పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ సభ్యుడిగా వర్రె వెంకటేశ్వర్లు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ సభ్యుడిగా వర్రె వెంకటేశ్వర్లు

Apr 15 2025 1:49 AM | Updated on Apr 15 2025 1:49 AM

పోలీస

పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ సభ్యుడిగా వర్రె వెంకటేశ్వర

మోత్కూర్‌: స్టేట్‌ పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ సభ్యుడిగా మోత్కూరు మండలం సదర్శాపురం గ్రామానికి చెందిన వర్రె వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్‌ పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి శివశంకర్‌రావును నియమించగా.. ముగ్గురు సభ్యులలో ఒకరిగా వర్రె వెంకటేశ్వర్లును నియమితులయ్యారు. వర్రె వెంకటేశ్వర్లు ఉమ్మడి రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల మోత్కూరు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

భూమి చదును చేస్తుండగా బయల్పడిన శివలింగం

చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రణబోతు బాజీరెడ్డి ఆదివారం తన వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా శివలింగంతో పాటు నాగప్రతిమ బయల్పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని శివలింగాన్ని తిలకించారు. కాగా ఈ స్థలంలో గతంలో గుడి ఉండేదని గ్రామస్తులు తెలిపారు.

అటవీ భూమిలో

అగ్ని ప్రమాదం

అడవిదేవులపల్లి: అడవిదేవులపల్లి గ్రామ సమీపంలో గల బౌద్ధమ దేవాలయాలకు వెళ్లే ప్రధాన రహదారి వెంట సర్వే నంబర్‌ 435లో గల అటవీ భూమిలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగి మంటలు ఎగిసిపడటంతో సుమారు 5 ఎకరాలు అగ్నికి ఆహుతయ్యింది. పంట పొలాలకు వెళ్లి వస్తున్న కూలీలు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బంది రావడం ఆలస్యమైతే అటవీ భూమి సమీపంలో గల పంటలను మంటలు చుట్టుముట్టేవని స్థానికులు పేర్కొన్నారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

మాడ్గులపల్లి: మాడ్గులపల్లి మండలం గజలాపురం గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్‌ బియ్యాన్ని ఆదివారం పట్టుకున్నట్లు ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం కురియాతండాకు చెందిన ధనావత్‌ శ్రీనునాయక్‌ మాడ్గులపల్లి మండలం గజలాపురం గ్రామంలో రేషన్‌ లబ్ధిదారుల నుంచి రేషన్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అదే గ్రామంలో గుండెపురి భిక్షం ఇంట్లో నిల్వ చేశాడు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి 7.5 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. పట్టుబడిన రేషన్‌ బియ్యాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి ఏఎస్‌ఐ జాఫర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ సభ్యుడిగా వర్రె వెంకటేశ్వర1
1/1

పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ సభ్యుడిగా వర్రె వెంకటేశ్వర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement