Mancherial District News
-
నీట్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు
● సీపీ అంబర్ కిషోర్ ఝా మంచిర్యాలక్రైం: ఈ నెల 21న నీట్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. జిల్లా కేంద్రంలోని నీట్ కేంద్రాలను గురువారం ఆయన కలెక్టర్ కుమార్ దీపక్, నీట్ జిల్లా కో ఆర్డినేటర్ జై కిషన్ ఓజాతో కలిసి సందర్శించారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులు, గదులు, సీసీ కెమెరాల ఏర్పాటు, పరిసర ప్రాంతాలు పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ సిబ్బంది, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ, కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రత చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కేంద్రంలో ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 1204 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ప్రతీ తరగతి గదిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్, పరీక్ష కేంద్రాల కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
నగరంలో ‘మొక్క’బడి సంరక్షణ
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో ఏటా వర్షాకాలంలో వన మహోత్సవంలో భాగంగా నాటుతున్న మొక్కల సంరక్షణ కరువవుతోంది. ఫలితంగా మొక్కలు ఎండిపోయి రికార్డుల్లో మాత్రమే సంఖ్య కనిపిస్తోంది. లక్షలాది మొక్కలు నాటినట్లుగా రికార్డుల్లో నమోదవుతున్నా వాస్తవంగా అవేవీ కనిపించని పరిస్థితి నెలకొంది. వర్షాలు కురిసిన వెంటనే ఎంతో ఉత్సాహంగా పాలకవర్గాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటేందుకు, ఇళ్లలో పంపిణీకి చూపిస్తున్న ఉత్సాహం సంరక్షణపై చూపించడం లేదు. ప్రతియేటా ఐదు లక్షలకు పైగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. అందుకు తగినట్లుగానే నాటుతున్నట్లుగా లెక్కల్లో చూపిస్తున్నారు. లక్ష మొక్కలు సంరక్షించినా... గత ప్రభుత్వం హరితహారం పేరిట మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం బడ్జెట్లో 10శాతం తప్పనిసరిగా కేటాయించేలా నిర్ణయించింది. అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామపంచాయతీల వార్షిక బడ్జెట్లో 10శాతం పార్కులు, నర్సరీలు, పచ్చదనం అభివృద్ధికి ఖచ్చితంగా కేటాయించి, మిగతా 90శాతాన్ని ఇతర పరిపాలనా అవసరాలకు కేటాయించాలి. గ్రీన్ బడ్జెట్ పేరిట ఏటా పది శాతం నిధులు కేటాయిస్తున్నా అందుకు తగినట్లుగా పచ్చదనం మాత్రం పెంపొందడం లేదు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో నగరంలో 5.96 లక్షలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్ణయించగా, 5.52 లక్షల మొక్కలు నాటినట్లుగా లెక్కల్లో చూపించారు. అందులో 3.18లక్షల మొక్కలు ఇళ్లల్లో నాటేందుకు ప్రతీ ఇంటికి ఆరు చొప్పున పంపిణీ చేస్తున్నట్లుగా ప్రకటించినా 2.97లక్షలు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. పంపిణీ చేసిన మొక్కలు ఇళ్లల్లో నాటారా లేదా అని కూడా అధికారులు, పాలకులు పట్టించుకోలేదు. ఇంటింటికీ పంపిణీ చేసి చేతులు దులిపేసుకున్నారు. వీటితోపాటు గతేడాది ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన, మున్సిపల్ ఖాళీ స్థలాల్లోనూ మొక్కలు నాటారు. మొక్కలు పెంచి, నాటినందుకు, సంరక్షించే ట్రీగార్డుల కోసం దాదాపుగా రూ.25లక్షల వరకు ఖర్చు చేశారు. నాటిన మొక్కల సంరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో వనమహోత్సవం పేరిట చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమం, నిధులు వృథా అవుతున్నాయి. ఏటా కనీసం లక్ష మొక్కలు నాటేలా చూసినా నగరంలో పచ్చదనం పెంపొందుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది 5.63లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు లక్ష్యాన్ని నిర్ణయించారు. -
‘నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం’
జన్నారం: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మండలంలోని కిష్టాపూర్ గ్రామ సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.25 లక్షల వ్యయంతో భోజనశాల భవన నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సమీపంలోని వ్యవసాయ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి బ్యాటరీ సైకిల్పై పర్యటించారు. విద్యార్థులకు పాఠ్య, నోటుపుస్తకాలు పంపిణీ చేశారు. తర్వాత కిష్టాపూర్, పొనకల్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బక్కయ్య, మండల అభివృద్ధి అధికారి ఉమర్ షరీఫ్, కస్తూ ర్బా గాంధీ హెచ్ఎం శ్రీవాణి, ఐటీఐ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ వై.రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసిహుల్లా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీర్ నందునాయక్, తదితరులు పాల్గొన్నారు. -
వనమహోత్సవం విజయవంతం చేయాలి
భీమారం: జిల్లాలో వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం భీమారం అటవీ ప్రాంతంలో నిర్వహించిన వనమహోత్సవంలో జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్కిషన్ జాదవ్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భావితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం విజయవంతం చేయాలని కోరారు. శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాకు కేటాయించిన 41 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించాలని అన్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, డీఆర్డీవో కిషన్, సర్పంచ్ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
‘భవిత’ భవనం పూర్తయ్యేదెన్నడో..!
మంచిర్యాలఅర్బన్: ప్రత్యేక అవసరాల పిల్లల కోసం చేపట్టిన వ్యక్తిగత గదుల నిర్మాణం పనులు(యాక్టివిటీ గదులు) నత్తనడకన సాగుతున్నాయి. భవిత కేంద్రాలకు అదనంగా అవసరమైన కొత్త గదులు, మరుగుదొడ్ల ఏర్పాటుతోపాటు పాతగదులు, టాయిలెట్లకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు తీరు‘బడి’గా చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. జిల్లాలో ఎనిమిది చోట్ల కార్యకలాపాల గదుల నిర్మాణం చేపట్టారు. బడులు పునఃప్రారంభమైనా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఒక్కో గది రూ.7లక్షల వ్యయంతో చేపట్టగా.. పనులు నేటికీ పూర్తికాలేదు. చాలా చోట్ల తలుపులు, కిటికీలు, గ్రిల్స్, ఎలక్ట్రికల్ వైరింగ్, ప్లంబింగ్ పనులు సగంలోనే నిలిచిపోగా బాతూరూమ్లు కొలిక్కి రాలేదు. దీంతో భవిత కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు అసౌకర్యంగా మారింది. నిర్మాణం ఇలా.. దివ్యాంగ పిల్లలకు భరోసానిచ్చే భవిత కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.1.02కోట్ల పరిపాలన అనుమతి మంజూరు చేశారు. కార్యకలాపాల గదుల నిర్మాణం, ర్యాంపులు, రైలింగ్తోపాటు మరుగుదొడ్ల నిర్మాణం పిల్లలకు అనుకూలమైన అభ్యాస వాతావరణం కోసం అవసరాలకు అనుగుణంగా, కార్యాచరణ ఆధారిత పెయింటింగ్కు నిధులు మంజూరు చేశారు. కార్యకలాపాల గది నిర్మాణానికి యూనిట్కు రూ.7లక్షల వరకు, ర్యాంపు, రైలింగ్తో కూడిన యాక్సెస్ చేయగల టాయిలెట్ నిర్మాణం యూనిట్కు రూ.లక్ష, భవనాల మరమ్మతులకు రూ.1లక్ష(అవసరం ప్రకారం), ఇప్పటికే ఉన్న టాయిలెట్ల మరమ్మతులకు రూ.50వేలు, పిల్ల ల అభ్యాస, అవసరాలకు అనుగుణంగా పెయింటింగ్కు రూ.1.50లక్షలు ఖర్చు చేయాలని నిబంధనలు ఉన్నాయి. ఇందులో జిల్లాలో కార్యకలాపాల గదులు ఎనిమిది మంజూరయ్యాయి. మంచిర్యాల, నెన్నెల మండలం దుబ్బపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, భీమారం, చెన్నూర్లో గదుల నిర్మాణానికి రూ.7లక్షల చొప్పున రూ.56లక్షలు కేటాయించారు. టీజీఈడబ్ల్యూఐడీసీ ద్వారా త్వరతగతిన పూర్తి చేయాల్సి ఉంది. నిర్మాణ పపనులపై పర్యవేక్షణ కొరవడడం.. మొదట్లో వేగంగా సాగిన పనులు తర్వాత కాలంలో నెమ్మదించాయి. అధికారులు దృష్టి సారించి గదుల నిర్మాణం పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. -
మా బడిలో నోఅడ్మిషన్
జన్నారం: జిల్లాలో ఈ పాఠశాలకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రధానోపాధ్యాయుడి అంకితభావం, విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కారణంగా బడిలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరుగుతోంది. విద్యాసంవత్సరం ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మండలంలోని పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధి అక్కపల్లిగూడలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ఇంగ్లిషు మీడియంలో బోధన సాగుతోంది. మండలంలో 29గ్రామ పంచాయతీలు ఉండగా.. ఈ బడిలో 13 పంచాయతీలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. గత విద్యాసంవత్సరంలో 334 మంది విద్యార్థులు ఉండగా.. ఇందులో గురుకుల సీట్లు సాధించిన వారు, ఐదో తరగతి పూర్తయిన విద్యార్థులు 108మంది ఇతర పాఠశాలలకు వెళ్లారు. ఈ ఏడాది కొత్తగా చేరిన 135మందితో విద్యార్థుల సంఖ్య 357కు చేరింది. దీంతో గురువారం అడ్మిషన్లు క్లోజ్ అంటూ బడి బయట పేపరు అతికించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో అడ్మిషన్లు నిలిపివేసినట్లు ప్రధానోపాధ్యాయుడు జాజల శ్రీనివాస్ తెలిపారు. ఆధునిక సౌకర్యాలు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, దాతల సహకారంతో పాఠశాలలో ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ప్రీ–ప్రైమరీ తరగతి గదికి ఏసీ ఏర్పాటు చేయగా, ప్రతీ తరగతి గదిలో టీవీలు అందుబాటులో ఉన్నాయి. దిక్సూచి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎన్ఆర్ఐ భూముల రంజిత్కుమార్ ఆధ్వర్యంలో డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. డెస్క్లు, బెంచీలు, మినరల్ వాటర్ ప్లాంట్తోపాటు విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఆరుగురు వీవీలు ప్రస్తుతం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితోపాటు ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో మరో ఆరుగురు విద్యావాలంటీర్లను నియమించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో మరో రెండు అదనపు తరగతి గదుల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గత ఏప్రిల్లో రూ.25 లక్షలు మంజూరు చేశారు. గదుల నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. -
సిగ్నల్ లేక ఇక్కట్లు
ఆలయంపై ఎక్కిన యువకులు ట్యాంకెక్కిన చింతకర గ్రామస్తులుఉట్నూర్ మండలం చింతకర అనుబంధంగా ఉన్న మూడు గ్రామాలకు సెల్ సిగ్నల్ లేక ఆదివాసీలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సిగ్నల్ రాక ఉపాధి పనులకు దూరమవుతున్నారు. పింఛన్, రేషన్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అత్యవసర సమయంలో ఫోన్ మాట్లాడాలన్న ట్యాంక్, చెట్లు ఎక్కాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు తమ గ్రామాలకు సెల్ టవర్ ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు. – ఇంద్రవెల్లి -
అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తల మృతి
ఆసిఫాబాద్రూరల్: అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భవానినగర్కు చెందిన బానోత్ రాజు(45), సుశీల (40) దంపతులకు ఒక కుమారుడు అనిల్ ఉన్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. అనిల్ కుమార్తె (3) తల్లిదండ్రుల వద్ద నిద్రపోయింది. గురువారం ఉదయం సమయంలో కుమార్తె ఏడుస్తుండగా అనిల్ వచ్చి చూస్తే తల్లిదండ్రులు చనిపోయి ఉన్నారు. ఈవిషయమై పోలీసులకు సమాచారం అందించారు. అయితే, గతేడాది పీర్ల పండుగ సమయంలో రాజు ఇంట్లో ఆభరణాల చోరీ జరిగింది. కేసు నమోదైన పోలీసులు నిందితులను పట్టుకోలేదు. ప్రస్తుతం పీర్ల ఉత్సవాల నేపథ్యంలో గ్రామస్తులు చందాలు వేసి ఆభరణాలు కొనుగోలు చేశారు. తన తండ్రికి సవారీ వస్తుందని గతేడాది చోరీ చేసినవారు ఎవరనేది బయటపడుతుందని ముందస్తు ప్రణాళిక ప్రకారం తల్లిదండ్రులను హత్య చేశారని కుమారుడు అనిల్ ఆరోపించారు. మూడు రోజులుగా అర్ధరాత్రి విద్యుత్ సరఫరా తీసివేశారని, బుధవారం రాత్రి కట్ చేశారని తెలిపారు. కుమారుడు, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. -
గుడుంబా స్థావరాలపై దాడులు
నెన్నెల: మండలంలోని నార్వాయిపేట గ్రామంలో ఎకై ్సజ్, పోలీసుశాఖ ఆధ్వర్యంలో గురువారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 23 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవడంతోపాటు 200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు చెన్నూర్ ఎకై ్సజ్ సీఐ హరి తెలిపారు. ఆరుగురిపై కేసులు నమోదు చేసి తహసీల్దార్ శ్రీనివాస్ ఎదుట బైండోవర్ చేశారు. అక్రమంగా నాటుసారా తయారు చేసిన, విక్రయించిన పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నెన్నెల ఎస్సై రామకృష్ణ, చెన్నూర్ ఎకై ్సజ్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
డీఎడ్ సర్టిఫికెట్ల పరిశీలన
ఆదిలాబాద్టౌన్: డీఎడ్ కళాశాలలో సీట్ల కోసం గురువారం ప్రభుత్వ డైట్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను పరిశీలించుకున్నారు. ప్రిన్సిపాల్ అబ్దుల్ హై, వైస్ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, కార్యాలయ సూపరింటెండెంట్ మమతలు పర్యవేక్షించారు. ఈనె ల 19, 20 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలిపారు. 21న ఎడిట్ ఆప్షన్, 25న కళాశాలల కేటాయింపు ఉంటుందని వివరించారు. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణమంచిర్యాలటౌన్: పోటీ పరీక్షల కోసం తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సెలింగ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జిల్లాలోని అర్హులైన అభ్యర్థులకు ఉచితంగా నాలుగు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి నీరటి రాజేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. టీజీపీఎస్సీ గ్రూప్–1, 2, 3, 4, ఎస్సెస్సీ సీజీఎల్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, పోలీస్ నియామకాలు, ఐబీపీఎస్, ఇతర పోటీపరీక్షలకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 25 నుంచి తరగతులు ప్రారంభించనుండగా, 100 మంది అభ్యర్థులకు మాత్రమే శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 040–23236112, 9059050062 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. లోక్ అదాలత్ విజయవంతం చేయండిచెన్నూర్: చెన్నూర్కోర్టులో నిర్వహించే జాతీ య లోక్అదాలత్ను విజయవంతం చేయాలని చెన్నూర్ సివిల్ జడ్జి పర్వతపు రవి అన్నారు. గురువారం స్థానిక కోర్టు సమావేశ మందిరంలో పోలీసు, ఎకై ్సజ్, బ్యాంక్ అధికారులతో ఈ నెల 20న నిర్వహించే లోక్ అదాలత్పై సమావేశం నిర్వహించారు. చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి, భీమారం పోలీసు స్టేషన్ల పరిధిలోని కేసుల పరిష్కారానికి పోలీసులు సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐలు బన్సీలాల్, కృష్ణ, ఎకై ్సజ్, బ్యాంక్ అధికారులు, కోర్టు పోలీసులు పాల్గొన్నారు. -
బావిలో జారిపడి యువకుడు..
భైంసారూరల్:ప్రమాదవశాత్తు బావిలో జారిపడి యువకుడు మృతిచెందాడు. ఏఎస్సై జీవన్రావు తె లిపిన వివరాల ప్రకారం..మండలంలోని దేగాం గ్రామానికి చెందిన పోతారపోల పోశెట్టి (26) బర్రెలు కాస్తూ జీవనం సాగించేవాడు. గురువారం మ ధ్యాహ్నం గ్రామసమీపాన బావిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. బావి ఒడ్డున ఉన్న పాకూరు జారి నీటిలో మునిగి మృతిచెందాడు. విషయంతెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. తల్లి మల్లవ్వ ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఏఎస్సై తెలిపారు. లోకేశ్వరం: రోడ్డుప్రమాదంలో గాయపడిన మహిళ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యన మృతిచెందింది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గడ్చాంద గ్రామానికి చెందిన పీసర గంగన్న– జయ(48) దంపతులు. ఆర్మూర్ తాలు కాలోని చిన్నపూర్ గ్రామానికి జయ పుట్టింటికి దొండల వాయినాం ఇచ్చేందుకు బుధవారం బైక్పై వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి స్వగ్రామానికి రాత్రి వస్తున్నారు. నగర్ గ్రామంలో ట్రాక్టర్ను ఓవర్టెక్ చేసే క్ర మంలో బైక్ అదుపుతప్పి ఢీకొ ట్టింది. ప్రమాదంలో జయ తలకు తీవ్రగాయాలయ్యాయి. అబ్బులెన్సులో భైంసా ఏరియాస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతిచెందింది. మృతురాలికి కుమారుడు అదిశేషు, కుమారై అవంతిక ఉన్నారు. మృతురాలి చెల్లె లక్ష్మి ఫిర్యాదుతో గు రువారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్సపొందుతూ యువకుడు..లక్సెట్టిపేట: మున్సిపాలిటి పరిధిలోని సీఎస్ఐ చర్చి రోడ్లో ఉంటున్న మద్దెల వివేక్ (24) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వి వేక్ డిగ్రీ చదువు మధ్యలో ఆపేశాడు. అతని ఇద్దరు చెల్లెలు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండగా తాను ఖాళీగా ఉంటున్నానని మనస్తాపం చెందాడు. ఈనెల 16న ఇంటి ఆవరణలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు, స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కరీంనగర్ తరలించి చికిత్స అందిస్తుండగా బుధవారం రాత్రి మృతి చెందాడు. తండ్రి కమలాకర్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఏఐతో తుపాకీ ఫొటో సోషల్మీడియాలో పోస్టు ఆదిలాబాద్రూరల్: ఏఐతో తుపాకీ పట్టుకుని ఉన్నట్లుగా ఫొటో రూపొందించి సోషల్ మీడియాలో పో స్టు చేసిన రౌడీ షీటర్ను అరెస్టు చేసినట్లు ఆదిలా బాద్ రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు. గురువా రం పోలీసుస్టేషన్లో వివరాలు వెల్లడించారు. చిచ్ధరి (ఖానాపూర్)కు చెందిన రౌడీషీటర్ గైక్వాంబ్లే దలిత్ ఏఐ ద్వారా తుపాకీ రూపొందించి సోషల్ మీ డియాలో పోస్టు చేశాడు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా ఉండడంతో నిందితుడిపై కేసు న మోదు చేసినట్లు తెలిపారు.ఎవరైన సోషల్ మీడియా లో మారణాయుధాలతో ఫొటో, వీడియో తీసి పో స్టుచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్ రూరల్ ఎస్సై వి.విష్ణువర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు. -
మామిడిలో యాజమాన్య పద్ధతులు
బెల్లంపల్లి: మామిడి తోటల్లో కోతల అనంతరం రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. కోతలు పూర్తయిన తదుపరి తోటల నిర్వహణపై ప్రత్యేక శద్ధ వహించడం వల్ల వచ్చే ఏటా పుష్పోత్పత్తి, కాయధారణ, అధిక దిగుబడి సాధించడానికి వీలువుతుంది. కోత అనంతరం చేపట్టే యాజమాన్య చర్యలతో పురుగులు, వ్యాధుల తీవ్రతను తగ్గిస్తాయి. తోటల నిర్వహణను నిర్లక్ష్యం చేయకుండ చెట్ల కత్తిరింపులు, ఎరువుల వినియోగం, సూక్ష్మపోషకాల పిచికారీ, పురుగు, వ్యాధుల సమగ్ర నివారణ చర్యలు చేపడితే నాణ్యమైన దిగుబడి సాధించవచ్చునని బెల్లంపల్లి కృషి విజ్ఙాన కేంద్రం (కేవీకే) ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు.స్రవంతి తెలిపారు. ఇంకా ఆమె మాటల్లోనే.. తోట పరిశుభ్రత మామిడి చెట్ల కింద ఎండిపోయిన పండ్లు, ఎండి న ఆకులు, వ్యాధిగ్రస్త కొమ్మలను తొలగించాలి. చెట్టు చుట్టూరా పెరిగిన కలుపు మొక్కలు తొలగించి తోటను పరిశుభ్రంగా ఉంచాలి. వ్యాధిగ్రస్త మొక్కల అవశేషా లను తోట బయట గుంతను తవ్వి పూడ్చివేయాలి. ఎరువుల యాజమాన్యం పదేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న చెట్టుకు తగిన మోతాదులో ఎరువులు వినియోగించాలి. 50–100 కిలోల పశువుల ఎరువు, 2.2 కిలోలు యూరియా, 6.0 కిలోల సింగిల్ సూపర్ఫాస్పేట్, 1.7 మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) ఎరువులను చెట్టునీడ పరిధి వద్ద వలయాకారంలో 15–20 సెం.మీ లోతులో వేసి మట్టితో కప్పాలి. సూక్ష్మపోషకాల పిచికారీ చెట్లకు కొత్త చిగుర్లు వచ్చిన 20–30 రోజుల తర్వాత జింక్ సల్పేట్: 5గ్రా/ లీటర్, బోరాక్స్:1గ్రా/లీటర్, మెగ్నీషియం సల్పేట్: 5 గ్రా/లీటర్ నీటిలో తగిన మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. లేదా మామిడి స్పెషల్ మైక్రో న్యూట్రియంట్ మిశ్రమం: 5 గ్రా/ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నీటి యాజమాన్యం వర్షాలు కురిసే వరకు10–15 రోజుల వ్యవదిలో నీరందించాలి. వర్షాకాలంలో చె ట్ల మొదళ్లలో నీరు నిల్వ కాకుండా కాలువలు ఏర్పాటు చేయాలి. డ్రిప్ ఇరిగేషన్ ఉన్న తోటల్లో మట్టిలో తేమను బట్టి నీరు ఇవ్వాలి. అంతర పంటల సాగు చిన్నవయస్సు ఉన్న మామిడి తోటల్లో అంతరపంటలు సాగు చేసుకోవాలి. చెట్లు కాపుదలకు వచ్చేవరకు పంటలను సాగు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంతర పంటలుగా పెసర, మినుము, కంది, అలసంద వంటి పప్పు ధాన్యాల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చు. మామిడి తోట కొమ్మలు తొలగించాలి రకరకాల కారణాలతో చెట్లకొమ్మలు విరిగి, ఎండిపోయి ఉంటాయి. ఒకదానిపై మరొకటి పెరిగిన కొమ్మలు తొలగించాలి. చెట్టు మధ్యభాగంలో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా కత్తిరింపు చేయాలి. సుమారు 1–1.5 సెం.మీ కంటే పెద్ద గాయాలపై బోర్డో పేస్ట్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ పూత వేయాలి. కత్తిరించిన కొమ్మలను తోట బయట తొలగించాలి. తోట అంతర్భాగంలో కొమ్మలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మామిడి తోటల్లో వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక వర్షపాతం కారణంగా నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చెట్టు చుట్టూ మల్చింగ్ చేయడం ద్వారా నేల తేమను కాపాడటానికి వీలవుతుంది. మెరుపులు, గాలివానల వల్ల విరిగిన కొమ్మలను వెంటనే తొలగించాలి. -
డీసీపీ ఆకస్మిక తనిఖీ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ గురువారం హాజీపూర్ పోలీస్స్టేషన్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రిసెప్షన్, డ్యూటీ అధికారి విభాగం, స్టేషన్ రైటర్ విభాగం, ప్రాసెస్ అప్లికేషన్లు, పెండింగ్ కేసుల ఫైళ్లు, క్రైమ్ రికార్డులు పూర్తిస్థాయిలో పరిశీలించారు. నమోదైన కేసులు, దర్యాప్తులో పురోగతి, పెండింగ్ వివరాలను సీఐ, ఎస్సైల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, హాజీపూర్ ఎస్సై కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
జీవితంపై విరక్తితో ఆత్మహత్య
తానూరు: జీవితంపై విరక్తితో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపా రు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హి ప్నెల్లి గ్రామానికి చెందిన చంద్రే ఉత్తం (40) గత పదేళ్లుగా పక్షవాతంతో బాధపడు తూ మంచానికి పరిమితమయ్యాడు. భార్యతో గతంలో విడాకులు కావడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. బంధువులు అందించిన సమాచారంతో గురువారం ఎస్సై.. ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తమ్ముడు గౌతం ఫిర్యాదుతో కేసు ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బైక్ను ఢీకొన్న కారు
ఇంద్రవెల్లి: బైక్ను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు, ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండలం పులిమడుగు గ్రామానికి చెందిన ఆడే ప్రకాశ్ (56), రాథోడ్ రాంజీ (65) కలిసి బైక్పై గురువారం ఇంద్రవెల్లి మండలకేంద్రంలోని తమ బంధువుల ఇంట్లో టీలా వేడుక కోసం వెళ్తున్నారు. ఇంద్రవెల్లి మండలం నర్సపూర్ చౌక్ సమీపంలో ప్రధాన రహదారి వద్ద వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆడే ప్రకాశ్, రాథోడ్ రాంజీలను స్థానికులు ప్రైవేటు వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రిమ్స్కు వెళ్లి పంచనామ అనంతరం పోస్ట్మార్టంకు తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రాణహితలో యువకుడి గల్లంతు
కోటపల్లి: మండలంలోని వెంచపల్లి సమీపంలోని ప్రాణహిత నదిలో స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా యువకుడు గల్లంతయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని వెంచపల్లి గ్రామానికి చెందిన పబ్బ తిరుపతి–భాగ్య దంపతుల కుమారుడు అజయ్గౌడ్(24) గురువారం మధ్యాహ్నం ప్రాణహిత నదిలో స్నానం చేసేందుకు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. నదిలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా అజయ్గౌడ్ గల్లంతయ్యాడు. స్నేహితులంతా వెతికినా కనిపించకపోవడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సీఐ కృష్ణ, ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని గజఈతగాళ్లతో రెండు, మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దడంగాతో నదిలో గాలించగా ఆచూకీ లభ్యం కాలేదు. చీకటి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. కాగా, అజయ్గౌడ్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. వేసవి సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చాడని బంధువులు తెలిపారు. ఇప్పుడే వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన కుమారుడు నదిలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మాజీ ఎంపీటీసీ తిరుపతి, మాజీ సర్పంచ్ గట్టు లక్ష్మణ్గౌడ్, పడాల సతీశ్లు కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
టోల్ప్లాజా సిబ్బందిపై దాడి
కాసిపేట: మందమర్రి, సోమగూడం నాలుగు లైన్ల జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న టోల్ప్లాజా సిబ్బందిపై గురువారం సూపర్వైజర్లు దాడికి పాల్పడ్డారు. టోల్ప్లాజాలో ఆర్చ్లైట్ సంస్థ ఆధ్వర్యంలో విధులు నిర్వహించే సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు సక్రమంగా అందడం లేదని, ఈనెల జీతం తక్కువగా వచ్చిందని వారు ప్రశ్నించారు. కంపెనీ అందించే పేమెంట్లో తక్కువ, ఎక్కువ రావడం, జాప్యం జరగడం ఏమిటని సూపర్వైజర్లతో సిబ్బంది వాదనకు దిగారు. ఈక్రమంలో ఓ సూపర్వైజర్ సిబ్బందిపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సిబ్బంది విధులు బహిష్కరించి మందమర్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సూపర్వైజర్ అధికార పార్టీ నాయకుడి బంధువు కావడంతో పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీనెల రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వేతనాలు తక్కువగా వేస్తున్నారని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వాపోయారు. వీరికి ఐఎఫ్టీయూ నాయకులు మద్దతుగా నిలిచి చర్చలు కొనసాగించారు. -
అంతా గప్చుప్!
భైంసా: బాసర ఆర్జీయూకేటీలో బుధవారం ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఘటన జరిగిన వెంటనే విద్యార్థినిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన అధికారులు, అనంతరం అంతర్గత విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఆ విచారణలో ఏమి తేలింది, అసలు ఎలా జరిగింది, ఏ పరిస్థితుల్లో ఈ చర్యకు పాల్పడింది వంటి అంశాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వడం లేదు. ఏ భవనం నుంచి, ఏ అంతస్తు నుంచి దూకిందన్న ప్రాథమిక వివరాలు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. క్యాంపస్లో ఈ ఘటన బయటకు రాకపోవడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనలు గతంలో క్యాంపస్లో విద్యార్థుల ఆత్మహత్యలు, అనారోగ్య ఘటనలు, మెస్ సమస్యలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భాల్లో పూర్తి వివరాలు బయటకు రాలేదనే విమర్శలు ఉన్నాయి. ఘటనలపై వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. తల్లిదండ్రుల ఆందోళన వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ పిల్లలను ఉన్నత విద్య కోసం ఆర్జీయూకేటీకి పంపించిన తల్లిదండ్రులు ప్రతి ఘటన తర్వాత ఆందోళన చెందుతున్నారు. ఒక ఘటన జరిగిందని తెలిసినా, అసలు పరిస్థితి ఏమిటో తెలుసుకునే అవకాశం లేకపోవడం వారిని మరింత కలవరపెడుతోంది. ఫోన్ చేస్తే అధికారులు స్పందించడం లేదని, మీడియాకు సరైన సమాచారం ఇవ్వడం లేదని వాపోతున్నారు. తాజాగా జరిగిన ఘటనకు సంబంధించి ఏమి జరిగిందో తెలియని పరిస్థితి. వాస్తవానికి అధికారులు నిజాలు చెప్పకపోవడం ఏంటని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల మానసిక పరిస్థితి, కౌన్సెలింగ్ వ్యవస్థ, హాస్టళ్లలో పర్యవేక్షణ తదితర అంశాలపై సమగ్ర సమీక్ష అవసరమని పేర్కొంటున్నారు. ఆర్జీయూకేటీ యాజమాన్యం ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించి, విద్యార్థుల భద్రతపై తీసుకుంటున్న చర్యలను బహిరంగంగా ప్రకటించాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలి
నేరడిగొండ: కౌలు రైతులపై రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడి, గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వ పథకాలు అందించాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన కౌలు రైతులతో గురువారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం 2011 భూ అధీకృత వాస్తవ సాగుదారుల చట్టాన్ని అమలు చేసి రుణ అర్హత కార్డులు జారీ చేయాలని కోరారు. తద్వారా భూ యజమానులతో సంబంధం లేకుండా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడంతో పాటు బ్యాంకు రుణాలు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సుమారు 28,763 మంది కౌలు రైతులు ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని, ప్రతి ఏడాది ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల్లో కౌలు రైతులే అధికంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట రోహిదాస్, చందర్, పరుశురాం, అనసూయ, నీలాబాయి, కౌలు రైతులు ఉన్నారు. -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
మంచిర్యాలక్రైం: కేసులు పరిష్కారానికి కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20న జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తామని తెలిపారు. చాలకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల్లో కక్షిదారులు రాజీ కదుర్చుకోవాలని పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా కొట్టివేసిన కేసుల్లో మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని, దీని ద్వారా రెండు వర్గాల వారు కేసులో విజయం సాధించినట్లేనని తెలిపారు. సివిల్, రాజీకి తగిన క్రిమినల్ కేసులు, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, సైబర్ క్రైమ్స్ కేసులు పరిష్కరిస్తామని తెలిపారు. వివరాలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ, మండల న్యాయసేవాధికార సంస్థలో సంప్రదించాలని సూచించారు. -
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాకాబందీ
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణాలు, నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీసులు బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ప్రధా న రహదారులు, పట్టణాల్లో 25 ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చే శారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు 20 పోలీస్స్టేషన్ల పరిధిలో చేపట్టిన నాకాబందీలో అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచారు. అనుమానాస్పద వ్య క్తుల వేలి ముద్రలు సేకరించారు. డ్రంకెన్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలపై, సరైన పత్రాలు లేని వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుశాఖ కట్టుబడి ఉందన్నారు. సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. మోసగించిన కేసులో మహిళ అరెస్ట్ఆదిలాబాద్టౌన్: డబ్బులు తీసుకుని ఇవ్వకుండా మోసగించిన కేసులో పట్టణంలోని బృందావన్కాలనీకి చెందిన దాసరి జ్యోతిని అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. గతేడాది శాంతినగర్కు చెందిన కొత్తపల్లి సంతోష్ అనే వ్యక్తికి బొజ్జ లసుంబాయి భూమిని విక్రయించింది. ఇందులో దాసరి జ్యోతి మధ్యవర్తిగా ఉంది. భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుని బాధితురాలికి ఇవ్వకుండా రేపు..మాపంటూ ఇబ్బందులకు గురిచేస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇది వరకే కేసు నమోదు కాగా బుధవారం అరెస్ట్ చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
జిల్లాలో కురవాల్సిన సాధారణ వర్షపాతం(మిల్లీమీటర్లలో)
మంచిర్యాలఅగ్రికల్చర్: ఖరీఫ్ సాగుకు సిద్ధమైన కర్షకులను ఎల్నినో కలవర పెడుతోంది. వానాకాలం సాగుపై ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణ వర్షపాతం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురుస్తాయో లేదోననే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో రుతు పవనాలు విస్తరించి భారీ వర్షాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 41నుంచి 43డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఇప్పటికే వ్యవసాయ అధికారులు, సాగు, విత్తన, ఎరువుల ప్రణాళిక సిద్ధం చేశారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే సాగు ప్రణాళికలో మార్పులు, చేర్పులు ఉంటాయని, రైతులు దీర్ఘకాలిక రకాలు కాకుండా స్వల్పకాలిక కంది, మొక్కజొన్న, పెసర, మినుము, ఆరుతడి పంటల సాగుకు అవగాహన కల్పిస్తున్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఎల్నినో ప్రభావంతో జూన్, జూలైలో సాధారణ వర్షపాతం ఉంటుందని, ఆగస్టు, సెప్టెంబర్లో తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు.జిల్లాలో..జిల్లాలో చిన్న, సన్నకారు, కౌలు రైతులు 1.57లక్షల మంది ఉన్నారు. ఖరీఫ్లో 3.57 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ప్రధానంగా పత్తి, వరి పంటలు సాగు చేస్తున్నారు. సాగునీటి సౌకర్యాలు అవసరం మేరకు లేకపోవడంతో 80శాతం వర్షాధారంగానే పంటలు సాగవుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కాసిపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని లంబాడితండాకు చెందిన దిలావత్ బూర్యానాయక్ (51) బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై ఎల్లారం వైపు వెళ్తుండగా ఎదురుగా బైక్పై వచ్చిన పోడెటి సమ్మయ్య ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని కుమార్తె అజ్మీర సమీర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఆగిఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్నిర్మల్రూరల్: మండలంలోని ఎల్లాపల్లి ఎక్స్రోడ్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు రూర ల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు మేకల లోడుతో వస్తున్న వ్యాన్ ఎల్లపల్లి ఎక్స్రోడ్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. దీంతో వ్యాన్లో విశ్రాంతి తీసుకుంటున్న మధ్యప్రదేశ్కు చెందిన డ్రైవర్ మున్నాఖాన్ (48) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవింగ్ చేస్తున్న సతీష్ యాదవ్ గాయాల పాలయ్యాడు. వ్యాన్లో ఉన్న షేక్ అఖిల్, సోహెల్కు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ కృష్ణ పరిశీలించారు. కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ‘బస్సు యాత్రను అడ్డుకుంటాం’ఇంద్రవెల్లి: ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఆదివాసీ గిరిజన బస్సుయాత్రను అడ్డుకుంటామని తుడుందెబ్బ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుర్క బాపురావ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 79 ఏళ్ల స్వాతంత్య్ర పాలనలో పాలకవర్గ రాజకీయ పార్టీలు ఆదివాసీల అభివృద్ధికి పాటుపడకుండా వారిని అణగదొక్కే విధానాలకు పాల్పడుతున్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతానికి వలస వచ్చిన లంబాడీలు అక్రమంగా ఏజెన్సీ సర్టిఫికెట్లు పొంది రాజకీయ బలంతో ఉద్యోగాలు దక్కించుకున్నారన్నారు. టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ శంకర్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించే బస్సు యాత్రను ఆదివాసీలందరు కూడా వ్యతిరేకిస్తున్నారన్నారు. సమావేశంలో గోండ్వాన పంచాయతీ రాయిసెంటర్ రాష్ట్ర మేడి మెస్రం దుర్గు, ఆదివాసీ సంఘాల నాయకులు సెడ్మకి రామారావ్, కోరెంగ సీతారాం, మడావి శేకు, దుర్వ హన్ను, సోయం వినోద్, భీంరావ్, ఇంద్రు, తదితరులు పాల్గొన్నారు. -
భగ భగ.. ఉక్కపోత
మంచిర్యాలఅగ్రిల్చర్: జిల్లాలో సూర్యుడు భగ భగ మండిపోతున్నాడు. అన్ని మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. బుధవారం వేమనపల్లి మండలం నీల్వాయిలో కనిష్ట ఉష్ణోగ్రత 40.3 డిగ్రీలు, భీమారం, బెల్లంపల్లి, కోటపల్లి, జన్నారం, వేమనపల్లి మండలాల్లో 43 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండే ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జూన్ మూడో వారంలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రుతు పవనాలు విస్తరించి జిల్లా అంతటా వర్షాలు కురువాల్సి ఉండగా.. వరుణుడు ముఖం చాటేశాడు. పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో విద్యార్థులు ఎండల తీవ్రతతో అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. -
పునరావాస సమస్యల పరిష్కారానికి చర్యలు
ఉట్నూర్రూరల్: గిరిజనుల పునరావాస సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. కడెం మండలానికి చెందిన గోండు గిరిజనులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం మాజీ ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో పీవోను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. జిల్లా అటవీ అధికారి, కలెక్టర్, ఆర్డీవో, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. గిరిజనుల సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదల, హక్కుల పరిరక్షణకు ఐటీడీఏ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. గిరిజనులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా పరిష్కార మార్గాలు వేగవంతం అవుతాయన్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన నివేదికలను సిద్ధం చేసి సంబంధిత ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు వెల్లడించారు. -
గంజాయి కేసులో నలుగురి అరెస్టు
చెన్నూర్: గంజాయి కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. బుధవారం ఎస్సై శ్యాంపటేల్, సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పట్టణానికి చెందిన నితిన్, క్రాంతి, మైనర్ బాలుడు ఎదుల్లబంధంకు చెందిన దీపక్ వద్ద గంజాయి కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నారన్నారు. 160 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం, 1500 నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలి పారు. బాలుడు నెలరోజుల క్రితం గంజాయికి బా నిస కావడంతో 15 రోజుల పాటు మంచిర్యాలలోని డీఅడిక్షన్ సెంటర్కు పంపించామ ని, అతనిలో ఎలాంటి మార్పురాకపోవడంతో కేసు నమోదు చేసి జువైనల్ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. -
తేలనున్న బోగస్ ఓట్లు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)తో జిల్లాలో వేలాదిగా ఓట్ల సంఖ్య తగ్గేలా కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతీ పన్నెండేళ్లకోసారి చేపట్టే ఈ ప్రక్రియలో ప్రతీ ఓటు సమగ్రంగా పరిశీలన చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలో ఎస్ఐఆర్ చేపట్టి ఓటరు మ్యాపింగ్ చేశారు. అంటే ఓటర్లను కుటుంబంతో ఒకేచోట చేర్చి జాబితాలో చేర్చారు. జిల్లాలో మొత్తం ఓటర్లలో 72శాతమే ఓటర్ల మ్యాపింగ్ జరిగింది. అంటే మిగతా 28శాతం ఓట్లు మ్యాపింగ్ కాలేదు. చాలాచోట్ల ఓటర్లు అందుబాటులో లేరని బీఎల్వోలు చెబుతున్నారు. జాబితాలో పేర్కొన్న అడ్రస్ల్లోనూ లేరని, ఫోన్నంబర్లు సైతం అందుబాటులో లేవని గుర్తించారు. దీంతో మ్యాపింగ్లో లేని ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు, గుర్తింపును ఖచ్చితంగా రుజువు చేసుకోవాల్సి ఉంది. జిల్లాలో.. జిల్లాలో 6.67లక్షల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 4.80లక్షల మంది ఓట్లు ఎన్నికల సంఘం మ్యాపింగ్ జరిగాయి. మిగతా ఓట్లు ఎన్యూమరేషన్ సమయంలోనే బయటపడే అవకాశం ఉంది. నిజంగా ఆ ఓట్లు ఉన్నాయా? లేవా? అనేది తేలనుంది. జిల్లాలో ఇప్పటికే 747 మంది బీఎల్వోలు ఓటరు మ్యాపింగ్కు పలుమార్లు ఓటర్ల కోసం ఇంటింటికి తిరిగారు. కొన్ని చోట్ల జాబితాలో ఉన్న ఓటర్లు మరణించారు. మరికొన్ని చోట్ల వలస వెళ్లారు. ఇంకా కొందరు వలస వెళ్లిన చోట్ల ఓటరుగా ఉండి జిల్లాలోనూ ఓటరుగా కొనసాగుతున్నారు. ఇలా డబుల్ ఓటర్లను సైతం గుర్తించారు. దీంతో ఓట్లు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కొందరు మ్యాపింగ్ సమయంలో అందుబాటులో లేకపోతే ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చిప్పుడు ఫాంలో వివరాలు రాసి ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే ఓటరుగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా, మ్యాపింగ్ సమయంలో లేకపోయినా ఓటు కోల్పోయే ప్రమాదం ఉంది. -
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్రాథోడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పాతమంచిర్యాలలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని, మందుల నిల్వలను స్టాక్ రిజిష్టర్లో నమోదు చేయడంతోపాటు గడువు తేదీలను పరిశీలించిన తర్వాతే రోగులకు ఇవ్వాలని సూచించారు. అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలని, ఆడపిల్లలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా హెచ్పీవీ వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు అశోక్, స్నేహిత, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీ విద్యార్థినికి...
బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ(ఐఐఐటీ)లో ఓ విద్యార్థిని బుధవారం హాస్టల్–1 భవనం పై నుంచి కిందపడిన ఘటన కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన బాగ్లీ హష్మతాబేగం పీ1 చదువుతోంది. బాలికల హాస్టల్ భవనంపై నుంచి కిందపడినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియరాలేదు. ఘటనకు గల కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను యాజమాన్యం అధికారికంగా వెల్లడించకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
విద్యుత్తో జర భద్రం
చెన్నూర్రూరల్: వర్షాకాలంలో ప్రజలు, రైతులు విద్యుత్తో చాలా అప్రమత్తంగా ఉండాలి.. ఇంటివద్ద, పంట పొలాల్లో విద్యుత్ వినియోగంలో తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో విద్యుత్తో బోరుబావులు, వాగుల వద్ద విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి పంటలు సాగు చేస్తున్నారు. విద్యుత్ వినియోగంపై రైతులు కచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించాలని కొమ్మెర ట్రాన్స్కో ఏఈ కేశెట్టి శ్రీనివాస్ సూచిస్తున్నారు. ఇంటివద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు పంట పొలాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
దండేపల్లి: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నెల్కివెంకటాపూర్లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై రాజవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొమ్మెన సుమంత్ (23) డిగ్రీ మధ్యలోనే ఆపేసి, కూలీ పనులకు వెళ్తున్నాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. సదరు యువతి అతని ప్రేమను నిరాకరించింది. దీంతో అతను కొద్దిరోజులుగా ఇంట్లో దిగాలుగా ఉంటున్నాడు. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. ఇంతలో పక్కింటికి వెళ్లిన తల్లి సత్తవ్వ ఇంటికి వచ్చి గది తలుపులు తెరిచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. సత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
సౌకర్యాలు కల్పిస్తే సిద్ధమే..
ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కనీస సౌకర్యాలు లేక విక్రయాలు నిలిపివేశాం. మార్కెట్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. చెన్నూర్తోపాటు గ్రామీణ ప్రాంతాల నుంచి సుమారు వందకు పైగా మహిళా వ్యాపారులు ఇక్కడికి వచ్చి కూరగాయల విక్రయాలు చేపడుతుంటారు. మార్కెట్కు గేటు, తాగునీరు, పైన రేకులు ఏర్పాటు చేస్తే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం. – బోగె భారతి, కూరగాయల వ్యాపారుల సంఘం అధ్యక్షురాలు ప్రతిపాదనలు పంపించాం..మార్కెట్లో ఫ్లోరింగ్, టాయిలెట్స్ నిర్మాణం పనులు మంత్రి వివేక్వెంకటస్వామి సహకారంతో చేపడుతాం. ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాం. మార్కెట్ పక్కనే వాటర్ ట్యాంక్ ఉండడంతో తాగునీటి కోసం నల్లాలు ఏర్పాటు చేశాం. వ్యాపారులు కోరిన విధంగా షెడ్లు కేటాయిస్తాం. ఎవరికి కేటాయించిన షెడ్లకు వారు రక్షణగా సౌకర్యవంతంగా ఏర్పాటు చేసుకుంటే సహకరిస్తాం. – మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్, చెన్నూర్ -
నకిలీ పత్తి విత్తన వ్యాపారిపై పీడీయాక్టు
బెల్లంపల్లి: రైతులకు నకిలీ పత్తి విత్తనాలు అంటగడుతున్న ఓ వ్యాపారిపై పోలీసులు పీడీయాక్టు చట్టాన్ని ప్రయోగించారు. రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా బుధవారం వివరాలు వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వూస సుబ్బారావు కమిషనరేట్ పరిధిలోని తాండూర్, భీమిని, భీమారం, బెల్లంపల్లి, నెన్నెల, చెన్నూర్ మండలాల్లో ఏజెంట్లను నియమించుకుని నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నాడు. ఈ ఏడాది అతనిపై రెండు పీడీయాక్టు కేసులు నమోదయ్యాయి. తాండూర్, భీమారం పోలీస్స్టేషన్ల పరిధిలోని రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా చేసినట్లు రూఢీ కావడంతో నిందితుడిపై పీడీయాక్టు అమలు చేస్తూ సీపీ అంబర్ కిశోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. తాండూర్ సీఐ ఎన్.దేవయ్య, ఎస్సై ప్రసాద్ ఉత్తర్వుల ప్రతిని అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు. 2021 నుంచి 2025 వరకు నకిలీ పత్తి విత్తనాల రవాణా, నిల్వ, విక్రయాలకు సంబంధించిన అనేక క్రిమినల్ కేసుల్లో పాలు పంచుకున్నట్లు సీపీ ప్రకటించారు. 2021 జూన్ 10న సుబ్బారావుపై పీడీయాక్టు అమలు చేయగా ప్రభుత్వం ధృవీకరించిందని తెలిపారు. అయినప్పటికీ తన వైఖరి మార్చుకోలేదన్నారు. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల పరిధిలో 9 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. నిందితుడిపై పీడీయాక్టు అమలుకు కృషి చేసిన బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, తాండూర్ సీఐ దేవయ్య, ఎస్సై ప్రసాద్ను సీపీ అభినందించారు. -
విద్యాలయ పనులు వేగవంతం చేయండి
నస్పూర్: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పీ.చంద్రయ్య అన్నారు. బుధవారం నస్పూర్ మండల కేంద్రంలోని కేజీబీవీని సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను నిర్ధేశిత గడువులోపూ పనులు పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం, పరిశుభ్రతపై దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న భోజనం, సదుపాయాలు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. -
అసౌకర్యాల మార్కెట్
చెన్నూర్: చెన్నూర్ పట్టణంలో రూ.7.50కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత మార్కెట్(ఇంటిగ్రేటెడ్ మార్కెట్) భవనం అసౌకర్యాలకు నిలయంగా మారింది. గత జనవరిలో అసౌకర్యాల మధ్యనే హడావుడిగా ప్రారంభించి పనులు పూర్తి చేయకపోవడంతో నిరుపయోగంగా మారుతోంది. మార్కెట్ ప్రారంభించిన సమయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు హామీనివ్వడంతో వ్యాపారులు కూరగాయల విక్రయాలు చేపట్టారు. మూత్రశాలలు, తాగునీటి సౌకర్యాలు కల్పించకపోవడంతో మళ్లీ పాత మార్కెట్లో విక్రయాలు చేపడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మూత్రశాలలు లేవు. తాగునీటి సౌకర్యం కల్పించలేదు. ఫ్లోరింగ్, ఎండ నుంచి రక్షణకు పైన రేకులు ఏర్పాటు చేయలేదు. మార్కెట్ భవన నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ అకాల మృతితో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. కొత్త కాంట్రాక్టర్కు అప్పగించి మరో రూ.20లక్షలు కేటాయిస్తే ఫ్లోరింగ్, మరుగుదొడ్లు, మూత్రశాలలు, గేటు, తాగునీటి సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కూరగాయలు విక్రయిస్తున్నారు. వర్షాకాలం దృష్ట్యా అధికారులు పనులు పూర్తి చేయించాలని వ్యాపారులు కోరుతున్నారు. -
సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
● అధికారులకు అవగాహన ఉండాలి ● రాష్ట్ర ప్రధాన కమిషనర్ జి.చంద్రశేఖర్రెడ్డి మంచిర్యాలఅగ్రికల్చర్: సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేయొద్దని సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ జి.చంద్రశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ.శ్రీనివాస్రావు, మోహిసిన్ పర్వీన్, దేశాల భూపాల్రెడ్డి, బోరెడ్డి అయోధ్యరెడ్డి, కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్తో కలిసి జిల్లా అధికారులకు సమాచార హక్కు చట్టం సమర్థవంతమైన అమలు, ప్రజలకు సమాచారం అందించడం, నిబంధనలు పాటించడం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సమాచారాన్ని పారదర్శకంగా అందించడం ప్రతీ ప్రభుత్వ అధికారి బాధ్యత అన్నారు. చట్టం లక్ష్యాలను సాధించేందుకు అధికారులు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. చట్ట ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలని, ఆలస్యమైతే ఉచితంగా అందించాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ అందించిన సలహాలు, సూచనలు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. అనంతరం జిల్లాలో పెండింగ్లోని ఉన్న అప్పీళ్ల దరఖాస్తులను ఆయా శాఖల వారీగా పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
టీజీపల్లెలో రేబీస్ కలకలం!
జన్నారం: మండలంలోని టీజీపల్లెలో రేబీస్ వ్యాధి కలకలం రేపుతోంది. వార ం రోజుల క్రితం వ్యాధి సోకిన కుక్క మృతి చెందడంతో పంచాయతీ సిబ్బంది కళేబరాన్ని పూడ్చిపెట్ట కుండా వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కుక్క కళేబరాన్ని పాతిపె ట్టకపోవడంతో ఇతర శునకాలు దానిని తిన్నాయని, అనంతరం అవి గేదెలను నాకడంతో వ్యాధి వ్యాప్తిచెంది ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేబీస్ లక్షణాలతో బుధవారం రెండు గేదెలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రవి అనే రైతుకు చెందిన ఆవుదూడ మృతి చెందగా అనుమానంతో పాతిపెట్టినట్లు చెబుతున్నాడు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు, గ్రామ పాలకులు స్పందించి తగు చ ర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై పశువైద్యాధికారి శ్రీకాంత్ను సంప్రదించగా రేబీస్ సోకినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, ఇతర శునకాలకుగానీ గేదెలకు గానీ రేబీస్ సోకితే 15 రోజుల్లో లక్షణాలు బయటకు కనిపిస్తాయన్నారు. గంజాయి విక్రేతలపై కేసుఆదిలాబాద్టౌన్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిపై వేర్వేరుగా కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. పట్టణంలోని బొక్కల్గూడకు చెందిన షేక్ షాబీర్ మహారాష్ట్రలోని యావత్మాల్ నుంచి గంజాయి తీసుకువచ్చి ఆదిలాబాద్లో విక్రయిస్తున్నాడు. బుధవారం తనిఖీ చేయగా అతని వద్ద 70 గ్రాముల గంజాయి లభించింది. కేసు నమోదు చేసి డిఅడిక్షన్ సెంటర్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. మహాలక్ష్మివాడకు చెందిన షేక్ మసూద్పై ఫిబ్రవరిలో గంజాయి కేసు నమోదైంది. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఖానాపూర్ చెరువు వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద 2 గ్రాముల గంజాయి లభించింది. నిందితుడిపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. -
శాంతిఖని దశ తిరిగేనా?
బెల్లంపల్లి:బొగ్గు ఉత్తత్తిలో బెల్లంపల్లిలోని శాంతిఖని గనిది సుదీర్ఘ ప్రస్థానం. 72 ఏళ్లుగా తవ్వకాలు జరుపుతున్నా మరో రెండు దశాబ్దాలకు పైగా సరిపడా బొగ్గు నిల్వలు ఉండడం విశేషం. ఈ గనిలో బొగ్గు ఉత్పత్తికి ఏర్పడుతున్న ప్రతికూల పరిస్థితులు సంకటంగా మారుతున్నాయి. ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతున్నా ముందుకు సాగుతూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ గనిలో ఉన్న నల్ల బంగారాన్ని పూర్తి స్థాయిలో వెలికితీసేందుకు సింగరేణి యా జమాన్యం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగించుకుంటూనే విదేశీ ప్రైవే ట్ సంస్థల సహకారం ఆశిస్తోంది. ఇందులో భాగంగా కొన్నాళ్ల క్రితం జా య్ మైనింగ్ సర్వీసెస్ (జేఎంఎస్) ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం చేసుకుని బొగ్గు ఉత్పత్తి కోసం చేసిన యత్నాలు సత్ఫలితాలు ఇవ్వలేదనే అసంతృప్తి ఉంది. ఆ క్రమంలోనే సింగరేణి, జేఎంఎస్ మధ్య పొరపొచ్చాలు రావడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. సింగరేణితో చేసుకున్న ఒప్పందం రద్దుకు జేఎంఎస్ యత్నాలు సాగిస్తుండగా యా జమాన్యం కూడా అంతేస్థాయిలో స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన మరో ప్రైవేట్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నా రు. ఆ సంస్థ ప్రతినిధి బృందం ఈ నెల 10న గనిలో దిగి పనిస్థలాలను, భూగర్భ భౌగోళిక పరిస్థితులను ప్రాథమికంగా పరిశీలించి ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం రెండు నెలల్లో వెల్లడిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పి వెళ్లగా ఏ నిర్ణయం తీసుకుంటారోనని గని అధికారులతో పాటు కార్మికులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. విఫలమైన ఆధునిక యంత్ర ప్రయోగాలు బొగ్గు అధికోత్పత్తి చేయాలనే ఉద్దేశంతో గనిలో ఆధునిక యంత్రాలను ప్రయోగాత్మకంగా దింపారు. కంటిన్యూయస్ మైనర్ (సీఎం) యంత్రాన్ని ప్రవేశ పెట్టినా ఏమాత్రం స త్ఫలితాలు ఇవ్వలేదు. ఆ యంత్రం కోసం భూగర్భంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎంతగా శ్రమించినా ఆ యంత్రం ఆశలు నెరవేర్చక పోగా తీవ్ర నిరాశకు గురి చేసింది. చివరకు ఆ యంత్రాన్ని ఆర్జీత్రీ ఏరియాకు తరలించారు. అదేక్రమంలో జేఎంఎస్ విదేశీ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని బోల్టర్ మైనర్ (బీఎం) యంత్రాన్ని తె చ్చారు. ఇదికూడా సరిగా పనిచేయకపోవడంతో ఆ శలపై నీళ్లు చల్లించింది. ప్రస్తుతం ఎస్డీఎల్ యంత్రాలతో అతికష్టంగా బొగ్గు వెలికితీత ప్రక్రియ కొనసాగిస్తున్నా లక్ష్యాన్నీ చేరుకోలేక చతికిల పడుతున్నట్లు తెలుస్తోంది. మిగిలి ఉన్న 43 మిలియన్ ట న్నుల్లో 13 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను కంటీ న్యూయస్ మైనర్ యంత్రం ద్వారా, 30 మిలి యన్ టన్నుల బొగ్గును లాంగ్ వాల్ ప్రాజెక్టు ద్వారా వెలికి తీయాలని చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. గనిని లాంగ్వాల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని చేసిన ప్రతిపాదనలు అటకెక్కాయి. కొ త్తగా షార్ట్వాల్ ప్రాజెక్టు తెరమీదకు తెచ్చినా అ దికూడా అమలు కాలేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలి యా కంపెనీపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. శాంతిఖని భూగర్భంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. 43 మిలియన్ టన్నుల బొగ్గు సంపద ఉన్నట్లు సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం అధికారులు చేసిన సర్వేలో గుర్తించారు. గనిలో ప్రస్తుతం 450 మీటర్ల లోతులో పనిస్థలాలు ఉన్నాయి. అంతదూరం వెళ్లి బొగ్గు వెలికి తీయాల్సివస్తుండగా భూగర్భ భౌగోళిక పరిస్థితులు, గాలి సరఫరా, తదితర సమస్యలు అశాంతికి గురి చేస్తున్నాయి. భూగర్భంలో దిగి పని స్థలాలకు చేరుకునే లోపే కార్మికులు అలసి పోతున్నారనే ఉద్దేశంతో శాంతిఖనికి అనుబంధంగా రూ.22 కోట్లు వ్యయం చేసి షాప్ట్ వైండింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం షాప్ట్ వైండింగ్ ద్వారా కార్మికులు గనిలో దిగి విధులు నిర్వహించడం ఊరట నిస్తోంది.ఆస్ట్రేలియా కంపెనీపైనే.. గనిలో దిగి పనిస్థలాలను పర్యవేక్షించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం గనిలో ఉన్న బొగ్గు నిల్వలను పూర్తిస్థాయిలో వెలికితీయడం సాధ్యమేనని సూచనప్రాయంగా తెలిపింది. సమగ్రంగా అధ్యయనం చేసి రెండు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ బృందం పరిశీలించిన అంశాలు, వ్యక్త పరిచిన అభిప్రాయాలు గని భవిష్యత్కు దోహదపడతాయనే ఆశాభావంతో ఉన్నాం. – సంజయ్కుమార్ సిన్హా, శాంతిఖని గని మేనేజర్ -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
తలమడుగు: చేపలు పట్టడానికి వెళ్లి విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కొత్తూరుకు చెందిన కాటిపల్లి కపిల్రెడ్డి (31)మంగళవారం అతని స్నేహితులు శైలేందర్, రామయ్య, ప్రమోద్, గంగయ్యతో కలిసి చేపలు పట్టేందుకు సమీపంలోని వాగుకు వెళ్లారు. విద్యుత్ తీగల సహాయంతో చేపలు పట్టే ప్రయత్నంలో కపిల్రెడ్డి షాక్కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాధిక తెలిపారు. అనుమానాస్పదంగా ఒకరు..తానూరు: అనుమానాస్పదంగా ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని బోల్సాలో పాలేరుగా పనిచేస్తున్న కందురోళ్ల పీరాజీ (35) సోమవారం రాత్రి యజమాని పశువుల పాకకు వెళ్లి అక్కడే పడుకున్నాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన తోటి పాలేర్లకు చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్పీ సాయికిరణ్, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా చాకు, మృతదేహాంపై చింపేసినట్లు ఉన్న చొక్కా, కల్లు సీసాలు, మద్యం బాటిళ్లు గుర్తించారు. భూ వివాదం విషయమై పాత కక్షలతో సమీప బంధువులే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బెల్తరోడా–భైంసా రహదారిపై ధర్నా నిర్వహించారు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..దిలావర్పూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మంజులాపూర్కు చెందిన ఉప్పల గణేశ్ (57)కు దిలావర్పూర్లోని పాత బస్టాండ్ ప్రాంతంలో వ్యవసాయ భూమి ఉంది. దానిని ము జ్టిగ ముత్యంకు కౌలుకు ఇచ్చాడు. మంగళవారం పంటచేను చూసేందుకు వచ్చాడు. ముత్యంను బస్టాండ్ వరకు రమ్మని పిలవడంతో అతని ఎలక్ట్రిక్ వాహనంపై వెళ్తుండగా నిర్మల్–భైంసా రహదారిపై వెనుకనుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గణేశ్ అక్కడికక్కడే మృతి చెందగా ముత్యంకు గాయాలు కావడంతో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. యువతి అదృశ్యంసిర్పూర్(టి): మండలంలోని చీలపెల్లికి చెందిన నిఖిత ఈ నెల 15న రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదని, కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్ తెలిపారు. గ్రామానికి చెందిన యు.సునీత కుమార్తె నిఖిత 15న రాత్రి బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగిరాలేదన్నారు. గతంలో ఆసిఫాబాద్ మండలం నవేగాంకు చెందిన రెగర్ల వెంకటేష్ నిఖితను తీసుకెళ్లి సిర్పూర్(టి)లో వది లేసి వెళ్లిపోయాడన్నారు. ఇప్పుడు కూడా తమ కూ తుర్ని అతనే తీసుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సునీత ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పుట్టిన రోజునే కబళించిన మృత్యువు
జన్నారం: పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు ఎంతో ఉత్సాహంగా వెళ్తున్న ఆ యువకుడిని బైక్ రూపంలో మృత్యువు కబళించింది. మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం చింతగూడకు చెందిన గుండ మల్లేశ్, సుజాత దంపతుల కుమారుడు రాకేష్ (22) హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ బండ్లగూడలో ఉంటున్నాడు. మంగళవారం అతని పుట్టినరోజు కావడంతో కేక్ కట్చేద్దామని నార్సింగ్లో ఉన్న అతని స్నేహితులు పిలవడంతో సోమవారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు. యువకుడి మరణంతో చింతగూడలో విషాదం చోటు చేసుకుంది. -
మంచిర్యాల
7‘కడెం’కు రక్షణగా ట్రాష్ రాక్ ‘కడెం’ ప్రధాన కాలువకు రక్షణగా ట్రాష్రాక్ నిర్మాణం చేపట్టారు. వర్షాకాలం సమీపిస్తుండగా రూ.2.58కోట్లతో చేపట్టిన పనులు నెలాఖరులోపు పూర్తి చేయనున్నారు.అస్మదీయులకు ఓడీ.. ఆర్టీసీలో సిబ్బంది కొరతతో అధికారులు ఉన్నవారితోనే డబుల్ డ్యూటీ చేయిస్తున్నారు. కాగా, కొందరు అవుట్ ఆఫ్ డిసిగ్నేషన్ డ్యూటీలు ఇస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. వాతావరణం చల్ల బడుతుంది. అక్కడక్కడా వర్షం కురుస్తుంది. -
సాగు భూముల కోసం పోరు
కడెం: సాగు భూముల కోసం మండలంలోని పెత్తర్పు గోండుగూడ వాసులకు అటవీ అధికారులకు మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. మంగళవారం పునరావాసంలో భాగంగా కవ్వాల్ టైగర్జోన్లో రాంపూర్, మైసంపేట్ వాసులకు అప్పగించిన సాగు భూములకు హద్దులు ఏర్పాటు చేయించేందుకు వెళ్లిన అటవీ, రెవెన్యూ అధికారులను గోండుగూడ వాసులు మళ్లీ అడ్డుకున్నారు. పునరావాస గిరిజనులతో పాటుగా ఏళ్లుగా ఇక్కడే సాగు చేస్తున్న తమకు సాగు భూములు కేటాయించాలని డిమాండ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పది మంది ఆదివాసీలను జీపులో ఇందన్పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారు. అడ్డుకునేందుకు వెళ్లిన మహిళలను ఈడ్చుకెళ్లారు. ఓ ఆదివాసీ మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పునరావాసంలో భాగంగా రాంపూర్, మైసంపేట్ వాసులకు భూములు అప్పగించామని, వారికి పట్టాలు సైతం వచ్చాయని, గోండుగూడ వాసులు అడ్డుకోవడం సరికాదని ఎఫ్డీవో శివకుమార్ అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో దేవదాసు, తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఎఫ్ఆర్వోలు గీతారాణి, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్రావు, అనితా, కల్పనదేవి, వాణి, రామకృష్ణ, కిరణ్, ఎస్సైలు సాయికిరణ్, సాయికుమార్, హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు. అటవీ అధికారుల దౌర్జన్యం సరికాదు కడెం: మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ జీపీ పరిధిలోని గోండుగూడ వాసులపై అటవీ అధికారుల దౌర్జన్యం సరికాదని రాంజీగోండ్ సేవాసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషంరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గోండుగూడ ఆదివాసీలు సాగు భూముల కోసం పోరాడితే వారిని అడ్డుకుని ఇందన్పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారన్నారు. ఆదివాసీలకు సాగు భూములు దక్కే వరకు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఆత్రం రాజేశ్వర్, తొడసం భీంరావు, తదితరులు పాల్గొన్నారు. -
సంకల్ప్ ప్రాజెక్ట్కు రిమ్స్ ఎంపిక
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో మాతాశిశు మరణాలను నియంత్రించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంకల్ప్ ప్రాజెక్ట్ను అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కింద జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని వసతులు, మెరుగైన వసతుల కల్పనకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై మంగళవారం హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర సెక్రెటరీ క్రిస్టినా జడ్ చోంగ్తు ముఖ్య అతిథిగా హాజరైన సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, డీసీహెచ్ఎస్ డా.ఉపేందర్ జాదవ్, రిమ్స్ పిడియాట్రిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.వంశీకృష్ణ, నర్సింగ్ సిబ్బంది అరుణ, సిమ్మి కుమారి, తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో వేగం పెంచాలి
భీమిని: ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో చంద్రయ్య సూచించా రు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీ బీవీ, జిల్లా పరిషత్ పాఠశాలలను సందర్శించారు. కేజీబీవీలో చేపట్టిన భోజ నశాల పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో ఆర్వో ప్లాంట్కు మరమ్మతు చేయించాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు. అనంతరం జిల్లా పరిష త్ పాఠశాలలో బూత్ స్థాయి అధికారులు, ఏ జెంట్లకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై నిర్వహిస్తున్న శిక్షణకు హాజరై పలు సూచనలు చేశారు. భారత ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పన దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా పరిషత్ పాఠశాలకు మంజూరైన మూత్రశాలలు త్వరగా నిర్మించాలని ఆదేశించారు. ఎంపీడీవో గంగమోహన్, తహసీల్దార్ బికర్ణదాస్, ఎంఈవో వెంకటస్వామి, ఎంపీవో మహేశ్, సర్పంచ్ శ్రీకాంత్గౌడ్ తదితరులున్నారు. -
యూరియా బుకింగ్ యాప్ వినియోగంపై సమీక్ష
మంచిర్యాలరూరల్(హాజీపూర్): యూరియా బుకింగ్ యాప్ వినియోగంపై మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్, వ్య వసాయశాఖ డైరెక్టర్ గోపి వీసీలో పాల్గొనగా జిల్లా నుంచి జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, ఏడీఏ మామిడి కృష్ణ, రైతు ఉత్పత్తిదారుల సంఘం డైరెక్ట ర్ పూస్కూరి శ్రీనివాసరావు, సీఏసీఎస్ సీఈవో వినయ్, ఏవో కృష్ణ, ఏఈవో మధుపా, కృషి సఖీ స్వప్న, జాతీయ సహజ వ్యవసాయ రైతులు పాల్గొన్నారు. యూరియా బుకింగ్ యాప్ వినియోగంలో రైతులు ఇంకా చైతన్యం కావాల్సిన అవసరం ఉంద ని, ప్రస్తుతం అందరి సహకారంతో యాప్లో యూ రియా బుకింగ్ చేసుకుంటున్నారని, దీంతో సమ యం కూడా ఆదా అవుతోందని మంత్రితో సేంద్రియ రైతులు పూస్కూరి శ్రీనివాసరావు, తిప్పని కుమార్ తెలిపారు. డీలర్ల వద్ద ఎలాంటి వరుస లేకపోవడంతో యూరియా కొనుగోళ్లు సులభతరంగా మారాయని తెలిపారు. అయితే, యాప్లో బుకింగ్ పై అవగాహన లేని రైతులకు మీ సేవా కేంద్రం ద్వా రా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరా రు. జీలుగ, జనుము, పచ్చిరొట్టతో యూరియా వి నియోగం చాలా వరకు తగ్గిందని, రైతు ఉత్పత్తిదా రుల సంఘం ద్వారా 125 మంది రైతులు సహజ వ్యవసాయం చేస్తుండగా చాలా వరకు రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లేలా చూస్తున్నామ ని ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందిస్తూ సేంద్రియ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. -
‘కడెం’కు రక్షణగా ట్రాష్రాక్
కడెం: నిర్మల్–మంచిర్యాల జిల్లాల ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్ కడెం ద్వారా 68,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. కడెం ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ద్వారా కడెం, దస్తురాబాద్, జన్నారం, దండెపల్లి, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రధాన కాలువకు రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం ట్రాష్రాక్ నిర్మాణం చేపట్టింది. వర్షాకాలం సమీపిస్తున్నందువల్ల పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యకు చెక్ కడెం ప్రాజెక్ట్ వరదల సమయంలో వచ్చే భారీ దుంగలు, చెత్తాచెదారం ప్రధాన(ఎడమ) కాలువ గేట్లలో ఇరుక్కుని, కాలువ గేట్లు ఎత్తేందుకు, దించేందుకు ఇబ్బందులు తలెత్తేవి. గతేడాది కాలువ గేటులో భారీ దుంగ ఇరుక్కుపోవడంతో గేటును కిందకు దించలేకపోయారు. ఇలాంటి సమయంలో సాగునీరు వృథాగా పోయో పరిస్థితి నెలకొంటుంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు రక్షణగా రూ.2.58 కోట్ల వ్యయంతో ట్రాష్రాక్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కాలువ సమీపంలో ఈ ట్రాష్రాక్ నిర్మాణం చేపట్టడంతో వరదల సమయంలో వచ్చే భారీ దుంగలు, కట్టెలు, చెత్తాచెదారం అడ్డుకుంటుంది. దీంతో ప్రధాన కాలువకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగునీటిని దిగువకు వదిలేందుకు ఆస్కారం ఉంటుంది. కాలువకు అడ్డుకట్టగా భారీ పిల్లర్లను నిర్మించి, మధ్యలో భారీ ఇనుప జాలీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన కాలువకు ప్రస్తుతం ఉన్న గేట్లను తొలగించి వాటిస్థానంలోనూతన గేట్లను అమర్చనున్నారు. ప్రాజెక్ట్పై ప్రభుత్వం ఫోకస్ కడెం ప్రాజెక్ట్ మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022, 2023లో కడెం ప్రాజెక్ట్కు వచ్చిన భారీ వరదల కారణంగా ప్రాజెక్ట్ డేంజర్జోన్లోకి వెళ్లింది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.12 కోట్ల నిధులతో ప్రాజెక్ట్ వరద గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం రూ.2.58 కోట్లతో ప్రాజెక్టు ఎడమ కాలువకు రక్షణగా ట్రాష్రాక్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ నెలాఖరుకు పూర్తి కడెం ప్రధాన కాలువలోకి భారీ దుంగలు వెళ్లి కాలువ గేట్లు ఎత్తేందుకు, దించేందుకు ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు ట్రాష్రాక్ నిర్మాణం చేపడుతున్నాం. వర్షాకాలం సమీపిస్తున్నందువల్ల పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల చివరినాటికి పనులు పూర్తి చేయిస్తాం. – వీరన్న, డీఈఈ, కడెం ప్రాజెక్ట్ -
బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలటౌన్: డీఎంహెచ్వోగా డాక్టర్ న రేందర్ రాథోడ్ మంగళవారం బాధ్యతలు స్వీ కరించారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. డీఎంఅండ్హెచ్వో కార్యాలయంలో నరేందర్ రా థోడ్ను వైద్యులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అనిల్, సూపరింటెండెంట్ విశ్వేశ్వర్రెడ్డి, డీపీవో ప్రశాంతి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మహ్మద్ రషీద్, అల్లాడి శ్రీనివాస్, నాందేవ్, కాకినాడ వెంకటేశ్వర్లు తదితరులున్నారు. -
ఆరోపణలు, విమర్శనాస్త్రాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బొగ్గు గనులపై రాజకీ యం వేడెక్కింది. జిల్లాలో కొద్ది రోజులుగా బొగ్గు గ నులు కేంద్రంగా కార్మిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రాజకీయ ప్రముఖు లు పర్యటిస్తున్న క్రమంలో నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల యుద్ధం పెరుగుతోంది. రెండురోజులుగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత ‘బాయి బాట’ పేరిట గనుల ను సందర్శిస్తున్నారు. కాసిపేట, శ్రీరాంపూర్తో పా టు స్థానిక కార్మికులను కలుస్తూ పలు సమస్యలు తె లుసుకుంటున్నారు. కార్మికుల వసతుల నుంచి సంస్థ విధానాలపై తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. కవి త హెచ్ఎంఎస్కు గౌరవాధ్యక్షురాలిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ‘బాయి బాట’తో కార్మి క లోకానికి దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ తోపాటు బీఆర్ఎస్పైనా విమర్శలు గుప్పిస్తున్నా రు. గతంలో కవిత టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా పనిచేయగా, తాజాగా కొత్త రాజకీయ పార్టీతో ఇక్క డి నుంచే రాజకీయాలు చేస్తామని ప్రకటించారు. డిప్యూటీ సీఎం, మంత్రుల టూర్ ఇటీవలే జిల్లాకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్కతో పాటు మంత్రులు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొ న్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్తో, సింగరే ణి ప్రాంత ఎమ్మెల్యేలు పర్యటించారు. కొంతకా లంగా పెండింగ్లో ఉన్న సింగరేణి కార్మికుల వారసులకు సంస్థలో కారుణ్య నియామకాలు ఇచ్చారు. ఒకేరోజు జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి 335మందికి నియామక పత్రాలు ఇచ్చారు. డిప్యూ టీ సీఎం, మంత్రి శ్రీధర్బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రే మ్సాగర్రావు నివాసంలోనే బస చేశారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్టుపై ఓపెన్ హౌస్ నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై బొగ్గు వెలికితీత నుంచి ఉత్పత్తి, రవాణా వరకు మీడియా సమక్షంలోనే అధికారులతో వివరించారు. రాజకీయ జోక్యం.. కార్మికుల బేజారు స్వతంత్ర ప్రతిపత్తిగల సింగరేణి కంపెనీలో మితి మీరిన రాజకీయ జోక్యం ఇప్పటికే సంస్థ పని తీరు పై ప్రతికూల ప్రభావం చూపుతోందనే విమర్శలు న్నాయి. కంపెనీలో కార్మికుడికి క్వార్టర్ కేటాయింపు నుంచి డిప్యుటేషన్, బదిలీ లాంటి చిన్న పనుల నుంచి మెడికల్బోర్డు ఏర్పాటు, నూతన నియామకాలు, టెండర్లు, సంస్థ లావాదేవీల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాలు ప్రభావితం చేయడంతో కార్మిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక గత, ప్రస్తుత ప్రభుత్వాలు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు విద్యుత్ సంస్థ నుంచే కాకుండా సర్కా రు నుంచి వచ్చే మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడంతోనూ సంస్థ పరిస్థితి రోజురోజుకూ ఇబ్బంది గా మారింది. ఓ వైపు బొగ్గుకు తగ్గుతున్న డిమాండ్, భూ గర్భగనుల్లో నష్టాలు, ఓపెన్కాస్టుల్లో ప్రైవేట్ కాంట్రాక్టర్ల తీరుతో సంస్థకు ఇటీవల ఆశించిన తీరులో లాభాలు రావడం లేదు. ఇటీవల జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం కూడా సింగరేణిలో రాజకీ య జోక్యం ఉండబోదని ప్రకటించారు. స్వయం ప్ర తిపత్తి సంస్థ హోదాను కాపాడుతామని హామీ ఇ చ్చారు. అయితే, ఇప్పటికే కంపెనీలో కార్మికులకు మేలు చేస్తున్నామనే పేరుతో అన్ని రాజకీయ పార్టీ లు సంస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏ మేరకు సంస్థ తన స్వతంత్రను నిలబెట్టుకుంటుందనేది కార్మిక వర్గాల్లో పెద్దప్రశ్నగా మిగిలింది.సంస్థలో 40లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మా యమయ్యాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపణలు చేశారు. దీంతో కంపెనీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే దీనిపై సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఇక జైపూర్ థర్మల్ప్లాంట్లో 800 మెగావాట్ల యూనిట్ పనుల్లో అవినీతి జరిగిందని విమర్శించారు. ఈ రెండింటిపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్రెడ్డికి లేఖ రాయగా, ఆయన స్పందించారు. దీంతో జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు అధికార పార్టీకి చెందిన కోల్ బెల్ట్ పరిధి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ ఆరోపణల్ని తిప్పి కొట్టే ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా ఇటీవల టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంచిర్యాలకు వచ్చి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, చిన్నయ్య, కార్మిక నాయకుడు రాజిరెడ్డి, ఇతర నాయకులతో కలిసి ప్రెస్మీ ట్ నిర్వహించి బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారని, కార్మికులకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు. -
ప్రజల చెంతకే పాలన!
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల కష్టాలు తీరనున్నాయి. డివిజన్కో కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబా టులోకి తెచ్చేందుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ప్రణాళిక రూపొందించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడ్డాక విలీనమైన న స్పూరు మున్సిపాలిటీ, హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను కలుపుకొని మొత్తం 60 డివి జన్లుగా మారింది. పరిధి పెరగడం, డివిజన్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రజలు నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి సమస్యలు చెప్పుకోలేని పరి స్థితి నెలకొంది. దీంతో ప్రజలకు పాలన సౌలభ్యంగా ఉండాలని ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంతో ప్రతీ డివిజన్కు ఒక కార్యాలయం ఏర్పాటు కానుంది. ఇప్పటికే విలీన గ్రామాల్లో ఉన్న గ్రామపంచాయతీ కార్యాలయాలు, నస్పూరు మున్సిపాలిటీ పరిధిలో సింగరేణి క్వార్టర్లు, భవనాలను డివిజన్ కార్యాలయాలుగా వినియోగించుకుంటుండగా, కొత్తగా 45 కొత్త కార్యాలయాలు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ.1.40 కోట్లు కేటాయిస్తూ రెండు నెలల క్రితం పాలకవర్గం తీర్మానం చేసి ఆమోదించింది. ఇటీవలే టెండర్ ప్రక్రియ పూర్తికావడంతో పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, మంచిర్యాల ఎమ్మెల్యే కొ క్కిరాల ప్రేమ్సాగర్రావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్, కలెక్టర్ కుమార్ దీపక్, కమిషనర్ అన్వేశ్ ఈ నెల 13న శంకుస్థాపన చేశారు. ఆగస్టు 30లోపు డివిజన్ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించగా, పనులు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేలా..ఎమ్మెల్యే ఆదేశాలతో డివిజన్ కార్యాలయాలు నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వార్డు ఆఫీసర్లుగా 54మంది పనిచేస్తుండగా మరో ఆరుగురు అవసరముంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు డివిజన్లకు పక్కనే ఉన్న డివిజన్ ఆఫీసర్ ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. డివిజన్లో కార్యాలయాలు లేకపోవడంతో వార్డు ఆఫీసర్లు కూడా ఎప్పుడు కాలనీకి వస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతోనే ప్రజలు వారి సమస్యలు చెప్పుకొనేందుకు నగరపాలక సంస్థ కార్యాలయానికి వస్తున్నారు. దీంతో కార్యాలయం నిత్యం రద్దీగా మారుతుండడం, ప్రజలకు దూరభారంతో పాటు సమయం వృథా అవుతుండడం ఇబ్బందిగా మారుతోంది. డివిజన్ కార్యాలయాలు అందుబాటులోకి వస్తే ఇక ప్రజలు ఏ సమస్య ఉన్నా కార్యాలయంలో ఉండే వార్డు ఆఫీసర్ లేదా కార్పొరేటర్కు నేరుగా వివరించే అవకాశముంటుంది. ప్రజల సమస్యలపై వచ్చిన వినతులను వెంటనే మంచిర్యాల నగర పాలక సంస్థ కార్యాలయానికి పంపించి రెండుమూడ్రోజుల్లోపే పరిష్కరించేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలు కాలనీల్లో ఎక్కువగా ఉండగా వాటి పరిష్కారం కోసం అధికారులు చర్యలు వెంటనే తీసుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. -
అస్మదీయులకు ఓడీ.. తస్మదీయులకు డీడీ
ఆదిలాబాద్:సిబ్బంది కొరతతో ఆర్టీసీ సతమతమవుతోంది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం 8 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఒక్కోసారి 12 గంటల వరకు పనిచేయాల్సిన దుస్థితి. సిబ్బందిలేమి కారణంగా పనిభారం అధికమై ఎంతోమంది ఉద్యోగులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో నూతన నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్నవారికే డబుల్ డ్యూటీ (డీడీ)లు కేటాయిస్తూ అధికారులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది అధికారులు అవుట్ ఆఫ్ డిసిగ్నేషన్ డ్యూటీస్ (ఓడీ)లు ఇస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఓడీఎం బదిలీపై వెళ్తూ కొంతమంది ఉద్యోగులకు ఓడీలు ఇచ్చి వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. ఇదే కాకుండా రీజియన్ వ్యాప్తంగా కొంతమంది ఉన్నతాధికారులు అడ్డగోలుగా ఓడీలు ఇస్తూ అక్రమంగా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. అయినవారికి అందలం.. సాధారణంగా స్టాఫ్ తక్కువగా ఉంటే నియామకాల ద్వారా ఖా ళీలు భర్తీ చేస్తారు. లేదంటే స్థానికంగా అందుబాటులో ఉన్న ఉద్యోగులకు ఓడీ పేరుతో విధులు కేటాయిస్తారు. ఆర్టీసీలో నియామకాలు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకే అధికారులు ఓడీలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇక్కడే కొంతమంది ఉద్యోగులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తమకు వత్తాసు పలికే వారికి అప్పనంగా ఓడీలు కేటాయిస్తున్నారు. ఓవైపు సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఉంటుండగా, తమకు అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగులను అందలమెక్కిస్తున్నారు. ఇటీవల మంచిర్యాల డిపోలో సీనియార్టీని కాదని, కొంతమంది జూనియర్ ఉద్యోగులకు అవుట్ ఆఫ్ డిసిగ్నేషన్ డ్యూటీలు ఇవ్వడం వివాదాస్పదమైంది. అనారోగ్య కారణాలు, వయస్సు రీత్యా సీనియర్లు విజ్ఞప్తి చేసుకుంటే అవసరాన్నిబట్టి ఓడీలు ఇవ్వాల్సింది పోయి, జూనియర్ ఉద్యోగులకు కేటాయించడం విమర్శలకు కారణమవుతోంది. ఓడీలతో పెరుగుతున్న డీడీలు.. అవసరం ఉన్నా, లేకపోయినా కొంతమందికి ఓడీలు కేటాయిస్తుండడంతో మిగిలిన కార్మికులపై భారం పడుతోంది. క్షేత్రస్థాయిలో బస్సులు నడిచేందుకు కీలకంగా వ్యవహరించే డ్రైవర్లు, కండక్టర్లపై డబుల్ డ్యూటీల భారం పడుతుంది. సిబ్బంది లేకపోవడంతో వారికి డబుల్ డ్యూటీ పేరిట అదనంగా పే చేయాల్సి వస్తుంది. తమవారికి లాభం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్న అధికారులు, పరోక్షంగా ఇతర ఉద్యోగులపై పనిభారం నెడుతున్నారు. దీంతో పలు సందర్భాల్లో ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగులు ఆసుపత్రుల పాలవుతున్నారు. రీజియన్ పరిధిలోని ఉద్యోగులు డిపో డ్రైవర్లు కండక్టర్లు ఆదిలాబాద్ 129 204 ఆసిఫాబాద్ 90 111 భైంసా 33 128 మంచిర్యాల 149 162 నిర్మల్ 138 204 ఉట్నూర్ 39 46 మొత్తం 578 855వేధిస్తున్న సిబ్బంది కొరత.. ఆదిలాబాద్ రీజీయన్ వ్యాప్తంగా 737 మంది డ్రైవర్లు ఉన్నారు. వీరిలో రెగ్యులర్ డ్రైవర్లు 583 మంది ఉన్నారు. మిగతా 154 మంది అవుట్ సోర్సింగ్లో విధులు నిర్వహిస్తున్నారు. 867 మంది కండక్టర్లు ఉండగా, వీరిలో కూడా సిబ్బంది కొరత ఉంది. మరోవైపు కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అధికారులు ఇష్టారాజ్యంగా ఓడీలు ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది. -
మత్తురహిత సమాజమే లక్ష్యం
కాసిపేట(బెల్లంపల్లి): సురక్షిత ప్రయాణం, మత్తురహిత సమాజమే లక్ష్యంగా కృషి చేద్దామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. మంగళవారం బెల్లంపల్లి డివిజన్ తాళ్లగురిజాల గ్రామంలో బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి యువతకు అరైవ్–అలైవ్ ద్వారా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫి క్ నిబంధనలు, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల ద్వారా కలిగే దు ష్పరిణామాలపై అవగాహన కల్పించారు. యువత స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఆర్మీ, పోలీస్ శాఖల్లో ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులు ఉత్సాహంగా పుష్–అప్స్ ప్రదర్శించగా వారి ప్రతిభను అభినందించారు. ఓ యువకుడిని సీపీ సన్మానించి రూ.500 నగదు బహుమతి అందజేశారు. బెల్లంపల్లి డీసీపీ భాస్కర్, ఏసీపీ కిరణ్కుమార్, సీఐ హనుక్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.ప్రజలకు అందుబాటులో ఉండాలిపోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసులు, దర్యాప్తు వివరాల గురించి సీఐ హనుక్ను అడిగి తెలుసుకున్నారు. సర్కిల్ పరిధిలో రోజువారీగా నమోదవుతున్న ఫిర్యాదులు, కేసుల రికార్డులు పరిశీలించి, పెండింగ్ కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తునకు సంబంధించి ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గ్రేవ్ కేసుల్లో జాప్యం లేకుండా నిందితులను త్వరగా అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచాలని సూచించారు. విచారణ, దర్యాప్తు సమయంలో భౌతిక సాక్ష్యాలతో పాటు సాంకేతిక ఆధారాలను వినియోగించాలని తెలిపారు. నేరాల నియంత్రణ, దొంగతనాల నిర్మూలనకు అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే తనిఖీలు చేపట్టాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహించాలని, డ్రండెన్డ్రైవ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు భద్రత, భరోసా కల్పించేలా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి మొక్కలు నాటారు. డీసీపీ భాస్కర్, రూరల్ సీఐ హనుక్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రెండోరోజూ హాజరు అంతంతే..
మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలల్లో విద్యార్థు ల హాజరు ఆశించిన స్థాయిలో నమోదు కావడం లే దు. రెండోరోజు మంగళవారం కారణంతో హాజరు అంతంతేగానే ఉంది. కాగా, మొదటిరోజు కంటే కాస్త పెరిగింది. మొదటిరోజు అమావాస్య కావడంతో 13శాతం హాజరు నమోదు కాగా, రెండోరోజు 24.5 శాతానికి పెరిగింది. ఈనెల 15న జిల్లా వ్యా ప్తంగా 34,192 మందికి గాను 4,369 మంది విద్యార్థులు హాజరు కాగా, మంగళవారం 8,184 మంది బడికి వచ్చారు. కొన్నిచోట్ల పాఠశాలలు సమయాని కి డేటాను అప్డేట్ చేయకపోవటం హాజరు తక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రైవేట్ పా ఠశాలలు కొన్ని తెరుచుకోకపోవటంతో గమన్హారం. జిల్లాకేంద్రంలో ఇలా..జిల్లాకేంద్రంలో 21 ప్రైమరీ, ఒక అప్పర్ ప్రైమరీ, ఆరు హైస్కూళ్లు, ఒక కేజీబీవీ, ఒక మోడల్స్కూల్ ఉండగా మొత్తం 3,613 మంది విద్యార్థులు చదువుతున్నారు. బడిబాట ఫలితంగా మొదటిరోజు 49 మంది, మంగళవారం 84మంది విద్యార్థులు నూతనంగా అడ్మిషన్లు పొందారు. దీంతో విద్యార్థుల సంఖ్య 3,697కు చేరింది. పాఠశాలలకు మొదటిరోజు 552 మంది మాత్రమే రాగా, మంగళవారం 732 మంది హాజరయ్యారు. రెండురోజుల వ్యవధిలో విద్యార్థుల సంఖ్య 180 పెరిగింది. ప్రభుత్వం చేపట్టిన ‘బడిబాట’లో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే బొజ్జు
ఉట్నూర్రూరల్: ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు మంగళవారం త న జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశా రు. పుష్పగుచ్చం అందించి సీఎం ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ఎమ్మెల్యే బొజ్జుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురా రోగ్యాలు ప్రసాదించాలని, నిరంతరం ప్రజా సేవలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి మ రింత కృషి చేసి భవిష్యత్లో మరెన్నో విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. దాడి కేసులో ఆరుగురు యువకుల రిమాండ్కాసిపేట: మండలంలోని సోమగూడెం(కె)లో గత నెలలో జరిగిన దాడి కేసులో ఆరుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మంగళవారం పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించా రు. మండలంలోని ధర్మరావుపేటకు చెందిన ముచ్చర్ల సంపత్, అతని స్నేహితులు మందమర్రి టోల్గేట్ సమీపంలోని గోపాల్ దాబా వ ద్దకు వెళ్లగా అక్కడ కొంతమంది వ్యక్తులతో పా ర్సిల్ విషయమై వాగ్వివాదం జరిగింది. అక్కడి నుంచి వచ్చి సోమగూడెంలోని బంధువుల ఇంటివద్ద ఉండగా దాబా వద్ద ఉన్న వ్యక్తులు ఆయుధాలతో అక్కడికి వచ్చి వారిపై దాడికి పాల్పడడంతో సంపత్, అల్లంల ప్రశాంత్, బొ మ్మనవేణి వరప్రసాద్, ఆకుల రాణాప్రతాప్కు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు దనకుంట్ల మునియప్ప, మహమ్మద్ అబ్బు, మహమ్మద్ సమీరుద్దీన్, అఖిల్, మల్యాల చందు, షేక్ ఫేరోజ్ను అరెస్టు చేశారు. నిందితుల ను కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో ఆసిఫాబాద్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. గుప్తనిధులకోసం తవ్వకాలుకాగజ్నగర్రూరల్: మండలంలోని ఈజ్గాం శివారులోని పంటచేలలో గుప్త నిధుల కోసం చేపట్టిన తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం శివారులోని పంట చేనులో పొక్లెయిన్తో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చెట్టు సమీపంలో తవ్వి పూడ్చిపెట్టారని ప్రచారం జరుగుతోంది. ముఠాను పట్టుకుని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్గా రమేశ్మంచిర్యాల క్రైం: మంచిర్యాల జిల్లా స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్గా పట్టణానికి చెందిన సమిట్ల రమేశ్ను నియమిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ఏడాదిపాటు ఉంటుందని రమేశ్ తెలిపారు. కాగా రమేశ్ 20 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. స్థానిక న్యాయవాదులు, బార్కౌన్సిల్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. -
వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
మంచిర్యాలఅగ్రిల్చర్: వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాద వ్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, వివిధ శాఖల అధి కారులు, మున్సిపాలిటీల కమిషనర్లతో వన మహోత్సవంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖలవారీగా కేటాయించి న లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టా లని సూచించారు. ఈ నెల 18న సీఎం రేవంత్రెడ్డి వన మహోత్సవాన్ని ప్రారంభిస్తారని, ఇదేరోజు జి ల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏ ర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లాలో 41లక్షల మొ క్కలు నాటి సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రహదారుల పక్కన పెద్ద మొక్కలు నాటి జియో ట్యాగింగ్ పూర్తి చేసి రోజువారీగా వివరాలు నవీకరించాలని వివరించారు. మున్సిపాలిటీల పరిధిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని, వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. అధికారులు అందుబాటులో ఉండాలిఅధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీపీవో వెంకటేశ్వర్రావు, జెడ్పీ సీఈ వో గణపతితో కలిసి గ్రామాలాభివృద్ధి ప్రణాళికపై డీఎల్పీవో, ఎంపీవో, జీపీవోలతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. 16వ ఆర్థిక సంఘం నిబంధనలు, గ్రామపంచాయతీలు, సభ నగర్, నిర్ణయ్ యాప్, ఈ గ్రామ స్వరాజ్ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అత్యుత్తమ ర్యాంకింగ్ వచ్చేలా గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు విధులకు సకా లంలో హాజరు కావాలని, తాగునీటి సరఫరా సక్రమంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. గ్రామసభలు నిర్వహించి గ్రామంలో నెలకొన్న సమస్యలు తెలసుకోవాలని, పన్నులు సకాలంలో వసూలు చేయాలని, అంటువ్యాధులు ప్రబలకుండా, దోమలు వృద్ధి చెందకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సీజీజీ కన్సల్టెంట్ మహేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
కేసులు పరిష్కరించాలి
చెన్నూర్: చెన్నూర్ కోర్టు పరిధిలోని పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలని చెన్నూర్ మున్సిఫ్ కోర్టు సివిల్ జడ్జి రవి సూచించారు. స్థానిక కోర్టు సమావేశ మందిరంలో ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్ కేసుల ప రిష్కారమే లక్ష్యంగా న్యాయవాదులతో ఏర్పా టు చేసిన సమావేశంలో జడ్జి మాట్లాడారు. కక్షిదారులు రాజీపడేలా న్యాయవాదులు చొర వ చూపాలని సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొలిపాక రవీందర్, సీనియర్ న్యాయవాదులు రమేశ్చందర్గిల్డా, మల్లేశంగౌడ్, న్యాయవాదులు కాయిత మహేశ్, మద్ది కార్తిక్, సంజీవ్, రమేశ్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సేల్స్మెన్కు గాయాలు
కెరమెరి: మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన డీఆర్ డిపో సేల్స్మెన్ చహకటి రాజేశ్వర్ తెల్లవారుజామున తన కుమారుడు జగదీశ్వర్ను బైక్పై ఎక్కించుకుని ఆసిఫాబాద్కు బయలుదేరాడు. మానిక్గూడ సమీపంలో వాహనానికి పందులు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడింది. జగదీశ్వర్కు స్వల్పంగా రాజేశ్వర్కు తీవ్రగాయాలయ్యాయి. 108లో ముందుగా ఆసిఫాబాద్ అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. జగదీశ్వర్ మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
సింగరేణిలో మానవ హక్కుల ఉల్లంఘన
శ్రీరాంపూర్: సింగరేణిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె ఆర్కే 7గని, ఏరియా స్టోర్స్లను సందర్శించారు. హెచ్ఎమ్మెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అ హ్మద్తో కలిసి కార్మికుల సమస్యలు తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూగర్భ గనుల్లో కార్మికులకు గాలి అందక ఇబ్బంది పడుతున్నారని, తాగునీరు కూడా దొరకడం లేదని అన్నా రు. కంపెనీలోని కార్మికుల పిల్లల చదువుల కోసం సీబీఎస్ఈ పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెలిపా రు. 2 వేల మంది డిపెండెంట్లు ఉంటే కేవలం 335 మందికే భట్టి విక్రమార్క లెటర్లు ఇచ్చారని, మిగతా వారికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి కొత్త గనులు లేవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అన్నలంతా మా దగ్గరే ఉన్నారు..గతంలో అన్నలు ఉన్నప్పుడు కంపెనీ అధికారులు భయపడి చక్కగా పని చేసేవారని, ఇప్పుడు వారు లేరనుకుంటున్నారని, కానీ వారంతా టీఆర్ఎస్లో ఉన్నారని, కార్మికుల హక్కుల ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు. గనిలోకి రాకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారని, తల్లి కాంగ్రెస్తోనే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, ఈ పిల్ల కాంగ్రెస్ మాకో లెక్కా అని మండిపడ్డారు. గేటు వద్ద ఉద్రిక్తతఆర్కే 7, ఏరియా వర్క్షాప్ వద్ద కవిత కాన్వయ్ను గనిలోకి రాకుండా పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. గేట్లకు తాళాలు వేయడంలో కార్యకర్తలు పగలగొట్టి దూసుకెళ్లారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరాంపూర్ బ స్టాండ్, సీసీసీలో జెండా పండుగ నిర్వహించారు. అనంతరం సీసీసీలోని డంప్యార్డును పరిశీలించి దాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధ్యక్షుడు తిప్పారపు సారయ్య, బ్రాంచీ ఉపాధ్యక్షుడు అనిల్రెడ్డి, కార్యదర్శి పీ. అశో క్, జిల్లా జిల్లా ఇన్చార్జీ చంద్రమోహన్గౌడ్, ఐత ప్ర శాంత్, నాయకులు గోసిక అశోక్, సుదర్శన్, చెవుల శ్రీను, వినయ్, వరలక్ష్మీ, సురేశ్ పాల్గొన్నారు. -
బడి గంట మోగింది..
● మామిడితోరణాలు, బెలూన్లు, రంగు కాగితాలతో స్కూళ్ల అలంకరణ ● స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ, పూలు అందజేత ● నోట్, పాఠ్య పుస్తకాలు పంపిణీ మంచిర్యాలఅర్బన్: వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలల్లో సోమవారం బడి గంట మోగింది. స్కూళ్లకు వచ్చిన విద్యార్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. విద్యాసంవత్సరం ప్రారంభమైన వేళ అమావాస్య ప్రభావం కొన్ని చోట్ల విద్యార్థుల హాజరుపై పడింది. జిల్లాలో ఉపాధ్యాయులు పాఠశాలలను మామిడి తోరణాలు, రంగుల కాగితాలు, పూల దండలు, బెలూన్లతో అలంకరించి ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. టీచర్ల రాక కోసం ఎదురు చూశారు. పాఠశాలల ప్రాంగణంలో చిన్నారులకు స్వాగతం పలుకుతూ రంగుల బెలూన్లూ, పెన్సిల్, స్వీట్లు పంపిణీ చేశారు. పలు చోట్ల ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నోట్, పాఠ్య పుస్తకాలు అందజేశారు. తొలి రోజు విద్యార్థుల హాజరు నామమాత్రంగా నమోదైంది. మధ్యాహ్నం 3.30గంటల వరకు యూడైస్ వివరాల ప్రకారం జిల్లాలోని 767 పాఠశాలల్లో 34,192 మందికి గాను 4,369 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ లెక్కన 13.58శాతం హాజరు నమోదైంది. ఉదయం నుంచి యాప్లో సాంకేతిక లోపం వల్ల మధ్యాహ్నం వరకు హాజరుకు కొంతమేర ఆటంకం ఏర్పడింది. కొన్ని చోట్ల విద్యార్థుల హాజరు తీసుకోకపోవడంతో తగ్గినట్లు చెబుతున్నారు. అమావాస్య కారణంగా తల్లిదండ్రులు పిల్లలను పంపించడంలో ఆసక్తి చూపకపోవడం కూడా హాజరు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు కొన్ని ప్రైవేటు పాఠశాలలు తెరవకపోవడం గమనార్హం. ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యార్థులు బడిబాట పట్టే అవకాశాలున్నాయి. భీమారంలో వినూత్నంగా ఫ్రేమ్భీమారం: మండలంలోని ఆర్కెపల్లి పాఠశాలలో విద్యార్థులకు వినూత్నంగా స్వాగతం పలికారు. ఫ్రేమ్ చేయించి విద్యార్థులను ఫొటో తీశారు. దాంపూర్లో పాఠశాలను సర్పంచ్ కొమురయ్య విద్యార్థులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. -
అమావాస్య సెంటిమెంట్
● తొలిరోజు విద్యార్థుల హాజరు శాతం తక్కువే.. ● దండేపల్లిలో సార్లు ఫుల్.. విద్యార్థులు నిల్! దండేపల్లి/చెన్నూర్రూరల్/చెన్నూర్/బెల్లంపల్లి: అమావాస్య సెంటిమెంటుతో జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు హాజరు కాలేదు. దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 161మందికి ఐదుగురే వచ్చారు. 27మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేయగా.. ఈ రోజు అమావాస్య రేపు లేదా ఎల్లుండి నుంచి వస్తారు అంటూ సమాధానం వచ్చింది. దండేపల్లి ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులకు నలుగురే హాజరయ్యారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. మండలంలోని గుడిరేవు, నెల్కివెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలతోపాటు వెల్గనూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో కొత్తగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పూలు ఇచ్చి స్వాగతం పలికారు. దండేపల్లి: ఐదుగురే విద్యార్థులు హాజరుకత్తెరసాల ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు.. -
సింగరేణిలో కార్మికుల వెట్టిచాకిరీ
పాతమంచిర్యాల/కాసిపేట/బెల్లంపల్లి: సింగరేణి కార్మికులతో యాజమాన్యం వెట్టిచాకిరీ చేయించుకుంటోందని, కనీస వసతులు కల్పించకుండా ఎక్కువ గంటలు పని చేయిస్తూ పెత్తనం చెలాయిస్తోందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట కవిత విమర్శించారు. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లాలో పర్యటించారు. మంచిర్యాలలోని ఎం కన్వెన్షన్ హాల్లో సమావేశంలో మాట్లాడారు. బెల్లంపల్లిలోని తిలక్ స్టేడియం ఎదుట పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాసిపేట గనిపై కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో కవిత మాట్లాడుతూ సింగరేణిలో పని ముట్ల కొరత తీవ్రంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్కోడ్లను అమలు చేయబోమని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థలో కార్మికుల అలియాస్ పేర్ల సమస్య పరిష్కరించాలని, డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. సంస్థలో బొగ్గు మాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సమయం ఆస్నమైందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే రెండు నెలలకోసారి కూడా ప్రజలకు దర్శనం ఇవ్వడం లేదని, ఇక్కడి రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం సింగరేణి కార్మికులను మభ్యపెడుతున్నారని, బొగ్గు బావులు తేవాల్సిన వారు వినతిపత్రాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాల్లో హెచ్ఎంస్ స్టేట్ జనరల్ సెక్రెటరీ రియాజ్ అహ్మద్, మాజీ మంత్రి బోడ జనార్ధన్, నాయకులు ఉదారి చంద్రమోహన్గౌడ్, సాజన్, వెంకట్, నాయకులు సురేష్, రాజ్కుమార్ పాల్గొన్నారు. విద్య, వైద్యం ఉచితం లక్సెట్టిపేట: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యం అమ్ముకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. -
కొత్త యూనిట్ పనులు పూర్తి చేయాలి
జైపూర్: 800మెగావాట్ల కొత్త యూనిట్ నిర్మాణ పనుల్లో భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) తిరుమల్రావు అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో సోమవారం ఆయన పర్యటించారు. ఎస్టీపీపీలో కొనసాగుతున్న 800మెగావాట్ల నిర్మాణ పనులు పరిశీలించారు. సేఫ్టీ కంట్రోల్ రూమ్, ట్రాక్హాపర్ పనులు సందర్శించి భద్రతా చర్యలు, ఆధునిక రైల్ వ్యాగన్ టిప్లర్ విధానంపై అధి కారులతో సమీక్షించారు. ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం మదన్మోహన్, ఏజీఎంలు సుధాకర్రెడ్డి, సూర్యనారాయణరాజు, కొత్త ప్లాంటు కోఆర్డినేటర్ వేణుగోపాల్, డీజీఎం శ్రీనివాస్, ఎస్వోటూ ఈడీ వెంకటయ్య, ఎస్ఈ రాము, రక్షణాధికారి సురేశ్ పాల్గొన్నారు.విద్యాసంస్థల బస్సులు తనిఖీ మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సోమవారం విద్యాసంస్థల బస్సుల తనిఖీలు ప్రారంభించారు. మంచిర్యా ల ఐబీ చౌరస్తాలో బస్సుల ఫిట్నెస్, వాహన ధ్రువీకరణ, బీమా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక యంత్రాల నిర్వహణ, విద్యార్థుల రిజిష్టర్ పరిశీలించారు. ఓ కళాశాల బస్సు నిబంధనలకు విరుద్ధంగా ఉందని గుర్తించి కేసు నమోదు చేసి సీజ్ చేశామని జిల్లా రవాణా శాఖ అధికారి వెల్ది గోపికృష్ణ తెలిపారు. ఈ నెల 25వరకు రోజూవారీగా తనిఖీలు చేపడుతామని తెలిపారు. ఏఎంవీఐ సూర్యతేజ, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
గుండెపోటుతో బాలింత మృతి
ఇంద్రవెల్లి: గుండెపోటుతో బాలింత మృతి చెందిన ఘటన మండలంలోని మల్లాపూర్ పంచాయతీ పరిధి బోరుజ్గూడలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరప ప్రమీల(28), గణపతి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రమీల మొదటి కాన్పులో జన్మించిన మగబిడ్డ నాలుగు నెలలకే అనారోగ్యంతో మృతిచెందాడు. చాలా రోజుల తర్వాత ప్రెగ్నంట్ అయింది. శనివారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు అంబులెన్స్లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ప్రసవం అనంతరం మగబిడ్డకు జన్మనివ్వగా, రెండు గంటలకు బిడ్డకు పాలు పట్టించింది. రాత్రి సమయంలో ప్రమీలకు ఒక్కసారిగా గుండెపోటు రాగా, చికిత్సపొందుతూ మృతి చెందింది. తల్లి మృతితో బిడ్డను చూసేదెవరని కుటుంబీకులు, గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. బిడ్డ సంరక్షణ కోసం దాతలు ముందుకొచ్చి మరప గణపతికి ఆర్థికసాయం చేయాలని కోరుతున్నారు. పార్పెల్లితండాలో యువకుడు..లక్ష్మణచాంద: మండలంలోని పార్పెల్లి అనుబంధ గ్రామం పార్పెల్లి తండాకు చెందిన గుగ్లవత్ నవీన్ గుండెపోటుతో మృతిచెందాడు. ధర్సింగ్–జమున దంపతులకు ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు గుగ్లవత్ నవీన్(22) జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. శనివారం పనులు ముగించుకుని ఇంటికి చేరుకుని నిద్రించాడు. అర్థరాత్రి సమయంలో ఛాతీ నొప్పి వస్తుందని తల్లిదండ్రులకు తెలిపాడు. గతంలోని ఉపయోగించిన టాబ్లెట్స్ వేశారు. కొంత సమయం తర్వాత మళ్లీ నొప్పిరావడంతో నిద్రలో మృతిచెందాడు. కుమారుడి మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ తీస్తుండగా వివాహిత..వాంకిడి: చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ తీస్తుండగా విద్యుత్ షాక్తో వివాహిత మృతి చెందింది. మండలంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం..తేజిగూడ గ్రామానికి చెందిన మొహర్లె రమేశ్కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె మహేశ్వరి(20)ని మూడు నెలల క్రితం లక్ష్మిపూర్కు చెందిన నగోసే వేణుతో వివాహం చేశారు. కాగా, శనివారం సాయంత్రం మహేశ్వరి తన ఇంట్లో సెల్ఫోన్కు చార్జింగ్ పెట్టింది. ఈ క్రమంలో చార్జింగ్ వైర్ను తొలగిస్తుండగా విద్యుత్ షాక్కు గురై కిందపడింది. గమనించిన అత్త కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు. కుటుంబీకులు ఆమెను వాంకిడి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రపంచ దేశాలకు మోదీ పాలనే దిక్సూచి
● ఎంపీ గోడం నగేశ్ జన్నారం: ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పాలనే దిక్సూచిగా నిలుస్తోందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని మొర్రిగూడ, కిష్టాపూర్, రోటిగూడ గ్రామాల్లో ఆదివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను (జీడీపీ) మూడో స్థానంలోకి తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ పేరుతో దేశాన్ని 2047 వరకు ప్రపంచంలో ప్రథమస్థానంలో ఉంచడమే ప్రధాని లక్ష్యమన్నారు. ఇళ్ల నిర్మాణం, సన్నబియ్యం పంపిణీలో కేంద్రం వాటా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తనఖాతాలో వేసుకుంటోందని ఆరోపించారు. అనంతరం మొర్రిగూడ, రోటిగూడ గ్రామాలకు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. కిష్టాపూర్లో బీసీమోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల ముఖేశ్గౌడ్ను ఎంపీ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్, మండల అధ్యక్షుడు మధుసూదన్రావు, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రినాయక్, సర్పంచ్ వాసాల నరేశ్, మండల ప్రధాన కార్యదర్శి రమేశ్గౌడ్, జిల్లా కౌిన్సిల్ సభ్యుడు కొంతం శంకరయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాజరావ్, బీసీ మోర్చా అధ్యక్షుడు గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
పచ్చిరొట్టతో నేల సారవంతం
మంచిర్యాలఅగ్రికల్చర్: వానాకాలం పంటల సాగుకు రైతన్నలు ఇప్పటికే దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ఖరీఫ్ సాగు ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులకు రాయితీపై అందించేందుకు ఎరువులు, విత్తనాలు మండలాలకు తరలిస్తున్నారు. పచ్చిరొట్ట పైర్ల నుంచి లభించే సేంద్రియ ఎరువుల విత్తనాలు మండలాలకు తరలించారు. ఎల్నినో ప్ర భావంతో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వర్షపు నీరు వృథా పోకుండా భూమిలో ఇంకేలా పొలానికి నీటిని, తేమశాతం, పోషక పదార్థాలను నిల్వ ఉంచుకునే శక్తి పెంచుకునేందుకు పచ్చిరొట్ట సాగుతో ఎంతో ప్రయోజనం చేకురనుంది. ముఖ్యంగా వరి సాగుకు నీటి తడులు ఎక్కువ అవసరం ఉంటుంది. నీటి తడులకు, నేల సారవంతం, పంటలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగించేందుకు ప్రభుత్వం జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలు సరఫరా చేస్తుంది. 50 శాతం రాయితీపై 4,355 క్వింటాళ్ల విత్తనాలు ఆయా మండలాల్లో రైతుల డిమాండ్కు అనుగుణంగా అందుబాటులో ఉంచారు. గత నెల 26న దండేపల్లి మండలంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ రైతులకు విత్తనాల పంపిణీ ప్రారంభించారు. ఇప్పటి వరకు 929.4 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. నేలలో తేమ శాతం పెరుగుదల ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు సేంద్రియ ఎరువులపై దృష్టి సారించా ల్సి ఉంటుందని జిల్లా వ్యవసాయ అఽ ది కారి సురేఖ వివరిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం పెరగడంతో పంట లకు తెగుళ్లు, పురుగుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. భూసారం పెంపునకు పచ్చి రొట్ట నుంచి లభించే ఎరువులు పంటలకు వేయడం వల్ల అధిక దిగుబడులు, నాణ్య మైన పంట ఉత్పత్తులు పొ ందవచ్చు. భూమి గుళ్లబా రుతుంది, భూసారం బాగా పెరుగుతుంది. మొక్క వేర్లకు గాలి, నీరు పుష్కలంగా అందుతాయి. చీడపీడల వ్యాప్తి సైతం తగ్గుతుంది. వరిసాగులో కీలకం జిల్లాలో 1.57 లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం ఉంటుంది. సేంద్రియ ఎరువులను తగు పాళ్లలో భూమికి అందించడంలో చాలా మంది రైతులు విఫలమవుతున్నారు. దీంతో పంట దిగుబడి తగ్గిపోతుంది. ముందస్తు భూసారం పెంపునకు జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలు పొలాల్లో చల్లుకుంటే నాటువేసే సమయానికి బురదలో కలియ దున్ని ఎరువుగా వినియోగించవచ్చు. పెరిగిన విత్తన ధరలు.. గతేడాది 30 కిలోల జీలుగ బ్యాగుకు రూ.4,274 ఉండగా రాయితీపై రూ.2,137కు అందించారు. ఈ ఏడాది రూ.4,905 ఉండగా రాయితీపై రూ.2,450కు విక్రయిస్తున్నారు. జనుము 40 కిలోల బ్యాగు గతేడాది రూ.5,350 ఉండగా 2,860కి అందించారు. ఈ ఏడాది రూ.6,220 ఉండగా రాయితీపై 3,110కి ఇస్తున్నారు. పిల్లిపెసర 20 కిలోల బ్యాగు గతేడాది రూ.3,680 ఉండగా రాయితీపై రూ.1,820కి ఇచ్చారు. ఈ ఏడాది రూ.3,990 ఉండగా రాయితీపై రూ.1,995కి అందిస్తున్నారు. పిల్లిపెసర..ఎకరాకు 6 నుంచి 8 కిలోల విత్తనం వేసుకోవాలి. పూతదశలో 4 నుంచి 5 టన్నుల పచ్చిరొట్ట ఇస్తుంది. దీన్ని పశుగ్రాసంగా కూడా వాడుకోవచ్చు. ఒక టన్ను పిల్లి పెసరలో నాలుగు కిలోల నత్రజని, కిలో భాస్వరం, మూడు కిలోల పోటాష్ ఇస్తుంది. విత్తనం క్వింటాళ్లు కొనుగోలు చేసింది(క్వింటాళ్లలో) జీలుగ 3,350 733.8 జనుము 840 185.2 పిల్లిపెసర 165 11 మొత్తం 4,355 929.4 ఇప్పటి వరకు జిల్లాకు చేరిన విత్తనాలుజీలుగ ఎకరాకు 12 నుంచి 15 కిలోల జీలుగ విత్తనం వేసుకోవాలి. పూతదశలో కోసినప్పుడు ఎకరాకు 5 నుంచి 6 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. ఒక టన్ను జీలుగ సాగులో ఐదు కిలోల నత్రజని, 1.5 కిలోల భాస్వరం, 4 కిలోల పోటాష్ వస్తుంది. చౌడు భూములకు బాగా పనికి వస్తుంది. జనుముఎకరాకు 20 నుంచి 25 కిలోల విత్తనం వేసుకోవాలి. పంట వేసిన 8 వారాల తర్వాత కోస్తే 6 నుంచి 8 టన్నుల పచ్చిరొట్ట ఇస్తుంది. ఒక టన్ను జనుములో నాలుగు కిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, మూడు కిలోల పొటాష్ ఉంటుంది. -
● ముగిసిన వేసవి సెలవులు ● నేడు తెరుచుకోనున్న పాఠశాలలు ● తొలిరోజు పుస్తకాలు పంపిణీ ● మామిడితోరణాలు, రంగుల కాగితాలు, జెండాలతో బడులకు అలంకరణ
మంచిర్యాలఅర్బన్: వేసవి సెలవులు ముగియడంతో సోమవారం పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. సెలవులకు స్వస్తి చెప్పి విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో పరిశుభ్రత పనులపై యాజమాన్యాలు దృష్టి సారించాయి. తరగతి గదులు, ప్రాంగణాలను శుభ్రం చేయించారు. తాగునీరు, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లను సరి చూసి అవసరమైన సదుపాయాలు కల్పించారు. మామిడి తోరణాలు, రంగుల కాగి తాలు, బెలూన్లతో సర్కారు పాఠశాలలను అలంకరించి విద్యార్థులకు స్వాగతం పలుకనున్నారు. తొలిరోజు పుస్తకాల పంపిణీ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,051 ఉండగా 1,32,353 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 234 ప్రైవేట్ పాఠశాలల్లో 70,273 మంది విద్యార్థులు చదువుతున్నారు. 817 కేజీబీవీ, మోడల్స్కూల్, రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాలల్లో 62,080 మంది, డీఈవో పరిధిలో 709 పాఠశాలల్లో 43,072 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలు మినహాయిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు అందజేయాల్సి ఉంది. ఇప్పటికే 3,05,620 నోట్, పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేరాయి. పాఠశాలల పున:ప్రారంభం రోజునే విద్యార్థి చేతికి పాఠ్యపుస్తకం అందించనుండగా యూనిఫామ్లు మాత్రం ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. యూనిఫామ్ కలర్ మార్చడంతో సాధారణ దుస్తులతోనే బడికి వెళ్లాల్సిన పరిస్థితి. పాత దుస్తులు చిరిగిపోవడంతో కొత్తవి కావాలని చిన్నారులు మారాం చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రులు కొత్త దుస్తుల కొనుగోలుపై దృష్టి సారించాల్సి వస్తుంది. ఈఏడాది ‘బడి బాట’ తర్వాత అడ్మిషన్లు పెరిగే పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై దృష్టి సారిస్తున్నామని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది 72 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అమలుకానుంది. ఇప్పటికే ఇన్స్ట్రక్టర్లు, ఆయాలను నియమించే ప్రక్రియ పూర్తి చేశారు. బడి శుభ్రత.. భోజనంలో నాణ్యత సర్కారు పాఠశాలల్లో బడి శుభ్రత, భోజనంలో నాణ్యతపై ప్రభుత్వం దృష్టి సారించింది. వంట శుభ్రత, వడ్డన అంశాలపై 1,290 మంది మధ్యాహ్న భోజన కార్మికులు, ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఇదివరకే వంట తయారీకి నాణ్యమైన సామగ్రి కొనుగోలు చేశారు. సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకోనుండటంతో మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియ్యం పాఠశాలలకు చేరింది. వంట కార్మికులు వంటపాత్రలు శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అల్పాహారం అందించేందుకు కొన్ని పాఠశాలలనే పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. దీంతో తొలి విడతలో జిల్లాలో సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అల్పాహారం లేనట్లే.గతేడాది పదో తరగతి పరీక్షలకు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 9,703 మంది హాజరయ్యారు. ఇందులో సర్కారు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 5,499 మంది కాగా తెలుగు మీడియంలో 769 మంది పరీక్షలకు హాజరయ్యారు.ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంతో సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి బడిబాట కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 9,376 మంది విద్యార్థులు సర్కారు పాఠశాలల్లో చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకు 6,909 చేరికలు నమోదయ్యాయి. టీజీఎంఎస్, కేజీబీవీ, యూఆర్ఎస్, టీజీఆర్ఈఐఎస్ పాఠశాలల్లో రెండో తరగతి నుంచి 12వ తరగతి వరకు 2,467 మంది ప్రవేశాలు పొందారు. మంచిర్యాలలో 1,121, లక్సెట్టిపేటలో 1,033, బెల్లంపల్లిలో 715, జన్నారంలో 671 మంది విద్యార్థులు చేరారు. పుస్తకాల ధరలు, ఫీజుల భారంతో ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల మార్పిడి గణనీయంగా పెరిగింది. గతేడాది జూలై 18 నాటికి రెండోతరగతి నుంచి పదోతరగతి వరకు 1,609 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. టీజీఎంఎస్, కేజీబీవీ, యూఆర్ఎస్, టీజీఆర్ఈఐఎస్లో 835 మంది చేరారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన బోధనతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. -
రిసార్ట్లో అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి
నస్పూర్/చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి శివారు ఓ రిసార్ట్లో శనివారం అర్ధరాత్రి యువకుడు అనుమానా స్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని విలేజ్ శ్రీరాంపూర్కు చెందిన గాండ్ల రాము(27) హైదరాబాద్ ఉప్పల్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కూకట్పల్లిలో ఉంటున్నాడు. వీకెండ్ కావడంతో కంపెనీకి చెందిన 20 మంది స్నేహితులు కలిసి పార్టీ చేసుకునేందుకు ఎల్లంబావి శివారులోని ఓ రిసార్ట్ను బుక్ చేసుకున్నారు. స్నేహితుల మధ్య ఘర్షణ రాము, అతని స్నేహితులు శనివారం సాయంత్రం రిసార్ట్కు చేరుకున్నారు. అందరూ కలిసి మద్యం తాగారు. అర్ధరాత్రి సమయంలో స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో గొడవ జరిగింది. కొంతసేపటి తర్వాత సద్దుమణిగింది. అర్ధరాత్రి తర్వాత నలుగురు స్నేహితులు కలిసి రిసార్ట్లోని స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టేందుకు వెళ్లారు. అందులో ఒక వ్యక్తికి ఈత రాకపోవడంతో స్విమ్మింగ్ పూల్లో నడుచుకుంటూ మిగతావారిని అనుసరించసాగాడు. ఈ క్రమంలో అతని కాళ్లకు నీటి అడుగున ఏదో తగిలింది. ఈ విషయాన్ని మిగిలిన ముగ్గురు మిత్రులకు చెప్పడంతో వారు స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్లి చూడగా.. రాము కనిపించగా బయటకు తీసుకువచ్చారు. మిగతా స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారు బయటకు వచ్చి రాముకు సీపీఆర్ చేశారు. వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్, ఎస్సై యాదగిరి ఘటనస్థలానికి వెళ్లి పరిశీలించి ఆధారాలు సేకరించారు. తన కుమారుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని, స్నేహితులే కొట్టి హత్య చేశారని తండ్రి అంజయ్య ఫిర్యాదు చేశారు. ఈమేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు. -
ఉత్తమ సేవా పురస్కారాలు
పాతమంచిర్యాల: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్లోని లోక్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ మంచిర్యాల శాఖ సభ్యులు గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. అత్యధికంగా రక్తదాతలను సమకూర్చిన విభాగంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్టు సభ్యుడు, ఎమ్మెల్యే తనయుడు కొక్కిరాల చరణ్రావు మొదటి అవార్డు అందుకున్నారు. సంస్థల విభాగంలో 246 మంది రక్తదాతలను సమకూర్చిన జైపూర్ పవర్ ప్లాంట్ డీజీఎం డి.పంతులు పురస్కారం అందుకున్నారు. 91 రక్తదాన శిబిరాల్లో 6,016 యూనిట్ల రక్తం సేకరించిన మంచిర్యాల ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రం రాష్ట్రంలో ద్వితీయ స్ధానంలో నిలి చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ తమ తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టు రక్తదానంలో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించి అవా ర్డును పొందడంతో తనపై మరింత భాధ్యతను పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ మంచిర్యాల శాఖ చైర్మన్ కంకణాల భాస్కర్రెడ్డి, కార్యదర్శి చందూరి మహేందర్, స్టేట్ ఎంసీ సభ్యులు వి.మధుసూదన్రెడ్డి, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ జనరల్ సెక్రెటరీ కాసర్ల రంజిత్, సభ్యులు కాసర్ల శ్రీనివాస్, ఎడ్ల కిషన్, సురభి శరత్రావు, చుంచు శంకర్ వర్మ, తదితరులు పాల్గొన్నారు. -
మంచిర్యాల అభివృద్ధి రాష్ట్రానికే మోడల్
మంచిర్యాలటౌన్: మంచిర్యాలలో జరుగుతున్న అభివృద్ధి రాష్ట్రానికే ఒక మోడల్ అవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నివాసంలో ఆదివారం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మేయర్ దర్ని మధుకర్తో కలిసి మాట్లాడారు. మంచిర్యాల పట్టణ ప్రగతిపై ప్రశంసలు కురిపిస్తూనే స్థానిక ఎమ్మెల్యే సంకల్పం, నిబద్ధత వల్లే అద్భుతమైన అభివృద్ధి సాధ్యమైందని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా మంచిర్యాల మోడల్ను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులను, కమిషనర్లను ఇక్కడికి పంపించి, ఈ అభివృద్ధిని ఒక మోడల్గా చూసి స్ఫూర్తి పొందేలా చేయాలని మంత్రి శ్రీధర్బాబుతో చర్చించానన్నారు. ఇక్కడి 50 పడకల ఆస్పత్రి, ఆర్కిటెక్చర్, విశాలమైన వరండాలు, గాలి వెలుతురు వచ్చేలా కట్టిన విధానం నచ్చి, పరిశీలనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్ వారిని ఇక్కడికి పంపించామన్నారు. ఇక్కడి మాదిరి తన నియోజకవర్గంలోనూ 50 పడకల ఆస్పత్రిని సాంక్షన్ చేయించుకున్నామన్నారు. 50 ఏళ్ల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేస్తున్నారని, దూరదృష్టితో పునాదులు వేసేవాడే నిజమైన నాయకుడన్నారు. అలాంటి నాయకత్వం, ప్రజల మద్దతు ఉండడం వల్లే అన్ని రంగాల్లోనూ మంచిర్యాల దూసుకుపోతుందన్నారు. మంచిర్యాల నియోజకవర్గానికి అనేక దశాబ్దాలుగా సరైన ఎమ్మెల్యే దొరకలేదని, ఇప్పుడు ఆ లోటు ఈ ప్రాంత ప్రజలకు తీరిందన్నారు. తమ నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ పార్కు మంజూరు చేయాలని మంత్రి శ్రీధర్బాబును అడిగి రెండున్నరేళ్లు అవుతున్నా ఇప్పటికీ మంజూరు చేయలేదని, కానీ మంచిర్యాలకు మాత్రం మంజూరు చేయగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎవరూ తీసుకోని విధంగా ఒక ఫిష్పాండ్ (చేపల చెరువు) కూడా ఇక్కడికి తెచ్చుకున్నాన్నారు. తాను ఉమ్మడి జిల్లాలో సీఎల్పీ లీడర్గా ఆదిలాబాద్ నుంచి పాతయాత్ర చేపట్టిన సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఎవరికీ లేని సమయంలో ప్రేమ్సాగర్రావు, కొక్కిరాల సురేఖ, శ్రీధర్బాబు తన వెనకుండి ముందుకు నడిపించారన్నారు. రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారంలో మంచిర్యాల నియోజకవర్గానికి సింహభాగం ఉంటుందని హామీ ఇచ్చారు. -
మునీర్ స్మారక భవన నిర్మాణానికి కృషి
మందమర్రిరూరల్: మందమర్రిలో సీనియర్ జర్నలిస్టు మునీర్ స్మారక భవన నిర్మాణానికి కృషి చేస్తానని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం పట్టణంలోని సీఈఆర్ క్లబ్లో జర్నలిస్ట్ చందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, పూర్వ సంపాదకులు రామచంద్రమూర్తి, సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి మునీర్ భాయ్ (ప్లొటేరియన్ జర్నలిస్ట్) పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మునీర్ చిన్న వయసులోనే పెత్తందారీ విధానంపై పోరాటం చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడన్నారు. జర్నలిస్ట్గా నలబై యేళ్లపాటు ప్రజా, కార్మిక సమస్యలపై అనేక వ్యాసాలు, కథనాలు రాసాడన్నారు. కోల్బెల్ట్ ప్రాంతంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి ముందుకు నడిపించాడన్నారు. నేటి జర్నలిస్ట్లు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వక్తలు మునీర్తో పంచుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంతకు ముందు మునీర్ చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జనంసాక్షి ఎడిటర్ రహమాన్, ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, టీజీబీకేఎస్ వ్యవస్థాపకులు కెంగర్ల మల్లయ్య, పుస్తక రచయితలు మాదాసి రామమూర్తి, నక్క వెంకట్రావ్, తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషిమంచిర్యాలటౌన్: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మంచిర్యాలలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. యోగా, ఫిట్నెస్ సభ్యులతో కలిసి వ్యాయామం చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానం అభివృద్ధికి 20 ట్రిప్పుల మట్టి పోయాల ని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్కు ఫోనులో సూచించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు రెండు క్రికెట్ కిట్లు అందించడం జరుగుతుందన్నారు. -
కాంగ్రెస్, బీజేపీలతోనే సింగరేణి నిర్వీర్యం
మంచిర్యాలటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు కుమ్మకై ్క సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టక పోవడం, మెడికల్ బోర్డును ఏర్పాటు చేయక పోవడంతో మాజీ మంత్రి హరీష్రావు ఆధ్వర్యంలో బొగ్గుబాయి బాట పట్టామన్నారు. దీనికి ఖంగుతిన్న కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా 335 మందికి కారుణ్య నియామక పత్రాలు ఇచ్చి, మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గుబాయిల వేలంలో సింగరేణి పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా కేంద్రం ఇవ్వలేదన్నారు. అబద్దాలను వల్లెవేసి ప్రజలను తప్పుదారి పట్టించాలనే బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివా కర్రావు మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి పేరు భట్టి విక్రమార్క కాదని, బకాయి విక్రమార్క అన్నా రు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదన్నారు. విశ్వనాథ ఆలయం అభివృద్ధికి 2023లోనే రూ. 1.97 కోట్ల నిధులు మంజూరు చేయిస్తే, అభివృద్ధి చేయకుండా, అవే నిధులతో కొత్త పనుల పేరిట శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రిటైర్డ్ సింగరేణి కార్మికులకు ఇంటి నిర్మాణం కోసం రెండు గుంటల భూమి ఇస్తానని చెప్పి, ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వైద్య సేవలకు కష్టమే?
మంచిర్యాలటౌన్: జిల్లా ప్రజలకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా అందే వైద్యసేవలకు ఈ ఏడాది కూడా కష్టంగానే మారనుంది. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద శిథిలావస్థకు చేరుకున్న భవనంలోనే ప్రస్తుతం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కాలేజ్రోడ్డులో మూడేళ్ల క్రితంరూ. 129.25 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి, రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ విభాగం భవన నిర్మాణాలు ప్రారంభించారు. నిర్మాణంలో జరుగుతున్న ఆలస్య ంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పనులు నత్తనడకన సాగుతుండడంతో భవన నిర్మాణం పూర్తి చేయించడంలో అధికారులు విఫలం చెందుతున్నారు. పదిరోజులకోసారి కలెక్టర్ కుమార్ దీపక్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశిస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరించడంతోనే, భవన నిర్మాణం పూర్తికా వడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వర్షాలు కురిస్తే ఇక అంతే మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో భయం భయంగానే రోగులకు వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి భవనంలోని గదులు సరిపోక ఇబ్బందులు పడుతుంటే, శిథిలావస్థకు చేరిన భవనంలో స్లాబ్ పెచ్చులూడుతుండగానే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదే భవనంలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్బ్యాంక్ను నిర్వహిస్తూ, తలసేమియా, సికిల్సెల్ రోగులకు ప్రతిరోజు రక్తమార్పిడి చేస్తున్నారు. ఓపీ సేవలతో పాటు, ల్యాబ్, ఎక్స్రే, సిటిస్కాన్, మందుల పంపిణీ, డ్రగ్ స్టోర్ అందులోనే నిర్వహిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో ఈ భవనంలోని స్లాబ్ నుంచి ఏదో ఒక గదిలో పెచ్చులూడుతుండడం ఆందోళన కలిగిస్తుండగా, ఈ ఏడాది జనవరిలో మూత్రశాలలోని స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడి కింద పడిపోయి రోగి సహాయకురాలికి గాయాలయ్యాయి. డయాలసిస్ నిర్వహిస్తున్న భవనం స్లాబ్ సైతం పెచ్చులూడుతుండడంతో కిడ్నీ బాధితులకు రక్తం శుద్ధి చేయడం ఇబ్బందిగా మారుతోంది. స్లాబ్ పెచ్చులు కిందపడకుండా అడ్డుగా ఏదో ఒకటి పెడుతూ నెట్టుకొస్తున్నారు. గోదావరి ఒడ్డున నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) సైతం వర్షాకాలం వస్తే వరదలో మునిగి పోతుంది. దీంతో ఎంసీహెచ్ను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న జనరల్ ఆసుపత్రి భవనంలో గర్భిణులు, బాలింతలు సైతం బిక్కుబిక్కుమంటూ చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి. వర్షాకాలం రాకముందే కొత్త భవనం అందుబాటులోకి వచ్చి ఉంటే, రోగులకు ఇబ్బందులు తప్పేవి. ఈ వర్షాకాలంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మాతా శిశు ఆరోగ్య కేంద్రం రోగులకు వైద్య సేవలు కష్టమే. -
‘ఫిట్’పై నజర్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యా సంస్థలు ప్రారంభం కానుండడంతో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సుల ఫిట్నెస్పై దృష్టి సారించారు. డీటీవో గోపీకృష్ణ ఆధ్వర్యంలో ఎంవీఐలు, ఏఎంవీఐలు 15 రోజులుగా బస్సుల ఫిట్నెస్ పరీక్షల్లో నిమగ్నమై ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రైవేటు విద్యాసంస్థల్లో 375 బస్సులు ఉన్నాయి. అందులో 303 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించగా 17 వాహనాలు ఫిట్గా లేవని వాటిని రిజెక్ట్ చేశారు. మిగిలిన 55 బస్సులు ఇంకా ఫిట్నెస్ పరీక్షలకు రాలేదు. రూ.వేల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బస్సుల నిర్వహణను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. పాఠశాలల్లో పేరెంట్ కమిటీలు ఉంటే బస్సు ఫిట్నెస్, ప్రమాదాల విషయంలో ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కానీ ఏక్కడా కూడా ఈ కమిటీల ఏర్పాటు జరగడం లేదు. ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలని, లేనిపక్షంలో తనిఖీల్లో పట్టుబడితే సీజ్ చేస్తామని డీటీవో హెచ్చరించినా యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనార్హం. అటెండర్ ఉండాలి ప్రతీ స్కూల్ బస్సుకు విధిగా అటెండర్ ఉండాలి. బస్సు రివర్స్ తీసుకునే సమయంలోనే కాదు.. పిల్లలను ఎక్కించడం, దించడంతో పాటు రోడ్లు దాటించే సమయంలో వీరి పాత్ర కీలకంగా ఉంటుంది. బస్సులో సీసీ కెమెరాలు, జీపీఎస్, అత్యవసర ద్వారం, ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక యంత్రాలతో పాటు ఐదేళ్ల అనుభవం కలిగిన డ్రైవర్ నియామకం ఇలా అన్నీ మార్గదర్శకాల మేరకు ఉండాలి. కానీ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రవాణా, విద్య, పోలీస్ శాఖలు టాస్క్ఫోర్స్గా ప్రతీ మూడు నెలలకోసారి తనిఖీలు జరుపుతూ కఠినంగా వ్యవహరిస్తే భద్రతతో పాటు ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం అవుతారు. 25 వరకు స్పెషల్ డ్రైవ్..విద్యా సంవత్సరం ప్రా రంభం రోజు నుంచి 25వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఉ దయం, సాయంత్రం వేళల్లో తనిఖీలు ఉంటాయి. బస్సుల ఫిట్నెస్తో పాటు విద్యార్థులను పరి మితికి మించి ఎక్కించడం, ప్రథమ చికిత్స, అగ్నిమాపక నివారణ యంత్రాల ఏర్పా టు వంటి వాటి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. పాఠశాల యాజమాన్యాలు ఎలాంటి నిర్లక్ష్యం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవు. – వెల్ది గోపీకృష్ణ, డీటీవో, మంచిర్యాల -
నేత్రాలు దానం
బెల్లంపల్లి: గుండెపోటుతో వ్యక్తి మృతిచెందగా, కు టుంబ సభ్యులు ఆయన నేత్రాలు దానం చేశారు. మున్సిపాలిటీ షంషీర్నగర్ బస్తీకి చెందిన జడల రమేశ్ ఆదివారం గుండెపోటుతో అకాల మృతిచెందాడు. అతని కళ్లు దానం చేసి అంధులకు కంటి చూపు ప్రసాదించవచ్చని జనహిత సేవా సమితి నిర్వాహకులు బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించగా వారు ముందుకొచ్చారు. వాసన్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ చందు వచ్చి రమేశ్ నేత్రాలను సేకరించాడు. పుట్టెడు దు:ఖంలో కూడా నేత్రదానం చేసేందుకు అంగీకరించిన కుటుంబ సభ్యులకు జనహిత సేవాసమితి అధ్యక్షుడు ఆడేపు మహేశ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సర్టిఫికేట్ అందజేశారు. కార్యక్రమంలో జనహిత సేవా సమితి నిర్వాహకులు ఇప్ప రవి, కె.గిరిప్రసాద్, గురుస్వామి, సుకుమార్, కనకయ్యతోపాటు దేవసాని వెంకన్న పాల్గొన్నారు. నేడు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత పర్యటన -
వాహన నంబర్లు, ఛాసిస్, ఇంజిన్ నంబర్ల ఫోర్జరీ
బోథ్: వాహన నంబర్లు, ఛాసిస్, ఇంజిన్ నంబర్లను ఫోర్జరీ చేసి తెలంగాణలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడానికి యత్నిస్తున్న ముగ్గురిని బోథ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బోథ్ పోలీస్స్టేషన్లో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి వివరాలు వెల్లడించారు. సొనాల మండల కేంద్రానికి చెందిన డ్రైవర్ ఎస్.కె.నయీమ్ (37) మహారాష్ట్ర లాతూర్ ప్రాంతంలో మహీంద్రా మ్యాక్స్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. సరైన పత్రాలు లేకపోవడంతో, తెలంగాణలో రిజిస్ట్రేషన్ కోసం అడ్డదారిని ఎంచుకున్నాడు. స్క్రాప్నకు వెళ్లిన ఏపీ23జె1036 అనే పాత వాహనానికి సంబంధించిన పత్రాలను పెందూర్ ఇంద్రు నుంచి రూ. 10 వేలకు కొనుగోలు చేశాడు. మాకునూర్ విజయ్ కుమార్ సహాయంతో మహారాష్ట్ర వాహనంపై ఉన్న ఛాసిస్, ఇంజిన్ నంబర్లు తొలగించి, ఫోర్జరీ వెల్డింగ్ పనుల ద్వారా పాత వాహన నంబర్లు చెక్కించారు. శనివారం ఉదయం బోథ్ కోరమాండల్ జంక్షన్ వద్ద ఎస్సై పురుషోత్తం సిబ్బందితో కలిసి వాహన తనిఖీ నిర్వహించారు. మహీంద్రా మ్యాక్స్ వాహనంతో వస్తున్న నయీమ్ పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. సిబ్బంది వాహనాన్ని వెంబడించి ఆపి నయీమ్ను విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్.కె. నయీమ్, మాకునూర్ విజయ్కుమార్, పెందూర్ ఇంద్రుపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ డి.గురుస్వామి, ఎస్సైవి.పురుషోత్తం, హెడ్ కానిస్టేబుల్ మదన్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
లోకేశ్వరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1986–87 బ్యాచ్ పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. బాగాపూర్ గ్రామంలోని ఓ తోటలో జరిగిన వీరి అపూర్వ సమ్మేళనానికి హాజరయ్యారు. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలో గడిపిన మధురస్మృతులను గుర్తుచేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు గంగారెడ్డి, సుదర్శన్రెడ్డి, శివలింగం, శంకర్రెడ్డి, లోలం గంగన్న, దేవేందర్రెడ్డి, రమణయ్య, కాశీరాం, కిష్ణారెడ్డి, సూర్యకాంత్లను సన్మానించారు. – లోకేశ్వరం32 ఏళ్ల తర్వాత..ఖానాపూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1993–94 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు 32 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఆది వారం వీరి ఆత్మీయ సమ్మేళనానికి జి.వి.ఆర్. ఫంక్షన్ హాల్ వేదికై ంది. పాఠశాలలో గడిపిన తీపిగుర్తులు, అల్లరి పనులను గుర్తుచేసుకున్నారు. రోజంతా సంతోషంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ప్రహ్లాద్, దేవన్న, నరసింహరావు, విఠల్ను సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి తమవంతు సహాయ సహకారం అందించాలని పూర్వవిద్యార్థులు తీర్మానం చేశారు. – ఖానాపూర్ -
పిచ్చికుక్కదాడిలో ఇద్దరికి గాయాలు
నెన్నెల: మండల కేంద్రంలో ఆదివారం పి చ్చికుక్క దాడిలో ఇద్దరు గాయపడ్డారు. కోమటివాడకు చెందిన నేతరి విమల ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా పి చ్చికుక్క ఆమె కాలును కరిచింది. అక్కడి నుంచి హనుమాన్ మందిర వద్ద రోడ్డుపై వెళ్తున్న లింగంపల్లి శంకర్పై దాడి చేసి గాయపర్చడంతో అతడి కాలికి తీవ్ర గాయమైంది. గాయపడిన ఇద్దరిని పీహెచ్సీలో చికిత్స అందించి ఇంటికి పంపించారు. గ్రామంలో పిచ్చికుక్కల స్వైరవిహారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పిచ్చికుక్కల బెడద లేకుండా పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
● మహిళ వేషధారణలో వచ్చి దొంగతనం ● వెంబడించి పట్టుకున్న పోలీసులు ● పరారీలో మరొకరు
జ్యువెలరీ షాపులో చోరీతానూరు: మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఉన్న తుల్జా భవాని జ్యువెలరీ షాపులో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. అంతర్రాష్ట్ర ముఠా ఇద్దరు దొంగలు మహిళ వేషధారణలో చీరలు కట్టుకుని షాప్ వద్దకు వచ్చారు. షటర్ ధ్వంసం చేసి షాపులో చొరబడి మూడు తులాల వెండి ఆభరణాలు, 15 గ్రాముల మూడు నాణెలు ఎత్తుకెళ్లారు. రాత్రి అటు నుంచి వస్తున్న ఇద్దరిని గమనించి దొంగలు.. విఠలేశ్వర ఆలయం వైపు పరుగులు తీయగా వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై షేక్ జుబేర్ సిబ్బందితో కలిసి ఆలయం వైపు వెళ్లారు. ఒక ఇంటి ఆవరణలో దాక్కున్న దొంగలు పోలీసులను చూసి గేటు పైనుంచి దాటే క్రమంలో చీర తట్టుకుంది. చీరను అక్కడే వదిలేసి అక్కడే ఉన్న బైక్ను దొంగలించి జౌలా(బి) మార్గంలో వెళ్లారు. పోలీసులు వెంబడించడంతో జౌలా(బి) శివారులో బైక్ వదిలేసి చేలకు పరుగులు తీశారు. వెంబడించి ఒకరిని పట్టుకోగా మరొకరు పరారైనట్లు ఎస్సై వెల్లడించారు. పట్టుకున్న దొంగ మహారాష్ట్రలోని స్టేషన్ ఉమ్రి గ్రామానికి చెందిన సయ్యద్ సోయల్గా గుర్తించారు. అతని నుంచి మూడు తులాల వెండి ఆభరణాలు. 15 గ్రాముల వెండి నాణేలు రికవరీ చేసినట్లు తెలిపారు. మరో దొంగ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ముధోల్ సీఐ రవీందర్ నాయక్ చేరుకుని జ్యువెలరీ షాపును పరిశీలించారు. ఫింగర్ ప్రింట్ తనిఖీ బృందంతో ఆధారాలు సేకరించాయి. పూర్తి విచారణ తర్వాతే వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. -
ఆదివాసీల హక్కుల కోసం పోరాటం
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీల హక్కులు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేశ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కేసీబీ గార్డెన్లో ఆదివారం రాష్ట్రస్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలకే ఉద్యోగవకాశాలు కల్పించే జీవో నంబర్ 3ను యథావిధిగా అమలు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీని వెంటనే ప్రకటించాలన్నారు. 1/70, పెసా చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఆదివాసీలు సాగుచేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అంతకుముందు పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో జాతీయ అధ్యక్షుడు వట్టం ఉపేందర్, ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బక శ్రావణ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉయక సుదర్శన్, నాయకులు వెట్టి మనోజ్, అర్క శేషారావు, గోడం రేణుక బాయి, ఉయిక ఇంద్ర పాల్గొన్నారు. -
అధికారం కోసమే బీజేపీ ఓటు చోరీ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): అధికారం కోసమే బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతోందని, ఇందులో భాగంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తీసుకువచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వేంపల్లిలో పద్మావతి గార్డెన్స్లో నిర్వహించిన సర్ అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుతో కలిసి మాట్లాడారు. పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఇప్పటికే బీజేపీ భారీ ఓట్లను తొలగించిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల తొలగించేందుకు చేస్తున్న కుట్రతో పౌరసత్వానికే ప్రమాదం పొంచి ఉందన్నారు. గతంలో ఓటరు నమోదు సవరణకు బీజేపీ తీసుకువచ్చిన ది ఎలక్షన్ లాస్(అమెండ్మెంట్) బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. సర్తో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఎమ్మెల్యేల సంక్షిప్త సమాచారాన్ని సేకరించి ఏఐతో క్రోడీకరిస్తూ అనుకూల ఓటర్లను తొలగించే యత్నం చేస్తోందన్నారు. ఇప్పటికే మ్యాపింగ్తో 2 లక్షల వరకు, అన్ మ్యాపింగ్తో 85 వేల వరకు ఓట్ల తొలగింపు చర్యలకు సిద్ధం కాగా, ఓటు కోసం తగిన ఆధారాలు చూపించాల్సి ందేనని ఆంక్షలు విధిస్తోందని తెలిపారు. సర్ ప్రక్రియ ముగిసే వరకు బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఎల్ఏలు తక్కువ సంఖ్యలో హా జరుకావడంపై ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సీరియస్ అయ్యారు. ఇష్టం లేని వాళ్లు ముందుగా సమాచారం ఇస్తే వారిస్థానంలో మరొకరికి బీఎల్ఏగా అవకాశం ఇస్తామన్నారు. సర్ పేరిట తెలంగాణలో ఓట్లు గల్లంతు కాకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చేలా సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సభ్యత్వ నమోదు పార్లమెంట్ ఇన్చార్జి రహమత్ హుస్సేన్, నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణ్రావు, శిక్షకుడు అవేజ్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు తూముల నర్సయ్య, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. -
సింగరేణి ప్రాంతానికి పెద్దపీట
– మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుసింగరేణి ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కారుణ్య నియామక పత్రాలు పొందిన వారిలో జిల్లా నుంచి 117 మంది ఉన్నారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. ప్రస్తుతం సింగరేణిలో మారుపేరు సమస్య ఉందని, ఒక కమిటీని వేసి త్వరలోనే పరిష్కారం జరిగేలా చూడాలని డిప్యూటీ సీఎంను కోరారు. రిటైర్డ్ కార్మికులకు తెల్ల రేషన్కార్డులు ఇవ్వాలని తాను సూచించగా, ఇచ్చిన ఘనత ఇందిరమ్మ రాజ్యంలోని సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందని అన్నారు. సింగరేణి ప్రాంతంలో 10 వేలకు పైగా క్వార్టర్లు ఖాళీగా ఉండి, వాడకంలో లేక అవి పాడవుతున్నాయని, వాటిని రిటైర్డ్ కార్మికులకు అందించి, ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీరాంపూర్లోని సింగరేణి ప్రాంతంలో ఇళ్లపట్టాలను ఇప్పించి, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు అందించే బోనస్ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచేలా చూడాలని కోరారు. రిటైర్డ్ కార్మికులకు ఆదాయపు పన్ను వెసులు బాటు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ మంత్రి వేణుగోపాల్చారి, ఐఎన్టీయూసీ, మినిమం వేజేస్ బోర్డు చైర్మన్ జనక్ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్షు డు సీతారామయ్య, సింగరేణి సీఎండీ బుద్ద ప్రకాష్ జ్యోతి, గిరిజన సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, నాయకులు పాల్గొన్నారు. -
‘మోదీ అంటే నమ్మకం, విశ్వాసం’
కాసిపేట: మోదీ అంటే ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉందని అందుకే నెహ్రూను మించి 12సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నట్లు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేశ్ తెలిపారు. మండల కేంద్రంలోని శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశమే ఇళ్లుగా, దేశ ప్రజలే కుటుంబంగా బతికేది కేవలం మోడీ అని అన్నారు. సమావేశంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు దేవునూరి సంతోష్, రెడ్డి బాలరాజు, ఉపాధ్యక్షుడు ప్రసన్న, నాయకులు రాంచందర్, రాజేష్, ప్రశాంత్, సురేందర్, తోట మనోజ్, మహిళా మోర్చ నాయకురాళ్లు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
చట్ట వ్యతిరేకులపై కఠినంగా వ్యవహరించాలి
● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా దండేపల్లి: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. శనివారం దండేపల్లి పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. రికార్డులు, రిజిష్టర్లు, రిసెప్షన్ కౌంటర్ను పరిశీలించారు. ఎస్సై రాజవర్ధన్ను అడిగి పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. పరిసరాలను పరిఽశీలించి, పరిశుభ్రంగా ఉంచాలన్నారు. క్రైమ్ వాహనాలు, ప్రాపర్టీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని, స్టేషన్ను వర్టికల్ వారీగా విభజించి సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని, రికార్డులను ఎప్పటికప్పుడు ఆధునీకరించాలని సూచించారు. -
హత్యకేసులో భర్త ఉరేసుకుని..
దహెగాం: మండలంలోని గెర్రె గ్రామంలో ఎనిమిది నెలల క్రితం జరిగిన నిండు గర్భిణి హత్యకేసులో ఏ 4గా నిందితుడిగా ఉన్న భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై చుంచు రమేశ్ కథనం ప్రకారం.. నిండు గర్భిణి తలాండి శ్రావణిని మామ శివార్ల సత్తయ్య అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. హత్య కేసులో ఏ4 గా ఉన్న భర్త శివార్ల శేఖర్(26) జైలు నుంచి విడుదలై బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో మేనకోడలి ఇంట్లో ఉంటున్నాడు. మూడురోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. శనివారం ఇంట్లో నుంచి బైక్పై వెళ్లగా తండ్రి సత్తయ్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. కుటుంబసభ్యులు వెతుకుతుండగా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో బైక్ కనిపించింది. అనుమానంతో వెతకగా చెట్టుకు ఉరేసుకున్నాడు. తన కుమారుడి మృతికి శ్రావణి తల్లిదండ్రులు చెన్నయ్య, అనసూర్యపై అనుమానం వ్యక్తం చేస్తూ సత్తయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పెళ్లి కావడం లేదని యువకుడు.. భైంసారూరల్: పెళ్లి కావడం లేదని మనస్తాపం చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన ఉంగురాల రాజు (34)కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో రాజుకు వివాహం జరగకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. శనివారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబీకులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని భైంసా ఏరియాస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన మహిళ అరెస్టు
ఆదిలాబాద్టౌన్: ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన మహిళను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం ఈమే రకు వివరాలు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఏజెంట్ల ద్వారా ప్ర భుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని వందల మంది అభ్యర్థులను మోసం చేసిన ముఠాసభ్యుల్లో ఒకరైన సుజాత ఠాకూర్ను వన్టౌన్ పోలీసులు అరెస్టు చే శారు. జిల్లావ్యాప్తంగా ఈ ముఠా సభ్యులపై 20 కే సులకు పైగా నమోదైంది. ప్రధాన నిందితులను జ నవరి 10న రిమాండ్కు తరలించగా తాజాగా సుజా త ఠాకూర్ను అరెస్టు చేశారు. నిందితులు 2023లో అనంత ఈ సొల్యూషన్స్, విద్యాదాన్ ఆర్గనైజేషన్ అనే సొసైటీ ద్వారా విద్యాంజలి 2.0 స్కీం డబ్బులు దుర్వినియోగం చేయాలని పన్నాగం పన్నారు. కేంద్రప్రభుత్వం ద్వారా వచ్చే సీఎస్ఆర్ నిధులు కాజేయాలని దురుద్దేశంతో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అబద్ధాలు చెప్పి నిరుద్యోగులను నమ్మించారు. నకిలీ ఉద్యోగాలను పాఠశాలలు, కళాశాలల్లో వచ్చేలా చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల లక్షల వరకు వసూళ్లు చేసి దాదాపు 240 అభ్యర్థులను మోసం చేసినట్లు వివరించారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారి మాటలను నమ్మవద్దని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలు రావని పరీక్షల ద్వారా ఉద్యోగాలను సాధించాలని తెలిపారు. నిరుద్యోగులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ● కారుణ్య నియామక పత్రాల అందజేత ● హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
మంచిర్యాలటౌన్: బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయని, సింగరేణి సంస్థను, కార్మికులను కాపాడుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం స్థానిక పద్మనాయక ఫంక్షన్హాల్లో సింగరేణి సంస్థలో 335 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీప్యూటీ సీఎం మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. గూడెం ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాందండేపల్లి: గూడెం ఆలయాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దుతామని, విద్యాలయాలు, వైద్యశాలలు, దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రూ.58 కోట్ల గోదావరి పుష్కరాల నిధులతో దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయ పునః నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు మక్కాన్సింగ్ఠాకూర్, సత్యనారాయణతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ‘భట్టి’ మాట్లాడారు. పిప్రిలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు గూడెం ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డితో ప్రస్తావించడంతో స్పందించి 37 రోజుల్లోనే నిధులు మంజూరు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ప్రత్యేక నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే దేవాలయాల అభివృద్ధికి రూ.2,216 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఆలయాలు, సాగునీటి రంగాల అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు బహుముఖ వ్యూహంతో ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నారని అభినందించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్దీపక్, దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, అదనపు కలెక్టర్లు రాములు, చంద్రయ్య, డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల మేయర్ మధుకర్, డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, డీఆర్డీవో కిషన్, తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు ఇవే... గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయ పునః నిర్మాణం, అభివృద్ధి పనులతోపాటు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రూ.9.70 కోట్లతో గ్రామ సంఘ భవనాల నిర్మాణం, లక్సెట్టిపేట మున్సిపల్ పరిధిలో రూ.2.30 కోట్లతో సీసీ రోడ్డు పనులు, రూ.2 కోట్లతో డ్రెయినేజీల నిర్మాణం, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల్లోని మోదెల, ద్వారక, గుడిరేవు గ్రామాల సమీపంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎడమవైపున రూ.74.40 కోట్ల నిధులతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఘనస్వాగతం.. గూడెం సత్యనారాయణస్వామి ఆలయానికి విచ్చేసిన డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్లకు ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు, కలెక్టర్ కుమార్దీపక్ ఘనస్వాగతం పలికారు. గూడెం గుట్టపై సత్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు ఆశీర్వచనం చేసి ప్రసాదం అందించారు. -
రోడ్డుప్రమాదంలో యువకుడు..
నేరడిగొండ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందినట్లు ఎస్సై ఇమ్రాన్ తెలిపారు. ఎస్సై, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని యాపల్గూడ గ్రామానికి చెందిన మండాడి భీంరావ్(30) శనివారం తన బైక్పై బంధువులను వదిలిరావడానికి గుత్పాల గ్రామానికి వెళ్లి తిరిగివస్తున్నాడు. రోల్మామడ సమీపంలోని దేవుల్నాయక్ తండా వద్ద లారీ రాంగ్రూట్లో నిర్లక్ష్యంగా రివర్స్ తీసుకుంటూ బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో భీంరావ్ కిందపడి తల, వీపు భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్లో నిర్మల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ జగన్పై చర్యలు తీసుకోవాలని మృతుడి అన్న కృష్ణ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
లక్సెట్టిపేట: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంకతిపల్లి గ్రామానికి చెందిన గణవేని రమేశ్ (41) గత కొన్నిరోజులుగా నడుమునొప్పి, పలు రకాల వ్యాధులతో అనారోగ్యం బారినపడ్డాడు. ఎన్ని ఆసుపత్రుల్లో చూపించుకున్న నయం కాలేదు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందాడు. శుక్రవారం ఉదయం బయటకు వెళ్లి మధ్యాహ్నం వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం లక్ష్మిపూర్ శివారు పొలం వద్ద పురుగుల మందు తాగి ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఈ వి షయం తెలుసుకున్న కుటుంబీకులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మె రుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుప్రతికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా రాత్రి మృతిచెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదుతో శనివారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు. -
చిన్నారులకు ఘన స్వాగతం
మంచిర్యాలఅర్బన్: ‘ప్రతీ విద్యార్థి ఆనందంగా పాఠశాలకు రావాలనే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. బోధన నాణ్యత పెంపు.. మెరుగైన ఫలితాల కోసం టీచర్లకు మార్గదర్శకాలు ఇచ్చాం. సర్కారు పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంపు.. డ్రాపౌట్ లేకుండా చిన్నారులు బడిబాట పట్టేలా కార్యాచరణ చేపట్టాం’ అని జిల్లా విద్యాధికారి చంద్రయ్య అన్నారు. ఈ నెల 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో వసతిగృహాలు, రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాలలు అందంగా అలంకరించి విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘బడిబాట’లో విద్యార్థుల నమోదు.. జిల్లాలో బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలోని 709 పాఠశాలల్లో 43,072 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ప్రైమరీలో 15,311, అప్పర్ ప్రైమరీలో 4419, సెకండరీలో 15,637, హయ్యర్ సెకండరీలో 7,705 మంది విద్యార్థులున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 10 శాతం అడ్మిషన్లు పెంచాలని నిర్ణయించాం. నాలుగేళ్లు నిండిన చిన్నారులను ప్రీ ప్రైమరీ పాఠశాలలో చేర్పించేలా అంగన్వాడీల్లో ఐదేళ్లు నిండిన చిన్నారులను ప్రభుత్వ యాజమాన్య ప్రాథమిక పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామసభలు, ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లల గుర్తింపు, కరపత్రాల ద్వారా ప్రచారం, సామూహిక అక్షరాభాస్యం, విలీన విద్య, బాలల సభ, బాలికా విద్య, తరగతిగదుల డిజిటలీకరణ, క్రీడాపోటీల నిర్వహణ, సర్కారు బడుల్లో బోధన, సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ విస్తృతంగా ప్రచారం చేపట్టడం ద్వారా విద్యార్థుల నమోదు పెంచనున్నాం. వందశాతం ట్రాన్సిషన్, జీరో డ్రాపౌట్ ప్రతీ ప్రభుత్వ యాజమాన్య ప్రాథమిక, ప్రాథమికోన్నత ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలలో ఐదు, ఏడు, ఎనిమిది తరగతులు పూర్తి చేసిన విద్యార్థులను సమీప ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో చేర్పించి సంబంధిత పాఠశాల హెచ్ఎం యుడైస్లో సటూండెట్ మాడ్యుల్లో ఇంపార్ట్ చేయించాలి. విద్యార్థుల నూతన పాఠశాల, ప్రవేశ వివరాలు మండల విద్యాధికారి నిర్ణీత ప్రొఫార్మాలో స్కూల్ కాంప్లెక్ హెచ్ఎం ద్వారా సమర్పించాలి. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థి ఇష్టానుసారం ఏదైనా జూనియర్ కళాశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థి చదివిన పూర్వ పాఠశాల, నూతన పాఠశాల, కళాశాల హెడ్స్ ఇద్దరూ యుడైస్లో డ్రాప్ బాక్స్లో ఏఒక్క విద్యార్థి ఉండకుండా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతీ విద్యార్థి యుడైస్లో నమోదై ఉండేలా నవీకరించాలి. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాఠశాల పున:ప్రారంభమైన రోజున ప్రతీ విద్యార్థికి మధ్యాహ్న భోజనం అందుతుంది. ఆయా పాఠశాలలకు బియ్యం సరఫరా జరిగింది. పాఠశాల హెచ్ఎం, కమిటీ సభ్యులు మధ్యాహ్న భోజనం రుచి, శుచిపై టెస్టీ చేయాల్సిందే. ప్రారంభం రోజే పుస్తకాలు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజునే నోట్, పాఠ్యపుస్తకాలు అందిస్తాం. జిల్లాకు 3,12,986 నోట్ పుస్తకాలు చేరాయి. 3,05,620 పాఠ్యపుస్తకాలకు 2,86,3400 వచ్చాయి. ఎనిమిదో తరగతి బయోలజీ, రెండో తరగతి ఇంగ్లిష్ మీడియం పుస్తకాలు రావాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో అన్ని పుస్తకాలు రావొచ్చు. గ్రౌండ్ బ్యాలెన్స్ కలుపుకుని మొత్తం 3,05,620 పుస్తకాలు (100 శాతం) ఆయా పాఠశాలలకు చేరాయి. గ్రామస్థాయిలో సర్పంచులు, అమ్మ ఆదర్శ కమిటీలు, మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించాం. ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం వల్ల బడుల్లో ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడు పరిష్కారానికి నోచుకునే అవకాశం ఉంటుంది. కేజీబీవీలకు యూనిఫాం క్లాత్ త్వరలోనే అందనుంది. పరిశుభ్రత, పారిశుద్ధ్యం అమ్మ ఆదర్శ కమిటీ, స్కూల్ ఫెసిలిటీ అండ్ మెయింటెనెన్స్ గ్రాంట్ నుంచి పారిశుద్ధ్య నిర్వహణ కోసం శానిటేషన్ వర్కర్స్ను నియమించుకోవాలి. అవసరమైతే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ సిబ్బందిని వినియోగించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశాం. వేసవి సెలవుల్లో పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండి విషపూరిత కీటకాలు సంచరించే ప్రమాదం ఉంది. తాగునీటి ట్యాంకులు పాకురుతో నిండి ఉంటాయి. ఇంకా ఒకరోజు సమయం ఉంది. తరగతి గదులు, పరిసరాలు, నీటి ట్యాంకులు, వంటపాత్రలు శుభ్రపర్చుకోవాలని ఆదేశించాం. బోధన నాణ్యతలో పెంపునకు చర్యలు గతేడాది విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్, పాఠ్యప్రణాళికలు రాయడం, అభ్యసన సామర్థ్యాలపై విపులంగా శిక్షణ ఇచ్చాం. ఉన్నత పాఠశాలలకు లిప్పై, ప్రధానోపాధ్యాయులకు బోధన తీరు పర్యవేక్షణపై అవసరమైన తర్ఫీదు ఇచ్చాం. ప్రాథమిక పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఐదు ఇన్స్పెక్షన్ టీంలు, ఉన్నత పాఠశాలల పనితీరు పర్యవేక్షణకు రెండు తనిఖీ బృందాలు నియమించాం. బడిబాట ముగిసిన తర్వాత బృందాలకు కేటాయించిన మండలాలను నిరంతరం పర్యవేక్షిస్తారు. దీంతో వ్యవస్థలో జాగరుకత, బాధ్యత పెరిగి ప్రణాళికాబద్ధమైన బోధనలో నాణ్యత, అభ్యసన సామర్థ్యాలలో పెరుగుదల, పాఠశాలల పనితీరులో పురోగతి సాధ్యమవుతుంది.మౌలిక వసతులు..టీచర్ల సర్దుబాటుడిజిటల్ విద్య..ఫీజుల వివరాలు ప్రదర్శించాలిమౌలిక సదుపాయాలకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలతో 545 పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల నవీకరణ, మరమ్మతులు పూర్తయ్యాయి.జిల్లాలో 2,464 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. తక్కువ విద్యార్థులుండి ఎక్కువ ఉపాధ్యాయులుంటే మరో పాఠశాలకు సర్దుబాటు చేశాం. గతేడాది 168 మందిని వర్క్ అడ్జస్ట్మెంట్ చేశాం. ఎక్కడైనా ఖాళీలుంటే కలెక్టర్ అనుమతితో సర్దుబాటు చేస్తాం. జిల్లాలోని 576 ప్రాథమిక పాఠశాలల్లో టాప్స్ ద్వారా, 138 ఉన్నత పాఠశాలల్లో ఐఎఫ్సీ తెరల ద్వారా బోధన జరుగుతోంది. 71 పాఠశాలల్లో ఐసీటీ ల్యాబ్లు ఏర్పాటు చేశాం. 119 పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నాం. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత అభ్యసన కార్యక్రమం కొనసాగుతుంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాఠశాల నోటీస్ బోర్డులో స్కూల్ అనుమతి, ఉత్తర్వుల ప్రతిని, వివరాలు, పాఠశాల గవర్నింగ్ బాడీ అనుమతించిన తరగతి వారీగా విద్యార్థుల నుంచి సేకరించే ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజుల వివరాలను విధిగా ప్రదర్శించాలి. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
సాత్నాల: ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి పని నిమిత్తం నాగపూర్ వెళ్తున్న కారు శనివారం భోరజ్ మండలం పిప్పర్వాడ టోల్ప్లాజా వద్ద చేరుకుంది. టోల్ తీసుకోవడానికి ఆగి ఉన్న లారీని వెనక నుంచి వేగంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డితోపాటు సనత్ కుమార్కు తీవ్రంగా, కుష్బూ నాయుడుకి స్వల్ప గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో లారీని ఢీకొన్నట్టు డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి తెలిపాడు. -
పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత
బెల్లంపల్లి: ఆటోలో బ్యాగు పోగొట్టుకున్న వ్యక్తికి టూటౌన్ పోలీసులు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా రాఘవపురానికి చెందిన మాదాసి ఐలయ్య శుక్రవారం దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో బెల్లంపల్లికి వచ్చాడు. కల్వరి చర్చికి వెళ్లడానికి మందమర్రి వైపు వెళ్లే ఆటో ఎక్కాడు. చర్చి వద్ద ఆటో దిగి బ్యాగును అందులో మర్చిపోయాడు. త ర్వాత టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యా గులో బ్యాంకు, పట్టాపాసుపుస్తకాలు, పింఛన్బుక్, ఆధార్కార్డు, రూ.2వేలు నగదు ఉన్నట్లు వెల్లడించాడు. స్పందించిన కానిస్టేబుల్ బుక్య గంగాధర్.. సీసీ పుటేజీలు పరిశీలించి ఆటో మందమర్రికి చెందిన శంకర్దిగా గుర్తించాడు. శనివారం అతని ఇంటికి వెళ్లగా బ్యాగును అప్పగించాడు. కానిస్టేబుల్తోపాటు ఆటోడ్రైవర్కు ఐలయ్య కృతజ్ఞతలు తెలిపాడు. -
పారదర్శక నమోదుతోనే పార్టీ నిర్మాణం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పారదర్శకంగా చేపట్టే సభ్యత్వ నమోదుతోనే పార్టీ నిర్మాణం జరుగుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలో గల ఎస్వీఎస్ గార్డెన్స్లో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అధ్యక్షతన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్), పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో బూత్ స్థాయి కార్యకర్తలు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తూ రూ.50తో పార్టీ క్రీయాశీలక సభ్యత్వం, రూ.10తో సాధారణ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టాలన్నారు. కేసీఆర్ ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి కౌశిక హరి మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ రూ.13.50 కోట్లు మంజూరైన రంగపేట బ్రిడ్జ్ పనులు ప్రారంభించకుండా ఆరు వరుసల రోడ్డు నిర్మాణం చేపట్టడం అనాలోచిత నిర్ణయమన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి బెల్లంపల్లి: పార్టీ సభ్యత్వ నమోదును ప్రతీ కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు అన్నారు. బెల్లంపల్లి ఏఎంసీ ఏరియా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యమ పార్టీగా అవతరించి రాజకీయ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ను బలోపేతం చేయడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం దోహద పడుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ టి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
రక్తం.. ప్రాణవాయువు!
● స్వచ్ఛందంగా ముందుకొస్తున్న దాతలు ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఏటా జూన్ 14న.. ప్రముఖ జీవశాస్త్రవేత్త, వైద్యుడు కార్ల్ ల్యాండ్ స్టీనర్ 19వ శతాబ్దంలో మానవ రక్తకణాలు కనుగొన్నందు కు గాను 1930లో నోబెల్ బహుమతి లభించింది. ఆయన జయంతి సందర్భంగా ఏటా జూన్ 14న రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తోంది.మంచిర్యాల జిల్లాలో.. జిల్లా కేంద్రం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం లేదు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ప్రభుత్వ ఆస్పత్రితోపాటు ఇతర ఆస్పత్రులకు సరఫరా చేస్తోంది. 2008 నుంచి ఇప్పటివరకు 1,11,832 యూనిట్లు రక్తదాన శిబిరాల ద్వారా సేకరించి 1,11,639 యూనిట్లు అందజేశారు. 2,500 యూనిట్లు నిల్వ చేసే కోల్డ్స్టోరేజీ ఉంది. ప్రతీ నెల సికిల్సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు 300 యూనిట్లు ఎక్కిస్తున్నారు. ఓ పాజిటివ్ గ్రూపు రక్తం ఎక్కువగా నిల్వ ఉంటుండగా.. వినియోగమూ ఎక్కువే ఉంటోంది. ప్రస్తుతం ఓ పాజిటివ్ 141 యూనిట్లు, ఓ నెగెటివ్ 6, ఏ పాజిటివ్ 86, ఏ నెగెటివ్ 3, బీ పాజిటివ్ 109, బీ నెగెటివ్ 2, ఏబీ పాజిటివ్ 26, ఏబీ నెగెటివ్ 1 మొత్తంగా 374 యూనిట్లు నిల్వ ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో.. నిర్మల్ జిల్లాలో రెండు ప్రభుత్వ బ్లడ్బ్యాంకులు, నిర్మల్ పట్టణంలో మూడు, భైంసాలో ఒక ప్రైవేటు బ్లడ్ బ్యాంకు ఉన్నాయి. రోజు 40 నుంచి 80 మందికి రక్తం అవసరం అవుతుంది. ఇటీవల రోడ్డు ప్రమాద కేసులు గణనీయంగా పెరిగాయి. వీరితోపాటు ప్రసవం, రక్తహీనత కేసులకు దాతల నుంచి రక్తం అవసరం పడుతుంది. జనరల్ ఆస్పత్రిలో 300 యానిట్ల వరకు రక్తం నిల్వ ఉంచవచ్చు. ప్రతీనెలా 200 నుంచి 250 యూనిట్లు అవసరం ఉండటంతో అదేస్థాయిలో సేకరిస్తున్నారు. బ్లడ్ బ్యాంకుల్లో ఒక్కోసారి రక్తనిల్వలు లేకుండా పోతుండడంతో అత్యవసర సమయాల్లో దాతల నుంచి సేకరించాల్సి వస్తోంది. ఏ, బీ, ఓ పాజిటివ్ గ్రూప్లను రక్తదాన శిబిరాల్లో ఎక్కువగా రక్తదాతలు ఇస్తారు. ఏ, బీ నెగెటివ్ వేల మందిలో ఒకరు, ఇద్దరు మాత్రమే ఉంటారు. దాతలకు బీమా పాలసీ వెయ్యిమందికి పైగా 39 సార్లు చేశా..పాతమంచిర్యాల /ఆసిఫాబాద్అర్బన్/నిర్మల్చైన్గేట్: రక్తం.. ప్రత్యామ్నాయం లేనిది. కృత్రిమంగా తయారు చేయలేనిది. మనిషిలో ప్రవహించే రక్తం మాత్రమే మనుషుల ప్రాణాలు కాపాడడంలో దోహదపడుతుంది. రక్తం తక్కువగా ఉన్న వారికి సరైన సమయంలో ఎక్కించకపోతే ప్రాణాలు పోయే ప్రమాదముంది. సికిల్సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతీ వారం లేదా నెలకోసారి క్రమం తప్పకుండా ఎక్కించాల్సిందే. అలాంటి వారితోపాటు అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారి కోసం కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి దానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -
దుబాయ్లో ఉద్యోగావకాశాలు
నిర్మల్ఖిల్లా: దుబాయ్లో క్యాబ్డ్రైవర్, బైక్ రైడర్గా పనిచేసేందుకు ఉమ్మడి జిల్లా అభ్యర్థులు టామ్కామ్(తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రవాసీమిత్ర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల పేర్కొన్నారు. 21 నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులని, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టుతోపాటు కనీసం ఏడాది అనుభవం ఉండాలని తెలిపారు. బేసిక్ ఇంగ్లిష్ మాట్లాడటం, చదవడం తెలిసి ఉండాలని పేర్కొన్నారు. నెలకు సుమారు రూ.64 వేల నుంచి రూ.లక్ష వరకు జీతం ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు టామ్కామ్ అధికారిక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈనెల 25 చివరి తేదీ, ఎంపికై నవారికి స్క్రీనింగ్ అనంతరం వైద్యపరీక్షలు, సీజీ/స్క్రీనింగ్ క్లియరెన్స్, వీసా ఆమోదానికి లోబడి తుది ఎంపిక ఉంటుందని వివరించారు. వివరాలకు 9440049520 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
లేబర్ కోడ్లను అడ్డుకోవాలి
శ్రీరాంపూర్: కేంద్ర ప్రభుత్వం కార్మికుల నడ్డి విరిచేలా తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్లను అడ్డుకోవాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. శనివా రం నస్పూర్ కాలనీలోని ప్రెస్క్లబ్లో ఆ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలు గు లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు కట్టు బానిసల్లా పనిచేయాల్సి వస్తుందని, వీటిని పోరాటాలతోనే తిప్పికొట్టాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను, కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. పెట్రోల్, డిజీల్, గ్యాస్ ఇతర నిత్యావసరాల ధరలు పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విద్యా, వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ కొరకు కఠిన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శిగా బోడంకి చందును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవికుమార్, జిల్లా అధ్యక్షుడు కనికరపు అశోక్, రాష్ట్ర కమిటీ సభ్యుడు పీ.ఆశయ్య, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ప్రకాష్, చందు, అశోక్, పున్నం నాయకులు దుంపల రంజిత్ కుమార్, ప్రేంకుమార్, ఉమారాణి, మల్లేశ్వరి పాల్గొన్నారు. -
కవి వెంకట్కు పద్యగాన సత్కారం
నిర్మల్ఖిల్లా: నిర్మల్కు చెందిన సంస్కృత భాషా ప్రచార సమితి ఆదిలాబాద్–నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్యకవి బి.వెంకట్కు పద్యగాన సత్కారం లభించింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగుభాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అక్కి నర్సింలు గౌడ్ రచించిన బాలరామాయణం పుస్తకావిష్కరణ సభలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొన్న డా. బి.వెంకట్ తన స్వీయ పద్యాలను ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు. అతిథులుగా పాల్గొన్న ఆచార్య కసిరెడ్డి వెంకట్రెడ్డి, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, తెలంగాణ భాషా చైతన్య సమితి అధ్యక్షులు బడేసాబ్, కుసుమ ధర్మన్న కళాపీఠం చైర్మన్ రాధాకుసుమ, పంచపదుల ప్రక్రియ రూపకర్త పాండురంగ విఠల్ చేతులమీదుగా ఆయన పద్యగాన సన్మానాన్ని స్వీకరించారు. జిల్లాకు చెందిన పలువురు రచయితలు, సాహితీవేత్తలు ఈ సందర్భంగా వెంకట్కు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కవిసమ్మేళనంలో 51 మంది కవులు పాల్గొన్నారు. -
తెప్పబోల్తా పడి మత్స్యకారుడి మృతి
కడెం: భారీ ఈదురుగాలులు, అలలకు తెప్పబోల్తాపడి మ త్స్యకారుడు నీట మునిగి మృతిచెందాడు. కడెం ప్రాజెక్టు వ ద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నాగుల రాజశేఖర్(54) మత్స్యకారుడు రోజులాగే శనివారం కడెం ప్రాజెక్ట్ బ్యాక్వాటర్లో చేపల వేటకు వెళ్లాడు. సాయంత్రం భారీ ఈదురుగాలులు రావడంతో అప్రమత్తమై ఒడ్డుకు చేరే క్రమంలో ప్రాజెక్ట్లో భారీ నీటి అలలకు తెప్ప బోల్తాపడింది. ఈత కొట్టేందుకు ప్రయత్నించిన రెండు కాళ్లకు చేపల వల చుట్టుకుని నీటిలో మునిగి మృతిచెందాడు. భారీ ఈదురుగాలుల మధ్య ఎలాగైన ఒడ్డుకు చేరాలని కడెం ఎడమ కా లువ వైపు వేగంగా తెడ్డు కొడుతుండగా ఒడ్డునవా రు తీసిన వీడియో వైరలయ్యాయి. రాజశేఖర్ మృతిచెందడం అందరినీ కలిచివేసింది. కుటుంబ స భ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వేగంగా ఆర్టీసీ విలీన ప్రక్రియ
ఆదిలాబాద్: ఆర్టీసీలో ఉద్యోగుల విలీన ప్రక్రియ వే గంగా జరుగుతుందని ఆదిలాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాను అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు. టీజీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే కార్మిక సోదరుల చిరకాల స్వప్నం సాకారం కాబో తోందని పేర్కొన్నారు. గత ఏప్రిల్లో జరిగిన సమ్మె సందర్భంగా కార్మికులు లేవనెత్తిన అంశాలపై ప్ర భుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ పరి శీలించిందని తెలిపారు. ఇప్పటికే విలీనానికి సంబ ంధించిన ఆర్థిక, సాంకేతిక, పరిపాలనాపరమైన అ ంశాలపై సమీక్ష నిర్వహించిందని వెల్లడించారు. రా ష్ట్రంలోని అన్ని డిపోల్లో కార్మిక శాఖ పర్యవేక్షణలో యూ నియన్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మిక సంఘాల ప్రతిని దులను విలీన ప్రక్రియలో భాగస్వాములను చేస్తామని వివరించారు. కార్మికుల భవిష్యత్తుకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ విధులను అంకితభావంతో నిర్వహిస్తూ, సంస్థ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
ఆర్జేసీలను కొనసాగించాలి
నార్నూర్: ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ బాలుర, ఉట్నూర్ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను (ఆర్జేసీ) కొనసాగించాలని ఆదివాసీ వి ద్యార్థి సంఘం (ఏఎస్యూ) జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఆర్జేసీ కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈవో)గా మార్చి కొనసాగిస్తామని ప్రభుత్వం భావిస్తే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్జేసీలను య థావిధిగా కొనసాగించాలని కోరారు. అవసరమైతే ప్రత్యేకంగా కొత్త సీఈవో కళాశాలలను మంజూరు చేసి భవనాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సలహాదారుడు పెందోర్ దీపక్, డీఏసీ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి జాదవ్ సుమేష్, రాజ్గొండ విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షుడు కుంరం చతుర్షావ్, మండల అధ్యక్షుడు ఆత్రం ప్రమేశ్వర్, నాయకులు మారప గంగారం, కొట్నాక్ శ్యాంరావు, కొట్నాక్ శ్రీరామ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆవుకు అరుదైన శస్త్రచికిత్స
ఆదిలాబాద్(బేల): మండలంలోని పొన్నాల గ్రా మంలో ఆవుకు సోకిన హార్న్ క్యాన్సర్ (కొమ్ము క్యా న్సర్)ను పశువైద్యులు శుక్రవారం విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తొలగించారు. రైతు అశోక్ పుల్మ రేకు చెందిన ఆవు కొమ్ము భాగంలో క్యాన్సర్ గడ్డలతో తీవ్ర ఇబ్బంది పడుతుండగా, పశువైద్యులు స కాలంలో స్పందించి ప్రాణదానం చేశారు. పశువైద్యాధికారి వినోద్ దేశ్పాండే.. శస్త్రచికిత్స చేశారు. కొమ్ము భాగాన్ని శాసీ్త్రయ పద్ధతిలో తొలగించారు. రక్తస్రావం కాకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. శస్త్రచికిత్స అనంతరం ఆవు ఆ రోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు. గాయం మానడానికి అవసరమైన చికి త్స అందిస్తున్నామని, కొన్నిరోజుల అనంతరం ఆ వు పూర్తిగా కోలుకుంటుందని పేర్కొన్నారు. పశువైద్యుల బృందాన్ని స్థానిక రైతులు అభినందించారు. -
చికిత్సపొందుతూ వివాహిత..
లక్సెట్టిపేట: కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగిన వివాహిత చికిత్సపొందుతూ మృతిచెందింది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని దౌడపల్లి గ్రామానికి చెందిన అడప ఉమ (51), శ్రీనివాస్ దంపతులు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఉమ గత నాలుగేళ్లుగా కడుపు, నడుము నొప్పితో బాధపడుతోంది. ఆసుపత్రుల్లో చూపించుకున్నా నయం కాలేదు. ఈనెల 10న కడుపునొప్పి అధికం కావడంతో భరించలేక ఇంట్లో పురుగుల మందు తాగింది. కుటుంబీకులు గమనించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కరీంనగర్ తరలించగా చికిత్సపొందుతూ గురువారం రాత్రి మృతిచెందింది. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే ప్రాణం తీసింది!
ఖానాపూర్: వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే ఒకరు మృతిచెందారని ఆరోపిస్తూ ఖానాపూర్ ప్రభుత్వ ఆ సుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం ఆందోళనకు దిగా రు. రోగిని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులు, గ్రామస్తులతో కలిసి అధికారులు, వైద్యసిబ్బందిని నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన షేక్ షారుఖ్ తన తండ్రి షేక్ హుస్సేన్ (54)కు గురువారం అర్ధరాత్రి తీవ్రనొప్పులు, అధిక చెమటలు వచ్చాయి. ఆర్ఎంపీ సూచన మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. విధుల్లో ఉన్న సిబ్బంది కేవలం ఒక ఇంజక్షన్, మూడు మాత్రలు ఇచ్చారని, కనీసం బీపీ పరీక్ష నిర్వహించలేదు. వైద్యుడు ప్రత్యక్షంగా వచ్చి చూడలేదు. ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని చెప్పకపోవడంతో దా దాపు 40 నిమిషాల పాటు అక్కడే ఉండి తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం హు స్సేన్ ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విధుల్లో నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రాత్రివేళ వైద్యుడు అందుబాటులో లేరని కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబం చేసిన ఆరోపణలను ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ స్వర్ణరెడ్డి ఖండించారు. రోగికి వైద్యచికిత్స అందించామని, డ్యూటీ వైద్యుడు అందుబాటులో ఉన్నారని, సిబ్బంది రోగి పరిస్థితి వైద్యుడి దృష్టికి తీసుకెళ్లలేదని తెలిపారు. సిబ్బంది అనుమతి లేకుండానే రోగిని ఇంటికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. సుర్జాపూర్ సర్పంచ్ బక్కశెట్టి వెంకట్రాములు, నాయకులు భూసి నరేందర్, బొమ్మెన రాకేశ్, ముషారఫ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్బీ ఎస్సై గంగన్న మృతి
జన్నారం: అనారోగ్యంతో ఎస్బీ ఎస్సై జాడి గంగన్న మృతిచెందారు. మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందిన ఈయన 1989లో కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరారు. 2012లో హెడ్ కానిస్టేబుల్గా, 2018లో ఏఎస్సైగా, 2024 సెప్టెంబర్ 26న ఎస్సైగా ప్రమోషన్ పొంది, ప్రస్తుతం రామగుండం ఎస్బీ ఎస్సైగా పనిచేస్తున్నారు. రెండునెలల క్రితం బ్రెయిన్స్ట్రోక్తో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి వచ్చారు. ఆ తర్వాత అనారోగ్యం బారినపడగా కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. కాగా, గంగన్న మరో 14 నెలల్లో ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంది. ఆయనకు భార్య అన్నపూర్ణ, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
విద్యుత్షాక్తో ఒకరు..
ముధోల్: విద్యుత్ షాక్తో ఒకరు మృతిచెందినట్లు ఎస్సై బిట్లా పెర్సిస్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని కోలిగల్లీకి చెందిన ముడుగుల సాయినాథ్ (40), సాయినాథ్ భూమేష్ ఎలక్రీషియన్తో కలిసి మాధవ్నగర్ కాలనీలో శుక్రవారం విద్యుత్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సాయినాథ్ ప్రమాదవశాత్తు కరెంటు షాక్కు గురయ్యాడు. స్థానికులు అంబులెన్సుకు సమాచారం అందించి ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రెండెకరాలే ‘భరోసా’!
మంచిర్యాలఅగ్రికల్చర్: వానాకాలం సాగు సీజన్ ప్రారంభమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరిట అందించే పంట పెట్టుబడి సాయం రెండెకరాలకే పరిమితం కావడంతో రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. మిగతా సాయం అందుతుందా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. మరోవైపు పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం విత్తనాలు, ఎరువుల వినియోగంపై సమావేశాలు నిర్వహిస్తోంది. యాసంగి సీజన్ రైతు భరోసా మొదటి విడత గత మార్చి 22న ప్రభుత్వం ఎకరానికి రూ.6వేల లెక్కన ఎకరంలోపు వారికి విడుదల చేసింది. రెండో విడత 20 రోజుల తర్వాత, మూడో విడత ఏప్రిల్ చివరలో జమ చేస్తామని ప్రకటించింది. ఏప్రిల్ 23న రెండో విడత రెండెకరాల్లోపు రైతులకు అందజేసింది. మొత్తంగా రెండెకరాల్లోపు రైతులకు 12వేలు జమ చేసింది. జిల్లాలోని 1,56,034 మంది రైతుల ఖాతాల్లో రూ.125.95 కోట్లు జమయ్యాయి. రైతు భరో సా అందజేయాలని రైతులు కోరుతున్నారు. -
ఆలయాల అభివృద్ధికి రూ.70 కోట్లు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయం అభివృద్ధి, మంచిర్యాల విశ్వనాథ ఆలయం పునర్నిర్మాణ పనులకు రూ.70కోట్లు ఇస్తానని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి 36రోజుల్లోనే ఇవ్వడం, పనులకు శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శనివారం ఆయా పనులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ ప్రారంభిస్తారని తెలి పారు. నియోజకవర్గంలో రూ.9.70కోట్లతో 35ఐకేపీ భవనాలు, నగరంలోని 60 డివిజన్లకు కార్యాలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. డివిజన్ కార్యాలయాల్లో ప్రజలు సమస్యలు తెలియజేస్తే వారం రోజుల్లోనే పరిష్కరించేలా పాలన సాగుతుందని అన్నారు. సింగరేణి ప్రాంత సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారానికి హామీనిచ్చారని, మెడికల్ బోర్డు ఏర్పాటుతోపాటు ఇకపై మూడు నెలలకోసారి దరఖాస్తులను పరిష్కరిస్తుందని చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా 335 మందికి కారుణ్య నియామక ఉద్యోగాలు ఇవ్వనుండగా.. శ్రీరాంపూర్ డివిజన్లోనే వందకు పైగా ఉన్నాయని, మంచిర్యాలలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా పత్రాలు అందజేస్తామని తెలిపారు. డీప్యూటీ సీఎం ‘భట్టి’ శ్రీరాంపూర్ సింగరేణి ఓసీని సందర్శిస్తారని, ఆదివారం వేంపల్లిలోని పద్మావతి గార్డెన్లో జరిగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై బూత్ స్థాయి ఏజెంట్ల అవగాహన శిక్షణ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నగర మేయర్ దర్ని మధుకర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
మంచి నిర్ణయం
రైతులు పంట రుణాల కోసం నేరుగా తమ మొబైల్ ఫోన్ల నుంచి దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిక యాప్ తీసకురావడం మంచి నిర్ణయం. రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగే పని తప్పింది. ఈ యాప్ వల్ల వారికి మేలు చేకూరుతుంది. – నర్సారెడ్డి, రైతు, లక్ష్మణచాంద సద్వినియోగం చేసుకోవాలి కృషిక యాప్ ద్వారా రైతులు తమ పంటల సాగుకు అసవరమైన రుణాలను తమ మొబైల్ ఫోన్ల నుంచే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులకు వెళ్లకుండా రుణాలు పొందవచ్చు. జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి. –రాంగోపాల్, ఎల్డీఎం, నిర్మల్ -
పంట రుణం ఇక ఈజీ
లక్ష్మణచాంద: ఇప్పటివరకు సాగు సమయం వచ్చిందంటే చాలు రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు అవసరమైన పంట రుణాల కోసం రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. బ్యాంకు అధికారులు ‘రేపు రండి..మాపు రండి’అంటూ తిప్పించుకునేవారు. ఇక నుంచి పంట రుణాలు కావాలనుకునేవారు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం మొబైల్ యాప్ ద్వారా నేరుగా పంట రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కృషిక అనే నూతన యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ యాప్ ఆంగ్లంలో ఉండగా, త్వరలోనే అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తామని అధికారులు తెలిపారు. కృషిక యాప్ పని తీరు ఇలా.. ప్రయోజనాలు ఇవే.. భవిష్యత్తు లక్ష్యాలు.. -
నాగోబా స్కూల్ ప్రారంభం
ఇంద్రవెల్లి: కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మెస్రం వంశ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ నాగోబా ఎక్సలెన్స్ స్కూల్ను శుక్రవారం ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతి దేవి చిత్రపటానికి పూజలు చేశారు. ఈప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికే శ్రీ నాగోబా ఎక్సలెన్స్ స్కూల్ను ప్రారంభించినట్లు మెస్రం వంశీయులు తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ, పేద పిల్లలను నాగోబా స్కూల్లో చేర్పించి ఉచిత విద్యను అందిస్తామన్నారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, కేస్లాపూర్ సర్పంచ్ తుకారం, మెస్రం వంశం ఉద్యోగులు దేవ్రావ్, శేఖర్బాబా, మోనోహర్, సోనేరావ్, వంశపెద్దలు కోసేరావ్, హనుమంత్రావ్, నాగ్నాథ్, భీంరావ్ తదితరులున్నారు. -
సర్కారు బడికి కొత్త అ‘డ్రెస్’
నిర్మల్ఖిల్లా/నిర్మల్రూరల్/మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ, స్థానిక సంస్థల్లోని 1వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల అందరి యూనిఫాం మారింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే కొత్త యూనిఫాం అమలు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఈ.నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న యూనిఫాం రంగుల్లో మార్పులు చేస్తూ కొత్త డిజైన్లను ఖరారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ యూనిఫాం విధానం అమలులోకి రానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్, గురుకుల, కేజీబీవీలు తదితర స్కూళ్లు విద్యార్థుల నూతన రంగుల దుస్తులతో శోభను సంతరించుకోనున్నాయి. పాఠశాలల వారీగా విద్యార్థుల కొలతలు, అవసరమైన గుడ్డ సరఫరా, కుట్టింపు ప్రక్రియలను త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం. సమగ్ర శిక్ష, సెర్ప్, మెప్మా సంస్థల సమన్వయంతో యూనిఫాంల తయారీ, పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇంకా చేరని ముడివస్త్రం పాఠశాలలు ఈ నెల 15న పునః ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ విద్యార్థులకు రెండేసి యూనిఫామ్ జతలు అందిస్తారు. ఇప్పటివరకు జిల్లాలకు యూనిఫామ్ వస్త్రం చేరలేదు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ముడివస్త్రం చేరి అక్కడి నుంచి పాఠశాలలకు చేరాలంటే కనీసం నెలరోజులైన పట్టవచ్చు. దీంతో కొన్ని రోజుల వరకు గత సంవత్సరం యూనిఫాంతోనే విద్యార్థులు బడులకు రావాల్సి ఉంటుంది. నిర్మల్ జిల్లాలో గత సంవత్సరం 47,969 మంది విద్యార్థులకు యూనిఫామ్ను స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టించి అందజేశారు. ఈసారి బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున సుమారు 53,100 మందికి అందించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లాలో గత ఏడాది 761 పాఠశాలల్లో 42,711మంది విద్యార్థులకు మొదట 1,86,723 మీటర్ల ముడి వస్త్రం సరఫరా చేశారు. రెండో దఫా 58,059 మీటర్ల వస్త్రం సరఫరా అయింది. గత ఏడాది వేసవి సెలవులకు ముందే యూనిఫామ్కు అవసరమైన వస్త్రం సరఫరా చేసి సకాలంలో విద్యార్థులకు యూనిఫామ్లు పంపిణీ చేశారు. ఈ ఏడాది వేసవి సెలవులు ముగిసిపోతున్నా ముడివస్త్రం సరఫరాకు నోచుకోలేదు. కొత్తగా పాఠశాలల్లో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు మరింత ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు. ప్రత్యేకతలివే.. విద్యాశాఖ విడుదల చేసిన నమూనాల ప్రకారం బాలురకు లైట్ బ్లూ రంగు షర్ట్, నేవీ బ్లూ రంగు ప్యాంట్/నిక్కర్ ఉండనుంది. బాలికలకు లైట్ బ్లూ టాప్తోపాటు నేవీ బ్లూ స్కర్ట్ లేదా దుస్తులు అమలు చేయనున్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికల యూనిఫాంలో ప్రత్యేక నేవీ బ్లూ వేస్ట్కోట్ను కూడా ప్రవేశపెట్టారు. తరగతుల వారీగా డిజైన్లలో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. -
అధ్యక్షా.. మేముసైతం
నిర్మల్ఖిల్లా: హైదరాబాద్ సచివాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్నేహ మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా చిన్నారులు ప్రతిభ కనబర్చారు. కడెం మండలం కల్లెడ గ్రామానికి చెందిన స్నేహ సంఘం సభ్యురాలు దీటి శ్రీనిజ (8వ తరగతి) డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించి పేదరికంపై అద్భుతంగా ప్రసంగించి అందరి ప్రశంసలు పొందింది. సారంగాపూర్ మండలకేంద్రానికి చెందిన హాసిని ఎంపీగా వ్యవహరించి తన ప్రతిభ చాటుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, అధికారుల సమక్షంలో మాక్ పార్లమెంట్ గురువారం సాయంత్రం నిర్వహించగా ఇందులో పాల్గొన్నారు. వీరిని అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. చిన్నారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతనెల 30న నిర్మల్లో నిర్వహించిన జిల్లాస్థాయి మాక్ పార్లమెంట్లో ఈ చిన్నారులు ప్రతిభ కనబర్చగా కలెక్టర్ భవేశ్మిశ్రా అభినందించారు. -
విద్యారంగానికి ప్రాధాన్యం
బెల్లంపల్లి/తాండూర్: విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే జి.వినోద్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని రాంగనగర్ బస్తీలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. వార్డుల్లో రూ.1.44కోట్ల అంచనాతో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. తాండూర్లో మహాత్మాజ్యోతిబాపూలే వసతిగృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, ప్రహరీలు, మూత్రశాలల నిర్మాణాలతోపాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. సబ్ కలెక్టర్ మనోజ్, మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి, సర్పంచ్ ముడిమడుగుల సురేష్, తహసీల్దార్ జ్యోత్స్న, ఎంపీడీఓ శ్రీనివాస్, ఆర్సీఓ బాలభాస్కర్ పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీల్లో సత్తా
ఆదిలాబాద్: చండీగఢ్లో ఈనెల 10 నుంచి 13 వరకు జరుగుతున్న ‘నేషనల్ క్యాడెట్ జూడో చాంపియన్షిప్ 2026’లో ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పూర్వవిద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జిల్లాకేంద్రంలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో చదువుతున్న మోథం హర్షవర్ధన్ మైనస్ 60 కేజీల విభాగంలో స్వర్ణ పతకం, రమావత్ తరుణ్ మైనస్ 55 కేజీల విభాగంలో కాంస్యం కై వసం చేసుకుని రాష్ట్రకీర్తిని జాతీయ స్థాయిలో చాటారు. త్వరలో జరగనున్న ఏషియన్ క్యాడెట్, వరల్డ్ క్యాడెట్ జూడో చాంపియన్షిప్లో వీరు పాల్గొనే అవకాశం ఉందని కోచ్ రాజు పేర్కొన్నారు. వీరిద్దరి విజయం జిల్లా క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తోందని డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్ తెలిపారు. లక్ష్మణ్కు ఉత్తమ రైతు పురస్కారంతాంసి: మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన రైతు కేమ లక్ష్మణ్ ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో శుక్రవారం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ 62వ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్రవ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, అధికారులు రైతును సన్మానించి పురస్కారం అందజేశారు. వ్యవసాయరంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. గ్రామస్తులు ఆయన్ను అభినందించారు. తనకు సహకరించిన ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రానికి కేమ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. -
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో అమృత్ 2.0 పనులు ఆలస్యం చేయకుండా సత్వరంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ఎమ్మెల్యే జి.వినోద్ అన్నారు. గురువారం బెల్లంపల్లి కన్నాల గ్రామ శివారులో అమృత్ 2.0 అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, కాంగ్రెస్ నాయకులు కారుకూరి రాంచందర్, దావ రమేష్బాబు, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రజల భద్రత.. జీవాల రక్షణ ఎంతో ముఖ్యంబెల్లంపల్లి: ప్రజల భద్రత, జీవాల రక్షణ ఎంతో ముఖ్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గురువారం బెల్లంపల్లి అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో ర్యాపిడ్ రెస్క్యూ టీమ్(ఆర్ఆర్టీ) భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి, జంతు ఘర్షణలను తగ్గించడంలో టీమ్ సభ్యులు ముందుండాలని తెలిపారు. అటవీ సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీవో విజయ్కుమార్, ఎఫ్ఆర్వో పూర్ణచందర్, డెప్యూటీ ఎఫ్ఆర్వో గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్లను ఢీకొట్టిన లారీ
తాండూర్: రెండు ట్రాక్టర్లను లారీ ఢీకొట్టిన ఘటన మండలంలోని బోయపల్లి బోర్డు సమీపంలో జాతీ య రహదారిపై చోటుచేసుకుంది. ఎస్సై ప్రసాద్రావు కథనం ప్రకారం.. తాండూర్ గ్రామం బోయవాడకు చెందిన ముస్కె రాజశేఖర్(19), బొల్లి తిరుపతి ఇద్దరు రెండు ట్రాక్టర్లపై బుధవారం అర్ధరాత్రి సమయంలో మంచిర్యాలలోని ఇసుక రీచ్కు ఇసుక తీసుకువచ్చేందుకు వెళ్తున్నారు. ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాలకు వెళ్తున్న లారీ వేగంగా ఈ రెండు ట్రాక్టర్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముస్కె రాజశేఖర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ట్రాక్టర్ డ్రైవర్ తిరుపతి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతుడి తండ్రి ముస్కె రాజలింగు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కార్మికుల పెన్షన్ పెంచాలని వినతి
శ్రీరాంపూర్: బొగ్గు గని కార్మికుల పెన్షన్ పెంచాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కోరారు. గురువారం హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సమావేశానికి హాజరైన కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన ధరలకు వస్తున్న పెన్షన్ సరిపోవడం లేదన్నారు. కనీసం పెన్షన్ పెంపుదల చేసి ఆర్థిక భద్రత కల్పించాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య చికిత్స అందించే సీపీఆర్ఎంఎస్ కార్డు పరిమితి పెంచాలని కోరారు. వైద్య బిల్లుల రీయింబర్స్మెంట్ సులభతరం చేయాలని, ఇంకా ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. కేంద్ర బొగ్గు సహాయక శాఖ మంత్రి చంద్రు దుబే, సింగరేణి డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్కు ఈమేరకు వినతిపత్రాలు అందజేశారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ.వేణుమాధవ్, ఉపాధ్యక్షుడు కంచ బీరయ్య, కోశాధికారి విజయబాబు పాల్గొన్నారు. -
ఆపన్నహస్తం అందించరూ..
ఖానాపూర్: మండలంలోని బావాపూర్ (కె) గ్రామానికి చెందిన గడుగు శ్రీనివాస్ విద్యుత్ షాక్కు గురై గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు. వైద్యఖర్చులు రూ.లక్షల్లో ఖర్చువుతుండడంతో బాధిత కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. ఈనెల 3న గ్రామంలో గాలిదుమారంతో కూడిన వర్షం కురవడంతో పలుచోట్ల స్తంభాలు కూలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. సరఫరా పునరుద్ధరించే పనుల్లో భాగంగా మరమ్మతు నిర్వహిస్తుండగా శ్రీనివాస్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన కుడిచేతితోపాటు కాలి వేళ్లను కోల్పోయాడు. హైదరాబాద్లోని ఆసుపత్రిలో ఆయన వైద్యానికి కుటుంబీకులు ఇప్పటికే సుమారు రూ.10 లక్షలు వెచ్చించారు. చికిత్సకు ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయని దాతలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆర్థికసాయం అందించాలని కోరుతున్నారు. సాయం చేయదలిచిన వారు గడుగు శ్రీనివాస్ సెల్ నంబర్ 97040 24138 నంబర్లో సంప్రదించవచ్చు. -
విచారణ పారదర్శకంగా నిర్వహించాలి
కాసిపేట: ఫిర్యాదులపై తక్షణమే స్పంది స్తూ విచారణ పారదర్శకంగా నిర్వహించాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. గురువారం మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలు పరిశీలించి రిసెప్షన్, పోలీసు సిబ్బంది పనితీరుపై సమీక్షించారు. రికా ర్డులు, కేసుల వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు నమ్మకం, భరోసా కల్పిస్తూ అండగా నిలువాలని తెలిపారు. ప్రతీ కానిస్టేబుల్ తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజల స మస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ ఎస్సై గంగారాం, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బెల్లంపల్లి నియోజకవర్గంలో..
తాండూర్: కాపువాడ ఎంపీపీఎస్లో అసంపూర్తిగా ఉన్న వంట గది వేమనపల్లి: అసంపూర్తిగా కల్మలపేట పాఠశాల మరుగుదొడ్లు, వంటశాలబెల్లంపల్లి/వేమనపల్లి/తాండూర్/నెన్నెల: బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్నగర్ జిల్లా పరిషత్ ఉర్ధూ మీడియం పాఠశాలలో వంటగది సరిగా లేదు. పైన రేకులు మాత్రమే అమర్చడంతో వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మరుగుదొడ్లకు తలుపులు లేవు. మరుగుదొడ్లు, మూత్రశాలల్లో పిచ్చిమొక్కలు పెరిగాయి. కన్నాలబస్తీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు అధ్వానంగా ఉన్నాయి. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలురకు మూత్రశాలలు నిర్మించాల్సి ఉంది. రాంనగర్బస్తీలో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
నిర్మల్రూరల్: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. మండలంలోని మేడిపల్లి శివారులో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజాము ఈ ఘటన చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై లింబాద్రి కథనం ప్రకారం... ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం గుట్టపక్క తండాకు చెందిన పవర్ జవహర్ సింగ్ (41) డ్రైవర్ లారీలో జొన్నల లోడ్తో సిరికొండ నుంచి సిద్దిపేటకు బుధవారం అర్ధరాత్రి బయల్దేరాడు. తెల్లవారుజామున మేడిపల్లి శివారు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఒక్కసారిగా జవహర్సింగ్ నడుపుతున్న లారీకి మంటలు అంటుకున్నాయి. క్యాబిన్ పూర్తిగా కాలిపోయింది. అందులో చిక్కుకున్న జవహర్సింగ్ మంటల్లో కాలిపోయి మృతిచెందాడు. స్థానికులు గమనించి పోలీసు, ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పి క్యాబిన్లో జవహర్ సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదానికి కారణమైన లారీ పాక్షికంగా కాలిపోయింది. లారీని నిర్లక్ష్యంగా రోడ్డుపై నిలిపి ఎలాంటి పార్కింగ్ లైట్లు వేయకుండా ప్రమాదానికి కారణమైన డ్రైవర్ చెంచు కోటేశ్వర్రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సర్కారు బడికి పోదాం పదా..
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల బలోపే తం, విద్యార్థుల నమోదు పెంపు, విద్యావిశిష్టతను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో రచించిన పాత మంచిర్యాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆడిచర్ల సాగర్ సర్కారు బడికి పోదాం పదా పాట యూట్యూబ్లో అలరిస్తోంది. కృతిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను వినియోగించి రూపొందించిన బడి పాట వీడియో ఆలోచింపజేస్తోంది. గురువారం ఫోరం ఫర్ సోషల్ కన్సర్న్ రాష్ట్ర చైర్మన్ పర్వతి సత్యనారాయణ ఆన్లైన్ ద్వారా అవిష్కరించారు. సర్కారు బడికి పోదాం పదా..పిల్లలకు అమ్మ బడి కదా..స్వేచ్ఛా స్వాతంత్య్రాల లోగిలి.. వారి మనుసుకు అది జాబిలి అంటూ వీడియో చిత్రీకరణ చూపరులను కట్టిపడేస్తోంది. తల్లిదండ్రుల తర్వాత జ్ఞానపు జ్యోతులు వెలిగించే ఉపాధ్యాయుల పిల్లల జీవితాల్లో కీలకపాత్ర వారిదే అంటూ సాగిన పాట ఆలోచింపజేస్తోంది. -
‘మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి’
మంచిర్యాలటౌన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి చెందుతోందని, సంక్షేమం దిశగా పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానిగా మోదీ తన 12ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్నారని, అత్యధిక రోజులు ప్రధానిగా రికా ర్డును సృష్టించారని అన్నారు. మంచిర్యాల అమృత్ భారత్ రైల్వేస్టేషన్ అభివృద్ధి కేంద్రం చేపడుతోందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రా బోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధి కారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, నాయకులు గా జుల ముఖేష్గౌడ్, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్రావు, తుల ఆంజనేయులు, పెద్దపల్లి పురుషోత్తం, కస్తూరి నాగరాజు, బొట్ల అనిత, సంజీవరావు, పట్టి వెంకటకృష్ణ, వైద్య శ్రీధర్, అమిరిశెట్టి రాజ్కుమార్, కుర్రె చక్రవర్తి, మోటపలుకుల తిరుపతి, బెల్లంకొండ మురళి, డేగ బాపు, మోతె సుజాత, నాంపల్లి శ్రీనివాస్, కమలాకర్రావు, కర్రె లచ్చన్న పాల్గొన్నారు.మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్గౌడ్ -
14న తుడుందెబ్బ రాష్ట్ర సమావేశం
ఆదిలాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని కేసీబీ గార్డెన్లో ఈనెల 14న ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేశ్ తెలిపారు. మావల మండలంలోని కుమురం భీంగూడలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ హక్కుల సాధన కోసం వ్యూహాలు, ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు, జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ప్రతినిధులు సకాలంలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెట్టి మనోజ్, రాష్ట్ర కార్యదర్శి అర్క శేషారావు, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గేడం విష్ణు, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం వరుణ్, ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం గణపతి, మావల మండల అధ్యక్షుడు వేడామ ముకుందరావు, నాయకులు తొడసం ప్రకాశ్, కుమ్ర గోవింద్, గోడం మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ గిరిజనులకు వాహనం ఏర్పాటు
జన్నారం: ఇందూరు పోచమ్మ తల్లికి మొక్కు చెల్లించేందుకు ఆదివాసీ గిరిజనుల డీసీఎం వాహనాన్ని ఆర్టీఏ అధికారులు పట్టుకుని పోలీస్టేషన్కు తరలించగా, ఎటు పాలుపోలేని స్థితిలో ఉన్న వారికి మరో వాహనం ఏర్పాటు చేసి జన్నారం ఎస్సై ఉదయ్కిరణ్ ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు గ్రామదేవత ఇందూరు పోచమ్మ తల్లికి మొక్కులు తీర్చుకోవడానికి మూకుమ్మడిగా మల్యాలకు చెందిన సుమారు 50 మంది గిరిజనులు డీసీ ఎం వ్యాను ద్వారా కవ్వాల్కు సామగ్రితో గురువా రం బయల్దేరారు. జన్నారం వచ్చిన ఎంవీఐ.. డీసీ ఎంను తనిఖీ చేయగా పత్రాలు లేకపోవడంతో వ్యా న్ను పోలీసుస్టేషన్కు తరలించారు. స్టేషన్ ఎదురుగా గంటపాటు సామగ్రితో గిరిజనులు కూర్చున్నారు. ఎస్సై ఉదయ్కిరణ్ వెంటనే మరో డీసీఎం తెప్పించి, వారిని పోచమ్మ ఆలయానికి పంపించారు. ఎస్సైకి గిరిజనులు ధన్యవాదాలు తెలిపారు. -
కస్టడీలో ఉన్న ధాన్యం లారీ వదిలేయాలి
కోటపల్లి: మండలంలోని రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు మీదుగా ధాన్యం తరలిస్తున్న ఆరు లారీలను అధికారులు పట్టుకున్నారు. కాని ఒక్కలారీని వదిలేయాలని ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం రాత్రి మహారాష్ట్ర నుంచి ధాన్యపు లారీలు మధ్యప్రదేశ్ వెళ్తుండగా చెక్పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేశారు. మహారాష్ట్ర రాజ్య ఆదివాసీ వికాస్ పేరిట టెండర్ వేసి ఆరు లారీలతో ధాన్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కటి మాత్రమే పోలీసు కస్టడీ అప్పగించి మిగిలినవి జాతీయ రహదారిపై నిలిపివేశారు. అయితే కస్టడీలో ఉన్న లారీని వదిలేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఒక్క ధాన్యం లారీని మహారాష్ట్ర(కే) పంపేలా గురువారం రాత్రి ఆదేశాలు జారీ అయింది. వాహనాలపై ఎలాంటి కేసులు లేకుండా పంపడం కొసమెరుపు. -
పది అంశాలు.. 99రోజులు..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్ శుక్రవారంతో ముగియనుంది. పది అంశాలతో మార్చి 6 నుంచి జూన్ 12వర కు సాగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై అవగాహన కల్పించడంతో పాటు లబ్ధిదారుల ఎంపిక తదితర వాటి పై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు పాల్గొంటూ వార్డు స్థాయి నుంచి మొదలు, గ్రామ, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ పథకాలపై దృష్టిరాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలుపై ప్ర త్యేక దృష్టి సారించింది. సభలు, సమావేశాల నిర్వహణతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించింది. ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రజలను భాగస్వామ్యం చేయడంతో పథకాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. 99రోజుల్లో పది అంశాలపై ఆయా శాఖల అధికారులు కార్యక్రమాలు నిర్వహించారు. పలు చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులపై నిరసన వ్యక్తమైంది. వారోత్సవాల నిర్వహణఒక్కో అంశం వారోత్సవాలు నిర్వహించా రు. పచ్చదనం, పరిశుభ్రతలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో ఇంటింటా పచ్చదనం పెంచ డం, తడిపొడి చెత్త వేరు చేయడం, వ్యర్థాలను తిరిగి వాడేలా చేయడం, ప్లాస్టిక్ నిషేధం, మురికి కాలువలు, పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పించారు. -
బైకులు ఢీకొని ముగ్గురికి గాయాలు
లక్ష్మణచాంద: మండలంలోని పార్పెల్లి–ధర్మా రం గ్రామాల మధ్య రెండు బై కులు ఎదురెదురుగా ఢీకొని ము గ్గురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగాపూర్కు చెందిన ఓరుగంటి నర్సయ్య(65) భార్య సునీత(45) పుట్టింటి వారు ధర్మారం పోచమ్మ వద్ద పండుగ చేస్తున్నారని గురువారం పార్పెల్లికి బైక్పై వ స్తున్నారు. పార్పెల్లికి చెందిన కందుకూరి హ రీశ్(35) ధర్మారం పోచమ్మ ఆలయానికి వెళ్లేందుకు బైక్పై వస్తుండగా ఎదురెదురుగా ఢీకొ న్నాయి. ఈప్రమాదంలో నర్సయ్య తలకు తీవ్ర గాయాలు కాగా, సునీత స్వల్పంగా, హరీశ్ తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పైలట్ నవీన్కుమార్, ఈఎంటీ దీపక్లు క్షతగాత్రులను అంబులెన్స్లో నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. నర్సయ్యకు మెరుగైన వైద్యం నిజామాబాద్కు పంపించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. హరీశ్, సునీతలు నిర్మల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓరుగంటి నర్సయ్య బావ మేడిపెల్లి నర్సయ్య ఫిర్యాదుతో హరీశ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణి తెలిపారు. -
పురాతన యుద్ధవీరుని శిల్పం లభ్యం
నిర్మల్ఖిల్లా: పట్టణంలోని గాజులపేట్ సమీప పంటపొలాల్లో గురువారం మధ్యయుగ కాలానికి చెందిన పురాతన యుద్ధవీరుని శిల్పం లభ్యమైనట్లు జిల్లాకు చెందిన యువకవి, కళాకారుడు పోలీస్ భీమేశ్ తెలిపారు. సుమారు 12వ లేదా 14వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న ఈ శిల్పం నాలుగు అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు కలిగి ఉందని పేర్కొన్నారు. యోధుని రూపాన్ని అద్భుతంగా చెక్కినట్లు తెలిపారు. తలపై ముడిచిన కురులు, పెద్ద కళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కుడిచేతిలో ఖడ్గం, ఎడమచేతిలో డోలు ధరించి ఉందన్నారు. శిల్పానికి ఎదురుగా సుమారు నాలుగు అడుగుల ఎత్తు గల రాతి దీపస్తంభం ఉన్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో ఇలాంటి వీరగళ్లు శిల్పాలు ఉన్నాయని, పురావస్తు శాఖ గుర్తించి అధ్యయనం చేసి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. నలుగురు ఎస్సైల బదిలీగోదావరిఖని: కాళేశ్వరం జోన్పరిధిలో నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ రామగుండం సీపీ అంబర్కిశోర్ఝా ఆదేశాలు జారీ చేశారు. సీసీఎస్ మంచిర్యాలలో పనిచేస్తున్న కె.నరేశ్ను ఎస్హెచ్వోగా పెద్దపల్లికి బదిలీ చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి ఎస్హెచ్వో ఎన్.మధూకర్ను సీసీఎస్ రామగుండం కమిషనరేట్కు బదిలీ చేశారు. ములుగు జిల్లా డీఎస్బీ ఎస్ఐగా పనిచేస్తున్న యు.ఉపేందర్రావును సీసీఎస్ రామగుండం, ఇటీవలే పెద్దపల్లి ఎస్హెచ్వోగా బదిలీ అయిన బి.జీవన్ను సీసీఎస్ పెద్దపల్లికి బదిలీ చేశారు. -
వడ్డీంచిన పచ్చధనం
రెబ్బెన: బొగ్గు ఉత్పత్తితో దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణలోనూ తన వంతు బాధ్యత నిర్వహిస్తోంది. ఓపెన్ కాస్టు ప్రాజెక్టుల ఏర్పాటుతో ధ్వంసమైన పచ్చదనాన్ని తిరిగి పెంపొందిస్తోంది. ఉత్పత్తి అనంతరం మూసివేసిన గనులపై విస్తృతంగా మొక్కలు పెంచుతూ పర్యావరణ పరిరక్షణ, భూ సంరక్షణ, పునరుద్ధరణకు పాటుపడుతోంది. ఈ క్రమంలో బొగ్గు గనుల నిర్వహణతోపాటు గనుల మూసివేత అనంతరం చేపట్టాల్సిన పర్యావరణ పరిరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించడంతో సింగరేణి సంస్థకు రూ.40 కోట్లు ఎస్క్రో డిపాజిట్ తిరిగి రానుంది. డోర్లి– 2 గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీతో కలిసి చెల్లించేందుకు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఆమోదం తెలిపింది. అడవిని తలపిస్తున్న ‘డోర్లి–2’ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని బెల్లంపల్లి ఏరియా డోర్లి– 2 ఓసీపీకి 2013– 14లో బొగ్గు తవ్వకాలకు అనుమతులు లభించాయి. ఆ సమయంలో గని నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, చర్యల కోసం అంచనా వ్యయం రూ.29.79 కోట్లను సింగరేణి యాజమాన్యం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ పేరుతో డిపాజిట్ చేసింది. ఏడేళ్లపాటు డోర్లి– 2లో బొగ్గు ఉత్పత్తిని చేపట్టి 2023–24లో మూసివేసింది. బొగ్గు ఉత్పత్తిని చేపట్టిన తర్వాత గనిని అలాగే వదిలేయకుండా కేంద్రం నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టింది. గని ప్రారంభ సమయంలో ఆ ప్రాంతంలో 162.517 హెక్టార్లలో అటవీప్రాంతం ఉండగా.. గని ఏర్పాటుతో కనుమరుగైంది. గని మూసివేసిన తర్వాత 162 హెక్టార్ల మేర మొక్కలు నాటి తిరిగి అడవిని మరిపించేలా పెంచింది. అలాగే 19.76 క్యూబిక్ మీటర్ల మేర భూమి పైపొర మట్టిని భద్రపర్చి దాన్ని డంపింగ్ యార్డులపై పర్చి మొక్కలు పెంచింది. గని మూసివేతకు సంబంధించి 2024 జూలైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ప్రత్యేక అడిట్ నిర్వహించింది. అన్ని నిబంధనలను సింగరేణి అమలు చేసినట్లు నివేదించింది. డిప్యూటీ అసిస్టెంట్ కోల్ కంట్రోలర్ ఆకాశ్ శివహరే సింగరేణి జమ చేసిన ఎస్క్రో డిపాజిట్కు వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తున్నట్లు సింగరేణి యాజమాన్యానికి లేఖ రాశారు. చెల్లించాల్సిన మొత్తంలో 90 శాతం రూ.36.63 కోట్లను ప్రస్తుతం విడుదల చేస్తున్నట్లు, మిగిలిన 10 శాతం జస్ట్ ట్రాన్సిషన్ ప్రొవిజన్ అంశాల పరిశీలన అనంతరం విడుదల చేయనున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యానికి వడ్డీతో కలిపి దాదాపు రూ.40 కోట్లు అందనున్నాయి. చేపట్టిన చర్యలివే.. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లి–2 ఓసీపీ ఏర్పాటులో డోర్లి, దంతన్పల్లితోపాటు మరికొన్ని గ్రామాలు ముంపునకు గురికాగా 162.517 హెక్టార్ల అటవీ భూమిని సేకరించి మైనింగ్ చేపట్టారు. గని తవ్వకానికి ముందు ఆ ప్రదేశంలో ఉన్న సారవంతమైన భూమి పైపొర మట్టిని సుమారు 19,76 క్యూబిక్ మీటర్ల మేర తవ్వి వేరే చోట భద్రపర్చారు. ఓవర్ బర్డెన్ డంపులపై తిరిగి పర్చి ఈ మట్టిని పర్చి మొక్కలు పెంచారు. యాజమాన్యం చేపట్టిన ఈ చర్యలతో డోర్లి ఓబీ డంపుల మీద దట్టమైన అడవిగా ప్లాంటేషన్ ఏర్పడింది. అలాగే సీహెచ్పీ, కోల్ బంకర్ల వద్ద మిస్ట్ స్పేయర్లను ఏర్పాటు చేసింది. హాల్ రోడ్లకిరువైపులా పెద్దఎత్తున మొక్కలను నాటి గ్రీన్ బెల్ట్లు ఏర్పాటు చేశారు. జల కాలుష్యం జరగకుండా ఓసీపీ చుట్టూ పది కిలోమీటర్ల మేర గార్ల్యాండ్ డ్రెయినేజీ ఏర్పాటు చేయడంతో పాటు రెండు చెక్డ్యాంలను నిర్మించారు. వాతావరణ కాలుష్యం జరగకుండా డ్రిల్ మిషన్ల వద్ద డస్ట్ కలెక్టర్లను ఏర్పాటు చేసింది. వెట్ డ్రిల్లింగ్ నిర్వహించి వాటర్ స్ప్రింక్లర్లను వినియోగించారు. కోల్ బంకర్లు, సీహెచ్పీల వద్ద మిస్ట్ స్పేయర్లను ఏర్పాటు చేశారు. మూసివేసిన గని పరిసరాల్లోకి మనుషులు, పశువులు ప్రవేశించకుండా చుట్టూ రక్షణ కంచెను ఏర్పాటు చేసి, సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. మైన్క్లోజర్ ప్లాన్, భూ సంరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేశారు. -
అటవీప్రాంత అభివృద్ధికి కృషిచేయాలి
చెన్నూర్రూరల్: అటవీప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అని రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని కిష్టంపేట సమీపంలోని అంబేద్కర్ పా ర్కులో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అటవీశాఖ అధికారి రాహూల్ కిషన్ జాదవ్, చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ తివారితో కలిసి హాజరయ్యారు. ముందుగా మొక్కలు నాటారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. భా వితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించ డం కోసం అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈప్రాంతంలోని మొసళ్ల పార్కును ఇతర ప్రాంతాల పర్యాటకుల కోసం తీ ర్చిదిద్దుతామన్నారు. తద్వారా పర్యాటక ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రజ ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. రైతుల శ్రేయస్సు కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. చె న్నూర్లో త్వరలో వంద పడకల ఆసుపత్రిని ప్రా రంభిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మా ట్లాడారు. అటవీ అభివృద్దిలో భాగంగా ప్రతి ఒక్క రు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. -
చెన్నూర్ నియోజకవర్గంలో..
చెన్నూర్/చెన్నూర్రూరల్/మందమర్రిరూరల్/కోటపల్లి: చెన్నూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల, ప్రాథమిక పాఠశాలలో మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా ఐదు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. రెండేళ్లయినా పనులు ముందుకు సాగలేదు. విద్యార్థుల్లో ఇరుకు గదుల్లో పాఠాలు వినాల్సిన దుస్థితి నెలకొంది. హరిజనవాడ ప్రాథమిక పాఠశాల ప్రహరీ కూలిపోయింది. మందమర్రి మండలం చిర్రకుంట గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.2లక్షలు కేటాయించి టెండర్ పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదు. కోటపల్లి: పార్పల్లి ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న కుళాయిలుచెన్నూర్: జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పూర్తి కాని తరగతి గదులు -
లక్ష్యం దాటని తునికాకు
కోటపల్లి: చెన్నూర్ ఫారెస్టు డివిజన్ పరిధిలో ఈ ఏడాది తునికాకు సేకరణ లక్ష్యం దాటలేదు. అటవీశాఖ నిర్దేశించిన లక్ష్యానికి కన్నా తక్కువ 50 శాతం మాత్రమే సేకరించారు. చెన్నూర్ అటవీ డివిజన్ పరిధిలో తునికాకు యూనిట్లలో మే రెండోవారం నుంచి అధికారులు ఆకు సేకరణ ప్రారంభించారు. కొన్ని యూనిట్లలో మొదటి వారంలో ప్రారంభం కాగా, మరికొన్నింటిని మూడో వారంలో మొదలైంది. ఉపాధి పనులకు వెళ్లడం, ఎండ తీవ్రతతో ఆదివాసీలు, ఇతర కూలీలు సేకరణకు ఆసక్తిచూపలేదు. దీంతో ఆకు సేకరణ తగ్గినట్లు అటవీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే గతంలో ఆకు సేకరణ ప్రారంభించిన పదిరోజుల్లోనే తునికాకు కట్టలు కల్లాల వద్ద నిండిపోయేవి. లక్ష్యంలో 40 శాతం వరకు పూర్తయ్యేది. ఈసారి మే 31తో ఆకుసేకరణ ముగిసినప్పటికి..ప్రభుత్వం ఆశించిన మేర లక్ష్యాన్ని చేరుకోలేదు. 10,600 ఎస్బీల లక్ష్యం.. చెన్నూర్ ఫారెస్టు డివిజన్ పరిధిలో 10,600 స్టాండర్డ్ బ్యాగులు(ఎస్బీ) ఆకు సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. సీజన్ ముగిసే సమయానికి కోటపల్లి రేంజ్ పరిధిలోని పార్పల్లి యూనిట్ టార్గెట్ 3 వేల యూనిట్లు ఉండగా కేవలం 1,398 బ్యాగులు మాత్రమే సేకరించారు. చెన్నూర్ పరిధిలో 5129.68 బ్యాగులను సేకరించారు. చెన్నూర్లో రెండు కన్నెపల్లి, భీమారం, కోటపల్లిలో పార్పల్లి, నీల్వాయిలో మూడు బద్దంపల్లి, మైలారం, నీల్వాయి మొత్తం ఆరు యూనిట్లలో సేకరణ జరిగింది. సుమారు కేవలం 50 శాతం మాత్రమే. గతేడాది సుమారు నిర్దేశించిన 62 శాతం లక్ష్యానికి ఈసారి ఆకుసేకరణ జరగలేదు. గతం కన్నా తగ్గింది గతం కన్నా ఈసారి తక్కువగా తునికాకు సేకరణ జరిగింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మన వద్ద ఆకు నాణ్యతగా ఉంటుంది. ఆకులు సేకరించి వారి వివరాలు ఆన్లైన్ చేశాం. డబ్బులు త్వరలోనే వారి ఖాతాలో జమవుతుంది. – సదానందం, ఎఫ్ఆర్వో కోటపల్లి -
ఓటర్ల పేర్ల తొలగింపును అడ్డుకోవాలి
రామకృష్ణాపూర్: ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ‘సర్’ ముసుగులో ఓటర్ల తొలగింపునకు జరుగుతున్న కుట్రలను బూత్ స్థా యి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి తిపికొట్టాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి పిలుపునిచ్చారు. క్యాతనపల్లి ము న్సిపాలిటీలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్లో గురువారం ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా(ఎస్ఐఆర్)పై బూ త్ స్థాయి ఏజెంట్ల అవగాహన కార్యక్రమంలో మంత్రి వివేక్వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ప్రభుత్వం ‘సర్’ పేరుతో కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలను బలహీనపర్చడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ఓటర్ల పేర్ల తొలగింపునకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ వేస్తే తిరస్కరించి ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాతర వేసిందని విమర్శించారు. నీట్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీల వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేరు భద్రంగా ఉండేలా బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో వెనుకబడి
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మన ఊరు–మన బడి పనులు అసంపూర్తిగా నిలిచిపోగా.. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు కొనసాగుతూ ఉన్నాయి. 2022–23లో చేపట్టిన మన ఊరు–మన బడి పనులపై ఊసే లేకపోగా.. బిల్లులు రాక కాంట్రాక్టర్ల అనాసక్తితో పనులు నిలిచిపోయాయి. 245 బడుల్లో పనులకు కలెక్టర్ ఆమోదం లభించగా.. మొదట్లో పనులు చక చక సాగినా ఆ తర్వాత 123 పాఠశాలల్లో పనులు ముందుకు సాగడం లేదు. పది శాతం మేర పనులు పూర్తి చేస్తే వినియోగంలోకి వచ్చే అవకాశాలున్నాయి. రూ.24 కోట్ల 26లక్షల 33వేలు విలువైన పనులు చేసినట్లు మెజర్మెంటు బుక్(ఎంబీ) న మోదు చేయగా.. రూ.18కోట్ల 53లక్షల 96వేలు చెల్లించినట్లు తెలుస్తోంది. పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలల్లో రూ.21కోట్ల 58లక్షల 70వేలతో పనులు పనులు చేపట్టారు. 545 పాఠశాలల్లో 476 పనులు పూర్తి చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యు త్ సౌకర్యం, చిన్న మరమ్మతులు సాగుతున్నాయి. 69 పాఠశాలల్లో పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. దాదాపు 210 పాఠశాలల్లో ప్రహరీ, 280కు పైగా వంట గదుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. గదుల కొరత మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న స్టేషన్రోడ్ పాఠశాలలో గదుల కొరత ఉంది. మూడు గదులు ఉండగా.. నలుగురు ఉపాధ్యాయులు ఐదు తరగతులకు బోధిస్తున్నారు. ఇటీవల ప్రీప్రైమరీ పాఠశాల మంజూరు కాగా ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గదిలో విద్యార్థులు ఇరుకుగా కూర్చుని చదువుకుంటుండగా.. ప్రీ ప్రైమరీ విద్యార్థులను ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియని పరిస్థితి. సైన్స్ సెంటర్పై ఖాళీగా ఉన్న యువజన క్రీడాధికారి, వయోజన విద్య కార్యాలయాల గదులను కేటాయిస్తే విద్యార్థులకు ప్రయోజనకరంగా మారుతుంది. మండల విద్యావనరుల కేంద్రం భవనంలో స్పోర్ట్స్ పేరిట గదిని ఖాళీగా ఉంచారు. నూతనంగా నిర్మిస్తున్న భవనం త్వరగా పూర్తి చేస్తే భవిత కేంద్రం గది కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. భవిత సెంటర్ పూర్తి చేస్తే అక్కడ ఓ గదిలో ప్రీప్రైమరీ, జిల్లా సైన్స్ సెంటర్పై రెండు గదులు అప్పగిస్తే విద్యార్థులకు సౌకర్యంగా మారనుంది. నస్పూర్/లక్సెట్టిపేట: నస్పూర్లోని సంఘం మల్ల య్యపల్లి ఎంపీపీఎస్లో వంటగది అసంపూర్తిగా ఉంది. మోటార్ బిగించకపోవడంతో బోర్వెల్ నిరుపయోగంగా మారింది. కేజీబీవీ లో డైనింగ్ హాల్, అదనపు తరగతి గదుల ని ర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆవరణ లో పిచ్చిమొక్కలు పెరిగి ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. మంచిర్యాలలోని హమాలీవాడలో నిలిచిన అదనపు తరగతి గదుల నిర్మాణం -
కారు, లారీపై పడిన వృక్షం
ఉట్నూర్రూరల్: మండలంలోని హర్కాపూర్ సమీపంలో బుధవారం ఒక ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఒక భారీ వృక్షం ఒక్కసారిగా ప్రయాణిస్తున్న కారు, లారీపై పడింది. ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ –ఆదిలాబాద్ ప్రధాన రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తులు మంటలు పెట్టారు. దీంతో ఆ చెట్టు లోపల పూర్తిగా కాలిపోయి, బలహీనపడి ఒక్కసారిగా రోడ్డుపై కూలిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక లారీ, కారుపై ఆ భారీ వృక్షం పడింది. అడ్డుగా లారీ ఉండడంతో కారులో ఉన్న వారికి పెద్ద ప్రమాదం తప్పింది. బాధ్యతారాహిత్యంగా చెట్లకు మంటలు పెట్టడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అర్హులైన కుటుంబాలకు సంక్షేమ ఫలాలు
చెన్నూర్: అర్హులైన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. బుధవారం ఆయన చెన్నూర్లో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించి, పాత మార్కెట్ కార్యాలయంలో బస్తీ దవాఖానాను ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ బీపీ చెక్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి చెక్కులు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానాను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, వైద్యులు సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. జర్మన్ భాష నేర్చుకుని ఉద్యోగాలు పొందండి మందమర్రిరూరల్: నిరుద్యోగ యువత జర్మన్ భాష నేర్చుకుని ఆ దేశంలో ఉద్యోగావకాశాలు పొందాలని రాష్ట్ర మంత్రి వివేక్వెంకటస్వామి అన్నారు. మందమర్రి పట్టణంలోని ఇల్లందు క్లబ్ ఆవరణలో బుధవారం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపనీ లిమిటెడ్, ఉపాది, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జర్మన్ భాష శిక్షణ కేంద్రాన్ని కమిషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ కాంతి వెస్లీ, అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ రేఖారాణి, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ రమేష్బాబు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ నాగభారతి, ఏరియా జీఎం రాధాకృష్ణ తదితరులతో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ శిక్షణలో 112 మంది యువకులు ఉన్నారని, మూడు నెలలపాటు శిక్షణ కాలంలో కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా రూ.1000 స్టైఫండ్ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ రాము, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి రవికృష్ణ, తహసీల్దార్ సతీష్కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, డీజీఎం(పర్సనల్) అశోక్కుమార్ పాల్గొన్నారు. -
వెదురు కళాకృతులు అద్భుతం
జన్నారం: వెదురుతో గిరిజన మహిళలు తయా రు చేసిన కళాకృతులు అద్భుతంగా ఉన్నాయని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం జన్నారం అటవీ డివిజన్ ఇందన్పల్లిలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యాలయ ఆవరణలో జిల్లా అటవీ అధికారి రాహుల్కిషన్ జాదవ్తో కలిసి మొక్కలు నాటారు. గిరిజన మహిళలు తయారు చేసిన వెదురు ఉత్పత్తులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కవ్వాల్ వెదురు ఉత్పత్తుల శిక్షణ కేంద్రంలో నిరుద్యోగులు జీవనోపాధి పొందాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుకపై ఆంక్షలు లేకుండా చూడాలని అధికారులకు సూచించా రు. ఈ సమావేశంలో ఎఫ్డీవో రామ్మోహన్, రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ, మార్కెట్ కమి టీ చైర్మన్ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందునాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇసాక్, కార్యదర్శి ముజాఫర్ అలీఖాన్ పాల్గొన్నారు. -
ఉన్నత విద్యకు ‘లక్ష్మీ’ కటాక్షం
ఆదిలాబాద్: పేదరికం, ఆర్థిక సమస్యలతో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘పీఎం విద్యాలక్ష్మి’ పథకానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర విద్యా, ఆర్థిక, మానవ వనరుల శాఖలు, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్తో ఈ పథకానికి సంబంధించిన పోర్టల్ను ప్రత్యేకంగా రూపొందించాయి. ఈ పోర్టల్ ద్వారా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సుమారు 90 రకాల విద్యా రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి ఆస్తులు, పూచీకత్తు లేకుండానే బ్యాంకుల నుంచి రుణ సాయం పొందే వెసులుబాటు ఉంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకోవాలనే నిరుపేద, బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. రూ.10 లక్షల వరకు.. ఈ పథకం ద్వారా విద్యార్థులకు వారి కోర్సు ఫీజుకు అనుగుణంగా మూడు వేర్వేరు విభాగాల్లో రుణాలు మంజూరు చేస్తారు. రూ.4 లక్షల లోపు, రూ.4 లక్షల నుంచి రూ. 7.50 లక్షల వరకు, రూ. 7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అవసరమైన మొత్తాన్ని ఎంపిక చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ రుణాలు పొందేందుకు ఎలాంటి నిర్దిష్ట గడువు తేదీ లేదు. విద్యార్థులు ఏడాది పొడవునా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కుటుంబం నుంచి కేవలం ఒక్కరికి మాత్రమే ఈ పథకంలో అవకాశం కల్పిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.9 లక్షల కంటే తక్కువగా ఉండాలి. గరిష్టంగా రూ.7.5 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ పథకంలో రూ.10 లక్షల వరకు తీసుకునే రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. రుణాలకు కేంద్ర ప్రభుత్వమే పూచీకత్తుగా (గ్యారెంటీగా) వ్యవహరిస్తుండటంతో, బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఈ రుణం కేవలం ట్యూషన్ ఫీజుకే పరిమితం కాకుండా, హాస్టల్ ఖర్చులు, పరీక్షల ఫీజులు, ల్యాబ్ ఫీజులు, పుస్తకాలు, ఇతర విద్యాసామగ్రి కొనుగోలు వంటి అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. కరువైన ప్రచారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యాలక్ష్మి పథకంపై అవగాహన, ప్రచార కార్యక్రమాలు కరువయ్యాయి. క్షేత్రస్థాయిలో బ్యాంకులు, విద్యా శాఖ నిర్లక్ష్యం కారణంగా పథకంపై ఎవరికీ సరిగ్గా తెలియదు. అర్హులైన విద్యార్థులు సమాచారం అందక ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. పూచీకత్తు లేని రుణాలు, వడ్డీ రాయితీల గురించి తెలియక మధ్యతరగతి, పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అందించే విద్యాలక్ష్మి రుణాలకు దూరమవుతున్నారు. అధికారులు, బ్యాంకులు క్షేత్రస్థాయిలో ప్రచారం కల్పించకపోతే, మారుమూల ప్రాంతాల ప్రతిభావంతులు వెనకబడిపోయే ప్రమాదం ఉంది. దరఖాస్తు చేసుకోండిలా..విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ ( https:// pmvidyalaxmi. co. in/ Index. aspx) లో విద్యార్థి పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్, చిరునామా వివరాలతో నమోదు చేసుకోవాలి. అనంతరం ఈ పోర్టల్లో ఉన్న వివిధ బ్యాంకు రుణ పథకాలను పరిశీలించి తమకు నచ్చిన బ్యాంకును ఎంచుకోవాలి. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మార్కుల జాబితా, కోర్సు సంబంధిత పత్రాలు, అడ్మిషన్ లెటర్ జత చేయాలి. అనంతరం ఎంచుకున్న బ్యాంకులో అకౌంట్ తెరిచి ఆ వివరాలను నమోదు చేసి, రుణ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఇలా దరఖాస్తు చేసిన తర్వాత, దాని పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే పరిశీలించవచ్చు. పోర్టల్లో నమోదైతేనే.. ఇంజినీరింగ్, మెడిసిన్, లా, మేనేజ్మెంట్, టెక్నికల్, సైంటిఫిక్, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఆర్కిటెక్చర్, బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఎంఏ, పరిశోధన కోర్సులతో పాటు, సీఏ, సీఎస్ వంటి డిగ్రీలను పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. దేశంలోని 1000కి పైగా ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశం పొందిన వారికి ఈ పథకం వర్తిస్తోంది. అయితే ఈ ఉన్నత విద్యా సంస్థలు విద్యాలక్ష్మి పోర్టల్లో నమోదై ఉండాలి. -
‘మోదీ పాలనలో అభివృద్ధి’
మంచిర్యాలటౌన్: ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు పరిపాలనలో దేశం ప్రపంచంలోనే అభివృద్ధి దిశగా పయనిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు పాలన సందర్భంగా బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం మోదీ చిత్రపటంతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, నాయకులు దుర్గం అశోక్, రంగ శ్రీశైలం, అమిరిశెట్టి రాజ్కుమార్, సత్రం రమేశ్, కుర్రె చక్రవర్తి, వంగపల్లి వెంకటేశ్వర్రావు, ఎనగందుల కృష్ణమూర్తి, గోలి రాము, మాధవరపు రమణరావు, కస్తూరి నాగరాజు, బొట్ల అనిత పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదంలో గడ్డివాము దగ్ధం
దస్తురాబాద్: అగ్ని ప్రమాదంలో గడ్డివాము దగ్ధమైన ఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుట్టాపూర్ గ్రామ పంచాయతీలోని చెన్నూర్ గ్రామానికి చెందిన దాసరి సుధాకర్ పశువుల మేత కోసం ఇంటి పరిసర ప్రాంతంలో గడ్డి నిల్వ చేశారు. ప్రమాదవశాత్తు గడ్డికట్టలకు నిప్పు అంటుకోగా స్థానికులు గమనించి మంటలు అర్పే ప్రయత్నం చేశారు. హుటాహుటిన జన్నారంలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా సకాలంలో ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 3వేల వరకు గడ్డి కట్టలు అగ్నికి అహుతయ్యాయని బాధిత రైతు వాపోయాడు. -
అప్పులు తీర్చలేనన్న బెంగతో..
కుంటాల: అప్పులు తీర్చలేనన్న బెంగతో లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామానికి చెందిన కామొల్ల రాములు(42) ఉరేసుకొని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఎస్సై సిరివేని అశోక్ కథనం ప్రకారం.. రాములు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. అప్పుల బాధ భరించలేక మంగళవారం రాత్రి కల్లూరు గ్రామ శివారులోని వైన్స్ వెనుక చెట్టుకు తన ప్యాంటుతో ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కొన ఊపిరితో ఉన్న ఆయనను 108 వాహనంలో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రాములు భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. -
మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్య
దహెగాం: పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పెసరికుంట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై చుంచు రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెసరికుంట గ్రామానికి చెందిన రాంటెంకి జ్యోత్స్న (17) కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన తన అక్క సంగీత (పెద్దమ్మ కూతురు) భర్త కత్తెర్ల అరుణ్తో అప్పుడప్పుడు ఫోన్లో చాటింగ్ చేస్తూ మాట్లాడేది. అక్క– బావల ఇంటికి తరచూ వెళ్లి వచ్చేది. జ్యోత్న్స తనతో చాటింగ్ చేస్తుందనే విషయాన్ని అరుణ్ భార్య సంగీతకు తెలిపాడు. దీంతో సంగీత ఈనెల 4న తన తల్లి కమలతో కలిసి పెసరికుంట గ్రామానికి వచ్చి జ్యోత్స్నను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారు. ఈనెల 7వ తేదీన మరోసారి బాలికపై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక అదేరోజు సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. బాలిక తండ్రి రాంటెంకి లస్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
దరఖాస్తుల వెల్లువ
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు అభ్యర్థుల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఖాళీలు తక్కువగా ఉన్నా దరఖాస్తులు వెల్లువెత్తడంతో ఉపాధి అవకాశాలపై ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా 72 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అమలు చేస్తోంది. బోధనకు ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ నెల 8వరకు ఆయా పాఠశాలల్లో దరఖాస్తులు స్వీకరించారు. 72 చొప్పున ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులు ఉండగా.. ఇన్స్ట్రక్టర్ పోస్టులకు 1893 మంది, ఆయా పోస్టులకు 378మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇన్స్ట్రక్టర్కు నెలకు రూ.8వేలు, ఆయాలకు నెలకు రూ.6వేలు గౌరవ వేతనం చెల్లిస్తారు. పూర్వ ప్రాథమిక విద్య కోసం.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2026–27 విద్య సంవత్సరానికి పూర్వ ప్రాథమిక విద్య కోసం 72 ప్రీ ప్రైమరీ సెక్షన్ల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మూడేళ్ల వయస్సు పిల్లలను చేర్చుకుంటారు. ప్రతీ పాఠశాలకు రూ.లక్ష నిధులు కేటాయించింది. చిన్నపాటి మరమ్మతులు, పర్నిచర్, ఇండోర్–అవుట్డోర్ ఆట సామగ్రి, బాల పెయింటింగ్స్ సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు వచ్చాయి. త్రిసభ్య కమిటీ ద్వారా ఎంపిక.. ప్రతీ పాఠశాల పరిధిలో స్థానికులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల అభ్యర్థుల ఎంపికకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఎంఈవో, ఎంపీడీవో, ఐసీడీఎస్ సూపర్వైజర్ లేదా సీడీపీవో సభ్యులుగా ఉంటారు. అభ్యర్థుల మార్కుల ఆధారంగా ఇన్స్ట్రక్టర్ల నియామకం జరగనుంది. డీఈడీ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. అర్హతలు, మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికతపై అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయా పోస్టులకు ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చిన ఏడో తరగతి మార్కుల పట్టికను క్షుణ్ణంగా పరిశీలించాలని అభ్యర్థులు కోరుతున్నారు. త్రిసభ్య కమిటీ దరఖాస్తుల వడపోత చేపట్టి ఒకటి రెండు రోజుల్లో జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి జాబితాను అందజేయనున్నారు. ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇన్స్ట్రక్టర్ పోస్టుకు మందమర్రి మండలంలో అత్యధికంగా 297 దరఖాస్తులు రాగా తర్వాత స్థానంలో బెల్లంపల్లి మండలంలో 258, నస్పూర్లో 213, మంచిర్యాలలో 176 దరఖాస్తులతో మూడంకెలు దాటాయి. ఆయా పోస్టుకు మందమర్రి మండలంలో 65, బెల్లంపల్లిలో 37, నెన్నెలలో 37, కోటపల్లిలో 35, నస్పూర్ మండలంలో 34 దరఖాస్తులు అందాయి. -
గంజాయి లభ్యం.. ఏడుగురు అరెస్ట్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండల కేంద్రంలో బుధవారం పోలీసులు గంజాయి కలిగి ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హాజీపూర్ ఎస్సై కిరణ్కుమార్ కథనం మేరకు.. మండల కేంద్రంలో నార్కోటిక్ టీం, డాగ్తో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొందరి వద్ద డాగ్ సింబ అనుమానాస్పదంగా వ్యవహరించింది. వెంటనే వారిని తనిఖీ చేయగా 74 గ్రాముల 19 గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ సెంటర్లో చోరీబాసర: మండలంలోని బిద్రెల్లిలో మంగళవారం దొంగలు హల్చల్ చేశారు. గురుకృప ఆన్లైన్ మల్టీసర్వీస్ సెంటర్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కౌంటర్ నుంచి రూ.4వేల నగదు ఎత్తుకెళ్లినట్లు సీఐ దీపక్ తెలిపారు. బుధవారం క్లూస్టీం వచ్చి ఆధారాలను సేకరించిందని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ వెల్లడించారు. విద్యుత్ షాక్తో కాడెద్దు మృతిపెంబి: మండలంలోని కోరకంటి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి సూర్యభాను అనే రైతుకు చెందిన కాడెద్దు బుధవారం మృతి చెందింది. విద్యుత్ స్తంభం వద్ద ఎర్త్ తీగను అధికారులు సరిగా అమర్చకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. -
‘సర్’ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
తాండూర్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు సూచించారు. బుధవారం ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై సమీక్షించారు. ఈ నెల 25 నుంచి మూడో విడత ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ప్రతీ ఇంటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు పనుల పురోగతిని పరిశీలించాలని అన్నారు. భూ భారతి పోర్టల్లో పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి ఆమోదించాలని తెలిపారు. తహసీల్దార్ జ్యోత్స్న, డిప్యూటీ తహసీల్దార్ కల్పన, రెవె న్యూ ఇన్స్పెక్టర్లు పద్మజ, మురళీధర్ పాల్గొన్నారు. -
పెరిగిన ధరలు నియంత్రించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ డిమాండ్ చేశారు. ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందని విమర్శించా రు. బీజేపీ పాలనలో సామాన్యుల బతుకు భారంగా మారిందని అన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, పూర్ణిమ, వీరభద్రయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు నగేష్, సుదర్శన్, శ్రీనివాస్, మల్లేష్, రవి, చంద్రకళ, రాజమొగిలి, కొండు బానేష్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆటోలో పాము.. కిందకు దూకిన కూలీలు
కోటపల్లి: ప్రయాణిస్తున్న ఆటోలో పాము కన్పించడంతో ఉపాధిహా మీ కూలీలు కిందికి దూకి గాయాలపాలైన ఘటన మండలంలోని ఎదులబంధం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఉపాధిహామీ పనుల కోసం గ్రామ శివారుకు కూలీలు ఆటోలో వెళ్లారు. పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా ఆటోలో ఒక్కసారిగా పాము కన్పించింది. దీంతో భయాందోళన చెందిన రెవెల్లి శ్రీనివాస్, కొనగిరి తిరుపతి, మల్ల న్నలు కిందకు దూకారు. దీంతో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకున్న సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కూలీలు క్షేమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
రొట్టెలు చేస్తూ.. ఆటలు ఆడుతూ..!
పిల్లలకు క్యారంలో మెలకువలు నేర్పిస్తున్న తాతయ్యకాస్తంత సమయం దొరికితే చాలు.. చిన్నారులు సెల్ఫోన్లకు అతుక్కుపోతున్నారు. లేదంటే టీవీ చూస్తూ గడిపేస్తున్నారు. కుంటాలలో మాత్రం చిన్నారులు భిన్నంగా ఆలోచించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతినిత్యం ఆటపాటలతో ఉత్సాహంగా గడుపుతున్నారు. అమ్మమ్మల దగ్గర రొట్టెలు చేయడంతో పాటు వివిధ రకాల వంటకాల్లో ప్రావీణ్యం పొందుతున్నారు. తాతయ్యలతో క్యారం, చెస్లు ఆడుతూ అందులో మెలకువలు నేర్చుకుంటున్నారు. – కుంటాల -
● శిథిలావస్థకు చేరిన ఇల్లు కూలి చిన్నారి మృతి
తాండూర్: ఇల్లు కూలి చిన్నారి మృతి చెందిన ఘటన తాండూర్ మండలం అచ్చలాపూర్ ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. తాండూర్ ఎస్సై ప్రసాద్రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఏముర్ల శేఖర్ –భాగ్యలకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె ఏముర్ల సునైత్రి (5) వేసవి సెలవులు కావడంతో రోజూ ఇంటి సమీపంలోని పిల్లలతో కలిసి ఆడుకుంటుంది. ఈ క్రమంలో బుధవారం తన ఇంటి సమీపంలోని ఏముర్ల పోచవ్వ అనే వృద్ధురాలికి చెందిన ఇంటిలో మరో బాలికతో కలిసి ఆటలాడుతుండగా ఒక్కసారిగా ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో సునైత్రి అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలిక ప్రాణాలతో బయటపడింది. చిన్నారి సునైత్రి తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాలి
● బానిసైన వారు బాధితులు మాత్రమే ● మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్మంచిర్యాలక్రైం: యుద్ధ ప్రాతిపదికన డ్రగ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిషాముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ డ్రగ్స్ నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పోలీసు వ్యవస్థలో నార్కొటిక్ టీమ్ ఏర్పాటైనట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 30 మందికి డీ అడిక్షన్ సెంటర్లో వైద్యం అందించి డ్రగ్స్ నుంచి విముక్తి కల్పించామని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో వారిని బాగు చేసేందుకు అన్ని విధాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డ్రగ్స్కు బానిసైన వారిని నేరస్తులుగా పరిగణనలోకి తీసుకోబోమని, బాధితులుగా చూసి రక్షించడమే ప్రధాన కర్తవ్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. గంజాయి, మద్యం, ఇతర డ్రగ్స్కు బానిసైన వారి వివరాలు డయల్ 100 ద్వారా తెలియజేయాలని అన్నారు. అనంతరం డ్రగ్స్ వాల్పోస్టర్లను విడుదల చేశారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, ఆసుపత్రి ఆర్ఎంఓలు భీష్మ, శ్రీధర్, డీఅడిక్షన్ సెంటర్ వైద్యుడు రామునాయక్, రెడ్ క్రాస్సొసైటీ సభ్యులు మధుసూదన్రెడ్డి, సీఐ ప్రమోద్రావు, ఎస్సై మధుసూదన్ పాల్గొన్నారు. -
కాపర్వైర్ దొంగలు అరెస్ట్
బెల్లంపల్లి: మందమర్రి ఏరియా శాంతిఖని గని నుంచి అక్రమంగా కాపర్వైర్ దొంగిలించిన ఏడుగురిని పోలీసులు పట్టుకున్నారు. బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్ హనోక్ తెలిపిన వివరాల ప్రకారం.. శాంతిఖని గనిలో కొద్ది రోజుల క్రితం కాపర్ వైర్ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కాపర్ వైర్ పట్టుకెళ్లారని గని అఽధికారి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం టూటౌన్ ఎస్సై సీ.హెచ్ కిరణ్కుమార్ శాంతిఖని ప్రాంతంలో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకోగా వారి వద్ద 10 కిలోల కాపర్ వైర్ లభ్యమైందని సీఐ తెలిపారు. ఆ వైర్ను శాంతిఖని గనిలో దొంగతనం చేసినట్లు మందమర్రి విద్యానగర్కు చెందిన ఉల్లిగడ్డల వ్యాపారులు పాస్తం గోపాల్, కళమంచి అశోక్, కళమంచి కల్యాణ్, పాస్తం వీరస్వామి, పార్థన్ గణేశ్, రాజసమ్మయ్య, పాస్తం సారయ్య అంగీకరించారు. చోరీ చేసిన వైరును చెట్ల పొదల్లో దాచిపెట్టి తీసుకెళ్లడానికి వచ్చి పోలీసులకు పట్టుబడ్డారు. సదరు వ్యక్తులు రామకృష్ణాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు నేరాలలో నిందితులుగా ఉన్నట్లు సీఐ వెల్లడించారు. ఈమేరకు నిందితులను కోర్టులో హాజరు పర్చినట్లు పేర్కొన్నారు. టూటౌన్ ఎస్సై సీ.హెచ్ కిరణ్కుమార్, సీసీఎస్ ఎస్సై శిరీష, సిబ్బంది పాల్గొన్నారు.


