
ప్రజావాణి అర్జీలపై అలసత్వం వద్దు
నల్లగొండ: ప్రజావాణి అర్జీలపై అలసత్వం చూపకుండా వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. 15 మంది ఫిర్యాదుదారులు ఫిర్యాదులను సమర్పించారని తెలిపారు. అర్జీల పురోగతిని కలెక్టరేట్లోని ఫిర్యాదుల విభాగానికి వెంటనే తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి
డిండి: కొనుగోలు కేంద్రాల్లో తేమ వచ్చిన వరి ధాన్యాన్ని కాంటాలు వేసి ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం డిండి మండల కేంద్రంతోపాటు తవక్లాపూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యం, తూకం చేసిన ధాన్యానికి సంబంధించి అకౌంట్లలో జమ అయ్యే డబ్బుల వివరాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆమె వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, డీటీసీఎస్ హన్మంతు శ్రీనివాస్గౌడ్, సీఈఓలు బాల్రెడ్డి, అంతిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి