
సారూ మొర ఆలకించరూ..
ఆస్తులు తీసుకుని అన్నం పెట్టడం లేదు
చందంపేట మండలం గాగిల్లపురం గ్రామానికి చెందిన నక్క ముత్యాలు నలుగురు కొడుకులు, కుమార్తె ఉన్నారు. ముత్యాలు భార్య 20 సంవత్సరాల క్రితం చనిపోయింది. పిల్లలందరి పెళ్లిల్లు అయ్యాయి. 20 ఎకరాలు భూమిని నలుగురు కొడుకులకు నాలుగు ఎకరాల చొప్పున్న రిజిస్ట్రేషన్ చేశాడు. నాలుగు ఎకరాలు ముత్యాలు పేరున ఉంది. నలుగురు కొడుకులు హైదరాబాద్ హస్తినాపురంలో వివిధ పనులు చేస్తూ జీవిస్తున్నారు. చనిపోయిన దగ్గర నుంచి ముత్యాలు గొర్రెలు సాదుకుంటూ జీవనం సాగించాడు. రెండేళ్ల నుంచి ఆరోగ్యం సహకరించక నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు కొడుకులు ముత్యాలును పట్టించుకోవడం లేదు. ముత్యాలు పేరున ఉన్న ఉన్న భూమి అమ్ముకుందామంటే అడ్డుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. చచ్చేటోనివి భూమి అమ్ముకుంటావా.. చావరాదు అంటున్నారని ముత్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కొడుకులు తిండి పెట్టకపోవడంతో చేతికి ఉన్న 60 తులాల వెండి కడియాలను అమ్ముకుని బతుకుతున్నానని వాపోయాడు. కొడుకులు తన బాగోగులు చూసేలా చూడాలని కోరుతూ వినతి పత్రం సమర్పించాడు.
నల్లగొండ : ఆస్తులు సంపాదించి పంచి ఇచ్చినా కొడుకులు బువ్వ పెట్టడం లేదని.. ఇంటిని తన పేరు రిజిస్టర్ చేసుకున్న మనుమడు పట్టించుకోవడం లేదని.. భూమి సమస్య ఉందని.. అర్హత ఉన్నా పింఛన్ మంజూరు కాలేదేని ఇలా.. ప్రజావాణిలో బాధితులు అధికారులకు మొర పెట్టుకున్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్డేలో ఇన్చార్జి అదనపు కలెక్టర్లు నారాయణ్ అమిత్, రాజ్కుమార్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దాదాపు 33 మంది వినతులు సమర్పించగా ఇందులో 14 రెవెన్యూకు, 19 వివిధ శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ సందర్భంగా ఇన్చార్జి అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలను నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులు ఏస్థాయిలో పరిష్కారం అవుతాయో వెంటనే అక్కడికి పంపాలన్నారు. కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫొటోలు...29ఎన్ఎల్సి305–230098.
మనవడు ఇల్లు తీసుకుని అన్నం పెడతలేడు
చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన జంపాల అంజమ్మ నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో నివాసం ఉంటుంది. అంజమ్మ కొడుకు గోపాల్ 24 సంవత్సరాల క్రితం కండరాల క్షీణత వ్యాధితో నడవలేని పరిస్థితికి వెళ్లిపోయాడు. అంజమ్మ బిడ్డ మంగమ్మతో పాటు అల్లుడు కూడా చనిపోతే మనవడు గడ్డం జానీని అంజమ్మే సాకింది. తనను, నడవలేని స్థితిలో ఉన్న కొడుకును తనే చూసుకుంటానంటే చెప్పడంతో అంజమ్మ పేరున ఉన్న ఇంటిని మనవడి పేరున రిజిస్ట్రర్ చేసింది. ఇప్పుడు మనవడు వారిని చూసుకోవడం లేదు. ఇదేంటని అడిగితే వారిని బెదిరిస్తున్నాడు. మనవడు మమ్ములను సాదేలా చూడాలని.. లేనిపక్షంలో గిఫ్ట్ డీడీ కింద రిజిస్ట్రేషన్ చేసిన ఇంటిని తన పేరుమీదకు మార్చాలని కోరుతూ అంజమ్మ.. నడవలేని స్థితిలో ఉన్న తన కొడుకు గోపాల్తో కలిసి వచ్చి అదనపు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించింది.
ఫ గ్రీవెన్స్ డేలో పలువురి ఫిర్యాదు

సారూ మొర ఆలకించరూ..

సారూ మొర ఆలకించరూ..