Mancherial District News
-
కొనుగోళ్లలో జాప్యం వద్దు
దండేపల్లి/జన్నారం: వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని అదనపు కలెక్టర్ రా ములు అన్నారు. మంగళవారం ఆయన దండేపల్లి, జన్నారం మండలం పొనకల్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను అధికారుల దృష్టికి తేవా లని సూచించారు. నిబంధనల ప్రకారం 41కిలోలు మాత్రమే బస్తా తూకం వేయాలని ని ర్వాహకులకు సూచించారు. లారీ వాళ్లు బస్తా కు రూ.2 నుంచి రూ.5 చొప్పున వసూలు చే స్తున్నారనేది అవాస్తవమని తెలిపారు. జన్నా రం మండలంలోని రాఘవేంద్ర రైస్మిల్ను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో డీసీఎస్వో బ్రహ్మరావు, దండేపల్లి తహసీల్దార్ రోహిత్దేశ్పాండే, ఆర్ఐ భూమన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలి
లక్సెట్టిపేట: రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని ఉద్యానవనశాఖ అధికా రిణి సహజ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎస్ఆర్ఎర్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులు ఆయిల్పామ్ సాగుచేస్తే అభివృద్ధి ఉంటుందని, పంట మార్పిడితోనే అధి కదిగుబడితో పాటు ఆదాయం అధికంగా వ స్తుందని పేర్కొన్నారు. ఆయిల్పామ్ గెలల ను కంపెనీలు నేరుగా కొనుగోలు చేస్తాయ ని, మధ్యవర్తుల ఇబ్బందులు ఉండవని తెలి పారు. ప్రభుత్వం సాగును ప్రోత్సహిస్తోంద ని, మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉందని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి, ఎంపీడీవో సరోజ, ఆత్మ చైర్మన్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
జలం.. పదిలం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మండుతున్న ఎండల్లోనూ జిల్లాలో భూగర్భ జలాలు గతంతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి కోటపల్లి, లక్సెట్టిపేట, మందమర్రి మండలాల్లోనే నీటి లభ్యత స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది. ఏటా ఎండాకాలంలో మార్చి నుంచి మొదలై మేలో ఎండలు తీవ్ర రూపం దాల్చుతాయి. ఈ సమయంలో స్థానిక అవసరాల కోసం నీటి కొరత ఏర్పడుతుంది. జూన్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. అప్పటివరకు స్థానికంగా ఉన్న భూగర్భ జలాలనే అన్ని అవసరాలకు వినియోగించుకోవాల్సి వస్తుంది. జిల్లాలో యాసంగి పంటలు చేతికొచ్చి, కోతలు పూర్తవుతున్న తరుణంలో సాగునీటి అవసరం లేదు. తాగునీరు, గృహ, పరిశ్రమలు, ఇతర సామాజిక అవసరాల కోసం స్థానికంగా ఉన్న బోరు బావులు, తాగునీటి పథకాలను పొదుపుగా వాడుకోవాల్సి ఉంది. గత వానాకాలంలో సమృద్ధిగా కురిసిన వర్షాలకు ఇంకా కొన్నిచోట్ల చెరువుల్లో నీరు లభిస్తోంది. జిల్లా సగటు భూగర్భ జలాలు గతేడాది 7.33 మీటర్లుగా ఉండగా, ఈ ఏడాది 6.85 మీటర్లుగా ఉంది. పట్టణాల్లో విచ్చలవిడిగా..పట్టణాల్లో విచ్చలవిడిగా బోర్లు వేయడంతో చాలాచోట్ల భూ గర్భజలాలు ఏటేటా లోతులోకి పడిపోతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు మండల కేంద్రాల్లో గృహావసరాలకు వినియోగిస్తున్న బోర్లు పరిమితి లేకుండా వేస్తున్నారు. వ్యాపార అవసరాల కోసం కొన్ని కాలనీల్లో వెయ్యి ఫీట్లకు పైనే బోర్లు వేస్తుండడం గమనార్హం. పలువురు వ్యాపారులు చాలాచోట్ల అనుమతులు లేకుండానే మినరల్ ప్లాంట్లు, నీటి శుద్ధి కేంద్రాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల క్రితమే నీటి వాడకంపై వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు నీటి మీటర్లు బిగించుకోవాలని ఆ మేరకు పన్ను చెల్లించాలని ఆదేశాలున్నప్పటికీ చాలా చోట్ల అమలు కావడం లేదు. అధికారులు నోటీసులిస్తున్నా పూర్తి స్థాయిలో పన్నులు వసూలు కావడంలేదు. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాల్లో భూగర్భ జలాలను విచ్చలవిడిగా వాడుతున్న పలు వ్యాపార, వాణిజ్య సంస్థలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ‘ఎల్లంపల్లి’లోనూ ఎక్కువగానే.. గోదావరి పైనున్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోనూ నీటి నిల్వలకు ప్రస్తుతం ఢోకా లేదు. గతేడాదికి ఇదే సమయానికి పోలిస్తే మెరుగ్గానే నీటి నిల్వలున్నాయి. ఇంజినీరింగ్ అధికారులు వానాకాలం నుంచే నీటి నిల్వలను ముందు జాగ్రత్తగా డ్యాంలో నిల్వ చేస్తూ వచ్చారు. వేసవిలో ప్రస్తుతం రోజువారీ అవసరాలకు అనుగుణంగా మిషన్ భగీరథ తాగునీటి పథకం కింద మంచిర్యాల, రామగుండం ప్రాంతాలకు 23 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 242 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో నీటి సరఫరా పథకానికి 310 క్యూసెక్కులు, వేమ్నూరు పంపుహౌస్ నుంచి 247 క్యూసెక్కులు వదులుతున్నారు. అయితే, వేసవిలోనూ ప్రాజెక్ట్కు ఇనోఫ్లో ఉంది. ప్రస్తుతం కడెం పరీవాహక ప్రాంతాల నుంచి 1,073 క్యూసెక్కుల వరద ఉంది. అంతే మొత్తంలో అధికారులు అవుట్ఫ్లో విడుదల చేస్తున్నారు.జిల్లాలో గతేడాది, ఈ ఏడాది ఏప్రిల్లో భూగర్భ జలాలు (మీటర్లలో)మండలం గ్రామం గతేడాది ప్రస్తుతం బెల్లంపల్లి బెల్లంపల్లి 15.39 13.94 భీమిని రాంపూర్ 2.66 2.55 చెన్నూరు చెన్నూరు 7.62 7.32 చెన్నూరు కొమ్మెర 2.08 1.91 దండేపల్లి మ్యాదిరిపేట 5.01 4.44 హాజీపూర్ హాజీపూర్ 5.06 4.32 జైపూర్ జైపూర్ 4.05 5.10 జైపూర్ కుందారం 19.81 19.55 జన్నారం ఇందన్పల్లి 5.24 4.74 కన్నెపల్లి జన్కాపూర్ 0.01 0.01 కాసిపేట కొండాపూర్ 3.72 3.83 కోటపల్లి కోటపల్లి 18.24 19.45 లక్సెట్టిపేట లక్సెట్టిపేట 2.26 4.31 మందమర్రి మందమర్రి 4.90 5.22 మందమర్రి పొన్నారం 14.05 11.09 నెన్నెల నెన్నెల 6.03 4.36 తాండూరు తాండూరు 15.70 12.52 వేమనపల్లి నీల్వాయి 0.55 0.45 జన్నారం జన్నారం 6.63 6.39 జన్నారం తపాలాపూర్ 3.93 2.69 భీమారం భీమారం 9.13 8.46 మంచిర్యాల మంచిర్యాల 7.64 7.30 నస్పూర్ నస్పూర్ 11.96 10.80 వేమనపల్లి లక్ష్మీపూర్ 4.55 4.42 కన్నెపల్లి నాయకిన్పేట 7.12 6.16 ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్థితి (మంగళవారం నాటికి)పూర్తి నీటిమట్టం 148మీటర్లు ప్రస్తుతం 143.18 మీటర్లు సామర్థ్యం 20.1754 టీఎంసీలు ప్రస్తుత నిల్వ 9.2564 టీఎంసీలు గతేడాది ఇదేరోజు నీటిమట్టం 142.64 మీటర్లు నిల్వ 8.3957 టీఎంసీలు -
సంక్షేమశాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో మంగళవారం ఏసీబీ తనిఖీలు కలకలం రేపాయి. కలెక్టరేట్లోని శిశు, మహిళా, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షే మ శాఖ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ మధు సి బ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీంతో వివిధ శాఖల జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కొందరు కార్యాలయం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. జిల్లా సంక్షేమశాఖలో తనిఖీ ల అనంతరం మధు విలేకరులతో మాట్లాడారు. సంక్షేమశాఖలో పలు అవకతవకలు జరిగినట్లు ఫి ర్యాదులు అందాయని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు చెప్పా రు. తనిఖీల్లో క్యాష్ బుక్ వినియోగం, దివ్యాంగుల పిటిషన్ల పరిశీలన, దివ్యాంగులకు అందజేయాల్సిన వాహనాల పంపిణీలో జాప్యం చేస్తున్నట్లు తేలిందని పేర్కొన్నారు. శిశు, మహిళా సంక్షేమం కో సం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మరిన్ని అవకతవకలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించాల్సి ఉందని, పరిశీ లన అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తనిఖీల్లో ఏసీబీ సీఐ, సిబ్బంది ఉన్నారు. -
శాసీ్త్రయ సాగు మేలు
చెన్నూర్: శాసీ్త్రయ వ్యవసాయంతో అధిక ది గుబడి సాధించవచ్చని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. స్థానిక మైనార్టీ ఫంక్షన్హాల్లో మంగళవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక రైతు వారంలో భాగంగా ఉద్యానవన పంట లు, ఆయిల్పామ్ విస్తరణపై ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులకు విత్తన కిట్లు అందజేశారు. అనంత రం 100 పడకలు, కేజీబీవీ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలలో చేపట్టిన నూతన భ వనాల పనులను పరిశీలించారు. మండలంలోని సోమన్పల్లిలో చేపట్టిన యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవ న నిర్మాణాన్ని పరిశీలించి పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఉద్యానవనశాఖ అధికారి అనిత, తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ తదితరులు పాల్గొన్నారు. నిబంధనల ప్రకారమే కొనుగోళ్లు భీమారం: నిబంధనల ప్రకారమే వరి ధాన్యం కొనుగోళ్లు చేపడతామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మండలంలోని పోలంపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి అనుమానాలను నివృత్తి చేశారు. -
అభివృద్ధి పథంలో ధర్మరావుపేట
దండేపల్లి: మండలంలోని ధర్మరావుపేట గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు ప్రత్యేక చొరవ తీసుకుని ఇందిరమ్మ పథకం అమలుకు పైలట్ గ్రామంగా ఎంపిక చేశారు. ఇళ్లు లేని పేదలకు 104 ఇళ్లు మంజూరు చేయించారు. లబ్ధిదారులంతా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మ క పథకమైన ‘పీఎం అజయ్’ కింద కూడా ఈ గ్రా మం ఎంపిక కావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేర్చుతుంటే, కేంద్రం పీఎం అజయ్ పథకం ద్వారా గ్రామంలోని ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, సామాజికాభివృద్ధికి నిధులు మంజూరు చేస్తోంది. ఈ రెండు పథకాల కలయికతో ధర్మరావుపేట గ్రామం అభివృద్ధి పథంలో ముందుకెళ్తోంది. 104 మంజూరు.. 71 పూర్తిధర్మరావుపేట గ్రామాన్ని ఇందిరమ్మ పథకంలో పై లట్ గ్రామంగా ఎంపిక చేసి 104 ఇళ్లు మంజూరు చే శారు. లబ్ధిదారుల్లో 71 మంది నిర్మాణాలు పూర్తి చే శారు. 66 నిర్మాణాలు స్లాబ్ దశ పూర్తి చేసుకున్నా యి. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నవారిలో 30మందికి పైగా లబ్ధిదారులు గృహప్రవేశ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నారు. నిర్మాణాలకు ముందుకురాని ఇళ్లను రద్దు చేసి వాటిని ఇతరులకు కేటా యించారు. దీంతో చాలామంది పేదలు ఇందిరమ్మ పథకం కింద సొంతింటి కల నెరవేర్చుకున్నారు. గ్రామాభివృద్ధికి ‘పీఎం అజయ్’ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా పీఎం అజయ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ధర్మరావుపేట గ్రామం పీఎం అజయ్ పథకం కింద ఎంపిక కావడంతో ప్రస్తుతం గ్రామాభివృద్ధికి రూ.20లక్షల నిధులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులతో గ్రామంలో డ్రైనేజీలు, పైపులైన్లు, కల్వర్టుల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పటికే చేపట్టాల్సిన పనులను గుర్తించారు. గ్రామాన్ని కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎమ్మెల్యే పలుసార్లు సందర్శిచారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సొంతింటి కల నెరవేరింది మాకు శిథిలమైన ఇల్లు ఉండేది. దాంట్లో ఉండటం ఇబ్బందిగా అనిపించేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరమ్మ పథకం ప్రవేశపెట్టి ఇళ్లు మంజూరు చేసింది. మాకూ ఇల్లు మంజూరైంది. దీంతో మేము ఇల్లు కట్టుకున్నాం. గృహప్రవేశం జరుపుకొన్నాం. దీంతో మా సొంతింటి కల నెరవేరింది. – తేజశ్రీ, ఇందిరమ్మ లబ్ధిదారు ప్రభుత్వ సహకారంతోనే.. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు చొరవ చూ పించారు. ఇందిరమ్మ పథకంలో పైలట్ గ్రామంగా ఎంపిక చేసి 100కుపైగా ఇళ్లు మంజూరు చేయించారు. ఇప్పటికే 71 ఇళ్లు పూర్తయ్యాయి. నిర్మాణాలకు ముందుకురాని లబ్ధిదారు ల ఇళ్లు రద్దు చేసి కొత్తవారికి కేటాయించారు. పీఎం అజయ్ నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాం. – కొత్త ధర్మయ్య, సర్పంచ్ -
కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం
మందమర్రిరూరల్/భీమారం/రామకృష్ణాపూర్/కోటపల్లి/జైపూర్: కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. మందమర్రి పట్టణ అధ్యక్షుడిగా మంద తిరుమల్రెడ్డి, మండల అధ్యక్షుడిగా కడారి జీవన్కుమార్, భీమారం మండల అధ్యక్షుడిగా పొడేటి రవి, క్యాతనపల్లి పట్టణ అధ్యక్షుడిగా వొడ్నాల శ్రీనివాస్, కోటపల్లి మండల అధ్యక్షుడిగా కాట్రాల గ్రామానికి చెందిన మల్లయ్య, జైపూర్ మండల అధ్యక్షుడిగా మాజీ సర్పంచ్ చల్ల విశ్వంబర్రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా వారు తమ నియామకంపై మంత్రి వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల నగర అధ్యక్షుడిగా నరేశ్ మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకాన్ని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్కుమార్గౌడ్ ప్రకటించారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. మంచిర్యాల సిటీ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తూముల నరేష్, లక్సెట్టిపేట పట్టణ అధ్యక్షుడిగా ఎస్డి.షాహిద్ అలీ, మండల అధ్యక్షుడిగా నలిమేల రాజు, హాజీపూర్ మండల అధ్యక్షుడిగా తోట రవి, దండేపల్లి మండల అధ్యక్షుడిగా అక్కల వెంకటేశ్వర్లును నియమించారు. తూముల నరేశ్ -
మరింత చేరువగా ప్రజావాణి
మంచిర్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణిని ఈ నెల 4నుంచి అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తోంది. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి హాజ రయ్యేందుకు జిల్లా నలుమూలల నుంచి వస్తూ బాధితులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి స్వీకరించిన వినతులను తప్పనిసరిగా ఆన్లైన్లో సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)లో అప్లోడ్ చేసి, యూనిక్ రిఫరెన్స్ నంబర్తో కూడిన రశీదు ఇస్తున్నారు. ఈ రశీదు ద్వారా దరఖాస్తుదారు తన అర్జీ ఏ స్థితిలో ఉందో ఆన్లైన్లో చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం గరిష్టంగా 30రోజుల్లోపు వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆయా శాఖల అధికారులు తీసుకున్న చర్యలపై నివేదికలను పోర్టల్లో ఉంచాల్సి ఉంది. ఒకవేళ నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపకపోతే, ఆ కేసులు ఆటోమేటిక్గా ఉన్నతాధికారుల పర్యవేక్షణలోకి వెళ్తాయి. అప్పుడు ఉన్నతాధికారులకు కిందిస్థాయి అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అధికారుల హాజరు తప్పనిసరిప్రతీ సోమవారం మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. ఈ నెల 4న మొదటిసారి మంచిర్యాల ఆర్డీవో కా ర్యాలయంలో కార్యక్రమం చేపట్టగా, బెల్లంపల్లిలో ని సబ్ కలెక్టర్ (ఆర్డీవో) కార్యాలయంలో కాకుండా తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. మంచిర్యాలలో నాలుగు, బెల్లంపల్లిలో 34 అర్జీలు అందాయి. కార్యక్రమానికి నోడల్ అధికారిగా ఆర్డీవో వ్యవహరిస్తుండగా, అన్ని శాఖల డివిజన్ స్థాయి అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. డీఎల్పీవో, డిప్యూటీ డీఎంహెచ్వో, వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్, డిస్కం డీఈ, ఆర్అండ్బీ డీఈఈ, సీడీపీవో తదితర అధికారులు హాజరై సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. తగ్గనున్న దూరభారం కలెక్టరేట్కు వెళ్లాల్సిన పని లేకుండా రెవెన్యూ డివిజ న్ కార్యాలయాల్లోనే బాధితులు సమస్యలు విన్నవించుకునే అవకాశముంది. దీంతో వారికి దూరభా రం తగ్గడంతోపాటు 30 రోజుల్లోనే సమస్యకు పరి ష్కారం దొరకనుంది. మంచిర్యాల ఆర్డీవో కార్యాల యం బస్టాండ్, రైల్వేస్టేషన్కు కూతవేటు దూరంలో నే ఉండగా డివిజన్ వ్యాప్తంగా వచ్చే బాధితులకు ఇది ఎంతో సౌకర్యవంతం. మొదటిసారి రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణిపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో అంతగా స్పందన రానట్లు తెలిసింది. దీనిపై ప్రజలకు అవగాహ న కల్పించాల్సిన అవసరముంది. కాగా, కొద్ది రోజు ల్లోనే మండలాల్లోనూ ప్రజావాణి నిర్వహించేందు కు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
పశువుల అక్రమ రవాణాపై నిఘా
కోటపల్లి: బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా పెట్టినట్లు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మండలంలోని రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టును మంగళవారం సందర్శించి అధికారులతో మాట్లాడారు. చెక్పోస్టు వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పశువుల అక్రమ రవాణా ను అరికట్టేందుకు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయో.. లేదో చూడాలని ఆదేశించారు. అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాల ని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల ని సూచించారు. విధి నిర్వహణలో ఎల్లప్పు డూ అ ప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పండుగ సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాల ను గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరా రు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి చెన్నూర్: నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝూ సూచించారు. చెన్నూర్ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి పరిసరాలు పరిశీలించారు. స్టేసన్ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనితీరు, స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, గ్రామాల వివరాలను సీఐ బన్సీలాల్ ద్వారా తెలుసుకున్నారు. రిసెప్షన్ ఇబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. నేరాల నియంత్రణ, పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్ను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. మారుమూల గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. -
అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం అభినందనీయం
కాసిపేట: మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకుంటూ నిరక్షరాస్యులకు చదువు నేర్పడం అభినందనీయమని రాష్ట్ర వయోజన విద్యాశాఖ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి కొనియాడారు. మంగళవారం మండలంలోని లంబాడీతండా గ్రామపంచాయతీలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేయగా ఆయన ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. వయోజన వి ద్యాశాఖ ఆధ్వర్యంలో మండలంలో 100 రో జుల్లో వందశాతం అక్షరాస్యత కార్యక్రమం ని ర్వహించినట్లు తెలిపారు. వందరోజుల్లో కు ట్టు శిక్షణ పొందుతూ 265 మంది మహిళలు వయోజనులకు విద్య నేర్పించినట్లు పేర్కొ న్నారు. శిక్షణ పొందిన మహిళలు ఉత్తీర్ణులైన 260 మందికి సర్టిఫికెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. డెప్యూటీ డైరెక్టర్ పురుషోత్తంనా యక్, డీఆర్డీవో కిషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, వయోజన విద్యాశాఖ పీవో శ్రీ నివాస్, సర్పంచ్ బలరాం, ఎంపీడీవో సత్యనారాయణసింగ్, డీఆర్పీ శాంకారి ఉన్నారు. -
ఆధునికంగా ముందుకు‘సాగు’తేనే..
దండేపల్లి: రైతులను వానాకాలం సాగుకు సిద్ధంచేయాలని భావిస్తున్న ప్రభుత్వం వారికి ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తోంది. గత నెల27న ప్రారంభించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కా ర్యక్రమాన్ని ఈనెల 23 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనుంది. జిల్లాలోని 56 గ్రామాల్లో ఈసదస్సులు నిర్వహించనుండగా ఇందుకు ఏడు బృందాల ను నియమించింది. జిల్లాలో ఇప్పటివరకు 16 గ్రా మాల్లో సదస్సులు నిర్వహించింది. మిగతా గ్రామాల్లో గడువులోపు కార్యక్రమాలు నిర్వహించి రైతులను వానాకాలం సాగుకు సన్నద్ధం చేయనుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే..రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు రైతులకు సాగులో పాటించే పలు అంశాలపై సూచనలు చేస్తున్నారు. అనవసరంగా యూరియా వాడకాన్ని తగ్గించి, నేల స్వభావాన్ని బట్టి ఎరువులు ఎలా వేయాలో వివరిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని సాధించేందుకు అవసరమైన మెళకువలు నేర్పిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి విత్తనాలు సాగు చేసేందుకు ప్రోత్సహిస్తున్నారు. వరి మాత్రమే కాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. సాగునీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలో తెలియజేస్తున్నారు. సాగు విషయాల్లో రైతులను అప్రమత్తం చేయడం, వారి సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. సద్వినియోగం చేసుకోవాలి సాగులో పాటించాల్సిన నూతన పద్ధతుల గురించి వివరించేందుకు కేవీకే శాస్త్రవేత్తలు రైతుల వద్దకే వచ్చి సదస్సులు నిర్వహిస్తున్నారు. శాస్త్రవేత్తలు చెప్పే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సాగులో ఆచరించి మంచి దిగుబడులు సాధించాలి. సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి. – సురేఖ, జిల్లా వ్యవసాయాధికారి -
● ప్రయోగాల ద్వారా నేర్చుకుంటున్న విద్యార్థులు ● మంచిర్యాల సైన్స్ సెంటర్లో గత నెల 27న ప్రారంభం ● తొమ్మిదో రోజుకు చేరిన సమ్మర్ సైన్స్ క్యాంపు
విద్యార్థులకు చదువుతో పాటు అనుభవం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపునకు సైన్స్ సమ్మర్ క్యాంపు దోహదపడుతుంది. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత అభివృద్ధి చెందటంతో పాటు విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి పెరుగుతుంది. టీమ్వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడుతాయి. రోబోటిక్స్, కోడింగ్, సైన్స్ మోడల్స్ ఆధునిక అంశాలపై అవగాహన పెరుగుతుంది. ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా విద్యార్థుల్లో నమ్మకం పెరుగుతుంది. పుస్తకాలలో మాత్రమే కాకుండా ప్రయోగాల ద్వారా సైన్స్ నేర్చుకునేందుకు జిల్లా సైన్స్ సెంటర్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో గతనెల 27న ప్రారంభమైన సమ్మర్క్యాంపు 15 రోజుల పాటు కొనసాగుతుంది. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ తొమ్మిది రోజుల పాటు కొనసాగుతున్న సైన్స్ సమ్మర్ క్యాంపుపై విద్యార్థుల అభిప్రాయాలు.. – మంచిర్యాలఅర్బన్కొత్త ప్రయోగాలు నేర్చుకుంటున్నాం సైన్స్ సమ్మర్క్యాంపులో కొత్త ప్రయోగాలు నేర్చుకుంటున్నాం. గెలాక్సీ, యూనివర్స్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సెన్స్ ఎకై ్స్ప రిమెంట్ బాగున్నాయి. లోయర్ క్లాస్లో ఉన్నప్పటికీ హయ్యర్ క్లాస్ కాన్సెప్ట్ అర్థమవుతున్నందుకు సంతోషంగా ఉంది. – నక్షత్ర, జెడ్పీహెచ్ఎస్, మంచిర్యాల సైన్స్పై భయం తొలగింది.. ప్రయోగాలు మాతో చేయించటం వల్ల సైన్స్పై ఉన్న భయం తొలగింది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, అన్నిరకాలు ప్రయోగాత్మకంగా నేర్పించడంతో కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్నాం, హోం వర్క్గా కొన్ని యాక్టివిటీస్ని ఇచ్చి మరుసటి రోజు మాతో ప్రదర్శింప జేయడంతో సులభంగా నేర్చుకుంటున్నాం.– బి.కృతి, టీఎస్ఎంఎస్, మంచిర్యాల ఆరోగ్యంపై అవగాహన బయాలజీలో భాగంగా ఊపిరితిత్తుల పని విధానం, గుండె, కిడ్నీ, హార్ట్స్ట్రోక్ ఎలా వస్తుంది?.. కార్డియా అరెస్టే అంటే ఏమిటి?.. స్టంట్ ఎలా వేస్తారనే విషయాలు తెలుసుకున్నాం. మెరుగైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంపై అవగాహన పెంచుకునేందుకు సైన్స్ సమ్మర్క్యాంపు ఉపయోగపడింది. – పి.శ్రేయాంత్, మంచిర్యాల ప్రయోగాత్మకతతో ఆసక్తి.. సైన్స్ సమ్మర్ క్యాంపులో ప్రయోగాత్మకంగా చేయించడం వల్ల సులభంగా అర్థమయ్యాయి. ప్రాక్టికల్గా నేర్పటం వల్ల మరింత ఆసక్తి పెరుగుతోంది. ప్రయోగాత్మక బోధన చాలా నచ్చింది. మిర్రర్స్ ప్రాపర్టీస్, లైట్ కాన్సెప్ట్, మైక్రోసాఫ్ట్ గు రించి తెలుసుకోవడం కొత్త అనుభూతి ఇస్తోంది. – ఎం.నిక్షిత్, మంచిర్యాలప్రత్యక్ష ప్రయోగాలు.. విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంచడం సైన్స్ సమ్మ ర్ క్యాంపు ఉద్దేశం. ప్రయోగాలు, సైన్స్ గేమ్స్, వర్క్షాప్లు నిర్వహిస్తున్నాం. ఆకర్షితులు అయ్యేందుకు రోజూ ఫన్ మాక్టివిటీస్ చేయిస్తున్నాం. సైన్స్ సూత్రాలు, నిజజీవితంలో ఉన్న సైన్స్ సూత్రాలు, క్లాస్ రూమ్లో బోధన మూడింటి సమన్వయంతో నిర్వహిస్తున్నాం. – డి.రాజగోపాల్, డీఎస్వో, మంచిర్యాల -
వడదెబ్బతో బాలిక మృతి
బోథ్: సొనాల మండలంలోని లెండిగూడలో మడావి శ్రీదేవి (14) అనే బాలిక వడదెబ్బతో మంగళవారం మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మడావి మారుతి కుమార్తె శ్రీదేవికి సోమవారం రాత్రి నుంచి వాంతులు, విరోచనాలు కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లి వచ్చి ఇంట్లో కుప్పకూలింది. వడదెబ్బతోనే మృతి చెందిందని బాలిక తల్లిదండ్రులు రోదిస్తూ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు ..ఆసిఫాబాద్రూరల్: రోడ్డు ప్ర మాదంలో ఒకరు మృతి చెంది న సంఘటన మండలంలో ని తుంపెల్లిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తి ర్యాణి మండలం ఓని గిన్నెధారికి చెందిన మడావి రవీందర్ (36) అతని భార్య నర్మదతో కలిసి ఆసిఫాబాద్లో ఉంటున్నాడు. మంగళవారం ఉదయం ఆసిఫాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా తుంపెల్లి గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు రెఫర్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పిల్లర్ బాక్సులు మీదపడి మహిళ ..చింతలమానెపల్లి: ఇందిరమ్మ పథకం కింద నిర్మిస్తున్న ఇంటి పిల్లర్ బాక్సులు మీదపడి మహిళ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కోర్సిని గ్రామానికి చెందిన సిడం సుగుణ (47)కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. పంచాయతీ కార్యదర్శి తిరుపతి అనధికారికంగా కాంట్రాక్టు తీసుకుని ఇల్లు నిర్మిస్తున్నాడు. మంగళవారం పిల్లర్లకు ఇనుప ప్లేట్లను నిర్మించారు. సాయంత్రం గాలులు వీస్తుండడంతో సుగుణ ఇనుపప్లేట్లు పడకుండా కర్రలు అడ్డుగా పెట్టేందుకు ప్రయత్నించింది. గాలులు బలంగా వీచడంతో ఒక్కసారిగా ఇనుప ప్లేట్ల బాక్సు మీదపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త గతంలోనే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని ఎస్సై జీవన్ పరిశీలించారు. కారు బోల్తాపడి ఒకరు..తాండూర్: ప్రమాదవశాత్తు కారు బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రసాద్రావు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజురాకు చెందిన అంబాడే దినేష్ (50), అతని స్నేహితులు రేబావర్ రమేశ్, రేబావర్ మహంకాళి, రేబావర్ సునీతతో కలిసి సోమవారం మంచిర్యాలలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. సాయంత్రం రాజురాకు వెళ్తుండగా వెనుకటైరు పేలడంతో కారు బోల్తా పడింది. ఘటనలో కారు నడుపుతున్న దినేష్కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మృతుని కుమారుడు హర్షల్ దినేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ప్రాణం తీసిన వివాహేతర సంబంధంఉట్నూర్రూరల్: తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని గొడ్డలితో దాడి చేసి ఒకరిని హత్య చేసిన సంఘటన మండలంలోని నర్సాపూర్(బీ)లో చోటు చేసుకుంది. ఉట్నూర్ ఎస్సై గుంపుల విజ య్ తెలిపిన వివరాల ప్రకా రం నర్సాపూర్(బీ)కి చెందిన కాంబ్లే చంద్రముని (43) అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇదే విషయమై దంపతుల మధ్య గొడవ జరగడంతో సదరు మహిళ భర్త అభినందన్ ఇటీవల భార్యను పుట్టింటికి పంపించాడు. సోమవారం రాత్రి చంద్రముని ఇంటికి వస్తుండగా కక్ష పెంచుకున్న అభినందన్, అ తని మిత్రులు సీతావార్, వాగ్మారే సత్యపాల్, వా గ్మారే మిలింద్, కాంబ్లే యోగిరాజ్, కాంబ్లే రజి నికాంత్, సోన్కాంబ్లే కిషోర్, కాంబ్లే రాహుల్తో కలి సి గొడ్డలి, కర్రలతో దాడి చేశారు. తీవ్రగాయాలు కావడంతో బాధిత కుటుంబ సభ్యులు రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య వర్ష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
నాగోబా ఆలయంలో పీవో ప్రత్యేక పూజలు
ఇంద్రవెల్లి: నాగోబా ఆలయంలో మంగళవారం ఐటీడీఏ పీవో మంద మకరందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు నాగోబా ప్రతిమను అందించి శాలువాతో సత్కరించారు. నాగోబా ఆలయ చరిత్ర, జాతర నిర్వహణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేస్లాపూర్ బాలికల ఆశ్రమ వసతిగృహాన్ని సందర్శించి సౌకర్యాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రా వ్, సర్పంచ్ మెస్రం తుకారాం, మెస్రం వంశీయులు మెస్రం కోసేరావ్ కటోడ, మెస్రం మనోహర్, మెస్రం జంగు పాల్గొన్నారు. తాపీమేస్త్రీ ఆత్మహత్యరెబ్బెన: మద్యం మత్తులో తాపీమేసీ్త్ర ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల మేరకు రెబ్బెన మండలంలోని గోలేటికి చెందిన తాపీమేస్తీ గజ్జెల్లి అశోక్ (35) ఆరేళ్లుగా కుటుంబంతో కలిసి పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని రామయ్యపల్లిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై ఇంట్లో తరచూ భార్యతో గొడవపడేవాడు. గత నెల 30న భార్యతో గొడవపడి గోలేటిలో ఉంటున్న తల్లి వద్దకు వచ్చి ఉంటున్నాడు. సోమవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి పడుకున్నాడు. మంగళవారం ఉదయం తలుపులు తీయకపోవడంతో తల్లి ఇరుగు పొరుగు వారి సహాయంతో తలుపులు తెరిచి చూడగా ఫ్యానుకు ఉరేసుకుని కనిపించాడు. 108లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య రమ్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుని తల్లి శశికళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆరోగ్యానికి యోగా..
చెన్నూర్: వేసవి సెలవుల్లో ప్రజ్ఞ శిక్షణ తరగతులు చిన్నారులకు వరంగా మారాయి. స్థానిక రాధాకృష్ణ మందిర్లో వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజ్ఞ వేసవి శిక్షణ శిబిరంలో ఐదు నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు మేధస్సు, ఆరోగ్యంపై శిక్షణ ఇస్తున్నారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ఆసనాలు వేస్తున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ పాటవాలు వెలికితీసేందుకు శిక్షణ తరగతులు దోహదం చేస్తాయని శిక్షకులు పేర్కొన్నారు. నెల రోజులపాటు ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయని, శిక్షణలో యోగా, మెడిటేషన్, భక్తి గీతాలు, ఫజిల్స్, తదితర కార్యక్రమాలు ఉంటాయని వికాస తరంగిణి చీఫ్ కోఆర్డినేటర్ భీమిని రవీందర్గౌడ్, పబ్లిక్ కోఆర్డినేటర్ కట్ల శ్రీనివాసాచార్యులు, సభ్యులు కాసుల సుధీర్, నడిపల్లి లక్ష్మణ్రావు, లక్ష్మాగౌడ్ తెలిపారు. -
అష్టా చెమ్మా
బెల్లంపల్లి: వేసవి సెలవుల్లో చిన్నారులు ఏదో ఓ ఆట నేర్చుకోవడానికి తపన పడుతున్నారు. సెల్ఫోన్లో లభ్యమయ్యే ఆన్లైన్ గేమ్లను పక్కన పెట్టి పురాతన కాలం నాటి ఆటలపై ఆసక్తి చూపుతున్నారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆటలు నేర్చుకుంటూ ఉల్లాసంగా గడుపుతున్నారు. బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామానికి చెందిన చిన్నారులు ఇంటి ఆవరణలో చెట్ల కింద రోజువారీగా ఉదయం, సాయంత్రం వేళల్లో అష్టాచెమ్మా ఆడుతున్నారు. పిల్లలు ఇళ్లలో టీవీలు చూస్తూ కాలంగడిపే కన్నా పూర్వకాలం నాటి ఆటలు ఆడుతుండటం చూసి తల్లిదండ్రులు మురిసి పోతున్నారు. -
‘ప్రాణహిత’ నిర్మాణానికి చర్యలు చేపట్టాలి
బెల్లంపల్లి: ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లాల కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం కలగలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. జగన్నాథపురం, అడ ప్రాజెక్టుల కాలువ నిర్మాణ పనులను గాలికి వదిలేశారన్నారు. కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. సమావేశంలో కుమురంభీం జిల్లా కార్యదర్శి ఎండీ చాంద్పాషా, మంచిర్యాల జిల్లా కార్యదర్శి లాల్కుమార్, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, డి.బ్రహ్మానందం, చరణ్, మల్లేశ్, శ్రీనివాస్, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు. -
పేపర్ క్రాఫ్ట్, ఫజిల్స్..
ఆసక్తి పెంపొందుతోంది ప్రస్తుత కాలంలో పిల్లలు ఎక్కువగా ఫోన్లు, టీవీల కు అతుక్కుపోవడంతో వారి ఆలోచనాశక్తి తగ్గు తోంది. వేసవి సెలవుల్లో పేపర్క్రాఫ్ట్, డ్రాయింగ్, గ్రూప్ యాక్టివిటి లాటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చిన్నారుల్లో ఆసక్తి పెంపొందుతోంది. – దాస్ అపర్ణ, క్రాఫ్ట్ టీచర్, కాగజ్నగర్ కాగజ్నగర్టౌన్: వేసవి సెలవులు వచ్చాయంటే చిన్నారులు ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడం సహజం. సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోవడంతో మానసిక ఒత్తిడి, అలసట పెరుగుతున్నాయ ని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులకు సృజనాత్మక ఆటల ద్వారా ఇస్తున్న శిక్షణ వారిలో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు గానూ పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో ప్రతీరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు పేపర్ క్రాఫ్ట్, ఆటలు, డ్యాన్సులు, ఫజిల్స్, కాగితంతో బొమ్మలను తయారు చేయడం, రంగులతో కళాత్మక చిత్రాలు వేయడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. సామూహికంగా కూర్చొని ఆటలు ఆడటం ద్వారా చిన్నారుల మధ్య స్నేహభావం, మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలాంటి వేసవి శిబిరాలు చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. -
ఒమన్లో నిర్మల్ వాసి అదృశ్యం
నిర్మల్ఖిల్లా: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్కు చెందిన ఆసం మురళి గత నెల ఉపాధి నిమిత్తం ఒమన్కు వెళ్లాడు. వారం రోజుల క్రితం అక్కడి లేబర్ క్యాంప్ నుంచి మెడికల్ పరీక్షల కోసం వెళ్లి తిరిగివస్తుండగా అదృశ్యమైనట్లు తోటి కార్మికులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నారై కమిటీకి వినతి... బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సలహా కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను కలిసి తమగోడు వెల్లబోసుకున్నారు. మురళిని క్షేమంగా స్వదేశానికి రప్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితుని సోదరుడు సుమన్ వినతిపత్రం అందజేశారు. స్పందించిన స్వదేశ్ పరికిపండ్ల, ఈ–మైగ్రేట్ పోర్టల్ ద్వారా ఒమన్లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. ఢిల్లీలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ కార్యాలయానికి కూడా వివరాలు పంపినట్లు వివరించారు. -
నైపుణ్యంతో కూడిన విద్యనందించాలి
బాసర: ఆర్జీయూకేటీ విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ భవేశ్మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆర్జీయూకేటీని సందర్శించి విశ్వవిద్యాలయ అధికారులతో కలెక్టర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాబోధనలో ఆధునిక సులభతర పద్ధతులను ప్రవేశపెట్టాలన్నారు. క్లిష్టమైన అంశాలు కూడా సులువుగా అర్థమయ్యేలా బోధించాలన్నారు. కేవలం పట్టభద్రులుగా కాకుండా ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా తీర్చిదిద్దాలన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న రంగాల వైపు విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కలెక్టర్ భవేశ్ మిశ్రాను, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ను వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సమావేశంలో డీఆర్డీవో విజయలక్ష్మి, తహసీల్దార్ పవన్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం
ఉట్నూర్రూరల్: గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. మంగళవారం పీవో చాంబర్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్, మిషన్ భగీరథ అధికారులతో గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలన్నారు. పైప్లైన్ లీకేజీలు, మోటార్లలో లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, విద్యుత్ సరఫరా మెరుగుదల, అంగన్వాడీ భవనాల నిర్మాణం, ఆశ్రమ పాఠశాలల మరమ్మతు పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలన్నారు. ప్రతీశాఖ సమన్వయంతో పనిచేస్తే ఆశించిన ఫలితాలు సాధ్యమన్నారు. -
విద్యార్థిని అభినందించిన కలెక్టర్
ఆసిఫాబాద్రూరల్/సిర్పూర్(టి): పార్కింగ్ సమస్యకు విన్నూత పరిష్కారం చూపించే విధంగా పార్కింగ్ మేనేజ్మెంట్ ఇన్ క్రౌడెంట్ ప్లెస్ అనే డిజైన్కు ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం నుంచి అధికారిక నమోదు లభించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ హరిత అన్నారు. మంగళవారం డిజైన్ తయారు చేసిన సిర్పూర్(టి) మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన విద్యార్థి మమత, గైడ్ టీచర్ కేశవ్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్ను డీఈవో లలితతో కలిసి కలెక్టరేట్లో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2026, జనవరి 5న డిజైన్ నమోదు చేయడం జరిగిందని, ప్రస్తుతం నగరాలలో పెరుగుతున్న ట్రాఫిక్, ప్కారింగ్ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందించే దిశగా ఒకఅడుగు పడినట్లు తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ నిర్వహణకు సులభతరం చేయడంలో ఈ డిజైన్ ఉపయోగపడుతుందన్నారు. జిల్లా విద్యార్థులకు, యువతకు ఇది ప్రేరణగా నిలుస్తుందన్నారు. -
గోలీలాటలో చిన్నారులు
దాగుడు మూత దండాకోర్బాక్సింగ్ పంచ్.. బ్లాక్..తైక్వాండోలో తర్ఫీదుబెల్లంపల్లి నంబర్–2 క్రీడా మైదానంలో శిక్షకుడు బోగ రాజేశ్ మార్గదర్శకంలో చిన్నారులు తైక్వాండోలో తర్ఫీదు తీసుకుంటున్నారు. ప్రతీరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు సాధన చేస్తున్నారు. రెండు గంటల శిక్షణ అనంతరం వారు ఇస్తున్న ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. శిక్షణకు 25 మంది వరకు చిన్నారులు హాజరవుతుండగా, మరికొందరు ఫుట్బాల్ నేర్చుకుంటున్నారు. – బెల్లంపల్లివేసవి సెలవుల్లో చిన్నారులు బాక్సింగ్పై ఆసక్తి చూపుతున్నారు. బాక్సింగ్ పంచ్.. బ్లాక్ కొట్టేందుకు శిక్షణ పొందుతున్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 31 వరకు ఇవ్వనున్న శిక్షణను14 ఏళ్లలోపు చిన్నారులు సద్వినియో గం చేసుకుంటున్నారు. మంచిర్యాల జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో 15 మంది బాక్సింగ్లో మెలకువలు నేర్చుకుంటున్నారు. రూ.100 ఫీజుతో నెలరోజుల పాటు శిక్షణ అందిస్తున్నట్లు శిక్షకులు తెలిపారు. – మంచిర్యాలటౌన్పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో గ్రామీణ ప్రాంత చిన్నారులు ఇంటివద్ద గోలీలు, వివిధ రకాల ఆటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా చెట్ల నీడలో...ఇళ్లముందు ఉన్న పందిరి కింద గోలీలాడుతూ కనిపిస్తున్నారు. ఆదివారం మండలంలోని అంజీ గ్రామాన్ని ‘సాక్షి’ సందర్శించగా చిన్నారులు ఇలా చెట్టు నీడలో గోలీలాడుతూ కనిపించారు. – ఇంద్రవెల్లిడ్రమ్ము పైన ఉన్న నీటిని తాగుతున్న తేనెటీగలుజిల్లాలో ఎండలు మండిపోతున్నాయి, గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. భరించలేని వేడిమి, వేసవి తాపంతో పిచ్చుకలు, తేనెటీగలు ఇంటి ఆవరణలో నిలిచి ఉన్న నీటిని తాగుతూ, అందులో స్నానం చేస్తూ చల్లబడుతూ ఉపశమనం పొందుతున్నాయి. – మంచిర్యాలఅగ్రికల్చర్వేసవి సెలవులను చిన్నారులు ఎంజాయ్ చేస్తున్నారు. పగటిపూట ఎండ తీవ్రతకు బయటకు రాని చిన్నారులు సాయంత్రం వేళలో దాగుడు మూత దండాకోర్ ఆటలు ఆడుతున్నారు. దస్తురాబాద్లోని కమ్మరివాడలో సరదాగా ఆడుతుండగా కనిపించారు. –దస్తురాబాద్ -
మూడు కిలోల తరుగు తీస్తే నష్టపోతాం..
జైపూర్ మండలం గంగిపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణకు మిల్లర్లు తిరకాసు పెడుతున్నారు. బస్తాకు మూడు కిలోల తరుగు తీస్తేనే దించుకుంటామని అంటున్నారు. తాలు, తప్ప తూర్పాల పట్టినా, తేమ శాతం 15శాతానికి లోబడి వచ్చినా తరుగు తీత తప్పదు అంటున్నారు. దీనికి ఒప్పుకోకపోవడంతో తూకం నిలిపివేశారు. గతంలో బస్తాకు 41కిలోల ప్రాతిపదిక కొన్నారు. ప్రస్తుతం మూడు కిలోల తరుగు తీస్తే నష్టపోతాం. కేంద్రంలో ధాన్యం ఆరబోసి 15 రోజులవుతోంది. భారీ వర్షం వస్తే ధాన్యం నీటి పాలవుతుంది. తరుగు తీత తగ్గించి కొనుగోలు చేయాలి. – గంగిపల్లి రైతులు -
సింగరేణిలో టీజీబీకేఎస్ ఆవిర్భావం
శ్రీరాంపూర్: సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య(టీజీబీకేఎస్) పేరుతో నూతనంగా సంఘం ఏర్పాటైంది. గోదావరిఖనికి చెందిన టీబీజీకేఎస్ మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య సోమవారం మేడారం తరలివెళ్లి సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద సంఘాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. కార్మికుల పక్షాన పోరాడుతామని, జూన్లో గోదావరిఖనిలో మొదటి మహాసభ నిర్వహించి యూనియన్ స్వరూపాన్ని వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు పెంచాల తిరుపతి, ముదిగిరి మల్లేశం, దాసరి శంకర్, మండ సంపత్, ప్రేంసింగ్, దేవ శ్రీనివాస్, దాసరి మల్లేశ్, నాగుల మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు. -
అమ్మనే.. ఆయన కళ్లు
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల(బి) గ్రామానికి చెందిన రాజేశ్వర్ పుట్టుకతో అంధుడు. పదేళ్లుగా తన హక్కు కోసం పోరాడుతున్నాడు. 2015–16 సంవత్సరంలో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేపట్టగా, రాజేశ్వర్కు మెరిట్ ఉన్నా ఉద్యోగం రాలేదు. తనకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదో చెప్పాలని పదేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. 80 ఏళ్ల ఆయన తల్లే రాజేశ్వర్కు కళ్లుగా మారి.. కొడుకుకు జరిగిన అన్యాయంపై కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. తల్లి బాటలో కొడుకు ఇలా తిరుగుతున్నాడు. సోమవారం కలెక్టరేట్కు వచ్చిన రాజేశ్వర్ ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
పొల్లుగూడలో పెర్సపేన్ ఉత్సవాలు
ఇంద్రవెల్లి: మండలంలోని పొల్లుగూడలో సోమవారం జుగ్నాక్ వంశీయుల పెర్సపేన్ (కులదేవత)కు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జుగ్నాక్ వంశంలో కొత్తగా పెళ్లిళ్లు అయిన కోడళ్లు, ఇప్పటి వరకు దేవత సన్నిధికి రాని కోడళ్లకు భేటింగ్ నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున పెర్సపేన్ దేవతకు పుణ్యస్నానం చేయించి అదేరోజు రాత్రి ఆలయంలో మహాపూజ నిర్వహించనున్నట్లు జుగ్నాక్ వంశీయులు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందించాలన్నారు. జుగ్నాక్ వంశీయుల విన్నపం మేరకు షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కటోడ జుగ్నాక్ మహాదు, జైతు, కాశీరాం, మానిక్రావ్, జుగ్నాక్ భరత్, లింబారావ్, కొరెంగా లింగు, జుగాదిరావ్, మర్సుకోల నాందేవ్, తదితరులు పాల్గొన్నారు. -
సన్నరకం వరి సాగు చేయాలి
నస్పూర్: రైతులు ప్రభుత్వం సిఫారసు చేసిన సన్నరకం వరి సాగు చేయాలని నగర మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సీతారాంపల్లి రైతు వేదిక వద్ద నిర్వహించిన రైతు వారోత్సవంంలో ఆయన మాట్లాడారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తుందని తెలిపారు. రైతులు అధికంగా రసాయన ఎరువులు వాడడం వల్ల నేలలో నాణ్యత తగ్గుతుందని తెలిపారు. నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని, విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో రశీదు తీసుకోవాలని అన్నారు. అనంతరం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్పొరేటర్ సురిమిల్ల సౌమ్య, జిల్లా హార్టికల్చర్ అధికారి అనిత, మండల వ్యవసాయ అధికారి మహేందర్, వెటర్నరీ సర్జన్ తిరుపతి పాల్గొన్నారు. -
అర్జీలపై నిర్లక్ష్యం వద్దు
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలపై నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములుతో కలిసి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, పరిహారం తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరైన జిల్లా సహకార శాఖ అధికారి, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఏవో రాజేశ్వర్ను ఆదేశించారు. -
స్కూటీ ఢీకొని వ్యక్తి మృతి
కాసిపేట: స్కూటీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని అశోక్నగర్కు చెందిన గొడిసెల మల్లేశ్ (65) సోమవారం తనకు పరిచయస్తుడైన లింగంపల్లి శంకర్తో కలిసి బెల్లంపల్లి రైల్వేస్టేషన్ నుంచి పెద్దనపల్లి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా మల్బార్ ఎంటర్ప్రైజెస్ సమీపంలో వెనుక నుంచి స్కూటీపై వచ్చిన సయ్యద్ హబీద్ అతివేగంగా వచ్చి మల్లేశ్ను ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని కుమార్తె గొడిసెల వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..దిలావర్పూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్కు చెందిన దండుగుల పవన్ (26) సెంట్రింగ్ పనులు చేస్తుండేవాడు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని తన పల్స ర్ బైక్పై ఇంటికి బయలుదేరాడు. కాల్వ గ్రామ సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై రవీందర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. జొన్న, మొక్కజొన్న పంటలు దగ్ధంతలమడుగు: మండలంలోని ఉండం గ్రామంలో సోమవారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జొన్నపంట దగ్ధమైంది. రైతులు దార్ల శ్రీకాంత్కు చెందిన మూడెరాలు, వంశీకి చెందిన రెండెకరాలు, శివయ్యకు చెందిన రెండెకరాల్లో జొన్నపంట దగ్ధమైంది. ఘటనలో విద్యుత్ మోటార్, 100 పైపులు, 25 స్పింక్లరు, వ్యవసాయ సామగ్రి దగ్ధమయ్యాయి. ఘటనలో సుమారు రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. మన్నూర్లో జొన్న, మొక్కజొన్న.. గుడిహత్నూర్: మండలంలోని మన్నూర్లో రైతు వెంకట్రావ్కు చెందిన రెండు ఎకరాల్లో జొన్న, రెండు ఎకరాల్లో మొక్క జొన్న పంటలు అగ్నికి ఆహుతయ్యాయి. రెండు రోజుల్లో క్రషర్ పట్టించాల్సి ఉండగా ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. గ్రామస్తులు ఫైరింజన్కు సమాచారం అందించగా సిబ్బంది వచ్చేసరికే పంట పూర్తి స్థాయిలో కాలిబూడిదైంది. సుమారు రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
ఇంద్రవెల్లి: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం హీరాపూర్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. హీరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏడు ఆవాస గ్రామాలకు రూ.25 లక్షలతో తాగునీటి సౌకర్యానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు మేరకు భూ సమస్య పరిష్కరించడానికి అటవీ హక్కు పట్టాలు, రెవెన్యూ పట్టాల సర్వే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఐటీడీఏ పీవో మందా మకరందు మాట్లాడుతూ ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ హీరాపూర్లో త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించనున్నట్లు తెలిపారు. 2021 ఏప్రిల్ 20న హీరాపూర్ను సందర్శించిన సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనున్నట్లు పేర్కొన్నారు. సమస్యలన్నీ పరిష్కారం కానున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికే హీరాపూర్లో ప్రజావాణి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజావాణిలో గ్రామ పెద్దలు, నాయకుల అభిప్రాయాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రాథోడ్ రవీందర్, విద్యుత్ శాఖ ఎస్ఈ జే.చావన్, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, సర్పంచులు తొడసం లక్ష్మీనాగోరావ్, ఆత్రం మహేశ్వర్, రాథోడ్ రోహిదాస్, పంచాయతీరాజ్ డీఈ పవార్ రమేశ్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో జీవన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘బీజేపీ చరిత్రాత్మక విజయం’
చెన్నూర్: దేశంలోని మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం చరిత్రాత్మకమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. పాండిచ్చేరి, అస్సాం, పశ్చిమబెంగాల్లో బీజేపీ గెలుపుపై సోమవారం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధికి బెంగాల్ ప్రజలు పట్టంకట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తుమ్మ శ్రీపాల్, రాపర్తి వెంకటేశ్వర్, శాంతరాణి, ఎతం శివకృష్ణ, జాడి తిరుపతి, కేవీఏం శ్రీనివాస్ పాల్గొన్నారు. భూసారం పరీక్షించుకోవాలి మందమర్రిరూరల్: ప్రతీ రైతు భూసారాన్ని పరీక్షించుకుని ఫలితాల ఆధారంగా ఎరువులు వినియోగించాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ అన్నారు. సోమవారం మండలంలోని సండ్రోన్పల్లిలో ఉన్న రైతువేదికలో భూసార పరిరక్షణ, పంటమార్పిడి విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేలలో సేంద్రియ కర్బన శాతం పెరగడం ద్వారా భూసారం పెరిగి పంటలో నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్, వ్యవసాయ అధికారి కిరణ్మయి, విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో ఆంక్షలు ఎత్తివేయాలి
● బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్రావు ● దండేపల్లిలో రైతుల రాస్తారోకో దండేపల్లి: వరి, మొక్కజొన్న కొనుగోళ్లలో ఆంక్షలు ఎత్తివేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎన్.విజిత్రావు డిమాండ్ చేశారు. దండేపల్లిలో రైతులతో కలసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం రోడ్డుపై ధాన్యం బస్తాలు వేసుకుని రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు, రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల బస్తాకు అదనంగా మరో మూడు కిలోలు తూకం వేయడం, బస్తాలను మిల్లులకు తరలించేందుకు లారీ వాళ్లకు బస్తాకు రూ.2 లేదా రూ.3 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. మొక్కజొన్న ఎకరాకు 26 క్వింటాళ్లే కొంటామంటే మిగతాది ఎవరికి అమ్ముకోవాలని ప్రశ్నించారు. ప్రేంసాగర్రావు ఎమ్మెల్యేగా ఎన్నికై న కొత్తలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల బస్తాకు ఒక గింజ కూడా ఎక్కువగా తూకం వేయకూడదని చెప్పి, కొనుగోలు కేంద్రాల్లో ఇంత జరుగుతున్నా ఇటువైపు కన్నెత్తిచూడడం లేదని విజిత్రావు విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏ ఇబ్బందులు తలెత్తినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తహసీల్దార్ రోహిత్దేశ్పాండే హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నాయకులు, రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు అనిల్, రవి, సంతోష్, భూమన్న, తిరుపతి, అజయ్, రమణ, శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. -
చక్కగా చదువుకున్నాం
పరీక్షలు అనగానే భయం ఉండేది. పేపర్ ఎట్లా వస్తుందో తెలియకపోయేది. ఈ నేపథ్యంలోనే ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ అందించడం భరోసా కలిగించింది. ప్రతీరోజు తరగతి గదిలో చక్కగా చదువుకున్నాం. ప్రతీరోజు సాక్షి దినపత్రికలో వచ్చే మెటీరియల్(పేపర్ కటింగ్)ను ఉపాధ్యాయులు అందించేవారు. అభ్యసన సులువు కావడంతో పదో తరగతిలో 500పైగా మార్కులు సాధించాను. – అన్వేష్, 511 మార్కులువిద్యకు ప్రాధాన్యత..‘సాక్షి’ దినపత్రికలో విద్య(ఎడ్యుకేషన్)కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతీ సబ్జెక్టుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు క్రమం తప్పకుండా ఇవ్వడం వల్ల పిల్లల కోసం రీడింగ్ రూమ్ కార్నర్ ఏర్పాటు చేసి వీటిని(పేపర్ కటింగ్) చదువుకునేలా ప్రోత్సహించాం. గ్రూపుల వారీగా చదువుకునేలా చూశాం. సాక్షి వివిధ సబ్జెక్టులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ ఇవ్వడం.. భయం లేకుండా వార్షిక పరీక్షలు రాసేందుకు దోహద పడింది. పాఠశాల నుంచి 77 మంది పరీక్షలు రాయగా 55 మంది పాసయ్యారు. ఆరుగురు విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. ‘సాక్షి’ దినపత్రికకు విద్యార్థుల తరఫున ధన్యవాదాలు. – బండి రమేష్, హెచ్ఎం, బాలుర ఉన్నత పాఠశాల -
బాధ్యతలు చేపట్టిన కమిషనర్ రమేష్
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్గా తన్నీరు రమేష్ సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న కమిషనర్ సంపత్రెడ్డి ములుగు మున్సిపాల్టీకి బదిలీ కాగా, అక్కడ కమిషనర్గా ఉన్న రమేష్ను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు సంపత్రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన కమిషనర్ రమేష్కు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కాగా, మున్సిపల్ ఎన్నికలకు ముందు బదిలీపై వెళ్లిన ఆయన తిరిగి ఇక్కడ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం గమనార్హం. -
‘సాక్షి’ మెటీరియల్.. ‘పది’ంతల మేలు
మంచిర్యాలఅర్బన్: సాక్షి స్టడీ మెటీరియల్ పదో తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా మారింది. సులభమైన భాషలో స్పష్టమైన వివరణలతో రూపొందించడం కలిసి వచ్చింది. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో భయం తొలగిపోవడంతోపాటు పరీక్ష పద్ధతిపై అవగాహన ఏర్పడింది. పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా జనవరిలో ‘సాక్షి’ నిపుణులతో రూపొందించిన స్టడీ మెటీరియల్ను పంపిణీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు అభ్యసన పుస్తకాలు ఎంతో ఉపయుక్తంగా మారాయి. ‘సాక్షి’ దినపత్రికలో వచ్చే ప్రశ్నలు, జవాబులు, బ్లూప్రింట్ తదితర అంశాలను ప్రతీ రోజు తరగతి గదిలో బోధించారు. మంచిర్యాల జెడ్పీహెచ్ఎస్(బాలుర) ప్రధానోపాధ్యాయుడు రమేష్ సూచన మేరకు ఉపాధ్యాయురాలు సుధా ప్రతీరోజు ‘సాక్షి’ పేపర్ క్లిప్పింగ్లను తీసుకొచ్చి రీడింగ్ కార్నర్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతూ పరీక్షలకు సన్నద్ధం చేశారు. వార్షిక పరీక్షల్లో మంచి మార్కుల సాధనకు ‘సాక్షి’ మెటీరియల్ మేలు చేసిందని జెడ్పీహెచ్ఎస్(బాలుర) విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
మంచిర్యాలక్రైం: చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత నెల 23న జిల్లా కేంద్రంలోని గౌతమేశ్వరకాలనీకి చెందిన ముదాం నగేష్ ఇంట్లో 376 గ్రాముల బంగారం, కిలో వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం మంచిర్యాల బస్టాండ్ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన (ప్రస్తుతం మహారాష్ట్ర, చంద్రాపూర్లో నివాసం ఉంటున్నారు) ఆశిష్ శ్రీనివాస్, రెడ్డిమల్ల ఆకాష్ను విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 311 గ్రాముల బంగారం, కిలో వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగితా 65 గ్రాముల బంగారు నగలను స్థానిక ముత్తుట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టినట్లు పేర్కొన్నారు. కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ శ్రీనివాస్పై మహారాష్ట్రలో 12కు పైగా కేసులున్నట్లు విచారణలో గుర్తించామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి దొంగలను పట్టుకున్న ఐడీ పార్టీ పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించి, ప్రత్యేక రివార్డులను అందజేశారు. సమావేశంలో ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్ రావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
వేగ నియంత్రణకు స్టాపర్లు
జన్నారం: టైగర్జోన్ నిబంధనలు జన్నారం అటవీ డివిజన్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ముందుగా రాత్రి 9గంటల నుంచి ఉదయం 6గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేతను అమలు చేశారు. అనంతరం ఎకో సెన్సిటివ్ జోన్ అమలుకు దృష్టి సారించారు. ఇందులో భాగంగా టైగర్జోన్ పరిధిలోని ప్రధాన రహదారిపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్టాపర్లు ఏర్పాటు చేశారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన వైల్డ్లైఫ్ బోర్డు సమావేశంలో టైగర్జోన్ నిబంధనలపై నిర్ణయాలు తీసుకున్నారు. వాహేనాల వేగం గంటకు 30కిలోమీటర్లకు మించకుండా చర్యలు తీసుకుంటున్నారు. తపాలపూర్ నుంచి ఇందన్పల్లి వరకు అటవీ ప్రాంతంలో 11చోట్ల స్టాపర్లు ఏర్పాటు చేశారు. వన్యప్రాణులు ఎక్కువగా తిరిగే, రోడ్డు దాటే ప్రాంతాల్లో మూడు చొప్పున ఏర్పాటు చేసి వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. వాహనాలు అతివేగంగా వెళ్లడంతో వన్యప్రాణులు తగిలి మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. గత ఏడాది కాలంలో జన్నారం అటవీ డివిజన్లోని తపాలపూర్, మహ్మదాబాద్, జువ్విగూడ ప్రాంతాల్లో పలు వాహనాలు వన్యప్రాణులను తప్పించబోయి ప్రమాదాలకు గురైన సంఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో వాహనదారులు, వన్యప్రాణుల రక్షణకు నిబంధనల ప్రకారం వేగాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం కాలంగా జన్నారం అటవీ డివిజన్ గుండా భారీ వాహనాల రాకపోకలను పగలు కూడా నిషేధించారు. మండలానికి చెందిన కొందరు ఆందోళనకు దిగడంతో రాకపోకలకు అనుమతించారు. భారీ వాహనాలు ఎక్కువగా తిరుగుతుండడంతో వన్యప్రాణులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున స్టాపర్లు ఏర్పాటు చేసి వేగాన్ని అదుపులోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
డీఎఫ్వో రాహుల్ కిషన్జాదవ్ బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలక్రైం: జిల్లా అటవీ శాఖ అధికారిగా రాహుల్ కిషన్ జాదవ్ సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ములుగు జి ల్లా అటవీ శాఖ అధికారిగా ఉన్న ఆయన ఇటీవల మంచిర్యాలకు బదిలీ అయ్యారు. ఎఫ్డీవో, ఎఫ్ఆర్వోలు, కార్యాలయ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. జిల్లాలో అటవీ సంపదను పెంపొందించేందుకు, వణ్యప్రాణుల సంరక్షణకు సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఎఫ్డీవో సర్వేశ్వర్, ఎఫ్ఆర్వో రత్నాకర్రావు, కార్యాలయ సూపరింటెండెంట్ పొన్నం మల్లయ్య, ఎఫ్ఆర్వోలు పాల్గొన్నారు. -
బాధిత రైతులకు పరిహారం అందేలా చూస్తాం
బోథ్: మండలంలోని కన్గుట్టలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న, జొన్న పంటలు దగ్ధమైన బాధిత రైతులకు పరిహారం అందేలా చూస్తామని తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్తో కలిసి గ్రామాన్ని సందర్శించి దగ్ధమైన పంటలు పరిశీలించారు. బాధిత రైతులు అధైర్య పడవద్దని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతులకు భరోసా కల్పించేందుకే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్ఖాన్, నిర్మల్ కాంగ్రెస్ నాయకుడు మల్లారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రాజు యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బూరుగుల మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలినేరడిగొండ: రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చట్టబద్ధత కల్పించాలని టీఎస్ఎస్డీసీ టీఎస్డీసీ చైర్మన్ అన్వేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించకుండా కేంద్రం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తోందని విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర రైతాంగ సమస్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ‘కిసాన్ కపాస్’ యాప్ పేరుతో పత్తి రైతులను కేంద్ర ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి, నాయకులు సద్దాం, సీతారాం, తదితరులు పాల్గొన్నారు. -
దాదర్ఎక్స్ప్రెస్ను నడపాలి
దాదర్ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేయడంతో ముంబై వెళ్లడానికి ఉత్తర తెలంగాణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్కు వెళ్లి అక్కడి నుంచి మరో రైలులో వెళ్లాల్సి వస్తోంది. అర్ధంతరంగా రద్దు చేసిన దాదర్ ఎక్స్ప్రెస్ను పునరుద్ధరిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల రైలు ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. నాసిక్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకునే భక్తులకు ఉపయుక్తం కానుంది. రైల్వేశాఖ అధికారులు ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి. – మంతెన శ్రీనివాస్, రైలు ప్రయాణికుడు, బెల్లంపల్లి -
వేర్వేరుచోట్ల మొక్కజొన్న పంట దగ్ధం
భైంసారూరల్: మండలంలోని ఇలేగాంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మొక్కజొన్న పంట దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రైతు పార్వతి సాయినాథ్ రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల పంటను కోసి చేనులోనే కుప్పలుగా ఉంచాడు. ఆదివారం పంటచేను పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తాకడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి పంటకు నిప్పంటుకుంది. మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు నీళ్లుచల్లి ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ.50 వేల నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. రాజూరలో.. ఖానాపూర్: మండలంలోని రాజూరలో రైతు ఎనుగందుల చిన్నయ్య ఎకరం విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల పంటను కోసి చేనులోనే కు ప్పగా ఉంచాడు. ఆదివారం ట్రాన్స్ఫార్మర్ వద్ద మ ంటలు చెలరేగడంతో పంటకు నిప్పంటుకుని అర ఎకరానికి పైగా దగ్ధమైంది. ప్రభుత్వం పరిహారం అ ందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. మామడలో... మామడ: మండల కేంద్రానికి చెందిన కోండ్ర రమేశ్ అనే రైతు ఎకరంలో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల పంటను కోసి చేనులో కుప్పగా పోశాడు. ఆదివారం తెల్లవారుజామున మొక్కజొన్నకు నిప్పుంటుకోవడంతో గమనించిన రైతు మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. అప్పటికే పంటమొత్తం కాలిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు..
చింతలమానెపల్లి: ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడుతోంది. రెండు నెలల క్రితం తండ్రి కుబిడె కిష్టయ్య అనా రోగ్యంతో మృతి చెందగా పెద్ద కుమారుడు కుబిడె శ్యాంసుందర్ (27) కుటుంబ బాధ్యతను తీసుకున్నాడు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు సైతం మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖర్జెల్లికి చెందిన శ్యాం సుందర్ టైలరింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలోని ఒక శుభకార్యం నేపథ్యంలో మోటార్ సైకిల్పై గ్రామానికి బట్టలు తీసుకెళ్లే క్రమంలో బాబాపూర్, నాగెపల్లి గ్రామాల మధ్య బైక్ అదుపుతప్పి గుంతలో పడిపోయింది. యువకుడికి తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య పావని, తల్లి మంగబాయి ఉన్నారు. సోదరుడు సుమియోన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కౌటాల పోలీసులు తెలిపారు. -
కథలు చెప్పం.. రాస్తాం..!
నీతికథలు రాస్తున్నా.. నాకు కథలంటే చాలా ఇష్టం. హెచ్ఎం, ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో కథలు, కవితలు రాస్తున్నాను. కథల కోసం ఒక నోట్ బుక్ పెట్టాను. ఇంటి వద్ద హోంవర్క్ పూర్తయ్యాక రోజుకో కథ రాస్తున్నాను. ఇంగ్లిష్తోపాటు తెలుగులోనూ కథలు రాస్తున్నాను. భాషపై పట్టు పెరగడంతోపాటు రైటింగ్ మెరుగుపడుతుంది. – ఉషశ్రీ, 5వ తరగతిదండేపల్లి: అక్షరాలు దిద్దాల్సిన వయసులోనే చిన్నారులు చిట్టి చేతులతో నీతి కథలు రాస్తున్నారు. వేసవి సెలవుల్లో కొత్త కోణంలో కథలు రాయడంపై దృష్టి సారించారు. మండలంలోని ద్వారక ప్రాథమిక పాఠశాలలో 27 మంది విద్యార్థులు ఉన్నారు. 3, 4, 5వ తరగతుల విద్యార్థుల ప్రధానోపాధ్యాయుడు సురేష్, ఉపాధ్యాయురాలు లావణ్య ‘వన్డే–వన్స్టోరీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పర్యావరణం, స్నేహం, నిజాయతీ, జంతువులు వంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకుని తెలుగు, ఆంగ్లంలో రోజుకో కథ రాస్తున్నారు. దీంతో వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతోపాటు విద్యార్థులే స్వయంగా రాయడంతో వారిలో నైతిక విలువలు పెంపొందుతాయి. పుస్తకాలతో కుస్తీ పట్టడమే కష్టమనుకునే ఈ రోజుల్లో సొంతగా నీతికథలు రాస్తూ రచయితలుగా రాణిస్తున్నారు. ప్రస్తుత వేసవి సెలవుల్లో ఇంటి వద్ద పుస్తక పఠనం చేస్తూ భాషాభివృద్ధిని పెంపొందించుకుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. మరిన్ని కథలు రాస్తాను.. నేను ఏడాది నుంచి కథలు రాస్తున్నాను. ఈఏటితో నేను ఈ పాఠశాలలో చదువు పూర్తయినప్పటికీ పై తరగతులకు వెళ్లిన కూడా నేను నా రచన అలవాటును కొనసాగిస్తాను. మరింత అభివృద్ధి చేసుకుంటూ మరిన్ని కథలు రాస్తాను. ఇది నాకు మంచి అలవాటుగా అనిపిస్తుంది. – నిత్య, 5వతరగతిసృజనాత్మకతను వెలికితీయాలని.. ప్రతీ విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలనే ఆలోచన, రచనలపై ఆసక్తిని పెంచాలనే ఉద్దేశ్యంతో వన్డే–వన్స్టోరీ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాను. విద్యార్థులు చాలా ఆసక్తి కనబరుస్తూ పోటీపడి కథలు రాస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో భావగ్రహణ శక్తితోపాటు ఆలోచన శక్తి పెరుగుతుంది. – నీరటి సురేష్, పాఠశాల హెచ్ఎం -
నోటిఫికేషన్లు విడుదల చేయాలి
ఉట్నూర్రూరల్: ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి జాదవ్ సుమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని కేబీ ప్రాంగణంలో గిరిజన నిరుద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 3 వెంటనే పునరుద్ధరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీలో ఏజెన్సీ ప్రాంత యువతకు సముచిత వాటా కల్పించాలని, ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 15 ఏళ్లుగా నోటిఫికేషన్లు లేక వేలాది మంది యువత వయసు భవిష్యత్పై ఆందోళన చెందుతున్నారన్నారు. కార్యక్రమంలో మడావి నగేష్, తిరుపతి, రాథోడ్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. -
వరిపంటపైల అడవిపందుల దాడి
జన్నారం: కోతకు సిద్ధంగా ఉన్న వరిపంటపై అడవిపందులు దాడి చేసి ధ్వంసం చేసిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. తపాలపూర్లో జెల్ల అక్కపెల్లి రెండెకరాల్లో వరి సాగు చేశాడు. పంట కోత దశకు వచ్చింది. శనివారం రాత్రి అడవిపందులు దాడి చేసి పంటను ధ్వంసం చేశాయి. అటవీశాఖ అధికారులు పరిహారం అందేలా చూడాలని బాధిత రైతు కోరుతున్నాడు. బ్లాక్మెయిల్కు పాల్పడిన ఇద్దరి అరెస్టుఆదిలాబాద్రూరల్: మావల పోలీస్ స్టేషన్ పరిధిలో మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో రాహుల్ కాంత్ ఐపీఎస్ తెలిపారు. సుభాష్నగర్కు చెందిన ఎర్రపోగుల పవన్ కుమార్, టైలర్స్ కాలనీకి చెందిన మర్రి రాధ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేశారు. సదరు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. ఆందోళనకు గురైన బాధితుడు పలుమార్లు డబ్బులు సైతం ఇచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితులను దస్నాపూర్లో అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
గంజాయి కేసులో ఇద్దరు అరెస్టు
బెల్లంపల్లి: గంజాయి కేసులో ఇద్దరు నిందితులను ఆదివారం అరెస్టు చేసినట్లు తాళ్ల గురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లిలో దాగం రోహిత్ నివాసంలో తనిఖీ చేయగా గంజాయి లభించింది. మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చి తన స్నేహితుడైన జుమ్మిడి రాజశేఖర్తో కలిసి చుట్టుపక్కల గ్రామాల యువకులకు విక్రయిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. రాజశేఖర్ నివాసంలోనూ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పెరట్లో పెంచుతున్న రెండు గంజాయి మొక్కలను గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 690 గ్రాముల ఎండు గంజాయితో పాటు రెండు మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా జడ్జి రిమాండ్ విధించారు. -
జిల్లాస్థాయి అథ్లెటిక్స్లో విద్యార్థినుల ప్రతిభ
వేమనపల్లి: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆ ధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో వేమనపల్లి, నీల్వాయి విద్యార్థినులు ప్రతిభ క నబరిచారు. అండర్–18 విభాగంలో కుర్రు శ్రీ వాణి లాంగ్ జంప్, షాట్పుట్లో ప్రథమ, జెడగల్ల అంజలి హైజంప్లో ప్రథమ, అండర్–16 లో చింతల మహేశ్వరి లాంగ్ జంప్లో ప్రథ మ, బండి నందిని హైజంప్లో ప్రథమ, అండర్–14లో గురుండ్ల శ్రేయ ట్రై అత్లీన్లో ద్వితీ య స్థానాలు సాధించారు. వీరు త్వరలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటార ని పీఈటీ మల్లేశ్ తెలిపారు. వీరిని ప్రజాప్రతినిధులు, మండల అధికారులు అభినందించారు. -
కంప్యూటర్ విద్యపై ఆసక్తి
చెన్నూర్: మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు నేడు కంప్యూటర్ విద్యపై ఆసక్తి చూపిస్తున్నారు. వేస వి సెలవులు సద్వినియోగం చేసుకునే దిశగా శిక్షణ పొందుతున్నారు. పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ఉదయం, సాయంత్రం కంప్యూటర్ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. చెన్నూర్లోని శిక్షణ కేంద్రంలో పట్టణ విద్యార్థులతోపాటు కోటపల్లి, వేమనపల్లి మండలాల నుంచి రాకపోకలు సాగి స్తున్నారు. కంప్యూటర్ కోర్సులు సీఎఫ్సీ, డీసీఏ, పీజీడీసీఏ, డీటీపీ, ట్యాలీతోపాటు టైప్రైటింగ్లోనూ శిక్షణ పొందుతున్నారు. రెండు నెలల శిక్షణ కాలంలో విద్యార్థి పూర్తి స్థాయిలో కంప్యూటర్ శిక్షణ పొందవచ్చని శిక్షకులు రాజు తెలిపారు.పరిజ్ఞానం తప్పనిసరి నాది కోటపల్లి మండలం కొల్లూరు. కంప్యూటర్ శిక్షణ కోసం ప్రతీరోజు ఉదయం బ్యాచ్ వస్తున్నా. డీటీ పీ నేర్చుకుంటున్నా. ఏఐ వచ్చింది. అయినప్పటికీ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పని సరైంది. ఉన్నత చదువులు చదివిన కంప్యూటర్ కోర్సులు వచ్చి ఉండాలి. – జె.రాంచరణ్ తేజ, కొల్లూరుడీసీఏ నేర్చుకుంటున్నా.. మాది చెన్నూర్ మండలం కిష్టంపేట. ఇంటర్ చదువుతున్నా. ప్రతీరోజు ఉదయం చెన్నూర్లోని కంప్యూటర్ సెంటర్కు వచ్చి డీసీఏలో శిక్షణ పొందుతున్నా. ఇంటర్ పూర్తయ్యే వరకు డీటీపీ, పీజీడీసీఏ కోర్సులు పూర్తి చేస్తా. వేసవి సెలవులు సద్వినియోగం చేసుకుంటున్నాం. – జి.విజయ్కుమార్, కిష్టంపేట -
అ‘పూర్వం’ మహా సమ్మేళనం
మంచిర్యాల పట్టణంలోని ఏసీసీ యూపీఎస్, ఎంసీడబ్ల్యూఈఈఎస్ పాఠశాలలో 1984–2018 వరకు చదివిన పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం ఆదివారం కనువిందుగా జరిగింది. దేశ విదేశాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు తరగతిగదుల్లోకి వెళ్లి అప్పటి మధురానుభూతులు గుర్తు చేసుకున్నారు. అంతకుముందు పాఠశాల ప్రాంగణంలోనే ప్రార్థన చేశారు. అక్కడి నుంచి పటేల్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు లక్ష్మీకుమారి, పాండురంగారావు, మురళీచంద్రమోహన్రావు, కేశవ్లాల్, జయంతిరాథోడ్, అప్పారావు, సీవీరావు, అనుపమలతో పాటు పలువురిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. 1,150 మందికి పైగా విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకున్న మహా సమ్మేళనానికి భారత్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. భారత్ వరల్డ్ రికార్డు, వరల్డ్ రికార్డు ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ కేవీ రామనాథ కార్యక్రమ నిర్వాహకులు శాంకరి, గీత, పూర్వ విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేశారు. – మంచిర్యాలఅర్బన్ -
కంపెనీని కాపాడేందుకే..
ప్రస్తుతం కంపెనీ అస్థిత్వం కోల్పోయే ప్రమాదముంది. కొత్త గనులు లేవు. ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఉన్న గనులను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇప్పటికే కంపెనీకి రూ.50వేల కోట్ల మొండి బకాయిలు రావాల్సి ఉంది. దీంతో ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది. భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. ఇలాగే కొనసాగితే సంస్థను అంబానీకో, అదానీకో అప్పగించే అవకాశముంది. 30ఏళ్ల క్రితం సింగరేణికి ఇలాంటి దుస్థితి వస్తే అప్పుడు కాపాడుకున్నాం. ఇప్పుడు మళ్లీ ఆ రోజులు వచ్చాయి. కంపెనీని కాపాడుకునేందుకు కార్మికుల హక్కులను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో నూతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా యూనియన్ను నడిపిస్తాం. – కెంగర్ల మల్లయ్య, టీజీబీకేఎస్ వ్యవస్థాపకుడు -
దేశ కార్మికులకు దిక్సూచి ఐఎన్టీయూసీ
పాతమంచిర్యాల: దేశ కార్మికులకు దిక్సూచి ఐ ఎన్టీయూసీ అని యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాంశెట్టి నరేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే ఐఎన్టీయూసీ ఆవిర్భవించిందని తెలిపారు. 3.30కోట్ల మంది కార్మికులు సభ్యులుగా ఉన్న ఐఎన్టీయూసీ ప్రపంచంలోనే పెద్ద కార్మిక సంఘమని పేర్కొన్నారు. యూనియన్ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కనీస వేతనాల సలహామండలి చైర్మన్ జనక్ప్రసాద్ నాయకత్వంలో తెలంగాణలోని కోటీ 20 లక్షల మంది అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమానికి పోరాడుతున్నారని తెలిపారు. ఐఎన్టీయూసీ నాయకులు తిరుపతి, చంద్రమౌళి, గుండోజు రమేశ్, శ్రావణ్, శ్రీనివాస్, కుమార్ తదితరులున్నారు. -
చేపల వేటకు వెళ్లి బాలుడు..
కాసిపేట: చేపల వే టకు వెళ్లి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపిన వివరాల మేరకు తిర్యాణి మండలం చిన్న అ రటిపల్లి గ్రామానికి చెందిన మడావి సురేష్ (16) వారం రోజుల క్రితం వెంకటాపూర్లో ఉంటున్న తన మేనత్త ఆత్రం గోదుబాయి ఇంటికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం తన మి త్రులతో కలిసి అటవీ ప్రాంతానికి చేపల వేటకు వెళ్లాడు. అటవీ శాఖ అధికారులు జంతువుల కోసం ఏర్పాటు చేసిన కుంటలో దిగడంతో ఈతరాక నీటిలో మునిగిపోయాడు. తోటి మిత్రుల సమాచారంతో స్థానికులు వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని తండ్రి బొజ్జిరావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అకాల వర్షం.. ఆగమాగం
జైపూర్/కోటపల్లి/చెన్నూర్రూరల్/వేమనపల్లి/భీమారం/రామకృష్ణాపూర్/మందమర్రిరూరల్: జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. జైపూర్ మండలంలో శనివారం అర్ధరాత్రి ఈదురుగాలులు వీచా యి. ఈ కారణంగా విద్యుత్ తీగలు తెగి షార్ట్ స ర్క్యూట్తో కాన్కూర్ గ్రామానికి చెందిన రైతు గుర్ణ దుర్గయ్యకు చెందిన కోతకు వచ్చిన వరి పొలం కా లిపోయింది. కళ్లెదుటే తన రెక్కల కష్టం అగ్నికి ఆ హూతి కావడంతో దుర్గయ్య కన్నీటిపర్యంతమయ్యాడు. సుమారు రూ.లక్ష వరకు నష్టం జరిగి నట్లు తెలిపాడు. కోటపల్లి మండలంలో ఆదివారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసింది. మండలకేంద్రంలో ధాన్యంపై టార్పాలిన్లు కప్పినా తడిసి ముద్దయింది. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. రాపనపల్లి గ్రామంలో పిడుగుపడి తాటిచెట్టు కాలిపోయింది. ఈదురుగాలులతో కురిసిన చిరుజల్లులకు చెన్నూర్ మండలంలోని అంగ్రాజ్పల్లి గ్రామంలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడింది. స్ధానిక సర్పంచ్ పాగె రాజమణి తక్షణమే స్పందించి చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. భీమారం మండలంలోని బూర్గుపల్లిలో ఆదివారం వీచిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి పైరు నేల వాలింది. భీమారం మండ ల కేంద్రంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసింది. ధాన్యం తడవకుండా కుప్పలపై రైతులు టార్పాలిన్లు కప్పారు. ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు వేమనపల్లి మండలంలో పలుచో ట్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దస్నాపూర్ సమీపంలోని దుర్గం రా జయ్య పొలంలో 11కేవీ విద్యుత్ స్తంభం కూలింది. దీంతోలో మండల కేంద్రానికి 2గంటల పాటు వి ద్యుత్ సరఫరా నిలిచింది. మండల కేంద్రంలోని ప్రాణహిత కాలనీలో విద్యుత్ తీగలు తెగి చెట్లపై పడ్డాయి. ట్రాన్స్కో, జేఎల్ఎం ఉదయకుమార్, సి బ్బంది మహేశ్ విద్యుత్ లైన్లను సరిచేసి సరఫరా ను పునరుద్ధరించారు. నీల్వాయిలో ఈదురుగాలు లతో మోస్తరు వర్షం కురిసింది. రైతులు మొక్కజొ న్న, వరి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు పడ్డారు. రామకృష్ణాపూర్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలు లతో కూడిన వర్షం పడి ‘ఏ’ జోన్, ‘బీ’ జో న్ ప్రాంతాల్లో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. స్తంభాలు కూడా విరిగిపోగా విద్యుత్ సరఫరా నిలిచింది. సూ పర్బజార్ సెంటర్లో ఓ వృక్షం నడిరోడ్డు పై విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. మున్సిపల్ సిబ్బంది వెంటనే చెట్లను తొలగించారు. గాలివాన బీభత్సానికి చెట్టు విరిగి మందమర్రి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంపై పడింది. విద్యుత్ తీగలపై కూడా చెట్టు కొమ్మలు పడగా స్తంభాలు విరిగిపోయాయి. స్తంభం విరిగిపడి సింగరేణి ఫారెస్ట్ అధికారి ఇంటి ఎదుట నిలిపి ఉన్న కారుపై పడగా ధ్వంసమైంది. కోల్బెల్ట్ రోడ్డుపై చెట్లు కూలిపోవడంతో పోలీస్ సిబ్బంది తొలగించారు. సారంగపల్లి, సండ్రోన్పల్లి కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. పలు గ్రామాల్లో మామిడి చెట్ల నుంచి కాయలు రాలిపోయాయి. కోతకొచ్చిన వరి పంటకు నష్టం జరిగింది. పట్టణంలో 10గంటల వరకు కూడా కరెంట్ రాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. -
ప్రశాంతంగా నీట్
మంచిర్యాలఅర్బన్: వైద్యకళాశాల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన నీట్ ప్రశాంతంగా ముగి సింది. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5.20గంటల వరకు పరీక్ష నిర్వహించగా జిల్లా కేంద్రంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,144 మంది కి గాను 1,112 మంది హాజరుకాగా 32 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో 228 మందికి 276 మంది, జెడ్పీ గర్ల్స్ హైస్కూల్లో 240 మందికి 236 మంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 232 మందికి 224 మంది, తెలంగాణ మోడల్ స్కూ ల్లో 384మందికి 376మంది హాజరయ్యారు. జి ల్లా పరిషత్ బాలుర పాఠశాల పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ రాములు పరిశీలించారు. ప్రతీ సెంటర్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేశారు. ఉదయం 11నుంచి విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కేంద్రాల్లోకి అనుమతించారు. 1.30గంటల తర్వాత పరీక్షా కేంద్రాల గే ట్లు మూసివేశారు. నీట్ రాసేందుకు వచ్చిన విద్యార్థులతోపాటు వారి కుటుంబసభ్యులు వెంట వచ్చా రు. పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లేంత వరకు ధైర్యం నింపు తూ అక్కడే ఉన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చి న మహిళలు విద్యార్థులు పరీక్ష రాసి వచ్చేదాకా కేంద్రాల వద్దే ఉన్నారు. నీట్ ప్రశాంతంగా ముగిసిందని సిటీ కో ఆర్డినేటర్ జైకిషన్ ఓజా తెలిపారు. ఆలస్యంగా వచ్చి నిరాశతో వెనుదిరిగి.. నిర్దేశిత సమయానికంటే 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఓ విద్యార్థి వెనుదిరిగిన ఘటన జిల్లా పరి షత్ బాలుర ఉన్నత పాఠశాల కేంద్రంలో చోటు చే సుకుంది. జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలకు చెందిన ఆడెపు మల్లేశ్ కుమార్తె అశ్విత ఆలస్యంగా కేంద్రానికి రావడంతోపాటు ఆధార్కార్డు మరిచిపోయింది. ఆధార్కార్డు కోసం తండ్రితో ఇంటికి వెళ్లి తి రిగి కేంద్రానికి 1.40కి చేరుకుంది. 1.30 గంటలకే గేట్ మూసి వేయడం.. సిబ్బంది అనుమతించకపోవడంతో తండ్రితో కలిసి వెనుదిరిగి వెళ్లిపోయింది. -
బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం ప్రారంభం
పాతమంచిర్యాల: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మంచిర్యాల క్లబ్లో బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరాన్ని జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి హనుమంతరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి సెలవులను సద్విని యోగం చేసుకోవాలని, క్రీడల్లో శిక్షణ పొంది నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం లాగే ఈసారి కూడా అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేశ్గౌడ్ ప్రోత్సాహంతో ఉచిత బ్యాడ్మింటన్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల క్లబ్, వీవీ బ్యాడ్మింటన్ అకాడమీ సహకారంతో ఉదయం శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అతిథులు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, ఏడీఈ గోపాల్, డాక్టర్ శ్రీనివాస్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అడ్వైజర్ కృష్ణ, వీవీ బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్ వివేకవర్ధన్, జయదేవ్, సురేశ్, సీనియర్ క్రీఽడాకారులు పాల్గొన్నారు. -
‘దాదర్’ పట్టాలెక్కేనా?
బెల్లంపల్లి: కాజీపేట–ముంబై మధ్య గతంలో రాకపోకలు సాగించిన దాదర్ (ముంబై) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ (నంబర్ 07197/98) రైలును ఏడాది క్రితం అర్ధంతరంగా రద్దు చేశారు. అప్పటినుంచి ఈ రైలు పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. రైల్వేశాఖ తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయంతో ముంబైకి వెళ్లడానికి ఉన్న ఒక్కగానొక్క సౌకర్యం కూడా దూరమైంది. కాజీపేట నుంచి సిర్పూర్ కాగజ్నగర్ రైల్వేస్టేషన్ల మధ్యలోని ప్రయాణికులకు దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు నాసిక్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోలేని ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రైల్వేశాఖ ఎప్పటికప్పుడు అర్ధంతరంగా రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరిస్తూ, కొత్త రైళ్లను ప్రవేశ పెడుతూ సానుకూల నిర్ణయాలు తీసుకుంటుండగా దాదర్ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందనే ఆరోపణలున్నాయి. పునరుద్ధరణకు మీనమేషాలు దాదర్ వీక్లీ ఎక్స్ప్రెస్ను పునరుద్ధరించి అత్యధిక ప్రాంతాలు, వేలాదిమంది ప్రయాణికులకు రైలు ప్ర యాణ సౌకర్యాన్ని కల్పించాల్సిన అవసరముంది. కాజీపేట జంక్షన్ నుంచి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బ ల్లార్షా, చంద్రపూర్, మజ్రికదాన్, ఆదిలాబాద్ మీ దుగా నాందేడ్, పర్భానీ, జల్న, శంభాజీనగర్, నాగర్సోల్, మన్మాడ్, నాసిక్ రోడ్, కళ్యాణ్, థాణే, దా దర్ (ముంబై)కి రైలు నడపడంతో కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరి ధిలోని ప్రయాణికులకు సౌలభ్యం కలిగే అవకాశాలు న్నా అమలు చేయడం లేదు. ఏ కారణంగానో రై ల్వేశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. తగ్గనున్న దూరభారం కాజీపేట నుంచి ఆదిలాబాద్కు వెళ్లడానికి ఈ మార్గం అత్యంత దగ్గరవుతుంది. ప్రతిపాదిత రూట్ను అమలు చేస్తే దూరభారం తగ్గుతుంది. ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న కృష్ణా ఎక్స్ప్రెస్ మార్గం ఆదిలాబాద్ నుంచి కాజీపేట వయా నిజామాబాద్, చర్లపల్లితో పోలిస్తే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ మార్గం ద్వారా కాజీపేట నుంచి ఆదిలాబాద్కు దాదాపు 162 కిలోమీటర్ల దూరం తగ్గడానికి అవకాశాలున్నాయి. ఇన్ని రకాల ప్రయోజనాలున్న దాదర్ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును పునరుద్ధరించి, క్రమబద్ధీకరించాలని ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నా రైల్వేశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికై నా రైల్వే అధికారులతోపాటు కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలా బాద్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని క్రమబద్ధీకరించేందుకు చొరవ చూపాల్సిన అవసరాన్ని రైలు ప్రయాణికులు గుర్తు చేస్తున్నారు.ఆదిలాబాద్ జిల్లాతో అనుసంధానం దాదర్ వీక్లీ ఎక్స్ప్రెస్ను పునరుద్ధరిస్తే పాత అనుబంధం మళ్లీ చిగురిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆదిలాబాద్తో విడిపోయిన అనుబంధం పెనవేసుకుంటుంది. మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ (టీ), కాగజ్నగర్ తదితర ప్రాంతాల రైల్వే ప్రయాణికులకు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్తో నేరుగా అనుసంధానం ఏర్పడుతుంది. -
స్వీయ గణనలో పాల్గొన్న ఎమ్మెల్యే
పాతమంచిర్యాల: జనాభా లెక్కల స్వీయ గణనను ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు ఆదివారం కలెక్టర్ కుమార్దీపక్ సమక్షంలో తన నివాసంలో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ప్రజలంతా ఈ ప్రక్రియలో పాల్గొని కచ్చితమై న సమాచారాన్ని అందించాలని కోరారు. సీపీవో పాపయ్య, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డీవైఎస్వో రాజేందర్ తదితరులున్నారు. రోడ్డు విస్తరణ అనివార్యం లక్సెట్టిపేట: పట్టణంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రోడ్డు విస్తరణ అనివార్యంగా మారిందని ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు పేర్కొన్నారు. స్థానిక విశ్రాంతి భవనంలో విలేకరులతో మాట్లాడారు. ఊత్కూర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ప్రధాన రోడ్డు విస్తరణకు గతంలో నిర్ణయించిన 80 అడుగులకు తగ్గేది లేదని పేర్కొన్నారు. రోడ్డుపైకి వచ్చిన భవనాలను యజమానులు తొలగించుకునేందుకు ఈనెల 6వరకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈనెల 7న రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. -
పకడ్బందీగా ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు, మేయర్ ధర్ని మధుకర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5 వేల టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రానివారు అధికారుల దృష్టికి తీసుకొస్తే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ రూ.300 కోట్ల అంచనా వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేసి మెరుగైన వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. మంచిర్యాల డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, లక్సెట్టిపేట చైర్ పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్పర్సన్ రాజేశ్వరి పాల్గొన్నారు. నకిలీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకో వాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలుపు మందులు, నకిలీ, నిషేధిత విత్తనాల నియంత్రణపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీపీ అంబర్ కిషోర్ ఝూ, డీఏవో సురేఖ, పోలీస్, రెవెన్యూ అధికారులతో కలి సి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు వినియోగించేలా అ వగాహన కల్పించాలన్నారు. నకిలీ విత్తనాల ని యంత్రణపై టాస్క్ఫోర్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ నకిలీ, నిషేధిత విత్తనాల విక్రయం, విని యోగం నియంత్రణపై సంబంధిత శాఖల అధికా రులు సమష్టిగా కృషి చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మాదక ద్రవ్యాలకు దూరం ఉండాలి
నస్పూర్: విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరం ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శనివారం సీసీసీ నస్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఎంఎం గార్డెన్లో నిర్వహించిన గంజాయి వినియోగం–దుష్పరిణామాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్తుకు బానిసైన వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, నార్కోటిక్స్ పెద్దపల్లి విభాగం సీఐ రాజ్కుమార్, సీసీసీ నస్పూర్ ఎస్సై మేకల ప్రశాంత్, హాజీపూర్ ఎస్సై కిరణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
కంప్యూటర్ విద్యపై ఆసక్తి
చెన్నూర్: మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు నేడు కంప్యూటర్ విద్యపై ఆసక్తి చూపిస్తున్నారు. వేసవి సెలవులు సద్వినియోగం చేసుకునే దిశగా శిక్షణ పొందుతున్నారు. పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ఉదయం, సాయంత్రం వేళల్లో కంప్యూటర్ కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. చెన్నూర్లోని శిక్షణ కేంద్రంలో పట్టణ విద్యార్థులతోపాటు కోటపల్లి, వేమనపల్లి మండలాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కంప్యూటర్ కోర్సులు సీఎఫ్సీ, డీసీఏ, పీజీడీసీఏ, డీటీపీ, ట్యాలీతోపాటు టైప్రైటింగ్లోనూ శిక్షణ పొందుతున్నారు. రెండు నెలల శిక్షణ కాలంలో విద్యార్థి పూర్తి స్థాయిలో కంప్యూటర్ శిక్షణ పొందవచ్చని శిక్షకులు రాజు తెలిపారు.డీసీఏ నేర్చుకుంటున్నా.. మాది చెన్నూర్ మండలం కిష్టంపేట. ఇంటర్ చదువుతున్నా. ప్రతీరోజు ఉదయం చెన్నూర్లోని కంప్యూటర్ సెంటర్కు వచ్చి డీసీఏలో శిక్షణ పొందుతున్నా. ఇంటర్ పూర్తయ్యే వరకు డీటీపీ, పీజీడీసీఏ కోర్సులు పూర్తి చేస్తా. వేసవి సెలవులు సద్వినియోగం చేసుకుంటున్నాం. –జి.విజయ్కుమార్ కిష్టంపేటపరిజ్ఞానం తప్పనిసరి నాది కోటపల్లి మండలం కొల్లూరు. కంప్యూటర్ శిక్షణ కోసం ప్రతీరోజు ఉదయం బ్యాచ్ వస్తున్నా. డీటీ పీ నేర్చుకుంటున్నా. ఏఐ వచ్చింది. అయినప్పటికీ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పని సరైంది. ఉన్నత చదువులు చదివిన కంప్యూటర్ కోర్సులు వచ్చి ఉండాలి. డీటీపీ కోర్సులో శిక్షణ పొందుతున్నా. –జె.రాంచరణ్ తేజ, కొల్లూరు -
15వ ఆర్థిక సంఘం నిధులపై సమీక్ష
మంచిర్యాలరూరల్(హాజీపూర్): 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధుల వినియోగంపై శనివారం ఐడీఓసీలోని డీపీవో ఛాంబర్లో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, డీఎల్పీవో, ఎంపీవోలతో కలిసి సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా, ఇంటి పన్నుల వసూళ్లు, లైసెన్స్ల రెన్యూవల్పై సమీక్షించా రు. సమావేశంలో డీఎల్పీవోలు సతీశ్, ధర్మారాణి, ఎంపీవోలు శ్రీపతి బాపు, అజ్మత్అలీ, అక్తర్ మోహీనుద్దీన్, శ్రీనివాస్, సతీశ్రెడ్డి, వెంకటేశ్, మహేశ్, రమ్యశ్రీ, సుమన్, డీపీఎం నరేందర్, సీనియర్ అసిస్టెంట్ రాంకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
‘జనాగ్రహ సభ విజయవంతం చేయాలి’
మంచిర్యాలటౌన్: హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 10న బీజేపీ ఆధ్వర్యంలో ని ర్వహించనున్న జనాగ్రహ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి కోరా రు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఇందుకు సంబంధించిన పోస్టర్లు ఆ విష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ దేశంలో పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ తీసుకువచ్చిన డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అడ్డుకున్నాయన్నారు. ఈ అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశంతోనే సభ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పాపారావు, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, నాయకులు దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణమూర్తి, కోడి రమేశ్, కమలాకర్రావు, దార కళ్యాణి, రంగ శ్రీశైలం, సత్రం రమేశ్, కుర్రె చక్రవర్తి, డేగ బాపు, అమిరిశెట్టి రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
నేడు నీట్
మంచిర్యాలఅర్బన్: వైద్య విద్యలో ప్రవేశంకోసం ఆదివారం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష (నీట్–2026) కోసం సర్వం సిద్ధం చేశారు. పరీక్షల నిర్వహణకు జిల్లా కేంద్రంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్దేశిత సమయం దాటితే లోనికి అనుమతించరు. మంచిర్యాలలో తెలంగాణ ఆదర్శ పాఠశాల (రాజీవ్నగర్)లో 384 మంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కాలేజీరోడ్)లో 232 మంది, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల (బస్టాండ్ పక్కన) 288 మంది, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (మార్కెట్ ఏరియా) పరీక్షా కేంద్రంలో 240 మొత్తంగా 1,144 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో 24 మందికి ఇద్దరు ఇన్విజలేటర్లు పర్యవేక్షించనున్నారు. సీసీ కెమెరాలు, జామారాలను అమర్చారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాల మూసివేత, 163 సెక్షన్ ఆంక్షలతో పాటు పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలు పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను శనివారం అడిషనల్ కలెక్టర్ రాములు, సిటీ కోఆర్డి నేటర్ జైకిషన్ ఓజా సందర్శించారు. తరగతి గదులు, నిఘా కెమెరాల ఏర్పాటు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇన్విజిలేటర్లకు ఓరియంటేషన్ నీట్కు సంబంధించిన ఇన్విజిలేటర్లకు స్థానిక రాజీవ్నగర్ తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో శనివారం ఓరియంటేషన్ నిర్వహించారు. సెంటర్ సూపరింటెండెంట్ ముత్యం బుచ్చన్న పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాములు పరీక్ష నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు. ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా అడ్మిట్కార్డు, మూడు ఫొటోలు (ఒకటి పోస్టుకార్డ్ సైజు, రెండు పాస్ఫొటోలు), ఒరిజినల్ ఐడీ ప్రూప్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంచిర్యాల సీఐ ప్రమోద్రావు, డిప్యూటీ సెంటర్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అబ్జర్వర్ రామకృష్ణ పాల్గొన్నారు. విద్యార్థులు మర్చిపోవద్దు.. విద్యార్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు, రెండు పాస్ఫొటోలు, పోస్టుకార్డు సైజ్ ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపుకార్డు (ఆధార్, డ్రైవింగ్ లైస్సెన్స్, తదితర)లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు వ్యాలెట్, చేతి గడియారాలు, కెమెరాలు, కాలిక్యులేటర్లు, పెన్నులు లోనికి అనుమతించరు. ఆభరణాలు, భారీ దుస్తులు, బూట్లు ధరించవద్దు. బయోమెట్రిక్ హాజరు నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకుంటే మంచిది. -
ప్రథమస్థానంలో లక్సెట్టిపేట
లక్సెట్టిపేట: ఎర్లీబర్డ్ స్కీంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఉమ్మడి జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. 2026–27 ఆర్థికసంవత్సరం ప్రారంభ నెలలో 5 శాతం రిబేటుతో పన్నుల వసూలులో జిల్లాలోనే ముందుంది. రాష్ట్రంలో 19వ స్థానం జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. రూ.2.50 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్ ఉండగా రూ.54 లక్షలతో 26 శాతం వసూలైనట్లు మున్సిపల్ కమిషనర్ విజయ్కుమార్ తెలిపారు. చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆస్తి పన్ను డిమాండ్ రూ.3.32 కోట్లు ఉండగా ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ.41.42 లక్షలు వసూలైందని కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో 7,053 నివాసాలు ఉండగా 830 నివాసాలకు సంబంధించిన వసూళ్లు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. చెన్నూర్ మున్సిపల్ కార్యాలయం -
పేదల అభ్యున్నతి కోసమే పథకాలు
బెల్లంపల్లి: పేదల అభ్యున్నతి కోసమే ప్రభుత్వం పథకాలు ప్రవేశ పెడుతోందని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. శనివారం కన్నా ల శివారులోని ఓ ప్రైవేట్ గార్డెన్లో నియోజకవర్గ స్థాయి గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తున్నామన్నా రు. అంతకు ముందు ప్రభుత్వ శాఖల అధికా రులు అభివృద్ధి నివేదికను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె.సంప త్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
కథలు చెప్పం.. రాస్తాం..!
నీతికథలు రాస్తున్నా.. నాకు కథలంటే చాలా ఇష్టం. హెచ్ఎం, ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో కథలు, కవితలు రాస్తున్నాను. కథల కోసం ఒక నోట్ బుక్ పెట్టాను. ఇంటి వద్ద హోంవర్క్ పూర్తయ్యాక రోజుకో కథ రాస్తున్నాను. ఇంగ్లిష్తోపాటు తెలుగులోనూ కథలు రాస్తున్నాను. భాషపై పట్టు పెరగడంతోపాటు రైటింగ్ మెరుగుపడుతుంది. –ఉషశ్రీ, 5వ తరగతిదండేపల్లి: అక్షరాలు దిద్దాల్సిన వయసులోనే చిన్నారులు చిట్టి చేతులతో నీతి కథలు రాస్తున్నారు. వేసవి సెలవుల్లో కొత్త కోణంలో కథలు రాయడంపై దృష్టి సారించారు. మండలంలోని ద్వారక ప్రాథమిక పాఠశాలలో 27 మంది విద్యార్థులు ఉన్నారు. 3, 4, 5వ తరగతుల విద్యార్థుల ప్రధానోపాధ్యాయుడు సురేష్, ఉపాధ్యాయురాలు లావణ్య ‘వన్డే–వన్స్టోరీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పర్యావరణం, స్నేహం, నిజాయతీ, జంతువులు వంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకుని తెలుగు, ఆంగ్లంలో రోజుకో కథ రాస్తున్నారు. దీంతో వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతోపాటు విద్యార్థులే స్వయంగా రాయడంతో వారిలో నైతిక విలువలు పెంపొందుతాయి. పుస్తకాలతో కుస్తీ పట్టడమే కష్టమనుకునే ఈ రోజుల్లో సొంతగా నీతికథలు రాస్తూ రచయితలుగా రాణిస్తున్నారు. ప్రస్తుత వేసవి సెలవుల్లో ఇంటి వద్ద పుస్తక పఠనం చేస్తూ భాషాభివృద్ధిని పెంపొందించుకుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. మరిన్ని కథలు రాస్తాను.. నేను ఏడాది నుంచి కథలు రాస్తున్నాను. ఈఏటితో నేను ఈ పాఠశాలలో చదువు పూర్తయినప్పటికీ పై తరగతులకు వెళ్లిన కూడా నేను నా రచన అలవాటును కొనసాగిస్తాను. మరింత అభివృద్ధి చేసుకుంటూ మరిన్ని కథలు రాస్తాను. ఇది నాకు మంచి అలవాటుగా అనిపిస్తుంది. –నిత్య, 5వ తరగతి సృజనాత్మకతను వెలికితీయాలని.. ప్రతీ విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలనే ఆలోచన, రచనలపై ఆసక్తిని పెంచాలనే ఉద్దేశ్యంతో వన్డే–వన్స్టోరీ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాను. విద్యార్థులు చాలా ఆసక్తి కనబరుస్తూ పోటీపడి కథలు రాస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో భావగ్రహణ శక్తితోపాటు ఆలోచన శక్తి పెరుగుతుంది. –నీరటి సురేష్, పాఠశాల హెచ్ఎం -
‘ముందస్తు’కు వెనుకాడారు..!
మంచిర్యాలటౌన్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ముందస్తు పన్ను చెల్లింపులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్ స్కీంకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 నాటికి పూర్తిస్థాయిలో పన్ను చెల్లించిన వారికి మాత్రమే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను ముందస్తుగా చెల్లించేందుకు ప్రభుత్వం 5 శాతం రిబేట్ కల్పించింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు పన్ను చెల్లింపులకు అవకాశం కల్పించింది. మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలో రూ.30.60 కోట్ల పన్ను డిమాండ్ ఉండగా ఈ ఏడా ది మార్చి 31 వరకు రూ.19.70 కోట్లు వసూలైంది. ఎర్లీబర్డ్ స్కీంలో భాగంగా రూ.7.24 కోట్లు వసూలైంది. స్కీంపై పూర్తి అవగాహన కల్పించక పోవడంతోనే ప్రజలు ముందస్తు పన్ను చెల్లింపులకు ముందుకు రాలేదని తెలుస్తోంది.రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎర్లీబర్డ్ స్కీమ్ కింద రూ.కోటి 13 లక్షల ఆదాయం సమకూరినట్లు మున్సిపాలిటీ రెవెన్యూ అధికారి సతీష్ తెలిపారు. మున్సిపాలిటీలో మొత్తం రూ.5 కోట్ల 28 లక్షలు డిమాండ్ ఉండగా ఏప్రిల్ 1 నుండి 30 వరకు చేపట్టిన ఎర్లీబర్డ్ స్కీమ్ ద్వారా 21 శాతం రూ.కోటి 13 లక్షలు వసూలైనట్లు ఆయన తెలిపారు. మందమర్రిరూరల్: మందమర్రి మున్సిపాలిటీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ఎర్లీబర్డ్ స్కీమ్ కింద రూ.54.80 లక్షలు వసూలయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలో రూ.2 కోట్ల 46 లక్షలు డిమాండ్ ఉండగా సింగరేణి రూ.32.99 లక్షలు, ఆర్యన్ కోల్వాషరీ రూ.5.80 లక్షలు చెల్లించడంతో మరికొంత ప్రాపర్టీ ట్యాక్స్ ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద పే చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం 23.92 శాతం వసూలైంది. మందమర్రిలో రూ.54.80 లక్షలుక్యాతనపల్లిలో రూ.1.13 కోట్లు -
షార్ట్ సర్క్యూట్తో పంటలు దగ్ధం
బోథ్: మండలంలోని కౌఠ (బి) గ్రామ శివారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ రైతు పండించిన జొన్న పంట పూర్తిగా అగ్నికి ఆహూతైంది. సాకె ర గ్రామ శివారు వద్ద ముడుపు సతీశ్రెడ్డి అనే రైతు కు చెందిన జొన్న చేనులో ఉదయం ఒక్కసారిగా వి ద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి మంటలు చెలరేగాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండగా మంట లు వేగంగా వ్యాపించి సుమారు ఎకరం విస్తీర్ణంలో ని జొన్నపంట పూర్తిగా కాలి బూడిదైంది. చేతికి వ స్తుందనుకున్న పంట కళ్ల ముందే కాలిపోవడంతో సతీశ్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు. షార్ట్సర్క్యూ ట్ కారణంగా పంట నష్టపోయిన తనను ప్రభుత్వం పరిహారంతో ఆదుకోవాలని కోరుతున్నాడు. చందునాయక్ తండాలో మొక్కజొన్న..ఖానాపూర్: మండలంలోని చందునాయక్ తండా గ్రామానికి చెందిన గిరిజన రైతు గుగ్లావత్ సురేశ్ నాయక్ మొక్కజొన్న చేను విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. గ్రామ శివారులోని పంటచేలలో ఒ క్కసారిగా మంటలు చెలరేగి రెండెకరాల మొక్కజొ న్న పూర్తిగా దగ్ధమైనట్లు బాధిత రైతు ఆవేదన వ్య క్తం చేశాడు. చేతికందిన పంట దగ్ధం కావడంతో తీ వ్ర ఆవేదనకు గురయ్యాడు. తనకు పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. భూతాయ (బి) గ్రామంలో..బజార్హత్నూర్: మండలంలోని భూతాయ (బి) గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో రెండెకరాల్లోని మొ క్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వి వరాల ప్రకారం.. కాల్బూర్గే మారుతికి చెందిన మొ క్కజొన్న చేనుపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు గా లికి ఒకదానికొకటి తగిలాయి. దీంతో నిప్పురవ్వలు ఎగిసి పడి రెండెకరాల పంట కాలి బూడిదైంది. సుమారు రూ.లక్ష వరకు నష్టం జరిగింది. ప్రమాదవశాత్తు మామిడి తోట.. తాండూర్: మండలంలోని చౌటపల్లి శివారులో ప్ర మాదవశాత్తు నిప్పంటుకుని మామిడితోట దగ్ధమైంది. బాధిత రైతు ఈస తెలిపిన వివరాల ప్రకారం.. చౌటపల్లి శివారులోని బాధిత రైతు రెండెకరాల మా మిడి తోట నుంచి సోలార్ ప్లాంట్ విద్యుత్ లైన్ వె ళ్లింది. శుక్రవారం షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగి మామిడితోట దగ్ధమైంది. పంట చేతికి వచ్చే సమయంలో సుమారు మామిడి 200 చెట్లు, 145 టేకు చెట్లు అగ్నికి ఆహూతి కాగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఘటనపై విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నాడు. అల్లీపూర్లోమొక్కజొన్న చేను..దండేపల్లి: మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన ఈర్ల సత్తయ్య మొక్కజొన్న చేను శుక్రవారం ప్రమాదవశాత్తు కాలిపోయింది. సుమారు పదెకరా ల మొక్కజొన్నతోపాటు నీటి పైపులు కాలిపోయా యి. మంటలు చెలరేగిన వెంటనే జన్నారం ఫైర్స్టేషన్కు సమాచారం ఇవ్వగా, అగ్నిమాపక యంత్రం వచ్చి మంటలు ఆర్పివేసింది. తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. -
కార్మిక సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మంచిర్యాలఅగ్రికల్చర్: కార్మిక సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన మే డే వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, నగరపాలక మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్మిక శాఖ సహాయ కమిషనర్ దుర్గం క్రాంతితోపాటు పాల్గొన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ప్రమాదరీత్యా మరణించిన 102 కార్మికుల కుటుంబాలకు సుమారు రూ.60 కోట్లు, సహజ మరణం పొందిన 223 కార్మికుల కుటుంబాలకు రూ.24 కోట్లు, పెళ్లి ప్రోత్సాహం కింద 993 మందికి రూ.30 కోట్లు, ప్రసూతి ప్రోత్సాహం కింద 1,646 మందికి రూ.49 కోట్లు, వైకల్యం పొందిన వారికి రూ.68 కోట్లు అందజేశామని వివరించారు. మే 2 నుంచి 10 వరకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ జిల్లాలో త్వరలో ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరయ్యేలా కృషి చేస్తానని అన్నారు. అసంఘటిత కార్మికులు మరణిస్తే కుటుంబానికి ఇచ్చే నగదును రూ.15 లక్షలకు పెంచేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అనంతరం కార్మిక శాఖకు చెందిన బి.సత్యనారాయణ, ఉపాధి కల్పన కింద వై.రమేష్(ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్), ఉత్తమ ఎస్టాబ్లిష్మింట్ కింద ఓరియంట్ సిమెంట్ దేవాపూర్, ప్రత్యేక కేటగిరి(బాలకార్మిక) కింద శివాజీ(7వ తరగతి విద్యార్థి జెడ్పీహెచ్ఎస్ టేకులబస్తి బెల్లంపల్లి)లకు అవార్డులు అందజేశారు. 16 మండలాలకు కంప్యూటర్లను అందజేశారు. -
బాలరాముడి చెంతకు భక్తుడి పాదయాత్ర
తాండూర్: శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యపురిని సందర్శించి బాలరాముడిని దర్శించుకోవాలనే ఆ భక్తుడి కోరిక నెరవేరింది. వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తన ఇష్టదైవం చెంతకు చేరి తన భక్తిని చాటుకున్నాడు తాండూర్ మండలం చౌటపల్లి గ్రా మానికి చెందిన చీమల నవీన్కుమార్. గత మార్చి 10వ తేదీన నవీన్కుమార్ ఆంజనేయస్వామి మాల ధరించాడు. గ్రామంలోని ఆలయంలో పూజలు చేసి 11వ తేదీన అయోధ్యకు మహాపాదయాత్ర ప్రారంభించాడు. 52రోజుల్లో వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర చేసి శుక్రవారం అయోధ్యకు చేరి బాలరాముడిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా నవీన్కుమార్ మాట్లాడుతూ.. మహాపాదయాత్ర చేసి శ్రీరామచంద్రుడిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. తన పాదయాత్రకు సహకరించిన భక్తకోటికి శిరస్సు వంచి నమస్కారాలు తెలిపాడు. -
క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్
మంచిర్యాలటౌన్/జన్నారం: వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 14 ఏళ్లు నిండిన బాలికలందరికీ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నారని వ్యాక్సినేషన్ రాష్ట్ర పరిశీలకుడు డేవిడ్ దామర్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని జన్నారం, దండేపల్లి మండలం వెంకట్రావ్పేట్, పాత మంచిర్యాల ప్రాథమిక అర్బన్ హెల్త్ కేంద్రం, మాతా శిశు ఆరోగ్య కేంద్రం, ఎన్టీఆర్ నగర్ ఉపకేంద్రంలో హెచ్వీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. బాలికలకు వ్యాక్సినేషన్ తప్పనిసరి అని, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నివారణకు దోహదపడుతుందని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలని, వంద శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీపీహెచ్ఎన్ ఆర్ఎస్ పద్మ, మార్త శ్రీనివాస్, అఖిల్ పాషా, డెమో బుక్క వెంకటేశ్వర్, జన్నారం వైద్యాధికారి ఉమాశ్రీ పాల్గొన్నారు.కిష్టాపూర్ బీట్ అధికారి సస్పెన్షన్జన్నారం: జన్నారం అటవీ డివిజన్ కిష్టాపూర్ బీట్ అధికారి పరమేశ్వర్ను సస్పెండ్ చేస్తూ జిల్లా అటవీ అధికారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడవిలో మంటలు ఆర్పడంలో, విధుల్లో నిర్లక్ష్యం, వహించినందుకు సస్పెండ్ చేసినట్లు జన్నారం రేంజ్ అధికారి లక్ష్మినారాయణ తెలిపారు. తాండూర్ ఏపీవో.. తాండూర్: మండల ఏపీవో ఎస్.నందకుమార్ను సస్పెండ్ చేస్తూ డీఆర్డీఏ ఎస్.కిషన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఏపీవోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మద్యంమత్తులో విధులు నిర్వహిస్తూ, ఇతర ఉద్యోగులు, ఉన్నతాధికారులతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఎంపీడీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంజనీరింగ్ కన్సల్టెంట్ జె.సత్యనారాయణను ఇంచార్జి ఏపీవోగా నియమించారు. -
ఓసీకి అటవీ అడ్డంకి!
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్లో ఓపెన్కాస్ట్ ఫేజ్–2 ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఓసీ ఏర్పాటుతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు రావడంతోపాటు పరోక్షంగా ఉపాధి మార్గాలు ఏర్పడుతాయని భావించిన ప్రజల ఆశలపై అటవీశాఖ ప్రతిబంధకాలు నీళ్లు చల్లుతున్నాయి. ఓసీ ప్రాజెక్టు ఆలస్యం అవుతుండడంతో ప్రారంభమవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మందమర్రి ఏరియా పరిధిలోని రామకృష్ణాపూర్లో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఓపెన్కాస్ట్ ఫేజ్–2 ప్రాజెక్టుకు 366 హెక్టార్ల భూమి క్లియరెన్స్ ప్రస్తుతం ప్రధాన అడ్డంకిగా మారింది. గతంలో ఇదే భూమిని ‘నాన్ ఫారెస్ట్ ల్యాండ్’గా గుర్తించి క్లియరెన్స్ ఇచ్చిన అటవీ అధికారులు ఇప్పుడే అదే భూమిని ‘ఫారెస్ట్ ల్యాండ్’గా పేర్కొనడం వివాదానికి దారి తీస్తోంది. దీంతో ఓసీ ఫేజ్–2 ప్రారంభంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. మూతపడిన ఆర్కే 3, 4, 1ఏ గనులను ఉపయోగిస్తూ ఓసీ ఫేజ్–2 ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేసింది. ఫేజ్–1లో భాగంగా ఎంకే–4, 4ఏ గనుల ద్వారా దాదాపు పదేళ్లపాటు బొగ్గు తవ్వకాలు జరిపిన యాజమాన్యం ప్రస్తుతం ఫేజ్–2లో సుమారు 30 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీత చేపట్టాలని, దాదాపు 18ఏళ్లపాటు బొగ్గు తీయాలనే లక్ష్యంతో ప్రాజెక్టు ఏర్పాటుకు సంకల్పించింది. గత డిసెంబర్ 3న ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభమవుతాయని స్థానికులు ఆశిస్తున్న తరుణంలో అటవీ శాఖ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. గతంలో ఫేజ్–1 సమయంలో ఇదే 366 హెక్టార్ల భూమిని ‘నాన్ ఫారెస్ట్ ల్యాండ్’గా గుర్తిస్తూ అటవీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ భూమిని ఫారెస్ట్ ల్యాండ్గా పేర్కొంటూ ఫేజ్–2కు అభ్యంతరాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఫేజ్–2 మొత్తం 1206 హెక్టార్లలో ఏర్పాటు కావాల్సి ఉండగా ప్రస్తుత వివాదం ఆ భూమిపైకి మళ్లింది. ఆన్లైన్ పేరిట కొత్త చిక్కులు.. గతంలో 1917 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం నాన్ ఫారెస్ట్ ల్యాండ్ కింద ఈ భూమికి క్లియరెన్స్ ఇచ్చిన అటవీ శాఖ అధికారులు ఇప్పుడు ఆన్లైన్ విధానం అమల్లోకి రావడం, ‘పరివేష్’ అనే సాఫ్ట్వేర్లో నమోదైన వివరాలు కూడా కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయని సమాచారం. మ్యాపింగ్ ప్రకారం ఇది నాన్ ఫారెస్ట్ ల్యాండ్గా స్పష్టత ఉన్నా కొందరు అధికారుల అభ్యంతరాలు ప్రాజెక్టు ఏర్పాటుకు అవరోధంగా మారుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకే భూమికి సంబంధించి కొందరు అటవీ అధికారులు గతంలో ఒక విధంగా ఇప్పుడు మరో విధంగా మాట్లాడడంపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫేజ్–1కు క్లియరెన్స్ ఇచ్చిన భూమికే ఇప్పుడు అడ్డంకులు ఎందుకు అన్న ప్రశ్నలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అటవీ అధికారులతో ఇదివరకే చర్చించినట్లు సమాచారం. కలెక్టర్ స్థాయిలోనూ సంప్రదింపులు జరిపినా పరిష్కారం లేకపోవడం గమనార్హం. అటవీశాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండడంతో స్థానిక ఎంపీ కూడా కేంద్ర స్థాయిలో చొరవ చూపి క్లియరెన్స్ సాధించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.మంత్రి జోక్యం చేసుకున్నా కానరాని ఫలితం.. -
ఇంటర్లో ఫెయిలై విద్యార్థిని ఆత్మహత్య
లక్సెట్టిపేట: మండలంలోని చందారం గ్రామానికి చెందిన మాధవి (17) అనే ఇంటర్ విద్యార్థిని ఇంటర్లో ఫెయిలై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మాధవి తన అక్క, అమ్మమ్మతో కలిసి చందారం గ్రామంలో ఉంటోంది. తల్లిదండ్రులు లేకపోవడంతో గ్రామస్తుల సహకారంతో స్థానిక కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇటీవల వెలువడిన వార్షిక పరీక్షల ఫలితాల్లో ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైంది. అప్పటి నుంచి బాధపడుతోంది. శుక్రవారం ఉదయం తన అక్క హైదరాబాద్కు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి అక్క అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతివాంకిడి: మండల కేంద్రంలోని శివకేశవ్నగర్కు చెందిన ఓ యువకుడు గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. శివకేశవ్నగర్కు చెందిన కోదండ సాయి (23) రాత్రి ఖమాన గ్రామానికి వెళ్లాడు. తిరిగి ఖమాన గ్రామం వైపు నుంచి వాంకిడి వైపునకు వస్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యువకుడి అనుమానాస్పద మృతిలక్సెట్టిపేట: లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన అశోక్ (36) అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానిక ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అవివాహితుడైన అశోక్ చేపలు పట్టుకుని జీవనోపాధి పొందుతున్నాడు. గురువారం సాయంత్రం చేపలు పట్టేందుకు తిమ్మాపూర్ గ్రామానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు వెతకగా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం తిమ్మాపూర్, ఇటిక్యాల గ్రామాల మధ్య అతడి మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి కొద్ది దూరంలో అతడి ద్విచక్రవాహనం పడి ఉంది. మృతుడి తల్లి మల్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రైల్వే లోకోస్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి
బెల్లంపల్లి: రైల్వేలో పని చేస్తున్న లోకోస్టాఫ్ సమస్యలు పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ చైర్మన్ నాగరాజు, కార్యదర్శి సాంబశివుడు డిమాండ్ చేశారు. శుక్రవారం రైల్వేస్టేషన్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతకాలంగా లోకో లాబీ రన్నింగ్ స్టాఫ్ పలు సమస్యలతో సతమతం అవుతున్నారని తెలిపారు. ఫాగ్ డివైస్, డేటానేటర్స్ లోకోలో ప్రవేశపెట్టాలని తెలిపారు. 120 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వాలని, లోకోలో ఉన్న సీసీ కెమెరాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లోకో పైలట్ వర్కింగ్ కమిటీ సభ్యులు, రైల్వే కార్మికులు, మజ్దూర్ యూనియన్ శ్రేణులు పాల్గొన్నారు. -
ఇంటికే అంగన్వాడీ సరుకులు
జిల్లాలోఅంగన్వాడీ కేంద్రాలు 974 చిన్నారులు 40,794 గర్భిణులు 3,307 బాలింతలు 3,543మంచిర్యాలటౌన్: రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 1నుంచి 31వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎండ వేడి తీవ్రంగా మారుతుండడం, వడగాల్పులు వీస్తుండడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో మే నెలకు సంబంధించిన పౌష్టికాహారం నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పోషక విలువలు కలిగిన ఆహారంతోపాటు గుడ్లు, అంగన్వాడీ సరుకులను టీహెచ్ఆర్(టేక్ హౌజ్ రేషన్) ఇవ్వాలని నిర్ణయించి అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించి సూచనలు చేసింది. నెలరోజులకు ఒకేసారి అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతీరోజు ఉడకబెట్టిన కోడిగుడ్డు, అన్నం, రోజుకో రకంగా కూరగాయలు, పప్పుతో మధ్యాహ్నం భోజనాన్ని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వడ్డిస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో మధ్యాహ్నం భోజనం లబ్ధిదారులకు అందించడం వీలు కాదు. దీంతో నెలకు సరిప డా సరుకులను ఒకేసారి అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, ఐదేళ్లలోపు చిన్నారులకు 30 గుడ్లు, 7 నెలల నుంచి 3 ఏళ్ల పిల్ల లకు 16 గుడ్లు, ఆరు లీటర్ల పాలు, 25 రోజులకు సరిపడా రోజుకు 16 గ్రాముల చొప్పున మంచి నూనె, 30 గ్రాముల చొప్పున కందిపప్పు, సరిపడా బియ్యం వంటివి నేరుగా అందిస్తారు. ఇంటికే పంపించే పౌష్టికాహారం తప్పనిసరిగా లబ్ధిదారులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
వలస కార్మికులకు విముక్తి
చెన్నూర్: మండలంలోని లంబాడిపల్లి సమీపంలో ఇటుకబట్టీ కంపెనీలో బాల కార్మికులతో పని చేయిస్తున్నారనే సమచారం మేరకు స్థానిక సివిల్ జడ్జి పర్వతపు రవి ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల లేబర్ అధికారులు దాడి చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ అసిస్టెంట్ లేబర్ అధికారి బొరంపూడి సత్యనారాయణతో కలిసి వివరాలు వెల్లడించారు. ఎంఎస్ఎం బ్రిక్స్ కంపెనీలో ఒడిశాకు చెందిన రెండు కుటుంబాల్లోని పది మందికి పైగా పని చేస్తున్నారని తెలిపారు. ఇద్దరు మైనర్ బాలబాలికలతో యజమాని పని చేయిస్తున్నట్లు గుర్తించారని అన్నారు. కార్మికులకు విముక్తి కల్పించి ఒడిశాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. లేబర్ అధికారుల ఫిర్యాదు మేరకు ఇటుకబట్టీల యాజమాని సయ్యద్ మోసిన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో అసిస్టెంట్ లేబర్ అధికారులు దుర్గం క్రాంతికుమారు, మెరుగు శ్రీకాంత్, భీమారం ఎస్సై పాల్గొన్నారు. -
ప్రాణాలు తీసిన ఈత సరదా
నర్సాపూర్ (జి): సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు ఎస్సారెస్పీ సుద్దవాగులో నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నర్సాపూర్ (జి) మండల కేంద్రానికి చెందిన ఎంఏ రిజ్వాన్ ఉద్దీన్ (20), అబ్దుల్ అర్షద్ (22) తమ స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ సుద్దవాగుకు ఈత కోసం వెళ్లారు. వాగులో నీటి లోతు అంచనా వేయలేక ఇద్దరు నీట మునిగారు. స్థానికులు వాగులో గాలించగా అప్పటికే అబ్దుల్ అర్షద్, రిజ్వాన్ ఉద్దీన్ మృతి చెందారు. చేతికి అందివచ్చిన కొడుకులు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. -
తుమ్మిడిహెట్టికి రెండో ముఖ్యమంత్రి
పరిశీలించిన కలెక్టర్, అధికారులుకౌటాల: ఈ నెల 7న సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కే.హరిత, ఎస్పీ పి.నితికాపంత్, ఎమ్మెల్సీ దండె విఠల్ శుక్రవారం మండలంలోని తుమ్మిడిహెట్టి ప్రాణహిత నది ప్రాంతాన్ని పరిశీలించారు. బరాజ్ నిర్మాణం, నీటి లభ్యత, ముంపు, సాగునీరు తదితర వివరాలపై ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రులు, నీటి పారుదల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు తుమ్మిడిహెట్టిలోని ప్రాణహిత నది బరాజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తారని తెలిపారు. సీఎం, మంత్రుల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ స్థలం, సభా ప్రాంగణం పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డెవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, కాగజ్నగర్ డీఎస్పీ వహిదుద్దీన్, తహసీల్దార్ ప్రమోద్కుమార్, ఎంపీడీఓ కోట ప్రసాద్, సీఐ సంతోష్కుమార్, ఎస్సై చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. 150మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణం, వంద టీఎంసీల నీటి వినియోగానికి ఇటీవల రాష్ట్ర సాగునీటి శాఖ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం తెలిపారు. మహారాష్ట్రలో ముంపు ఏర్పడితే పరిహారం చెల్లింపులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసుల ఏళ్లనాటి సాగునీటి కల సాకారం వైపు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నెల 7న సీఎం రేవంత్రెడ్డి స్వయంగా బరాజ్ నిర్మించే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి శివారు ప్రాణహిత నది వద్దకు రానున్నారు. 18ఏళ్లుగా ఎదురుచూపులు.. ఉమ్మడి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించేందుకు జలయజ్ఞంలో భాగంగా 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు తుమ్మిడిహెట్టి వద్ద శంకుస్థాపన చేశారు. 152 అడుగుల ఎత్తులో బరాజ్ నిర్మించి ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలకు నీరందించాలి. ఆ తర్వాత ఎల్లంపల్లి వరకు నీటిని తరలించి అక్కడ నుంచి ఆరు జిల్లాలకు నీరివ్వాలి. ఇందుకోసం భూసేకరణ, 71కిలోమీటర్ల కాలువల నిర్మాణానికి రూ.11వేల కోట్లు వెచ్చించారు. అయితే 152మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో 30 గ్రామాల ముంపు ఏర్పడుతుందని అభ్యంతరాలు రావడంతో ఆగిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక కూడా రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. చివరగా 2015లో నాటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావుతో జరిగిన చర్చల్లో 148మీటర్ల ఎత్తు వరకు అంగీకరించారు. పూర్తి స్థాయి ఎత్తుకు ఒప్పుకోకపోవడంతో ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టారు. రీడిజైన్లో గోదావరి–ప్రాణహిత కలిసే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. తర్వాత వార్దా నదిపై బరాజ్ కట్టి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల సాగునీటికి డిజైన్లు చేసినా ముందుకు సాగలేదు.2008లో నాటి కాంగ్రెస్ సర్కారు హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తుమ్మిడిహెట్టి ప్రాంతాన్ని ప్రారంభ సమయంలో సందర్శించారు. మళ్లీ 18ఏళ్ల తర్వాత ఓ ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఈ నెల 7న ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద సీఎం రేవంత్రెడ్డి స్వయంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.గతంతో పోలిస్తే బరాజ్ నిర్మాణం, కాలువలు, భూ సేకరణ ఇతర వ్యయం ఎల్లంపల్లి వరకే భారీగా అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బరాజ్ ఎత్తు విషయంలో స్పష్టత వచ్చినప్పటికీ ఇంకా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికీ డీపీఆర్ సిద్ధం కాలేదు. గోదావరిపై ఉన్న సుందిళ్ల బరాజ్కు తరలించడమా, లేక పాత డిజైన్ ప్రకారమే ముందుకు వెళ్తారా? అనేది తుది ప్రతిపాదన వెల్లడి కావాల్సి ఉంది. దీంతో పెరిగిన ఖర్చులతో రూ.20వేల కోట్ల వరకు అవుతుందనే అంచనా ఉంది.భారీగా పెరగనున్న వ్యయం -
ఎస్పీని సన్మానించిన బాధిత కుటుంబం
ఆదిలాబాద్టౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో 2020 డిసెంబర్ 27న భూ వివాదంలో ఓ వ్యక్తిని నలుగురు హత్య చేశారు. రాజన్న సిరిసిల్ల ఎస్పీగా అఖిల్ మహాజన్ పనిచేసిన సమయంలో కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయించారు. ఇటీవల నిందితులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. మృతుడి అన్న భూమ్రెడ్డి సిద్దిపేట నుంచి శుక్రవారం ఆదిలాబాద్ పట్టణానికి చేరుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. -
ఎండాకాలం.. వాహనం పదిలం
ఆదిలాబాద్ టౌన్: ఉమ్మడి జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రాష్ట్రంలోనే అత్యధికంగా 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి తాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎండవేడిమికి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని వాహనాలు ఆహూతి అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింతగా పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నా రు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్లు, బైకులు వే డెక్కడం, వాటి నుంచి పొగ రావడం, టైర్లు పేలిపోవడంతో పాటు మంటలు చెలరేగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇంజిన్ ఓవర్ హీటే కారణం వేసవిలో వాహనాల ఇంజిన్ ఓవర్ హీట్ కారణంగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీర్ఘకాలంగా వాహనాన్ని నడపడం, ఎండలో ఎక్కువ దూరం ప్రయాణించడంతో ఇంజిన్ వేడెక్కి వైర్లు, పైపులు దెబ్బతింటాయి. దీని కారణంగా మంటలు వ్యాపించే ప్రమాదముంది. వాహనం బయటకు తీసే ముందు ఇంజిన్ ఆయిల్ స్థాయిని తప్పనిసరి గా పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ యిల్ తక్కువగా ఉంటే ఇంజిన్ మరింత వేడెక్కే అ వకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అలాగే, ఇంజిన్ కూలింగ్ వ్యవస్థ సరిగా ఉండాలి. వేసవిలో రేడియేటర్లలో దుమ్ము చేరి కూలెంట్ సరిగా పనిచేయకపోవడంతో ఇంజిన్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. రేడియేటర్ను తరచూ శుభ్రం చేయించాలి. కూలెంట్ను నిత్యం పరిశీలించాలి. టైర్ల పరిస్థితిని ఎప్ప టికప్పుడు గమనిస్తూ ఉండాలి. టైర్లు అరిగిపోయినా, సరైన గాలి లేకపోయినా, ఎక్కువ గాలి ఉన్నా అవి పేలిపోయే ప్రమాదముంది. వేసవి కాలంలో వాహనదారులు వాహనాల్లో పెట్రోల్ లేదా డీజిల్ను ఫుల్ట్యాంక్ చేయించవద్దు. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వాహనంలో మంటలు వ్యాపించే ప్రమాదముంది. అధిక వేడి కారణంగా ట్యాంక్లో ఒత్తిడి పెరిగి ప్రమాదాలకు దారితీయవచ్చు. అవసరమైనంత మాత్రమే వాహనంలో ఇంధనం ఉంచుకోవడం మంచిదని మెకానిక్లు సూచిస్తున్నారు. బ్యాట రీలకు అదనపు లైట్లు, నాణ్యతలేని వైర్లు అమర్చినా షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశముంటుందని చెబుతున్నారు. అనవసర మార్పులు చేయించకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. వాహనాన్ని సాధ్యమైనంత వరకు నీడలో నిలుపాలని పేర్కొన్నారు. చిన్న సమస్య వచ్చినా వెంటనే మెకానిక్ను సంప్రదించాలని సూచించారు. -
అటు పరీక్షలు.. ఇటు మూల్యాంకనం
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి పరీక్షలు ఓ వైపు కొనసాగుతుండగానే మరోవైపు జవాబు పత్రాల మూల్యాంకనం వేగవంతంగా పూర్తి కావడంతో ఫలితాల వెల్లడికి మార్గం సులువైంది. గతంలో పరీక్షలు ముగిశాక మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కాగా ఈ ఏడాది పరీక్షల మధ్యలో మూడు విడతల్లో మూల్యాంకనం సాగింది. ఒకేసారి అన్ని సబ్జెక్టుల జవాబు పత్రాల మూల్యాంకనం వల్ల గందరగోళం నెలకొనగా.. ఈసారి సబ్జెక్టుల వారీగా టీచర్లకు అదే రోజు విధులు కేటాయించడం కూడా సాఫీగా సాగేందుకు దోహదపడింది. సమాంతరంగా పరీక్షలు, మూల్యాంకనం సాగడంతో ఫలితాలు జాప్యం లేకుండా వెలువడ్డాయి. ఒకరోజు ముందుగానే.. గత ఏడాది కంటే ఒక రోజు ముందుగానే ఫలితాలు వెలువడ్డాయి. గత ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వరకు పరీక్షలు కొనసాగగా.. ఈ ఏడాది మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్ 16న ముగిసాయి. ఎన్నడూ లేని విధంగా సీబీఎస్ఈ తరహాలో నిర్వహణతో ఎనిమిది పేపర్లకు 33రోజులపాటు పరీక్షలు సాగాయి. గత ఏడాది వరకు తొమ్మిది, పది రోజులపాటు కార్మెల్ హైస్కూల్ వేదికగా మూల్యాంకనం సాగింది. విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు సకాలంలో రిపోర్టు చేయకపోవడం వల్ల మూల్యాంకన ప్రక్రియ ఆలస్యమయ్యేది. ఒంటిపూట బడులు కొనసాగుతుండడం, మూల్యాంకన విధుల్లో పొద్దంతా ఉండడం ఇష్టం లేకనో ఏమోగానీ ఉపాధ్యాయులు మూల్యాంకన విధుల నుంచి తప్పించుకునేందుకు మొగ్గు చూపేవారు. అన్ని సబ్జెక్టుల టీచర్లు ఒకేసారి రావడంతో గందరగోళంగా మారేది. ఈ ఏడాది మూడు విడతలుగా మూల్యాంకనం సాగింది. ప్రతీ పరీక్షకు మూడు నాలుగు రోజుల వ్యవధి ఉండడంతో గణితం పరీక్షలు ముగియగానే మూల్యాంకన ప్రక్రియ చేపట్టారు. ఏప్రిల్ ఒకటి నుంచి 9వరకు తెలుగు, హిందీ, గణితం, ఇంగ్లిషు, ఏప్రిల్ 10 నుంచి 17వరకు ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, మూడో విడత ఏప్రిల్ 17నుంచి 23వరకు సోషల్ సబ్జెక్టు జవాబు పత్రాల మూల్యాంకనం సాగింది. దీంతో ఆయా సబ్జెక్టుల టీచర్లు మాత్రమే రావడం వల్ల సాఫీగా మారింది. గత ఏడాది ఏప్రిల్ 30న ఫలితాలు వెలువడగా, ఈ ఏడాది 29న వెలువడ్డాయి. గతంలో కంటే మూల్యాంకన పనిదినాలు ఎక్కువైనా ఒక రోజు ముందే ఫలితాలు వెలవడడం గమనార్హం. సాగిందిలా.. ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆయా పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. గతేడాది 1,29,243 జవాబు పత్రాలు రాగా ఈ ఏడాది 1,31,398 పేపర్లు స్పాట్ కేంద్రానికి వచ్చాయి. మూల్యాంకన విధులకు ఏఈ, సీఈ, స్పెషల్ అసిస్టెంట్లుగా 2025లో 596 మందిని కేటాయించగా ఈసారి 645 మంది హాజరయ్యారు. అప్పట్లో మూ ల్యాంకనం తొమ్మిది రోజులు.. ఈ ఏడాది పరీక్షలకు విరామం ఉండడం.. మూడు విడతల్లో మూల్యాంకనం చేయడం(పనిదినాలు ఎక్కువైన) సులువుగా మారి ఫలితాలకు మార్గం సుగమమైంది. -
నగర కమిషనర్గా రాజు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.అన్వేష్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ జి.రాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్వేష్ను వేములవాడ మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేసింది. ‘రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వం’ జన్నారం: రైతుబంధు ఇవ్వడంలో, ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని, రైతులను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్రాథోడ్ అన్నారు. గురువారం జన్నారంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. వెంటనే వడ్లు కొనాలని, లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జి.మధుసూదన్రావు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బద్రి నాయక్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్, బీజేపీ జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య, నాయకులు గోలి చందు, ఎం.వీరాచారి, అప్పాల జలపతి, ఎస్.పవన్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. -
వేసవి క్రీడల శిక్షణకు వేళాయె..
మంచిర్యాలటౌన్: ప్రతీయేటా వేసవి సెలవుల్లో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇప్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటి నుంచి 31వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రీడల్లో శిక్షణకు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. పట్టణ ప్రాంతాల్లో అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్బాల్, వాలీబాల్, కరాటే, కబడ్డీ, బ్యాడ్మింటన్కు శిక్షణకు నామమాత్రంగా రూ.100 చొప్పున, బాస్కెట్బాల్కు రూ.300, బ్యాడ్మింటన్కు రూ.500 ఫీజు తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. పట్టణ ప్రాంతాల్లో 11, గ్రామీణ ప్రాంతాల్లో 10 శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ఆటల్లో ఆసక్తి ఉండి నేర్చుకోవాలనే తపన ఉన్న పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు శిక్షకులు, పీడీలు, సీనియర్ క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు. నెల రోజులపాటు 14రకాల క్రీడల్లో ఉదయం 6గంటల నుంచి 9గంటల వరకు, సాయంత్రం 5గంటల నుంచి 7గంటల వరకు శిక్షణ ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 14ఏళ్లలోపు బాలబాలికలు మాత్రమే అర్హులు. క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకుంటే పిల్ల లకు ఆటల్లో ప్రావీణ్యం లభిస్తుంది. -
ఫిష్పాండ్తో జాతీయస్థాయిలో గుర్తింపు
మంచిర్యాలటౌన్: దేశంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫిష్పాండ్ మంచిర్యాలకు వచ్చిందని, దీంతో మత్స్య సంపద అభివృద్ధి చేయడంతోపాటు రాష్ట్రానికి కావాల్సిన చేపల విత్తన ఉత్పత్తి చేయడం జరుగుతుందని, జాతీయస్థాయిలోనే మంచిర్యాలకు ఒక గొప్ప గుర్తింపు లభించిందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ ఏర్పాటుకు నిధులు, 85.10 ఎకరాలు కేటాయింపు పూర్తయిందని అన్నారు. ఫిష్పాండ్ ఏర్పాటుతో 100 నుంచి 150 మంది మత్స్యకారులకు నేరుగా ఉపాధి లభిస్తుందని అన్నారు. మొట్టల పెంపకం, చేప పిల్లల విత్తన ఉత్పత్తి చేసి రాష్ట్రం మొత్తం సరఫరా చేస్తారని తెలిపారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరుకు ఆమోదం వచ్చిందని, అన్నవరానికి దీటుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయానికి రూ.10 కోట్ల నిధులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. బీజేపీ ధాన్యం కొనుగోలుపై రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యేకు మంచిర్యాల అభివృద్ధి నచ్చడం లేదని, మహాప్రస్థానంతోపాటు ఇండస్ట్రియల్ పార్కు పనులు అడ్డుకునేందుకే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారని అన్నారు. మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య పాల్గొన్నారు. -
స్వీయ గణన వేగవంతం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ వేగవంతం అవుతోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం హాజీపూర్ మండలం సబ్బేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాలు, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్వీయ గణనపై ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. స్వీయగణన పూర్తి చేసిన వారు ఎన్యుమరేటర్ ఇళ్ల గణనకు వచ్చిన సమయంలో స్వీయగణన నంబరు ఇవ్వాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ హాజీపూర్ పీహెచ్సీని సందర్శించి ఫార్మసి, వార్డు, ల్యాబ్, పరిసరాలు పరిశీలించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి పాతమంచిర్యాల: ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ భారతి, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెట్రోల్బంక్లు, సోలార్ప్లాంట్లు, ప్లంబింగ్ రంగాల్లో ముందుకు రావాలని అన్నారు. మహిళల సామార్థ్యాల అభివృద్ధి కోసం 100 రోజుల శిక్షణ కార్యక్రమం అమలు చేస్తోందని, శిక్షణ తర్వాత ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి శ్రీలత, కోశాధికారి మాలతి, అదనపు డీఆర్డీఓ అంజయ్య, డీపీఎంలు స్వర్ణలత, రాజుబాయి, సారయ్య, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు పకడ్బందీగా నిర్వహించాలి లక్సెట్టిపేట: వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలోని లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల, తిమ్మాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ దిలీప్కుమార్తో కలిసి సందర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. రోగుల రిజిష్టర్, మందుల నిల్వలు, ల్యాబ్, వార్డులు, పరిసరాలను పరిశీలించారు. -
ఇళ్ల నిర్మాణాలు అడ్డుకోవద్దు
వేమనపల్లి: సుంపుటం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోవద్దని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అటవీ శాఖ అదికారులకు సూచించారు. ఇటీవల సుంపుటం గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సంతోష్కుమార్, స్థానిక సర్పంచు దుర్గం భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. దీంతో గురువారం అదనపు కలెక్టర్ అటవీ, రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామ రికార్డులు పరిశీలించి గ్రామం రెవెన్యూ పరిధిలో ఉందని, అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. నీల్వాయిలో పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. బుయ్యారం, నాగారం గ్రామాల్లో పర్యటించారు. డీఎల్పీఓ సతీష్, ఎంపీడీఓ కుమారస్వామి, డీటీ సాయికృష్ణ, ఎఫ్ఆర్ఓ దయాకర్, సర్పంచులు భాగ్యలక్ష్మి, చెన్నూరి సమ్మయ్య, కొండి మానస, ముల్కల్ల శ్రీలత పాల్గొన్నారు. -
పల్లె వృద్ధి అంతంతే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: దేశ ప్రగతిలో పట్టుగొమ్మలైన పల్లెల్లో సౌకర్యాలు ఇంకా మెరుగుపడాల్సి ఉంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించే ‘పంచాయతీ అడ్వాన్స్మెంటు ఇండెక్స్(పీఏఐ) 2.0’లో జిల్లా పంచాయతీలు వెనుకబడ్డాయి. దేశంలో పంచాయతీ పరిస్థితిని సమగ్రంగా అధ్యయనం చేసి సమ్మిళిత వృద్ధి సాధించేందుకు ప్రతీయేటా ఓ నివేదికను రూపొందిస్తారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపోజిట్ ఇండెక్స్(1.0) మొదలు కాగా, తర్వాత పల్లెల సమగ్ర ప్రగతిని అంచనా వేసేలా 2.0లో మరిన్ని అంశాలు జోడించారు. తాజాగా 2023–24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం పంచాయతీల వారీగా సాధించిన స్కోరును విడుదల చేసింది. ఈ నివేదిక జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి తీరును వెల్లడించింది. ఈ జాబితాలో జిల్లా నుంచి పీఏఐ ఓవరాల్గా ఏ పంచాయతీ కూడా ఏ ప్లస్ స్కోరుతో చోటు దక్కించుకోలేకపోయింది. చెన్నూర్ మండలం పొన్నారం రాష్ట్రంలోనే చివరి పది స్థానాల్లో ఒకటిగా నిలిచింది. ఇక రాష్ట్ర స్థాయిలో మొదటి పది స్థానాల్లో ఏ పంచాయతీ కూడా లేదు. జిల్లా పరిధిలో అత్యుత్తమంగా జన్నారం మండలం లింగయ్యపల్లి పంచాయతీ పీఏఐ ఓవరాల్గా 77.42 స్కోర్తో ఏ కేటగిరీలో ఉంది. పరిస్థితిపై అంచనా ప్రతీ పంచాయతీ నుంచి తొమ్మిది అంశాల్లో డేటా సేకరించారు. పేదరికం, వైద్యం, శిశు, మహిళా స్నేహ పూర్వక వాతావరణం, తాగునీరు, పర్యావరణం, మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం, సుపరిపాలన అంశాలను పరిగణనలోకి తీసుకుని సూచీలను ప్రకటించారు. జిల్లాలో 18 మండలాల్లోని 304 పంచాయతీలు ఉండగా వీటిలో 102 పంచాయతీల నుంచి అన్ని విభాగాల్లో డేటా తీసుకున్నారు. స్థానిక అధికారులు గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలను పాయింట్ల వారీగా డేటాను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేశారు. వీటిని మరోసారి ఆన్లైన్ డేటాతో సరిపోల్చుకుని కేంద్రం ప్రకటించింది. ఈ స్కోరులో ఏ ప్లస్ 90పైన, ఏ 75 నుంచి 90, బీ 60 నుంచి 75, సీ 40 నుంచి 60, డీ 0 నుంచి 40గా కేటగిరీలుగా ప్రకటించారు. -
● జిల్లాలో 97.20శాతం పాస్ ● రాష్ట్ర స్థాయిలో జిల్లా 20వ స్థానం ● మూడు స్థానాలు వెనక్కి.. ● బాలికలే మళ్లీ ముందంజ
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగి విద్యార్థుల్లో ఆనందం నింపింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 20వ స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణత శాతం మెరుగైనా ఫలితాల పరంగా చూస్తే రాష్ట్ర స్థాయిలో మూడు స్థానాలు పడిపోయింది. గత ఏడాది 96.54శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది 97.20శాతంతో ఉత్తీర్ణత గణనీయంగా పెరిగింది. గతేడాది రాష్ట్ర స్థాయిలో జిల్లా 17వ స్థానం సాధించగా.. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 20వ స్థానంలో నిలువడం నిరాశపర్చింది. జిల్లాలో 9,684 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 9,413 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 4,879 మంది పరీక్షలకు హాజరు కాగా 4,720 మంది పాసయ్యారు. బాలికలు 4,805 మందికి 4,693 ఉత్తీర్ణత పొందారు. కాగా, బాలురు 96.74 ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 97.67 ఉత్తీర్ణత శాతంతో పైచేయి సాధించారు. శతశాతం పాఠశాలలు జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పాఠశాలలు శత శాతం సాధించాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత పొందారు. విద్యార్థులు కష్టపడి చదవడం, ఉపాధ్యాయుల మార్గదర్శనం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి. జిల్లాలో మొత్తం 132 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు నూరుశాతం ఫలితాలు సాధించాయి. ఇందులో 81 ప్రభుత్వ, 51 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. 18 కేజీబీవీల్లో 11 వందశాతం ఫలితాలతో దూసుకెళ్లగా.. ఐదు తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఒక్కటి కూడా శతశాాతం ఫలితాలు సాధించలేకపోయాయి. జూన్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 5 నుంచి 12వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 30 నుంచి మే 14వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో యాదయ్య తెలిపారు. రీకౌంటింగ్కు విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున 15రోజుల్లో ఎస్బీఐ ద్వారా చలానా చెల్లించి దరఖాస్తులను డీజీఈ హైదరాబాద్ కార్యాలయానికి పంపించాలని తెలిపారు.మంచిర్యాల మోడల్స్కూల్ విద్యార్థి సంజనను అభినందిస్తున్న ఉపాధ్యాయులు‘లెక్క’ తప్పింది..! మంచిర్యాలఅర్బన్: విద్యార్థి భవిష్యత్కు కీలకమైన పదో తరగతి ఫలితాల్లో గణితం సబ్జెక్టులోనే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ లెక్కల్లో తప్పారు. ఫార్ములాలు తెలియకపోవడమో, బేసిక్ కాన్సెప్ట్లు బలంగా లేకపోవడమో ఏమోగానీ మార్కులపై ప్రభావం చూపింది. గణితం తర్వాత చాలామంది ఇంగ్లిష్ పరీక్ష తప్పారు. భయంతో సరైన ప్రాక్టీస్ చేయకపోవడం కారణంగా తెలుస్తోంది. పాఠశాలలకు సక్రమంగా హాజరు కాని విద్యార్థులే లెక్కల్లో తప్పినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లాలో 271 మంది ఫెయిల్ కాగా, వీరిలో గణితం పరీక్షలో 136 మంది అ నుత్తీర్ణులయ్యారు. 124 మంది ఇంగ్లిష్ సబ్జెక్టులో ఫెయిలయ్యారు. సైన్స్లో 87 మంది, తెలుగులో 53 మంది, హిందీలో 24, సోషల్లో 14 మంది ఫెయిలయ్యారు. సబ్జెక్టుల్లో వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే సప్లిమెంటరీ పరీక్షల్లో ఫలితాల్లో మంచి విజయాలు సాధించవచ్చు. మంచిర్యాలలో అత్యధికంగా.. పదో తరగతిలో మండలాల వారీగా ఫలితాలు చూస్తే గణితం, ఇంగ్లిష్ ,సైన్స్ సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులు జిల్లా కేంద్రం మంచిర్యాలలోనే అత్యధికంగా ఉన్నారు. గణితంలో 39 మంది ఉంటే తర్వాత చెన్నూర్లో 21 మంది, బెల్లంపల్లిలో 15 మంది ఫెయిలయ్యారు. ఇంగ్లిష్లో మంచిర్యాలలో 28 మంది, బెల్లంపల్లి మండలంలో 15 మంది అనుత్తీర్ణులయ్యారు. మంచిర్యాలలో సైన్స్ సబ్జెక్టు విద్యార్థులు 28 మంది, 15 మంది తెలుగు సబ్జెక్టులో ఫెయిలయ్యారు.నాలుగేళ్లుగా ౖపైపెకి..పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం అంతకంతకు పెరిగిపోతోంది. నాలుగేళ్లుగా పోల్చి చూస్తే విద్యార్థుల ఉత్తీర్ణత పెరగడం ఉత్సాహాన్ని నింపుతోంది. బాలికలు నిరతరంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. 2023లో 84.87శాతం, 2024లో 92.42శాతం, 2025లో 96.54 శాతం ఉత్తీర్ణత సాధించగా 2025–26లో 97.20శాతం సాధించడంతో పాఠశాల పనితీరు మెరుగైందని చెప్పవచ్చు. -
మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ వృథా
సిబ్బంది లేకపోయినా వెలుగుతున్న లైట్లు, తిరుగుతున్న ఫ్యాన్లు విద్యుత్ను ఆదా చేయాల్సిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విభాగంలో అవసరం లేకపోయినా ఫ్యాన్లు, లైట్లు ఆన్లో కనిపించాయి. కార్యాలయ గదుల్లో సిబ్బంది లేకపోయినా విద్యుత్ పరికరాలు పనిచేస్తుండటంతో ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ చార్జీలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఖచ్చితంగా పొదుపు చర్యలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఆర్జీయూకేటీలో టీజీసీహెచ్ఈ కమిటీ పర్యటన
బాసర: బాసర ఆర్జీయూకేటీని బుధవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్ఈ) కమిటీ సభ్యులు సందర్శించారు. క్యాంపస్లోని విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏబీ3 భవనంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్యాంపస్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, అకడమిక్ క్యాలెండర్ అమలు, వసతుల లేమిపై విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించారు. తమకు ఎదురవుతున్న ఇబ్బందులను కమిటీ సభ్యుల దృష్టికి విద్యార్థులు నేరుగా తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, నాన్టీచింగ్ స్టాఫ్ కమిటీ సభ్యులు వినతిపత్రాలు అందజేశారు. నివేదికను ప్రభుత్వానికి అందజేసి సమస్యల శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు. -
మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
నస్పూర్: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం మంచిర్యాల పరిశీలకులు ఆర్.దశరథ్ అన్నారు. బుధవారం నస్పూర్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన జిల్లా అదనపు కలెక్టర్ రాములు, ఆర్డీఓ శ్రీనివాస్రావు, ప్రత్యేక ఉప పాలనాధికారి చంద్రకళతో కలిసి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో మ్యాపింగ్ శాతాన్ని పెంపొందించడం అత్యవసరమని తెలిపారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫారం 6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తులు నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను ధ్రువీకరించి తొలగించడం లేదా సవరించాలని సూచించారు. ఓటరు జాబితా సమగ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమం విజయవంతానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. -
మహిళా సంఘాలకు పక్కా భవనం
పాతమంచిర్యాల: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల పక్కా భవనాల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. మండల సమాఖ్యలు, గ్రామైక్య సంఘాల(వీవో)కు భవనాలు అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అనువైన స్థలాలను ఎంపిక చేసి నిర్మాణాలు ప్రారంభించారు. సంఘాలకు కొన్ని చోట్ల భవనాలు ఉండగా.. కొన్ని అద్దె, మండల అభివృద్ధి కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి. నెన్నెల మండల సమాఖ్యకు పక్కా భవనం ఉండగా.. దండేపల్లి, మందమర్రిలో భవనాలు శిథిలావస్థకు చేరాయి. భీమారం, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మహిళా సంఘాలకు భవనాలు లేకపోవడంతో సభ్యులకు సమావేశాల నిర్వహణ ఇబ్బందిగా మారింది. దీంతో ప్రతీ గ్రామైక్య సంఘానికి భవనం నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించి రూ.17.4 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.10లక్షల చొప్పున కేటాయించారు. ఉపాధి హామీ నిధులతో నిర్మాణాలు చేపడుతున్నారు. మహిళలు సమావేశాలు నిర్వహించుకునేలా నిర్మిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 170 భవనాల నిర్మాణాలు చేపట్టారు. వీటిలో 20 భవనాల నిర్మాణం పూర్తి కాగా, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. భీమారం మండలంలో 4, చెన్నూర్లో 9, జైపూర్లో 18, కోటపల్లిలో 11, బెల్లంపల్లిలో 26, భీమినిలో 6, కన్నెపల్లిలో 15, కాసిపేటలో 5, నెన్నెలలో 10, తాండూరులో 11, వేమనపల్లిలో 10, దండేపల్లిలో 17, లక్సెటిపేటలో 6, జన్నారంలో 22 గ్రామైక్య సంఘాలకు భవనాలు మంజూరయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 426 గ్రామైక్య సంఘాలు ఉండగా ప్రస్తుతం 170 భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. వేమనపల్లి, కన్నెపల్లి, బెల్లంపల్లి, భీమారం మండల సమాఖ్యల భవనాలు, జైపూర్ మండలంలో గోదాంల నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరయ్యాయి. భవనాల నిర్మాణంతో సామగ్రి నిల్వ చేసుకోవడం, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలకు సౌకర్యంగా ఉంటుందని మహిళా సంఘాల సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
డీఎఫ్వో శివ్ ఆశిష్సింగ్ బదిలీ
● కొత్త డీఎఫ్వోగా రాహుల్ కిషన్ జాదవ్ నియామకం మంచిర్యాలక్రైం: రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖలో 12మంది జిల్లా అధికారులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్సింగ్ బదిలీ అయ్యారు. రెండున్నరేళ్లుగా ఇక్కడ పని చేస్తున్న ఆయనను మహబూబ్నగర్ జిల్లా అటవీశాఖ అధికారిగా నియమించారు. ఆయన స్థానంలో ఇక్కడికి ములుగు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్(2018 బ్యాచ్ ఐఎఫ్ఎస్)ను బదిలీ చేశారు. కాగా, 2022 సెప్టెంబర్ 14న శివ్ ఆశిష్సింగ్ జిల్లా అటవీ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, అర్బన్ పార్క్ అభివృద్ధి పనుల్లో తనదైన ముద్ర వేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, జాప్యం చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. -
పురుగుల మందు తాగి ఒకరు బలవన్మరణం
వాంకిడి: మద్యం తాగడం మానేయాలని మందలించినందుకు మనస్తాపానికి గురై ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఖమాన గ్రామానికి చెందిన తపాసె నాందేవ్ (46) కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన నాందేవ్ను కుటుంబ సభ్యులు మందలించారు. మనస్తాపానికి గురై రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా గ్రామ శివారులోని పంటచేలలో పడిపోయి కన్పించాడు. నోట్లో నుంచి నురుగు రావడంతో పురుగుల మందు తాగినట్లు గుర్తించారు. మృతుని భార్య పిసుబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జూన్లోగా డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మె
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల ప్రధాన డిమాండ్లను జూన్లోగా నెరవేర్చని పక్షంలో మెరుపు సమ్మె చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసఫ్ తెలిపారు. మంగళవారం రాత్రి సీసీసీ కార్నర్లోని నరసయ్య భవన్లో ఏఐటీయూసీ శ్రీరాంపూర్ ఏరియా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, నూతన గనులను ప్రారంభించాలని, మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, కార్మికుల సొంతింటి పథకం అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు, హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ ప్రధా న కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్రావు, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం
చెన్నూర్: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం వరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోటపల్లి, జైపూర్ మండలాల లబ్ధిదారులు 144 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి అందజేశారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని అన్నారు. రెండో విడత మరో 2500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా అర్హులకు నేరుగా మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం చెన్నూర్ మండలం పొక్కూర్ సర్పంచ్ ఐత స్వరూప, సత్తయ్య మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బెల్లంకొండ కరుణసాగర్రావు, మాజీ సర్పంచ్ గొడిసెల బాపురెడ్డి పాల్గొన్నారు. నిరుపేదల కోసమే ఇదిరమ్మ ఇళ్ల పథకం చెన్నూర్రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. మండలంలోని బావురావుపేట గ్రామంలో ఎగుడ శేఖర్ ఇందిరమ్మ గృహ ప్రవేశంలో కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం సత్ఫలితాలు ఇస్తోందని, నిరుపేదలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. బావురావుపేట నుంచి కత్తెరసాల, కాచన్పల్లి వరకు వంతెన నిర్మాణాల కోసం సుమారు రూ.5కోట్లు మంజూరు చేసినట్లు తెలిపా రు. సర్పంచ్ తాటి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. -
సన్న రకం వరి సాగుపై దృష్టి సారించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ నస్పూర్: జిల్లాలోని రైతులు సన్న రకం వరి సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన నస్పూర్లోని కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సన్న రకం వడ్లు సాగు చేసేలా అధికారులు ప్రోత్సహించాలని తెలిపారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం బోనస్ అందిస్తుందని, వానాకాలం సీజన్లో సాగు చేయాలని సూచించారు. అధిక దిగుబడి సాధించేందుకు మెలకువలు పాటించాలని అన్నారు. జిల్లాలో దాదాపు 1.57 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. ప్యాడి క్లీనర్లు, తూకం యంత్రాలు, తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి మంచిర్యాలటౌన్: సైబర్ మోసాలు అరికట్టేందుకు సైబర్ క్రైమ్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ఖాన్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై విద్యార్థులు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని, ఆన్లైన్లో సురక్షితంగా ఉండే విధానాలను తెలుసుకోవాలని అన్నారు. అత్యవసర సహాయం కోసం సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930, పిల్లల సమస్యల కోసం చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098లో సంప్రదించవచ్చని తెలిపారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలు, లింక్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మధుసూదన్, కళాశాల ప్రిన్సిపాల్ కె.సుజాత, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆనంద్ పాల్గొన్నారు. -
గిరిజనుల సంక్షేమానికి కృషి
ఉట్నూర్రూరల్: ఉమ్మడి జిల్లాలోని గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తానని ఐటీడీఏ పీవో మంద మకరందు తెలిపారు. బుధవారం బాధ్యతల స్వీకరణ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల జీవనోపాధి మెరుగుదలకు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తానన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావ్పేటకు చెందిన తాను ఐటీ ఇంజినీరింగ్ను 2016–17లో పూర్తి చేసినట్లు తెలిపారు. అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఐఏఎస్ పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే 2020–21లో అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్లో శిక్షణ పూర్తి చేసిన అనంతరం జగిత్యాల జిల్లాలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ)గా తొలి నియామకం పొందానని, ఆ తర్వాత నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా, హైదరాబాద్ రాజేంద్రనగర్లో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా సేవలందించినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. -
నీటిగుంతలో పడి బాలుడు మృతి
పెంచికల్పేట్: నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన రజిత, సంతోష్ దంపతుల కుమారుడు దోబే మహేష్ (13) వేసవి సెలవుల నేపథ్యంలో చేడ్వాయిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. మంగళవారం సాయంత్రం తోటి స్నేహితులతో కలిసి ఇంటినుంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం గ్రామంలోని రైతు వేదిక వెనుక ఉన్న నీటి గుంతలో మృతదేహం గమనించిన స్థానికులు బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. కాగజ్నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, పెంచికల్పేట్ ఎస్సై అనిల్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పంచనామ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. . మృతుని తల్లి రజిత ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
ముగిసిన ఖేలో ఇండియా ఫుట్బాల్ పోటీలు
రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా అండర్–16 బాలికల ఫుట్బాల్ పోటీలు బుధవారం ముగిశాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించిన పోటీల్లో కరీంనగర్, రంగారెడ్డి జట్లు ఫైనల్స్కు చేరాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో కరీంనగర్ జట్టు 1–0 గోల్స్ తేడాతో ఛాంపియన్గా, రంగారెడ్డి జట్టు రన్నరప్గా నిలిచాయి. సెమీఫైనల్స్లో ఓడిన ఆదిలాబాద్, నిజామాబాద్ జట్లకు సంయుక్తంగా తృతీయ బహుమతి అందజేశారు. క్రీడలకు సమయం కేటాయించాలి ప్రతిఒక్కరూ క్రీడల కోసం సమయం కేటాయించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఖేలో ఇండియా పోటీల బహుమతి ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల వల్ల పట్టుదల అనేది పెంపొందుతుందని, జీవితంలో ఉన్నతంగా రాణించాలంటే పట్టుదల అనేది చాలా ముఖ్యమన్నారు. స్థానిక ఠాగూర్ స్టేడియంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటు చేయాలని సింగరేణి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మందమర్రి జీఎం రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, స్థానిక ఏరియా ఆసుపత్రి డీవైసీఎంఓ డాక్టర్ మధుకుమార్, ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫాల్గుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్ లక్ష్యం..
భవిష్యత్లో ఐఐటీ పూర్తి చేసి.. సివిల్స్ సాధించడం, సమాజానికి చేయాలన్నదే లక్ష్యమని అమన్ అమృత తెలిపాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధించానని పేర్కొన్నాడు. మంచిర్యాలలోని శ్రీచైతన్య పాఠశాలలో చదివాడు. కాగా, తండ్రి కిషోర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి హరిత గృహిణి. జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన అమన్ అమృతను పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం అరవిందరెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజ్, ప్రధానోపాధ్యాయుడు సంజీవ్ అభినందించారు. -
జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామానికి చెందిన వడ్డపెల్లి రవీందర్ (40) మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఓ ప్రైవేట్ బ్యాంక్లో రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు. కిస్తీలు రెగ్యులర్గా కట్టలేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. జీవితంపై విరక్తితో బుధవారం ఉదయం ఇంటి ముందున్న బాల్కనీలో చీరతో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య రమ, కుమారుడు అక్షిత్, కుమార్తె వైశాలి ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నిర్మల్ కలెక్టరేట్లో రైతు ఆత్మహత్యాయత్నంనిర్మల్చైన్గేట్: తాను పండించిన పంటను అదే గ్రామానికి చెందిన వ్యక్తి కోయనీయకుండా అడ్డుపడుతున్నాడని ఆరోపిస్తూ నిర్మల్ కలెక్టరేట్ ప్రాంగణంలో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. సారంగపూర్ మండలం ఆలూరుకు చెందిన గజ్జ శ్రీధర్ తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న, వరి సాగు చేశానని, పంటను కోయనీయకుండా, అమ్మ నియకుండా అదే గ్రామానికి చెందిన వ్యక్తి అడ్డుపడుతున్నాడని వాపోయాడు. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి కలెక్టరేట్ ప్రాంగణంలో పడిపోయాడు. గమనించిన సిబ్బంది 108కు సమాచారం అందించడంతో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భార్య చేతిలో భర్త హతంఆదిలాబాద్రూరల్: భార్య చేతిలో భర్త హతమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై విష్ణువర్ధన్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని లోహరకు చెందిన సొలంకే గణపతి (54) కుల వృత్తి కమ్మరి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతీరోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి అతని భార్య మథుర బాయితో గొడవ పడుతున్నాడు. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవలో మథురబాయి రాడ్తో కొట్టడంతో తీవ్రగాయాలపాలైన గణపతి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు సొలంకే సురేష్ ఫిర్యాదు మేరకు మథురబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గిరిజనుల కల్పతరువు ‘ఇప్ప’
ఉట్నూర్రూరల్:అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు వేసవికాలంలో ఇప్పపూల సేకరణలో బిజీగా ఉన్నారు. ఉట్నూర్ మండలంలోని దొంగచింత, నర్సాపూర్(జే), తాటిగూడ, బాబాపూర్, కామాయిపేట, దేవుగూడ, మారుతిగూడ, తదితర గిరిజన గ్రామాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, జన్నారం, గాదిగూడ, ఇంద్రవెల్లి, తదితర మండలాల గిరిజనులు కోడి కూయకముందే అడవిబాట పడుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉండే లభించే బంక, జిగురు, మొర్రి పండ్లు, తునికాకు, తునికి పండ్లు, ఇతర ఉత్పత్తులతో పాటు వేసవిలో ఇప్పపువ్వుతో గిరిజనులు ఉపాది పొందుతున్నారు. అడవిలో సేకరించిన ఇప్పపూలను ఇంటికి తెచ్చి మూడు రోజులపాటు ఎండలో ఆరబెడతారు. ఎండిన తర్వాత వాటిని విక్రయిస్తారు. ఇప్పపూల తర్వాత ఇప్ప పరక లభ్యమవుతుంది. ఇప్పపరక నుంచి నూనె తీస్తారు. నూనె తీయడానికి ‘గానె’ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇప్పపరక నూనె మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇప్పచెట్లను గిరిజనులు తమ సొంత భూముల్లో కూడా పెంచుకుంటారు. ఆహారంగా వినియోగం ఇప్పపూలను గిరిజనులు ఆహారంగా వినియోగిస్తారు. ఇప్పపూలను ఎండ బెట్టిన తర్వాత సలపతో బాగా దంచి మెత్తగా చేసి కుండలో వండి భుజిస్తారు. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సల్దిగా ఉపయోగించుకుంటారు. వేసవికాలంలో వ్యవసాయ పనులు చేసి అలసిపోయిన సమయంలో, వడదెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి జొన్న అంబలితో పాటు ఇప్పపూలతో చేసిన వంటకాలను భుజిస్తారు. వేసవి కాలంలో గిరిజన గ్రామాల్లోని ఏ ఇంటికి వెళ్లినా జొన్న అంబలి, ఇప్పపూలు తప్పనిసరిగా లభిస్తాయి. గిరిజనుల సంప్రదాయ పండుగలకు ఇప్పపూలతో కుడుములు, గారెలు, లడ్డూలు, వడలు, తదితర వంటకాలు తయారు చేస్తారు. పానియాలు తయారీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయ ఉత్సవాలు, వివాహాల్లో ఉత్సాహం కోసం వారే స్వయంగా ఇప్పసారా తయారుచేసి సేవిస్తారు. వ్యవసాయ పనులు చేసి అలసిపోయిన సమయంలో అలసట తీరేందుకు ఇప్పసారా సేవిస్తారు. ఇప్పపూల సారా తయారు చేయగా మిగిలిన ఇప్పపూలను పశువులకు దాణాగా వేస్తారు. జీసీసీ ద్వారా కొనుగోళ్లు ఆదివాసీలు అడవి నుంచి సేకరించిన ఇప్పపూలను గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలు ఇప్పపూలకు రూ.3వేల చొప్పున ధర చెల్లిస్తూ ఆదివాసీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని, సేకరించిన ఇప్పపూలను జీసీసీకి విక్రయించి ఉపాధి పొందాలని అధికారులు సూచిస్తున్నారు.బుట్టల్లో నింపిన ఇప్పపువ్వు ఇప్పపూలతో తయారు చేసిన వంటకాలుప్రకృతి ప్రసాదించిన ఇప్ప పువ్వు గిరిజనుల కల్పతరువుగా నిలుస్తోంది. వేసవిలో అటవీ ప్రాంతంలో ఇప్ప పువ్వు, పరక, తునికి పండ్లు, మొర్రిపండ్లు విరివిగా లభిస్తాయి. కొండకోనలు, అటవీ ప్రాంతాల్లో నివసించే గోండి, కొలాం గిరిజనులు వాటిని సేకరించి జీవనోపాధి పొందుతున్నారు. మరోవైపు ఆదివాసీల పండుగల్లో ఇప్పపూలను పిండివంటలకు వాడుతున్నారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా పెరిగిన ఇప్పచెట్లు గిరిజనులకు బతుకుదెరువు చూపుతున్నాయి. వాటితో గిరిజనులకు ఉన్న అనుబంధంపై ప్రత్యేక కథనం. -
దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయండి
నస్పూర్: మే నెల 9, 10న హైదరాబాద్లోని రవీంద్రభారతీలో నిర్వహించే సైకలాజిస్టుల రాష్ట్ర స్థాయి దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సైకాలజిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రంగు వేణుకుమార్ కోరారు. బుధవారం ఆయన నస్పూర్లోని ప్రకృతి మిత్ర కార్యాలయంలో జిల్లా ముఖ్య బాధ్యులతో సమావేశం నిర్వహించారు. పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 5 నుంచి 10 వరకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో మానసిక ఆరోగ్యం, జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. సైకాలజిస్టులు, మేధావులు, ప్రజ లు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. రాష్ట్ర బాధ్యులు బి.నారాయణరావు, ముఖ్య సలహాదారులు గుండేటి యోగేశ్వర్, కస్తూరి పద్మచరణ్, బాధ్యులు పప్పుల నాగరాజు, చిందం మొగిలి తదితరులు పాల్గొన్నారు. -
100 వికెట్లు తీసిన అర్జున్
నిర్మల్టౌన్: పట్టణానికి చెందిన కొప్పుల విజయ,సంజయ్ దంపతుల కుమారుడు కొప్పుల అర్జున్ హైదరాబాద్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి టోర్నమెంట్లలో మొత్తం 100 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 85 మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించి అబ్బుర పరిచాడు. 14 సంవత్సరాల వయసులో ఈ మైలురాయిని అందుకున్న మొదటి వ్యక్తి జిల్లా వాసి కావడం గర్వకారణంగా ఉందని పలువురు ప్రముఖులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా కోచ్రామరాజు అర్జున్ను ప్రత్యేకంగా అభినందించారు. స్క్రాప్ దొంగ అరెస్ట్ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని కృష్ణానగర్లో గల స్క్రాప్ గోదాంలో చోరీకి పాల్పడిన నింది తుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ని ఖార్ అహ్మద్ అనే వ్యక్తి కృష్ణానగర్లో స్క్రాప్ దుకాణం నిర్వహిస్తున్నాడు. మంగళవారం దు కాణంలో వెళ్లి చూడగా గోదాములో సామగ్రి తక్కువగా కనిపించింది. సీసీ కెమెరాలను పరి శీలించగా 15 రోజులుగా మసూద్నగర్కు చెందిన షేక్ తబ్రేజ్ అనే వ్యక్తి చోరీకి పాల్పడుతున్నట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. కలెక్టరేట్ ఎదుట రైతు ఆమరణ దీక్షకై లాస్నగర్: రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలని, పూర్తిస్థాయిలో రైతుభరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తలమడుగు మండల కేంద్రానికి చెందిన రైతు కిషోర్రావు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలన్నారు. రబీ రైతుభరోసా విడుదలలో జాప్యం చేయకుండా తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ డిమాండ్లను అమలు చేయని పక్షంలో రైతులను సంఘటితం చేసి ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. -
జీయర్ గురుకులంలో ఇంటర్ విద్య
కడెం: విద్య, వినయం, విధేయతతో కూడిన విద్య కు ప్రతి రూపంగా నిలుస్తోంది. కడెం మండలంలోని అల్లంపల్లి జీయర్ గురుకుల పాఠశాల. మారుమూల గ్రామాల పిల్లలకు నేటికీ విద్య అందని ద్రాక్షే. కనీస మౌలిక సౌకర్యాలు నోచుకొని గిరి గ్రామంలో చిన జీయర్స్వామి సకల వసతులతో గురుకుల పాఠశాలను నెలకొల్పి కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తున్నారు. గురుకులంలో ఈ విద్యాసంవత్సరం నుంచి కళాశాలను ప్రారంభిస్తున్నారు. ఇంటర్ విద్య.. మండలంలోని అల్లంపల్లిలో పాఠశాల విద్యనే అందని ద్రాక్షగా మారింది. ఈ తరుణంలో చిన జీయర్స్వామి చొరవతో 2004లో ఇక్కడ జీయర్ గురుకులాన్ని స్థాపించారు. ఇందులో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచిత వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. ఈ ఏడాది నుంచి గురుకులంలో ఇంటర్ కళాశాలను ప్రారంభిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో పాటు మారుమూల విద్యార్థులు సివిల్స్ సాధించేలా సీబీఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు బాలలత ఆధ్వర్యంలో సివిల్స్ ఫౌండేషన్ కోర్సు అందించనున్నారు. కార్పొరేట్ స్థాయి కళాశాల, హాస్టల్ వసతికి ఏడాదికి నామమాత్రంగా ఎస్టీ విద్యార్థులకు రూ.10 వేలు, ఇతరులకు రూ.50 వేలు ఫీజు నిర్ణయించారు. గురుకుల విద్యార్థులు మెరికలు చినజీయర్స్వామి గురుకుల పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, యోగా, అర్చరీలో రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు. ఇక్కడ విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే తల్లిదండ్రులు కళాశాలలో ప్రవేశం కొరకు 8179923758, 9951666316 నంబర్లలో సంప్రదించాలని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్) అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, ప్రిన్సిపాల్ అడెపు మహేందర్ కోరారు. -
పాఠ్యపుస్తకాలొచ్చాయ్..
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు 84.39శాతం జిల్లాకు చేరాయి. ఇంకా 15.61శాతం రావాల్సి ఉంది. పాత మంచిర్యాలలోని బుక్డిపోకు పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతున్నాయి. గతంలో ఆలస్యం కారణంగా విద్యార్థులకు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈసారి బడులు తెరిచేనాటికే పుస్తకాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాకు అవసరమైన పుస్తకాలుజిల్లాలో 480 ప్రాథమిక, 96 ప్రాథమికోన్నత, 108 ఉన్నత పాఠశాలలుండగా 38,298 మంది విద్యార్థులు చదువుతున్నారు. 18 కేజీబీవీల్లో 4,640 మంది, ఐదు మోడల్ స్కూళ్లలో 3,073 మంది విద్యార్థులు న్నారు. జిల్లాకు 4,06,052 పాఠ్యపుస్తకాలు అవసరమున్నాయి. పార్ట్–1 పుస్తకాలు 3,05,620 అవస రం కాగా, ఇప్పటికే 2,57,910 జిల్లాకు చేరాయి. ఇంకా 47,710 పుస్తకాలు రావాల్సి ఉంది. పార్ట్–2 లో ఇంకా 90,290 పుస్తకాలు చేరాల్సి ఉంది. గ్రౌండ్ బ్యాలెన్స్లో 10,142 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మే చివరివరకు పుస్తక విక్రయ కేంద్రం నుంచి పాఠ్యపుస్తకాలను మండల పాయింట్లకు సరఫరా చేసేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. నేరుగా పాఠశాలలకే నోట్ పుస్తకాలుహైదరాబాద్ నుంచి నేరుగా పాఠశాలలకే నోట్ పుస్తకాలు సరఫరా కానున్నాయి. వీటిని సకాలంలో పంపిణీ చేసేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. కేజీబీవీల్లో విద్యార్థినులంతా పేదవారే కావడంతో ఉచితంగా పంపిణీ చేసే నోట్బుక్స్పైనే ఆధారపడుతుంటారు. నోట్పుస్తకాలు గతంలో సకాలంలో సరఫరా కాకపోవటంతో వారిపై ఆర్థికభారం పడింది. ఈ నేపథ్యంలోనే ఈసారి 1నుంచి 12వ వతరగతి విద్యార్థినులకు నోట్బుక్స్ సరఫరా, పంపిణీ షె డ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 22 నుంచి ప్రారంభమై మే 31నాటికి పూర్తి కావాలని ఆదేశాలు వచ్చాయి. మండల విద్యాశాఖ అధికారులు ప్రతిరోజూ సరఫరాను పర్యవేక్షిస్తూ.. పాఠశాల ల వారీగా నిల్వల వివరాలు డీఈవోలకు నివేదించా ల్సి ఉంటుంది. హెచ్ఎం లేదా ఒక ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, వర్క్పుస్తకాల స్వీకరణ, పంపిణీకి సంబంధించిన వివరాలను ఐఎస్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని అధి కారులు సూచించారు. జీరో ఎన్రోల్మెంట్ (విద్యార్థులు లేని) పాఠశాలలకు నోట్ బుక్స్ వెళ్తే వాటిని వెంటనే గుర్తించి జిల్లా ప్లానింగ్ కో ఆర్డినేటర్, డీఈ వో కార్యాలయానికి అప్పగించాలని ఆదేశించారు. -
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
రెబ్బెన: నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు సీఐ సంజయ్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొమురవెళ్లికి చెందిన గజ్జల సూర్యకాంత్, అతని స్నేహితులైన జక్కులపెల్లికి చెందిన ధోని రాజేశ్, కొమురవెళ్లికి చెందిన కొల్లూరి సాయికిరణ్లు ఏపీలోని శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద నకిలీ పత్తి విత్తనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడి రైతులకు అంటకట్టే ప్రయత్నం చేశారన్నారు. తమకు అందించిన పక్కా సమాచారం మేరకు సూర్యకాంత్ వద్ద నుండి 175 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.4,37,500 ఉంటుందన్నారు. మండల వ్యవసాయాధికారి దిలీప్ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘నెట్టింట్లో’ కథలు
లక్ష్మణచాంద:పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. సెలవుల్లో విద్యార్థులు ఇంటివద్ద మొబైల్ ఫోన్లలో పనికి రాని గేములు, అనవసరమైన సినిమాలు, పాటలు చూసి సమయం వృధా చేయకుండా మంచి పుస్తకాలు చదివేలా అంతర్జాలం వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కథలు చదివేలా... గతంలో వేసవి సెలవులు వచ్చాయంటే చాలు తల్లిదండ్రులు తమ పిల్లలను పల్లెటూర్లలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యల ఇళ్లకు తీసుకెళ్లేవారు. రాత్రి అయ్యిందంటే చాలు అక్కడ ఆరు బయట మంచాలు వేసుకుని తాతయ్య, అమ్మమ్మలు పిల్లలను తమ వద్ద కూర్చోబెట్టుకుని ఆకాశంలో చుక్కలను చూపిస్తూ ‘అనగనగా ఒక రాజు.. ఆ రాజుకు నలుగురు కుమారులు..’ అంటూ మంచి మంచి నీతి కథలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కానరావడం లేదు. అంతర్జాలంలో ఎన్నో... కాలం మారింది. కథలు చెప్పే తాతయ్యలు లేరు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లో అంతర్జాలంలో చాలా కథల బ్లాగులు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వాటిని ఆన్లైన్లో పిల్లలు చదివేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని కోరుతున్నారు. నీతి కథలు, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, మహనీయుల జీవిత చరిత్రలు వంటివి పిల్లలు చదివేలాగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బాల వినోదం బ్లాగ్స్పాట్.ఇన్ అంతర్జాలంలో బాలవినోదం బ్లాగ్స్పాట్.ఇన్ వెబ్సైట్లో కథలు ఉన్నాయి. యానిమేటెడ్ చిత్రాలతో ఈ వెబ్సైట్ను రూపొందించారు. ప్రతీపేజీలో అందమైన డిజైన్లతో కూడిన బొమ్మలు, నీతి కథలు కనిపిస్తాయి. పిల్లలకు ఇందులో ఫొటో కాంటెస్ట్ పరీక్ష కూడా ఉంటుంది. మ్యాజిక్కీస్.కామ్ ఇది మరొక వైబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా పిల్లలు స్టోరీ బుక్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇందులో యానిమేషన్తో కూడిన కథలు చాలా ఉంటాయి. చిట్టి పొట్టి కథల పుస్తకాలతో పాటు మనకు కావాల్సిన వివిధ రకాల పుస్తకాలు కొనుగోలు చేసేందుకు కూడా అవకాశం ఉంది. పిల్లలను ఇట్టే ఆకట్టుకునేందుకు వివిధ రకాల బొమ్మలతో కూడిన కథలు గల మంచి పుస్తకం.ఇన్ అనే వెబ్సైట్ ఉంది. ఇందులో ప్రధానంగా పరమానందయ్య శిష్యులు, చిట్టి చిలుకమ్మా, చిట్టి కథలు.. వంటివి ఉంటాయి. వీటిని పిల్లలు చూడవచ్చు. -
ఆర్జీయూకేటీలో ‘ఫిజిక్స్ హబ్’ ప్రారంభం
బాసర: బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన భౌతికశాస్త్ర ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్ ‘ఫిజిక్స్ హబ్’ను మంగళవారం విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ ఏ.గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ భౌతికశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి.దేవరాజు ఈ ఇంటరాక్టివ్ పోర్టల్ను రూపొందించినట్లు తెలిపారు. కఠినమైన భౌతికశాస్త్ర భావనలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఇందులో విజువల్ సిమ్యులేషన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. క్యాంపస్లోని సుమారు 1,500 మంది పీయూసీ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. -
గోదావరిలో మునిగి వృద్ధుడు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రమాదవశాత్తు గోదావరిలో నీటమునిగి వృద్ధుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు రంగంపేటకు చెందిన కాయితీ మల్లయ్య (66)కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం పాతమంచిర్యాలకు చెందిన ముదాం ఉమాకర్కు చెందిన గేదెలను మేపేందుకు ముల్కల్ల శివారులోని గోదావరివైపు వెళ్లాడు. సాయంత్రం గోదావరి నీటిలో సేద తీరుతున్న గేదెలను తోలుకు రావడానికి నీటిలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మంగళవారం ఉదయం మృతదేహం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతునికి భార్య రాజేశ్వరి, కుమారుడు కుమార్, కుమార్తెలు మానస, మల్లీశ్వరి ఉన్నారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. వడదెబ్బతో ఒకరు..వాంకిడి: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి వడదెబ్బతో మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొత్త దుబ్బగూడకు చెందిన చిచోల్కర్ రాందాస్(44) చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం చిచోల్కర్ శంకర్, బోయిరె శ్రావణ్తో కలిసి చేపలు పట్టేందుకు అడ ప్రాజెక్టుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చారు. కొద్ది సేపటికి వాంతులు, విరేచనాలు కావడంతో రాందాస్ స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని తండ్రి పొచ్చు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పదేళ్ల క్రితం తల్లి, ప్రస్తుతం తండ్రి మృతితో పిల్లలిద్దరూ అనాధలుగా మిగిలారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..లక్సెట్టిపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల మేరకు హాజీపూర్ మండలం సబ్బపల్లికి చెందిన తురుపాటి పౌల్ (44) గ్యాస్ స్టౌవ్లు రిపేరు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడన్నాడు. వృత్తిలో భాగంగా మంగళవారం ద్విచక్ర వాహనంపై దండేపల్లి వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన జీబు ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుని కుమారుడు మనోజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మట్కా నిర్వాహకుడిపై కేసుఆదిలాబాద్టౌన్: మట్కా నిర్వహిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన క్యాతం శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. మంగళవారం నిందితుడు మట్కా ఆడుతుండగా పట్టుకుని అతని వద్ద నుంచి రూ.300 నగదు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
‘గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి పోరాడుదాం’
జన్నారం: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికుల సంక్షేమం కోసం పోరాడుదామని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లెడ భూమన్న అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. ఉపాధి కోసం వివిధ దేశాలకు వెళ్లిన 1900 పైగా గల్ఫ్ కార్మికులు ఉపాధి వేటలో మృతి చెందారన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చినప్పటికీ గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో నష్టపోవాల్సి వస్తుందన్నారు. గల్ఫ్ దేశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన కార్మికులకు ఆసరా పెన్షన్ అందజేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సేపూరి గోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరగొండ తిరుపతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరుగు మల్లికార్జున్, మండల అధ్యక్షుడు మగ్గిడి తిరుపతి, ప్రధాన కార్యదర్శి దుమ్మల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలూ ముఖ్యమే..
