
రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తాచాటాలి
మిర్యాలగూడ : రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటాలని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జి.అంజయ్య, అధ్యక్షుడు డాక్టర్ టి.ప్రశాంత్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–11, 13, 15, 17, 19 విభాగాల క్రీడాకారులకు రెండు రోజుల నుంచి పోటీలు కొనసాగుతున్నాయి. దీంల్లో భాగంగా సోమవారం పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయిలో టోర్నీకి ఎంపిక చేసి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపికై న క్రీడాకారులు త్వరలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు మధుబాబు, కార్యదర్శి పి.నవీన్కుమార్, సెలక్షన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.శ్రీనివాస్, జిల్లా కోచ్ ఎం.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.