
నేడు ‘రైతు నేస్తం’
నల్లగొండ టౌన్: జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు వేదికల్లో మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగే రైతు నేస్తం కార్యక్రమానికి రైతులు విధిగా హాజరు కావాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు, మినీ కిట్లను రైతులకు అందజేస్తారని పేర్కొన్నారు. వానాకాలం పంటల సాగుపై వ్యవసాయాధికారులు తగిన సలహాలు, సూచనలు అందజేస్తారని, ఈ అవకాశం రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు
నల్లగొండ: ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాలకు అర్హత గల విద్యార్థులు ఈ నెల 21లోగా iti.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఐటీఐల కన్వీనర్, నల్లగొండ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.నర్సింహాచారి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు విద్యార్థులు నల్లగొండలోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్లో సంప్రదించాలని కోరారు.
అంతర్జాతీయ సదస్సుకు ఎంపిక
నల్లగొండ టూటౌన్ : సింగపూర్ యూనివర్సిటీలో జూలై నెలలో జరుగనున్న అంతర్జాతీయ సదస్సుకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) వాణిజ్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి ఎంపికయ్యారు. ఈ సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. సదస్సుకు వెళ్లనున్న వెంకటరమణారెడ్డికి సోమవారం వీసీ ఖాజాఆల్తాఫ్ హుస్సేన్ ఆహ్వాన పత్రం అందజేసి అభినందించారు.
పెట్టుబడిదారి వర్గానికి
కేంద్రం వత్తాసు
గట్టుప్పల్ : కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారి వర్గానికి వత్తాసుగా ఉంటూ శ్రామిక వర్గాలను అణగదొక్కే కుట్ర చేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం గట్టుప్పల్ మండలం వెల్మకన్నెలోని యాదయ్య ప్రాంగణంలో నిర్వహించిన సీపీఐ 2వ మండల మహాసభలో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవి నీతి, అక్రమాలతో ప్రజాధనం దోచుకు తిన్నారని ఆరోపించారు. ప్రజలను పక్కదో పట్టించేందుకే కవిత రోజుకో ప్రకటనతో డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. కారింగు శ్రీను అధ్యక్షతన జరిగిన మహాసభలో నాయకులు తీర్పారు వెంకటేశ్వర్లు, నలపరాజు రామలింగయ్య, లాలయ్య, చాపల శ్రీనివాస్, భీమనపల్లి రమేష్, చలం పాండురంగారావు, జగన్, గడ్డం నవీన్, కట్ట దశరథ, రాపోలు సత్తయ్య, ధనంజయ, కందాల ముత్యం పాల్గొన్నారు.
నేరాలు, హింసకు వ్యతిరేకంగా పోరాటం
సూర్యాపేట అర్బన్: నేరాలు, హింస, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చింతపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలోని కాంప్లెక్స్లో ఎన్హెచ్ఆర్సీ జిల్లా కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్ బండ్ల రమేష్, వైస్ చైర్మన్ నవిలె నాగయ్య, కన్వీనర్ సారగండ్ల సైదులు, మహిళా పోర్ట్ చైర్మన్ మాదాన స్వప్న, జనరల్ సెక్రటరీ బి.సునీత పాల్గొన్నారు.