శ్రీరాంపూర్: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమేనని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ.. 25రోజు ల పా టు శిక్షణ శిబిరం కొనసాగుతుందని తెలిపా రు. విద్యార్థులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొ ని రాణించాలని సూచించారు. సెలవుల్లో సె ల్ఫోన్లు పట్టుకుని సమయం వృథా చేయరా దని తెలిపారు. మైదానంలో ఆటలు ఆడడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పిల్లల్లో శా రీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసాని కి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయ ని చెప్పా రు. ఏరియా ఎస్వోటూ జీఎం ఎన్.సత్యనారా యణ, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్రావు, డీజీఎం (పర్సనల్) అనిల్కుమార్, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి, స్పోర్ట్స్ గౌరవ కార్యదర్శి పాల్సృజన్, కోఆర్డినేటర్ నర్సయ్య పాల్గొన్నారు. -
మంచిర్యాల
7ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి వేసవిలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లో ఫ్యాన్లు తిరగక, కూలర్లు నడవక ఎండ వేడిమిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఎండ వేడిమి అధికంగా ఉంటుంది. ఉక్కపోత పెరుగుతుంది.‘నెట్టింట్లో’ కథలు ‘బాలవినోదం బ్లాగ్స్పాట్, ఇన్’ వెబ్సైట్లో చాలా కథలున్నాయి. యానిమేటెడ్ చిత్రాలతో రూపొందించగా వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఎంతో వినోదం అందించనున్నాయి. -
ఆయన కళ్లు సజీవం
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన టి.పాల్ (45) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు అతని నేత్రాలను హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మధుసూదన్రెడ్డి నేత్ర దానానికి ముందుకు వచ్చిన మృతుని కుమారుడు మనో జ్, కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల శాఖ అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి, సభ్యులు డా.సుగుణాకర్రెడ్డి, భాస్కర్రెడ్డి, శంకర్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరుచోట్ల మొక్కజొన్న దగ్ధం
పెంబి: మండల కేంద్రం శివారులో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్సర్క్యూట్తో పదెకరాల మొక్కజొన్న దగ్ధమంది. స్థానికులు తెలిపిన వివరా ల మేరకు పెంబి శివారులో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ తీగలు తాకి నిప్పురవ్వలు ఎగిసిపడటంతో గోస్కూల శ్రీనివాస్, గోస్కూల తిరుమల, ఎలిగేటి అనిల్ కుమార్, కోప్పుల జ్యోతి, ఒద్నాల ఉమకు చెందిన పదెకరాల మొక్కజొన్న పూర్తిగా కా లి బూడిదయ్యింది. విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ని వివరణ కోరగా.. సంఘటన స్థలాన్ని పరిశీలించా మని, షార్ట్సర్క్యూట్తో జరిగిన ఆనవాళ్లు లేవన్నా రు. సంఘటన స్థలాన్ని ఎంఆర్ఐ శ్రావణ్ రెడ్డి, ఏ ఈవో నాగమణి, జీపీవో భాస్కర్ పరిశీలించారు. రూ.7.56 లక్షలనష్టంవాటిల్లినట్లు అంచనా వేశారు. మాలేగాంలో... కుభీర్: మండలంలోని మాలేగాంలో మంగళవారం ఉదయం బండారి భోజన్న అనే రైతుకు చెందిన 2ఎకరాల 30 గుంటల్లో మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. సుమారు రూ.2లక్షల నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు భోజన్న కోరుతున్నాడు. -
రవాణా వ్యవస్థ మెరుగుపరుస్తాం
భీమారం: అన్ని గ్రామాలకు రోడ్లు నిర్మించి రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి పేర్కొన్నారు. మండలంలోని గెర్రిగూడెం నుంచి నర్సింగాపూర్ మీదుగా కాజిపల్లి వరకు రూ.4.40 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. బూర్గుపల్లి నుంచి కాజిపల్లి, ధాంపూర్ మధ్య రింగ్ రోడ్డు ని ర్మించనున్నట్లు పేర్కొన్నారు. వేసవిలో ప్రజలకు నీ టి సమస్య రాకుండా అనేక చర్యలు చేపట్టినట్లు తెలి పారు. అదనంగా బోరువెల్స్ ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చుతున్నట్లు పేర్కొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపా రు. దాంపూర్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని విజయవంతం చేసినందు కు అధికారులను అభినందించారు. వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, నాయకులున్నారు. -
ప్రాజెక్ట్ పనులు సక్రమంగా చేపట్టాలి
తాండూర్: మండలంలోని చౌటపల్లి గ్రామపంచా యతీ పరిధిలో పీఎం అజయ్ పథకం ప్రాజెక్ట్ పనులు సక్రమంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్ర య్య సూచించారు. మంగళవారం చౌటపల్లి గ్రామపంచాయతీని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పీఎం అజయ్ పథకం కింద చేపట్టిన పనుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య పనులు, మురుగుకాలువల్లో పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేసవిలో నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఆయన వెంట చౌటపల్లి సర్పంచ్ ముదాం సునీత, డీఎల్పీవో సతీశ్కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో అనిల్కుమార్, పంచాయతీ కార్యదర్శి వసంత ఉన్నారు. -
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్విని యోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మంచిర్యాల అదనపు వి.రాములు సూచించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాప్రాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా బాల పరిరక్షణ విభాగం ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీనేజ్ ప్రెగ్నెన్సీ, ఎల్లోప్మెంట్ కేసెస్పై అవగాహన కార్యక్రమానికి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ఖాన్, సంక్షేమశాఖ అధికారి దుర్గాప్రసాద్, జిల్లా వైద్య, ఆరో గ్యశాఖ అధికారి అనిత, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులతో హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కౌమార దశలో పిల్లల్లో ఏర్పడే మా ర్పులపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ, ఎల్లోప్ మెంట్ కేసులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. -
సబ్సిడీ పేరుతో మోసగించిన నిందితుడు అరెస్ట్
ఉట్నూర్రూరల్: సబ్సిడీ పేరుతో రైతులను మోసగించిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ మడావి ప్రసాద్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన కామెర చంద్రమౌళి మంచిర్యాల లోని ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్లో మేనేజర్నని, భారత్ కిసాన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా ట్రాక్టర్లు , ఇతర పరికరాలు 50 శాతం సబ్సిడీపై ఇప్పిస్తానని భూపేటకు చెందిన రాజమౌళి వద్ద ట్రాక్టర్ కోసం రూ.4 లక్షలతో పాటు డాక్యుమెంట్ చార్జీల పేరుతో రూ.36 వేలు, గంగన్నపేట్కు చెందిన బోర్లకుంట రాజన్న వద్ద రూ.4.25 లక్షలు, దంతనపల్లికి చెందిన సింగిరెడ్డి రవీందర్ రెడ్డి వద్ద గడ్డి కట్టల యంత్రం పేరుతో రూ.1.70 లక్షలు, అదే గ్రామానికి చెందిన కొమ్ముల సందీప్ రెడ్డి వద్ద రూ.1.70 లక్షలు వసూలు చేశాడు. గతేడాది ఆగస్టులో సదరు రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు అందిన సమాచారం మేరకు మంగళవారం ఉట్నూర్ వినాయక చౌక్ వద్ద నిందితుడిని ఎస్సై విజయ్, పోలీస్ సిబ్బంది భూపతి, నరేష్, తానాజీ అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడిపై మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లోని పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు పేర్కొన్నారు. -
భీమినిలో రైతు ఆత్మహత్యాయత్నం
భీమిని: తన భూమిని ఇతరుల పేరిట పట్టా చేశారంటూ ఆరోపిస్తూ ఓ రైతు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నగుడిపేటకు చెందిన రైతు రెడ్డి స్వామి గ్రామ శివారులోని సర్వే నంబర్ 107లో 2.16 ఎకరాల భూమిని పదేళ్ల క్రితం ఏటకారి రామయ్య దగ్గర కొనుగోలు చేశాడు. కాగా, ఈ భూమిలోంచి 1.16 ఎకరాలు కమలాపూర్ ప్రాజెక్ట్ కాలువలో ముంపునకు గురైంది. మిగతా ఎకరంలో తాను పంటలు సాగు చేస్తున్నాడు. కాగా, తన భూమిని మరొకరికి పట్టా చేయించారని స్వామి ఆరోపిస్తూ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాతో భార్యాపిల్ల్ల లతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోనే తాగడానికి యత్నించాడు. దీంతో అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై కోటేశ్వర్ తన సిబ్బందితో చేరుకుని సదరు రైతు నుంచి పురుగుల మందు డబ్బా లాక్కున్నాడు. తనకు దక్కాల్సిన భూమిని మరొకరి పేరిట పట్టా చేశారని, తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నాడు. అనంతరం బాధితులను పోలీస్స్టేషన్కు తరలించారు. భూమి కొనుగోలు వ్యవహారంలో తనను మోసం చేసిన ముగ్గురిపై స్థానిక పోలీస్స్టేషన్లో స్వామి ఫిర్యాదు చేశాడు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్ బికర్ణదాస్ను వివరణ కోరగా నిబంధనల మేరకు సదరు వ్యక్తులు స్లాట్బుక్ చేసుకోవడంతో వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశామని వివరించారు. -
‘నీట్’ పకడ్బందీగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రిల్చర్: నీట్ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రాములు, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావు, జిల్లా విద్యాధికారి యాదయ్యతో కలిసి నీట్ పరీక్ష నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. నీట్ పరీక్ష నిర్వహణ కోసం అవసరమైన ఏ ర్పాట్లు చేయాలని తెలిపారు. కంట్రోల్ రూమ్, పరీ క్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షాకేంద్రాల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. పాలనా విభాగం నుంచి ఒక నోడల్ అధికారి, పోలీస్శాఖ నుంచి నోడల్ అధి కారిని నియమించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష స మయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యు త్ సరఫరా చేయాలని సూచించారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని నియమించి, ఓఆర్ఎస్తోపాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. నిబంధనల ప్ర కారం జిల్లాలో అవసరమైన పరీక్షాకేంద్రాలు ఏర్పా టు చేయాలని, దివ్యాంగ అభ్యర్థుల కోసం సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జిల్లాలో నీట్ పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. -
మ్యాపింగ్ జాప్యం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కోసం చేపట్టిన ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ జిల్లాలో ఆశించిన మేర ముందుకుసాగడం లేదు. గత నాలుగు నెలలకుపైగా సాగుతున్నా.. ఇంకా 70శాతం ప్రక్రియ కూ డా పూర్తి కాలేదు. దేశ వ్యాప్తంగా సమగ్ర ఓటర్ల జా బితా కోసం ఎన్నికల కమిషన్ ప్రతీ 25 ఏళ్లకోసారి సర్వే చేయడం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002లో సర్వే నిర్వహించగా ప్రస్తుతం మళ్లీ జరుగుతోంది. తెలంగాణలో ఏప్రిల్ నుంచే ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సర్వే ప్రారంభం కావాల్సి ఉన్నా ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు, జనగణన తదితర కారణాలతో జాప్యం జరుగుతోంది. రికార్డుల్లో 6.67లక్షల మంది ఓటర్లుజిల్లాలోని ప్రధాన నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు పరిధిలో 6.67లక్షల మంది ఓ టర్లున్నట్లు రికార్డుల్లో ఉంది. ప్రస్తుతం ఓటరు మ్యా పింగ్ ప్రక్రియ జరుగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి మ్యా పింగ్ చేస్తున్నారు. అంటే.. గతంలో జరిగిన సవరణ ఆధారంగా ఉన్న జాబితా ప్రకారం ఒక్కో కుటుంబంలో ఇంటి పెద్ద తల్లి, తండ్రి, భర్త, కొడుకు, కూ తురు ఓటరును పోల్చుతూ ఒకేచోట మ్యాపింగ్ చే స్తున్నారు. అంటే, ఒక కుటుంబాన్ని ఒకేచోట చేర్చి మ్యాపింగ్ చేస్తుంటారు. ఒకవేళ ఓటరు జాబితాలో ఉన్న అడ్రస్ ప్రకారం వ్యక్తులు స్థానికంగా నివాసం లేకుంటే మ్యాపింగ్ చేయరు. దీంతో త్వరలో సమగ్రంగా చేపట్టే సర్వేలో ఇక్కడే ఓటు ఉండాలని భావి స్తే, ఈ ప్రాంతానికి చెందిన వారిమేనని దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు పొందిన 12రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించాలి. లేకుంటే ఆ ఓటరును జాబితా నుంచి తొలగిస్తారు.జిల్లాలో మ్యాపింగ్ వివరాలుఅడ్డగోలుగా రెండేసి ఓట్లుస్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టే ముందు జరుగుతున్న ఈ మ్యాపింగ్లో డబుల్ ఓట్లు బయటపడుతున్నాయి. ఇప్పటికే రెండేసి ఓట్లు, వలస వెళ్లి మరోచోట ఉన్న ఓట్లు, మృతులు, ఇతర నియోజకవర్గాలకు అడ్రస్ మార్చుకున్న ఓటర్ల వివరాలు తెలిసిపోతున్నాయి. చాలాచోట్ల ఓట రు జాబితాలో ఉన్న ఓటర్లు స్థానిక పోలింగ్ కేంద్రాల పరిధిలో నివాసం లేరు. దీంతో వారందరి ఓట్లు మ్యాపింగ్కు దూరంగా ఉంటున్నాయి. బూత్ లెవెల్ అధికారులు వారి ఫోన్ నంబర్లు తెలుసుకుని ఆరా తీసి ఎక్కడ ఓటు ఉందో.. లేదో.. కనుక్కుని ఆ మేరకు వివరాలు నమోదు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఫోన్ నంబర్లు, వారంతా ఎక్కడ ఉంటున్నారో కూడా స్పష్టత లేకుండా ఉంది. జిల్లా కేంద్రంతోపాటు సింగరేణి కార్మికులు, పట్టణాల్లో ఉన్న వారంతా జిల్లాలో కొంతకాలం ఉండి ఆ తర్వాత శాశ్వతంగా వలస వెళ్లి పోయారు. దీంతో ఆ ఓట్లు తదుపరి జాబితాలో తొలగించే అవకాశముంది. ప్రత్యేక సమగ్ర సవరణలో మళ్లీ తమ పేర్లు స్థానికంగా ఉన్నట్లుగా నమోదు చేయాలంటే ఏదైన ధ్రువీకరణ పత్రం తప్పకుండా చూపించాల్సి ఉంది. అయితే, చాలామందికి రెండేసి ప్రాంతాల్లో ఓట్లున్నట్లు తెలుస్తోంది. రెండుచోట్ల ఓట్లున్నవి కూడా సర్వేతో బయటపడుతున్నాయి. మరోవైపు పట్టణా ల్లో మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలంటూ బూత్ స్థాయి అధికారులతో నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. -
సుర్రుమంటున్న ఓసీపీలు
శ్రీరాంపూర్: భానుడి ప్రతాపానికి సింగరేణి ఓసీపీలు సుర్రుమంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో కార్మికులు విలవిల్లాడుతున్నారు. సాధారణ ప్రాంతాలతో పోల్చితే మైనింగ్ ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయి. మూడురోజులుగా 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ఓసీపీల్లో బొగ్గు వేడికి మరో రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతుతున్నాయి. మే లో దంచికొట్టే ఎండలు ఈ సారి ముందే ప్రతాపం చూపుతున్నాయని కార్మికులు పేర్కొంటున్నారు. భూగర్భ గనుల్లో పని చేసే కార్మికుల కన్నా ఓసీపీల్లో పని చేసేవారిపైనే తీవ్ర ప్రభావం ఉంటుంది. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో ఐదు ఓసీపీలున్నాయి. వీటిలో బెల్లంపల్లి ఏరియాలోని కై రిగూడ, మందమర్రి పరిధిలోని కేకే, ఆర్కేపీ, శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ, ఇందారం ఓసీపీలున్నాయి. వీటన్నింటిలో కార్మికులు ఎండ తీవ్రతను తట్టుకోవడం కోసం యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈసారి కూడా క్వారీల్లో అధికారులు చలువ పందిళ్లు వేయించి మట్టి కుండల్లో నీటిని ఉంచుతున్నారు. కొన్నిచోట్ల కూల్ క్యాన్లు పెట్టించారు. టవల్స్, గొడుగులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు. కొన్ని డిసిగ్నేషన్ల వారికి కూల్ బాటిళ్లు అందించారు. డంపర్లు, షవల్స్, ఇతర భారీ యంత్రాల్లో ఏసీలు పూర్తి కండిషన్ చేయించారు. కాగా, ఓసీపీల్లో మాదిరిగా అన్ని భూగర్భ గనులు, సర్ఫేస్ డిపార్టుమెంట్లు, సీహెచ్పీలతోపాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా మార్చని షిఫ్ట్ వేళలుఓసీపీల్లో ఎన్ని ఉపశమన చర్యలు చేపట్టినా ఎండదెబ్బ నుంచి కాపాడలేకపోతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా గతంలో మే నెలలో పని వేళలు మార్చేవారు. రెండేళ్లుగా షిఫ్ట్ వేళలు మార్చడం లేదు. దీంతో కార్మికులు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఈసారి ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా యాజమాన్యం షిఫ్ట్ వేళలు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం షిఫ్ట్ ఉదయం 7నుంచి మధ్యాహ్నం 3గంటలకు వరకు ఉండగా.. ఉదయం 6నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 3నుంచి రాత్రి 11గంటల వరకు ఉన్న సెకండ్ షిఫ్ట్ను సాయంత్రం 4నుంచి రాత్రి 11గంటల వరకు మార్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. షిఫ్ట్ వేళలు మార్చాలి గత రెండేళ్ల కంటే ఈసారి ఎండలు తీవ్రంగా ఉన్నందునా షిఫ్ట్ వేళలు మార్చాలి. ఎన్ని ఉపశమన చర్యలు చేపట్టినా కార్మికులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. తక్షణమే కంపెనీ దీనిపై ఉత్తర్వులు జారీ చేయాలి. అన్ని సర్ఫేస్ విభాగాల్లో పని చేసే కార్మికులకు కూడా ఓసీపీల్లో మాదిరిగా ఉపశమన చర్యలు చేపట్టాలి – బండి రమేశ్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు -
హోరాహోరీగా ఖేలోఇండియా పోటీలు
రామకృష్ణాపూర్: పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో జరుగుతున్న అస్మిత ఖేలో ఇండియా అండర్–16 బాలికల ఫుట్బాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఎనిమిది జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పోటీలు ముగియగా రంగారెడ్డి, కరీంనగర్ జట్లు ఫైనల్స్కు చేరుకున్నాయి. మంగళవారం సాయంత్రం మొదటి సెమీఫైనల్ మ్యాచ్ కరీంనగర్–ఆదిలాబాద్ జట్ల మధ్య జరుగగా 3–1 గోల్స్తో కరీంనగర్ గెలుపొంది ఫైనల్కు చేరింది. మరో సెమీఫైనల్ మ్యాచ్ స్పోర్ట్స్ స్కూల్ రంగారెడ్డి, నిజామాబాద్ల మధ్య జరుగగా 1–1 గోల్స్తో ఇరు జట్ల మ్యాచ్ టై కావడంతో పెనాల్టీ షూట్అవుట్ నిర్వహించారు. ఉత్కంఠ భరితంగా సాగిన షూట్అవుట్లో 5–4 గోల్స్తో స్పోర్ట్స్ స్కూల్ రంగారెడ్డి జట్టు గెలుపొంది ఫైనల్కు చేరుకుంది. బుధవారం కరీంనగర్, రంగారెడ్డి జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫాల్గుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి, సీనియర్ క్రీడాకారులు ఈశ్వరాచారీ, బెల్లం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బ్యాటరీల చోరీ కేసులో నిందితుల అరెస్ట్
మందమర్రిరూరల్: సింగరేణి బ్యాటరీల చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ రమేశ్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మందమర్రి ఏరియాలోని స్టోర్స్లో ఈ నెల 20న విలువైన బ్యాటరీలో చోరీకి గురయ్యాయి. సింగరేణి అధికారుల ఫిర్యాదు మేరకు 25న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలోని నార్లాపూర్ సమీపంలో నేషనల్ హైవేపై ఎస్సై నరేష్, సిబ్బందితో కలిసి ఆటోను తనిఖీ చేయగా 25 బ్యాటరీలు లభించాయి. ఆటోలో ఉన్న వారిని ప్రశ్నించగా స్టోర్స్లో దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. బ్యాటరీలను స్వాధీనం చేసుకుని నిందితులు మునియప్ప, నరేంద్ర, శివప్రసాద్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
బడి ముగిసింది.. బాధ్యత మిగిలింది..!
నిర్మల్ఖిల్లా: వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. పిల్లలు పుస్తకాలు పక్కనపెట్టేశారు. ఆట పాటలతో ఎంజాయ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల అసలు బాధ్యత ఇప్పుడే మొదలైంది. వచ్చే 45 రోజులు పిల్లలను ఎండల దెబ్బ నుంచి రక్షించి, కాలక్షేపం, మంచి ప్రవర్తన, ఆరోగ్యం విషయాల్లో శ్రద్ధ చూపాలి. ఈ 45 రోజుల కాలంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలతో ప్రమాదాలు.. ఈసారి ఎండలు తీవ్రంగా ఉండటంతో పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. దీంతో బయ టకు వెళ్లకుండా పిల్లలు మొబైల్లు, టీవీలకు అతుక్కునే ప్రమాదం ఉంది. ఇది కంటి సమస్యలు, నిద్రలేమి, ఆగ్రహ స్వభావాన్ని తీసుకొస్తుంది. సరైన మార్గదర్శకత లేకపోతే అలవాట్లు దెబ్బతింటాయి. సృజనాత్మక కార్యక్రమాలు.. పిల్లలను ఇండోర్ ఆటలు, పుస్తక పఠనం, కథలు, చిత్రలేఖనం, పజిల్స్ వైపు మళ్లించండి. కుటుంబ సభ్యులతో ఆటలు ఆడటం సామాజిక నైపుణ్యాలను పెంచుతుంది. మొబైల్, టీవీ వాడకాన్ని పరిమితం చేసి, మేధోపరమైన కార్యక్రమాలకు ప్రోత్సాహించండి. ఆరోగ్య జాగ్రత్తలు.. మధ్యాహ్నం వేళల్లో పిల్లలను బయటకు పంపొద్దు. ఉదయం తొందరగా లేదా సాయంత్రం చల్లని సమయాల్లో మాత్రమే అనుమతించాలి. తగినంత నీరు, పండ్ల రసాలు, తేలికపాటి ఆహారం ఇవ్వాలి. హైడ్రేషన్పై శ్రద్ధ పెట్టండి. చదువు, ఆటలు, విశ్రాంతి సమయాలను సమతుల్యం చేసే షెడ్యూల్ రూపొందించాలి. ఇది క్రమశిక్షణను పెంచుతుంది. బాధ్యతలు తెలిసేలా... క్లే మోడలింగ్ (మట్టితో బొమ్మలు చేయడం), పెయింటింగ్, ఒరిగామి (కాగితపు కళలు) నేర్పించాలి. అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పురాణ గాధలు, నీతికథలు వినేలా ప్రోత్సహించాలి. ఇది వారి భాషా పరిజ్ఞానాన్ని, విలువలను పెంచుతుంది. మొక్కలకు నీళ్లు పోయడం, ఇంటిని సర్దడం వంటి పనుల్లో పిల్లలను భాగస్వామ్యం చేస్తే వారికి బాధ్యత తెలుస్తుంది. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. -
స్వీయ గణన షురూ
మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన ప్రక్రియలో సెల్ఫ్ ఎన్యుమరేషన్(స్వీయ గణ న) ప్రక్రియ మొదలైంది. మే 10వరకు ఎవరికి వా రు స్వీయ గణన చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం పోర్టల్లో కుటుంబంలోని ఒకరి సెల్ నంబరుతో లాగిన్ అయి, వారి కుటుంబ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లా అధికారులు పలువురు స్వీయ గణన ద్వారా వివరాలను నమోదు చేసుకోగా, ప్రజలు సైతం ముందుకు వచ్చేందుకు అవగాహన కల్పిస్తున్నారు. మే 11నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి జనగణన చేపడుతారు. అందుకు ముందుగానే స్వీయ గణన చేసుకోవడం వల్ల ఎన్యుమరేటర్లు వచ్చిన సమయంలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న సమయంలో వచ్చిన 11 అంకెల రెఫ రెన్స్ ఐడీని ఇస్తే సరిపోతుంది. ఒకవేళ వివరాలు తప్పుగా ఉన్నా, ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కూడా ఉండగా, ఇంటి పెద్ద వివరాలను మాత్రం మార్చేందుకు అవకాశం ఉండదు. ఎన్యుమరేటర్లు వచ్చిన సమయంలో ఇంట్లో లేకున్నా, ఇతర ప్రాంతాలకు వెళ్లినా ఆన్లైన్ ద్వారా స్వీయ గణన చేసుకున్న రెఫరెన్స్ ఐడీని ఎన్యుమరేటర్కు చెబితే సరిపోతుంది. ఎక్కడున్నా నమోదుకు అవకాశంజనగణన వివరాలను ఎక్కడ ఉన్నా నమోదు చేసుకునేందుకుhttp://se.census.gov. inవెబ్సైట్లో లేదా మొబైల్ యాప్ ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించింది. జనగణన తొలిదశ మే 11నుంచి ప్రారంభం కానుంది. అందులో భాగంగా హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ జరగనుండగా, వీటిని ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి చేపట్టనున్నారు. ఏ ఒక్క కుటుంబం వివరాలను కూడా తప్పిపోవద్దనే ఉద్దేశ్యంతో స్వీయ గణనకు అవకాశం కల్పించారు. మే 10వరకు ప్రజలే ఎన్యుమరేటర్లుగా మారి వారి వివరాలను నమోదు చేసుకోవచ్చు. కుటుంబ యజమాని పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ నమోదు చేసిన తరువాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేసిన వెంటనే 33 రకాల ప్రశ్నలకు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత సబ్మిట్ చేయడంతో హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల సంఖ్యతో ఐడీ వస్తుంది. దీనిని భద్రపరుచుకుని, జనగణనకు ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు చెబితే సరిపోతుంది. -
వడదెబ్బతో ఒకరి మృతి
నెన్నెల: పెళ్లి డప్పు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. మరో పక్షం రోజుల్లో కూతురు పెళ్లి చేయాల్సిన తండ్రి మరణం విషాదం మిగిల్చింది. మండలంలోని మైలారం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోగారపు మారయ్య(56) చిన్న కూతురు వివాహం వచ్చే నెల 13న జరగాల్సి ఉంది. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ నెల 24న మధ్యాహ్నం వంట చెరుకు కోసం ఎడ్లబండిలో అడవికి వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతడి జాడ కోసం అదే రోజు రాత్రి అడవంతా వెతికినా దొరకలేదు. రెండో రోజు ఉదయం మళ్లీ అడవిలోకి వెళ్లి గాలించగా ఓ చోట ఎడ్లు, బండి కనిపించాయి. మారయ్య ఆచూకీ లభించలేదు. మూడో రోజు ఆదివారం సాయంత్రం మైలారం గ్రామ శివారులో ఓ వాగు ఒడ్డున విగత జీవిగా కనిపించాడు. మారయ్య అడవిలో దారి తప్పి నీటి కోసం వెతుకుతూ వాగు వద్దకు వెళ్లి వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి పెద్ద అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్సై రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుడి కుమారుడు వెంకటేషం ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
ప్రాణం పోసిన ‘108’
నార్నూర్: పురిటి నొప్పుల వేళ ఓ నిండు గర్భిణికి సకాలంలో వైద్యసేవలు అందక 108లో ప్రసవించాల్సిన దుస్థితికి నిదర్శనం ఈ ఘటన. వైద్యసిబ్బంది అందుబాటులో లేని ఆసుపత్రుల కంటే ఆపత్కాలంలో అండగా నిలిచిన వారి మానవత్వమే తల్లీ బిడ్డను కాపాడాయి. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చిత్తగూడ గ్రామానికి చెందిన రంభబాయికి సోమవారం ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే గాదిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఝరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడా సిబ్బంది లేకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. చివరకు 108లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలో లోకారి సమీపంలో ఆమె ప్రసవించింది. అంబులెన్స్ సిబ్బంది చొరవతో ఆమె ఆడ శిశువుకు జన్మినిచ్చింది. అనంతరం రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కాగా, ఈ ఘటనలో ఆ తల్లి పురిటి వేదన హృదయ విదారకంగా నిలిచింది. సకాలంలో వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో ఆమె ప్రాణాలకు ముప్పు తలెత్తే పరిస్థితి ఏర్పడింది. రెండు చోట్ల వైద్య సిబ్బంది లేకపోవడం సర్కారు దవాఖానాల దుస్థితికి అద్దం పడుతోంది. -
మండే సూర్యుడు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో భానుడు భగ భగ మండుతూ నిప్పులు చెరుగుతున్నాడు. రికార్డు స్థా యి గరిష్ట ఉష్ణోగ్రతలతో దడ పుట్టిస్తున్నాడు. వడగాలుల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 33.1 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 45.8 డిగ్రీలుగా నమోదైంది. జిల్లాలో 18మండలాలకు గాను నాలుగు మండలాల్లో 45 నుంచి 46 డిగ్రీలు, 14మండలాల్లో 42 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జిల్లా మొత్తం రెడ్, ఆరెంజ్ జోన్లోకి వెళ్లింది. అత్యధికంగా భీమారం మండల కేంద్రంలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతన్నాయి. ఉదయం తొమ్మి ది గంటల నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతతో జనం బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం ఎండకు తోడు అర్ధరాత్రి వరకు వడగాలులు, ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటి నీటి ఎద్దడి తలెత్తుతోంది. ఎండలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వేడి, ఓవర్లోడ్తో ట్రిప్ అవుతూ కాలిపోతున్నాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఓసీపీల్లో నిప్పుల కుంపటి మండుటెండల్లో భూ ఉపరితలాల్లో పని చేసే సింగరేణి కార్మికుల పరిస్థితి నెత్తిమీద నిప్పుల కుంపటి మాదిరిగా తయారైంది. ఎండల్లో విధులు నిర్వర్తిస్తూ కొందరు వడదెబ్బ బారినపడి ఆస్పత్రి పాలవుతున్నారు. అనారోగ్యానికి గురవడంతో మధ్యాహ్నం రెండో షిఫ్టుకు వెళ్లే కార్మికుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. బోసిపోతున్న చిరువ్యాపారాలు గత పది రోజులుగా మండుతున్న ఎండల్లో చిరువ్యాపారాలు, ఆటోవాలల గిరాకీలు తగ్గాయి. రోజువారీగా కూరగాయలు, పండ్లు, ఇతర చిరు వ్యాపారులు రావడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరాకీలు దెబ్బతిన్నాయని అంటున్నారు. సాధారణ ప్రయాణాలు వాయిదాలు వేసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితులతోపాటు శుభకార్యల సీజన్ కావడంతో వాటికి హాజరయ్యేందుకు ప్రయాణాలు చేయడం పెద్ద సమస్యగా మారింది. మధ్యాహ్నం వేళ ఇళ్లలో కూలర్లు వినియోగిస్తున్నా వేడి తగ్గడం లేదు. ఎండ తీవ్రత నుంచి ఉమశమనం కోసం ప్రజలు శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు, చల్లని పండ్ల రసాల తాగేందుకు ఇష్టపడుతుండడంతో వీటి విక్రయాలు పెరిగాయి. భీమారం నస్పూర్ కన్నెపల్లి దండేపల్లి లక్సెట్టిపేట జైపూర్ మంచిర్యాల భీమిని జన్నారం చెన్నూర్ హాజీపూర్ నెన్నెల వేమనపల్లి మందమర్రి కోటపల్లి తాండూర్ బెల్లంపల్లి కాసిపేట కనిష్టం 33.6 32.2 32.8 32.3 33.6 32.4 32.8 33.8 33.9 32.4 34.0 31.8 29.8 33.6 31.8 32.9 32.2 32.3 గరిష్టం 45.8 45.4 45.3 45.2 44.8 44.6 44.5 44.4 44.4 44.3 44.2 44.2 44.0 43.8 43.8 43.3 43.3 43.1నిర్మానుష్యంగా..చున్నీ కప్పుకుని వెళ్తున్న యువతులుమంచిర్యాలలో కూరగాయలు విక్రయిస్తున్న మహిళలు -
విజ్ఞానం, వినోదానికి సైన్స్ ప్రయోగాలు
మంచిర్యాలఅర్బన్: వేసవి సెలవుల్లో విజ్ఞానం, వినోదం, సైన్స్ ప్రయోగాలకు సమ్మర్ సైన్స్ క్యాంపు ఎంతో దోహదం చేస్తుందని డీఈవో యాదయ్య అన్నారు. సోమవారం జిల్లా సైన్స్ కేంద్రంలో 15 రోజుల వేసవి సైన్స్ సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను సెల్ఫోన్లకు దూరంగా ఉంచడం, సైన్స్పై ఆసక్తి పెంచేందుకు శిబిరం తోడ్పడుతుంద ని అన్నారు. 92 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. కృత్యాధార పద్ధతిలో ప్రయోగాలను తమకు తామే చేస్తూ సైన్స్పై అవగా హన పొందాలని తెలిపారు. జిల్లా పరీక్షల విభాగం సహాయ సంచాలకుడు మల్లేశం మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి మూఢనమ్మకాలపై సరైన అవగాహన పెంచుకోవాలని, సైన్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. మొదటిరోజు సైన్స్ ఉపాధ్యాయుడు జాకీర్ కొన్ని ప్రయోగాలతో విద్యార్థులను ఆలోచింపజేశారు. జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి మహేశ్వర్రెడ్డి, సెక్టోరి యల్ అధికారులు భరత్కుమార్, విజయలక్ష్మి, సత్తయ్య, చౌదరి, జూనియర్ కళాశాల లెక్చరర్ నాగవర్మ, ఉపాధ్యాయులు తిరుపతి, రాజేశం, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
తెలంగాణ సాధించిన ఘనత బీఆర్ఎస్దే..
నస్పూర్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్దేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నస్పూర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో, తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ స్వరాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడిందని, ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కే.సురేందర్రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
సారంగపూర్: వేసవి తాపం తీర్చుకునేందుకు సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు వాగులో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్లో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైకుంఠాపూర్ గ్రామానికి చెందిన సాతెల్లి సాయన్న–పోసవ్వ దంపతులకు కొడుకు సాయిప్రసాద్(23), కూతురు సంతానం. సాయిప్రసాద్ తన స్నేహతులతో కలిసి సరదాగా సమీపంలోని వాగుకు ఈతకు వెళ్లాడు. వాగులో దిగిన కొంత దూరం వెళ్లాక లోతు ఉండడంతో స్నేహితులు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. ఈతరాని సాయిప్రసాద్ నీటిలో మునిగి మృతి చెందాడు. ఒడ్డున ఉన్న స్నేహితులు కేకలు వేయగా సమీపంలోని రైతులు వచ్చే సరికే సాయిప్రసాద్ నీటిలో మునిగిపోయాడు. ఎదిగిన ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
ఆర్కేపీలో క్రీడా సందడి
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్లోని సింగరేణి ఠా గూర్స్టేడియంలో అస్మిత ఖేలో ఇండియా అండర్–16 బాలికల ఫుట్బాల్ పోటీలు సోమవారం ఘ నంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఫుట్బాల్ అసో సియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో ఎనిమిది జిల్లాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఎండల దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు మైదానాల్లో మ్యాచ్లు జరుగుతున్నాయి. ఉదయం జరిగిన మ్యాచ్ల్లో తొలుత నిజామాబాద్, గజ్వేల్ జట్లు తలపడగా 7–0 గోల్స్తో నిజామాబాద్ విజయం సాధించింది. రెండో మ్యాచ్ ఆదిలాబాద్, సిద్దిపేట జట్ల మధ్య జరుగగా 13–0 గోల్స్తో ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్ రంగారెడ్డి, హైదరాబాద్ జట్ల మధ్య జరుగగా 1–0 గోల్స్తో రంగారెడ్డి జట్టు గెలుపొందింది. మరో మ్యాచ్ కరీంనగర్, వనపర్తి జట్ల మధ్య జరుగగా 1–0 గోల్స్తో కరీంనగర్ జట్టు విజయం సాధించింది. ఇక సాయంత్రం జరిగిన మ్యాచ్ల్లో కరీంనగర్, గజ్వేల్ జట్లు తలపడగా 6–0 గోల్స్తో కరీంనగర్ గెలుపొందింది. ఆదిలాబాద్, మల్కాజిగిరి మధ్య జరిగిన మ్యాచ్లో 2–0 గోల్స్తో ఆదిలాబాద్ గెలిచింది. సిద్దిపేట, రంగారెడ్డి జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 0–10 గోల్స్తో రంగారెడ్డి, వనపర్తి, నిజామాబాద్ మధ్య జరిగిన మ్యచ్లో 6–0 గోల్స్తో నిజామాబాద్ గెలుపొందాయి. పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన మార్చ్ఫాస్ట్ ఆకట్టుకుంది. క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలి – సీఐ రమేష్, మందమర్రి క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలని గెలుపోటములను సమానంగా స్వీకరించాలని మందమర్రి సీఐ పర్స రమేష్ అన్నారు. క్రీడల్లో రాణించటం వల్ల మంచి భవిష్యత్ ఉంటుందని, ముఖ్యంగా క్రమశిక్షణ ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరిత, సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, పట్టణ ఎస్సై శ్రీధర్, ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫాల్గుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పల్లె రాజు, వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు ఈశ్వరాచారి, బెల్లం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో మహిళ హత్య
ఆదిలాబాద్టౌన్: మద్యం మత్తులో మహిళపై లైంగికదాడికి యత్నించిన నిందితుడు ఆమె ప్రతిఘటించడంతో హత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్చౌక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వన్టౌన్ పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు. ఈమేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని వన్టౌన్లో ఎస్పీ అఖిల్మహాజన్ విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 24న పంజాబ్చౌక్ సమీపంలోని డ్రెయినేజీలో జనగమ్వార్ అనిత మృతదేహం లభ్యమైంది. మృతురాలి సోదరుడు సంతోష్ ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేశాడు. శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో మహారాష్ట్రకు చెందిన నర్సింగా సంతోబా గంపల్వాడ్ను నిందితుడిగా గుర్తించాం. మృతురాలు ఘటనా స్థలంలో విశ్రాంతి తీసుకునే సమయంలో మద్యం మత్తులో ఉన్న నిందితుడు చెత్త ఏరుకునే ఆమెను ఎవరూ లేని ప్రదేశమైన కాలువ వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురై గొంతు నులిమి హత్య చేశాడు. ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహన్ని డ్రెయినేజీలో పడేశాడు. కాగా, కేసును 48 గంటల్లో చేధించినట్లు ఎస్పీ తెలిపారు. నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసును ఛేదించిన వన్టౌన్ సీఐ సునిల్ కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సైలు సంజయ్, అశోక్ను ప్రత్యేకంగా అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలతో పాటు నగదు రివార్డులు అందజేశారు. -
ఇందిరమ్మ నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలు అధికారులను ఆదేశించారు. హిమాయత్నగర్లోని హౌసింగ్ కా ర్పొరేషన్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో మంత్రులు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల ఆత్మగౌరవానికి ప్రతీ క అని అన్నారు. నిర్మాణ ప్రక్రియలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. లబ్ధిదారుల దరఖాస్తులను పెండింగ్ పెట్టవద్దని, అధికారుల వద్ద ఫైల్ వారం రోజులకు మించి ఉండవద్దని పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉంటే తక్షణమే అధికారులను డిప్యూటేషన్పై తీసుకొని పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రతీ దశలో పనుల ను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. స్థోమతలేని నిరుపేద లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. దశ ల వారీగా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మంజూ రయ్యే నిధుల ద్వారా రుణం తీర్చేలా చూడాలని తెలిపారు. సమావేశంలో ఎంపీలు నగేశ్, గడ్డం వంశీ, ఎమ్మెల్సీలు దండే విఠల్, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావు, గడ్డం వినోద్, రామారావు పటే ల్, పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీష్బాబు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీసీ గౌతమ్, ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, మంచిర్యాల కలెక్టర్లు రాజర్షిషా, హరిత, భవేష్ మిశ్రా, కుమార్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
మామిడి.. మొక్కుబడి కొనుగోళ్లు
బెల్లంపల్లి: బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్కు రోజు వారీగా కనీసం టన్ను మామిడికాయలు కూడా అ మ్మకానికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెటింగ్ అధికారుల నిర్లక్ష్యం, దిగుబడి గణనీయంగా పడిపోవడం, కొద్దిపాటిగా చేతికందిన కాయలకు మంగు, మచ్చలు ఏర్పడడం, మద్దతు ధర లేకపోవ డం వంటి ప్రతికూల అంశాలు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బెల్లంపల్లి మార్కెట్లో మామిడి కొనుగోళ్లు ప్రారంభించి వారం రోజులు కావస్తున్నా వ్యాపారులు, రైతుల నుంచి కనీస స్పందన లేదు. ఓ చిరువ్యాపారి ద్వారా మొక్కుబడిగా కొనుగోళ్లు చేపట్టి ఆనవాయితీని కొనసాగిస్తున్నార నే విమర్శలు వస్తున్నాయి. తొలిసారిగా గత ఏడాది బెల్లంపల్లిలో ప్రారంభించిన మామిడికాయల కొనుగోళ్లు ఆశాజనకంగా సాగాయి. పక్షం రోజులపాటు క్రయవిక్రయాలు సాగి సుమారు ఆరు వేల క్వింటాళ్ల వరకు అమ్మకానికి వచ్చాయి. ఒకరిద్దరు బడా వ్యాపారులు రావడంతో రైతులు మ్యాంగో మార్కెట్కు తీసుకొచ్చి కాయలు విక్రయించారు. రైతులకు పెద్దగా లాభాలు రాకపోయినా నాగ్పూర్కు తీసుకెళ్లే వెతలు తప్పి రవాణా ఖర్చులు మిగిలాయి. ఈసారి ఆమాత్రం వెసులుబాటు కూడా లేకపోవడం రైతులను నిరాశకు గురి చేస్తోంది. తగ్గిన దిగుబడి మామిడి కాతపై ఈసారి ప్రకృతి తీవ్ర ప్రభావం చూపింది. పూత విరబూసినా అకాల వర్షాలు, చీడపీడల వల్ల పూత అధిక శాతం నేలపాలైంది. అక్కడక్కడ నిలిచిన పూత పిందె దశకు చేరుకునే క్రమంలో అకాల వర్షాలకు రాలిపోయింది. ప్రతికూల పరిస్థితులతో దిగుబడి పడిపోయింది. ఉద్యానవన అధికారుల లెక్కల ప్రకారం సాధారణంగా ఒక ఎకరాకు ఐదు నుంచి ఆరు టన్నుల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం టన్ను కూడా రాకుండాపోయింది. దీనికి తోడు కాయలపై మంగు, మచ్చలు ఏర్పడడంతో మద్దతు ధర కరువైంది. నాగ్పూర్ మార్కెట్లో ధర ఇలా.. బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్కు డిమాండ్ ఉన్నా మామిడి కాయలు రావడం లేదు. కొద్దిపాటి నీలం, తోతపరి తదితర రకాల కాయలు మాత్రమే వస్తున్నాయి. దశేరి, బంగెనపల్లి, హిమాయతి వంటి ము ఖ్యమైన రకాలు కానరావడం లేదు. వీటికి మార్కెట్లో కనీస మద్దతు ధర ఉంటుంది. బడా వ్యాపారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో నాగ్పూర్ మార్కెట్కు తీసుకెళ్లి అమ్మాలనే తలంపులో రైతులు ఉన్నారు. ప్రస్తుతం నాగ్పూర్ మ్యాంగో మార్కెట్లో దశేరి రకం కాయలకు టన్నుకు రూ.25 వేలు ధర చెల్లిస్తుండగా, బంగెనపల్లి రకానికి రూ.20 వేలు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. ఆదిలో దశేరి కాయలు టన్నుకు రూ.60 వేలు ధర పలుకగా, బంగెనపల్లి కాయల ధర రూ.50 వేలు చెల్లించి బడా వ్యాపారులు రైతుల్లో ఆశలు కల్పించారు. ఆయా రకాల కాయల ధరలు ప్రస్తుతం సగానికి పడిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితులను చవి చూస్తున్నారు. బెల్లంపల్లి మార్కెట్కు బడా వ్యాపారులను రప్పించి కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవడంలో మార్కెటింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.మద్దతు ధర లేదు చెట్లకు వచ్చిన పూత చూసి కాపు లీజుకు తీసుకున్న. తీరా పూతంతా రాలిపోయింది. తోటలన్నీ కాపులేక వెలవెలబోతున్నాయి. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి లీజుకు తీసుకున్న తోటల్లో దిగుబడి పడిపోయింది. కొద్దిపాటిగా చేతికందిన కాయలకు మద్దతు ధర దక్కుతుందనే ఆశతో ఉండగా నాగ్పూర్ బడా వ్యాపారులు దశేరి, బంగెనపల్లి రకాల ధరలు బాగా తగ్గించి కొంటున్నారు. బెల్లంపల్లిలోనూ మద్దతు ధర లేకుండాపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – బాబా, గుత్తేదారు, బెల్లంపల్లి కాపు పడిపోయింది గత మూడు నాలుగేళ్ల నుంచి మామిడి కాపు పడిపోతున్నది. చెట్టు నిండా పూత విరబూసిన ఫాయిదా ఉంటలేదు. వచ్చిన పూత వచ్చినట్లే రాలిపోయి కొద్దిపాటి పూత మాత్రమే నిలుస్తున్నది. ఈసారి కూడా అట్లనే జరిగింది. అక్కడక్కడ పిందెలు నిలిచి కాయ దశకు చేరుకోగానే అకాల వర్షాలతో పంట నేలపాలైంది. అమ్మకానికి తీసుకెళ్లడానికి కాయలు కానరాకుండా ఉన్నాయి. కాపు పడిపోయి కష్టాలు మిగిలాయి. – గోమాస మల్లయ్య, మామిడి రైతు, మాలగురిజాల -
పెన్గంగలో విద్యార్థి గల్లంతు
సాత్నాల: భోరజ్ మండలం పెన్గంగ నదిలో స్నానానికి వెళ్లి తోటవార్ కిరణ్(19) అనే విద్యార్థి సోమవారం గల్లంతయ్యాడు. ఎస్సై పవర్ గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ముధోల్ మండలానికి చెందిన కిరణ్ ఆదిలాబాద్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్నాడు. పిట్టలవాడలోని ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్ వాచ్మెన్ సాయి వంశీ పెన్గంగ వద్ద పూజ ఉందని ఉదయం కుటుంబంతో సహా వెళ్లాడు. వారితోపాటు హాస్టల్ విద్యార్థులైన కిరణ్, తరుణ్ కూడా వెళ్లారు. నదీ తీరంలో వారు పూజలు నిర్వహిస్తుండగా, స్నానం కోసం కిరణ్, తరుణ్ నదిలోకి దిగారు. ప్రమాదవశాత్తు ఇరువురు నీటిలో మునిగే క్రమంలో కేకలు వేశారు. సమీపంలో ఉన్న ఓ వ్యక్తి దూకి వారిని కాపాడేందుకు యత్నించాడు. తరుణ్ను ముందుగా ఒడ్డుకు చేర్చగా, కిరణ్ నీటిలో కొట్టుకుపోయాడు. ఎంత వెదికినా ఆచూకీ లభించకపోవడంతో విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. వారు అక్కడికి చేరుకుని రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. చీకటి పడడంతో పోలీసులు గాలింపు చర్యలను నిలిపివేశారు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెల్లడించారు. -
‘మున్నూరు కాపులను మోసగిస్తున్న ప్రభుత్వం’
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మున్నూరు కాపులను తక్కువ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జి గాదె సత్యం అన్నారు. సోమవారం మంచిర్యాలలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా ఉన్న మున్నూరు కాపులను ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం 13.75 లక్షల వరకు ఉన్నట్లు లెక్కలు చూపించడం అన్యాయమని అన్నారు. అన్ని బీసీ కులాల సంఖ్యను చాలా తక్కువ లెక్కల్లో చూపించారని ఆరోపించారు. మున్నూరు కాపుల గణాంకాల వాస్తవాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి నియామకమైన గాదె సత్యంను జిల్లా మున్నూరు కాపు కులబాంధవులు ఘనంగా సన్మానించారు. రేసు కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతికోటపల్లి: రేసుకుక్కల దాడిలో 15గొర్రెలు మృతిచెందాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి నక్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధి బ్రహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన కొండ మల్లయ్య తన గొర్రెలను అటవీ ప్రాంతంలో మేతకు తీసుకెళ్లగా రేసుకుక్కలు ఒక్కసారిగా గుంపుతో వచ్చి దాడి చేశాయి. గొర్రెలు అటవీ ప్రాంతంలో చెల్లాచెదురుగా వెళ్లిపోయాయి. కొన్ని గొర్రెలు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోగా, మిగిలిన వాటిని కాపరి గ్రామంలోకి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం దాడి చేసిన స్థలానికి కాపరులతో వెళ్లి పరిశీలించగా 15 గొర్రెలు మృతిచెంది కనిపించాయి. అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. -
శతాధిక వృద్ధురాలి నేత్రదానం
బెల్లంపల్లి: బెల్లంపల్లికి చెందిన ఓ శతాధిక వృద్ధురాలి రెండు కళ్లను సోమవారం ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. పట్టణంలో ని హన్మాన్బస్తీకి చెందిన డోలి నర్సమ్మ(103) అనా రోగ్యంతో మృతిచెందింది. జనహిత సేవా సమితి బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఆడేపు సతీష్, సభ్యుడు డోలి సుకుమార్ మృతురాలి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో నేత్రదానానికి ముందుకొచ్చా రు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బంది ప్రదీప్ ఆమె కళ్లను సేకరించి తీసుకెళ్లారు. మృతురాలి కొడుకులు డోలి దశరథ్, విజయ్కుమార్, కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. -
పురాతన ఆలయాలను పునర్నిర్మిద్దాం
వేమనపల్లి: పురాతన ఆలయాలను పునర్నిర్మించి ఆలయ చరిత్రను కాపాడుకుందామని టీటీడీ దేవాలయాల పర్యవేక్షణ అధికారి రామనాథం అన్నారు. సోమవారం మండల కేంద్రానికి సమీపంలోని రాజారం గ్రామంలో కొలువై న దశావతార దేవస్థానం, కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదు వేల ఆలయాలు నిర్మించామని, రాజా రంలో కొలువుదీరిన దశావతార, కాల భైరవ స్వామి దేవతామూర్తుల వద్ద ఆలయ నిర్మాణా నికి కృషి చేస్తామని అన్నారు. ఆలయ పురాతన చరిత్రను సూచించే వివరాలు, ఫొటోలు అందజేయాలని తెలిపారు. సర్పంచులు మళ్లీశ్వరి, సాయికృష్ణ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యుడు సత్యనారాయణ, ధర్మాచార్యులు పరమేశ్వర్, జయప్రద, చంద్రశేఖర్, సభ్యులు అమోల్, మహేష్ పాల్గొన్నారు. -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్లో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఐటీడీ ఏ ఏపీవో వసంత్రావ్ అన్నారు. మండలకేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవా రం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ యా ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆ యన ఆర్టీలు స్వీకరించారు. వాటిని సంబంధి త అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరి ష్కరించేలాచొరవ చూపాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. పోడు భూములకు పట్టాలివ్వాలని ఆందోళనఉట్నూర్రూరల్: ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో సోమవా రం ఆందోళన చేపట్టారు. ఐటీడీఏ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏపీవో వసంత్రావ్కు సమస్యలతో కూ డిన వినతిపత్రం అందజేశారు. ఇందులో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేతావత్ రాందాస్, ప్రధాన కార్యదర్శి జి వెంకటాద్రి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కుటికెల శంకర్, ఉపాధ్యక్షుడు ధర్మం, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు నర్సయ్య, మహిళా సంఘం జి ల్లా అధ్యక్షురాలు సంధ్యారాణి, బాలసాని మల్లేశ్గౌడ్, నాగరావ్, భగవంతరావ్, రవి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనంపై నుంచి పడి మహిళ మృతి
బోథ్: సొనాల మండలంలోని గుట్టపక్కతండా గ్రామానికి చెందిన సైనాబాయి (35) ద్విచక్రవాహనంపై నుంచి పడి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సైనాబాయి తన అల్లుడు మట్ట నందుసింగ్ బైక్పై ఉదయం 6.30 గంటల సమయంలో చేనుకు వెళుతోంది. గంపలు తీసుకుని బైక్పై వెళుతుండగా సొనాల సమీపంలో అవి కదలడంతో ఒక్కసారిగా ఆమె జారి కిందపడింది. తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికుల సాయంతో బోథ్లోని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతిచెందింది. కాగా మృతురాలికి భర్త సదాశివ్, కుమారుడు ఉన్నారు. పనిముట్ల కొరత లేకుండా చూడాలిశ్రీరాంపూర్: గనుల్లో పనిముట్లు, యంత్రాల స్పేర్స్ కొరత లేకుండా చూడాలని శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ తెలిపారు. సోమవారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏరియా పర్చేజ్ అధికారులతో సమీక్షించారు. గనుల్లో యంత్రాల ని ర్వహణకు అవసరమయ్యే పరికరాల కొరత లేకుండా చూడాలన్నారు. నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలంటే యంత్రాలు నిర్ధేశించిన పని గంట లు పని చేయాలని తెలిపారు. ఇందుకోసం యంత్రాల బ్రేక్ డౌన్ అయినప్పుడు జాప్యం జరుగకుండా విడిభాగాలు సమకూర్చాలని, కొనుగోలు టెండ ర్లు, పనులు వేగవంతంగా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జీఎం యన్. సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ రమణారావు, ఏజెంట్లు రవికుమార్, శ్రీధర్, ఓసీపీ పీఓ వెంకటేశ్వ ర్లు, అధికారులు నాగరాజు, రామకృష్ణ, మోహన్, మల్లేశ్, రవీందర్, చంద్రలింగం పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో
దండేపల్లి: వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ముత్యంపేట గ్రామంలో రైతులు సోమవారం రోడ్డెక్కారు. లక్సెట్టిపేట–నిర్మల్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు పోసి రోజులు గడుస్తున్నా మిల్లుల ట్యాగింగ్ రాలేదని, కాంటాలు వేయడం లేదని అన్నారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోళ్లు ప్రాంభించి, ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. రైతుల ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు పలికారు. ఎస్సై తహాసీనొద్దీన్ రైతులు, నాయకులతో మాట్లాడి సమస్యను ఫోన్లో తహసీల్దార్ రోహిత్దేశ్పాండే దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో కాంటాలు ప్రారంభిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్, నాయకులు వెంకటేష్, కిషన్, సురేష్, అనిల్, శ్రీనివాస్, మొండయ్య, గురువయ్య, హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
గోల్డ్ లోన్ బాధితుల ఆందోళన
చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచిలో గోల్డ్ లోన్ బాధితులు సోమవారం ఆందోళన చేపట్టారు. గత ఏడాది బ్యాంకులో చోరీ అయిన బంగారు ఆభరణాలు లభించినా నేటి వరకు బాధితులకు ఇవ్వకపోవడం దారుణమని వా పోయారు. బ్యాంకును సందర్శించిన డీజీఎం విజయ్ కుమార్ సాహు బాధితులతో మాట్లాడారు. బంగారం కోర్టు పరిధిలో ఉందని, రు ణం పొందే సమయంలో బంగారం ధర ఎంత ఉందో ఆ ధర చెల్లిస్తామని తెలిపారు. బాధితులు ముందుకు వస్తే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. బాధితులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం డీజీఎంకు అందజేశారు. ఏజీఎం రితేష్ గుప్తా, మేనేజర్ రాజేష్, బ్యాంకు అధికారులు, గోల్డ్ లోన్ బాధితులు పాల్గొన్నారు. -
శంకుస్థాపన దాటని బ్యూటిఫికేషన్!
మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లోని చెరువులను పునరుద్ధరించడంతో పాటు, బ్యూటిఫికేషన్ చేపట్టేందుకు నిధులు విడుదల చేసింది. ప్రజారోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో నెలన్నర క్రితమే ఆయా చెరువుల్లో పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. చెరువుల పునరుద్ధరణకు వేసవి కాలంలో పనులు చేపడితేనే వర్షాకాలంలోపు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. పనులకు శంకుస్థాపన చేసినా, జిల్లాలోని ఒక్క చెరువు పనులను కూడా ప్రారంభించక పోవడంతో చెరువుల బ్యూటిఫికేషన్ వర్షాకాలంలోపు పూర్తి చేయడం కష్టంగానే ఉంది. పునరుద్ధరణతో ప్రయోజనం పురపాలికల్లో డ్రెయినేజీల నుంచి మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి వెళ్తుండడంతో మురుగు నీటితో నిండిపోయి, గుర్రపు డెక్క, నాచు పెరగడంతో పాటు, చెత్తా చెదారంతో నిండి కంపు కొడుతున్నాయి. చెరువుకు హద్దులుగా కట్టలను ఏర్పాటు చేసిన కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణకు గురవుతున్నాయి. చెరువుల వద్ద కాస్త సేదతీరేందుకు అవకాశం లేకుండా పోయింది. పట్టణ ప్రాంతాల్లోని చెరువులను ప్రజలకు ఆహ్లాదం పంచేలా, వాటిని పునరుద్ధరించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని ఒక్కో చెరువుకు పనులను బట్టి నిధులను విడుదల చేసింది. అందులో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాముని చెరువుకు రూ.1.98 కోట్లు, నస్పూర్ చెరువుకు రూ.3.14 కోట్లు, బెల్లంపల్లి మున్సిపాలిటీలోని జాజికుంట చెరువుకు రూ.1.57 కోట్లు, మందమర్రి మున్సిపాలిటీలోని మందమర్రి చెరువుకు రూ.3.14 కోట్లు, చెన్నూరు మున్సిపాలిటీలోని కుమ్మరి చెరువుకు రూ.1.87 కోట్లు, క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని కుమ్మరికుంటకు రూ.1.98 కోట్లు, లక్సెట్టిపేట్ మున్సిపాలిటీలోని ఇటిక్యాల చెరువుకు రూ.3.14 కోట్ల నిధులు కేటాయించారు. వీటితో చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా తక్షణ చర్యలు చేపడతారు. చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, చెరువు కట్ట నిర్మాణం చేసి, ఫోర్ షోర్ బండ్ పనులు చేపడతారు. చెరువుల్లోకి వర్షపు నీరు మాత్రమే చేరేలా చర్యలు చేపట్టి, పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తారు. జిల్లాలో ఎంపిక చేసిన చెరువులు, అమృత్ 2.0 పథకం కింద మంజూరైన నిధులుమున్సిపాలిటీ/కార్పొరేషన్ ఎంపిక చేసిన చెరువులు నిధులు మంచిర్యాల కార్పొరేషన్ రాముని చెరువు రూ.1.98 కోట్లు నస్పూర్ నస్పూర్ చెరువు రూ.3.14 కోట్లు బెల్లంపల్లి జాజికుంట చెరువు రూ.1.57 కోట్లు మందమర్రి మందమర్రి చెరువు రూ.3.14 కోట్లు చెన్నూర్ కుమ్మరి చెరువు రూ.1.87 కోట్లు క్యాతన్పల్లి కుమ్మరికుంట రూ.1.98 కోట్లు లక్సెట్టిపేట్ ఇటిక్యాల చెరువు రూ.3.14 కోట్లు -
భూసార పరీక్షలకు వేళాయె..!
చెన్నూర్రూరల్: భూసారానికి అనుగుణంగా పంటలను సాగు చేయించి, నాణ్యమైన అధిక దిగుబడులను సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూసార పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురి చొప్పున వలంటీర్లను నియమిస్తోంది. చెన్నూర్ డివిజన్లోని చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాలకు సుమారుగా 310 మందిని ఎంపిక చేశారు. వీరికి త్వరలో వ్యవసాయ శాస్త్రవేత్తలచే శిక్షణ ఇచ్చి పంట పొలాల్లోని మట్టిని సేకరించి ఆదిలాబాద్లోని భూసార పరీక్ష కేంద్రానికి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భూసార పరీక్షలతో మేలు.. భూసార పరీక్షల వల్ల భూముల్లోని పోషకాల మోతాదు తెలుస్తుంది. పోషకాలు తక్కువగా ఉంటే వ్యవసాయాధికారులు వాటిని పెంచడానికి చర్యలు తీసుకుంటారు. నత్రజని, భాస్వరం, పొటాషియం, ఐరన్, జింక్, బోరాన్, మెగ్నీషియం తదితరాల శాతాన్ని గుర్తిస్తారు. వీటికి అనుగుణంగా ఎలాంటి పంటలు సాగు చేయాలో వ్యవసాయాధికారులు సూచిస్తారు. ఎరువులను ఎంత మోతాదులో వాడాలో సిఫారసు చేస్తారు. ఫలితంగా ఎరువుల వినియోగం, పెట్టుబడుల ఖర్చులు తగ్గించుకోవచ్చు. సేద్యపు రంగంలో ఆధునిక శాసీ్త్రయ పద్ధతులను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు భూసార పరీక్షల కోసం మట్టినమూనాలను సేకరించేందుకు వలంటీర్లు, ఏఈవోలు వ్యవసాయ క్షేత్రాలను ఏవిధంగా ఎంపిక చేసుకోవాలి? ఏవిధంగా సేకరించాలి? అనే అంశాలు, అలాగే పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శిక్షణ ఇస్తారు. సేకరించిన మట్టి నమూనాలను ఆదిలాబాద్లోని భూసార పరీక్ష కేంద్రానికి పంపించి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఫలితాలను రైతులకు తెలియజేయనున్నారు. పరీక్షల ఫలితాల అనంతరం భూసారం ఎంత ఉంది? ఎలాంటి పంటలు సాగు చేయాలి? ఎరువులు ఎంత మోతాదులో వాడాలి. అనేది వ్యవసాయశాఖ అధికారులు రైతులకు తెలియజేస్తారు. -
● కొనుగోలు కేంద్రాలు ప్రారంభాలతోనే సరి ● తూకం వేయని ధాన్యం.. రైతుల ఎదురు చూపులు ● ఉదయం ఎండలు, సాయంత్రం మబ్బులు.. చిరుజల్లులు
మంచిర్యాలఅగ్రికల్చర్: అట్టహాసంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. వారం రోజులైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు కుప్పల వద్ద తిప్పలు పడుతున్నారు. నాలుగైదు రోజులుగా ఉదయం ఎండ, సాయంత్రం మబ్బులు, అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఎండలో ఆరబోస్తూ.. సాయంత్రం కుప్పలు చేసి కవర్లు కప్పుతున్నారు. భారీ వర్షం కురిస్తే ధాన్యం నేలపాలవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి ధాన్యం దిగుబడి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోశారు. ఈ నెల 13న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం తూకం, మిల్లులకు తరలింపు లేక నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే ప్రారంభించిన కేంద్రాల్లో మిల్లులకు ట్యాగింగ్ లేక, తూకం వేయక, లారీలు రాక ధాన్యం కదలడం లేదు. వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయింది. పూర్తి స్థాయిలో కేంద్రాలు, మిల్లులకు ట్యాగింగ్ చేయలేదు. ఏ కేంద్రం ఏ మిల్లుకు కేటాయిస్తారోనని గందరగోళం నెలకొంది. 58 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జిల్లాలో వివిధ ఏజెన్సీల ద్వారా 313 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటివరకు 58 కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం తరలింపు లేదు. తూకం వేసిన ధాన్యం ట్రక్షీట్ ఎంట్రీ, మి ల్లులకు తరలించి అన్లోడ్, రిసీవింగ్ ఎంట్రీ తదిత ర వివరాలు ట్యాబ్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. కానీ కేంద్రాల కేటాయింపు, మిల్లులకు ట్యాగింగ్లో స్పష్టత రాలేదు. ధాన్యం తరలించకపోవడంతో నిర్వాహకులు రైతుల ధాన్యాన్ని తూకం వేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. తూకం వేసిన ధాన్యం రోజుల తరబడి కేంద్రంలో నిల్వ చేస్తే మిల్లుకు తరలించిన సమయంలో బరువు తగ్గి నష్టపోవాల్సి వస్తుందని, తరుగు పేరుతో మిల్లర్లు కోత విధించే అవకాశం ఉందని నిర్వాహకులు వాపోతున్నారు. లక్ష్యం భారీగా.. సేకరణ ఆలస్యం..జిల్లాలో ఈ యాసంగి 1.22 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 2.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేసి 313 కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నారు. దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో 58 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా క్వింటా ధాన్యం కూడా మిల్లుకు తరలించినట్లు ట్యాబ్ ఎంట్రీ లెక్కలో రాలేదు. జిల్లాలో ధాన్యం సేకరణపై అదనపు కలెక్టర్, పౌరసరఫరాల శాఖ అధికారులను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.


