
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
పెద్దవూర : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్(డీఎస్ఓ) వెంకటేష్, డిస్ట్రిక్ట్ కో–ఆపరేటీవ్ ఆఫీసర్(డీసీఓ) పత్యానాయక్ కోరారు. పెద్దవూరలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు వేర్వేరుగా పరిశీలించి మాట్లాడారు. ఏఈఓలు సర్టిఫైడ్ చేసిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. లారీల సమస్యలు లేకుండా డీఎంఓతో ఫోన్లో మాట్లాడి వెంటనే రెండు లారీలను రప్పించారు. కొండమల్లేపల్లి మిల్లర్తో ఫోన్లో మాట్లాడి పెద్దవూర నుంచి ధాన్యం లారీలు వస్తాయని త్వరతగతిన అన్లోడ్ అయ్యేలా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. వారి వెంట డీఎం హరీష్, సివిల్ సప్లయ్ డీటీ ముక్తార్, ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ వద్దిరెడ్డి వెంకట్రెడ్డి, మనోహర్, రైతులు తదితరులు ఉన్నారు.