
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన
నకిరేకల్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి మంచి పాలన అందిస్తున్నారని, ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు జీఓను విడుదల చేయడంపై హర్షిస్తూ నకిరేకల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డ్రోన్ సహాయంతో నకిరేకల్ మెయిన్ సెంటర్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయించారు. అనంతరం సాయి మందిరం సమీపంలో స్టేడియంకు వెళ్లే దారిలో మహనీయుల విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే వీరేశం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారిత కోసం జీవితాంతం పరితపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు లింగాల వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మార్కెట్, మున్సిపల్ చైర్పర్సన్లు గుత్తా మంజుల, చౌగోని రజితాశ్రీనివాస్గౌడ్, పూజర్ల శంభయ్య, మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం, బత్తుల ఉశయ్యగౌడ్, పెద్ది సుక్కయ్య, కంపసాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం