breaking news
Mancherial District News
-
గుడుంబా తయారీ అరికట్టాలి
మంచిర్యాలక్రైం: జిల్లాలో గుడుంబా తయారీ అరికట్టాలని బీజీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి శుక్రవారం జిల్లా ఎకై ్సజ్ అధికారి నందగోపాల్కు వినతిపత్రం అందజేశారు. వేమనపల్లి మండలం భుయ్యారం గ్రామంలో గుడుంబా తయారీ కేంద్రాలు వెలిశాయని, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భుయ్యారం గ్రామ గుడుంబా నిషేధిత కమిటీ అధ్యక్షురాలు ముడిమడుగుల లావణ్య, ఏస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దుర్గం ఎల్లయ్య, ఈశ్వరి, రాజేశ్వరి, బుచ్చక్క, లక్ష్మి, రామక్క, సత్తక్క, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలి మంచిర్యాలటౌన్: సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, శిశువు మృతికి కారణమైన డాక్టర్ ఎం.శ్రీలత లైసెన్స్ రద్దు చేయాలని, మంచిర్యాలలోని నర్సింగ్ హోంను సీజ్ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి జిల్లా కలెక్టర్ కుమార్దీపక్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు దుర్గం ఎల్లయ్య, దుర్గం రాజేశ్వర్, బాధితుడు వసంతరావు పాల్గొన్నారు. -
విపత్తుల సమయంలో తక్షణమే స్పందించాలి
● 22న మాక్డ్రిల్ నిర్వహణ ● జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి సదీర్ బాల్ మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణమే స్పందించి ప్రజారక్షణ చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి సదీర్ బాల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ పి.చంద్రయ్యతో రక్షణ చర్యల ప్రణాళిక రూపకల్పనపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదాల నివారణ, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజారక్షణపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో కనీసం పది రోజులు ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు ఉండాలని అన్నారు. ఈ నెల 22న అన్ని జిల్లాల్లో మాక్డ్రిల్ నిర్వహించాలని సూచించారు. చెన్నూర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్, నీటిపారుదల, పశుసంవర్థక, పోలీస్, వ్యవసాయ, అగ్నిమాపక, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సర్పంచ్ ఓట్ల లెక్కింపులో తేడాపై ఆందోళన
చెన్నూర్రూరల్: మండలంలోని బావురావుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తేడా వచ్చిందంటూ ఓడిపోయిన అభ్యర్థి మద్దతుదారులు శుక్రవారం చెన్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ఎంపీడీవోతో వాగ్వాదానికి దిగారు. అనంతరం చెన్నూర్–మంచిర్యాల ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. పబ్బ జ్యోతి స్వతంత్ర అభ్యర్థిగా, తాటి శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ మద్దతుదారుగా పోటీపడ్డారు. బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టగా రెండు ఓట్ల తేడాతో శ్రీని వాస్గౌడ్ గెలిచినట్లు ప్రకటించారు. కాగా, జ్యోతి మద్దతుదారులు మాట్లాడుతూ గ్రామంలో 803 ఓట్లు ఉండగా.. 738 పోలైనట్లు అధికారులు చూపించారని అన్నారు. జ్యోతికి 355 ఓట్లు, శ్రీనివాస్కు 357 ఓట్లు వచ్చాయని, 15 ఓట్లు చెల్లలేదని, నోటాకు 8ఓట్లు వచ్చినట్లు చూపించారని తెలిపారు. మొత్తం 735 ఓట్లు వస్తున్నాయని, మిగతా మూడు ఏమయ్యాయని ప్రశ్నించారు. పోలీసులు ధర్నా విరమింపజేశారు. అనంతరం వారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. -
మావోయిస్టుల లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల, కుమురంభీం(కేబీఎం) డివిజన్ కమిటీ కార్యదర్శి కామారెడ్డి జిల్లాకు చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ హైదరాబాద్లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. శుక్రవారం హైదరాబాద్లో డీజీపీ శివధర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో లొంగిపోగా.. ఆ వివరాలను ప్రెస్మీట్లో వెల్లడించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు ఎస్పీ చిత్తరంజన్ కూడా పాల్గొన్నారు. సీపీఐ(మావోయిస్టు)కి చెందిన 41మంది 24ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో ఇద్దరే తెలంగాణకు చెందిన వారు కాగా, 24ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కేబీఎం కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, పార్టీ సభ్యుడు జన్నారానికి చెందిన ప్రభంజన్ ఉన్నారు. మిగతా వారంతా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వివిధ కేడర్లో పని చేస్తున్న వారు ఉన్నారు. అజ్ఞాతం వీడేందుకేనా..? వచ్చే మార్చి నెలాఖరు వరకు మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు తమ పార్టీ కేడర్ను ఇతర ప్రాంతాలకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేర్వేరు చోట్ల ఆశ్రయం పొందుతున్నారు. మనుగడ క్లిష్టంగా మారడంతో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అలా ఇటీవల కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూ ఏజెన్సీ అటవీ ప్రాంతంలోకి కొందరు మావోయిస్టులు వచ్చినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. వారిని గుర్తించి అత్యంత గోప్యంగా పోలీసులు ఆయుధాలతో సహా హైదరాబాద్కు తరలించారు. వీరంతా ఛత్తీస్గఢ్ నుంచి ములుగు ఇతర ప్రాంతాల మీదుగా సిర్పూర్ యూ మండలం కకర్బుడ్డి, బాబ్జీపేట పరిసరాల్లో సంచరిస్తున్నారు. పెద్దదోబ, చిన్నదోబ పరిధిలో అటవీ సమీపంలోని ఓ చేనులో ఉన్న గుడిసెలో తల దాచుకున్నారు. గత కొద్దిరోజులుగా అక్కడే ఉంటున్నారు. వీరంతా ఇక్కడికి ఎలా చేరుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేళ అంతర్రాష్ట్ర సరిహద్దులతోపాటు జిల్లాలు, కీలక ప్రాంతాల్లో చెక్పోస్టులు ఉన్నాయి. ఈ తనిఖీలను దాటి ఎప్పుడు, ఎలా వచ్చారనేది మిస్టరీగా మారింది. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లాలో బలగాలు గుర్తించిన మావోయిస్టులే అజ్ఞాతం వీడారనేది ఉన్నతాధికారులు ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. -
కుష్ఠువ్యాధి గుర్తింపు ఉద్యమం
మంచిర్యాలటౌన్: జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు జిల్లా వైద్యారోగ్యశాఖ ‘కుష్ఠువ్యాధి గుర్తింపు ఉద్యమం’ చేపట్టింది. జిల్లాలో 8,14,558 మంది జనాభా ఉండగా.. 2,12,500 ఇళ్లలో 650 బృందాల ద్వారా ఇంటింటి సర్వే చేస్తోంది. వ్యాధిగ్రస్తుల గుర్తింపు, ప్రజల్లో అవగాహన కల్పించడం, ఉచితంగా చికిత్స, మందులు అందజేస్తారు. 2027వరకు కుష్ఠు రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఈ నెల 18న ప్రారంభమైన సర్వే 31వరకు కొనసాగుతుంది. ఏటా వ్యాధి నిర్మూలనకు పలు కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజల్లో పూర్తి అవగాహన రాకపోవడంతో నిర్మూలించలేకపోతున్నారు. 18న జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న ఆనంద నిలయం వృద్ధాశ్రమంలోని వృద్ధులను పరీక్షించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పరిధిలో రెండ్రోజులుగా సర్వే చేపడుతున్నారు. బయటకు చెప్పుకోలేకనే... జిల్లాలో కుష్ఠువ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గించేందుకు ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నా ఎక్కడో ఒకచోట వారిని గుర్తిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి నివారణకు చర్యలు చేపడుతున్నా ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదు. వ్యాధిపై సరైన అవగాహన లేక, బయటకు చెబితే సామాజికంగా దూరమవుతామనే భయంతో బాధితులు అలాగే కాలం గడుపుతున్నారు. కుటుంబ సభ్యులు, సమీపంలో నివసించే వారికి ఈ వ్యాధి సోకడానికి కారకులు అవుతున్నారు. జిల్లాలో వ్యాధిగ్రస్తుల వివరాలుసంవత్సరం గుర్తింపు2016–17 73 2017–18 37 2018–19 72 2019–20 54 2020–21 83 2021–22 74 2022–23 113 2023–24 87 2024–25 73 2025–26 74(నవంబర్ 30వరకు)నిర్మూలనకు ఇంటింటి సర్వేజిల్లాలో కుష్ఠువ్యాధి నిర్మూలన కోసం ఇంటింటి సర్వే చేపట్టాం. వ్యాధిగ్రస్తులను గుర్తించడం, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో ప్రతియేటా కుష్ఠువ్యాధి నివారణ కోసం సర్వేతోపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కొంతమేర నిర్మూలనకు ఉపయోగపడుతుంది. వ్యాధి పూర్తిస్థాయిలో లేకుండా చేయడమే ధ్యేయంగా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చర్యలు చేపడుతోంది. – డాక్టర్ అనిత, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి -
అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. శుక్రవారం పట్టణంలో రూ.20 లక్షలతో నిర్మించిన అంబేడ్కర్ భవనం, రూ.9.55 లక్షలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ అంబేడ్కర్ భవనం విస్తరణకు మరో రూ.20 లక్షలు మంజూరు చేయిస్తానని చెప్పారు. వంద పడకల ఆస్పత్రి పనులు మే వరకు పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. 50పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మాతాశిశు ఆస్పత్రిగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై కమిషనర్తో సమీక్ష నిర్వహించారు. అధికారులపై మంత్రి ఆగ్రహం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకుండా ప్రారంభోత్సవం చేపట్టారని సంబంధిత అధికారులపై మంత్రి వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు భవనాల మధ్య కప్పు వేయాల్సి ఉంది, ప్లాట్ఫాం పూర్తి చేయడం లేదని ఎలా చెప్పావు అని కమిషనర్పై మండిపడ్డారు. పాత కాంట్రాక్టర్ పనులు చేయడం లేదని డీఈ వివరించారు. ఆ కాంట్రాక్ట్ రద్దు చేయాలని, మార్కెట్కు రావాల్సిన రూ.1.90కోట్లు పెండింగ్ నిధులు మంజూరు చేయిస్తామని మంత్రి అన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, కూరగాయల ప్లాట్ఫాం పనులు నెలాఖారులోగా పూర్తి చేయాలని కమిషనర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మల్లికార్జున్ పాల్గొన్నారు. పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలి చెన్నూర్: సర్పంచ్లు పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేయాలని మంత్రి వివేక్వెంకటస్వామి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం చెన్నూర్ నియోజకవర్గంలో కొత్తగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నంటి రఘునాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్రావు, ఉప సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ఎవరీ ప్రభంజన్
జన్నారం: ప్రభంజన్ జన్నారం మండలంలోని మారుమూల గ్రామాలైన ఆదివాసీ గిరిజనుల సమస్యల పై అధికారుల దృష్టికి తీసుకెళ్లేవాడు. గతంలో జన్నారంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయంలో కూడా పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపాడు. గత కొంతకాలంగా అందరితో ఉన్న వ్యక్తి మావోయిస్టు అర్బన్ ఏరియా కోఆర్డినేటర్ అనే వార్త రావడంతో మండలంలో చర్చనీయాంశమైంది. ఆయన కు పొనకల్లోని గాంధీనగర్లో సొంత ఇల్లు ఉంది. తల్లిదండ్రులు లక్ష్మి, కాంతన్న, చెల్లెలు ఉన్నారు. చెల్లెలికి వివాహం కాగా, తల్లిదండ్రులతో గాంధీనగర్లో నివసిస్తున్నాడు. -
సర్పంచ్ అభ్యర్థి ఆందోళన
నర్సాపూర్ (జీ): రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని గొల్లమాడ గ్రామంలో ఈనెల 14న ఎన్నికలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపులో ఎన్నికల అధికారులు గందరగోళం చేయడంతో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ సర్పంచ్ అభ్యర్థులు అనూషాబాయి, ధనగరి లక్ష్మి ఎంపీడీవో పుష్పలతకు వినతిపత్రం అందజేశారు. లెక్కింపులో గందరగోళం సృష్టించి ఓట్లన్నీ తారుమారు చేశారని ఆరోపించారు. ఎన్నికల శిక్షణలో అవగాహన లేని అధికారులను విధుల్లోకి తీసుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని సర్పంచ్ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద అనుచరులు, నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. ఎన్నికల ఫలితాలపై తమకు అనుమానాలున్నాయని రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు త్వరలో నిర్వహించనున్న పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిలివేయాలని కోరారు. ఈ విష యమై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సర్పంచ్ అభ్యర్థి అనూషాబాయి తెలిపారు. ముధోల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి రమాదేవి, నాయకులు గాదేవార్ విలాస్, దీక్షిత్ పటేల్ తదితరులున్నారు. ఆందోళన చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి, నాయకులు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని రింగన్ఘాట్ గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కెరమెరి ఎస్సై మధూకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొఠారి గ్రామానికి చెందిన మర్సకోల మహేశ్ (21), కొత్తగూడ గ్రామానికి చెందిన సిడాం జ్యోతీరాం బైక్పై అంబారావుగూడకు వెళ్లి నిత్యావసరాలు కొనుగోలు చేశారు. తిరిగి వస్తున్న క్రమంలో రింగన్ఘాట్ గ్రామ సమీపంలో కల్వర్టు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్తో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, జ్యోతీరాంకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి అన్న యోత్మారామ్ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఆదిలాబాద్రూరల్: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న దృష్ట్యా విద్యార్థులు కఠినమైన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ సెంటర్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక ప్రేరణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు మోడల్ పేపర్లను పదేపదే రాయాలని, ఏదైనా సబ్జెక్టు కఠినంగా అనిపిస్తే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకుని ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని సూచించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ను శాలువాతో సన్మానించారు. జిల్లా బీసీ అభివృద్ధిశాఖ అధికారి రాజలింగు, సహాయ వెనుకబడిన అభివృద్ధిశాఖ అధికారి సోనియా, బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్, వసతిగృహ సంక్షేమాధికారులు జే నర్సింలు, చిన్నయ్య, జావీద్, ప్రభాకర్, సంతోష్, రజనీకాంత్రెడ్డి, కల్పన తదితరులున్నారు. నిందితుడికి రిమాండ్ ఆదిలాబాద్టౌన్: సెల్ఫోన్ను దొంగిలించిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపా రు. గురువారం పట్టణంలోని ముస్కాన్ ట్రావెల్స్లో ఇందిరానగర్కు చెందిన రవి సెల్ఫోన్ చోరీకి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. బైక్ చోరీ నిందితుల అరెస్ట్ ఆదిలాబాద్టౌన్: ద్విచక్రవాహనం చోరీకి పా ల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ సీఐ నాగారాజు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణా నికి చెందిన న్యాయవాది రామారావుకు చెంది న ద్విచక్రవాహనాన్ని మావలకు చెందిన ఎడగంటి భీమన్న, పల్లపు లక్ష్మణ్ పంజాబ్ చౌక్లో చోరీ చేశారు. ఆ వాహనాన్ని సాయిబాబు వద్ద తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పేర్కొన్నారు. -
మతిస్థిమితం లేని మహిళ మృతి
సారంగపూర్: నిర్మల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని అడ్డి రాజమణి (36) శుక్రవారం మండలంలోని ధని గ్రామంలో బావిలో పడి మృతి చెందింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ధని గ్రామానికి చెందిన రాజమణిని నిర్మల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. రాజమణి భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. వీరి 14 ఏళ్ల కుమారుడు కూడా ఏడాది క్రితం చని పోయాడు. అప్పటినుంచి రాజమణి మతిస్థిమితం కోల్పోయింది. ధని గ్రామంలోని తన తల్లిగారి ఇంటివద్దే ఉంటోంది. నెలక్రితం ఆత్మహత్యకు యత్నించగా ఆమె సోదరులు అడ్డుకుని రక్షించారు. కాగా, గురువారం రాత్రి నుంచి ఆమె కనిపించడంలేదు. కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ధని గ్రామంలోని ఎస్సీ కాలనీ వెనుక వైపు గ్రామపంచాయతీకి చెందిన బావిలో పడి మృతి చెందింది. ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో వెళ్లి పంచనామా నిర్వహించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వేబ్రిడ్జిపై కూరుకుపోయిన టిప్పర్
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా సీహెచ్పీపై టిప్పర్ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం బొగ్గు లోడ్తో వచ్చిన టిప్పర్ తూకం సమయంలో వేబ్రిడ్జి గార్డర్ విరిగిపోగా పక్కనున్న కంప్యూటర్ గదిపై ఒరిగింది. దీంతో కొన్ని బొగ్గు పెళ్లలు కిటికీల్లోంచి జారి గదిలో పడ్డాయి. ఏ మాత్రం లారీ మరింత ఒరిగినా గది కూలిపోయేదని, అందులోని క్లర్క్ ప్రాణాలు పోయేవని ప్రత్యక్ష సాక్షులు తె లిపారు. తృటిలో ప్రమాదం తప్పిందని పే ర్కొన్నారు. కొన్ని గంటల తర్వాత లారీని అ క్కడి నుంచి తొలగించారు. నిర్వహణ లోపంతోనే గార్డర్ విరిగిందని కార్మికులు చెబుతున్నారు. సీహెచ్పీలో అధికారులు రక్షణ చర్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరో పించారు. -
ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: మళ్లీ పరీక్షల్లో ఫెయిలవుతానేమోనని ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని భగవంతంవాడలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ ప్రమోద్రావు, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండల కేంద్రానికి చెందిన చింతల శ్రీనివాస్కు ఇద్దరు కుమారులు రాజేశ్, విఘ్నేశ్ (20) ఉన్నారు. వీరు మంచిర్యాలలోని భగవంతంవాడలోని శ్రీనివాస్ అత్తగారైన శంకరమ్మ ఇంట్లో ఐదేళ్లుగా ఉంటూ ఇక్కడే చదువుకుంటున్నారు. చిన్న కుమారుడు విఘ్నేశ్ ఐటీఐ చదువుతున్నాడు. గతేడాది రాసిన పరీక్షలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. ఈ నెల 24న మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలున్నాయి. ఈసారి నిర్వహించే సప్లమెంటరీ పరీక్షల్లోనూ ఫెయిలవుతానేమోనని కొద్దిరోజులుగా దిగులు పడుతున్నాడు. ఈ నెల 18న రాజేశ్, విఘ్నేశ్ రోజులాగే రాత్రి భోజనం చేశాక గదిలో నిద్రించారు. అందరూ నిద్రలోకి జారుకున్నాక విఘ్నేశ్ ఇంట్లోని హాల్లో స్లాబ్ కొండికి నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటికి రాజేశ్ నిద్రలేచి చూడగా విఘ్నేశ్ కనిపించలేదు. హాల్లోకి వచ్చి చూడగా అప్పటికే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కలప వాహనం పట్టివేత
దండేపల్లి: మండలంలోని చింతపల్లి శివారులో అ నుమతి లేకుండా అక్రమంగా నాన్టేకు చెట్టు నరికి వాహనంలో తరలిస్తుండంగా అటవీశాఖ అధికారులు చింతపల్లి–కొర్విచెల్మ గ్రామాల మధ్య శుక్రవారం పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి తాళ్లపేట అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారు. అనుమతి లేకుండా చెట్లు నరికితే చర్యలు తప్పవని అటవీశాఖ అధికారులు నాగరాజుచారి, నరేశ్ హెచ్చరించారు. మండలంలో జోరుగా దందా..దండేపల్లి మండలంలో నాన్టేకు కలప దందా కొ ద్దిరోజులుగా జోరుగా సాగుతోంది. రహదారులు, కాలువల వెంట, విద్యుత్ తీగల కింద ఉన్న తు మ్మ, వేప, ఇతర నాన్టేకు చెట్లు, చెట్ల కొమ్మలపై కొంతమంది కన్నేసి దర్జాగా నరికేస్తున్నారు. అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముత్యంపేట అటవీ చెక్పోస్టు గుండా ఈ దందా నిత్యం సాగుతున్నా అటవీశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
రైతుబిడ్డలకు ఉన్నతోద్యోగాలు
తాంసి: భీంపూర్ మండలంలోని కరంజి(టీ) గ్రామానికి చెందిన ఎల్టి కార్తిక్రెడ్డి గ్రూప్–3 పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అకౌంటెంట్గా ఉద్యోగం సాధించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందని కార్తిక్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. 2023లో నిజాం కాలేజీలో ఎంఏ సోషియాలజీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నాడు. కార్తిక్రెడ్డి తల్లిదండ్రులు రాధ–సుదర్శన్రెడ్డి వ్యవసాయం చేసుకుంటే కుమారుడిని ఉన్నత చదువులు చదివించారు. తల్లిదండ్రుల కష్టాలను దగ్గరగా చూసిన కార్తిక్ ఎలాగైనా ఉన్నత ఉద్యోగం సాధించాలనే లక్ష్యంలో గ్రూప్–3 ఫలితాల్లో సత్తా చాటి ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు కార్తిక్రెడ్డిని అభినందించారు. కాగా, గ్రూప్–1 ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తానని కార్తిక్రెడ్డి చెబుతున్నాడు. తలమడుగు: గ్రూ ప్–3 ఫలితాల్లో రైతుబిడ్డ సత్తా చాటాడు. మండలంలోని అర్లీ(కే) గ్రామానికి చెందిన కళ్ల సందీప్ రాష్ట్ర స్థా యిలో 202 ర్యాంక్, జోనల్ స్థాయిలో 28వ ర్యాంక్ సాధించాడు. ట్రెజరీ విభాగంలో సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సందీప్ది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు కృష్ణ, సు వర్ణ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం కా గా, మొదటి కుమారుడు సాయికుమార్, రెండోకుమారుడు సందీప్. దేవపూర్ గ్రామంలో సందీప్ పదోతరగతి వరకు చదివాడు. ఇంటర్మీడియట్, డిగ్రీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పూర్తి చేశాడు. ఇంటి వద్దే ఉంటూ గ్రూ ప్–3కి ప్రిపేరయ్యాడు. కోచింగ్ లేకుండానే రాష్ట్రస్థాయిలో 202 ర్యాంక్ సాధించి ట్రెజరర్ విభాగంలో సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగం సాధించగా గ్రామస్తులు అభినందిస్తున్నారు. సందీప్కుంటాల: మండల కేంద్రానికి చెందిన తాటి సాయితేజ గ్రూప్–3లో 920వ ర్యాంక్ సాధించాడు. సీఐడీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గ్రూప్–4లోనూ 540 ర్యాంక్ సాధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికై భైంసా ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి శోభ బీడీ కార్మికురాలు, తండ్రి మహేశ్ రైతు. ఈ సందర్భంగా సాయితేజను గ్రామస్తులు అభినందించారు. భీంపూర్: మండలంలోని కై రిగూడ గ్రామానికి చెందిన మెస్రం రే ణుక–జైవంత్రావు దంపతుల కుమారు డు హరిదాస్ ఇటీవల విడుదలైన గ్రూప్–3 ఫలితాల్లో సీనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ) ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తారు. పిల్లలకు నచ్చిన రంగాన్ని ప్రోత్సహించేలా తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. హరి దాస్ మారుమూల గ్రామం నుంచి ఉద్యోగం సాధించగా గ్రామస్తులు అభినందించారు. సాయితేజ హరిదాస్ తాంసి: మండల కేంద్రానికి చెందిన పోలి పెల్లి అజయ్ గ్రూప్ –3లో రాష్ట్రస్థాయిలో 874 ర్యాంక్ సాధించి ఇంటర్మీడియట్ అధికా రిగా ఉద్యోగం సాధించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన అజయ్ తండ్రి రామకృష్ణ మృతి చెందాడు. తల్లి లక్ష్మి వ్యవసాయం చేస్తూనే ఇద్దరు ఆడపిల్లలతోపాటు కుమారుడు అజయ్ని చదివించింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన అజయ్ ఆది లాబాద్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ వరకు చదివాడు. కరీంనగర్లో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ చదివాడు. 2023 నుంచి 2024 వరకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యాడు. గ్రూప్–2లో 444 ర్యాంక్ సా ధించినా ఉద్యోగం రాలేదు. అయినప్పటికీ పట్టువదలకుండా చదువుతూ గ్రూప్–3లో ప్రతిభ కనబరిచి ఉద్యోగం సాధించాడు. ఒక వైపు పరీక్షలకు సన్నద్ధమవుతూనే చదువు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఉస్మానియా కాలేజీల్లో బీఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తల్లి పడుతున్న కష్టాన్ని చూసి మంచి ఉద్యో గం సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో ఉంటూ ఉద్యోగాలకు సన్నద్ధమైనట్లు అజయ్ తెలిపాడు. ప్రణాళిక ప్రకారం చదివితే ఉద్యో గం సాధించడం సుళువేనని చెబుతున్నాడు. గ్రూప్–3లో ఉద్యోగం సాధించిన అజయ్ను తాంసి గ్రామస్తులు అభినందించారు. అజయ్కార్తిక్రెడ్డి -
పీఎస్ నుంచి సీనియర్ ఆడిటర్గా..
బోథ్: నిరంతర కృషి, పట్టుదల ఉంటే లక్ష్యాన్ని ముద్దాడొచ్చని తోషం గ్రామపంచాయతీ కార్యదర్శి పనుల పురుషోత్తం నిరూపించారు. ఇటీవల విడుదలైన గ్రూప్–3 ఫలితాల్లో ఆయన స్టేట్ లెవల్లో 172వ ర్యాంక్, జోనల్ స్థాయిలో 18వ ర్యాంక్ సాధించి సీనియర్ ఆడిటర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. మండలంలోని ధన్నూర్ బీ గ్రామానికి చెందిన పురుషోత్తంకు 2014లోనే పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం లభించింది. అప్పటి నుంచి బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నత ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యారు. అవసరమైనప్పుడు సెలవులు పెట్టి గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాగలకు సిద్ధమయ్యారు. గతంలో రెండుసార్లు స్వల్ప తేడాతో గ్రూప్–2 ఉద్యోగాన్ని కోల్పోయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించి నేడు గ్రూప్–3లో సత్తా చాటారు. తన విజయానికి కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదని పురుషోత్తం పేర్కొన్నారు. తల్లి ఊషమ్మ ఆశీస్సులు, భార్య విమల ప్రోత్సాహం తనను నిరంతరం ముందుకు నడిపించాయని తెలిపారు. ఆయనకు కుమారుడు శ్రేయాన్ష్, కుమార్తె క్రిశ్వి ఉన్నారు. గ్రూప్–3 సాధించడం సంతోషంగా ఉన్నా తన అసలు లక్ష్యం గ్రూప్–1 ఉద్యోగం సాధించడమేనని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉంటూనే ఉన్నత శిఖరాలను అధిరోహించిన పురుషోత్తంను తోటి ఉద్యోగులు, గ్రామస్తులు అభినందించారు. -
ముచ్చటగా మూడోసారి
ఆసిఫాబాద్రూరల్: మండలంలోని మాలన్గొందిలో ముచ్చటగా మూడోసారి ఆ కుటుంబాన్ని సర్పంచ్ గిరి వరించింది. 2014లో తిరుపతి సర్పంచ్గా ఎన్నిక కాగా, 2019లో మడావి భార్య సీత విజయం సాధించారు. ఈసారి మళ్లీ 300 మెజర్టీతో మడావి సీత సర్పంచ్గా ఎన్నికయ్యారు. సీసీరోడ్డు, డ్రెయినేజీల నిర్మాణంతోపాటు భీమన్న ఆలయం అభివృద్ధి చేస్తున్న కృషిని గుర్తించి తమను ఎన్నుకుంటున్నారని వారు తెలిపారు. అలాగే చిర్రకుంట పంచాయతీ సర్పంచ్గా 2019లో పార్వతిబాయి ఎన్నిక కాగా, ఈసారి కూడా బీజేపీ మద్దతుతో ఆమె గెలుపొందారు. వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. వరించిన అదృష్టం ఆసిఫాబాద్ మండలంలోని అడదస్నాపూర్ పంచాయతీలో టాస్ ద్వారా విజేతలను నిర్ణయించారు. పంచాయతీలో మొత్తం 445 ఓటర్లు ఉండగా 382 పోలయ్యాయి. నోటాకు మూడు ఓట్లు పడగా, చెల్లనివి 22 ఉన్నాయి. సర్పంచ్ అభ్యర్థులు నీలాకుమారి, కమలాబాయికి సమానంగా 154 చొప్పున ఓట్లు వచ్చాయి. మూడుసార్లు రీకౌటింగ్ చేసినా ఫలితం మారలేదు. దీంతో చివరికి టాస్ వేయగా నీలాకుమారిని అదృష్టం వరించింది. -
ఆ బస్సుకు ఏటా పూజలు
కడెం: ఏదైనా ఓ గ్రామానికి నూతనంగా బస్సును ప్రారంభిస్తే ఆ బస్సుకు పూజలు నిర్వహించి.. స్వాగతం పలకడం సాధారణం. కానీ నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్ బస్సుకు ఏటా పూజలు నిర్వహిస్తుంటారు అక్కడి ప్రజలు. మండల కేంద్రం నుంచి మారుమూల గంగాపూర్ గ్రామానికి వెళ్లాలంటే ఒక్కటే దారి. నవబ్పేట్ సమీప ఆటవీప్రాంతం గుండా వాగులు, వంకలు దాటి 14 కిలోమీటర్లు వెళ్లాలి. లేదంటే కడెం ప్రాజెక్ట్ బ్యాక్వాటర్లో తెప్పపై వెళ్లాలి. ఎత్తెన గుట్టలు, రాళ్లు, రప్పలతో రోడ్డు సరిగా లేకున్నా ఆర్టీసీ ఏళ్లుగా బస్సు నడుపుతోంది. రోజుకు రెండు ట్రిప్పులు వస్తుంది. వర్షాకాలం మాత్రం బస్సును నిలిపివేస్తారు. చలికాలంలో ప్రారంభిస్తారు. ఇలా ప్రారంభించిన ప్రతీసారి బస్సు అలంకరించి, పూజలు చేసి స్వాగతం పలుకుతారు. గంగాపూర్, కొర్రతండా, రాణిగూడ పంచాయతీల ప్రజలు గ్రామాలు దాటి బయట ప్రపంచానికి రావాలంటే సరైన రవాణా వ్యవస్థ లేదు. దీంతో ఆర్టీసీ బస్సుతో వీరికి ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. -
జంతుగణనకు సన్నద్ధం
జన్నారం: ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించే శాఖాహార, మాంసహార జంతువుల గణనకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో బీట్ల వారీగా ట్రాన్స్క్ట్ లైన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. జన్నారం అటవీ డివిజన్లోని 40బీట్లలో శాఖాహార జంతువుల కోసం ఏర్పాటు చేసుకొని ట్రాన్సెక్ట్ లైన్(నమూన రేఖ) ను బీట్ అధికారులు సిద్ధం చేసుకున్నారు. ట్రాన్సెక్ట్ లైన్లను ఎఫ్డీవో రామ్మోహన్, రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ గురువారం పరిశీలించారు. శాఖాహార, మాంసహార జంతు గణన కోసం ముందుగా రేఖలు ఏర్పాటు చేసుకొని, వాటిలోనే గణన చేపడుతారని తెలిపారు. జనవరి మాసంలో జంతుగణన ప్రారంభించే అవకాశాలున్నందునా ముందస్తుగా ఈ పనులు చేపడుతూ సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. జన్నారం డివిజన్లో మూడు అటవీ రేంజ్లు, 21అటవీ సెక్షన్, 40 బీట్లు ఉండగా, అందరు సిబ్బంది గణనలో పాల్గొంటారని, వీరికి ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు ఎఫ్డీవో తెలిపారు. వలంటీర్ల సహాయం కూడా అవసరం ఉన్నందునా ఆసక్తి గలవారిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. -
పరీక్ష సమస్య కాదు..
టెట్ ఉత్తీర్ణకు నిర్వహించే పరీక్ష సమస్య కాదు. బోధనతోపాటు పరీక్ష రాయడానికి ఇబ్బంది లేదు. టెట్ ఉత్తీర్ణత సాధించడం కోసం ప్రిపేర్ కావడానికి సెలవులు అవసరం లేదు. ఇవన్నీ గతంలో పాసైనవే. టైం దొరికనప్పుడుల్లా యూట్యూబ్లో వీడియోలు సేకరిస్తూ పరీక్షకు సన్నద్దమవుతున్నా. 15 నుంచి 30 సంవత్సరాలు సేవలందించిన సీనియర్ ఉపాధ్యాయులను పరీక్షించడం సహేతుకం కాదు. ప్రతీ ఉపాధ్యాయుడు ప్రభుత్వం బోర్డులు నిర్వహించిన పరీక్షలన్ని పాసయ్యాడు. – మురళీధర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గర్మిళ్ల -
అందుబాటులో ఉన్న పుస్తకాలతో..
పాఠశాల విధులు నిర్వహిస్తూనే అందుబాటులో ఉన్నా పుస్తకాలు చదువుతున్నా. టెట్ రాసేందుకు అనుకున్నంత సమయం లేకుండాపోయింది. నిన్నటి వరకు ఎన్నికల విధులు నిర్వహించాం. ఇటూ ప్రిపేర్ కావడం ఆందోళనగా ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులరాలుగా 31 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేశాను. ఇప్పుడు ఎగ్జామ్ రాయమనడం అన్యాయం. గణితం ఉపాధ్యాయులు హిందీ, హిందీ టీచర్లు సోషల్ రాయమనడం అంతా గజబీజీగా ఉంది. టెట్ తప్పనిసరి నిబంధన సమంజసంగా లేదు. – శారా సంగీత, జీహెచ్ఎస్, పాత మంచిర్యాల -
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
చెన్నూర్రూరల్: మండలంలోని నారాయణపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి అనుబంధ గ్రామమైన రాయిపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గండు జగదీశ్, అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి వెంకటేశ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. నారాయణపూర్కు చెందిన రాదండి చిన్న సమ్మయ్య వెంకటేశ్కు మద్దతుగా ప్రచారం చేశాడు. కానీ బుధవారం జరిగిన ఎన్నికల్లో వీళ్లిద్దరూ కాకుండా మూడో వ్యక్తి గెలుపొందడంతో తన ఓటమికి చిన్న సమ్మయ్య కారణమని కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి జగదీశ్, అతడి కుటుంబ సభ్యులు చిన్న సమ్మయ్య ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన సమ్మయ్య గురువారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సమ్మయ్యను చెన్నూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనలతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమ్మయ్యను చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరామర్శించారు. -
పట్టభద్రులకే ‘పట్టం’...!
తాండూర్: తాండూర్ మండలంలోని 15గ్రామ పంచాయతీల్లో ఓట ర్లు పలువురు పట్టభద్రులకే పట్టం కట్టారు. మండలంలోని ద్వారకాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా ఎన్నికై న మాసాడి తిరుపతి ఎంకాంలో పోసు్ట్రగాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో 89ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. బోయపల్లి సర్పంచ్గా గెలుపొందిన సుందిళ్ల శంకరమ్మ గృహిణిగానే తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె కూడా బీఏలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 148ఓట్ల మె జార్టీతో ఎన్నికల్లో విజయం సాధించారు. కాసిపేట సర్పంచ్గా ఎన్నికై న ము దాం వనజ సైతం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గృహిణిగా తన బాధ్యత నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మండలంలోనే అత్యధికంగా 805ఓట్ల భారీ మెజార్టీ తో విజయాన్ని కై వసం చేసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు సర్పంచ్లు ఇంటర్మీడియెట్, మరో ఐదుగురు పదో తరగతి విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. -
ఆ కుటుంబాలకే పల్లె పగ్గాలు
భైంసారూరల్: నిర్మల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఈసారి భిన్నమైన తీర్పు ఇచ్చారు. యువతను, చదువుకున్నవారిని ఎన్నుకున్నారు. అయితే కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం.. సంప్రదాయాన్ని కొనసాగించారు. గత పాలకుల కుటుంబీకులకే మరో అవకాశం కల్పించారు. వరుసగా రెండోసారి.. భైంసా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కథ్గాం గ్రామానికి సర్పంచ్గా వరుసగా దెగ్లూర్ రాజు రెండోసారి ఎన్నికయ్యాడు. భైంసాలో దంతవైద్యుడిగా పనిచేస్తూ మొదటిసారి సర్పంచుగా ప్రజాజీవితంలోకి వచ్చాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రాజు ప్రస్తుతం గ్రామంలో ప్రజాప్రతినిధిగానే కొనసాగుతున్నారు. మొదటిసారి జిల్లాలో ఉత్తమ పంచాయతీగా అవార్డు సైతం అందుకున్నాడు. అప్పటి కలెక్టర్లు ప్రశాంతి, ముషారఫ్ అలీ ఫారూఖీ, వరణ్రెడ్డి రాజు చేసిన సేవలను ప్రసంసించారు. పల్లె ప్రకృతి వనం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను నిర్వహించి కలెక్టర్ల మెప్పు పొందారు. రెండోసారి వరుసగా సర్పంచుగా ఎన్నికయ్యాడు. మహాగాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి అప్పాల రాజ్యలక్ష్మి ఎన్నికై ంది. గడిచిన ఐదేళ్లలో అప్పాల రాకేశ్ సర్పంచ్గా పనిచేశారు. రిజర్వేషన్ మహిళకు కేటాయించడంతో భార్యను పోటీలో దింపి సర్పంచ్గా గెలుపించుకున్నారు. అప్పుడు రాకేశ్ ఇప్పుడు ఆయన సతీమణి రాజ్యలక్ష్మి సర్పంచ్గా పని చేస్తున్నారు. -
వృత్తి బాధ్యత నిర్వహిస్తూనే..
ఓవైపు వృత్తి బాధ్యత నిర్వహిస్తూనే వీలు దొరికనప్పుడల్లా టెట్ ప్రిపేర్ అవుతున్నా. ఇంట్లో పుస్తకాలు చదువుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం 1996డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యాను. అప్పుడు బీఎస్సీ బీఎడ్ అర్హతతో ఉద్యోగంలోకి వచ్చాం. తర్వాత క్రమంలో వృత్తిపరమైన పదోన్నతలు కోసం డిపార్?ట్మంటల్ టెస్టుల రాసి ఉన్నాం. ప్రస్తుతం 2010 ఆర్టీఈ చట్టం ద్వారా ఉపాధ్యాయ వృత్తికి టెట్ పరీక్ష తప్పనసరి చట్టం చేయబడింది. 30 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నా టెట్ కావాలని అడగడం సరికాదు. – సుజాత, స్కూల్అసిస్టెంట్ (బయోలజీ) జెడ్పీహెచ్ఎస్(బాయ్స్) లక్సెట్టిపేట -
సర్పంచ్గా ‘మాస్టారు’
చెన్నూర్రూరల్: మండలంలోని లంబడిపల్లి గ్రామ స ర్పంచ్గా విద్యావంతుడు, యువకుడు నగావత్ మ హేశ్నాయక్ ఎంపికయ్యా డు. ఆయన ఎంఏ, బీఈడీ పూర్తి చేసి జైపూర్లోని గు రుకుల జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అ ధాపకుడిగా పని చేస్తున్నాడు. నాలుగున్నర ఏ ళ్లుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న మహేశ్ స ర్పంచ్ జనరల్ రిజర్వు కావడంతో ఉద్యోగా నికి రిజైన్ చేసి ఎన్నికల్లో పోటీ చేశాడు. సమీప ప్రత్యర్థిపై 55ఓట్ల తేడాతో గెలుపొందాడు. ప్రజలు తనపై నమ్మకంతో సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామాభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడుతానన్నారు. -
అప్పుడు భర్త... ఇప్పుడు భార్య...
● కధం కుటుంబానికి నాలుగు సార్లు.. లోకేశ్వరం:రాజకీయాల్లో ఒకసారి అడుగు పెట్టాక ఆ అభ్యర్థి తన కంటూ ఏదో ఒక పదవిని దక్కించుకునేందుకు ప్రతిఎన్నికల్లోనూ పోటీ అవకాశాలు వెతుక్కుంటారు. ఒక్కసారి సీటు దక్కించుకోవలంటే పోటాపోటీగా పోరాడాల్సి ఉంటుంది. లోకేశ్వరం మండలం హవర్గ గ్రామానికి చెందిన కధం లక్ష్మి 2000లో మొదటిసారిగా మన్మద్ ఎంపీటీసీగా గెలుపొంది. ఈపరిదిలోని మన్మద్, బిలోలి, హవర్గ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. భూజంగ్రావు 2014లో మండల కోఆప్షన్గా పని చేశారు. మళ్లీ 2019, 2025 భూజంగ్రావు సర్పంచ్గా గెలుపొందారు. లక్ష్మి ఒకసారి, భూజంగ్రావు మూడు సార్లు వివిధ పదవులు పొందారు. కధం భుజంగ్రావు 2019, 2025 ఎన్నికల్లో సర్పంచ్ కధం లక్ష్మి 2000 ఎన్నికల్లో మన్మద్ ఎంపీటీసీ -
టీచర్లకు ‘టెట్’షన్
మంచిర్యాలఅర్బన్:జాతీయ విద్యా విధానం ప్రకారం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పాస్ కావాలని సెప్టెంబర్ 1న ఉత్తరవులు వచ్చాయి. జనవరి 3 నుంచి 20 వరకు ఆన్లైన్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తూనే.. టెట్కు సన్నద్ధమవుతున్నారు. అయిదేళ్లకుపైగా సర్వీస్ ఉన్నవారు రెండేళ్లలో టెట్ అర్హత సాధించాల్సి ఉంది. దీంతో అందరిలో టెన్షన్ కనిపిస్తోంది. సాధన పోరాటం.. తరగతి గది విధుల మధ్య ఖాళీ సమయాల్లో టెట్ కోసం ఆన్లైన్ తరగతులు వింటున్నారు. కొందర సాయంత్రం వేళ శిక్షణ కేంద్రాల్లో పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. సెలవు రోజుల్లో ఇంట్లో ఆన్లైన్ కోచింగ్లతో సిద్ధపడుతున్నారు. ఈ ప్రయత్నాలు వారి రోజువారీ బాధ్యతలతో సమతుల్యం చేసుకోవడం సవాల్గా మారాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు పది వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో సగానిపైగా టెట్ అర్హత లేనివారే. మంచిర్యాల జిల్లాలో 2,507 మంది ఉండగా, 1,562 మందికి టెట్ లేదు. ఆదిలాబాద్ జిల్లాలో 2,636 మంది ఉపాధ్యాయుల్లో 1,845 మందికి అర్హత లేదు. ఆసిఫాబాద్లో 2,030 మంది ఉండగా, 1,015 మందికి టెట్ లేదు. నిర్మల్ జిల్లాలో 2,600 మంది ఉండగా, 1,500 మంది టెట్ లేకుండా పనిచేస్తున్నారు. జిల్లా మొత్తం టెట్ అర్హత మంచిర్యాల 2,507 1,562 ఆదిలాబాద్ 2,636 1,845 నిర్మల్ 2,600 1,500 ఆసిఫాబాద్ 2,030 1,015 -
నాడు పతులు.. నేడు సతులు
ఆసిఫాబాద్రూరల్: ఆసిఫాబాద్ మండలంలో పలువురు గతంలో సర్పంచులుగా పనిచేయగా.. ప్రస్తుతం వారి సతీమణులు ఆ పదవులు చేపట్టనున్నారు. 2019లో ఎల్లారం పంచాయతీ సర్పంచ్గా సీతారాం ఎన్నికయ్యారు. గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఈసారి ఆయన భార్య నీలబాయిని ప్రజలు సర్పంచ్గా ఎన్నుకున్నారు. కౌటగూడలో 2019లో లక్ష్మీనారాయణ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఈసారి ఎస్టీ మహిళకు రిజర్వేషన్ రావడంతో భార్య స్వప్పను బీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలపగా ఆమె విజయం సాధించారు. పాడిబండ పంచాయతీలో గతంలో దినకర్ సర్పంచ్గా ఎన్నిక కాగా, ఈసారి ఎస్టీ మహిళ రిజర్వేషన్తో అతడి భార్య ఈశ్వరీ విజయం సాధించారు. గుండిలో పంచాయతీలో మాత్రం 2019లో అరుణ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీసీ పురుషులకు రిజర్వేషన్ రావడంతో ఆమె భర్త రవీందర్ బరిలోకి దిగి ఏడు ఓట్లతో గెలుపొందారు. -
రెండు బైక్లు ఢీ
కాసిపేట: మండల కేంద్రంలోని కాసిపేట పెట్రోల్బంక్ కోమటిచేను శివారు ప్రాంతంలో రహదారిపై గురువారం సాయంత్రం ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురిని 108అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించగా ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులు ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలపై వేగంగా వచ్చి ఢీకొన్నారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను అంబులెన్స్లో మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఒకరు మృతి చెందగా, మరొకరు విషమంగా ఉన్నట్లు 108అంబులెన్స్ ఈఎంటీ నరేష్, పైలెట్ పాషాలు తెలిపారు. మృతుడు మందమర్రి మండలం క్యాతన్పల్లికి చెందిన దురిశెట్టి హరిప్రసాద్(26)గా, విషమంగా ఉన్న వ్యక్తి మందమర్రి శ్రీపతినగర్కు చెందిన రమేశ్గా గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. -
జీజీహెచ్లో దయ్యం ఉన్నట్లు ప్రచారం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆ సుపత్రిలో ఒక రహస్యమైన నీడ కనిపిస్తున్నట్లు ఒక వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఓపీ విభాగంలోని ల్యాబ్ వైపున బుధవారం అర్ధరాత్రి 12:36గంటలకు ఒక రహస్యమైన నీడ కనిపించినట్లు వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్ ఔట్ పోస్టు పోలీసులకు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఫేక్ వీడియోను తయారు చేసినా, వాటిని షేర్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, ఆసుపత్రి వారు చేస్తే, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రజలు నమ్మొద్దని కోరారు. -
పరీక్ష సులువే..
రోజువారీ తరగతి గదిలో బోధన చేస్తున్న తమకు ప రీక్ష రాయటం సులువే. ఏ మాత్రం ఖాళీ సమయం దొ రికినా పుస్తకాలు తిరిగేస్తూ పరీక్షపై దృష్టి పెడుతున్నా. గ్రామ పంచాయతీ ఎన్నికలతో కొంత అటంకం ఏర్పడింది. క్రిస్మస్ సెలవులు.. ఏ ఒక్క హాలిడే వచ్చినా సద్వినియోగం చేసుకుంటా. టెట్ అ ర్హత పరీక్ష అనేది ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకునే వారి కోసం ఉద్దేశించింది. ఎంతో అనుభవం గడించిన ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలో అర్హత సాధించాలనే నిబంధన అసంబద్దం. – బోయిని శ్రీనివాస్, జెడ్పీహెచ్ఎస్ తాళ్లపేట్ -
ప్రజల కోసం దేనికై నా రెడీ
రామకృష్ణాపూర్: కార్యకర్తలకు అండగా ఉండటానికి, ప్రజల కోసం నిలబడటానికి అవసరమైతే ఎంతటి పోరాటానికై నా వెనుకాడబోనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి ఒకవేళ ఎస్సీ జనరల్ అయితే తాను జెడ్పీటీసీ ఎన్నికల్లో తప్పక పోటీచేస్తానని తెలిపారు. క్యాతనపల్లిలోని సుమన్ స్వగృహంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన గ్రామ సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను గురువారం ఘనంగా సన్మానించారు. సుమన్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని, ప్రజాజీవితంలో వారి మద్దతు కూడగట్టుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయ న పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా కష్టపడి పనిచేసి గ్రామపంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారని కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలలోనూ ఇదే స్ఫూర్తిని చాటి పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. కోల్బెల్ట్లో నెలకొన్న సమస్యలపై జీఎం కార్యాలయాల ముట్టడికి టీబీ జీకేఎస్ నాయకులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ రాజరమేశ్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపెల్లి సంపత్, బడికల సంపత్, రామడికుమార్ పాల్గొన్నారు. -
ఫేక్ ఫొటో షేర్చేసిన యువకుడి గుర్తింపు
నస్పూర్: పులి సంచరిస్తుందంటూ సీసీసీ నస్పూర్, శ్రీరాంపూర్ కోల్బెల్ట్ ప్రాంతాల్లో తరుచుగా వినిపిస్తున్న మాట. పలువురు ఆకతాయిలు ఎలాంటి అవగాహన, సరైన సమాచారం లేకుండా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను వైరల్ చేస్తూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా బుధవారం రాత్రి సీసీసీ లోని పోస్ట్ ఆఫీస్ వద్ద పులి సంచరిస్తుందంటూ నకిలీ పులి ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అదే రాత్రి సీసీసీ, ఆర్కే 5 కాలనీ చుట్టు పక్కల బృందాలుగా ఏర్పడి డ్రోన్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. పులి సంచారం అవాస్తవం అని నిర్ధారించారు. గురువారం ఉదయం అటవీశాఖ అధికారులు ఆర్–కే 5 కాలనీలో విలేకరులతో మాట్లాడుతుండగా కాలనీ బ్యారెక్సుకు చెందిన జహినాబేగం తన ఇంటి సమీపంలోకి పులి వచ్చిందని, పులి చూసానని కాలనీవాసులకు సమాచారం ఇచ్చింది. కాలనీ వాసులు అక్కడే ఉన్న అటవీ శాఖ అధి కారులకు తెలుపడంతో ఎఫ్ఆర్వో రత్నాకర్, డీవైఎఫ్ఆర్వో అబ్దుల్ అజార్, ఇతర సిబ్బందితో కలిసి బ్యారె క్సు, మసీదు, చర్చి, డంపింగ్ యార్డు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో పులి సంచారం అవాస్తవమని, భయాందోళనలకు గురి కావొద్దని సదరు మహిళతో పాటు స్థానికులకు సూచించారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దు : డీఎఫ్వో శివ్ఆశిష్ సింగ్ ఆర్కే–5 కాలనీలో డీఎఫ్వో శివ్ ఆశిష్సింగ్ ఎఫ్ఆర్లో రత్నాకర్తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. కోల్బెల్ట్ ప్రాంతంలోని పలు కాలనీల్లో పులి సంచరిస్తుందంటూ వస్తున్న అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దన్నారు. నకిలీ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేసి అధికారులు, సిబ్బంది సమయాన్ని వృథా చేయడంతో పాటు ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సరైంది కాదన్నారు. సోషల్ మీడియాలో నకిలీపోస్ట్లు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏదైనా సమాచారం కోసం 94403 13191, 94415 33220నంబర్లలో సంప్రదించాలని సూచించారు. నకిలీ ఫొటో పోస్ట్చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఆర్లో అబ్దుల్అజార్, బీట్ ఆఫీసర్ రమేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో మద్యం వరద
మంచిర్యాలక్రైం: జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మద్యం ఏరులై పారింది. ఈ నెల 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీలో లక్కు దక్కిన వ్యాపారులకు ఎన్నికల కిక్కు కలిసొచ్చింది. ప్రారంభంలో అమ్మకాలు సాధారణంగా జరిగిన, రోజురోజుకు అమ్మకాలు పెరిగాయి. ఈ నెల 6వ తేదీ నుంచి అమ్మకాలు ఊపందుకోగా 17వ తేదీ వరకు 11రోజుల్లో రూ.35 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో మందు జోరు.. జిల్లాలో 73 మద్యం దుకాణాలుండగా సాధారణ రోజుల్లో నిత్యం జిల్లా వ్యాప్తంగా రోజుకు రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. గత నెల నవంబర్ 25న గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది కానీ, ఈ నెల 6వ తేదీ నుంచి పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో మద్యం అమ్మకాలు జోరుగా సా గాయి. 11రోజుల్లో మద్యం అమ్మకాలు రూ.35కోట్లకు చేరాయి. మద్యం అమ్మకాల విషయంలో ఎకై ్సజ్ శాఖ ప్రతీ మద్యం దుకాణానికి టార్గెట్ పెడుతోంది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎకై ్సజ్ శాఖ అధికారులు విధించినదానికంటే మూడింతలు ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు చెప్పడం గమనార్హం. కలిసొచ్చిన పంచాయతీ ఎన్నికలు... కొత్త మద్యం వ్యాపారులకు పంచాయతీ ఎన్నికలు కలిసొచ్చాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో, వీటి తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త మద్యం వ్యాపారుల్లో అనందం కనిపిస్తోంది. కొత్త మద్యం పాలసీకి రెండు సంవత్సరాల గడువు ఉండగా మొదటి సంవత్సరం మొత్తం ఎన్నికల సందడిలో మద్యం అమ్మకాలు జోరుగానే సాగుతాయని అంచనా వేసుకుంటున్నారు. -
● జిల్లాలో సంచారంపై ఫేక్ వీడియోలు.. ● సోషల్ మీడియాలో ఏఐ ఫొటోలు వైరల్.. ● అటవీ అధికారులు, జనం బెంబేలు ● అసత్య ప్రచారంపై అధికారుల సీరియస్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పెద్దపులుల సంచారం కన్నా, అసత్య ప్రచారాలతోనే జనం బెంబేలెత్తుతున్నారు. పెరిగిన ఆధునికతతో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) క్రియేట్తో సోషల్ మీడియాలో పులుల సంచారం అంటూ వ్యాప్తి చేస్తూ జనాన్ని హడలెత్తిస్తున్నారు. ఇటీవల జిల్లాలో పులులు సంచరిస్తున్నది తెలిసిందే. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, జన్నారం డివిజన్లలో మహారాష్ట్ర నుంచి వస్తున్న పులులు స్థానిక అడవుల్లో, కొత్త ప్రాంతాల్లో కలియదిరుగుతున్నాయి. అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పెద్దపులుల సంచారంపై అప్రమత్తంగా ఉంటున్నారు. ఎటువైపు కదలికలు ఉన్నాయోనని పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాలు, పశువులపై దాడులు గమనిస్తూ ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే చాలా చోట్ల పులుల సంచారం లేకున్నా, ఉన్నట్లుగానే ప్రచారం చేయడంతోనే స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. అసత్యపు ప్రచారంతో హడలెత్తిస్తూ... ఇటీవల శ్రీరాంపూర్ పరిధిలో ఆర్కే 8 బొగ్గు గని సమీపంలో ఓ పులి రోడ్డుకు సమీపంలో అటుగా వెళ్తున్నవారికి కనిపించింది. ఆ సమయంలో తమ వాహనంలోనే ఉంటూ ఆ పులి కదలికలను వీడియో తీశారు. ఆ వీడియో స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. పులి సంచారంపై అధికారులు ధృవీకరించుకోగా నిర్ధారణ అయింది. అయితే దీనిని ఆసరా చేసుకొని కొందరు ఏఐతో ఆర్కే 5లో పులి సంచరిస్తున్నట్లు పెద్దపులితో ఉన్నట్లు ఫొటోలను సృష్టించి సోషల్మీడియాలో పోస్టు చేశారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అటవీ అధికారులు సైతం పులి వచ్చిందా? అని పలుచోట్ల పరిశీలించగా, వచ్చినట్లు ఎలాంటి గుర్తులు కనిపించలేదు. మరో వైపు రెండు రోజుల క్రితం ఇదే తీరుగా మహారాష్ట్రలోని చంద్రాపూర్లో ఓ పులి రైలు పట్టాలపై చనిపోయింది. ఇది కూడా జిల్లా పరిధిలోనే మంచిర్యాల–పెద్దంపేట మధ్య రైల్వే పట్టాలపై ఓ పులి చనిపోయిందంటూ వాట్సాప్లో వైరల్ చేశారు. దీంతో మళ్లీ అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. గత నెలలో జరిగిన ఘటనకు ఇక్కడ చనిపోయిందంటూ సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేశారు. అంతకుముందు మాదా రం, ఖైరీగూడ ఓసీపీ వద్ద పులి సంచరిస్తోందని ప్రచారం చేశారు. ఇవే కాకుండా స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో ఎవరికి తోచినట్లు వారు పులుల సంచారంపై అసత్యపు ప్రచారం చేస్తున్నారు. ఇకనైనా అసత్య ప్రచారాలు చేయొద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. -
డయల్ యువర్ డీఎంకు సమస్యల వెల్లువ
మంచిర్యాలఅర్బన్: సార్.. మా ఊరి బస్టాప్లో బస్సులు నిలపండి.. పల్లె వెలుగులకు ఎక్స్ప్రెస్ బోర్డులు ఏర్పాటు చేసి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారంటూ గురువారం నిర్వహించిన డయల్ యువర్ డీఎంకు ప్రయాణికుల నుంచి సమస్యలు వెల్లువెత్తాయి. జన్నారం బస్స్టేషన్ శిథిలమైందని, ఆధునీకరించి ప్రయాణికులకు సౌకర్యం కల్పించా లని ఎక్కువ మంది విన్నవించగా సంబంధిత ఇంజ నీరింగ్ విభాగం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని డీఎం శ్రీనివాసులు సమాధానం ఇచ్చారు. జన్నారం మండలం లక్ష్మీదేవర ఆలయం వద్ద ఎక్స్ప్రెస్ బస్సులు నిలిపితే సౌకర్యంగా ఉంటుందని ప్రయాణికులు కోరగా సంబంధిత డిపో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరి ష్కరించేందుకు ప్రయత్నిస్తానని డీఎం సమాధానం ఇచ్చారు. పల్లెవెలుగు బస్సులను ఎక్స్ప్రెస్ బోర్డుతో నడిపించి మంచిర్యాల నుంచి లక్సెటిపేటకు ఆర్డినరీ బస్సుల కంటే డబుల్ చార్జీలు తీసుకుంటూ ప్రయాణికులపై భారం మోపుతున్నారని విజయ్ భాస్కర్ అనే ప్రయాణికుడు డీఎం దృష్టికి తీసుకురాగా, మంచిర్యాల డిపో బస్సులు ఆర్డినరీకి ఎక్స్ప్రెస్గా నడపటం లేదని జగిత్యాల, కోరుట్ల బస్సులు నడపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని డిపో అధికారులకు సమాచారం అందిస్తామని డీఎం హామీ ఇచ్చారు. పాతమంచిర్యాల, రంగంపేట్ మీదుగా పులిమడుగు బస్సు నడపాలని, డీ–మార్ట్ దగ్గర బస్సులు నిలపాలని నారాయణ అనే ప్రయాణికుడు కోరగా కొత్తగా బస్సులు వచ్చినప్పుడు సర్వే చేసి బస్సు నడిపే ప్రయత్నం చేస్తానని డీఎం సమాధానం ఇచ్చారు. రాజీవ్నగర్కు బస్సుల సంఖ్య పెంచాలని, చెన్నూర్ నుంచి వచ్చే బస్సులు తోళ్లవాగు దగ్గర నిలపాలని, పరీక్షల సమయంలో బస్సుల సంఖ్య పెంచాలని పీడీఎస్యూ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ దృష్టికి తీసుకురాగా రాజీవ్నగర్కు మూడు బస్సులు నడుస్తున్నాయని, పరీక్షల సమయంలో తెలియజేస్తే వాటికి అనుగుణంగా బస్సులు నడుపుతామని డీఎం సుముఖత వ్యక్తం చేశారు. జన్నారం చింతగూడ వద్ద ఎక్స్ప్రెస్ బస్సులు నిలపాలని రాజేందర్, భూమేశ్ అనే ప్రయాణికులు కోరగా జన్నారం చింతగూడ ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్ మంచిర్యాల బస్సులు నడుస్తాయని ఎక్స్ప్రెస్ స్టేజీ గురించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని డీఎం తెలిపారు. జన్నారం–జగిత్యాల, మంచి ర్యాల డిపో బస్సులు నడపాలని సాయంత్రం నిర్మల్–మంచిర్యాల బస్సుల సంఖ్య పెంచాలని భూమే శ్ సూచించగా జన్నారం–జగిత్యాల మార్గంలో జగిత్యాల డిపో బస్సులు నడుస్తున్నాయని, నిర్మల్–మంచిర్యాల సాయంత్రం 5, 6గంటలకు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయని డీఎం అన్నారు. జన్నారం నుంచి వేములవాడకు బస్సులు నడపాలని మహేష్ కోరగా జగిత్యాల డిపోకు సమాచారం ఇస్తామని డీఎం తెలిపారు. జన్నారం నుంచి భాగ్యనగర్ లింక్ బస్సు కావాలని శివరామక్రిష్ణ కోరగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మంచిర్యాల నుంచి రేచినికి బస్సులు నడపాలని వేణుగోపాల్ సూచించగా కొత్త బస్సులు వచ్చాక పరిశీలించి నడిపేందుకు ప్రయత్నిస్తానని డీఎం అన్నారు. సబ్బెపల్లి సమీపంలోని పైపుల కంపెనీ వద్ద బస్సులు నిలపాలని సత్యనారాయణ కోరగా పరిశీలిస్తామన్నారు. ఇటిక్యాల్ బస్టాప్ వద్ద ఎక్స్ప్రెస్ బస్సులు నిలపాలని ప్రమోద్కుమార్ కోరగా హజీపూర్, దొనబంబడ, లక్సెట్టిపేటలో ఎక్స్ప్రెస్ స్టేజీలున్నాయని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని డీఎం తెలిపారు. -
పుష్కర ఏర్పాట్లు చేపట్టాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: 2027లో గోదావరి, 2028లో కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని నదీ తీర ప్రాంతాల్లో భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుంచి పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర దేవాదాయ శాఖ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ అధికారి నవీన్కుమార్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర అధికారులు పలు సూచనలు చేశారన్నారు. గోదావరి పుష్కరాలు–2027, కృష్ణా పుష్కరాలు–2028లను సురక్షితంగా, సవ్యంగా, భక్తులకు అనుకూలంగా నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పుష్కరాల ప్రణాళిక, సమన్వయం, అమలు బాధ్యతలను ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థకు అప్పగించినట్లు తెలిపారు. దేవాదాయ శాఖకు అవసరమైన సమగ్ర వివరాలను అందిస్తామని, పుష్కర ఘాట్లపై క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే నిర్వహించామని తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ను జిల్లా నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 11ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు ఉన్నాయని, భక్తుల సందర్శన సంఖ్య ఆధారంగా ఈ ఘాట్లను 3 టియర్స్గా విభజించినట్లు తెలిపారు. ఆయా ఘాట్ల అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధిత శాఖల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచులు ప్రజా సేవకు అంకితం కావాలి
బెల్లంపల్లి: సర్పంచులు ప్రజాసేవకు అంకితం కావాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అ న్నారు. బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నూతనంగా ఎన్నికై న సర్పంచులను డీసీసీ అధ్యక్షుడు పి.రఘునాథ్రెడ్డితో కలిసి గు రువారం సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలని సూచించారు. గ్రామాల్లో మౌళిక వసతులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్ర తిఒక్కరికి అందేలా కృషి చేయాలని సర్పంచులకు పిలుపుఇచ్చారు. డీసీసీ అధ్యక్షుడు రఘునా థ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి అభివృద్ధికి పాటుపడాలన్నారు.కాంగ్రెస్ శ్రేణుల తోపులాట..సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు తోపులాడుకున్నారు. ఎన్నికల బరిలో కాంగ్రెస్ రెబెల్గా పోటీచేసి గెలిచిన సర్పంచ్కు సన్మానం చేయడానికి ఆహ్వానించడంతో వేదిక మీదికి రాకుండా ప్రత్యర్థి వర్గం శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలు ఒకరినొకరు తోపులాడుకోగా ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు నిశ్చేష్టులై చూడాల్సి వచ్చింది. అంతలోనే ముఖ్యనాయకులు జ్యోక్యం కలిపించుకొని సముదాయించడంతో గొడవ సద్దు మణిగింది. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ కారుకూరి రాంచందర్, టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, తాండూర్, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి, కాసిపేట, నెన్నెల మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘అమృత్ స్టేషన్’ పనుల పరిశీలన
మంచిర్యాలఅర్బన్/బెల్లంపల్లి: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా మంచిర్యాల రైల్వేస్టేషన్లో చేపట్టిన పనులను సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ బుధవారం పరిశీలించారు. వెయిటింగ్ హాల్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్, వాహనాల పార్కింగ్ తదితర పనులు తనిఖీ చేశారు. బెల్లంపల్లి రైల్వేస్టేషన్ను సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. లోకో ఇతర విభాగాల సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రైల్వే ఉద్యోగులు డీఆర్ఎం దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లగా.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. రైల్వేస్టేషన్లో ఆటోస్టాండ్ ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లు నిర్మించాలని మాజీ కౌన్సిలర్ కే.చంద్రశేఖర్, ఆటోడ్రైవర్లు వినతిపత్రం అందజేశారు. సీనియర్ డీసీఎం షిఫాలి, డీవోఎం నిఖిల్, రైల్వేస్టేషన్ మేనేజర్ ముత్తినేని రవీందర్ పాల్గొన్నారు. -
నేడు డయల్ యువర్ డీఎం
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఈ నెల 18న డయల్ యువర్ ఆర్టీసీ డీఎం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ టి.శ్రీనివాసులు తెలిపారు. ప్రయాణికుల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరణ, పరిష్కారానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం 12గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఆర్టీసీ..అసౌకర్యాల ప్ర యాణం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి డీ ఎం స్పందించారు. డిపో పరిధిలో నడిచే బ స్సుల సమయాలు, మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రజలు 9959226004 నంబరులో తమ అభిప్రాయాలను తెలియజేయాలని, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘చే’జిక్కిన పల్లె
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. మూడు విడతల్లో సాగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ జోరు తగ్గింది. స్వతంత్రులు సత్తాచాటి అధిక స్థానాలు కై వసం చేసుకున్నారు. బీజేపీ నామమాత్రంగా మారి రెండంకెలకు చేరుకోలేపోయింది. తొలి, మలి విడతల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో విజయం సాధించగా.. మూడో విడతలోనూ హవా కొనసాగించారు. మొదటి విడత మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. మలి విడత బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల, తాండూరు, వేమనపల్లి మండలాల్లో ఎన్నికలు జరిగాయి. మూడో విడత చెన్నూర్ నియోజకవర్గం భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తంగా 306 గ్రామ పంచాయతీలకు గాను 12సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వేమనపల్లి మండలం రాజారం, దండేపల్లి మండలం గూడెం, నెల్కివెంకటాపూర్, వందూరుగూడ గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు. మిగతా 290 పంచాయతీల్లో ఏకగ్రీవాలతో కలిపి 183 స్థానాల్లో కాంగ్రెస్, 59 చోట్ల బీఆర్ఎస్, 50 గ్రామాల్లో స్వతంత్రులు, తొమ్మిది చోట్ల బీజేపీ, ఒకచోట సీపీఐ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందారు. స్వతంత్రులుగా గెలిచిన పలు స్థానాల్లోని అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావహులుగా ఉండి.. రెబల్స్గా గెలిచిన వారే కావడం గమనార్హం. రాష్ట్ర మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే జి.వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే జి.వినోద్తోపాటు డీసీసీ, నాయకులు గ్రామాల్లో అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతోపాటు రెబల్ అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చి మరీ గెలుపొందారు. పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రచారం చేసినా బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలను గెలుచుకోలేకపోయింది. మరోవైపు ప్రతిపక్షం కోసం బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు సాగించినా పట్టు దొరకలేదు. కాగా, జిల్లాలోని 16మండలాల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, పోలీసు అధికారుల కృషితో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మూడో విడతలో మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి.నియోజకవర్గాల వారీగా ఫలితాలు..నియోజకవర్గం జీపీలు ఏకగ్రీవం ఎన్నికలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సీపీఐ స్వతంత్ర మంచిర్యాల 90 06 81 53 16 09 – 09 బెల్లంపల్లి 114 02 111 81 25 –– 01 06 చెన్నూర్ 102 04 98 49 18 –– –– 35 మొత్తం 306 12 290 183 59 09 01 50 -
శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేదు
మంచిర్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించిన వారు ఎంతటివారైనా రాజీపడేది లేదని మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన రామగుండం పోలీసు కమిషనరేట్ను ఆకస్మికంగా సందర్శించారు. ఆర్మ్డ్ సాయుధ దళ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కమిషనరేట్ పరిధిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, భద్ర త ఏర్పాట్లు, పోలింగ్ ప్రక్రియ, ఫలితాల వి వరాలు అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు ఇంటెలిజెన్స్, ఇన్ఫార్మర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అన్నారు. అనంతరం కమిషనరేట్ ఆవరణలో నివాస గృహాల నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించారు. నిర్ధిష్ట గడువులో పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తదితరులు పాల్గొన్నారు. -
ఆరుసార్లు ఓట్ల లెక్కింపు..
జైపూర్: మండలంలోని పెగడపల్లి గ్రామంలో బుధవారం ఆరుసార్లు ఓట్ల లెక్కింపు నిర్వహించాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు నరేశ్పై స్వతంత్ర అభ్యర్థి రాము 15ఓట్ల తేడాతో గెలుపొందాడు. నరేశ్ రీకౌంటింగ్ కోరగా అధికారులు ఆరుమార్లు లెక్కించారు. ప్రతీసారి రాము ఓట్లు తగ్గుతూ రాగా.. చివరికి నాలుగు ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో ఇరువర్గాల మధ్యన ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి రాముకు సంబంధించిన వ్యక్తులు ఆందోళనకు దిగారు. సీసీ కెమెరాల రికార్డులతో మరోమారు కౌంటింగ్ నిర్వహించి ఎట్టకేలకు రాము రెండు ఓట్లతో గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు. -
మిట్టపల్లిలో ఉద్రిక్తత
జైపూర్: మండలంలోని మిట్టపల్లిలో బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు కామెర మనోహర్ సోదరుడు మధ్యాహ్నం ఓటింగ్ ముగిసిన తర్వాత కొన్ని బ్యాలెట్ పత్రాలతో కౌంటింగ్ హాల్లోకి వెళ్లాడని, బాక్సులను మార్చే ప్రయత్నం చేశారని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలో మంత్రి వివేక్వెంకటస్వామి అరాచకాలు, హత్య రాజకీయాలను ప్రో త్సహిస్తున్నారని ఆరోపించారు. షెట్పల్లిలో బీఆర్ఎస్ నాయకుడిపై కత్తితో దాడి చేశారని, కోటపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశారని రేషన్ డీలర్ను సస్పెండ్ చేశారని అన్నారు. మిట్టపల్లిలో రెండు గంటలకు ప్రారంభం కావాల్సిన ఓట్ల లెక్కింపును రెండు గంటలు ఆలస్యం చేశారని తెలిపారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఏసీపీ వెంకటేశ్వర్ జోక్యం చేసుకుని లెక్కింపు కేంద్రంలో క్షుణ్ణంగా పరిశీలించామని, ఎలాంటి పొరపాట్లు జరగలేదని, కౌంటింగ్ హాల్లోకి వెళ్లిన మనోహర్ సోదరుడిపై కేసు నమోదు చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. ఇందారంలో.. ఇందారంలోనూ ఉదయం స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు ఎండీ.ఫయాజ్ కుమారుడు, బంధువులు పోలింగ్ కేంద్రంలో డబ్బులు పంచుతూ ప్రచారం చేస్తున్నారని స్వతంత్ర అభ్యర్థి వెన్నంపల్లి సాగర్ ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు అధికారులు సపోర్టు చేస్తున్నారని ఆందోళనకు దిగారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పారు. బావురావుపేటలో.. చెన్నూర్రూరల్: మండలంలోని బావురావుపేట గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారు తాటి శ్రీనివాస్గౌడ్, స్వతంత్ర అభ్యర్థి పబ్బ జ్యోతి పోటీపడ్డారు. ఓట్ల లెక్కింపులో శ్రీనివాస్గౌడ్కు రెండు ఓట్లు ఎక్కువ రాగా, జ్యోతి మద్దతుదారులు రీకౌంటింగ్కు పట్టుబట్టారు. రీకౌంటింగ్లో ఒక్క ఓటు తేడా వచ్చింది. మళ్లీ రీకౌంటింగ్ చేయాలని, తమకు పోలైన ఓట్లలో చెల్లనిని ఎక్కువ ఉన్నాయని స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులు పట్టుబట్టడంతో గొడవకు దారి తీసింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో అధికారులు మళ్లీ రీకౌంటింగ్ చేశారు. శ్రీనివాస్గౌడ్ రెండు ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ప్రకటించారు. -
పరదాల చాటున పోలింగ్!
నిర్మల్ జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను చూసి ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రాథమిక పాఠశాలల్లో గదులు తక్కువగా ఉండడంతో పాఠశాలల ఆవరణలోనే పరదాలు కట్టి బూత్లు ఏర్పాటు చేశారు. ముధోల్ నియోజకవర్గంలోని భైంసా, బాసర, కుభీర్ మండలాల్లో చాలా పాఠశాలల ఆవరణలో ఇలా పరదాల చాటునే పోలింగ్ నిర్వహించారు. ఇలేగాం, కుంసర గ్రామాల్లోనూ పరదాలతోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో గదులు ఉన్నా.. పరదా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
రిటైర్డు ఉద్యోగులకేది బోనస్
శ్రీరాంపూర్: సింగరేణిలో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వారికి ప్రతీ ఆర్థికపరమైన చెల్లింపుల్లో అధికారులు జాప్యం చేస్తున్నారు. ప్రతీసారి బోనస్ సమయంలో రిటైర్డ్ ఉద్యోగులు ఎదురుచూడాల్సి వస్తోంది. ఆన్రోల్ ఉద్యోగులకు లాభాల వాటా, దీపావళి బోనస్ డబ్బులు చెల్లించి మూడు నెలలు గడుస్తున్నా రిటైర్డ్ ఉద్యోగులకు బోనస్ డబ్బులు అందలేదు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సాధించిన లాభాల నుంచి వాటా చెల్లించారు. ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 నాటికి 100 మస్టర్లు చేసిన వారు ఈ లాభాల బోనస్కు అర్హత సాధిస్తారు. దీంతోపాటు జనవరి 1, 2024 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు పని చేసిన వారికి దీపావళి బోనస్(పీఎల్ఆర్) చెల్లించారు. ఇందుకు 30 మస్టర్లు చేసి ఉంటే అర్హులు. ఆగస్టు 31, 2025కి ముందు రిటైర్డ్ అయిన వారికి లాభాల వాటా, సెప్టెంబర్ 30, 2025కి ముందు రిటైర్డ్ అయిన వారికి దీపావళి బోనస్ చెల్లించలేదు. ఈ నిర్ణీత తేదీల్లో పని చేసి, నిర్ణీత మస్టర్లు చేసి ఉంటే ఈ బోనస్కు అర్హులుగా ఉంటారు. ఇలా శ్రీరాంపూర్లో లాభాల వాటా కోసం 350 మంది, దీపావళి బోనస్ కోసం 600 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఆడిట్ పేరిట జాప్యం కంపెనీలో అన్నింటికీ కంప్యూటర్ ఆన్లైన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అయినా రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థికపరమైన చెల్లింపులకు వచ్చే సరికి ఏవేవో కొర్రీలు పెడుతూ జాప్యం చేస్తున్నారు. ఆడిట్ చేస్తున్నామంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఉద్యోగుల హాజరు శాతం మొదలుకొని వేతనాలు అన్ని కూడా కంప్యూటర్ సాప్ ప్రోగ్రాంలో నిక్షిప్తమై ఉంటాయి. వాటిని క్రోడీకరించి ఎంత మొత్తం చెల్లించాలో లెక్కలు తీయడానికి అధికారులు నెలల సమయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. రిటైర్డ్ అయిన వారికి బోనస్ డబ్బులు చెల్లించాలంటే వారు కంపెనీకి ఉన్న బకాయిలు చూడాలని, పీనల్ రెంట్లు, ఫెస్టివల్ అడ్వాన్స్లు, ఆడిట్ రివకరీలు, మెడికల్ బిల్లులు, నామినీ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు వారు సమర్పిస్తే పూర్తి స్థాయిలో ప్రాసెస్ చేసిన తరువాతే చెల్లించడం వీలవుతుందని, ఆన్రోల్ కార్మికులతోపాటుగా వెంటనే చెల్లిండం వీలుకాదని పర్సనల్ డిపార్టుమెంట్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వీరికి చెల్లింపు కోసం తాజాగా కార్పొరేట్ నుంచి ఆదేశాలు వచ్చాయని, ప్రాసెస్ చేసి మరో 20 రోజుల్లో చెల్లించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
సిరా గుర్తు తొలిగిస్తున్న వ్యక్తి పట్టివేత
ముధోల్ : మూడో వి డత పంచాయతీ ఎ న్నికల సందర్భ ంగా నిర్మల్ జిల్లా ముధోల్ ప్రభుత్వ పాఠశాల కేంద్రంలో ఓటు వేసి బ యటకు వచ్చిన ఓ మహిళ వేలికి పెట్టి న సిరా గుర్తును తొలగిస్తూ ఓ వ్యక్తి పట్టుపడ్డాడు. మండల కేంద్రం నయాబాదికి చెందిన ఆర్బాజుద్దీన్ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన మహిళ వేలికి పెట్టిన సిరా చుక్కను కెమికల్తో తొలగిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆర్బాజుద్దీన్ను అ దుపులోకి తీసుకుని కెమికల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. దొంగ ఓట్లు వేయించేందుకు సిరా గుర్తు తొలగించేందుకు ప్రయత్నించి ఉండవచ్చుని పోలీసులు భావిస్తున్నారు. డీసీసీ సొంత ఊరిలో బీఆర్ఎస్ విజయంగుడిహత్నూర్: డీసీసీ అఽ ద్యక్షుడు నరేశ్ జాదవ్ సొం త ఊరు తోషంతండాలో బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థి జాదవ్ జితేందర్ 294 ఓట్లు సాధించి 68 ఓట్ల మెజారిటీతో విజ యం సాధించాడు. కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన జాదవ్ శ్రీకాంత్ 226 ఓట్లు సాధించి పరాజయం పాలయ్యాడు. జాదవ్ నరేశ్ ఉదయం తన సొంతూరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
నాడు భార్యలు.. నేడు భర్తలు
చెన్నూర్రూరల్: మండలంలోని నాగాపూర్, లింగంపల్లి గ్రామాల్లో 2019లో భార్యలు సర్పంచులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సర్పంచుల రిజర్వేషన్ కలిసి రావడంతో భర్తలు పోటీ చేసి గెలుపొందారు. నాగాపూర్లో 2019లో బీసీ మహిళకు రిజర్వ్ రావడంతో అన్నల మానస బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేసి గెలిచారు. ఈసారి జనరల్ రిజర్వ్ కావడంతో ఆమె భర్త అన్నల తిరుపతి సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. లింగంపల్లిలో 2019లో బీసీ మహిళకు రిజర్వ్ రావడంతో అంగ లక్ష్మి కాంగ్రెస్ మద్దతుతో సర్పంచుగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం బీసీ జనరల్ రిజర్వ్ కావడంతో ఆమె భర్త అంగ రమేష్ కాంగ్రెస్ మద్దతుతో సర్పంచు గెలిచారు. -
విద్యుత్షాక్తో యువకుడు మృతి
కుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన కై పెల్లి ప్రణీత్ విద్యుత్షాక్తో బుధవారం మరణించాడు. అయ్యప్ప దీక్షలో ఉన్న ప్రణీత్ బుధవారం వేకువజామునే పూజ చేశాడు. అనంతరం మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టడానికి పొలం వద్దకు వెళ్లాడు. మోటారు స్టార్ట్చేసే క్రమంలో విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై మృతిచెందాడు. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. ఈమేరకు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రణీత్కు తల్లి, సోదరుడు ఉన్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నిర్లక్ష్యం వహిస్తున్నారు..
ప్రతీసారి రిటైర్డ్ ఉద్యోగులకు లాభాల వాటా, దీపావళి బోనస్ చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. ఆన్రోల్ కార్మికులకు చెల్లించేటప్పుడే రిటైర్డ్ ఉద్యోగులకూ కూడా చెల్లించాల్సి ఉండగా కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రిటైర్డ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – కేతిరెడ్డి సురేందర్రెడ్డి, టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం బోనస్ డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. ప్రతీసారి బోనస్ చెల్లింపుల్లో రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సింగిల్ క్లిక్తో కంప్యూటర్లో ఉద్యోగుల సమస్త వివరాలు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా నెలల తరబడి లెక్కలు చేయడం విడ్డూరంగా ఉంది. సత్వరమే రిటైర్డ్ ఉద్యోగులకు బోనస్ చెల్లించాలి. – ఏ.వేణుమాధవ్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
అన్నపై తమ్ముడు.. చెల్లైపె అక్క
తిర్యాణి(ఆసిఫాబాద్): తిర్యాణి మండలంలో సొ ంత అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య పంచా యతీ పోరు ఆసక్తికరంగా మారింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో ఒకచోట అన్నపై తమ్ముడు గెలవగా.. మరోచోట చెల్లెలుపై అక్క విజయం సాధించింది. మండలంలోని సుంగాపూర్ పంచాయతీలో అన్న టేకం మారుతి బీఆర్ఎస్ మద్దతుతో పోటీపడగా, తమ్ముడు టేకం సురేశ్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా బరిలో నిలిచాడు. మారుతికి 137 ఓట్లు రాగా, సురేశ్కు 159 ఓట్లు వచ్చాయి. దీంతో సొంత అన్నపై తమ్ముడు సురేశ్ 22 ఓట్లతో విజయం సాధించాడు. అలాగే గడలపల్లిలో అక్క ఆత్రం శంకరమ్మ బీఆర్ఎస్ మద్దతుతో, చెల్లెలు సిడాం విమల కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచారు. శంకరమ్మకు 326 ఓట్లు రాగా, విమల 258 ఓట్లకే పరిమితమైంది. దీంతో అక్క 68 ఓట్లతో విజయం సాధించింది. -
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే, సీఐ మధ్య వాగ్వాదం
ఆసిఫాబాద్అర్బన్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, స్థానిక పట్టణ సీఐ బాలాజీ వరప్రసాద్ మధ్య బుధవారం వా గ్వాదం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ మండలంలోని రాజంపేట పోలింగ్ కేంద్రానికి సమీపంలో గల ఎమ్మెల్యే నివాసం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు గుమిగూడారు. గమనించిన సీఐ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం వద్ద నుంచి గమనించిన ఎమ్మెల్యే వెంటనే ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఉన్నవారిని హెచ్చరించడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే ఇక్కడి నుంచి పోలీసులు వెళ్లిపోవాలని, లేనిపక్షంలో రోడ్డుపై బైఠాయిస్తానని హెచ్చరించారు. దీంతో సీఐ సిబ్బందితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయం ఫ్లెక్సీ రగడ రాజంపేటలోని పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసం వద్ద పార్టీ నాయకులతో కూడిన ఫ్లెక్సీలతో తొలగించే క్రమంలో ఉదయం 9.30 గంటలకు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీవో లోకేశ్వర్రావు ఆధ్వర్యంలో అధికారులు ఫ్లెక్సీలు తొలగించేందుకు యత్నించగా కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలు తొలగించిన తర్వాతే తమవి తొలగించాలని పట్టుబట్టారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి ఇన్నిరోజులైనా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. చివరికి కార్యకర్తలు ఫ్లెక్సీల తొలగింపునకు అంగీకరించడంతో ఆందోళన సద్దుమణిగింది. -
బైక్ కొనివ్వలేదని బలవన్మరణం
ఖానాపూర్: ఏడాది కాలంగా తనకు బైక్ కొనివ్వాలని అడుగుతున్నా.. తండ్రి ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్నాడని మనస్తాపం చెందిన యువకుడు క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖానాపూర్ మండలం కొమ్ముతండాలో జరిగింది. చేతికి వచ్చిన కొడుకు చేదోడుగా ఉంటాడనుకుంటే.. బలమన్మణానికి పాల్పడడంతో తండ్రి గుండెలో పగిలేలా రోదిస్తున్నాడు. ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. బీర్నంది పంచాయతీ పరిధిలోని కొమ్ముతండాకు చెందిన భూక్య బలిరాంకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు భూక్య వెంకటేశ్(21) ఉన్నాడు. పెద్ద కూతురుకు వివాహం చేశాడు. ఐదేళ్ల క్రితం బలిరాం భార్య చనిపోయింది. ఇక ఒక్కగానొక్క కొడుకు కావడంతో వెంకటేశ్ను గారాబంగా పెంచారు. దీంతో చదవుకూడా పెద్దగా అబ్బలేదు. దీంతో ఐదేళ్లుగా తండ్రికి తోడుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఏడాది కాలంగా వెంకటేశ్ తనకు బైక్ కొని ఇవ్వాలని తండ్రి బలిరాంను కోరుతున్నాడు. పెద్ద కూతురు పెళ్లి చేయడం కారణంగా వాయిదా వేశాడు. ఈ ఏడాది వానాకాలం పంట దిగుబడి కూడా ఆశించిన మేరకు రాలేదు. అయినా వెంకటేశ్ మంగళవారం తనకు బైక్ కావాలని కోరాడు. తండ్రి యాసంగి పంట తర్వాత కొనిస్తానని చెప్పాడు. తరచూ వాయిదా వేస్తున్నాడని మనస్తాపం చెందిన వెంటకేశ్ పొలం వద్దకు వెళ్లి.. పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సహాయంతో ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో నిర్మల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందాడు. ఒక్కగానొక్క కొడుకు మరణంతో బలిరాం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పోలీసు లాఠీ.. అవ్వకు సాయం
ఆదిలాబాద్టౌన్: మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిశీలన కోసం ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ఆదిలాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు. బోథ్ మండల కేంద్రం నుంచి సొనాలకు వెళ్తున్న క్రమంలో ఓ వృద్ధురాలు వాహనం నుంచి కింద పడడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. ఎన్నికల హడావుడిలో ఉన్నప్పటికీ ఎస్పీ విషయాన్ని గమనించి ఆమె వద్దకు చేరుకున్నారు. వాహనంలో ఉన్న ఫస్ట్ఎయిడ్ కిట్తో ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత ఎస్కార్ట్ వాహనంలో బోథ్ ఆస్పత్రికి తరలించేలా చొరవ చూపారు. కాగా ఆ వృద్ధురాలు నడవడానికి ఇబ్బందులు పడుతుండగా పోలీసుల వద్ద ఉన్న లాఠీని అందజేసి ఇలా వాహనం వరకు తీసుకెళ్లారు. ఎస్పీ చొరవను పలువురు అభినందించారు. -
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
కాసిపేట: మండలంలోని దేవాపూర్కు చెందిన రామిళ్ల లింగయ్య(55) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం... ఎస్సీ కాలనీకి చెందిన లింగయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అప్పులు చేసి పెద్ద కూతురుకి వివాహం చేశాడు. రెండో కూతురుకు పెళ్లి చేయాలనే బాధతో మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 11న మధ్యాహ్నం 3గంటలకు ఇంటి నుంచి వెళ్లి సాయంత్రం 5గంటలకు వచ్చాడు. దేవాపూర్ శివారులోని అడవికి వెళ్లి మద్యం మత్తులో నల్లపొడిసె చెక్క తాగి వచ్చినట్లు చెప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు రామిళ్ల దిలీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పతుల్.. సతుల్.. సర్పంచ్
లోకేశ్వరం:పంచాయతీ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాకు చెందిన కొన్ని గ్రామాల ప్రజలు భిన్నమైన, విచిత్రమైన తీర్పు ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిపించిన కుటుంబానికే మరో అవకాశం ఇచ్చారు. అయితే గత ఎన్నికల్లో పతిని గెలిపిస్తే.. ఈ ఎన్నికల్లో సతులను గెలిపించారు. లోకేశ్వరం మండలం రాజూర, పుస్పూర్, లోకేశ్వరం పంచాయతీ ఓటర్లు 2019, 2025 ఒకే కుటుంబాలకు చెందిన భార్య, భర్తలు పంచాయతీ పగ్గాలు అపపగించారు. 2019 ఎన్నికల్లో రాజూర సర్పంచ్గా ముత్తగౌడ్ ఎన్నిక కాగా, 2025 ఎన్నికల్లో ఆయన భార్య శ్యామలను గెలిపించారు. ఇక పుస్పూర్ సర్పంచ్గా 2019లో సంగెం నర్సన్నను ఎన్నుకోగా ప్రస్తుతం ఆయన భార్య సంగెం లక్ష్మిని గెలిపించారు. లోకేశ్వరం ఓటర్లు 2019లో తమ సర్పంచ్గా దార్వాడి సౌజన్యను ఎన్నుకున్నారు. 2025 ఎన్నికల్లో ఆమె భర్త దార్వాడి కపిల్కు పగ్గాలు అప్పగించారు. -
చదును పేరిట మట్టిదందా
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేటలో ప్రభుత్వ వైద్య కళాశాలలో చదును పేరిట అక్రమ మట్టిదందా సాగుతోంది. కళాశాల నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ మట్టిదందాకు తెరతీశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. మట్టిని లారీకి రూ.రెండు వేల చొప్పున అమ్ముకుంటున్నారని, గత కొన్ని రోజులుగా సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రశ్నించే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మంగళవారం మాజీ ఎంపీటీసీ ఒడ్డె బాలరాజు, స్థానిక గ్రామస్తులు వైద్య కళాశాలలోకి వెళ్లి సదరు కాంట్రాక్టర్ను నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదన చోటు చేసుకుంది. స్థానిక రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారుల దృష్టి సారించకపోవడంతో మట్టిని అమ్ముకుంటున్నారని, సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఓటు హక్కు వినియోగించుకోవాలి
చెన్నూర్రూరల్: ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు విని యోగించుకోవాల ని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్, పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మూడవ విడత సర్పంచ్ ఎన్నికలలో భాగంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెన్నూర్ పట్టణ సీఐ దేవేందర్రావు పాల్గొన్నారు. భద్రత మధ్య ఎన్నికలు భీమారం: భద్రత మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నతపాఠశాల వద్ద ఏర్పాటు చేసి న ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. మండలంలోని ఆన్ని గ్రామ పంచాయతీ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఐలు నవీన్, అశోక్, ఎస్సై శ్వేత పాల్గొన్నారు. -
‘చివరి’ విజేతలెవరో..!
చెన్నూర్: జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం చెన్నూర్, మందమర్రి, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఆయా మండలాల్లో 102 గ్రామ పంచాయతీలు ఉండగా.. చెన్నూర్ మండలం రచ్చపల్లి, కోటపల్లి మండలం ఎసాన్వాయి, లక్ష్మిపూర్, మందమర్రి మండలం శంకర్పల్లి సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 98 గ్రామ పంచాయతీల్లో 390మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 868 వార్డు స్థానాలకు గాను 153 ఏకగ్రీవం కాగా.. మిగతా 711 స్థానాల్లో 1,905మంది బరిలో ఉన్నారు. ఆయ మండలాల్లో వార్డు సభ్యుల స్థానాలకు పోటీ తీవ్రంగా ఉండడంతోపాటు సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలు వెల్లడయ్యే వరకు అర్ధరాత్రి అయ్యే అవకాశం లేకపోలేదు. ఎన్నికల సామగ్రి పంపిణీఆయా మండలాల్లోని మండల పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఎన్నికల అధికారులు, సిబ్బందికి పోలింగ్ సామగ్రి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల ఉత్తర్వులు కాపీలు పంపిణీ చేశారు. చెన్నూర్లోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా ఎన్నికల పరిశీలకులు మోహన్రెడ్డి, డీపీవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో శ్రీనివాస్ సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పోలింగ్ అధికారులు, సిబ్బంది పోలీసు బందోబస్తు మధ్య ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. పోలింగ్ సిబ్బంది తరలింపు కోసం 59 బస్సులు, 19 కార్లు, 9 టాటాఏస్ వాహనాలు సమకూర్చారు. 999 ప్రీసైడింగ్ అధికారులు(పీవోలు), 1092 ఓపీవోలు, 99 మంది స్టేజ్–2 ఆర్వోలు, ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు, 18 మంది వెబ్ కాస్టింగ్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. 1,06,889 మంది ఓటర్లుచెన్నూర్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 1,06,889 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జైపూర్ మండలంలో అత్యధికంగా 30,622 మంది ఓటర్లు ఉండగా.. మందమర్రి మండలంలో అత్యల్పంగా 11,127 మంది ఓటర్లు ఉన్నారు. మందమర్రి మండలంలో తక్కువ ఓటర్లు ఉండడం వల్ల తొలి ఫలితం ఇక్కడే వెలువడే అవకాశం ఉంది. నియోజకవర్గంలోని గ్రామీణ ఓటర్లలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. కాగా, బుధవారం జరిగే ఎన్నికలతో జిల్లాలో మూడు విడతలుగా సాగిన పంచాయతీ ఎన్నికల పర్వం ముగియనుంది. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తినస్పూర్: పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పోలింగ్, మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుందని తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, సిబ్బందికి అసౌకర్యాలు కలుగకుండా అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. -
‘న్యాయవాదుల సమస్యల పరిష్కారమే లక్ష్యం’
మంచిర్యాలక్రైం: న్యాయవాదుల సమస్యల పరిష్కారమే లక్ష్యమని హైకోర్టు సీనియర్ న్యాయవాది, తెలంగాణ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వి.రఘునాథ్ అన్నారు. తె లంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన స్థానిక జిల్లా కోర్టును సందర్శించారు. బార్ అసోసియేషన్ ఇన్చార్జి అధ్యక్షుడు భుజంగరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. న్యాయవాదుల కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువ న్యాయవాదులకు స్టైఫండ్ అందేలా కృషి చేస్తానని తెలిపారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించా లని కోరారు. సీనియర్, యువ, మహిళా న్యాయవాదులు పాల్గొన్నా రు. -
జేసీబీ యజమాని ఆత్మహత్యాయత్నం
జన్నారం: జేసీబీ యజమాని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడెం మండలం కల్లెడకు చెందిన వెంబడి శేఖర్ మండలంలోని బాదంపల్లిలో తన అత్తగారింటిలో ఉంటూ జేసీబీ నడుపుకొంటున్నాడు. ఈనెల 14న పుట్టిగూడ సమీపంలో బాల్నాయక్ పొలంలో జేసీబీతో వ్యవసాయ బావి తవ్వాడు. బావి నుంచి వచ్చిన మట్టిని ఇందిరమ్మ ఇళ్ల కోసం తరలించాడు. ఈక్రమంలో అటవీ అధికారులు వచ్చి జేసీబీకి తాళం వేశారు. రైతు బాల్నాయక్ పట్టా పాస్బుక్ తీసుకెళ్లి చూపించగా తిరిగి తాళాలు ఇచ్చారు. మంగళవారం అటవీ అధికారులు మళ్లీ వచ్చారు. జేసీబీ ని సీజ్ చేసేందుకు తాళాలు ఇవ్వాలని శేఖర్పై ఒత్తిడి తెచ్చారు. దీంతో మనస్తాపంతో అతడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్తులు పెట్రోల్ బాటిల్ లాక్కుని అతడిపై నీళ్లు పోశారు. ఈ విషయమై సెక్షన్ అధికారి బోజ్యనాయక్ను సంప్రదించగా, ఇకో సెన్సిటివ్ జోన్ నిబంధనల ప్రకారం మొరం తరలించడం నేరమని తెలిపారు. పట్టా భూమిలో మొరం తీసే అనుమతి లేదని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే జేసీబీని సీజ్ చేసేందుకు వస్తే రాద్ధాంతం చేస్తున్నాడని వివరించారు. -
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
రోజూ సాధన చేస్తున్నాను ఆసిఫాబాద్రూరల్: నేను ఫుట్బాల్ పోటీల్లో 2023, 2025లో రెండుసార్లు జాతీయ స్థాయిలో పాల్గొన్నాను. రాష్ట్ర స్థాయిలో కూడా పతకాలు సాధించాను. భవిష్యత్లో ఫుట్బాల్ కోచ్గా గిరిజన బాలికలను మంచి క్రీడాకారిణులుగా తీర్చిదద్దడమే నా లక్ష్యం. ఇదే లక్ష్యంతో రోజూ సాధన చేస్తున్నాను. – భూమిక, ఎనిమిదో తరగతి (గిరిజన బాలికల గురుకుల పాఠశాల) స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొడతా ఆసిఫాబాద్రూరల్: నేను మా కోచ్ రవికుమార్ సూ చనలు, పలహాలు పాటిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో మూ డుసార్లు, జాతీయ స్థాయి పోటీల్లో 2023, 2024లో పాల్గొన్నాను. భవిష్యత్లో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి స్పోర్ట్స్ కోటాలో జాబ్ సాధి స్తా. ఇదే లక్ష్యంతో ముందుకుసాగుతున్నాను. – దుర్గాదేవి, పదో తరగతి (గిరిజన బాలికల గురుకుల పాఠశాల) ఇండియా కోచ్ కావాలని ఉంది ఆసిఫాబాద్రూరల్: ఇప్పటివరకు 10మంది జాతీ య, 30మంది రాష్ట్ర స్థా యిలో ఆడి ఐదు బంగారు పతకాలు సాధించారు. వి ద్యార్థినులను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నాను. 2014లో మ ధ్యప్రదేశ్లో తెలంగాణ కోచ్గా ఎంపికయ్యా ను. ఇండియా కోచ్గా ఎంపికవ్వడమే లక్ష్యం. – రవికుమార్, ఫుట్బాల్ కోచ్ (గిరిజన బాలికల గురుకుల పాఠశాల) కోచ్ల సహకారంతోనే.. ఫుట్బాల్ ఆటపై ఉన్న ఆసక్తితో మేము వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరుస్తున్నాం. కోచ్లు ఇమ్రాన్, అంబాజీ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మిగతావారు కూడా ఈ క్రీడలో రాణించేలా కృషిచేస్తాం. జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న క్రీడతో ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించవచ్చు. – అల్లం సాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలువురు విద్యార్థులు చదువుతోపాటు ఫుట్బాల్ ఆటలోనూ రాణిస్తున్నారు. కోచ్ల పర్యవేక్షణలో శిక్షణ పొంది రాటుదేలుతున్నారు. బాల్ కొడితే గోల్ పడాల్సిందే.. అన్న రీతిలో వివిధ స్థాయిల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి పతకాలు కొల్లగొడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలువురు ఫుట్బాల్ క్రీడాకారులపై కథనం.. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే మరింత రాణించొచ్చు మందమర్రిరూరల్: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న గాలిపెల్లి అను ఫుట్బాల్ ఆటలో రాణిస్తోంది. మందమర్రి మండలానికి గుర్తింపు తెస్తోంది. గత నెల 15 నుంచి 17వరకు నల్గొండ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–17 పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. డిసెంబర్ 17నుంచి 19వరకు జార్ఖండ్లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సారా తస్నీమ్, పీడీ చిన్నక్క అను కి ప్రశంసాపత్రం అందించారు. విద్యార్థిని చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తుందని అభినందించారు. అను మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఫుట్బాల్లో రాణిస్తున్నానని తెలిపింది. విద్యార్థులను పేరెంట్స్ ప్రోత్సహిస్తే వారు వారికి నచ్చిన క్రీడల్లో సత్తా చాటుతారని పేర్కొంది. రాటుదేలుతూ.. రాణిస్తూ..కాగజ్నగర్ టౌన్: సిర్పూర్(టీ) కాగజ్నగర్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఫుట్బాల్ క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. స్టేట్ లెవల్ మహిళా కోచ్ మాసవేని వనిత శిక్షణలో రాటుదేలుతున్నారు. మైదానంలోకి దిగారంటే గోల్ కొట్టాల్సిందే.. అనే రీతిలో వివిధ స్థాయిల్లో నిర్వహించే పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. అందరి ప్రశంసలు పొందుతున్నారు. 30మంది విద్యార్థులు, 30 మంది విద్యార్థినులు రోజూ ఉదయం 5.30నుంచి 6.30 గంటల వరకు, సెలవు దినాల్లోనూ 4 నుంచి 5గంటల వరకు సాధన చేస్తున్నారు.రాష్ట్రస్థాయిలో రాణించిన రాజేశ్వరి దహెగాం: మండలంలోని చినరాస్పెల్లి గ్రామానికి చెందిన ఎల్కరి రాజేశ్వరి ఫుట్బాల్ క్రీడలో రాష్ట్ర స్థాయిలో రాణించింది. జిల్లా స్థాయిలో రాణించడంతో రాష్ట్ర స్థాయికి ఎంపికై ంది. చినరాస్పెల్లి పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుకుంటోంది. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తోంది. నవంబర్ 14నుంచి 16వరకు నల్గొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఆడి మంచి పేరు తీసుకురావాలన్నదే తన లక్ష్యంగా రాజేశ్వరి పేర్కొంది. డేట్ అకాడమీని ఓపెన్ చేస్తే బాగుంటుంది ప్రభుత్వం ప్రతీ మండలానికి ఒక డేట్ అకాడమీ సెంటర్ను ఓపెన్ చేస్తే మరింత మంది క్రీడాకారులను తయారు చేయవచ్చు. ప్రతీ జిల్లాలో ఆయా క్రీడలకు సంబంధించిన కోచ్లను ప్రభుత్వం నియమించాలి. 2010 నుంచి కోచ్ల నియామకం నిలిచింది. కాంట్రాక్ట్ పద్ధతిలోనే తీసుకుంటున్నారు. మా పాఠశాల నుంచి ఎనిమిది మంది వరకు నేషనల్ క్రీడాకారులున్నారు. నేషనల్ స్థాయిలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు సరైన సదుపాయాలు లేకున్నా రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. పాఠశాలలో నిత్యం ఉదయం 5.30 నుంచి 6.30గంటల వరకు, సెలవు దినాల్లో నాలుగు గంటలపాటు ప్రాక్టీస్ చేయిస్తున్నాం. – మాసవేని వనిత, ఈఎంఆర్ఎస్, కాగజ్నగర్, స్టేట్ లెవెల్ మహిళా విభాగం కోచ్ జాతీయస్థాయికి ఎదిగిన అక్షరమంచిర్యాలఅర్బన్: ఇటీవల ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్బాల్ పోటీల్లో స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న రేగూరి అక్షర మండల స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపికై ంది. అక్షర ఫుట్బాల్ అంటే ఆసక్తి చూపడంతో ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మొదటిసారి నిర్వహించిన పోటీల్లో మైదానంలోకి అడుగుపెట్టిన అక్షర మండల స్థాయి, జిల్లా, జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లా జట్టులో చోటు సాధించింది. నల్గొండ జిల్లాలో అండర్–17లో బాలికల విభాగంలో నిర్వహించిన పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. డిసెంబర్ 18 నుంచి 22వరకు జార్ఖండ్లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. పీడీ శిక్షణ ఇవ్వడంతోనే.. నేను ఆరో తరగతిలో పాఠశాలలో చేరాను. ప్రస్తుతం పదోతరగతి చదువుతున్నాను. పీడీ మేడం ప్రతీరోజు ఉదయం, సాయంత్రం కోచింగ్ ఇస్తున్నారు. దీంతో జిల్లా, రాష్ట్ర, నేషనల్ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఇటీవల కొత్తగూడెంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి, ఒడిశాలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ఆడాను. – అజ్మీర మురళీకృష్ణ బాల్ కొడితే గెలుపే.. ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నిజామాబాద్, రామకృష్ణాపూర్, సిద్దిపేటలో నిర్వహించిన అండర్–14 విభాగంలో మొదటి స్థానం సాధించాను. ఒడిశాలో నిర్వహించిన ఈఎంఆర్ఎస్ పరిధిలో నేషనల్ లెవెల్లో పాల్గొన్నాను. ఫుట్బాల్ ఆటలో మరిన్ని మెళకువలు నేర్చుకుని నేషనల్లో ఆడి సత్తా చాటాలనుంది. – రితక ఇండియా తరఫున ఆడాలన్నదే లక్ష్యం పాఠశాల స్థాయి నుంచి జాతీయస్థాయి పోటీల్లో ఆడాను. అండర్–14 విభాగంలో గతేడాది కొల్లాపూర్లో నిర్వహించిన స్టేట్ లెవెల్ పోటీల్లో ఆడి నేషనల్కు ఎంపికయ్యారు. నవంబర్లో ఒడిశాలో నిర్వహించిన ఎస్జీఎఫ్ పోటీల్లో టీంలో బెస్ట్ ప్లేయర్గా ఆడాను. భారత్ తరఫున ఆడాలన్నదే లక్ష్యం. – ఎలబోయిన అభిలాష్ రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాను మాది మధ్య తరగతి వ్యవసాయం కుటుంబం. నేను ఆరో తరగతిలో ఏకలవ్య పాఠశాలో చేరాను. అప్పటినుంచి క్రీడలు అంటే చాలా ఇష్టం. దీంతో ఫుట్బాల్ కోచ్ సహకారంతో ఆటలో శిక్షణ పొంది నేషనల్ స్థాయిలో ఆడుతున్నాను. ప్రతీరోజు పాఠశాలలో ఉదయం గంట సాయంత్రం 2గంటల పాటు ప్రాక్టీస్ చేస్తాం. – అల్లం రాణి అందరూ ఆడడం చూసి.. పాఠశాలలో అందరూ ఆడడం చూసి ప్రాక్టీస్ చేసి నేషనల్ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో ఆడాను. వనపర్తిలో నిర్వహించిన స్టేట్లెవెల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చాను. రామకృష్ణాపూర్, ఒడిశాలో నిర్వహించిన ఫుట్బాల్ పోటీల్లో పాల్గొని సత్తా చాటాను. ఇండియా ఫుట్బాల్ జట్టులో ఆడాలన్నదే నా లక్ష్యం. – అజ్మీర హారిక కొడితే గోల్ పడాల్సిందే ఫుట్బాల్ ఆటలో దిగానంటే బాల్ కొడితే గోల్లో పడాల్సిందే. ఎస్జీఎఫ్, ఖేలో ఇండియా పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి నేషనల్ స్థాయిలో ఆడి గుర్తింపు పొందాను. నేషనల్ స్థాయిలో ఆడుతాను. మా పీడీ చొరవతో ఎంతోమంది నిరుపేద విద్యార్థులు రాణిస్తున్నారు. నాకు కూడా మంచి కోచ్ కావాలని ఉంది. – నిఖిత ఆర్మీలో చేరి దేశసేవ చేయాలని.. మాది పేద కుటుంబం. ఫుట్బాల్ ఆటల్లో మంచి ప్రతిభ కనబర్చి ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని ఉంది. గతేడాది ఖేలో ఇండియా గేమ్స్లో రామకృష్ణాపూర్లో నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాను. అండర్–14, 17 విభాగంలో ఒడిశాలో నిర్వహించిన ఖేలో ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నాను. – పవార్ అశ్విని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని.. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. పాఠశాలలో సాయంత్రం వేళ నా స్నేహితులు ఫుట్బాల్ ఆడుతుంటే చూసి గతేడాది నుంచి నేనూ గ్రౌండ్కు వెళ్లి శిక్షణ పొందుతున్నాను. గతేడాది వనపర్తిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. నేషనల్ లెవెల్లో అడి ఉన్నతస్థాయిలో స్థిరపడాలని ఉంది. – దీక్షిత -
ఒక్క పైసా రాలే
పిల్లల వివాహాలు, చదువులు, వైద్యఖర్చులకు రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ ఉపయోగపడుతాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ను అందించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుని బిల్లులిస్తే ఏళ్లు గడిచినా రావడం లేదు. వచ్చినా సగం డబ్బులే చెల్లిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం రూ.700 కోట్లు విడుదల చేశామంటున్నా ఒక్క పైసా రాలేదు. – ఎస్.సుధాకర్, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
దశాబ్దాల సేవలకు గుర్తింపేది?
కై లాస్నగర్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా దశాబ్దాల పాటు ప్రజలకు సేవలందించారు. ఉద్యోగ జీవితమంతా ఉరుకులు, పరుగుల మధ్య విధులు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ అనంతరం తమ కుటుంబంతో కలిసి శేషజీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్మైంట్ బెనిఫిట్స్ సకాలంలో అందక అనుకున్న కార్యక్రమాలను పూర్తిచేయలేని దుస్థితితో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే నాణ్యమైన వైద్యసేవలు పొందలేని పరిస్థితి ఉంది. పెన్షన్ సొమ్ముతోనే జీవనం సాగిస్తున్న వారు నానా అవస్థలు పడుతున్నారు. తమకు రావాల్సిన ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల పలుసార్లు ఆందోళనలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 8వేల మంది రిటైర్డ్ ఉద్యోగులున్నారు. బుధవారం జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా పెన్షనర్ల సమస్యలు ఓసారి పరిశీలిస్తే.. బెనిఫిట్స్ విడుదలలో తీవ్ర జాప్యం రిటైర్డ్ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనంతరం జీపీఎఫ్, జనరల్ ఇన్సురెన్స్, గ్రాట్యూటీ, కముటేషన్ లాంటి బెనిఫిట్స్ను ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. అయితే వీటి విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పెన్షన్ మాత్రమే అందిస్తున్న ప్రభుత్వం ఈ ప్రయోజనాలు కల్పించడం లేదు. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు తమ పిల్లల వివాహాలు, ఉన్నత చదువులు, ఇంటి నిర్మాణాలు లాంటివి చేపట్టేందుకు ఆర్థికంగా అవస్థలు పడాల్సి వస్తోంది. వీటికి తోడు బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఆకస్మాత్తుగా వచ్చే రుగ్మతలకు అవసరమైన వైద్య చికిత్స కోసం ఇబ్బంది పడుతున్నారు. నగదు రహిత వైద్యసేవలు అందించాలనే డిమాండ్ వారిలో వ్యక్తమవుతోంది. రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్లు.. -
ప్రోత్సాహం లేక జాతీయ స్థాయిలోనే ఆగిపోయా..
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ గిరిజన క్రీడా పాఠశాలలో 2002 నుంచి 2005 వరకు చదువుకున్నాను. కోచ్ రఘునాథ్రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్ర స్థాయిలో గద్వాల్లో, జాతీయ స్థాయిలో జమ్ముకశ్మీర్లో ఆడి మొదటి స్థానంలో నిలిచాను. 2005లో 10వ తరగతి పూర్తి చేసుకున్న సమయంలో ఉట్నూర్ క్రీడా పాఠశాలను ఎత్తివేశారు. అనంతరం ఇంటర్ ఆదిలాబాద్లోని ఫుట్బాల్ అకాడమీలో చేరడానికి వెళ్లగా దానినీ ఖమ్మం జిల్లాకు తరలించారు. దీంతో ఉట్నూర్కు వచ్చి ఇంటర్ పూర్తి చేశాను. ప్రభుత్వాలు అవకాశం కల్పించకపోవడంతో 2005లో నేషనల్ స్థాయిలోనే ఆగిపోయాను. ప్రస్తుతం ఉట్నూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పీడీగా పని చేస్తున్నాను. ప్రభుత్వాలు దృష్టి సారించి ఆదిలాబాద్, ఉట్నూర్లో ఫుట్బాల్ అకాడమీలు ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు అవకాశం కల్పిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశముంది. క్రీడా పాఠశాలల్లో ఫుట్బాల్ అకాడమీని తిరిగి ఏర్పాటు చేసి నాకు అవకాశం కల్పిస్తే గిరిజన విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చి వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేలా తప్పనిసరిగా కృషి చేస్తా. – పాండురంగ్, జాతీయస్థాయి క్రీడాకారుడు -
గర్భస్థ శిశువు మృతి
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ నర్సింగ్హోంలో గర్భస్థ శిశువు మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మంగళవారం బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని కిరణ్ దాస్బస్తీకి చెందిన కుమ్మరి వసంత్, పద్మ దంపతులకు వివాహమై 20ఏళ్లు అవుతోంది. పిల్లల కోసం నర్సింగ్హోం వైద్యురాలి సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పద్మ గర్భం దా ల్చింది. ఈ నెల 15న ప్రసవానికి సమయం ఇచ్చా రు. దీంతో వైద్యురాలి సూచన మేరకు ఆ రోజు ఆ స్పత్రిలో చేరారు. గర్భస్థ శిశువు చనిపోయినట్లు గు ర్తించిన స్కానింగ్ నిర్వాహకులు వైద్యురాలికి తెలి పారు. దీంతో వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యురా లు సూచించడంతో కుటుంబ సభ్యులు నిలదీశారు. ఆపరేషన్ ద్వారా శిశువును బయటకు తీయాలని వైద్యురాలు సూచించారు. పోలీసులు ఇరువర్గాలతో చర్చించి ఆపరేషన్కు ఏర్పాట్లు చేశారు. న్యాయం చేయాలని ఆందోళన శిశువు మృతికి కారణమైన వైద్యురాలిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని బాధితులు మంగళవారం మధ్యాహ్నం వరకు ఆందోళన చేపట్టారు. డబ్బులు చెల్లించే వరకు ప్రసూతి ఆపరేషన్ ఆలస్యం చేయడం కారణంగానే శిశువు మృతిచెందిందని ఆరోపించారు. బాధితుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ ని సీఐ ప్రమోద్రావు తెలిపారు. కాగా, వైద్యురాలు స్పందిస్తూ శిశువు ఉమ్మనీరు తాగిందని, పద్మ ఆరో గ్య పరిస్థితి సహకరించకపోవడంతో వేరే ఆసుపత్రి కి వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. అన్ని విధాలా ప్రయత్నించామని, తమ తప్పు లేదని తెలిపారు. -
ఆటంటే మక్కువ.. నిత్య సాధన
ఖానాపూర్: ఖానాపూర్ పట్టణానికి చెందిన పలువురు ఫుట్బాల్ క్రీడాకారులు జిల్లాస్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. పట్టణంలోని ప్రైవేట్ క్రీడా మైదా నంలో రోజూ ఉదయం, సాయంత్రం సాధన చేస్తూ ఆటపై తమ నిబద్ధతను చాటుకుంటున్నారు. గతేడాది నవంబర్లో జరిగిన సీఎం క ప్ జిల్లాస్థాయి పోటీల్లో వీరు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆ తర్వాత నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో కడుకుంట్ల సాయికిరణ్, అల్లం సాయికుమార్, మాదాసు రంజిత్కుమార్, గర్కా గోపాలకృష్ణ, కెల్లేటి మనేశ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పలువురు అభినందించారు. నిత్యం సాధన చేస్తున్నాం నిరంతరం సాధన చేస్తే ప్రతి ఒక్కరూ ఫుట్బాల్ పోటీల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. భవిష్యత్లో మేము రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ రాణిస్తాం. 16మంది జట్టుగా ఉన్న మేము నిత్యం సాధన చేస్తున్నాం. అందరూ పూర్తిస్థాయిలో సహకారమందిస్తేనే ఎంతోమంది క్రీడాకారులు రాణిస్తున్నారు. – కడుకుంట్ల సాయికిరణ్ -
సింగరేణి పరిరక్షణకు కలిసి రావాలి
శ్రీరాంపూర్: సింగరేణి ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉందని, పరిరక్షణకు అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షు డు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నస్పూర్ కాలనీలోని ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త గనులు రాకపోవడం వల్ల భవిష్యత్ అంధకారంగా మారిందని, గత పాలకులు కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయలేదని, కంపెనీలో రాజకీయ జోక్యం పెరిగి అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థను కాపాడుకోవడానికి అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్యంగా పోరాడాలని అన్నారు. తెలంగాణ పరిధిలోని బొగ్గుబ్లాకులను సింగరేణికే కేటా యించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 41బొగ్గుబ్లాకుల వేలానికి పిలిచిందని, ఇతర కంపెనీలు పాల్గొనకుండా అడ్డుకుని సింగరేణికే దక్కేలా పోరాడాలని అన్నారు. ఈ సమావేశంలో యూ నియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, సహాయ కార్యదర్శి కొమురయ్య, నాయకులు అఫ్రోజ్ ఖాన్, నర్సింగరావు, అనంతరె డ్డి, పరుశురాం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ.. అసౌకర్యాల ప్రయాణం!
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీలో ‘మహాలక్ష్మి’ పథకం అమలుతో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆ సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెరగకపోవడం, కిక్కిరిసి ప్రయాణించాల్సి రావడం, ఉన్న సిబ్బందిపై ఒత్తిడి పెరగడం వల్ల ప్రయాణం అసౌకర్యాల మధ్య సాగుతోంది. దీంతో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికులకు వాటర్బాటిల్, ఏసీ బస్సుల్లో దుప్పట్లు అందించడం, చెయ్యెత్తితే బస్సులు ఆపడం మాటెలా ఉన్నా స్టాప్లోనూ నిలపకుండా వెళ్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపకపోవడంపై అధికారులకు ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. గంటల తరబడి వేచి చూస్తుండగా.. సమయపాలన లేకుండా బస్సు వెనకాల బస్సు రావడం ప్రయాణికులను అసంతృప్తికి గురి చేస్తోంది. దుప్పట్లేవి..రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. దూర ప్రాంతాలైన హైదరాబాద్కు వెళ్లే ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు దుప్పటి(రగ్గులు) అందించాల్సి ఉంటుంది. బస్సు డిపోకు చేరగా దుప్పట్లు ఉతికి మళ్లీ ఇచ్చేందుకు కాంట్రాక్టర్ను నియమించారు. ఎక్కడా ప్రయాణికులకు దుప్పట్లు అందించిన దాఖలాలు లేవు. కనీసం చలికాలంలోనైనా దుప్పట్లు ఇవ్వకపోవడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. దుప్పట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించాల్సిందే. స్టాప్లో నిలుపకుండానే..కొందరు పల్లెవెలుగు బస్సుల డ్రైవర్, కండక్టర్ల తీరులో మార్పు రావడం లేదు. బస్టాప్లో నిలుపకుండానే వెళ్తున్నారు. లక్సెట్టిపేట, చెన్నూర్ రూట్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. వేంపల్లి, ముల్క ల్ల, ఊరు శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల్లో బస్సులు నిలుపడం లేదని తెలుస్తోంది. ఎవరైనా ఎక్స్ప్రెస్ బస్సుల్లో తెలియక ఎక్కితే దిగే చోటు నిలుపకుండా మరో స్టేజీలో దింపుతూ దురుసుగా వ్యవహరిస్తున్న డ్రైవర్లు లేకపోలేదు. పల్లె వెలుగు అద్దెబస్సుల సిబ్బందిపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకెళ్తే చర్యలు తీసుకుంటున్నారు. బస్టాప్లో నిలుపకుండా మొదటిసారి రూ.300, రెండోసారి రూ.500, మూడోసారి రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లకు రెండుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి శాఖాపరమైన చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. చెన్నూర్, ఆసిఫాబాద్ రూట్లలో..మంచిర్యాల బస్టాండ్లో సాయంత్రం కాగానే చెన్నూర్, ఆసిఫాబాద్ ప్లాట్ఫారాలపై ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ప్రయాణికుల సంఖ్యకు తగినట్లుగా బస్సులు లేకపోవడమే సమస్య. మరో ఆరేడు బస్సులు వస్తేనే కొంత మేర సమస్య తీరనుంది. చాలామంది ప్రయాణికులకు సమస్య ఎదురైనప్పుడు ఫిర్యాదులు ఎక్కడ చేయాలో తెలియని పరిస్థితి. సమస్యల పరిష్కారం, సలహాలు, సూచనల కోసం డయల్ యువర్ డీఎం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అడిగితేనే వాటర్బాటిల్సుఖవంతమైన ప్రయాణానికి ఆర్టీసీ సూపర్ లగ్జరీ, లహరి బస్సులు ప్రవేశపెట్టింది. పుష్ బ్యాక్ సీట్లతోపాటు టీవీ, వాటర్బాటిల్ అందించే ఈ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తోంది. జిల్లాలో వివిధ రకాల బస్సులు 142 ఉండగా.. ఇందులో 69 అద్దె బస్సులు ఉ న్నాయి. 62వేల కిలోమీటర్లు నడపడం ద్వారా రూ.34లక్షల నుంచి రూ.36లక్షల వరకు ఆదా యం సమకూరుతోంది. 30 లగ్జరీ, నాలుగు లహరి, నాలుగు రాజధాని బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.10 అదనపు చార్జీ వసూలు చేస్తున్న యాజమాన్యం ప్రయాణికులకు అరలీటర్ వాటర్బాటిల్ అందించాల్సి ఉంటుంది. టిమ్ డ్యూటీ డ్రైవర్లు ఒక్కో బాటిల్ ప్రయాణికునికి అందిస్తే రూ.1 చొప్పున కమీషన్ చెల్లిస్తారు. ఏసీ బస్సుల్లో డ్రైవర్తోపాటు అటెండర్ ఉన్నా కూడా వాటర్బాటిల్ ఇవ్వడం లేదు. దీంతో ప్రయాణికులు బయట కొనుగోలు చే యాల్సి వస్తోంది. టికెట్తోపాటు వాటర్బా టిల్ ఇవ్వాల్సి ఉండగా.. అడిగితే గానీ ఇవ్వ డం లేదు. ప్రయాణికులకు ఇవ్వని వాటర్బాటిల్ ఏమవుతున్నాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు. -
అన్నారం బ్యారేజీలో మంత్రుల ఇసుక దందా
మంచిర్యాలటౌన్: అన్నారం బ్యారేజీలో రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్, దుద్దిళ్ల శ్రీధర్బాబు ఇసుక దందా చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు నడిపె ల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ రూ.83 వేల కోట్లయితే రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారే జీ నిర్మించి సుందిళ్లకు నీటిని పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే సుందిళ్ల బ్యారే జీ అని, అన్నారం బ్యారేజీని వినియోగించుకోకుండా పెద్దయెత్తున ఈ ప్రాంత ఇసుకను తరలిస్తూ మేడిగడ్డ, అన్నారంను ఇసుక కోసం ఎండబెడుతున్నారని ఆరోపించారు. చెన్నూరు ఎత్తిపోతల పథ కం కోసం రూ.1,603 కోట్లతో కేసీఆర్ శంకుస్థాపన చేసి షట్పల్లి వద్ద పంప్హౌజ్ పనులను ప్రారంభిస్తే నిలిపివేశారని తెలిపారు. చెన్నూరు డివిజన్, రామకృష్ణాపూర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు, పార్క్, శ్మశాన వాటిక పనులు నిలిపివేశారని అన్నారు. చెన్నూరులో వందపడకల ఆసుపత్రి భవనం నిలిపివేశారని, బస్డిపోను రూ.4 కోట్లతో తెస్తే పక్కన పెట్టారని, ప్రజలకు సంబంధించిన అ భివృద్ధి, సంక్షేమ పనులు ఆపవద్దని సూచించారు. చెన్నూరు నియోజకవర్గంలో షట్పల్లిలో తమ పార్టీ కి చెందిన నాయకుడిపై హత్యాయత్నం జరిగింద ని, హత్యారాజకీయాలు సరికావని, ఇందుకు మంత్రి వివేక్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. -
వైద్యసేవలు అందించాలి
రిటైర్డయిన వారిలో అత్యధికులు 60 నుంచి 70 ఏళ్ల వయస్సు పైబడిన వారే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వెల్నెస్ సెంటర్లకు పోతే అక్కడ సరైన వైద్యం అందడం లేదు. ఈ కేంద్రాల్లో నిపుణులైన వైద్యులను నియమించాలి. ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రులన్నింటిలో నగదు రహిత వైద్య సేవలు అందించాలి. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలి. – సాయిరి శశికాంత్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
ప్రజాతీర్పు నిక్షిప్తం
తాండూర్: బెల్లంపల్లి నియోజకవర్గంలో రెండో విడతలో గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల ఎన్నిక ముగిసింది. ఆదివారం ఫలితాలు వెలువడగా గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నిక ల అధికారులు ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేశారు. మంగళవారం ప్రజాతీర్పును భద్రపర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మండలంలోని గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఏర్పాటు చేసిన బాక్సులను స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి తరలించారు. ఒక్కో గ్రామానికి సంబంధించిన మొత్తం ఓట్లు ఒక్కో బాక్సులో వేసి సీల్ వేశారు. సహాయ ఎన్నికల అధికారి శ్రీనివాస్ నేతృత్వంలో మండలంలోని 15గ్రామాల బాక్సులను పోలీసుస్టేషన్లో భద్రపర్చారు. ఏడాది వరకు ఈ ప్రజాతీర్పు బాక్సులను భద్రంగా ఉంచుతారు. -
ఒకే పాలకవర్గం.. మూడు జంటలు
దండేపల్లి: రిజర్వేషన్ల పుణ్యమా..అంటూ ఒకే పంచాయతీ పాలకవర్గంలో భార్య, భర్తకు అదృష్టం కలిసొచ్చింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో దండేపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గంలో మూడు జంటలకు ఆ ప్రత్యేకత దక్కింది. దండేపల్లి సర్పంచ్గా అజ్మేరా రాజేశ్వర్, మూడో వార్డు సభ్యురాలిగా ఆయన భార్య అజ్మేరా సుజాత ఎన్నికయ్యారు. రెండో వార్డు సభ్యుడిగా తొడసం జైతు ఎన్నిక కాగా, ఐదో వార్డు సభ్యురాలిగా ఆయన భార్య తొడసం సునీత ఏకగ్రీవంగా ఎన్నికై ంది. నాలుగో వార్డు సభ్యురాలిగా పెంద్రం రేవతి, ఎనిమిదో వార్డు సభ్యుడిగా ఆమె భర్త పెంద్రం శంకర్ ఎన్నికయ్యారు. కొత్తగా కొలువుదీరనున్న దండేపల్లి పంచాయతీ పాలకవర్గంలో మూడు జంటలకు ఇలా ప్రత్యేక చోటు లభించింది. -
అమెరికా నుంచి వచ్చి ఓటేసిన మామ.. ఒక్క ఓటు తేడాతో గెలిచిన కోడలు
లోకేశ్వరం మండలం బాగాపూర్ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. సర్పంచ్గా ముత్యాల శ్రీవేద బరిలో నిలిచారు. దీంతో అమెరికాలో ఉంటున్న ఆమె మామ ఇటీవల వచ్చి ఓటేశాడు. ఈ పంచాయతీ పరిధిలో 426 ఓట్లుండగా ఇందులో 378 ఓట్లు పోలయ్యాయి. ముత్యాల శ్రీవేదకు 189 ఓట్లు రాగా, మరో అభ్యర్థి హర్ష స్వాతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు చెల్లకపోవడంతో అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓటు రావడంతో శ్రీవేద ఒక్క ఓటు తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. శ్రీవేద ఒక్క ఓటు తేడాతో గెలుపొందగా, ఆమె మామ ఓటే ఆమెకు కీలకమైందని అంతా చర్చించుకున్నారు. -
చెప్పడం కాదు.. రాసి ఇవ్వండి
బోథ్: మండల కేంద్రంలోని 15వ వార్డుకు చెందిన కిరాణా దుకాణ యజమాని అజీమ్ పంచాయతీ ఎన్నికల్లో తనను ఓటు అడగడానికి వచ్చే అభ్యర్థుల నుంచి హామీపత్రం తీసుకుంటున్నాడు. తమ కాలనీ సమస్యలు పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా హామీ తీసుకుంటుండడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నికై న ప్రజాప్రతినిధులు సమస్యలు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. అభ్యర్థులకు అజీమ్ మొదట సమస్యలు స్పష్టంగా పేర్కొంటూ రాసిన ప్లకార్డు చూపిస్తున్నారు. ఆ తర్వాత, ‘గెలిచిన తర్వాత ఈ గల్లీ సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తాం’ అనే అంశంతో కూడిన ప్రత్యేక హామీ పత్రాన్ని సిద్ధం చేసి, దానిపై అభ్యర్థుల సంతకాలు తీసుకున్నారు. అభ్యర్థి సంతకంతో ఉన్న ఆ హామీ పత్రాన్ని ఆధారంగా చేసుకుని జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో న్యాయపరమైన పోరాటం చేస్తానని పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఓటు ఒక సాధనంగా ఉపయోగించుకుంటూ బాధ్యతాయుతంగా ముందుకు రావడంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హామీ పత్రాన్ని చూపిస్తున్న బిలాల్ అజీమ్ -
ముత్యాల కుటుంబానికి మూడోసారి..
లోకేశ్వరం: మండలంలోని బాగాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా ముత్యాల శ్రీవేద ఒకే ఓటుతో ఎన్నికల్లో విజయం సాధించింది. 1972లో లోకేశ్వరం, నగర్, భాగాపూర్ గ్రామాలకు ఆమె తాత ముత్యాల నారాయణ్రెడ్డి సర్పంచ్గా ఐదేళ్ల పాటు పని చేశారు. నారాయణ్రెడ్డి చిన్న కోడలు ముత్యాల రజిత 2013లో సర్పంచ్గా గెలుపొందారు. 2018లో డీఎస్సీలో రజిత స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం ముధోల్ మండలం ఎడ్బిడ్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. ఇప్పుడు బీటెక్ చదివిన శ్రీవేద గెలుపుతో ముత్యాల కుటుంబానికి మూడోసారి సర్పంచ్ పదవి దక్కినట్లయింది. -
నాడు ఎంపీటీసీలు.. నేడు సర్పంచులు
దహెగాం: పంచాయతీ ఎన్నికల్లో మాజీ ఎంపీటీసీలు సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. దహెగాం పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ సభ్యురాలు రాపర్తి జయలక్ష్మి బీజేపీ మద్దతుతో బరిలో నిలిచి సమీప అభ్యర్థి తుమ్మిడె మల్లీశ్వరిపై 242 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలుపొందారు. మండలంలోని ఇట్యాల పంచాయతీ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేయగా గజ్జెల జయలక్ష్మి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి బీఆర్ఎస్ మద్దతుదారు పొన్న కళావతిపై 109 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలిచారు. -
వేధింపులు తాళలేక భర్తను చంపిన భార్య
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని రాజీవ్నగర్కు చెందిన లారీ డ్రైవర్ మాటేటి చంద్రయ్య (50)ను ఆయన భార్య లక్ష్మి స్టీల్ రాడ్తో బాదడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రయ్య మద్యానికి బానిసై తరచూ భార్య, కూతురును వేధించేవాడు. ఆదివారం మధ్యరాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను వేధించాడు. దీంతోఅతడి వేధింపులు భరించలేక భార్య లక్ష్మి స్టీల్ రాడ్తో పలుసార్లు అతడి తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావమై చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి సీఐ శశిధర్రెడ్డి వెళ్లి వివరాలు సేకరించారు. సోమవారం మృతుడి సోదరి దూడం లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఏజెన్సీ గ్రామం.. ఒకే కుటుంబానికి పట్టం
తాండూర్: మండలంలో రెండు ఏజెన్సీ గ్రామాల్లో ఒక్కటైన కిష్టంపేట గ్రామపంచాయతీ ఓటర్లు ఒకే కుటుంబానికే పలుసార్లు పట్టం కట్టారు. 2001 ఎన్నికల్లో కిష్టంపేట సర్పంచ్గా సార్ల తిరుపతి గెలుపొందారు. ఆ తర్వాత అతని తల్లి సార్ల ఓదమ్మ వరుసగా రెండుసార్లు సర్పంచ్గా ఎన్నికై ంది. 2019లో జరిగిన ఎన్నికల్లో తిరుపతి తమ్ముడి భార్య సార్ల పద్మను గ్రామ ప్రజలు సర్పంచ్గా ఎన్నుకున్నారు. తాజాగా సార్ల తిరుపతి సర్పంచ్గా గెలుపొందాడు. గడిచిన ఐదు ఎన్నికల్లో నాలుగు దఫాలు ప్రజలు ఈ కుటుంబానికే పట్టం కట్టడం విశేషం. నాడు ఎంపీపీ.. నేడు సర్పంచ్లోకేశ్వరం: మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన బాయమోల్ల లలిత 2019లో నిర్వహించిన ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలుపొంది మండల అధ్యక్షురాలుగా పని చేశారు. ఎస్సీకి రిజర్వ్ చేసిన మన్మద్ స్థానానికి సర్పంచ్గా పోటీ చేసి ఈనెల 14న నిర్వహించిన ఎన్నికల్లో తిరిగి లలిత సర్పంచ్గా ఎన్నికయ్యారు. -
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
ఇంద్రవెల్లి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైంది. బాధిత కుటుంబీకులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దు ర్వగూడ గ్రామానికి చెందిన మడావి శ్రీకాంత్ కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం వ్యవసా య పనులకు చేనుకు వెళ్లారు. మధ్యాహ్నం 12గంటలకు షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఈ ప్రమాదంలో ఇంట్లో దాచిన రూ.65వేల నగదు, ఐదు క్వింటాళ్ల పత్తి, శ్రీకాంత్ తల్లి లచ్చుబాయి, భార్య సులోచనకు చెందిన రెండు తులాల బంగారం, నిత్యావసరాలు, దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై సాయన్న, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. పంచనామా నిర్వహించి సుమారు రూ.6లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు నిర్ధారించారు. అనంతరం తక్షణ సాయంగా బాధిత కుటుంబానికి నిత్యావసరాలు అందజేశారు. ఇల్లు, ఇంట్లోని సామగ్రి కాలిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు విలపించారు. అధికారులు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. -
ఎస్టీలు లేకున్నా ఏజెన్సీ గ్రామంగా రూయ్యాడి
తలమడుగు: అన్ని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలతో సందడిగా మారగా మండలంలో రూయ్యాడి గ్రామంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. రుయ్యాడిని 1970లో ఏజెన్సీ గ్రామంగా గుర్తించారు. దీని పరిధిలో సకినాపూర్, అర్లీ, రూయ్యడి అనుబంధ గ్రామాలుండగా సకినాపూర్, అర్లి నూతన పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం రూయ్యడీ గ్రామపంచాయతీలో ఎస్టీ అభ్యర్థులెవరూ లేరు. దీంతో గ్రామం సర్పంచ్ ఎన్నికలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో 1,514 మంది ఓటర్లున్నారు. ఇందులో గిరిజనులెవరూ లేరు. దీంతో 10వ వార్డు స్థానాలుండగా ఐదింటిని ఎస్టీలకు రిజర్వ్ చేశామని తెలిపారు. ప్రస్తుతం ఐదు వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రామంలో ఎస్టీలెవరూ లేకపోవడంతో ఎస్టీలకు కేటాయించినందున గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రుయ్యాడి గ్రామన్ని ఏజెన్సీ గ్రామం నుంచి తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఒకే కుటుంబానికే రెండు పర్యాయాలు -
పోస్టర్ ఆవిష్కరణ
నస్పూర్: ఈనెల 28న శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో నిర్వహించనున్న ఉద్యోగులు, క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన ప్రచార పోస్టర్ను కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఆత్మీయ సమ్మేళనం కమిటీ క న్వీనర్ ఆదిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సురేందర్రెడ్డి, ఆత్మీయ సమ్మేళం కమిటీ కోఆర్డినేట ర్ ఇసంపల్లి రాంచందర్, కోశాధికారి సదయ్య, జి ల్లా స్పోర్ట్స్ అధికారి హనుమంతరెడ్డి, కమిటీ సభ్యులు భానుప్రకాశ్, కృష్ణారెడ్డి, రాజన్న, శ్రీనివాస్, బానయ్య, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
తలమడుగు: మండలంలోని కజ్జర్ల గ్రామ సమీపంలో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతడిని పట్టుకుని విచారించారు. ఇటీవల చోరీకి పాల్పడ్డ నిందితుడిగా గుర్తించారు. మండలంలోని కజ్జర్ల గ్రామనికి చెందిన తలర్ల హరీశ్ గ్రామంలో ఇటీవల దొంగతనానికి పాల్పడినట్లు తె లిపారు. పట్టుకుని విచారించగా కజ్జర్లలో ఈ మధ్యలో జరుగుతున్న దొంగతనాలు తానే చేసినట్లు అంగీకరించాడు. అతడి నుంచి బంగారు చైన్, ఉంగరం సీజ్ చేసినట్లు తెలిపారు. సోమవారం సీఐ ఫణీందర్, ఎస్సై రాధిక నిందితుడి హరీశ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై రాధిక పేర్కొన్నారు. -
ఆధ్యాత్మిక శోభితం
చెన్నూర్/నిర్మల్ఖిల్లా/మంచిర్యాల అర్బన్: ఆధ్యాత్మిక మాసాల్లో ధనుర్మాసానికి ప్రత్యేక మాసంగా పేరుంది. ధనుర్మాసో త్సవాలను చెన్నూర్ జగన్నాథాలయంలో 400 ఏళ్లుగా ఘనంగా నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. ధనుర్మాసంలో సూర్యుడు ధ నుస్సు రా శిలో ప్రవేశించి సూర్యుడు మకర రాశి లోకి మారినప్పుడు ధనుర్మాసం ముగుస్తుంది. ధ నుర్మాసంలో శ్రీమహా విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 16న మంగళవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14 భోగి రోజున ముగుస్తుంది. ఆధ్యాత్మిక మాసం కావడంతో నెలపాటు భజన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించ ం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు. పండుగ నెలగా ప్రారంభం ధునుర్మాస్మం ప్రారంభం నుంచి సంక్రాంతి పండుగ నెల ప్రారంభమవుతుంది. భక్తులు గోదాదేవికి (ఆండాల్) తిరుప్పావై పాశురాలను అలపించడం అనవాయితీగా వస్తోంది. ఈ మాసాన్ని ప్రారంభం నుంచే పండుగ నెల అని అంటారు. ఈ మాసంలో శుభకార్యాలు జరగవు. దైవిక కార్యాలు మాత్రమే నిర్వహిస్తారు. గోదాదేవి, రంగనాథుల కల్యాణం గోదారంగనాథుడి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. లోక కల్యాణార్థం లక్ష్మి స్వరూపమైన గోదారంగనాథుల కల్యాణంలో వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. 30న ముక్కోటి ఏకాదశి ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 31న ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలు ఉ త్తర ద్వారం నుంచిస్వామివారి దర్శనం ఉంటుంది. జనవరిలో సుదర్శన హోమం ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఏటా జనవరిలో చెన్నూర్ జగన్నాథాలయంలో సుదర్శన హోమం నిర్వహిస్తారు. సుదర్శన హోమానికి స్థానికులతోపాటు వివిధ పట్టణాల నుంచి వేలాదిమంది వచ్చి పూజలు చేస్తారు. నిర్మల్లోని దేవరకోట ఆలయంలో... నిర్మల్ పట్టణంలోని చారిత్రక పురాతన పుణ్యక్షేత్రమైన దేవరకోట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈనెల 16 నుంచి వచ్చే నెల 14వరకు ప్రవచన కార్యక్రమం ని ర్వహించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆళ్వారు దివ్యప్రబంధ ప్రాజెక్ట్ వారిచే నెలపాటు తిరుప్పావై ప్రవచన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జిల్లాలోని పలు వేంకటేశ్వరాలయాల్లోనూ ధనుర్మాసోత్సవాలు నిర్వహించనున్నారు. మంచిర్యాలలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో.. మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథస్వామి ఆలయ ప్రాంగణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. డిసెంబర్ 30న ముక్కోటి ఏకాదశి రోజున భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు. 31న తిరుప్పావై సేవాకాలం, జనవరి 5న గోదాదేవికి మంజలి ఉత్సవం, అభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 14న గోదారంగనాథస్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు ఈవో ముక్తా రవి తెలిపారు. -
ప్రలోభాల పర్వం
చెన్నూర్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): చెన్నూర్ నియోజకవర్గంలోని భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సర్పంచ్ అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెర తీశారు. కుల, ప్రజా, యువజన సంఘాలతోపాటు యువతకు మందు, విందులు ఏర్పాటు చేస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. చెన్నూర్, కోటపల్లి, జైపూర్, భీమారం మండలాల్లో పోటీ తీవ్రంగా ఉండడంతో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మహిళలకు డబ్బులు, శీతలపానీయాలు, చీరలు, కానుకలు, పురుషులకు మద్యం పంపిణీ చేస్తున్నారు. కోటపల్లి మండలం సిర్సా, పుల్లగామ, జనగామ, నక్కలపల్లి, కోటపల్లి, చెన్నూర్ మండలం కిష్టంపేట, సుద్దాల, అంగ్రాజుపల్లి, సోమన్పల్లి, దుగ్నెపల్లి, చెల్లాయిపేట, వెంకంపేట, కత్తరశాలలో ఓటర్లకు సకల మర్యాదలు చేస్తున్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిన ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రవాణా చార్జీలతోపాటు మర్యాదలకు సన్నాహాలు చేస్తున్నారు. నాలుగు స్థానాలు ఏకగ్రీవం మొత్తం 102 సర్పంచ్, 153 వార్డు సభ్యుల స్థానా లు ఏకగ్రీవం అయ్యాయి. చెన్నూర్ మండలం రచ్చపల్లి, కోటపల్లి మండలం ఎసాన్వాయి, లక్ష్మిపూర్, మందమర్రి మండలం శంకర్పల్లి గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయా గ్రామాల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో ఫలితాలు రాత్రి వరకు వెల్ల డయ్యే అవకాశం ఉంది. మండలాల వారీగా సామగ్రి పంపిణీ కేంద్రాలు 17న పోలింగ్ దృష్ట్యా ఐదు మండలాల్లో పోలింగ్ సిబ్బంది, పోలీసు, వెబ్కాస్టింగ్, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంగళవారం ఆయా మండల కేంద్రాల్లో సామగ్రి తీసుకుని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలి వెళ్లడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం సందర్శించారు. 999పీవోలు, 1,092మంది ఓపీవోలుఎన్నికల విధుల్లో 999మంది ప్రిపైడింగ్ అధికారులు(పీవో), 1,092మంది ఇతర పోలింగ్ అధికారులు(ఓపీవో) పాల్గొననున్నారు. 99మంది స్టేజ్–2 ఆర్వోలతోపాటు ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు, 18మంది వెబ్కాస్టింగ్ సిబ్బంది భాగస్వామ్యం కానున్నారు. సిబ్బంది, పోలింగ్ సామగ్రి తరలింపునకు 59బస్సులు, 19కార్లు, 9టాటాఏస్ వాహనాలను డీటీవో గోపికృష్ణ పర్యవేక్షణలో ఎంవీఐ సంతోష్కుమార్ ఏర్పాటు చేశారు.మండలాల వారీగా ఓటర్ల వివరాలుమండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తంభీమారం 6,394 6,699 0 13,093 చెన్నూర్ 12,839 13,263 0 26,102 జైపూర్ 15,278 15,347 1 30,626 కోటపల్లి 12,797 13,142 2 25,941 మందమర్రి 5,502 5,624 1 11,127 మొత్తం 52,810 54,075 4 1,06,889 -
తవ్వకాల్లో బయటపడిన దుర్గాదేవి విగ్రహం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల పుష్కరఘాట్ రహదారిలో దుర్గాదేవి విగ్రహం బయటపడింది. ఇటీవల అయోధ్య రామమందిరంలోని ఓ ప్రధాన పూజారితోపాటు వారణాసి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు పీఠాధిపతులు, స్వాములు పుష్కరఘాట్ వద్ద గోదావరినదికి హారతి ఇచ్చేందుకు వచ్చి దుర్గాదేవి విగ్రహం ఉందని జోస్యం చెప్పడం, పూజలు చేయడం తెలిసిందే. సోమవారం ముల్కల్ల గాయత్రి, శారదాపీఠం పీఠాధిపతి, స్థానిక వేద పండితుల ఆధ్వర్యంలో పుష్కరఘాట్లోని నాడెం వెంకటయ్యకు చెందిన స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తవ్వకాలు చేపట్టారు. బేసీబీతో తవ్వకాలు చేపట్టగా సింహవాహనంపై ఉన్న దుర్గాదేవి విగ్రహం బయటపడింది. గోదావరి జలాలతో జలాధివాసం చేసి వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రతిష్టించారు. విషయం తెలియడంతో పరిసర ప్రాంత భక్తులు భారీగా తరలివచ్చి స్వయంభూగా వెలిసిన దుర్గాదేవి విగ్రహాన్ని దర్శించుకున్నారు. హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్కిరణ్, అయ్యప్పస్వామి భక్తులు, ముల్కల్ల శ్రీగాయత్రి, శ్రీశారదా పీఠం పీఠాధిపతి చంద్రమౌళ్యాచార్యులు, స్థానిక వేద పండితుల పవనశాస్త్రి పాల్గొన్నారు. త్వరలో దేవాలయ నిర్మాణం చేపట్టి భారీ ఎత్తున విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహిస్తామని విజయదుర్గా సేవా సమితి సభ్యులు తెలిపారు. -
కన్నాల బస్తీలో వైద్య శిబిరం
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ కన్నాల బస్తీలో సోమవారం ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడతెగకుండా మూడు వారాలకు పైగా దగ్గు వస్తున్న వ్యక్తులు టీబీ వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, వ్యాధిగ్రస్తులకు ఉచితంగా చికిత్స అందిస్తూ నెలకు రూ.1000 చొప్పున చికిత్స పూర్తయ్యే వరకు పోషణ భత్యాన్ని అందిస్తుందని తెలిపారు. అనంతరం పలువురికి ఎక్స్రేలు తీశారు. కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యురాలు సుచరిత, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ సురేందర్, సూపర్వైజర్ శశికాంత్, హెల్త్విజిటర్ వెంకటేష్ పాల్గొన్నారు. -
నష్టాలు తప్పేలా లేవు
రూ.10లక్షలు అప్పు చేసి ఏడెకరాల్లో మిర్చి సాగు చేసిన. పోయినేడాది 15 ఎకరాల్లో సాగు చేయగా ధర లేక నష్టపోయిన. ఈ ఏడాది ధర బాగుంటుందని ఆశపడి ఏడెకరాలు సాగు చేసిన. పంట దిగుబడి బాగా వచ్చి లాభం వస్తుందని అనుకున్న. కొత్త తెగుళ్లు సోకడంతో పంటంతా నాశనమవుతోంది. ఎకరాకు ఆరు, ఏడు క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఈసారి కూడా నష్టాలు తప్పేలా లేవు. – భూతం సంతోష్, రైతు, చెన్నూర్ వాతావరణ మార్పులతోనే..మొక్క దశలో తెగుళ్లు సోకడంతో మందులతో నయమైంది. మరో నెల రోజుల్లో పంట చేతికి వస్తుందనే సమయంలో ఎర్రనల్లి, తెల్లదోమ సో కింది. వేలాది రూపాయలు వెచ్చించి మందులు కొట్టినా లాభం లేకుండా పోయింది. చెట్టు నుంచి ఆకుల వరకు ముడత పడి కాయ పెరగడం లేదు. పెరిగిన కాయ ఎరుపు వర్ణంలోకి మారకముందే ఎండి తాలుగా మారుతోంది. ఈ తెగుళ్లతో దిగుబడి రెండింతలు తగ్గనుంది. – మానిశెట్టి శ్రీనివాస్, రైతు, చెన్నూర్ -
విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చూడాలి
కోటపల్లి: ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అసౌకర్యాలు కలుగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కోటపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. తాగునీరు, మూత్రశాలలు, వంటశాలలు, అందిస్తున్న భోజనం నాణ్యతపై అడిగి తెలుసుకున్నారు. రిజిష్టర్లు తనిఖీ చేశారు. మోనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అనంతరం కోటపల్లి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. -
ఆటో బోల్తాపడి డ్రైవర్ మృతి
కాసిపేట: మండలంలోని దే వాపూర్ పోలీస్స్టేషన్ పరిధి లో సల్ఫాలవాగు దేవాపూర్ శివారు ప్రాంతంలో ఆటో బో ల్తాపడి దుర్గం గోపాల్ (55) అనే డ్రైవర్ మృతి చెందాడు. దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి మండలంలోని దుబ్బగూడెం గ్రామస్తుడు గోపాల్ ఆటోలో దేవాపూర్ నుంచి సోమగూడెం వైపునకు వెళ్తున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గోపాల్ గాయపడ్డాడు. గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని గోపాల్ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతదేహాన్ని బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కల్తీ ఈత కల్లు తయారీ స్థావరంపై దాడి
గుడిహత్నూర్: మండలంలోని వైజాపూర్ గ్రా మంలోని ఓ పురాతన ఇంట్లో కల్తీ ఈత కల్లు త యారీ స్థావరంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. సుమారు 400 లీటర్ల కల్తీ ఈత కల్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వి వరాల ప్రకారం.. మండలంలోని సీతాగోందికి చెందిన సంతోష్గౌడ్ ఎన్నికల నేపథ్యంలో తన కల్లు దుకాణం మూసి వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి ని త్యం ఉచితంగా కల్లు పంపిణీ చేస్తున్నాడని అదే వార్డులో పోటీలో ఉన్న ఆసిఫ్ ఆరోపించారు. జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలి పారు. దీంతో పోలీసులు కల్లు తయారు చేస్తు న్న స్థావరానికి వెళ్లి డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన కల్లుతో పాటు కల్లు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మిర్చికి తెగుళ్లు.. రైతుకు కన్నీళ్లు
చెన్నూర్: ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏటా మిర్చి రైతులు నష్టాలు చవి చూస్తున్నారు. ఈ ఏడాదైనా పంట బాగా పండితే నష్టాలను పూడ్చుకోవచ్చని ఆశిస్తే నిరాశే ఎదురైంది. నెల రోజుల్లో పంట చేతికి రానుండగా ఈ సమయంలో తెగుళ్లు సోకాయి. కళ్లెదుటే పంటంతా నాశనం అవుతుండడంతో రైతులు తల పట్టుకుంటున్నారు. గతేడాది చెడగొట్టు వానలు నట్టేట ముంచితే ఈ సంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు మిర్చి రైతులను కంటి మీద కునుకులేకుండా చేశాయి. పంట వేసిన నుంచి దిగుబడి చేతికి వచ్చేదాకా క్రిమిసంహారకాలు పిచికారీ చేసినా ఫలితం లేకుండాపోయింది. తెగుళ్లు తగ్గక పోగా కొత్త తెగుళ్లు దాపురించాయి. ఈ కారణంగా చెట్లు ముడతపడి ఎండిపోవడమే కాకుండా మిర్చి నల్లగా మారుతోంది. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు వివిధ రకాల పురుగు మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. తగ్గనున్న దిగుబడి వర్షాభావ పరిస్థితులు, వాతావరణంలో వచ్చిన మార్పులతో మిర్చి పంటకు ఎర్రనల్లి, తెల్లదోమ, బబ్బెర ముడత, జెమిని తెగుళ్లు సోకాయి. తెగుళ్ల బారిన పడకుంటే ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఈ ఏడాది పంట వేసిన నుంచి తెగుళ్లు సోకుతుండగా ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి వాణిజ్య పంట కావడంతో దిగుబడి చేతికి వచ్చేదాకా ఎకరాకు రూ.1.80లక్షల నుంచి రూ.2లక్షల వరకు పెట్టుబడి అవుతోందని వారు చెబుతున్నారు. 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తేనే గిట్టుబాటు అవుతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం 7 నుంచి 8 క్వింటాళ్లు మాత్రమే వచ్చే అవకాశముండగా ఎకరాకు రూ.50వేల నుంచి రూ.80వేలు నష్టం వాటిల్ల వచ్చని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో తగ్గిన సాగు గతేడాది మిర్చికి ధర లేక ఈ సంవత్సరం జిల్లాలో సాగు గణనీయంగా తగ్గింది. పోయినేడాది జిల్లాలో 1,046 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది 250 ఎకరాలకే పరిమితమైంది. మిర్చి పంటకు పేరున్న కోటపల్లి మండలంలోనే అత్యధికంగా రైతులు సాగు చేశారు. గతేడాది క్వింటాల్ ధర రూ.14వేలు పలికింది. ఈ ఏడాది ధర పెరుగుతుందని రైతులు ఆశించారు. ప్రస్తుతం వరంగల్ మార్కెట్లో క్వింటాల్కు రూ.13,500 ధర పలుకుతోంది. ధర కూడా గతేడాది కంటే తక్కువగా ఉండడంతో నష్టాలు తప్పేలా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) క్లస్టర్ గతేడాది ప్రస్తుతంమంచిర్యాల 112 42 బెల్లంపల్లి 124 38 చెన్నూర్ 810 170 మొత్తం 1,046 250 -
ఉద్యోగులు రక్షణ నియమాలు పాటించాలి
మందమర్రిరూరల్: సింగరేణి ఉద్యోగులు రక్షణ నియమాలు పాటించాలని జీఎం(ఎంఎస్), సేఫ్టీ కమిటీ కన్వీనర్ విజయ్కుమార్ అన్నారు. సింగరేణి 56వ రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా సోమవారం ఏరియాలోని కేకే–5 గనిని ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి సేఫ్టీ కమిటీ తనిఖీ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్షణ నియమాలు పాటిస్తే విధి నిర్వహణలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండదని అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు అందించే ప్రథమ చికిత్సపై తెలియజేస్తూ రక్షణపై ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎస్వో టు జీఎం లలితేంద్రప్రసాద్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భూశంకరయ్య, కేకే–5 గని మేనేజర్ శంభునాథ్పాండే, సేఫ్టీ కమిటీ సభ్యులు, అధికారులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పట్టు కోసం ప్రతిపక్షాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. రెండు విడతల్లో పోలింగ్, ఫలితాల వెల్ల డి పూర్తి కాగా.. బుధవారం చెన్నూర్ నియోజకవర్గంలో తుది దశ ఎన్నికలు జరగనున్నాయి. అధికా ర, ప్రతిపక్ష పార్టీల నాయకులతోపాటు స్వతంత్రులూ రంగంలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది. రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఫలితాలపై అంచనాలు పెరిగాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రతిపక్ష ‘గులాబీ’ పార్టీ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇంకోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ చెన్నూర్ నియోజకవర్గానికే చెందిన వారు కావడంతో ‘కమలం’ పార్టీ తన పరిధి విస్తృతం చేసుకోవాలని, పలు చోట్ల గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది. వీలైనన్ని సర్పంచ్, వార్డు స్థానాలు తమ మద్దతుదారులే ఎన్నికయ్యేలా వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. వర్గ పోరు, రెబెల్స్ బెడద అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రామాల్లో రెండేసి వర్గాలుగా ఉన్నాయి. పాత, కొత్త నాయకుల మధ్య సఖ్యత కుదరడం లేదు. దీంతో జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లోని ఆయా గ్రామాల్లో గత కొన్నేళ్లుగా సీనియర్ నాయకుల చేతిలోనే అంతా నడుస్తోంది. మంత్రి వివేక్ మాట వినకుండా కొందరు సర్పంచ్ బరిలో ఉన్నారు. దీంతో సొంత పార్టీలోనే ఎన్నికల్లో వ్యతిరేక వర్గంతో పోటీ నెలకొంది. కొన్ని గ్రామాల్లో నాయకుల మధ్య ఎన్నికల వైరం కొనసాగుతోంది. ఈ క్రమంలో తన నియోజకవర్గంలో పట్టు నిరూపించుకునేందుకు మంత్రి వివేక్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ మద్దతుదారులను అభ్యర్థుల ఎంపిక నుంచి సొంత పార్టీలో ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల ఇన్చార్జి లను నియమించి అధిక స్థానాలు గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు పల్లెల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆరాట పడుతోంది. నియోజకవర్గంలో గత వైభవం కోసం చెమటోడుస్తోంది. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత కేడర్లో నిరాశ నెలకొంది. ఇప్పటికీ కొన్ని చోట్ల పార్టీ బలం ఉండడంతో మళ్లీ పుంజుకుంటామనే ఆశతో పోటీలో ఉన్నారు. సర్పంచ్ స్థానాలు గెలిచేందుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రంగంలోకి దిగారు. కార్యకర్తలు, నాయకులతో సమన్వయం చేస్తూ తమ మద్దతుదారులు గెలిచేలా కృసి చేస్తున్నారు. ఇక బీజేపీ వచ్చే అసెంబ్లీ నాటికి చెన్నూర్లో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జిల్లా అధ్యక్షుడు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో పలు చోట్ల కమలం పార్టీ మద్దతుదారులు గెలుస్తారనే భరోసాతో ఉన్నారు. పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సర్పంచ్ స్థానాలు గెలిచేందుకు కృషి చేస్తున్నారు. -
● నగరంలో పైపులైన్ల లీకేజీలు ● ప్రజలకు అందని శుద్ధమైన నీరు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో పైపులైన్ల లీకేజీల కారణంగా తాగునీరు కలుషితం అవుతోంది. తరచూ ఏదో ఒక ప్రాంతంలో పైపులు పగిలి తాగునీరు వృథాగా పోతోంది. ఆ ప్రాంతంలో నీరు మురుగుగా మారి అదే పైపుల ద్వారా సరఫరా అవుతోంది. శుద్ధమైన తాగునీటిని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు చేపట్టి రూ.కోట్లు కేటాయిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. డ్రెయినేజీలు సక్రమంగా లేకపోవడం, డ్రెయినేజీల్లో నుంచి వెళ్లే పైపులు లీకేజీ ఏర్పడి నీరు కలుషితం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. లీకేజీలకు మరమ్మతులు చేపడుతున్నా ఏదో ఒక ప్రాంతంలో సమస్య ఏర్పడుతోంది. మంచిర్యాల మున్సిపాల్టీగా ఉండగా 16ఏళ్ల క్రితం ముల్కల్ల గోదావరి వద్ద ఫిల్టర్బెడ్ నిర్మించి తాగునీరు సరఫరా చేస్తున్నారు. అప్పుడే రూ.29.30కోట్లతో మంచినీటి ఫిల్టర్బెడ్ నిర్మించి పైపులైను వేశారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ముల్కల్ల ఫిల్టర్బెడ్కు తరలించి మంచిర్యాలకు సరఫరా చేస్తున్నారు. దశాబ్దాన్నర క్రితం వేసిన పైపులైన్కు తరచూ లీకేజీ సమస్యలు వస్తుండడంతో గత ఏడాది అమృత్ 2.0 పథకం కింద మంచిర్యాల మున్సిపాల్టీకి రూ.48.50 కోట్లు, నస్పూర్ మున్సిపాల్టీకి రూ.73 కోట్లు కేటాయించారు. మంచిర్యాలలో కొత్తగా 6,100 నల్లా కనెక్షన్లు, 21 కిలోమీటర్ల పైప్లైన్ మార్పు, వాటర్ ట్యాంక్ నిర్మించాలి. నస్పూరులో ఐదు వేల నల్లా కనెక్షన్లు, 18 కిలోమీటర్ల పైప్లైన్, ఏడు వాటర్ ట్యాంకులు, వాటర్ ఫిల్టర్బెడ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఏడాది క్రితం పనులు ప్రారంభించినా మంచిర్యాల, నస్పూరులో 40శాతం మాత్రమే పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జూన్లోపు పూర్తిచేయాల్సి ఉండగా ఆలస్యం ఆవుతున్నాయి. నగరంలో 76మంది తాగునీటి సరఫరా కోసం పని చేస్తుండగా, పూర్తిస్థాయిలో సిబ్బంది లేక లీకేజీ సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. అమృత్ 2.0 పథకం ద్వారా పాతపైపులను మార్చితేనే లీకేజీలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. కొన్ని నెలల క్రితమే పాత పైపుల స్థానంలో కొత్తవి వేసేందుకు ఆయా ప్రాంతాల్లో పైపులను తెప్పించి ఉంచినా పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ‘అమృత్’ ఆలస్యం.. తాగునీరు కలుషితంమంచిర్యాల కార్పొరేషన్ వివరాలు జనాభా 2,48,283 నల్లా కనెక్షన్లు 42,564 పైపులైన్ 566 కిలోమీటర్లు -
ఓటేసిన కొత్త ఓటర్లు
వేమనపల్లి: మండలంలో పలువురు కొత్త ఓటర్లు తొలిసారిగా ఓటు వేశారు. ఉన్నత చదువుల కోసం వివిధ ప్రాంతాల్లో ఉంటున్నవారంతా ఆదివారం పల్లెబాట పట్టారు. సొంతూళ్లకు వచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తొలిసారి ఓటేసిన పలువురు యువ ఓటర్ల మనోగతం వారి మాటల్లో.. ఇష్టమైన నాయకుడిని ఎన్నుకోవాలి మా ఊరిలో ఓటేయటం మంచి అనుభూతినిచ్చింది. వరంగల్లో డిగ్రీ చదువుతున్న. ఎలాగైనా ఓటెయ్యాలనే తపనతో వేమనపల్లికి వచ్చాను. మంచి వ్యక్తికి ఓటు వేసి సమాజానికి నా వంతు సహాయం చేయాలనుకున్న. అందరూ ఓటేసి ఇష్టమైన నాయకున్ని ఎన్నుకోవాలి. – నాగుల నవీన్కుమార్ హైదరాబాద్ నుంచి వచ్చా.. హైదరాబాద్లో బీటెక్ చదువుతున్న. ఓటు కోసం గ్రా మానికి వచ్చాను. చిన్నప్పు డు ఓటేసేందుకు మా డాడీ వాళ్లతో ఎడ్లబండ్ల మీద వెళ్లెటోన్ని. వాళ్లు వెళ్తూ ఉంటే మేం ఆసక్తిగా చూసేది. ప్రత్యక్షంగా ఓటేయటం నిజంగా ఆనందాన్నిచ్చింది. పొద్దంతా క్యూలైన్లో ఉండి ఓటేసిన. – వాంగ్మయ్రెడ్డి, వేమనపల్లి సెలవు పెట్టి వచ్చా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న. శనివారం సెలవు పెట్టి ఓటు కోసం మా ఊరికి వచ్చాను. నా ఓటు కోసం చాలా మంది అభ్యర్థులు ఫోన్లు చేశారు. సమాజానికి మంచి చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని స్వచ్ఛందంగా వచ్చి నచ్చిన వ్యక్తికి ఓటేశాను. – పుప్పిరెడ్డి రూప, సాఫ్ట్వేర్, మంగనపల్లి -
‘హైదరాబాద్ను రెండో రాజధాని చేయాలి’
శ్రీరాంపూర్: హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే నర్సింగ్ డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీరాంపూర్లోని ఓ పాఠశాలలో ఆ సంఘం మంచిర్యాల కార్పొరేషన్ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన హైదరాబాద్ను రెండో రాజధానిగా చేయడం వలన పాలన సౌలభ్యం పెరుగుతుందన్నారు. బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని, ఎస్సీ సంక్షేమ కోసం ప్రత్యేక కార్పొరేషన్ బోర్డును ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, జిల్లా కేంద్రంలో ఎస్సీ సంక్షేమ భవన్ ఏర్పా టు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షుడిగా జక్కా మొగిలిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు గుమ్మడి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు బింగి సదానందం, నాయకులు పుట్ట రవి, మద్దెల స్వామి, కాటన్ కృష్ణ, భోగ శంకర్, నరసయ్య, సొల్లు కొమురయ్య, మొగిలి వాసు, రాజశేఖర్ పాల్గొన్నారు. -
ఆర్ఆర్ జట్టులో మన ఆర్తి
ఆసిఫాబాద్రూరల్: ఫుట్బాల్ క్రీడాకారుడు ల యోనల్ మెస్సీ కిక్లతో హైదరాబాద్లోని ఉప్ప ల్ స్టేడియం ఉర్రూతలూగింది. అభిమానుల ఉత్సాహం అంబరాన్నంటింది. క్రీడాభిమానుల కోలాహలంలో సింగరేణి ఆర్ఆర్ జట్టులో ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లా ఫుట్బాల్ క్రీడాకారిణి ఆర్తి తళుక్కున మెరిసింది. జిల్లా పేరును ఒక్కసారిగా మారుమోగించింది. ఈ నెల 13న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో సింగరేణి ఆర్ఆర్ జట్టు, ఫుల్బాల్ స్టార్ క్రీడాకారుడు లయోనల్ మెస్సీ జట్టుతో ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ జట్టులో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలకు చెందిన క్రీడాకారిణి ఆర్తి పాల్గొంది. సీఎంతో కలిసి ఫుట్బాల్ ఆడింది. ఆర్తి స్వగ్రామం నిర్మల్ జిల్లా రాణపూర్తండా కాగా.. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటారు. గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఫుట్బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున జాతీయ స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను మెస్సీ షో కోసం ఎంపిక చేసినట్లు కోచ్ రవికుమార్ తెలిపారు. రాష్ట్ర ఫుట్బాల్ జట్టులో 10మంది బాలురు ఉండగా.. ఇద్ద రు బాలికలు ఎంపికయ్యారు. ఇందులో ఒకరు ఆర్తి కావడం ఉమ్మడి జిల్లాకే గర్వకారణం. రాష్ట్ర స్థాయిలో గోల్డ్మెడల్.. ఆర్తి 2023–24లో వనపర్తిలో జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకం అందుకుంది. జార్ఖండ్లో జరిగిన జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించింది. 2024–25లో నల్గొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించింది. జమ్మూకశ్మీర్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొంది. తెలంగాణ ఉమెన్స్ లిక్ బెస్ట్ ప్లేయర్ అవార్డూ అందుకుంది. -
విద్యుత్షాక్తో యువకుడు..
కుభీర్: విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల మేరకు కుభీర్కు చెందిన శ్యామ్ మండల కేంద్రంలో టెంట్హౌజ్ నిర్వహిస్తున్నాడు. వరుసకు సోదరుడైన రాంబోల్ నవీన్ (25) అతని వద్ద పనిచేస్తున్నాడు. ఆదివారం మండలంలోని సిర్పెల్లి తండాలో కిశోర్ అనే వ్యక్తి చేనులో టెంట్ వేసేందుకు ఇద్దరూ కలిసి వెళ్లారు. టెంట్ వేసేక్రమంలో నవీన్ ఇనుపపైపును పైకి లేపగా పైన ఉన్న లెవన్ కేవీ విద్యుత్లైన్కు తాకడంతో షాక్కు గురయ్యాడు. అతన్ని రక్షించే ప్రయత్నంలో శ్యామ్కు కూడా స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు. మృతుని తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య
కడెం: అనారోగ్యంతో బాధపడుతున్న ఒకరు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయికిరణ్, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ లక్కవత్తుల రాజనర్సింహం(రాజు) (42)కు 12 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు విరగడంతో చికిత్స చేయించారు. ఇటీవలే రెండు కాళ్లకూ ఇన్ఫెక్షన్ కావడంతో తొలగించాలని వైద్యులు చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన రాజు ఆదివారం గ్రామంలోని చింతచెట్టుకు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
జాతీయస్థాయి సదస్సుకు నిర్మల్వాసి
నిర్మల్ఖిల్లా: బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్(బీడబ్ల్యూఐ) ఆధ్వర్యంలో ఈ నెల 15న చైన్నెలో నిర్వహించనున్న జాతీయ స్థాయి వలస కార్మికుల సదస్సుకు నిర్మల్ జిల్లా వాసి స్వదేశ్ పరికిపండ్లకు ఆహ్వానం అందింది. దేశంలోని ఆయా భౌగోళిక ప్రాంతాల్లో వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చ ర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికుల కోసం చేపట్టిన ‘సీఎం ప్రవాసి ప్రజా వాణి’ ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏ ర్పాటు చేసిన ‘గల్ఫ్ ప్రజావాణి’ వంటివి గల్ఫ్ కార్మికుల సమస్యలపై పనిచేస్తున్న తీరును ఇందులో వివరించనున్నట్లు ఆయన తెలిపారు. హెచ్ఎంఎస్ ఇన్చార్జిగా సుదర్శన్మందమర్రిరూరల్: హెచ్ఎంఎస్ బెల్లంపల్లి రీజి యన్ ఇన్చార్జిగా వెల్ది సుదర్శన్ను నియమిస్తూ యూనియన్ ప్రధాన కా ర్యదర్శి రియాజ్ అహ్మద్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. సుదర్శన్ మాట్లాడుతూ రీజియన్లో యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. టీ20 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలుమంచిర్యాలటౌన్: కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ 2025 క్రికెట్ టోర్నీకి ఈనెల 16న జిల్లా కేంద్రంలో సీనియర్ క్రికెట్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు కోచ్ ప్రదీప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ ఇండస్ట్రీ సౌజన్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ఒక జట్టును ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల సీనియర్ క్రికెట్ క్రీడాకారులు ఆధార్కార్డు, సొంత క్రికెట్ కిట్, యూనిఫాంతో ఈ నెల 16న మంచిర్యాల జెడ్పీ బాలుర మైదానంలో హాజరు కావాలని సూచించారు. -
రాజారంలో ఉపసర్పంచే సర్పంచ్!
వేమనపల్లి: మండలంలోని రాజారంలో ఉపసర్పంచ్గా ఎన్నికై నవారికే సర్పంచ్ గౌరవం దక్కనుంది. 320 ఓటర్లున్న ఈ పంచాయతీని ఎస్సీలకు కేటాయించారు. గ్రామంలో ఎస్సీలెవరూ లేనందున సర్పంచ్ ఎన్నిక నిర్వహించలేదు. ఎస్సీలకు కేటాయించిన 1, 2, 3 వార్డుల్లోనూ ఎస్సీలు లేనందున వీటికీ ఎన్నిక జరగలేదు. మిగతా 4,5,6 వార్డులకే ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ బలపరిచిన నాలుగో వార్డు అభ్యర్థి కొద్దని శంకరమ్మ గెలుపొందింది. 5, 6 వార్డులకు బీఆర్ఎస్ బలపరిచిన ఎనగంటి మల్లీశ్వరి, గాదర్ల బీరయ్య విజయం సాధించారు. వీరిలో ఎనగంటి మల్లీశ్వరి ఉపసర్పంచ్గా ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నిక లేనందున ఇక్కడ ఉపసర్పంచ్కే ఇన్చార్జి బాధ్యతలు, చెక్ పవర్ అప్పగించి పాలక వర్గాన్ని కొనసాగించనున్నారు. -
సర్పంచ్ అభ్యర్థికి అస్వస్థత
● ఆస్పత్రికి.. ఆ తర్వాత పోలింగ్ కేంద్రానికి.. బెల్లంపల్లి: తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మాస వెంకటస్వామి అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్సతో తేరుకుని గంటల వ్యవధిలోనే మళ్లీ పోలింగ్ కేంద్రానికి చేరాడు. ఆదివారం ఉదయం 8గంటల ప్రాంతంలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన ఛాతిలో నొప్పి వస్తోందంటూ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఆయన ఉదయం 11గంటలకు మళ్లీ పోలింగ్ కేంద్రంలో ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఓటర్లు అవాక్కయ్యారు. ఏం జరిగిందో తెలియదు గానీ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరడం, పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. నాలుగుసార్లు సర్పంచ్కాసిపేట: మండలంలోని పల్లంగూడకు చెందిన దుస్స విజయ–చందు దంపతులు నాలుగు పర్యాయాలు సర్పంచ్గా ఎన్నికై గ్రామంలో తమ పేరు పదిలపర్చుకున్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా దుస్స చందు ఒక్కసారి సర్పంచ్గా ఐదేళ్లు పని చేశాడు. అతని భార్య దుస్స విజయను జనరల్, బీసీ స్థానాల్లో నిలుపుతూ మూడుసార్లు గెలిపించాడు. మధ్యలో ఒకసారి ఎస్సీ రిజర్వేషన్ రాగా తనకు నచ్చిన అభ్యర్థినే గెలిపించుకున్నాడు. ఏదిఏమైనా గ్రామంలో అభివృద్ధి సమస్యలతో వ్యతిరేకత ఎదుర్కొనే నాయకుల్లో ఉన్న ఈ రోజుల్లో నాలుగుసార్లు గెలవడం విశేషం. -
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ప్రలోభం
చెన్నూర్రూరల్: మండలంలోని కిష్టంపేట పంచాయతీలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ప్రచారం జరగడంతో ప్రజలు ఆధార్కార్డు, రేషన్కార్డులతో రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు రైతు వేదిక వద్దకు వెళ్లడంతో సదరు నాయకులు అక్కడ నుంచి జారుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రచారం జరగడంతోనే ఇక్కడకు వచ్చామని గ్రామస్తులు తెలిపారు. ఓట్లకోసం అమాయక ప్రజలను ప్రలోభాలకు గురిచేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
ఆరట్టు వైభవం
దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీఅభినవ శబరిమల అయ్యప్ప ఆలయంలో ఆదివారం ఆరట్టు వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపకుడు, గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు జల క్రీడ, పంచామృతాభిషేక పూజలు, పుష్పాభిషేకం, మూల విరాట్టుకు అభిషేక పూజలు నిర్వహించారు. ఆరట్టులో భాగంగా ఆలయ సమీపంలో మరో గుట్టపై అయ్యప్ప భక్తులు వల్లీవేట కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల శరణుఘోషతో గూడెం అయ్యప్ప ఆలయ ప్రాంగణం మార్మోగింది. అయ్యప్ప కీర్తనలతో నిర్వహించిన ప్రత్యేక భజన కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి కూడా దీక్షాపరులు, భక్తులు అధికసంఖ్యలో వచ్చారు.ఉత్సవ విగ్రహానికి అభిషేక పూజలు చేస్తున్న అర్చకులు -
గాడి తప్పిన సింగరేణి వ్యవస్థ
● ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్ ప్రసాద్శ్రీరాంపూర్: సింగరేణి వ్యవస్థ గాడి తప్పిందని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బీ.జనక్ ప్రసాద్ అన్నారు. ఆదివారం నస్పూర్ కాలనీలోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థ భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిందన్నారు. ఉన్నత స్థాయిలో అధికారులు సరైన నిర్ణయాలు తీసుకోకుండా సంస్థకు నష్టం చేకూరుస్తున్నారన్నారు. కొత్తగనులు లేక ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లాయన్నారు. నెలనెల తరబడి మెడికల్ బోర్డుకు పిలువకపోవడం వల్ల కార్మికులు లక్షల రూపాయాలు నష్టపోతున్నారన్నారు. 25 మంది సీనియర్ యూనియన్ నేతలతో కమిటీ ఏర్పాటు చేసి వారితో మంత్రులను కలిసి కార్మికుల సమస్యలు వివరిస్తామన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో తనకు మాట్లాడే అవకాశం దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ఆ యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య, ఉపాధ్యక్షులు జెట్టి శంకర్రావు, కలవేన శ్యాం, ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్రెడ్డి, నాయకులు భీంరావు, ల్యాగల శ్రీనివాస్, పెట్టం శ్రీనివాస్, రావుల అనిల్, తోకల సురేష్ యాదవ్, మనోజ్, తదితరులు పాల్గొన్నారు. -
రక్షణే శ్రీరామ రక్ష
శ్రీరాంపూర్: సింగరేణిలో ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయి. గతంతో పోల్చితే కంపెనీలో ప్రమాదాల సంఖ్య తగ్గింది. మారిన టెక్నాలజీ, పనిపరిస్థితులు, వర్క్మెన్ కల్చ ర్, కొత్త రక్షణ పద్ధతులు వెరసి ప్రమాదాలు తగ్గుముఖంపట్టాయి. ఎనిమిదేళ్లుగా కంపెనీలో రక్షణ చర్యలు మరింత పకడ్బందీగా చేపడుతున్నారు. ఫ లితంగా గతంలో డబుల్ డిజిట్లో ఉన్న మరణాలు నేడు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. ప్రమాదా లను పూర్తిగా రూపుమాపాలని పదేళ్లుగా జీరో హా ర్మ్ సింగరేణి అనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కానీ, అప్పుడప్పుడు జరుగుతున్న ప్రమాదాలు రక్షణ చ ర్యల్లో డొల్లతనాన్ని ఎత్తి చూపుతున్నాయి. రక్షణ చ ర్యల పేరుతో ఆడంబరాలు కాకుండా మరింత పటి ష్ట చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు రక్షణపై సమీక్షిస్తూ క్షేత్ర స్థాయిలో గుర్తించిన హెచ్చరికలకు అనుగుణంగా పటిష్ట రక్షణ చర్యలు చేపడితేనే ఈ లక్ష్యం నెరవేరుతుందని కార్మికులు పేర్కొంటున్నారు. పెరిగిన భద్రత గతంతో రూఫ్ కూలే ప్రమాదాలు అధికంగా జరిగే వి. ఇప్పుడు రూఫ్ బోల్టింగ్, సపోర్టింగ్ వ్యవస్థలో వచ్చిన కొత్త టెక్నాలజీతో ఇవి తగ్గాయి. గ్యాస్, నీటి దుర్ఘటనలు, సైడ్ఫాల్, హాలేజీ ప్రమాదాలు కూడా తగ్గాయి. తట్టా, చెమ్మస్ స్థానంలో ఎస్డీఎల్ యంత్రాలు రావడం, భూగర్భంలో కాలినడకన వెళ్లే బదులు మ్యాన్రైడింగ్ యంత్రాలు రావడం, గ్యాస్ ప్రమాదాలను పసిగట్టే గ్యాస్ డిటెక్టర్ పరికరాలు రావడంతో రక్షణకు మరింత ఊతమిచ్చింది. 2019లో ఏర్పాటు చేసిన సేఫ్టీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్లతో రక్షణ చర్యలను నిత్యకృత్యంగా మాని టరింగ్ చేస్తున్నారు. ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వంటివి సత్ఫలితాలనిస్తున్నాయి. 2017 రెగ్యులేషన్స్లో భాగంగా చేసి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ (ఎస్ఎంపీ)లు, సేఫ్టీ ఆపరేటింగ్ ప్రొసీజర్స్తో కార్మికులను ప్రమాదాల నుంచి తప్పించే చర్యలు కూడా మంచి ఫలితాలనిస్తున్నాయి. కొనసాగుతున్న పక్షోత్సవాలురక్షణ చర్యలను మరింత పటిష్టం చేసి ఉద్యోగులకు అవగాహన కల్పించడం కోసం కంపెనీ వ్యాప్తంగా 56వ రక్షణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. పక్షోత్సవాలు ఈ నెల 8న ప్రారంభమై 20వరకు కొనసాగుతాయి. ప్రతీ గని, డిపార్ట్మెంట్కు ప్రత్యేక తనిఖీ బృందం వచ్చి రక్షణ చర్యలను తనిఖీ చేసి ఉత్తమ ప్రమాణాలు పాటించిన వారికి సెంట్రల్ ఫంక్షన్లో బహుమతి ప్రదానం చేస్తారు. నేడు ఈ పక్షోత్సవా లతో కంపెనీ వ్యాప్తంగా సందడి నెలకొంది. ఉద్యోగు ్డలకు రక్షణపై మరింత అవగాహన కల్పించి తని ఖీ నిర్వహిస్తున్నారు. శ్రీరాంపూర్లో రికార్డు నమోదు రక్షణలో శ్రీరాంపూర్ ఏరియా ఇతర ఏరియాలకు ఆదర్శంగా నిలిచి రికార్డు నమోదు చేసుకుంది. 2023, 2024, 2025లో ఇప్పటివరకు ఒక్క ఫ్యాటల్ యాక్సిడెంట్ జరగలేదు. వరుసగా మూడేళ్లలో ఒక్క కార్మికుని ప్రాణాలు కో ల్పోకపోవడం రికార్డుగా చెప్పవచ్చు. సీరియస్ ప్రమాదాలను పరిశీలిస్తే 2023లో 14, 2024లో 18, 2025లో 17 ప్రమాదాలు జరి గాయి. గత 55వ రక్షణ పక్షోత్సవాల్లో శ్రీరాంపూర్ ఏరియా గనులు, డిపార్ట్మెంట్లో కంపెనీ స్థాయిలో 18 బహుమతులు సాధించింది. -
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
తాండూర్: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ మనోహర్ తెలిపిన వివరాల మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం రోళ్లపహాడ్ గ్రామానికి చెందిన కృష్ణస్వామి–సుమలత దంపతుల కుమార్తె అయిన సహస్ర(3)ను ఆదివారం అతని సోదరుడైన తుంగెర గణేశ్ బైక్పై రెబ్బెన మండలంలోని కొమురవెళ్లికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో రేచిని గ్రామపంచాయతీ పరిధిలోని బల్హాన్పూర్ వద్దకు చేరుకోగానే రేచిని నుంచి వస్తున్న బొలెరో వాహనం వేగంగా ఢీకొట్టింది. బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సహస్ర మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
పరదా మాటున ఓటింగ్..
తాంసి: పరదాలు కట్టిన గదుల్లో ఓటుహక్కు వినియోగించుకుంటున్న దృశ్యం తాంసి మండలంలోని హస్నాపూర్లో చోటు చేసుకుంది. మండలంలోని హస్నాపూర్లో 674 మంది ఓటర్లు, 8 వార్డులు ఉన్నాయి. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రెండు గదులు మాత్రమే ఉన్నాయి. పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సరిపడా గదులు లేకపోవడంతో చేసేదేంలేక అధికారులు గదుల బయట ఉన్న పిల్లర్లకు చుట్టూ పరదాలు (గ్రీన్ మ్యాట్) కట్టి ఆదివారం ఓటింగ్ నిర్వహించారు. ఇదేమిటని అక్కడ ఉన్న అధికారులను అడిగితే గదులు లేకపోవడం వల్ల తాత్కాలికంగా పరదాలతో తయారుచేసిన గదిలో ఓటింగ్ నిర్వహించడం జరిగిందని చెప్పడం విశేషం. -
● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్ ● క దిలిన పల్లెలు.. 84.59శాతం నమోదు ● కన్నెపల్లిలో అత్యధికంగా 90.37.. తాండూర్లో అత్యల్పంగా 78.52శాతం ● కేంద్రాలను సందర్శించిన అధికారులు ● ప్రశాంతంగా ముగిసిన జీపీ ఎన్నికలు
కాసిపేట: దేవాపూర్లో ఓటేసేందుకు క్యూలో నిల్చున్న ఓటర్లు బెల్లంపల్లి: రెండోదశ గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. 84.59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, భీమిని, వేమనపల్లి, కన్నెపల్లి మండలాల్లో 114 గ్రామపంచాయతీలుండగా వీటిలో కాసిపేట, కన్నెపల్లి మండలాల్లోని ధర్మరావుపేట, ముత్తాపూర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. వేమనపల్లి మండలం రాజారం గ్రామపంచాయతీని ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో సర్పంచ్ ఎన్నికలు అక్కడ నిలిచిపోగా మూడు జనరల్ వార్డులకు పోలింగ్ జరిగింది. మిగతా 111 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అత్యధికం కన్నెపల్లి.. అత్యల్పం తాండూర్ పోలింగ్ జరిగిన ఏడు మండలాల పరిధిలో 1,37,382 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,16,205 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 68,179 మంది పురుషులకు గాను 58,179 మంది, 69,195మంది మహిళలకు గాను 58,023 మంది, ఎనిమిది మంది ఇతరులకు గాను ముగ్గురు ఓటు వేశారు. పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం కాస్త తగ్గింది. అత్యధికంగా కన్నెపల్లి మండలంలో 90.37శాతం, అత్యల్పంగా తాండూర్ మండలంలో 78.52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. చలిని లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు గుంపులుగుంపులుగా వచ్చారు. మధ్యాహ్నం 12గంటల వరకే మెజార్టీ ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కేంద్రాలను పరిశీలించిన అధికారులు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటించారు. ఎన్నికలు అధికారులు ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల, నెన్నెల, తాండూర్ మండలం బోయపల్లి పోలింగ్ కేంద్రాలను రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, వేమనపల్లి, నీల్వాయి పోలింగ్ కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, బుదాకలాన్, మాదారం, రాజీవ్నగర్ పోలింగ్ కేంద్రాలను బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, కిష్టంపేట, ముత్యంపల్లి, కాసిపేట పోలింగ్ కేంద్రాలను డీపీవో వెంకటేశ్వర్రావు, తాళ్లగురిజాల, పాతబెల్లంపల్లి, చంద్రవెల్లి, చాకేపల్లి, బోయపల్లి, కిష్టంపేట, తాండూర్జన్కాపూర్ పోలింగ్ కేంద్రాలను డీపీసీ భాస్కర్ సందర్శించారు. నెన్నెల: మండల కేంద్రంలో వీల్చైర్లో వృద్ధురాలిని తీసుకువస్తున్న పోలీసులునెన్నెల: మండల కేంద్రంలో ఓటేసినట్లు వేలు చూపిస్తున్న వృద్ధులుభీమిని: జన్కాపూర్లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీసీపీబెల్లంపల్లిరూరల్: బుధాకలాన్లో పోలింగ్ తీరును పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్ మనోజ్ -
ఇండియా జట్టు తరఫున ఆడాలని ఉంది..
ఫుట్బాల్ పోటీల్లో ఇండియా జట్టు తరఫున ఆడాలనే లక్ష్యంతో రోజూ ఫుట్బాల్ సాధన చేస్తున్నాను. మూడు సార్లు వరల్డ్ కప్ విన్నర్గా నిలిచిన అంతర్జాతీయ క్రీడాకారుడు లయోనల్ మెస్సీతో ఫుట్బాల్ షో ఆడడంతో నా జన్మ ధన్యమైంది. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఇండియా జట్టు తరఫున ఫుట్బాల్ ఆడాలని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో క్రీడాకారులకు మరింత ఉత్సాహం పెరుగుతుంది. – క్రీడాకారిణి ఆర్తి, 9వ తరగతి -
నెన్నెల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన సీపీ
నెన్నెల: మండల కేంద్రంలోని హైస్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని రామగుండం సీపీ అంబ ర్ కిషోర్ ఝా ఆదివారం సందర్శించి ఎన్నిక ల సరళిని పరిశీలించారు. మండలంలో ఎన్ని కలు సజావుగా, ప్రశాంతంగా జరిగినట్లు తె లిపారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, నెన్నెల ఎస్సై ప్రసాద్, సిబ్బందిని అభినందించారు.పోలింగ్ సరళిని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్వేమనపల్లి: మండలకేంద్రంతో పాటు నీల్వాయిలోని పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. కేంద్రాల్లోకి వెళ్లి పోలింగ్ సరిళిని తెలుసుకున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. బీఎల్వోలు, వైద్య సిబ్బంది పని తీరు తెలుసుకున్నారు. లెక్కింపు పూర్తయ్యేదాకా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. అనంతరం పోలింగ్ బాక్సుల పంపిణీ కేంద్రం వద్దకు వెళ్లి ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో కుమారస్వామికి పలు సూచనలు చేశారు. -
పోలింగ్స్టేషన్ ఎదుట ఆందోళన
ఆదిలాబాద్రూరల్: మావల గ్రామ పంచాయతీలో తమ ఓట్లు గల్లంతయ్యాయని పలువురు మహిళా ఓటర్లు ఆదివారం ఆందోళనకు దిగారు. ఓటు వేసేందుకు వచ్చిన మహిళలు బీఎల్వోలను కలిసి పోల్ చీటీలు ఇవ్వాలని కోరగా మీపేర్లు ఓటరు జాబితాలో లేవన్నారు. దీంతో సదరు మహిళలు పోలింగ్ కేంద్రంలోనికి వెళ్లి ఆర్డీవో స్రవంతి, నోడల్ అధికారి రాజలింగుతో వాగ్వాదానికి దిగారు. అయితే వారి ఓట్లు పట్టణ పరిఽధిలోకి వెళ్లాయని, వారు నివసిస్తున్న కాలనీ మున్సిపల్ పరిధిలోకి వస్తుందని ఆర్డీవో నచ్చజెప్పడంతో శాంతించి వెనుదిరిగారు. -
సింగరేణి నిధులు దుర్వినియోగం
మంచిర్యాలటౌన్: ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నిధులతో ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులు కష్టపడి సంస్థకు లాభాలు తెచ్చిపెడితే, రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేని కార్యక్రమాలకు సింగరేణి నిధులు ఖర్చు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మెస్సీ పర్యటనను పార్టీ స్వాగతిస్తుందని, కానీ సింగరేణి నిధులను వెచ్చించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్మికులకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా సింగరేణి నిధులను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సింగరేణి కార్యాలయా ల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు పురుషోత్తం జాజు, గాజుల ముఖేశ్గౌడ్, రాజ్కుమార్, సత్రం రమేశ్, కుర్రె చక్రవర్తి, బింగి ప్రవీణ్, రావణవేణి శ్రీనివాస్, రాకేశ్ రెన్వా, మద్ది సుమన్, చిరంజీవి, ఆకుల నరేందర్, బద్రి శ్రీకాంత్, మాడిశెట్టి మహేశ్ పాల్గొన్నారు. -
జిల్లా టీఈఈ 1104 యూనియన్ కార్యవర్గం ఎన్నిక
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా టీఈఈ 1104 యూనియన్ ఎన్నికల సర్వసభ్య సమావేశం శనివారం కంపెనీ అధ్యక్షుడు బి.రఘునందన్ అధ్యక్షతన వేంపల్లిలోని మంచిర్యాల గార్డెన్లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా బొమ్మ సత్తిరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆర్.రవికుమార్, కార్యదర్శిగా కొండయ్య, అదనపు సెక్రెటరీగా జీవీఎం పరమేశంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంచిర్యాల డివిజన్ అధ్యక్షుడిగా తోట్ల కొమురయ్య, కార్య నిర్వాహక అధ్యక్షుడిగా కండె శ్రీనివాస్, కార్యదర్శిగా బొలిశెట్టి రాజన్న, అదనపు సెక్రెటరీగా జాడి రాజేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బొమ్మ సత్తిరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు, 2011 బ్యాచ్ జూనియర్ లైన్మెన్ ఏరియర్స్, ఈపీఎఫ్ టు జీపీఎఫ్, ఎన్ఎంఆర్లను ఆర్టిజన్లుగా గుర్తించాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా పోరాడుతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కంపెనీ కార్యదర్శి ఎస్.వెంకటరమణారావు, సలహాదారు టి.శేషగిరిరావు, వివిధ జిల్లాల నాయకులు, 300 మంది కార్మికులు పాల్గొన్నారు. -
మొదట ఇక్కడే..
భీమిని: బస్సులో నిలబడి వెళ్తున్న సిబ్బందిభీమిని: నాయకునిపేటలో ప్రజలు, యువకులతో మాట్లాడుతున్న డీసీపీ భాస్కర్బెల్లంపల్లి/మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల, తాండూర్, వేమనపల్లి మండలాల్లోని గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఆయా మండలాల్లోని 114 గ్రామ పంచాయతీలకు గాను కాసిపేట మండలం ధర్మరావుపేట, కన్నెపల్లి మండలం ముత్తాపూర్ గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. వేమనపల్లి మండలం రాజారం గ్రామంలో రిజర్వేషన్ అనుకూలంగా లేకపోవడంతో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇక మిగతా 111 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుండగా.. 336మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 996వార్డు సభ్యుల స్థానాలకు గాను 16చోట్ల నామినేషన్లు రాలేదు. 111మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 873 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనుండగా.. 1,948మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. పోలింగ్ సామగ్రి పంపిణీ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గాను అధికారులు సిబ్బందికి శనివారం మధ్యాహ్నం నుంచి పోలింగ్ సామగ్రి అందజేశారు. ఆయా మండలాల్లోని మండల ప్రజాపరిషత్ కార్యాలయాల ఆవరణలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల ఉత్తర్వుల కాపీలు పంపిణీ చేశారు. బెల్లంపల్లిలోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా ఎన్నికల పర్యవేక్షకుడు మనోహర్ సందర్శించి పోలింగ్ అధి కారులకు సూచనలు చేశారు. అనంతరం పోలింగ్ అధికారులు, సిబ్బందికి తమకు కేటాయించిన గ్రామాలకు పోలీసు బందోబస్తుతో తరలివెళ్లారు. డీటీవో గోపికృష్ణ పర్యవేక్షణలో ఎంవీఐ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో 80బస్సులు, 33 కార్లు, 25టాటా ఏస్ వాహనాలు సమకూర్చారు. అధికారుల నియామకం.. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ నిర్వహణకు డివిజన్ వ్యాప్తంగా 1,147మంది ప్రిసైడింగ్ అధికారులు(పీవో), 1,363 మంది ఓపీవోలు, 48మంది స్టేజ్–2 ఆర్వోలు, ఐదుగురు మైక్రో అబ్జర్వర్లు, 30మంది వెబ్కాస్టింగ్ సిబ్బంది, ఇతరులతో కలిపి మొత్తంగా 2,630మంది ఎన్నికల్లో విధుల్లో పాల్గొననున్నారు. బెల్లంపల్లి మండలంలో 179మంది పీవోలు, 200మంది ఓపీవోలు, భీమినిలో 115మంది పీవోలు, 115ఓపీవోలు, కన్నెపల్లిలో 150మంది పీవోలు, 162మంది ఓపీవోలు, కాసిపేటలో 219మంది పీవోలు, 276మంది ఓపీవోలు, నెన్నెలలో 182మంది పీవోలు, 207మంది ఓపీవోలు, తాండూర్లో 166మంది పీవోలు, 242మంది ఓపీవోలు, వేమనపల్లి మండలంలో 136మంది పీవోలు, 161మంది ఓపీవోలు విధులు నిర్వర్తించనున్నారు. 39 రూట్లు.. 996 మందితో బందోబస్తు.. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. 31 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతోపాటు సాధారణ పోలింగ్ కేంద్రాల్లోనూ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నా రు. 39 రూట్లలో నలుగురు ఏసీపీలు, 12 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 950 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఆర్మ్డ్, ఏఆర్, ప్రత్యేక పోలీసులతో కలిపి 996 మంది ఎన్నికల బందోబస్తులో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి బెల్లంపల్లిరూరల్/తాండూర్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా సాధారణ ఎన్నికల పర్యవేక్షకుడు మనోహర్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అధికారులకు సూచించారు. శనివారం బెల్లంపల్లి, తాండూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ నిర్ణీత సమయానికి ప్రారంభించి గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు పారదర్శంగా చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో మహేందర్, ఎంఈవో పోచయ్య, ఎంపీవో శ్రీనివాస్, సహాయ ఎన్నికల అధికారి శ్రీనివాస్, తహశీల్దార్ జ్యోత్స్న, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారులే కీలకంనెన్నెల/వేమనపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అధికార పాత్ర కీలకమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. రెండో విడత ఎన్నికల నేపథ్యంలో నెన్నెల, వేమనపల్లిలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను శనివారం ఆయన సందర్శించారు. సామగ్రి పంపిణీపై సలహాలు, సూచనలు చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని పోలింగ్ సిబ్బందికి సూచించారు. పూర్తి స్థాయి సామగ్రితో ఉద్యోగులను పోలింగ్ కేంద్రాలకు చేర్చడంతోపాటు లెక్కింపు పూర్తయ్యాక తిరిగి వచ్చేలా రూట్ అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో నెన్నెల ఎంపీడీఓ అబ్దుల్హై, తహసీల్దార్ పిప్పిరి శ్రీనివాస్, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓ నరేష్, వేమనపల్లి ఎంపీడీవో కుమారస్వామి, డీటీ మస్కూర్ఆలీ, ఎంఈఓ శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలుబెల్లంపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు విధిగా గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. పోల్ చిట్టీతోపాటు గుర్తింపు కార్డును తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం 18 రకాల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డును చూపించి ఓటు వేయవచ్చని సూచించింది. కార్డులు ఇవే.. ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులను ప్రకటించింది. ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఫొటోతో కూడిన పట్టాదారు పాసు పుస్తకం, కుల ధ్రువీకరణ పత్రం, రేషన్కార్డు, పీహెచ్సీ ఫొటో గుర్తింపు కార్డు, ఓటరు ఐడీ కార్డు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, కో–ఆపరేటివ్ సంస్థలు ఉద్యోగులకు జారీ చేసిన గుర్తింపు కార్డులు, ఉపాధి హామీ పథకం జాబ్కార్డు, ప్రభుత్వం అందజేసిన హెల్త్కార్డు, కార్మిక శాఖ ఆరోగ్య బీమా పథకం కార్డు, వితంతువులు, మాజీ సైనికుల పింఛన్ పుస్తకం, వృద్ధుల పింఛన్ పత్రం, స్వాతంత్య్ర సమర యోధుల గుర్తింపు కార్డు, దివ్యాంగుల ధ్రువపత్రం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు జారీ చేసిన గుర్తింపు కార్డులు పరిగణలోకి తీసుకుంటారు.గుర్తింపు కార్డు చూపిస్తేనే ఓటునెన్నెల: పంచాయతీ ఎన్నికల్లో గొడవలు సృష్టించి, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీసీపీ భాస్కర్ యువకులకు సూచించారు. శనివారం రాత్రి నెన్నెల మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో సాయుధ పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించారు. అనంతరం హనుమాన్ చౌరస్తాలో యువత, గ్రామస్తులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, నాయకులు సహకరించాలని అన్నారు. యువకులు గొడవలకు పాల్పడవద్దని, ఒకసారి ఎన్నికల సంబంధిత కేసు నమోదైతే భవిష్యత్లో చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రతీసారి వారిని బైండోవర్ చేస్తారని, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు అనర్హులు అవుతారని అన్నారు. ఓటర్లు ప్రలోభాల కు లోనుకాకుండా ఓటు వేయాలని కోరారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ర్యాలీలు, విజయోత్సవా లకు అవకాశం లేదన్నారు. ఏసీపీలు రవికుమార్, ప్రకాష్, ఎస్సైలు ప్రసాద్, సంతోష్ పాల్గొన్నారు.జిల్లాలో 1,37,382మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 68,179మంది, మహిళలు 69,195 మంది, ఇతరులు 8మంది ఉన్నారు. కొన్ని గ్రామాల్లో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు. తాండూర్ మండలం నీలాయపల్లిలో 292మంది, భీమిని మండలం లక్ష్మీపూర్లో 376 మంది, నెన్నెల మండలం జోగాపూర్లో 430 మంది, కాసిపేట మండలం తాటిగూడలో 435 మంది, బెల్లంపల్లి మండలం లింగాపూర్లో 461 మంది, దుగ్నెపల్లిలో 493 మంది ఓటర్లు ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన రెండు గంటల్లోనే ఫలితం వెలువడే అవకాశాలున్నాయి.కాసిపేట: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీనెన్నెల: పోలింగ్ సామగ్రితో బస్సులో గ్రామాలకు వెళ్తున్న అధికారులు, సిబ్బంది -
సర్పంచులకు సన్మానం
మంచిర్యాలటౌన్: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందగా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి శనివారం ఘనంగా సన్మానించారు. దొనబండ సర్పంచ్ బేతు రమాదేవి, వెల్గనూర్ సర్పంచ్ మోరుపుటాల మానస తులసి, నాగసముద్రం సర్పంచ్ నందుర్క సుగుణ, నంబాల సర్పంచ్ గోపె రాజమల్లు, లక్ష్మీపూర్ సర్పంచ్ సురమల్ల సౌజన్యలను అభినందించారు. నంబాల ఉపసర్పంచ్ బుద్దె వెంకటేశ్కు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. -
‘ఇంటర్’ ఫీజు చెల్లించలేం..!
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ ఫి బ్రవరి 2నుంచి, వార్షిక పరీక్షలు 25 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ప్రభుత్వ కళాశాలల్లో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రూ.630 వార్షిక పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రాక్టికల్స్కు అదనంగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 14 వరకే పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. అపరాధ రుసుం రూ.వెయ్యితో డిసెంబర్ 3నుంచి 9వరకు అధికారులు అవకాశం కల్పించారు. అయినా చాలామంది పరీక్ష ఫీజు చెల్లించలేదు. ఈ నెల 16నాటితో అపరాధ రుసుం రూ.2వేలతో చెల్లింపు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థుల వివరాలపై ఇంటర్ విద్యాశాఖ ఆరా తీస్తోంది. రెగ్యులర్గా కళాశాలకు వస్తున్నారా, గైర్హాజరుకు కారణాలేమిటో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు, కారణాలు ఏమిటనే విషయాలపై దృష్టి సారించారు. జిల్లాలోని పది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 4,114 మంది విద్యార్థులు ఉన్నారు. 3,386మంది(82.3శాతం) మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించారు. 728మంది పరీక్ష ఫీజు చెల్లించలేదు. ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో 2,438మందికి గాను 1974మంది ఫీజు చెల్లించగా.. 464 మంది ఇంకా కట్టాల్సి ఉంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,676 మందికి గాను 1,412 మంది ఫీజు చెల్లించారు. ఇంకా 264మంది విద్యార్థులు చెల్లించాల్సి ఉంది. విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడానికి గల కారణాలపై ఇంటర్మీడియెట్ బోర్డుకు నివేదించనున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా భారం..! పరీక్ష ఫీజు చెల్లించకపోవడానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. విద్యార్థుల్లో ఎక్కువ మందికి తల్లి ఉంటే తండ్రి లేకపోవడం, ఇద్దరూ లేకపోవడంతో వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ, నానమ్మ ఇళ్లలో ఉంటున్నారు. వారాంతాల్లో పని చేస్తూ చదువుతున్న వారే కావడంతో ఫీజులు చెల్లించలేక డ్రా పౌట్గా మారుతున్నారు. ఇక అపరాధ రుసుం రూ.2వేలతో చెల్లించాలంటే ఆర్థికంగా భారమవుతుంది. కళాశాలకు గైర్హాజరు ప్రభుత్వ కళాశాలల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు తరచూ గైర్హాజరవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి ఉదయం 8గంటలకు బయల్దేరితే ఇళ్లకు వెళ్లసరికి రాత్రి అవుతుండడంతో ఆకలికి తాళలేక మధ్యాహ్నమే వెళ్లిపోతున్నారు. మరికొందరు కుటుంబ పరిస్థితుల కారణంగా సీజనల్ పనుల్లో నిమగ్నం కావడంతో రావడం లేదని తెలుస్తోంది. పత్తి, మిర్చి ఏరడం, దుక్కులు దున్నడం వంటి పనుల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలవడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతోంది. పదో తరగతి వరకు మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫామ్, పుస్తకాలు తదితర సౌకర్యాలు ఉంటున్నాయి. దీంతో ఇళ్లలో కుటుంబ పెద్దలు అభ్యంతరం చెప్పకపోవడంతో బడిబాట పడుతున్నారు. ఇంటర్కు వచ్చే సరికి ఖర్చులు పెరిగిపోవడం, పనుల్లో సాయం చేయాల్సి రావడం వల్ల డ్రాపౌట్లుగా మారుతున్నారు.జిల్లాలోని ఓ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ బైపీసీ ఫస్టియర్ విద్యార్థి రమేష్(పేరు మార్చం)కు తల్లిదండ్రులు లేరు. నానమ్మ ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు తొమ్మిదో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా.. రమేష్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఇంట్లో పెద్ద దిక్కు లేకపోవడం, నానమ్మ వృద్ధాప్యం కారణంగా ఆదివారం, సెలవు రోజుల్లో పని చేయాల్సి వస్తోంది. పరీక్ష ఫీజు రూ.630 చెల్లించలేని పరిస్థితి. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక భారం నేపథ్యంలో చాలామంది విద్యార్థులది ఇదే పరిస్థితి.విద్యార్థి, అధ్యాపకుల మధ్య దూరం పరీక్ష ఫీజు చెల్లింపులపై విద్యార్థులకు అధ్యాపకులు ఫోన్లు చేస్తే ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. కళాశాలలో అడ్మిషన్లు పొందినప్పుడు ఓ నంబరు ఇవ్వడం, తర్వాత మార్చడం వల్ల ఫోన్ పని చేయడం లేదు. దీంతో విద్యార్థి, అధ్యాపకుల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఏదైనా సమాచారం ఇవ్వాలన్నా కష్టతరంగా మారుతోంది. రాక రాక కళాశాలకు వస్తే పాఠాలు అర్థం కాక గైర్హాజరుకే మొగ్గు చూపుతున్నారు. ఇదివరకు అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు రెండు మూడు విడతల్లో చెల్లింపులు ఉండేది. ప్రస్తుతం ఒకేసారి అపరాధ రుసుం లేకుండా చెల్లించాలనే నిబంధన కూడా పేద విద్యార్థులకు గుదిబండగా మారింది. పరీక్ష ఫీజు రూ.630 చెల్లించలేని విద్యార్థి రూ.2వేలు అపరాధ రుసుం ఎలా చెల్లిస్తాడో అధికారులకే తెలియాలి. పరీక్ష ఫీజు చెల్లించాలని, అపరాధ రుసుంతో మూడు రోజుల్లో గడువు ముగుస్తుందని ఫోన్ చేసి అధ్యాపకుడు సూచిస్తే.. ‘మీరే చెల్లించండి సారూ.. నేను పనిచేసిన డబ్బులు వచ్చాక మీకు ఇస్తా..’ అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడడం విద్యార్థుల ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. పేద విద్యార్థులు ఇంటర్ పరీక్షకు దూరం కాకుండా అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
ఓటు వేయలేదని బెదిరింపులు.. అనుచిత వ్యాఖ్యలు
ఇంద్రవెల్లి: ఇరువర్గాల మధ్య రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఈ.సాయన్న తెలిపారు. మండల కేంద్రానికి చెందిన కాంబ్లే అతీష్కుమార్ ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి పోటీచేసి ఓడిపోయాడు. ఈ నెల 12 రాత్రి వ్యాపారి ఠాకూర్ దీపక్సింగ్ షేకావత్కు ఫోన్చేసి తనకు ఓటు వేయలేదని, నీతోపాటు వ్యాపారులందరి సంగతి చూస్తానని, జేసీబీతో షాపులన్నీ కూల్చివేయిస్తానని బెదిరించాడు. అంతేకాకుండా ఇంద్రవెల్లి పటేల్ మారుతి డోంగ్రేపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీపక్సింగ్ షేకావత్ ఫిర్యాదు మేరకు అతిష్కుమార్పై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వ్యాఖ్యలకు నిరసనగా వ్యాపారులు మార్కెట్ బంద్ నిర్వహించారు. ర్యాలీగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి అతిష్కుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేత
బోథ్: జిల్లాలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఈ నెల 11 నుంచి మొక్కజొన్న కొనుగోళ్లను నిలివేశారు. మార్కెట్యార్డులో ఇప్పటి వరకు నిల్వ ఉంచిన మొక్కజొన్నను మాత్రమే కొనుగోలు చేయనున్నట్లు మార్క్ఫెడ్ ప్రకటించింది. అయితే ఇంటివద్ద మొక్కజొన్న పంట నిల్వ ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో ఉన్న పంట మాత్రమే కొనుగోళ్లు.. ప్రస్తుత రబీ సీజన్లో మొక్కజొన్న పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. సోయాబీన్ కొనుగోలు కేంద్రాల కంటే ముందే జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనథ్, భీంపూర్, నార్నూర్ మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ నెల 11 నుంచి కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. అలాట్మెంట్ పూర్తయినందున అధికారులు కొనుగోళ్లు చేపట్టడం లేదు. అయితే ఇప్పటికే మార్కెట్కు తీసుకువచ్చిన పంటను మాత్రమే కొంటామని అధికారులు పేర్కొన్నారు. కొత్తగా మార్కెట్కు మొక్కజొన్నలు తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు. 23 వేల టన్నులు కొనుగోలు జిల్లావ్యాప్తంగా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 8 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆయా కేంద్రాల ద్వారా సుమారు 23 వేల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2,400 చెల్లించి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల ఆకస్మిక మూసివేత నిర్ణయంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాలను మూసివేస్తే, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర తమకు దక్కకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. మిగిలిన పంటను ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుందని, దీనివల్ల భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు ప్రక్రియను మరో వారం రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నారు. -
శభాష్ ..ప్రేరిత్..!
మంచిర్యాలఅర్బన్: స్మార్ట్ ఫోన్ల వినియోగం పి ల్లలపై దుష్ప్రభావాలు చూపుతున్నాయి. ఆన్లైన్ గేమ్లు, ఇతర కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతున్న ఈ రోజుల్లో అందరిలా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటాడు మంచిర్యాలకు చెందిన ముంజం ప్రేరిత్. సాంకేతిక పరిజ్ఞానంతో త న ఆలోచనలకు పదునుపెట్టి ‘జ్ఞానయాత్ర’ పేరుతో క్విజ్యాప్ తయారుచేసి ఔరా అనిపించాడు. తయారీకి మూడు నెలలు.. మంచిర్యాలకు చెందిన ముంజం బాబురావు, చందన దంపతుల కుమారుడైన ప్రేరిత్ స్థానిక కార్మెల్ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నా డు. యాప్ డెవలప్మెంట్ లెస్సెన్ (పాఠం)తో తర్ఫీదు పొందిన ఈ చిన్నారి తన ఆలోచనకు పదును పెట్టాడు. పట్టుదలతో అందివచ్చిన సాంకేతికను ఉపయోగించి రోజువారీ క్విజ్లు, బహు ళ ఎంపిక ప్రశ్నలు, స్కోర్ ట్రాకింగ్ తదితర సరదాగా నేర్చుకోవటానికి ఉపయోగపడే అంశాలతో యాప్ రూపొందించాడు. ఇందుకు మూడు నె లల సమయం పట్టిందని పేర్కొన్నాడు. యాప్తో విద్యార్థులు క్విజ్, సాధారణ జ్ఞానం, విద్యా సంబంధిత ప్రశ్నలు నేర్చుకునే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ వినియోగించే తీరును బట్టి ఉంటుందని, విద్యను సులభంగా ఆసక్తికరంగా అందించాలనే లక్ష్యంతో ఈయాప్ను రూపొందించినట్లు ప్రేరిత్ ‘సాక్షి’కి తెలిపాడు. గణితంలో ఘనుడు.. క్విజ్ యాప్ కాకుండా గణితంలో కూడా ప్రేరిత్ సత్తా చాటాడు. ఇదివరకు అలామా సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఏఏ–1లో 13 దేశాల నుంచి వెయ్యిమంది విద్యార్థులు పాల్గొనగా ప్రేరిత్ ప్రథమ స్థానం సాధించాడు. ఏడు నిముషాల్లో అత్యధిక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంతో అలామా సంస్థ ఆన్లైన్ సర్టిఫికెట్ అందజేసింది. -
నత్తనడకన రైల్వే ఆధునికీకరణ
బాసర: అమృత్ భారత్ పథకం కింద బాసర రైల్వేస్టేషన్లో చేపట్టిన ఆధునికీకరణ పనులు రెండుళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలసంఖ్యలో వచ్చే యాత్రికులకు ఇబ్బందులు తప్పడంలేదు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దున ఉండడం, జ్ఞానసరస్వతీ మాత ఆలయం, ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయం ఉండడంతో బాసరకు ప్రయాణికులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. అమృత్ భారత్ పథకం కింద ఎంపికై న బాసర రైల్వేస్టేషన్లో 2024 ఫిబ్రరి 26న అప్పటి ఎంపీ సోయం బాపూరావు, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వర్చువల్ విధానంలో పనులు ప్రారంభించారు. కేంద్రం నిధులు మంజూరు చేసినా పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆధునికీకరణలో భాగంగా స్టేషన్లో వెయిటింగ్ హాల్, టాయిలెట్స్ నిర్మాణం, ఎస్కలేటర్, లిఫ్ట్ ఏర్పాటు పనులు చేపట్టారు. యాత్రికులు సేదతీరేందుకు విశ్రాంతి గదుల నిర్మాణం చేపట్టారు. ఆధునికీకరణలో భాగంగా బాసర రైల్వేస్టేషన్ పాత ప్లాట్ఫాంలు తొలగించారు. రెండు ప్లాట్ ఫాంలు ఉండగా ఇరువైపులా పనులు చేస్తున్నప్పటికీ ప్రయాణికులు నిలబడే పరిస్థితి ఏర్పడింది. ప్లాట్ ఫాంలపై వివిధ బోగీలను సూచించే ఎలక్ట్రానిక్ మానిటర్లు తొలగించారు. దీంతో ఏరైలు ఎక్కడ నిలుస్తుందో తెలియక ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తి చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. బాసరలో ఆగని వారంతపు రైళ్లు బాసర రైల్వే స్టేషన్ మీదుగా రోజుకు 40 నుంచి 45 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. అందులో వారాంతపు రైళ్లు 12765, 12766, 16734, 16733, 12720, 19714, 19713, 19302, 19301, 07605/07606, 17605,17606 ఆగడం లేదు. వీటిపై ఇప్పటికే రైల్వే మంత్రిత్వ పాటు రైల్వే ఉన్నతాధికారులకు పలువురు విన్నవించారు. -
‘నిందితులను అరెస్ట్ చేయకపోతే కలెక్టరేట్ ముట్టడి’
చెన్నూర్: వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ మృతికి కారణమైన నిందితులను అరెస్ట్ చేయకపోతే జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏటా మధుకర్ మృతిచెంది రెండు నెలలు కావస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అండదండలతో నిందితులు యథేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నిందితులను అరెస్టు చేయాలని, లేనిపక్షంలో రామగుండం సీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు బత్తుల సమ్మయ్య, తుమ్మ శ్రీపాల్, రాజశేఖర్, రాపర్తి వెంకటేశ్వర్, ఏతం శివకృష్ణ, మద్ద మధుకర్, అడుప శ్రీనివాస్, రాజేశ్, శంకర్, ప్రసాద్, చరణ్ పాల్గొన్నారు. -
శతాధిక వృద్ధురాలు మృతి
హాజీపూర్(మంచిర్యాలరూరల్): జిల్లా కేంద్రంలోని గోసేవ మండల్ కాలనీకి చెందిన శతాధిక వృద్ధురాలు బొట్ల ఆగమ్మ శనివారం మృతి చెందింది. గత జూలై 25న కుటుంబ సభ్యుల సమక్షంలో వందేళ్ల జన్మదిన వేడుకలు జరుపుకున్న వృద్ధురాలి భర్త 30 ఏళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఆరుగురు కుమారులు, కుమార్తె సంతానం. మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, పలువురు ప్రజా ప్రతినిధులు, వైద్యులు, ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు, సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. పాము కాటుకు మహిళ..తిర్యాణి: పాము కాటుకు మహిళ మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన తుమ్రం జమున (58) తన సోదరుడు పర్వత్రావు ఇంటివద్ద ఉంటోంది. గురువారం చేనులో కూరగాయలు తెంపేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె కాలుకు ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. ముళ్లు గుచ్చుకున్నాయని భావించి ఇంటికి వచ్చింది. కొద్దిసేపటికి వాంతులు కావడంతో పాటు కాలు వాపెక్కడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పాము కాటు వేసినట్లు నిర్ధారించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి మృతి చెందింది. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి..మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చి కిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీ ఐ ప్రమోద్రావు తెలిపారు. ఈనెల 12న స్థానిక రైల్వే స్టేషన్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని స్థానికులు గు ర్తించి 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొ ందుతూ శనివారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మృతుని వద్ద ఎలాంటి ఽఆధారాలు లభించలేదని, బిహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలకు 8712656534లో సంప్రదించాలన్నారు. -
చెన్నూర్లో నవోదయ పరీక్షలో మాస్ కాపీయింగ్
చెన్నూర్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన నవోదయ ఎంట్రెన్స్ పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగిందని విద్యార్థులు ఆరోపించారు. రూమ్ నెంబర్ 6లో విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా ఇన్విజిలేటర్ వచ్చి వారి బంధువుల పిల్లలకు ఒకరి పరీక్ష పేపర్ను మరొకరికి ఇచ్చి రాయించారన్నారు. అంతే కాకుండా తెలియని జవాబులను పరీక్ష ముగిసే వరకు చెప్పడం దారుణమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదంతా కష్టపడి చదువుకుంటే కాపీ కొట్టి పాసైన విద్యార్థులు మా భవిష్యత్ను నాశనం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పే పంతుల్లే ఇలా కాపీయింగ్కు ప్రోత్సహించడం సరికాదన్నారు. గతేడాది సైతం ఇలాగే జరిగిందని మా అబ్బాయి చెప్పాడని విద్యార్థి తండ్రి జగదీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత పాఠశాలలో నవోదయ ప్రవేశ పరీక్షలో జరిగిన కాపీయింగ్పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన ఇన్విజిలేటర్ల పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
గల్ఫ్ చట్టాలపై అవగాహన ఉండాలి
ఖానాపూర్: గల్ఫ్ దేశాలకు ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్లాలనుకునే ఆశావహులు అక్కడి చట్టాలు, పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, ఎన్ఆర్ఐ అడ్వైజరీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సింగిరెడ్డి నరేష్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని తిమ్మాపూర్ పద్మశాలి సంఘ భవనంలో గల్ఫ్ వెళ్లేవారికి ముందస్తు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడి చట్టాలు, సంస్కృతి, పని విధానాలు, భద్రతా నిబంధనలు, వేతనాలు, ఒప్పందాల వివరాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. మోసాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎంబసీల హెల్ప్లైన్ నంబర్లు, సహాయక సంస్థల సమాచారాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సాయిండ్ల రాజయ్య, కోఆర్డినేటర్ కంటం రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
సుద్దాలలో 14 మంది, బుద్దారంలో నలుగురు
చెన్నూర్రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని సుద్దాల గ్రామ పంచాయతీ సర్పంచ్ రి జర్వేషన్ ఎస్సీ మహిళకు కేటాయించగా 14 మంది అభ్యర్థులు బరిలో ఉ న్నారు. 1,689 ఓటర్లకు గానూ 832 మంది పురుషులు, 857 మంది మహిళలు ఉన్నారు. కిష్టంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కాగా తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3,029 మంది ఓటర్లకు గానూ 1,467 మంది పురుషులు, 1,562 మంది మహిళలు ఉన్నా రు. గంగారం సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వుకాగా తొమ్మిది మంది బరిలో ఉఉన్నారు. 1,162 మంది ఓటర్లకుగానూ 578 మంది పురుషులు, 584 మంది మహిళలు ఉన్నారు. దుగ్నెపల్లి సర్పంచ్ ఎస్సీ జనరల్ రిజర్వుకాగా ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,556 మంది ఓటర్లకుగానూ 752 మంది పురుషులు, 804 మంది మహిళలు ఉన్నారు. అతిచిన్న పంచాయతీ బరిలో నలుగురు అతి చిన్న గ్రామ పంచాయతీ అయిన బుద్దారం స ర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వుకాగా నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 271 మంది ఓటర్లకుగానూ 134 మంది పురుషులు, 137 మంది మహిళలు ఉన్నారు.ఆయా పంచాయతీల్లో సర్పంచ్ పదవి ఎవరిని వరించనుందో? వేచి చూడాల్సిందే.లక్ష్మణచాంద: గత ఎన్నికల్లో మండలంలోని రాచాపూర్ గ్రామ ఉప సర్పంచ్గా పనిచేసిన భూషి ముత్యం ప్రస్తుత ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి విజయం సాధించాడు. గతంలో తాను గ్రామస్తులకు చేసిన సేవతోనే ఈసారి సర్పంచ్గా తనకు అవకాశం కల్పించారని, గ్రామాభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొంటున్నాడు.నాడు ఉపసర్పంచ్..నేడు సర్పంచ్ -
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో వంద పడకల అసుపత్రి, గిరిజన ఆశ్రమ పాఠశాల భవనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అమృత్ 2.0 నిర్మాణ పనులను అధికారులు, కాంట్రాక్టర్ల సమన్వయంతో వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం పట్టణంలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను ఆయన సందర్శించారు. వంద పడకల ఆసుపత్రి పూర్తయితే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని తెలిపారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వేసవికాలంలోగా అమృత్ 2.0 పనులు పూర్తి చేసి తాగునీరు అందించాలని అన్నారు. పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
దుర్వినియోగం కాకుండా చర్యలు
కార్పొరేషన్ పరిధిలో తిరిగే వాహనాలకు పెట్రోల్, డీజిల్ను అవసరం మేరకు మాత్రమే ప్రతీరోజు పోయిస్తాం. ఇటీవల ఒక డ్రైవర్ వాహనాన్ని తిప్పకుండా పెట్రోల్ మిగిలించి బాటిళ్లలో తీసుకుంటున్న వీడియో బయటకు రాగా, అతడిని విధులకు దూరంగా ఉంచాం. ప్రతీరోజు పెట్రోల్, డీజిల్ వినియోగంపై ప్రత్యేక పర్యవేక్షణ చేసి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఇతర వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోయిస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదు. – సంపత్కుమార్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
కార్పొరేషన్ ‘చమురు’ వదిలిస్తున్నారు..!
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోని వాహనాల్లో పెట్రోల్, డీజిల్ వినియోగంపై నియంత్రణ కరువైంది. ప్రతీ నెల రూ.21లక్షలకు పైగా వ్యయం చేస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ చమురును దుర్వి నియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్కు చెందిన స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు, జేసీబీలు, ప్రొక్లెయిన్లు, ల్యాడర్, బయో టాయిలెట్ బస్సులు, వైకుంఠ రథాలు మొత్తంగా 123వరకు వాహనాలు ఉన్నాయి. వీటిని ఆయా పనులకు నగరంలో తిప్పుతుండగా.. సుమారు 20 వరకు వాహనాలు ప్రతీ నెల ఏదో ఒక మరమ్మతుతో రోడ్లపైకి రావడం లేదు. ప్రతీ రోజు పెట్రోల్, డీజిల్ పోయిస్తున్నారు. ఆయా వాహనాలు ఎక్కడ తిరుగుతున్నాయి, ఎంత మేర పెట్రోల్, డీజిల్ వినియోగిస్తున్నారనే దానిపై సరైన పర్యవేక్షణ లేదు. వాహనాలు తిరిగినా, తిరగకున్నా లెక్క ప్రకారం ఇంధనం పోయిస్తున్నారని తెలుస్తోంది. వాహనాలను అవసరం మేరకు తిప్పకుండానే అందులో మిగిలిన పెట్రోల్, డీజిల్ను డ్రైవర్లు బాటిళ్లలో తీసి అమ్ముకున్న సంఘటనలు ఇటీవల బయటపడ్డాయి. ఆయా డ్రైవర్లను చర్యలు తీసుకున్నా పర్యవేక్షణ లోపించి ప్రజాధనం వృథా అవుతోందనే ఆరోపణలున్నాయి. జీపీఎస్ ట్రాకింగ్ లేకనే.. కార్పొరేషన్లో ప్రతీ నెల రూ.21 లక్షలకు పైగా వి లువైన పెట్రోల్, డీజిల్ వినియోగిస్తున్నారు. గతంలో ప్రతీ వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేసి ఏ వాహనం ఎక్కడెక్కడ తిరుగుతుందో పర్యవేక్షించేవారు. పలు వాహనాల తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని, రూ.లక్షలు ఖర్చు చేసి మ రమ్మతు చేయిస్తున్నారు. మరమ్మతుకు గురైన వా హనాలు ఆ నెలలో తిరగకపోయినా ఇంధనం ఖర్చు ఏమాత్రం తగ్గకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్ వాహనాలతో పాటు కొందరు సిబ్బంది సొంత వాహనాల్లో పెట్రో ల్, డీజిల్ పోయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వా హనాలు మరమ్మతుకు గురైనా ప్రతీ నెల ఖర్చు తగ్గకపోవడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. జీపీఎస్ ట్రాకింగ్ లేకపోవడంతో కొందరు డ్రైవర్లు వారి కి కేటాయించిన ఏరియాల్లో పూర్తిస్థాయిలో తిప్పకుండా ఇంధనాన్ని మిగిల్చి వాహనాన్ని మున్సిపల్లో అప్పగించే ముందు బాటిళ్లలోకి తీసుకుంటున్నారు. ఇటీవల బయటపడిన వీడియోలే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఆటోలను ఇంటింటికి తిప్పి చెత్త సేకరించాల్సి ఉండగా.. కొన్ని ఏరియాలకు వెళ్లకుండా మిగులు ఇంధనాన్ని అమ్ముకుంటున్నట్లు బయటపడింది. చెత్త సేకరణ సక్రమంగా చేయకపోవడంతో ఎక్కడికక్కడ పేరుకుపోయి నగరం చెత్తమయంగా మారుతోంది. -
కడెం రేంజ్ వైపు పులి అడుగులు
జన్నారం: జన్నారం అటవీ డివిజన్లో పులి అలజడి తగ్గింది. పది రోజులుగా అడవిలో ఉంటూ భయపెట్టిన పులి ఈ అడవి దాటింది. కడెం రేంజ్ వైపు అడుగులు వేసింది. అక్కడ మూడు రోజులు తిరిగి గోదావరి తీరం దాటినట్లు తెలుస్తోంది. జన్నారం అటవీ డివిజన్లో గత నెల 25న ఇందన్పల్లి రేంజ్లో ఆవును చంపింది. అప్పుడు అటవీ శాఖ అధికారులు పరిశీలించి పులిదాడిగా గుర్తించారు. అప్పటి నుంచి టైగర్ మానిటరింగ్, అటవీ సిబ్బంది పులి కదలికలను పరిశీలించారు. సీసీ కెమెరాలు అమర్చి ఎప్పటికప్పుడు అడుగులు, కదలికలు గమనించారు. చంపిన ఆవు మాంసాన్ని రెండ్రోజులు తిన్నట్లు కెమెరాలో చిక్కింది. అదే విధంగా పలు ప్రాంతాల్లో పులి అరుపులు కూడా అటవీ సిబ్బంది విన్నారు. జత లేకనే.. జన్నారం అటవీ డివిజన్కు వచ్చిన పులిని మగపులిగా అటవీ అధికారులు గుర్తించారు. ఆడపులి జత కోసం ఇక్కడికి వచ్చినట్లు భావించారు. ఆడపులి తోడు ఈ ప్రాంతంలో దొరక్కపోవడంతో ఇక్కడి నుంచి కడెం రేంజ్లోకి ప్రవేశించింది. కడెం రేంజ్లోని దస్తురాబాద్ మండలం ఎర్రగుంటపల్లె బీట్లో తిరిగినట్లు అటవీ అధికారులు పాదముద్రలు గుర్తించారు. రెండ్రోజుల తర్వాత అక్కడా కనిపించలేదు. పులి అక్కడి నుంచి గోదావరి నది దాటి సారంగాపూర్ అటవీ ప్రాంతంలో ప్రవేశించినట్లు అటవీ అధికారులు అనుమానించారు. ఇటీవల సారంగపూర్ అటవీ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఆ పులి ఇక్కడి నుంచే ఆ ప్రాంతానికి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయమై ఇందన్పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను సంప్రదించగా, పులి పది రోజులుగా జన్నారం అడవుల్లో ఉండి కడెం రేంజ్లోకి వెళ్లిందని, అక్కడి నుంచి గోదావరి దాటినట్లు తెలిసిందని పేర్కొన్నారు. పులుల ఆచూకీకి అధికారుల గాలింపుజైపూర్: మండలంలో పులుల సంచారంపై అట వీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందారం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు ఉండడంతోపాటు శుక్రవారం దుబ్బపల్లి మామిడితోటల సమీపంలో పులి గాండ్రింపులు వినిపించినట్లు తోటలకాపరులు తెలిపారు. జైపూర్ ప్రాంతంలోని పులి ముదిగుంట గ్రామం మీదుగా ఈ వైపు రాగా, వేలాల అటవీ ప్రాంతంలో మరొకటి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ఆరోగ్య హక్కుపై అవగాహన ఉండాలి
చెన్నూర్: ప్రతీ పౌరునికి ఆరోగ్య హక్కుపై అవగాహన ఉండాలని డీసీహెచ్ఎస్ కోటేశ్వర్ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్పై జిల్లా న్యాయ సేవ విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ప్రభుత్వం ప్రజలకు అందించే వైద్య సేవలు, పథకాలను చేరవేయాలని తెలిపారు. రోగులకు లభ్యమయ్యే ఉచిత సేవలు, చట్టపరమైన రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే అవగాహన సదస్సు ఉద్దేశమని అన్నారు. అనంతరం న్యాయవాదులు ఆరోగ్యశ్రీ, జననీ శిశు సురక్షా, ఉచిత ఔషధ పంపిణీ హక్కులపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ, న్యాయ సలహా మండలి న్యాయవాదులు మల్లేశం, కాయిత మహేశ్, ప్రభాకర్, రాజశేఖర్, వైద్యులు, సిబ్బంది, రోగులు పాల్గొన్నారు. -
ఉద్యమం ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు
మంచిర్యాలఅర్బన్: సమష్టి ఉద్యమం ద్వారానే 42శాతం బీసీ రిజర్వేషన్లు సాధిద్దామని, ప్రాణత్యాగాలు చేసే అవసరం లేదని వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం మంచిర్యాల వీవీడీసీ కళాశాలలో బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బీసీ హక్కుల కోసం అమరుడైన సాయి ఈశ్వరచారి ఆశయసాధనకు బీసీ సంఘాలు, రాజీకీయ, కుల విద్యార్థి సంఘాలతో రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శీతాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చేరాల వంశీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ పల్లె భూమేష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఉదారి చంద్రమోహన్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరెండ్ల శ్రీనివాస్, నాయకులు గుమ్ముల శ్రీనివాస్, టీబీఎస్ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్, రాజ్కిరణ్, రాజేశం భాస్కర్ పాల్గొన్నారు. -
ఆడపిల్లల ఆరోగ్యానికి హెచ్పీవీ వ్యాక్సిన్
మంచిర్యాలటౌన్: ఆడపిల్లల ఆరోగ్య రక్షణకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్ల లకు సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వినియోగించే హెచ్పీవీ వ్యాక్సినేషన్పై వైద్యులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో త్వరలోనే చేపట్టనున్నామని తెలిపారు. జిల్లాలో ఆడపిల్లల వివరాలు సిద్ధం చేసుకోవాలని, వారందరికీ వ్యాక్సిన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీడిపీవో విజయలక్ష్మీ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ అరుణశ్రీ, బెల్లంపల్లి ఉపవైద్యాధికారి డాక్టర్ సుధాకర్నాయక్, డీపీవో ప్రశాంతి, జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ అఖిల్, డీపీహెచ్ఎం పద్మ, డెమో బుక్క వెంకటేశ్వర్, డీపీసీ సురేందర్ పాల్గొన్నారు. నాణ్యమైన ఉచిత ఆరోగ్య సేవలు లక్ష్యం మంచిర్యాలటౌన్: ప్రజలందరికీ నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అనిత అన్నారు. జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్, డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ కౌన్సిల్ సభ్యుడు, అడ్వకేట్ మహ్మద్ సందాని, సీహెచ్వో వెంకటేశ్వర్లు, డీపీవో ప్రశాంతి, డెమో బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
‘ఆశ్రమ’ంలో అస్తవ్యస్తం..!
మంచిర్యాలఅర్బన్: మారుమూల ప్రాంతాల గిరిజ న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ల క్ష్యంతో ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు నిర్వహణ లోపంతో కొట్టుమి ట్టాడుతున్నాయి. ఓ వైపు సమస్యలు నెలకొనగా.. మరోవైపు అక్రమ డిప్యూటేషన్లు ఇబ్బందిగా మారా యి. రెగ్యులర్ పోస్టింగ్లో కొందరు విధులు నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా నచ్చిన ప్రాంతాల్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. ఇంకొందరు సస్పెన్షన్కు గురైనా మళ్లీ అవే పాఠశాలలకు రెగ్యులర్ పోస్టింగ్ కేటాయించడం, మరో పాఠశాలకు డిప్యూటేషన్పై పంపడం లాంటి చర్యలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. జిల్లాలో 16 ప్రీమెట్రిక్, రెండు పోస్టుమెట్రిక్ వసతిగృహాలున్నాయి. మొత్తం 2,785 మంది విద్యార్థులు వసతి పొందు తూ చదువుకుంటున్నారు. ఇందులో బాబానగర్లో పిల్లలేకపోవడంతో తాత్కాలికంగా మూసివేశా రు. నిబంధనలు తుంగలో తొక్కి డిప్యూటేషన్లు వేడయడంతో సరిపడా ఉపాధ్యాయుల్లేక ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల బోధనపై ప్రభావం పడుతోంది. ఎవరిష్టం వారిదే అన్నట్లు..ఎస్టీ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో డిప్యూటేషన్ల ప్రక్రియ ఎవరిష్టం వారిదే అన్న చందంగా మారింది. జిల్లా కేంద్రానికి చెందిన పోస్టుమెట్రిక్ హాస్టల్ (గర్ల్స్) రెగ్యులర్ వార్డెన్కు లక్సెట్టిపేట ఆశ్రమ పాఠశాలకు డిప్యూటేషన్ ఇచ్చారు. జన్నారం ఆశ్రమ పాఠశాల వార్డెన్ను మంచిర్యాల పోస్టుమెట్రిక్ హాస్టల్కు డిప్యూటేషన్పై పంపారు. బీసీ సమీకృత హాస్టల్లో రెగ్యులర్ పోస్టింగ్తో విధులు నిర్వహించే వార్డెన్కు జన్నారానికి డిప్యూటేషన్ ఇచ్చారు. జన్నారం ఆశ్రమ పాఠశాల వార్డెన్ను కదిలించేందుకు ఈ డిప్యూటేషన్లు చేపట్టారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బీసీ సమీకృత వసతిగృహంలో బీసీ వార్డెన్ను సరెండర్ చేయగా ఎస్సీ వార్డెన్ మాత్రమే అన్నీ తానై చూడాల్సి వస్తోంది. ముగ్గురు వార్డెన్లు, ముగ్గురు వాచ్మెన్లు పనిచేయాల్సిన చోట ఒక్కరే ఉండడంతో పర్యవేక్షణ లోపిస్తోంది. ఇదే వసతిగృహంలో రెగ్యులర్ వాచ్మెన్ ఏకంగా పక్క జిల్లా సిర్పూర్(టీ) బాయ్స్ హాస్టల్కు డిప్యూటేషన్పై నచ్చిన చోటకు వెళ్లారు. బీసీ సమీకృత వసతిగృహంలో సిబ్బంది కొరత నేపథ్యంలో ఎస్టీ వార్డెన్, వాచ్మెన్ను వెనక్కి పంపిస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. -
ఏజెన్సీ గ్రామంలో అభ్యర్థులు లేక..
ఆసిఫాబాద్రూరల్: మండలంలోని చోర్పల్లి గ్రామపంచాయతీ ఏజెన్సీ గ్రామమైనా ఎక్కువ బీసీ ఓటర్లే ఉన్నారు. ఐదే ఎస్టీ కుటుంబాలున్నాయి. దీంతో పోటీ చేసే అభ్యర్థులు లేక ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరుగా అన్నదమ్ములే సర్పంచ్కు పోటీ పడుతున్నారు. ఇందులో కమ్మరి కృష్ణ, పెంటయ్య సొంత అన్నదమ్ములు పోటీలో ఉన్నారు. చోర్పల్లి గ్రామ పంచాయతీలో నాలుగు ఎస్టీ, నాలుగు జనరల్ వార్డులున్నాయి. ఐదు కుటుంబాల నుంచి నాలుగు వార్డు స్థానాలకు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారే పోటీ పడుతున్నారు. మూడు పార్టీలు నాలుగు ఎస్టీ వార్డుల్లో పోటీ చేయించాలంటే 12 మంది అభ్యర్థులు అవసరం. కానీ, ఊరిలో ఎనిమిది మందే ఉండటంతో మరో పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉత్పన్నమైంది. కమ్మరి పెంటయ్యకమ్మరి కృష్ణ -
హాకీ పోటీల్లో జిల్లా జట్టుకు మూడోస్థానం
ఆదిలాబాద్: అండర్–14 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్లో జిల్లా క్రీడాకారులు మూడో స్థానంలో నిలిచారు. వనపర్తి వేదికగా ఈనెల 10నుంచి శుక్రవారం వరకు నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచారు. మొదట మహబూబ్నగర్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆదిలాబాద్ జట్టు 1–2 స్కోర్ తేడాతో పరాభవాన్ని చవిచూసింది. తర్వాత మూడోస్థానం కోసం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 4–1 స్కోర్ తేడాతో విజయకేతనం ఎగురవేసింది. టోర్నీ విజేతగా మహబూబ్నగర్, రెండో స్థానంలో నల్గొండ జట్లు నిలిచినట్లు శిక్షకులు శేఖర్ వివరించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరచడంపై హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలూరి గోవర్ధన్రెడ్డి, కోరెడ్డి పార్థసారథి అభినందనలు తెలిపారు. -
గాడిద పాలకు భలే డిమాండ్
ముధోల్: గాడిద పాలకు భలే డిమాండ్ ఉంది. ఒకప్పుడు పెద్దలు ఇంట్లో చిన్నపిల్లలకు దగ్గు, దమ్ము, దడ, వ్యాధులు వచ్చినప్పుడు గాడిదపాలు తాగిపిస్తే తగ్గిపోయేది. ఇప్పుడు అట్లాంటి జబ్బులు వస్తే పెద్దపెద్ద ఆస్పత్రుల కు తీసుకెళ్లి అఽధిక డబ్బులు వెచ్చించి వ్యాధులను నయం చేసుకుంటున్నారు. మరికొంత మంది ఇప్పటికీ అప్పటి వైద్యం వాడుతూ జ బ్బులు నయం చేయించుకుంటున్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నర్సినయాగావ్ తాలుకా జున్ని గ్రామానికి చెందిన రమేశ్ తనకున్న గాడిదను తీసుకువచ్చి పల్లెల్లో తిప్పుతున్నాడు. వాడవాడల్లో దగ్గు, దమ్ముకు గాడిద పాలు అంటూ తిరుగు తూ ఒక జండూమామ్ సీసా గాడిద పాలను రూ.150కు విక్రయిస్తున్నాడు. -
చికిత్స పొందుతూ బాలిక మృతి
మందమర్రిరూరల్: మండలంలోని పొన్నారం గ్రామానికి చెందిన మాసు సావిత్రి–సంతోష్ దంపతుల కుమార్తె అక్షర (14) అన్నం తిననందుకు తల్లి మందలించడంతో ఈ నెల 1న గడ్డి మందు తాగింది. తలిదండ్రులు గమనించి వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ప్రతిమ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. అక్షర పొన్నారం జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతిలో టాపర్. అక్షర మృతి వార్త తెలియడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కాగా, అక్షర తండ్రి మాసు సంతోష్ కాంగ్రెస్ మద్దతుతో పొన్నారం సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండడం గమనార్హం. -
గడలపెల్లిలో అక్కాచెల్లెళ్లు
తిర్యాణి: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని గడలపెల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ హంసబాయి పెద్ద కుమార్తె ఆత్రం శంకరమ్మ బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేస్తుండగా చిన్న కుమార్తె సిడాం విమల కాంగ్రెస్ మద్దతులో బరిలో నిలిచింది. వీరిద్దరూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఆత్రం శంకరమ్మ సిడాం విమల లగ్గాంలో అన్నదమ్ముల సవాల్ దహెగాం: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని లగ్గాం పంచాయతీ సర్పంచ్గా నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో సొంత అన్నదమ్ములు మోరె తిరుపతి, మోరె వెంకన్న వేర్వేరు పార్టీల మద్దతుతో బరిలో నిలిచారు. వెంకన్న కాంగ్రెస్ మద్దతుతో తిరుపతి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్నారు. ఈ అన్నాదమ్ముల సవాల్లో గెలుపెవరిదో ఆదివారం సాయంత్రం తేలనుంది. మోరె తిరుపతిమోరె వెంకన్నసుంగాపూర్లో..తిర్యాణి మండలంలోని సుంగాపూర్ గ్రామానికి చెందిన సొంత అన్నాదమ్ములు సర్పంచ్లో బరిలో నిలిచారు. టేకం గుండయ్య మూడో కు మారుడు మారుతి బీఆర్ఎస్ మద్దతుతో పోటీలో ఉండగా చిన్న కుమారుడు సురేశ్ కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉన్నాడు. వీరు పోటీలో ఉండటం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.టేకం సురేశ్ టేకం మారుతిచిన్నపంచాయతీ.. ఏడుగురు అభ్యర్థులుతాండూర్: మండలంలోని అతి చిన్న గ్రామపంచాయతీ అయిన నీలాయపల్లిలో ఏడుగురు అభ్యర్థులు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. తాండూర్ మేజర్ గ్రామపంచాయతీ నుంచి గత ఎన్నికల సమయంలో నీలాయపల్లి నూతన గ్రామపంచాయతీగా ఏర్పడింది. గత ఎన్నికల్లో ఇక్కడ సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసారి గ్రామపంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. నీలాయపల్లి ఒడ్డెర కాలనీ, పుల్ల య్యగూడెం హ్యాబిటెక్స్లోని ఈ గ్రామపంచాయతీ పరిధిలో 292 మంది ఓటర్లున్నారు. ఇందులో 144 మంది పురుషులు, 148 మంది మహిళా ఓటర్లున్నారు. ఈ ఎన్నికల్లో 100 నుంచి 120 ఓట్లు సాధించినవారే గెలుపు కై వసం చేసుకునే అవకాశముంది. ఇప్పటికే ఎనిమిది వార్డుల్లో నాలుగు ఏకగ్రీవమయ్యాయి. తొలిసారి నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే. -
ఎదురెదురుగా బైక్లు ఢీ.. ముగ్గురికి గాయాలు
సారంగపూర్: మండలంలోని కుప్టి తండా వద్ద శుక్రవారం రాత్రి రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థాని కుల వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ఇద్ద రు యువకులు తమ బైక్పై మహారాష్ట్ర వైపు వెళ్తున్నారు. మండలంలోని కౌట్ల(బి) గ్రామానికి చెంది న సాద అరుణ్(24) అనే యువకుడు తన స్కూటీ పై కౌట్ల(బి) వైపు వస్తున్నాడు. ఈ రెండు వాహనా లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి క్షతగాత్రులను నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
పంచాయతీ విభిన్నం
నాడు భర్త సర్పంచ్.. నేడు భార్యమొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఓ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తి సర్పంచ్గా గెలుపొందితే, ఇదే కుటుంబంలోని పలువురు వార్డు సభ్యులుగా విజయం సాధించారు. ఓ చోట గతంలో భర్త సర్పంచ్గా గెలువగా ప్రస్తుతం భార్య ఎన్నికై ంది. మూడు విడతల్లోనూ చాలా పంచాయతీల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సర్పంచులుగానో, వార్డు సభ్యులుగానో బరిలో నిలిచిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామపంచాయతీల్లో చోటు చేసుకున్న చిత్రవిచిత్ర ఘటనల్లో కొన్ని..జన్నారం: మండలంలోని ఏకై క మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా 2019లో భర్త గెలిస్తే ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో భార్య సర్పంచ్గా గెలిచింది. పంచాయతీ ఎన్నికల్లో పొనకల్ గ్రామపంచాయతీ సర్పంచ్గా జక్కు సుష్మ గెలుపొందారు. పొనకల్ మేజర్ గ్రామపంచాయతీలో 6,825 మంది ఓటర్లున్నారు. పొనకల్ జనరల్ మహిళకు రిజర్వేషన్ రావడంతో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జక్కు భూమేశ్ తన భార్య సుష్మను అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిపాడు. హోరాహోరీ ప్రచారంలో ప్రత్యర్థి సులువ శైలజపై 2,981 ఓట్ల మెజారిటీతో సుష్మ గెలుపొందారు. పొనకల్లో అత్యధికంగా ఓటర్లు ఉండటంతో అర్ధరాత్రి 12గంటల అనంతరం ఫలితాలు ప్రకటించారు. పొనకల్కు చెందిన అప్పాల జలపతిని ఉప సర్పంచ్గా వార్డు సభ్యులంతా కలిసి ఎన్నుకున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు సర్పంచులుగా.. నలుగురు వార్డుమెంబర్లుగా..ఇంద్రవెల్లి: మండలంలోని శంకర్గూడకు చెంది న ఒకే కుటుంబ సభ్యుల్లో ఇద్దరు సర్పంచులు గా, నలుగురు వార్డు సభ్యులుగా గెలుపొందా రు. శంకర్గూడకు చెందిన జాదవ్ జమునానా యక్ దనోరా (బీ) గ్రామపంచాయతీ సర్పంచ్గా 2ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమె కూతురు జాదవ్ అనురాధ తొమ్మిదో వార్డు మెంబర్గా గెలుపొందారు. జాదవ్ జమునానాయక్ తోటి కోడలు జాదవ్ రోమా శంకర్గూడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గేడం సుజాతపై విజయం సాధించారు. శంకర్గూడలో జమునానాయక్ భర్త జాదవ్ హీరా లాల్ నాలుగో వార్డు మెంబర్గా, అదే కుటుంబానికి చెందిన జాదవ్ విజయ్కుమార్ శంకర్గూడ ఐదోవార్డు మెంబర్గా విజయం సాధించారు. అదే కుటుంబానికి చెందిన జాదవ్ సంధ్యారాణి శంకర్గూడలో ఒకటో వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచులుగా గెలిచిన జాదవ్ జమునానాయక్, జాదవ్ రోమాజాదవ్ జమునానాయక్ కుటుంబ సభ్యులునాడు తల్లిదండ్రులు.. నేడు కొడుకుఖానాపూర్: మండలంలోని బావాపూర్(కే) గ్రామానికి చెందిన ‘మైస’ కుటుంబీకులు గతంలో రెండు పర్యాయాలు సర్పంచ్గా గ్రామానికి సేవలందించారు. తాజాగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. మైస రాజారాం 1998లో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అనంతరం రాజారాం భార్య రాజు సర్పంచ్గా గెలుపొందింది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఎస్సీ రిజర్వేషన్ రావడంతో గురువారం జరిగిన ఎన్నికల్లో ఎంఎస్సీ, బీఈడీ చదివిన రాజారాం రెండో కుమారుడు రాజేశ్ సర్పంచ్గా గెలుపొందాడు. మైస రాజేశ్ మైస రాజారాం, రాజు దంపతులునాడు భర్త ఏకగ్రీవం.. నేడు భార్య విజయంనిన్న తల్లి.. నేడు కొడుకు ఖానాపూర్: మండలం బాదన్కూర్తి గ్రామానికి చెందిన పార్శపు శ్రీనివాస్ 2019లో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. తాజాగా గ్రామపంచాయతీని బీసీ మహిళకు రిజర్వ్ చేయడంతో శ్రీనివాస్ తన భార్య రోహితను పోటీలో నిలుపగా ఆమె విజయం సాధించింది. ఖానాపూర్: మండలంలోని సత్తన్పల్లి గ్రామానికి చెందిన సీర్ల లక్ష్మి తాజా మాజీ సర్పంచ్. ఇ టీవల సత్తన్పల్లి పంచాయతీని బీసీ జనరల్కు కేటాయించగా ఆమె కుమారుడు సీర్ల విజయ ఆనంద్ పోటీ చేసి సర్పంచ్గా గెలుపొందాడు. ఒక్క ఓటుతో గెలుపుకెరమెరి: మండలంలోని పరంధోళి గ్రామపంచాయతీలో గురువారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రాతోడ్ పుష్పలతకు 202, ప్రత్యర్థి దిలీప్నకు 201 ఓట్లు వచ్చాయి. దీంతో పుష్పలత ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ గ్రామపంచాయతీలో 873 మంది ఓటర్లుండగా 692 ఓట్లు పోలయ్యాయి. -
చెరువులో పడి మేకలకాపరి మృతి
నర్సాపూర్(జి): ప్రమాదవశాత్తు చెరువులో కాలు జారి నీట మునిగి ఒకరు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నందన్ గ్రామానికి చెందిన మేకల కాపరి పత్రి ఓమేశ్ (34) శుక్రవారం మేకలు మేపుతూ నందన్ మీది చెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి నీట మునిగి మృతి చెందాడు. గమనించిన మరొక మేకల కాపరి గ్రామస్తులకు సమాచారం అందించాడు. గజ ఈతగాళ్ల సహాయంతో ఓమేశ్ మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య దేవా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు దేవేందర్, కూతురు అక్షిత ఉన్నారు. -
పత్తి ఏరుతున్న కొత్త సర్పంచ్
వాంకిడి: మండలంలోని చిచ్పల్లి సర్పంచ్గా ఎన్నికైన కొర్వేత పద్మ ఎన్నికలు ముగిసిన మ రుసటి రోజే వారి చేనులో పత్తి సేకరిస్తూ కని పించింది. 2019పంచాయతీ ఎన్నిల్లోనూ స ర్పంచ్గా పోటీ చేసి గెలుపొందింది. ఈసారి రిజర్వేషన్ కలిసిరాగా మళ్లీ పోటీ చేసి వరుసగా రెండోసారి సర్పంచ్ పీఠాన్ని దక్కించుకుంది. పద్మ ఇంటర్ తర్వాత డీఎడ్ పూర్తి చేసి డిగ్రీ చ దువుతోంది. వివాహానంతరం చిచ్పల్లికి వచ్చి న పద్మ 2019లో సర్పంచ్గా ఎన్నికై గ్రామస్తుల మన్ననలు పొందింది. ఈసారి 117 ఓట్ల మెజా ర్టీతో గెలిచింది. ఎలాంటి ఆర్భాటం లేకుండా శుక్రవారం చేనులో పత్తి ఏరుతూ కనిపించింది. -
వైజ్ఞానిక ప్రదర్శనకు ఆర్జీయూకేటీ విద్యార్థిని
బాసర: బాసర ఆర్జీయూకేటీకి చెందిన పీయూసీ ఫస్టియర్ విద్యార్థిని వీ వాగ్దేవికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన బాల వైజ్ఞానిక ప్రదర్శనలో చోటు దక్కింది. ప్రాంతీయ విద్యాసంస్థ భోపాల్లో గత నెల 18నుంచి 23వరకు నిర్వహించిన రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనలో తాను తయారు చేసిన వైజ్ఞానిక ఆవిష్కరణకు గాను ప్రశంసాపత్రాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ వీసీ, ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ విద్యార్థినిని అభినందించారు. భవిష్యత్లో వాగ్దేవి మరిన్ని ఆవిష్కరణలు చేసి విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన సహాయ, సహకారాలను విశ్వవిద్యాలయం అందిస్తుందని తెలిపారు. ఆర్జీయూకేటీ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. డీన్లు డాక్టర్ ఎస్.విఠల్, ఎస్.శేఖర్ పాల్గొన్నారు. -
బావ, మరదలు.. పోటాపోటీ
తాండూర్: మండలంలోని ఏజెన్సీ గ్రామపంచాయతీ కిష్టంపేటలో బావ, మరదలు మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కిష్టంపేట ఎస్టీ జనరల్ స్థానం కావడంతో గతంలో సర్పంచ్గా పోటీ చేసిన సార్ల తిరుపతి బరిలో ఉన్నాడు. ప్రధాన అభ్యర్థిగా తాజా మాజీ సర్పంచ్ సార్ల తిరుపతి సోదరుడి భార్య సార్ల పద్మకు మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. వీరిద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారోననే ఆసక్తి గ్రామంలో నెలకొంది. సార్ల తిరుపతిసార్ల పద్మ -
ఆ కుటుంబానికే హ్యాట్రిక్
జన్నారం: మండలంలోని కామన్పల్లి గ్రామ సర్పంచ్ స్థానాన్ని మూడోసారీ పేరం శ్రీనివాస్ కుటుంబం గెలుచుకుని హ్యాట్రిక్ సాధించింది. మొదటిసారి శ్రీనివాస్ తల్లి పేరం బుచ్చవ్వ, రెండోసారి ఆయన భార్య మానస గెలుపొందారు. మూడోసారి శ్రీనివాస్ బరిలో నిలిచి విజయం సాధించాడు. బీఆర్ఎస్ బలపర్చిన శ్రీనివాస్ గురువారం వెలువడిన ఫలితాల్లో ప్రత్యర్థి రాజన్నపై వంద ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. రెండు ఓట్లతో అదృష్టం లక్సెట్టిపేట: మండలంలోని పాతకొమ్ముగూడెం గ్రామ సర్పంచ్గా దుమ్మని సత్తన్న రెండు ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. మొత్తం 1240 ఓట్లకు గాను 1016 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సత్తన్నకు 478 ఓట్లు రాగా, ప్రత్యర్థి బీఆర్ఎస్ మద్దతుదారు గంగయ్యకు 476 ఓట్లు వచ్చాయి. 6 ఓట్ల తేడాతో విజయం దండేపల్లి: మండలంలోని కర్ణపేట గ్రామ పంచాయతీకి గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠత నెలకొంది. స్వంతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన అజ్మేరా సుభాష్ తన సమీప ప్రత్యర్థి సోయం జంగుపై ఆరు ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. 11 ఓట్లతో సర్పంచ్ గెలుపుజన్నారం: మండలంలోని బంగారుతండా గ్రామ పంచాయతీ నుంచి 11 ఓట్ల తేడాతోనే సర్పంచ్ అభ్యర్థి బుక్య నిర్మలబాయి గెలుపొందారు. గ్రామ పంచాయతీలో మొత్తం 390 ఓట్లు ఉండగా 206 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి సాయికుమార్పై 11 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 15 ఓట్ల మెజారిటీజన్నారం: మండలంలోని కలమడుగు గ్రామంలో హోరాహోరీ సాగిన పోరులో 15 ఓట్లతో చివరికి బొంతల నాగమణి గెలుపొందారు. గ్రామంలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగగా.. మండలంలో ఆసక్తికరంగా మారింది. ఒకటి, ఐదు ఓట్ల తేడాతోనే అధిక్యత కనబరుస్తూ ఉన్న నాగమణి ప్రత్యర్థి అభ్యర్థి స్వరూపరాణిపై చివరికి 15 ఓట్లు మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. -
మండలం మొత్తం పురుష మహిళా పోలైన పోలింగ్ ఓటర్లు ఓట్లు ఓట్లు ఓట్లు శాతం హాజీపూర్ 16,954 7,057 7,363 14,420 85.05లక్సెట్టిపేట 25,227 9,962 10,809 20,771 82.34దండేపల్లి 34,213 12,993 14,368 27,362 79.98
జన్నారం 43,306 15,245 18,012 33,257 76.80మొత్తం 1,19,700 45,257 50,552 95,810 80.04మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగింది. మంచిర్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వాతావరణం చల్లగా ఉండడంతో ఉదయం నుంచి మందకొడిగా మొదలైన పోలింగ్ ఎనిమిది గంటల నుంచి వేగం పుంజుకుంది. ఆ తర్వాత ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి బారులు తీరి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువతీ, యువకులు భారీగా తరలివచ్చి ఓటు వేయడంతో పోలింగ్ శాతం పెరిగింది. జిల్లా ఎన్నికల పరిశీలకుడు మనోహర్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీపీవో వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. రాత్రి వరకు కొనసాగిన లెక్కింపు.. ఆయా మండలాల్లోని 90 గ్రామ పంచాయతీల్లో ఆరు ఏకగ్రీవం కాగా.. మరో మూడు పంచాయతీలు గూడెం, నెల్కి వెంకటాపూర్, వందూర్గూడలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో మిగతా 81 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 258మంది పోటీపడ్డారు. 816వార్డు సభ్యుల స్థానాలకు 34చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 268మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. 514 స్థానాల్లో 1476మంది బరిలో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగగా.. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. తక్కువగా ఓటర్లు ఉన్న గ్రామాల్లో ఫలితాలు త్వరగా వెలువడ్డాయి. ఓటర్లు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో రాత్రి వరకు లెక్కింపు కొనసాగి ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి. పరిశీలించిన అధికారులు పోలింగ్ సరళిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించారు. హాజీపూర్ మండలం దొనబండ, హాజీపూర్, పెద్దంపేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలతోపాటు లక్సెట్టిపేట, దండేపల్లి జన్నారం మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకుడు మనోహర్, కలెక్టర్ కుమార్దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీపీఓ వెంకటేశ్వర్రావు, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు. పోలింగ్ శాతాన్ని తెలుసుకుని ప్ర శాంతంగా ఎన్నికలు ముగించాలని సూచించారు. నాగరం తొలి ఫలితం.. హాజీపూర్ మండలం నాగారం గ్రామ పంచాయతీ ఫలితం మొదట వెలువడింది. ఇక్కడ 228 మంది ఓటర్లకు గాను 207ఓట్లు పోలయ్యాయి. బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కొడప కళావతిపై కాంగ్రెస్ పార్టీ బలపర్చిన పెంద్రెం మహేశ్వరి 20ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మండలం 7–9గం 9–11గం 11 –ఒంటిగంట వరకు పోలైనవి శాతం పోలైనవి శాతం పోలైనవి శాతందండేపల్లి 5,548 16 17,845 52 28,520 74.59 హాజీపూర్ 3,176 19 9,167 54 14,371 84.76 జన్నారం 6,058 14 19,568 45 32,584 75.24 లక్సెట్టిపేట 5,794 23 14,026 56 20,440 81.02 మొత్తం 20,576 17 60,606 51 92,915 77.62పోలింగ్ సరళి ఇలా..సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పంచాయతీ ఎన్నికల్లో హాజీపూర్ మండలంలో అత్యధికంగా పోలింగ్ 85శాతం నమోదు కాగా, జన్నారంలో 75శాత నమోదైంది. ఉదయం మందకొడిగా మొదలై ఆ తర్వాత పుంజుకుంది. పురుషులకంటే మహిళలే అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.హాజీపూర్లో అత్యధికంగా పోలింగ్ నాలుగు మండలాల్లో మొత్తంగా 1,19,700 మంది ఓటర్లకు గాను 95,810 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80.04శాతం పోలింగ్ నమోదైంది. పంచాయతీ ఎన్నికల్లో మహిళలు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేశారు. హాజీపూర్ మండలంలో 306 మంది మహిళలు, లక్సెట్టిపేటలో 847, దండేపల్లిలో 1,375, జన్నారంలో 2,767 మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఓటు వేశారు. మొత్తంగా పురుషులకన్నా 5,295 మంది మహిళలు ఎక్కువ ఓటు వేశారు. మొత్తం ఓటరల్లో కూడా పురుషుల కన్నా మహిళలు 3,135 మంది ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఓటర్లలోనూ ఎక్కువగా ఉన్న మహిళలు పో లింగ్లోనూ ఎక్కువ సంఖ్యలోనే పాల్గొన్నారు. ఫలితాల్లో కీలకంగా వ్యవహరించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంమంచిర్యాలఅగ్రికల్చర్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మొదటి విడత పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు గురువారం ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమస్యాత్మకగా పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి, కౌటింగ్ ప్రక్రియను అదనపు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావుతో కలిసి పరిశీలించారు. జిల్లాలో గుర్తించిన 24 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. హాజీపూర్, దండేపల్లి, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లోని పోలింగ్ కేంద్రాలు, లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న గ్రామాల్లో త్వరలోనే సర్పంచ్లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. సూక్ష్మ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, పోలింగ్ సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని తెలిపారు. -
గనులపై పులి భయం
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని పలు గనులపై పులి భయం వెంటాడుతోంది. గత నాలుగు రోజులుగా రెండు పులులు జైపూర్ మండలంలో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ధ్రువీకరించారు. పులులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండింటిలో ఒక పులి రెండ్రోజులుగా గనుల వెనుకాల ఉన్న గ్రామ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోంది. గురువారం రాత్రి ఆర్కే 8 గని సమీపంలో శ్మశానవాటిక వద్ద పులి కనిపించింది. అదే సమయంలో హైదరాబాద్కు వెళ్తున్న రమేశ్ వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయగా వైరల్గా మారింది. డిప్యూటీ ఫారెస్టు రేంజ్ అధికారి అజహర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పులి ఎటువైపు వెళ్లిందో పరిశీలిస్తున్నారు. పులి సంచారంతో ఆర్కే 5, ఆర్కే 7, ఆర్కే న్యూటెక్ గనుల కార్మికులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి షిఫ్ట్ వెళ్లేవారు, సెకండ్ పూర్తి చేసుకుని ఇళ్లకు చేరేవారు భయాందోళనకు గురవుతున్నారు. మందమర్రి మండలంలో.. మందమర్రిరూరల్: మందమర్రి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రాత్రి పులి సంచరించింది. గురువారం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధి అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను డిప్యూటీ ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ సంతోష్ గుర్తించారు. మామిడిగట్టు, ఆదిల్పేట్ ఎర్రచెరువు మీదుగా కొండెంగల వాగు నుంచి వెంకటాపూర్ మీదుగా ఆర్కే–5 గని సమీపం వరకు పాదముద్రలు కనిపించాయి. రాత్రి వెంకటాపూర్ మీదుగా పొన్నారం తుర్కపల్లి, సారంగపల్లి గ్రామాలకు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు, పత్తి కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


