
ఉద్యాన సాగుకు ఊతం
రాష్ట్ర సూక్ష్మ నీటిపారుదల
పథకం కింద..
రాష్ట్ర సూక్ష్మ నీటిపారుదల పథకం కింద ఆయిల్పామ్తోపాటు పండ్లు, కూరగాయలు, మిరప తోటల సాగుకు బిందు, తుంపర సేద్యం పరికరాలను అందించనున్నారు. ఇందుకు ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందించనున్నారు.
నల్లగొండ అగ్రికల్చర్: ఉద్యాన పంటల సాగుకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా 2025–26 ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యాన వన పంటల సాగు విస్తీర్ణం పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఉద్యాన పంటలైన ఆయిల్పామ్, పండ్లు, కూరగాలయలు, పూల తోటల సాగుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలకు చెందిన రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తూనే సబ్సిడీలు కూడా అందజేయాలని నిర్ణయించింది.
ఆయిల్పామ్ తోటల విస్తీర్ణ పథకం
ఆయిల్పామ్ తోటల విస్తీర్ణ పథకం కింద ఉద్యాన పంటల సాగును ప్రోత్సాహించాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ, సూక్ష్మ నీటిపారుదల పథకం సమన్వయంతో ఈ ఏడాది జిల్లాలో 6,500 ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు సాగు చేయాలని నిర్ణయించింది. ఇందుకు గాను పతంజలి ఫుడ్స్ కంపెనీ ద్వారా లబ్ధిదారులకు మొక్కలను సరఫరా చేసి రైతుల వ్యవసాయ భూముల్లో నాటించనున్నారు. నాటిన మొక్కల పెంపకానికి గాను సబ్సిడీపై రైతులకు డ్రిప్ (బిందు, తుంపర సేద్యం) పరికరాలు అందించనున్నారు.
ఫ ఆయిల్పామ్, పండ్లు, కూరగాయలు, పూల సాగు పెంపే లక్ష్యం
ఫ సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందజేత
ఫ రైతులకూ ప్రోత్సాహకాలు
ఫ కార్యాచరణ సిద్ధం చేసిన ప్రభుత్వం
అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద పండ్ల తోటలు, ఇతర కూరగాయల సాగును ప్రోత్సహించడానికి సబ్సిడీ అందజేయాలని నిర్ణయించింది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. లాభదాయకంగా మారిన తోటలు, కూరగాయలు సాగుపై రైతులు దృష్టిసారించాలి.
– పి.అనంతరెడ్డి, జిల్లా ఉద్యాన పట్టు
పరిశ్రమ అధికారి