breaking news
Mancherial District News
-
లారీ బోల్తాపడి డ్రైవర్ మృతి
నేరడిగొండ: బ్రిడ్జి పైనుంచి లారీ కిందపడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఇచ్చోడ సీఐ రాజు తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఐచర్ కంటైనర్ నేరడిగొండ మండలంలోని కుప్టి వంతెన వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అనువతే అనిల్ (38) క్యాబిన్లోనే ఇరుక్కుని మృతి చెందాడు. మృతదేహాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సీఐ తెలిపారు. ఎస్సై ఇమ్రాన్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
కలశయాత్రకు ఘన స్వాగతం
మందమర్రిరూరల్: 1962లో భారత్, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధంలో 114 మంది యాదవ జవాన్లు వీరమరణం పొందారని బిహార్ రాష్ట్ర మాజీ సైనికాధికారి కిరణ్కుమార్ పేర్కొన్నారు. వారి స్మారకార్ధం కిరణ్కుమార్ చేపట్టిన రేజాంగుల రాజ్ కలశయాత్ర మంగళవారం మందమర్రికి చేరుకుంది. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం ఆధ్వర్యంలో ఘన స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఇందూ గార్డెన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిరణ్కుమార్ మాట్లాడుతూ 122 రోజుల క్రితం ప్రారంభమైన యాత్ర ఇప్పటికే 28 రాష్ట్రాలు తిరిగామన్నారు. నవంబర్ 19న ఢిల్లీలో ముగియనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు మల్లెత్తుల నరేష్ యాదవ్, ఆర్.లక్ష్మణ్ యాదవ్, యశ్వంత్రాజ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. -
అక్కాచెల్లెళ్లకు పీహెచ్డీ పట్టాలు
బోథ్: ఉస్మానియా విశ్వవిద్యాలయం మంగళవారం నిర్వహించిన స్నాతకోత్సవంలో మండలంలోని సొనాలకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకే వేదికపై పీహెచ్డీ పట్టాలు అందుకున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఇర్ల భాగ్యలక్ష్మి తెలుగు సాహిత్యంలో పరిశోధన చేయగా ఆమె చెల్లెలు ఉదయరాణి చరిత్రలో పరిశోధన చేసింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ఇస్రో ఛైర్మన్ నారాయణ, వైన్స్ఛాన్సలర్ ఎం.కుమార్ చేతుల మీదుగా పీహెచ్డీ పట్టాలు అందుకున్నారు. విద్యారంగంలో తమదైన ముద్ర వేసుకుంటూ, ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఈ అక్కాచెల్లెళ్లు పలువురికి ఆదర్శంగా నిలిచారు. నిరంతర కృషి, పట్టుదల ఉంటే ఎంతటి ఉన్నతమైన లక్ష్యాలనైనా సాధించవచ్చని వారు పేర్కొంటున్నారు. -
మెడికల్ బోర్డులో లోపాలు సరిచేయాలి
శ్రీరాంపూర్: సింగరేణి మెడికల్ బోర్డులో లోపాలను సరిచేయాలని కోరుతూ జీఎల్బీకేఎస్ గౌరవ అధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి జే.సీతారామయ్య మంగళవారం హైదరాబాద్లో సింగరేణి సీఎండీ ఎన్.బలరాంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల మెడికల్ బోర్డులో అర్హులైన చాలామందిని అన్ఫిట్ చేయాల్సి ఉండగా ఫిట్ ఇచ్చి అన్యాయం చేశారన్నారు. చాలామంది కార్మికులు జబ్బులతో బాధపడుతున్నారన్నారు. తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించి ఫిట్ ఇచ్చిన వారిని తిరిగి స్క్రీనింగ్ చేయాలని కోరారు. అంతే కాకుండా పెండింగ్లో ఉన్న డిపెండెంట్ల ఉద్యోగాలను త్వరితగతిన సెటిల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ నాయకులు ఎం.శ్రీనివాస్, జీ.అనురాధ, తదితరులు పాల్గొన్నారు. -
స్వగ్రామానికి చేరిన మృతదేహం
దస్తురాబాద్: ఉజ్బెకిస్థాన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందిన మండలంలోని మున్యాల గ్రామపంచాయతీలోని పెద్దూర్కు చెందిన సంగ సురేష్ (35) మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరుకుంది. గత నెల 22న ఉజ్బెకిస్థాన్లో పనిచేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. తప్పిన ప్రమాదంలక్ష్మణచాంద: మండలంలోని పార్పెల్లి నుంచి నిర్మల్ వెళ్లే ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. మంగళవారం పార్పెల్లి నుంచి నిర్మల్ బయలుదేరిన ఆర్టీసీ బస్సు పీచర–రాచాపూర్ గ్రామాల మధ్య అకస్మాత్తుగా ఎదురుగా వాహనం రావడంతో డ్రైవర్ బస్సును నెమ్మదిగా రోడ్డు కిందకు దించాడు. లేదంటే పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లేదని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం తప్పిందన్నారు. దరఖాస్తుల ఆహ్వానంకాగజ్నగర్టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు న వోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ మ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ, 10వ తరగతి చ దువుతున్న విద్యార్థులు 2025 సెప్టెంబర్ 23 లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 2026, ఫిబ్రవరి 7న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలిసి కట్టుగా కట్టారు..సిరికొండ: మూడు రో జులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని రిమ్మ గ్రామానికి వెళ్లే మట్టిరోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తడంతో మంగళవారం రిమ్మ, తిమ్మాపూర్ గ్రా మస్తులంతా కలిసి కట్టుగా కొట్టుకుపోయిన రో డ్డుతో పాటు రోడ్డు పక్క న గల రాళ్లకట్టకు ఇలా మరమ్మతులు చేశారు. -
వాగు దాటి..కుమారుడికి వైద్యం అందించి
ఇంద్రవెల్లి: మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు ఉప్పొంగడంతో హర్కపూర్ అంద్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ ఏ, మామిడిగూడ జీ గ్రామాలకు రెండు రోజులుగా రాకపోకలు స్తంభించి పోయాయి. మంగళవారం వరద నీరు తగ్గడంతో మామిడిగూడ జీ గ్రామ పటేల్ మెస్రం గంగారాం జ్వరంతో బాధపడుతున్న తమ కుమారుడు గురుప్రసాద్ను భుజంపై ఎక్కించుకుని ప్రమాదకర పరిస్థితిలో వాగు దాటి ఇంద్రవెల్లి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. వాగు వద్ద కల్వర్టు నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.5 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు వాపోయారు. ఏటా వర్షాకాలంలో తిప్పలు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి వాగుపై కల్వర్టు నిర్మించాలని కోరుతున్నారు. -
వరదనీటితో పంటలకు ముప్పు
మంచిర్యాలఅగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 16.20 లక్షల ఎకరాల్లో వివిధ రకాలు పంటలు సాగయ్యాయి. ఇందులో అధికశాతం రైతులు పత్తి సాగు చేశారు. ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునుగుతున్నాయి. పత్తి, వరి, సోయా, కంది పంటలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరద నీటితో పంటల్లో మట్టి, ఇసుక మేటలు వేసి తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. దీంతో చేనులోంచి నీటిని పంపించేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు నీటి పదను ఎక్కువై మొక్కలు జాలువారి పోతున్నాయి. పంటకు వేరుకుళ్లు, ఎండు తెగులు, ఆకుమచ్చ, కాండం కుళ్లు తెగుళ్లు సోకడంతో ఆకులు పసుపు వర్ణం, ఎర్రబారిపోవడంతో పంట దిగుబడి తగ్గే ప్రమా దం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల రైతులు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండి సరైన యా జమా న్య పద్ధతులు పాటించాలని, పంటల్లో సస్య రక్షణ చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ సూచిస్తున్నారు. పత్తి పంటలో.. Å పంట చేలల్లో కాల్వలు తీసి నీటిని బయటకు పంపించాలి. వీలైనంత త్వరగా అంతర కృషి చేయాలి. దీనివల్ల భూమిలో తేమ తగ్గి వేర్లకు గాలి, పోషకాలు అందడంతో మొక్కలు త్వరగా సాధారణ స్థితికి వస్తాయి. నీరు బయటకు పంపిన తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ను మొక్కకు 5 నుంచి 6 సెంటిమీటర్ల దూరంలో గుంతలు తీసి వేయాలి. లేదా అంతరకృషి చేయాలి. Å పొలంలో తేమ అధికంగా ఉన్నప్పుడు వేర్లు పోషకాలు, నీటిని తీసుకోలేక ఆకులు లేత ఆకుపచ్చ రంగులోకి మారుతాయి. దీనివల్ల మొక్కల పెరుగుదల తగ్గుతుంది. కాబట్టి 20 గ్రాముల యూరియా లేదా పది గ్రాముల 20–20 లీటరు నీటిలో కలిపి ఐదురోజుల వ్యవధిలో రెండుమూడు సార్లు పిచికారీ చేస్తే మొక్కలు త్వరగా కోలుకుంటాయి. భూమి, వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు పత్తిని ఆకుపచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు పది లీటర్ల నీటిలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, గ్రాము స్ట్రైప్టోసైక్లిన్ను కలిపి పిచికారీ చేయాలి. Å భూమిలో అధిక తేమ ఉన్నప్పుడు వేరుకుళ్లు తెగులు ఆశించి మొక్కలు చనిపోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు లేదా కార్బండిజమ్ రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి ద్రావణాన్ని తెగులు సోకిన మొక్క మొదళ్లలో పోయాలి. వరి పంటలో.. వరి సాగు చేసిన రైతులు ఇప్పటికే నాట్లు వేసినట్లయితే పంటలో ఎక్కువ మోతాదులో నీరు ఉండకుండా చూడాలి. ముంపు పాలైన వరి పొలాల్లో తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించిన తర్వాత ఎకరాకు 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేయాలి. .తాటాకు తెగులు హిస్పాపిల్లా పెద్దపురుగులు ఆకులోని పత్రహరితాన్ని గోకి తినడం వల్ల తెల్లటి చారలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫైరీఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొడతెగులు ఆకులపై పాము పొడ మచ్చలుగా ఏర్పడి మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి. దీని నివారణకు హెక్సాకొనజోల్ రెండు మిల్లీలీటర్లు లేదా వాలిడా మైసిన్ రెండు మిల్లీలీటర్లు లేదా వాలిడా మైసిన్ రెండు మిల్లీలీటర్లు లేదా ప్రోపికొనజోల్ 1 మిల్లీలీటర్ లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్+ టెబ్యుకొనజోల్ 75 డబ్ల్యూజీ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి 15 రోజులకు ఒకసారి చొప్పున రెండుసార్లు పిచికారీ చేయాలి. అగ్గితెగులు అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాముల లేదా ఐసోప్రోదయేలేన్ 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.ఆకుముడుత పురుగుఈ పురుగు ఆకుముడుతలో ఉండి పత్రహరితాన్ని హరించడంతో ఆకులు తెల్లబడుతాయి. దీని నివారణకు పిలక దశలో చేనుకు అడ్డంగా తాడుతో 2 నుంచి 3 సార్లు లాగితే పురుగులు కిందపడిపోతాయి. ఆతర్వాత క్లోరిఫైరీఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాములు లేదా క్లోరాన్ నిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 20 డబ్లూడీజీ 0.25 గ్రాములు లేదా 48 ఎన్సీ 0.1 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలు ఎకరాకు ఎనిమిది కిలోల చొప్పున వేయాలి -
ఆర్జీయూకేటీలో ఇండక్షన్ ప్రోగ్రాం
బాసర: బాసర ఆర్జీయూకేటీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టూడెంట్ ఆక్టివిటీ సెంటర్లో పీయూసీ2 పూర్తి చేసుకుని ఇంజనీరింగ్లో విభాగంలో చేరిన కొత్త విద్యార్థులకు మంగళవారం ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ప్రత్యేక అతిథిగా ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి ఆర్జీయూకేటీలో 2025 పాఠ్యక్రమం అమలులోకి వచ్చినట్లు తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కరికులం రూపకల్ప న చేయబడిందని, అన్ని ఇంజనీరింగ్ బ్రాంచులకు సమాన ప్రాధాన్యత లభించేలా రూపొందించబడిందన్నారు. ఓఎస్డీ మాట్లాడుతూ మనం కేవలం ఉద్యోగాలు పొందడమే కాకుండా కొత్త ఉద్యోగా ల ను సృష్టించి దేశానికి సేవ చేయాలని లక్ష్యంగా పె ట్టుకోవాలన్నారు. అసోసియేట్ డీన్స్ డాక్టర్ మహే శ్, డాక్టర్ వీ.చంద్రశేఖర్రావు, సీఎస్సీ విభాగాధిపతి డాక్టర్ వెంకట్రామన్, తదితరులు పాల్గొన్నారు. -
108లో ప్రసవం
ఇచ్చోడ: మండలంలోని ముఖరా బి గ్రామానికి చెందిన గర్భిణి ప్రతిక్షకు మంగళవారం పురిటినొప్పులు రావడంతో ఆమె భర్త అనిల్ 108కు సమాచారం అందించాడు. అంబులెన్సులో ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ రాకేశ్, ఈఆర్సీపీ డాక్టర్ కౌశిరెడ్డి సలహా మేరకు వాహనంలోనే డెలివరీ చేశారు. మొదటికాన్పులో ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీపిల్లలు క్షేమంగా ఉండటంతో వారిని ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పైలట్ వినోద్, ఈఎంటీ రాకేశ్ను గ్రామస్తులు అభినందించారు. -
ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల తొలగింపు
● మరొకరికి చార్జ్మెమో వేమనపల్లి: మండలంలోని ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ ఫేక్ అటెండెన్స్ పంపించిన కారణంగా ప్రభుత్వం వారిని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు డీపీవో కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. సుంపుటం కార్యదర్శి వెంకటి, దస్నాపూర్ కార్యదర్శి రజిత, చామనపల్లి కార్యదర్శి యాదగిరిని విధుల నుంచి తొలగించగా ముల్కలపేట కార్యదర్శి సురేష్కు చార్జ్మెమో, ఎంపీడీవో కుమారస్వామికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సమయపాలన పాటించకుండా పాత ఫొటోను తీసి క్షేత్ర స్థాయిలో విధుల్లో ఉన్నట్లు ఫేక్ అటెండెన్స్ పంపించడంతో ముగ్గురిపై వేటు పడింది. వర్షానికి కూలిన ఇళ్లుదస్తురాబాద్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంగళవారం మండలంలోని బుట్టాపూర్ గ్రామానికి చెందిన గుండ లక్ష్మి, మండల కేంద్రంలోని గంప భారతకు చెందిన ఇల్లు కూలిపోయాయి. కూలిన ఇళ్లను తహసీల్దార్ విశ్వంబర్, పంచాయతీ కార్యదర్శి పరిశీలించారు. సాత్నాల: ఇటీవల కురుస్తున్న వర్షాలకు భోరజ్ మండలంలోని ఆకోలి గ్రామానికి చెందిన ఆ త్రం రంగనాథ్ ఇల్లు కూలింది. మంగళవారం అకస్మాత్తుగా గోడలు కూలిపోవడంతో ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీయడంతో ప్రమాదం తప్పింది. ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడంతో ఆ కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. కూ లీపని చేసుకుని జీవనం సాగించే తమకు ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేదని, శాశ్వత గృహం మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేత వాంగ్మూలం భీమారం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మా రిన ఫోన్ట్యాపింగ్లో భీమారం మండల కాంగ్రెస్ నేత పొడేటి రవి ఇటీవల సిట్ విచారణకు హాజరైనట్లు ఆలస్యంగా తెలిసింది. పంజాగుట్ట పోలీస్స్టేషన్ నుంచి పిలుపు వచ్చిన మాట వాస్తమేనని రవి ‘సాక్షి’కి మంగళవారం తెలిపా రు. ఈ మేరకు విచారణలో శాసనసభకు జరి గిన ఎన్నికల్లో చెన్నూర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగదు తరలిస్తుండగా మందమర్రి ఏరి యాలో ఎన్నికల అధికారులు పట్టుకున్నారు క దా అని, అప్పట్లో ఇబ్బందికరంగా ఏమైనా ఫో న్లు వచ్చాయా అని సిట్ అధికారులు ప్రశ్నించి ట్లు తెలిపారు. తాను కాంగ్రెస్పార్టీకి విధేయుని గా ఉన్నందునే అప్పటి ప్రభుత్వం తనఫోన్ ట్యాప్ చేయించిందని, ఈ విషయం అధికారులు తనకు చెప్పేంత వరకు తెలియదని అన్నారు. -
ఆస్తి పన్ను ఎగవేత?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: శ్రీరాంపూర్ ఓసీపీ కంపెనీలో ఓబీ (ఓవర్ బర్డెన్) మట్టి వెలికితీత ప నులు చేపడుతున్న కాంట్రాక్ట్ సంస్థలు స్థానిక మున్సిపాలిటీకీ మాత్రం పన్ను చెల్లించడంలో అ లసత్వం వహిస్తున్నాయి. అధికారులు పలుసార్లు నోటీసులిస్తున్నా పట్టించుకోకపోవడంతో రూ.లక్షల్లో పన్నుల బకాయిలు పేరుకుపోయాయి. ఇ ప్పటివరకు రూ.58.50లక్షల వరకు స్థానిక సంస్థ కు పన్ను చెల్లించాల్సి ఉంది. అయితే సామాన్య పౌరుల ఇంటి పన్ను చెల్లించడంలో జాప్యం జరి గితే వెంటనే చర్యలు చేపట్టే అధికారులు బడా సంస్థలపై ఇప్పటివరకు కఠినచర్యలు తీసుకోవ డం లేదు. నస్పూర్ మున్సిపాలిటీగా ఉన్నపుడు నోటీసులిస్తూ సరిపెట్టారు. చివరకు కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లడంతో చర్యలు ప్రారంభించారు. అయి తే మున్సిపల్ అధికారులు బకాయిలు వసూలు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ ప్ర త్యేకాధికారిగా కలెక్టర్ ఉండడంతో ఆయన చర్యలు తీసుకుంటున్నారు. అయితే కంపెనీల నుంచి స్పందన లేదు. చివరకు రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ కింద ఆస్తుల స్వాధీనానికి కూడా ఆ దేశాలిచ్చారు. అయితే ఆర్అండ్బీ అధికారులను భవన నిర్మాణాల క్యాంపు మదింపు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ, నాలుగు నెలలుగా ఆ కంపెనీ క్యాంపు నిర్మాణాల విలువ లెక్కగట్టి నివేదిక ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. మరోవైపు ఆయా కంపెనీల స్థిరాస్తులతో పాటు చరాస్తులైన వాహనాలనూ ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేస్తే కార్పొరేషన్కు ఆదాయం వచ్చే అవకాశముంది. రూ.లక్షల్లో పన్ను బకాయిలు జీవీఆర్ ఇన్ఫ్రా, సీఆర్ఆర్ క్యాంపు, గౌరవ్ కంపె నీలు గత కొన్నేళ్లుగా స్థానిక మున్సిపాలిటీకి ఆస్తి పన్ను చెల్లించడం లేదు. గతంలో నస్పూర్ ము న్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పుడు అప్పటి అధికా రులకు ఈ మూడు కంపెనీలకు డిమాండ్ నోటీసులిచ్చారు. ఆ తర్వాత పలుసార్లు హెచ్చరిస్తూ నోటీసులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ స్పందించ లేదు. 2022నుంచే ఆస్తిపన్ను బకాయిలు న్నాయి. రెండు సంస్థలు మూడేళ్ల పన్ను చెల్లించా ల్సి ఉండగా, జీవీఆర్ మాత్రం రెండేళ్ల ఆస్తి పన్ను చెల్లించాలి. వీటిలో అత్యధికంగా గౌరవ్ కంపెనీ రూ.21.92లక్షలు, సీఆర్ఆర్ రూ.18.48లక్షలు, జీవీఆర్ కంపెనీ రూ.18.10లక్షలు చెల్లించాలని నోటీసులో అధికారులు పేర్కొన్నారు. ఇందులో గౌరవ్ కంపెనీ ఇప్పటికే కాంట్రాక్ట్ ముగిసిపోయింది. గత మూడేళ్లుగా కంపెనీలకు నోటీసులి స్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మిగతా రెండు కంపెనీలే పనులు నిర్వర్తిస్తున్నాయి. ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలోనూ పన్ను చెల్లించాల్సి ఉంది. మరోవైపు సింగరేణి కంపెనీ నుంచి పను ల బిల్లుల చెల్లించే సమయంలోనైనా బకాయిలు వసూలు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తే స్థానిక సంస్థకు ఆదాయం సమకూరనుంది. -
సమృద్ధిగా యూరియా నిల్వలు
కోటపల్లి: జిల్లాలో యూరియా సమృద్ధిగా ఉందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం మండలంలోని పార్పల్లి జాతీయరహదారిపై ఏ ర్పాటు చేసిన ఆంతర్రాష్ట్ర చెక్పోస్టును సీపీ అంబర్ కిషోర్ ఝా, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయశాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీం ద్వారా యూరియా అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జి ల్లాలో 2,500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే 500 మెట్రిక్ టన్నులు ఎక్కువగా విక్రయించినట్లు పేర్కొన్నారు. యూరియా లేదనే అవాస్తవాన్ని ఎవ రూ నమ్మవద్దని సూచించారు. డ్రోన్లతో పిచికారీ చేసే నానో యూరియా చెన్నూర్లో అందుబాటులో ఉందని తెలిపారు. ఆయన వెంట సీఐలు దేవేందర్రావు, బన్సీలాల్, ఎస్సై రాజేందర్, ఏఈవో రాజకుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సర్వేయర్ల పాత్ర కీలకం మంచిర్యాలఅగ్రికల్చర్: భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్కుమార్ దీప క్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండో బ్యాచ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమానికి భూకొలతల శాఖ అధికారి శ్రీనివాస్తో కలి సి హాజరై మాట్లాడారు. చట్టంలోని పూర్తి వివరాలు తెలుసుకుని విధులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని సర్వేయర్లకు సూచించారు. -
వ్యాధుల వివరాలు నమోదు చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలో నమోదవుతున్న వి జల్స్ రూబెల్లా, డిప్తీరియా, పెరిటిసిస్, న్యూ మెంటల్ టిటానస్, ఏఎఫ్పీ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఎస్ఎంవో డాక్ట ర్ అతుల్ సూచించారు. డీఎంహెచ్వో కార్యాలయంలో మంగళవారం జిల్లా వైద్యాధికారుల తో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. వ్యాధి ని ర్ధారణకు తప్పనిసరిగా శాంపిళ్లు సేకరించాల ని, ప్రైవేట్, ప్రభుత్వ వైద్యులకు వీటిపై అవగాహన కల్పించాలని, రోగాలకు సంబంధించి న వివరాలు నమోదు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. జిల్లా ప్రో గ్రాం అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్కు జిల్లా సర్వైలైన్స్ అధికారిగా బాధ్యతలు అప్పగించా రు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, బెల్లంపల్లి డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్ నాయక్, డీపీహెచ్ పద్మ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, హెల్త్ ఆఫీసర్ సుమన్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
‘ఖాకీ’లతో రెస్క్యూ టీమ్
మంచిర్యాలక్రైం: ఎంతటి కఠిన సవాళ్లనైనా ఎదుర్కోవడం.. అత్యంత భయంకర పరిస్థితులకు ఎదు రు నిలబడి అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు తదితర విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేందుకు పోలీస్శాఖలో ఓ ప్రత్యేక టీమ్ సిద్ధంగా ఉంది. ఈ టీమ్లోని సభ్యులు తమ ప్రాణాలనూ లెక్క చేయకుండా ప్రమాదంలో చిక్కుకున్నవారిని సురక్షితంగా కాపాడుతారు. గతేడాది జరిగిన విపత్తులను దృష్టిలో ఉంచుకుని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గ డి భాస్కర్ చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ఆధ్వర్యంలో కమిషనరేట్ పరిధిలోని ఒక్కో పోలీస్స్టేషన్ నుంచి మెరికల్లాంటి 90మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. వా రికి వారంపాటు హైదరాబాద్లోని నాగోల్లో ప్ర త్యేక శిక్షణ ఇచ్చి టీమ్ను తయారు చేశారు. గత అనుభవాల దృష్ట్యా.. గతేడాది వరుసగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో అనేక మారుమూల గ్రామాలు నీట మునిగి ప్రజలు అష్టకష్టాల పాలయ్యారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్నగర్, పద్మశాలీకాలనీ, రెడ్డికాలనీ, రాళ్లపేట, రాంనగర్, ఎల్ఐసీ కాలనీలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. నీట మునిగి ఏడాది గడిచినా బాధితులు నష్టాల నుంచి తేరుకోకముందే ఈసారి మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. సుమారు ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల వరకు నష్టం జరిగింది. వీరికి అప్పటి ప్రభుత్వం కూడా ఎలాంటి సాయం అందించలేదు. ఎప్పుడు వర్షాకాలం వచ్చినా జిల్లా ప్రజల్లో వణుకు మొదలవుతోంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్తో పా టు ఎగునున్న సుందిళ్ల, ఎల్లంపెల్లి ప్రాజెక్ట్ల్లోకి భారీగా నీరు చేరడంతో బ్యాక్ వాటర్, గోదావరి ప్రవాహానికి తోడు, పలు కాలువలు, వాగుల నుంచి వచ్చే వరదలతో మంచిర్యాల పట్టణంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. బాధిత ప్రజ లను కాపాడేందుకు స్థానిక పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఎంతో శ్రమించారు. ప్రస్తుతం చినుకు పడితే తమ గూడు చెదిరిపోతుందనే భావనలో ఎన్నో కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ కాలం వె ల్లదీస్తున్నాయి. గతంలో రెండుసార్లు సంభవించిన ముంపులో భారీ నష్టాన్ని ప్రజలు చవిచూశారు. ప్రజల రక్షణే ప్రధాన లక్ష్యం ప్రజలను కాపాడేందుకు ప్రత్యేక రెస్క్యూ టీమ్ను ఏర్పాటు చేశాం. మెరికల్లాంటి కానిస్టేబుళ్లను ఎంపిక చేసి కఠోర శిక్షణ ఇప్పించాం. వరదలు, ప్రయాణాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నవారు ‘డయల్ 100’కు కాల్ చేస్తే చాలు స్థానిక పోలీసులు గాని రెస్క్యూ టీమ్ సభ్యులు గాని వెంటనే స్పందించి రక్షణ కల్పిస్తారు. విపత్తులు సంభవించినప్పుడు అధైర్యపడవద్దు. వానాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా ఫ్లడ్ రెస్క్యూ టీమ్ను ఏర్పాటు చేశాం. – ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల డీసీపీఎలా పని చేస్తారంటే.. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఏర్పాటైన రెస్క్యూ టీమ్ కమిషనర్ పర్యవేక్షణలో పని చేస్తుంది. ప్రజలు ఎక్కడైనా ప్రమాదంలో చిక్కుకున్నారంటే స్థానిక పోలీస్స్టేషన్కు గాని లేదా ‘డయల్ 100’కు కాల్ చేసి సమాచారం అందిస్తే వెంటనే అక్కడికి పోలీస్ రెస్క్యూ టీమ్ చేరుకుంటుంది. సాంకేతిక ప రిజ్ఞానం, అత్యాధునిక పరికరాల ఆధారంగా ప్రమాదంలో ఉన్న వారిని టీమ్ సభ్యులు ప్రాణాలతో కాపాడేందుకు ప్రయత్నిస్తారు. ఎక్కడైనా రాకపోకలు నిలిచిపోయే విధంగా చెట్లు పడిపోయినా, రోడ్లు, బ్రిడ్జీలు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయినా, వరదలతో కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయినా వారిని కాపాడుతారు. వివిధ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈ రెస్క్యూ టీమ్ సభ్యులు తమ ప్రాణాలనూ లెక్క చేయకుండా ప్రజలను రక్షిస్తారు. కమిషనరేట్ పరిధిలో 30మంది టీమ్తో కూడిన మూడు టీమ్లు 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. -
స్తంభాలపై కేబుల్ తొలగించాలి
చెన్నూర్: జిల్లాలోని విద్యుత్ స్తంభాలకు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్ను వెంటనే తొలగించాలని ఎస్ఈ జాడే ఉత్తమ్ పేర్కొన్నా రు. గణేశ్ నవరాత్రోత్సవాల్లో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చెన్నూర్ మున్సి పాలిటీ పరిధిలో పర్యటించారు. స్తంభాలకు అమర్చిన కేబుల్ను పరిశీలించారు. అనంతరం స్థానిక విద్యుత్ సబ్ డివిజనల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 27నుంచి గణేశ్ నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతాయని, నిర్వాహకులు విద్యుత్ తీగల కింద మండపాలు ఏర్పాటు చేయవద్దని తెలిపారు. పె ద్ద విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు విద్యు త్ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాల ని తెలిపారు. మండపాల కోసం నాణ్యమైన తీగలు వినియోగించాలని సూచించారు. జిల్లా వ్యా ప్తంగా స్తంభాలపై ఏర్పాటు చేసిన కేబుల్ను సంనిర్వాహకులు తొలగించకుంటే తమ సిబ్బంది తొలగిస్తారని తెలిపారు. ఏడీఏలు బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, రమేశ్, ఏఈ శ్రీనివాస్ ఉన్నారు. ప్రమాదకర లైన్లను సవరించాలి మంచిర్యాలఅగ్రికల్చర్: స్తంభాలకున్న కేబుల్ వైర్లు తొలగించాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ క ర్నాటీ వరుణ్రెడ్డి సూచించారు. మంగళవారం హన్మకొండ విద్యుత్శాఖ కార్పొరేట్ కార్యాల యం నుంచి జిల్లా విద్యుత్శాఖ అధికారులతో వీ డియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఏడాదిగా స్తంభాలపై వైర్లు తొలగించాలని కేబుల్ ఆ పరేటర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలి పారు. ప్రమాదాల జరుగుతున్నాయని సంబంధి త యాజమాన్యాలకు రీఅలైన్మెంట్ చేసుకోవాలని సూచించామని, చేసుకోని పక్షంలో తొలగించా లని అధికారులను ఆదేశించారు. వినాయక మండపాలు పరిశీలించాలని, అధిక ఎత్తు ఉన్న విగ్రహాల తరలింపు ప్రాంతాల్లో ప్రమాదకర లైన్లను సవరించాలని సూచించారు. ఎస్ఈ ఉత్తమ్ జా డే, డీఈ ఖైసర్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
డ్రోన్తో గ్రామీణ యువతకు ఉపాధి
దండేపల్లి/లక్సెట్టిపేట/మంచిర్యాలఅగ్రికల్చర్: ఎరువుల పిచికారీకి అందుబాటులోకి వచ్చిన డ్రోన్ టెక్నాలజీ గ్రామీణ యువతకు ఉపాధినిస్తోందని డీ ఈవో ఛత్రునాయక్ తెలిపారు. మంగళవారం ఆయ న దండేపల్లి మండలం ముత్యంపేట రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్లో పా ల్గొన్నారు. ముత్యంపేట, లక్సెట్టిపేట మండల కేంద్రంలో ఫెర్టిలైజర్ షాపులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా 2552.157 మెట్రిక్ టన్నులు, డీఏపీ 588.5, ఎంవో పీ 862.55, కాంప్లెక్స్ 4342.175, ఎస్ఎస్పీ 451.3 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అవసరం మేరకే యూరియా వినియోగించాలని సూచించారు. ఏడీఏలు అనిత, గోపి, వ్యవసాయాధికారులు అంజిత్కుమార్, శ్రీకాంత్, ఏఈ వోలు నరేశ్, సుజన్య, మౌనిక, శ్రీకన్య పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో కంట్రోల్రూం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వారంరోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కలెక్టరేట్లో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసి 08736–250501 నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. 24గంటలు పని చేసే కంట్రోల్రూమ్లో అధికారులు అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. తమ కాలనీలోకి వరదనీరు చే రుతోందని.. కల్వర్టు జామ్ అయి వీధుల్లోకి నీ రు వస్తోందని.. ప్రమాదకరంగా వరద ప్రవహిస్తోందంటూ ఫిర్యాదులు వస్తుండడంతో రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. వెంటనే సంబంధి త తహసీల్దార్, గ్రామపంచాయతీ, మున్సిపల్ సిబ్బందికి తెలియపరుస్తూ అప్రమత్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అవసరమైన సమయంలో వాగులు, నది, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అ త్యవసర సేవలందించేందుకు 90మంది సభ్యులతో కూడిన మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రక్షణ పరికరాలతో సిద్ధంగా ఉంచారు. -
ఇళ్లకు పరిహారం అందించాలి
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి పీపీ రా వు ప్రాజెక్టు బ్యాక్వాటర్ చేరి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పంట పొలాలు, ఇళ్లు మునిగి పరిహారం అందక అనేక అవస్థలు పడుతున్నాం. కొందరికి, లీడర్లకు మాత్రమే పరిహారం ఇచ్చి మాకు అన్యాయం చేశారు. మేము ఆ నీటిలో మునిగి చనిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికై నా అధికారులు మా కాలనీకి వచ్చి పరిశీలించి న్యాయం చేయాలి. – కన్నెపల్లి మండలం సాలిగాం ముంపుకాలనీవాసులు -
దోస్త్ కావట్లే..!
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియలో మూడు విడతల్లో సీట్ల కేటాయింపు పూర్తయినా ఆశించిన మేర భర్తీ కాలేదు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఉన్నత విద్యాశాఖ ఇంటర్ తర్వాత డిగ్రీలో చేరే విద్యార్థుల సౌకర్యార్థం దోస్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్–తెలంగాణ) పేరిట ఆన్లైన విధానంలో మే 3నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గత తప్పిదాల దృష్ట్యా ఉన్నత విద్యామండలి అధికారులు ఈ విద్యాసంవత్సరం దోస్త్ను పక్కాగా చేపట్టారు. జిల్లాలో మంచిర్యాల చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లిలో నాలుగు ప్రభుత్వ, 10 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. బీకాం, బీజెడ్సీ, బీఎస్సీ, బీఏ, కంప్యూటర్ కోర్సులు ఉన్నాయి. ఒక్కో కళాశాలలో ప్రతీ కోర్సులు 60మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. వీటిల్లో 6,368 సీట్ల భర్తీకి గాను 3,261 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. మూడు విడతల్లో సీట్ల కేటాయింపు పూర్తయినా సగం ఖాళీగానే ఉండడంతో చివరి దఫాగా స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రైవేటుకు దీటుగా ప్రచారం ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు విస్తృత ప్రచారం చేపట్టారు. సౌకర్యాలు, తదితర అంశాలపై విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, స్కాలర్షిప్, ఆధునిక ప్రయోగశాలలు, విశాలమైన ఆట మైదానాలు అంటూ కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. అయినప్పటికీ నాలుగు ప్రభుత్వ కళాశాలల్లో 2,160 సీట్లకు గాను 987మంది అడ్మిషన్లు పొందడం గమనార్హం. ప్రైవేట్కూ తగ్గిన ఆదరణ ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లోనూ చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. పది కళాశాలలు ఉన్నా మూడు నాలుగింటిల్లో మాత్రమే చేరుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో 300 సీట్లకు గాను 30మంది మాత్రమే అడ్మిషన్లు పొందారు. వంద అడ్మిషన్లు దాటిన కళాశాలల్లో మరో మూడు ఉన్నాయి. మరో కళాశాల ఉన్నా లేనట్లేనని తెలుస్తోంది. కళాశాలలు మూతపడడానికి ఫీజు రీయింబర్స్మెంటు కారణంగా తెలుస్తోంది. విపరీతమైన కళాశాలల సంఖ్య పెరగడం, కోర్సులు ఎక్కువగా ఉండడం కూడా కారణమని తెలిసింది. ఇంటర్ తర్వాత విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సుల వైపు ఆసక్తి చూపడంతో డిగ్రీలో ప్రవేశాలు తగ్గుతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్నత చదువుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇంజినీరింగ్, బైపీసీ తీసుకున్న వారు ఎంబీబీఎస్, ఇతర ప్రొఫెఫనల్ కోర్సుల్లో చేరికకు తల్లిదండ్రులు ఆలోచించడం కూడా డిగ్రీ కోర్సులపై ప్రభావం చూపుతోంది. జ్యోతిబాపూలే, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో వసతి సౌకర్యం ఉండడంతో విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు.మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు ఇవే..కళాశాల సీట్లు ప్రవేశాలుమంచిర్యాల 360 196 చెన్నూర్ 480 221 లక్సెట్టిపేట 660 245 బెల్లంపల్లి 660 327 -
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి
తాండూర్: వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన మండలంలోని బోయపల్లి ఎస్సీ కాలనీ, నర్సాపూర్ భీమన్న వాగు, తాండూర్, కొత్తపల్లి రైల్వే అండర్పాస్ పరిశీలించారు. వర్షపు నీరు నిల్వ ఉండడంతో తలెత్తుతున్న ఇబ్బందులపై స్థానిక అధికారులతో చర్చించారు. రైల్వే అండర్పాస్ వద్ద నీరు నిల్వ ఉండకుండా శాశ్వత చర్యలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, తహసీల్దార్ జోత్స్న, ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. బహుజన సంక్షేమానికి సర్వాయి పాపన్నగౌడ్ పోరాటం మంచిర్యాలఅగ్రికల్చర్: బహుజన సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ అని కలెక్టర్ కమార్ దీపక్ అన్నారు. సోమవారం సర్ధార్ పాపన్నగౌడ్ జయంతిని కలెక్టరేట్లో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. -
వరదల్లో నగరం
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రమైన మంచిర్యాల నగరంలో సోమవారం కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. టూటౌన్ ప్రాంతంలోని అన్ని కాలనీల్లో రోడ్లు వరద నీటిలో మునిగి, ఇళ్లలోకి వరద నీరు చేరి వస్తువులు తడిసిపోయాయి. హమాలీవాడ డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వరద నీరు రోడ్లపై పారి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరింది. రోడ్లు నీటితో నిండిపోవడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సూర్యనగర్ రోడ్డు నంబరు 2లో డ్రెయినేజీలు సక్రమంగా లేక వరదనీటితో కలిసి మురికి నీరు ఇళ్లలోకి చేరింది. డ్రెయినేజీల్లోని చెత్త తొలగించకపోవడం, దొరగారిపల్లె వెళ్లే రోడ్డుతోపాటు గోపాల్వాడ, గాంధీనగర్ నుంచి సూర్యనగర్ రోడ్డు నంబరు3కి వరద నీరు ముంచెత్తుతోంది. హమాలీవాడలోని రోడ్లన్నీ నీటిలో మునిగాయి. ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బృందావనం కాలనీ, చున్నంబట్టి వాడ, తిలక్నగర్లో రోడ్లు వరదలో మునిగాయి. తిరుమలగిరి కాలనీలోని డ్రెయినేజీ నిండి నీరు ఇళ్లల్లోకి చేరడంతో మాజీ కౌన్సిలర్ సుదమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో వరద నీటిని జేసీబీ సహాయంతో దారి మళ్లించారు. హైటెక్సిటీ కాలనీలోని రోడ్లు వరద నీటిలో మునిగిపోయాయి. మాతాశిశు ఆరోగ్య కేంద్రా(ఎంసీహెచ్)న్ని వర్షపు నీరు చుట్టుముట్టింది. బాలింతలు, గర్భిణులు వరద నీటిలో ఆస్పత్రి లోపలికి వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. గత మూడేళ్లుగా ఏటా వర్షాకాలంలో గోదావరి వరద నీటిలో ఎంసీహెచ్ మునిగిపోవడం, అందులోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులను ఐబీ చౌరస్తాలోని మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించడం, వర్షాకాలం ముగిసే వరకు ఎంసీహెచ్ను మూసే ఉంచడం జరిగింది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, రాళ్లవాగు ఉప్పొంగడంతో వరద నీటిలో ఎంసీహెచ్ మునిగే ప్రమాదం ఉందని, సిబ్బంది, బాలింతలు, గర్భిణులు ఆందోళన చెందుతున్నారు. -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులను అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రయ్య, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావులతో కలిసి అర్జీలు స్వీకరించారు. కాసిపేట మండలం పెద్దనపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన సఫిరా, అబ్దుల్ బి తాము 59జీవో ప్రకారం భూ క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుని రుసుం చెల్లించామని, పట్టా మంజూరు చేయాలని వేర్వేరుగా దరఖాస్తు అందజేశారు. మంచిర్యాలకు చెందిన దూట లక్ష్మణ్ తాను కొనుగోలు చేసిన భూమికి భూభారతి చట్టం ప్రకారం పట్టా మంజూరు చేయాలని కోరారు. విద్యుత్ జీరో బిల్లు రావడం లేదని నస్పూర్లోని గణేష్నగర్కు చెందిన బాలసాని అనిత దరఖాస్తు సమర్పించింది. -
రూ.80 వేల నష్టం..
భారీ వర్షాలతో ఎర్రవాగు ఉప్పొంగడంతో వరద చేనులోకి వచ్చి మూడు ఎకరాల పత్తి పంటలో ఇసుక మేటలు వేసింది. ఇప్పటి వరకు రూ.80 వేలు ఖర్చు చేసిన. ప్రభుత్వమే ఆదుకోవాలి. – కొట్రంగి మనోహార్, గ్రామం: జజ్జరవెల్లి, మం: కన్నెపల్లి బురదపాలైన పెట్టుబడి..మూడు ఎకరాల్లో పత్తి సాగుకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టిన.. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎదిగే దశలో ఉన్న పత్తి పంట నీట మునిగింది. రెండు ఎకరాలు ఎల్లారం వాగు ఉప్పొంగడంతో బురదలో కూరుకుపోయింది. మట్టి దిబ్బలతో మొక్కలు బురదలో ఉండి మురి గిపోతోంది. పంట నష్ట పరిహారం అందించాలి. – గద్దల క్రిష్ణ, గ్రామం: జన్కాపూర్, మం: కన్నెపల్లి -
వరద బాధితులను ఆదుకోవాలి
మంచిర్యాలటౌన్: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు వరద నీటిలో ముంపునకు గురవుతున్నాయని, తక్షణమే అధికారులు స్పందించి, సహాయక చర్యలు చేపట్టి ముంపు బాధితులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని హమాలీవాడలో వరద నీటిలో మునిగిన కాలనీ రోడ్లు, ఇళ్లను పరిశీలించారు. అనంతరం కమిషనర్కు ఫోన్ చేసి వరద నీటితో ఇబ్బంది పడుతున్న కాలనీ ప్రజల సమస్యలను వివరించారు. ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని, ఇళ్లలోకి చేరిన వరద నీరు, డ్రెయినేజీల్లో పేరుకుపోయిన చెత్త తొలగించాలని తెలిపారు. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే బ్లీచింగ్ పౌడర్ చల్లి, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని, వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఉన్నందున పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు గోగుల రవీందర్రెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీపతి శ్రీనివాస్, అంకం నరేశ్, తోట తిరుపతి, శ్రీరాముల మల్లేశ్, కర్రు శంకర్, జెట్టి చరణ్ పాల్గొన్నారు. -
జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 17.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. బెల్లంపల్లి మండలంలో 48.8 మిల్లీమీటర్లు, మంచిర్యాలలో 46, మందమర్రిలో 38.5, నస్పూర్లో 37.8, హాజీపూర్లో 33.3, కన్నెపల్లిలో 33, లక్సెట్టిపేటలో 26.5, కాసిపేటలో 21, తాండూర్లో 16.5, జన్నారంలో 14.5, దండేపల్లిలో 12, నెన్నెలలో 11.8, భీమినిలో 9.5, వేమనపల్లిలో 9.3, జైపూర్లో 8, చెన్నూర్లో 8, కోటపల్లిలో 4.5, భీమారంలో 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ‘ఎల్లంపల్లి’ గేట్లు ఎత్తివేత మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత కొనసాగుతోంది. ఆదివారం రాత్రి గేట్ల మూసివేసినప్పటికీ అర్ధరాత్రి నుంచి సోమవారం రోజంతా కురిసిన వర్షం, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్ట్లోకి చేరుతుండడంతో గేట్ల ఎత్తివేత కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20.175టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.950 టీఎంసీల నీటిమట్టం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 80వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టులోని 32గేట్లు ఎత్తి 2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ పథకానికి 295 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, నంది పంప్హౌస్కు 3,200 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, దళితులపై దాడులను అరికట్టడానికి ప్రత్యేక కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల విద్యాలయం, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ(సీఓఈ) బాలుర విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. బాలికల విద్యాలయంలో ప్రహరీ నిర్మాణం చేపట్టాలని సబ్ కలెక్టర్ను ఆదేశించారు. బూడిదగడ్డ బస్తీలో ఇటీవల కూల్చివేతకు గురైన వినాయక మండప నిర్మాణాన్ని పరిశీలించారు. కారణాలు తెలుసుకుని సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, నీలాదేవి, జిల్లా శంకర్, రాంబాబు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఏసీపీ రవికుమార్, తహసీల్దార్ కృష్ణ, దళిత సంఘాల నాయకులు చిలుక రాజనర్సు, రమేష్, నారాయణ, గోపాల్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ కానిస్టేబుళ్లకు శిక్షణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లో సోమవా రం ఆర్టీసీ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చారు. 51వ తెలంగాణ ఆర్టీసీ కానిస్టేబుళ్ల రిఫ్రెషర్ కోర్సు ను బెటాలియన్ కమాండెంట్ పి.వెంకటరాములు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కానిస్టేబుళ్లు కూడా ప్రతీ రోజు డ్రిల్, క్రమశిక్షణతో ఉద్యోగం చేస్తూ సంస్థకు మంచి పేరు తీసుకువరావాలని అన్నారు. శిక్షణ అసిస్టెంట్ కమాండెంట్ కాళిదాసు, సీఐ రవీందర్, ఆర్ఐలు భాస్కర్, సతీశ్, అన్నయ్య, బెటాలియన్ అధికారులు, శిక్షణ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
‘పోడు’ రైతులకు న్యాయం చేస్తాం
కౌటాల: ప్రజా ప్రభుత్వంలో పోడు రైతులకు న్యాయం చేస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల ఉచ్చులో పాడి పోడు రైతులు కేసుల పాలు కావొద్దన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు ఎంపీ ఎన్నికల ప్రచారంలో గోడం నగేశ్ను గెలిపిస్తే గిరిజనేతర రైతులకు పోడు పట్టాల పంపిణీ చట్టం చేస్తామని ఇచ్చిన హామి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పోడు వ్యవసాయం కేంద్రం పరిధిలో ఉందని, బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు పోడు పట్టాల పంపిణీ చట్టంను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనేతరులకు ఐదెకరాలకంటే ఎక్కువ పోడు సాగు ఉదని అటవీశాఖ అధికారులు గుర్తించినట్లు తెలిపారు. అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, పార్టీ మండల కన్వీనర్లు నికోడే గంగారాం, ఉమా మహేశ్, నాయకులు సీతల్, విఠల్, పోశం, శంకర్, రవి, లహాను, తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
ఉట్నూర్రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయ ఛాంబర్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉట్నూర్ మండలం రాజుగూడకు చెందిన రాథోడ్ వికాస్ ల్యాప్టాప్ మంజూరు చేయాలని, మందమర్రికి చెందిన అమృత ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఇప్పించాలని, ఉట్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన ఆత్రం అయ్యుబాయి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని, జైనూర్ మండలం శివనూర్కు చెందిన ధనుష్ గురుకుల కళాశాలలో అడ్మిషన్ ఇప్పించాలని కోరారు. ఇంకా పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. -
అనారోగ్యంతో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మృతి
దండేపల్లి: మండలంలోని మేదరిపేటకు చెందిన జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మర్రి ప్రవీణరెడ్డి (71) అనారోగ్యంతో మృతి చెందింది. 2000 సంవత్సరంలో టీడీపీ నుంచి దండేపల్లి జెడ్పీటీసీగా గెలుపొందిన ఆమె 2005 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్గా పనిచేశారు. అంతేకాకుండా సుమారు 40 ఏళ్ల నుంచి మేదరిపేటలో ప్రైవేట్ నర్సింగ్హోం నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం క్యాన్సర్ బారిన పడింది. నెల రోజులుగా హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందింది. జాతీయస్థాయి వర్క్షాప్కు జిల్లా ఉపాధ్యాయుడునిర్మల్ఖిల్లా: నూతన జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయి వర్క్షాప్ను నిర్వహించనుంది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి పదిమంది ఉపాధ్యాయులకు స్థానం దక్కగా అందులో నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మేదరి ఎల్లన్నకు అవకాశం లభించింది. ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 10 వరకు రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించనున్న వర్క్షాప్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.రమేశ్ ఉత్తర్వులు వెలువరించారు. ఉద్యోగాల పేరుతో మోసగించిన ఒకరి అరెస్టుబోథ్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులను మోసగించి డబ్బులు వసూలు చేసిన మామిడాల సతీశ్ను సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు. ఎస్సై శ్రీసాయిలు తెలిపారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సతీశ్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.5.50 లక్షలు వసూలు చేశాడని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పేకాడుతున్న నలుగురు..సాత్నాల: పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సోమవారం భోరజ్ మండలం గిమ్మ గ్రామంలో దాడులు నిర్వహించగా పేకాడుతున్న మండ అడెల్లు, మాదాస్తు పవన్, మునిగల భూమన్న, గడసందుల భూమయ్యను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుండి రూ.6,600 నగదు, రెండు ఫోన్లు, స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
భరోసా కల్పిస్తున్నాం
మాన్యువల్ కెమెరాల స్థానంలో డిజిటల్ కెమెరాల రాకతో చాలావరకు ప్రత్యేకత తగ్గింది. లేటెస్ట్ ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లు రావడంతో ఫొటోలు, సెల్ఫీలతో సెల్ఫోన్ ప్రింట్లు పెరిగాయి. ప్రొఫెషనల్ ఫొటో కెమెరాలతో కాకుండా సెల్ ఫొటోలపై మోజు పెంచుకుంటున్నారు. లక్షలు వెచ్చించి కొన్న కెమెరాలతో షూటింగులకు వెళ్లిన ప్రతీచోట సెల్ఫోన్లు ఇచ్చి ఫొటోలు తీయమంటున్న సందర్భాల్లో బాధగా ఉంటోంది. సంక్షేమ సంఘం ద్వారా కుటుంబ భరోసాతో అండగా నిలుస్తున్నాం. – అప్పాసు రాము, ప్రొఫెషనల్ ఫొటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల -
నిధి తీస్తానని మోసగించిన వ్యక్తి అరెస్టు
లోకేశ్వరం: మీ ఇంట్లో నుంచి నిధిని బయటకు తీ స్తానని నమ్మించి మోసగించిన వ్యక్తిని సోమవారం అరెస్టు చేసినట్లు ముధోల్ సీఐ మల్లేశ్ తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని బామ్నికే గ్రామానికి చెందిన బాయి భోజక్క ఇంటికి ఈ నెల 12న సిరిసిల్ల జిల్లాలోని పెద్దూర్ గ్రామానికి చెందిన రాజేశ్వర్, శ్రీకాంత్ కారులో వచ్చారు. మీఇంట్లో బంగారు నిధి ఉందని, పూజలు చేసి బయటకు తీస్తామని, ఇందుకు రూ. 22 వేలు అవుతుందని ఒప్పందం కుదుర్చుకుని వెళ్లి పోయారు. మళ్లీ 13న రాజేశ్వర్ వచ్చి ముందుగా రూ.10 వేలు ఇవ్వమని తీసుకున్నాడు. అనంతరం సదరు మహిళ ఇంట్లో కొత్తకుండను పెట్టి ఇందులో రెండు తులాల బంగారం వేయాలని చెప్పడంతో తులం చైన్, తులం ఉంగరం ఇచ్చింది. వాటిని కుండలో వేసినట్లు నమ్మించాడు. పూజలు చేసి రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. రెండు రోజుల తరువాత మళ్లీ ఫోన్చేసి పూజ పూర్తి చేసి నిధి బయటకు తీయాలంటే దాదాపు రూ.3 లక్షలు అవుతుందని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు కుండను తెరిచి చూడగా అందులో బంగారం లేకపోయేసరికి లబోదిబోమన్నారు. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాజేశ్వర్ భోజక్క ఇంటికి రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద ఉన్న ఉంగరం, చైన్తో పాటు కారును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న ఎస్సై అశోక్ను సీఐ అభినందించారు. -
గుండేగాంలోకి మళ్లీ నీళ్లు..
భైంసా/భైంసారూరల్: ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుండేగాం వాసుల్లో మళ్లీ భయం పట్టుకుంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గుండేగాం వంతెన నీట మునిగింది. వంతెనతోపాటు గ్రామాన్ని సోమవారం ఎస్పీ జానకీ షర్మిల సందర్శించా రు. గ్రామస్తులతో మాట్లాడి ఏ అవసరం వచ్చినా మేమున్నామని భరోసా కల్పించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం నిర్మల్ జి ల్లాకు రానున్నారు. మంత్రి ఈ సమస్యకు పరి ష్కారం చూపుతారన్న ఆశ గ్రామస్తుల్లో నెలకొంది. సర్వే పూర్తయినా... గత ప్రభుత్వహయాంలో గుండేగాం పునరావాసం సర్వే పూర్తి చేశారు. రూ.200 కోట్లకుపైగా నిధులు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. భైంసా మండలం సిద్దూర్ శివారుల్లో సర్వేనంబర్ 73లో మూడెకరాల భూమి గుర్తించి అందులో పునరావాసం కల్పిస్తామన్నారు. ఏళ్లు గడుస్తున్నా ఇళ్ల స్థలాలకు సంబంధించిన నమూనాలు పూర్తికాలేదు. గత ప్రభుత్వహయాంలో పునరావాసం కోసం రూ.66 కోట్లు అవసరమని మరో ప్రతిపాదన పంపించారు. ఈ నిధులు సరిపోవంటూ మరో రూ.33 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. ఇలా పలుమార్లు ఇచ్చిన నివేదికలన్నీ ప్రభుత్వం వద్దే మగ్గుతున్నాయి. ఫలితంగా ఏటా వానాకాలం ఈ గ్రామానికి గండంగా మారుతోంది. వర్షాలు కురిస్తే నీరంతా గ్రామంలోకి వచ్చి చేరుతోంది. డబుల్బెడ్రూం ఇళ్లలోనే... రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో రెవెన్యూ అధికారులు కమలాపూర్ గుట్ట సమీపంలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూం ఇళ్లలోనే ఇప్పటికీ గుండేగాం వాసులు ఉంటున్నారు. ప్రతీరోజు అక్కడి పంట పొలాల్లో పనిచేసుకుని సాయంత్రానికి ఇక్కడికే తిరిగివస్తున్నారు. ఇదీ పరిస్థితి... వాడి గ్రామ సమీపంలో సుద్దవాగుపై 2005లో రూ.12కోట్ల వ్యయంతో రంగారావు పల్సికర్ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 12 గ్రామాలకు చెందిన 4,600 ఎకరాలకు సాగునీరందించేలా పనులు చేపట్టారు. కోతల్గాం, బిజ్జూర్, ఎగ్గాం, మాటేగాం, హంపోలి, బోరిగాం, వాడి, బాబుల్గాం, భైంసా, హజ్గుల్, వానల్పాడ్, వాటోలి గ్రామాలకు చెందిన 1800 మంది రైతుల సాగు భూములకు నీరందేలా కాలువలు తవ్వారు. 2006లో ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు అర్ధాంతరంగా వదిలేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రాజెక్టు నిర్మాణ నిధులు రూ.25 కోట్లకు పెంచి పనులు ప్రారంభించారు. 2006 నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులు పూర్తికాక అటు పునరావాసం కల్పించక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టు కింద తవ్విన కాలువలన్నీ కూరుకుపోయాయి. ఇబ్బంది పడుతున్నాం వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నాం. వర్షం కురిస్తే నీళ్లన్నీ గ్రామంలోకి వస్తున్నాయి. వాగు పక్కన నిలిచిన నీరంతా శ్మశాన వాటికను ముంచేస్తోంది. – అంశబాయి, గ్రామస్తురాలు పునరావాసం కల్పించాలి ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుండేగాం వాగు పక్కన నీరు నిలిచిపోయింది. ఎటుచూసినా నీరే ఉంది. అధికారులు గుండేగాం వాసులకు పునరావాసం కల్పించాలి. – సురేశ్, గ్రామస్తుడు -
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
ఇంద్రవెల్లి: ఇటీవల కురుస్తున్న వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఖానా పూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి మండలంలోని ముత్నూర్ సమీపంలో గ ల త్రివేణి సంగమం చెరువు, కోతకు గురైన ప్రధాన రహదారిని పరిశీలించారు. అనంతరం పిట్టబొంగ రం గ్రామంలో ఈదురు గాలులతో ఇంటి పైకప్పు కొట్టుకుపోయిన అనక జంగు కుటుంబాన్ని పరామర్శించారు. దస్నాపూర్, వడగామ్, హీరాపూర్, అంజీ తదితర గ్రామాల్లో పర్యటించి కోతకు గురైన రో డ్లు, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, తహసీ ల్దార్ ప్రవీణ్కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండి జహీర్, నాయకులు ఎండీ మసుద్, మీర్జా యాకూబ్బేగ్, సోమోరే నాగోరావ్ పాల్గొన్నారు. -
‘గడ్డెన్నవాగు’కు వరద
‘స్వర్ణ’ రెండు గేట్లు ఎత్తివేత ఎస్సారెస్పీలోకి పోటెత్తిన వరద‘కడెం’ ఆరుగేట్లు ఎత్తివేతమూడు గేట్ల ద్వారా దిగువకు వస్తున్న వరదనీరుదిగువకు వెళ్తున్న వరదనీరుఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1089.2 అడుగుల (74.128 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది. సోమవారం ప్రాజెక్ట్లోకి 1.25 లక్షల క్యూసెక్కుల వరద నీరు కొనసాగడంతో 34 గేట్లను ఎత్తి 1.25 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వరద కాలువకు 18 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 4,700 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. – మామడపట్టణ శివారులోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం వరకు 4,100 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా మూడు గేట్లు ఎత్తి 16వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దిగువన సుద్దవాగులో వరదనీటి ప్రవాహా నికి గణేశ్నగర్ వద్ద శివాలయం నీట మునిగింది. ఆటోనగర్ వెళ్లే బైపాస్ వంతెన పైనుంచి నీరు పారుతుండడంతో రాకపోకలు నిలిపేశారు. – భైంసాటౌన్మండలంతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా 6,425 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి 9,205 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 1181.1 అడుగుల వద్ద స్థిరంగా ఉంచుతున్నారు. డీఈ శ్రీనివాస్, ఏఈ వేణుగోపాల్ ప్రాజెక్టును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. – సారంగపూర్కడెం ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో కొనసాగుతోంది. సోమవారం రాత్రి ప్రాజెక్ట్కు 42,285 క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో అప్రమత్తమైన అధికారులు ఆరు వరద గేట్లను ఎత్తి 45,887 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695.225 అడుగుల నీటిమట్టం ఉంది. – కడెం -
జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ
బెల్లంపల్లిరూరల్: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో బెల్లంపల్లికి చెందిన సీనియర్ కరాటే మా స్టర్ విజ్జగిరి రవి అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బ హుమతి కై వసం చేసుకున్నారు. ఈ నెల 17న బెంగళూర్లో నిర్వహించిన జాతీయ స్థాయి క రాటే బెల్ట్ టెస్ట్ పోటీల్లో పాల్గొని బ్లాక్ బెల్ట్ సిక్తస్ డాన్ కై వసం చేసుకున్నాడు. కెన్ భూ కాయ్ కరాటే ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ విజ యం, తెలంగాణ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. ముగిసిన రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలుఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 16 నుంచి జరుగుతున్న 5వ రాష్ట్ర బేస్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు సోమవారంతో ముగిశాయి. పురుషు ల విభాగంలో సంయుక్త విజేతలుగా హైదరా బాద్, రంగారెడ్డి జట్లు, తృతీయస్థానంలో నిజా మాబాద్ జట్టు నిలిచింది. మహిళల విభాగంలో హైదరాబాద్, నిజామాబాద్ జట్లు సంయు క్త విజేతలుగా తృతీయస్థానంలో నల్గొండ జ ట్టు నిలిచింది. విజేతలకు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్వేత ట్రోఫీలు అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి డాక్టర్. కృష్ణ, జిల్లా అధ్యక్షుడు కళాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు లోక ప్రవీణ్ రెడ్డి, డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్ పాల్గొన్నారు. బెదిరింపులకు పాల్పడిన ఒకరు అరెస్టుఇచ్చోడ: మండల కేంద్రానికి చెందిన షేక్ మహ్మద్ అలీని బెదిరించిన కేసులో పాండురంగ్ అనే వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ బండారి రాజు తెలిపారు. 2023లో మండల కేంద్రంలో సిరిచెల్మ చౌరస్తాలో జరిగిన మర్డర్ కేసులో మహ్మద్ అలీ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని, కోర్టులో సాక్ష్యం చెప్తే చంపేస్తానని ఈ నెల 17న బెదిరించడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఛాయాచిత్రం.. స్మృతుల సజీవ సాక్ష్యం
మంచిర్యాలరూరల్(హాజీపూర్):ఫొటోగ్రఫీ ప్రకృతి అందాలు, పసిపాపల నవ్వులు, జీవితంలోని ప్రతీ మలుపును శాశ్వతంగా నిలిపే కళ. నలుపు–తెలుపు యుగం నుంచి డిజిటల్ కాలం వరకు, ఫొటోలు భావాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. ప్రకృతి సౌందర్యం, శుభకార్యాలు, ప్రళయాలు, విధ్వంసాలు అన్నింటినీ ఒడిసిపట్టే ఛాయాచిత్రాలు సామాజిక మార్పులకు ఆధారం. ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈ కళ గురించి ప్రత్యేక కథనం. ఫోటోగ్రఫీ పుట్టుక ‘ఫోటోస్’ (కాంతి), ‘గ్రాఫ్’ (రాయడం) అనే గ్రీకు పదాల నుంచి ఫొటోగ్రఫీ ఉద్భవించింది. 1839లో ఫ్రాన్స్కు చెందిన ఎల్.జె.ఎం.డ్యాగురే తొలి ఛాయాచిత్రాన్ని సెన్సార్ అయోడైజ్డ్ ద్వారా బంధించగా, ఫ్రాన్స్ సైన్స్ అకాడమీ ఆగస్టు 19ను ప్రపంచ ఫొటోగ్రఫీ దినంగా ప్రకటించింది. 1889లో జార్జ్ ఈస్ట్మన్ కొడాక్ బాక్స్ కెమెరాను రూపొందించాడు. మాన్యువల్ నుంచి డిజిటల్ కెమెరాల వరకు, ఇప్పు డు స్మార్ట్ఫోన్ సెల్ఫీలు ఫొటోగ్రఫీని మార్చేశాయి. సాంకేతిక మార్పులు తెలంగాణ రాష్ట్ర ఫొటో, వీడియో గ్రాఫర్స్ సంఘం, ఆల్ ఇండియా ఫొటో ఇండస్ట్రీ వంటి సంస్థలు ఎగ్జిబిషన్ల ద్వారా డిజిటల్ కెమెరాలు, ప్రింటర్లను పరిచయం చేస్తూ శిక్షణ ఇస్తున్నాయి. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఛాయాచిత్ర పోటీలు నిర్వహిస్తూ బహుమతులు అందిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు విప్లవం సృష్టిస్తుండగా, స్టూడియోల గిరాకీ తగ్గింది. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో ఇబ్రహీంపట్నం గురుకుల విద్యాపీఠంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న మంచిర్యాల జట్టును ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎండీ యాకూబ్ ఆదివారం ప్రకటించారు. బాలుర విభాగంలో సాయిదీక్షత్ (కార్మెల్ హై స్కూల్, మంచిర్యాల), వినయ్, అభిరామ్(జెడ్పీహెచ్ఎస్, రెబ్బనపల్లి), సాయినాథ్, కౌశిక్ (టీజీడబ్ల్యూఆర్ఎస్ కోటపల్లి), ధనుష్ (జెడ్పీహెచ్ఎస్, తాళ్లపేట్), హర్షిత్ (జెడ్పీహెచ్ఎస్, జైపూర్), సాయి (టీజీడబ్ల్యూఆర్ఎస్ గుడిపేట్) జట్టు ఎంపికై ంది. బాలికల విభా గంలో ఎం.రుచిత, అక్షిత, జె.రాణి (జెడ్పీహెచ్ఎస్, రెబ్బనపల్లి), నక్షత్ర (జెడ్పీహెచ్ఎస్, అస్నాద్), హరిప్రియ, శాలిని (టీజీడబ్ల్యూఆర్ఎస్, లక్సెట్టిపేట్) ఎంపికయ్యారు. జట్టు కు కోచ్లుగా వ్యాయామ ఉపాధ్యాయులుగా జుల శ్రీనివాస్, మనోహర్ ప్రాతినిథ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికై న క్రీడాకారులను డీఈవో యాదయ్యతో పాటు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు రేణి రాజయ్య, రోజి వరకుమారి, సిరంగి గోపాల్, సురేష్, సత్యనారాయణ అభినందించారు. -
ఎల్లంపల్లి గేట్ల మూసివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం 18.350 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో కింద 15 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా అవుట్ఫ్లో కింద 13 వేల క్యూసెక్కుల నీటిని బయటకు తరలిస్తున్నా రు. ఇందులో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 295, ఎన్టీపీసీకి 121, నంది పంప్హౌజ్కు 12,600ల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకు తెరిచి ఉన్న 10 గేట్లను రాత్రి మూసివేసి నీటిని నిల్వ చేస్తున్నారు. -
యూరియా వస్తోంది!
చెన్నూర్: ఖరీఫ్లో పంటలు సాగు చేసిన రైతులు ఎరువుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వ్యవసాయ పనులు మానుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నియోజకవర్గంలో వారం రోజులుగా ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. రెండు వందల బస్తాల ఎరువులు వస్తే మూడు వందల మంది రైతులు బారులు తీరుతున్నారు. చెన్నూర్, కోటపల్లి మండలాల్లో ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలపై కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరా తీసినట్లు తెలిసింది. రెండు మండలాలకు సరిపడా ఎరువులు పంపించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో చెన్నూర్, కోటపల్లి మండలాలకు 120 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చెన్నూర్, కోటపల్లి, పారుపల్లిలో కేంద్రాలను ఏర్పాటు చేసి సోమవారం ఎరువులు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఏ ప్రాంత రైతులకు ఆ ప్రాంతంలోనే ఎరువులు పంపిణీ చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచిస్తున్నారు. మూడు కేంద్రాల్లో పంపిణీ మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో 120 మెట్రిక్ టన్నుల యూరియా వస్తోంది. చెన్నూర్, కోటపల్లి మండలాల్లో మూడు పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. చెన్నూర్లో 40, కోటపల్లిలో 40, పారుపల్లి సెంటర్లో 40 మెట్రిక్ టన్నుల చొప్పున సోమవారం రైతులకు యూరియా పంపిణీ చేస్తాం. నాలుగు రోజుల తర్వాత సెంటర్కు 20 మెట్రిక్ టన్నుల చొప్పున ఎరువులు అందజేస్తాం. – బానోత్ ప్రసాద్, ఏడీ అగ్రికల్చర్, చెన్నూర్ -
చినుకు.. వణుకు!
మంచిర్యాలటౌన్: మంచిర్యాల కార్పొరేషన్గా పేరుమారినా మౌలిక సదుపాయాలు మాత్రం ప్రజలకు ఏమాత్రం అందడంలేదు. చిన్నపాటి వర్షానికే వరద నీరు రోడ్లపై, ఇళ్ల మధ్యనే నిలుస్తోంది. గంటపాటు ఏకధాటిగా వర్షం కురిస్తే జనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, ఉన్నచోట పూడిక తీయక పోవడం, చెరువు మత్తడి కాలువలతో పాటు, డ్రెయినేజీ కాలువను కబ్జా చేసి ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం వరద నీటిలో కాలనీలు మునిగేందుకు కారణమవుతున్నాయి. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు డ్రెయినేజీ వ్యవస్థను పట్టణ జనాభా, వరద నీరు పారేలా నిర్మాణం చేపట్టాల్సి ఉండగా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఏటా వర్షాకాలంలో పట్టణంలోని సగం కాలనీలు వరద నీటిలో మునిగి పోతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే వరద నీరు ఇళ్లల్లోకి చేరి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. శుక్రవారం ఉదయం కురిసిన వర్షానికి పట్టణం మొత్తం వరద నీటితో నిండిపోయి రోడ్లపై వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.బృందావనం కాలనీలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు చిన్నపాటి వర్షానికే..జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి బృందావనం కాలనీ, సూర్యనగర్, చున్నంబట్టివాడ కాలనీల్లో రోడ్లు వరద నీటిలో మునిగిపోయాయి. రోజంతా రోడ్లపై వరద నీరు నిలిచి ఉండడంతో వాహనదారులు, పాదచారులు బయటకు వెళ్లలేని పరిస్థితి. హమాలివాడకు వెళ్లేందుకు ఉన్న రెండు రైల్వే అండర్ బ్రిడ్జిల్లోకి వచ్చే వరద నీటిని బయటకు పంపిస్తుండగా అవి నేరుగా సూర్యనగర్ కాలనీలోని డ్రెయినేజీల్లోకి చేరుతున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రోడ్లపై పారుతున్నాయి. దొరగారిపల్లె నుంచి వచ్చే వరద నీరు, పోచమ్మ చెరువు మత్తడి కాలువలోని నీరు సైతం బృందావనం కాలనీ, సూర్యనగర్, చున్నంబట్టి కాలనీల్లోకి చేరి అక్కడి రోడ్లను ముంచెత్తుతున్నాయి. వరద నీటిని బయటకు పంపించేందుకు మార్గం లేక పోవడంతో ఏటా నీటిలోనే ఆయా కాలనీలు ఉంటున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఇబ్బందిగా మారుతోంది. పాతమంచిర్యాల నుంచి రంగంపేట్ వెళ్లే వంద ఫీట్ల రోడ్డు పక్కన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై పారుతూ సమీపంలోని శ్రీలక్ష్మీనగర్ కాలనీకి చేరుతుంది. ఈ ప్రాంతంలో డ్రెయినేజీల నిర్మాణం చేపట్టి వరద నీరు బయటకు వెళ్లేలా చేస్తే కాలనీలోకి వరద నీరు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంది. ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస థియేటర్కు వెళ్లే దారిలో డ్రెయినేజీని నిర్మించక పోవడం, ఒకవైపు మాత్రమే డ్రెయినేజీ ఉండడంతో కాలనీలోని ఇళ్లల్లోకి వరద నీరు చేరి ఇబ్బందిగా మారుతోంది. హైటెక్సిటీ కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో వర్షపు నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి. దీంతో కాలనీలోని రోడ్లు, ఇళ్ల మధ్య వరద నీరు చేరుతోంది. బృందావనం కాలనీ, సూర్యనగర్, చున్నంబట్టి వాడ, శ్రీలక్ష్మీనగర్ కాలనీ, వికాస్నగర్, తిలక్నగర్, రాజీవ్నగర్, పాతమంచిర్యాల, సాయికుంట, శ్రీనివాస కాలనీ, హైటెక్సిటీ కాలనీ, హమాలివాడ, ఐబీ చౌరస్తా, రాంనగర్, ఎన్టీఆర్నగర్ కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థను సరిచేయడమో, వరద నీరు వెళ్లేలా నిర్మాణం చేయడమో చేస్తేనే నగరంలో వరద నీరు రోడ్లపై చేరకుండా ఉండేందుకు అవకాశం ఉంది. -
ప్రణాళిక రూపొందిస్తున్నాం
మంచిర్యాలలో కొన్నేళ్ల క్రితం నిర్మించిన డ్రెయినేజీలు ప్రస్తుతం పెరిగిన జనాభాకు అనుగుణంగా లేవు. జిల్లా కేంద్రం కావడంతో పట్టణం పరిధి పెరిగిపోవడం, పాతకాలం నాటి డ్రెయినేజీ వ్యవస్థతో వరద నీరు బయటకు వెళ్లలేక రోడ్లపై పారుతోంది. వరద నీరు వెళ్లేందుకు తాత్కాలికంగా చర్యలు తీసుకుంటున్నాం. పూర్తిస్థాయి నివారణకు కార్పొరేషన్ స్థాయిలో డ్రెయినేజీలు నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ప్రస్తుతం కాలనీల్లో చేరిన వరదనీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. – సంపత్ కుమార్, ఇన్చార్జి కమిషనర్, మంచిర్యాల -
‘తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోం’
మంచిర్యాలటౌన్: బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని మాజీ ఎమ్మె ల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నా రు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆదివా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 14న హాజీపూర్ మండలంలోని రాపల్లిలో బీఆర్ఎస్ నాయకు డు ఆనె మల్లేశ్కు సంబందించిన ఒక పెళ్లి బరా త్లో కాంగ్రెస్ నాయకులు కావాలని గొడవచేసి, దాడికి పాల్పడ్డారని, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఈ నెల 15న ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. దెబ్బలు తిన్నవారిపైనే కేసు న మోదు చేయడం, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ను పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీపీకి ఫిర్యాదు చేశామన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు, హాజీపూర్ మండల అధ్యక్షు డు మొగిలి శ్రీను, మంచిర్యాల పట్టణ అధ్యక్షు డు గాదె సత్యం, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అంకం నరేశ్, అత్తి సరోజ పాల్గొన్నారు. -
అధైర్య పడకండి.. అండగా ఉంటా
జన్నారం: ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అధైర్య పడవద్దని, అండగా ఉంటానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం జన్నారం మండలంలోని పొనకల్ బుడుగ జంగాల కాలనీ, రాంపూర్ గ్రామ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోటిగూడకు వెళ్లే దారిపై వంతెన నిర్మిస్తామన్నారు. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నందువల్ల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు. నియోజక వర్గంలోని అన్ని మండలాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. గోదావ రి, వాగులు, ఇతర ప్రాంతాల్లో చేపలు పట్టేందుకు వెళ్లవద్దని సూచించారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసీఉల్లా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముజఫర్ అలీ ఖాన్, నాయకులు ఇసాక్, రియాజొద్దీన్, మహేశ్, మాణిక్యం, కరుణాకర్, నందునాయక్, సుధీర్కుమార్, తదితరులు ఉన్నారు. -
ఉద్యోగ, ఉపాధికి భరోసా...!
మంచిర్యాలఅర్బన్: నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక సంస్థ (ఐటీఐ)లను నవీకరించి అడ్వాన్స్డ్ టెక్నాల జీ కేంద్రాలు (ఏటీసీ)గా తీర్చిదిద్దింది. ఐటీఐలలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ ఏటీసీలను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సిర్థపడేందు కు బాటలు వేస్తున్నారు. పదోతరగతి పాసైన విద్యార్థులకు అవసరమైన అత్యాధునిక శిక్షణ పొందే ఏటీసీలో స్పాట్ అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 6 నుంచి స్పాట్ వాక్ఇన్ ఇంటర్ూయ్వ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసకుంటే ఆన్లైన్లో మెరిట్ జాబితా వెలువడిన త ర్వాత ఇంటర్ూయ్వ నిర్వహించి కోరుకున్న కోర్సులో ప్రవేశానికి అవకాశం ఇవ్వనున్నారు. స్పాట్ అడ్మిషన్లకు ఈ నెల 28తో గడువు ముగియనుంది. పారిశ్రామిక శిక్షణవిద్యార్థులకు శిక్షణనిచ్చి స్వయం ఉపాధి పొందేందుకు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సాధించేందు కు ఐటీఐలను ఏర్పాటు చేశారు. మంచిర్యాల ఐటీఐ లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెకానిక్, టర్నర్, కోపా, సోలార్ టెక్నీషియన్, ఫ్యాషన్ డిజైన్తో పాటు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏటీసీలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషిన్ ఇండస్ట్రియల్ రోబోటెక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, వర్చువల్ ఎనాలిసిస్ అండ్ డిజైనర్, అడ్వాన్స్డ్ సీఎన్సీ మిషనింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రానిక్ వెహికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 32 సీట్లు ఖాళీమంచిర్యాల ఐటీఐలో 97 శాతం, ఏటీసీలో 85 శా తం సీట్లు భర్తీ అయ్యాయి. ఇప్పటికే పలు దఫాలు గా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఐటీఐ, ఏటీసీల్లో మొత్తం 376 సీట్లుకుగానూ 344 భర్తీ కాగా 32 సీట్లు మిగిలి ఉన్నాయి. ఐటీఐలో 204 సీట్లుకుగానూ 197 భర్తీ కాగా ఏడు సీట్లు, ఏటీసీలో 172 సీట్లకుగానూ 147 భర్తీ కాగా 25 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆధునిక పరికరాలతో కొత్త కోర్సులు...పరిశ్రమల డిమాండ్కు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏటీసీలను ఏర్పాటు చేశారు. కోర్సులకు సంబంఽధించిన ఏటీసీ భవనంలో ఆధునాతన పరికరాలు అమర్చారు. డెల్ వర్క్ స్టేషన్, ఐవోటీ కిట్, సర్వర్ రాక్, త్రీడీ ప్రింటర్, కార్ లిప్ట్, సిల్, ఫెయింట్ బాత్, ఇండస్ట్రియల్ రోబోటెక్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్ (సీఎన్సీ), వీఎంసీ, ప్లంబింగ్ పరికరాలు బిగించారు. టాటా టిగోర్, టాటా ఏసీ, ఈవీ కిట్, మహేంద్ర త్రీవీలర్ పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది నుంచి ఏటీసీ ప్రవేశాలకు అవకాశం కల్పించారు. సద్వినియోగం చేసుకోవాలి ఐటీఐ, ఏటీసీలో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 28 వరకు గడువు ఉంది. ప్రతీరోజు ఉదయం ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అనంతరం మెరిట్ లిస్టు ఆధారంగా వాక్ ఇన్–ఇంటర్వ్యూలుంటాయి. పదోతరగతి మెమో, బోనఫైడ్, కులధ్రువీకరణ, ఆధార్కార్డు, పాస్పోర్టుసైజ్ ఫొటో, టీసీ సమర్పించాలి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రమేశ్, ఐటీఐ ప్రిన్సిపాల్, మంచిర్యాల -
ఆలయంలో చోరీకి పాల్పడిన ముగ్గురు అరెస్ట్
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయంలో శనివారం చోరీ జరుగగా నిందితులను 24 గంటల్లోనే పట్టుకున్నట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పోలీస్స్టేషన్లో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఆర్చకుడు ఆదివారం ఉదయం ఆలయానికి వచ్చి చూడగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపల హుండీ పగులగొట్టి కానుకలను చోరీ చేశారు. కాగా, ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు వెంటనే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. క్యాతనపల్లిలో అనుమానాస్పదంగా నలుగురు కనిపించారని, వారు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా అందులో ముగ్గురిని పట్టుకున్నామని తెలిపారు. వారిని విచారించగా చోరీ చేసింది తామేనని ఒప్పుకున్నారని, వారి వద్ద నుంచి రూ.4 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడన్నారు. ఈ మేరకు ముగ్గురు నిందితులు కుంటాల భీమయ్య, మడక చిరంజీవి, కడమంచి శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
ఆసిఫాబాద్అర్బన్/భైంసారూరల్/కాగజ్నగర్టౌన్: ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలోని పాఠశాల ల విద్యార్థులు అపూర్వ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆసిఫాబాద్లోని శ్రీ వాసవి ఉన్నత పాఠశాలలో 1996–2004 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం రోజ్గా ర్డెన్లో, కాగజ్నగర్లోని సంతోష్ ఫంక్షన్ హాల్లో బాలభారతి ఉన్నత పాఠశాల 2002–03 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు, భైంసా మండలంలోని దేగాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 2001–02 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు చదువుల తల్లి ఒడిలో క లుసుకున్నారు. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలు సుకున్నారు. చిన్ననాటి గుర్తులను నెమరువేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. సుబ్బా మ హేశ్, ఇందారపు బాలకిషన్, ప్రసాద్, సతీశ్, తిరుమల్రావ్, చిత్రాని, చందన, శ్రీనివాస్, బెలే ప్రకాశ్, వామన్రావు, విఠల్ పాల్గొన్నారు. -
రాసేవారు ‘లేఖ’!
నిర్మల్ఖిల్లా: సర్ పోస్టు..మేడమ్ పోస్టు..పల్లెల్లోకై న, పట్టణాల్లో ఉత్తరాలు మోసుకొచ్చే వారధి పోస్టుమాన్. సైకిల్పై వచ్చి బెల్ మోగిస్తూ చేతిలో ఉత్తరాన్ని పెడితే చదవాలనే ఆతృత ఉండేది. సైన్యంలో పహారా కాస్తున్న జవాను.. తల్లిదండ్రులు, భార్యకు లేఖ ద్వారా ఇచ్చిన సందేశం. నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న కబురందించే ఉత్తరం. మనసులో మాటను చెప్పలేక కవితలు రాసిన ప్రేమ భావం. సెలవులకు పిల్లలతో కలిసి ఇంటికి రమ్మని పిలుస్తూ కూతురు, అల్లుడికి అందించే ఆహ్వానం. క్యాంటీన్ ఖర్చులు, పుస్తకాలకు డబ్బులు పంపమని నాన్నగారికి విన్నపం. ఇలా సందర్భమేదైనా అన్ని రకాల భావాలను అందించే లేఖ ప్రస్తుతం రాసేవారు కరువయ్యారు. మారుతున్న కాలంతోపాటు ఉత్తరం కనుమరుగైంది. 90వ దశకం వరకు.. జిల్లాలో 90వ దశకం వరకు ఉత్తరాల బట్వడా జో రుగా కొనసాగింది. ‘తోక లేని పిట్ట తొంబై ఆమడలు పోయే’, ‘రెక్కలు లేని పిట్ట గూటికి సరిగ్గా చేరింది’అంటూ చిన్నారులకు ఇంట్లో పెద్దలు, నానమ్మ, తాతయ్యలు ‘ఉత్తరం’పై పొడుపు కథలు అల్లేవారు. నాడు ఆత్మీయుల ప్రేమ, ఆశీర్వాదాలను, మోసుకొచ్చే ఉత్తరం కాలక్రమంలో కానరాకుండా పో యింది. పెరిగిన సాంకేతికత కారణంగా ఇది కాలగర్భంలో కలిసిపోయింది. వాటి స్థానాన్ని స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్, కొరియర్లు ఆక్రమించాయి. కనుమరుగవనున్న ‘రిజిస్టర్డ్ పోస్టు సేవలు’! 1854 సంవత్సరం బ్రిటిష్ కాలంలో మన దేశంలోకి ప్రవేశపెట్టబడిన పోస్టుబాక్సులు ఇకపై కనుమరుగు కాానున్నాయి. 180 ఏళ్ల నుంచి పెనవేసుకున్న ఈ బంధం ఇక తెగిపోనుంది. రెండు దశాబ్దాల క్రితం వరకు ప్రజలు పోస్టుబాక్సులు, ఉత్తరాలతో విడదీయరాని బంధాన్ని పెనవేసుకున్నారు. బంధువులు, స్నేహితులకు రాసిన ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డ్స్, అభిమాన రచయితలు, సినీతారలకు రాసిన లెటర్స్తోపాటు ఊరుపేరు లేకుండా రాసే ఆకాశరామన్న ఉత్తరాలు ముందు ఈ పోస్టుబాక్సుల్లో పడేస్తే..అక్కడి నుంచి చేరాల్సిన చోటుకు చేరేవి. పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా పోస్టుబాక్సులు తొలగించనున్నారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు నిలిపివేయనున్నట్టు శాఖాధికారులు వెల్లడిస్తున్నారు. రెండు దశాబ్దాల నుంచి ఇంటర్నెట్, డిజిటల్ కమ్యూనికేషన్ల వల్ల సాధారణ రిజిస్టర్ పోస్టులు, పోస్టు బాక్సుల ఉపయోగం గణనీయంగా తగ్గిపోయింది. ఇకపై ఈ సేవను స్పీడ్పోస్ట్లో విలీనం చేయడం ద్వారా, పోస్టల్ డిపార్ట్మెంట్ ట్రాకింగ్లో మరింత ఖచ్చితత్వాన్ని, డెలివరీ వేగాన్ని, ఆపరేషనల్ ఎఫిషియన్సీని మెరుగుపర్చాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తపాలా సేవల్లో మార్పులు తపాలా సేవలో మార్పులు వచ్చాయి. ఒకనాడు ఉత్తరాల బడ్వాడాకు, మనీ ఆర్డర్లు పంపేందుకు, పొదుపు పథకాలు అందించేందుకు ప్రధాన కేంద్రాలుగా పోస్టాఫీసులు ఉన్నాయి. నేడు ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు సేకరిస్తూ, బీమా పాలసీలు అందిస్తూ బ్యాంకులుగా రూపాంతరం చెందాయి. ప్రజలు కూడా అందివచ్చిన టెక్నాలజీ, స్మార్ట్ఫోన్లకు అలవాటుపడ్డారు. సెల్ఫోన్లు విరివిగా వినియోగించడం వంటి కారణాలతో ఉత్తరాలు కనుమరుగయ్యాయి. పార్సిళ్ల వంటివి పంపాలంటే ప్రైవేటు సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం పోస్టాఫీసుల్లో పోస్టుకార్డులు, ఇన్లాండ్, బుక్పోస్టు లెటర్లు కనిపించడం లేదు. -
రైలు నుంచి జారిపడి యువకుడికి గాయాలు
తాండూర్: గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి యువకుడు గాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రం కొత్తపల్లి వారసంత సమీపంలోని రైల్వేట్రాక్పై రైలులో హైదరాబాద్కు చెందిన మహేశ్ జారిపడటంతో గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్కు వెళ్లే క్రమంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని యువకుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం తాండూర్ పీహెచ్సీకి తరలించి వైద్యం అందించారు. 108 ఈఎంటీ ప్రశాంత్, పైలెట్ అన్నం తిరుపతి ఉన్నారు. -
వర్షానికి కూలిన ఇల్లు
కుంటాల: మండలంలోని ఆయా గ్రామాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లింబా(బి) గ్రామంలోని దృపతి బాయి నివసిస్తున్న ఇల్లు కూలింది. ఆ ఇంటిని అధికారులు ఆదివారం పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దని తహసీల్దార్ కమల్సింగ్ సూచించారు. ఆయన వెంట ఆర్ఐ అడెల్లు, పంచాయతీ కార్యదర్శి గంగాప్రసాద్ తదితరులు ఉన్నారు. రెబ్బెనలో.. భీమిని: కన్నెపల్లి మండలంలోని రెబ్బెనలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గోమాస రాజేందర్ చెందిన ఇల్లు కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామాంజనేయులు ఆదివారం ఆ ఇంటిని పరిశీలించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
వర్షార్పణం
వేమనపల్లి: ఇటీవల కురిసిన కుండపోత వర్షానికి మండలంలో వరి, పత్తి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. మండల కేంద్రంలోని రాజారాం శివారు నుంచి వచ్చిన వరదతో 250 ఎకరాల్లో వరి, 300 ఎకరాల్లో పత్తి, కల్మలపేట, గొర్లపల్లి, కేతన్పల్లి, జాజులపేట, సుంపుటం, నీల్వాయి, దస్నాపూర్ శివారుల్లో పత్తి పంటలు వరదపాలయ్యాయి. నాగారాం, బుయ్యారం, మామిడిపల్లి, చామనపల్లి గ్రామాల్లో ఒర్రెలు, పెద్దవాగు ఉప్పొంగి 250 ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీటమునిగాయి. మామడకు వెళ్లే ఒర్రైపె తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. మామిడిపల్లి, బొమ్మెన రూట్లో కల్వర్టు కొట్టుకుపోయింది. బుయ్యారం గ్రామ సమీపంలో ఉన్న పైపు కల్వర్టుపై కందకం ఏర్పడింది. చామనపల్లి వాగులో వరద పోటెత్తడంతో అసంపూర్తి వంతెన మునిగిపోయి ఇరువైపులా ఒడ్డు కోతకు గురైంది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి గ్రామపంచాయతీకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
కరెంట్ షాక్తో మహిళ..
నెన్నెల: మండలంలోని కోణంపేట గ్రామానికి చెందిన దుర్గం తార (59) ఆదివారం సాయంత్రం కరెంట్ షాక్తో మృతి చెందింది. ఇంట్లో కూలర్ ఆఫ్ చేసే క్రమంలో విద్యుదాఘాతంతో కిందపడింది. పొరుగు వారు గమనించి కర్రతో కొట్టి పక్కకు తొలగించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వర్షానికి ఇల్లు ఉరిసి నేల తడిగా ఉండటం, కూలర్ బాడీ ఇనుపది కావడంతో కరెంట్ షాక్ వచ్చిందని భావిస్తున్నారు. భర్త బాపు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం
పాతమంచిర్యాల: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు సంఘాలు వి ఫలమయ్యాయని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కార్మికుల సమస్యలను గత టీబీజీకేఎస్ విస్మరించిందన్నారు. ఎన్నికల్లో గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ లు సర్కార్కు తొత్తులుగా మారాయన్నారు. సింగరేణి ఉద్యోగులకు సొంతింటికి 2 గుంటల భూమి ఇవ్వాలని, మారుపేర్ల సమ స్య పరిష్కరించాలని, ఓపెన్ కాస్టులు రద్దు, నూతన భూగర్భగనులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నూతన గనులు ఏర్పాటు కోసం ప్రజా, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో ఉద్య మం చేపడుతామన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, ఉపాధ్యక్షుడు దాసరి జనార్దన్, జిల్లా అధ్యక్షుడు జైపాల్సింగ్, బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి సమ్ము రాజన్న పాల్గొన్నారు. నీల్వాయి ఎస్సై సస్పెన్షన్వేమనపల్లి: ఎట్టకేలకు నీల్వాయి ఎస్సై ఇ.సురేష్ను సస్పెండ్ చేస్తూ రామగుండం పోలీస్ క మిషనరేట్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నెల 11న మండలంలోని సుంపుటం గ్రా మానికి చెందిన భార్యభర్తల గొడవలో భర్త కిష్టయ్యను స్టేషన్కు పిలిపించి చితకబాదాడు. కౌ న్సెలింగ్ పేరుతో రూ.10 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడు పోలీ స్ కమిషనరేట్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. సమగ్ర విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేశారు. -
మానసికంగా తీరనిలోటు
జీవితానికి ఆత్మీయత అనుబంధాలకు ఉత్తరం లేఖ అనేది ఒక గవాక్షం లాంటిది. సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన ఘనత ఉత్తరానిదే. ఉత్తరం అంటే నాలుగు వాక్యాలు రెండు మడతలు కానే కాదు..ఆ ఉత్తరం కనుమరుగవ్వడం మానసికంగా తీరని లోటు.. లేఖ సాహిత్యం అనేది ఒక ఆత్మీయ ప్రపంచం అది అంతర్థానమవడం బాధాకరం. – టి.సంపత్ కుమార్, నవలా రచయిత, నిర్మల్ గుర్తించలేకపోతున్నారు ఉపాధ్యాయుడిగా ఉద్యోగావకాశం వచ్చిందని నాలుగుదశాబ్దాల క్రితం ఉత్తరం ద్వారా తెలిసింది. ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. పెరిగిన టెక్నాలజీ అనుగుణంగా ప్రస్తుతం కంప్యూటర్, స్మార్ట్ఫోన్ల వినియోగం ఎక్కువైంది. లేఖ ప్రత్యేకతను ప్రజానీకం గుర్తించలేకపోతున్నారు. – గాంధారి మురళీధర్, రిటైర్డ్ టీచర్, వడ్యాల్ సేవల్లో మార్పులు వ్యక్తిగత కుటుంబ పరమైన ఉత్తరాల ప్రాధాన్యత తగ్గుతోంది. రాఖీ పర్వదినం వంటి సందర్భాల్లో మాత్రం తోడబుట్టిన వారికి రాఖీ పంపిణీ ఇప్పటికీ పోస్ట్ ద్వారానే కొనసాగుతోంది. పోస్టాఫీస్ ఆధునాతన సేవలతో మార్పులు జరుగుతున్నాయి. – కె.వెంకట్రావు, సబ్ పోస్ట్మాస్టర్ గ్రేడ్–2, నిర్మల్ -
భారీ వృక్షాలు నరికివేత
కై లాస్నగర్: పచ్చదనం పెంపొందించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఓ వైపు అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు ప్రచారం చేస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటం అధికారుల నిర్వాకానికి నిదర్శనంగా నిలుస్తోంది. జిల్లాకేంద్రంలోని జగ్జీవన్ రాంచౌక్లో గల జెడ్పీ క్వార్టర్స్ వద్ద భారీగా పెరిగిన నీలగిరి, వేప వృక్షాలను నరికివేసి ట్రాక్టర్లో విక్రయానికి తరలించడం విస్మయానికి గురిచేసింది. ఏళ్లనాటి పెద్దపెద్ద చెట్లను నరికివేయడమేంటనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాల్టా చట్టాలు అమలు చేయాల్సిన అధికారులే ఉల్లంఘించడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై జెడ్పీ సిబ్బందిని సంప్రదించగా భారీగా పెరిగిన వృక్షాలు క్వార్టర్స్పై పడే ప్రమాదమున్నందున అధికారుల అనుమతితోనే నరికివేసినట్లు తెలిపారు. -
సమస్యలు పరిష్కరించడంలో విఫలం
నస్పూర్: సింగరేణి కార్మికవాడల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమైందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ)రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 కాలనీ, నస్పూర్ డిస్పెన్సరీ ఏరియాలోని కాలనీల్లో ఆదివారం ఆయన బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. కాలనీల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మిక కుటుంబాలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు పలు క్వార్టర్లలో ఊరుస్తోందన్నారు. వర్షపు, డ్రెయినేజీ నీరు ఇళ్లలోకి చేరడంతో సామగ్రి తడిసిపోవడంతో కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. శ్రీరాంపూర్ బ్రాంచి అధ్యక్షుడు గుల్ల బాలాజి, బ్రాంచ్ నాయకులు పాల్గొన్నారు. -
చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి
జన్నారం:చేపలు పట్టేందుకు వెళ్లి ప్ర మాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై గొల్లపెల్లి అ నూష కథనం ప్రకా రం.. జన్నారం మండలం కొత్తపేట గ్రామం కొలాంగూడకు చెందిన ఆత్రం భీము (30) ఆదివారం ఉదయం కొత్తపేట చెరువు అలుగు రావడంతో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో కాలుజారి నీటిలో మునిగాడు. ఈత రాకపోవడంతో మృతిచెందాడు. అటుగా వెళ్తున్నవారు గమనించి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. ఎస్సై ఘ టనస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు మృతదేహాన్ని అప్పగించారు. తండ్రి అర్జున్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పర్వతారోహణకు మంచు అడ్డు
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని కెలికే గ్రామానికి చెందిన గిత్తె కార్తీక్ హిమాచల్ప్రదేశ్లోని మౌంట్ యూనామ్ పర్వతారోహణకు మంచు అడ్డు తగిలింది. ఫలితంగా ఆయన ఆశయం నీరు గారింది. కార్తీక్ ఈనెల 9న మనాలి నుంచి మౌంట యూనామ్ పర్వతారోహణకు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 10వ తేదీ నుంచి 12 వరకు 3,650 మీటర్ల ఎత్తులో ఉన్న స్పిటిక్వాలిలోని కాజాకు చేరుకున్నారు. దీన్ని కానామో పర్వతమని పిలుస్తారు. 13న కాజా నుంచి కిబ్బర్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడే ఫైనల్ ట్రెక్ చేశారు. 14న కానామో బేస్ క్యాంప్ నుంచి వారి ప్రయాణం ప్రారంభమైంది. కొంతదూరం వెళ్లాక సేదతీరారు. 15న శిఖరానికి చేరుకుని త్రివర్ణ పతాకం అధిరోహించాలని 14న అర్ధరాత్రి ఆయన ప్రయాణం ప్రారంభించాలని అనుకున్నాడు. 15 ఉదయం వరకు 7 గంటల వరకు మంచుపాతం మొదలైంది. వాతావరణం అనుకూలించక యూనామ్ పర్వతాన్ని అధిరోహించలేక నిరాశతో వెనుతిరిగాడు. మరో వంద కి.మీ ఎత్తుకు వెళ్లగలిగితే అధిరోహించేవాడు. మొత్తం 5,900 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి నిరాశతో వెనుదిరిగి వచ్చాడు. కార్తీక్తోపాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆనంద్బాబు, నక్ష్ ఉన్నారు. -
గల్లంతైన వ్యక్తి కోసం సెర్చ్ ఆపరేషన్
కడెం: కడెం వరదలో గల్లంతైన కన్నాపూర్కు చెందిన తిప్పిరెడ్డి గంగాధర్ జాడ కోసం పాండ్వపూర్ వంతెన వద్ద ఎస్పీ జానకీ షర్మిల ఆదివారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఎన్డీఆర్ఎఫ్, మత్స్యకారులు, డ్రోన్ కెమెరాతో గాలింపు చర్యలు చేపట్టారు. కడెం, దస్తురాబాద్ మండలాల్లోని కడెం నది వెంట గాలించారు. రాత్రి వరకు జన్నారం మండలం కలమడుగు వరకు చేరారు. కడెం, గోదావరి వెంట జల్లెడ పట్టిన ఆచూకీ లభించలేదు. ఒక వైపు కడెం ప్రాజెక్ట్పై నుంచి దిగువ, కన్నాపూర్ చెరువు మార్గం, గ్రామ శివారు గల చేన్ల నుంచి వెళ్లేమార్గాల్లో బారికేడ్లు పెట్టి మూసివేశారు. సీఐ అజయ్, ఎస్సై సాయికిరణ్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గంగాధర్ తిరిగిరావాలని కుటుంబ సభ్యులు ఆశతో ఎదురుచూస్తున్నారు. కడెం ప్రాజెక్ట్ సందర్శన.. కడెం ప్రాజెక్ట్ను ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ సందర్శించారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో, 18 వరద గేట్ల పని తీరును తెలుసుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మల మల్లేశ్యాదవ్, నాయకులు భూమేశ్, తదితరులు ఉన్నారు. కాగా, వరదల కారణంగా మూడు రోజులుగా బోటింగ్ నిలిచిపోయింది. ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల భద్రత దృష్ట్యా పర్యాటకులకు అనుమతి ఇవ్వడం లేదు. -
ఘనంగా వాజ్పేయి వర్ధంతి
చెన్నూర్: చెన్నూర్ బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్పేయి వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ ప్రధానిగా చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, నాయకులు బత్తుల సమ్మ య్య, కొండపాక చారి, జాడి తిరుపతి, ఎతం శివకృష్ణ, కేవీఏం శ్రీనివాస్, వెంకటనర్సయ్య, మంచాల రాజబాపు పాల్గొన్నారు.కేకే–5 గనిలో మాక్ రిహార్సల్ మందమర్రిరూరల్: రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మందమర్రి ఏరియాలోని గనుల్లో పనులు కొంతమేరకు స్తంభించాయి. శనివారం కేకే–5 గని పైభాగంలో పాలవాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. దీంతో గని అధికారులు మొదటి షిఫ్టు కార్మికులకు పలు సూచనలు చేశారు. సుమారు గంట సేపు గనిలో రక్షిత ప్రదేశానికి చేర్చి.. గనిలోకి వాగు నీరు ప్రవేశిస్తే తీసుకోవాల్సి న రక్షణ చర్యలపై మాక్ రిహార్సల్ ద్వారా వివరించారు. వరద గనిలోకి వస్తే సైరన్ మోగిస్తారని గని ఏజెంట్ రాంబాబు, మేనేజర్ శంభునాథ్ పాండే తెలిపారు. సుమారు 30ఏళ్ల క్రితం పాలవాగు వరద ఉధృతికి రంధ్రం ఏర్పడి గనిలోకి వరదనీరు ప్రవేశించింది. అప్పుడు అధికారులు కార్మికులను అప్రమత్తం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా, వరద తీవ్రతను గమనించేందుకు పర్యవేక్షణ అధికారిని ఏర్పాటు చేశారు. -
గిరిజనేతరుల చేతిలో వేల ఎకరాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అటవీ భూములు సా గు చేస్తున్న వేలాది గిరిజనేతరులు తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా బీసీ, ఎస్సీలు అటవీ భూముల ఆధారంగానే జీవి స్తూ సాగు చేసుకుంటున్నారు. గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్(అటవీ హక్కుల గుర్తింపు) కింద పట్టాలు ఇచ్చారు. కానీ గిరిజనేతరులకు అవకాశం లేదు. దీంతో ఏటా సీజన్లో ఆ భూముల్లో విత్తనాలు వేసే సమయంలో ఆక్రమణదారులు, అటవీ అధికారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల తిరిగి స్వాధీనం చేసుకుని మొక్కలు నాటుతున్నారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్తులను అటవీ అధికారులు సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుకు పాదయాత్ర చేపట్టగా, మధ్యలోనే పోలీసులు అడ్డుకుని తీసుకొచ్చారు. బీసీ, ఎస్సీలు అధికం అటవీ భూములను గిరిజనులతోపాటు బీసీ, ఎస్సీ ఇతర వర్గాలు వేలాది మంది సాగు చేస్తున్నారు. వీరికి సైతం పట్టాలు ఇవ్వాలని డిమాండ్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం పక్కన పెట్టింది. మూడేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా 1.50లక్షల మంది గిరిజన రైతులకు 4.05లక్షల ఎకరాల్లో హక్కులు కల్పించారు. చట్టం ప్రకారం గిరిజనులకు మాత్రమే హక్కులు ఉన్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాల్లోనూ గిరిజనేతరులు సాగులో ఉన్నారు. రిజర్వు ఫారెస్టుతోపాటు పులుల సంరక్షణ కేంద్రమైన కవ్వాల్ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా 1.29లక్షల ఎకరాలు ఆక్రమణలో ఉంది. గిరిజనేతరులతోపాటు కొన్ని చోట్ల గిరిజనులు సైతం కొత్తగా ఆక్రమణలకు పాల్పడుతుండడంతో అడవుల సంరక్షణ మరింత ఇబ్బందిగా మారిందని అధికారులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే.. నిజాం కాలం నుంచే అటవీ ఆక్రమణలు ఉన్నప్పటికీ గత 20ఏళ్లలో ఈ ఆక్రమణలు తీవ్రంగా పెరిగాయి. పత్తి సాగు మొదలైనప్పటి నుంచి గిరిజనులతోపాటు గిరిజనేతరులు సైతం పెద్ద ఎత్తున చెట్లను నరికి సాగులోకి వచ్చారు. ఆ సమయంలో కొంతమంది సిబ్బంది అవినీతితో ఇష్టారీతిన ఆక్రమణలు జరిగాయి. మరికొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల నిర్లక్ష్యం, తదితర కారణాలతోనూ రిజర్వు ఫారెస్టుల్లో సాగు మొదలైంది. ఆ భూములే తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే సామాజిక సమస్యగా మారింది. దిందాలో ఒక్కొక్కొరు 40ఎకరాల వరకు.. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బందెపల్లి, దిందాలో పరిధిలో ఒక్కో కుటుంబం ఎకరం నుంచి 42ఎకరాల వరకు ఆక్రమించారు. ఇందులో పది నుంచి 30ఎకరాల వరకు సాగులో ఉన్నారు. ఇక్కడ 530ఎకరాల్లో గిరిజనులకు పట్టాలు ఇచ్చారు. రిజర్వు ఫారెస్టులో 2600ఎకరాలు ఆక్రమణలో ఉంది. అయితే 600ఎకరాలను సాగుదారులకు వదిలేశారు. మిగతాది గిరిజనేతరుల నుంచి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా వివాదం రాజుకుంటోంది. -
ప్రజలు ఆందోళన చెందవద్దు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. శని వారం గుడిపేట శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రాజెక్ట్ అధికారులతో కలిసి సందర్శించారు. వరదలు, వర్షాలకు సంబంధించి అత్యవసర సేవలకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం నంబర్ 08736–250501లో సంప్రదించాలని తెలిపారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. కడెం ప్రాజెక్ట్ నుంచి భారీ నీటి విడుదలతో వరద ఉధృతి పెరిగే అవకాశంతోపాటు రానున్న 36 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉన్నందున రెడ్ అలర్ట్గా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 90 మంది సభ్యులతో కూడిన 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ముందస్తుగా పునరావాస ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. ఎల్లంపల్లి డీఈ బుచ్చిబాబు, హాజీపూర్ తహశీల్దార్ శ్రీనివాసరావుదేశ్పాండే ఉన్నారు. కాగా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు తెరుస్తున్నారనే సమాచారం తెలియడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. దెబ్బతిన్న రోడ్డు పరిశీలన కోటపల్లి: మండలంలోని లింగన్నపేట–ఎదులబంధం గ్రామాల మధ్య తుతుంగ వాగు ఉధృతికి రోడ్డు దెబ్బతిని పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్ శనివారం సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత రోడ్డు మరమ్మతు చేయాలని ఆర్అండ్బీ ఆధికారులను అదేశించారు. -
ప్రయాణికులను కాపాడిన సీఐ
ఖానాపురం: వరద నీటిలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని వరంగల్ జిల్లా దుగ్గొండి సీఐ సాయిరమణ కాపాడారు. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన బాస లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ, రితిక, రితిన్ భద్రాచలానికి కారులో వెళ్తున్నారు. ఖానాపురం మండలంలోని చిలుకమ్మనగర్–కొత్తగూడ మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో చిక్కుకుపోయారు. వెంటనే లక్ష్మీనారాయణ పోలీసులకు సమాచారం అందించారు. డీజీ కంట్రోల్ కార్యాలయం నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో సీఐ సాయిరమణ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు చిలుకమ్మనగర్కు చేరుకుని గ్రామస్తుల సహకారంతో వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సదరు కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
కాలనీలు జలమయం
తాండూర్: నర్సాపూర్ దారిలో వెళ్లకుండా ఏర్పాట్లునెన్నెల: అప్రోచ్ రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న ఎర్రవాగులక్సెట్టిపేట: పోతపల్లి దారిలో నీటి ప్రవాహంనెన్నెలలో నీట మునిగిన పత్తి పంటమంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన వర్షానికి పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో జలమయంగా మారాయి. హైటెక్ కాలనీలోని డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచి చెరువును తలపించాయి. ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లోని రోడ్లు జలమయం కాగా, పలు దుకాణాల్లోకి నీరు చేరింది. డ్రెయినేజీల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతోనే మురుగునీరు దుకాణాల్లోకి చేరిందని వాపోయారు. ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస థియేటర్కు వెళ్లే దారిలో ఒక వైపు మాత్రమే డ్రెయినేజీ ఉండడం, వరద నీరు వెళ్లక రోడ్డుపై నిలిచి, ఇళ్లలోకి చేరి వస్తువులు పాడయ్యాయి. సూర్యనగర్, చున్నంబట్టివాడ, పాతమంచిర్యాలలోని శ్రీలక్ష్మీ కాలనీ, బృందావనం కాలనీల్లోని రోడ్లు, ఇళ్లను వరద నీరు చుట్టిముట్టింది. సూర్యనగర్లోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చున్నంబట్టి వాడలోని రోడ్లు నీట మునిగడంతో వాహనదారులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పాతమంచిర్యాలలోని శాలివాహన పవర్ ప్లాంటు నుంచి వరద నీరు సమీప కాలనీల్లోకి చేరింది. రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహించగా, కాజ్వేపై వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహించడంతో సమీప కాలనీ ప్రజలు భయాందోళన చెందారు. డీసీపీ భాస్కర్ రాళ్లవాగు, పట్టణంలోని లొతట్టు ప్రాంతాలను సందర్శించారు. రైల్వే అండర్బ్రిడ్జిలు, సీతారామ కాలనీ, బృందావనం కాలనీ, సూర్యనగర్ కాలనీల్లోని రోడ్లు వరదలో మునిగాయి. మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 8.30గంటల వరకు 53 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8.30గంటలకు భారీ వర్షం కురవడంతో మధ్యాహ్నం వరకు జనజీవనం స్తంభించింది. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహించి అతలాకుతలమైంది. చెరువులు, కాలువలకు గండ్లు పడడంతో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. కన్నెపల్లి, భీమిని, మందమర్రి, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, కాసిపేట, నెన్నెల, కోటపల్లి మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కోటపల్లి మండలం జనగామ గ్రామంలో చెన్నూర్ కవిత ఇల్లు కూలింది. పత్తి, వరి పొలాల్లో వరద నీరు చేరడంతో చెరువులను తలపించాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వరద, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద చేరడంతో 11గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎడతెరిపి లేని వర్షానికి శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి ఏరియాల్లోని ఓపెన్కాస్టుల్లో భారీగా వరద నీరు చేరి 20వేల మెట్రిక్ టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి రూ.కోట్ల నష్టం వాటిల్లింది. స్తంభించిన రాకపోకలు కన్నెపల్లి మండలంలో అత్యధికంగా 140.8 మిల్లీమీటర్లు, భీమిని మండలంలో 118.5మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కన్నెపల్లి, జజ్జరవెల్లి ఎర్రవాగు, చిన్నతిమ్మాపూర్ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టణ, గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. ఒర్రెలు, వాగులపై నిర్మించిన చెక్డ్యాంలు పొంగి పొర్లడంతో 57 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. కాసిపేట, భీమారం, వేమనపల్లి, నెన్నెల మండలాల్లో 24 గ్రామాలకు, కోటపల్లి మండలం ఎదులబంధం, తూతుంగ వాగు, నక్కలపల్లి ఒర్రె ఉప్పొంగడంతో 14గ్రామాలకు, భీమిని, కన్నెపల్లి మండలంలో ఎర్రవాగు, జన్కాపూర్ చెరువు, ఒర్రెలు పొంగి ప్రవహించడంతో 19గ్రామాలకు, నెన్నెల మండలం ఎర్రవాగు ఉప్పొంగడంతో దమ్మిరెడ్డిపేట, ఖర్జీ జంగల్పేట, కోనంపేట తదితర ఏడు గ్రామాలకు, చెన్నూర్ మండలంలో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి పరవళ్లు మహారాష్ట్రతోపాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది, గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో గేట్లు ఎ త్తి లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. నీల్వాయి ప్రాజెక్టు నుంచి 100 క్యూసెక్కులు మత్తడి ద్వారా దిగువకు వెళ్తోంది. ‘ఎల్లంపల్లి’ 20 గేట్ల ఎత్తివేతమంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట వద్దనున్న ఎల్లంపల్లి(శ్రీపాదసాగర్) ప్రాజెక్టు గేట్లు శనివారం ఎత్తారు. దీంతో దిగువన గోదావరి నదిలోకి నీరు పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకు గాను శనివారం 18.750 టీఎంసీల నీటిమట్టంతో ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్లో 1.62లక్షల క్యూసెక్కులు, ఎగువ ప్రాంతాల నుంచి 55వేల క్యూసెక్కులు మొత్తంగా 2.16లక్షల క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లిలోకి చేరుతోంది. దీంతో సాయంత్రం 6గంటల నుంచి అధికారులు మొదట 10గేట్లు ఎత్తారు. రాత్రి 7గంటల ప్రాంతంలో 20గేట్లకు పెంచా రు. గేట్లు ఎత్తడం ద్వారా 3.13లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 286 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, నంది పంప్హౌజ్కు 12,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. కాగా, గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 15టీఎంసీల నీటిమట్టంతో ఉండగా గేట్లు ఎత్తలేదు.నెన్నెలలో ఇంట్లోకి చేరిన నీటిని బయటకు తోడేస్తున్న రైతుజిల్లాకు వర్షసూచన జిల్లాలో సాధారణ వర్షపాతం ఇప్పటి వరకు 626.2 మిల్లీమీటర్లు కాగా 536.5 మిల్లీమీటర్లు కురిసింది. సగటున ఇంకా 14 శాతం లోటు నెలకొంది. భీమిని మండలంలో 34శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా ఇంకా 13 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. జిల్లాకు మరో నాలుగు రో జులపాటు ఆరెంజ్, ఎల్లో అలార్ట్ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ సూచిస్తోంది.ముల్కల్లలో జాతీయ రహదారిపై విరిగిపడిన చెట్టుతాండూర్: అచ్చలాపూర్లో ఇంట్లోకి చేరిన నీరుప్రాజెక్టుల్లో నీటిమట్టం వివరాలుప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుత నీటిమట్టం ఇన్ఫ్లో (మీటర్లలో) (మీటర్లలో) (క్యూసెక్కుల్లో) ర్యాలీవాగు 151.50 145.200 200గొల్లవాగు 155.50 150.100 140.772నీల్వాయి 124 124 900జన్నారం: శ్రీలంక కాలనీలో ఇంటిలోకి వరదనీరువర్షపాతం(మిల్లీమీటర్లలో) వివరాలు శుక్రవారం రాత్రి నుంచి ఉదయం వరకు శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకుజన్నారం దండేపల్లి లక్సెట్టిపేట హాజీపూర్ కాసిపేట తాండూర్ భీమిని కన్నెపల్లి వేమనపల్లి నెన్నెల బెల్లంపల్లి మందమర్రి మంచిర్యాల నస్పూర్ జైపూర్ భీమారం చెన్నూర్ కోటపల్లి54.2 32.8 56.1 44.4 92.1 15.8 9.7 31.5 84.6 74.9 40.5 52.1 38.2 38.4 61.1 54.3 74.8 98.1 32.5 68.3 49.5 67.5 42.8 65.0 118.5 140.5 10.0 102.3 62.3 30.3 68.3 58.6 24.3 23.3 17.8 22.5 -
‘ఇన్స్పైర్’ అయ్యేదెలా..!
మంచిర్యాలఅర్బన్: బాలల ఆలోచనలకు పదును పెడితే అద్భుతం ఆవిష్కృతమవుతుంది. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏటా కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ మండలి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఇన్స్పైర్ మనక్ పేరిట విజ్ఞాన మేళా నిర్వహిస్తోంది. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంది. 2025–26 విద్యాసంవత్సరానికి ఇన్స్పైర్ పోటీలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కస్తూర్భా, గురుకుల విద్యాలయాల్లో ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉన్నా స్పందన కరువైంది. జిల్లాలో 335పాఠశాలలు ఉండగా ఇప్పటివరకు 26 స్కూళ్ల నుంచి 115 ప్రాజెక్టుల నామినేషన్లు మాత్రమే వచ్చాయి. జూలై ఒకటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, వచ్చే నెల 15తో గడువు ముగియనుంది. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు తీసుకొచ్చేందుకు చక్కని మార్గమైనా నామినేషన్లు అంతంత మాత్రమే వచ్చాయి. నిర్ధిష్ట గడువులోగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు స్పందిస్తేనే విద్యార్థులకు మేలు జరుగుతుంది. పాఠశాలకు ఐదు చొప్పున ప్రతీ పాఠశాల నుంచి తరగతికి ఒకటి చొప్పున ఐదు ప్రాజెక్టులు తయారు చేయాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్లో ఇన్స్పైర్ మనక్ కాంపిటీషన్ యాప్లో ప్రదర్శనకు సంబంధించిన వీడియో, ఆడియో, ఫొటోలు, పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలి. జిల్లా స్థాయి ప్రదర్శన ఆన్లైన్లోనే న్యాయ నిర్ణయ ప్రక్రియ పూర్తి కానుంది. ఇక్కడ ఎంపికై న విద్యార్థులు రాష్ట్ర స్థాయికి అక్కడి నుంచి జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ల భిస్తుంది. మొదట విద్యార్థులు రూపొందించిన ప్రా జెక్టులను నిపుణులు పరిశీలించి జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికై న ఒక్కో ప్రాజెక్టుకు రూ.10వేల చొప్పున ప్రోత్సాహకం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికై తే రూ.25వేలు, జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చూపితే రాష్ట్రపతి భవన్, జపాన్ సందర్శనకు అవకాశం కల్పించే వీలుంది. ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రాజెక్టులు నమోదవుతున్నా ప్రైవేటు పాఠశాలల నుంచి ఆదరణ లేకుండా పోయింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, అవగాహన లేమితో కొంతమేర ఇన్స్పైర్కు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. బడిలో ఐడియా బాక్స్.. పాఠశాలల్లో దరఖాస్తుల స్వీకరణకు ఐడియా బాక్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో ఇన్స్పైర్పై అవగాహన కల్పించి వారి సృజనాత్మక ఆలోచనలు రాసి ఐడియా బాక్స్లో వేయాలి. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో భౌతిక, రసాయనశాస్త్ర, జీవశాస్త్ర, గణిత, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు నాణ్యమైన ఆవిష్కరణలపై శిక్షణ ఇచ్చారు. టీచర్లు విద్యార్థులు ఐడియా బాక్స్లో వేసిన ప్రాజెక్టు ఆలోచనలకు తుది మెరుగులు దిద్ది ప్రాజెక్టు రూపేణ తీసుకు రావాల్సి ఉంది. నెలన్నర గడుస్తున్నా ఆశించిన మేర నామినేషన్ల దరఖాస్తులు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.గడువులోపు వచ్చేలా చర్యలువిద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఏటా ఇన్స్పైర్ మనక్ అవార్డు పోటీలు నిర్వహిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. నిర్ధిష్ట గడువులోగా అధిక దరఖాస్తులు వచ్చేలా విద్యాశాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతాం. విస్తృ త ప్రచారం చేపట్టడం, మరోసారి టీచర్లకు అవగాహన కల్పించి కొత్త ఆవిష్కరణలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా చొరవ చూపి విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేలా కృషి చేస్తాం. – రాజగోపాల్, జిల్లా సైన్స్ అధికారి -
వాగులో చిక్కుకున్న యువకులు
● తాళ్ల సహాయంతో కాపాడిన స్థానికులు కాసిపేట: మండలంలోని బుగ్గ చెరువు మత్తడిలో చిక్కుకున్న యువకులను స్థానికులు తాళ్ల సహాయంతో కాపాడారు. శనివారం మధ్యహ్నం 12గంటల ప్రాంతంలో బుగ్గగూడెంకు చెందిన మార్నేని సంజీవ్, మార్నేని సంతోష్, మార్నేని సాగర్, బద్ది అరుణ్, ఏదుల శశికుమార్ బుగ్గ చెరువు మత్తడి వాగు దాటి చేపలు పట్టేందుకు అవతలి ఒడ్డుకు వెళ్లారు. వర్షాలకు వాగు ఉధృతి పెరిగింది. దీంతో మొదటి మత్తడి దాటిన యువకులు అటు వైపు కొంత దూరంలో రెండో మత్తడి ఉండడంతో అలాగే ఉండిపోయారు. మార్నేని సంతోష్ ప్రమాదపు అంచున ఇటువైపునకు దాటగా.. మిగతా నలుగురు అటు వైపు ఉండిపోయారు. స్థానిక రైతులు గంటన్నరపాటు ప్రయత్నించి తాడు సహాయంతో ఒక్కొక్కరిని ఇవతలి వైపు దాటించారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నెన్నెల: మండలంలో కురుస్తున్న భారీ వర్షాలు దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలో జలమయమైన ప్రాంతాలు, వాగులను శనివారం పరిశీలించారు. సుంకరివాడలోని నారాయణ, పురంశెట్టి రాకేశ్ ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని తొలగించాలని ఎంపీవో శ్రీనివాస్, కార్యదర్శి సురేశ్ను ఆదేశించారు. ఇళ్లలో నిలిచిన నీరు బయటకు వెళ్లేలా నూతనంగా వేసిన సీసీ రోడ్డు పక్క నుంచి కాలువ తీయాలని, నీళ్లు వెళ్లేందుకు అడ్డంగా ఉన్న మెట్లు తొలగించాలని సూచించారు. తహసీల్దార్, మండల పరిషత్, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ నిలిచిన నీటిని తొలగించే ఏర్పాట్లు చేయాలన్నారు. కొత్తగూడంలో ఏర్పడిన కుమ్మరివాగు ప్రాజెక్టు ఎడమ కాల్వ గండిని సందర్శించి వెంటనే ఇసుక బస్తాలతో పూడ్చాలని ఇరిగేషన్ ఏఈని ఫోన్లో ఆదేశించారు. లంబాడితండా ఎర్రవాగును సందర్శించి పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో అబ్దుల్హై, ఇన్చార్జి తహసీల్దార్ ప్రకాశ్ తదితరులు ఉన్నారు. -
ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
కోటపల్లి: ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్ అన్నారు. శనివారం సుపాక గ్రామంలో ప్రపంచ అదివాసీ దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆదివాసీల సభలో ఆయన మాట్లాడారు. అటవీ హక్కుల చట్టాలను తుంగలో తొక్కుతూ అడవులను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి 2023నూతన అటవీ సంరక్షణ చట్టం తీసుకవవచ్చారని అన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం, నాయకులు నెర్పల్లి ఆశోక్, తలండి ముత్తయ్య, మడే వెంకటస్వామి, మల్లేశ్, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు సంకే రవి, కిసాన్మిత్ర జిల్లా కో అర్డినేటర్ సిడం రమేశ్, మత్య్సకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చందు, మాజీ సర్పంచ్ లక్ష్మణ్గౌడ్, మాజీ ఎంపీటీసీ తిరుపతి పాల్గొన్నారు. -
బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీలు
రెబ్బెన: గోలేటిలో ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించే అంతర్ జిల్లాల బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సత్తాచాటాలని బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి పేర్కొన్నారు. గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా పురుషులు, మహిళల క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. సుమారు 40 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులకు ఈనెల 17 నుంచి 21 వరకు సింగరేణి క్రీడామైదానంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో ప్రతిభ చూపినవారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి మారం శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్రెడ్డి, భాస్కర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు చందర్ ఏఐటీయూసీ నాయకులు జగ్గయ్య, క్రీడాకారుడు నరేశ్ పాల్గొన్నారు. శిక్షణ శిబిరానికి ఎంపిక ఉమ్మడి జిల్లా పురుషుల జట్టుకు కె.సిద్దార్థ్, ఎం.తిరుపతి, పి.పవన్కుమార్, కె. తరుణ్, జి.గోపాల్, పి.శ్రీకాంత్, సాయి చరణ్, టి.దిలీప్కుమార్, పి.దేవరాజ్, ఎం.సూర్యకుమార్, ప్రేంకుమార్, సీహెచ్ గోపాలకృష్ణ, సీహెచ్ వరణ్ ఎంపికయ్యారు. మహిళల జట్టుకు ఏ.స్వప్న, కె.అంజలి, డి.శ్రావణి, జి.అనూష, కె.శ్రీస్పూర్తి కారుణ్య, టి.ప్రజ్వల శ్రీ, పి.వర్షిణి, సుజాత, సాయిదీక్ష, సంజన, అర్చన, వైష్ణవి, హారిక ఎంపికయ్యారు. -
గర్భిణుల తరలింపు
వేమనపల్లి: భారీ వర్షాలు దృష్ట్యా శనివారం వేమనపల్లి పీహెచ్సీ వైద్యాధికారి రాజేష్ ఆధ్వర్యంలో లోతట్టు గ్రామాల్లోని గర్భిణులను సు రక్షిత ప్రాంతాలకు తరలించారు. కళ్లెంపల్లి, జా జులపేట, సుంపుటం గ్రామాలకు చెందిన భారతి, శకుంతల, రోజును వేమనపల్లి పీహెచ్సీ నుంచి అంబులెన్స్లో చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇన్చార్జి హెల్త్ సూపర్వైజర్ రాంశెట్టి బాపు, ఏఎన్ఎం మంజుల, రాజ్యలక్ష్మి, ఈఎంటీ జనార్దన్, పైలెట్ సంపత్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. కులం పేరుతో దూషించిన ఇద్దరిపై కేసుజన్నారం: కులం పేరుతో దూషించిన ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై గొల్ల పెల్లి అనూష తెలిపారు. ఆమె కథనం ప్రకారం..లక్సెట్టిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన రామంటెంకి శ్రీనివాస్కు జన్నారం మండలం రేండ్లగూడ శివారులోని సర్వేనంబర్ 158/4లో ఎకరం పొలం ఉంది. రేండ్లగూడకు చెందిన బాల్త రాజమౌళి ఈ పొలాన్ని దున్నించాడు. ఈనెల 13న రామటెంకి శ్రీనివాస్, తండ్రి రాజలింగుతో కలిసి అక్కడికి వెళ్లి తిరిగివస్తున్నారు. పాతకక్షలు మనస్సులో పెట్టుకుని బా ల్త రాజమౌళి, బాల్త భూమక్కలు శ్రీనివాస్, రా జలింగును కులం పేరుతో దూషించారు. శ్రీని వాస్ ఫిర్యాదుతో శనివారం ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఆత్మహత్యకుంటాల: మండలంలోని లింబా(బి) గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ గాండ్ల సాయినాథ్ (40) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. సాయినాథ్కు గత 20 ఏళ్ల క్రితం రజితతో వివాహమైంది. ఇప్పటివరకు సంతానం కాలేదు. దివ్యాంగుడు కాగా, మద్యానికి బానిసయ్యాడు. శనివారం ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి అశోక్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. మతిస్థిమితంలేని వృద్ధుడుసిర్పూర్(టి): మండలంలోని నవేగాం గ్రామానికి చెందిన రాంటెంకి రుషి(60) శుక్రవారం పెన్గంగ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై కమలాకర్ కథనం ప్రకారం.. రుషి గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతుండేవాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. దహెగాం మండలకేంద్రం శివారులో పత్తి చేనులో అతని బట్టలు దొరకగా శనివారం ఉదయం పెన్గంగ నదిలో మృతదేహం ఆచూకీ లభ్యమైంది. మృతుడి పెద్దనాన్న కుమార్తె యశోదాబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అడవిపంది దాడిలో వ్యక్తి మృతిభీమిని: అడవిపంది దాడిలో వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కన్నెపల్లి ఎస్సై భాస్కర్రావు, స్థానికులు తెలిపిన వివరాలు.. భీమిని మండలం వెంకటపూర్కు చెందిన దాగామ రామయ్య (70) కన్నెపల్లి మండలం సుర్జాపూర్ శివారులో శనివారం పత్తి చేనుకు వెళ్లి వస్తున్నాడు. ఈక్రమంలో అడవి పంది దాడిలో అతడు గాయపడ్డాడు. పక్క చేనులో ఉన్న రైతులు గట్టిగా కేకలు వేయగా అది పరిగెత్తింది. రామయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. అక్కడి నుంచి వెళ్లిన అడవి పంది గురుండ్ల చిరంజీవి, మేకల బాపులపై దాడి చేసి గాయపర్చింది. ఫారెస్ట్ అధికారులు సిబ్బంది, మరికొందరితో కలసి పట్టుకునేందుకు వెళ్లగా అందులో ఒకరిని గాయపర్చినట్లు తెలిసింది. మృతుడి కుమారుడు రాజేశం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి
ఆదిలాబాద్: క్రీడాకారులంతా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని రాష్ట్ర బేస్బాల్ సంఘం అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో తెలంగాణ 5వ సీనియర్ రాష్ట్రస్థాయి బేస్బాల్ చాంపియన్షిప్ (మహిళలు–పురుషులు) పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటిని సమానంగా స్వీకరించాలన్నారు. క్రీడాభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. పది రోజుల పాటు శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని వివరించారు. పోటీల్లో రాష్ట్ర జట్టు విజేతగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.శ్వేత మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతోమంది ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించినవారికి గొప్ప భవిష్యత్తు ఉంటుందన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం శుభపరిణామన్నారు. 33 జిల్లాల నుంచి సుమారు 700 క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి డా.కృష్ణ, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి జ్యోతి, ఉపాధ్యక్షుడు లోక ప్రవీణ్రెడ్డి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, వ్యాయామ ఉపాధ్యాయులు దయానందరెడ్డి, హరిచరణ్, రామ్కుమార్, జిల్లాల నుంచి కార్యదర్శులు, కోచ్లు, మేనేజర్లు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు పురుషుల విభాగంలో ఆదిలాబాద్ కరీంనగర్ జట్టుపై 6–1తో, హైదరాబాద్ నిర్మల్ జట్టుపై 7–1తో, మహబూబ్నగర్ సిద్దిపేట జట్టుపై 7–2తో విజేతలుగా నిలిచాయి. మహిళల విభాగంలో నిజామాబాద్ జట్టు సిద్దిపేటపై 9–0తో, కరీంనగర్ జట్టు మహబూబాబాద్ జట్టుపై 6–5తో, నల్గొండ జట్టు ఆసిఫాబాద్ జట్టుపై 7–4తో విజేతలుగా నిలిచాయి. -
మూగజీవాలను కాపాడిన హెడ్కానిస్టేబుల్
రామకృష్ణాపూర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలోని కార్మికవాడలకు భారీగా వరద నీరు చేరింది. ఆర్కే1 ఏరియా శివారులో పాలవాగుకు ఆనుకుని ఉన్న ఓ వ్యవసాయ భూమిలో పశువుల కోసం ఏర్పాటు చేసిన కొట్టం వరద నీటిలో ముని గిపోతుండగా ఆవుల ఆర్తనాదం విన్నవారు శనివారం పోలీసులకు సమాచారమిచ్చారు. పట్టణ ఎస్సై రాజశేఖర్ వెంటనే స్పందించి హెడ్ కానిస్టేబుల్ జంగును పంపించాడు. వరద ఉధృతిలో ప్రాణాలకు తెగించి ఒక కర్ర సహాయంతో ఈదుకుంటూ వెళ్లి మూగజీవా లను రక్షించాడు. హెడ్ కానిస్టేబుల్ను ఎస్సై, సీఐ శశిధర్రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు అభినందించారు. -
కడెం వరదలో వ్యక్తి గల్లంతు
కడెం/దస్తురాబాద్: చేపల వేటకు వెళ్లి కడెం వరదలో చిక్కుకుని ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కడెం మండలం కన్నాపూర్కు చెందిన తిప్పిరెడ్డి గంగాధర్ (45) శనివారం కడెం గేట్లు ఎత్తడంతో కుమారుడు, మరో వ్యక్తితో కలిసి ప్రాజెక్ట్ గేట్ల దిగువన వెళ్లాడు. రెండు గేట్లు మూసివేయడంతో నీటి ప్రవాహం తగ్గిందని కర్రలతో చేపలు వేటాడేందుకు వెళ్లాడు. అరగంట తర్వాత ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు సైరన్ మోగించి మరో రెండు గేట్లు ఎత్తారు. సమీపంలో వందలాది మంది కేకలు వేసిన గంగాధర్ ఫోన్ చూస్తుండగా ఒక్కసారిగా చుట్టూ నీళ్లు చేరాయి. బయటకు రాలేక, కొద్ది దూరంలో బండపై నిల్చోని కాపాడండి అంటూ కేకలు వేశాడు. వరద ప్రవాహం పెరగడంతో అందరు చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయాడు. 3 కి.మీ మేర మునుగుతూ, తేలుతూ ఈదుతున్నాడు. పాండ్వపూర్ సమీపంలో కడెం వంతెనను దాటి వెళ్లడం అక్కడే ఉన్నవారు, కానిస్టేబుళ్లు నాగరాజు, వంశీ గమనించారు. చెట్లపొదల పక్క నుంచి కొట్టుకుపోతున్న అతన్ని కాపాడేందుకు పరిగెత్తి ప్రయత్నించారు. సుమారు 3 కి.మీ మేర బురదలో వెళ్లిన ఫలితం దక్కలేదు. అదేవిధంగా దస్తురాబాద్ మండలం భూత్కూర్ పంచాయతీ రాంపూర్ గోదావరి తీర ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చేపట్టింది. ఎస్సై సాయికుమార్, తహసీల్దార్ విశ్వంబర్ అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ దొరకకపోవడం, రాత్రి కావడం, వరద ప్రవాహం పెరగడంతో గాలింపును నిలిపివేశారు. కడెం ప్రాజెక్ట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ఎఫ్ బృందం స్పందిస్తే వరదల్లో గంగాధర్ను బయటకు తీసుకువచ్చేవారని స్థానికులు వాపోయారు. గంగాధర్కు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉపాధి నిమిత్తం బిస్కెట్లు, కేక్లు, చాక్లెట్లు తదితర బేకరీ ఐటెమ్స్ను షాపులకు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. కేకలు వేశాం కడెం గేట్లు దూరాన ఉన్న మేము బయటకు రావాలని కేకలు వేశాం. అతను గమనించలేదు. నేను పోతున్నా అంటూ గట్టిగా ఆరిచాడు. 20 నిమిషాల వ్యవధిలో వరదలో కొట్టుకుపోయాడు. – వినయ్, ప్రత్యక్ష సాక్షి -
చిరుత సంచారం
కాగజ్నగర్రూరల్: మండలంలోని సార్సాల పరిసరాల్లో చిరుత సంచరించింది. శుక్రవారం రాత్రి బూరం పోచన్నకు చెందిన గేదె దూడపై దాడి చేసి హతమార్చింది. అదే ప్రాంతంలో కుక్కపై దాడి చేసి చంపింది. శనివారం తెల్లవారు జాము ఓ మహిళకు చెందిన పశువులపై దాడికి యత్నించడంతో అవి తప్పించుకున్నాయని గ్రామస్తులు తెలిపారు. శనివారం ఫారెస్ట్ సెక్షన్ అధికారి సుభాన్, బీట్ అధికారి శ్రీవాణి, సిబ్బందితో సందర్శించి చిరుత పాదముద్రలను సేకరించారు. తక్షణ సహాయం కింద గేదె దూడ యజమానికి రూ.5 వేల పరిహారం అందజేశారు. చిరుతపులి సంచారంపై డప్పు చాటింపు చేశారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో నీటి నిల్వఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్లోకి భారీగా వరద పోటెత్తింది. శనివారం 1.04 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు ప్రస్తుతం 1083 అడుగులు ఉంది. 80.5 టీఎంసీలకుగాను 53.62 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్ నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువ, మిషన్ భగీరథకు వదులుతున్నారు. గోదావరిలో భారీగా వరద నీరు చేరే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారులు సూచించారు. పశువుల, గొర్రెల కాపర్లు, చేపలు పట్టేవారు, రైతులు గోదావరి నదిని దాటే ప్రయత్నం చేయొద్దని పేర్కొన్నారు. – మామడ -
భార్యతో గొడవపడ్డందుకు చితకబాదిన ఎస్సై!
వేమనపల్లి: భార్యతో గొడవపడ్డందుకు తనను ఎస్సై చితకబాదాడని మండలంలోని సుంపుటం గ్రామానికి చెందిన అల్గం కిష్టయ్య ఆరోపించాడు. ఈ మేరకు ఎస్సైపై ఆరే కుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశంతో కలిసి సీపీ, డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సుంపుటం గ్రామానికి చెందిన అల్గం కిష్టయ్య నాలుగేళ్ల క్రితం నీల్వాయి కొత్త కాలనీకి చెందిన భారత ప్రమీలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ప్రమీల పుట్టింటికి వెళ్లడం, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించిన అనంతరం తిరిగి కాపురానికి రావడం జరుగుతుండేది. 20 రోజుల క్రితం అనారోగ్యంతో ప్రమీల పుట్టింటికి వెళ్లింది. దీంతో కిష్టయ్య గత ఆదివారం ఆమె వద్దకు వెళ్లి కాపురానికి రావాలని గొడవ పడ్డాడు. దీంతో ప్రమీలతోపాటు ఆమె తల్లిదండ్రులు నీల్వాయి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై సురేశ్ భార్యాభర్తలకు కౌన్సిలింగ్ చేశాడు. అయితే గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశ్ ద్వారా రూ.10వేలు ఇవ్వాలని ఎస్సై తనను డిమాండ్ చేసినట్లు కిష్టయ్య ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన భార్య, అత్తమామలు, మరికొందరి ముందే ఎస్సై తనను రోకలిబండతో తీవ్రంగా కొట్టాడని కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ విషయమై మూడురోజుల క్రితం రూరల్ సీఐ బన్సీలాల్, ఏసీపీ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. శుక్రవారం రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీకి పోస్టు ద్వారా ఫిర్యాదు కాపీ పంపించినట్లు పేర్కొన్నాడు. ఎస్సై సురేశ్తో తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
పాటాగూడలో తొలిసారి ఎగిరిన జెండా
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని పాటాగూడ గ్రామంలో తొలిసారి జాతీయ జెండా రెపరెపలాడింది. ఇది మారుమూల గ్రామం కావడంతో ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. జోడేఘాట్కు వెళ్లే ప్రధాన రోడ్డు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో ఉంటుంది. అప్పుడప్పుడు ప్రైవేట్ వాహనాలు వెళ్తుంటాయి. అవి కూడా వెళ్లని పక్షంలో వారికి కాలినడకే శరణ్యం. ఆ గ్రామంలో ఇప్పటివరకు బడి, అంగన్వాడీ కేంద్రం లేదు. దీంతో ఇప్పటివరకు జెండా ఎగురవేయలేదు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా చొరవతో ఇటీవల గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాల ప్రారంభించారు. ఇందులో 14 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శుక్రవారం పాఠశాలలో సీఆర్టీ చంద్రకళ త్రివర్ణపతాకం ఎగురవేశారు. దీంతో గిరిజనులు హర్షం వ్యక్తంజేశారు. -
గిరిజనుల అభివృద్ధికి నిరంతర కృషి
ఉట్నూర్రూరల్: గిరిజనుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ముందుగా పీవో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఐటీడీఏ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్య, వైద్యం, అభివృద్ధిపై దృష్టి సారించినట్లు చెప్పారు. 934 ప్రాథమిక పాఠశాలల్లో 12,017 మంది విద్యార్థులు చదువుతుండగా 1,449 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నట్లు తెలిపారు. 133 ఆశ్రమ పాఠశాలల్లో 31,749 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పెంచిన చార్జీల ప్రకారం నూతన ఆహార మెనూ అమలు చేస్తూ నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు చెప్పా రు. ఉమ్మడి జిల్లాలో నాలుగు మినీ బాలికల గురుకులాలు, నాలుగు ఏకలవ్య పాఠశాలలు (కో–ఎడ్యుకేషన్), ఎనిమిది అప్గ్రేటెడ్ బాలికల జూని యర్ కళాశాలలు, నాలుగు అప్గ్రేటెడ్ జూనియర్ కళాశాలలు, ఒక బాలుర జూనియర్ కళాశాల, ఒక బాలికల జూనియర్ కళాశాల, రెండు మహిళా డిగ్రీ కళాశాలలు, ఒక పురుషుల డిగ్రీ కళాశాల ఉన్నట్లు తెలిపారు. గురుకులాల్లో 11,114 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 32 పీహెచ్సీలు, 186 ఆరోగ్య ఉప కేంద్రాలు, ఎనిమిది సామాజిక ఆరోగ్య కేంద్రాలుండగా వీటి ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. డయాలసిస్ సెంటర్ ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 42 మందికి చికిత్స అందించినట్లు తెలిపారు. భూ బదలాయింపు చట్టం కింద ఈ సంవత్సరం 25 కేసులు నమోదు చేసి 12 పరిష్కరించినట్లు పేర్కొన్నారు. మిగతా 13 కేసులు విచారణలో ఉన్నట్లు తెలిపారు. జీసీసీ ద్వారా ఉమ్మడి జిల్లాలో గిరిజన సహకార సంస్థ, ఐటీడీఏ ఆధ్వర్యంలో 17 పెట్రోల్ పంపులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా, మంజూరైన 11 పెట్రోల్ పంపులను ప్రారంభించి నిరుద్యోగ గిరిజన యువతీయువకులకు ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. మగతా ఆరు పంపులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఏవో దామోదరస్వామి, ఏడీఎంహెచ్వో మనోహర్, పీహెచ్వో సందీప్, పీవీటీజీ ఏపీవో మనోహర్, డీపీవో ప్రవీణ్, అధికారులు, సిబ్బంది, ఆశ్రమ, గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘హమాలీల సమస్యలు పరిష్కరిస్తా’
బెల్లంపల్లి: హమాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లిలోని అగర్వాల్ భవన్లో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభ నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హమాలీ సంఘం నాయకులను సీఎం రేవంత్రెడ్డి వద్దకు తీసుకువెళ్లి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం మాట్లాడుతూ.. హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అసంఘటిత కార్మికుల మాదిరిగానే ఫీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం హమాలీలు పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతకుముందు బజారు ఏరియా ప్రాంతం నుంచి పుర వీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గెల్లి రాజలింగు, నియోజకవర్గ అధ్యక్షులు, హమాలీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
అభినవ పోతన.. వరదన్న
చెన్నూర్: తెలుగు రాష్ట్రాల్లో సాహితీ రంగంలో వానమామలై వరదాచార్యులు కీర్తి గడించారు. ఓ వైపు సాహిత్యంలో, మరోవైపు రాజకీయంలో రాణించా రు. వరదన్న చేతి నుంచి జాలు వారిన రచనలు ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీర్తి, ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. వరదాచార్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పని చేశారు. నేడు వరదా చార్యుల జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. జననం.. విద్యాభ్యాసంవరదాచార్యులు వరంగల్ జిల్లా మడికొండలో 16 ఆగస్టు 1912లో సీతాంబ, బక్కయ్యశాస్త్రి దంపతులకు జన్మించారు. తండ్రి బక్కయ్యశాస్త్రి చెన్నూర్లో ఉపాధ్యాయునిగా పని చేశారు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. వరదాచార్యులకు చదువు అబ్బలేదు. ఆయన సహజ కవి. 13వ ఏటా పద్యాలు, కవితలు, రచనలు ప్రారంభించారు. డిగ్రీలు లేని పండితుడు కావడంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నిజామాబాద్లోని దోమకొండ జనతా కళాశాలకు సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకుడిగా నియమించారు. అనంతరం వానమామలై ఆంధ్ర సారస్వత పరిషత్లో విశారద రాసి ఉత్తీర్ణులయ్యారు. వరదాచార్యులు రాసిన ‘మణిమాల’ విశారద పరీక్షలో పాఠ్యాంశంగా ఉంది. అది చదివే పరీక్ష రాశారు. బాలల కోసం అనే బుర్రకథలు, నాటికలు రచించారు. దోమకొండ నుంచి చెన్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ చేయించుకుని 1961 నుంచి 1972 వరకు విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. కవి ప్రస్థానంలో..చెన్నూర్ పట్టణానికి చెందిన వానమామలై వరదాచార్యుల 50 ఏళ్ల కవి ప్రస్థానంలో ఎన్నో రచనలు చేశారు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, ఆంధ్రకవి, వసంత, మధుకవి, కవికోయిల, ఉత్ప్రేక్షా చక్రవర్తి, మహాకవి శిరోమణి, కవిశిరోవసంత లాంటి బిరుదులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. షష్టిపూర్తి సందర్భంగా భారతీ సాహిత్య సమితి కరీంనగర్ జిల్లా కోరుట్లలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు గండపెండేరం, స్వర్ణకంకణం, రత్నాభిషేకం చేశారు. పూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం వారణాసి వారు విద్యావాచస్పతి (డిలిట్) గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఇలా అనేక రాష్ట్రాల్లో మరెన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. ఆయన అనేక రచనలు ముద్రితం కాగా, కొన్ని ముద్రణకు నోచుకోలేదు. రాజకీయ ప్రస్థానంలో..18 ఏళ్ల పాటు అధ్యాపకునిగా పని చేసిన వరదాచార్యులును అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం పీవీ నరసింహారావు 1972లో ఎమ్మెల్సీగా అవకాశమివ్వగా 1978 వరకు పని చేశారు. చెన్నూర్లో వేదపాఠశాల ఏర్పాటు చేసి అధ్యక్షునిగా పని చేశారు. 31 అక్టోబర్ 1984లో ఆయన తుదిశ్వాస విడిచారు. -
వికసిత్ భారత్లో భాగస్వాములు కావాలి
మంచిర్యాలటౌన్: దేశ ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీ య జెండాను ఆవిష్కరించాలని, వికసిత్ భార త్ దిశగా మోదీ చేస్తున్న కృషిలో ప్రజలు భాగస్వాములు కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం నుంచి తిరంగా బైక్ ర్యాలీని పట్టణ వీధుల గుండా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లి, అమిరిశెట్టి రాజ్కుమార్, సత్రం రమేశ్, గాజుల ముఖేశ్గౌడ్, పట్టి వెంకటకృష్ణ, మోటపలుకుల తిరుపతి, బియ్యాల సతీశ్రావు, ఎనగందుల కృష్ణమూర్తి, బొలిశెట్టి అశ్విన్, కోడి రమేశ్, ముదాం మల్లేశ్, రంగ శ్రీశైలం, బోయిని హరి కృష్ణ, జయరామరావు, సప్పిడి నరేశ్, కర్రె లచ్చన్న, కర్రె చక్రి, బోయిని దేవేందర్, కోడి సురేశ్ పాల్గొన్నారు. -
కార్మికుల హక్కులు సాధించిన టీబీజీకేఎస్
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికులకు చరిత్రలో నిలిచిపోయే హక్కులను టీబీజీకేఎస్ సాధించిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శుక్రవారం ఆయన నస్పూర్ కాలనీలో టీబీజీకేఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షులు బండి రమేష్ పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దివాకర్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల సమస్యలను పరిష్కరించామని, ఏ సమస్య వచ్చినా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి ప్రయోజనాలు చేకూర్చారని తెలిపా రు. కారుణ్య ఉద్యోగాలు ఇప్పించారని అన్నా రు. టీబీజీకేఎస్కు పూర్వ వైభవం తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు యన్.విజిత్రావు, యూని యన్ కేంద్రం ఉపాధ్యక్షుడు నూనె కొముర య్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, జాయింట్ సెక్రెటరీ సత్తయ్య, మాజీ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు అన్వేష్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుబ్బయ్య, నాయకులు మేరకు పవన్, బేర సత్యనారాయణ, అత్తి సరోజ, వంగ తిరుపతి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
సమరయోధుల ఆశయ సాధనకు కృషి
మంచిర్యాలక్రైం: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కమిషనరేట్లో స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయుధ పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన ఉత్తమ పోలీసు అధికారులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు రమేష్, మల్లారెడ్డి, శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
కార్యకర్త స్థాయి నుంచే మంత్రినయ్యా
చెన్నూర్: తాను కార్యకర్త స్థాయి నుంచే మంత్రి స్థాయికి చేరుకున్నానని, చెన్నూర్ను పాత కొత్త అందరం కలిసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూర్కు చెందిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజ్, మాజీ కౌన్సిలర్ తుమ్మ రమేశ్, కారెంగుల శ్రావణ్ తదితరులకు మంత్రి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంతోపాటు పార్టీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేయాలని, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకే పార్టీలో చేరికలు నిర్వహించామని తెలిపారు. తనతో పని చేసిన పాత నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడ్డదని, అందరినీ సమానంగా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై వచ్చిన వారిని పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్రావు, పట్టణ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఫయాజ్, నాయకులు పాల్గొన్నారు. -
● ఉత్తర తెలంగాణలో జిల్లాకు ప్రథమస్థానం ● అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం ● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు ● ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
జెండాకు వందనం చేస్తున్న ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు, జిల్లా ఉన్నతాధికారులుమంచిర్యాలఅగ్రికల్చర్: ఉత్తర తెలంగాణలో మంచిర్యాల జిల్లా ప్రథమ స్థానంలో దూసుకెళ్తోందని, అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే.. సన్నబియ్యం సరఫరా ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించి రూ.13వేల కోట్ల వ్యయంతో 3.10కోట్ల మందికి అందిస్తోంది. జిల్లాలో 2,47,923 మంది కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేశాం. పోర్టబులిటి విధానం ద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా రేషన్ బియ్యం తీసుకునే వీలు కల్పించాం. కొత్త రేషన్కార్డులు జూలై 14నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్కార్డుల పంపిణీ ప్రారంభించాం. పదేళ్ల తర్వాత పేదలకు రేషన్కార్డులు చేతికందాయి. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు 24,079 నూతన రేషన్కార్డులు అందించడంతోపాటు పాత కార్డుల్లో పిల్లల పేర్లు చేర్పులకు 41,677 దరఖాస్తులు పరిశీలించి 53,040మందిని చేర్చాం. రాజీవ్ ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం రాజీవ్ ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్ స్కీం. మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాం. జిల్లాలో 9,120మంది పేదలు చికిత్స పొందారు. ఇందుకు ప్రభుత్వం రూ.14.15కోట్లు ఖర్చు చేసింది. ఆడబిడ్డలకు అండగా.. ప్రజా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది. ఆడబిడ్డలకు ఈ పథకం ద్వారా రూ.6,790 కోట్లు ఆదా అయ్యింది. జిల్లాలో ఉచిత రవాణా ద్వారా 2,24,03,654 మంది మహిళలకు లబ్ధి చేకూరింది. రూ.500కే వంట గ్యాస్ సరఫరా ద్వారా మహిళలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించి జిల్లాలో 1,22,837 మంది లబ్ధిదారులకు రూ.14.63 కోట్లు రాయితీ మంజూరు చేశాం. గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా జిల్లాలో ప్రతీ నెల లక్ష నివాసాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ 1,25,759 మంది వినియోగదారులకు నెలకు రూ.4.96 కోట్లు ఖర్చు చేస్తూ ఇప్పటివరకు రూ.71.38 కోట్లు లబ్ధి చేకూర్చింది. భూభారతి.. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభార తి చట్టాన్ని ప్రవేశపెట్టి రైతులకు అనుకూలంగా అప్పీలు వ్యవస్థను పొందుపర్చింది. జిల్లాలో ప్రతీ మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా వచ్చిన 51,503 దరఖాస్తుల్లో 26,744 దరఖాస్తులు వివిధ స్థాయిల్లో పరిశీలనలో ఉన్నాయి. విద్యారంగం బలోపేతం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాం. జిల్లాలో 510 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు పూర్తి చేసి మిగతా వాటిల్లో పురోగతిలో ఉన్నాయి. 688 పాఠశాలలకు స్కూల్ ఫెసిలిటీ గ్రాంటు రూ.1,64,30,000 ఐదు నెలలకు ఇచ్చాం. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు గతంలో ఎన్నడూ లేని విధంగా 40 శాతం డైట్, 200 శాతం కాస్మొటిక్ చార్జీలు పెంచి నూతన మెనూ అమలు చేస్తూ పౌష్టికాహారం అందించి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం.. మున్సిపాలిటీలు.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తోపాటు ఐదు బల్దియాల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. మంచిర్యాలలో రూ.10.22 కోట్లతో రాష్ట్రంలోనే అత్యుత్తమంగా మహాప్రస్థానం నిర్మించాం. అమృత్ 2.0 పథకం కింద బల్దియాలకు రూ.275 కోట్లు మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ భవనాల నిర్మాణం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవన నిర్మాణం, నర్సింగ్ కళాశాల, వైద్య విద్య కోసం రూ.40 కోట్లతో భవన నిర్మాణం, రూ.3.50 కోట్లతో మందుల నిల్వ గిడ్డంగి నిర్మించాం. గుడిపేటలో రూ.216 కోట్ల వ్యయంతో అధునాతన వైద్య కళాశాల నిర్మాణం జరుగుతుంది. కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్సింగ్, ఏసీపీ ప్రకాష్, సబ్ కలెక్టర్ మనోజ్, ఐఎన్టీయూసీ నాయకుడు జనక్ప్రసాద్ పాల్గొన్నారు.విద్యార్థిని నృత్యంఇందిరా మహిళా శక్తి..రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా దండేపల్లి మండలంలో శంకుస్థాపన చేసి మరొకటి ఏర్పాటుకు మందమర్రి మండలాన్ని గుర్తించాం. మహిళలకు పెట్రోల్బంక్లు, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ, ఇందిరా శక్తి స్టాళ్లు, మీసేవ కేంద్రాలను ప్రారంభించింది.పేదలకు ఇందిరమ్మ ఇళ్లు..తొలి విడతగా ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. అన్ని శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నాం. జిల్లాలో 10,377 ఇళ్లు మంజూరు కాగా 6,373 ఇళ్లు మార్కవుట్, 1,870 ఇళ్లు బేస్మెంటు, 164 గోడలు, 24 స్లాబ్ నిర్మాణ స్థాయిలో ఉన్నాయి. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15.49కోట్లు జమ చేశాం. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఈ ఏడాది మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించింది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీల్లో 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి గ్రూప్–1లో 15, గ్రూప్–2లో 18, గ్రూప్–3లో 26 కులాలను చేర్చాం.అలరించిన విద్యార్థుల నృత్యాలుస్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. దేశభక్తి గీతాలపై చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు, కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు విద్యార్థులను అభినందించి బహుమతలు అందజేశారు. -
దొంగ ఓట్లతో గెలిచేందుకు బీజేపీ ప్రయత్నం
మంచిర్యాలటౌన్: దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ విమర్శించారు. దొంగ ఓట్లను ఆధారాలతో సహా బయటపెట్టినా ఎన్నికల సంఘం, బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఓట్ చోర్.. గద్దె చోడ్(ఓట్ల దొంగలు గద్దె దిగండి) ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల నగరంలోని వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా నుంచి ఐబీ చౌరస్తా మీదుగా గురువారం సాయంత్రం మాస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మట్లాడుతూ ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓటర్లు ఉండడం, ఓటర్లుగా ఉన్నవారిని మృతిచెందినట్లుగా చిత్రీకరించడం వంటివి బీజేపీ చేపట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజలందరూ చైతన్యవంతులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ఏపీ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ ఆగుతుంది..
బెల్లంపల్లి: మంచిర్యాల, బెల్లంపల్లి రైల్వేస్టేషన్లలో ఏపీ సంపర్క్క్రాంతి ట్రైవీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదలకు రైల్వే అధికారులు ఎట్టకేలకు సానుకూలత వ్యక్తం చేశారు. ఈ నెల 2న ‘సాక్షి’లో ‘రైళ్లు ఆగవా..’ శీర్షికన ప్రచురితమైన కథనంలో ఆయా స్టేషన్లలో హాల్టింగ్ ఎత్తివేసిన వైనాన్ని ప్రస్తావించడం తెలిసిందే. స్పందించిన రైల్వే అధికారులు హజ్రత్ నిజాముద్దీన్(న్యూఢిల్లీ) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి వెళ్లే ఏపీ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును దిగువ మార్గంలో ఆయా రైల్వేస్టేషన్లలో నిలుపుదలను పునరుద్ధరిస్తూ రైల్వే రిజర్వేషన్ పోర్టల్ ఐఆర్సీటీసీలో అప్డేట్ చేశారు. ఈ నెల 21 నుంచి నిలుపుదలకు పొందుపర్చారు. రైల్వే ప్రయాణికుల సమస్యలు, రైళ్ల హాల్టింగ్ ఎత్తివేతపై రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తోడ్పడిన ‘సాక్షి’కి, రైల్వే ఉన్నతాధికారులకు ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు ఫణి, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. -
రాంనగర్ వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణం
బెల్లంపల్లి: వర్షాకాలంలో వరద నీరు ముంచెత్తి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న రాంనగర్ వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడుతామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గురువారం పట్టణంలోని రాంనగర్ వాగు వద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. వాగుపై సరైన వంతెన లేకపోవడంతో వరద నీరు ఇళ్లలోకి వస్తోందని, ఏటా తమకు వరద కష్టాలు తప్పడం లేదని స్థానికులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే ఏమాత్రం జాప్యం చేయకుండా కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు కాంట్రాక్టర్తో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ను ఆదేశించారు. చైన్ మిషన్ ద్వారా వాగులో పూడిక తీయించి వరద ముప్పును నివారించాలని సూచించారు. రాంనగర్ బస్తీ వాసులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ‘ఎల్లంపల్లి’లో పెరిగిన నీటిమట్టం మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట వద్ద ఉన్న ఎల్లంపల్లి(శ్రీపాద సాగర్) ప్రాజెక్ట్ నీటిమట్టం మూడు టీఎంసీల మేర పెరిగింది. ఎగువ ప్రాంతాలు, కడెం ప్రాజెక్ట్ నుంచి వస్తున్న వరద నీటితో నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకు గాను గురువారం 15.750 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉంది. కడెం ప్రాజెక్ట్ నుంచి 5,775 క్యూసెక్కులు, ఎగువ ప్రాంతాల నుంచి 4,100 క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్లోకి వచ్చి చేరుతోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 277 క్యూసెక్కులు, నంది పంప్హౌజ్కు 9,500 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. -
● 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్ ● టెక్నాలజీ, అభివృద్ధి, విద్య, వైద్యరంగాల్లోనూ ఘనత ● వందేళ్ల భారతంలో అభివృద్ధిపై యువత అభిప్రాయం ● వందేళ్ల భారత్ ఎలా ఉండాలి అనే అంశంపై ‘సాక్షి’ టాక్ షో
న్యాయ వ్యవస్థలో మార్పు రావాలిన్యాయవ్యవస్థలో న్యా యం జరిగేందుకు ఏళ్లుగా బాధితులు ఎదు రు చూడాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం జరిగేలా మార్పులు రావాలి. దేశం ఇప్పటికీ టెక్నాలజీలో దూసుకుపోతూ ఎన్నో రకాల రీసెర్చ్లకు కేంద్ర బిందువుగా మారుతోంది. టెక్నాలజీలో యువతకు మంచి అవకాశాలు కల్పించాలి. – దానిష్ మినహాజ్, బీఎస్సీ సెకండియర్, మంచిర్యాలమంచిర్యాలటౌన్: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047నాటికి వందేళ్లు పూర్తవనుండగా.. ఆ నాటికి మన దేశం ప్రపంచాన్ని శాసించే స్థాయిలో అన్ని రంగాల్లోనూ నంబర్ వన్ స్థానంలో ఉంటుందని యువత అభిప్రాయ పడింది. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘వందేళ్ల భారతం ఎలా ఉండాలి’ అనే అంశంపై ‘సాక్షి’ గురువారం మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో టాక్షో నిర్వహించింది. కళాశాల ప్రిన్సిపాల్ పి.ఉపేందర్రెడ్డి, డిగ్రీ విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశానికి ఏదో చేయాలనే తపనతో విద్యార్థులు, యువత ముందుకు వచ్చే అవకాశం ఉందని, వందేళ్లలో దేశ పురోగాభివృద్ధి బాగుంటుందని, ప్రపంచాన్ని శాసించే సూపర్పవర్గా భారత్ ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. దేశానికి యువతనే వెన్నెముక, ప్రభుత్వం సరైన అవకాశాలు కల్పిస్తే దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని స్పష్టం చేశారు. చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రభుత్వం యువతకు పూర్తి సహకారం అందించడంతోపాటు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తేనే దేశాభివృద్ధికి దోహాదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి బ్యూరో ఇంచార్జి రాజు, పీడీ నూనె శ్రీనివాస్, లెక్చరర్లు మహేశ్, చంద్రశేఖర్, సుమలత, శ్వేత, సుధాకర్, గోపి, విద్యార్థులు పాల్గొన్నారు. టెక్నాలజీలో మరింతగా రాణించాలిభారతదేశం టెక్నాలజీలో ఎంతగానో ఎదిగింది. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే టెక్నాలజీలో మరింతగా రాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ వంటి వాటిలో యువత రాణించేలా చూస్తే మన దేశాన్ని వారే అభివృద్ధి పథంలో తీసుకెళ్తారు. – కే.సాయివిగ్నేష్, బీబీఏ సెకండియర్, మంచిర్యాలఅభివృద్ధి సాధించాలిదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. విద్య, ఉద్యోగం, వైద్యం, కోర్టుల్లో జరిగే న్యాయం సత్వరంగా అందడంతోపాటు మారుతున్న కాలానుగుణంగా ప్రభుత్వం ఆలోచించాలి. స్కిల్ డెవలప్మెంట్ అనేది చిన్ననాటి నుంచే విద్యతోపాటు అందించాలి. – ఎన్.భూమిక, ఎంఎస్టీసీఎస్, ఫస్టియర్, మంచిర్యాలటెక్నాలజీ, విద్య అందాలిస్వాతంత్య్రం సాధించిన 78 ఏళ్లలోనే దేశ జీడీపీతోపాటు ఎంతగానో అభివృద్ధి సాధించింది. మరో 22 ఏళ్లలో దేశం ప్రపంచంలోనే గొప్పదేశంగా మారేందుకు అవకాశాలున్నాయి. టెక్నాలజీ, ప్రతీ ఒక్కరికి ఉచితంగా విద్య అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. ఎంతోమంది విద్యావంతులు తయారై దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తారు. – సిహెచ్.కౌశిక్, ఎంఎస్టిడిఎస్ ఫస్టియర్, మంచిర్యాల -
పీహెచ్సీల్లో మెరుగైన వైద్య సేవలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్సీ)ల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం హాజీపూర్ మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, మందుల నిల్వలు, ల్యాబ్ రిజిష్టర్లు, పరిసరాలు పరిశీలించి రోగులతో మాట్లాడారు. కర్ణమామిడిలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు, మధ్యాహ్న భోజన పనితీరును పరిశీలించారు. కేజీబీవీ ప్రత్యేకాధికారి స్వప్న, పీహెచ్సీ వైద్యాధికారి లహరి పాల్గొన్నారు. వార్షిక పాస్ సద్వినియోగం చేసుకోవాలి మంచిర్యాలఅగ్రికల్చర్: జాతీయ రహదారుల సంస్థ కల్పించిన వార్షిక పాస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో జాతీయ రహదారుల సంస్థ మంచిర్యాల పీఐయూ డిప్యూటీ మేనేజర్ హర్షకుమార్ గుప్తా, అధికారులతో కలిసి వార్షిక పాస్ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడతూ దేశంలోని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేలపై వర్తించేలా ఈ నెల 15 నుంచి అమల్లోకి రానుందని తెలిపారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధం మంచిర్యాలటౌన్: ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తిలక్నగర్ చెరువును డీసీపీ ఏ.భాస్కర్తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాబో యే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 90 మంది సభ్యులతో మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, శిక్షణ పొందిన పోలీసులు, గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. -
ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది
మా తాతల కాలం నుంచి గ్రామంలో ఎవరూ మద్యం సేవించరు. అదే ఆచారం ఇప్పటి వరకూ కొనసాగుతోంది. గ్రా మంలో అందరం కలిసి మెలిసి ఉంటాం. ఏ సమస్య వచ్చినా ఇక్కడే అందరం కలిసి ప రిష్కరించుకుంటాం. ఆంజనేయ స్వామి గు డిలో పూజలు నిర్వహిస్తాం. అందరం కలిసి పండుగలు ఆనందంగా జరుపుకుంటాం. – మొర్ల పోచయ్య, చారిగాం స్నేహభావంతో ఉంటాం గ్రామంలోని యువకులమంతా కలిసి మెలిసి స్నేహభావంతో ఉంటా ం. గ్రామంలో ఏమైనా సమస్య ఉంటే యువకులమంతా ఒకేచోట చేరి పరిష్కరించుకుంటాం. గ్రామంలో ఎవరూ మద్యం సేవించరు. బెల్టుషాపులు పెట్టరు. ఇదే ఆచారాన్ని అందరం పాటిస్తాం. – మొర్ల శంకర్, చారిగాం -
అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత
కోటపల్లి: బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న యూరియాను గురువారం తెల్లవారుజామున పట్టుకున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ బన్సీలాల్ వివరాలు వెల్లడించారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా బొలెరోలో ఎలాంటి ఆధారాలు లేకుండా మహారాష్ట్రకు తరలిస్తున్న 62 బస్తాల యూరియా పట్టుబడడంతో వ్యవసాయాధికారి సాయికృష్ణరెడ్డికి సమాచారం అందించామన్నారు. అతను వచ్చి యూరియాను పరిశీలించి అక్రమంగా తరలిస్తున్నారని చెప్పడంతో వాహనాన్ని కోటపల్లి పోలీస్స్టేషన్కు తరలించి విచారణ చేపట్టామన్నారు. చెన్నూర్ పట్టణంలోని అస్నాద్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఫెర్టిలైజర్ షాపు నుంచి యూరియా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి వాహన డ్రైవర్పై రాజమల్లు, షాపు యజమాని బాపురెడ్డిపై ఫెర్టిలైజర్ కంట్రోల్ అర్డర్ 1983 చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
అధిక తేమతో పంటలకు చేటు
చెన్నూర్రూరల్: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పంటచేలల్లో నీరు నిలిచింది. నీరు ఎక్కువైతే తేమ ఏర్పడి పంటలకు నష్టం వాటిల్లనుంది. అధిక తేమతో పంటలు నష్టపోకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసా ద్ సూచిస్తున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... వర్షాలకు పత్తి చేనులో నీరు నిలిస్తే వెంటనే కాలువలు తీసి నీటిని బయటకు పంపించాలి. వర్షాలు తగ్గిన వెంటనే భూమిలో తేమను తగ్గించు కోవడానికి అంతర సేద్యం చేయాలి. బురద పదనులో ఎకరాకు 25 కిలోల యూరియా 10 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. అలాగే ఎకరానికి సీ ఓసీ 3 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఒకరోజు తర్వాత కిలో స్వర్ణపాల్ను 150 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. పంటను వేరుకుళ్లు తెగులు ఆశిస్తే 3 గ్రాముల ఆక్సిక్లోరైడ్ లేదా ఒక గ్రాము కార్బండిజమ్ను లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లలో తడపాలి. మొక్కజొన్న అధిక తేమను తట్టుకోలేదు. సాధ్యమైనంత త్వరగా అంతరకృషి చేసుకోవాలి. ఎకరాకు 25 కిలోల యూ రియా, 10 కిలోల పొటాష్ ఎరువును మొక్కల మొదళ్ల దగ్గర వేసుకోవాలి. కాండం తొలిచే పురుగు ఉంటే కార్బోప్యూరాన్ 3జీ గుళికలు ఎకరానికి 3 కిలోలు ఆకు సుడుల్లో వేయాలి. పెసర, మినుము పైర్లకు అధిక తేమతో పేనుబంక, లద్దె పురుగు ఆశించే అవకాశం ఉంది. ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరప పంట మిరప చేనులో నీరు నిలిస్తే వెంటనే నీటిని కాలు వల ద్వారా తొలగించాలి. నారుకుళ్లు తెగులు ఆశిస్తే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా రెండు గ్రాముల రిడోమిల్ లీటరు నీటికి కలిపి వారంలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే అధిక తేమ నుంచి పంటలను కాపాడుకోవచ్చు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముల్కల్ల గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కోటపల్లి మండలం దేవులవాడకు చెందిన నిట్టూరి శశిపాల్ (36) గురువారం ఉదయం ముల్కల్ల శివారులో నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో త్రీవగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుని తండ్రి లస్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ను ప్రక్షాళన చేయాలిమంచిర్యాలటౌన్: జిల్లా క్రికెట్ అసోసియేషన్ను ప్రక్షాళన చేయాలని, హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అక్రమాలపై విచారణ చేపట్టాలని ఓల్డ్ మంచిర్యాల క్రికెట్ క్లబ్(ఓఎంసీసీ) అధ్యక్షుడు బొలిశెట్టి కిషన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీ మైదానంలో గురు క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం అండర్–17 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గురు అకాడమీ నిర్వాహకులు దుర్గాప్రసాద్, ఎంఏ విజయ్, వివేక్, తూముల ప్రభాకర్, ఆమ్రోస్, ఎడ్ల మల్లేశ్, ఎలుక శ్రీనివాస్, రమేశ్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం క్రికెట్ క్రీడాకారుల కోసం రూ.20 వేల మ్యాట్ను కిషన్, ప్రభాకర్ అందించారు. ఎరువుల కోసం బారులుచెన్నూర్: చెన్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనం వద్ద ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. గురువారం ఎరువులు పంపిణీ చేస్తున్నారనే సమాచారం మేరకు పెద్ద సంఖ్యంలో తరలివచ్చారు. వరుసలో ఎక్కువ సమయం ఉండలేక తమ వంతుగా చెప్పులు ఉంచారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు సక్రమంగా ఎరువులు పంపిణీ జరిగేందుకు బందోబస్తు నిర్వహించారు. యూరియా కోసం రైతుల ఆందోళన భీమిని: యూరియా సక్రమంగా పంపిణీ చేయ డం లేదని మండలంలోని వెంకటపూర్లో జై భీమ్ పరస్పర సహాయక సహకార మార్కెటింగ్ సంఘం ఎదుట రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. రైతులు మాట్లాడుతూ ఈ కేంద్రం నుంచి ఇప్పటివరకు ఒక లోడు మాత్రమే పంపిణీ చేశారని తెలిపారు. నిర్వాహకులు బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏడీఏ సురేఖ, ఎస్సై భాస్కర్రావు రైతులతో మాట్లాడగా ఆందోళన విరమించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మకాలు చేపట్టాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని ఏడీఏ సురేఖ తెలిపారు. భీమిని ఏవో యమునాదుర్గా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబు
మంచిర్యాలఅగ్రికల్చర్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కలెక్టరేట్తోపాటు మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు గురువారం ముస్తాబయ్యాయి. కలెక్టరేట్ ఆవరణలో టెంట్లు, శామియానాలు, అతిథులకు కుర్చీలు తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ పతాకావిష్కరణ, వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలు తెలియజేసే స్టాళ్లు ఏర్పాటు, ముఖ్య అతిథి ప్రసంగం, సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకు గౌరవ వందనం సమర్పణ, ప్రగతి నివేదిక సందేశం, ప్రశంసాపత్రాల పంపిణీ తదితర కార్యక్రమాలు ఉంటాయి. జిల్లా నుంచి మంత్రి ఉన్నా.. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా.. గతంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండావిష్కరణకు ప్రభుత్వ సలహాదారుకు సర్కారు అవకాశం కల్పించింది. ప్రస్తుతం జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిగా గడ్డం వివేక్వెంకటస్వామి ఉన్నారు. అయినప్పటికీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఎగురువేసే అవకాశం ఇతర ప్రాంతానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావుకు కల్పి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కు చెందిన మంత్రికి అవకాశం కల్పించకపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
మద్యానికి దూరం.. చారిగాం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో చారిగాం గ్రామం ఉంది. ఈ గ్రామంలో 234 మంది జనాభా, 112 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారంతా మద్యం నిషే ధానికి కట్టుబడి ఉంటున్నారు. గ్రామంలో గుడుంబా తయారీ, బెల్టుషాపుల ఏర్పాటు చేయవద్దని మూడున్నర దశాబ్ధాల క్రితమే పెద్దలు తీర్మాణించారు. ఇప్పటికీ అవే ఆచారాలను పాటిస్తున్నారు. గ్రామంలో అన్నీ వ్యవసాయ కుటుంబాలే. ప్రధానంగా కూరగాయాలు సాగుచేసి పట్టణంలోని మార్కెట్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. 35 ఏళ్లుగా గ్రామస్తులు మద్యపాన నిషేధం పాటిస్తున్నారు. స్థానిక యువత బయట తాగినట్లు తె లిస్తే ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్లి వారిచే మాలధారణ చేయిస్తున్నారు. మరోసారి మద్యం జోలికి వెళ్లకుండా వారికి అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఎలాంటి గొడవలు, అల్లర్లకు తావులేకుండా మంచి నడవడికతో ఉంటున్నారు. అదో మారుమూల కుగ్రామం. ఆ గ్రామంలో అందరి జీవనాధారం వ్యవసాయమే. ప్రతీరోజు ఉదయాన్నే నిద్రలేచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. మహాత్మాగాంధీ సూచనలు నమ్మిన కాగజ్నగర్ మండలంలోని చారిగాం గ్రామస్తులు మద్యపాన నిషేధాన్ని పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
శిశువు మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
బెల్లంపల్లి: వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ గురువారం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన గర్భిణి సువర్ణకు పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త కరణ్ బుధవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలీవరీ చేస్తామని చెప్పి చేర్చుకున్నారు. అదే రోజురాత్రి మగశిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ చనిపోయినట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందాడని ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. మంచిర్యాలకు రెఫర్ చేయకుండా వైద్యులు అశ్రద్ధ చేసి తమ బిడ్డ మృతి చెందడానికి కారకులయ్యారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆస్పత్రి వైద్యులను వివరణ కోరగా మగశిశువు స్టిల్బర్త్తో పుట్టాడని, తల్లిగర్భంలో ఉన్నప్పుడు మలం తినడంతో మృతి చెందినట్లు తెలిపారు. -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా మంచిర్యాలక్రైం: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్–2025 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కమిషనరేట్లో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికారులు, విద్యార్థులు, వివి ధ శాఖల ఉద్యోగులు, మహిళలతో మాదక ద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణా సరఫరా, సాగు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, యాంటీ నార్కోటిక్ సీఐ రాజ్కుమార్, సీసీఆర్బీ సతీష్, పీసీఆర్ సీఐ రవీందర్, సీసీఎస్ సీఐ బాబురావ్ పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ఓరియంట్లో గుర్తింపు ఎన్నికలు
కాసిపేట: మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంటు కంపెనీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఎట్టకేలకు నగారా మోగింది. ఈ నెల 19న ఎన్నికల నిర్వహణకు ఆదిలాబాద్ డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు 15రోజుల్లో ఎన్నికలు నిర్వహించి, ఈ నెల 20న పూర్తి వివరాలు అందించాల్సి ఉండగా.. 19న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఎన్నికలు నిర్వహించి సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల్లో 257మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 266మంది జాబితా సిద్ధం చేయగా..పలువురి అభ్యంతరాల మేరకు నూతన ఉద్యోగులు తొమ్మిది మందికి ఓటు హక్కు నిరాకరించారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాల్గొనేందుకు ఐదు యూనియన్లు అర్హత సాధించాయి. ఈ నెల 14న మధ్యాహ్నం 12గంటల్లోపు ఆసక్తి లేని యూనియన్లు తమ అభిప్రాయం తెలియజేస్తే పోటీలో లేకుండా బ్యాలెట్ పేపర్పై గుర్తు తొలగిస్తామని, లేనిపక్షంలో గుర్తు కొనసాగుతుందని కార్మిక శాఖ అధికారులు ప్రకటించారు. నాలుగేళ్లుగా ఎన్నికల కోసం ఎదురు చూస్తుండగా.. ఐదు రోజుల్లోనే ఎన్నికల నిర్వహణ ముగియనుండడంతో కార్మికులు, కార్మిక సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
‘వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవాలి’
పాతమంచిర్యాల: ఇంగ్లండ్, అమెరికాలతో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు వెంటనే రద్దు చేసుకోవాలని అఖిల భారత కేత్ మజ్ధూర్ సంఘ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి లాల్కుమార్ అన్నారు. బుధవారం బహుళ జాతి కంపెనీల అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దొండ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుపతి, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సంకె రవి, ఉపాధ్యక్షుడు చందు పాల్గొన్నారు. -
విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
రామకృష్ణాపూర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. మందమర్రి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్మెల్ డిగ్రీ కాలేజీ భవనాన్ని కలెక్టర్ కుమార్దీపక్తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాభివృద్ధే ధ్యేయంగా అనేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని అన్నారు. కాకా అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఐదువేల మంది విద్యార్థులకు ఎలాంటి డొనేషన్లు తీసుకోకుండా విద్యనందిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లు తగ్గించారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి వరకు పంపించి నాలుగు నెలలు గడుస్తోందని, అయినా కేంద్ర ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తోందని అన్నారు. బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్చ్ బిషప్ కార్డినల్ ఆంథోని, ఆదిలాబాద్ బిషప్ ప్రిన్స్ ఆంథోని, బిషప్ జోసఫ కున్నత్, ఫాదర్ రెక్స్, ఫాదర్ జిజో తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల కోసం బారులు
చెన్నూర్/కోటపల్లి: ఎరువుల కోసం రైతులు బారులు తీరుతున్నారు. చెన్నూర్ ప్రాథమిక సహకార సంఘం గోదాం వద్ద రైతులు ఎరువుల కోసం ఎదురు చూశారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు, మహిళా రైతులు సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. 4గంటలకు ఒక లారీ ఎరువులు వచ్చినా పంపిణీ చేయకపోవడంతో ఆందోళనకు దిగారు. ఎరువులు పంపిణీ చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని చెల్లాయిపేటకు చెందిన రైతు మహేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కోటపల్లిలో బుధవారం యూరియా వచ్చిందనే సమాచారంతో రైతులు ఉదయాన్నే రైతువేదిక వద్ద బారులు తీరారు. ఏడీఏ ప్రసాద్ యూరియా బస్తాలు అందజేశారు. యూరియా లభిస్తుందో లేదోననే బెంగతో ఒక్కసారిగా రైతులు ఎగబడడంతో తోపులాట జరిగింది. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
జన్నారం: ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం జన్నారం అటవీ డివిజన్ గుండా భారీ వాహనాల రాకపోకలను జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్తో కలిసి ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. భారీ వాహనానికి అటవీశాఖ ఇస్తున్న రూ.150 రశీదును లారీ యజమానికి అందజేశారు. అనంతరం జన్నా రం వరకు లారీలో ప్రయాణించారు. ఈ సందర్భంగా వ్యాపారులు, అటవీశాఖ అధికారులు ఎమ్మెల్యే ను సన్మానించారు. మండల కేంద్రంలోని అంబేడ్క ర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాకపోకలపై నిషేధం ఎత్తివేతకు కృషి చేస్తానని ఏడాది క్రితం హామీ ఇచ్చానని, అప్పటి నుంచి ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి, అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వైల్డ్లైఫ్ బోర్డు స మావేశంలో అధికారులపై ఒత్తిడి తెచ్చానని, చివరికి రాకపోకలపై నిషేధం ఎత్తివేయడం శుపరిణా మమని అన్నారు. పగటిపూట రాకపోకలు సాగించే వాహనాల డ్రైవర్లు, యజమానులు అటవీ శాఖ ని బంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. అతివేగంగా వెళ్లి వన్యప్రాణులకు హాని కలిగించవద్దని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు అనవసర ఆరోపణలు చేశారని అన్నారు. రేంజ్ అధికారి సుష్మారావు, డీఆర్వో సాగరిక, ఎస్సై అనూష, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మ న్ ఫసీఉల్లా, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముజా ఫర్ అలీఖాన్, ప్రధాన కార్యదర్శి మాణిక్యం, నాయకులు ఇసాక్, శంకరయ్య, రియాజోద్దీన్, శాఖీర్అలీ, ముజ్జు, స్వామి, అజార్ పాల్గొన్నారు. -
బహుజన రాజ్య స్థాపననే లక్ష్యం
పాతమంచిర్యాల: తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం స్థాపించడమే లక్ష్యమని డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఎసీ ఆవిర్భావ సభకు ఆయన ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొరల రాజ్యాన్ని కూల్చి బహుజన రాజ్యం నిర్మించడం కోసమే మా భూమి రథయాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరిచి రాజకీయ చైతన్యాన్ని బహుజనుల్లో నింపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎదునూరి రమేష్, సదానందం, సుదమళ్ల హరికృష్ణ, పడాల రామన్న, జెఏసీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ పాల్గొన్నారు. -
‘ఎల్లంపల్లి’కి వరద
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట గ్రామ శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు 14టీఎంసీల నీటిమట్టంతో ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి 11,500 క్యూసెక్కుల, ఎగువ ప్రాంతాల నుంచి 7,600 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 330 క్యూసెక్కులు, ఎస్టీపీపీకి 121 క్యూసెక్కులు వదులుతున్నారు. నేడు పాఠశాలలకు సెలవు మంచిర్యాలఅగ్రికల్చర్: భారీ వర్షాల వాతావరణ సూచన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు సెలవు పాటించాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సాంకేతిక అభ్యసనం విద్యార్థులకు వరం
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వం ముందు చూపుతో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత అభ్యసనం కల్పించిందని, సాంకేతిక అభ్యసనం విద్యార్థులకు ఒక వరమని డీఈవో యాదయ్య అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లాలో ఎంపిక చేసిన ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు గణితం బోధించే ఉపాధ్యాయులకు సాంకేతిక అభ్యసనంపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశలవారీగా అన్ని ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్లు అందిస్తామని, వాటి ద్వారా నాణ్యమైన బోధన, స్వీయ అభ్యసన సులభతరం అవుతుందని తెలిపారు. శిక్షణ అంశాలను ఉపాధ్యాయులకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, క్వాలిటీ కో–ఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, రిసోర్సు పర్సన్లు పాల్గొన్నారు. కేజీబీవీల నిర్వహణకు ముందస్తు బడ్జెట్ ఇవ్వాలి మంచిర్యాలఅర్బన్: కేజీబీవీ, యూఆర్ఎస్ల నిర్వహణకు ముందస్తు బడ్జెట్ ఇవ్వాలని డీఈవో యాదయ్యకు స్పెషల్ ఆఫీసర్లు వినతిపత్రం అందజేశారు. గ్యాస్ రిఫిల్ క్రెడిట్ బేస్లో పంపిణీ చేయాలని, ఎస్వోలకు రూ.32,500 వేతనంతో చాలా ఇబ్బందిగా మారిందని, విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.30వేల నుంచి రూ.60వేల వరకు ప్రతీ పాఠశాలకు బడ్జెట్ రిలీజు చేయాలని కోరారు. కేజీబీవీల ఎస్వోలు ఏ.సుమలత, ఫణిబాల, మయూరి, కనకలక్ష్మీ, జె.స్వప్న, మౌనిక, రజిత, సునీత, సరిత తదితరులు పాల్గొన్నారు. -
ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్
భీమిని: భీమిని, కన్నెపల్లి మండలాల్లో ముంపు ప్రాంతాలను కలెక్టర్ కుమార్ దీపక్ సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి బుధవారం పరిశీ లించారు. కన్నెపల్లి మండలం సాలీగాం పీపీ రావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ఇళ్లలోకి నీరు చేరగా.. వారు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు ఏర్పాటుతో తమకు నష్ట పరిహారం రాలేదని బాధితులు మొర పెట్టుకున్నారు. నష్ట పరిహారం రాని వారి జాబితా తయారు చేసి పంపించాలని తహసీల్దార్ శ్రవణ్కుమార్ను కలెక్టర్ ఆదేశించారు. మేరీమాత పాఠశాలలో పునరావాసం, సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. భీమిని మండలం ఖర్జీభీంపూర్, రాజారాం గ్రామాలకు వెళ్లే రోడ్డు కోతకు గురి కాగా పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. చిన్నతిమ్మాపూర్, తంగళ్లపల్లి గ్రామాల్లో ముంపునకు గురైన పంటలను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. ఎంపీడీవోలు గంగామోహన్, శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్లు బికార్ణదాస్, శ్రవణ్కుమార్, ఎస్సైలు విజయ్కుమార్, భాస్కర్రావు పాల్గొన్నారు. -
మళ్లీ పొడిగింపేనా?
● ఫిబ్రవరిలో ఆరు నెలలు పెంచిన ప్రభుత్వం ● నేటితో ముగియనున్న సొసైటీ పాలకవర్గాల గడువు ● జాతీయ పతాకావిష్కరణపై చైర్మన్ల ధీమాఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వివరాలుకై లాస్నగర్/నిర్మల్చైన్గేట్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు ఈ నెల 14న ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీటి గడువు ముగిసినప్పటికీ డీసీసీబీ చైర్మన్ల విజ్ఞప్తి మేరకు ఆరునెలల పాటు అదనంగా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు సైతం గురువారంతో ముగియనుంది. ప్రస్తుతం వీటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో సొసైటీ పాలకవర్గాల గడువు పెంపు మరోసారి అనివార్యం కానుంది. ప్రత్యేకాధికారులను కూడా నియమించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. పంద్రాగస్టు వేడుకల్లో తామే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామని సొసైటీ చైర్మన్లు ధీమా వ్యక్తం చేస్తుండటంతో పాలకవర్గాల గడువు మరోసారి పొడిగింపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండోసారి పదవీకాలం పొడిగింపు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)కు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహించింది. సొసైటీ పరిధిలో ఎన్నికై న చైర్మన్లతో అదే నెల 25న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎన్నికలు నిర్వహించారు. వీరితో పాటు పలువురు డైరెక్టర్లను సైతం ఎన్నుకున్నారు. కాగా ఈ సొసైటీలకు ఎన్నికలు జరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీతో ఐదేళ్ల గడువు పూర్తయ్యింది. దీంతో వాటి కాలపరిమితి ముగియడంతో రాష్ట్రంలోని డీసీసీబీ చైర్మన్లంతా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ పదవీకాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఆరునెలల పాటు పదవీకాలాన్ని పొడిగించింది. తాజాగా ఈ గడువు నేటితో ముగియనుంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో మరోసారి తమ పదవీకాలాన్ని పొడిగించాలని డీసీసీబీ చైర్మన్లతో పాటు సొసైటీ చైర్మన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో మరోసారి మూడు లేదా అరునెలల పాటు పదవీకాలం పొడిగిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవీ కాలం ముగియడంతో 15వ తేదీన జరిగే పంద్రాగస్టు వేడుకల్లో చైర్మన్ల హోదాలో జాతీయ పతాకావిష్కరణ చేసే అవకాశం ఉండదు. అయితే ప్రభుత్వం ఎలాగైనా తమ పదవీకాలాన్ని పొడిగిస్తుందనే ధీమాలో ఉన్న సొసైటీ చైర్మన్లు తామే మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.సహకార సంఘాలు : 77 డీసీసీబీ : 01 డీసీఎంఎస్ : 01 సొసైటీల పరిధిలోని సభ్యులు : 55 వేలు అన్నదాతకు వెన్నుదన్నుగా ... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 55 వేలకు పైగా రైతులు ఉన్నారు. వారికి వ్యవసాయ సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలను క్షేత్రస్థాయిలో అందజేస్తూ సొసైటీలు వారికి అండగా నిలుస్తున్నాయి. పలు సొసైటీలు ధాన్యం కొనుగోళ్లను సైతం చేపడుతున్నాయి. ఈ సొసైటీలన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ), జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. అవకాశముంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు ఈ నెల 14తో ముగియనుంది. ఇటీవలే ఆరు నెలల పాటు సొసైటీల గడువును ప్రభుత్వం పొడిగించింది. మరోసారి సైతం పదవీకాలాన్ని పొడిగించేందుకే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది. – బి.మోహన్, జిల్లా సహకార శాఖ అధికారి, ఆదిలాబాద్ -
‘నవోదయ’లో ప్రవేశానికి గడువు పొడిగింపు
కాగజ్నగర్టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికిగానూ ఆరోతరగతిలో ప్రవేశానికి నిర్వహించనున్న అర్హత పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27 వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ బు ధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనికోరారు. ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుకు సత్కారంఆసిఫాబాద్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2025 కోసం బుధవారం హైదరాబాద్లోని పాఠశాల విద్యాసంచాలకుల కార్యాలయంలో జాతీయ స్వతంత్య్ర జ్యూరీ నిర్వహించారు. కుమురంభీం జిల్లా నుంచి జన్కాపూర్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు ధర్మపురి వెంకటేశ్వర్లు ముఖాముఖిలో పాల్గొన్నారు. రాష్ట్ర నుంచి 160 మంది దరఖాస్తు చేసుకోగా ఆరుగురిని ఎంపిక చేశారు. ఇందులో వెంకటేశ్వర్లు ఒకరు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు పాఠశాల విద్యాప్రగతిని, విద్యార్థుల ప్రగతిలో వినూత్న సేవలను వివరించారు. అనంతరం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఉపాధ్యాయుడిని శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు మదన్మోహన్, ఆర్జేడీ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
వివాహానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
● బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ● ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి ● మృతుల్లో ఒకరు కానిస్టేబుల్వెల్గటూర్: అప్పటివరకూ స్నేహితుడి వివాహ వేడుకలో అందరితో కలిసి ఆనందంగా గడిపిన ఆ యువకులు.. ఇంటికి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసులు, స్థానికుల కథనం వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన ముచ్చకుర్తి అనిల్(26), మేడి గణేశ్(26) ఇద్దరు స్నేహితులు. ద్విచక్రవాహనంపై ఎండపల్లి మండల కేంద్రంలో బుధవారం జరిగిన స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. రాత్రిపూట స్వగ్రామమైన ఇటిక్యాలకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. వెల్గటూర్ మండలం పాశిగామ స్టేజీ వద్ద లక్సెట్టిపేట నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వస్తోంది. అదే సమయంలో రోడ్డుపైకి ఓ గేదె రావడంతో బస్సు గేదెను ఢీకొంది. బస్సు డ్రైవర్ గేదెను తప్పించే క్రమంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. అనిల్ ఇటీవలే కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉద్యోగం చేస్తున్నాడు. గణేశ్ హైదరాబాద్లో వండర్ లాలో పనిచేస్తున్నట్లు సమాచారం. గణేశ్కు సోదరి ఉంది. తల్లిదండ్రులు గ్రామంలో కూలీ పని చేసుకుని జీవిస్తున్నారు. అనిల్ తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం ముంబయి వలస వెళారు. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కడెం కెనాల్లో పడి ఒకరు మృతి
దండేపల్లి: మద్యం మత్తులో కడెం కెనాల్లో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సేదం నర్సయ్య (48) కూలీ పని నిమిత్తం దండేపల్లి మండలంలోని కుంటలగూడకట్టకు చెందిన తన బంధువైన బొబ్బిలి బక్కవ్వ ఇంటికి వచ్చాడు. మంగళవారం మద్యం సేవించి కడెం కెనాల్ సమీపంలో ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఆతరువాత కొద్దిసేపటికి అతను కనిపించక పోవడంతో బంధువులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆచూకీ కోసం వెతుకుతుండగా బుధవారం కుంటలగూడకట్ట సమీపంలోని కడెం కెనాల్ లో చెట్లపొదలకు తట్టుకుని మృతదేహం దొరికింది. మద్యం మత్తులో ప్రమాద వశాత్తు కెనాల్లో జారిపడడంతో ఈతరాక నీటిలో మునిగి మృతి చెందాడని మృతుని బంధువు భూమేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
అప్పుల బాధతో లారీ డ్రైవర్ ఆత్మహత్య
కాసిపేట: అప్పులబాధతో లారీ డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చో టు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపారు. కాసిపేట పోలీస్స్టేషన్ పరి ధిలోని సోమగూడెం ఇందిరమ్మ కాలనీకి చెందిన మహమ్మద్ రంజాన్(41) ఇటీవల లారీని కొనుగోలు చేయడంతో అప్పులపాలయ్యాడు. ఈనెల 12న శ్రీరాంపూర్లో ఆర్టీసీ బస్సుతో యాక్సిడెంట్ అయిందని కుటుంబ సభ్యులతో చెప్పి బాధపడ్డాడు. ఇప్పటికే అప్పుల పాలైన తాను యాక్సిడెంట్తో మరింత అప్పులు పెరుగుతుండడంతో మానసికంగా కుంగిపోయి బుధవారం ఉదయం తన ఇంటిముందు రేకులకు లుంగీతో ఉరేసుకున్నాడు. మృతుని కుమారుడు హసన్బాబా ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒకరు..నేరడిగొండ: మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన సోలాంకి శ్రీకాంత్ (26) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చే సుకున్నట్లు ఎస్సై ఇమ్రాన్ తెలిపారు. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఫాస్టాగ్ తరహాలో టైగర్ జోన్ ఎంట్రీ ఫీజుకడెం: టోల్గేట్ మాదిరిగా ఫాస్టాగ్ తరహాలో చెక్పోస్ట్ల వద్ద సెస్ వసూలు చేసేందుకు అట వీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కవ్వాల్ టైగర్ జోన్ గుండా ప్రయాణించే వాహనాలకు చెక్ పోస్ట్ల వద్ద ఎన్విరాల్మెంట్ సెస్ వసూలు చేస్తున్నా రు. గతంలో టైగర్జోన్ పరిధిలో భారీ వాహనాలకు అనుమతులు లేవు. ఇటీవలే అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. పాండ్వపూర్ లోని చెక్పోస్ట్ వద్ద టైగర్జోన్లోకి ఎంట్రీ అయ్యే వాహనాలు ఇప్పటి వరకు సిబ్బంది సెస్ వసూలు చేసేవారు. ఫాస్టాగ్ తరహాలో ఏర్పాటు చేయబోతున్న చెక్పోస్ట్తో వాహనదారులు వెంటవెంటనే వెళ్లేందుకు వీలుంది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
గుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీ వ్రంగా గాయపడిన వెన్నెల నారాయణ (51) చికి త్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు ఆదిలాబాద్ మండలంలోని యాపల్గూడకు చెందిన నారాయణ మంగళవారం ఉదయం తన మోటార్ సైకిల్పై అడెల్లి పోచమ్మ దర్శనానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో స్థానిక శర్మ దాబా వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్సులో రిమ్స్కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారి రాజు, ఏఎస్సై రంగారావు తెలిపారు. ఆగి ఉన్న లారీని ఢీకొని సింగరేణి కార్మికుడు..రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రిలోని గాంధీనగర్కు చెందిన సాయి వెంకటేష్ (28) అనే సింగరేణి కార్మికుడు మృతి చెందాడు .శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే–7 గనిలో జనరల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వెంకటేష్ బైక్పై మంచిర్యాల నుండి మందమర్రి వైపు వెళ్తుండగా బొక్కలగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుని తండ్రి బానేష్ గతంలోనే అనారోగ్యంతో మృతి చెందగా తల్లి అన్నపూర్ణ అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. గూడ్స్ రైలు ఢీకొని ఒకరు..సిర్పూర్(టి): ఆరెగూడ సమీపంలో డౌన్లైన్పై ఆపోజిషన్ డైరెక్షన్లో రైల్వే కాంట్రాక్ట్ లేబర్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గూడ్స్ రైలు రివర్స్లో వచ్చి ఢీకొనడంతో షేక్ జంషేద్ (44) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం 5.40 గంటలకు షేక్ జంషేద్, ప్రవీణ్, పర్వేస్ నైట్ పెట్రోలింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రవీణ్కు చేయి విరగడంతో హైదరాబాద్కు తరలించారు. కాగజ్నగర్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ కె.సురేష్ గౌడ్ విచారణ జరిపారు. షేక్ జంషేద్ మృతదేహానికి పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒకరిపై వేధింపుల కేసుజైనథ్: అదనపు కట్నం కోసం వేధించిన ఒకరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన రంగ బాలరాజు గౌడ్ కుమార్తె స్రవంతికి అంకోలి గ్రామానికి చెందిన బాలాజీతో 2018లో వివాహమైంది. కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో రెండు సంవత్సరాల క్రితం స్రవంతి పుట్టింటికి వచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. వారం రోజుల క్రితం బాలాజీ జైనథ్కు వచ్చి చంపుతానని బెదిరించడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
ఇంటిస్థలం కబ్జా చేసిన ఎనిమిది మందిపై కేసు
ఆదిలాబాద్రూరల్: మావల శివారు ప్రాంతంలోని సర్వేనంబర్ 170లో నకిలీ ఇంటి పత్రాలు సృష్టించి ఆ స్థలాన్ని కబ్జా చేసిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. బుధవారం మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన స్వామికి 2013 బీపీఎల్ కింద ప్రభుత్వం 905 నంబర్ గల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో బాధితుడు స్వామి గుడిసె వేసుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం 2015లో అనుమతులు సైతం తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా ఇంటి నిర్మాణం చేపట్టలేకపోయాడు. రహెమాన్ఖాన్ ఆ స్థలంలో ఉన్న గుడిసెను తొలగించి వెంకటమ్మకు రూ. 2.30 లక్షలకు విక్రయించాడు. వెంకటమ్మ ఆ స్థలాన్ని కిష్టన్నకు రూ.3.50 లక్షలకు విక్రయించింది. బాధితుడు స్వామిని బెదిరింపులకు గురిచేయడంతో ఎస్పీ అఖిల్ మహాజన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో సుంకరి సంతోష్, రహిమాన్ ఖాన్, తాటి లక్ష్మణ్, కిష్టన్న, పవన్ నాయక్, సుంకరి వెంకటమ్మ, శరత్, వంశీకృష్ణపై కేసు నమోదు చేశా రు. ఇందులో నలుగురిని అరెస్టు చేయగా కిష్టన్న పవన్ నాయక్, సుంకరి వెంకటమ్మ, శరత్ పరారీలో ఉన్నారు. సమావేశంలో మావల సీఐ కర్రె స్వామి, ఎస్సై రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గంజాయి సేవిస్తున్న ముగ్గురిపై.. నెన్నెల: గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. కొందరు యువకులు బొప్పారం అడవిలో గంజాయి సేవిస్తున్నారని అందిన సమాచారం మేరకు వెంటనే దాడి చేయగా మంచిర్యాల గద్దెరాగడికి చెందిన ఐటీఐ విద్యార్థి పాల్తెపు ప్రణయ్ దొరికిపోయాడు. అతడిని సోదా చేయగా 1.5 గ్రాముల గంజాయి లభించింది. గంజాయితో పాటు పల్సర్ బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీస్స్టేషన్కు తరలించి వివరాలు సేకరించారు. ప్రణయ్తో పాటు పారిపోయిన నెన్నెల మండలం గన్పూర్ గ్రామానికి చెందిన పోతురాజుల అకాశ్, గొల్లపల్లికి చెందిన సల్లూరి పెత్రుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ప్లాట్ ఇస్తానని మోసం చేసిన ఒకరిపై..ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ యజమాని సయ్యద్ షాహిద్పై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కె.నాగరాజు తెలిపారు. 2008లో నార్నూర్కు చెందిన ఎక్బాల్ ఖాన్ షాహిద్ వద్ద రూ.50 వేలకు ఆదిలాబాద్ పట్టణంలో ఓ ప్లాట్ కొనుగోలు చేశాడు. రూ.20వేలు అడ్వాన్స్ ఇవ్వగా రూ.30 వేలు కిస్తులుగా చెల్లించాడు. ఆ తర్వాత ప్లాట్ ఇవ్వకుండా 2016లో మరో వ్యక్తికి విక్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
చిన్నారిపై వీధికుక్క దాడి
లక్ష్మణచాంద: మండలంలోని ధర్మారంలో బాలు ని పై వీధికుక్క దాడి చే యడంతో గాయాలయ్యా యి. గ్రామానికి చెందిన మల్లెల శ్రీకాంత్–శిరీష దంపతుల కుమారుడు కౌశిక్ మంగళవారం ఇంటిముందు ఆడుకుంటుండగా వీధికుక్క వచ్చి దాడి చేసింది. తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు బాలుడిని నిర్మల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలుఆదిలాబాద్రూరల్: భార్యపై హత్యాయత్నం కేసులో భర్తకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.ప్రభాకర్రావు బుధవారం తీర్పునిచ్చినట్లు మావల సీఐ కర్రె స్వామి తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టల్వాడకు చెందిన జాదవ్ ఆనంద్రావు మద్యం సేవించి ఇంటికి వచ్చి తరచూ భార్యతో గొడవపడేవాడు. ఇదేక్రమంలో తలపై సుత్తెతో కొట్టడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దంపతుల కుమారుడు మహేష్ 18 డిసెంబర్ 2024న పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై విష్ణువర్ధన్ కేసు నమోదు చేశారు. కోర్టు డ్యూటీ అధికారి సంతోష్ 10 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పైవిధంగా తీర్పు వెల్లడించారు. -
ఐచర్ ఢీకొని వ్యక్తి మృతి
● న్యాయం చేయాలని రహదారిపై బైఠాయించిన కుటుంబ సభ్యులుతానూరు: భైంసా–నాందేడ్ రహదారిపై బెల్తరోడా ఎక్స్రోడ్డు వద్ద బుధవారం ఐచర్ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. మహలింగి గ్రామానికి చెందిన బన్సోడే ప్రభుదాస్ (35) భార్య లక్ష్మి, కుమారుడు అరుతో కలిసి భైంసాకు వెళ్లాడు. బుధవారం స్వగ్రామానికి వెళ్లేందుకు బెల్తరోడా ఎక్స్రోడ్డు వద్ద బస్సు దిగారు. భార్య, కుమారుడిని అక్కడే కూర్చోబెట్టి మక్కబుట్టా తీసుకువచ్చేందుకు రోడ్డు దాటుతుండగా భైంసా నుంచి నాందేడ్ వైపు అతివేగంగా వెళ్తున్న ఐచర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం ఆపకుండా వెళ్తుండడంతో స్థానికులు వెంబడించి మహారాష్ట్ర సరిహద్దులోని రాఠి గ్రామ శివారులో పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై షేక్ జుబేర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. న్యాయం చేయాలని రహదారిపై బైఠాయింపు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు రహదారిపై బైఠాయించారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం చోటు చేసుకుందని, పరిహారం అందేవరకూ ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. -
ఉద్యోగాల పేరిట మోసగించిన నిందితుడి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: ఎస్కే మైక్రోఫైనాన్స్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద ఎత్తున మోసం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇంద్రవెల్లి మండలంలోని శంకర్గూడకు చెందిన జవాడే కృష్ణ అలియాస్ జాదవ్ కృష్ణ ఎన్ఆర్ఐ అంటూ సామాజిక సేవ పేరుతో పరిచయాలు పెంచుకొని మైక్రో ఫైనాన్స్, ప్రభుత్వ ఆస్పత్రులు, అంగన్వాడీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. 2024 డిసెంబర్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్లో మైక్రో ఫైనాన్స్ పేరుతో కార్యాలయాలను ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా 300 మంది నుంచి రూ.20 వేల చొప్పున మెంబర్షిప్ చేయించాడు. రెండు కార్యాలయాల్లో ఐదుగురు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని నిరుద్యోగుల నుంచి రూ.69 లక్షలు వసూలు చేశాడు. ఆరునెలల పాటు కనిపించకపోవడంతో జూలైలో నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శంకర్గూడలో రూ.9 లక్షల నగదు, రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇంట్లోనే దాచిపెట్టి రూ.15 లక్షలతో పరారయ్యాడు. నిందితుడిని భోరజ్ చెక్పోస్టు వద్ద అరెస్ట్ చేసి రూ.9లక్షల నగదుతో పాటు 10.7 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఐదు సెల్ ఫోన్లు, ఒక ఖరీదైన వాచ్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి విడతల వారీగా వసూలు చేసి మోసం చేసిన డబ్బుల్లో రూ.6లక్షలు ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్ యజమానికి ఇచ్చాడని, మరో రూ.6లక్షలు మహరాష్ట్రలోని నాగ్పూర్లో భవన యజమానికి, రూ.3.5 లక్షలు ఆదిలాబాద్, ఉట్నూర్ కార్యాలయాల నిర్వహణకు, రూ.2.1 లక్షలు నిందితుడి తమ్ముడి అవసరాల నిమిత్తం ఇచ్చినట్లు తెలిపారు. మిగితా డబ్బులు జల్సాల కోసం, తప్పించుకోవడానికి ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నిందితుడు కరోన సమయంలో ముంబాయ్లో ఫేక్ రెమిడి ఇంజక్షన్లను విక్రయించాడని, నాగ్పూర్లో రుణాల పేరిట అక్కడి ప్రజలను మోసం చేశాడని తెలిపారు. నిందితుడిపై ఉట్నూర్లో 3, ఇంద్రవెల్లిలో 3, నార్నూర్లో 2, మావల పోలీసు స్టేషన్లో 3, ఆదిలాబాద్ వన్టౌన్లో 2, జైనథ్లో 3 చొప్పున కేసులు నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఉట్నూర్ సీఐ ఎం.ప్రసాద్, ఐటీకోర్ ఎస్సై గోపీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ● వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ -
● ఆర్టీసీకి కలిసి వచ్చిన వరుస సెలవులు ● ‘పౌర్ణమి’ రోజున రూ.2.89 కోట్ల ఆదాయం ● రీజియన్ వ్యాప్తంగా రూ.9.26 కోట్ల ఆమ్దాని
మంచిర్యాలఅర్బన్/ఆదిలాబాద్: వరుస సెలవులు, పండుగలు ప్రజా రవాణా సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఈనెల 8న వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీపౌర్ణమి, 10న ఆదివారం కలిసి రావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల 7నుంచి 11వరకు రీజియన్ వ్యాప్తంగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 101 నమోదవడం రద్దీ తీరుకు నిదర్శనం. ఉమ్మడి ఆదిలాబాద్లోని ఆరు డిపోల పరిధిలో ఐదు రోజుల వ్యవధిలో ప్రతీ కిలోమీటర్కు రూ.66.48 ఆదాయం వచ్చింది. మొత్తం 639 బస్సులు 13,93,000 కిలోమీటర్లు తిరిగి 18.84 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. జూలై నెలలో ఒక్క సాధారణ రోజు ఇన్కమ్ రూ.1.85 కోట్లుగా ఉంది. అయితే రాఖీ పండుగ ఒక్కరోజే రీజియన్ వ్యాప్తంగా రూ.2.89 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. గతేడాది ఈ పండుగకు రూ.1.57 కోట్ల ఆదాయం రాగా ఈ సారి అదనంగా మరో రూ.1.32 కోట్లను ఆర్జించి ఆర్టీసీ రికార్డు సృష్టించింది. మొత్తంగా ఐదు రోజుల్లో రీజియన్ పరిధిలో రూ.9.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా నిర్మల్ డిపో రూ. 2.49 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ‘మహాలక్ష్మి’లే అధికం..తమ సోదరులకు రాఖీ కట్టేందుకు దూర ప్రయాణమైనా మహిళలు ఆర్టీసీలో ప్రయాణించడం సంస్థకు లాభించింది. ఐదు రోజుల వ్యవధిలో మొత్తం 18.84 లక్షల మంది ప్రయాణించగా, అందులో 12.60 లక్షల మంది ‘మహాలక్ష్మి’లే ఉన్నారు. అత్యధికంగా పౌర్ణమి రోజున 4.27 లక్షల మంది ప్రయాణించగా, ఇందులో 2.93 లక్షల మంది మహాలక్ష్మి లబ్ధిదారులున్నారు. ఇక ఆక్యూపెన్సీ రేషియో విషయానికి వస్తే ఉట్నూరు డిపో పరిధిలో అత్యధికంగా 109 ఉండగా, నిర్మల్ 106, భైంసా 102, ఆదిలాబాద్ 101, మంచిర్యాల 97, ఆసిఫాబాద్ 95గా నమోదయ్యాయి. ముందస్తు ప్రణాళికతో..వరుసగా రెండు పండుగలు, ఆదివారం కూడా తోడవడంతో రద్దీని ముందే పసిగట్టిన ఆర్టీసీ అధి కారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగా రు. ఉమ్మడి జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర ప్రాంతాలతోపాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. తదనుగుణంగా యాజమాన్యం ప్రత్యేక బస్సులు నడిపింది. ముఖ్యంగా హైదరాబాద్కు 118 స్పెషల్ సర్వీస్లను ఏర్పాటు చేశారు. రద్దీకి అ నుగుణంగా 7, 8వ తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉ మ్మడి ఆదిలాబాద్లోని వివిధ ప్రాంతాలకు 46 బ స్సులు ఏర్పాటు చేయగా, 10 నుంచి 12వ తేదీ వర కు రీజియన్ నుంచి హైదరాబాద్కు 72 బస్సులను ఆపరేట్ చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్డెస్క్లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగుల ఇబ్బందులను పరిగణలోనికి తీసుకొని ఈసారి వారికి ప్రత్యేక భోజన వసతి కల్పించారు. ఫలితంగా ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడంతోపాటు ఆర్టీసీకి ఆమ్దాని వచ్చింది. రీజియన్ పరిధిలో ఇలా.. (ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు)అగ్రస్థానంలో నిర్మల్ డిపో.. ఐదు రోజుల్లో నిర్మల్ డిపో రూ.2.49 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది రూ.1.25 కోట్లతో సరిపెట్టుకోగా, ఈసారి రెట్టింపు సమకూర్చుకో వడం విశేషం. గతంలో రూ.కోటి 80 వేల ఆదాయంతో నిలిచిన ఆది లాబాద్ ఈసారి పుంజుకుని రూ.2.15 కోట్లకు చేరుకుంది. డిపో బస్సులు ప్రయాణించిన ఆదాయం కి.మీ(లక్షల్లో) (రూ.కోట్లలో) ఆదిలాబాద్ 3.22 2.15 భైంసా 1.47 0.90 నిర్మల్ 3.47 2.49 ఉట్నూర్ 0.77 0.53 ఆసిఫాబాద్ 1.69 1.06 మంచిర్యాల 3.31 2.13 రీజియన్ 13.93 9.26సమష్టి కృషి ఆర్టీసీ ప్రతీ ఉద్యోగి సమష్టి కృషితోనే మంచిర్యాల డిపోకు ఆదాయం సమకూరింది. పండుగవేళ కూడా ప్రతి ఒక్కరూ విధిగా రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వర్తించారు. మహిళా ఉద్యోగులూ రాఖీ రోజున డ్యూటీలు చేయాల్సి వచ్చింది. వీరందరి కృషితోనే ఐదు రోజుల్లో రూ.2,12,73,888 ఆదాయం ఆర్జించాం. ఆదాయం రావడానికి కృషి చేసిన ప్రతీ ఉద్యోగికి ఈ నెల 13న స్వీట్లు పంపిణీ చేస్తాం. –శ్రీనివాసులు, డీఎం, మంచిర్యాల -
లక్ష్య సాధనపై సింగరేణి దృష్టి
● సంస్థ స్థితిగతులపై ఉద్యోగులకు అవగాహన ● ఉత్పత్తి పెంపునకు చర్యలు ● మల్టీడిపార్టుమెంటల్ సమావేశాలు శ్రీరాంపూర్: సింగరేణిలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పని సంస్కృతిని మెరుగుపర్చేందుకు యాజమాన్యం దృష్టి సారించింది. బొగ్గు మార్కెట్లో పోటీ నెలకొనడం, గనులన్నీ పాతవి కావడం, సంప్రదాయ పని విధానం, కొత్తగనులు రాకపోవడం, యంత్రాల వినియోగం తగ్గడం వెరసి సంస్థ సవాళ్లు ఎదుర్కోంటోంది. ఈ నేపథ్యంలో కంపెనీని గట్టెక్కించి ఉజ్వల భవిష్యత్కు పునాది వేయడం కోసం అధికారులు సంస్థ స్థితిగతులపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నారు. వనరుల సద్వినియోగం వల్ల సంస్థ లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఇందుకోసం ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్ల్లో మల్టీడిపార్టుమెంటల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కంపెనీ వ్యాప్తంగా మంగళవారం ప్రారంభమైన సమావేశాలు ఈ నెల 18వరకు కొనసాగుతాయి. భూగర్భగనులు, ఓసీపీలు, డిపార్టుమెంట్లపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, లాభనష్టాలు, యంత్రాల పనితీరు, బొగ్గు నాణ్యత, గత సంవత్సరం సాధించిన ఉత్పత్తి ఉత్పాదకత ఎలా ఉంది, భూగర్భగనుల్లో వస్తున్న నష్టాలు, ఓసీపీలో వస్తున్న లాభాలతో సమం చేస్తుండడంపై కంపెనీ, ఏరియా స్థాయితోపాటు గనులవారీగా గణాంకాలు తీసి వివరిస్తున్నారు. నష్టాలు తగ్గించడానికి ఏం చేయాలి, ఏ చర్యలు తీసుకుంటే ఉత్పత్తి పెరుగుతుందో తెలియజేస్తున్నారు. సద్వినియోగంతోనే ఉపయోగంబొగ్గు ఉత్పత్తిలో భూగర్భ గనుల్లో ఎస్డీఎల్ యంత్రాల వినియోగం పెంచాలని సూచిస్తున్నారు. ఒక ఎస్డీఎల్ యంత్రం రోజు 133 టన్నుల ఉత్పత్తి సాధించాల్సి ఉండగా 100 టన్నుల వరకే సాధిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. వంద శాతం ఉత్పత్తి సాధిస్తే ఉత్పత్తి పెరిగి నష్టం తగ్గుతుందని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం భూగర్భ గనుల్లో టన్ను బొగ్గు ఉత్పత్తి చేస్తే రూ.9,468 ఖర్చవుతుంది. దీన్ని విక్రయిస్తే రూ.4864 వస్తుంది. ఈ లెక్కన టన్ను బొగ్గు ఉత్పత్తి చేస్తే కంపెనీకి రూ.4602 నష్టం వస్తున్నట్లు లెక్కలేసి చెబుతున్నారు. డ్రిల్మిషన్ల పనితీరు, ప్రస్తుతం పనిగంటలు, లక్ష్యం ఎంత వివరిస్తున్నారు. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే షవల్స్ పనితీరు మెరుగుపర్చాలని, డంపర్లు 18 గంటల పని చేయాలని, బొగ్గు నాణ్యత పాటించకపోవడం వల్ల రూ.కోట్లు ఫెనాల్టీ చెల్లించాల్సి రావడం అంశాలు తెలియజేస్తున్నారు. స్పేర్స్ కొరత.. నాసిరకం పరికరాలుఅధికారులు ఎంత చెప్పినా కంపెనీ పరంగా చర్యలు తీసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయని కార్మికులు పేర్కొంటున్నారు. భూగర్భ గనుల్లో చాలా వరకు ఎస్డీఎల్ యంత్రాలు సర్వే ఆఫ్ అయినవే ఉన్నాయి. వాటితోనే పని చేస్తున్నారు. దీనికి తోడు స్పేర్స్ కొరత తీవ్రంగా ఉంది. స్పేర్స్ సమయానికి బ్రేక్డౌన్ల వల్ల నష్టం జరుగుతోంది. మరికొన్ని సందర్భాల్లో నాసిరకం ఆయిల్స్, విడిభాగాలు లేకపోవడం వల్ల యంత్రాలు మొరాయించి ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయని కొందరు అధికారులే పేర్కొంటున్నారు. ఓసీపీల్లో కాంట్రాక్టర్లు ఓబీ లక్ష్యాలను తీయకపోవడం వల్ల బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. అనుభవం, సామర్థ్యం లేని సంస్థలకు ఓబీ పనులు అప్పగించడం, టెండర్లలో విధానపర లోపాలు, ఓబీ వెలికితీతకు సరిపడా యంత్రాలను సమకూర్చుకోకపోవడం వెరసి సంస్థ ఉత్పత్తి లక్ష్యాలపై ప్రభావం చూపుతుందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యాలు పెరగడం, యూనియన్ నేతలు, కార్యకర్తలు కొందరు పూర్తి స్థాయిలో గనుల్లోకి దిగి పనిచేయకుండా ఉచిత మస్టర్లు పొంది సంస్థకు నష్టం చేస్తున్న సందర్భాలూ లేకపోలేదు. ఈ వ్యవస్థాగత లోపాలను సరిచేయాల్సిన బాధ్యత కూడా యాజమాన్యంపై ఉంది. -
కదిలే స్పీడ్ బ్రేకర్లు..!
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో రోడ్ల పై పశువులు సంచరిస్తూ వాహనదారులకు ప్రాణసంకటంగా మారాయి. వాహనాల వేగా నికి ఒక్కసారిగా బ్రేక్లు వేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పాతమంచిర్యాల, నగరంలోని జాతీయ రహదారులపై పశువులు గుంపులుగా తిరుగుతున్నాయి. తోళ్లవాగు నుంచి శ్రీనివాసగార్డెన్, ఐబీ చౌరస్తా నుంచి వేంపల్లి, లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి బైపాస్ రోడ్డు మీదుగా వైశ్యాభవన్ వరకు పశువులు నిత్యం రోడ్లపై మకాం వేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. జిల్లా కేంద్రం కావడం, వివిధ ప్రాంతాల ప్రజలు పనుల నిమిత్తం వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 8న రాత్రి మంచిర్యాలలోని శ్రీనివాసకాలనీకి చెందిన శీకా మణిబాబుతోపాటు మరో నలుగురు ఓమిని వ్యాన్లో కరీంనగర్ నుంచి వస్తుండగా పాతమంచిర్యాల వద్ద రోడ్డుపై పడుకుని ఉన్న ఆవుని ఢీకొన్నారు. దీంతో వ్యానులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆవు యజమాని కార్తీక్పై మంచిర్యాల పోలీసుస్టేషన్లో 9న కేసు నమోదైంది. ఆయనను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కార్పొరేషన్ అధికారులు స్పందించి పశువులు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు తక్షణ సహాయం, సౌకర్యార్థం ప్రతీ జిల్లాలో పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, 24 గంటలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో విద్యుత్, నీటిపారుదల, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి సబ్కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
భూ సమస్యలు పరిష్కరించాలి
భీమిని: భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. మంగళవారం ఆయన కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. భూ భారతిలో మండలంలో దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, వాటిలో ఎన్నింటిని పరిష్కరించారని ఆరా తీశారు. ఆయా గ్రామాల్లోని పెండింగ్ సమస్యలపై విచారణ చేపట్టి పరిష్కరించాలని సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని తెలిపారు. తహసీల్దార్ శ్రావణ్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ పోచయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
‘అత్యవసర సేవకులే కాదు.. ప్రాణదాతలు’
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యుత్ సరఫరాలో వినియోగదారులకు అంతరాయం లేకుండా అందిస్తున్న అత్యవసర సేవకులే కాదు.. రక్తదానం చేసి ప్రాణదాతలు కూడా అయ్యారని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే అ న్నారు. మంగళవారం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ భవనంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమి యా, సికిల్సెల్ వ్యాధిగ్రస్తుల సహాయర్థం ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ మంచిర్యాల రక్తనిధి కేంద్రానికి ప్రతీ సంవత్సరం విద్యుత్ శా ఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ కే.భాస్కర్రెడ్డి మాట్లాడుతూ రక్తనిధి కేంద్రంలో నిల్వలు అట్టడుగు స్థాయికి చేరా యని, స్వచ్ఛంద సేవాసంస్థలు, యువత ముందుకు రావాలని తెలిపారు. జేఏసీ చైర్మన్ సత్తిరెడ్డి, రమేష్, డీఈ ఎంఎం ఖైసర్, బెల్లంపల్లి డీఈ రాజన్న, ఏడీఈ మోహన్రెడ్డి, రాజశేఖర్, రవికుమార్, కాటం శ్రీనివాస్, శరత్, ఏఈ మంచాల శ్రీరివాస్, క్రిష్ణ పాల్గొన్నారు. -
కొత్త ప్లాంటు పనులపై సమీక్ష
జైపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో డైరెక్టర్(ఈఅండ్ఎం) డీ.సత్యనారాయణరావు పర్యటించారు. మంగళవారం ఎస్టీపీపీ ప్రాణహిత గెస్ట్హౌస్లో అధికారులతో 800 మెగావాట్ల ప్లాంటు ప నులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిర్ణీత సమయంలో మూడో యూని ట్ ప్లాంటును ఏర్పాటు చేయాలని అన్నారు. మిథనాల్ ప్లాంటు నిర్మాణ పనులను పర్యవేక్షించి త్వరి తగతిన పూర్తి చేయాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్లాంటు పరిసరాల్లో సీబీఎస్ఈ స్కూల్ ప్రారంభించేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్టీపీపీ ఈడీ సీహెచ్.చిరంజీవి, హెచ్వోడీ(పీపీడీ) కే.విశ్వనాథరాజు, జీఎం(ఎస్టీపీపీ) శ్రీనివాసులు, జీఎం(పీసీఎస్, ఓఅండ్ఎం) నరసింహరావు, ఏజీఎం(ఫైనాన్స్) మురళీధర్, ఏజీఎం(ఈఅండ్ఎం) మదన్మోహన్, ఏజీఎం(సోలార్) శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్కు ఘన సన్మానంశ్రీరాంపూర్: సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) డీ.సత్యనారాయణరావును ఏరియా అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ నెలాఖరుతో రిటైర్డ్ కాబోతున్న ఆయన మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా వర్క్షాప్ను సందర్శించిన సందర్భంగా సన్మానం చేశారు. ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, వర్క్షాప్ డీజీఎం రవీందర్, అధికారులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో జూనియర్ అసిస్టెంటు
● డీఏ బిల్లు తయారీకి లంచం డిమాండ్ ● రూ.6వేలు తీసుకుంటుండగా పట్టివేత ● వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు మంచిర్యాలక్రైం: డీఏ బిల్లు తయారీకి లంచం డిమాండ్ చేసిన ఆరోగ్యశాఖ జూనియర్ అసిస్టెంట్ను ఏసీబీ అధికారులు మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు వివరాలు వెల్లడించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గడియారం శ్రీనివాస్ కోటపల్లి మండలం అంగరాజుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇన్చార్జి జూనియర్ అసిస్టెంట్గానూ పని చేస్తున్నాడు. అంగరాజుపల్లిలోనే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పని చేసిన తోట వెంకటేశ్వర్లు ఇటీవల ఉద్యోగ విరమణ పొందాడు. రెండు నెలల డీఏ బిల్లు చేసేందుకు శ్రీనివాస్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నాడు. లంచం ఇస్తే బిల్లు చేస్తానని చెప్పడంతో రూ.6వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఒప్పందం ప్రకారం కలెక్టరేట్కు సమీపంలోని ఓ హోటల్ వద్ద వెంకటేశ్వర్లు నుంచి శ్రీనివాస్ రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కలెక్టరేట్లోని డీఎంహెచ్వో కార్యాలయంలో పూర్తి విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఏసీబీ డీఏస్పీ మధు మాట్లాడు తూ లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి అంటూ టోల్ ఫ్రీ నంబర్ 1064, మొబైల్ నంబర్, 9440446106 నంబర్లకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. -
చట్టప్రకారం నడుచుకుంటేనే సహకారం
● అటవీ భూములు సాగు చేస్తే చర్యలు ● కలెక్టర్ కుమార్ దీపక్ దండేపల్లి: గిరిజనులు చట్టప్రకారం నడుచుకుంటేనే సహకారం అందించి జీవనోపాధి కల్పిస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండలంలోని లింగాపూర్ అటవీ బీట్లో కొద్ది రోజులుగా సమీప గ్రామాల గిరిజనులు చెట్ల పొదలు తొలగించి సాగుకు ప్రయత్నిస్తున్నారు. అటవీ, పోలీసు అధికారులు నచ్చజెప్పినా వినిపించుకోవడం లేదు. దీంతో వారందరితో మాట్లాడేందుకు మంగళవారం కలెక్టర్ కుమార్ దీపక్ డీఎఫ్ఓ శివ్ఆశిష్సింగ్, డీసీపీ భాస్కర్తో కలిసి తాత్కాలిక గుడిసెల్లో ఉంటున్న గిరిజనుల వద్దకు వెళ్లారు. కలెక్టర్ మాట్లాడుతూ 2005కంటే ముందు పోడు వ్యవసాయం చేసుకుంటూ అందుకు తగిన ఆధారాలున్న వారికి మాత్రమే పోడు పట్టాలు ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత అక్రమంగా అటవీ భూముల్లో చెట్లు తొలగించి సాగు ప్రయత్నాలు చేసే వారికి ఎలాంటి పట్టాలు ఇవ్వబోమని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆక్రమిత అటవీ భూముల్లో వెదురు, పండ్లతోటలు పెంచుకునే అవకాశం కల్పిస్తామని, మొక్కలు నాటి సంరక్షించినందుకు కూలి చెల్లించడంతోపాటు వాటిని విక్రయిస్తే వచ్చే ఆదాయాన్ని సంబంధిత గిరిజనులకే చెందేలా చూస్తామని అన్నారు. కొందరు గిరిజనులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో కలెక్టర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎఫ్వో, డీసీపీ సూచించారు. గిరిజనులు ఆలోచించి అభిప్రాయాన్ని తెలియజేయాలని అన్నారు. ఏసీపీ ప్రకాశ్, తహసీల్దార్ రోహిత్దేశ్పాండే, సీఐ రమణమూర్తి, ఎస్సైలు తహాసీనొద్దీన్, సురేష్, అనూష, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. కాగా, గిరిజనులతో మాట్లాడేందుకు అధికారులంతా అడవిలో కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లారు. -
అశ్లీల వీడియోలు పోస్ట్ చేసిన ఇద్దరిపై కేసు
రామకృష్ణాపూర్: అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరిపై కేసు న మోదు చేసినట్లు మందమర్రి సీఐ శశిధర్రెడ్డి, ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మంగళవారం పో లీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లలో అశ్లీల వీడియోలు పోస్ట్ చేసినట్లు నేషనల్ సెంటర్ ఫర్ మి స్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్ చిల్డ్రన్ (ఎన్సీఎంఈసీ) సంస్థ వారు గుర్తించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్కు సమాచారం ఇచ్చారు. వారు ఆ కేసును తమకు అప్పగించడంతో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. -
కొలాం గిరిజనుల విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
నార్నూర్: ఏజెన్సీ ప్రాంతంలోని కొలాం గిరిజనుల విద్యాభివృద్ధికి ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏటీడీవో క్రాంతికుమార్ అన్నారు. మంగళవారం కొలాం హబిటేషన్ గ్రామాలైనా కొత్తపల్లి–హెచ్ కొలాంగూడ, భీంపూర్ కొలాంగూడ, బొజ్జుగూడలలో నూతనంగా ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొలాం గిరిజన పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో పాఠశాలలు ప్రారంభించినట్లు తెలిపారు. సీఆర్టీలను నియమించి విద్యాబోధన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పీఎం జన్మన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం బలిరాం, ఎస్సీఆర్పీ రాజబాబు, విజయ్కుమార్, సీఆర్టీ రోహిదాస్ చౌహాన్, రామేశ్వర్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు. -
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
తాంసి: మద్యం మత్తులో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పొన్నారిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గుమ్ముల నరేశ్ (31) కూలీ పనులకు వెళ్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. ఈక్రమంలో కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ పోషణకు గ్రామంలో పలువురి వద్ద అప్పులు సైతం చేశాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గ్రామ శివారులో గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ టి.ప్రభాకర్ మృతదేహన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టెబుల్ తెలిపారు. జీవితంపై విరక్తితో ఒకరు..భైంసారూరల్: జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కుంబి గ్రామానికి చెందిన ఉప్పులవార్ మాధవరావు (49) గ్రామంలో గొర్రెల కాపరిగా పనిచూస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉరేసుకుని ఒకరు..కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ఓ లాడ్జిలో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన నరేందర్(40)కు పదిహేనేళ్ల క్రితం వాంకిడి మండలానికి చెందిన సంతోషితో వివాహమైంది. ఏడాదిక్రితం అతని భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఒంటరి జీవితాన్ని గడుపుతూ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మానసికంగా బాధపడుతూ ఊర్లు తిరుగుతుండేవాడు. ఈక్రమంలో కాగజ్నగర్కు వచ్చి లాడ్జిలో బస చేశాడు. మంగళవారం గదిలో ఫ్యాన్కు తాడుతో ఉరేసుకున్నాడు. మృతుని సోదరుడు భూంపల్లి ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని జీఎస్ ఎస్టేట్లో నివాసముంటున్న ఆనంద్ త్రిపాఠి ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు ఈ నెల 6న ఇంటికి తాళం వేసి మధ్యప్రదేశ్కు వెళ్లాడు. సోమవారం సాయంత్రం అతని స్నేహితుడు శివకుమార్ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా కిటికి తలుపులు తెరిచి ఉండడం గమనించాడు. లోపలికి వెళ్లిచూడగా తాళం పగులగొట్టి ఉండడంతో విషయాన్ని స్నేహితుడికి సమాచారం అందించాడు. లాకర్లో ఉన్న రూ.10వేల నగదు, రిస్ట్ వాచ్, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు పేర్కొన్నాడు. శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. జఠాశంకర ఆలయంలో..ముధోల్: మండల కేంద్రంలోని జఠాశంకర ఆలయంలో మంగళవారం చోరీ జరిగినట్లు ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు. మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని దొంగ ఆలయంలో ఉన్న హుండీ పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్ళాడు. ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఆలయానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై తెలిపారు. -
కుడి.. ఎడమైతే!
● నేడు వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే ● అందరిలో ప్రత్యేకతగా.. ● ఉమ్మడి జిల్లాలోనూ ఎడమచేతివాటం వ్యక్తులు ఈ ఫొటోలో కనిపిస్తున్న వారు నిర్మల్ జిల్లాలోని గుండంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సిలారి మధు, విద్యార్థులు. ఉపాధ్యాయుడితో పాటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న దాదాపు పదిమంది విద్యార్థులు ఎడమ చేతివాటం కలిగి ఉన్నారు. పాఠ్యాంశ బోధనలోనూ ఎడమవైపు చేతిద్వారానే అనువుగా ఉంటుందని చెబుతున్నారు. మిగతా వారితో పోల్చితే ఎడమచేతివాటం కలిగిన విద్యార్థులు విద్య, విద్యేతర విషయాల్లో చురుగ్గా ఉన్నారని వారు పేర్కొంటున్నారు.నిర్మల్ఖిల్లా: కుడిఎడమైతే పొరపాటు లేదోయ్...అన్నాడో సినీ కవి.. అంటే వ్యక్తిలోని భిన్నత్వాన్ని బట్టి ప్రత్యేకతను ఆపాదిస్తాం. ఎడమ చేతివాటం అనేది జన్యు ప్రభావ ఫలితంగా ఏర్పడిందని వైద్య పరిశోధనలు సైతం రుజువు చేస్తున్నాయి. సమాజంలోని మనుషులలో ప్రతిఒక్కరూ భిన్నమైన గుణాన్ని కలిగి ఉంటారు. అందులో కొందర్ని మాత్రం ప్రత్యేకతను బట్టి సులభంగా గుర్తిస్తాం. చిన్ననాటి నుంచే జన్యు ప్రభావ ఫలితంగానే కుడి, ఎడమ చేతివాటాలు సంభవిస్తాయని సైన్స్ చెబుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎడమ చేతి వాటం కలిగినవారు పలువురు ఉన్నారు. నేడు ప్రపంచ ఎడమ చేతివాటం వ్యక్తుల దినోత్సవం (వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే)గా జరుపుకుంటున్న నేపథ్యంలో సాక్షి కథనం. ప్రోత్సహిస్తేనే మంచిది.. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల మధ్య వయస్సులో పిల్లలు వస్తువులను పట్టుకోవడం మొదలుపెడతారు. ఈ సమయంలోనే కుడి, ఎడమ చేతివా టాలను గుర్తించవచ్చు. ఎడమ చేతి వాటాన్ని తల్లిదండ్రులు ఒక చెడు అలవాటుగా భావించి మాన్పించేందుకు ప్రయత్నం చేస్తారు. అలా చేయడం వల్ల ఇతర సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కాలినడకన వెళ్లి..చికిత్స అందించి
నార్నూర్: ఏజెన్సీలో కొలాం గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించింది. సదరు వైద్యసిబ్బంది మంగళవారం మండలంలోని కొత్తపల్లి (హెచ్) కొలాంగూడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భీంపూర్ బొజ్జుగూడ (కొలాంగూడ) గ్రామానికి కాలినడకన వెళ్లి ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి చికిత్స అందించారు. 15 రోజులకు ఒకసారి కొలాం గ్రామాన్ని సందర్శించి వైద్య సేవలు అందిస్తామని స్టాఫ్నర్స్ జంగుబాయి తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆమె వెంట ఎల్టీ గంగాదేవి, పారామెడికల్ అసిస్టెంట్ సావిత్రిబాయి, ఆశ కార్యకర్త లక్ష్మీబాయి, తదితరులు ఉన్నారు. -
మస్తిష్క నియంత్రణ అమరిక ఫలితంగానే...
గర్భస్థదశలో శిశువు ఉన్నప్పుడు ఏర్పడిన జన్యు ప్రభావంతోనే ఎడమచేతివాటంగా జన్మిస్తారు. కొందరిలో వంశపారంపర్యంగా, పరిసర కారకాల ప్రభావంతో కూడా ఏర్పడుతుంది. వారు ప్రతీపనిని ఎడమచేతితో చేసేందుకు ప్రయత్నిస్తారు. మస్తిష్కనియంత్రణ అమరిక ఫలితంగా కూడా ఎడమ చేతివాటం ఏర్పడుతుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. వీరు అందరిలోకన్నా భిన్నత్వాన్ని, మేధాశక్తిని అధికంగా కలిగి ఉంటారని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సమాజంలో ప్రత్యేక నైపుణ్యాలతో పేరు ప్రతిష్టలు పొందిన వారిలో చాలామంది ఎడమచేతివాటం వారే. – అప్పాల చక్రధారి, సీనియర్ పిల్లల వైద్యనిపుణులు, నిర్మల్ -
తొడసం కై లాస్కు సన్మానం
ఉట్నూర్రూరల్: రాష్ట్రపతి ఆహ్వానం అందుకున్న తొడసం కై లాస్ను ఆదివాసీ బిరుదుగోండి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రాంజీగోండ్ భవన్లో మంగళవారం సన్మానించారు. గోండిభాషలో మహాభారత్ గ్రంథాన్ని రచించి ఏఐ ద్వారా అనేక పాటలు సృష్టించిన తొడసం కై లాస్ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి విందుకు ఆహ్వానించినట్లు వారు పేర్కొన్నారు. ఆర్చరీ (విలువిద్య)లో అనేక మందికి శిక్షణనిచ్చి, ఇటీవల పురస్కారం అందుకున్న చించుఘాట్ గ్రామానికి చెందిన కాత్లే మారుతిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మర్సుకోలా తిరుపతి, ప్రధాన కార్యదర్శి తొడసం శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు పెందూర్ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ పంజాబీ దాబా వద్ద మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు గంజాయితో పట్టుబడినట్లు టాస్క్ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. రెబ్బెన మండలం ఖైర్గాంకు చెందిన గన్నా శ్రవణ్కుమార్, మహారాష్ట్రలోని రాజూరకు చెందిన అరున్ రామారావు ముమారే వద్ద నుంచి 60 గ్రాముల (10 ప్యాకిట్లు) గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. తనిఖీల్లో టాస్క్ఫోర్స్ ఎస్సై రాజు, కానిస్టేబుళ్లు సంజీవ్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఆర్ఐ కృష్ణపై కేసు నమోదు
ఇంద్రవెల్లి: రిమ్స్లో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసగించిన మండలంలోని శంకర్గూడకు చెందిన ఎన్ఆర్ఐ, డిజిటల్ మైక్రో ఫైనాన్స్ చైర్మన్ జవాడే కృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన డిగ్రీ విద్యార్థి తుంగపిండి ఉదయ్కుమార్కు కృష్ణతో పరిచయం ఏర్పడింది. మే నెలలో వారింటికి వెళ్లి రిమ్స్లో ఏఎన్ఎం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మీ అమ్మకి ఇప్పిస్తానని చెప్పడంతో జూన్ 3న ఉదయ్కుమార్ తన తల్లితో కలిసి ఆదిలాబాద్లోని రామ్నగర్లో ఉన్న డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి రూ.2.30 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం పలుమార్లు కార్యాలయానికి వెళ్లగా అక్కడ కృష్ణ కనిపించలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు మంగళవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎసై తెలిపారు. వినాయక మండపం కూల్చివేతబెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 21 వార్డు బూడిదగడ్డ బస్తీలో నిర్మిస్తున్న వినాయక మండపాన్ని మంగళవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ కృష్ణ , వన్టౌన్ ఎస్హెచ్వో శ్రీనివాసరావు పరిశీలించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అనుమతి లేకుండా మండపం నిర్మించడం సరికాదని నిర్వాహకులకు సూచించారు. కడెం ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేతకడెం: ఎగువన కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్ట్కు మంగళవారం రాత్రి 4,812 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరడంతో ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు రెండు వరద గేట్లను ఎత్తి 12,833 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696.775 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. యూరియా కోసం రైతుల వెతలుతాండూర్: ఖరీఫ్ సీజన్లో వివిధ రకాల పంటలు సాగుచేసిన మండల రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటల సాగు అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా కాకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. మండల సహకార సంఘానికి ప్రస్తుతం 12 టన్నుల (260 బస్తాలు) యూరియా మాత్రమే సరఫరా అయ్యింది. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున ఇస్తుండడంతో అన్నదాతలు గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంద్రవెల్లి: మండల కేంద్రంలోని పీఏసీఎస్, హక రైతు సేవ కేంద్రం, ఫర్టిలైజర్ దుకాణాల్లో గత 10 రోజులుగా యూరియా కొరత ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులు మానేసి దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. కొన్నిషాపుల్లో యూరియా ఉన్న అవసరంలేని మందులతో లింకులుపెట్టి వాటిని అంటగడుతూ ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి యూరియా కొరతలేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
సింగరేణిని పరిరక్షించుకోవాలి
● ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్ప్రసాద్ శ్రీరాంపూర్: సింగరేణిని పరిరక్షించుకోవాలని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్ ప్రసాద్ అ న్నారు. మంగళవారం నస్పూర్ కాలనీలోని శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, సంస్థ పరిరక్షణకు సేవ్ వర్కర్స్...సేవ్ సింగరేణి కార్యక్రమంలో భాగంగా ఈనెల 14న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా, 22న కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీ స్ను ముట్టడించనున్నట్లు తెలిపారు. సింగరేణి యాజమాన్యం తీసుకుంటున్న పలు నిర్ణయాలు కా ర్మికులకు ఇబ్బందిగా మారాయన్నారు. పర్మినెంట్ ఉద్యోగులను తగ్గించడం, కారుణ్య ఉద్యోగాల కల్పనలో ఇబ్బందులకు గురి చేయడం, 3,600 మందిని విజిలెన్సు కేసుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. కంపెనీలో కార్మికుల సంఖ్యను కుదించినట్లు అధి కారులను ఎందుకు తగ్గించడం లేదన్నారు.సమావేశంలో ఆ యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపల్లి సమ్మయ్య, జెట్టి శంకర్రావు, ఉపాధ్యక్షులు గరి గే స్వామి, కలవేన శ్యాం, ప్రధాన కార్యదర్శి ఏ నుగు రవీందర్రెడ్డి, నాయకులు జీవన్జోయల్, తి రుపతి రాజు, అశోక్, మెండె వెంకటి పాల్గొన్నారు. -
వేధింపులతో మహిళ మృతి
తలమడుగు: వేధింపులతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాధిక తెలిపిన వివరాల మేరకు తలమడుగు మండలంలోని కజర్ల గ్రామానికి చెందిన మొట్టె మానస(25)కు అదే గ్రామానికి చెందిన గంపల ప్రశాంత్తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ప్రశాంత్ ఆర్మీలో ఉద్యోగం చేస్తుండడంతో మానసను జమ్మూకశ్మీర్కు తీసుకెళ్లాడు. అక్కడ భర్త, అత్తామామలు శారీరకంగా, మానసికంగా వేధించడంతో ఆరోగ్యం క్షిణించింది. దీంతో మహిళ కుటుంబ సభ్యులు కజ్జర్లకు తీసుకువచ్చి ఆదిలాబాద్లోని రిమ్స్లో చేర్పించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి పూర్ణచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు..మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడ సమీపంలో రహదారిపై ఈ నెల11న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయికుంటకు చెందిన రామటెంకి రాజవ్వ (84) మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. వృద్ధురాలు సోమవారం చున్నంబట్టి వాడ సమీపంలో రోడ్డు దాటుతుండగా మంచిర్యాల వైపు నుంచి శ్రీరాంపూర్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. రాజవ్వకు తలకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి కూతురు మల్లక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బ్యాంక్ సిబ్బందిపై దాడి!ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఓ ఎలక్ట్రికల్ షాపు యజమాని బ్యాంక్ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. మంగళవారం బ్యాంక్ రుణానికి సంబంధించి రికవరీ కోసం వెళ్లగా బ్యాంక్ ఉద్యోగులు, షాపు యజమానికి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో షాపు యజమాని కత్తెరతో దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితుడిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ను వివరణ కోరగా.. దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. అదుపుతప్పి వ్యాన్ బోల్తాబెల్లంపల్లి: బెల్లంపల్లి శివారులోని నేషనల్హైవే బైపాస్ రోడ్డుపై మంగళవారం తెల్లవారు జా మున సరుకుల లోడ్తో వెళ్తున్న వ్యాన్ 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో రోడ్డుపక్కన బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డా డు. ఆ సమయంలో వెనుక నుంచి వాహనాలే వీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
● గల్ఫ్ దేశాలకు వెళ్లి జిల్లా యువత అష్టకష్టాలు ● పర్యాటకవీసాలపై నైపుణ్యరహిత పనుల్లో చేరిక ● చట్టాలపై అవగాహన లేక చేయని నేరానికి జైలుకు ● క్షేమసమాచారం తెలియక బాధిత కుటుంబసభ్యుల ఆందోళన
ఉపాధివేటలో ఆగిన గుండె ● ఉజ్బెకిస్తాన్లో వలస కార్మికుడి మృతి నిర్మల్ఖిల్లా: ఉపాధివేటలో విదేశాలకు పయనమైన జిల్లాకు చెందిన యువకుడి గుండె అక్కడే ఆగింది. దస్తూరాబాద్ మండలం మున్యాల్ గ్రామ పంచాయతీ పరిధి కొత్తపెద్దూర్ గ్రామానికి చెందిన సంగ సురేశ్ (33) ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గల్ఫ్ దేశం వెళ్లేందుకు సురేశ్ కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన సబ్ ఏజెంట్ను సంప్రదించి రూ.2.50 లక్షలు ముట్టజెప్పాడు. సదరు సబ్ఏజెంటు మొదట 9 రోజులు ఢిల్లీలో ఉంచి అక్కడి నుంచి టూరిస్ట్ వీసా మీద ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంటుకు పంపాడు. అక్కడ క్లీనింగ్ పని కోసం 15 రోజులు శిక్షణ పొందాడు. అనంతరం డ్యూ టీలో చేరిన నాల్గొవ రోజు (గత నెల 21) గుండెపోటు రాగా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో సురేశ్ మృతి చెందినట్లు కంపెనీప్రతినిధులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. కాగా అక్కడి ఏజెంట్ మృతదేహాన్ని కార్గోలో పంపడానికి డబ్బు ఖర్చువుతుందని, ఢిల్లీ వరకు మాత్రమే పంపగలమ ని రోజుకో మాట చెబుతూ కాలయాపన చేస్తున్నట్లు కుటుంబసభ్యులు వాపోతున్నారు. కలెక్టర్, రాష్ట్ర ఎన్ఆర్ఐ సభ్యులకు వినతి.. తాజాగా సోమవారం మృతుడి భార్య సంగ మమత, ఇద్దరు పిల్లలు, మామ జింక భూమన్నలతో కలిసివచ్చి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్కు సమస్య విన్నవించా రు. స్పందించిన కలెక్టర్ వివరాలు తీసుకొని మృతదేహం త్వరగా ఇండియా పంపేలా చ ర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అ నంతరం రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ స భ్యుడు స్వదేశ్ పర్కిపండ్లకు వివరాలతో కూ డిన పత్రాలు అందించి మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించాలని వేడుకున్నారు. ఏజెంట్కు కట్టిన నగదు తిరిగి ఇప్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవించారు. నిర్మల్ఖిల్లా: ఉన్న ఊరిలో పనులు లేక కుటుంబాలను పోషించుకునేందుకు గ్రామీణ పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులు దేశం కాని దేశం వెళ్లి అష్టకష్టాలు పడుతున్నారు. కంపెనీ వీసాలు దొరక్క విజిట్ వీసాలపై వెళ్లిన వారి బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఉపాధి వేటలో ఎలాగైనా గల్ఫ్ దేశం వెళ్లాలన్న యువకుల బలమైన కాంక్షను ఆసరాగా చేసుకున్న నకిలీ ఏజెంట్లు తాత్కాలిక, పర్యాటక వీసాలను అంటగట్టి రూ.లక్షలు దోచేస్తున్నారు. అలా వెళ్లిన జిల్లా వలస కార్మికులు నైపుణ్య రహిత పనుల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. గల్ఫ్ దేశాల చట్టాల ప్రకారం వీసా లేకుండా పనిచేయడం నేరం కావడంతో అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో వారి జాడ, క్షేమ సమాచారం స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలియక తల్లడిల్లుతున్నారు. జిల్లాలో ఇలాంటి కేసులు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ ఏజెంట్ల వలలో చిక్కి.. కంపెనీ ఉద్యోగాల పేరిట అధిక వేతనాల ఆశ చూపుతూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ ఏజెంట్లు గ్రామీణ మధ్యతరగతి యువతకు ఎరవేస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఉన్నతంగా స్థిరపడిన వా రిని చూసి యువత తామూ అలాగే ఎదగొచ్చని ఆశపడుతూ అప్పుచేసి రూ.లక్షలు ముట్ట చెబుతున్నా రు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత మోసపోతున్నా రు. గత ఆరు నెలల కాలంలో గల్ఫ్ దేశాలకు వెళ్లిన జిల్లాకు చెందిన పలువురు యువకులు అక్కడి పోలీసులకు చిక్కడంతో ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. నైపుణ్య రహిత పనుల్లోనే.. విదేశాలకు వెళ్లాలన్న తపనతో రూ.లక్షలు వెచ్చించి అక్కడ నైపుణ్య రహిత పనులైన భవన నిర్మాణ రంగం, ఆఫీస్ బాయ్, క్లీనింగ్ తదితర పనులు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి చట్టాల పట్ల అవగాహన లేకపోవడం, ఉన్నతచదువులు లే కపోవడం, నైపుణ్య రంగాల్లో అనుభవం లేకపోవ డం కూడా ఇందుకు మరో కారణంగా గల్ఫ్ సంక్షేమ సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు తప్పనిసరిగా వివిధ వృత్తి పనుల్లో అనుభవం కలిగి ఉండాలని, అలాంటి పనుల నిమిత్తమే రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారావిదేశాలకు ఉపాధి కోసం వెళ్లాలని సూచిస్తున్నారు.ఇటీవల చోటుచేసుకున్న పలు ఘటనలు.. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన పన్నాల శ్రీనివాస్ సౌదీ అరేబియా దేశం వెళ్లి గత మేలో పనిలో చేరాడు. అక్కడి యజమాని తన వ్యవసాయ క్షేత్రానికి పంపగా ఒకసారి భార్య పిల్లలకు ఫోన్ చేశాడు. అనంతరం అతని నుంచి ఇప్పటివరకు ఎటువంటి క్షేమ సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సోన్ మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన కిస్టాపురం లక్ష్మన్న సబ్ ఏజెంట్ ద్వా రా రూ.2లక్షలు వెచ్చించి దుబాయ్కి లేబర్ సప్లయ్ కంపెనీ వీసా ద్వారా వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సరైన వేతనం కూడా లేకపోవడంతో స్వదేశానికి రప్పించే ఏర్పాటు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన గొర్రె రాజేందర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఆయన వేతన ఖాతాలో అక్రమ నగదు బదిలీ కాగా కేసులో ఇరుక్కున్నాడు. స్వదేశానికి తిరిగి రాలేక అక్కడి పోలీసుల అదుపులో ఉన్నాడు. తమ కొడుకుని ఎలాగైనా ఇండియాకు రప్పించాలని తండ్రి గంగన్న, కుటుంబ సభ్యులు కలెక్టర్ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు. లోకేశ్వరం మండలం రాజురా గ్రామానికి చెందిన సాయినాథ్, సారంగాపూర్ మండలం దేవితండాకు చెందిన జాదవ్ మధుకర్ గల్ఫ్ దేశాల్లో వివిధ రకాల కేసుల్లో ఇరుక్కొని అష్టకష్టాలు పడుతున్నారు. కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన గొర్రెకర్ శ్రీనివాస్ దుబాయ్లో సైబర్ నేరం కేసులో కటకటాలపాలవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చట్టాలపై అవగాహన ఉండాలి నకిలీ ఏజెంట్లను నమ్మి విజిట్ వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లొద్దు. వృత్తిపరమైన శిక్షణతో కూడిన పనులకు మాత్రమే వెళ్లాలి. రిజిస్టర్డ్ ఏజెంట్లు, కంపెనీల ద్వారా వీసా రుసుము చెల్లించిన తర్వాతనే పయనమవ్వాలి. ప్రవాసీ భారత బీమా యోజన ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. గల్ఫ్ దేశాల నియమ, నిబంధనలు, చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి. – మంద భీమ్రెడ్డి, ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ ప్రతినిధి, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్చైర్మన్ -
● గతేడాది కంటే సగటున ఒకమీటరు దిగువకు నీటిమట్టం ● లోటు వర్షపాతంతో పైకి చేరని భూగర్భ జలాలు ● వర్షపు నీటిని ఒడిసిపడితేనే నీటి లభ్యత మెరుగు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూగర్భ జలాలు గతేడాది కంటే ఈ ఏడాది ఇంకా దిగువనే ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ సీజన్లో ఆశించిన మేర వర్షపాతం అందించలేదు. జిల్లాలో ఇంకా లోటు వర్షపాతమే నమోదవుతోంది. దీంతో భూగర్భ జలాలు సైతం భూమి లోపలే ఉంటున్నాయి. వర్షాకాలం ఆరంభమై మూడునెలలు కావస్తున్నా గోదావరి నదిలోకి ఇంకా వరదలు రాలేదు. దీంతో నీటివనరుల్లో ప్రవాహం లేదు. వాగులు, వంకలు గరిష్ట నీటితో పారలేదు. చాలా వరకు చెరువులు పూర్తిస్థాయిలో నిండలేదు. గత నెల, ఈ నెలలో వానలు కురిసినప్పటికీ భారీ వర్షాలు లేక నీటి వనరుల్లో సరిపడా నీరు లేదు. దీంతో భూగర్భజలాలు పైకి రావడం లేదు. జిల్లాలో ఫిజోమీటర్లు ఏర్పాటు చేసిన చోట్ల నీటి లభ్యతను లెక్కించి ఏ ప్రాంతాల్లో ఎంత మేర నీళ్లు ఉన్నాయని భూగర్బ జలాల అధికారులు నమోదు చేస్తుంటారు. ఈ లెక్కల ప్రకారం గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది జిల్లాలో సగటున సుమారు ఒకమీటరు లోపలే నీరు ఉండడం గమనార్హం. అత్యధికంగా చెన్నూరు, కోటపల్లి మండలాల్లో సగటును రెండు మీటర్ల లోతుకు ఊట పడిపోయింది. మిగతా మండలాల్లోనూ అన్నింటిలో సగటున లోతు ఒక మీటరు ఉంది. వరద రాక.. నీరు ఇంకక ఈసారి వర్షాలు ఆశించిన మేర కురియకపోవడంతో వరదలు వచ్చి చెరువులు, కుంటలు ఉప్పొంగలేదు. దీంతో వరదలు వస్తేనే మళ్ళీ నీటివనరులు నిండి భూమిలోకి నీరు ఇంకే అవకాశం ఉంటుంది. అలా ఇంకిన నీరే భూగర్భ జలాలుగా నిల్వ కానున్నాయి. వీటినే సాగు, తాగునీటికి అవసరమైనప్పుడు వీటిని వెలికితీసుకునే అవకాశం ఉంది. జిల్లా పరీవాహక ప్రాంతాలకు గోదావరి, ప్రాణహిత నదులు, చిన్న, మధ్యతరహా నీటి ప్రాజెక్టులు, చెరువులు, అటవీ, కొండ ప్రాంతాలు నీటి ఇంకుడుకు ప్రధాన ప్రాంతాలుగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో నీరు ఇంకే అవకాశం లేక వృథాగా నీరు వెళ్ళిపోతోంది. ఇంకుడు గుంతలు, సామూహిక గుంతల నిర్మాణం చేపడితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఈ సారి వర్షాలు తక్కువగా ఉండడంతో నీరు భూమిలోకి ఇంకకపోవడంతో గతంతో పోలిస్తే తక్కువగా ఉంది. అయితే ఆందోళనకర పరిస్థితులేమి లేవని, ఈ నెలలో వర్షాలు కురిస్తే, సాధారణ స్థితికి చేరుకుంటుందని భూగర్భ జలాల అధికారులు పేర్కొంటున్నారు. వాన నీటిని ఒడిసి పట్టి ఇంకుడు గుంతల్లో నీటిని ఇంకేలా చేస్తే నీటి కొరత తీరి, భూమి పైపొరల్లోనే నీరు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.ఫిజోమీటర్లు ఉన్న ప్రాంతాల్లో భూ గర్భ జలాల సగటు (మీటర్లలో)మండలం గ్రామం గతేడాది జూలై ఈ ఏడాది జూలై బెల్లంపల్లి బెల్లంపల్లి 15.5 15.98 భీమిని రాంపూర్ 0.76 2.08 చెన్నూర్ చెన్నూర్ 6.85 8.01 చెన్నూర్ కొమ్మెర 1.53 2.62 దండేపల్లి మ్యాదిరిపేట 4.56 4.48 హాజీపూర్ హాజీపూర్ 4.86 5.12 జైపూర్ జైపూర్ 1.77 2.92 జైపూర్ కుందారం 8.75 8.58 జన్నారం ఇందన్పల్లి 4.32 3.44 కన్నెపల్లి జన్కాపూర్ 0.02 0.01 కాసిపేట కొండాపూర్ 1.61 3.75 కోటపల్లి కోటపల్లి 15.08 17.52 లక్సెట్టిపేట లక్సెట్టిపేట 0.32 0.98 మందమర్రి మందమర్రి 3.84 4.50 మందమర్రి పొన్నారం 15.41 16.66 నెన్నెల నెన్నెల 5.94 6.76 తాండూరు తాండూరు 14.21 15.54 వేమనపల్లి నీల్వాయి 0.01 0.59 జన్నారం జన్నారం 4.28 5.85 జన్నారం తపాలాపూర్ 2.96 3.09 భీమారం భీమారం 7.84 8.11 మంచిర్యాల మంచిర్యాల 4.22 6.39 నస్పూర్ నస్పూర్ 4.40 6.70 వేమనపల్లి లక్ష్మీపూర్ 3.92 4.25 కన్నెపల్లి నాయకిన్పేట్ 5.78 7.44 మొత్తం సగటు 5.54 6.45 -
యూట్యూబర్ పేరిట మోసం
కౌటాల: యూట్యూబ్ స్టార్ హర్షసాయి అనుచరుడని ఆన్లైన్లో మోసాలకు పాల్పడిన మొహమ్మద్ తౌఫిక్ఖాన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు కౌటాల సీఐ సంతోష్కుమార్ తెలిపారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో కేసు వివరాలు వె ల్లడించారు. హర్యానాలోని మేవార్ జిల్లా లోహికాకాల గ్రామానికి చెందిన మొహమ్మద్ తౌపిక్ ఖాన్ అదే రాష్ట్రానికి చెందిన సహచరులు ముబారక్ ఖాన్, వసీమ్ఖాన్, అహ్మద్ ఖాన్, ఇమ్రాన్లతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. యూట్యూబర్ హర్షసాయి పేరుతో నకిలీ నంబర్లు, వాట్సాప్ వాడుతూ ప్రజలకు ఆర్థికసాయం, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫోన్ పే, ఇతర ఆన్లైన్ మధ్యమాల ద్వారా డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. గత మేలో జిల్లాలోని బెజ్జూర్ మండలం సలుగుపల్లి గ్రామానికి చెందిన ఆత్రం సాయిని నమ్మించి రూ. 28వేలు వసూలు చేశారు. అనంతరం అతని ఫోన్ నంబర్ కలవకపోవడంతో మోసపోయానని గుర్తించి సాయి బెజ్జూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు పై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని హర్యానాలో పట్టుకున్నారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందుతుడి వద్ద నుంచి సెల్ఫోన్, సిమ్లు, ఆన్లైన్ లావాదేవిల రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో శ్రమించిన ఎస్సైలు సర్తజ్పాషా, తేజస్విని, కానిస్టేబుల్ వినోద్, సందీప్ను సీఐ అభినందించారు. -
విద్యార్థిని ఆత్మహత్య
జైపూర్: అనారోగ్య సమస్యలతో, హాస్టల్లో ఉండలేక ఇంటికి వచ్చిన విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేలాల గ్రామానికి చెందిన దామెరకుంట శ్రావణి –రవి దంపతులకు వైష్ణవి, లక్ష్మీప్రసన్న ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు లక్ష్మీప్రసన్న(13) జైపూర్ కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. ఆమె కొద్ది రోజులుగా పంటినొప్పి, చెవి నొప్పితో బాధపడుతోంది. ఆమెకు చికిత్స చేయించేందుకు నెల క్రితం తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చి ఆసుపత్రిలో చూపించారు. అనారోగ్య సమస్యలకు తోడు చదువుపై ఆసక్తి లేకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం రాత్రి ఇనుపరాడ్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ వెల్లడించారు. ‘దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి’ ఉట్నూర్రూరల్: ప్రజావాణిలో అందించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో పీవో దరఖాస్తులు స్వీకరించారు. బేల మండలం నుంచి హరిత, ఇంద్రవెల్లి మండలం జాలంతండాకు చెందిన కుమ్మర రేణుక, గాదిగూడ మండలంలోని జరీ గ్రామానికి చెందిన కుడిమేత అశ్విని, ఆత్రం భగవంతురావు ఇంద్రవెల్లి మండలం మర్కాగూడకు చెందిన సంగీత తదితరులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్జీలు సమర్పించారు. పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్ఆదిలాబాద్రూరల్: 20 ఆటోల చోరీల్లో నిందితుడిగా ఉన్న జైనూర్కు చెందిన సయ్యద్ అలీ అనే వ్యక్తిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆటో చోరీలకు సంబంధించి మొత్తం ఏడుగురు నిందితులు ఉండగా, అందులో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరిలో సయ్యద్ అలీ అనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. -
‘దేశీదారు’ పట్టివేత
ఆదిలాబాద్టౌన్: అక్రమంగా తరలిస్తున్న 530 దేశీదారు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. సోమవారం ఎకై ్సజ్ సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్రూరల్ మండలంలోని భీంసరి గ్రామానికి చెందిన అలిశెట్టి అభిలాష్ అనే వ్యక్తి రూ.24వేల విలువ గల మద్యం సీసాలను మహారాష్ట్ర నుంచి ద్విచక్ర వాహనంపై తరలిస్తున్నాడు. కొరట గ్రామ శివారులో ఎకై ్సజ్ అఽ దికారుల రాకను గమనించి బైక్తో పాటు మ ద్యం సీసాలను వదిలి పరారయ్యాడు. అభిలా ష్పై కేసు నమోదు చేశామని, త్వరలో నిందితుడిని జైలుకు పంపిస్తామన్నారు. సిబ్బంది తానాజీ, ధీరజ్, హన్మంతు పాల్గొన్నారు. -
‘కార్మిక సమస్యలపై పోరాడుతాం’
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని బీఎంఎస్ బొగ్గు పరిశ్రమల ఇన్చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన సీసీసీ కార్నర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగులతో చేయించాల్సిన బొగ్గు ఉత్పత్తిని కూడా కాంట్రాక్టర్లతో చేయిస్తున్నారన్నారు. బొగ్గు ఉత్పత్తి 50 శాతం పర్మినెంట్ ఉద్యోగులు, సంస్థ ఆధ్వర్యంలోనే జరగాలన్నారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాలు ప్రకటించి కార్మికులకు వాటా చెల్లించాలన్నారు. యూనియన్ రాష్ట్ర నాయకులు మండ రామాకాంత్, పులి రాజిరెడ్డి, అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, శ్రీరాంపూర్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు సత్తయ్య, కార్యదర్శి రాజేందర్, నాయకులు కమలాకర్, కిరణ్కుమార్, మహేందర్, నాగేశ్వర్ రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఎత్తివేత
జన్నారం: జన్నారం గుండా పగటిపూట భారీ వాహనాల రాకపోకల నిషేధం ఎత్తివేస్తున్నట్లు వైల్డ్లైఫ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ఏలుసింగ్ ఆదేశాలు జారీ చేసినట్లు మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలోని ఎఫ్డీవో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన్నారం మీదుగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు భారీ వాహనాలు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా గతంలో మాదిరి భారీ వాహనాలకు రూ.150 పర్యావరణ శిస్తు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వాహనాల అనుమతి తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో రేంజ్ అధికారులు సుష్మారావు, శ్రీధరచారి, దయాకర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. -
వాగు దాటి.. వైద్యం అందించి
నార్నూర్: వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులపై వంతెనలు లేని గ్రామాల వాసులు ప్రమాదకరంగా వాగులు దాటాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాగా సోమవారం గాదిగూడ మండలంలోని ఆర్జుని గ్రామ పంచాయతీ పరిధి మారుగూడ గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. గ్రామానికి వెళ్లే మార్గం మధ్యలో పెద్దవాగు ఉండగా వైద్య సేవలు అందించేందుకు ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది హెచ్ఈ రవీందర్ రాథోడ్, ఏఎన్ఎం సులోచన, అరవింద్, గంగాధర్లు ప్రమాదకరంగా వాగు దాటారు. దాదాపు కిలోమీటరు కాలినడకన వెళ్లి వైద్యశిబిరం నిర్వహించారు. వారి వెంట ఉపాధ్యాయులు మెస్రం శేఖర్, జాదవ్ జ్యోతి, శ్యావ్రావు తదితరులు ఉన్నారు. -
ట్రిపుల్ఐటీలో ఉత్తమ విద్య
● ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ బాసర: ఆర్జీయూకేటీ అందించే ఉత్తమ విద్య, ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక వనరులను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. బాసర క్యాంపస్లో నూతన విద్యార్థుల తల్లిదండ్రులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అకడమిక్ జ్ఞానంతో పాటు సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధించేందుకు కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు ప్రతీరోజు కనీసం 5 నిమిషాలు పిల్లలతో మాట్లాడి, వారి విద్యాప్రగతి, మానసిక స్థితి, లక్ష్యాలపై చర్చించాలని సూచించారు. అసోసియేట్ డీన్స్ డా. విటల్, డా. నాగరాజు, డాక్టర్ మహేశ్, శ్రీనివాస్, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. మెటా గేట్ అకాడమీతో ఒప్పందం ఆర్జీయూకేటీలోని మెటలర్జీ –మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగం, హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మెటా గేట్ అకాడమీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ సమక్షంలో ఓఎస్డీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ మురళీధర్షన్, మెటా గేట్ అకాడమీ డైరెక్టర్ శ్రీ ఎన్. గురుప్రసాద్ సంతకాలు చేశారు. ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు గేట్ ఉచిత శిక్షణ అందించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. మెటలర్జీ విభాగాధిపతి శ్రీ కిరణ్ కుమార్, అసోసియేట్ డీన్లు డాక్టర్ మహేశ్, డాక్టర్ విట్టల్, అధ్యాపకులు డాక్టర్ ఆర్.అజయ్, వి.అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీకి 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
మామడ: ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1079.80 అడుగుల నీటి మట్టం ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.49 టీఎంసీలుగా ఉంది. కాగా సరస్వతీ కాలువ కింద సాగు చేసిన పంటల కోసం 800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బాసర గోదావరిలో భక్తుల మొక్కులుబాసర: వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నూతనంగా నీరు ప్రవహిస్తుండడంతో శ్రావణమాసం పురస్కరించుకొని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గోదారమ్మకు దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో వరద నీరు భారీగా వస్తోంది. ‘కార్మికుల శ్రమను దోచుకుంటున్న సంఘాలు’మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, టీబీజీకేఎస్ సంఘాలు యాజమాన్యంతో కుమ్మకై ్క సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) కార్యదర్శి అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనేక వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. ఆదాయ పన్ను రద్దు, సొంతింటి కల, ప్రైవేటీకరణ అడ్డుకుని కొత్తగనులు ఏర్పాటు, కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి వాగ్దానాలు ఇచ్చి గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు, నాయకులు సీతారామయ్య, జనక్ప్రసాద్లు కార్మిక వర్గాన్ని మోసం చేస్తూ అవినీతి వాటాలతో తోడుదొంగలుగా మారారని విమర్శించారు. డిమాండ్ల సాధనలో సింగరేణి కార్మికవర్గం, కాంట్రాక్ట్ కార్మికులు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
ప్రజా ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ ● ప్రజావాణిలో అర్జీలు స్వీకరణమంచిర్యాలఅగ్రికల్చర్: సీఎం ప్రజావాణి, జిల్లా ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాస్రావు, మంచిర్యాల అటవీ డివిజన్ అధికారి సర్వేశ్వర్తో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా నస్పూర్ మండలం సంగుమల్లయ్యపల్లెకు చెందిన ఎం.వెంకటేశం రికార్డుల నుంచి తన కూలిపోయిన ఇంటినంబర్ తొలగించాలని కోరుతూ అర్జీ అందజేశాడు. ఈ సందర్భంగా మందమర్రి పట్టణానికి చెందిన దుర్గం మోహన్ తాను నెన్నెల శివారులో కొనుగోలు చేసిన భూమిని తనపేరుపై పట్టా చేయాలని కోరుతూ అర్జీ అందజేశాడు. భీమారం మండలం సుంకరిపల్లి కాలనీకి చెందిన దినసరి కూలీ దుర్గం భాగ్య ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరింది. నస్పూర్ శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన కోట మల్లయ్య 35 ఏళ్లుగా నివా సం ఉంటున్న ఇల్లు ఇటీవల వేరొకరి పేరుమీద మార్పు జరిగిందని దీనిని సవరించాలని కోరుతూ అర్జీ అందజేశాడు. నస్పూర్ మండలం ఆర్కే 6 క్రిష్ణాకాలనీకి చెందిన హరీష్ సీ టైప్ క్వాటర్ల వద్ద పగిలిపోయిన సెప్టిక్ ట్యాంక్కు మరమ్మతులు చేపట్టాలని కోరాడు. లక్సెట్టిపేట మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు మామిడి రాజశేఖర్ ఇంటర్ పూర్తి చేసి ఎల్టి శిక్షణ తీసుకున్నానని, ఏదైనా ఉపాధి చూపించాలని కోరుతూ అర్జీ అందజేశాడు. హాజీపూర్ మండలంలోని గుడిపేటకు చెందిన ఎంబడి జ్యోతి తన భర్త చనిపోయాడని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అర్జీ అందజేసింది. నస్పూర్ శివారులోని సర్వేనంబర్ 42లో ఉన్న టీఎన్జీవో ప్లాట్లలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ ఆధ్వర్యంలో ఫిర్యాదు అందజేశారు. ఆయా శాఖల అధికారులు అర్జీలు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.అక్రమ పట్టా రద్దు చేయాలి బెల్లంపల్లిరూరల్: ఇళ్ల స్థలాలను అక్రమంగా చేసుకున్న పట్టాలు రద్దు చేసి తమపేరిట పట్టా జారీ చేయాలని కోరుతూ బెల్లంపల్లి మండలం మాలగురిజాలకు చెందిన బాధితులు ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్ను వేడుకున్నారు. గ్రామానికి చెందిన దుర్గం అంకులు, ఏగోలపు లక్ష్మి, గోమాస రామస్వామి, కలాలి ధర్మయ్య మాట్లాడుతూ సర్వే నంబర్ 162లో అనేక ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, అదే గ్రామానికి చెందిన కామెర నారాయణ గోమాస పోశం వద్ద మూడుగుంటల భూమిని కొనుగోలు చేసి 13 గుంటలుగా పట్టా పొందాడన్నారు. తాము నివసిస్తున్న ఇంటి స్థలాల్లో నూతన ఇంటి నిర్మాణలు చేపట్టకుండా అడ్డుకుని భయబ్రాంతులకు చేస్తున్నారన్నారు. అక్రమంగా ఉన్న 10 గుంటల పట్టాను రద్దు చేసి తాము నివసిస్తున్న ఇంటి స్థలాలకు పట్టా మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకున్నారు. -
వందేభారత్.. నష్టాల ప్రయాణం
● రెండు జిల్లాల్లో ఒక్క హాల్టింగ్ కూడా లేని రైలు.. ● ఆక్యుపెన్సీ సాధించడంలో విఫలం ● పట్టించుకోని రైల్వే అధికారులు ● విజ్ఞప్తులతోనే సరిపెడుతున్న ప్రజా ప్రతినిధులుబెల్లంపల్లి: మహారాష్ట్రలోని నాగ్పూర్–సికింద్రాబాద్ మధ్య ప్రవేశపెట్టిన వందేభారత్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు వందశాతం ఆక్యుపెన్సీ లక్ష్య సాధనలో వెనుకంజలో ఉంది. డిమాండ్ ఉన్న రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం లేకపోవడంతో ప్రయాణికుల ఆదరణ కరువవుతోంది. ఈ మార్గంలో వందేభారత్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు నడపాలని ఎంతగానో ఆరాటపడిన ప్రయాణికుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మహారాష్ట్రలో నాగ్పూర్ తర్వాత సేవాగ్రామ్ (వార్దా), చంద్రపూర్, బల్లార్షా రైల్వేస్టేషన్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించిన రైల్వే అధికారులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఏ ఒక్క రైల్వేస్టేషన్లోనూ నిలుపుదల ఉత్తర్వులు జారీ చేయకపోవడం రైలు ప్రయాణికులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. చంద్రపూర్–బల్లార్షా మధ్య కేవలం 13 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఆప్రాంతంలో నిరభ్యంతరంగా హాల్టింగ్కు పచ్చజెండా ఊపి పదుల కిలోమీటర్ల దూరం ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని రైల్వేస్టేషన్లను విస్మరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల మూడు ప్రధాన రైల్వేస్టేషన్లతో పాటు జిల్లా కేంద్రమైన పెద్దపల్లి రైల్వే జంక్షన్లోనూ హాల్టింగ్కు ఉత్తర్వులు జారీ చేయాలన్న ప్రయాణికుల డిమాండ్ను రైల్వే అధికారులు పెడచెవిన పెట్టారు. బల్లార్షా తర్వాత రామగుండం, కాజీపేట జంక్షన్లో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. రామగుండంలో ఈ రైలు ఎక్కే ప్రయాణికులు అంతంత మాత్రమే. కాజీపేటలో పలు సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులో ఉండటం వల్ల వందేభారత్ రైలు సక్సెస్ కాలేకపోతోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఆక్యుపెన్సీ సాధనలో వెనుకంజ వందేభారత్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు గతేడాది ప్రారంభం కాగా ఇప్పటికీ వందశాతం ఆక్యుపెన్సీ సాధించలేదు. అనాలోచిత నిర్ణయాలతో రైలును ఆదిలో 20 కోచ్లతో ప్రారంభించారు. అయితే ప్రయాణికుల ఆదరణ ఆశాజనకంగా లేక పోవడంతో క్రమంగా ఆక్యుపెన్సీ తగ్గుతూ వచ్చింది. ఫలి తంగా గత ఫిబ్రవరి మూడో వారంలో కోచ్లను ఒక్కసారిగా 20 నుంచి 8కి కుదించారు. పరిమిత సంఖ్యలో కోచ్లు ఉండటంతో ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో క్రమంగా 70 శాతం వరకు పెరగడం కాస్త ఊరటనిస్తుండగా వందశాతం సాధించే దిశగా పరుగులు పెట్టలేకపోతోంది.వందేభారత్ రైలు -
ఇంటర్ ప్రవేశాలకు మరో అవకాశం..!
కళాశాలల్లో జనరల్, వొకేషనల్ విద్యార్థుల ప్రవేశాలు ఇలా...కళాశాల జనరల్ వొకేషనల్ మొత్తంమంచిర్యాల 197 246 443 మందమర్రి 93 71 164 కాసిపేట 92 49 141 చెన్నూర్ 175 0 175 బెల్లంపల్లి(గర్ల్స్) 176 0 176 బెల్లంపల్లి 222 215 437 జైపూర్ 107 0 107 జన్నారం 99 0 99 దండేపల్లి 83 0 83 లక్సెట్టిపేట్ 274 181 455 మొత్తం 1518 762 2280మంచిర్యాలఅర్బన్: ఇంటర్లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. కాలేజీలో అడ్మిషన్ కోసం దరఖాస్తుల గడువును మూడోసారి పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20 లోపు దరఖాస్తులు అందజేయాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. జూన్ 1నుంచి ప్రారంభమైన ప్రవేశాలు జూలై 31తో ముగియగా ఆగస్టు 20 వరకు అడ్మిషన్ల గడువు పొడిగించింది. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో దరఖాస్తుల గడువు మరోసారి పెంచినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ విద్య పూర్తిగా ఉచితం.. పాఠ్యపుస్తకాలు..స్కాలర్షిప్లు పొందవచ్చంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ కళాశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన బోధన తీరుపై అవగాహన కల్పించారు. ఇంటర్ విద్యాశాఖ అధికారులు ప్రతీ కళాశాల ప్రిన్సిపాల్తో ప్రత్యేకంగా సమావేశమై క్షేత్రస్థాయిలో ఏయే చర్యలు చేపట్టాలో అవగాహన కల్పించారు. గతేడాది కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులపై శ్రద్ధ చూపుతామని తల్లిదండ్రులకు భరోసానిస్తున్నారు. ప్రవేశాల సంఖ్య పెరిగేలా చర్యలు ముమ్మరం చేశారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా... పదో తరగతి ఫలితాలు వెలువడక ముందునుంచి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల పెంపు ప్రక్రియ వేగవంతం చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో బోధన, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఎంసెట్ శిక్షణ, రోజువారీగా స్టడీ అవర్ నిర్వహణ, సొంత భవనం, విశాలమైన ఆటస్థలం, ఆహ్లాదకరమైన వాతావరణం, స్టడీ మెటీరియల్, స్కాలర్షిప్..ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే సాధ్యమంటూ పాఠశాలల వారీగా వెళ్లి సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు అవగాహన కల్పించడంతో క్రమంగా ఇంటర్లో ప్రవేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో మూడోసారి గడువు పొడిగించామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఐఈవో అంజయ్య విద్యార్థులకు సూచించారు. ఈ నెల 20 వరకు గడువు పెంపు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచనలక్సెట్టిపేట్లో అత్యధికంగా ప్రవేశాలు..లక్సెట్టిపేట్లో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఆధునిక హంగులతో నూతనంగా భవనం నిర్మించారు. జిల్లాలో గతంలో 170 మంది కూడా దాటని విద్యార్థుల సంఖ్య ఈఏడాది 455కు చేరింది. జిల్లా కేంద్రమైన మంచిర్యాల ప్రభుత్వ కళాశాలలో 443 మందితో తర్వాత స్థానంలో నిలిచింది. బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 437 మంది అడ్మిషన్లు పొందారు. ఇలా ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య పెరుగుతుండడంతో మూడోసారి అవకాశం కల్పించారు. దీంతో మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరే అవకాశం లేకపోలేదు.