రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి

Jun 4 2025 2:22 AM | Updated on Jun 4 2025 2:22 AM

రెవెన్యూ సదస్సులు  పకడ్బందీగా నిర్వహించాలి

రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి

కేతేపల్లి : భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం కేతేపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులపై ఆమె సమీక్షించారు. మొదటి రోజు నిర్వహించిన రెవెన్యూ సదస్సులపై ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఎంఏ సత్తార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది రైతులు హాజరయ్యారు.. ఎలాంటి దరఖాస్తులు వచ్చాయి..? ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించే విషయాన్ని గ్రామాల్లో టాంటాం ద్వారా ప్రజలకు ముందు తెలియ చేయాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులను సాధ్యమైన వేగంగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు, ఆర్‌ఐలు వెంకన్న, రామచంద్రయ్య, సర్వేయర్‌ టి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement