Mancherial District News
-
మూడు సిలిండర్లు స్వాధీనం
కై లాస్నగర్: సబ్సిడీపై అందించే గృహావసర ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం పట్టణంలోని టీచర్స్కాలనీలోని రోడ్ నంబర్ 16లో గల ఓ ఇంటిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజస్థాన్కు చెందిన ఓ వ్యక్తి బాదంమిల్క్, ఐస్క్రీమ్, వివిధ రకాల స్వీట్ల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. వాటి తయారీకి కమర్షియల్ సిలిండర్లకు బదులుగా వివిధ ఆయిల్ కంపెనీల గృహావసర సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. మూడు ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకుని వాటిని వినియోగిస్తున్న వ్యక్తిపై 6ఏ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాయితీపై అందించే గృహావసర సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థల్లో వినియోగించడం చట్టరీత్యా నేరమని డీటీ మహేశ్ తెలిపారు. తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
దత్తత చట్టబద్ధంగా ఉండాలి
సంతానం లేని వారు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి. చిన్న పిల్లలను అమ్మిన వారిపై, కొన్నవారిపై కేసు నమోదు చేస్తాం. దళారులను నమ్మి పోసవద్దు. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాలదళారులను నమ్మి మోసపోవద్దు దత్తత తీసుకునే వారు దళారులను నమ్మి మోసపోవద్దు. పిల్లలు లేని వారు పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి. సీడబ్ల్యూసీ అధికారులను కలిస్తే వివరాలు అందిస్తారు. సీఏఆర్ఏ కింద దత్తత ఏజెన్సీ కేంద్రాలు పనిచేస్తాయి. దరఖాస్తు చేసుకుంటే చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకునే అవకాశం ఉంది. – రౌఫ్ఖాన్, జిల్లా శిశు సంక్షేమ అధికారి -
లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
గుడిహత్నూర్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్రంగా, పలువురి స్వల్ప గాయాలయ్యాయి. మండల కేంద్రానికి 2 కి.మీ దూరంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎండీకే ట్రావెల్స్ బస్సు కేవలం 18 కి.మీ ప్రయాణం చేసిన తర్వాత తెలంగాణ దాబా వద్దకు చేరుకుంది. బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది. ఆ సమయంలో బస్సు వెనుక బైక్పై వెళ్తున్న మండలంలోని డోంగర్గావ్ చెందిన ఇరువురు యువకులకు గాయాలయ్యాయి. కాగా బస్సులో క్లీనర్ ప్రభుదాస్తోఆటు గిత్తే భరత్, షేక్ ఆతిక్లకు తీవ్రగాయాలు కాగా, పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని హైవే అంబులెన్సులో రిమ్స్కు తరలించి చికిత్స అందజేశారు. కాగా ఈ స్లీపర్ బస్సులో సుమారు 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ట్రావెల్స్ డ్రైవర్ మహ్మద్ మహబూబ్ఖాన్ అతివేగంగా నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా
చెన్నూర్: నియోజకవర్గంలో శాశ్వత నీటి కరువు లేకుండా చూస్తానని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. శనివారం కలెక్టర్ కుమార్దీపక్తో కలిసి రూ.1.87కోట్లతో చేపట్టిన చెన్నూర్ కుమ్మరికుంట పునరుజ్జీవ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుమ్మరికుంటను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.100 కోట్లతో చేపట్టిన అమృత్ 2.0 పథకం పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. చెన్నూర్ మున్సిపాలిటీకి తాగునీరు అందించేందుకు రూ.45 కోట్లతో గోదావరి నుంచి లింక్ కనెక్టివిటీకి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మైనార్టీలను పట్టించుకోని బీఆర్ఎస్పదేండ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని మంత్రి వివేక్ ఆరోపించారు. స్థానిక మైనార్టీ ఫంక్షన్హాల్లో కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ముందుగా వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్కుమార్, కమిషనర్ మురళీకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ప్రసాద్, కౌన్సిలర్లు నజీమొద్దీన్, మంత్రి లక్ష్మణ్, అంబటి శంకర్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. -
గంగాపూర్ శివారులో ఉద్రిక్తత
● అటవీ అధికారుల తవ్వకాలను అడ్డగింత ● ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులుచింతలమానెపల్లి: గంగాపూర్ శివారులో అట వీ అధికారులు శనివారం తవ్వకాలు నిర్వహించారు. ఆ స్థలంలో సాగు చేస్తున్న రైతులు తవ్వకాలను అడ్డుకోవడంతో కొంత ఉద్రి క్తత నెలకొంది. గంగాపూర్ నర్సరీ సమీపంలోఅధికారులు సర్వే నిర్వహించగా కొంత స్థలం ఆక్రమణకు గురైనట్లుగా గుర్తించారు. ఆ ప్రాంతంలో కందకాల తవ్వకానికి చర్యలు తీసుకుంటుండగా పలువురు రైతులు అడ్డుకున్నారు. ఈ స్థలం తమకు ప్రభుత్వం కేటా యించిందని, పనులను నిలిపివేయాలని కోరారు. ఈ భూమి అటవీశాఖదని సర్వేలో తేలినట్లుగా అధికారులు తెలుపగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 ఏండ్లకు పైగా భూమిని సాగు చేస్తున్నామని భూమి లో కందకాలు తవ్వడంతో తాము నష్టపోతా మని వాపోయారు. ఈవిషయమై ఎఫ్ఆర్వో సుభాష్ మాట్లాడుతూ ఈ భూమి అటవీ ప్రాంతంలో ఉందని అటవీ పరిధి మేరకు పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆక్రమణలకు గురైన అటవీ ప్రాంతంలో త్వరలో ప్లాంటేషన్ పనులు నిర్వహిస్తామన్నారు. అటవీ అభివృధ్ధి పనుల్లో భాగంగా కందకాలు తవ్వుతున్నట్లు వివరించారు. -
నీటి గుంతలో పడి వృద్ధుడి మృతి
నెన్నెల: మండలంలోని కొనంపేట శివారు చిన్నవాగులో జేసీబీతో తవ్విన నీటి గుంతలో పడి వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కొనంపేటకు చెందిన డోలె బక్కయ్య(63) శుక్రవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లాడు. పొద్దుపోయినక నీటిగుంతలో విగత జీవిగా ఉన్న బక్కయ్యను చూసిన యువకులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిగుంతలో పడి మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి కుమారుడు మల్లయ్య శనివారం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వలస కూలీ దారుణహత్య మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో వలస కూలీ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. సీఐ ప్రమోద్రావు కథనం ప్రకారం.. స్థానిక చిందం శ్రీనివాస్ అనే బిల్డర్ వద్ద మహారాష్ట్రకు చెందిన దీపక్ (35)తోపాటు మరో ఇద్దరు కాంక్రీట్ మిల్లర్ పని చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని కాలేజీరోడ్ వైన్స్ సమీపంలో ఓ ఇంట్లో ముగ్గురు అద్దెకుంటున్నారు. శుక్రవారం పనికి వెళ్లి ఇంటికి వచ్చిన ముగ్గురు మద్యం మత్తులో గొడవపడినట్లు తెలిసింది. మరో ఇద్దరు రాడ్తో దీపక్పై దాడి చేసి పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న దీపక్ను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీపక్తోపాటు ఉన్న మరో ఇద్దరు స్నేహితులు. ఒకరు మహారాష్ట్ర ఐరి రాంపూర్కు చెందిన దీపక్, మరొకరు కాసిపేట మండలం పల్లంగూడ గ్రామానికి సంజీవ్గా గుర్తించారు. ఇద్దరు కనిపించకపోవడంతో వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మద్యానికి బానిసై వృద్ధుడు ఆత్మహత్య
సారంగపూర్: మద్యానికి బానిసై వృద్ధుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వి వరాల ప్రకారం.. మండలంలోని చించోలి(బి) గ్రా మానికి చెందిన పల్లెర్ల పె ద్ద సాయన్న(61) గత కొ ంతకాలం క్రితం అప్పులపాలై ఉన్న ఇల్లు అమ్ముకున్నాడు. గత మూడు నెలలుగా ఎలాంటి పని చేయకుండా ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా మద్యానికి బానిసయ్యాడు. శనివారం స్థానిక కల్లు దుకా ణంలో అధిక మద్యం తాగాడు. ఆ మత్తులో గ్రామశివారు ఆర్టీఓ కార్యాలయం సమీపంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు గుర్తించి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్ వెంటనే ఘటనస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. భార్య నర్సవ్వ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉండగా చిన్నకుమారుడు నిర్మల్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఉరేసుకుని సింగరేణి రిటైర్డ్ కార్మికుడు.. తాండూర్: మండలంలోని తంగళ్లపల్లి గ్రామానికి చెందిన జాడి మొండయ్య(80) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ప్రసాద్ కథనం ప్రకారం.. జాడి మొండయ్య సింగరేణిలో ఉద్యోగ విరమణ చేసిన అనంతరం కుమారుడు పోశం వద్ద ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం పక్షవాతం రావడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. శనివారం బాత్రూం వెళ్లిన మొండయ్య ఎంత సేపటికి బయటకు రాలేదు. తలుపు బద్దలుకొట్టి చూడగా బాత్రూంలో ఉన్న రాడ్కు ఉరేసుకున్నాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బడ్జెట్లో బీసీలకు అన్యాయం
బెల్లంపల్లి: రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీ జనాభా ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్లో తగినంత నిధుల కేటాయింపు జరగలేదని జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ విమర్శించారు. శనివారం బెల్లంపల్లి ఏఎంసీ ఏరియా బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు అత్తెసరు నిధులు కేటాయించడం సరికాదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.12,500 కోట్లు కేటాయించి మోసం చేసిందన్నారు. ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గణేష్గౌడ్, కౌన్సిలర్ దొంగల రాజ్కుమార్, నాయకులు బండారి ప్రవీణ్కుమార్, పాయవేణ మల్లేశ్, మధు తదితరులు పాల్గొన్నారు. నిరాశ మిగిల్చిన బడ్జెట్ జన్నారం: రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గల్ఫ్ కార్మికులకు నిరాశ మిగిల్చిందని తె లంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమన్న ఆరోపించారు. మండలకేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం నిధి, గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తాజా బడ్జెట్లో గల్ఫ్ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో మండల అధ్యక్షుడు తిరుపతి, ప్రధాన కార్యదర్శి దుమల్ల ఎల్లయ్య (రెడ్డి), ఉపాధ్యక్షులు ప్రశాంత్, జన్నారం టౌన్ అధ్యక్షుడు రాజేష్, కోశాధికారి అంజయ్య పాల్గొన్నారు. -
యాపలగూడ టూ కలెక్టరేట్
పెంబి: తమ గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలని మండలంలోని యాపలగూడ గ్రామస్తులు కలెక్టరేట్కు శనివారం పాదయాత్రగా బయల్దేరారు. కడెం వాగు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రను సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. రాష్ట్ర కార్యదర్శి బండారి రవికుమార్ ప్రారంభించారు. రెండు రోజుల్లో నిర్మల్కు చేరుకుంటుందని తెలిపారు. గిరిజనుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. మారుమూల పెంబి మండలంలోని 15 గ్రామాలకు రోడ్డు, తాగునీరు, కరెంట్ సౌకర్యం లేవని తెలిపారు. ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు, ప్రజాప్రతినిధులు తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శించారు. దోత్తి, కడెం వాగులపై, పస్పుల వాగుపై వంతెనలు నిర్మించినా వరద దాటికి కొట్టుకుపోయాయన్నారు. మూడేళ్లయినా కొత్తవి నిర్మించడం లేదని తెలిపారు. పుల్గంపాండ్రి నుంచి సిరిచెల్మ వరకు రోడ్డు నిర్మాణం చేపడితే మండల ప్రజలకు ఆదిలాబాద్కు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. రాష్ట్రకమిటీ సభ్యులు ఉడత రవీందర్, పూసం సచిన్, జిల్లా కార్యదర్శి గౌతంకృష్ణ, సీపీఎం జిల్లాకార్యదర్శి నూతన్కుమార్, బొమ్మెన సురేశ్, వ సుధ, జిల్లాకమిటీ సభ్యులు తోడసం శంభు, కామా క్షి, నాగెల్లి, నర్సయ్య, ఆదివాసీలు పాల్గొన్నారు. పాదయాత్రగా బయల్దేరిన గిరిజనులు, నాయకులు -
పిల్లల కిడ్నాప్..అమ్మకం!
మంచిర్యాలక్రైం: అభం..శుభం.. తెలియని పిల్లలను తల్లి పొత్తిళ్ల నుంచి దూరం చేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఎంతకై నా తెగిస్తున్నారు. తల్లిదండ్రుల పేదరికాన్ని ఆసరాగా చేసుకొని వారికి మాయమాటలు చెప్పి ఎంతో కొంత ముట్టజెప్పి కొనుగోలు చేస్తున్నారు. అలాగే రైల్వే స్టేషన్, ఫుట్పాత్ల వద్ద చిన్నారులను కిడ్నాప్ చేసి సంతానం లేని వారికి విక్రయిస్తున్నారు. ఇటీవల లక్సెట్టిపేట, హన్మకొండ జిల్లా కాజిపేట పోలీసులు చిన్నపిల్లలను విక్రయిస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ చేసిన ఘటనలో జిల్లాకు చెందిన మూడు కుటుంబాలు దళారులు చేతిలో మోసపోయి చిక్కుల్లో పడిన ఘటనలు ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. అల్లారి ముద్దుగా పెంచుకున్న చిన్నారులను శిశుగృహాంలోకి తరలించి పైగా వీరిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలించడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఒకరి ఆశ.. మరొకరికి సంపాదనసంతానం కోసం ఏళ్ల తరబడి వేచిచూసి చివరికి దత్తత మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అమాయకులను ఆసరాగా చేసుకుని దళారులు మాయమాటలు చెప్పి చిన్నారులను అక్రమంగా విక్రయిస్తున్నారు. సంతాన లేమితో బాధపడుతున్న వారికి ఏ తల్లి కన్నబిడ్డనో ఎత్తుకొచ్చి విక్రయిస్తూ అడ్డదారిలో లక్షలు సంపాదిస్తున్న ముఠాలు ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నాయి. విక్రయించినవారితోపాటు కొనుగోలు చేసి వారి కుటుంబాలు కొద్ది రోజుల్లోనే వారి అనందం ఆవిరైంది. చిన్న పిల్లలను విక్రయిస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడగా కేసు నమోదు చేశారు. దళారుల వద్ద దత్తత తీసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు ఎవరో తెలియక పోవడంతో శిశుసంక్షేమశాఖ సంరక్షణలో ఉంచారు. తెలియక దళారుల చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని న్యాయం చేయాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అక్రమ రవాణా గుట్టురట్టుమంచిర్యాల, రామగుండం, కాజీపేట రైల్వేస్టేషన్ల వద్ద ఫుట్పాత్పై తల్లిదండ్రులతో నిద్రిస్తున్న పిల్లల్ని ఎత్తుకొచ్చి సంతానం లేనివారిని విక్రయిస్తున్న ముఠాను కాజీపేట పోలీసులు గత జనవరి 9న గుట్టురట్టు చేశారు. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్కు చెందిన కొడుపాక నరేశ్, వల్లెపు యాదగిరితోపాటు మరో మహిళ ఒక ముఠాగా ఏర్పడ్డారు. నరేశ్ కాజీపేట రైల్వేస్టేషన్లో గతేడాది డిసెంబర్ 28న ఫుట్పాత్పై నిద్రిస్తున్న కన్నానాయక్ కుమారుడు మల్లన్న(5 నెలలు)ను ఎత్తుకెళ్లాడు. తండ్రి ఫిర్యాదుతో నరేశ్ గుట్టు రట్టయింది. నరేశ్ ముఠా.. మంచిర్యాల, జన్నారం, సీసీసీ, జగిత్యాల ప్రాంతాల్లో చిన్నారుల విక్రయించినట్లు ఒప్పుకుంది. లక్సెటిపేట పోలీసులు జిల్లాకు చెందిన మరో ముఠా సీసీసీ నస్పూర్ తీగల్పహాడ్కు చెందిన విజయలక్ష్మి, లక్సెట్టిపేట మండలం సూరారానికి చెందిన స్వరూపను గుర్తించారు. గతంలో విజయలక్ష్మిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారంట్ మీద తీసుకువచ్చి జనవరి 23న రిమాండ్ తరలించారు. స్వరూప, విజయలక్ష్మికి చెందిన ముఠా లక్సెట్టిపేట మండలం మోదెలకు చెందిన కుటుంబానికి మూడేళ్ల చిన్నారిని విక్రయించారని సమాచారంతో విచారణ చేపట్టారు. స్వరూప, విజయలక్ష్మి..రాష్ట్రవ్యాప్తంగా పసి పిల్లల అక్రమ రవాణా చేసినట్లు వెలుగులోకి రావడం గమనార్హం.దత్తత చట్టబద్ధత ఇలా..దత్తత తీసుకునే దంపతుల వయసు, దత్తత ఎందుకు తీసుకుంటున్నారో ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. కేరింగ్స్ పోర్టల్లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు పరిశీలన తర్వాత జిల్లా శిశు సంక్షేమ శాఖ, పి ల్లల సంరక్షణ కమిటీ 60 రోజుల్లో పోర్టల్లో నమోదు చేస్తుంది. సీరియల్ నంబర్ ఆధారంగా చిన్నారులను ఎంపిక చేసుకునే ఆవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నాక ఏడాది నుంచి మూడేళ్ల గడువు పట్టే అవకాశం ఉంటుంది. హిందు మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకా రం బంధువుల పిల్లలను దత్తత తీసుకోవా లంటే సెంట్రల్ అడప్షన్ రిసోర్స్ అథారిటీ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ ముఠా ఈజీమనీకి అలవాటుపడి సంతానం లేనివారిని, పిల్లల్ని కని పెంచే స్థోమత లేని వారిని టార్గెట్ చేస్తోంది. రైల్వేస్టేషన్లు, పట్టణ కేంద్రాల్లోని ఫుట్పాత్లపై రాత్రి నిద్రిస్తున్న చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నాయి. పాపకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు, బాబు అయితే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు విక్రయించేలా ఒప్పందం ముందుగానే దళారులు మంతనాలు జరుపుకుంటారు. మాకే అనాథ ఆశ్రమం ఉంది అందులో నుంచి తెచ్చి ఇస్తామని, ఆన్లైన్ ద్వారా పాప దొరకడం ఆలస్యమవుతోందని మాయమాటలు చెప్పి బోల్తా కొట్టిస్తారు. నకిలీ ఐడీ ప్రూఫ్ చూపించి నమ్మించి మోసాలకు ఽపాల్పడ్డారు. -
గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు
నార్నూర్: జొన్న పంట మధ్యలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ మాడవి ప్రసాద్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్లో శనివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. మండలంలోని మాలేపూర్ గ్రామానికి చెందిన మేర్ట్కర్ బాలాజీ తన పంటలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం రాత్రి రెవెన్యూ అధికారులతో కలిసి దాడి చేసి 24 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.2.40 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక బృందంతో గాలించి అదుపులో తీసుకున్నట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న ఎస్సై శ్రీసాయి, సిబ్బందిని సీఐ అభినందించారు. -
నాడు తండ్రి..నేడు కొడుకు
జైపూర్: నాడు తండ్రి, నేడు కొ డుకు లారీ రూపంలో మృత్యు వు కబళించింది.ఊహించని ప్ర మాదం ఆ కుటుంబలో తీరని విషాదం మిగిల్చింది. పదేళ్ల క్రితం తండ్రిని లారీ ప్రమాదంలో మృతిచెందగా, ఇప్పుడు కుమారుడి బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో మరణించాడు. జైపూర్ మండలం టేకుమట్ల వాగు బ్రిడ్జి వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. స్థానికులు, బంధవులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన లక్ష్మి–మల్లేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నవాడు పోరడ్ల సాయికుమార్(23) హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో మెడికల్ రిప్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది పండుగ కోస ం ఇంటికి వచ్చిన ఆయన ఇక్కడే రెండ్రోజులుగా ఉన్నాడు. తన అమ్మమ్మ స్వగ్రామం జైపూర్ మండలం కుందారం. తన చిన్ననాటి స్నేహితుడి ఇంట్లో శనివారం రంజాన్ వేడుకలకు హాజరయ్యేందుకు బైక్పై వచ్చి తిరిగివెళ్తున్నాడు. ఇందారం నుంచి హైవే రోడ్డుకు మట్టి లోడుతో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సాయికుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. కొడుకు మృతి వార్త తెలియగానే తల్లి గుండెపగిలేలా రోదించింది. లారీ అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుందని బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారమివ్వాలని బంధువులు డిమాండ్ చేశారు. ఘటనస్థలం వద్ద మృతదేహంతో రాత్రివరకు రా స్తారోకో చేపట్టారు. హైవేరోడ్డు పనులు చేపడుతున్న కంపెనీతో కుటుంబీ కులు రాత్రివరకు చర్చలు జరిపారు. ఈమేరకు కే సు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. -
తలంబ్రాలపై అవగాహన
మంచిర్యాలఅర్బన్: వివాహాలు, గృహప్రవేశాలు, పుట్టినరోజు వేడుకలు తదితర శుభకా ర్యాల్లో రాములోరి తలంబ్రాలు వాడటం శు భప్రదమని ఆర్టీసీ మంచిర్యాల డీఎం శ్రీనివా సులు పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల బస్టాండ్లో రాములోరి తలంబ్రాల పంపిణీ పై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాచలంలోని సీతారాముల కల్యాణ తలంబ్రాలు అత్యంత విశిష్టమైనవని చెప్పారు. రాములోరి తలంబ్రాలను భక్తులకు చేరవేసేందుకు కార్గో ద్వారా ముందుస్తు బుకింగ్కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు మంచిర్యాల కార్గో సెంటర్ను సంప్రదించాలని సూచించారు. అసిస్టెంట్ డిపో మేనేజర్ శ్రీలత, ట్రాఫిక్ సూపర్వైజర్లు వెంకటేశ్వర్లు, మాధవి, భారతి తదితరులున్నారు. -
‘సింగరేణి పరిరక్షణ ఏఐటీయూసీ లక్ష్యం’
బెల్లంపల్లి: సింగరేణిని కాపాడుకోవడం ప్రధాన లక్ష్యమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణ శంకర్ అన్నారు. భారత కమ్యూనిస్టుపార్టీ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవ్ సింగరేణి బస్సుజాత శనివారం రాత్రి బె ల్లంపల్లికి చేరింది. బీఆర్ అంబేడ్కర్(కాంటా) చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. ఈ నెల 30న కొత్తగూడెంలో నిర్వహించనున్న ము గింపు సభను విజయవంతం చేయాలని కోరారు. సభలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డెప్యూటీ కార్యదర్శి వైవీరావు, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఓట్ల కోసం అభివృద్ధిని ఆపం’
మంచిర్యాలటౌన్: ఓట్లు నష్టపోతామని అభివృద్ధిని ఆపలేమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు పేర్కొన్నారు. నగరంలోని మా ర్కెట్ ఏరియాలో రోడ్డు వెడల్పు పనుల్లో భా గంగా ఆక్రమణల కూల్చివేతలను శనివారం పరిశీలించారు. హిందూ పండుగల నేపథ్యంలోనే రాజకీయ కక్షతోనే మార్కెట్లో కూల్చివేతలు చేపడుతున్నట్లు ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న ఆరోపణలు ఖండించారు. రూ.78కోట్లతో పూర్తిస్థాయిలో రోడ్ల వెడల్పు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ వి ద్యుత్ కనెక్షన్ పనులు చేపడుతున్నట్లు తెలిపా రు. రోడ్డు వెడల్పు పనులతో గతంతో పోలిస్తే వ్యాపారం మరింత పెరిగిందని, జీఎస్టీ లెక్క లే ఇందుకు నిదర్శనమని తెలిపారు. మంచిర్యాల ఫైర్స్టేషన్ ఉన్న భూమి ప్రభుత్వానికి సంబంధించిందని, ఆరు ఫైరింజన్లను అందుబాటులో ఉంచేందుకే నస్పూరు లేదా గుడిపేట్కు దానిని తరలించాలని చూస్తున్నామని పేర్కొన్నారు. ఫైర్స్టేషన్ స్థలం ఫారెస్ట్ డిపార్టుమెంట్కు ఇచ్చి, ప్రస్తుత ఫారెస్ట్ కార్యాలయమున్న చోట కార్పొరేషన్ షాపింగ్ కాంప్లె క్స్ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నట్లు తెలి పారు. ప్రభుత్వ భూములు తాను స్వాధీనం చేసుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. -
పార్టీ సిద్ధాంతాలపై అవగాహన ఉండాలి
చెన్నూర్: బీజేపీ సిద్ధాంతాలపై ప్రతీ కార్యకర్త కు అవగాహన ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షు డు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ సూచించారు. స్థానిక ఫంక్షన్హాల్లో శనివారం రాత్రి కోటపల్లి, వేమనపల్లి మండలాల బూత్స్థాయి అధ్యక్షులకు ఏర్పాటు చేసిన ఒక్కరోజు శిక్షణ తరగతులను ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఇస్తున్న శిక్షణ తరగతుల్లో భాగంగా చెన్నూర్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, కార్యదర్శి రత్న లక్ష్మీనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు పట్టి కృష్ణ, చెన్నూర్ పట్టణాధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు. -
మెరుగ్గానే ఉపాధిహామీ
గ్రామీణులకు పని కల్పించే ఉపాధిహామీ పథకంలో కూలీల పని దినాలు నమోదు మెరుగ్గానే ఉంది. రాష్ట్రంలో పలు జిల్లాలతో పోలిస్తే అధికంగా ఉంది. గతేడాది వెల్లడించిన సామాజిక ఆర్థిక సర్వేతో పరిశీలిస్తే 89.2శాతం అత్యధికంగా ఉండగా, ఈసారి అంతకంటే మెరుగ్గానే నాలుగు జిల్లాలు నమోదయ్యాయి.ఉపాధి కూలీ పని దినాలు (లక్షల్లో..)జిల్లా లక్ష్యం నమోదు సాధించిన శాతం ఆదిలాబాద్ 44.8 41.2 92.00 ఆసిఫాబాద్ 28.3 25.1 91.80 మంచిర్యాల 21.0 18.8 89.40 నిర్మల్ 32.0 28.0 87.40 -
ఈద్ ముబారక్
జైపూర్: ఇందారంలో సర్పంచ్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి వివేక్వెంకటస్వామిమంచిర్యాలఅర్బన్/జైపూర్: జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. నెలపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాసదీక్షలు చేసి శనివారం ఉదయం నుంచే మంచిర్యాల బస్టాండ్, ఆండాళమ్మ కాలనీ వద్ద గల ఈద్గాలు, ఆయా ప్రాంతాల్లోని మసీదులకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు సందేశమిచ్చారు. అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు తదితరులు ఈద్గాల వద్దకు చేరుకుని ముస్లింలను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. జైపూర్ మండల కేంద్రంతోపాటు ఇందారం, టేకుమట్ల తదితర గ్రామాల్లోని మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి ఇందారం సర్పంచ్ ఎండీ ఫయాజొద్దీన్ ఇంట్లో నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు -
వ్యక్తిగతంగా అధిక విస్తీర్ణంలో..
1,33,051వ్యవసాయ భూములు, వ్యక్తిగతంగా లేదా ఉమ్మడి, సంస్థల వారీగా ఉన్న సాగులో యూనిట్లుగా ఉన్న పరిధిని పరిశీలిస్తే ఏజెన్సీ అధికంగా ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో వ్యక్తుల చేతులో అధిక మొత్తంలో భూములున్నాయి. మొత్తంగా వ్యక్తిగత, ఉమ్మడి, సంస్థల పరిధిలో భూమిని చూసినప్పుడు రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లా ముందువరుసలో ఉంది. 1,85,262.041,84,8961,61,314.381,16,4781,52,964.561,65,277 -
ఇంటర్లో ‘మధ్యాహ్న’ం ఊరట
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో విద్యార్థుల ఆకలి తీరనుంది. మధ్యాహ్న భోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం 2026–27 నుంచి అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. కళాశాలలు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఉన్నాయి. దీంతో దూర ప్రాంత విద్యార్థులు ఉదయాన్నే వస్తుండడంతో భోజ నం తెచ్చుకునే పరిస్థితి ఉండదు. ఆకలితో తరగతులకు హాజరు కాలేక మధ్యాహ్నం ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో డ్రాపౌట్లు పెరిగిపోవడం, విద్యార్థుల హాజరు శాతం తగ్గడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విద్యార్థులకు ఊరట కలుగనుంది. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొదటి సంవత్సరం 2,433, రెండో సంవత్సరం 1,676మంది విద్యార్థులు ఉన్నారు. ఐదేళ్లుగా కళాశాలల్లో మధ్యాహ్న భోజనంపై పాలకులు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు కానుండడంతో విద్యార్థుల ఆకలి తీరి కళాశాలల్లో సంఖ్యతో పాటు హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది. సీఎం చిత్రపటానికి పాలాభిషేకంప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం విస్తరించడంపై ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం (జీజేఎల్ఏ) హర్షం వ్యక్తం చేసింది. శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్షులు విజిత్కుమార్, ఆసిఫ్, జిల్లా ఇంటర్ విద్యాధికారి అంజయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జన గణన విధులు సమర్థవంతంగా నిర్విహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జన గణన అధికారులు, సిబ్బందికి నిర్వహించిన కార్యక్రమంలో సీపీవో, జన గణన అధికారి పాపయ్య, అదనపు జనగణన అధికారి రాజేందర్తో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యాప్ ద్వారా జనగణన చేయాలని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా జనగణనను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో చేపడుతున్నట్లు తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు జన గణనలో భాగంగా ఇళ్ల గణన సైతం కొనసాగుతుందని, కుటుంబాల వివరాలు పూర్తిగా నమోదు చేయాలని అన్నారు. పనులు పూర్తి చేయాలి నెన్నెల: విద్యాలయాల్లోని భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కస్తూరిబా, నెన్నెల హైస్కూల్, చిత్తాపూర్ ఆశ్రమ పాఠశాలను సందర్శించి పనులను పరిశీలించారు. నెన్నెల జిల్లా పరిషత్ పాఠశాలలో మరుగుదొడ్లను వారంలోగా ఉపయోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ తనిఖీ చేశారు. ఎంపీడీఓ అబ్దుల్హై, ఎంపీఓ శ్రీనివాస్, సర్పంచ్ ఇబ్రహీం, కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు. -
సంరక్షిస్తేనే మనుగడ
జన్నారం: పర్యావరణం, అడవులు, వన్యప్రాణులు సంరక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. పచ్చదనంతోనే పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అడవిపై గొడ్డలివేటు ఈప్రక్రియకు ఆటంకం కలిగిస్తోంది. నేడు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. వన్యప్రాణుల కలయికకు నిలయంఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న కవ్వాల్ టైగర్ రిజర్వ్ విభిన్న జీవవైవిధ్యానికి నిలయంగా మారుతుంది. సుమారు 2,015 చదరపు కి.మీ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న కవ్వాల్ అడవి, అ రుదైన వృక్ష సంపద, వన్యప్రాణులకు నిలయం. ఇ క్కడి టేకు అడవులు రాష్ట్రంలోనే నాణ్యమైనవిగా పే రుగాంచాయి. 2012లో కవ్వాల్ అభయారణ్యాన్ని కేంద్రప్రభుత్వం ’టైగర్ రిజర్వ్’గా ప్రకటించింది. ఇక్కడ కేవలం పులులే కాకుండా చిరుత, జింకలు, సాంబార్, అడవి దున్నలు, ఎలుగుబంట్లు అడవి పందులు తదితర వన్యప్రాణులు, సరిసృపాలు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఇటీవల నిర్వహించిన పక్షుల గణనలో ఇక్కడ వందలాది జాతుల పక్షులు, విదేశీ వలస పక్షులు సందడి చేయడం విశేషం. జీవవైవిధ్యంలో ముఖ్యపాత్రఅడవులు భూమికి ఊపిరితిత్తులు లాంటివి. కార్బన్ డై ఆకై ్సడ్ను తీసుకుని స్వచ్ఛమైన ప్రాణవాయువుని అందిస్తుంది. మనిషి మనుగడకు దోహదపడే అడవులు జీవవైవిధ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పక్షులు, జంతువులు, వివిధ రకాల కీటకాలను అ వాసాలుగా మారిన అడవులు అంతరించిపోతే అనర్థాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. పిచుకలు అంతరించిపోవడం వల్ల మిడుతలు వచ్చినట్లు, కరోనా లాంటి కొత్త వైరస్లు పుట్టుకొస్తాయి. ప్రాణకోటికి అవాసంగా ఉన్న అడవుల రక్షణ అత్యంత అవసరం. పెరిగిన అడవుల శాతంగతంతో పోలిస్తే కవ్వాల్ టైగర్జోన్ ప్రాంతంలో అడవుల శాతం పెరిగాయి. రాష్ట్రం ఏర్పడక ముందు పోడు సాగుకు, స్మగ్లింగ్ కోసం అడవులు నరికివేతకు గురయ్యాయి. దీంతో అడవుల శాతం తగ్గుతూ వచ్చింది. 2020 ముందు 21 శాతానికి పడిపోయింది. రాష్ట్రం ఏర్పాటు నుంచి ప్రస్తుతం 21 నుంచి 33 శాతానికి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న స్మగ్లింగ్!గతంతో పోలిస్తే కవ్వాల్ టైగర్జోన్లోని పలు ప్రాంతాల్లో స్మగ్లింగ్ పెరిగినట్లు తెలుస్తోంది. జన్నారం అటవీ డివిజన్లో ఆరు నెలల్లో సుమారు రూ.5లక్షల పైగా కలప స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో అధికారులు పలు వాహనాలను పట్టుకున్నారు. -
అంగట్లో అడవి బిడ్డలు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పేదరికం, గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అడవి బిడ్డలను అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొన్ని సామాజిక వర్గాల్లో ఆర్థికంగా ఉన్నా పెళ్లి కాని యువకుల కోసం ఇక్కడి అమ్మాయిలను తరలిస్తున్నారు. ఈ దందాలో మధ్యవర్తులు కీలకంగా మారుతున్నారు. రెండు రోజుల క్రితం బెజ్జూరు మండలానికి చెందిన ఇద్దరు అమ్మాయిలను పని కల్పిస్తామని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి తరలించి పెళ్లి చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇతర రాష్ట్రాలే కాకుండా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన పలు సామాజిక వర్గాల వారు సైతం గిరిజన అమ్మాయిలను పెళ్లిళ్ల పేరుతో డబ్బులు పోసి కొనుక్కుంటున్నారు. ఇందుకు తల్లిదండ్రులకు ఎంతో కొంత ఎదురిస్తూ వివాహాలు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు పెళ్లిళ్లు జరిగాక ఆ కుటుంబాల్లో పరిస్థితులకు తట్టుకోలేక తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. పేదరికమే శాపంనిరుపేద గిరిజన కుటుంబాల్లో అమ్మాయిలు చాలా వరకు పది, ఇంటర్ వరకు చదివి ఆపేస్తున్నారు. వీరితోపాటు ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు ఉన్న వారు, విడాకులు పొందిన, భర్త చనిపోయిన వారిని పెళ్లిళ్ల కోసం మధ్యవర్తులు అమ్మాయిల తల్లిదండ్రులను ఆశ్రయిస్తున్నారు. పెళ్లి ఖర్చులతో సహా కుటుంబీకులకు డబ్బులు ఇస్తూ తమ వైపు తిప్పుకుంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో గత కొన్నేళ్లుగా మహిళలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి ప్రాంతాలకు ఇక్కడి మహిళలతో పెళ్లిళ్లు జరిగాయి. కొన్ని చోట్ల కుటుంబ సభ్యుల ఇష్టంతోనే జరుగుతున్నాయి. గోండి భాషతో సహా మరాఠీ, హిందీ భాషలు మాట్లాడడం సులువు కావడంతో గిరిజన మహిళలను ఉత్తరాదికి పంపుతున్నారు. ఇందులో గ్రామంలో ఉన్న మధ్యవర్తులు, పలు రాష్ట్రాల్లోని మధ్యవర్తులు వ్యవహారమంతా నడుపుతున్నారు. ఇవి కొన్నిసార్లు మాత్రమే బయటపడుతున్నాయి. పెళ్లిళ్లు, పని కల్పన పేరుతోగతేడాది మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ, స్థానిక మధ్యవరులు కలిసి ఆసిఫాబాద్కు చెందిన ఓ యువతిని మధ్యప్రదేశ్కు పెళ్లి పేరుతో విక్రయించారు. అక్కడ వారి బారి నుంచి తప్పించుకుని బయటపడి ఫిర్యాదు చేయడంతో 9మందిపై కేసు నమోదైంది. దర్యాప్తు జరుగుతోంది మహిళల అక్రమ రవాణా కేసుపై విచారణ జరుగుతోంది. బాధిత మహిళలను సురక్షితంగా తీసుకొచ్చాం. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తాం. –నితిక పంత్, జిల్లా ఎస్పీ -
పండుగల పూట కూల్చివేతలు దారుణం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మార్కెట్ ఏరియాలో పండగల పూట ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డు వెడల్పు పేరిట కూల్చివేతలు చేపట్టడం దారుణమని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ టాకీస్ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా బెల్లంపల్లి చౌరస్తా వరకు రోడ్డు వెడల్పులో భాగంగా చేపడుతున్న కూల్చివేతలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ కక్ష, వ్యాపారులపై కోపంతో కూల్చివేయడం దారుణమని, రాజకీయ ప్రోద్బలంతో మున్సిపల్ అధికారులు కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. మంచిర్యాల నగర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ప్రతి ఏటా పండుగల సమయంలోనే కూల్చివేతలను జరపడం దారుణమని తెలిపారు. -
ప్రకృతికి ప్రోత్సాహం
మంచిర్యాలఅగ్రికల్చర్: రసాయనిక ఎరువుల అధిక వినియోగంతో భూసారం దెబ్బతిని నేల, జీవ వైవిధ్యం, వాతావరణం, ఆహార పంటలు విషతుల్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులను ప్రకృతి వ్యవసాయ వైపు మళ్లించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఇందులో భాగంగా జాతీయ సేంద్రియ వ్యవసాయ పథకం ద్వారా వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్థక, మత్స్యశాఖల సమన్వయంతో సేంద్రియ వ్యవసాయం 2025–26, 27 సంవత్సరాలకు గాను ఎంపిక చేసిన రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి సంవత్సరానికి పెట్టుబడి కింద రూ.4వేల చొప్పున అందిస్తారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, సాగు వ్యయాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే ముఖ్య ఉద్దేశంతో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకం కింద జిల్లాలో 1875 మంది రైతులను ఎంపిక చేశారు. ఐడీ కార్డు, భూముల భూసార పరీక్షలు చేయించి వాటి ఫలితాల కార్డు, సలహాల బుక్, బ్యాగ్, క్యాప్, తదితర వివరాలతో కూడిన కిట్లు అందజేశారు. జిల్లాలో 15 క్లస్టర్లుప్రకృతి వ్యవసాయానికి జిల్లాలో 15 క్లస్టర్లు ఏర్పా టు చేసి.. ఒక్కో క్లస్టర్లో 125మంది రైతులను ఎంపిక చేశారు. ఒక్కొక్కరు ఒక్కో ఎకరం సాగు చేసే లా సహజ వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలను వివరించి ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో క్లస్టర్లోని రైతులకు సలహాలు అందించేందుకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన ప్రగతిశీల మహిళా రైతులు(కృషి సఖీస్) వాలంటీర్లుగా 30మందిని నియమించారు. కమ్యూనిటీ బేస్గా పని చేసేందుకు వేతన ఇతరత్రా కలిపి రూ.5వేలతోపాటు ప్రత్యేక మొబైల్ అందజేసి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తల ద్వారా 16 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. వర్షాకాలానికి ముందే సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు సేంద్రియ వ్యవసాయ ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అనే సూచనలు, సలహాలు, పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. భూసార పరీక్షలకు అనుగుణంగా నేల స్వభావాన్ని బట్టి పంటల సాగు, వాతావరణ మా ర్పులకు అనుగుణంగా పంటలు విత్తుకోవడం, ప్ర కృతిపరంగా లభించే ఎరువులు ఆవుపేడ, ఆవుమూత్రం, బెల్లం, పప్పుల పిండి, రైజోస్పియర్ మట్టి, వేప, కానుగ, బొప్పాయి, జామ ఆకులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వంటి సహాజసిద్ధంగా లభించే వాటితో తయారు చేసే వర్మీ కంపోస్టులు బీజామృతం, జీవామృతం, ఘనామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఆగ్నాస్త్రం, దశపర్ణికషాయం వంటి ద్రా వణాలు, కషాయాల సేంద్రియ ఎరువులను విని యోగిస్తూ ఆనాటి సనాతన పద్ధతిలో పంటల సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. మొదటి విడతలో 1875 ఎకరాలు..జిల్లాలో 3.60లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా 1.58లక్షల మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. గత కొంతకాలంగా పత్తి, వరి పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ పంటలతోపాటు కూరగాయల పంటల దిగుబడి కోసం రైతులు విపరీతంగా రసాయన ఎరువులు వినియోగిస్తుండడంతో పెట్టుబడి పెరిగిపోతోంది. ఖరీఫ్, రబీ సీజన్లో వందలాది మెట్రిక్ టన్నుల ఎరువులు, వందల లీటర్ల చీడపీడల పురుగు మందులు వినియోగిస్తున్నారు. వీటి వల్ల దిగుబడి తగ్గిపోవడం, నేల నిస్సారం అవుతోంది. రసాయనిక మందులు పిచికారీ చేస్తున్న రైతులతోపాటు వినియోగిస్తున్న ప్రజలూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ క్రమంలో రసాయనిక ఎరువుల వినియోగం విడతల వారీగా తగ్గించేందుకు ప్రభుత్వం సహజ సిద్ధ ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తోంది. జిల్లాలో.. -
ఈద్ ముబారక్
నెన్నెల/చెన్నూర్: ముస్లింల రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ముగిసాయి. ఉపవాస దీక్షలు పాటించి శుక్రవారం నాటికి 30రోజులు పూర్తి కావడం, సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో శనివా రం రంజాన్ పండుగ నిర్వహణకు సిద్ధమయ్యారు. రంజాన్ మాసం అనంతరం షవ్వాల్ మాసం మొదటి రోజు నిర్వహించే పండుగ ఈద్–ఉల్–ఫితర్ను అతి పవిత్రమైనదిగా భావిస్తారు. పండుగ సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇందుకోసం జిల్లాలోని మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇస్లాం సిద్ధాంతాల్లో జకాత్ నాలుగోది. జకాత్ అంటే దానం. ముస్లింలు ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దానిలోనే అవసరం ఉన్నవారికి కొంత విధిగా దానం చేయాలని సూచిస్తుంది. నిరుపేదలు సైతం ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలనేది దీని ఉద్దేశం. ఉపవాసాల దీక్షలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు, లోపాలు జరుగుతూనే ఉంటాయి. ఈ లోపాల పరిహారం చేసేదే ఫిత్రాదానం. పండున నాడు ప్రార్థనకు ముందు పేదలకు ఇచ్చే దానమే ఫిత్రా అని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. నిరుపేదలు కూడా ఇతరులతోపాటు మంచి వస్త్రాలు ధరించి మంచి వంటకాలు ఆరగించే వీలు కల్పిస్తుందని తెలిపారు. చెన్నూర్లో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ, కమిషనర్ మురళికృష్ణ తెలిపారు. -
గేదెలపై మొసళ్ల దాడి
జైపూర్: మండలంలోని శివ్వారం ఎర్ర చెరువులో మొసళ్ల కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శివ్వారం గ్రామానికి చెందిన గెల్లు సారక్క, లంబు సంపత్రెడ్డిల గేదెలు గురువారం మేత కోసం శివ్వారం అటవీ ప్రాంతం వెపు వెళ్లాయి. వేసవికాలం కావడం చెరువులో నీరు తాగడానికి అక్కడికి వెళ్లిన రెండు గేదెలను మొసళ్లు నోటితో కరిచి లోపలికి లాక్కెళ్లి దాడి చేసి చంపాయి. శుక్రవారం స్థానికులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. మృతి చెందిన ఒక్కో గేదె విలువ రూ.60 వేల ఉంటుందని బాధితులు తెలిపారు. అటవీ అధికారులు ఘటన స్థలాని కి చేరుకుని పరిశీలించారు. పశువైద్యాధికారులు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఎర్ర చెరువులో మొసళ్ల ఉన్నట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది. ఇప్పటివరకు పశువులు, మనుషులపై మొసళ్లు దాడి చేసిన ఘటన లేదు. ఇదే తొలిసారి జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. -
సింగరేణిలో రాజకీయ జోక్యంతో నష్టం
మందమర్రిరూరల్/కాసిపేట: సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం పెరగడం వల్ల సంస్థకు నష్టంతోపాటు కార్మికుల హక్కులు హరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మండిపడ్డారు. సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవ్ సింగరేణి బస్సు జాత శుక్రవారం మందమర్రి పట్టణంలోని కాసిపేట–1, 2 గనులపై సాగింది. మందమర్రి మార్కెట్ ఏరియాలో నిర్వహించిన బహిరంగ సభలో, గనులపై నాయకులు మాట్లాడారు. సింగరేణికి రావాల్సిన రూ.51 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించడం లేదని తెలిపారు. రాజకీయ జోక్యం తగ్గకపోతే మరో ఐదారేళ్లలో సంస్థ మనుగడ కష్టతరమని, ఉద్యోగులకు వేతనాలు చెల్లించే పరిస్థితి కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బస్సు జాత ఈ నెల 30 కొత్తగూడెంలో ముగుస్తుందని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, ఏఐటీయూసీ డెప్యూటీ జనరల్ సెక్రెటరీలు వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి, బ్రాంచ్ కార్యదర్శులు సత్యనారాయణ, దాగం మల్లేష్, చిప్ప నర్సయ్య, నాయకులు సుదర్శన్, శ్రీనివాస్, మినుగు లక్ష్మీనారాయణ, నాయకులు పాల్గొన్నారు. -
జనసంద్రమైన దీక్షభూమి
నార్నూర్: మండలంలోని కొత్తపల్లి హెచ్ గ్రామంలోని బంజారా జాతీయ దీక్షభూమి జనసంద్రమైంది. సేవాలాల్ మహారాజ్ దీక్ష చేపట్టిన భక్తుల మహాపాదయాత్రను దీక్షగురువు శ్రీ సద్గురు ప్రేమ్సింగ్ మహరాజ్ శుక్రవారం ప్రారంభించారు. రాష్టం నుంచే కాక మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో దీక్షభూమికి తరలివచ్చారు. ఈ సందర్భంగా దీక్షగురు వు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు సేవాలాల్ దీక్ష చేపట్టారని తెలిపారు. ఈనెల 27న శ్రీరామనవమి రోజు మహారాష్ట్రలోని పౌరఘడ్లోని పుణ్యక్షేత్రానికి వారు చేరుకుని దీక్ష విరమిస్తారని తెలిపారు. ఆధ్యాత్మిక భావంతో చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. పాదయాత్రను ప్రారంభిస్తున్న ప్రేమ్సింగ్ మహరాజ్ యాత్రలో భక్తులు -
రేషన్ బియ్యం పట్టివేత
నస్పూర్: నగర పరిధిలోని తోళ్లవాగు సమీపంలో శుక్రవారం పోలీసులు తనిఖీ నిర్వహించారు. మంచిర్యాల నుంచి అక్రమంగా బోలెరో వాహనంలో మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. సుమారు రూ.1.50 లక్షలు విలువ గల 19 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సివిల్ సప్లై డీటీ స్రవంతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని రేషన్ బియ్యాన్ని సీసీసీ నస్పూర్ పోలీసుస్టేషన్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు ఉట్నూర్రూరల్: పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ఉట్నూర్ పోలీసులు శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. మండలంలోని శంకర్తండాకు చెందిన జాదవ్ శ్రీనివాస్ మద్యం తాగి బైక్పై రాగా, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి అతన్ని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్తో ఆవు మృతి మందమర్రిరూరల్: మండలంలోని మామిడిగట్టులో విద్యుత్ షాక్తో ఆవు మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రైతు గుడికందుల భూమయ్యకు చెందిన ఆవు గురువారం ఉదయం మేతకు వెళి్ల్ సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా చెరువు పక్కన ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్కు గురై మృతిచెందింది. పశువైద్యాధికారి తిరుపతి శుక్రవారం ఆవును పరిశీలించారు. దీని విలువ రూ.55 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. రెండురోజుల క్రితం సారంగపల్లిలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్తో గేదె మృతిచెందిన విషయం తెలిసిందే. -
మైన్క్లోజర్ పనులు పరిశీలన
నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 మైన్క్లోజర్ పనులను శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. గనిలో గత కొన్నినెలల క్రితం బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు. గని పూర్తిస్థాయి మూసివేత పనులు కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం మైన్ క్లోజర్ పనులు కొనసాగుతున్నాయా లేదా అని జీఎం తనిఖీ నిర్వహించారు. మైన్ ప్రారంభానికి ముందు ఎలాంటి సాధారణ పరిస్థితులు ఉన్నాయో మూసివేత అనంతరం అలాంటి పరిస్థితి అక్కడ ఏర్పాటు చేయాల్సిందని సిబ్బందికి సూచించారు. గని ప్రాంగణంలో విరివిగా మొక్కలు నాటాలని ఆయన ఆదేశించారు. ఆర్కే 5,6 గ్రూప్ ఏజెంట్ ఎన్.శ్రీధర్ ఉన్నారు. -
24 గంటల్లో చోరీ కేసు ఛేదన
నర్సాపూర్(జి): చోరీ కేసును 24 గంటల్లో ఛేదించినట్లు నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ కిరాణా దుకాణంలో గురువారం రాత్రి నిందితుడు రూ.4వేల నగదు, 8 సిగరెట్ ప్యాకెట్లు ఎత్తుకెళ్లి, 4 సీసీ కెమెరాలు ధ్వంసం చేశాడు. యజమాని శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో బరుకుంట శ్రీరామ్(24) అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.3500 నగదు, 8 సిగరెట్ ప్యాకెట్లు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుడిని నిర్మల్ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై గతంలో మూడు చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ కృష్ణ, ఎస్సై గణేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘ఆరు గ్యారంటీల అమలులో విఫలం’
మంచిర్యాలఅగ్రికల్చర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని ఆరోపించారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, మంచిర్యాల కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోయ్యాల హేమాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, కార్పొరేటర్ కాస్తూరి నాగరాజు, నాయకులు వెంకటేశ్వర్రావు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
ప్రత్యేక నిధుల్లేవ్..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేక నిధులేవీ దక్కలేదు. స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వాటిలో చాలావరకు నిధులు అరకొర కేటాయింపులే జరిగాయి. శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ రూ.3,24,234కోట్లతో ప్రవేశపెట్టగా.. రాష్ట్ర ప్రాయోజిత పథకాలతోనే జిల్లాకు ఊరట దక్కనుంది. నగరాభివృద్ధికి గత బడ్జెట్లో కొత్తగా ఏర్పడిన మంచిర్యాల నగరం, మహబూబ్నగర్, కొత్తగూడెం, పాల్వంచ, మున్సిపాలిటీలకు కలిపి రూ.45 కోట్లు ప్రతిపాదించారు. తాజాగా రూ.90కోట్లు కేటాయించారు. ఈ నిధులు విడుదలైతేనే అభివృద్ధి పనులు జరగనున్నాయి. మరోసారి ప్రతిపాదనలుగత బడ్జెట్ మాదిరి ఈసారి కూడా జిల్లా పరిధిలో అభివృద్ధి, సాగునీటి పథకాలకు నిధులు బడ్జెట్లో అంచనా వేశారు. గోదావరి నది ముంపు రాకుండా ఉండేందుకు రూ.115కోట్లు వెచ్చించారు. గత బడ్జెట్లో రూ.100కోట్లు ప్రతిపాదించారు. నీల్వాయి ప్రాజెక్టుకు రూ.54కోట్లు, ర్యాలీవాగుకు గత బడ్జెట్లో రూ.10కోట్లు ప్రతిపాదించగా, ఈసారి ప్రస్తావన లేదు. మిగతా ప్రాజెక్టులకూ నిధులు లేవు. ప్రస్తుతం డీపీఆర్ దశలో ఉన్న ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.52కోట్లు ప్రతిపాదించారు. నిర్మాణంపై ఇంకా స్పష్టత రాలేదు. బడ్జెట్లో ప్రతిపాదిత దశలోనే ఈ నిధులు ఉంటూ కేటాయింపులు లేక ఖర్చు చేయడం లేదనే వాదనలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలతోనే ఊరటఇక రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.50,713కోట్లు కేటాయించడంతో జిల్లాలోనూ ఈ పథకాలు కొనసాగనున్నాయి. విద్యారంగాన్ని పట్టించుకోలేదు మంచిర్యాలఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 8.2శాతం మాత్రమే విద్యకు కేటాయించింది. ఎన్నికలకు ముందు విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయిస్తానని చెప్పారు. బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించకపోవడం ఏమిటి. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆవునూరి మురళి ఇచ్చిన నివేదికలో విద్యారంగానికి 18శాతం నిధులు కేటాయించాలని చెప్పినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వం బడ్జెట్ను సవరించి విద్యారంగానికి 20శాతం నిధులు కేటాయించాలి. – పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పీఆర్సీ ప్రస్తావన లేదు మంచిర్యాలఅర్బన్: జనాకర్షక పథకాలకే తప్ప ప్రస్తుత వ్యవస్థను బాగు చేసే విధంగా విద్యారంగానికి కేటాయింపులు లేవు. పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం విచారకరం. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ఉచిత వైద్యాన్ని స్వాగతిస్తున్నాం. ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఆహ్వానించదగినదే. విద్యకు 8.22శాతం మాత్రమే నిధులు కేటాయించడం సరికాదు. విద్యకు 15శాతం కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ మూడో బడ్జెట్లో కూడా నెరవేరలేదు. – టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చక్రపాణి, రాజావేణు -
మెడికల్ కాలేజీకి వృద్ధురాలి మృతదేహం
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధుల ఆశ్రమంలో బట్టు సత్తవ్వ(65) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా, మృతదేహాన్ని కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ సభ్యులు మాట్లాడుతూ ఆశ్రమంలోనే 12 ఏళ్లుగా ఉంటున్న సత్తవ్వకు అనారోగ్యం బారినపడిందన్నారు. శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా మృతి చెందిందన్నారు. కూతురు మాధవి, అల్లుడు ప్రభాకర్గౌడ్, తమ్ముడు రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో ఆమె భౌతికకాయాన్ని చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థకు అప్పగించినట్లు తెలిపారు. రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్రెడ్డి, స్టేట్ ఎంసీ మెంబర్ వి. మధుసూదన్రెడ్డి, జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్, కాసర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పిచ్చుకల సంరక్షణ అందరి బాధ్యత
మంచిర్యాలక్రైం: పిచ్చుకల సంరక్షణ అందరి బాధ్యత అని మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్కుమార్ అన్నారు. శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం కలెక్టరేట్ రోడ్డులోని మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పౌరుడు పర్యవరాణానికి నష్టం కలిగించకుండా జీవన విధానం అలవర్చుకోవాలని, ప్రకృతికి మి త్రులుగా మారాలని తెలిపారు. వేసవిలో పిచ్చుకల సంరక్షణ కోసం ఇళ్ల గోడలు, చెట్లపై, వీలైన ప్రదేశాల్లో మట్టి పాత్రల్లో నీళ్లు, గింజలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం వెదురు, కర్ర, గడ్డి, మట్టితో చేసి న పిచ్చుక గూళ్లు, మట్టి పాత్రలు, జొన్న గొ లుసుల ధాన్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ, మిత్ర స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు గుండేటి యోగేశ్వర్, న్యాయవాది నటేశ్వర్, పశు వైద్యాధికారి గుల్లపల్లి శంకర్, వ్యవసాయ శాఖ అధికారి ప్రేమ్కుమార్, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి కిష్టయ్య, ప్రకృతి ప్రేమికుడు అక్కల చంద్రమౌళి, ప్రకృతి మిత్ర సంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
ఆదిలాబాద్రూరల్: దాడి దోపిడీ, హత్యాయత్నం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 17న రాత్రి లాండసాంగ్వి గ్రామానికి చెందిన అశోక్ ఆదిలాబాద్ నుంచి యాపల్గూడ వెళ్లేందుకు పట్టణంలోని వినాయక్ చౌక్లో గల పెట్రోల్ పంపు వద్ద వాహనాల కోసం వేచి చూస్తుండగా దండుగుల వెంకటేష్ లిఫ్ట్ ఇస్తానని వాహనంపై ఎక్కించుకున్నాడు. బంగారిగూడ అనుకుంట గ్రామాలకు మధ్యలో ఉన్న బ్రిడ్జి వద్ద వాహనం ఆపి పెద్ద బండరాయితో తలపై కొట్టడమే కాకుండా కత్తితో మెడపై, చేతిపై గాయపరిచాడు. బాధితుడి వద్ద ఉన్న రూ.1,300, ఫోన్ తీసుకుని పరారయ్యాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. గురువారం అనుకుంట సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి ద్విచక్ర వాహనం, సెల్ఫోన్, కత్తి, రూ.వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై విష్ణువర్ధన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలి’
నస్పూర్: సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని అరికట్టా లని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతా రామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ అన్నారు. గురువారం సేవ్ సింగరేణి జాత కార్యక్రమంలో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గ నుల వద్ద గేట్ మీటింగ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.51 వేల కోట్లను చెల్లించకపోవడం వల్ల నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు. నూతన గనులు ప్రారంభించడం లేదని, నూతన యంత్రాలను కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, మనుగడ కొనసాగాలంటే ప్రభుత్వం వెంటనే రూ.51 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్లో సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కే.వీరభద్రయ్య, వైవీ రావు, సమ్మయ్య, బ్రాంచి కార్యదర్శి ఎస్కే బాజీసైదా, ఉపాధ్యక్షులు కొట్టె కిషన్రావు, సహాయ కా ర్యదర్శి మోత్కూరి కొమురయ్య, నాయకులు చంద్రమోహన్, బుచ్చయ్య, నాగభూషణం పాల్గొన్నారు. గూడెం అర్చకుడికి ఉగాది పురస్కారందండేపల్లి: మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయ అర్చకుడు శ్రీ జక్కాపురం జయస్వామి ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. గురువారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉగాది పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ఈవో శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. -
ట్రిపుల్ఐటీలో సబ్కలెక్టర్ సందర్శన
భైంసా: భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ బాసర ట్రిపుల్ఐటీని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పీయూసీ–1, పీయూసీ–2 విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై చర్చించారు. ప్రస్తుత వార్షిక పరీక్షలు, ఎంసెట్, ఇతర పోటీ పరీక్షల సిద్ధతపై విద్యార్థులను అడిగి తెలుసుకుని, క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. క్యాంపస్లో జరుగుతున్న కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం క్యాంపస్లోని మెస్లు, వంట గదులను పరిశీలించి నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నేరడిగొండ: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన లింగాల సత్యనారాయణ గౌడ్ (65) బుధవారం రాత్రి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసం సమీపంలో నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా ఇచ్చోడ నుంచి నిర్మల్ వైపు అతివేగంగా వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనంతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో 108లో క్షతగాత్రుడిని బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని కుమారుడు లింగాల సంతోష్గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు. -
భోళా శంకరా.. కరుణించు
మొక్కులు చెల్లిస్తున్న భక్తులుదర్శనానికి బారులుతీరిన భక్తులుకుమురంభీం జిల్లా కెరమెరి మండలం పరందోళి పంచాయతీలోని శంకర్లొద్దికి గురువారం సేవాలాల్ భక్తులు, ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భోళా శంకరుడిని దర్శించుకుని పూజలు చేశారు. భోగ్ పెట్టి హోమం పూజ నిర్వహించారు. అనార్పల్లి మాజీ సర్పంచ్ రాథోడ్ అన్నదానం చేయగా వెంకటి తాగునీటి సౌకర్యం కల్పించారు. కాంగ్రెస్ ఆసిఫాబాద్ ఇన్చార్జి శ్యాంనాయక్, బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, భక్తులు రూప్లాల్ రాథోడ్, రాజు, అనార్పల్లి సర్పంచ్ జాటోత్ శారద పాల్గొన్నారు. – కెరమెరి -
బుల్లి పిట్ట.. కనుమరుగైతే ఎట్టా?
జన్నారం: ప్రకృతిలో మనిషితో అత్యంత సన్నిహితంగా ఉండే పక్షి పిచ్చుక. ఒకప్పుడు ఇంటి ముంగిట, పెరట్లోని చెట్లపై కిలకిలరావాలతో సందడి చేసే పిచ్చుకలు నేడు మచ్చుకై నా కనిపించడం లేదు. ఆధునిక జీవనశైలి, సెల్ టవర్ల రేడియేషన్, ఆహార కొరత కారణంగా ఈ చిన్నిప్రాణులు అంతరించిపోయే జీవాల జాబితాలోకి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన నేషనల్ ఫరెవర్ సొసైటీ వ్యవస్థాపకుడు మహమ్మద్ దిలావర్ 2010 మార్చి 20న పిచ్చుకల దినోత్సవం నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటూ వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను పర్యావరణవేత్తలు గుర్తు చేస్తున్నారు. ఎందుకు తగ్గుతున్నాయ్ పరిశోధనల ప్రకారం కొన్ని దశాబ్దాలుగా పిచ్చుకల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీనికి ప్రధాన కారణాలు అనేకంగా ఉన్నాయి. పాతకాలపు పెంకుటిళ్లు తగ్గిపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు.ఆధునిక కాంక్రీటు భవనాలలో పిచ్చుకలు గూళ్లు కట్టుకో వడానికి వీలైన సందులు, గూళ్లు ఉండడం లేదు. సెల్ టవర్ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు పిచ్చుకల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల అవి సంతానోత్పత్తి చేయలేక చనిపోతున్నాయి. కానీ ఈ విషయం సైంటిఫిక్గా నిరూపణ కాలేదని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. పంట పొలాల్లో పురుగుమందుల వాడకం వల్ల పిచ్చుకలకు ప్రధాన ఆహారమైన పురుగులు లభించడం లేదు. రక్షణ ఇలా.. కాంక్రీటు భవనాల వల్ల పిచ్చుకలకు నివాసం కరువైంది. దీనిని అధిగమించేందుకు హన్మకొండ వంటి ప్రాంతాల్లో ఓరుగల్లు వైల్డ్ సొసైటీ సభ్యులు, పర్యావరణ ప్రేమికులు కృత్రిమ గూళ్లను, వరి కంకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం జన్నారం అటవీ డివిజన్లో అప్పటి ఎఫ్డీవో మాధవరావు తన ఇంటి పరిసరాలు, అటవీప్రాంతాల్లో కూడా కృత్రిమగూళ్లను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా జరగాల్సిన అవసరం ఉంది. -
అలరించిన కుస్తీ పోటీలు
కుభీర్: మండల కేంద్రమైన కుభీర్లో గురువారం ఉగాదిని పురస్కరించుకుని విఠలేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. మండలంలోని వస్తాదులతో పాటు మహారాష్ట్రలోని పలు గ్రామాల మల్లయోధులు పోటీల్లో తలపడ్డారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.6,100, ద్వితీయ బహుమతిగా రూ.3 వేలు అందజేశారు. పోటీలను తిలకించడానికి కుభీర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. భళా బాలికలు మహారాష్ట్ర, హరియానాకు చెందిన ముగ్గురు బాలికలు బాలురతో కుస్తీ పోటీల్లో పాల్గొని విజయం సాధించారు. హరియానాకు చెందిన సాయి సుప్రియ, పుసద్కు చెందిన నేహా, నాందేడ్కు చెందిన రోహిని ఒక్కొక్కరు రెండేసి కుస్తీలను గెలుచుకున్నారు. సదరు బాలికలను గ్రామస్తులు అభినందించి ప్రత్యేక కానుకలు అందజేశారు. -
ప్రవాసీల పద్దు ఎంత..?
నిర్మల్ఖిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల సమస్యలు రో జురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, జన్నారం, ఖానాపూర్, భైంసా, ఆదిలాబాద్, ఇచ్చోడ, బోథ్, గుడిహత్నూర్, లక్సెట్టిపేట్, మంచిర్యాల, మందమర్రి, తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది యువకులు దుబాయ్, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్ వంటి ఎడారి దేశాలకు వలస వెళ్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 72 వేలకుపైగా గల్ఫ్ కార్మికులు ఉన్నట్లు అంచనా. ఉపాధి కోసం విదేశాల బాట పట్టిన యువకులు అక్కడ అనేక కష్టాలు ఎదుర్కొంటుండగా, వారి కుటుంబాలు ఇక్కడ ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాన్న డిమాండ్లు మళ్లీ ఊపందుకుంటున్నాయి. జీవితాలు దుర్భరం.. అవగాహన లోపం, ఏజెంట్ల మోసాలకు గురికావడం వల్ల చాలామంది యువకులు విదేశాలకు వెళ్లిన తర్వాత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నైపుణ్య రహిత పనులు, తీవ్ర ఉష్ణోగ్రతలు, భాషా సమస్యలు, తక్కువ వేతనాలు వంటి కారణాలతో వారు శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మృతదేహాల రాకలో ఆలస్యం గల్ఫ్ దేశాల్లో అనారోగ్యం లేదా ప్రమాదాల వల్ల మరణించిన కార్మికుల మృతదేహా లు స్వదేశానికి చేరుకోవడానికి నెలల తరబడి ఆలస్యం కావ డం హృదయ విదా రక పరిస్థితులను సృష్టిస్తోంది. కుటుంబ సభ్యులు కడసారి చూపు కోసం కూడా ఎదురు చూడాల్సి వ స్తోంది. ఈ ప్రక్రియలో గల్ఫ్ కార్మిక సంఘాలు, భా రత రాయబార కార్యాలయాలు సమన్వయం చేస్తు న్నా సమస్యలు పూర్తిగా పరిష్కారం కావడం లేదు. సంక్షేమ పథకాల అవసరం గల్ఫ్ కార్మికులు లేదా అక్కడే మరణించిన వారి కుటుంబాలకు అందుతున్న ఆర్థికసాయం పరిమితంగా ఉందని విమర్శలు ఉన్నాయి. బాధిత కుటుంబాల పిల్లలకు ఉచిత విద్య, ఆరోగ్య భద్రత, పింఛన్ వంటి పథకాలు అమలు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. తిరిగి వచ్చిన కార్మికులకు పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేక పద్దుకు విజ్ఞప్తి చేశాం.. గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు, వారి కుటుంబాల దీనస్థితిని వివరిస్తూ రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు జరపాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర ఎన్నారై అడ్వైజరి కమిటీ వైస్ చైర్మన్ మందా భీమ్రెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్లతో కూడిన బృందంతో మంత్రిని కలిశాం. బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. – స్వదేశ్ పరికిపండ్ల, రాష్ట్ర ఎన్నారై కమిటీ సభ్యుడు, నిర్మల్ ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన రాజుల పోతన్న (51). ఇతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం సౌదీ అరేబియా వెళ్లి ఈ నెల 14న అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. అక్కడికి వెళ్లడానికి, కుటుంబ పోషణకు చేసిన అప్పులు తీరక మరోవైపు కుటుంబ యజమాని విగత జీవిగా మారడం భార్యాపిల్లల్లో తీవ్ర విషాదం నింపింది. కనీసం కడచూపు కోసం తన భర్త మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని భార్య నర్సమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇటీవల రాష్ట్ర ఎన్నారై కమిటీ సభ్యులు నిర్మల్జిల్లాలోని సారంగాపూర్ మండలంలో పలు గ్రామాలను సందర్శించి గల్ఫ్ బాధిత కుటుంబాల పరిస్థితిని అధ్యయనం చేశారు. బాధితుల సమస్యలు, అవసరాలను గుర్తించి సమగ్ర నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘కేంద్రీయ’ ప్రవేశాలకు వేళాయె
బజార్హత్నూర్: కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి బాల వాటిక 1, 1వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 20న ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 2న రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాలలో విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ఆర్మీ, అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలతో పాటు విద్యాహక్కు చట్టం కింద కూడా ఇతర పిల్లలకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. రెండు సెక్షన్లలో 40 మంది విద్యార్థుల చొప్పున 80 మందికి ప్రవేశం కల్పిస్తారు. సీబీఎస్ఈ సిలబస్తో బోధన ఉంటుంది. తరగతి1లో అడ్మిషన్ పొందే విద్యార్థి 2026 మార్చి 31 నాటికి 6 నుంచి 8 ఏళ్ళ వయస్సు కలిగి ఉండాలి. దివ్యాంగులకు రెండేళ్ల వరకు సడలింపు ఉంటుంది. అర్హులైన విద్యార్థులు kvsonline admission.kvs.gov.in లేదా kvssangathan. nic.in వెబ్సైట్ ద్వారా లాగిన్ కావాలి. బాలవాటిక 2, బాలవాటిక 3, రెండో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మొదటి మెరిట్ లిస్ట్ (బాలవాటిక) :ఏప్రిల్ 08, 2026 మొదటి మెరిట్ లిస్టు (1వ తరగతి) :ఏప్రిల్ 09, 2026 రెండో మెరిట్ లిస్టు:ఏప్రిల్ 16, 2026 మూడో మెరిట్ లిస్టు:ఏప్రిల్ 21, 2026 బాలవాటిక 2, 3, రెండోతరగతి, ఆపైన ఎంపిక లిస్ట్:ఏప్రిల్ 13 బాలవాటిక 2, 3, తరగతులు 2, ఆపైన ప్రవేశాలు: ఏప్రిల్ 15 నుంచి 20 ఒకవేళ మొదటి నోటిఫికేషన్లో అనుకున్న సంఖ్యలో రాకపోతే రెండో నోటిఫికేషన్ జారీ చేసి ఏప్రిల్ 22 నుంచి 26 వరకు ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అన్ని తరగతులకు ప్రవేశానికి చివరితేదీ జూన్ 30. -
హైకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి
రామకృష్ణాపూర్: హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం క్యాతనపల్లి మున్సి పల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల్లో ఆమైపె కేసు నమోదైన విషయం తెలిసిందే. బెయిల్ షరతుల్లో భాగంగా గురువారం ఆర్కేపీ పోలీస్స్టేషన్కు హాజరై సంతకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి వివేక్ ప్రజల తీర్పును గౌరవించాలని పేర్కొన్నారు. ఆమె వెంట నాయకులు సుదర్శన్గౌడ్, రామిడి కుమార్ తదితరులు ఉన్నారు. -
జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన బోనగిరి శ్రీహర్షవర్ధన్ జాతీయ స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరు సుధాకర్ తెలిపారు. ఈ నెల 21నుంచి గోవాలో జరిగే జాతీయస్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటార ని తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు గాజు ల ముఖేష్గౌడ్, ఉపాధ్యక్షుడు భాస్కర్ల వా సు, మీనారెడ్డి, ట్రెజరర్ సత్యపాల్రెడ్డి, జా యింట్ సెక్రెటరీ రమేశ్రెడ్డి సన్మానించారు.శ్రీహర్షవర్ధన్ను సన్మానిస్తున్న సభ్యులు -
ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
జైపూర్/రామకృష్ణాపూర్: ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. గురువారం ఆయన జైపూర్ మండలం ఇందారంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తోఫాను జిల్లా కలెక్టర్ కుమార్దీపక్తో కలిసి అందజేశారు. మసీదు ప్రాంగణంలో వాటర్షెడ్డు ప్రారంభించారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఏ జోన్ మసీదులో సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని తెలిపారు. చెన్నూర్లో రూ.50లక్షలతో షాదీఖానా నిర్మిస్తున్నట్లు చెప్పారు. జైపూర్లో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటును విస్తరిస్తూ కొత్తగా 800మెగావాట్ల ప్లాంటును త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగావశాలు కల్పిస్తామని, ఆర్కే–5లో కొత్తగా ఓపెన్కాస్టు మైన్ ఏర్పడుతుందని అన్నారు. చెన్నూర్లో నిర్మిస్తున్న ఏటీసీని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రామకృష్ణాపూర్ పట్టణంలో కబ్రస్తాన్ ఏర్పాటుకు సింగరేణి అధికారులతో మాట్లాడి భూమి కేటాయించామని, త్వరలోనే రూ.30 లక్షలతో పనులు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి, సర్పంచ్ ఫయాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రిక్కుల శ్రీనివాస్రెడ్డి, జిల్లా కోశాధికారి ముక్త శ్రీనివాస్, నాయకులు చల్ల విశ్వంభర్రెడ్డి, అబ్దుల్అజీజ్, పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
గత బడ్జెట్లో ప్రాజెక్టులకు కేటాయింపులు
● గత పద్దులో జిల్లాకు అరకొరగానే నిధులు ● 2026–27 సంవత్సరంలో ప్రాధాన్యత దక్కేనా? ● నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి ‘భట్టి’ప్రాణహిత– చేవెళ్ల : రూ.32.2కోట్లు శ్రీపాద ఎల్లంపల్లి : రూ.349.66కోట్లు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర బడ్జెట్పై ఆశలు నెలకొన్నాయి. జిల్లాలో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పనులకు మోక్షం కలుగాలంటే కేటాయింపులే కీలకం కానున్నాయి. శుక్రవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ క్రమంలో జిల్లాలో అభివృద్ధి, పెండింగ్ పనుల పూర్తిపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర పద్దులో ఏ మేరకు ఏ ప్రాంతానికి ప్రాధాన్యత దక్కుతుందోనని ఎదురు చూస్తున్నారు. విద్య, వైద్యారోగ్యం, రోడ్లు, మౌలిక వసతులకు రూ.కోట్లలో నిధులు రావాల్సి ఉంది. సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరతజిల్లాలో పూర్తి స్థాయిలో సాగునీటి వసతులు లేక ఇప్పటికీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువగా ఆరుతడి పంటలకే పరిమితం అవుతున్నారు. రెండో పంట వేసే పరిస్థితి లేదు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితే మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సాగునీరు అందనుంది. జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులైన ర్యాలీ, నీల్వాయి, గొల్లవాగు, మత్తడివాగు ప్రాజెక్టుల కాలువలు మరమ్మతు చేయాల్సి ఉంది. కాలువలు సరిగా లేక నీరందడం లేదు. గూడెం ఎత్తిపోతలు, కడెం కాలువల ఆధునీకరణ చేయాల్సి ఉంది. చిన్న తరహా నీటి వనరులైన చెరువులకు పూర్తి స్థాయిలో మరమ్మతు చేయాల్సి ఉంది. వానాకాలంలో కురిసిన వర్షాలకు ఐదు వేల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఎకరానికి రూ.10వేల చొప్పున అందాల్సి ఉంది. రైతులకు నిధులు విడుదల కాక నిలిచిపోయాయి. విద్యారంగానికి అవసరంప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నా యి. ఇంకా కిచెన్ షెడ్లు, అదనపు తరగతుల గదుల నిర్మా ణం పూర్తయింది. ఇక నియోజకవర్గానికో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు మూడింటికి శంకుస్థాపన చేశారు. ఈ బడ్జెట్లో నిధులు విడుదలైతే పనులు మొదలు కానున్నాయి. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, వసతిగృహాల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలి ఉంది. కస్తూరిబా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతిగృహాల్లో వసతులు పెంచాల్సి ఉంది. పెండింగ్ బిల్లులకు మోక్షం లేక ఇబ్బందులు పడుతున్నారు. మెరుగైన వైద్యం కోసంవిద్య, వైద్య రంగాలకు కీలకమైన జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, గుడిపేటలో మెడికల్ కాలేజీ దాదాపు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. వైద్య కళాశాలకు అనుబంధంగా జిల్లా కేంద్రంలో కాలేజీ రోడ్లో కొత్త ఆసుపత్రి భవనం నిర్మితమవుతోంది. గోదావరి సమీపంలో మాతాశిశు సంరక్షణ కేంద్రం ప్రస్తుతం సేవలు అందిస్తోంది. ఇక చెన్నూరు, లక్సెట్టిపేట, బెల్లంపల్లిలో సామాజిక ఆసుపత్రులు, 16 మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వీటికి అనుబంధంగా ఉన్న సబ్ సెంటర్లు, పట్టణాల్లో బస్తీ దవాఖానాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకాలు చేపట్టాల్సి ఉంది. ఇక స్పెషలిస్టు వైద్యులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అన్ని స్థాయిల్లో నియామకాలు చేపట్టాల్సి ఉంది. ఎదురుచూస్తున్న పట్టణాలుజిల్లా కేంద్రం మంచిర్యాల నగరంగా అప్గ్రేడ్ అయిన నేపథ్యంలో 60డివిజన్లలో అభివృద్ధి చెందాల్సి ఉంది. నగరంలో మాస్టర్ ప్లాన్ అమలుకు రూ.78కోట్లు అవసరమని గతంలో అంచనా వేశారు. ఇక గోదావరి వరదలు రాకుండా రాళ్లవాగుకు గోడ పనులు మొదలయ్యాయి. ఇక బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్సెట్టిపేటలో కొత్తగా ఎన్నికై న పాలకవర్గాలు నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ పథకంలో తాగునీరు కోసం పనులు సాగుతున్నాయి. వీటితోపాటు రోడ్డు విస్తరణ పనులు, చెరువులు, పార్కుల ఆధునీకరణ, శ్మాశనవాటికలు, సామాజిక భవనాలు పనులు జరుగుతున్నాయి. సమీకృత మార్కెట్లు నిలిచిపోయాయి. ఇవేకాకుండా మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి నిధులు రావాల్సి ఉంది. ఇక గ్రామ పంచాయతీలకు ఇటీవల ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో కొంత మేర పనులు సాగుతున్నాయి. -
కాంగ్రెస్ జంబో కార్యవర్గం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)ని అధిష్టానం పూర్తి స్థాయిలో నియమించింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులకు స్థానం కల్పిస్తూ జంబో కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కాంగ్రెస్ కమిటీలను ప్రకటించారు. తమ తమ నియోజకవర్గాల్లోని నాయకులు, కార్యకర్తల పేర్లను స్థానిక ఎమ్మెల్యేలు సూచించారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి పంపిన పేర్లను తుదిగా ఖరారు చేశారు. గత నవంబర్లో డీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగగా, తాజాగా పూర్తి స్థాయి కమిటీని 50మందితో నియమించారు. వీరిలో ఏడుగురు ఉపాధ్యక్షులు, 15మంది ప్రధాన కార్యదర్శులు, ఓ కోశాధికారి, ముగ్గురు అధికార ప్రతినిధులు, 24మంది కార్యదర్శులు ఉన్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధి నుంచి కాంగ్రెస్ నాయకులు, సీనియర్లకు అవకాశం కల్పించారు. ఆరుగురు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని నాయకులకు చోటు దక్కింది. ఉపాధ్యక్షులు వీరే.. బొమ్మన హరీశ్గౌడ్, సూరం రవీందర్రెడ్డి, ఈ.కర్ణసాగర్, రిక్కుల శ్రీనివాస్రెడ్డి, అర్కల హేమలత, ముద్దసాని వేణు, గుర్రం మోహన్రెడ్డి ప్రధాన కార్యదర్శులు గెల్లి మధు, రొడ్డ శారద, పుస్కూరి విక్రమ్రావు, ధర్ని సత్యనారాయణ, చెన్న సూర్యనారాయణ, భూక్య లక్ష్మణ్నాయక్, చింతల శ్రీనివాస్, పుల్లూరి లక్ష్మణ్, తిమ్మి అబుబుకర్, అక్కల శకుంతల, బొల్లం భీమన్న, సయ్యద్ ఇసాక్, కల్వల జగన్మోహన్రావు, వేముల క్రిష్ణ కోశాధికారి: ముక్త శ్రీనివాస్ అధికార ప్రతినిధులు : అబ్దుల్ అజిజ్, కంకతి శ్రీనివాస్, బియ్యాల తిరుపతి కార్యదర్శులు పురాణం సాయిరామ్ కౌశిక్, నలిమెల స్వామి, ముదుగురి కొమురయ్య, మోర్ల సుధాకర్, జనార్దన్రెడ్డి, సుంకరి శ్రీనివాస్, కే.కావ్య, దాగం సుధారాణి, జమ్మికుంట విజయ్, చిలకాని రాజమణి, మెరుగు చైతన్య, వేల్పుల శ్రీనివాస్, ఆకారపు రమేశ్, గోనే నర్సయ్య, కిరణ్గౌడ్, గోపతి బానేశ్, రేగుంట రమేశ్, ఎండీ.ముఖరంజ, పనాస కళావతి, బొడ్డున సంధ్యారాణి, ముజఫర్ హైమద్, కొండ్రు వెంకటేశ్, బానోత్ నీలయ్య. జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మన హరీశ్గౌడ్ఉపాధ్యక్షుడు సూరం రవీందర్రెడ్డి -
‘నవోదయ’ ప్రవేశాల్లో వెనుకబాటు
కాగజ్నగర్టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే విద్యార్థులకు బంగారం లాంటి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినట్లే. ఆరో తరగతిలో ప్రవేశం పొందితే 12వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్లో ఉచితంగా విద్య అందిస్తారు. అయితే చాలామంది విద్యార్థులు పరీక్ష తీరుపై అవగాహన లేకపోవడంతో పోటీలో వెనుకబడుతున్నారు. ఈ ఏడాది ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ఫలితాల్లో నిర్మల్ జిల్లా నుంచి 37 మంది సీట్లు దక్కించుకుంటే కుమురంభీం జిల్లా నుంచి కేవలం ఏడుగురు మాత్రమే సీట్లు సాధించారు. 80 సీట్లకు ప్రవేశపరీక్షఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్నగర్ పట్టణంలో జవహర్ నవోదయ విద్యాలయం ఉంది. మెరుగైన విద్యాబోధనతోపాటు వసతి సౌకర్యం, నాణ్యమైన భోజనం, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం ఉచితంగా కల్పిస్తారు. విద్యార్థులకు వేర్వేరుగా వసతి, భోజన సౌకర్యం ఉంటుంది. బాలికలకు 33 శాతం రిజర్వేషన్ సైతం అమలు చేస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నిబంధనలకు అనుగుణంగా సీట్లు కేటాయిస్తారు. 2026– 27 విద్యాసంవత్సరంలో విద్యాలయంలో ఆరో తరగతిలో 80 సీట్లుకు మంగళవారం ఫలితాలు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షకు మొత్తం 6,196 మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 4,478 మంది పరీక్షలు హాజరయ్యారు. అవగాహన కరువుఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో నవోదయ ప్రవేశ పరీక్షకు సక్రమంగా సన్నద్ధం కావడం లేదు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం సిలబస్ గురించి అవగాహన కల్పించడం లేదు. దీంతో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఎక్కువ మంది సీటు సాధించలేకపోతున్నారు. నాలుగేళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఏటా ఐదు వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నా అందులో గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు తక్కువ మంది ఎంపికవుతున్నారు. ముందస్తు ప్రణాళిక అవసరంనవోదయ విద్యాలయంలో సీటు సాధించాలంటే ముందస్తు ప్రణాళిక అవసరం. నాలుగో తరగతి నుంచే విద్యార్థులు ప్రిపేరేషన్ ప్రారంభించాలి. వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తే.. ఇందులో మెంటల్ ఎబిలిటీ, గణితం, పేరాగ్రాఫ్ విభాగాల్లో 80 ప్రశ్నలు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 50 మార్కులకు పది భాగాల్లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో భాగంలో నాలుగు ప్రశ్నలు ఉంటాయి. గణితానికి సంబంధించి 25 మార్కులకు 20 ప్రశ్నలు ఉంటాయి. పేరాగ్రాఫ్కు 20 ప్రశ్నలకు 25 మార్కులు కేటాయిస్తారు. అవగాహన అవసరం నవోదయ విద్యాలయంలో సీటు సాధించాలంటే ముందుగా తల్లిదండ్రులకు అవగాహన అవసరం. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి పోటీ ఎక్కువ ఉన్నా తక్కువ మంది ఎంపికవుతున్నారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఆయా పాఠశాలల్లోని ఐదో తరగతి విద్యార్థులకు ఏడాది ముందు నుంచే పరీక్ష విధానం, సిలబస్ గురించి వివరిస్తూ సన్నద్ధం చేయాలి. ఫలితాల వివరాలు జిల్లా దరఖాస్తులు రాసినవారు ఎంపికై ంది ఆదిలాబాద్ 1,290 942 17 నిర్మల్ 1,552 1278 37 మంచిర్యాల 1,722 1267 19 ఆసిఫాబాద్ 1,632 991 7 -
మంచిర్యాల
వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. 7ప్రవాసీల పద్దు ఎంత.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గల్ఫ్ దేశాలకు వల స వెళ్లిన కార్మికుల సమస్యలు తీవ్రమవుతున్నాయి. బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. బుల్లి పిట్ట.. కనుమరుగైతే ఎట్టా? ప్రకృతిలో మనిషితో సన్నిహితంగా ఉండే పక్షి పిచ్చుక. ఒకప్పుడు ఇంటి ముంగిట, పెరట్లో ని చెట్లపై కిలకిల రావాలతో సందడి చేసే పిచ్చుకలు నేడు కనిపించడం లేదు. 8లోu -
‘నోటీసులు లేకుండా కూల్చివేతలా?’
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగర అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ రోడ్డు వెడల్పు పేరిట భవన యజమానులకు నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేయడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస టాకీస్, మార్కెట్ ఏరియా, రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతాల్లో రోడ్డు వెడల్పు పేరిట చేపడుతున్న కూల్చివేతలను బుధవారం బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం హిందూ పండుగల సమయంలో కూల్చి వేతలతో ప్రజలను ఇ బ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొట్ల అనిత, కస్తూరి నాగరాజు, మాజీ కౌన్సి లర్ బొట్ల సత్యం, రంగ శ్రీశైలం, పురుషోత్తం జాజు, ఆకుల అశోక్వర్ధన్, అమిరిశెట్టి రాజ్కుమార్, కర్రె లచ్చన్న, జయరామరావు, నాంపల్లి శ్రీనివాస్, ప్రకాశ్ శర్మ, పచ్చ వెంకటేశ్వర్లు, కమలాకర్రావు, బూర్ల చిరంజీవి పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం
మంచిర్యాలటౌన్: జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణపై అవగాహన కల్పించే పోస్టర్లు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్, నోడల్ డాక్టర్ అరుణశ్రీ, వైద్యులు ప్రసాద్, సుధాకర్, కమిటీ సభ్యులు డాక్టర్ రాజ్కిరణ్, రాంప్రసాద్, డాక్టర్ ప్రశాంతి, హారిక, లింగారెడ్డి, లక్ష్మణస్వామి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించాలి మంచిర్యాలటౌన్: ఈ నెల 31వరకు అన్ని గ్రామాల్లో ఆశ, ఆరోగ్య కార్యకర్తల సమన్వయంతో కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని డీఎంహెచ్వో అనిత అన్నారు. బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కుష్ఠువ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమ అవగాహన పోస్టర్లను వైద్య సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. డీపీఎంవో రాఘవయ్య, సీహెచ్వోలు, డీపీవో పాల్గొన్నారు. -
సవరణ సమర్థవంతంగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో తహసీల్దార్లు, ఉప తహసీల్లార్ల ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనర్హులు, డూప్లికేట్ నమోదు, మృతులు, చిరునామా మారిన వారి వివరాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. బూత్ స్థాయి ఏజెంట్ల సహకారంతో ఇంటింటి సర్వే సమర్థవంతంగా నిర్వహించాలని, అవసరమైన చోట ఆన్లైన్ నమోదు ప్రక్రియ వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలి బెల్లంపల్లి/భీమిని: ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కన్నెపల్లి మండల కేంద్రంలోని పలు కార్యాలయాలను పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయంలో గైర్హాజరైన టైపిస్ట్కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. బెల్లంపల్లిలోని కేజీబీవీని మున్సిపల్ కమిషనర్ సంపత్తో కలిసి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అదనపు తరగతి గదులు, భోజన శాల నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థుల కోసం ఈసారి సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ బజారు ఏరియా ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. రామ్నగర్ బస్తీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. -
బకాయిలపై కొరడా
చెన్నూర్: మున్సిపాలిటీ పరిధి లో ఇంటి పన్నుల బకాయిదా రులపై అఽధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. లైన్గడ్డ స మీపంలో ఇంటి యజమాని గొ డిసెల తిరుపతిరెడ్డి రెండేళ్లుగా ఇంటి పన్ను రూ.30 వేలకు పై గా బకాయి ఉంది. బుధవారం ఆయన ఇంటికి కమిషనర్ ము రళీకృష్ణ చేరుకుని తాళం వేశారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి మంచిర్యాలటౌన్: జిల్లాలోని షెడ్యూ ల్డ్ కులాల నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, ఆర్థిక పురోగతి పెంపునకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ తెలిపారు. ఈవీ 2 వీలర్ 185 యూనిట్లు, ఈవీ త్రిచక్ర వాహనం(సరుకు రవా ణా/ప్రయాణికుల రవాణా)ను 70శాతం రాయితీపై 91 యూ నిట్లు, వ్యవసాయ పథకాల్లో సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్ అందిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 24లోగా ఓబీఎంఎంఎస్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని, ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ధ్రువపత్రాలను జతచేసి జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యాలయంలో అందించాలని తెలిపారు. -
లక్ష సంతకాల సేకరణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): కాంగ్రెస్ ప్ర భుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన బీసీ అంశాలను నెరవేర్చాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లాలో లక్ష సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. బుధవారం మల్కల్లలో అంబేద్కర్ విగ్రహం వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు గుమ్ము ల శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు గజ్జెల్లి వెంకట య్య, నాయకులు శాఖపూరి భీంసేన్, వేముల అశోక్, కీర్తి రవి, శ్రీనివాస్, రామగిరి రాజన్నచారి, ధర్మాజీ సాయి పాల్గొన్నారు. -
పంట పొలంలోనే ప్రాణాలొదిలాడు
దండేపల్లి: పొలానికి నీళ్లుపెట్టేందుకు వెళ్లి విద్యుత్ మోటార్ ఆన్చేస్తుండగా షాక్కు గురై యువరైతు ప్రాణాలొదిలిన విషాద ఘ టన దండేపల్లి మండలంలోని నంబాలలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దాసరి చంద్రశేఖర్ (28) ప్రస్తుత యాసంగిలో రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. హనుమాన్ దీక్ష తీసుకున్న అతను బుధవారం ఉదయం హనుమాన్ ఆలయంలో పూజ చేసుకుని పొలానికి నీళ్లుపెట్టేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో అతని భార్య అనూష పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. విషయాన్ని మామ సత్తయ్యకు చెప్పడంతో వెంటనే అతను పొలం వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా పడిఉన్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తహసీనొద్దీన్ తెలిపారు. -
చల్లబడ్డ వాతావరణం
మంచిర్యాలఅగ్రికల్చర్/నెన్నెల/చెన్నూర్రూరల్: జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం కురిసిన అకాల వర్షానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలో 9.5మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మందమర్రి మండలంలో 35.8 మిల్లీమీటర్లు, నస్పూర్లో 27, బెల్లంపల్లిలో 26.4, భీమినిలో 17.6, మంచిర్యాలలో 13.2, కన్నెపల్లిలో 12.9, కాసిపేటలో 9, హాజీపూర్లో 8.2, తాండూర్లో 6.5, వేమనపల్లిలో 5.6, జైపూర్లో 4.8, నెన్నెలలో 3.1, భీమారంలో 2.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆయా మండలాల్లో గాలివానకు మామిడి కాయలు, పిందెలు నేలరాలాయి. మొక్కజొన్న, వరి పంట నేలవాలింది. మరో రెండ్రోజులు వాతావరణ శాఖ వర్ష సూచనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షానికి పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తడిసిన మిర్చి చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మిర్చి పంట తడిసింది. చెన్నూర్, కోటపల్లి మండలాల్లో రూ.10 లక్షల విలువైన మిర్చి పంట దెబ్బతిన్నది. మిర్చి పంట నల్లబడి తాలుగా మారుతోందని రైతులు పేర్కొంటున్నారు. చేన్లలో ఆరబెట్టిన మిర్చిపై ప్లాస్టిక్ కవర్లు కప్పారు. కేకే–ఓసీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో బుధవారం తెల్ల వారు జాము నుంచి కురిసిన అకాల వర్షానికి కేకే–ఓసీలో సు మారు నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోజంతా కురిసిన వర్షానికి ఐదు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 85 వేల క్యూబిక్ మీటర్ల మట్టితీత పనులకు ఆటంకం ఏర్పడిందని ఓసీ ప్రాజెక్ట్ ఆఫీ సర్ మల్లయ్య తెలిపారు. గాలివానకు గాయపడిన అరుదైన పక్షి మంచిర్యాలక్రైం: గాలివానకు బుధవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ రోడ్డు నంబరు–4లో అరుదైన పక్షి గాయపడింది. స్థానికులు ఉప్పులూరి సంతోష్కుమార్, నితిన్కుమార్ అటవీ శాఖ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్కు అప్పగించారు. లోసి ఇఫ్సీ అనే అరుదైన పక్షి జాతికి చెందినదిగా గుర్తించి పశువైద్యశాఖ అధికారి వద్ద చికిత్స అందించారు. స్థానిక ఎఫ్ఆర్వో రత్నాకర్రావు, బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ సంరక్షణలో ఉంచారు. స్థానికులను జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ అభినందించారు. -
సింగరేణి కార్మికుల పింఛన్ పెంచాలని వినతి
మంచిర్యాలటౌన్: కోల్మైన్స్ పెన్షన్ పథకం(సీఎంపీఎఫ్) 1998 కింద పదవీ విరమణ చేసిన సింగరేణి బొగ్గు కార్మికుల పింఛన్ పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సీఎంపీఎఫ్ కమిషనర్, కోల్ కంట్రోలర్ సజీష్ కుమార్ను కోరారు. బుధవారం ఢిల్లీలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. జీవితాంతం కష్టపడి పని చేసిన కార్మికులు గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలంటే పింఛన్లను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. అత్యవసర అంశంగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ స్పందిస్తూ ప్రస్తుత నిబంధనలు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. -
పరాభవ.. ఆశాజనకం
మంచిర్యాలఅర్బన్: తెలుగింట తొలి పండుగ.. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పర్వదినంతోనే ప్రారంభమవుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం విశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పరాభవ నామ సంవత్సరం గురువారం నాటితో మొదలైంది. పరాభవ అంటే అవమానం, ఓటమి అయినా ఆధ్యాత్మికంగా చూస్తే అ హంకారం, స్వార్థాన్ని జయించి వినయాన్ని అలవర్చుకునే కాలాన్ని సూచిస్తోందని, వ్యక్తి తన లోపాలను గుర్తించి అధిగమించడానికి, పరివర్తనకు మంచి సమయమని, రై తులు, నిరుద్యోగులు, విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఉగాది రోజున ఆలయాల్లో పంచాంగ పఠనం ప్రత్యేకంగా నిలుస్తుంది. అర్చకులు, పండితులు రాశుల వారీగా తెలియజేసే ఆదాయ, వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారు. ఇందుకోసం జిల్లాలోని ఆలయాల్లో పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు పూ ర్తి చేశారు. మంచిర్యాలలో ని విశ్వనాథ స్వామి దేవస్థాన ప్రాంగణంలో శ్రీపరాభవ నామ సంవత్సరా న్ని పురస్కరించుకుని బు డి దామోదర్ శర్మ సిద్ధాంతితో సాయంత్రం ఆరు IIవ పేజీలో uదండేపల్లి: మహమ్మాయి అమ్మవారికి పూజలు -
‘మహా’ ఇసుక ముఠా అరెస్ట్
భైంసాటౌన్: మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి నిర్మల్ జిల్లాకు ఇసుక అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణాపై తనిఖీల్లో భాగంగా ఆదివారం ధర్మాబాద్ నుంచి బాసర–నిజామాబాద్ వైపు ఇసుక తరలిస్తున్న రెండు లారీలు, ఒక ఐషర్ను పట్టుకున్నట్లు చెప్పారు. వీటిలో రూ.1,01,400 విలువైన 78 టన్నుల ఇసుక ఉన్నట్లు పేర్కొన్నారు. జేసీబీతోపాటు బైక్ స్వాధీనం చేసుకుని 13 మందిపై కేసు నమోదు చేయగా ప్రధాన నిందితుడు షేక్ రవూఫ్తోపాటు ధర్మాబాద్కు చెందిన షేక్ జావిద్, లక్ష్మణ్, షేక్ ఇర్ఫాన్, రాజస్థాన్లోని అల్వార్కు చెందిన ఇలియాస్ ఖాన్ను రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. రవూఫ్పై ఇదివరకే బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులు, భైంసాటౌన్ పరిధిలో ఒక కేసు, నిర్మల్ టౌన్ పరిధిలో దోపిడీ కేసు, ధర్మాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం, ఇతర తీవ్రమైన నేరాల కేసులు 4 నమోదైనట్లు తెలిపారు. ఏడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత లోకేశ్వరం: మండలంలోని సాథ్గాం సుద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను సోమవారం పట్టుకున్నట్లు తహసీల్దార్ భోజన్న తెలిపారు. ఒక్కో ట్రాక్టర్కు రూ.5 వేల జరిమానా విధించారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత భైంసారూరల్: మండలంలోని వానల్పాడ్ పరిసరా లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు రెవెన్యూఇన్స్పెక్టార్ దత్తాత్రేయ తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. -
పొదుపుతో భరోసా..
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు మన దైనందిన జీవితంపై ఎంతటి ప్రభావం చూపగలవో ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్–ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా యుద్ధ సంక్షోభంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతూ ఇంధన వనరుల సరఫరాపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పరిమిత వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో మళ్లీ గుర్తు చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో సహజవనరుల స్థితిగతులు, వినియోగంపై కథనం.నిర్మల్ఖిల్లా/బోథ్: ఇటీవల గ్యాస్ కొరత వస్తుందనే వార్తలు వ్యాపించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అప్రమత్తమయ్యారు. గ్యాస్ గోదాముల వద్ద వి నియోగదారులు బారులు తీరుతున్నారు. కేవలం సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే ముందుచూపు ప్రదర్శించడం కాకుండా, రోజువారీ జీవితంలోనే పొదుపు, మిత వినియోగం వంటి అలవాట్లను అలవరుచుకోవడం అవసరమని ప్రస్తుత పరిస్థితులు పాఠాలు నేర్పుతున్నాయి. పరిమితంగా వాడితేనే వనరులు ఎక్కువకాలం నిలు స్తాయని సందేశం మనకు చేరవేస్తున్నాయి. దుబారా తగ్గితేనే.. ప్రస్తుత జీవన విధానంలో గ్యాస్, విద్యుత్, పెట్రోల్ వంటి వనరులు అనివార్యంగా మారాయి. వంటగదిలో గ్యాస్, ప్రయాణానికి పెట్రోలు, దైనందిన పనులకు విద్యుత్ ఇవన్నీ మన జీవితంలో భాగమయ్యాయి. కానీ అవసరానికి మించి వినియోగించడం వల్ల వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. గ్యాస్ వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అవసరం లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయడం, చిన్న దూరాలకు వాహనాలు వినియోగించకుండా నడకకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి చిన్నచిన్న చర్యలు కూడా పెద్ద మార్పునకు దారితీస్తాయి. వంటగ్యాస్ పొదుపు చిట్కాలివే.. ఉమ్మడి జిల్లా అటవీ విస్తీర్ణం (చదరపు కిలోమీటర్లలో) జిల్లా అటవీ విస్తీర్ణం కుమురంభీం 1,778.26 మంచిర్యాల 1,564.93 ఆదిలాబాద్ 1,145.76 నిర్మల్ 1,085.02 గ్యాస్ కనెక్షన్ల వివరాలు (2025 వరకు) జిల్లా గ్యాస్ కనెక్షన్లు ఆదిలాబాద్ 2,82,200 కుమురంభీం 1,90,000 మంచిర్యాల 3,45,200 నిర్మల్ 2,69,300 పెట్రోల్, డీజిల్ వాహనాల గణాంకాలు జిల్లా వాహనాలు నిర్మల్ 10,194 ఆదిలాబాద్ 9,623 కుమురంభీం 6,626 మంచిర్యాల 11,760ప్రస్తుత తరమే వనరులను అధికంగా వినియోగిస్తే రాబోయే తరాలకు వాటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ప్రకృతి వనరులను సంరక్షించడం ప్రతీ పౌరుడు బాధ్యతగా భావించాలి. పొదుపు, మిత వినియోగం, సంరక్షణ అనే మూడు సూత్రాలను పాటిస్తేనే భవిష్యత్ తరాలకు ఈ వనరులను అందించగలుగుతాం. -
కాకతీయులనాటి వీరగల్లు శిల్పం గుర్తింపు
నిర్మల్ఖిల్లా: వేల సంవత్సరా లుగా ఆధ్యాత్మిక శోభతో వెలుగుతున్న నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండిరామన్న రాతి గుట్టపై సుమారు 11 నుంచి 13వ శతాబ్దపు కాకతీయుల కాలంనాటి వీరగల్లు శిల్పాన్ని గుర్తించినట్లు జిల్లాకు చెందిన కవి, చరిత్ర పరిశోధకుడు తు మ్మల దేవరావు తెలిపారు. ఈ శిల్పంలో వీరుని చేతిలో ఖడ్గం, డాలు ఉన్నాయి. గండి రామన్నగుట్ట పూర్తిగా పెద్దపెద్ద రాళ్లు, గుహలతో కూడుకుని ఉంటుంది. సముద్ర మట్టానికి సుమారు 300 అడుగుల ఎత్తులో లోతైన గుహలో శివలింగం, నంది, సర్పం, ఉమామహేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. సాధారణంగా యుద్ధంలో మరణించిన వీరుని స్మారకంగానో లేదా గ్రామ రక్షణకోసం పోరాడిన వీరుని గుర్తుగా వీరగల్లు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 16వ శతాబ్దానికి పూర్వమే ఆలయ నిర్మాణంలక్ష్మణచాంద: మండలంలోని బాబాపూర్లో ఉన్న శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం క్రీస్తుశకం 16వ శతాబ్దానికి పూర్వమే నిర్మించారని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్కుమార్, పరిశోధక విద్యార్థి రాజశేఖర్ తెలిపారు. సోమవారం ఆలయాన్ని సందర్శించారు. ఇది త్రికూటాలయమని, కదలీకరణ పద్ధతిలో నిర్మాణం జరిగిందన్నారు. ఆలయ ప్రాంగణంలో కాలభైరవునిగా కొలువబడుతున్న వీరగల్లు శిల్పులచే అద్భుతంగా చెక్కబడిందన్నారు. ఇది వీరుని స్మారకంగా శిల్పులు చెక్కే విగ్రహమన్నారు. -
ఆర్జీయూకేటీ ముగిసిన చర్చలు
బాసర: బాసరలోని ఆర్జీయూకేటీలో 15 మంది విద్యార్థి ప్రతినిధులు, పరిపాలన అధికారులతో ఏబీ–3 కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం చర్చలు జరిగాయి. విద్య, ఇతర సమస్యలపై ఆందోళనలు వ్యక్తం చేశారు. అధికారులు అన్ని అంశాలను ఓపికగా విని రికార్డు చేశారు. విద్యార్థులు ఎక్కువగా నాన్–అకాడమిక్ సమస్యలు లేవనెత్తారు. కొన్ని పాయింట్లు అవగాహన లోపాలు, వాస్తవాలకు విరుద్ధమని పరిపాలన గుర్తించింది. అయినా సానుకూల స్పందనతో పారదర్శక చర్చల ద్వారా ఆరోగ్యకర వాతావరణాన్ని నెలకొల్పుకుంటామని తెలిపారు. 2008 నుంచి అడ్మిషన్లు, టెండర్లు, టెండర్లపై విచారణకు కమిటీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి క్రమబద్ధ పరిష్కారాలు అందిస్తామని స్పష్టం చేశారు. క్యాంపస్ ప్రశాంతంగా ఉండి తరగతులు, పరీక్షలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు.పుకార్లు, ప్రతికూల సందేశాలను నమ్మకూడదని విద్యార్థులు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఓఎస్డీ నియామకంపై దుమారం భైంసా: బాసర ట్రిపుల్ ఐటీలో ఓఎస్డీని పరిపాలనా అధికారిగా కొనసాగించడంపై వివాదం నెలకొంది. ఈ అంశంపై తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ (టీఎస్ఎస్) ప్రతినిధులు సోమవారం వీసీ గోవర్ధన్కు వినతిపత్రం అందజేశారు. ఓఎస్డీ ఎం.మురళీ దర్శన్ను పరిపాలనా అధికారిగా కొనసాగించడంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశా రు. ప్రస్తుతం ఓఎస్డీగా ఉన్న వ్యక్తి పరిపాలనా అధికారిగా వ్యవహరిస్తున్నారని, ఇది ఏ చట్టబద్ధ నిబంధనల ప్రకారం జరిగిందో వెల్లడించాలని కోరారు. పరిపాలనా అధికారిగా నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను బహిరంగంగా వెల్లడించాలని, నియామక ప్రక్రియ, చట్టబద్ధ ఆధారంపై స్పష్టత ఇవ్వాలని, విద్యార్థుల ఫిర్యాదులపై స్వతంత్ర విచారణ జరపాలని, నియామకం నిబంధనలకు విరుద్ధమైతే సంబంధిత అధికారి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. -
ఖానాపూర్లో విజిలెన్స్ తనిఖీలు
● 12 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం ● 10 మందిపై 6ఏ కేసు నమోదు ఖానాపూర్: గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య దుకాణాల్లో విని యోగిస్తున్నారనే సమాచారం మేరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం ఖానాపూర్లో తనిఖీలు నిర్వహించారు. 10 దుకాణాల్లో 12 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని 10 మందిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శేఖర్రెడ్డి తెలిపారు. గృహాలకు సరఫరా చేసే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని, దుకాణ దారులు తప్పనిసరిగా లైసెన్స్ ఉన్న కమర్షియల్ సిలిండర్లనే వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై రాహెల్ గైక్వాడ్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ కార్తీక్రెడ్డి పాల్గొన్నారు. చిట్ఫండ్ చైర్మన్ రిమాండ్ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని చిట్ఫండ్ చైర్మ న్ పెరాల శ్రీనివాస్ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఈ చిట్ఫండ్లో చిట్టీలు వేసి గడువు ముగిసినప్పటికీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, దాదాపు 10 మంది వరకు బాధితులు ఆయనపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వీరికి రూ.కోటి వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. -
ముగిసిన అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలు
తాంసి: కరంజి(టి)లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలు సోమవారం ముగిశాయి. జైశ్రీరాం యూత్ ఆధ్వర్యంలో నితిన్ స్మారకార్థం నిర్వహించిన పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన 17 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్, సిద్దిపేట జట్లు తలపడగా హైదరాబాద్ జట్టు గెలుపొందింది. విజేత జట్టుకు ప్రథమ బహుమతి సర్పంచ్ కల్చప్ యాదవ్ రూ.31 వేల నగదు, ద్వితీయ స్థానంలో నిలిచిన సిద్దిపేట జట్టుకు కప్పల గజానన్ రూ.21వేల నగదు, తృతీయస్థానంలో నిలిచిన మాండ్వి జట్టుకు మాజీ సర్పంచ్ నరేందర్ యాదవ్ రూ.11వేల నగదుతో పాటు టోర్నీ నిర్వాహకులు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు దేవారెడ్డి, రెడ్డివార్ రమేశ్, గ్రామ యువకులు పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలిఉట్నూర్రూరల్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. సోమవారం ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉట్నూర్ మండలం ఘనపూర్కు చెందిన ఆత్రం లోకేష్ పైచదువుల నిమిత్తం ల్యాప్టాప్ మంజూరు చేయాలని, సిర్పూర్కు చెందిన గేడం గజానంద్ ఏకలవ్య పాఠశాలలో స్లీపర్ ఉద్యోగం ఇప్పించాలని, సిరికొండకు చెందిన రామారావు సోలార్ పంపుసెట్ మంజూరు చేయాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మం జూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలపై అర్జీలు అందజేశారు. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
చెన్నూర్: జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎస్టీపీపీ ఈడీ చిరంజీవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీపీపీ సీఎంవో ఏఐ అధ్యక్షుడు పంతులా మాట్లాడుతూ సింగరేణి అధికారుల జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు కోలిండియా మాదిరిగా ఇవ్వాలని, సీఐఎల్ మాదిరిగా ప్రయోజనాలు కల్పించాలని, పదోన్నతులు కల్పించాలని, క్రమశిక్షణ చర్యల ప్రక్రియ సరైన పద్దతిలో జరగడంలేదని, దానిని సరిచేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో జీఎంలు నర్సింహారావు, మదన్మోహన్, డీజీఎంలు శివప్రసాద్, మహేందర్, శ్రీధర్, వేణుగోపాల్, ఎస్ఈ రాము, సీఎంవోఏఐ వైస్ ప్రెసిడెంట్ జనగామ శ్రీనివాస్, అప్పారావు, జాయింట్ సెక్రెటరీ మోహన్సింగ్, ఎస్వోటూ ఈడీ వెంకటయ్య, రక్షణాధికారి పులి సురేశ్ పాల్గొన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి చెన్నూర్: రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఎస్టీపీపీ ఈడీ సీహెచ్.చిరంజీవి అన్నారు. సోమవారం ఎస్టీపీపీలో పవర్మేక్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జీఎంలు మదన్మోహన్, నర్సింహారావు, పీఎంపీఎల్ హెడ్ అఖిల్కపూర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం గొప్ప మానవతా సేవ అని అభినందించారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాల్లో ఉద్యోగులు, కార్మికులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. శిబిరంలో 70 యూనిట్ల రక్తం సేకరించారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ సోసైటీ జిల్లా జనరల్ సెక్రెటరీ చందూరి మహేందర్, ఎస్టీపీపీ వైద్యులు జానకి, అధికారులు పంతులా, కిరణ్బాబు, తదితరులు పాల్గొన్నారు. -
గోవింద్నాయక్ అస్తమయం
దండేపల్లి:నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెలే అజ్మీరా గోవింద్నాయక్(75) ఇక లేరు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. 2009 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వయస్సు పైబడడంతో ఆయన స్వగ్రామం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్లో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. నాలుగురోజుల క్రితం జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు రక్తంలో, మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. చికిత్స ప్రారంభించారు. అయితే చికిత్సకు సహకరించకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. సోమవారం సాయంత్రం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య అనుసాయినాయక్, ముగ్గురు కొడుకులు అరవింద్, మిలన్, చందన్ ఉన్నారు. నాలుగుసార్లు పోటీ.. మూడుసార్లు గెలుపు.. గోవింద్నాయక్ ఆరోజుల్లో బీఏ, ఎల్ఎల్బీ చదివాడు. రాజకీయాలకు ముందు హైకోర్టు న్యాయవాదిగా పనిచేశాడు. ప్రజాసేవ చేయాలని 1977లో అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానా పూర్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వేషన్ కావడంతో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అయినా కుంగిపోలేదు. ఎమ్మెల్యేగా ప్రజా సేవా చేయాలని నియోజకవర్గంలో పర్యటిస్తూ, ప్రజలమధ్యే ఉంటూ, ప్రజా సమస్యలపై పోరా డారు. 1985లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎ మ్మెల్యేగా గెలిచారు. 1994లో టీడీపీ నుంచి పోటీచే సి గెలిచారు. 2004లో బీఆర్ఎస్(టీఆర్ఎస్)లో చే రి మూడోసారీ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2009 ఎన్నికలనుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రజల మనిషిగా.. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గోవింద్ నాయక్ ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. ఆయనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో విడదీయని బంధం ఉంది. ఉమ్మడి జిల్లాతోపాటు, రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఒకసారి శాసనసభ కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు. ఈరోజుల్లో ఎన్నికల్లో కోట్లు గుమ్మరిస్తుంటే, గోవింద్నాయక్ మాత్రం మూడుసార్లు ప్రజాభిమానంతోనే గెలుపొందారు. ఈ విషయాన్ని గతంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. నిగర్విగా, సౌమ్యుడిగా, ప్రజల మనిషిగా గుర్తింపు పొందాడు. అయన మరణం ఉమ్మడి జిల్లాకు తీరని లోటని పలువురు విచారం వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం లింగాపూర్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
నేడు పవిత్ర షబ్బెఖదర్
నెన్నెల: ముస్లింల పవిత్రమాసం రంజాన్ నెలలో 26వ రోజున అల్లా అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్ అవతరించింది. రంజాన్ నెల ప్రారంభమై సోమవారానికి 26వ రోజు, ఈరోజే అవతరించింది. దీన్నే షబ్బెఖదర్గా పిలుస్తారు. ఆధ్యాత్మిక బోధనలతో ఈ మహాగ్రంథం మార్గనిర్దేశం చేస్తుందని నెన్నెల జామా మసీదు మౌలానా షగీర్ అహ్మద్ బర్కద్వా చెప్పారు. ఖురాన్ సన్మార్గ బాటలో పయనించడానికి ఉపకరిస్తుందని వివరించారు. ఖురాన్ మహాగ్రంఽథాన్ని కంఠస్తం చేసేవారి సంఖ్య భారీగా ఉండటం దైవ సంకల్పానికి నిదర్శమన్నారు. చరిత్ర పుటల్లో ఖురాన్ అవతరించి సుమారు 1450 ఏళ్లు దాటుతున్నా అక్షరం కూడా మార్పు చెందలేదన్నారు. ఖురాన్లో 30 ఫారాలు(పాఠాలు), 114 సూరాలు, 6666 వాక్యాలు ఉన్నాయని చెప్పారు. అశాంతి రాజ్యమేలిన నేపథ్యం.. అరబ్బుల హయాంలో అశాంతి రాజ్యమేలిన నేపథ్యమే దివ్య ఖురాన్ అవతరణకు మూలమని మౌ లానా షగీర్ అహ్మద్ బర్కద్వా తెలిపారు. అప్పట్లో ఒకరి హక్కులు మరొకరు కాలరాస్తూ పరస్పరం దూషించుకుంటూ దాడులకు పాల్పడుతూ గడిపేవారని వివరించారు. మహ్మద్ ప్రవక్త చలించిపోయి మానసిక ఉపశమనం కోసం ‘ఘారెహిర’అనే గుహలో ఒంటరిగా కూర్చొని అల్లాను స్మరించుకునేవారని, ఒకరోజు అల్లాహ్ తన దూత జిబ్రాయిల్ ద్వారా మహ్మద్ ప్రవక్తకు చేరవేసిన సందేశం చదివి ప్రవక్త మనస్సు ఆలోచనతో ప్రపంచ గమనాన్ని చుట్టి వచ్చిందన్నారు. ఆ సందేశాలకు విస్తృత ప్రచారం కలిగిస్తే ప్రజలకు చెడు నుంచి విముక్తి కలిగించి సన్మార్గంలో నడపొచ్చని ఆయన ప్రగాఢంగా విశ్వసించారని చెప్పారు. వాటి నుంచి అల్లాహ్ తన సందేశం వినిపించేవారని, అలా నలభయ్యే ఏటా నుంచి దశలవారీగా 30 ఏళ్ల పాటు అల్లాహ్ అందించిన భిన్న సందేశాల సమూహారమే ఖురాన్ మహాగ్రంథం. ప్రతి ముస్లిం విధిగా వజూ చేసి ఆపై ఖురాన్ చేత పట్టుకొని ఖిబ్లా(పడమర) వైపు తిరిగి దైవనామ స్మరణతో చదవాలని వివరించారు. -
తాత మందలించాడని కోపంతో శనగ పంట దగ్ధం
సాత్నాల: జులాయిగా తిరగొద్దు, మద్యం మానేయాలని తాత మందలించాడని కోపంతో మనుమడు శనగ పంటను దగ్ధం చేశాడు. భోరజ్ మండలం పెండల్వాడ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై పవర్ గౌతమ్ కథనం ప్రకారం.. పెండల్వాడ గ్రామానికి చెందిన లాంగ్డే ప్రభాకర్కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇందులో చిన్నవాడు సంతోష్ అతని వద్ద ఉంటున్నాడు. సంతోష్ కుమారుడు సునీల్ మద్యానికి బానిసై, జులాయిగా తిరుగుతున్నాడు. తాత ప్రభాకర్ మందలించడంతో మనుమడు సునీల్ కోపం పెంచుకున్నాడు. వీరికి రెండెకరాల పొలం ఉండగా, ఈ ఏడాది మరో 7 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. సరిగ్గా దిగుబడి రాకపోయేసరికి 4 ఎకరాల్లో శనగ వేయగా కోతదశకు రాగా, కోసి కుప్పలుగా వేశారు. ఆదివారం శనగ దగ్ధమై కనిపించచడంతో ప్రభాకర్ లబోదిబోమన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సునీల్ను విచారించగా నేరం అంగీకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. కాలిపోయిన శనగ పంట విలువ దాదాపు రూ.2 లక్షలు ఉంటుంది. -
పదో శతాబ్దపు పురాతన ఆలయం
కడెం: మండలంలోని కల్లెడలో క్రీస్తుశకం పదో శతా బ్దానికి చెందిన ఓ పురాతన ఆలయ స్తంభాలను గుర్తించినట్లు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్కుమార్ తెలిపారు. మల్లన్న దేవుని మందిరంలో అద్భుతంగా తీర్చిదిద్దిన రెండు రాతి స్తంభాలు, ఆలయ ప్రాంగణంలో ఒక రాతి దూలాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. రెండు ఎత్తైన, వెడల్పైన, దృఢమైన రాతి ద్వారాల శేరెలపై అందంగా చెక్కిన శైవ ద్వార పాలకులున్నట్లు, ఒక్కొక్క ద్వార పాలకునికి సేవకోసం ఒక్కో చామరధారిణిని చెక్కిన శిల్పాలు రమణీయంగా ఉన్నట్లు తెలిపారు. అవి చాళుక్య శైలికి చెందిన శిల్పాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో వెయ్యేళ్ల క్రితం చాళుక్యుల పరిపాలన అనేక ఏళ్లు వర్థిల్లిందని ఆయన తెలిపారు. అక్కడ పూర్వం విశాలమైన ఆలయం ఉండేదని తెలుస్తోందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ విశ్లేషించారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
ఒంటిపూట బడి వేళ చిన్నారులపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బడికి వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ ఇవ్వాలి. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాక ఎండలో ఆడకుండా చూడాలి. నీటి పరిమాణం ఉన్న పండ్లు అందించాలి. వడదెబ్బ లక్షణాలు జ్వరం, అలసట, వాంతులు ఉంటే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ రవి బాశెట్టి, ఎండీ జనరల్ మెడిసిన్, నిర్మల్ అప్రమత్తంగా ఉండాలి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఎండ ప్రతాపం తెలియని చిన్నారులు ఆటల్లో మునిగి తేలేందుకు ఉత్సాహం చూపుతారు. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూడాలి. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను రివైజ్ చేసుకోవడం.. హోంవర్క్ చేసేలా చూడాలి. సెల్ఫోన్కు దూరంగా ఉంచడం మంచిది. – యాదయ్య, డీఈవో, మంచిర్యాల -
దుఃఖాన్ని దిగమింగుకుని నేత్రదానం
బెల్లంపల్లి: గుండెపోటుకు గురై తండ్రి అకాల మృతిచెందగా, ఆ కుటుంబం పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని ఆయన రెండు కళ్లను దానం చేసి మానవత్వాన్ని చాటుకుంది. ఆ రెండుకళ్లతో మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించడానికి దోహదపడ్డారు. బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాకు చెందిన కొట్టే సత్యప్రకాశ్ (68) ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. భార్య నాగమణి, కుమారుడు నవీన్, కుటుంబ సభ్యులు ఆయన కళ్లను దానం చేయడానికి ముందుకు వచ్చారు. జనహిత సేవా సమితిలో సభ్యుడైన నవీన్.. సదాశయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్.లింగమూర్తి సౌజన్యంతో మృతుడు రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్, ఐ బ్యాంక్ సిబ్బంది ప్రదీప్ వచ్చి సేకరించి సర్టిఫికేట్ అందజేశారు. జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడేపు సతీశ్, సహాయ కార్యదర్శి పెద్ది వినయ్కుమార్, సభ్యుడు సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీలో ప్రాజెక్ట్ ఎక్స్పో
బాసర: ఆర్జీయూకేటీలో అంతఃప్రజ్ఞ 2కే26 కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ఆదివారం కెమి కల్, సివిల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ విభాగాలు సంయుక్తంగా ప్రాజెక్ట్ ఎక్స్పో నిర్వహించాయి. విద్యార్థులు పలు సృజనాత్మక ప్రా జెక్టులను ప్రదర్శించారు. వీసీ, ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శన్ పరిశీలించారు. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి పర్యావరణానికి అనుకూలమైన శుభ్రపర్చే పదార్థాన్ని తయారు చేసే హస్క్ ఆధారిత డిటర్జెంట్, బయోప్లాస్టిక్, తక్కువ ఖర్చుతో నీటిని శుద్ధి చేసే వాటర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. బైమెటాలిక్ స్ట్రిప్, సన్ఫ్లవర్ ఆధారిత సోలార్ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ ద్వారా పునరుత్పత్తి శక్తిని వినియోగం, భవనాల ఎత్తు పెంచే ఆధునిక హైడ్రాలిక్ జాక్ సిస్టమ్, ఆటోమొబైల్ మోడళ్లు ఇంజినీరింగ్ నమూనాలను ప్రదర్శించారు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఎస్.వినయ్కుమార్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఎ.కిరణ్ కుమార్, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఎస్.కె. ఖలీల్, ఫ్యాకల్టీ కన్వీనర్ జంగలే స్వప్నిల్, అధ్యాపకులు ఉన్నారు. -
స్పెషల్ రైళ్లు రెగ్యులర్ అయ్యేదెప్పుడో?
బెల్లంపల్లి: రైల్వేశాఖ వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టిన స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఏళ్లుగడుస్తున్నా రెగ్యులర్కు నోచుకోవడం లేదు. కాజీపేట– బల్లార్షా, పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేమార్గాల్లో పలు స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఆ మార్గాల్లో ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తున్నా రైళ్లను రెగ్యులర్ చేయడంలో రైల్వేశాఖ తీవ్ర కాలయాపన చేస్తోంది. ఈప్రాంతం నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రులు, ఎంపీలు పట్టింపులేని ధోరణిని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ద.మ రైల్వే జోన్పరిధిలో ఏళ్ల నుంచి ప్రత్యేకంగా నడుస్తున్న వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఇటీవల రెగ్యులర్ వీక్లీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నాంపల్లి (హైదరాబాద్) నుంచి కన్యాకుమారి వయా నల్లగొండ, కాచిగూడ నుంచి తూతుకుడి వయా మహబూబ్నగర్, చర్లపల్లి, నుంచి షాలిమార్ వయా కాజీపేట వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును అమృత్ భారత్గా మార్చి వచ్చే ఏప్రిల్ మొదటివారం నుంచి నడపనున్నారు. కానీ కాజీపేట–బల్లార్షా, పెద్దపల్లి–నిజామాబాద్ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లకు మాత్రం మోక్షం లభించడం లేదు. కాజీపేట మార్గంలో నడుస్తున్న ప్రత్యేక రైళ్లు ఇవే.. వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ బల్లార్షా మార్గంలో ప్రతీసారి నిరాశే రైళ్లకు సంబంధించిన ప్రతీ అంశంలోనూ కాజీపేట–బల్లార్షా మార్గంలో ప్రతిసారి రైల్వే శాఖ తీవ్ర వివక్షత చూపుతోందనే విమర్శలు ఉన్నాయి. సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టకపోవడం, ముఖ్యమైన స్టేషన్లలో పలు రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించకపోవడం, వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రెగ్యులర్ చేయకపోవడం తదితర విషయాల్లో అన్యాయం చేస్తోందనే ప్రయాణికుల నుంచి వ్యక్తమవుతోంది. తూర్పు కోస్తా రైల్వేజోన్ పరిధిలో ఇటీవల పలు వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రైల్వే శాఖ ద.మ రైల్వే జోన్ పరిధిలో ఉన్న కాజీపేట–బల్లార్షా, పెద్దపల్లి నిజామాబాద్ మార్గాలను మరోమారు విస్మరించడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికై నా ఆయా మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రెగ్యులర్ చేయడానికి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి వుషూ పోటీలు ప్రారంభం
భైంసాటౌన్: పట్టణంలోని మున్నూరుకాపు సంఘ భవనంలో ఆదివారం అస్మిత ఖేలో ఇండియా మహిళల వుషూ రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే పి.రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో మానసిక, శారీరక ధృడత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం అలవడుతుందన్నారు. మహిళలు సైతం క్రీడల్లో ముందుండాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు భైంసా వేదిక కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ అమేచ్యూర్ వుషూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్రాజ్, రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ ఒమర్, జిల్లా అధ్యక్షులు లోలం రాజశ్రీ, కార్యదర్శి జ్ఞానతేజ, కోచ్ శ్రీరాముల సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఒంటిపూట బడి
నిర్మల్ఖిల్లా/మంచిర్యాలఅర్బన్: ప్రస్తుత వేసవికాలంలో రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు నడపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. తరగతులు ముగిశాక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టించి ఇంటికి పంపనున్నారు. పదోతరగతి పరీక్ష కేంద్రాలు ఉన్నచోట మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు ఎండబారిన పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు అవసరం వేసవిలో సరైన మోతాదులో నీరు తాగకపోతే తల తిరగడం, వాంతులు, అలసట వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారులు తరచూ నీరుతాగడం, తేలికపాటి ఆహా రం తీసుకోవడం అలవాటు చేయాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే సందర్భాల్లో పిల్లలపై పర్యవేక్షణ త గ్గే అవకాశముండటంతో మరింత జాగ్రత్త అవసరమని పేర్కొంటున్నారు. విద్యార్థుల తలకు రుమాలు, టోపీ లేదా గొడుగు వాడేలా చూడాలని చెబు తున్నారు. మధ్యాహ్నం బడి ముగియడంతో పిల్ల లు వాగులు, చెరువులు, వ్యవసాయ బావుల్లో స్నా నాలు చేసేందుకు పంపించొద్దని పేర్కొంటున్నారు. చదువులకు వినియోగించుకోవాలి మధ్యాహ్నం తర్వాత పిల్లలు ఖాళీగా ఉండే సమయాన్ని చదువులకు వినియోగించుకోవాలి. హోంవర్క్ చేయించడం, పరీక్షలకు సిద్ధం చేయడంతోపాటు క్రాఫ్ట్ పనులు, డ్రాయింగ్, పెయింటింగ్ నేర్చుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండోర్ గేమ్స్, పజిల్స్ వంటి మేధస్సును పెంపొందించే ఆటలపై ఆసక్తి పెంచాలని సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేసి కథల పుస్తకాలు చదివే అలవాటు పెంచాలని చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వివరాలు జిల్లా సంఖ్య నిర్మల్ 1,049 ఆదిలాబాద్ 1,449 మంచిర్యాల 1,051 కుమరంభీమ్ 1,204 మొత్తం 4,753 మొత్తం విద్యార్థులు: సుమారు 5.12 లక్షలు -
దోపిడీకి పాల్పడిన ఇద్దరి రిమాండ్
ఆదిలాబాద్: సోడా వ్యాపారిపై దాడి చేసి నగదు దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. టూ టౌన్లో ఆదివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఈనెల 11న మధ్యాహ్నం పట్టణంలోని తిరుపెల్లి కాలనీలో కనకదుర్గ వైన్స్ సమీపంలో సోడా బండి నడుపుతున్న చిత్తల్వార్ దీపక్ వద్దకు మహాలక్ష్మి వాడకు చెందిన దండేవర్ అనికేష్, పిలివర్ రాజేష్ వచ్చి సోడా తాగారు. డబ్బులు అడగగా, మా ఏరియాలోకి వచ్చి వ్యాపారం చేస్తూ మమ్మల్నే డబ్బులు అడుగుతావా అని బెదిరించారు. బాధితుడిపై దాడి చేసి గల్లా పెట్టెలోని రూ.1200 నగదు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక సెల్ఫోన్, రూ.500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు పీర్ సింగ్, విష్ణు ప్రకాశ్, సిబ్బంది దత్తు, క్రాంతి పాల్గొన్నారు. -
జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న ‘బక్కి’
బాసర: బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని ఆదివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధానార్చకులు సంజీ పూజారి ఆయన్ను సత్కరించి ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో విజయ రామారావు, తహసీల్దార్ పవన్ చంద్ర, ఏఈఓ శ్రీనివాస్, ఎస్హెచ్వో కిరణ్, ఎస్సై నవనీత్రెడ్డి, ఆలయ పీఆర్వో రామారావు, సిబ్బంది ఉన్నారు. ఇసుక తరలిస్తున్న వాహనాలు పట్టివేతబాసర: బాసరలో ఆదివారం రెండు లారీలు, ఐచర్ వాహనాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో బాసర చెక్పోస్ట్ నాయగావ్ వెళ్లే రూట్ వద్ద ఎస్హెచ్ఓ సీఐ కిరణ్ ఆధ్వర్యంలో వాహనాలను పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో సీఐ కిరణ్ తెలిపారు. లోకేశ్వరం: మండలంలోని సాథ్గాం శివారు ప్రాంతం సుద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను ఆదివారం పట్టుకున్నట్లు జీపీవో భీమేశ్ తెలిపారు. ఇసుకను ట్రాక్టర్లో ధర్మోర వైపు తరలిస్తుండగా మండల కేంద్రంలో పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. మహిళా రైతు కూలీ మృతిచెన్నూర్: పొలం వద్ద పనిచేస్తుండగా రైతు కూలీ ఆదివారం మృతిచెందింది. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. జైపూర్ మండలం పౌనూర్కి చెందిన అఖిల(27) అదే గ్రామానికి చెందిన మేడగోని శ్యామ్కుమార్తో 2024లో వివాహామైంది. ఉదయం గ్రామ శివారులో వరిలో కలుపు తీయడానికి కూలీ పనిగా వెళ్లింది. అక్కడ పని చేస్తుండగా ఒడ్డు మీద కరెంట్ బోరు మోటారు నీళ్లు పోసే ఇనుప పైపు తాకి ఆకస్మాతుగా పడిపోయి స్పృహా కోల్పోయింది. గమనించిన తోటి కూలీలు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు అఖిలకు విద్యుత్ షాక్ తగిలిందా, మరేదైనా వేరే కారణంతో చనిపోయిందా అనేది సమగ్ర విచారణ చేయాలని తండ్రి కొమురయ్య కోరాడు. ఈమేరకు తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బీఆర్ఎస్ నాయకులపై కుట్రపూరితంగా కేసులు
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో అరెస్టయి ప్రస్తుతం బెయిల్పై ఉన్న మాజీ ఎ మ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ షరతుల ప్రకా రం ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్కు వచ్చి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులపై కుట్ర పూరితంగా కేసులు నమోదు చేశారని, ఎన్ని కల సమయంలో తమ కార్యకర్తలెవరూ దాడులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, చట్టంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. ఆయన వెంట బీ ఆర్ఎస్ నాయకులు మూల రాజిరెడ్డి, మేలిపెల్లి సంపత్, సుదర్శన్గౌడ్, తదితరులు ఉన్నారు. -
చెరువుల పునరుజ్జీవమే ప్రభుత్వ లక్ష్యం
మంచిర్యాలటౌన్: జిల్లాలోని చెరువుల పునరుజ్జీవ మే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాముని చెరువు, నస్పూర్లోని చెరువు పునరుజ్జీవ పనులకు ఆదివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుతో కలిసి శంకుస్థాపన చేశా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అమృత్ 2.0 పథకం కింద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాముని చెరువు, నస్పూరు పరిధిలోని చెరువుల పునరుజ్జీవ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల నగరం, లక్సెట్టిపేట్ మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక వసతులు కల్పించేలా పనులను చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అవసరమని, అధికారులు సైతం ప్రజలను సమస్యలపై అడిగి తెలుసుకుని, పరిష్కారం దిశగా పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాలక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల అభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాలలో చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమృత్ పథకం ద్వారా రూ.3.14 కోట్లతో చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పట్టణంలో ఇప్పటికే రోడ్డువెడల్పు పనులు పూర్తి కాగా రానున్న రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు తొలగిపోనున్నాయన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్పర్సన్ రాజేశ్వరి, కమిషనర్ విజయ్కుమార్, తహసీల్దార్ దిలీప్కుమార్ పాల్గొన్నారు. -
ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివా రం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెయి నీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ఖాన్, డీపీఆర్వో కృష్ణమూర్తి, దేవాపూర్ సిమెంట్ కంపెనీ యూనియన్ అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్రావు, తహసీల్దార్ రఫతుల్లా, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేశ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
ఉగాది కవి సమ్మేళనం
మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్లో ఆదివారం సాహితీ సంరక్షణ సమి తి ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ ఉగాదికి స్వా గతం పలుకుతూ కవి సమ్మేళనం నిర్వహించా రు. ఈ సందర్భంగా కవులు పద్యవచనము, గే యము ద్వారా కవితాగానం చేశారు. పర అంటే బయట, ఉన్నతి అభవ అంటే లయము, అంతము మనలోని అహంకారము ద్వేషము లోభము, నెగిటివ్ భాగాలను అంతమయ్యే కా లమని, లోపాలను గుర్తించి ఆత్మపరిశీలన చే సుకొని సద్గుణాలతో నడవటం, బలహీనతపై విజయం సాధించే సంవత్సరమంటూ వక్తలు అభిప్రాయపడ్డారు. అనంతరం పలువురు కవులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు వామన్రావు, రెడ్క్రాస్ సొసైటీ సభ్యుడు మహేందర్, సుబ్బాయమ్మ, అడ్డగూరి శ్రీలక్ష్మి, శ్రీనివాస్, సంతోష్, చంద్రశేఖర్, బ్రహ్మయ్యచార్య పాల్గొన్నారు. -
‘ప్రగతి ప్రణాళిక’పై నిర్లక్ష్యం వద్దు
చెన్నూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’పై అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని పలు వా ర్డుల్లో పర్యటించారు. వాటర్ ట్యాంకుల నిర్మాణాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కమిషనర్ మురళీకృష్ణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరా ల మాదిరి వీధులు శుభ్రంగా ఉంచాలన్నారు. డ్రెయినేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. సకాలంలో ఇంటిపన్ను చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలన్నారు. వార్డుల పరిశుభ్రత మున్సిపల్ అధికా రుల బాధ్యత అన్నారు. ఎక్కడైనా పారిశుధ్యం లోపి స్తే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రగతి ప్రణాళిక 8 వార్డుల్లో పూర్తి అయ్యిందని, మరో 10 వార్డుల్లో చేపట్టాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, వైస్ చైర్మన్ వినయ్కుమార్, కౌన్సిలర్లు నజ్మాఅమేర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు ఉపకరణాలు
మంచిర్యాలటౌన్: దివ్యాంగులకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఉపకరణాలను పంపిణీ చేసేందుకు అర్హులైన వారి నుంచి ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించింది. శారీరక వైకల్యంతో కొందరు సొంతంగా నడవలేని వారు ట్రై సైకిళ్లపై కూర్చుని ఎక్కడికై నా ప్రయాణం చేసేందుకు అవకాశం ఉండగా, చేతులు, కాళ్లు లేని వారి కోసం బ్యాటరీతో నడిచే వీల్చైర్లను అందించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. దివ్యాంగులు ఆర్థికంగా ఎదిగేందుకు సొంతంగా ఉపాధి పొందాలనుకునే వారికి సైతం పెట్రోలు ఖర్చు లేకుండా బ్యాటరీతో నడిచే మొబైల్ బిజినెస్ ట్రైసైకిళ్లు, మినీ ట్రేడింగ్ ఆటోలు, డిగ్రీ విద్యార్థులు, ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారికి అవసరమైన ల్యాప్టాప్లను దివ్యాంగుల సంక్షేమ శాఖ, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు చేరుతున్న ఉపకరణాలు ఉపకరణాలకోసం ఇప్పటికే పలువురు అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాకు 45 స్కూటీలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 40 మాత్రమే వచ్చాయి. మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్లు 18, ల్యాప్టాప్లు 14 జిల్లాకు చేరుకున్నాయి. బ్యాటరీ వీల్చైర్లు 14, హైబ్రిడ్ అటాచ్మెంట్ వీల్చైర్లు 5, రెండు 5జి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు 12 రావాల్సి ఉంది. ప్రస్తుతం వచ్చిన స్కూటీలు, ట్రైసైకిళ్లను సమీకృత కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచారు. మిగతా ఉపకరణాలు వచ్చేంత వరకు వేచి ఉండకుండా వచ్చిన వాటిని అర్హులైన వారికి పంపిణీ చేయాలని దివ్యాంగులు కోరుతున్నారు.జిల్లాకు కేటాయించిన ఉపకరణాలు స్కూటీలు 45 మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్లు 18 బ్యాటరీ వీల్చైర్లు 14 హైబ్రిడ్ అటాచ్మెంట్ వీల్చైర్లు 5 బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో 1 ల్యాప్టాప్ (డిగ్రీ విద్యార్థులు) 7 ల్యాప్టాప్ (హయ్యర్ టెక్నికల్ విద్య) 7 ట్యాబ్లు 12 5జీ స్మార్ట్ ఫోన్లు 2 -
క్రీడలతో మానసిక ఉల్లాసం
● కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలటౌన్: క్రీడాపోటీలతో మానసిక ఉల్లా సం కలుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఉషోదయ పాఠశాలలో రెవెన్యూ ఉద్యోగులకు ఆదిలాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఒక్కోసారి నిర్ణీత పనివేళలను మించి పని చేయాల్సి ఉంటుందన్నారు. వ్యాయామం, యోగ, క్రీడలు, ప్ర తీఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలన్నారు. అనంతరం పోటీల్లో విజేతలకు బ హుమతులు, మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ మ హమ్మద్ విలాయత్ అలీ, తదితరులు పాల్గొన్నారు. నేడు తహసీల్ కార్యాలయాల ఎదుట ధర్నాచెన్నూర్: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల ఎదుట ఉదయం 11గంటలకు ధర్నా నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ తెలిపా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు ఇళ్లు, వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు పిలుపు మేరకు ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. పేదలు, రైతులు అష్టకష్టాలు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ తహసీల్ కార్యాలయాల ఎదుట చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. -
అంగన్వాడీ పటిష్టతలో సర్పంచులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పల్లెల్లోని అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థ మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంలో భాగంగా సర్పంచులు విశేష పాత్ర పోషిస్తున్నారు. గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించే బాధ్యతలు సర్పంచులకు అప్పగించా రు. అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేయడం, వి ద్యార్థులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా తీ సుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయంలో భాగంగా ఇప్పటికే విడుదలైన ఉత్తర్వుల మేరకు కమిటీలు ఏర్పాటయ్యాయి. 11 మంది సభ్యులతో కూడిన కమిటీకి చైర్మన్గా సర్పంచ్, కన్వీనర్గా అంగన్వాడీ ఉపాధ్యాయురాలు, స భ్యులుగా సామాన్య శాస్త్రం భోధించే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, ఒక విశ్రాంత ఉద్యోగి, ఒక ఏఎన్ఎం, చిన్నారుల తల్లులు, గర్భిణులు ఉంటారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలోని మంచిర్యాల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 244, బెల్లంపల్లి అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్లో 282, లక్సెట్టిపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్లో 203, చెన్నూర్ రూ రల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 245తో కలిపి మొ త్తంగా 974 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో అర్బన్ ప్రాంతాల్లో 526, రూరల్ ప్రాంతాల్లో 446 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలను సర్పంచులు పర్యవేక్షించనున్నారు. నిరంతర పర్యవేక్షణ.. అంగన్వాడీ కేంద్రాలపై సర్పంచుల పర్యవేక్షణ ఇకపై నిరంతరాయంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి కేంద్రాలకు ప్రతీ నెల సరఫరా అవుతున్న సరుకులు వివరాలు, చిన్నారులకు సకాలంలో పౌష్టికాహారం అందేలా చూడటంపై సర్పంచులు పర్యవేక్షించనున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు అందించే భోజనం నాణ్యతనూ తనిఖీ చేసే అధికారం ఉంది. పిల్లలు, కిషోర బాలికలు, బాలింతలు, గర్భిణులతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంపై అవగాహన కల్పించడంలో కూడా వీరి పాత్ర ఉంటుంది. అంగన్వాడీ కేంద్రానికి ప్రతీనెల వచ్చే రూ.లక్షల విలువ చేసే సరుకులు పక్కదారి పట్టకుండా, అంగన్వాడీ వ్యవస్థ పకడ్బందీగా సాగేలా పర్యవేక్షించనున్నారు. బాలామృతం, పాలు, గుడ్లు, బియ్యం, కందిపప్పు, తదితర పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలను లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూడనున్నారు. చిన్నారుల భద్రత, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం వంటి బాధ్యతలను కూడా సర్పంచులు చూడనున్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీలు ప్రతీ నెల సమావేశమై నివేదికను తయారుచేసి ఉన్నతాధికారులకు పంపించి కేంద్ర బాగోగులకు చర్యలు చేపట్టనున్నారు.సర్పంచులకు బాధ్యతలుగ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా ఎన్నికై న సర్పంచులకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. సర్పంచులు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ ప్రతీనెల కమిటీ సభ్యులతో సమావేశమై కేంద్రాలను పటిష్టం చేసేలా చర్యలు చేపడతాం. – రౌఫ్ఖాన్, జిల్లా సంక్షేమాధికారి -
ఆర్జీయూకేటీని సందర్శించిన ‘బక్కి’
బాసర: బాసర ఆర్జీయూకేటీని శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష స మావేశం నిర్వహించారు. విద్యార్థుల రక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. అడ్మిషన్ల ప్రక్రి య గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ని యామకంలో తప్పనిసరిగా రిజర్వేషన్ పద్ధతిని పా టించాలని ఆదేశించారు. వివిధ అంశాలపై అధికా రులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులతో మా ట్లాడి వారికి అందిస్తున్న వసతులు, సౌకర్యాలు అడి గి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్, సభ్యులను యూనివర్సిటీ అధికారులు సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ స భ్యురాలు కుస్త్రం నీలాదేవి, వైస్ చాన్స్లర్ గోవర్ధన్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
భీమారం: మంచిర్యాల–చెన్నూర్ జాతీయ రహదారిపై కుందారం ఎక్స్రోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం... తాండూరు మండలం మాదారంకు చెందిన ఏరుకొండ వెంకటేశ్ చెన్నూర్లో ఉన్న తన తల్లిని చూసేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. కుందారం ఎక్స్రోడ్డు వద్దకు రాగానే చెన్నూర్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి బైక్ను బలంగా ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఘటనలో బైక్ నడుపుతున్న వెంకటేశ్కు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. జాతీయరహదారి గుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులు 108 కి సమాచారం అందించారు. పైలట్ హరీశ్, ఈఎంటీ రమేశ్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
గుండు గీయించారని నిలదీత
ఖానాపూర్: పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీలో గల మైనార్టీ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్న విద్యార్థికి తల్లిదండ్రుల అనుమతి లేకుండా పాఠశాల సిబ్బంది గుండు గీయించారు. విషయం తెలుసుకున్న సదరు విద్యార్థి తండ్రి రవి శనివారం పాఠశాలకు చేరుకుని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంప్రదాయం ప్రకారం తల్లి దండ్రులు చనిపోయినప్పుడు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మాత్రమే గుండు చేయించుకుంటారని, ఇలాంటి చర్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ హైమద్ను వివరణ కోరగా గుండు తీసిన విషయం తన దృష్టికి రాలేదని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. -
అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం
బాసర: గత నెల 28న అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యమైంది. తానూరు మండలం బమ్మిని గ్రామానికి దుర్గావార్ నీలాబాయి (58) బాబు దంపతులు కొంతకాలంగా బాసరలోని గణేశ్నగర్లో నివాసం ఉంటున్నారు. బాబు ట్రిపుల్ఐటీలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తుండగా వారి కుమారుడు విష్ణుమూర్తి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నీలాబాయి ఫిబ్రవరి 28న ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మార్చి 1న బాసర పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. శనివారం గణేశ్నగర్ గుట్ట ప్రాంతంలో దుర్వాసన రావడంతో స్థానికులు అటుగా వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకుని కనిపించింది. విష్ణుమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ కిరణ్ తెలిపారు. వివాహిత అదృశ్యం ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన 25 ఏళ్ల వివాహిత అదృశ్యమైంది. శనివారం ఇంట్లో భర్తతో గొడవజరగడంతో సదరు మహిళ బయటకు వెళ్ళిపోయింది. రాత్రి వరకూ రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. -
క్రీడలతోనే మానసిక ఉల్లాసం
మంచిర్యాలటౌన్: క్రీడల ద్వారానే శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని, విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు క్రీడలు ఉపశమనాన్ని కలిగిస్తాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీఉషోదయ పాఠశాల మైదానంలో శనివారం ఆదిలాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, శ్రీనివాస్రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీలతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఒక్కోసారి నిర్ణీత పనివేళలను మించి పనిచేయాల్సి ఉంటుందన్నా రు. కార్యాలయాల్లో పని ఒత్తిడి దృష్ట్యా శారీరక శ్రమ లేకుండా పని చేయడంతో 40ఏళ్ల వయస్సుకే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగులకు శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలని, నిత్య జీవితంలో వ్యాయామం ఒక భాగంగా పాటించాలన్నారు. అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. -
తాళం వేసి ఉన్న రెండిళ్లలో చోరీ
తానూరు: మండలంలోని భోసి గ్రామంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. గ్రామానికి చెందిన అర్ధాపూర్ గంగాధర్ కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లగా, సాయినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి మరో ఇంట్లో పడుకున్నారు. గుర్తు తెలి యని దుండగులు ఇళ్ల తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. గంగాధర్ ఇంట్లో బీరువాలో ఉన్న రూ.79 వేలు, సాయినాథ్ గౌడ్ ఇంట్లో రూ.వెయ్యి నగదు అపహరించారు. శనివారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ముధోల్ సీఐ రవీందర్నాయక్, ఎస్సై షేక్ జుబేర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
కాసిపేట గనిని సందర్శించిన డీఎఫ్వో
కాసిపేట: మందమర్రి ఏరియాలోని కాసిపేట గనిని శనివారం ఆసిఫాబాద్ డీఎఫ్వో నీరజ్ టిబ్రేవాల్ ఐఎఫ్ఎస్ సందర్శించారు. గని మేనేజర్ సతీష్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు ఆయన ను శాలువాలతో సత్కరించారు. అనంతరం మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి పనిస్థలాల వద్దకు వెళ్లారు. గనిలో బొగ్గు ఉత్పత్తి, మిషన రీ పనితీరు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఐ టీయూసీ పిట్ కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మణ్దాస్, రక్షణాధికారి నిఖిల్, డెప్యూటీ మేనేజర్ వెంకటేష్, సంక్షేమాధికారి మీర్జాగౌస్జీషాన్, సర్వేయర్ ప్రభాకర్, టీబీజీకేఎస్ నాయకులు అఫ్జలు ద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీలో రెండో రోజు అంతఃప్రజ్ఞ
బాసర: బాసర ఆర్జీయూకేటీలో శనివారం రెండోరోజు అంతఃప్రజ్ఞ 2కే–26 నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ తన జీవిత ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, విజయానికి దారితీసిన పట్టుదల గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా కార్లు, బైక్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్చాన్స్లర్ గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఈ.మురళీదర్శన్, ఫ్యాకల్టీ కన్వీనర్ స్వప్నిల్ జంగలే విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులను పరిశీలించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో నినా ఏఐ ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్, పిల్లల కోసం రూపొందించిన ఏఐ ఆధారిత లెర్నింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో స్మార్ట్ వాటర్ ఫ్లో అండ్ పైప్లైన్ లీకేజ్ డిటెక్షన్ సిస్టమ్, స్మార్ట్ డ్రగ్ డిస్పెన్సర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో హెలియో ఆక్వా రిఫైనర్ , ఈవీ ఛార్జింగ్ స్టేషన్ వంటి ప్రాజెక్టులు ప్రదర్శించబడ్డాయి. పోస్టర్ ప్రజెంటేషన్ విభాగంలో క్వాంటం కమ్యూనికేషన్ ప్రాజెక్ట్ విజేతగా నిలిచింది. బహుమతులు అందజేతఅంత ప్రజ్ఞలో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బహుమతులు అందజేశారు. -
నూతన ఆవిష్కరణలకు ముందుకు రావాలి
కై లాస్నగర్: గ్రామీణ ప్రాంతాల్లోని నూతన ఆవి ష్కరణలను వెలికితీసి వాటిని వ్యాపార మార్గాలుగా మలిచేందుకు యువత ముందుకు రావాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 40 మంది కి పైగా యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలు, పర్యావరణహి త ఇంధన వనరులు, ఆరోగ్య రంగానికి సంబంధించిన వినూత్న నమూనాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ అభివృద్ధి కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉన్న ప్రతిభను వెలికితీయాల్సిన అవసరముందన్నారు. స్థానికంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్లకు ప్రో త్సాహం అందించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణుల బృందం ఆవిష్కర్తలతో ప్రత్యక్షంగా చర్చించి వారి ఆలోచనలను మరింత మెరుగుపరుచుకునేలా మార్గనిర్దేశం చేసింది. ఐడియా వ్యాలిడేషన్, ప్రోటోటైపింగ్, గో టు మార్కెట్ స్ట్రాటజీ, నిధుల సమీకరణ, మార్కెటింగ్, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీపీవో రమేశ్, డీపీఆర్వో విష్ణువర్ధన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఈడీఎం రవి, రెడ్కో డీఎం శ్రీనివాస్, వివేకానంద కళాశాల ప్రిన్సిపాల్ నికినీ వర్మ, టీజీఐసీ ప్రతినిధులు ప్రణయ్, రమేశ్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
పశుగ్రాసం సాగు ఎంతో మేలు
చెన్నూర్రూరల్: వరి కోసేందుకు రైతులు ఎక్కువగా యంత్రాలను వినియోగిస్తున్నారు. దీంతో వరిగడ్డి ముక్కలు, ముక్కలుగా కావడంతో ఎక్కువగా పశువుల మేతకు పనికిరాకుండా పోతోంది. దీంతో వేసవిలో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు రైతులు గడ్డిజొన్నను సాగుచేస్తే పశుగ్రాసానికి కొరత ఏర్పడకుండా ఉంటుంది. జిల్లా కేంద్రంలోని వెటర్నటీ ఆసుపత్రి స్టోర్లో గడ్డిజొన్న ఎస్హెచ్జీ రకం విత్తనాలు 8.9 టన్నులు అందుబాటులో ఉన్నాయని, రైతులకు 75 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి యాకూబ్రెడ్డి తెలిపారు. జిల్లాలో 12,09,436 మూగజీవాలుజిల్లాలో 1,38,536 ఆవులు, 1,04,080 గేదెలు, 2,42,616 ఎద్దులు, 5,36,913 గొర్రెలు, 1,87,291 మేకలు ఉన్నాయి. మండలాల వారీగా పశువుల సంఖ్యను బట్టి గడ్డిజొన్న విత్తనాలు పంపిణీ చేయనున్నారు. రైతులు సూపర్ నేవియర్ అనే గడ్డిజాతి రకాన్ని పెంచుకుంటే ఏళ్ల తరబడి పశువులకు గ్రాసం లభిస్తుంది. డెయిరీ ఫాంలు ఉన్న రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గడ్డి రకం కట్ చేసిన కొద్దీ పెరుగుతుంది. చిన్నచిన్నగా కట్ చేసిన ముక్కలను రెండున్నర ఫీట్లకు ఒకటి చొప్పున భూమిలో నాటుకుంటే ఇవి మొలకెత్తుతాయి. అలాగే హెడ్జ్ లూసర్న్ రకం మొక్కలలో మాంసకృత్తులు అధికంగా ఉండి ఆవులు, గేదెలు పాలను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. విత్తనాలు విత్తిన 45 రోజులకు ఈ గడ్డిజొన్న కోతకు వస్తుంది. కోత కోసి పశువులకు మేతగా వేసిన తర్వాత మళ్లీ పిలకలు వచ్చి మొక్కలు ఎదుగుతాయి. ఏళ్లతరబడి పశుగ్రాసం లభిస్తుంది. బహు వార్షికాలను కూడా పెంచవచ్చు. ఇవి విత్తనాలు కాకుండా మొక్కలను లేదా కాండపు పిలకలను నాటగానే కలుపు పెరగకుండా ఉండేందుకు 30 నుంచి 60 రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి నీటితడులు ఇవ్వాలి. యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పశుగ్రాసం సాగు చేసుకుంటే వేసవిలో కూడా పశువులకు గ్రాసం కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఎస్హెచ్జీ ఏక వార్షిక గడ్డిజొన్న సాగు చేస్తే ఏడాది పాటు పశువులకు గ్రాసం లభిస్తుంది.రైతులు దృష్టి సారించాలి వేసవిలో పశువులకు మేత సరిగా దొరకదు. కాబట్టి రైతులు పశుగ్రాసం సాగుపై దృష్టి సారించాలి. ఎస్హెచ్జీ రకం గడ్డి జొన్న విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా డెయిరీఫాంలు నడిపించే రైతులు పశుగ్రాసాలను తప్పకుండా సాగు చేయాలి. అలాగే వేసవిలో పశువులు, జీవాల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి. – యాకూబ్రెడ్డి, జిల్లా పశువైద్యాధికారి, మంచిర్యాల -
ఇబ్బందులు లేకుండా సిలిండర్ల సరఫరా
● కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు ● కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్లో డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రావు, ఏసీపీ ప్రకాష్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎల్పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో అవసరానికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, బుకింగ్, నిల్వలపై సమీక్షిస్తున్నామని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలు, గోదాములు వద్దకు వెళ్లకుండా ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు. గ్యాస్ డెలివరి సమయంలో ఓటీపీ చెప్పి సహకరించాలని, హోటల్, రెస్టారెంట్లలో వాణిజ్య సిలిండర్ మాత్రమే ఉపయోగించుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్యాస్ సిలిండర్లు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే నిత్యావసరాల చట్టం 1955 కింద చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎల్పీజీ వినియోగదారులు కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని, గ్యాస్ ఏజెన్సీ వద్ద ఆన్లైన్, నిర్వాహకులు, గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్సైట్ యాప్లో పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. -
● అడవుల్లో యథేచ్ఛగా షికారీ ● తాజాగా ఓ చిరుతపులి బలి ● వన్యప్రాణులకు తప్పని ముప్పు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అడవుల్లో వన్యప్రాణుల వేట ఆగడం లేదు. యథేచ్ఛగా షికారీ సాగుతోంది. తాజాగా దండేపల్లి మండలం తాళ్లపేట రేంజ్ మామిడిపల్లి బీట్ అటవీ ప్రాంతంలో చిరుతపులిని ఉచ్చు బిగించి హతమార్చారు. కళేబరాన్ని కా ల్చివేశారు. ఈ ఘటనలో అటవీ అధికారులు ము గ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద చిరుతపులి గోర్లు, దంతాలు, మీసాల వెంట్రుకలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇదే తరహాలో పెద్దపులిని చంపిన ఘటనలోనూ వేటగాళ్లు పట్టుబడ్డారు. ఇటీవల పలు చోట్ల వన్యప్రాణులను వేటాడుతూ అధికారులకు చిక్కారు. జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్, జన్నారం డివిజన్లలో ఇప్పటికీ అడవుల్లో వన్యప్రాణులను వేటాడుతున్నారు. ఇటీవల వేమనపల్లి మండలం నీల్వాయిలో అడవి పందిని హతమార్చిన ఘటనలో కేసు నమో దు చేశారు. ఇంకా పలు చోట్ల పట్టుబడుతూనే ఉన్నారు. అడవుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని చె బుతున్నా చిరుతపులుల వంటి జంతువులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జంతువులనే కాకుండా కొన్ని చోట్ల పక్షులను సైతం వేటాడుతున్నారు. వేసవిలో మరింత అధికం వేసవిలో వన్యప్రాణులు అడవి దాటి బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో కొందరు వేటాడి పట్టుకుంటున్నారు. ఇక నీటికుంటలు, వాగుల వద్ద కాపు కాసి వేటాడుతున్నారు. ఇవేకాక రాత్రి పూట తీగలకు విద్యుత్ సరఫరా చేస్తూ చంపేస్తున్నారు. వేటాడిన వన్యప్రాణుల మాంసాన్ని పట్టణాలకు తరలించి అమ్ముకుంటున్నారు. జిల్లా కేంద్రంతో సహా పట్టణాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రైవేటు కార్యక్రమాలకు ప్రత్యేక వంటకంగా అడవి జంతువుల మాంసం అమ్ముతున్నారు. దీంతో విచ్చలవిడిగా వేటతో అడవుల్లో శాకాహార జంతువుల లభ్యత తగ్గుతోంది. శాకాహార జంతువుల వేటతో వాటిపై ఆధారపడే పులులు, చిరుతలు, ఇతర మాంసాహార వన్యప్రాణులకు ఆహారం దొరకడం లేదు. ఈ క్రమంలో అడవి సమీపంలో ఉన్న పశువులు, మేకలు, గొర్రెలపై దాడులు చేస్తున్నాయి. చనిపోయిన వాటికి అటవీ శాఖ రూ.లక్షల్లో పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఓ వైపు వేటగాళ్ల కారణంగా వన్యప్రాణులకు రక్షణ లేకపోగా, మరోవైపు అడవుల్లో జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది.పొంచి ఉన్న ముప్పువిచ్చల విడిగా వేటతో వన్యప్రాణులకు ప్రాణముప్పు పొంచి ఉంది. అక్రమ కలప రవాణా, పోడుతో అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ మరింత కష్టంగా మారుతోంది. ఈ ప్రభావం స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులపై పడుతోంది. విద్యుత్ తీగలతో వేటాడం వల్ల తీవ్రంగా నష్టం జరుగుతోంది. కొన్నిసార్లు విద్యుత్ తీగలకు మనుషులు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. అయినప్పటికీ పంట చేన్లు కాపాడుకునే సమయంతోపాటు వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ తీగలనే వాడుతున్నారు. దీంతో అనేక జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అటవీ సమీప గ్రామాల్లో కొందరికి వేటాడం నిత్యకృత్యంగా మారింది. అడవుల్లో సీసీ కెమెరాలు, చెక్పోస్టులు, రాత్రి పూట గస్తీ సిబ్బంది ఉన్నప్పటికీ వేటను పూర్తిగా అదుపులోకి తేలేకపోతున్నారు. కొన్ని రేంజ్ల్లో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంతోనూ ముప్పు వాటిల్లుతోంది. -
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్
జన్నారం: మండలంలోని పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధి మజీద్లో శనివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మభూమేశ్ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు అందజేసి విందు భోజనం చేశారు. పండుగలు మత సామరస్యానికి ప్రతీకగా నిలువాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసీఉల్లా, సర్పంచులు వెంకన్న, సురేశ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముజాఫర్ అలీఖాన్, పార్టీ సీనియర్ నాయకులు గుర్రం మోహర్రెడ్డి, ఇందయ్య, రమేశ్, నందునాయక్, ఇసాక్, రియాజోద్దీన్, షాఖీర్ అలీ, ముజ్జు పాల్గొన్నారు. -
కట్నం ఇడే కాద్ తోద్.. అంటున్న ‘కొలాం’
● సమాజ మార్పునకు ఆదివాసీల శ్రీకారం ● ఉమ్మడి జిల్లాలో గోండు, కొలాం, పర్ధాన్ పెద్దల తీర్మానం ● ఇప్పటికే పలు గ్రామాల్లో అమలులోకివరకట్నం.. వివాహ సమయంలో వధువు కుటుంబం నుంచి వరుడి కుటుంబా నికి నగదు, బంగారం, ఆస్తుల రూపేణ బదిలీ చేసే ఒక సామాజిక దురాచారం. ఆడపడుచు కుటుంబా నికి ఇబ్బందిగా మారిన దీనిని రూపుమాపేందుకు ప్రభుత్వాలు చట్టాలెన్ని చేసినా క్షేత్రస్థాయిలో అమలుకు మాత్రం నోచుకోని దుస్థితి. ఈ క్రమంలో సామాజిక బాధ్యతగా గుర్తించిన ఆదివాసీ తెగలు వరకట్నం నిషేధం వైపు మొగ్గు చూపుతున్నాయి. కట్నం ఇవ్వొ ద్దు.. తీసుకోవద్దు అని గ్రామాల్లో తీర్మానాలతో పాటు అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. ‘హైరి కీవల్ సిల్లే’ ‘కట్నం ఇదే కాద్ తోద్’ వంటి తీర్మానాలతో ముందడుగు వేస్తున్న ఆయా తెగలపై ఈ వారం సండే స్పెషల్. సిరికొండ: ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లంటే ఆ కుటుంబంపై ఆర్థిక భా రం చెప్పనవసరం లేదు. కట్నా లు, కానుకలు, ఆర్భాటాలు వంటివి చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టే అవుతోంది. అలాంటిది తమ గూడెంలో అమ్మాయి పెళ్లిని ఆర్భాటం లేకుండా సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ఊరి పెద్దలు భావించారు. ఈనెల 9న సమావేశమయ్యారు.‘హైరి కీవల్ సిల్లే’ వరకట్నం నిషేధించడంతో పాటు పెళ్లి కూతురు కుటుంబానికి తలా కొంత ఆర్థికంగా చేదోడుగా నిలవాలని నిర్ణయించారు. వెంటనే అమలులోకి తెచ్చారు సిరికొండ మండలంలోని కోసుపటేల్ గూడవాసులు. సాత్నాల: వరకట్న సమస్య కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని కొలాం తెగ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెళ్లి అనేది పవిత్ర బంధమని.. దానిని డబ్బు, ఆస్తులతో కొలవకూడదని భావించింది. ఇకపై వరకట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాత్నాల మండలంలోని టెంబ్రీగూడలో పటేళ్లు, కులస్తులు ఇటీవల సమావేశమయ్యారు. సాత్నాల, బేల, జైనథ్, ఇంద్రవెల్లి మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 150 పాల్గొన్నారు. వరకట్నం అనేది తమ సంస్కతిలో భాగం కాదని నిషేధించాలని తీర్మానం చేశారు. ఆడంబరాలకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. పెళ్లిళ్లు సాంప్రదాయబద్ధంగా ఉండాలని, రూ.లక్షలు ఖర్చయ్యే రెడీమేడ్ మండపాలకు దూరంగా ఉండడంతో పాటు మద్యపానం నిషేధించాలన్నారు. డీజేలు వంటి వాటి జోలికి వెళ్లకుండా పిప్రి వాయిద్యాలతో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పెళ్లిలో చదివింపుల్లో భాగంగా వస్తువులు కాకుండా నగదు రూపంలో అందిస్తే కుటుంబాలనికి ఆసరాగా ఉంటుందని తీర్మానించారు.ఆడబిడ్డ పెళ్లికి ఊరంతా సాయం -
అంగన్వాడీ కేంద్రాల్లో శుద్ధజలం
మంచిర్యాలటౌన్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తుండగా.. ఇకపై శుద్ధమైన జలం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాకు 79 ఆర్వో ప్లాంట్లు మంజూరు చేశారు. జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 974 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో స్వంత భవనాలు 182 ఉండగా, ఉచిత అద్దె భవనాలు 309, అద్దె చెల్లిస్తున్నవి 483 ఉన్నాయి. ప్రస్తుతం స్వంత భవనాలు ఉండి, నల్లా కనెక్షన్ ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధమైన తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్లో ప్రతీ కేంద్రంలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు చిన్నారులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో విద్యుత్ సరఫరాతో ఫ్యాన్ల ఏర్పాటుకు అవకాశం ఉండగా.. వేసవిలో చిన్నారులకు ఉక్కపోత ఇబ్బందులు తొలగనున్నాయి. స్వంత భవనాలు ఉన్నచోట్ల ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ఖాన్ తెలిపారు.జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు 974 ఆర్వోప్లాంట్లు మంజూరు 79 చిన్నారులు 29,635 గర్భిణులు 3,307 బాలింతలు 3,543 -
‘పది’ పరీక్షలు ప్రారంభం
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 99.72శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం 9.30గంటల నుంచి 12.30గంటల వరకు ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, ఉర్దూ, హిందీ) పరీక్షలు నిర్వహించారు. రెగ్యులర్ విద్యార్థులు 9,682 మందికి గాను 9,655 మంది హాజరు కాగా, 27 మంది గైర్హాజరయ్యారు. గతంలో ఒక్కసారి ఫెయిలైన విద్యార్థులు ఏడుగురికి గాను ఐదుగురు హాజరు కాగా ఇద్దరు రాలేదు. పరీక్ష నిర్ణీత సమయానికి గంట ముందే విద్యార్థులు, తల్లిదండ్రులు కేంద్రాలకు చేరుకున్నారు. గది నంబరును సరిచూసుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కేంద్రాల్లోకి అనుమతించారు. చీఫ్ సూపరింటెండెంట్లు 48 మంది, డిపార్టుమెంటు అధికారులు 48మంది, సిట్టింగ్స్క్వాడ్ బృందాలతోపాటు 460మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించారు. కేంద్రాల్లో ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచారు. ప్రతీ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తనిఖీ అధికారులు, స్వ్వాడ్ ఫోన్లు బయటపెట్టారు. జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, ఐదు కేంద్రాలను డీఈవో యాదయ్య పరిశీలించారు. -
కేజీబీవీలు ‘ఎక్స్లెన్స్’
మంచిర్యాలఅర్బన్: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు బాలికలకు బాసటగా నిలుస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధన, వసతులతో కూడిన విద్య వారికి వరంగా మారాయి. జిల్లాలో 18 కేజీబీవీ(కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా)లు ఉండగా.. 15చోట్ల ఇంటర్, మూడింటిలో ఆరు నుంచి పదో తరగతి వరకు కొనసాగుతున్నాయి. 4640 మంది బాలికలు విద్యనభ్యసిస్తుండగా.. 241మంది ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు. ఆరు నుంచి పదో తరగతి వరకు నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. తాజాగా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఐఐటీ, నీట్, క్లాట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. మూడు ఎంపిక జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, తాండూర్ కేజీబీవీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్(వైఐఐఓఈ)గా మార్చారు. మంచిర్యాలలో ఐఐటీ, బెల్లంపల్లిలో నీట్, తాండూర్లో క్లాట్కు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకోలేని పరిస్థితి, రూ.లక్షలు ఖర్చు చేసే ఆర్థిక స్థోమత లేని దృష్ట్యా ఎంపిక చేసిన విద్యాలయాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మూడు విద్యాలయాల్లోని ఇంటర్ ప్రథమ సంవత్సరం(2026–27) గాను అడ్మిషన్లు స్వీకరించనున్నారు. ఇందులో చేరికకు విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మార్చి 2026లో పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థినులు ఈ నెల 16నుంచి ఏప్రిల్ 15వరకు ఆన్లైన్లో www.tgrjc.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష మే 3న టీజీఆర్జేసీ సీఈటీ–2026 ద్వారా నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రతిభావంతులకు ఆయా విద్యాలయాల్లో అవకాశం కల్పిస్తారని డీఈవో యాదయ్య తెలిపారు. కాగా, మిగతా కేజీబీవీల్లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. -
నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు భైంసా: బాసర ట్రిపుల్ఐటీలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ను శుక్రవారం వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పూర్తిచేసిన అర్హులైన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో ఉన్నత విద్యనభ్యసించే అవకాశాన్ని కల్పించేందుకు ఈ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని తెలిపారు. పదిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రతీ సబ్జెక్ట్ మార్కులకు అదనంగా డిప్రైవేషన్ స్కోర్ను జోడించి పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను టీజీ ఆన్లైన్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు లేదా https:// www. rgukt. ac.in/ÌZలో ఆన్లైన్లో సమర్పించవచ్చని అధికా రులు తెలిపారు. ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శ న్, అడ్మిషన్ కన్వీనర్ శీలం శేఖర్, కోకన్వీనర్ బండి హరికృష్ణ, అసోసియేట్ డీన్స్ డా. మహేశ్, డా. విఠ ల్, డా. దేవరాజ్, సునీత తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ చేపట్టాలి
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జన్నారపు రాజేశ్వర్ డి మాండ్ చేశారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఏటా పదుల సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారని, దీనికి కారణగాలను యూనివర్సిటీ అధికారులు వెల్లడించాలన్నారు. యూనివర్సిటీలో అడ్మిషన్స్ జరిగిన విధానంపై రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి విడుదలైన నిధుల ఖర్చులు, అన్ని టెండర్ ప్రక్రియ చెల్లించిన బిల్లులపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలన్నారు. నాయకులు మనోజ్,అక్షయ్, రాకేశ్, గౌతం, ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దుచేయాలి
రెబ్బెన: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్టీయూ ఏరియా అధ్యక్షుడు గోలేటి శ్రీనివాస్, కార్యదర్శి అరికెళ్ల పోచం అన్నారు. ఐఎప్టీయూ ఆధ్వర్యంలో ఈనెల 16న కలెక్టరేట్ల ముట్టడి, 23న హైదరాబాద్ రీజినల్ లేబర్ కమిషనర్ కార్యాల యం ఎదుట నిర్వహించే ధర్నా పోస్టర్లను శుక్రవా రం గోలేటిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను సింగరేణిలో అమలు చేయొద్దన్నా రు. లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుండి అమలు చేయాలని గెజిట్ విడుదల చేసిందన్నారు. వీటిని రద్దు చేసేవరకు దేశవ్యాప్తంగా కార్మికవర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. నాయకులు భీమేశ్, చందు, వెంకటేశ్, చంద్రయ్య, కుమార్, పోసుబాయి, తార, నాగలక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు. -
గాడితప్పిన సమయ ‘పాలన’
కై లాస్నగర్(బేల): బేల మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన పూర్తిగా గాడితప్పింది. సంబంఽధిత అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు తమ ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఎంపీడీవో, తహసీల్దార్, వ్యవసాయాధికారి కార్యాలయాలను సంప్రదించగా ఉద్యోగులెవరూ లేక ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రతినిత్యం ఇదే పరిస్థితి. వివిధ పనుల నిమిత్తం ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుండటం ఉద్యోగులు, సిబ్బంది నిర్వాకానికి నిదర్శనంగా నిలుస్తోంది. మధ్యాహ్నం 12.30 తర్వాత తీరిగ్గా హాజరయ్యే ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకల్లా తిరిగి ఇంటిముఖం పడుతారని అక్కడి సిబ్బంది చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. ఎంపీడీవో కార్యాలయంలో ఖాళీగా పర్యవేక్షకుడి కుర్చీ ఖాళీగా ఉన్న నాయబ్ తహసీల్దార్ సీటు -
సులభ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నస్పూర్: సింగరేణిలో పనిచేస్తున్న సులభ్ కార్మికు ల సమస్యలు వెంటనే పరష్కరించాలని సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి.బ్రహ్మానందం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన సులభ్ కార్మికులతో కలిసి శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీఎం శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రతీనెల 10 లోపు వేతనాలు చెల్లించ డం లేదన్నారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్, గత సంవత్సర కాలంగా పెండింగ్ ఉన్న డీఏ విడుదల చేయాలన్నారు. కార్మికులు, వారి కుటుంబాలకు హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని కోరారు. సులభ్ కాంప్లెక్స్లు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటికి మరమ్మతులు చేపట్టాలన్నారు.జిల్లా నాయకులు శంకరి, మంతెన లక్ష్మయ్య, నేదురి, నర్సయ్య, లక్ష్మయ్య, రాజేందర్, పరుశరాములు, విజయ, రౌతు లక్ష్మి, జ్యోతి, సుగుణ, తదితరులు పాల్గొన్నారు. -
ప్లాంటు పనులు వేగవంతం చేయాలి
చెన్నూర్: సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన 800 మెగావాట్ల ప్లాంట్ పనులు వేగవంతం చేయాలని సింగరేణి జీఎం (సివిల్) వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జీఎం నరసింహారావుతో కలిసి శుక్రవారం జైపూర్లోని ఎస్టీపీపీని సందర్శించారు. ప్లాంట్లో భాగంగా నిర్మించబోయే కూలింగ్ టవర్స్ పనులను పర్యవేక్షించారు. ప నుల వివరాలను బీహెచ్ఈఎల్ డైరెక్టర్ మధుకిరణ్, పీఎంపీఎల్, కేపీసీ అధికారులు వివరించారు. ప్లాంటు ప్రస్తుత స్థితిగతులను ఎస్ఈ సివిల్ బానోతు రాము డయాగ్రామ్ ద్వారా ఆయనకు తెలియజేశారు. ప్లాంట్ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు కిరణ్బాబు, రాము ఉన్నారు. యువకుడి అదృశ్యం మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన చిట్టిమల్ల అనిల్(26) అదృశ్యమయ్యారు. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. రాపల్లికి చెందిన అనిల్ వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 10వ తేదీ రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. అతని ఆచూకీపై బంధువులు, స్నేహితులతో ఆరా తీసిన దొరకలేదు. అనిల్ సోదరుడు దిలీప్ ఫిర్యాదు మేరకు శుక్రవారం మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒకరి బైండోవర్ దహెగాం: మండలంలోని కర్జి గ్రామానికి చెందిన కాటెల కమలాకర్ను శుక్రవారం తహసీల్దార్ మునవార్ షరీఫ్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. గ్రామంలో మద్యం తాగి గొడవలకు పాల్పడుతున్నందున సత్ప్రవర్తన కోసం బైండోవర్ చేశామని పేర్కొన్నారు. మరోసారి గొడవలకు పాల్పడితే రూ.లక్ష జరిమానాతోపాటు జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. -
టెర్మినల్ బెన్ఫిట్స్ వెంటనే అందించాలి
నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలో పదవీ విరమణ పొందిన ప్రతీ ఉద్యోగికి టెర్మినల్ బెన్ఫిట్స్ వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన జీఎం కార్యాలయంలో శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్కాస్టుల మేనేజర్లు, సంక్షేమ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గనుల వారీగా పదవీ విరమణ పొందిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపు వివరాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రాట్యూటీ, సీఎంపీఎఫ్, పెన్షన్ పెండింగ్ వివరాలు సేకరించారు. ఒక్కో గనిలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఏ ఏ కారణాలతో పెండింగ్లో ఉన్నాయో తెలుసుకుని త్వరగతిన పూర్తిచేయాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అర్హత లేనివారు, ఉద్యోగం అవసరం లేని వారికి ఎల్ఎస్పీ, ఎంఎంసీ పొందే వెసులుబాటు కల్పించాలన్నారు. అదేవిధంగా ఉద్యోగి అతని కుటుంబ సభ్యుల వివరాలు ఆన్లైన్లో నమోదు ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీజీఎం పర్సనల్ ఎస్.అనిల్కుమార్, డీవైపీఎంలు రాజేశ్, కిరణ్, సీనియర్ పీఓలు సురేందర్, మురళీ, ప్రశాంత్, వివిధ గనుల మేనేజర్లు, గనుల సంక్షేమాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
చెక్బౌన్స్ కేసులో ఇద్దరికి జైలు
మంచిర్యాలక్రైం: చెక్బౌన్స్ కేసులో ఇద్దరికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ మంచిర్యాల జిల్లా జ్యూడిషీయల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్, జూనియర్ సివిల్ జడ్జి కె.నిరోషా శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మందమర్రి మండలం క్యాతన్పల్లికి చెందిన అశోక్కుమార్ లడ్డా వద్ద ఆర్థిక అవసరాల నిమిత్తం మంచిర్యాల సీసీసీ కార్నర్కు చెందిన నేరెళ్ల రమేశ్ 2018లో రూ.5.77 లక్షలు, సీసీసీకి చెందిన నేరెళ్ల సాయికృష్ణ రూ.4.83 లక్షలను అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు వేర్వేరుగా 2018లో కోర్టును ఆశ్రయించాడు. జడ్జి.. ఈ కేసును విచారిస్తున్న సమయంలో అప్పు తిరిగి చెల్లించడంతోపాటు నేరెళ్ల రమేశ్కు సంవత్సర కాలం పాటు జైలుశిక్ష, నేరెళ్ల సాయికృష్ణకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. క్యాతనపల్లి అల్లర్ల కేసులో ఐదుగురికి బెయిల్ రామకష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్ల కేసులో ఐదుగురికి శుక్రవారం మంచిర్యాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామిడికుమార్, మేడిపెల్లి సంపత్, బండారి సూరిబాబు, కుర్మ దినేష్, ముస్తఫాలను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి ఆదిలాబాద్ జిల్లా జైలుకు రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. శుక్రవారం బెయిల్ మంజూరు చేయడంతో రాత్రి విడుదలయ్యారు. ‘అక్రమ కేసులతో వేధిస్తున్నారు’ మంచిర్యాలటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనపై అక్రమ కేసులను పెట్టి వేధిస్తున్నారని మంచిర్యాలకు చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోగుల రవీందర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గజ్వేల్లోని ఎర్రవల్లి ఫాంహౌస్లో మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. మంచిర్యాలలో తనపై ఇప్పటికే 30కి పైగా పోలీసులు కేసులను నమోదు చేశారని, ఇంకా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బీ ఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భయాందోళన చెందా ల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని కేసీఆర్ పేర్కొన్నారని రవీందర్రెడ్డి తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన నలుగురి అరెస్ట్ ఆదిలాబాద్టౌన్: బెదిరింపులకు పాల్పడిన నలుగురిని అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. పోలీసుస్టేషన్లో శుక్రవారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రాంనగర్కు చెందిన సలాం వరుణ్, దుర్గానగర్కు చెందిన వెట్టి మనోజ్, ఇంద్రవెల్లి మండలానికి చెందిన కుమ్రం ప్రభాత్రావు, బజార్హత్నూర్కు చెందిన దుర్వ సుభాష్ ఆర్కే కోఆపరేటీవ్ సొసైటీ ద్వారా డబ్బులు తీసుకున్నారు. తిరిగి చెల్లించాలని సొసైటీ చైర్మన్ కొండూర్ రాకేందర్ అడిగితే తుడుందెబ్బ పేరుతో బెదిరింపులకు దిగారు. సొసైటీ ద్వారా డబ్బులు తీసుకున్న ప్రభాత్రావు, దుర్వ సుభాష్లు తిరిగి ఇవ్వకుండా వెట్టి మనోజ్, సలాం వరుణ్లు ఆదివాసీ నాయకులమని చెబుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. రాకేందర్ నుంచి రెండు, మూడు విడతల్లో ఒక్కోసారి రూ.20వేల చొప్పున డబ్బులు వసూళ్లు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. సెక్యూరిటీగార్డుపై దాడిచేసిన ఇద్దరిపై కేసు ఆదిలాబాద్టౌన్: వసుంధర షాపింగ్ మాల్ సెక్యూరిటీ గా ర్డుపై దాడిచేసిన ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సు నీల్కుమార్ తెలిపా రు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన నిందితులు షేక్ సమీర్, సాబిల్లు గురువారం పార్కింగ్ విషయంలో గొడవపడి సెక్యూరిటీ గార్డు రాథోడ్ రవిపై దాడికి దిగారు. బాధితుడు ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. వారి బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
చెన్నూర్: రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన ధారావత్ ధనుష్ ప్రతిభ కనబర్చాడు. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ఎన్9 బ్యాడ్మింటన్ అకాడమీలో ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–17 బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబర్చి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన సీఎం కప్–2025 బ్యాడ్మింటన్ పోటీల్లో రెండు పతకాలు సాధించాడు. ధనుష్..సింగరేణి ఎస్టీపీపీలో డీజీఎం (ఈఅండ్ఎం) ధారావత్ దంపతుల కుమారు డు. ఏప్రిల్ 16 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్దీపక్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నాడు. అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా డిప్యూటీ స్పోర్ట్స్ ఆఫీసర్ యాకుబ్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సుధాకర్లు అతన్ని అభినందించారు. -
రామకృష్ణాపూర్ ఓసీపీ–2 విస్తరణపై సమీక్ష
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ ఓపెన్కాస్ట్ ఫేజ్–2 గని అంశంపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శుక్రవారం మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణతో సమీక్షించారు. గద్దెరాగిడిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి అనంతరం ఓసీ ఫేజ్–2పై జీఎంతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓసీ విస్తరణలో భాగంగా ఫేజ్–2 మైన్కు అనుమతులు లభించాయని, అయితే గనికి అవసరమైన భూమికి ఇంకా ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. గనికి కేటాయించాల్సిన భూమి నాన్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నప్పటికీ కొందరు అధికారులు దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా పేర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికే క్లియరెన్స్ కోసం డీఎఫ్ఓ సహా సంబంధిత అధికారులతో మాట్లాడి అనుమతులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కొత్త గని అందుబాటులోకి వస్తే సుమారు 18 ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తి కొనసాగడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గనుల కోసం నిర్వహించిన వేలంలో పాల్గొనకుండా అడ్డుకుందని విమర్శించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి, పల్లెరాజు, గాండ్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
సరిపడా గ్యాస్ సిలిండర్లు
● కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు ● పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజలకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర్రా వు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో ఎల్పీజీ సిలిండర్ల నిల్వ లు, సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, రబీ పంటల సాగు, ధాన్యం కొనుగోలు కార్యాచరణ అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేద ని, అధికారులు ఆయిల్ కంపెనీలతో ప్రతీరో జు సమీక్షించాలని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎల్పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతీరోజు సమీక్షించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించి బుకింగ్ నిల్వలపై సమీక్షిస్తున్నామని అన్నారు. డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, నీటిపారుదల శాఖ ఈఈ విష్ణుప్రసాద్, వ్యవసాయ అధికారి సురేఖ, పౌరసరఫరాల శాఖ మేనేజర్ శ్రీకళ పాల్గొన్నారు. -
భారీగా పెరగనున్న జనాభా
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జనగణనకు అంతా సిద్ధమవుతోంది. గత కొన్నేళ్లుగా వాయిదా పడుతున్న జనాభా లెక్కల సేకరణ వచ్చే మే నెలలో మొదలు కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 2011లో చేపట్టిన జనాభా లెక్కలే ఇప్పటికీ జిల్లా జనాభాకు ప్రామాణికంగా మారాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలన పేరుతోనూ సామాజిక, ఆర్థిక, కుల గణన చేపట్టారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దేశాభివృద్ధి, లోటుపాట్లపై ప్రణాళికలు రూపొందించాలంటే జనాభాపై స్పష్టత ఉండాలి. అలాగే ఆయా వర్గాల్లో అర్హులకు ప్రాయోజితాలు దక్కాలన్నా ఈ జనాభా వివరాలే కీలకం ఈ క్రమంలో జనగణనకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే అంతా సిద్ధం చేసింది. జిల్లాలోనూ ఈ మేరకు గత మూడు రోజులుగా శిక్షణ జరుగుతోంది. మండల పరిధిలో తహసీల్దార్లు, ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లకు శిక్షణ ఇచ్చారు. రెండు దశల్లో వివరాల సేకరణ రెండు దశల్లో జరగనున్న ఈ గణనలో ఎన్యుమరేటర్లు మొదట ప్రతీ యూనిట్(కుటుంబాలు)లను లెక్కిస్తారు. ప్రతీ వంద కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున నియమించనున్నారు. వేసవి సెలవులు పూర్తయితే ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు ఎన్యుమరేటర్లుగా వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలో మే 11నుంచి జూన్ 9వరకు ఇళ్లు, కుటుంబాల వివరాల సేకరించనున్నారు. ఇక రెండో దశలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టనున్నారు. జననాలను మార్చి ఒకటి నుంచి కటాఫ్గా తీసుకుని నమోదు చేయనున్నారు. 33అంశాలతో కూడిన ప్రశ్నావళిని ఎన్యుమరేటర్లు జిల్లాలో ప్రతీ ఇంటి నుంచి వివరాలు తీసుకోనున్నారు. ఇంటి రకం నుంచి మొదలు సౌకర్యాలు, సామాజిక స్థితిని ప్రతిబింబించే పలు ప్రశ్నలతో కూడిన అంశాలను అడిగి నమోదు చేస్తారు. అంతా డిజిటల్, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఈసారి జనగనణలో పూర్తిగా పేపర్ లెస్గా ప్రత్యేక పోర్టల్లో ఎన్యుమరేటర్లు ట్యాబ్లతో నమోదు చేయనున్నారు. పూర్తిగా డిజిటల్గా పద్ధతిలో వివరాలు సేకరించనున్నారు. ఇక పౌరులు సైతం సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. సెన్సస్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్లి నేరుగా వివరాలు పొందుపర్చవచ్చు. మొబైల్ నంబరుతో లాగిన్ అయి పూర్తి వివరాలు ఆన్లైన్లోనే నమోదు చేయొచ్చు. లేకపోతే ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు పూర్తిగా వివరాలైన వెల్లడించాలి. జనాభా లెక్కలే కీలకం కేంద్రం ప్రతీ పదేళ్లకోసారి నిర్వహిస్తున్న జనాభా లెక్కలే అత్యంత ప్రామాణికం. ఈ లెక్కింపుతో సీ్త్ర, పురుష, లింగ నిష్పత్తి, బాల, బాలికలు, అక్షరాస్యత, ఆర్థి క స్థితి, సామాజిక స్థితిగతులు సైతం తెలుస్తాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ, ఈబీసీ, మహిళలకు అవకాశాల కోసం రిజర్వేషన్లు, పథకాల అమలు లెక్కల ఆధారంగా ఉంటుంది. 2021లోనే గణన చేపట్టాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. తర్వాత లోక్సభ ఎన్నికలు తదితర కారణాలతో వాయిదా పడుతూ చివరకు ఈ ఏడాదిలో గణనకు కసరత్తు పూర్తయింది. తమ పూర్తి వివరాలు తెలియజేస్తే దేశపురోగతికి తోడ్పడుతుందని, అందరూ నిజాలే చెప్పాలని అధికారులు కోరుతున్నారు.2011లో చివరగా జనాభా లెక్కలు జరగగా మళ్లీ 15ఏళ్ల తర్వాత జరుగుతున్నాయి. ఈ క్రమంలో గ్రామాలు, పట్టణాల్లో జనాభా పెరగనుంది. జిల్లా కేంద్రం మంచిర్యాల నగరంలోనే రెండు లక్షలకుపైగా జనాభా ఉండగా, మిగతా పట్టణాల్లో 50వేల నుంచి లక్ష వరకు జనాభా ఉండనుంది. ఇక మేజర్ గ్రామ పంచాయతీలు, చిన్న పంచాయతీల్లోనూ గడిచిన పదిహేనేళ్లలో జనన, మరణాలు పెరిగాయి. ఈ క్రమంలో జనాభా పది లక్షలు దాటే అవకాశం ఉన్నట్లు అంచనా ఉంది. -
వంటింట్లో ధరల మంట
మంచిర్యాలఅగ్రికల్చర్: వంటింట్లో ధరల మంట మండుతోంది. గ్యాస్ ధరలకు రెక్కలు రాగా.. వంటనూనెలు, పప్పుల ధరలు ఒక్కసారిగా పెరిగి వినియోగదారులపై పెనుభారం పడుతోంది. గత నెల రోజులుగా విదేశాల నుంచి వంటనూనె, పప్పుదినుసుల దిగుమతులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గత నెలలో పొద్దు తిరుగుడు నూనె ప్యాకెట్ ధర రూ.145 నుంచి రూ.150 మధ్య ఉండగా.. ఈ వారంలో రూ.165 నుంచి రూ.180కి చేరింది. పామాయిల్ ధర రూ.140 నుంచి రూ.160కి పెరిగింది. పల్లిలు కిలో రూ.125 నుంచి రూ.135 ఉండగా ప్రస్తుతం రూ.175 నుంచి రూ.180కి చేరింది. కందిపప్పు రూ.120 నుంచి రూ.130 ఉండగా.. రూ.140 నుంచి రూ.150కి చేరింది. హోల్సేల్ దుకాణాల్లో ఇలా ఉంటే రిటెయిల్, గ్రామాల్లోని దుకాణాల్లో నూనె ప్యాకెట్, కిలో పప్పులపై మరో రూ.5 నుంచి రూ.10వరకు పెంచి విక్రయిస్తున్నారు. ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో జిల్లా ప్రజలపై రూ.4.30కోట్ల మేర భారం పడుతోంది. గ్యాస్ ధరలు, ఇటు వంటనూనె, పప్పుల ధరలు ౖపైపెకి చేరడంతో దినసరి కూలీ జేబు ఖాళీ అవుతోంది. ఇతర దేశాల దిగుమతులు తగ్గిపోవడంతో ధరలు పెరిగిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడడంతో కొందరు ముందస్తుగా నిల్వ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి కొంత కృత్రిమ కొరత సృష్టించి కూడా ధరలు పెంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధర పెరుగగా.. వంటనూనెలు, పప్పుల ధరలు పెరగడంతో సామాన్యుడితోపాటు హోటళ్ల నిర్వాహకులపై తీవ్ర ప్రభావం పడుతోంది. యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. -
విద్యార్థులూ.. విజయీభవ
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈసారి పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఇస్తారు. అంతకుమించితే మాత్రం పరీక్ష రాసే వీలుండదు. జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా 9703మంది పరీక్షలకు హాజరు కానుండగా.. వీరిలో 4896 మంది బాలురు, 4807 మంది బాలికలు ఉన్నారు. ఎనిమి ది పరీక్షలకు 33రోజుల వ్యవధి ఉంది. మార్చి 14, 18, 23, 28, ఏప్రిల్ 2, 7, 13న పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఎస్ఈ తరహాలో మొదటిసారిగా ఒక్కో పరీక్షకు మూడు నాలుగు రోజుల విరామం వస్తోంది. దీంతో విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఏర్పడింది. హాల్టికెట్పై ముద్రించిన క్యూర్ కోడ్ను స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా తెలుసుకోవచ్చు. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. నిఘా.. ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య సిబ్బందితోపాటు మందులు అందుబాటులో ఉంచుతున్నారు. ఫర్నిచర్, డ్యుయల్ డెస్క్లు, ఫ్యాన్లతోపాటు సౌకర్యాలు కల్పించారు. ప్రతీ కేంద్రంలో సీఎస్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిఘా కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలు తెరవడం, జవాబు పత్రాలు సీల్ వేయడం చేస్తారు. ప్రతీ కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్, విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు బృందంతోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్ ఎప్పటికప్పుడు కేంద్రాలను సందర్శిస్తుంది. వాట్సాప్లో హాల్టికెట్లు ఈసారి మూడు రకాలుగా హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయి. ప్రింటెడ్ హాల్టికెట్లు పాఠశాలల్లో పంపిణీ, ఎస్సెస్సీ బోర్డు వెబ్సైట్ bse.te langana.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ 80969 58096 వాట్సప్ నంబరుకు జిజీ సందేశం పంపిన తర్వాత hall ticket march 2026 అని పంపాలి. విద్యార్థి వివరాలు నమోదు చేసి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గంట ముందే చేరుకోవాలిపరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలి. మొబైల్ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి లేదు. ప్రశ్నపత్రం జాగ్రత్తగా చదివి సమాధానాలు రాయాలి. ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలి. విద్యార్థుల సందేహాల నివృత్తికి హెల్ప్లైన్ నంబర్లు 94409 67015, 94406 88034లో సంప్రదించవచ్చు. – యాదయ్య, డీఈవో -
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. గత నెల 25న ప్రారంభం కాగా.. శుక్రవారం చివరి పరీక్షకు హాజరయ్యారు. చివరి రోజు 5,429మందికి గాను 5,273మంది హాజరు కాగా, 156మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 4,811మందికి గాను 4,704మంది హాజరు కాగా 107మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 618 మందికి 569 మంది హాజరు కాగా 49 మంది రాలేదు. ఇంటర్ పరీక్షలు సజావుగా ముగిసినట్లు డీఐఈవో అంజయ్య తెలిపారు. 14న ఫిజికల్ సైన్స్ ఫస్టియర్, 16న ఫిజికల్ సైన్స్ సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. శుక్రవారం పరీక్షలు పూర్తి కాగానే కేంద్రాల విద్యార్థులు కేరింతలు కొట్టారు. సెల్ఫోన్లలో ఫొటోలు దిగారు. మళ్లీ ఎప్పుడు కలుస్తామోనని కాసేపు కబుర్లలో మునిగితేలారు. పరీక్షలన్నీ పూర్తి కావడంతో విద్యార్థులు హాస్టళ్ల నుంచి స్వగ్రామాలకు తరలివెళ్లారు. ఇంతకాలం కుటుంబసభ్యుల మాదిరిగా కలిసి ఉన్న హాస్టల్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులను విడిచి వెళ్లాల్సి రావడంతో కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థులతో బస్స్టేషన్లు కోలాహలంగా మారాయి. -
బాసరలో అంతఃప్రజ్ఞ 2కే–26
బాసర: దేశంలోనే అతిపెద్ద గ్రామీణ సాంకేతిక ఉత్సవంగా గుర్తింపు పొందిన అంతఃప్రజ్ఞ 2కే–26 బాసర రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టె క్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ను గేమింగ్ అరేనాగా మార్చి, ఏఆర్/వీఆర్ సిమ్యులేషన్లు, డ్రోన్ ఆధారిత గేమ్లు, వీడియో గేమింగ్ సెటప్లు ఏర్పాటు చేశారు. ఇవి అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సృజనాత్మక స్టాళ్లు క్యాంపస్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినూత్న ఆవిష్కరణలు, టెక్నాలజీ ప్రదర్శనలు, వినోదాత్మక కార్యక్రమాలతో ప్రాంగణం సందడిగా మారింది. వీసీ, ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ మురళీదర్శన్, ఫ్యాకల్టీ కన్వీనర్ జె.స్వప్నిల్, కాకతీయ శాండ్ బాక్స్ ప్రతినిధి సత్యం కె.చౌబే, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
‘డ్రగ్స్ మహమ్మారిని అరికడుదాం’
మంచిర్యాలఅర్బన్: సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల డీఈవో యాదయ్య అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా సైన్స్ కేంద్రంలో 18 మండలాల నుంచి ఎంపిక చేసిన 20 పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులకు డ్రగ్స్ అరికట్టడం, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు ప్రహరీ క్లబ్లకు చెందిన విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైకియాట్రిస్ట్ వైద్యుడు రామ్నాయక్, పోలీస్ విభాగం నుంచి ఇన్స్పెక్టర్ మధుసూదన్, రిసోర్స్పర్సన్లు కృష్ణారెడ్డి, ముజీర్, సత్యనారాయణమూర్తి, సెక్టోరల్ అధికారి చౌదరి, సైన్స్ అధికారి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల సంక్షేమానికి నిధులు కేటాయించాలి
నస్పూర్: ఈ నెల 16నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో బీసీల సంక్షేమానికి రూ. 50 వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సమితి ఆధ్వర్యంలో గురువారం సీసీసీ కార్నర్లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. హామీ విస్మరించి మొదటి బడ్జెట్ సమావేశాల్లో రూ.9వేల కోట్లు, రెండో బడ్జెట్ సమావేశాల్లో రూ.11 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టడం బీసీలకు అన్యాయం చేయడమేనని విమర్శించారు. 56శాతం జనాభా ఉన్న బీసీలకు అరకొర నిధులు కే టాయిస్తే వారి ఆర్థికాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అత్యధిక పన్నులు చెల్లించేది బీసీ లేనని చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో బీసీ లకు రూ.50వేల కోట్లు కేటాయించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు గజెల్లి వెంకటయ్య, వేముల అశోక్, చంద్రగిరి చంద్రమౌళి, అంకం సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభం
జన్నారం: మండలంలోని చింతగూడలో ని ర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని గురువారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుతారి సుమలత ఎమ్మెల్యే దృష్టికి గ్రామ సమస్యలు తీసుకెళ్లగా, ఆయన స్పందించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తదితరులున్నారు. క్రీడా పోటీలు ప్రారంభంమంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాల మైదానంలో మై భారత్ (మేరా యువ భారత్) ఆధ్వర్యంలో క్లస్టర్ బ్లాక్ స్థాయి క్రీడాపోటీలు గురువారం అట్ట హాసంగా ప్రారంభమయ్యాయి. రెండ్రోజుల పాటు నిర్వహించనున్న పోటీలను కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వై.నరేందర్రెడ్డి ప్రారంభించారు. రన్నింగ్, షటిల్, బ్యాడ్మింటన్, వాలీబాల్ పోటీల్లో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఇన్చార్జి గోపాలకృష్ణ, కళాశాల అధ్యాపకులున్నారు. నూతన నియామకంమంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన బీజేపీ నాయకుడు, న్యాయవాది తులా ఆంజనేయులును పార్టీ తెలంగాణ మీడియా ప్యానలిస్ట్గా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నియమిస్తూ ఉ త్తర్వులు జారీ చేశారు. ఆంజనేయులు విద్యార్థి దశలోనే ఏబీవీపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. బీజేవైఎం మంచిర్యాల జిల్లా క న్వీనర్గా, అధ్యక్షుడిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా సేవలందించారు. తనను బీజేపీ మీడియా ప్యానలిస్ట్గా నియమించినందుకు గాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్గౌడ్కు ఈ సందర్భంగా ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. -
ల్యాప్టాప్ కష్టాలు
భైంసా: గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బాసరలోని ట్రిపుల్ఐటీ ప్రస్తుతం సమస్యల గూడంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక విద్యకు ప్రతీకగా నిలవాల్సిన ఈ విద్యాసంస్థలో విద్యార్థుల చేతుల్లో పుస్తకాలే తప్ప, వారి చదువుకు అవసరమైన ల్యాప్టాప్లు కనిపించడం లేదు. ఇంజినీరింగ్ మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న సుమారు 3 వేల మందికి ఇప్పటివరకు ల్యాప్టాప్లు ఇవ్వకపోవడంతో వారి భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులకు కలగానే..గతంలో పదో తరగతి అనంతరం ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందిన వెంటనే పీయూసీ చదువుతున్న విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేసే విధానం ఉండేది. కానీ గత ఆరేళ్లుగా ఆ సంప్రదాయం నిలిచిపోయింది. కనీసం ఇంజినీరింగ్లోకి వచ్చిన తర్వాత అయినా ల్యాప్టాప్లు అందుతాయని ఆశించిన విద్యార్థులకు అది కలగానే మిగిలింది. ఇంజినీరింగ్ విద్యలో కీలకమైన కోడింగ్, డిజైనింగ్, ప్రోగ్రామింగ్ వంటి అంశాలను కంప్యూటర్ లేకుండానే నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాక్టికల్స్ చేయడానికి అవకాశం లేకపోవడంతో అనేక మంది పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే వేధింపులుయూనివర్సిటీకి వచ్చే మంత్రులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని విద్యార్థులు చెబుతున్నారు. తమ సమస్యలను బయటకు చెబుతున్న వారిపై అధికారులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమస్యలపై ప్రశ్నించిన విద్యార్థులను వేధిస్తున్నారని, ఈ విషయమై మంత్రులు, మానవ హక్కుల సంఘానికి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు పేర్కొంటున్నారు. రెండేళ్లలో ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటకు వెళ్లాల్సిన విద్యార్థులు కనీసం కంప్యూటర్ మౌస్ పట్టుకోకుండా డిగ్రీలు పూర్తిచేసి వెళ్తేవారికి ఉద్యోగాలు ఎలా వస్తాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గ్రామీణప్రాంతాల నుంచి పెద్ద ఆశలతో వచ్చిన పేద విద్యార్థులు ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే నిధులు విడుదల చేసి విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. పంపిణీకి నిధుల కొరత సాకు!ల్యాప్టాప్ల పంపిణీకి నిధుల కొరతను సాకుగా చూపుతున్న అధికారులు పీయూసీ విద్యార్థుల కోసం నామమాత్రంగా ఒక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. 3,300 మంది విద్యార్థులు ఉన్న విభాగంలో కేవలం వంద నుంచి రెండు వందల డెస్క్టాప్ కంప్యూటర్లను మాత్రమే ఉంచడం వారిలో అసంతృప్తిని కలిగిస్తోంది. కంప్యూటర్ ఉపయోగించేందుకు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. మరో రెండునెలల్లో ల్యాప్టాప్లు ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మరో రెండు నెలల్లో ల్యాప్టాప్లు అందజేస్తాం. పీయూసీ విద్యార్థుల కోసం ప్రస్తుతం ల్యాబ్లో 1,250 ల్యాప్టాప్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. – వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ -
17న సింగరేణి పరిరక్షణ కోసం ఆందోళనలు
బెల్లంపల్లి: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కా రం కోసం ఈనెల 17న ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూ నియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటస్వామి, బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, గోలేటి, బెల్లంపల్లి బ్రాంచి ఇన్చా ర్జి చిప్ప నర్సయ్య తెలిపారు. బెల్లంపల్లి సీపీఐ కా ర్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఏసీబీ కేసు నమోదును ఆసరా తీసుకుని సింగరేణిలో మెడికల్ బోర్డును ఆపేయడం సరైంది కాదన్నారు. ఈ విషయాన్ని ఏఐటీయూసీ గుర్తింపు సంఘం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా యధాతథంగా బోర్డు కొనసాగి స్తామని హామీ ఇచ్చిన అమలుకావడం లేదన్నారు. మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల సింగరేణిలో అ వినీతి, కుంభకోణాలు జరుగుతున్నాయని ఈక్రమంలో ఆందోళన కార్యక్రమాలకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందులోభాగంగా ఈనెల 17న గనులు, విభాగాల్లో నల్లబ్యాడ్జీలు ధ రించి ధర్నాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. 18 నుంచి శ్రీరాంపూర్లో సేవ్ సింగరేణి జాతా ప్రారంభించి అన్ని ఏరియాల కార్మికులను చైతన్యపరుస్తామన్నారు. 30న కొత్తగూడెం హెడ్ఆఫీసు ఎదుట ధర్నా, ఏప్రిల్లో సమ్మె చేస్తామని ప్రకటించారు. సమావేశంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ఆడేపు రాజమౌళి, తిరుపతిగౌడ్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, శ్రీధర్, రమేశ్, రాంచందర్, సాగర్, శేషికుమార్, రామకృష్ణ, వివేక్ పాల్గొన్నారు. -
బాలికలు హెచ్పీవీ టీకా తీసుకోవాలి
మంచిర్యాలటౌన్: 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపున్న బాలికలు హెచ్పీవీ టీకా తీసుకోవాలని ప్రోగ్రాం అ ధికారి డాక్టర్ అనిల్కుమార్ సూచించారు. జిల్లా వై ద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బాలికలకు అవగాహన క ల్పించారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివా రించేందుకు ఉద్దేశించిన టీకాలను ప్రభుత్వం ఉచి తంగా ఇస్తోందని తెలిపారు. మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూర్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాలకు తల్లిదండ్రుల నుంచి సమ్మతిపత్రంతో పాటు ఆధార్కార్డు తీసుకువెళ్లాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థినులు ఒత్తిడికి గురికా కుండా పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు. హె ల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు నాందేవ్, దీక్షితారాణి, ప్రిన్సిపాల్ సంధ్య, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసరావు, ఏఎన్ఎం రాజేశ్వరి, పాఠశాల స్టాఫ్ నర్సు శ్రీలత ఉన్నారు. -
ముగిసిన ఫస్టియర్ పరీక్షలు
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ముగి శాయి. చివరిరోజు 6,319 మంది విద్యార్థులకు గాను 6,065 మంది హాజరు కాగా, 254 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 5,665 మందికిగాను 5,472 మంది హాజరు కాగా, 193 మంది పరీక్షలు రాయలేదు. వొకేషనల్లో 654 మందికి గాను 593 మంది హా జరుకాగా 61 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో అంజయ్య తెలిపారు. కాగా, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు పూర్తి కావడంతో వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు ఇంటిబాట పట్టారు. చివరి పరీక్ష రాసి బయటకు వచ్చిన వారంతా కేరింతలు పెట్టారు. సెల్ఫీలు దిగి సందడి చేశారు. అనంతరం హాస్టల్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామాలకు తరలివెళ్లారు. -
నగర అభివృద్ధికి కృషి చేద్దాం
మంచిర్యాలటౌన్: నగర అభివృద్ధికి కృషి చేద్దామని నగరపాలక సంస్థ మేయర్ దర్ని మధుకర్ పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో మొదటి సాధారణ సమావేశాన్ని మేయర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కమిషనర్ అన్వేశ్ ఆధ్వర్యంలో నిర్వహించా రు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తాగునీటి సమస్య లేకుండా చూడాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను ఆదేశించా రు. సమావేశ మందిరం నిర్మాణానికి రూ.50 లక్షలు ముందుగా కేటాయించగా, ఫర్నిచర్, ఇంటీరియర్ డెకరేషన్, సౌండ్ సిస్టం కోసం రూ.10 లక్షలు, మ హాప్రస్థానంలో ట్యాంక్ నిర్మాణానికి రూ.15 లక్షలను సాధారణ నిధుల నుంచి కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మేయర్, డిప్యూటీ మేయర్ క్యాబిన్లు, కమిషనర్ నూతన చాంబర్ కోసం నిధుల కేటాయింపుతోపాటు, వివిధ పనులకు రూ.1.11 కోట్లు కేటాయించారు. ఇంజినీరింగ్ విభాగంలో నీ టి సరఫరా, ఎలక్ట్రికల్ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల కాలపరిమితి మార్చి 2025తో ముగియనుండగా, 2027 మార్చి వరకు వేతనాల కోసం అయ్యే వ్యయం రూ.1.83 కోట్లు మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి చెల్లించేందుకు పరిపాలన ఆమోదం పొందారు. తాత్కాలికంగా 11మంది ట్యాంకర్ డ్రైవర్లను మార్చి 2027వరకు తీసుకునేందుకు గాను రూ.19.80 లక్షల మంజూరుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. నస్పూరుతోపాటు విలీన గ్రా మాల్లో తాగునీటి సరఫరా నిర్వహణ, అభివృద్ధికి రూ.32.95 లక్షలు, మంచిర్యాలలో తాగునీటి సరఫరా నిర్వహణకు రూ.25 లక్షలు, నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు ఫిబ్రవరిలో చేసిన ఖర్చు రూ.24.23 లక్షలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ప్రతీ డివిజన్కో కార్యాలయం చొప్పున 60 డివిజన్లలో నిర్మించేందుకు రూ.1.40 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కా ర్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కోసం రోజువారీ కార్మికులను తీసుకునేందుకు గాను రూ.40లక్షల సాధారణ నిధులకు పరిపాలన ఆమోదం తెలిపారు. మంచిర్యాల కా ర్పొరేషన్లో ఆస్తి పన్ను, నీటి పన్ను, ఇతర పన్నుల బకాయిల వసూలుకు అవగాహన, విస్తృత ప్రచా రం నిర్వహించేందుకు నాలుగు ఆటోలను మార్చి 31వరకు ఎంగేజ్ తీసుకునేందుకు రూ.3.10లక్షలు కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. -
ఆన్లైన్లోనే గ్యాస్ బుకింగ్
మంచిర్యాలఅగ్రికల్చర్: గ్యాస్ వినియోగదారులు ఆన్లైన్లో మాత్రమే సిలిండర్లు బుక్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు సూచించారు. గురువారం ఆయన చాంబర్లో ఎల్పీజీ డీలర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్యాస్ కంపెనీల సేల్స్ అధికారులతో ఫోన్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో గృహావసరాల కోసం వినియోగించే డొ మెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని తెలిపారు. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలు, గోదాముల వద్దకు వెళ్లకుండా ఆన్లైన్లో మాత్రమే సిలిండ ర్లు బుక్ చేసుకోవాలని సూచించారు. గ్యాస్ బు కింగ్ గడువు సింగిల్ సిలిండర్ వారికి 25రోజు లు, డబుల్ సిలిండర్ వారికి 30 రోజుల వ్యవధి ఉంటుందని పేర్కొన్నారు. సిలిండర్ డెలివరీ స మయంలో డెలివరీ బాయ్కి ఓటీపీ చెప్పి సహకరించాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో వాణిజ్య సిలిండర్ మాత్రమే వినియోగించాలని, నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగించినాస్తే కఠినచర్యలు తీసుకుంటామ ని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్లో సిలిండర్లను విక్రయించాలని చూస్తే నిత్యాసవరాల సరుకుల చట్టం 1955 కింద కఠి నచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవైసీ చేసుకోనివారు వినియోగదారులు వెంటనే చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
శభాష్ ఫైర్సిబ్బంది
మంచిర్యాలక్రైం: ఇంట్లో బెడ్రూంలో డోరు లా క్ పడి లోపల ఉన్న చిన్నారిని సురక్షితంగా కా పాడి ఫైర్ సిబ్బంది శభాష్ అనిపించుకున్నా రు. వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాకేంద్రంలోని చున్నంబట్టివాడలో సుద్దాల అజయ్–సుస్మిత దంపతులకు కుమార్తె అద్వైత(2) ఉంది. గురువారం ఇంట్లో బెడ్రూంలో ఆడుకుంటూ డోర్ లాక్ పడింది. డోర్ తెరువకపోవడంతో అజయ్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకున్నారు. లాడర్ సహాయంతో మూడు అంతస్తులపై భవనం పైకి చేరుకుని వెంటిలేషన్ డ్రిల్స్ తీసివేశారు. గదిలో చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తల్లిదండ్రులు, స్థానికులు ఫైర్ సిబ్బందిని అభినందించారు. -
ఐకే–1ఏ, ఐకే–ఓసీపీలో మైన్క్లోజర్ తనిఖీ
చెనూరు: జైపూర్ మండలం ఇందారం ఐకే–1ఏ, ఐకే–ఓసీపీలో ప్రోగ్రెసివ్ మైన్క్లోజర్ కార్యక్రమంలో భాగంగా వోఎస్డీ(సీసీవో,ఎంవోసీ) కృష్ణమోహన్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ బృందం గురువారం పర్యటించింది. మైన్క్లోజర్ పనులు పరిశీలించి గనుల తవ్వకం పూర్తయిన ప్రదేశాల్లో మట్టి నింపడం, చెట్లు నాటడం వంటి చర్యల ద్వారా పర్యావరణహితంగా పునరుద్ధరించే కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. ఐకే–గ్రూప్ ఏజెంట్ ఏవీ.రెడ్డి గనుల పరిసరాలను బృందానికి వివరించారు. అంతకుముందు శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్.. వోఎస్డీ కృష్ణమోహన్ను సన్మానించారు. కార్పొరేట్ పర్యావరణాధికార విభాగం అదనపు మేనేజర్లు తిరుపతి, శంకర్, బాబ్జీలు, కార్పొరేట్ ఎస్ఎస్వో యాదగిరి, డీజీఎం ఫారెస్టు హరినారాయణ, ఐకే–ఓసీపీ మేనేజర్ నాగన్న, కోటయ్య, పర్యావరణాధికారి హన్మాన్గౌడ్ తదితరులు ఉన్నారు. -
23న ‘కోడ్’ల రద్దుకు ధర్నా
బెల్లంపల్లి: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నా లుగు లేబర్ కోడ్లు రద్దు చేయాని డిమాండ్ చే స్తూ ఈనెల 23న హైదరాబాద్ ఆర్ఎల్సీ కా ర్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివా స్ తెలిపారు. కార్మికులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. గురువా రం బెల్లంపల్లి సింగరేణి సివిల్ విభాగం కార్యాలయ ఆవరణలో ధర్నా పోస్టర్ ఆవిష్కరించా రు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మి కవర్గానికి అత్యంత ప్రమాదకరమని, వీటిని నివారించాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో ఈనెల 16న కలెక్టరేట్లు ముట్టడిస్తామని తెలిపారు. నాయకులు కృష్ణవేణి, వెంకటి, ల త, కొమురయ్య, శ్రీనివాస్, భాను, అమృత, మైసక్క, చంద్రకళ, కరుణ, వెంకటేశ్, బుచ్చ వ్వ, రాజేశ్వరి, కుమార్ తదితరులున్నారు. పాతమంచిర్యాల: నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని ఈ నెల 16న తలపెట్టిన ‘కలెక్టర్ ముట్టడి’ పోస్టర్ను జిల్లా కేంద్రంలోని మార్క్స్ భవన్లో ఆవిష్కరించారు. కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మంతెన మల్లన్న కోరారు. నాయకులు సురేందర్, రాజేశ్, తిరుపతిరెడ్డి, దేవన్న, అరుణ, సత్యం పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం
నేరడిగొండ: మండలంలోని బోరిగాం గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా క్షణాల్లోనే మంటలు చెలరేగా యి. ఈ ప్రమాదంలో మూడు నివాస గృహాలతో పాటు రెండు పశువుల కొట్టాలు దగ్ధమయ్యాయి. ఇళ్లలో ఉన్న నిత్యావసర వస్తువులు, నగదు, ధాన్యం, ఇతర విలువైన సామగ్రి పూర్తిగా కాలిబూడిదయ్యాయి. గ్రామస్తులు మంటలార్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే కాలిపోయాయి. ఇచ్చోడ నుంచి ఫైరింజన్ ఘటన స్థలానికి చేరుకుని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ప్రమాదంలో జాదవ్ ప్రేమ్సింగ్, జాదవ్ సుందర్, జాదవ్ అంబర్సింగ్ నివాస గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే జాదవ్ రెడ్డియా, రాథోడ్ బిక్కులాల్కు చెందిన పశువుల కొట్టాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.20 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
మంచిర్యాలక్రైం: పోలీస్శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహించి అనారోగ్యంతో మృతి చెందినవారి కుటుంబాలకు అండగా ఉంటామని రామగుండం పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ (అడ్మిన్) శ్రీని వాస్ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో వివిధ స్టే షన్లలో హోంగార్డుగా విధులు నిర్వహించిన రాములు, తిరుపతి అనారోగ్యంతో మృతి చెందగా తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ సంక్షేమ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.15వేల విలువైన చెక్కులను ఆయన కార్యాలయంలో గురువారం అందజేశారు. ఎస్బీ ఏసీపీ నాగేంద్రగౌడ్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, హోంగార్డు ఆర్ఐ పెద్దన్న తదతరులు పాల్గొన్నారు. -
ఉజ్వల భవిష్యత్తుకు పాలిటెక్నిక్..
లక్ష్మణచాంద: ఉజ్వల భవిష్యత్తుకు పాలిటెక్నిక్ విద్య పాలిటెక్నిక్ బాటలు వేస్తోంది. ఈ విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇంజినీర్గా ఎదగాలనుకునే వారికి ఈ కోర్సు ముఖ్యమైందని నిర్మల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా.రమేశ్ తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లొమా సాంకేతిక విద్యలో ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయని, ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. అందుబాటులో కోర్సులుడిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్, ఇతర స్పెషలైజేషన్లు, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, వెటర్నరీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పాలిసెట్ ద్వారానే అడ్మిషన్స్ పొందవచ్చు. ఉద్యోగావకాశాలుజూనియర్ ఇంజినీర్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేయడం, ప్రాజెక్టులను పర్యవేక్షించడం, బృందాలు నిర్వహించడం. టెక్నీషియన్: పరిశోధన, అభివృద్ధి, పరీక్ష, నిర్వహణలో ఇంజినీర్లు, శాస్త్రవేత్తలకు సహాయం చేయడం. సూపర్వైజర్: తయారీ పరిశ్రమల్లో ఉత్పత్తి, నాణ్యత నియంత్రణ, నిర్వహణ పర్యవేక్షించడం. తయారీ రంగం: ఆటోమొబైల్, ఏరోస్పేస్, హెవీ మెషినరీ, ఎలక్ట్రానిక్స్, వివిధ పరిశ్రమలకు డిప్లొమా హోల్డర్లను నియమించుకుంటాయి. నిర్మాణ రంగం: భవనం, పౌర, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిర్మాణం, ఎలక్ట్రికల్ ఇతర మెకానికల్ ఇంజినీరింగ్లో డిప్లొమా హోల్డర్లు అవసరం. ఐటీ,ఐటీఈఎస్: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, మెయింటెనెన్స్ కోసం కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో డిప్లొమా హోల్డర్లు అవసరం. జీతం ప్యాకేజీలు: డిప్లొమా హోల్డర్లు పరిశ్రమ, ఉద్యోగ పాత్ర, స్థానాన్ని బట్టి నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం ప్యాకేజీ ఉంది. విద్యార్థులకు వరంలాంటిది ఆదిలాబాద్, నిర్మల్, బెల్లంపల్లి, ఉట్నూర్లో మెకానికల్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, సివిల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి జిల్లా విద్యార్థులకు పాలిటెక్నిక్ విద్య వరంలాంటిది. పాలిసెట్ పరీక్ష రాసి డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ పొందాలి. సాంకేతిక విద్యనభ్యసించి ఉద్యోగావకాశాలు పొందాలి. ఈ సంవత్సరం నూతనంగా కంప్యూటర్ సైన్స్, ఆటోమేషన్ రోబోటిక్స్ కోర్సులు మంజూరు చేయాలని కోరుతూ ఏఐసీటీకి దరఖాస్తు చేశాం. మరో రెండు కోర్సులు నిర్మల్లో అదనంగా అందుబాటులోకి వస్తాయి. – డా.టి.రమేశ్, ప్రిన్సిపాల్, పాలిటెక్నిక్ కళాశాల, నిర్మల్ పరీక్ష వివరాలు: అధికారిక వెబ్సైట్: polycet. sbtet. telangana. gov. inÌ దరఖాస్తుకు చివరి తేదీ: 20.04.2026అపరాధ రుసుము: రూ.100 (21.04.26) అపరాధ రుసుము: రూ.300 (22.04.26) పరీక్ష తేదీ: మే 13, 2026 రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీలకు: రూ.250 ఇతరులకు: రూ.500 పరీక్ష విధానం: ఆఫ్లైన్ (పెన్–అండ్–పేపర్ టెస్ట్) 2:30 గంటలు, మ్యాథమెటిక్స్(60), ఫిజిక్స్(30), కెమిస్ట్రీ(30), బయాలజీ(30) నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, వెటర్నరీ డిప్లొమా కోర్సులు చేయాల్సినవారికి బయాలజీ ప్రశ్నలు కూడా ఉంటాయి. ఉన్నత విద్యావకాశాలు: పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఇంజినీరింగ్ కోర్సుల్లో రెండో సంవత్సరం నేరుగా ఈ సెట్ పరీక్ష ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు. -
వీఆర్ఏతో వ్యక్తిగత పనులు
తానూరు: తానూర్ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించే వీఆర్ఏలతో అధికారులు వ్యక్తిగత పనులు చేయించుకోవ డం చర్చనీయాంశమైంది. కార్యాలయంలో ప్రభుత్వ పనులు చేయించుకోవాల్సిన అధికా రులు తమ సొంత పనులు చేయాలని ఆదేశి స్తున్నారు. గురువారం ఓ అధికారి వీఆర్ఏతో కారు శుభ్రం చేయించుకున్నాడు. కార్యాలయానికి వచ్చిన మండల వాసులు ఈ దృశ్యాన్ని సెల్ఫోన్లో బంధించారు. అధికారుల తీ రుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయ మై ‘సాక్షి’ సదరు అధికారిని వివరణ కోరగా, కారుపై చెత్త పడడంతో తొలగించాడని తెలిపారు. -
డబ్బులు వెంటనే చెల్లించాలి
నస్పూర్: సహారా ఇండియా సంస్థలో గడువు తీరిన ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు వెంటనే చెల్లించాలని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, తె లంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య డిమాండ్ చేశారు. గురువా రం ఆయన బాధితులతో కలిసి సీసీసీ కార్నర్లోని సహారా ఇండియా సంస్థ కార్యాలయం ఎ దుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ కుమారస్వామికి వినతిపత్రం అందజేశారు. 15రోజుల్లో డబ్బులు చెల్లించకుంటే మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, నస్పూర్ కార్యాలయాల ఎదుట సామూహిక ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. బాధితులు వెంకట్రె డ్డి, పెద్దపల్లి మల్లయ్య, మోతె కాంతయ్య, రాజ మౌళి, అంకం సతీశ్, శంకర్, మల్లయ్య, అరుణ, నక్షత్ర, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బెల్లంపల్లిలో బీజేపీ భిక్షాటన
బెల్లంపల్లి: నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇ వ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం పట్టణంలో బీ జేపీ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. పాత బస్టాండ్ ఏరియా రోడ్డుపై పాదచారులు, షాపుల వద్దకు వెళ్లి యాచించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేశ్, కార్యదర్శి రాచర్ల సంతోష్కుమార్ మాట్లాడుతూ.. అర్హులను విస్మరించి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేసి, అధికా ర పార్టీ నాయకులు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికై నా అర్హులకు ఇళ్లు కేటా యించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ పట్టణాధ్యక్షురాలు దార కళ్యాణి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గోమాస కమల, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కోడి సురేశ్, పట్టణ కోశాధికారి సంతోష్ అగర్వాల్, నాయకులు మల్లేశ్, ఓంసాయి, రాము, ప్రశాంత్, శ్రీనివాస్, సా గర్, సందీప్, తేజవంశీ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలి
రామకృష్ణాపూర్: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హుల కు అందేలా చూడాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూ చించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అ మ్మాగార్టెన్స్లో గురువారం ప్రజాపాలన–ప్రగతి ప్ర ణాళికపై సర్పంచులు, మంచిర్యాల మేయర్, డి ప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కా ర్యక్రమానికి హాజరై మాట్లాడారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీ టి సరఫరా, పైపులైన్ల మరమ్మతులు, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై ప్రజాప్రతినిధులకు త్వరలో అవగాహన కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలి క వసతుల కల్పనపై దృష్టి సారించాలని, స్వయం సహాయక సంఘాల మహిళలూ భాగస్వాములు కా వాలని సూచించారు. అర్హులకు రేషన్కార్డులు అందేలా చూడాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నా రు. కాగా, శిక్షణ కార్యక్రమం కొనసాగుతుండగా ప్ర జాప్రతినిధులంతా భోజనాలకు వెళ్లారు. దీంతో భో జనాల ఏర్పాటుకు కారణమైన అధికారికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. డీసీపీ భా స్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీపీవో వెంకటేశ్వర్రావు, ఆయా డిపార్ట్మెంట్ల అధికారులున్నారు. -
బెదిరిస్తే స్థలం వదులుకుంటామా?
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలో ప్రభుత్వం పీఆర్టీయూ సంఘానికి కేటాయించిన స్థలంలో పాగా వేసి బెదిరింపులకు పాల్పడినంత మాత్రాన స్థలాన్ని వదులుకుంటామా అని కబ్జాదారులను పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సర్వేనంబర్ 426లో 2004 అప్పటి ప్రభుత్వం కేటాయించిన 484 గజాల భూమిని ఓ కార్పొరేటర్ కబ్జాకు పాల్పడుతున్న విషయం తెలుసుకుని హుటాహుటిన మంచిర్యాలకు చేరుకున్నారు. జిల్లాకు చెందిన టీచర్లతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. కబ్జాకు యత్నించిన విషయమై మేయర్ ధర్ని మధుకర్, డీసీపీ భాస్కర్ను వేర్వేరు కలిసి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు యత్నించడం, జిల్లా నాయకత్వాన్ని బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో కబ్జాదారులు వెనుదిరిగినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్షమయ్యగౌడ్, ఆడిట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొట్టే శంకర్, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి డీసీపీని కలిసి వివరిస్తున్న శ్రీపాల్రెడ్డి, తదితరులు -
క్లుప్తంగా
ఇంట్లో చోరీ.. కడెం: మండల కేంద్రంలో పట్టపగలే ఇంట్లో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శివానందగౌడ్ ఇంటికి తాళం వేసి ఉంది. గురువారం మధ్యాహ్నం ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ప్లాస్టిక్ డబ్బాలు ఎరుకుంటూ ఆ ఇంట్లో చొరబడ్డారు. బీరువా పగులగొట్టి బంగారం, డబ్బులు ఎత్తుకెళ్తుండగా స్థానికులు అనుమానం వచ్చి అడ్డుకున్నారు. వారి వద్ద నుంచి బంగారం చైన్, డబ్బులు స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని దొంగలను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ విషయమై ఎస్సై సాయికిరణ్ను సంప్రదించగా ముగ్గురితోపాటు, మరికొందరు ఉన్నారని, వారి గురించి విచారిస్తున్నట్లు తెలిపారు. -
మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం
చెన్నూర్: మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం తొలిప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి పేర్కొన్నారు. జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో రూ.30లక్షలతో చేపట్టిన మూడు గ్రామసమైక్య సంఘ భవనాలు, జైపూర్లో రూ.30లక్షలతో చేపట్టిన గోదాం నిర్మాణాలకు బుధవారం కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇందారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. నియోజకవర్గంలో ఒక్కో భవనానికి రూ.30లక్షల చొప్పున వెచ్చించి 35 భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్, పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు ఇందిరా శక్తి క్యాంటీన్లు, పెరటి కోళ్ల పెంపకం, ఇతర అనేక వ్యాపారాల్లో ప్రోత్సహిస్తూ మహిళలను ముందంజలో ఉంచేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించి, బ్యాంక్ లింకేజీ రుణాల ద్వారా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రుణం పొందిన స్వయం సహాయక సంఘాలు సకాలంలో చెల్లించి తిరిగి రుణం పొంది వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలని సూచించారు. మండలానికి 753 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 200 నిర్మాణాలు స్లాబ్ దశలో ఉన్నట్లు తెలిపారు. అనంతరం 39మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి కిషన్, తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్రెడ్డి, స్థానిక సర్పంచ్ ఫయాజ్, భాస్కర్, గ్రామసమైక్య సంఘాల మహిళలు పాల్గొన్నారు. -
చెన్నూర్ మండలంలో..
చెన్నూర్రూరల్: మండలంలోని కత్తెరసాల గ్రామంలో విద్యుత్ స్తంభానికి అమర్చిన మినీ ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ తీగలు ప్రమాదకరంగా మారాయి. రక్షణ కంచె ఏర్పాటు చేయకపోవడంతో పశువులు, అటుగా వెళ్లేవారు దానిని తాకే ప్రమాదముంది. అలాగే, తుర్కపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభం ఇంటి పక్కనే ఒక వైపునకు వంగింది. గాలిదుమారాలు వస్తే స్తంభం పడిపోయే ప్రమాదముంది. గతంలో పలుసార్లు ప్రమాదాలు కూడా జరిగిన ఘటనలున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
బెల్లంపల్లి పట్టణంలో..
బెల్లంపల్లి: మున్సిపాలిటీలో 34 వార్డులుండగా దాదాపు ప్రతీ వార్డులో కరెంట్ తీగల సమస్య ఉంది. కన్నాల బస్తీ, టేకుల బస్తీ, 24 డీప్ ఏరియా, హన్మాన్ బస్తీ, బూడిదగడ్డ, నంబర్ 2 ఇంక్లైన్, శాంతిఖని, 65డీప్ ఏరియా, బెల్లంపల్లి బస్తీ, పోస్టాఫీస్ బస్తీ తదితర కార్మిక వాడలు, కార్మికేతర ప్రాంతాలైన షంషీర్ నగర్, ఇంక్లైన్ రడగంబాలబస్తీ, అంబేడ్కర్ నగర్, గంగారాం నగర్, రాంనగర్, అశోక్నగర్, బాబుక్యాంపు బస్తీల్లో ఇళ్ల మీదుగా విద్యుత్ తీగలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. బస్తీల్లో కరెంట్ లైన్లు సవరించడంలేదు. కంపెనీ ఏరియాల్లో కరెంట్లైన్ల సమస్య తీవ్రంగా ఉంది. వేలాడుతు న్న విద్యుత్ తీగలు సవరించాలని పలు బస్తీల ప్ర జలు ఫిర్యాదు కోరుతున్నా ఫలితం ఉండడంలేదు. కాగా, కొత్తబస్టాండ్ ఏరియాలో నాలుగేళ్ల క్రితం ఓ ఇంటి పైకప్పు పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు ఇనుప నిచ్చెన కరెంట్ తీగలకు తగలడంతో షాక్తో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. -
లైఫ్ అండ్ కెరియర్పై అవగాహన
బాసర: ఆర్జీయూకేటీ బాసర విశ్వవిద్యాలయంలో విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని బుధవారం ‘లైఫ్ అండ్ కెరియర్’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అమెరికా, యూకేలోని ప్రముఖ కంపెనీల మాజీ సీఈవో హెచ్.టి.చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్ వైపు మళ్లాలని, కేవలం సీనియర్ల నుంచి మాత్రమే కాకుండా జూనియర్లు, స్నేహితుల నుంచి కూడా నేర్చుకోవాలని సూచించారు. ప్రతీ విద్యార్థి డైరీ రాసే అలవాటు చేసుకోవాలన్నారు. డ్రగ్స్, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండి, కేవలం చదువు, స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలన్నారు. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. అన్నింటికంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అత్యంత ముఖ్యమన్నారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీ దర్శన్, డాక్టర్ టి.నాగ సాయికుమార్, అసోసియేట్ డీన్ (ఇంజనీరింగ్) మహేశ్, విఠల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూ పాలి. ప్రతీరోజు వ్యా యామం చేయడం అలవాటు చేసుకోవాలి. బీపీ, షుగర్ అదుపులో ఉంచుకోవాలి. పాయిజన్ తీసుకున్న వారిలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. నిర్మల్ జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం 78 మంది డయాలసిస్ సేవలు పొందుతున్నారు. – డాక్టర్ గోపాల్ సింగ్, నిర్మల్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ జీవన శైలితోనే నియంత్రణ కిడ్నీ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే మందులతోనే నియంత్రించవచ్చు. ఎక్కువ ప్రభావితమైన తర్వాత డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి తప్పదు. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలు కనిపిస్తే డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్లను సంప్రదించకుండా మితిమీరిన పెయిన్కిల్లర్స్ వాడకూడదు. ఆరోగ్య అవగాహనే కిడ్నీలకు ఉత్తమ రక్షణ. – డాక్టర్ అశోక్, యూరాలజిస్టు, నిర్మల్ -
‘గ్యాస్’ గుది బండ!
జిల్లాలో ఎల్పీజీ కనెక్షన్ల వివరాలుగృహావసర కనెక్షన్లు 2,59,850 కమర్షియల్ కనెక్షన్లు 1,475సాక్షి ప్రతినిఽధి, మంచిర్యాల: ఇరాన్–అమెరియా ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా జిల్లాలో ఎల్పీజీ కొరత ఏర్పడింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఫుడ్ బిజినెస్ వ్యాపారులతోపాటు ప్రతీ ఇంట్లోనూ గ్యాస్తో ఇబ్బంది పడే అవకాశముంది. ఇటీవల గృహావసర సిలిండర్ (14.02కిలోలు)పై రూ.60 పెరిగి ధర రూ.987కు చేరింది. వ్యాపారపరంగా వాడే సిలిండర్ (19కిలోలు)పై రూ.115 పెరిగి ధర రూ.2,200కు చేరుకుంది. వాహనాల్లో వాడే సీఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్లలోనూ కిలోకు రూ.91చొప్పున విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలో ప్రతీనెల మొత్తం గ్యాస్ కనెక్షన్లలో 10 శాతం రీఫిల్లింగ్కు వస్తాయనే అంచనా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు వినియోగదారులు మొగ్గు చూపడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. ఇదే అదనుగా కొన్ని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వ్యాపారులకు బ్లాక్లో అమ్ముకునేందుకు పక్కదారి పట్టించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిలిచిన కమర్షియల్ సరఫరా రెండురోజులుగా జిల్లాకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచింది. దీంతో హోటళ్లు, రెస్ట్రారెంట్ల నిర్వాహకులు, స్ట్రీట్ఫుడ్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల గృహావసర సిలిండర్లనే వాడుతున్నారు. వీటిని నివారించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు కేసులు నమోదు చేసేందుకు తనిఖీలు చేస్తున్నారు. రెండురోజుల క్రితం రామకృష్ణాపూర్ పట్టణంలో అనధికారికంగా వాడుతున్న 12 సిలిండర్లు సీజ్ చేశారు. పెరుగుతున్న ఆంక్షలు ఎల్పీజీ ప్రధాన సరఫరాదారులైన ప్రభుత్వ రంగ హిందూస్థాన్, భారత్, ఇండేన్ కంపెనీలు ఇప్పటికే వాడకం, బుకింగ్పై ఆంక్షలు విధించాయి. వినియోగదారులు రీఫిల్ సిలిండర్ తీసుకున్నాక 21రోజులకు మరోటి పొందేలా గడువు పెట్టారు. తాజాగా మళ్లీ మరో ఐదురోజులకు పెంచి, 25రోజులకు చేశారు. ఇక రెండు ఉంటే నెలవరకు గడువు విఽధించారు. ఇలాగే సరఫరాలో అంతరాయం ఏర్పడితే సరఫరా గడువు మరింత పెరిగే అవకాశముంది. మరోవైపు గృహ వినియోగదారులూ ముందస్తుగా సిలిండర్లు బుక్ చేసుకుంటూ నిల్వలు పెంచుకుంటున్నారు. దీంతో బుకింగ్ల సంఖ్య పెరిగినట్లు ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు కమర్షియల్ సిలిండర్లపై ఆయిల్ కంపెనీలు రూ.150చొప్పున ఇచ్చే సబ్సిడీ నిలిచిపోయింది. కట్టెల పొయ్యిలు, పొదుపుగా గ్యాస్ కొరతతో హోటళ్లల్లో గ్యాస్ వాడకంలో పొదుపు మొదలైంది. కొన్నిచోట్ల కట్టెల పొయ్యిపై వంట చేసేందుకు సిద్ధమయ్యారు. కట్టెలకు గతంలో క్వింటాల్కు రూ.400చొప్పున విక్రయించగా, ప్రస్తుతం రూ.800కు చేరినట్లు హోటళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. ఎలక్ట్రికల్ కుక్కర్లు, స్ట్రీమ్, ఇతర ప్రత్యామ్నాయం వెతుకున్నారు. ఎక్కువగా గ్యాస్ అవసరమయ్యే వంటలను తగ్గిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఇబ్బందులు లేనప్పటికీ ఇదే తీరుగా కొనసాగితే ఫుడ్ బిజినెస్పై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాపారాలు వాపోతున్నారు. కమర్షియల్ సరఫరా లేనప్పుడు గృహావసరాలకు వాడే సిలిండర్లు వాడేందుకు అనుమతివ్వాలని కోరుతున్నారు. బ్లాక్ చేస్తే కఠినచర్యలుజిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొంత అంతరాయం ఉన్నప్పటికీ ఇంకా సరిపడా నిల్వలున్నాయి. ఇంకా ఎక్కడా కొరత ఏర్పడలేదు. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా సిలిండర్ల నిల్వలు, రీఫిల్లింగ్ చేస్తే కఠినచర్యలు తీసుకుంటాం. – వేణుగోపాల్, ఏఎస్వో -
పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలి
చెన్నూర్: పారిశుద్ధ్య నిర్వహణ పనులు పకడ్బందీ గా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం కలెక్టర్ మున్సిపాలిటీలోని ఐదో వార్డులో చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కింద చేపట్టిన పారిశుద్ధ్య పనులు, వంద పడకల ఆస్పత్రి పనులు, స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అ నంతరం తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశం బోధించారు. ఆయన మాట్లాడుతూ.. మెనూ తప్పకుండా పాటించాలని సూచించారు. మున్సిప ల్ కమిషనర్ మురళీకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్కుమార్, ఆయా శాఖల అధికారులున్నారు. విధులు సమర్థవంతంగా నిర్వహించాలి మంచిర్యాలఅగ్రికల్చర్: జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. జనాభా లెక్కల ప్రక్రియ నిర్వహణ, సాంకేతికత వినియోగం, ఇతర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దండేపల్లి: మండలంలో కలెక్టర్ కుమార్ దీపక్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. కొర్విచెల్మలో మెగా గాలికుంటు నిర్మూలన శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలోని డైనేజీలు, నర్సరీని పరిశీలించారు. స ర్పంచ్ సోనియా, ఉపసర్పంచ్ తిరుపతి, ఎంపీడీవో ప్రసాద్, మండల పశువైద్యాధికారి ధన్రాజ్, సి బ్బంది పాల్గొన్నారు. అలాగే, ద్వారక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో చేపట్టిన హాస్టల్ భవన నిర్మాణ పనులు, గోదావరి పుష్కరఘాట్ను పరిశీలించా రు. వెల్గనూర్ గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని సూచించారు. రెబ్బనపల్లి ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెబ్బనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఆరోగ్య ఉ పకేంద్రాన్ని తనిఖీచేశారు. గూడెం గ్రామాన్ని సందర్శించి డ్రైనేజీలు పరిశీలించారు. అనంతరం గుట్టపై కి ఎక్కి పార్కింగ్ స్థలాల గురించి చర్చించారు. ఖాళీ ప్రదేశాల్లో వసతి గృహాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలని సూచించారు. తహసీల్దార్ రోహిత్దేశ్పాండే, ఎంపీడీవో ప్రసాద్, ఎంపీవో కేవీ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లపై అవగాహన
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని జీఎం కార్యాలయ ఆవరణలోగల కాన్ఫరెన్స్ హాల్లో కొత్తగా కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తు న్న నాలుగు లేబర్ కోడ్స్పై బుధవారం డిప్యూ టీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) బిశ్వ భూ షణ్ ప్రుస్టి అధికారులకు అవగాహన కల్పించా రు. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21నుంచి 29చట్టాలను కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్గా మా ర్చినట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమం, హ క్కుల భద్రత, వేతన నిర్మాణం, పారదర్శక ఉ ద్యోగ వ్యవస్థ కోసం రూపొందించిన కోడ్స్ను సరిగా అర్థం చేసుకుని అమలు చేయడం అ త్యంత అవసరమని సూచించారు. అనంతరం ఏరియా ఇన్చార్జి జీఎం మల్లయ్య ఆధ్వర్యంలో అధికారులు కమిషనర్ను సన్మానించారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (రామగుండం) యూ సఫ్, ఎస్వోటూ జీఎం లలితేంద్రప్రసాద్, డీజీ ఎం (పర్సనల్) అశోక్కుమార్, కేకే గ్రూపు ఏ జెంట్ రాంబాబు, ఏరియా ఇంజినీర్ బాలాజీ భగవతీఝా, ఏరియా అధికారులు, గనులు, డిపార్ట్మెంట్ల సంక్షేమాధికారులున్నారు. 7వ తేదీకల్లా వేతనాలు చెల్లించాలి చెన్నూర్: ఎస్టీపీపీలో ఆయా కంట్రాక్ట్ ఏజెన్సీ లు ప్రతీనెల 7వ తేదీకల్లా కార్మికులకు వేతనా లు చెల్లించాలని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బిశ్వ భూషణ్ ఆదేశించారు. జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీని సందర్శించగా జీఎంలు నర్సింహారావు, మదన్మోహన్ స్వాగతం పలి కారు. అనంతరం ఆయన స్థానిక ప్రాణహిత అ తిథి గృహంలో పలు ఏజెన్సీలతో సమావేశమై రికార్డులు తనిఖీ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ కూ డా అందించాలని సూచించారు. అనంతరం నూతన కార్మిక చట్టాలపై అవగాహన కల్పించా రు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎండీ యూసఫ్, డీజీఎం శివప్రసాద్, కిరణ్బాబు, ఇతర అధికారులు, ఏజెన్సీల కాంట్రాక్టర్లున్నారు.


