
న్యాయవాదుల చట్ట సవరణను పునఃసమీక్షించాలి
భువనగిరిటౌన్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల న్యాయవాదుల చట్టం–1961ను సవరించడం వలన న్యాయవాద వృత్తి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని, ఈ చట్ట సవరణపై కేంద్రం పునఃసమీక్షించాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. పార్థసారథి అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలో మామిడి వెంకట్రెడ్డి అధ్యక్షతన జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయవాదుల చట్టంను సవరించడం వలన బార్ కౌన్సిల్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని అన్నారు. అంతేకాకుండా విదేశీ లాయర్లను కేసులు వాదించేందుకు అనుమతించడం సరికాదన్నారు. వెంటనే సవరణ బిల్లును రద్దుచేసి పాత చట్టాన్ని కొనసాగించాలని కోరారు. 2019 తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఎన్రోల్ చేసుకున్న అడ్వకేట్లందరికీ హెల్త్కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉన్నత పదవుల్లో ఉన్న జడ్జిల ఇళ్లోలో డబ్బుల సంచులు దొరకడం అవమానకరమని, ఆవిధంగా దొరికిన వారిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కుక్క దువ్వ సోమయ్య, తడక మోహన్, సహాయ కార్యదర్శి బొల్లెపల్లి కుమార్, కోశాధికారి బొడ్డు కిషన్, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ నేహాల్, యాదసు యాదయ్య, జెల్లా రమేష్, ఎండీ ఖయ్యూం, గాదపాక శంకర్, ఆకుల మల్లేశం, పిడుగు ఐలయ్య, జిట్టా భాస్కర్రెడ్డి, ఎస్కే హమీద్ తదితరులు ఉన్నారు.
అఖిల భారత న్యాయవాదుల సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి