
రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ర్యాలీ
నల్లగొండ: రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం నల్లగొండ పట్టణ సమీపంలోని మర్రిగూడ బైపాస్ వద్ద జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సాగింది. అనంతరం అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్ ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలో మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.