
మే 12న ప్రపంచ సుందరీమణుల రాక
నాగార్జునసాగర్: మే 12న బుద్ధపూర్ణిమ రోజు ప్రపంచ సుందరీమణులు బుద్ధవనం సందర్శనకు రానున్నారని రాష్ట్రఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి తెలి పారు. హైదరాబాద్లో జరిగే ప్రపంచ అందాల పోటీలకు హాజరయ్యే పలుదేశాల సుందరీమణులు సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించేందుకు రాను న్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్కలెక్టర్ నారాయణ అమిత్తో కలిసి శని వారం ఆమె బుద్ధవనాన్ని సందర్శించారు. అనంతరం అధికారులతో సమావేశమై మాట్లాడారు. మే 3 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రత్యేకించి సివిల్ వర్క్ పూర్తిచేసి, బుద్ధవనం పరిసర ప్రాంతాలు, విజయవిహార్కు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా పరిశుభ్రంగా ఉంచడంతోపాటు లైటింగ్ ఏర్పాట్లపై దృష్టిపెట్టాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ సుందరీమణులు మొదట బుద్ధవనానికి చేరుకుంటారని, అక్కడినుంచి విజయవిహార్కు వచ్చి తర్వాత బుద్ధవనంలో వివిధ ప్రాంతాలను సందర్శిస్తారని తెలిపారు. సమావేశంలో బుద్ధవనం ప్రాజెక్టు ఓఎస్డీ సుధాన్రెడ్డి, టూరిజం శాఖ ఎస్ఈ భాస్కర్రావు, అధికారులు ఉన్నారు.
సాగర్లో ఏర్పాట్లు పరిశీలించిన
రాష్ట్ర ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి