
మాటూర్, కొల్లూరులో పలు ఇళ్లలో చోరీ
మోటకొండూర్: మండలంలోని మాటూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాటూర్ పెద్దులు, మాటూర్ ఐలయ్య, సల్ల ఉప్పలయ్య, వడ్ల మహేష్, వడ్ల జహంగీర్, అంబాల రాజయ్య, తోటకూరి కిష్టయ్య తమ ఇళ్లకు తాళాలు వేసి వేరే ఊర్లకు వెళ్లారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో రెండు బైక్లపై ఆరుగురు దొంగలు వచ్చి ఆయా ఇళ్ల తాళాలు పగులగొట్టి బీరువాలు తెరిచి చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో మాటూరి బాలమణి పెద్దులు ఇంట్లో రూ.1.50 లక్షల నగదు, 20తులాల వెండి, సల్ల ఉప్పలయ్య ఇంట్లో రూ.20వేల నగదు, 35 తులాల కడియాలు, మిగతా ఐదుగురి ఇళ్లో చెక్కుడు గుత్తి, వెండి గ్లాస్లు, ఇతర ఆభరణాలు అపహరించారు. ఉదయం పక్క ఇళ్లవారు చూసి పోలీసులకు, ఇంటి యాజమానులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మోటకొండూర్ ఎస్ఐ నాగుల ఉపేందర్ తెలిపారు.
రూ.2 లక్షలకుపైగా నగదు,
ఆభరణాలు అపహరణ