breaking news
Mancherial District News
-
చికిత్సపొందుతూ మృతి
కాగజ్నగర్రూరల్: మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన కార్తిక్ గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఈజ్గాం ఎస్సై కల్యాణ్ తెలిపారు. ఆయన తె లిపిన వివరాల ప్రకారం.. కార్తిక్ ద్విచక్రవాహనంపై గన్నారం నుంచి ఆరెగూడకు వస్తుండగా ఎదురుగా అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపిన డ్రైవర్ అనిల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పంచాయతీల్లో మేనిఫెస్టోలు
గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మొదటి, రెండో విడత పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. దీంతో సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థులు ఆయా గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వారిని గెలిపిస్తే చేపట్టనున్న పనులను మేనిఫెస్టోల రూపంలో ప్రకటిస్తూ ఓటర్లను ఆకర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురి మేనిఫెస్టోలపై కథనం.. – లక్ష్మణచాంద గుడ్ మార్నింగ్ లక్ష్మణచాంద అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా గ్రామంలోని వీధులను ఉదయం సందర్శిస్తానని సర్పంచ్ అభ్యర్థి ఓస కవిత తెలి పారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని పేర్కొన్నారు. – ఓస కవిత, లక్ష్మణచాంద సర్పంచ్ అభ్యర్థి అంబులెన్స్.. వైకుంఠ రథం.. డిజిటల్ లైబ్రరీ.. -
అడ్డంకి తొలగింది.. అవకాశం దొరికింది
నిర్మల్చైన్గేట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడో సంతానం నిబంధనను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఇద్దరి కంటే ఎక్కువ పిల్ల లుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను పంచాయతీరాజ్ చట్టం నుంచి తొలగించింది. ఎంతమంది పిల్లలున్నా పోటీకి అర్హులేనని స్పష్టం చేసింది. అధిక జనాభాను నియంత్రించేందుకు కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధన 1994 మే 30 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం చాలామంది కోల్పోయారు. ప్రస్తుతం ఈ నిబంధన తొలగిపోవడంతో పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది సంతానం కలిగినవారికి అవకాశం దక్కగా వారు బరిలోకి దిగుతున్నారు. వేరే వాళ్లకు పనిచేశాను గత ప్రభుత్వాలు ఇద్దరు పిల్లల నిబంధన పెట్టడంతో స్థానిక సంస్థల్లో పోటీ చేసే అర్హత కోల్పోయాను. ఇతరుల గెలుపు కోసం పనిచేశాను. ప్రస్తుతం ఈ నిబంధన ఎత్తివేయడం, రిజర్వేషన్ కలిసిరావడంతో పోటీలో ఉన్నాను. – రెడ్డి లక్ష్మీనరేందర్, ఎక్బాల్పూర్, ఖానాపూర్ మండలంఈసారి అవకాశం దక్కింది ప్రజాసేవ చేయాలని నా కోరిక. గత ఎన్నికల్లో పాండ్వాపూర్ పంచాయతీని జనరల్ మహిళకు కేటాయించగా ముగ్గురు పిల్లల నిబంధనతో పో టీ చేయలేదు. ఈ నిబంధన ఎత్తివేయడం, ఎ స్టీ రిజర్వేషన్ రావడంతో అవకాశం దక్కింది. – రాథోడ్ మాణిక్రావు, పాండ్వాపూర్, కడెం మండలంశుభ పరిణామం నాకు ముగ్గురు పిల్ల లున్నారు. ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఉన్నా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. ప్రభుత్వం ఆ నిబంధన తొలగించడం శుభపరిణామం. చాలామందికి పోటీచేసే అవకాశం దక్కింది. – బోధనపోల్లా సాయవ్వ, బోరిగం, తానూరు మండలంరిజర్వేషనూ కలిసొచ్చింది ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం హర్షణీయం. ఈ నిబంధన కారణంగా చాలా ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయాను. ఇప్పుడు నిబంధన ఎత్తివేయడంతోపాటు ఎస్సీ జనరల్ రిజర్వేషన్ నాకు కలిసి వచ్చింది. – మామిడిపల్లి భీమేశ్, కొండుకూరు పంచాయతీ -
ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి
భీమిని: ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ కన్నెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన బెల్లంపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. మండల కేంద్రమైన కన్నెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గొల్లపల్లి రాజ్కుమార్ ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం ఓ లబ్ధిదారుడి నుంచి రూ.10వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అంత డబ్బు తనతో కాదని రూ.5వేలు ఇవ్వడానికి అంగీకరించాడు. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులను సంప్రదించాడు. శుక్రవారం సాయంత్రం కన్నెపల్లిలో విధులు ముగించుకుని.. బెల్లంపల్లి పట్టణంలో కాంటా వద్దకు వచ్చిన బాధితుడి నుంచి రూ.5వేలు రాజ్కుమార్ తీసుకుంటుండగా ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ మధు సిబ్బందితో కలిసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మధు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064, మొబైల్ నంబర్ 9154388963ను సంప్రదించాలని సూచించారు. -
‘వసతి’లో బస అంతేనా?
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ గురుకులాలు, వసతిగృహాల్లో పర్యవేక్షణ లోపిస్తోంది. విద్యార్థుల సంక్షేమం నుంచి భోజనం మెనూ వరకు ఇష్టారాజ్యంగా మారింది. అధ్వాన భోజనం వడ్డింపుపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేసినా.. అధికారుల తనిఖీల్లో వాస్తవమని తేలినా.. సంబంధిత వ్యక్తులపై చర్యలు కరువయ్యాయి. వసతిగృహాల్లో విద్యార్థులకు అందుతున్న ఆహారం, ఇతర సదుపాయాలు, సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు నెలలో ఒకరోజు బస చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విద్యాసంవత్సరంలో రాత్రి బస కార్యక్రమం నిర్వహించలేదు. జిల్లాలో 10 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, డిగ్రీ కళాశాలలున్నాయి. ఎనిమిది ఎంజేపీటీబీసీలు, 16 ఎస్టీ ఆశ్రమ, రెండు పోస్టు మెట్రిక్ వసతిగృహాల్లో 3,249 మంది, 18 వసతిగృహాల్లో 1,645 మంది విద్యార్థులున్నారు. ఎస్సీ వసతిగృహాల్లో 2,067 మంది ఉన్నారు. వీరి బాగోగులను సంక్షేమశాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న వసతిగృహాలు మినహాయిస్తే దూర ప్రాంతాలకు వెళ్లిన సందర్భాలు తక్కువే. ఇటీవల హాస్టల్లో వార్డెన్ లేకపోవడంపై అధికారి తీసుకున్న చర్యలు నామమాత్రమే. కొన్నిచోట్ల వార్డెన్లు పెట్టిందే మెనూగా మారింది. భవనాలు శిథిలావస్థకు చేరడం, ఇతర త్రా సమస్యలు నెలకొన్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్నానపు గదులు లేకపోవడంతో ఆ రుబయటే స్నానం చేయాల్సిన దుస్థితి ఉంది. గురుకులాలు, వసతిగృహాల్లో రాత్రి బస చేస్తే విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది. సరుకుల సరఫరాలో గోల్మాల్ గురుకులాలు, వసతిగృహాలకు సరఫరా చేసే సరుకుల్లో గోల్మాల్ జరుగుతోంది. కాంట్రాక్టర్లు బ్రాండెడ్ సరుకులు సరఫరా చేస్తున్నామని చెబుతున్నా నాన్బ్రాడెండ్ సరుకులే కనిపిస్తున్నాయి. కచ్చితమైన తేదీలు లేకపోవడంతో వీలున్నప్పుడు సరుకుల సరఫరాతో కాంట్రాక్టర్, వార్డెన్లకు కలిసివస్తోంది. నిబంధనల ప్రకారం విజయ పాలు సరఫరా చేయాల్సిన ఉన్నా చాలాచోట్ల టెట్రా, ఇతర సంస్థలకు చెందిన పాలు వినియోగిస్తున్నారు. టెండర్ ప్రకారం కాంట్రాక్టర్ సరుకులు, చికెన్, పాలు, కూరగాయలు సరఫరా చేయకపోతే బ్లాక్లిస్ట్లో పెట్టాల్సి ఉన్నా అధికారులు తాత్సారం చేస్తున్నారు. సరుకుల గోల్మాల్పై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. -
‘ధాన్యం’పై విజిలెన్స్ విచారణ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపై పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం మరోసారి విచారణ చేశారు. చెన్నూర్ మండలం కిష్టాపూర్, దుగ్నేపల్లి కొనుగోలు కేంద్రాల పరిధిలో విస్తీర్ణం కంటే అధికంగా ధాన్యం దిగుబడి, దొడ్డు రకం ధాన్యం సన్న రకంగా చూపించి సర్కారు ఇచ్చే బోనస్ పొందే ప్రయత్నం చేశారంటూ ఫిర్యాదులు అందడం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ఎన్ఫోర్స్మెంటు ఓఎస్డీ శ్రీధర్రెడ్డి, ఏఎస్వో సుదర్శన్రెడ్డి, కార్పొరేషన్ అధికారులు రజిత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కలిసి విచారణ చేపట్టారు. కిష్టాపూర్ పరిధిలో ధాన్యం సేకరణ జరిగిన నాలుగు మిల్లుల్లో విచారణలో భాగంగా తాజాగా మరో రెండు మిల్లుల్లో తనిఖీ చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం, మిల్లుల్లో ఉన్న నిల్వలతో సరిపోల్చుకున్నారు. గతంలో ఇచ్చిన నివేదికతోపాటు మరోమారు దర్యాప్తు చేయగా ఈ కేంద్రాల్లో తప్పిదాలేవీ జరగనట్లుగా ప్రాథమికంగా నిర్ధారించుకున్నట్లు అధికారులు తెలిపారు. విస్తీర్ణం కంటే అధికంగా ధాన్యం దిగుబడి చూపించి లబ్ధి పొందారనే ఫిర్యాదులోనూ వాస్తవం లేనట్లుగా గుర్తించారు. చుట్టుపక్కల గ్రామాల పరిధిలో ధాన్యం దిగుబడితో పోలిస్తే కిష్టాపూర్, దుగ్నేపల్లి కేంద్రాల్లో ఫిర్యాదు వచ్చినట్లు ఎలాంటి అక్రమాలు జరగలేదని అధికారులు అంచనాకు వస్తున్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికే దుగ్నేపల్లి కేంద్రం పరిధిలో విచారణ జరిపారు. గత రబీ సీజన్లో రైతులు ఇచ్చిన ధాన్యమే మిల్లులో ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే అప్పటి వ్యవసాయాధికారులు ధాన్యం నిబంధనల ప్రకారమే ఆయా రకాన్ని(గ్రేడ్) ఆమోదించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పీడీఎస్ బియ్యం పట్టివేత జిల్లా కేంద్రం ఎన్టీఆర్ నగర్లో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 15.30క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిల్వతోపాటు ఆటోలో తరలిస్తున్న బియ్యాన్ని పంచనామా చేసి, కేసు నమోదు చేశారు. -
దివ్యాంగులను ప్రోత్సహించాలి
శ్రీరాంపూర్: దివ్యాంగులను ప్రోత్సహించాలని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలోని సీఈఆర్ క్లబ్లో దివ్యాంగులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని, వారిలోని ప్రతిభను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని తెలిపారు. భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి షేక్ బాజీసైదా, డీజీఎం(పర్సనల్) ఎస్.అనిల్కుమార్, స్పోర్ట్స్ గౌరవ కార్యదిర్శి పాల్ సృజన్, కోఆర్డినేటర్ నరసయ్య, ఇండోర్ కేప్టెన్ తోట సురేశ్ పాల్గొన్నారు. -
పోలీసుల ఆకస్మిక తనిఖీలు
మంచిర్యాలక్రైం: స్థానిక సంస్థల ఎన్నికలు, డిసెంబర్ 6 నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యారు. రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా శుక్రవారం రాత్రి మంచిర్యాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఐబీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, పాతమంచిర్యాల, ఏసీపీ శివారులో బృందాలుగా ఏర్పడి నాకాబందీ నిర్వహించారు. అనుమానితుల పేర్లు, సెల్నంబరు, ఆధార్ నంబరు, వివరాలు సేకరించారు. వాహనాలు, ప్రయాణికుల లగేజీ తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రార్థన మందిరాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్రావు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘మహా’శివలింగం
నిర్మల్ జిల్లా కేంద్రం మీదుగా వెళ్లే 44 నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం 106 టైర్ల భారీ ట్రక్కుపై 35 అడుగల ఎత్తు, 10 అడుగుల వెడల్పు, 200టన్నుల బరువు గల భారీ శివలింగాన్ని తరలించారు. తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోగల వట్టినాడు గ్రామ పరిధిలో దీనిని తయారు చేయించి బిహార్లోని ఉత్తర చంపారన్ జిల్లా మహావీర్ మందిర్ ట్రస్ట్ (పాట్నా) ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న విరాట్ రామాయణ్ మందిరంలో ప్రతిష్ఠించేందుకు దీనిని తీసుకువెళ్తున్నారు. ఈ భారీ శివలింగంపై 1,008 శివలింగాలు చెక్కబడి ఉన్నాయి. 2015లో ఆర్డర్ ఇవ్వగా 2022 నుంచి 2025 నవంబర్ 19 వరకు దీనిని తయారు చేసినట్లు తెలిసింది. కొండాపూర్ బైపాస్ వద్ద ట్రక్కు ఆగి ఉండగా మహా శివలింగాన్ని చూసేందుకు అధికసంఖ్యలో జనం తరలివచ్చారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
నెన్నెలలో పోలీసుల కవాతు
నెన్నెల: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా మైలారం, నెన్నెల గ్రామాల్లో శుక్రవారం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ధైర్యం, భరోసా కల్పించడానికే పోలీసు కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్, నెన్నెల, తాళ్లగురిజాల ఎస్సైలు ప్రసాద్, రామకృష్ణ, ఆలీ, పోలీసులు పాల్గొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు మందమర్రిరూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని రౌడీషీటర్లను సీఐ శశిధర్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లను స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలు, ప్రజలను బెదిరింపులపై ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్సై ఆంజనేయులు, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ పాల్గొన్నారు. -
నామినేషన్ల ప్రక్రియ పరిశీలన
జైపూర్/భీమారం: జిల్లాలోని జైపూర్, మిట్టపల్లి, భీమారం, బూర్గుపల్లి గ్రామాల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు పి.మనోహర్ శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీపీవో వెంకటేశ్వర్రావుతో కలిసి పరిశీలించారు. ఆయా కేంద్రాలను తనిఖీ చేసి రిటర్నింగ్ అధికారులకు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ, రిజిష్టర్ నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. నామినేషన్లను ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జైపూర్ తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతిబాపురావు పాల్గొన్నారు. -
● తొలి విడతకు నాలుగు రోజులే గడువు ● వేగం పెంచుతున్న సర్పంచ్ అభ్యర్థులు ● రంగంలోకి జిల్లా స్థాయి నాయకులు ● ఇంటింటికి వెళ్తూ ఓటు వేయాలని విన్నపం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసి అభ్యర్థులు తేలడంతో పోటాపోటీగా ఓట్ల వేట మొదలైంది. మొదటి విడత ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న జరగనుంది. ఓటింగ్కు 48గంటల ముందే ప్రచారం నిలిపి వేయాల్సి ఉంటుంది. ఇక బహిరంగ ప్రచారానికి నాలుగు రోజులే మిగిలి ఉంది. సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి తమకు ఓటెయ్యాలని కోరుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల తరఫున జిల్లా నాయకులు గ్రామాల్లోకి వెళ్లి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే పల్లెల్లో మైకులు, రికార్డింగ్ ఆడియోలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం చేయిస్తున్నారు. గెలుపు కోసం వాడవాడల్లో ప్రతీ గడపకు తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మహిళలు, యువత ఓట్లు అధికంగా ఉన్న చోట్ల వారిపై ప్రత్యేక దృష్టి సారించి మద్దతు కోరుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్, వార్డు స్థానాల్లో మద్దతుదారులతో కలిసి అందుబాటులో బూత్ల వారీగా ఉన్న ఓటర్లను కలుస్తున్నారు. వలస ఓటర్లకు ఫోన్లు గ్రామాల నుంచి పలు నగరాలు, పట్టణాలకు వలస వెళ్లిన వారిలో అనేకమంది ఓటర్లు ఉన్నారు. ఊళ్లో ఓటు ఉండి విద్య, ఉపాధి, ఉద్యోగరీత్యా హైదరాబాద్తోపాటు పొరుగు జిల్లాలకు వలస వెళ్లారు. ఆ ఓటర్లకు అభ్యర్థులు ఫోన్లు చేస్తూ బరిలో ఉన్నామని చెబుతూ మద్దతు కోరుతున్నారు. పోలింగ్ రోజు ఓటేసేందుకు గ్రామానికి రావాలని ముందుగానే ఓ మాట చెప్పి ఉంచుతున్నారు. సోషల్ మీడియాలో జోరు పంచాయతీ ఎన్నికల ప్రచారం సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం తదితర సామాజిక మాధ్యమాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. తమ గుర్తును వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పాటు చేసి విస్తృతంగా పాటలు, వీడియోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా పల్లెల్లో ఎన్నికలతో వాట్సాప్ గ్రూపులు నిండిపోతున్నాయి. తమ స్టేటస్లోనూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. రెండు, మూడో విడతలోనూ.. జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో రెండు, మూడో విడత నామినేషన్ల ప్రక్రియ సాగుతోంది. రెండో విడతలో శనివారం వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. విత్డ్రా తర్వాత రెండో విడతలో ఎన్నికలు జరగనున్న 114జీపీలు, 996వార్డు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలనుంది. ఆ తర్వాత అభ్యర్థులకు గుర్తులు కేటాయించాక ప్రచారం మరింత పెంచే అవకాశం ఉంది. ఇక మూడో విడతలో ఎన్నికలు జరిగే 102 పంచాయతీలు, 868వార్డు స్థానాలకు ఈ నెల 9వరకు నామినేషన్ల విత్ డ్రా సమయం ఉంది. తుదిగా బరిలో నిలిచిన అభ్యర్థులు తెలిస్తే ప్రచారం ముమ్మరం చేసే అవకాశం ఉంది. -
చేపా.. చేపా.. లక్ష్యం చేరలేదు..!
మంచిర్యాలఅగ్రికల్చర్: అసలే ఆలస్యం.. సరఫరా చేసిందీ సగం. అందులోనూ నాణ్యతాలోపం.. ఏదో వదిలామా.. లేదా..? అన్న చందంగా చేపపిల్లల పంపిణీ సాగుతోంది. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు సరఫరా చేస్తోంది. ఈ ఏడాది జిల్లాలో 369 చెరువులు, కుంటలు, 11 ప్రాజెక్టుల్లో 2.23 కోట్ల చేపపిల్లల విడుదలకు లక్ష్యం పెట్టుకున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలకు చెరువులు, కుంటలు మత్తడి దూకా యి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో జలాశయాల్లో ఇప్పటివరకు 1.24 కోట్ల చేపపిల్లలు మాత్రమే వదిలారు. పూర్తి స్థాయిలో వదలకపోవడంపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చేపపిల్లలు వదిలేందుకు సీజన్ కాగా.. సరఫరాకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్లు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో పలు మండలాల్లో మత్స్యకారులే చేపపిల్లలు కొనుగోలు చేసి జలాశయాల్లో వదిలారు. ఆలస్యంగా ఇద్దరు టెండరుదారులు చేపపిల్లల సరఫరాకు ముందుకు రావడంతో నవంబర్ 4 నుంచి పంపిణీ చేపట్టారు. నెల రోజులు గడుస్తున్నా 56శాతమే సరఫరా చేశారు. ఇప్పటికే సరఫరా సీజన్ ముగిసింది. సీజన్లో చేపపిల్లలు వదిలితే ఆరు నెలల కాలంలో మూడు నుంచి నాలుగు కిలోల వరకు చేప ఎదిగి మత్స్యకారులకు లాభదాయకంగా ఉండేది. యాసంగి పంటల సాగుకు నీరు వదిలితే చేపల ఎదుగుదలపై ప్రభావం పడనుంది. నాణ్యత అంతంతే.. జిల్లాలో 35 నుంచి 40 మిల్లీమీటర్ల పరిమాణం గల చేపపిల్లలు(కట్ల, రవు) 115.65 లక్షలు, 80 నుంచి 100 మిల్లీమీటర్ల పరిమాణం గలవి(కట్ల, రవు, మ్రి గాల) 108.28 లక్షలు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 35 నుంచి 40మిల్లీమీటర్ల పరి మాణం గల 1.12లక్షల చేపపిల్లలు, 80నుంచి 10 మిల్లీమీటర్ల పరిమాణం గలవి 13లక్షల చేపపిల్లలు వదిలారు. ఇందులో చిన్నపిల్లలు 30మిల్లీమీటర్ల లో పు ఉన్నాయని, 10నుంచి 20శాతం చనిపోయి ఉంటున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. మందమర్రి మండలానికి డీసీఎం వాహనం ట్యాంకుల్లో తీసుకొచ్చిన చేపపిల్లలు చనిపోయి ఉండడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు తిరిగి పంపించారు. లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట్కు చెందిన మత్స్యకారులు సైతం నాణ్యతలేవని చేపపిల్లలను తిరస్కరించారు. గతేడాది 20శాతమే.. గతేడాది 2.22 కోట్ల చేపపిల్లలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ ఇందులో 20శాతం కూడా సరఫరా చేయలేదు. ఈ ఏడాది 2.23 కోట్లు పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 56శాతమే సరఫరా చేశారు. లక్ష్యం మేరకు సరఫరా చేయకపోవడంపై మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపపిల్లలు, రొయ్యల పంపిణీ పంపిణీ చేపట్టింది. ప్రస్తుతం రొయ్యల సీడ్కు మంజూరు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు.నీటి నిల్వలు లేకపోవడం వల్లనే.. జిల్లాలో 380 చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు 1.25 కోట్లు చేపపిల్లలు పంపిణీ చేశాం. 56శాతం సరఫరా పూర్తయింది. నాణ్యత లేని, చనిపోయి ఉన్నపిల్లలను వెనక్కి పంపి మళ్లీ సరఫరా చేయడం జరిగింది. ప్రస్తుతం కాంట్రాక్టర్ గత నాలుగు రోజులగా సరఫరా నిలిపివేశాడు. ఈ ఏడాది సుందిళ్ల, అన్నారం, గోదావరిబ్యాక్ వాటర్ నీటినిల్వలు లేక పెద్ద చేపపిల్లలను విడదల చేయడం లేదు. – ఆర్.అవినాష్, జిల్లా మత్స్యశాఖ అధికారి -
గొడవలకు పాల్పడే రౌడీ షీటర్లపై పీడీ యాక్టు
బెల్లంపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి గొడవకు పాల్పడినా రౌడీ షీ టర్లపై పీడీ యాక్టు పెట్టడానికి వెనుకాడబోమ ని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హెచ్చరించా రు. గురువారం బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కా ర్యాలయ ఆవరణలో సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. బెదిరింపులకు పాల్పడటం, గుంపులుగా తిరగడం, పోటీ చేసే అభ్యర్థులపై ఒత్తిడి తీసుకురావడం, మద్యం, డబ్బులు, బ హుమతుల పంపిణీలో పాల్గొనడం, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం లాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని పేర్కొన్నారు. పోలింగ్బూత్ల వద్ద కలహాలు సృష్టించడం లాంటి మరే ఇతర చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్, వన్టౌన్, తాండూర్ సీఐలు సీహెచ్ హనోక్, కె.శ్రీనివాసరావు, ఎన్.దేవయ్య సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు. -
పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: మూడు విడతల్లో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పా ట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్, పంచాయతీ అధికారులతో పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. సర్పంచ్, వార్డు స్థానాల చివరి విడత నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తగా వ్య వహరించాలని పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికా రి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. జిల్లాలో 306 గ్రామపంచాయతీలు, 2,680 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 268 మంది వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. 72 వెబ్ కాస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి 26 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు పేర్కొన్నారు. సర్పంచ్ స్థానాల ఎన్నికలకు మొదటి విడతలో ఆరు చోట్ల ఏకగ్రీవం కాగా, మూడు స్థానాలకు నామినేషన్లను రాలేదని తెలిపారు. 81స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్న ట్లు పేర్కొన్నారు. అదనపు ఎన్నికల అధికారి, పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జెడ్పీ సీఈవో గణపతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నామినేషన్ కేంద్రాల పరిశీలన భీమారం: మండలంలో బూర్గుపల్లి, భీమారం, కా జీపల్లిలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్దీపక్ సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియ పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని సూ చించారు. నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు అందించిన పత్రాలు ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి క్షుణ్ణంగా పరిశీలించాలని, నిర్ణీత గడువు దాటిన తరువాత వచ్చే నామినేషన్లు తీసుకోకూడదని ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్భా పాఠశాలను సందర్శించారు. విద్యాలయంలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా అదనపు ఎన్ని కల అధికారి మధుసూదన్, సీఐ నవీన్ ఉన్నారు. -
రోశయ్య సేవలు చిరస్మరణీయం
మంచిర్యాలఅగ్రికల్చర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ము ఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్గా పనిచేసిన కొణిజేటి రోశయ్య అందించిన సే వలు చిరస్మరణీయమని కలెక్టర్ కుమార్ దీపక్ కొని యాడారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోశయ్య వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా ఎన్నోసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసి రాష్ట్రాన్ని వినూత్న సంస్కరణలతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అనంతరం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్గా పని చేసి విశిష్ట సేవలందించారని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు కిషన్, దుర్గాప్రసాద్, పురుషోత్తం నాయక్, హన్మంత్రెడ్డి, కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో..మంచిర్యాలక్రైం: ఉమ్మడి రాష్ట్ర సీఎంగా, గవర్నర్గా, ఆర్థికశాఖ మంత్రిగా, ప్రజాసేవకుడిగా దీర్ఘకా లం సేవలందించిన కొణిజేటి రోశయ్య రాజనీతి భావితరాలకు స్ఫూర్తి అని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. రోశయ్య వర్ధంతిని పురస్కరించుకుని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం వర్ధంతి నిర్వహించారు. ఆయ న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. రోశయ్య రాజకీయ ప్రస్థానం, నిస్వార్థ ప్రజాసేవ, సాదాసీదా జీవన పద్ధతి, పరిపాలనా నైపుణ్యం తదితర అంశాలను స్మరించుకున్నారు. ప్రజలకు అందించిన సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, సీపీవో సిబ్బంది, వివిధ విభాగాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
భూ సేకరణకు నిధులివ్వండి
కొరటా– చనాఖా ప్రా జెక్ట్ నిర్మాణం 97శాతం పూర్తయింది. పెండింగ్లో ఉన్న ఆయకట్టు భూసేకరణ నిధులు త్వరగా విడుదల చేసి సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ సీఎం ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు భూ సేకరణ జీవో జారీ చేశారు. పంటచేలకు రోడ్లు వేసేలా పొ లంబాటకు రూ.40 కోట్లు విడుదల చేశారు. జిల్లాను దత్తత తీసుకుని ప్రత్యేక ప్రేమ చూపు తూ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు. – పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ సమస్యలపై సమీక్ష నిర్వహించాలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో సాగునీటి చెరువులు, కెనాల్స్, రోడ్లు, పాఠశాలల పరిస్థితులు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేలా ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సీఎం అధ్యక్షతన నిర్వహించాలి. ఉట్నూర్ ఐటీడీఏకు ఆరేళ్లుగా పాలకవర్గం నియమించకపోవడంతో పీఎంకేఎస్వై, పోడు భూములు వంటి ఆదివాసీల సమస్యలపై చర్చించే అవకాశం లేదు. ఐటీడీఏ పాలకవర్గాన్ని నియమించాలి. ఎయిర్పో ర్టు భూ సేకరణకు జీవో జారీ, ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరు చేసిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ వేదికపై రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు జూపల్లి, వివేక్, ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యేలు శంకర్, బొజ్జు, వినోద్, జిల్లా అధికారులుఅన్నివర్గాల ప్రజలకు న్యాయం సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తోంది. జిల్లాలోని రైతులకు మేలు చేకూర్చేలా రూ.2,500 కోట్ల రుణమాఫీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించాం. అర్హులైన పేదలందరికీ రేషన్కార్డులిచ్చాం. పేదలు దొడ్డుబియ్యం తినకుండా అమ్ముకుంటున్నారని గుర్తించి వారి కడుపునింపేలా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. ప్రజాపాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలిచి ఆశీర్వదించాలి. – పి.సుదర్శన్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుపర్యాటకంగా అభివృద్ధి చేస్తాం ప్రభుత్వం రూ. లక్ష ల కోట్ల అప్పులు న్నా.. ప్రతీ నెలా రూ.కోట్ల రూపేనా వడ్డీలు చెల్లిస్తున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ, అభివృద్ధిని ఎక్కడా ఆపకుండా అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద విద్యార్థులు రూపాయి ఖర్చులేకుండా కార్పొరేట్స్థాయిలో విద్యనభ్యసించేలా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశాం. రెండేళ్లలోనే 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. పంట నష్టపోయిన రైతులకు ఎకరా కు రూ.10వేల చొప్పున పరిహారం అందించేలా ప్రతిపాదనలు స్వీకరించాం. త్వరలోనే ఆ మొత్తాన్ని రైతులకు అందజేస్తాం. జిల్లాను పర్యాటకపరంగా తీర్చిదిద్దుతాం. – జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిఆదిలాబాద్టౌన్/కై లాస్నగర్: ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ సక్సెస్ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం నిర్వహించిన సభకు జనం భారీగా తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి రాక గంటన్నర ఆలస్యమైనా ప్రజలు ఓపిగ్గా ఎ దురుచూశారు. జిల్లాలో రూ.260 కోట్లతో చేపట్టను న్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రా రంభోత్సవాలకు సంబంధించి సభ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణతో సభను ప్రారంభించారు. ఇందులో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, గడ్డం వినోద్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా అంటే అభిమానం..: సీఎం ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ఎంతో అభిమానమని, పీసీసీ అధ్యక్షుడినయ్యాక ఇక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలను ప్రారంభించానని సీఎం రేవంత్రె డ్డి గుర్తు చేశారు. జిల్లాను దత్తత తీసుకున్నానని తెలి పారు. త్వరలోనే అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తానని పేర్కొన్నారు. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న జిల్లాకు ఏడాదిలోనే ఎయిర్బస్సు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అలాగే ఈ ప్రాంత ప్రజల ఆ కాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీ మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి కేంద్రంగా నాగోబా సన్నిధిలో కుమురంభీం పేరిట ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇది తన సూ చనగా పేర్కొన్నారు. అలాగే మూతపడ్డ సీసీఐ ఫ్యా క్టరీని ప్రైవేట్ సెక్టార్లో పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుని ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. కొరటా–చనాఖా ప్రాజెక్ట్ను త్వరలోనే ప్రారంభించి జా తికి అంకితం చేస్తామని పేర్కొన్నారు. అలాగే కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహితపై ప్రాజెక్ట్ నిర్మించి ఉమ్మడి జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యంగా జిల్లాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేసినట్లు వివరించారు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాకు అనేక వరాలు కురిపించడంతో ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. భారీ బందోబస్తు సీఎం పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీల నాయకులను పోలీసులు వేకువజామునే ముందస్తు అ రెస్ట్లు చేసి స్టేషన్లకు తరలించారు. ఎలాంటి పొ రపాట్లకు తావివ్వకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. సీఎం రాకను సభ ప్రాంగణంలో ఉన్న ప్రజలకు తెలియజేసేలా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. అంతకుముందు ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ నాయకులు, ట్రెయినీ కలెక్టర్ సలోనిచాబ్రా హెలీప్యాడ్ వద్దకు చేరుకుని సీఎం రేవంత్రెడ్డికి పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. యువత నైపుణ్యాభివృద్ధికి చర్యలు అహంకార, అవినీతి కారణంగానే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఓటు ద్వారా గద్దెదించి ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కు గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్లాంటి పథకాలు అమలు చేస్తున్నాం. బీఆర్ఎస్ పాలనలో అమలు కానీ అనేక పథకాలను ప్రజల కు అందిస్తున్నాం. ముఖ్యంగా యువతలో నైపుణ్యాలు మెరుగుపర్చేలా ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేశాం. – గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి -
ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దు
లక్సెట్టిపేట: ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దని అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. గురువా రం మండల కేంద్రంలోని కేఎస్సార్ ఫంక్షన్హాల్లో దండేపల్లి, లక్సెట్టిపేట, జన్నారం మండలాల స ర్పంచ్ అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఓటర్లకు ఓటు వేసే స్వేచ్ఛ ఇ వ్వాలని, ఎలాంటి ప్రలోభాలకు గురిచేయవద్దని, ఇబ్బందులకు గురి చేయవద్దని తెలిపారు. రాష్ట్ర ఎ న్నికల పరిశీలకుడు మనోహర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని సూ చించారు. అందరి సహకారంతో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించా రు. ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజేశ్వర్ అధికారులున్నారు. -
ఆర్వో, ఎస్సైని తొలగించాలి
మంచిర్యాలటౌన్: అధికార పార్టీకి పూర్తి మద్దతుగా నిలుస్తూ ఎన్నికల కోడ్, నిబంధనలు తుంగలో తొక్కిన దండేపల్లి ఎస్సై, ఎన్నికల అధికారిని విధుల నుంచి తొలగించాలని మా జీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పాతమామిడిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా మాధవిని బీఆర్ఎస్ బలపరచగా ఆమె వేసిన నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించా రు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కార్యాలయంలోని వెనుక డోరు నుంచి మాధవి తో నామినేషన్ విత్డ్రా చేయించారని తెలిపా రు. అడ్డుకున్న తమ పార్టీ నాయకులను ఎస్సై భయపెట్టి కేసులు నమోదు చేస్తానని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. సమాచారం తెలిసిన వెంటనే తాను కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడగా, గడువులోపే విత్డ్రాకు వచ్చారని, ఆ తర్వాత రీవెరిఫికేషన్ కోసమే పిలిచినట్లు తనకు మెసేజ్ పెట్టినట్లు తెలిపారు. దీనిపై పూర్తి ఆధారాలతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. విలేకరులతో సమావేశంలో మాజీ ప్ర జాప్రతినిధులు, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అనధికార పొత్తులు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పంచాయతీ ఎన్నికల్లో పదవుల కోసం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పార్టీ కార్యకర్తలను నాయకులు పక్కన పెడుతున్నారు. ఇ న్నాళ్లుగా ఉన్న రాజకీయ వైరుధ్యాలను మరిచి ప్ర జాప్రతినిధులుగా గెలిచేందుకు సిద్ధపడుతున్నారు. కొన్నిచోట్ల నువ్వా.. నేనా? అన్నట్లుగా కొట్లాడుతుండగా, మరికొన్ని చోట్ల మధ్యే మార్గంగా రాజీ పడు తూ ముందుకు సాగుతున్నారు. ప్రధాన పార్టీలు బ లపరిచిన అభ్యర్థులు జెండాలను పక్కకు పెట్టి త మ ఎజెండాను అమలు చేస్తున్నారు. పార్టీ అధిష్టా నం నుంచి ఒప్పుకోకున్నా, అనధికార పొత్తులతో ఎత్తులు వేస్తున్నారు. మండల, జిల్లా పరిషత్, ము న్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో నిర్వహిస్తారు. ఇందుకు పార్టీ నుంచి ‘బీ ఫాం’ తప్పనిస రి. అయితే పంచాయతీ ఎన్నికలు ఇందుకు భిన్నం. రాజకీయ పార్టీల గుర్తులుండవు. బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తులే కేటా యిస్తారు. దీంతో పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత పలుకుబడితో ప్రతిపక్ష నాయకులు సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు పంచుకుంటున్నారు. ఇ ప్పటివరకు జిల్లాలో ఆరుగురు సర్పంచులు, 268 మంది వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏకగ్రీవాల వెనుక భారీ తతంగం జరుగుతోంది. జెండాలు లేవు.. ఎజెండాలే జిల్లాలో తొలి విడత ఎన్నికల్లో ఇప్పటికే పలు చోట్ల ఏకగ్రీవాల కోసం ఆయా పార్టీల నాయకులు కలిసి పదవులు పంచుకున్నారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో ఇప్పటికే ఏకగ్రీవాల కోసం సంప్రదింపులు నడస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ కోసం పలు విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలకు దెబ్బస్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వస్తుండగా, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల అభ్యర్థులకు ఇబ్బందులు వస్తున్నాయి. సర్పంచ్ పదవులు అధికంగా అధికార పార్టీకి దక్కుతుండగా ప్రతిపక్ష పార్టీలు రాజీ పడాల్సి వస్తోంది. పంచాయతీల్లో అధికంగా పలుకుడి ఉన్న నాయకులు ఆయా చోట్ల పోటీ లేకుండా ఉండేందుకు పార్టీలను పక్కకు పెట్టి ముందుకు సాగుతున్నారు. మరోవైపు సర్పంచులుగా గెలిచాక ఆయా అభ్యర్థులకు పార్టీ జెండా కప్పి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
కామాంధులకు ఉరే సరి..!
మంచిర్యాలక్రైం: అభం శుభం తెలియని చిన్నారులు, మహిళలు, వివాహితలపై లైంగికదాడులకు తెగబడుతున్న కామాంధులకు ఉరి శిక్ష విధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లైంగికదాడులకు పాల్పడిన వారికి ఇతర దేశాల్లో చట్టాల మాదిరిగా బహిరంగంగా కఠిన శిక్ష అమలు చేయాలని కోరుతున్నాయి. అప్పుడే అఘాయిత్యాలను నివారించే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చినా దురాఘాతాలు అదుపులోకి రావడం లేదు. అశ్లీల చిత్రాల వెబ్సైట్లను పూర్తి స్థాయిలో నిషేధిస్తే తప్ప దేశంలో అత్యాచారాలకు అడ్డుకట్ట పడదని మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న జరిగిన ఘటనపై కేంద్రం తీవ్రంగా స్పందించి కఠినమైన నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. మహిళల భద్రత కోసం ప్రత్యేక విభాగాలు, దళాలు ఏర్పాటు చేసింది. అయినా మహిళలపై ఆకృత్యాలు ఆగడం లేదు. వరంగల్లో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం ఘటన రాష్ట్ర ప్రజలను కన్నీరు పెట్టించింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వివాహిత ముగ్గురు కామాంధుల చేతుల్లో బలైంది. ఈ ఘటనలు ప్రజల మది నుంచి ఇప్పుడిప్పుడే చెదిరిపోతుండగా.. దండేపల్లి మండలం నంబాల గ్రామంలో బాలిక(7)పై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడి హత్య చేయడం మరోసారి సంచలనం సృష్టించింది. దిశ కేసు తరహాలో నిందితులకు కఠిన శిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆసిఫా ఆర్డినెన్స్ నిష్పక్షపాతంగా అమలు చేయాలి 12ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఉరి శిక్ష విధించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆసిఫా ఆర్డినెన్స్కు అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఉన్నవ్, కఠువా ఘటనల నేపథ్యంలో బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్పై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం మహిళపై అత్యాచారం కేసులో కనీస శిక్ష పదేళ్లకు పెరిగింది. కేసు తీవ్రతను బట్టి దోషులకు 14ఏళ్లు శిక్ష విధించే అవకాశం ఉంది. 16ఏళ్లలోపు అమ్మాయిలపై అఘాయిత్యానికి 20ఏళ్ల వరకు శిక్ష పెంచారు. అవసరమైతే యావజ్జీవ కారాగారం విధిస్తారు. సామూహిక అత్యాచారం కేసులో దోషులకు చనిపోయే వరకు, 12ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా 20ఏళ్లు, చనిపోయే వరకు శిక్ష విధించేందుకు ఆర్డినెన్స్ అవకాశం కల్పించింది. ఈ ఆర్డినెన్స్ ఆధారంగా కఠిన శిక్ష విధించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు సమీపంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. సామ్సాంగ్ ప్లాజా షోరూం వద్ద అనుమానాస్పదంగా వ్యక్తి పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అదించారు. సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడు ఎరుపు రంగు చొక్కా, గల్లలుంగీ ధరించి ఉన్నాడు. సుమారు 60 సంవత్సరాలు పైబడి ఉంటాయి. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలకు 8712656534 నంబర్లో సంప్రదించాలని సీఐ సూచించారు. ఉరేసుకుని ఒకరు ఆత్మహత్యనిర్మల్టౌన్: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ ప్రవీణ్కుమార్, స్థానికులు తెలిపిన వివరాల మేరకు స్థానిక ప్రియదర్శిని నగర్ కాలనీలో నివాసముంటున్న విజయ్కుమార్ (42) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా డు. బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. బయటకు వెళ్లిన భార్య సౌభాగ్య వచ్చేసరికి మృతి చెంది కనిపించడంతో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధంసాత్నాల: మండలంలోని మేడిగుడ(ఆర్) గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైంది. సీ డాం యాదవ్కు చెందిన ఇంట్లో బుధవారం ఉద యం షార్ట్సర్క్యూట్ జరగడంతో కూలర్కు మంటలు అంటుకున్నాయి. నిత్యావసరాలతో పాటు బట్టలు, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. బాధితుడికి గతంలో పక్షవాతం వచ్చి చేయి, కాలు పనిచేయడం లేదు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ జాదవ్ రామారావు పరిశీలించారు. ప్రభుత్వ పరంగా ఆర్థికసాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. బాలిక ఆచూకీ లభ్యం వేమనపల్లి: బాలిక అదృశ్యమైన గంటల వ్యవధి లోనే నీల్వాయి పోలీసులు ఆచూకీ కనిపెట్టి తల్లి చెంతకు చేర్చారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గోవింద్గావ్ గ్రామానికి చెందిన ఆత్రం సంతోష్, మమత దంపతుల కుమార్తె అంజలి వేమనపల్లి మండలంలోని దస్నాపూర్లో అమ్మమ్మ ఇంటివద్ద ఉంటోంది. వారం రోజులుగా పాఠశాలకు వెళ్లకపోవడంతో అమ్మమ్మ, తాతయ్య మందలించారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక బుధవారం ఇంటినుంచి వెళ్లిపోయింది. తాత నాయిని భీమయ్య నీ ల్వాయి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై జ గదీష్రెడ్డి ఆచూకీ కోసం ఆరా తీశారు. మధ్యాహ్నం కొత్తగుడిసెల కాలనీలోని సమీప బంధువు ఇంటివ ద్ద బాలిక కనిపించడంతో తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి బాలికను అప్పగించారు. -
‘ఆదివాసీల సమస్యల పరిష్కారంలో విఫలం’
ఇచ్చోడ: ఆదివాసీల సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ ఆరో పించారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది క్రితం ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులతో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇచ్చిన హామీ ఒక్క టి కూడా నెరవేర్చలేదన్నారు. చట్టబద్ధతలేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే విషయంలో స్పష్టత ఇవ్వాలని, జీవో 3 పునరుద్ధరించా లని, ఆదివాసీ గూడేల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. తోటి సంఘం జిల్లా అధ్యక్షుడు నైతం శేఖర్, నాయికపోడ్ నాయకుడు రమేశ్, తుడుందెబ్బ నాయకుడు మురళీకృష్ణ, ప్రధాన్ సంఘం నాయకుడు గెడం మధుకర్, తోటి సంఘ నాయకుడు కాత్లే విఠల్, తదితరులు పాల్గొన్నారు. -
ఆభరణాల చోరీ కేసులో అల్లుడే నిందితుడు
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ద్వారకానగర్కు చెందిన వీరమ్మ బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఆమె అల్లుడేనని డీఎస్పీ వహీదుద్దీన్ తెలిపారు. బుధవారం పట్టణ పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. వీరమ్మ ఇంట్లో గత నెల 28న గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధిత మహిళ కుమారుడు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామన్నారు. వీరమ్మకు స్వయానా అల్లుడైన బెల్లంపల్లి హనుమాన్ బస్తీలో నివాస ముంటున్న వేముల బాలకృష్ణ అత్తగారి ఆస్తిపై కన్నేశాడు. రెబ్బెన మండలంలోని నార్లాపూర్కు చెందిన బండి నీలేష్, తాండూరు మండలంలోని కత్తెర్లకు చెందిన దూల రాజ్కుమార్ను వీరమ్మ ఇంట్లోకి పంపించాడు. సదరు వ్యక్తులు ఆమెను కిందపడేసి మెడలో ఉన్న గొలుసులాక్కున్నారు. బీరువాలో ఉన్న మరో గొలుసు, 5 ఉంగరాలతో పాటు రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు. వాటిని బాలకృష్ణకు అప్పగించాడు. అతను అందులో ఒక గొలుసు అమ్మి ఇవ్వాలని తాండూరు మండలం చౌటపల్లికి చెందిన తోగుల తిరుపతికి ఇచ్చాడు. తిరుపతి ఆ గొలుసును బెల్లంపల్లి మార్కెట్లోని శంకరాచారి అనే స్వర్ణకారుడికి అమ్మి రూ.1,06,500 తీసుకున్నాడు. సీసీ పుటేజీల ఆధారంగా బాలకృష్ణ, నీలేష్, తిరుపతిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి నగలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కుమార్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. సమావేశంలో పట్టణ సీఐ ప్రేం కుమార్, ఎస్సై సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్గా నాడు భార్య.. నేడు భర్త
తాంసి: ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు. కానీ ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని లీమ్గూడలో గిరిజనులు సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో గ్రామానికి చెందిన తొడసం జైవంతబాయిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసారి రిజర్వేషన్లో భాగంగా ఎస్టీ జనరల్ కేటాయించగా ఆమె భర్త తొడసం శంభు నామినేషన్ దాఖలు చేశారు. మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది. మహిళా సర్పంచ్ అభ్యర్థిపై దాడికి యత్నం బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మహిళా అభ్యర్థిపై దాడికి యత్నించినట్లు తాళ్లగురిజాల ఎస్సై బి.రామకృష్ణ తెలిపారు. చాకేపల్లి జీపీ ఎస్టీ మహిళా స్థానానికి రిజర్వు కాగా జంబి మౌనిక సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసింది. తన తరుపున వార్డు సభ్యురాలిగా నాయిని భాగ్యచేత నామినేషన్ వేయించింది. భాగ్య భర్త కృష్ణకు ఇష్టం లేకపోవడంతో మంగళవారం రాత్రి ఆమెతో గొడవ పడ్డాడు. అక్కడి నుంచి మౌనిక ఇంటికి వచ్చారు. తమ మధ్య గొడవకు మౌనికనే కారణమని భావించి కృష్ణ బావమరిది జంబి పోషం కోపంతో మౌనిక, ఆమె భర్త జంబి నరేష్ దాడికి యత్నించాడు. బాధితులు తాళ్లగురిజాల పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సోషల్ మీడియాలో ఓటింగ్
కౌటాల: పంచాయ తీ ఎన్నికల్లో భాగంగా పల్లెల్లో పోరు వా డీవేడిగా సాగుతోంది. నామినేషన్ల స్వీ కరణ ముగియడంతో అభ్యర్థులు ప్ర చార పర్వం షురూ చేస్తున్నారు. ఈ క్రమంలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారోనని యువత ముందుగానే సాంకేతికతను వినియోగిస్తున్నారు. వాట్సాప్ గ్రూప్లో ఓ యాప్ను వినియోగిస్తూ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఎవరికి ఎక్కువ శాతం ఓట్లు వస్తే వాటిని ఆయా సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేస్తూ తమ అభ్యర్థి గెలుస్తారని ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్ బరిలో తోడి కోడళ్లుదండేపల్లి: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దండేపల్లి మండలంలోని అల్లీపూర్ సర్పంచ్ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వు చేశారు. గ్రామానికి చెందిన తోడికోడళ్లు కొత్తపల్లి కళ, కొత్తపల్లి చంద్రకళ సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సరికి ఇద్దరూ బరిలోనే ఉన్నారు. -
చిత్రహింసలు పెట్టి చంపేయాలి..!
నంబాల బాలిక ఎంత నరకం అనుభవించిందో అంతకంటే రెండింతల నరకం వారికి చూపించి, బహిరంగ ప్రదేశాల్లో ఉరి తీయాలి. వీరి చావును చూసిన వారి వెన్నులో వణుకు పుట్టాలే. అప్పుడే మహిళలపై అత్యాచారాలు తగ్గుముఖం పడుతాయి. ఇతర దేశాల మాదిరిగా చట్టాలు అమలు చేయాలి. దిశకు ఒక రూలు, చిన్నారికి ఒక రూలా.! – రాజేఽశ్వరి, పీవోడబ్ల్యూ జిల్లా కన్వీనర్, మంచిర్యాల కఠినంగా వ్యవహరించాల్సిందే.. రేపిస్టుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిందే. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తే ఉరిశిక్ష వెంటనే అమలు చేయాలి. అప్పుడే ఆడపిల్లలకు రక్షణ ఉంటుంది. ముఖ్యంగా మగపిల్లలను తమ తల్లిదండ్రులు నైతిక విలువలతో పెంచాలి. దోషులను కఠినంగా శిక్షించడం ఎంత ముఖ్యమో బాధితులకు రక్షణ కల్పించడం అంతే ముఖ్యం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. – తాళ్లపల్లి కవిత, సైకాలాజిస్టు, వనిత వాక్కు ఫౌండేషన్ కో ఫౌండర్, మంచిర్యాల కాలయాపన చేయొద్దు నిందితులను కోర్టు, జై లు విచారాణ అంటూ ల క్షలు ఖర్చు చేసి చేయడ ం కంటే దిశ కేసు తరలో న్యాయం చేయాలి.మహిళల జోలికి వెళ్తే కఠినంగా శిక్షిస్తారనే భయం ఉండాలి. దేశంలో ఆర్డినెన్స్ తెచ్చినా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. లెంగిక దాడులు జరుగకుండా చర్యలు చేపట్టాలి. సమాజంలో మార్పు కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, మహిళా సంఘాలు కృషి చేయాలి. – అరుణ, పీవోడబ్ల్యూ రాష్ట్ర కన్వీనర్ -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
నిర్మల్రూరల్: ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ‘రోల్ ప్లే’ కాంపిటీషన్ పోటీల్లో జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీనిధి, టి.శ్రీహిత, డి.అభిజ్ఞ హిత, ఏ.శ్రీ చందన ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరుగనున్న నేషనల్ లెవెల్ పోటీల్లో పాల్గొననున్నారు. సదరు విద్యార్థినులను బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డేనియల్, ఏటీపీ సారిక, గైడ్ టీచర్ దేవేందర్ అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కల్పన, మేరీ, సునీత, కావ్య, తదితరులు పాల్గొన్నారు. విజయ్ మర్చంట్ ట్రోఫీకి ఎంపికఆదిలాబాద్: ప్రతిష్టాత్మక విజయ్ మర్చంట్ ట్రోఫీకి జిల్లా క్రికెటర్ కశ్యప్ పటా స్కర్ ఎంపికయ్యాడు. ప్ర స్తుతం విదర్భ క్రికెట్ అసో సియేషన్ తరపున ప్రాతి నిధ్యం వహిస్తున్న కశ్యప్ ఈ ట్రోఫీకి వరుసగా రెండోసారి ఎంపికకావ డం విశేషం. గతేడాది సైతం ఈ టోర్నీకి ప్రాతి నిధ్యం వహించాడు. బీసీసీఐ నిర్వహిస్తున్న ఈ ట్రోఫీకి ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికై న మొదటి క్రికెటర్ కశ్యప్ కావడం గమనార్హం. ఈ సీజన్లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్పై 60, మహారా ష్ట్ర క్రికెట్ అసోసియేషన్పై 113, బరోడా క్రికెటర్ అసోసియేషన్పై 57 పరుగులు సాధించాడు. అండర్–16 విభాగంలో నిలకడైన ఆటతీరుతో ట్రోఫీకి మరోసారి ఎంపికైనట్లు శిక్షకుడు జయేంద్ర పటాస్కర్ తెలిపారు. -
విత్డ్రాలో హైడ్రామా!
దండేపల్లి: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం ముగిసింది. మండలంలోని మామిడిపల్లి సర్పంచ్ ఏకగ్రీవంపై రాత్రి వరకు హైడ్రామా నడిచింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎల్తపు వైష్ణవి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన గుర్రాల మాధవి సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ఉప సంహరణకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉండగా 4 గంటల తర్వాత మాధవి నామినేషన్ ఉపసంహరణ కోసం వెళ్లింది. దీంతో అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు ఆమెను అడ్డుకున్నారు. సమయం అయిపోయిన తర్వాత ఎలా ఉప సంహరించుకుంటారని ప్రశ్నించారు. 3 గంటలలోపే ఉపసంహరణకు దరఖాస్తు ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. దరఖాస్తు చూపాలంటూ ఇరుపార్టీల నాయకుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపీడీవో ప్రసాద్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహసీనొద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని అభ్యర్థులు, రిటర్నింగ్ అధికారులతో మాట్లాడారు. రాత్రి ఎనిమిది గంటల తర్వాత మామిడిపల్లి సర్పంచ్గా ఎల్తపు వైష్ణవిని ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. ఒత్తిళ్లకు తలొగ్గి ఏకగ్రీవం మామిడిపల్లి సర్పంచ్ ఏకగ్రీవంలో అధికారులు, పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు ఆరోపించారు. ఉపసంహరణ సమయం దాటిన తర్వతా ఆమోదించడం సరికాదన్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
‘కార్మిక చట్టాలను స్వాగతిస్తున్నాం’
మందమర్రిరూరల్: భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలను బీఎంఎస్ స్వాగతిస్తుందని ఆ సంఘం అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక హక్కుల పరిరక్షణ, సంస్థ ప్రగతి, దేశాభివృద్ధికి 49 కార్మిక చట్టాలను నాలుగు చట్టాలుగా సవరణ చేసి ప్రవేశపెట్టిందని తెలిపారు. దీనిని రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ కార్మిక సంఘాలు అవగాహన లేక సింగరేణి విషయంలో దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అలాంటి దుష్ప్రచారాన్ని కార్మిక వర్గం నమ్మవద్దని కోరారు. నూతనంగా ప్రవేశపెట్టిన నాలుగు చట్టాల వల్ల సంఘటిత, అసంఘటిత కార్మికర్గానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో బీఎంఎస్ సెంట్రల్ ప్రెసిడెంట్ శ్రీనివాసరాజు, ఏరియా ఉపాధ్యక్షుడు రమేష్, ప్రదీప్కుమార్, నాయకులు పాల్గొన్నారు. -
భీమారం అడవుల్లో బెబ్బులి
భీమారం: మంచిర్యాల జిల్లా భీమారం రిజర్వు ఫారెస్ట్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ రేంజ్ అధికారి రత్నాకర్రావు తెలిపారు. మంగళవారం రాత్రి నెన్నెల మండలం గంగారం మీ దుగా భీమారం–నెన్నెల ప్రధాన రహదారి దా టి దాంపూర్ అటవీప్రాంతంలోకి అడుగుపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే దాంపూర్ రిజర్వు ఫారెస్ట్లోకి వచ్చిన పులి కుందారం వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. గొర్రెలు, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. పులిని గుర్తించేందుకు రిజర్వు ఫారెస్ట్లో పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంచిర్యాల అటవీ డివిజన్ అధికారులు, సిబ్బంది అటవీప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. -
ఎన్కౌంటర్ చేయాలి..!
మహిళలపై అత్యాచారం, హత్య చేసిన వారిని వెంటనే ఎన్కౌంటర్ చేయ్యాలి. అప్పుడే బాలిక ఆత్మ శాంతిస్తుంది. ఇలాంటి వాళ్లు భూమి మీద బతికి ఉన్నా రానున్న రోజుల్లో మరిన్ని సంఘటనలకు దారి తీస్తుంది. కోర్టు, బెయిల్, విచారణ పేరుతో కాలయాపన చేయడం, వారికి భద్రత, జైల్లో తిండి ప్రభుత్వానికి అనవసరమైన ఖర్చు. నిందితులు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత యథేచ్ఛగా తిరుగుతుంటారు. మరిన్ని ఘటనలు చేసే అవకాశం ఉంటుంది. – కే.లావణ్య, పీవోడబ్ల్యూ రాష్ట్ర కో కన్వీనర్, మంచిర్యాలఅశ్లీల సైట్లను నిరోధించాలి చట్టాలు కఠినంగా అమలు చేయడంతోపాటు అశ్లీల వె బ్సైట్లను పూర్తిగా నిషేధించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. మద్యపానం మానవులను మృగాళ్లుగా మారుస్తుంది. మద్యపానం నిషేధించాలి. బాలికలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఆపద ఉందని భావిస్తే పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నం చేయాలి. బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కరాటే, కుంగ్ఫూ, క్రీడల్లో ప్రభుత్వం ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – కుర్మ సునిత, వనిత వాక్కు ఫౌండేషన్ కో ఫౌండర్, మంచిర్యాల -
రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల పర్యటన
జైపూర్: మండలంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు పి.మనోహర్ పలు కేంద్రాల్లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. జైపూర్, ఇందారం, షెట్పల్లి పంచాయతీ కార్యాలయాల్లోని కేంద్రాలను తనిఖీ చేసి ఆర్వోలకు సూచనలు చేశారు. నామినేషన్ ప్రక్రియ, రిజిష్టర్ నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, నామినేషన్లను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేపట్టాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తతో పని చేయాలని తెలిపారు. తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతిబాపురావు, ఆర్వోలు, ఏఆర్వోలు పాల్గొన్నారు. -
రోడ్డు విస్తరణ సర్వే అడ్డుకున్న వ్యాపారులు
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాల్టీలో రోడ్ల విస్తరణ సర్వేను ఆర్ఎంబీ అధికారులు బుధవారం ప్రారంభించారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి పెద్ద చెరువు రావిచెట్టు వరకు, తెలంగాణ తల్లి విగ్రహం నుంచి కత్తెరశాల ఎక్స్రోడ్డు వరకు, గాంధీచౌక్ నుంచి గోదావరి రోడ్డు వరకు విస్తరణ కోసం సర్వే చేపట్టారు. అంబేడ్కర్ చౌక్ నుంచి రావిచెట్టు వరకు సర్వేయర్లు కొలతలు తీశారు. అపోలో మెడికల్ వద్ద వ్యాపారులు సర్వేను అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ సర్వేయర్లు, సిబ్బంది వెనుదిరిగారు. చెన్నూర్ వర్తక వ్యాపార సంఘం అధ్యక్షుడు పడమటింటి సతీశ్ మాట్లాడతూ విస్తరణకు తాము అడ్డంకి కాదని, వ్యాపారులకు నోటీసులు ఇవ్వకుండా కొలతలు చేపట్టడమేమిటని ప్రశ్నించారు. ముందుగా బైపాస్ రోడ్డు అభివృద్ధి చేసి భారీ వాహనాలు అటుగా మళ్లించాలని, పట్టణంలో కుక్కలు, కోతలు బెడద నివారించాలని అన్నారు. కాగా, మున్సిపల్ కమిషనర్ మురళికృష్ణ స్పందిస్తూ సర్వే మాత్రమే నడుస్తోందని, 66 ఫీట్ల రోడ్డు వెడల్పు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ కొలతల కంటే ఎక్కువ నష్టం జరిగితే పరిహారం కింద భవన నిర్మాణ అనుమతిలో రాయితీ కల్పిస్తామని, ప్రజలు సహకరించాలని అన్నారు. -
ఓపెన్కాస్ట్ వస్తేనే ఆర్కేపీ అభివృద్ధి
రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియా పరిధి రామకృష్ణాపూర్లో చేపట్టనున్న ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్ ఫేజ్–2 కోసం స్థానిక ఓసీ ఆవరణలో బుధవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ సజావుగా సాగింది. స్థానిక ప్రజలు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు, యూనియన్ ప్రతినిధులు ఓసీ ఫేజ్–2కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ లక్ష్మణ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఓసీకి ఆనుకునే ఉన్న బీజోన్ ఆర్కే4 గడ్డ ప్రాంతవాసులు సభా ప్రాంగణానికి నల్లబ్యాడ్జీలతో హా జరయ్యారు. సభలోనికి రాకముందు రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశా రు. గతంలో ఓసీ ఫేజ్–1 సందర్భంగా సింగరేణి అధికారులు తమ కాలనీవాసులకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, ఓసీ బ్లాస్టింగ్ల్లో ఇ ళ్లు శిథిలమయ్యాయని, అనేక మంది శ్వాసకోశ రో గాలబారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీ ఫేజ్–2కు సహకరిస్తామని, సుమారు 350 కుటుంబాలు గల ఆర్కే4 గడ్డ ప్రాంతవాసులకు సింగరేణి యాజమాన్యం పునరావాసం కల్పించి ఆర్అండ్ఆ ర్ ప్యాకేజీ ప్రకటించాలని, లేనిపక్షంలో ఓసీ ఏర్పాటును అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన సభలో 48 మంది సలహాలు, సూచనలు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతీ ఒక్క రి అభిప్రాయాలను నమోదు చేశామని అన్నారు. పునరావాసం కల్పించాలనేది ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. నిబంధనల మేరకు సింగరేణి అధికారులు ప్రత్యామ్నాయం చూడాలని, ప్రజల సమస్యలను సామరస్యంగా పరిష్కరించేలా చొరవ చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపెల్లి సంపత్, మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీలకు బంకర్బెడ్లు
మంచిర్యాలఅర్బన్: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో మెరుగైన సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం విద్యార్థినులు గదుల్లోని చాపలపై నిద్రించాల్సి వస్తోంది. విద్యార్థినుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం బంకర్ బెడ్లు అందించేందుకు నిర్ణయించింది. ఈ తరహా బెడ్ల వల్ల స్థలం వృథా కాకుండా ఉంటుందని యోచిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా ఎన్ని అవసరమో విద్యాలయాల వారీగా లెక్కలు తీసి ఉన్నతాధికారులకు నివేదించారు. హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ కాంట్రాక్టు ఆర్డర్లు పొందగా నెలాఖరు వరకు ఆయా కేజీబీవీలకు సరఫరా చేసేందుకు చర్యలు వేగవంతం చేశారు. మొదటి దఫాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 45కేజీబీవీలకు 6860 బంకర్బెడ్లు సరఫరా చేయనున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ బెడ్లు ఎన్ని అవసరమో ప్రతిపాదనలు పంపించింది. ఇందులో భాగంగా ఆయా కేజీబీవీలకు దశలవారీగా బంకర్ బెడ్లు సరఫరా చేయనున్నారు. మరోవైపు నాబార్డు నిధులతో మౌలిక వసతులు కల్పించనున్నారు. విద్యార్థినుల అవసరాల మేరకు అదనపు తరగతి గదులు, శుద్ధ జల ట్యాంకులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీటిసంపులు, బోర్వెల్లు, ప్రహరీల నిర్మాణం, సోలార్ ఫెన్సింగ్, డార్మెటరీ, భోజనశాలలు, దోమలు రాకుండా మెష్ల ఏర్పాటు, భవన మరమ్మతులు, విద్యుత్ ఉపకరణాల మరమ్మతులు చేపట్టనున్నారు.మొదటి దశలో జిల్లాల వారీగా వివరాలుజిల్లా విద్యాలయాలు పడకలుఆదిలాబాద్ 13 2103 ఆసిఫాబాద్ 12 1749 నిర్మల్ 10 1553 మంచిర్యాల 10 1455 45 6860 -
నామినేషన్ల పరిశీలన పకడ్బందీగా చేపట్టాలి
బెల్లంపల్లిరూరల్/భీమిని: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన బెల్లంపల్లి మండలం బుధాకుర్థు, కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల పక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి క్షుణ్ణంగా పరిశీలించాలని, రిజిష్టర్లను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికల గుర్తుల కేటాయింపులో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఎంపీడీవోలు మహేందర్, శ్రీనివాస్రెడ్డి, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. పీహెచ్సీ భవన నిర్మాణం పరిశీలన కన్నెపల్లి మండల కేంద్రంలో పీహెచ్సీ భవన నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. పోలింగ్ రోజు సెలవు మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక, ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోసం ఉపయోగించే ప్రజాభవనాలు, విద్యాసంస్థలు, ఇతర భవనాలకు పోలింగ్ రోజు ప్రభుత్వ సెలవు, పోలింగ్కు ముందు రోజు స్థానిక సెలవుగా పరిగణించాలని పేర్కొన్నారు. దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లో 10, 11న, బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల, తాండూర్, వేమనపల్లి మండలాల్లో 13, 14న, భీమారం, జైపూర్, చెన్నూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో 16, 17న సెలవుదినంగా ప్రకటించినట్లు తెలిపారు. -
● చిచ్చుపెడుతున్న పంచాయతీ ఎన్నికలు ● ఏకగ్రీవాల కోసం ఒత్తిళ్లు, ప్రలోభాలు ● పలు చోట్ల హద్దు దాటుతున్న వైనం ● గ్రామాల్లో పెరుగుతున్న రాజకీయ వేడి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పంచాయతీ ఎన్నికలు పల్లెల్లో వర్గపోరును రాజేస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల మధ్య రాజకీయ వైరాన్ని మరింత పెంచేస్తున్నాయి. నామినేషన్లు వేసినప్పటి నుంచే పోటీదారుల మధ్య వైరం కొనసాగుతోంది. గ్రామ ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేందుకు బరిలో నిలబడినప్పటి నుంచే గ్రూపులుగా ఏర్పడుతున్నారు. పోటీ నుంచి తప్పుకునేలా చేస్తున్నారు. పలుచోట్ల నామినేషన్ల సమయంలోనే పలువురిని బలవంతంగా ఉపసంహరించుకరేలా ఒత్తిళ్లు తెచ్చారు. అధికార, ఆర్థిక, అంగబలంతో కొంతమందిని పోటీ నుంచి తప్పుకునేలా చేస్తున్నారు. జిల్లాలో పలు గ్రామాల్లో వార్డు, సర్పంచ్ స్థానాల్లో కొందరు పోటీ నుంచి తప్పుకోగా.. ఒకే అభ్యర్థి ఉన్నచోట్ల ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాల కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. సర్పంచ్గా రిజర్వేషన్లు కలిసి రాని వారంతా ఉప సర్పంచ్ పీఠం ఆశిస్తున్నారు. జిల్లాలో మొదటి విడత 90 పంచాయతీలు, 816 వార్డు స్థానాల్లో నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక అభ్యర్థులు తేలిపోయారు. ఇక రెండు, మూడో విడత పంచాయతీలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడత పోలింగ్ ఈ నెల 11న జరగనుంది. ఈ క్రమంలో వాడీవేడిగా రాజకీయాలు సాగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా రాజకీయాలు బరిలో ఉన్న అభ్యర్థులు తమ గెలుపే లక్ష్యంగా రాజకీయాలు సాగిస్తున్నారు. ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొన్నిసార్లు నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ హద్దులు దాటుతున్నారు. చట్టాన్ని అతిక్రమించి హద్దులు మీరుతూ వివాదాస్పదం అవుతున్నారు. తనను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరిస్తున్నారంటూ బెల్లంపల్లి మండలం చాకపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మౌనిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దండేపల్లి మండలం పాత మామిడిపల్లి సర్పంచ్ అభ్యర్థి మాధవి నామినేషన్ ఉప సంహరణకు వచ్చే క్రమంలోనూ చివరి వరకు హైడ్రామా సాగింది. నిర్ణీత సమయం తర్వాత వచ్చి విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంకా చాలాచోట్ల బయటకు రాకుండా లోలోపల ఒప్పందాలు కుదుర్చుకుని పోటీలో ఉన్న కొందరు తప్పుకునేందుకు రాజీ పడుతున్నారు. రెండు, మూడో విడత నామినేషన్ల ఉపసంహరణలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. మొదట బరిలో ఉన్న వారికి వచ్చే పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు, మండల జిల్లా స్థాయిలో కో ఆప్షన్గా ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేస్తామని ఆశ చూపిస్తున్నారు. ఇక కొందరైతే డబ్బు ఆశతోపాటు పలు రకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇక చెబితే వినకుండా ఉన్న వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతు న్న ఘటనలూ ఉన్నాయి. దీంతో పల్లెల్లో పంచా యతీ ఎన్నికల్లో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.అభ్యర్థులూ.. తస్మాత్ జాగ్రత్తఐదేళ్ల పంచాయతీ ఎన్నికల కోసం పచ్చని గ్రామాల్లో చిచ్చుపెట్టుకోవద్దని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గొప్పలకు పోయి డబ్బుల ఖర్చుతోపాటు వైరాలు పెంచుకోవద్దని హితవు పలుకుతున్నారు. గ్రామాల బాగు కోసం కలిసికట్టుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగి ఎన్నికలు నిర్వహించుకోవాలని కోరుతున్నారు. పలుకుబడి, డబ్బుల ఖర్చు, రాజకీయ వైరం, కక్షసాధింపు చర్యలతో నేరాలకు పాల్పడకుండా తస్మాత్ జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. -
సీఎం సారూ.. మీపైనే ఆశలు
కై లాస్నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో భాగంగా పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు. అక్కడి నుంచే పలు అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలు ఆవిష్కరించనున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు అనేకం ఉన్నాయి. విద్య, వైద్య, మౌలిక వసతుల పరంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతులు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతవాసులు సీఎం కల్పించే భరోసాపై గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించిన సీఎం ఆ దిశగా ఏమైనా కార్యాచరణ ప్రకటిస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పర్యటన సాగుతుందిలా...సీఎం మధ్యాహ్నం 1.20 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్లో బయలుదేరి 2గంటలకు ఆదిలాబాద్లోని ఎరోడ్రమ్కు చేరుకుంటారు. 2.10 గంటలకు కాన్వాయ్ ద్వారా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు చేరుకుంటారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 3.45గంటలకు స్టేడియం నుంచి హెలిప్యాడ్కు చేరుకుని హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. -
5 క్వింటాళ్ల పత్తి దగ్ధం
వేమనపల్లి: మండలంలోని రాజారం కుర్మగూడేనికి చెందిన జుంజు కొమురయ్య పత్తికి ప్ర మాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధమైంది. బాధితుడు వేమనపల్లి శివారులో ఏడెకరాల చేను కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. ఇటీవల ఏరిన 11 క్వింటాళ్ల పత్తిని ఇంటి ముందు భద్రపరిచాడు. ఎదురింట్లో మల్లన్న దేవుని పట్నాలు ఉండగా అక్కడికి వెళ్లాడు. అంతలోనే పత్తి గడ్డకు నిప్పంటుకుంది. గమనించిన స్థానికులు మోటర్లు ఆన్ చేసి మంటలు ఆర్పివేశారు. ఘటనలో సుమారు 5 క్వింటాళ్ల పత్తి కాలిపోయిందని, పరిహారం ఇప్పించి ఆదుకోవాలని బాధిత రైతు వేడుకుంటున్నాడు. -
ముత్తపూర్ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం
భీమిని: కన్నెపల్లి మండలం ముత్తపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా ఎండీ మున్నాభీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోపు ముత్తపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి నామినేషన్లు ర కపోవడంతో మున్నాభీ నామినేషన్ ఒకటే కా వడంతో ఆమె ఏకగ్రీవమయ్యే అవకాశం లభించింది. ముత్తపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఎని మిది వార్డులుండగా ఇందులో నాలుగో వార్డుకు ఒకే వర్గానికి చెందిన ఇద్దరి నుంచి రెండు నామి నేషన్లు రాగా, మిగతా ఏడు వార్డులకు ఒకటి చొ ప్పున రావడంతో పంచాయతీ పాలకవర్గమంతా ఏకగ్రీవమయ్యే అవకాశముంది. ఈ సందర్భంగా ఎండీ మున్నాభీ మాట్లాడుతూ.. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో ముత్తపూర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తాను ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యేందుకు సహకరించిన ముత్తపూర్ గ్రామస్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే గ్రామంలో ఏకగ్రీవం కాసిపేట: మండలంలోని ధర్మరావుపేట గ్రా మపంచాయతీలో సర్పంచ్, రెండు వార్డు స భ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. మంచిర్యాల ఎ మ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు స్వగ్రా మం ధర్మరావుపేటలో ఎమ్మెల్యే సోదరుడు, ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు సత్యపాల్రావు ఆధ్వర్యంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీ వమైంది. జుగునాక రాధ నామినేషన్ ఒక్క టే దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు. అలాగే పార్వతి పెద్దిరాజు, ఆజ్మీర శ్రీవల్లి వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
సైబర్ మోసాల నియంత్రణకు చర్యలు
మంచిర్యాలక్రైం: సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ నూతన ఎత్తుగడలకు శ్రీకారం చుట్టిందని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీస్ ‘ఫ్రాడ్ క ఫుల్స్టాప్’ కార్యక్రమాన్ని తెలంగా ణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో టీజీసీ ఎస్బీ డైరెక్టర్ షీకా గోయల్ మంగళవారం జూమ్ లింక్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. ఆన్లైన్లో నిర్వహించిన వర్క్షాపులో కమిషనరేట్లో ని పోలీస్ అఽధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ‘ఫ్రాడ్ క ఫుల్స్టాప్’ కార్యక్రమంలో భాగంగా సైబర్ సారథి 1930, స్కామ్సే బచావో, పైసా పైలం, హర్ స్క్రీన్ సురక్ష, మేరా లాగి మేరా రూల్, మహిళల రక్షణ, పిల్లల సంరక్షణ, హెల్ప్లైన్ 1930, గోల్డెన్ హవర్ రిపోర్టింగ్ ప్రా ముఖ్యత, ఏఐ ఆధారిత నివేదన వేగవంతం తదిత ర ఆంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రతీ ఠాణా పరిధిలోని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను సైబర్ మోసాలపై అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రతీ కాలేజీ నుంచి ఇద్దరు సైబర్ వలంటీర్లను ఎంపిక చేయాలని, ఐదుగురు విద్యార్థులు, ఒక టీచర్ను టీమ్గా ఏర్పాటు చేయాలని సూచించారు. వీరితో కాలేజీల్లోనే కాకుండా పబ్లిక్ స్థలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం సైబర్ నేరాల నియంత్రణ ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన వెంట అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు. -
గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించాం
జిల్లా కేంద్రంలో నిర్వహించిన 50 మీటర్ల పరుగుపందెం పోటీల్లో గోల్డ్మెడల్, సిల్వర్ మెడల్ సాధించాం. మెడల్స్, సర్టిఫికెట్లు అందుకోవడం ఎంతో ఆనందం కలిగించింది. మున్ముందు కూడా క్రీడాపోటీల్లో రాణిస్తాం. – ప్రశాంతి, ధనలక్ష్మి, దివ్యాంగ విద్యార్థినులు రెండుసార్లు చాంపియన్గా.. జిల్లాస్థాయిలో నిర్వహించిన క్రీడాపోటీల్లో రెండుసార్లు మా పాఠశాల చాంపియన్గా నిలిచింది. మేము ఎందులోనూ తక్కువ కాదు. త్వరలో హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయిలో పోటీల్లో సైతం రాణించి పాఠశాల, ఽఅధ్యాపకులు, తల్లిదండ్రుల పేరు నిలబెడుతాం. – లక్ష్మణ్, భద్రి, ఏడోతరగతి విద్యార్థులు -
‘ఆదర్శ’ హాస్టళ్ల బాధ్యతల నుంచి ఎస్వోల తొలగింపు!
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ మోడల్ స్కూళ్లకు అనుబంధంగా ఉన్న బాలికల వసతిగృహ నిర్వహణ బాధ్యతల నుంచి కేజీబీవీ ఎస్వోలను తొలగించారు. ఇదివరకు డీపీవో, ఫైనాన్స్, అకౌంట్స్ ఆఫీసర్, సమీప కేజీబీవీ ఎస్వో నిర్వహించే బాలికల హాస్టల్ ఉమ్మడి ఖాతాను ఇక నుంచి డీపీవో ఫైనా న్స్, అకౌంట్స్, మోడల్ స్కూల్స్కు అనుబంధంగా ఉన్న బాలికల హాస్టళ్ల కేర్టేకర్ కమ్ వార్డెన్ నిర్వహించనున్నారు. గర్ల్స్ హాస్టల్ ప్రాంగణాల శుభ్రతను మోడల్స్కూల్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పారిశుధ్య కార్మికులు చూడనున్నారు. ప్రాంగణ నిర్వహణ నిర్ధారించే బాధ్యతలను మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్కు అప్పగించారు. చిన్న మరమ్మతులు, ఇతర సమస్యల పరిష్కార బాధ్యతలు కేర్ టేకర్ కమ్ వార్డెన్తో పాటు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఎంఈవో, జిల్లా జెండర్ అండ్ ఈక్విటీ కో–ఆర్డినేటర్లతో కూడిన నలుగురు సభ్యుల కమిటీ చూడనుంది. హాస్టల్ విద్యార్థినులతో వారానికోసారి సమావేశం నిర్వహించాలని మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక నుంచి హాస్టల్ బాధ్యతలు కేర్ టేకర్ కమ్ వార్డెన్లు పర్యవేక్షించనున్నారు. కేజీబీవీ ఎస్వోలకు ఊరటజిల్లాలో ఐదు ఆదర్శ పాఠశాలలుండగా అనుబంధంగా వసతిగృహాలు ఏర్పాటు చేశారు. బాలికల విద్యను ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆర్ఎన్ఎస్ఏ ద్వారా వసతిగృహాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తర్వాత కాలంలో సమగ్రశిక్షణ పరిధిలోకి తీసుకువచ్చి మోడల్స్కూల్ ప్రిన్సిపాల్కు ఎఫ్ఏవోకు చెక్పవర్ ఇచ్చారు. ఒక్కో వసతిగృహంలో 100 మంది విద్యార్థినులకు అవకాశం కల్పించారు. మొ దటి ప్రాధాన్యతలో కళాశాలల విద్యార్థినులకు వసతిగృహాల్లో చోటు కల్పిస్తున్నారు. అప్పట్లో మోడల్ స్కూల్ ప్రాంగణంలోని బాలికల వసతి గృహాల నిర్వహణ బాధ్యత తమది కాదని మోడల్స్కూల్ ప్రిన్సిపాల్స్ కోర్టు ద్వారా ఉత్తర్వుల పొందిన నేపథ్యంలో సమీప కేజీబీవీ ఎస్వోలకు నిర్వహణ బా ధ్యతలు కట్టబెట్టారు. అప్పట్లోనే ఆదర్శ పాఠశాలలకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహాల నిర్వహణ బాధ్యతలు సమీప కేజీబీవీ ఎస్వోలకు అప్పగించడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వైపు కేజీబీవీ పాఠశాల, హాస్టల్, కళాశాల పర్యవేక్షించటంతో పాటు ఆదర్శ హాస్టళ్ల అదనపు భారం మోపడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబట్టా యి. మోడల్ స్కూల్కు అనుబంధంగా ఏర్పాటు చేసిన హాస్టళ్లు దూరంగా ఉండటం, కేజీబీవీ బాధ్యతల నిర్వహణ కష్టతరంగా మారింది. ఎట్టకేలకు హాస్టల్ నిర్వహణ బాధ్యతల నుంచి వారిని తప్పించటం కేజీబీవీ ఎస్వోలకు ఊరటనిచ్చింది. -
సర్పంచ్గా భర్త, వార్డుమెంబర్గా భార్య..
● నామినేషన్ దాఖలు చేసిన దంపతులు బెల్లంపల్లిరూరల్: మండలంలోని లంబాడితండా గ్రామ పంచాయతీలో ఎనిమిది వార్డులు ఉండగా 686 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 332 మంది పురుషులు, 354 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ స్థానాన్ని అన్రిజర్వుడ్ (సీ్త్ర లేదా పురుషులు)లకు, మొదటివార్డును అన్ రిజర్వుడ్ (మహిళ)కు కేటాయించారు. దీంతో లంబాడితండాకు చెందిన సామాజిక కార్యకర్త రంగ ప్రశాంత్ సర్పంచ్ అభ్యర్థిగా, అతని భార్య జీళ్ల రజిత మొదటి వార్డు సభ్యురాలిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. -
నేడు నామినేషన్ల ఉపసంహరణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నామి నేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు గాను డమ్మీ అభ్యర్థులుగానే కాకుండా రెబల్గా నామినేషన్ వేసినవారికి పంచాయతీ ఎన్నికలు వరంగా మారాయి. తమకు అధికసంఖ్యలో ఓటర్ల మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటూ గుర్తింపు చాటుకుంటున్నారు. మంచి ర్యాల రెవెన్యూ డివిజన్లోని హాజీపూర్, దండేపల్లి, లక్సెట్టిపేట, జన్నారం మండలాల్లో 90 గ్రామపంచాయతీల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నా యి. 90 పంచాయతీల్లో మూడు గ్రామాలకు నామి నేషన్లు దాఖలు కాలేదు. మిగతా 87 పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా 408 మంది నామినేషన్లు వేశారు. 816 వార్డు సభ్యుల స్థానాలకు గాను 34 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 782 వార్డు స్థానాలకు గాను 1,697 నామినేషన్లు వేశారు. పోటీలో ఉన్న నాయకులు ఉపసంహరణ చేసుకోవా లని కోరినప్పుడు డమ్మీలు మొదట ససే మిరా అంటూనే ఆపై తమ మనసులోని కోరిక నేరుగా చెప్పేస్తున్నారు. మొదట పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ సాగే చర్చలో బేరసారాలు చేసుకుంటూ ఎంతో కొంత సెటిల్ చేసుకుని నామినేషన్లు ఉపసంహరించుకోవడం పరిపాటిగా మారింది. మరికొంత మంది తమతో మంతనాలు జరిపేందుకు ఎవరూ రాకుంటే వారే స్వయంగా అభ్యర్థుల వద్దకు వెళ్లి డబ్బులిస్తే పోటీ నుంచి తప్పుకొంటామని బేరసా రాలకు దిగుతున్నారు. గెలుపుపై ఆశలు పెట్టుకున్న అవతలి అభ్యర్థులు కొంత మొత్తమైనా ముట్టజెప్పకపోతారా? అని చూస్తున్నారు. ఈ తరహాలో డమ్మీ అభ్యర్థులు తొలి విడతలో ఉండగా సోమ, మంగళవారాల్లో గ్రామాల్లో ఎక్కడ చూసినా వీరిని పోటీ నుంచి తప్పుకోవాలని మంతనాలు పెద్ద ఎత్తున సాగడం కొసమెరుపు. ఇక రెబల్ అభ్యర్థుల తీరు మరోలా ఉండగా గెలుపు గుర్రాలమంటూ బెట్టు చేస్తున్నారు. ఏది ఏమైనా డమ్మీలు, ఆశావహుల వ్యూహాన్ని పసిగట్టిన కొంత మంది చేసేది లేక వారి కి ఎంతో కొంత ముట్టజెబుతూ నామినేషన్లు ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.10వేల నుంచి రూ.50 వేలకే పై గా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొ న్ని చోట్ల ఉపసంహరణకు బెదిరింపులు, బుజ్జగింపులు, మధ్యవర్తిత్వాలతో చర్చలు జరుగుతున్నా యి. గ్రామ రాజకీయాలు వేడెక్కిన తరుణంలో ఉపసంహరణ ప్రక్రియ అనంతరం ఎవరు బరిలో ఉంటారో, ఎవరు ఉపసంహరించుకుంటారోనన్న పరిస్థితులకు నేడు తెరపడనుంది. -
నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలి
చెన్నూర్రూరల్/చెన్నూర్: పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సూ చించారు. మండలంలోని కిష్టంపేట గ్రామపంచా యతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడువు లోపే నామినేషన్లు స్వీకరించాలని, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు గదుల నిర్మాణ పనులు పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేసే లా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఎంపీడీవో మోహన్, చెన్నూర్ పట్టణ సీఐ దేవేందర్రావు, ఎంపీవో అజ్మత్ అలీ పాల్గొన్నారు. చెన్నూర్లో పట్టణంలో..చెన్నూర్లోని ఆరోగ్యకేంద్రం, అమృత్ 2.0, సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వంద పడకల ఆస్పత్రి భ వన నిర్మాణ, ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పా ఠశాల గదుల మరమ్మతు పనులు, అదనపు గదుల నిర్మాణ పనులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. -
ఆత్మస్థైర్యం నింపేందుకే పోటీలు
మంచిర్యాలక్రైం: దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య (రెవెన్యూ) తెలిపారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల మైదా నంలో జిల్లా మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ని ర్వహించిన ఆటలపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటల పోటీల తో ఆత్మస్థైర్యం పెరుగుతుందని, దివ్యాంగులు ప్ర తి ఒక్కరూ తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలి పారు. రన్నింగ్, షాట్ఫుట్, చెస్, బదిరులకు రన్నింగ్, షాట్ఫుట్, జావెలిన్ త్రో, శారీరక దివ్యాంగులకు షార్ట్ఫుట్, క్యారం, జావెలిన్ త్రో, బుద్ధి మాంద్యం, దివ్యాంగులకు రన్నింగ్, షార్ట్ఫుట్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ఖాన్, జిల్లా యువజన క్రీడాలశాఖ అధికారి హన్మంత్రెడ్డి, జిల్లా వయోజన విద్యాధికా రి పురుషోత్తంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వైకల్యం చిన్నబోయింది..!
ఉట్నూర్రూరల్: చదువులోనే కాదు క్రీడల్లో కూడా సత్తా చాటుతామని నిరూపిస్తున్నారు వికాసం పాఠశాల దివ్యాంగ విద్యార్థులు. రెండేళ్లుగా జిల్లాస్థాయి క్రీడాపోటీల్లో ఓవరాల్ చాంపియన్గా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబీ ప్రాంగణంలో ఏజెన్సీ ప్రాంత దివ్యాంగ బాలబాలికల కోసం 2014లో అప్పటి పీవో ఆర్వీ కర్ణన్ వికాసం పేరుతో ప్రత్యేక పాఠశాలను ప్రారంభించారు. ఇందులో వినికిడిలోపం, దృష్టిలోపం, బుద్ధిమాంద్యం, శిశుపాక్షిక పక్షవాతం గల విద్యార్థులు 152 మంది 1 నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. వీరు పరుగు పందెం, క్యారమ్, చెస్, జావెలిన్ త్రో, ఆర్చరీ పోటీల్లో రాణిస్తున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. పలు పతకాలు కై వసం చేసుకుని చాంపియన్లుగా నిలిచారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారి అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. -
రేపు ట్రాఫిక్ డైవర్షన్
● పట్టణంలోని పలురూట్లలో ఆంక్షలు ఆదిలాబాద్టౌన్: ఈనెల 4న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ డైవర్షన్ చేపడుతున్నట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అంకోలి, తంతోలి గ్రామాల ప్రజలు కేఆర్కే మీదుగా పిట్టల్వాడ నుంచి పట్టణానికి చేరుకోవాలని పేర్కొన్నారు. ఏరోడ్రమ్ నుంచి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు రోడ్డుపై పూర్తిగా ఆంక్షలు ఉంటాయన్నారు. నిర్మల్, మావల మీదుగా సభకు వచ్చే బస్సులు పిట్టల్వాడ, మావల పోలీస్స్టేషన్ మీదుగా తెలంగాణ రెసిడెన్షియల్ బాలుర కళాశాలలో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. ఉదయం నుంచి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, కేఆర్కే కాలనీ, హ్యాండిక్యాప్ కాలనీకి ఆంక్షలు వర్తిస్తాయన్నారు. అత్యవసర పనుల కోసం ప్రజలు పట్టణంలోని అంతర్గత రోడ్లను వినియోగించుకోవాలన్నారు. వీఐపీ వాహనాలు తెలంగాణ చౌక్ మీదుగా కాన్వెంట్ స్కూల్, సరస్వతి శిశుమందిర్ నుంచి టీటీడీ కల్యాణ మండపానికి చేరుకోవాలన్నారు. సభకు వచ్చే ప్రజలు ద్విచక్ర వాహనాలను రాంలీలా మైదానం, సైన్స్ డిగ్రీ కళాశాలలో పార్కింగ్ చేయాలన్నారు. టూవీలర్లు, కార్లు, ఆటోలను కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేసి నడక మార్గంలో సభా స్థలానికి చేరుకోవాలని సూచించారు. బైక్తో ఢీకొట్టి.. ప్రశ్నిస్తే చితక్కొట్టి..బోథ్: బైక్పై అతివేగంగా వచ్చి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టగా ప్రశ్నించినందుకు అతనిపై దాడికి పాల్పడిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీసాయి తెలిపిన వివరాల మేరకు కోఠ కె గ్రామానికి చెందిన వి నోద్ తన ఆటోను సొనాల మండల కేంద్రంలో ఆటోస్టాండ్ వద్ద ఉంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఘన్పూర్ నుంచి పల్సర్ బైక్పై అతివేగంగా వచ్చిన జాదవ్ సాయికిరణ్, కిషన్ మహరాజ్ వినోద్ను ఢీకొట్టారు. వినో ద్ వారిని మందలించడంతో అతనిపై దాడి చేశారు. తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తండ్రి బర్గి నాగోరావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభమంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట మహాత్మ జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు పీఎంశ్రీ జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చారు. బెల్లంపల్లి తెలంగాణ గురుకుల పాఠశాలలో సోమవారం నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో ఖోఖోలో బంగారు పతకాలు సాధించారు. మంగళవారం ఉమ్మడి జిల్లా ఎంజేపీల ఆర్సీవో, ప్రిన్సిపాల్ సేరు శ్రీధర్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ నాగజ్యోతి, పీడీ సురేశ్, పీఈటీ నాగేశ్, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. -
సర్పంచ్ బరిలో అన్నదమ్ములు, అత్తాకోడలు
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంటకు చెందిన జాదవ్ కిషన్, దేవ్కబాయి దంపతులకు ప్రతాప్సింగ్, కుబేర్సింగ్, అనార్సింగ్, రామ్లఖన్సింగ్ నలుగురు కు మారులు సంతానం. గతంలో జాదవ్ కిషన్ ఒకసారి సర్పంచ్గా, ముత్నూర్ ఎంపీటీసీగా, తల్లి ఏమాయికుంట సర్పంచ్గా సేవలందించారు. తండ్రి మరణానంతరం నాలుగో కుమారుడు లఖ న్సింగ్ గత ఎన్నికల్లో ఏమాయికుంట సర్పంచ్గా పోటీచేసి గెలుపొందాడు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో నామినేషన్ దాఖలు చేశాడు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న సోదరులు జాదవ్ కుబేర్సింగ్, అనార్సింగ్ సర్పంచ్ పదవికి పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఓటర్లు అయోమయస్థితిలో పడిపోయారు. అదేవిధంగా మండలంలోని హీరాపూర్ గ్రామపంచాయతీలో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరి సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడం మండలంలో చర్చనీయాంశమైంది. ముగ్గురు అన్నదమ్ములు, అత్తా కోడళ్లలో ఎవరు గెలుస్తారోనని మండల ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.ఉపసంహరణకూ నిబంధనలునిర్మల్ఖిల్లా: ఇప్పటికే తొలివిడత నామినేషన్ల ప్ర క్రియ పూర్తయింది. బరిలో ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు బుధవా రం చివరిరోజు. అయితే ఇప్పటికే తమతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులను బరిలో నుంచి తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్ర త్యేక నిబంధనలు పొందుపరిచింది. అభ్యర్థి తమ నామినేషన్ ఉపసంహరించుకోదల్చుకుంటే సంబంధిత రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక ఫార్మాట్లో దరఖాస్తు అందజేయాలి. తనంతట తానుగా ఉపసంహరించుకుంటున్నారని, ఎటువంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ఆర్థికపరమైన ప్రలోభాలు, ఇతరుల ప్రమేయాలు లేవని స్వచ్ఛందంగా స్వీయ ధృవీకరణను సమర్పించాల్సి ఉంటుంది. అయితే రిటర్నింగ్ అధికారి దీనికి సంతృప్తి చెందకపోతే క్షేత్రస్థాయిలో వి చారణ చేపట్టేందుకు కూడా అధికారాలు ఉన్నాయి. గుర్తుల కేటాయింపు ఇలా..!బోథ్: పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సంద డి జోరందుకుంది. తొలివిడత నామినేషన్లు, పరిశీలన పూర్తికాగా ఈ నెల 3న ఉపసంహరణ గడువు ముగియనుంది. తుది జాబితా ప్రకటించి పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. రెండోవిడత 6న, మూడోవిడత 9న నామి నేషన్ ఉపసంహరణ అనంతరం గుర్తులు కేటా యిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తులు కేటాయించింది. తెలుగు అక్షర క్రమంలో.. పంచాయతీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు ప్ర క్రియ పూర్తిగా తెలుగు అక్షర క్రమం ఆధారంగా జ రుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లలో పే రును ఏ విధంగా పేర్కొంటే ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే గుర్తు కేటాయిస్తారు. ఉదాహరణకు ‘అరవింద్’ అనే పేరుతో నామినేషన్ వేసిన వారికి, ‘లక్ష్మి’ అనే పేరుతో నామినేషన్ వేసిన వారి కంటే ముందుగా గుర్తు కేటాయించేందుకు ప్రాధాన్యత ఉంటుంది. నామినేషన్ వేసే అభ్యర్థులు ఇంటిపేరును ముందుగా రాయాలా, లేదా పేరును రా యాలా అనేది తమ బ్యాలెట్ స్థానాన్ని ప్రభావితం చేయడానికి ఉపయోగించే అవకాశం ఉంటుంది. సర్పంచ్ల కోసం.. సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కోసం 30 ప్రత్యేక గుర్తులను కేటాయించారు. ఈ గుర్తులను గులా బీ రంగు బ్యాలెట్ పేపర్పై ముద్రిస్తారు. ఉంగ రం, కత్తెర, బ్యాటు, ఫుట్బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్పేస్టు, స్పానర్ (పానా), చెత్తడ బ్బా, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వ జ్రం, బకెట్, డోర్హ్యాండిల్, టీ జల్లెడ, మంచం, టేబుల్, బ్యాటరీ లైట్, బిస్కెట్, వేణువు, చెప్పులు, గాలి బుడగ, క్రికెట్ స్టంప్స్ వంటివి ఉన్నా యి. ’నోటా’ గుర్తు కూడా అందులో ఉంటుంది. వార్డు అభ్యర్థులు వార్డు అభ్యర్థులకు నోటాతో కలిపి 21 గుర్తులు ఉంటాయి. వాటిని తెల్లరంగు (వైట్) బ్యాలెట్ పేపర్పై ముద్రిస్తారు. గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ ఆంటినా, గరాటా, మూకుడు, ఐస్క్రీమ్, గాజు గ్లాసు, పోస్టుడబ్బా, కవరు, హాకీ కర్ర బంతి, నెక్టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్ స్తంభం, కేటిల్ వంటివి ఉన్నాయి. గుర్తుల కేటాయింపు పూర్తయిన వెంటనే, పోలింగ్ ప్రక్రియకు అవసరమైన బ్యాలెట్ పేపర్లను ముద్రించి పంపిణీ చేయనున్నారు. -
ప్రహరీ కూల్చివేసిన ముగ్గురిపై కేసు
రామకృష్ణాపూర్: మందమర్రిలోని లక్ష్మీభవాని కాలనీలో ఓ ఫంక్షన్ హాల్కు సంబంధించిన స్థల విషయంలో కోర్టులో స్టే ఉండగా మంగళవారం ప్రహరీని కూల్చివేసేందుకు ప్రయత్నించిన ఘటన చర్చానీయాంశమైంది. ఊరు మందమర్రికి చెందిన నర్సి ంగరావు పేరిట 421 సర్వే నంబర్లో కొంత భూమి ఉంది. అందులో చాలా రోజుల క్రితం బైర్నేని లక్ష్మి ఓ ఫంక్షన్ హాల్ నిర్మించారు. దీంతో నర్సింగరావు కోర్టును ఆశ్రయించగా ఫంక్షన్హాల్ కూల్చివేతకు ఉత్తర్వులిచ్చింది. తీర్పును బైర్నేని లక్ష్మి కూడా సవాల్ చేయడంతో కోర్టు స్టే ఇచ్చింది. అయితే స్టే ఆర్డర్ ఉండగా నర్సింగరావు కుమారుడు పవన్రావు జేసీబీలతో వచ్చి ప్రహరీని కూల్చివేశారు. పట్టణ ఎస్సై రాజశేఖర్ జేసీబీలను పోలీస్స్టేషన్కు తరలించారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు పవన్రావుతో పాటు ప్రసన్న, సోనుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
సినిమాలతో ప్రేరణ పొంది.. గన్ కొని
కౌటాల(సిర్పూర్): హిందీ సినిమాల ప్రభావంతో ఓ యువకుడు బిహార్కు వెళ్లి గన్ కొనుగోలు చేశాడు. ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో స్థానిక వ్యాపారిని బెదిరించాడు. అంతేకాక సదరు వ్యాపారి తమ్ముడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కౌటాల సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ నితిక పంత్ వివరాలు వెల్లడించారు. కౌటాల మండలం సాండ్గాంకు చెందిన కుర్బంకర్ అజయ్ హిందీ సినిమాలు చూసి ప్రేరణ పొంది వ్యాపారులను బెదిరించి, వినకపోతే చంపి అయినా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. జూన్ 12న రూ.50లక్షల నగదును మహారాష్ట్రలోని చంద్రపూర్ బస్టాండ్కు వచ్చి ఇవ్వాలని కౌటాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యాపారి ఫర్టిలైజర్ షాపులో బెదిరింపు లెటర్ వేశాడు. వ్యాపారి స్పందించకపోవడంతో యూట్యూబ్ వీడియోల ద్వారా ఆయుధాలు బిహారులో దొరుకుతాయని తెలుసుకుని జూలై చివరి వారంలో అక్కడికి వెళ్లాడు. బాబు సాహెబ్ కుమార్ అనే వ్యక్తికి రూ.55వేలు చెల్లించి ఒక పిస్టోల్, ఒక తపంచా, రెండు మ్యాగజైన్లు, 21 బుల్లెట్లు కొనుగోలు చేశాడు. మూడు బుల్లెట్లతో అక్కడే ప్రాక్టీస్ చేసి ఇంటికి చేరుకున్నాడు. సమీపంలో ప్రాణహిత నది ఒడ్డున కూడా ఒక బుల్లెట్ను గాలిలోకి ఫైర్ చేశాడు. మళ్లీ సెప్టెంబర్ 26న కాగజ్నగర్ నుంచి మహారాష్ట్ర వెళ్లే రైలులో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ నుంచి అజయ్ మళ్లీ వ్యాపారికి కాల్ చేసి బెదిరించాడు. అక్టోబర్ 15న రాత్రి 7 గంటల సమయంలో వ్యాపారి తమ్ముడిని చంపాలనే ఉద్దేశంతో ముఖంపై లైట్ ఫోకస్ వేసి ఫైర్ చేశాడు. కానీ గురితప్పింది. అక్టోబర్ 18న బాధితుడు కౌటాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మరోసారి వ్యాపారి లేదా వారి కుటుంబీకులను చంపాలని పిస్టోల్, మూడు బుల్లెట్లు తీసుకుని అజయ్ బైక్పై వెళ్తుండగా మంగళవారం కౌటాల మండలం ముత్తంపేట క్రాస్రోడ్డు వద్ద ఎన్నికల విధుల్లో తనిఖీ చేస్తున్న పోలీసులకు చిక్కాడు. నిందితుడి వద్ద నుంచి పిస్టోల్, తపంచా, రెండు మ్యాగజీన్లు, 15 చిన్న బుల్లెట్లు, ఐదు బుల్లెట్ షెల్స్, సెల్ఫోన్, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నేరం ఒప్పుకోవడంతో అజయ్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ సంతోష్కుమార్, ఎస్సైలు చంద్రశేఖర్, సందీప్ పాల్గొన్నారు. -
అన్నను చంపిన తమ్ముడి అరెస్ట్
రామకృష్ణాపూర్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని సండ్రోన్పల్లిలో అన్నను కొట్టిచంపిన ఘటనలో నిందితుడు మెండ్రపు కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మందమర్రి సీఐ శశిధర్రెడ్డి తెలిపారు. మంగళవారం పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సండ్రోన్పల్లికి చెందిన మెండ్రపు కుమార్ అతని అన్న మెండ్రపు గోపాల్ ఇద్దరు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. గోపాల్ తరచూ మద్యం సేవించి గొడవకు దిగేవాడు. గోపాల్, అతని భార్య గంగా వేధింపుల కారణంగా కుమార్ భార్య చంద్రకళ కూతురుతో సహా ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. దీనికి తోడు రోజువారీ గొడవలు మరింత పెరిగాయి. ఈ నెల1న రాత్రి గోపాల్ మళ్లీ గొడవకు దిగడంతో కోపోద్రిక్తుడైన కుమార్ రోకలి బండతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమావేశంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
బగారా తిని మూడు మేకలు మృతి
వాంకిడి: మేతకు తీసుకెళ్తున్న క్రమంలో బయట పడేసి ఉన్న బగారా అన్నం తిని మూడు మేకలు మృతి చెందగా సుమారు 20 అస్వస్థతకు గురైన ఘ టన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు గొర్రెల కాపరి రమే శ్ మంగళవారం ఉదయం మండల కేంద్రంలోని పలువురికి చెందిన మేకలను మేతకు తీసుకెళ్తుండగా చికెన్ సెంటర్ సమీపంలో పడేసి ఉన్న బగారా అన్నం తిని అస్వస్థతకు గురయ్యాయి. గమనించిన కాపరి అప్రమత్తమై వెంటనే మేకల మందను స మీపంలో ఉన్న పశు వైద్యశాలకు తరలించగా వై ద్యులు యాంటిడోస్ టీకాలు వేశారు. దేశవేణి రమే శ్, నవ్గడె చందు, శ్రావణ్కు చెందిన మేకలు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందగా సుమారు 20 మేకలు చికిత్స అనంతరం కొంతవరకు కోలుకున్నాయి. విష ప్రయోగం వల్లే ప్రమాదం.. పడేసిన అన్నంపై విష ప్రయోగం చేయడం వల్లే మేకలు మృత్యువాత పడ్డాయని బాధితులు ఆరోపించారు. పడేసి ఉన్న ఆహారం తినడం వల్లే మేకలకు ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
మల్యాలలో జాతీయ మానసిక ఆరోగ్య సర్వే
జన్నారం: ప్రజల మానసిక ఆరోగ్యస్థితి, జీవనశైలి సమస్యలు, ఆరోగ్య అవగాహన స్థాయి అంచనా, చికిత్స అంతరాల గుర్తింపునకు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీనగర్, నిమ్హాన్స్ బెంగళూర్ ఆధ్వర్యంలో మండలంలోని మల్యాల గ్రామంలో మంగళవారం సర్వే నిర్వహించారు. వైద్యులు వామన్ కులకర్ణి, సాయికృష్ణ తిక్కా ఆధ్వర్యంలో సర్వే కొనసాగింది. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే–2 రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.వినీల్, మెడికల్ ఆఫీసర్ ఉమాశ్రీ పర్యవేక్షించారు. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించారు. మానసిక సమస్యలపై 14416 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఎమ్ఎల్హెచ్పీ నవనీల, ఏఎన్ఎం పద్మ, ఆశ వర్కర్ తిరుమల, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఓసీ ఫేజ్–2 ప్రాజెక్ట్పై ప్రజాభిప్రాయ సేకరణ
రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియా పరిధిలోని రామకృష్ణాపూర్ ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్ ఫేజ్–2 ఏర్పాటుకు బుధవారం నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణకు ఓసీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న కార్యక్రమానికి అదనపు కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, సింగరేణి అధికారులు, యూనియన్ ప్రతినిధులు హాజరుకానున్నారు. 1,209 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ప్రాజె క్ట్ జీవితకాలం దాదాపు 18 ఏళ్లు కాగా, ఈ ఓసీ ద్వా రా 2.50 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. పూర్తిగా యాంత్రీకరణ విధానంతో చేపట్టే ఓసీకి మొత్తం కావాల్సిన భూమి 1,209 హె క్టార్లు కాగా, ఇందులో అటవీభూమి 611 హెక్టార్లు, అటవీయేతర భూమి 597 హెక్టార్లు ఉంది. ఈ ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్కు ఎలాంటి పునరావాసం లేకపోవటం విశేషం. ప్రాజెక్టు కోసం రూ.442.90 కోట్లు కే టాయించారు. ఈ ఓసీ ఏర్పాటు ద్వారా కొత్త ఉద్యో గ, అభివృద్ధి అవకాశాలు పెరగనున్నట్లు స్థానికులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ప్రజాభిప్రాయసేకరణలో స్థానికులు, సంఘాల ప్రతినిధులు, యూని యన్ నాయకులు పాల్గొని అభిప్రాయాలు తెలుపాలని ఏరియా జీఎం రాధాకృష్ణ సూచించారు. -
ప్రభుత్వాస్పత్రిలో వేసెక్టమీ శిబిరం
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ ఆస్పత్రిలో మంగళవారం వేసెక్టమీ (కుటుంబ నియంత్రణ) శస్త్రచికిత్స శిబిరాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ఎస్.అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా పురుషులకు కోత, కుట్టు లేని కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేశారు. ఈ సందర్భంగా వైద్యులు పురుషులకు వేసెక్టమీపై అవగాహన కల్పించారు. ప్రోగ్రాం అధికారులు అరుణశ్రీ, గోపీనాథ్, భగవతి, శ్రీమన్నారాయణ, డీపీహెచ్ కాంతారావు, ఎస్వో దామోదర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, ప్రభు త్వ ఆస్పత్రి నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లి, దొనబండ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్ మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు చర్యలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాపల్లి, దొనబండ పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవి కాగా శాంతిభధ్రతల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తున్నట్లు తెలి పారు. యువత ఎన్నికల్లో భాగస్వాములు కావాల ని, క్షణికావేశాలతో గొడవల్లో పడి జీవితాలను అంధకారం చేసుకోవద్దని హితవు పలికారు. హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్పాండే, ఎస్సై స్వరూప్రాజ్, పంచాయతీ కార్యదర్శులున్నారు. విద్యార్థులతో మాటామంతి..దొనబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించే క్రమంలో వాలీబాల్ ఆడుతున్న విద్యార్థులను గమనించిన డీసీపీ భాస్క ర్ వారి వద్దకు వెళ్లారు. విద్యార్థులందరినీ పలకరిస్తూ భవిష్యత్లో ఏ ఉద్యోగం చేయాలని ఉందని తెలుసుకున్నారు. చదువులో కష్టంగా ఉన్న సబ్జెక్ట్లపై కూడా ఆరా తీశారు. కష్టపడి చదివితే తప్పకుండా రాణిస్తారని వారిలో చైతన్యం నింపారు. -
పథకాలకు ఆకర్షితులయ్యే కాంగ్రెస్లో చేరిక
చెన్నూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పే ర్కొన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో చెన్నూర్ మండలంలోని కొమ్మెర గ్రా మానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ స త్యగౌడ్, ఆయన అనుచరులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని పేర్కొన్నారు. గ్రామాలవారీగా కసరత్తుచెన్నూర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి చె న్నూర్, కోటపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. స ర్పంచ్ అభ్యర్థుల ప్రకటనకు గ్రామాల వారీ గా కసరత్తు చేశారు. కొన్ని గ్రామాల్లో నాయకుల మధ్య సయోధ్య కుదరక తానే పేర్లు ఖ రారు చేస్తానని నాయకులకు వివరించారు. -
మంచిర్యాల
7పట్టింపు కరువై.. పాలకులు, ఆర్టీసీ అధికారుల నిర్లిప్తతకు సజీ వ సాక్ష్యంగా నిలుస్తోంది బెల్లంపల్లి బస్టాండ్. ఏళ్లుగా అభివృద్ధి, వసతులకు నోచుకోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వైకల్యం చిన్నబోయింది..! చదువులోనే కాదు.. క్రీడల్లోనూ దివ్యాంగ విద్యార్థులు సత్తా చాటుతున్నారు. నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆట్లో రాణిస్తున్నవారిపై కథనం.. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. చలి పెరుగుతుంది. రాత్రి మంచు కురుస్తుంది. -
ఎల్లారం శివారులో పులి
నెన్నెల: కుశ్నపల్లి రేంజ్ పరిధిలోని ఎల్లారం గ్రామ శివారులో నీలగిరి ప్లాంటేషన్ ప్రాంతంలో పులి వచ్చినట్లు తెలవడంతో కదలికను గమనించేందుకు అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. రేంజ్ అధికారి దయాకర్ సిబ్బందితో కలిసి మంగళవారం పులి పాద ముద్రలు గుర్తించారు. పులి జాడ కోసం రంగపేట, గుండ్ల సోమారం, జోగాపూర్, చిత్తాపూర్ అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు సిబ్బందిని అప్రమత్తం చేశారు. పులి ఎటువైపు వెళ్లిందనే విషయమై ఆరా తీస్తున్నారు. ఎల్లారం వైపు నుంచి రంగపేట అటవీ ప్రాంతం వైపు వెళ్లిందా..? లేక.. ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందా? అని పరిశీలిస్తున్నారు. పులి పాదముద్రలు కనిపించడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
బాలికపై లైంగికదాడి.. హత్య
దండేపల్లి: బాలిక అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు విషయం బయట పడుతుందని చంపి బావిలో పడేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(6) అదృశ్యం కావ డం, మూడు రోజుల తర్వాత వ్యవసాయ బావిలో శవమై తేలడం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దండేపల్లి పోలీసులు మిస్టరీని ఛేదించారు. బాలికపై ఆమెకు దగ్గరి బంధువులైన ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడి హత్య చేశారని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ తెలిపారు. సోమవారం దండేపల్లి పోలీసుస్టేషన్ ఆవరణలో ఏసీపీ ప్రకాశ్తో కలిసి వివరాలు వెల్లడించారు. మండలంలోని నంబాల గ్రామానికి చెందిన శనిగారపు బాపు(52) భార్య ఆరేళ్ల క్రితం చనిపోయింది. కొడుకు, కూతురు ఇతడికి దూరంగా ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఉపారపు సతీష్(40)కు రెండేళ్ల క్రితం భార్యతో విడాకులయ్యాయి. ఇద్దరూ బ్యాండ్ పని చేస్తూ జీవిస్తున్నారు. ఒంటరిగా ఉంటున్న వీరు ఖాళీ సమయంలో సెల్ఫోన్లో అశ్లీల వీడియోలు చూసేవారు. కొద్ది రోజులుగా గ్రామానికి చెందిన బాలికకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకున్నారు. నవంబర్ 24న రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను ఇద్దరు కలిసి నోరు మూసి పత్తి చేనులోకి ఎత్తుకెళ్లారు. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి ఈ విషయం బయట చెబుతుందనే భయంతో గొంతు నులిమి హత్య చేశారని డీసీపీ తెలిపారు. ఆ తర్వాత వ్యవసాయ బావిలో పడేశారని పేర్కొన్నారు. పారిపోయే ప్రయత్నాల్లో భాగంగా మోటార్సైకిళ్లపై ద్వారక నుంచి మేదరిపేట వైపు వెళ్తుండగా సోమవారం పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులపై పోక్సో, అత్యాచార కేసు నమోదు చేశామని తెలిపారు. ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా శిక్ష పడేలా చూస్తామని అన్నారు. ఏసీపీ ప్రకాశ్ పర్యవేక్షణలో కేసును ఛేదించిన లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహాసీనొద్దీన్, లక్సెట్టిపేట ఎస్సై సురేష్, జన్నారం ఎస్సై అనూష, పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
విద్యార్థిని దూషించిన టీచర్ సస్పెన్షన్
ఆదిలాబాద్టౌన్: గిరిజన విద్యార్థిని కులం పేరుతో దూషించిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవెనగర్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠాలు చెప్పకుండా ఇతర పనుల్లో నిమగ్నమైన హిందీ ఉపాధ్యాయుడు మహ్మద్ యూనుస్ను సిలబస్ వెనుకబడి ఉందని, పాఠాలు చెప్పాలని కోరాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు విద్యార్థిని కులం పేరుతో దూషించడంతో పాటు వారి కుటుంబ సభ్యులను అసభ్యపదజాలంతో దూషించాడు. విద్యార్థి తల్లిదండ్రులకు తెలుపడంతో తల్లిదండ్రులు అదేరోజు విషయాన్ని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకొచ్చారు. కాగా సోమవారం విద్యార్థిని దూషించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల నాయకులు పాఠశాలలో ఆందోళన చేపట్టారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రఘురమణ, ఆదిలాబాద్ అర్బన్ ఎంఈవో సోమయ్యలు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
బైక్ను ఢీకొట్టిన లారీ
జైనథ్: బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారు. ఎస్సై గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం నిరాల నుంచి జైనథ్ పోలీస్స్టేషన్కు హెడ్ కానిస్టేబుల్ గౌరీ అశోక్ బైక్పై వస్తుండగా మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా అంతర్రాష్ట్ర రహదారిపై లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ చేతికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. కాగా లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ప్రతీ సమస్య మొదట తెలిసేది సర్పంచ్కే
గ్రామంలోని ప్రతి సమస్య మొదట తెలిసేది ఆ గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్కే. సర్పంచ్లు నేరుగా రాష్ట్రస్థాయి, దేశస్థాయి వరకు కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. నేను 2000 సంవత్సరం నుంచి 2005 వరకు జైనథ్ మండలంలోని అడ గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాను. ఉత్తమ గ్రామపంచాయతీగా రాష్ట్రపతి ద్వారా అవార్డును ప్రణబ్ ముఖర్జి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. కంప్యూటరీకరణ చేపట్టడం జరిగింది. ప్రస్తుతం గ్రామపంచాయతీకి నిధులు తక్కువగా వస్తున్నాయి. నేను సర్పంచ్గా పనిచేసిన సమయంలో తాగునీటి సమస్యను పరిష్కరించాను. ఇంటింటికీ నల్లా, మరుగుదొడ్లు ఏర్పాటు చేయించాను. గ్రామంలోని భూముల కొలతలు చేయించి రికార్డులు తయారు చేయడం జరిగింది. 1995 నుంచి 2000 సంవత్సరం వరకు ఎంపీటీసీగా, ఆ తర్వాత 2000 నుంచి 2005 వరకు సర్పంచ్గా, 2006 నుంచి 2009 వరకు ఎంపీటీసీగా, 2010లో జెడ్పీటీసీగా ఎన్నికయ్యాను. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను. గ్రామ అభివృద్ధి చేసిన వారికి సర్పంచ్గా మంచి గుర్తింపు ఉంటుంది. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే -
సర్పంచ్లు ఎమ్మెల్యే అయ్యారు..
ఆదిలాబాద్టౌన్: సర్పంచ్గా ఎన్నికై ప్రజాప్రతినిధిగా అడుగు వేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేలూ అయ్యారు. ఇద్దరిదీ ఒకే మండలం.. ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం గమనార్హం. వీరిలో ఒకరు ఆదిలాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాగా, మరొకరు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న. సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను.. యూత్ ప్రెసిడెంట్గా అనేక సేవ కార్యక్రమాలు చేయడంతో 1988లో నన్ను జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మా ఊరిలో తాగునీటి సమస్య అధికంగా ఉండేది. దీంతో 1981 నుంచి 1983 వరకు యూత్ సభ్యులం కలిసి గ్రామంలో 300 హ్యాండ్ బోర్లు వేయించాం. అనేక సేవ కార్యక్రమాలు చేసేవాళ్లం. దాంతో నాపై గ్రామస్తులు నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పట్లో సర్పంచ్ అంటే నమ్మకం. గ్రామాభివృద్ధి, అవినీతికి దూరంగా ఉండేవారిని ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. మంచి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి జరిగేదని ఆకాంక్షించేవారు. గ్రామంలో సీసీ రోడ్లు, రాజీవ్ రోజ్గార్ యోజన పథకం కింద సంవత్సరానికి రూ.లక్ష వచ్చేవి. ఆ నిధులను 25 శాతం మొక్కలు నాటించేందుకు, 75 శాతం గ్రామంలో వివిధ పనులు చేయించేందుకు ఖర్చు చేశాను. స్కూల్ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఆ రోజుల్లో నేను ప్రజాసేవ చేయాలని రాజకీయంలోకి వచ్చాను. సర్పంచ్గా ఉన్న నేను 1989లో వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యాను. అంచెలంచెలుగా పదవులు చేపట్టాను. – జోగు రామన్న, మాజీ మంత్రి -
పెద్దపులి సంచారం
బెజ్జూర్: మండల పరిధిలో పెద్ద పులి సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులు సోమవారం ధ్రువీకరించారు. ఇటీవల కృష్ణపల్లి గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి అడుగులు కనిపించడంతో అధికారులు గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తత చర్యల్లో భాగంగా కృష్ణపల్లి గ్రామంలో సోమవారం డప్పు చాటింపు ద్వారా ప్రజలకు సమాచారం అందించారు. పులి సంచారం ఉన్న నేపథ్యంలో అడవిలోకి ఒంటరిగా వెళకూడదని సూచించారు. ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించి పులి కదలికలపై నిఘా కొనసాగిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. గ్రామాల్లో పోలీసులు, అటవీ సిబ్బంది సంయుక్తంగా పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. -
పల్లె పాలనకు 61 ఏళ్లు
నిర్మల్చైన్గేట్: ప్రజాస్వామ్య వ్యవస్థలో మూలస్తంభమైన గ్రామపంచాయతీల ఏర్పాటు, కాలానుగుణంగా చోటు చేసుకున్న మార్పులు ఆసక్తిగా ఉన్నా యి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పంచాయతీ రాజ్ సంస్థల ఏర్పాటు కోసం 1957లో భారత ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మూడంచెల (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని చేసిన సూచనలను జాతీయాభివృద్ధి సంస్థ, 1958లో ఆమోదించింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీ రాజ్ సంస్థల చట్టం ఏర్పాటు చేసింది. దీన్ని మొట్టమొదటగా రాజస్థాన్ రాష్ట్రం అమలు చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1959 అక్టోబర్ 2న అమలు చేసింది. మొదట్లో పరోక్ష పద్ధతి.. ఆంధ్రప్రదేశ్లో 1964లో సమగ్ర గ్రామ పంచాయతీల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం 500 పైగా జనాభా ఉన్న గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభా ఆధారంగా 5 నుంచి 17 మంది వరకు వార్డు సభ్యులుండవచ్చని పేర్కొన్నారు. 1964లో సర్పంచ్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. వార్డు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటే, ఈ వార్డు సభ్యులు సర్పంచ్ను ఎన్నుకునే వారు. ఎన్నికై న సర్పంచ్లు కలిసి సమితి ప్రెసిడెంట్ను ఎన్నుకునేవారు. సమితి ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునేవారు. 1976 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. వీరి ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండేది. 1978 నుంచి ప్రత్యక్ష పద్ధతి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. సర్పంచ్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని ఈ కమిటీ సూచించింది. దీంతో అప్పటి నుంచి సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు.. 1992లో అమల్లోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే 1/3 వ వంతు మహిళలకు రిజర్వు చేయాలని సూచించింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మండల వ్యవస్థతో మార్పులు.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1986 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తాలూకాలను రద్దు చేసి మండల వ్యవస్థ ఏర్పాటు చేశారు. మండలాలకు 1987లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్ అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకున్నారు. దీనిలో సభ్యులుగా ఆయా మండలాల పరిధిలోని సర్పంచ్లు ఉండే వారు. ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లను ఎన్నుకునేవారు. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 ద్వారా పరిషత్ వ్యవస్థ.. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 ద్వారా అదే సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అనే మూడంచెల వ్యవస్థ రూపొందుకుంది. మండల పరిషత్లో సర్పంచ్లను సభ్యులుగా తొలగించి వారి స్థానంలో ఎంపీటీసీలను, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో ఎంపీపీలను సభ్యులుగా తొలగించి జెడ్పీటీసీలను సభ్యులుగా చేర్చారు. మెజార్టీ ఎంపీటీసీలు ఎంపీపీని, మెజార్టీ జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోవడం ప్రారంభమైంది. -
ముగిసిన వెబినార్
బాసర: ఆర్జీయూకేటీలో ‘ఏఐ, పీఈజీఏ ఎమర్జింగ్ టెక్నాలజీస్’పై జరిగిన అంతర్జాతీయ వెబినార్ సిరీస్ సోమవారం విజయవంతంగా ముగిసింది. ఇండియా, యూఎస్ఏ, కొలంబియాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పాల్గొనేవారిని ఆకర్షించే విధంగా బహుళ నిపుణుల సెషన్లు ఇందులో నిర్వహించారు. ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ (వైస్ ఛాన్సలర్) ప్రొఫెసర్ ఇ. మురళి దర్శన్ (ఓఎస్టీ) డా. నమాని రాకేశ్ (కౌన్సిలర్, ఐఈఈఈ ఎస్బి ఆర్జీయూకేటీ బాసర), శ్రీ సాయిరోహిత్ తుమ్మరకోటి మార్గదర్శకత్వంలో వెబినార్ రూపొందించారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు బాసర: బాసర సరస్వతి అమ్మవారిని సోమవారం తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ కమిషనర్ సత్యనారాయణ, హై కోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ జవహర్లు తమ కుటుంబాలతో వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి అమ్మవారి హారతి, తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. కోతుల బెడద తీర్చే వారికే ఓటుదండేపల్లి: మండల కేంద్రంలో నెలకొన్న కోతుల బెడదను తీర్చే వారికే పంచాయతీ ఎన్నికల్లో ఓటేస్తామంటూ, దండేపల్లిలో బస్టాండు వద్ద గ్రామస్తులు సోమవారం ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, కోతుల బెడదను తీరుస్తామని హామీ ఇచ్చే వారికే పంచాయతీ ఎన్నికల్లో ఓటేస్తామని తేల్చి చెప్పారు. లోన్ కట్టకుంటే న్యూడ్ ఫొటోలు పంపుతామని బెదిరింపులుబోథ్: లోన్ కట్టకపోతే న్యూడ్ ఫొటోలు బంధువులకు పంపుతామని మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడికి సోమవారం వాట్సాప్ కాల్ వచ్చింది. గుర్తు తెలియని నంబరు నుంచి కాల్ చేసిన సైబర్ నేరగాడు తీసుకున్న లోన్ను చెల్లించకపోతే. న్యూడ్ ఫొటోలను బంధువులకు పంపుతామని ఉపాధ్యాయుడిని భయపెట్టాడు. అయితే తాను ఎలాంటి లోన్ తీసుకోలేదని ఆయన బదులిచ్చాడు. లోన్ తీసుకున్నారని, వెంటనే చెల్లించాలని, లేకుంటే న్యూడ్ ఫొటోలను బంధువులు, స్నేహితులకు పంపడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని వాట్సాప్ కాల్లో సదరు వ్యక్తి భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో ఉపాధ్యాయుడు వెంటనే బోథ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నంబరును ఎస్సై శ్రీసాయి బ్లాక్ చేయించి, సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఉపాధ్యాయుడికి సూచించారు. గబ్బిలానికి షార్ట్ సర్క్యూట్వేమనపల్లి: మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం వద్ద సోమవారం గబ్బిలం షార్ట్సర్క్యూట్కు గురై మృత్యువాత పడింది. దీంతో ఎల్టీ లైన్ తీగలు తెగిపోగా, ట్రాన్స్ఫార్మర్ వద్ద మంటలు లేచి ఫీజులు మాడిపోయాయి. ప్రాణహిత కాలనీతో పాటు పలు వాడలకు విద్యుత్ పరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సిబ్బంది అప్రమత్తమై విద్యుత్లైన్పై ఉన్న గబ్బిలాన్ని తొలగించి, విద్యుత్ లైన్ సరిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
నార్నూర్: మండలంలోని ఉమ్రీ గ్రామ శివారు వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకుని జాదవ్ నరేశ్ (18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై గణపతి తెలిపారు. జైనూర్ మండలంలోని అంద్గూడ గ్రామానికి చెందిన జాదవ్ సునీత, అన్నాజీ దంపతుల కుమారుడు జాదవ్ నరేశ్ బతుకు దెరువు కోసం నార్నూర్ మండలం ఉమ్రీ గ్రామానికి చెందిన జాదవ్ రాణారంజిత్ దగ్గర నాలుగేళ్లుగా పాలేరుగా పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం ఎద్దులను మేపడానికి జాదవ్ రాణారంజిత్ పొలం వద్దకు వెళ్లాడు. సాయంత్రం ఏడు గంటల వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో యజమాని రాణారంజిత్ పొలానికి వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకుని ఉండడంతో వెంటనే గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు రాత్రి వచ్చి చెట్టుకు శవమై ఉన్న కొడుకును చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ కొడుకు మృతిపై అనుమానం ఉందని మృతుడి తల్లి జాదవ్ సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్యమంచిర్యాల క్రైం: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై మజారొద్దిన్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని హమాలీవాడకు చెందిన ఆకోజి రాజు(45), భార్య భారతిల మధ్య కుటుంబ కలహాలున్నాయి. దీంతో గత ఐదు సంవత్సరాల నుంచి భారతి భర్తకు దూరంగా జైపూర్ మండలం ఇందారంలోని తల్లిగారింటి వద్ద ఉంటుంది. అప్పటి నుంచి రాజు మద్యానికి బానిసయ్యాడు. అప్పుడప్పుడు తన తల్లి విజయలక్ష్మి ఇంటికి వచ్చిపోయేవాడు. గత నెల 25వ తేదీన రాజు ఇంటికి వచ్చి వెళ్లాడు. ఈక్రమంలో సోమవారం స్థానిక కట్ట పోచమ్మ చెరువు కాలువలో రాజు మృతదేహం లభ్యమైంది. సుమారు నాలుగు రోజుల క్రితం మృతి చెంది ఉండడంతో మృతదేహం కుళ్లిపోయింది. రాజుకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రాజు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మోసం చేసిన వ్యక్తిపై కేసుఆదిలాబాద్టౌన్: నమ్మించి మోసం చేయడంతో పాటు బాధితుడిని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు సోమవారం తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన షేక్ అక్బర్, కారులో పాన్మసాలా తరలిస్తూ మహారాష్ట్రలోని మాండ్వి వద్ద అక్కడి పోలీసులకు చిక్కాడు. ఆదిలాబాద్ పట్టణంలో ఓ అడ్వకేట్ వద్ద క్లర్క్గా పని చేసే తాహెర్ అహ్మద్ ఖాన్ వాహనాన్ని విడిపిస్తానని నమ్మించి షేక్ అక్బర్ వద్ద రూ.44వేలు తీసుకున్నాడు. వాహనాన్ని విడిపించకపోవడంతో బాధితుడు ప్రశ్నించాడు. దీంతో అతనిపైనే కేసు పెట్టిస్తానని బెదిరించి మరో రూ.9వేలు వసూలు చేశాడు. వాహనం విడిపించకపోడం, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అన్నను కొట్టి చంపిన తమ్ముడురామకృష్ణాపూర్: తోడబుట్టిన అన్ననే తమ్ముడు కొట్టి చంపిన ఘటన మందమర్రి మండలం సండ్రోన్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మందమర్రి పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మెండ్రపు గోపాల్ (35), మెండ్రపు కుమార్లు అన్నదమ్ములు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. సోమవారం రాత్రి ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో కూర్చొని మద్యం తాగారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘర్షణ చోటుచేసుకోవడంతో తమ్ముడు కుమార్ క్షణికావేశంలో రోకలిబండతో అన్న గోపాల్ తలపై బాది హత్య చేశాడు. సమాచారం అందుకున్న సీఐ శశిధర్రెడ్డి, ఎస్సైలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు. -
బొగ్గు ఉత్పత్తిలో మందమర్రి ఏరియా పురోగతి
రామకృష్ణాపూర్: గతంతో పోలిస్తే బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో మందమర్రి ఏరియా పురోగతి సాధించిందని ఏరియా జీఎం రాధాకృష్ణ అన్నారు. నవంబర్ మాసంలో ఏరియా ఉద్యోగులందరి సమష్టి కృషితో 68శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్పతిలోనే కాకుండా బొగ్గు రవాణాలోనూ పురోగతి సాధించామని, గతంలో 30 రేకుల వరకే రవాణా జరిగితే, ఈ నవంబర్లో 33 రేకుల రవాణా చేశామన్నారు. ఉద్యోగులు, అ ధికారులు, కార్మిక సంఘాల నాయకులు స మష్టిగా సహకరిస్తే అండర్ గ్రౌండ్ గనుల్లో 100శాతం ఉత్పతి లక్ష్యం సాధించవచ్చన్నా రు. రామకృష్ణాపూర్ ఓపెన్కాస్ట్ ఫేజ్–2 ప్రజాభిప్రాయసేకరణ ఈ నెల 3న ఓసీ కా ర్యాలయ ఆవరణలో ఉంటుందని, అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో ఎస్ ఓటు జీఎం జీఎల్ ప్రసాద్, ఏరియా ఇంజినీర్ బాలాజీ భగవతి, డీజీఎం పర్సనల్ అశోక్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఐఈడీ కిరణ్కుమార్, సీనియర్ పీఓ బొంగోని శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
జత కలిసేనని..!
జన్నారం: జన్నారం అటవీ డివిజన్లో పులి తోడు కోసం సంచరిస్తోందా..? ఆడ పులి కోసం అన్వేషణ సాగిస్తోందా..? జత కలిసేందుకు అనువైన సమయమిదేనా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. గత కొన్ని రోజులుగా జన్నారం అడవుల్లో పులి మకాం వేసింది. అప్రమత్తమైన అటవీ అధికారులు ఎప్పటికప్పుడు కదలికలను గుర్తిస్తున్నారు. జన్నారం డివిజన్లో పర్యటిస్తున్నది మగపులిగా గుర్తించారు. ఆడపులి జత కోసం అన్వేషిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడే మకాం వేస్తుందా..? 2012 ఏప్రిల్లో కవ్వాల్ అభయారణ్యాన్ని కవ్వాల్ టైగర్ జోన్గా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పులల రాకపోకలే తప్ప ఇక్కడ ఆవాసం ఉన్న దాఖలాలు లేవు. ఒకట్రెండు రోజులు మాత్రమే ఈ ప్రాంతంలో సంచరించి తిరిగి వెళ్లేవి. కానీ గత నెల 26న జన్నారం అటవీ డివిజన్లోని ఇందన్పల్లి రేంజ్ పరిధిలో ఆవుపై దాడి చేసి చంపింది. పరిశీలించిన అటవీశాఖ అధికారులు పులి దాడిగా గుర్తించి ట్రాక్ చేశారు. సీసీ కెమెరాలు అమర్చగా వాటిలో పులి చిక్కినట్లు తెలిసింది. అదే విధంగా పలు ప్రాంతాల్లో పులి పాదముద్రలు గుర్తించి ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు అంచనాకు వచ్చారు. టైగర్జోన్లో టైగర్ తిరగడం అంత ప్రత్యేకత కాకున్నా సంవత్సర కాలంగా పులి రాక కోసం ఎదురు చూస్తున్న అటవీ అధికారులకు మాత్రం ఈ పులి ఆరు రోజులుగా ఇక్కడే మకాం వేయడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఆవాసం ఏర్పాటు చేసుకుంటే.. జన్నారం అటవీ డివిజన్ పులి ఆవాసాలకు అనువుగా ఉంది. గడ్డి మైదానాలతో వన్యప్రాణుల సంఖ్య పెరగడం, నీటిసౌకర్యం, దట్టమైన అడవులు పులికి ఆవాస యోగ్యంగా ఉంటాయి. ఆరు రోజులుగా మకాం వేసిన పులి ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నాయి. ఆడపులి తోడయితే కొన్ని రోజుల్లో పులి పిల్లలను కనే అవకాశం ఉంది. అనువైన ప్రదేశం ఉన్నందున ఇక్కడే మకాం వేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అడవుల్లోకి పశువులు, మనుషులు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. అలజడి తగ్గిస్తే పులి ఆవాసం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటుందని అంటున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.తోడు కోసమేనా..?జన్నారం అడవుల్లో తిరుగుతున్న పులిని మగ పులిగా అధికారులు గుర్తించారు. ఆడ పులికి తోక చిన్నదిగా, పాదముద్ర 4 సెంటీమీటర్లు వెడల్పు ఉంటుంది. ప్రస్తుతం జన్నారంలో తిరుగుతున్న పులి పాదముద్ర 5 సెంటీమీటర్ల వెడల్పు, తోక పొడవుగా ఉండడంతో మగ పులిగా నిర్ధారణకు వచ్చారు. ఆడపులి తోడు కోసమే వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చంద్రపూర్ అటవీ ప్రాంతం నుంచి బేల మీదుగా జన్నారం అడవుల్లోకి వచ్చినట్లు పేర్కొంటున్నారు. గత నాలుగు నెలల క్రితం లక్సెట్టిపేట అడవుల్లో కనిపించింది ఆడపులి కావడంతో దాని తోడు కోసమే ఈ ప్రాంతానికి మగపులి వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రతీ శీతాకాలంలో పులులు సంతతి పెంచుకోవడం జరుగుతుందని, జనవరి వరకు మేటింగ్లో ఉంటాయని అధికారులు తెలిపారు. అందులో భాగంగానే ఈ మగపులి తోడు కోసం వెదుకుతూ ఈ ప్రాంతానికి చేరిందని పేర్కొంటున్నారు.టైగర్ ట్రాకింగ్పై శిక్షణజన్నారం అటవీ సిబ్బందికి టైగర్ ట్రాకింగ్పై శిక్షణ ఇప్పిస్తున్నారు. కాగజ్నగర్కు చెందిన టైగర్ ట్రాకర్లతో నాలుగు రోజులు శిక్షణ ఇప్పించారు. పులి అడుగులు గుర్తించడం, ప్రత్యక్షంగా చూసే విధానం, కెమెరాలు ఏర్పాటు చేయడం, పులి మానిటరింగ్లో మెలకువలు నేర్పించారు. పులి జాడ ఎలా కనుగొనడం, జాగ్రత్తలు వివరించారు. పది రోజుల తర్వాత మరో నాలుగు రోజులు సైతం శిక్షణ ఇప్పించనున్నారు.పులి(ఫైల్) -
ధాన్యం ఆరబెట్టి తీసుకు రావాలి
వేమనపల్లి/కోటపల్లి: తేమ శాతం తగ్గే వరకు వరి ధాన్యం ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. సోమవారం ఆయన వేమనపల్లి, కోటపల్లి మండల కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యమని ధ్రువీకరించిన తర్వాతే కొనుగోలు చేయాలని, అప్పుడే వరి ధాన్యం లోడ్తో వెళ్లిన లారీలకు మిల్లుల వద్ద కోతలు, అభ్యంతరాలు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, డీపీఎం సారయ్య, ఏపీఎంలు పాల్గొన్నారు. నామినేషన్ కేంద్రాల పరిశీలన వేమనపల్లి మండలం నీల్వాయి, వేమనపల్లి నామినేషన్ క్లస్టర్లను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ వివరాలు తెలుసుకున్నారు. ఎంపీడీవో కుమారస్వామి ఆర్ఐ ఖాలిక్ పాల్గొన్నారు. దుప్పట్లు పంపిణీ మంచిర్యాలఅర్బన్: స్థానిక ఎస్సీ కళాశాల బాలుర వసతిగృహంలో సోమవారం రాత్రి విద్యార్థులకు జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య దుప్పుట్లు పంపిణీ చేశారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు దుర్గాప్రసాద్, ఏఎస్డబ్ల్యూవో ధర్మనంద్గౌడ్, ప్రశాంత్, హెచ్డబ్ల్యూవో కుమారస్వామి పాల్గొన్నారు. -
హెచ్ఐవీపై అవగాహన ఉండాలి
మంచిర్యాలటౌన్: ప్రజలందరూ హెచ్ఐవీ(ఎయిడ్స్)పై అవగాహన కలిగి ఉండాలని, ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా హెచ్ఐవీ ఎయిడ్స్ సమీకృత వ్యూహ సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విద్యార్థులతో అవగాహన ర్యాలీని సోమవారం డీఎంహెచ్వో ప్రారంభించారు. ఎయిడ్స్ దినోత్స వం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జిల్లా వైద్యాధికారి అనిత మాట్లాడుతూ 2010–2025 మధ్య హెచ్ఐవీ/ఎయిడ్స్ కేసులు దేశంలో గణనీయంగా తగ్గాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్, లెప్రసి జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధాకర్నాయక్, ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్, ఆర్ఎంవోలు డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శ్రీమన్నారాయణ, దిశ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ రమేశ్ పాల్గొన్నారు. ఉత్తమ సేవలకు అవార్డులు హెచ్ఐవీ/ఎయిడ్స్పై ప్రజలకు అవగాహన కల్పించి, వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో కృషి చేసిన ఉద్యోగులకు ఉత్తమ అవార్డులను డీఎంహెచ్వో డాక్టర్ అనిత అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో కాసిపేట వైద్యాధికారి డాక్టర్ శ్రీదివ్య, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, దీపక్నగర్ సీవో సురేఖ, ఐసీటీసీ సిబ్బంది శ్రీనివాస్రెడ్డి, నరేందర్, రాజేందర్ ఉన్నారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ ● అధికారులకు శిక్షణ మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల్లో అధికారులు నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో 1, 2, 3 విడత స్టేజ్ రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికలు, బ్యాలెట్ నిర్వహణ, పోలింగ్, కౌంటింగ్ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు, ఏర్పాట్లు పరిశీలన, బ్యాలెట్ పేపర్ల నిర్వహణ, పోలింగ్ రోజున అవసరమైన ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ, అధికారులు, సిబ్బందికి ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మాస్టర్ ట్రైనర్లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎన్నికల అధికారి, పంచాయతీ అధికారి వెంకటేశ్వరావు, నోడల్ అధికారి శంకర్, మాస్టర్ ట్రైనర్లు హరిప్రసాద్, మధు, అధికారులు పాల్గొన్నారు. -
రేపు మొదటి విడత ఉపసంహరణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గ్రామ పంచాయ తీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల పరిశీలన సోమవారం పూర్తయింది. అభ్యంతరాలను స్వీకరించగా.. మంగళవారం ఆర్డీవో ఆధ్వర్యంలో పరిష్కరించనున్నారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన వెంటనే మధ్యాహ్నం అభ్యర్థులను ఖరారు చేస్తూ గుర్తులు కేటాయించనున్నారు. సర్పంచ్ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొనగా.. ఒక్కో స్థానానికి ఐదు నుంచి ఎనిమిది మంది వ రకు నామినేషన్లు వచ్చాయి. దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లోని 90 గ్రామ పంచాయతీలకు గాను మూడు పంచాయతీల్లో నా మినేషన్లు దాఖాలు కాలేదు. దీంతో 87 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 90 సర్పంచ్ స్థానాలకు 408, 816వార్డు సభ్యుల స్థానాలకు 1,697 నామినేషన్లు వచ్చాయి. 816 వార్డులకు గాను 34 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడం, ఏకగ్రీవం కావడం వంటి కారణాలతో మిగతా 782 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యంతరాలు పెద్దగా రాకపోవడంతో వచ్చిన కొన్నింటి పరిష్కార ప్రక్రియ మంగళవారం త్వరగానే పూర్తి కానుంది. బుధవారం చాలా సంఖ్యలో నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ముల్కల్లలో ఇసుక రీచ్ ప్రారంభంమంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల శివారు గోదావరి తీరంలో గనులు, భూగర్భ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ సోమవారం ప్రారంభమైంది. మైనింగ్ శాఖ ఏడీ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఇసుక ట్రాక్టర్ వద్ద టెంకాయ కొట్టి రీచ్ను మళ్లీ యధావిధిగా ప్రారంభించారు. ట్రాక్టర్ యజమానులు సంయమనంతో ఇసుక రవాణా చేయాలని, ముల్కల్ల ఇసుక రీచ్ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
మున్సిపల్ కార్యాలయం ముట్టడి
చెన్నూర్: చెన్నూర్లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో సౌకర్యాలు కల్పించిన తర్వాతే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కూరగాయల వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు బొగే భారతి మాట్లాడుతూ 30ఏళ్లుగా జగన్నాథ ఆలయం ఎదుట వందలాది మంది చిరు వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. మరుగుదొడ్లు, కూరగాయల నిల్వ గదులు, తాగునీటి సౌకర్యాలు కల్పించకుండా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ బుధవారం నుంచి కూరగాయలు అక్కడే విక్రయించాలని అల్టీమేటం జారీ చేయడం బాధాకరమని అన్నారు. మహిళా వ్యాపారులని చూడకుండా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వ్యాపారాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్వెంటకస్వామి ఈ విషయంపై స్పందించి వసతులు కల్పించి భవనాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూరగాయల వ్యాపారులు పాల్గొన్నారు. -
కబడ్డీ బాలికల జిల్లా జట్టు ఎంపిక
శ్రీరాంపూర్: జిల్లా జూనియర్స్ బాలికల కబడ్డీ జట్టును ఎంపిక చేశారు. కొద్ది రోజులుగా నస్పూర్లోని సాధన డిఫెన్స్ అకాడమీలో ఎంపిక పోటీలు నిర్వహించగా.. సోమవారం తుది జట్టు ప్రకటించారు. ఈ జట్టు ఈ నెల 2 నుంచి 5వరకు నల్గొండ జిల్లా హాలియ గ్రామంలో జరిగే 51వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటుందని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంచందర్, జిల్లా కార్యదర్శి కార్తీక్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. జట్టు కోచ్లుగా కే.రవీందర్, శివ, మేనేజర్గా సంఘవి వ్యవహరిస్తున్నారు. జట్టుకు ఎంపికై న వారిలో సీహెచ్.రక్షిత(రామకృష్ణాపూర్), యన్.శ్రీజ(మైలారం), ఎం.శృతి(మైలారం), ఎం.వేదనసాయి(ఎల్లారం), ఎస్.వర్షిణి(గుళ్ల సోమారం), టీ.స్రవంతి(మందమర్రి), ఏ.ఆశ్రిత(నెన్నెల), ఎం.స్పందన(కోటపల్లి), డీ.గీత(బోడపల్లి), కే.అవంతిక(పారుపెల్లి), సీహెచ్.హారిక(పార్ధీ), టీ.కల్పన(అర్జునగుట్ట), యన్.అర్చన(కొత్తపల్లి) ఉన్నారు. -
రెండో రోజు జోరుగా నామినేషన్లు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో రోజు సోమవారం జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా.. సోమవారం ఏకాదశి కావడంతో భారీగా వచ్చాయి. బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్లోని ఏడు మండలాల్లో రెండ్రోజులు కలిపి 114 సర్పంచ్ స్థానాలకు గాను 301, 996 వార్డు సభ్యుల స్థానాలకు 739 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో 1,39,312 మంది ఓటర్లు ఉండగా 69,249 మంది పురుషులు, 70,055 మంది మహిళలు, ఇతరులు 8 మంది ఉన్నారు. అభ్యర్థుల బారులు భీమిని: సోమవారం మంచి రోజు కావడంతో మండల కేంద్రం భీమినిలోని మండల విద్యావనరుల కేంద్రం లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రానికి భారీగా తరలివచ్చారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు బారులు తీరి నామినేషన్లు వేశారు. మద్దతు దారులలతో తరలిరావడంతో సందడి నెలకొంది. నామినేషన్ల వివరాలు మండలం పంచా సర్పంచ్ వార్డులు వార్డు సభ్యుల యతీలు నామినేషన్లు నామినేషన్లుబెల్లంపల్లి 17 57 156 140 భీమిని 12 32 100 075 కన్నెపల్లి 15 36 130 088 కాసీపేట 22 35 190 075 నెన్నెల 19 53 158 134 తాండూరు 15 53 144 152 వేమనపల్లి 14 35 118 075 మొత్తం 114 301 996 739భీమినిలో బారులు తీరిన అభ్యర్థులు -
మా దృష్టి రాలేదు
ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు 41కిలోల వరకే తూకం వేయాలని చెబుతున్నాం. 42కిలోలు తీసుకున్నట్లు మా దృష్టి రాలేదు. – కిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి42కిలోలు పెడుతున్నారు6ఎకరాల్లో దిగుబడి వచ్చిన 130క్వింటాళ్ల వడ్లను కేంద్రంలో వారం రోజులపాటు ఆరబోసాను. హమాలీలు రాకపోవడంతో కొంత ఆలస్యమైంది. ధాన్యంలో తేమ లేకున్నా బస్తా 42 కిలోలు తూకం వేశారు. ఇదేంటని అడిగితే తరుగు కోసం అంటున్నారు. – బుచ్చన్న, రైతు, గ్రామం: కొత్తమామిడిపల్లి, మం: దండేపల్లి -
వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం
బాసర: హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి జాహ్నవి బంగారు పతకం సాధించింది. ఇన్చార్జి వీసీ గోవర్ధన్ ఆదివారం ఆమెను అభినందించారు. అసోసియేట్ డీన్లు డా.ఎస్.విట్టల్, డా.కె.మహేశ్, శీలం శేఖర్, స్పోర్ట్స్ సెల్ ఫ్యాకల్టీ ఇన్చార్జి ఎం.రామకృష్ణ పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీలకు జిల్లా స్విమ్మర్ ఆదిలాబాద్: జిల్లా కేంద్రానికి చెందిన కొమ్ము చరణ్తేజ ఎస్జీఎఫ్ అండర్–17 స్విమ్మింగ్ పోటీల్లో జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఆదివారం నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు న్యూఢిల్లీలోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్లో జరిగే పోటీల్లో పాల్గొంటారు. 4x100 ఫ్రీ స్టైల్ రిలేపోటీల్లో చరణ్ తేజ్ పాల్గొననున్నట్లు స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కోచ్ కొమ్ము కృష్ణ తెలిపారు. అండర్–14 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆది వారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసో సియేషన్ అండర్–14 జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చి న 48 మందిని గుర్తించి, నాలుగు టీమ్లుగా ఏర్పాటు చేసినట్లు కోచ్ పి.ప్రదీప్ తెలిపారు. నాలుగు టీమ్ల మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించి, అందులో ఉత్తమ ప్రదర్శన కనబర్చి న వారితో ఉమ్మడి జిల్లా టీమ్ను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. పీడీ గోపాల్, సీనియర్ క్రీడాకారులు చందు, తిరుపతి పాల్గొన్నారు. -
చారిత్రక శిల్పాలు గుర్తింపు
ఖానాపూర్: మండలంలోని బావాపూర్ (ఆర్) తండా సమీపంలోని గోండుగూడలో హనుమాన్ ఆలయంలో క్రీస్తుశకం 12,13 శతాబ్దాలకు చెందిన మధ్యయుగ చారిత్రక శిల్పాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్కుమార్ తెలిపారు. ఆనాటి శైవ ఆలయంలో పెద్ద ద్వారతోరణాన్ని గుర్తించారు. దాని మధ్యలో ప్రధాన శైవ ఆచార్యుడు, ఇరువైపులా అర్థ పద్మాసనాలలో కూర్చొని ఉన్న ఇద్దరు శైవ గురువులు, వారి పరిచారక గణాల శిల్పాలు ఒక్కొక్క గడిలో కూర్చి పేర్చి లతలతో అలంకరించి అందంగా చెక్కారని తెలిపారు. ఇదే గుడిలో కాకతీయుల కాలంలోనే చెక్కబడిన వినాయకుడు, నంది, నాగ శిల్పం, బాణలింగం, విరిగిన స్తంభాలు అనాటి శిల్పకళకు ప్రాణం పోస్తున్నాయి. అదేవిధంగా సింగాపూర్ గోండుగూడలో ఉన్న హనుమాన్ ఆలయంలో కాకతీయుల కాలంలో చెక్కబడిన గణపతి, లింగం, పానవట్టం, తదితర శిల్పాలు సంపూరక స్తంభాలు, ఇతర ఆధునిక శిల్పాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడి ప్రాచీన శిల్పాలు ఇప్పుడు మనుగడలో లేని రెండు లింగాల గుడి నుంచే గ్రహించి పునఃప్రతిష్ట చేసినట్టు భావిస్తున్నారు. పరిశోధనలో యువ పరిశోధకులు రాజశేఖర్, బావాపూర్ గ్రామస్తులు పవన్, రాజేశ్వర్ పాలుపంచుకున్నారు. గుర్తించిన ద్వార తోరణంనంది విగ్రహం -
విద్యుత్షాక్తో ఒకరు..
ఖానాపూర్: విద్యుత్షాక్కు గురై ఒకరు మృతి చెందినట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన పన్నెల వెంకట్రాములు(49) శనివారం రాత్రి మొక్కజొన్న పంట పొలానికి నీరుపెట్టేందుకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకోలేదు. అయ్యప్ప మాలలో ఉన్న వెంకట్రాములు ఆలయంలో నిద్రిస్తున్నాడని కుటుంబీకులు అనుకున్నారు. ఉదయం పంట వైపు వెళ్లిన వేముల శ్యాంసుందర్ అక్కడ పడి ఉండడం చూసి కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతుడి భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. జైపూర్: మండలంలోని ఎల్కంటి గ్రామానికి చెందిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నా యి.. మండల రెడ్డి జాగృతి అ ధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు బేతు తిరుపతిరెడ్డి–విజయ దంపతుల కుమారుడు భరత్రెడ్డి. వరంగల్ గ్రీన్వుడ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అక్కడే హాస్టల్లో ఉంటూ ఇటీవల స్కూల్లో నిర్వహించిన గేమ్స్లో పాల్గొనగా చేతికి గాయమైంది. విషయం తెలుసుకున్న తిరుపతిరెడ్డి శనివారం భరత్రెడ్డిని మంచిర్యాలలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. శరీరంలో రక్తం గడ్డ కట్టుకుపోయిందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు కరీనంగర్ రెఫర్ చేశారు. అక్కడి వైద్యులు చికిత్స అందించి ఆదివారం హైదరాబాద్కు తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందాడు.భరత్రెడ్డి (ఫైల్) -
‘కలంస్నేహం’ ఆత్మీయ సమ్మేళనం
నిర్మల్ఖిల్లా: జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఆదివారం ‘కలంస్నేహం’రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి కవులు, కవయిత్రులు, గాయకులు, కళాకారులు పాల్గొని కవితలు, పాటలు వినిపించారు. వ్యవస్థాప అధ్యక్షుడు శ్రీమాన్ గోపాల్ ఆచార్య మాట్లాడుతూ కళలు మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు. సమాజంలో చైతన్యం పెంపొందించే కవితలు రాయాలన్నారు. పూర్వకవులు రాసిన కవితలు చదవాలని ‘కలంస్నేహం’సాహితీవేదిక ద్వారా ఎంతోమంది కొత్త కవులకు మార్గనిర్దేశనం చేస్తున్నామని తెలిపారు. డా.అప్పాల చక్రధారి, నేరెళ్ల హనుమంతు, వాణిజ్యపన్నుల అధికారి గోదావరి, సాంఘికసంక్షేమ విద్యాలయ ప్రిన్సిపాల్ సుమలత, నిర్వాహకులు దేవి ప్రియ, కవులు, రచయితలు కడారి దశరథ్, కొండూరు పోతన్న, శ్యామలరాణి, తోట గంగాధర్, దేవిదాస్ పాల్గొన్నారు. -
వరిధాన్యం తిని 40 గొర్రెలు మృతి
చెన్నూర్రూరల్: మండలంలోని తుర్కపల్లి స మీపంలోని వరి ధాన్యం తిని 40 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. సుద్దాల, తుర్కపల్లి గ్రామాలకు చెందిన గానవేన పోచయ్య, బట్టి శ్రీశైలం, అక్కల పోచ య్యలకు చెందిన గొర్రెలు శనివారం వరి చేలలో మేతకు వెళ్లాయి. అక్కడ వరి ధాన్యం తిని మృత్యువాత పడుతున్నాయి. సమాచారం అందుకున్న కత్తెరసాల పశువైద్యాధికారి సతీశ్ అక్కడకు వెళ్లి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆదివారం వరకు 40 గొర్రెలు మృతి చెందాయి. పరిస్థితి విషమంగా ఉన్న 17 గొర్రెలకు చికిత్స అందిస్తున్నారు. ఇవి కోలుకోవ డం కష్టమేనని తెలిపారు. కత్తెరసాల, ఆస్నాద, భీమారం పశువైద్యాధికారులు శ్రీనివాస్, రాకేష్శర్మ, సిబ్బందితో కలిసి జిల్లా పశు వైద్యాధికారి శంకర్ అక్కడికి వెళ్లి గొర్రెల మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. వాటికి పోస్టుమార్డం నిర్వహించారు. పీఏసీఎస్ చైర్మన్ చల్ల రాంరెడ్డి, యాదవ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ఈర్ల మల్లికార్జున్ బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని గొర్రెల యాజమానులు కోరుతున్నారు. -
సాఫ్ట్బాల్ విజేత రంగారెడ్డి
ఇచ్చోడ: 12వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషు ల సాఫ్ట్బాల్ పోటీల్లో రంగారెడ్డి జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో రంగారెడ్డి 7–2తో మహబూబ్నగర్పై ఘన విజయం సాధించింది. మండల కేంద్రంలోని గిరిజన గురుకు ల బాలుర పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈ పోటీలు ఆదివారం ముగిశా యి. రాష్ట్రవ్యాప్తంగా 21 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్లో మహబూబ్నగర్ జిల్లా జట్టుతో తలపడి రంగారెడ్డి జట్టు గెలుపొందింది. విజే త జట్టుకు కప్తోపాటు బంగారు పతకం, ద్వితీయస్థానంలో మహబూబ్నగర్కు రజ తం సాధించింది. హన్మకొండ జట్టు 4–3తో హైదరాబాద్పై గెలిచి తృతీయస్థానంలో నిలువగా కన్సోలేషన్ బహుమతి పొందింది. గెలుపొందిన జట్లకు జిల్లా యువజన, క్రీడల అధికారి శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు. సాఫ్ట్బాల్ అసోషియేషన్ ఆప్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్బాబు, తెలంగాణ అధ్యక్షుడు అభిషేక్ గౌడ్, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా కార్యదర్శి గంగాధర్, శిక్షకులు చిన్నికృష్ణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక అభివృద్ధితో ఉపాధి
జన్నారం: పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆయా అటవీ ప్రాంతాల ను అభివృద్ధి చేసి గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలతోపాటు జన్నారం అటవీ డివిజన్ ఎంపిక చేసింది. ఆయాచోట్ల సఫారీ ప్రయాణం, అక్కడ మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరగడంతోపా టు గిరిజనులకు ఉపాధి అవకాశం ఉంటుంది. ఇందన్పల్లిలో ఇప్పటికే వెదురుతో కళావృత్తులపై శిక్షణ ఇస్తున్నారు. వెదురు కళాకండాలను పర్యాటకులు కొనుగోలు చేస్తే ఉపాధి లభించే అవకాశం ఉంది. అదేవిధంగా గైడ్లుగా, చిన్న హోటళ్లు నిర్వహించుకునే వీలుంటుంది. అభివృద్ధికి దూరంగత ఐదేళ్ల క్రితం జన్నారం అటవీ డివిజన్ను అటవీ శాఖ పర్యాటకంగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత మరిచింది. ఏటా పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అక్టోబర్ నుంచి జూన్ వరకు సఫారీ ప్రయాణానికి అనుమతి, పర్యాటకుల నుంచి కొంత ఫీజు వసూళ్లు చేస్తోంది. ఇందులో భాగంగా జన్నారం డివిజన్ గొండుగూడ బేస్క్యాంపు, బైసన్కుంట, నీలుగాయి కుంట ప్రాంతాల్లో పర్యాటకులను సఫారీ ద్వా రా తిప్పేందుకు ట్రాక్లు ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా జన్నారం డివిజన్ అధికారి పోస్టు ఖాళీ గా ఉండటం, నిధుల కొరతతో పర్యాటక ప్రదేశాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఐదేళ్లలో చేసిన ఏర్పాట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఉపాధి లభిస్తుంది అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు, వివిధ పక్షులు ఉంటాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ప్రాంతాలు అభివృద్ధి జరిగితే గైడ్స్, డ్రైవర్ల నియామకం, గిరిజనులకు చిరు వ్యాపారాల ద్వారా ఉపాధి లభిస్తుంది. – వీరెందర్, మేనేజర్ పర్యాటక శాఖ గోండుగూడ బేస్క్యాంప్బైసన్కుంటలో విహరిస్తున్న విదేశీ డక్స్ -
ఖోఖో విజేత ఆదిలాబాద్
ఆదిలాబాద్: ఖోఖో విజేతలుగా ఆదిలాబాద్ బాలుర, బాలికల జట్లు నిలిచాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వేదికగా నిర్వహించిన 44వ తెలంగాణ జూనియర్ ఇంటర్ డిస్టిక్ర్ట్ ఖోఖో టోర్నమెంట్లో ప్రతిభ కనబర్చారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో రంగారెడ్డిపై ఆదిలాబాద్ బాలుర జట్టు, మహబూబ్నగర్పై ఆదిలాబాద్ బాలికల జట్టు ఘన విజయం సాధించినట్లు శిక్షకులు శంకర్, రామ్కుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర్, కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, సీనియర్ పీడీ దయానంద రెడ్డి, శివ, తిరుమల, కృష్ణ తదితరులు విజేతలుగా నిలిచిన జట్లను అభినందించారు. -
జనవరిలో తెలుగు మహాసభలు
నిర్మల్ఖిల్లా: ప్రపంచ మూడో తెలుగు మహాసభలు జనవరి 3, 4, 5వ తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కవులు, సాహితీవేత్తలు, కళాకారులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో తెలుగు మహాసభల ఆహ్వాన, కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. నిర్మలభారతి సాహితీ సాంస్కృతిక కళాక్షేత్రం జిల్లా ప్రధాన కార్యదర్శి, పద్యకవి బి.వెంకట్ తదితరులు కలిసి ఆవిష్కరించారు. ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతిలో సభలు జరుగుతాయని తెలిపారు. తెలుగు సాహిత్య సభలు, తెలుగు కవి సమ్మేళనాలు, అష్టావదానాలు, శతావధానాలు, తెలుగు కవి సమ్మేళనాలు, తెలుగుసాహిత్య సమీక్షలు, హరికథలు, బుర్రకథలు, పద్య, సాంఘిక నాటకాలు, జానపద, శాసీ్త్రయ నృత్యాలు, హాస్యవల్లరి, హాస్యకదంబం, గ్రంథావిష్కరణలు, సాహితీ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. జిల్లాకు చెందిన సాహితీవేత్తలు నేరెళ్ల హన్మంతు, పత్తి శివప్రసాద్, అంబటి నారాయణ, పోలీస్ భీమేశ్, కొండూరి పోతన్న, కడారి దశరథ్, శశికుమార్, గంగన్న, బస్వరాజు, చెనిగారపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ.. సోషల్ మీడియా జోరు
సిరికొండ: పంచాయతీ ఎన్నికల వేళ..సోషల్ మీడియాలో పోస్టులు జోరందుకున్నాయి. యువత తమ ఆలోచనలు వాట్సాప్ గ్రూప్ల్లో పోస్తూ చేసి అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘నువ్వు రాజకీయాలపై నోరు మూస్తే..అవి నీ శ్వాసపై కూడా పన్ను వేస్తాయి’, ‘ఓటేసేవాడి కోసం కష్టపడేవాడు సర్పంచ్ కావాలి’‘ఒక్క ఓటు..ఊరి భవిష్యత్తు’ఈసారైనా పది మందికి ఉపయోగపడే వ్యక్తిని ఎన్నుకోండి అంటూ యువకులు తమ కోటేషన్లతో తమ గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. పార్టీ ఏదైనా సరే రాజకీయాల కోసం స్నేహాన్ని దూరం చేసుకోకండి..అంటూ వాట్సాప్ పోస్టు లు, స్టేటస్లు పెడుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఎస్సై స్వరూప్రాజ్ కథనం ప్రకారం.. బెల్లంపల్లి మండలం లంబాడితండాకు చెందిన నూనె రాజశేఖర్(30) ప్రస్తుతం హాజీపూర్లో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి బీఎస్ఎన్ఎల్ టవర్ సమీపంలో జాతీయ రహదారి పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. లక్సెట్టిపేట నుంచి మంచిర్యాల వైపు వస్తున్న కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో ఢీ కొట్టాడు. తీవ్రగాయాలైన రాజశేఖర్ను వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి వివాహం కాలేదు. మేన వదిన చింతకింది లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘డంపు’.. కంపు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు శాశ్వత డంప్యార్డు కోసం స్థల సేకరణలో జాప్యం జరుగుతోంది. మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాలను నస్పూర్ మున్సిపాలిటీ, హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను విలీనం చేస్తూ ఈ ఏడాది జనవరిలో కార్పొరేషన్గా ఏర్పాటు చేశారు. దీంతో పరిధి పెరగడంతో పాటు రోజువారీ చెత్త సేకరణ కూడా పెరిగింది. చెత్త వేసేందుకు మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలకు శాశ్వత డంప్యార్డులు లేక ఇబ్బంది అవుతోంది. నగరంలోని ఆండాళమ్మ కాలనీలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసేందుకు గాను రెండెకరాల్లో ఏర్పాటు చేసిన డీఆర్సీ కేంద్రాన్ని డంప్యార్డుగా మార్చి కొన్నేళ్లుగా వినియోగిస్తున్నారు. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో డంప్యార్డును తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించడం లేదు. ప్రస్తుతం వినియోగిస్తున్న డంప్యార్డుకు తక్కువ స్థలం ఉండడంతో చెత్తతో నిండి దుర్గంధం వ్యాపిస్తోంది. కాలుతున్న చెత్త నుంచి వస్తున్న పొగతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీరోజు 40 మెట్రిక్ టన్నులకు పైగా చెత్త వేస్తుండడం, తడి, పొడి చెత్తను వేరు చేయక పోవడంతో డంప్యార్డు పూర్తిగా నిండిపోతోంది. ఇటీవల బయోమైనింగ్ ప్రక్రియతో కొంత తొలగించినా రోజువారీగా చెత్త వేస్తుండడంతో డంప్యార్డు స్థలం నిండిపోతోంది. పొగతో కాలనీవాసుల కష్టాలు ఆండాళమ్మ కాలనీలోని డంప్యార్డులోని చెత్త కాల్చడంతో వచ్చే పొగను పీల్చడంతో పాటు దుర్గంధం కారణంగా కాలనీవాసులు అనారోగ్యానికి గురవుతున్నారు. డంప్యార్డుకు సమీపంలోనే అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండడంతో చిన్నారులకూ ఇబ్బందులు తప్పడంలేదు. డంప్యార్డును ఆనుకుని ఆండాళమ్మ కాలనీ ఏర్పడగా, గ్రీన్సిటీ, రంగంపేట్, పవర్ సిటీ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున జరిగి వందలాది కుటుంబాలవారు నివసిస్తున్నారు. చలికాలం కావడంతో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు చెత్త కాల్చడంతో వచ్చే పొగతో మరింత ఇబ్బంది పడుతున్నారు. డంప్యార్డు కోసం ఊరికి దూరంగా శాశ్వత స్థలాన్ని పలుసార్లు అధికారులు గుర్తిస్తున్నా, ఏదో ఓ కారణంతో ఆయా స్థలాలను వినియోగించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం నస్పూరులోని సింగరేణికి చెందిన స్థలాన్ని గుర్తించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతులు తీసుకున్నా డంప్యార్డును అక్కడికి తరలించడంలో జాప్యం జరుగుతోంది. గతంలోనూ వేంపల్లి, ముల్కల్ల, తిమ్మాపూర్లో డంప్యార్డుకు స్థలాలు సేకరించినా వాటిని వినియోగించక ముందే స్థానికులు అడ్డుకున్నారు. ప్రస్తుతం నస్పూరులోనూ స్థలాన్ని గుర్తించినా మంచిర్యాల కార్పొరేషన్కు దానిని అప్పగించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శాశ్వత డంప్యార్డుకు స్థలాన్ని కేటాయించడంలో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆండాళమ్మ కాలనీ, పవర్సిటీ కాలనీ, రంగంపేట, గ్రీన్సిటీ కాలనీల ప్రజలు కోరుతున్నారు. -
నేటి నుంచి కొత్త వైన్స్షాపులు ప్రారంభం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలోని లిక్కర్ గోదాము వద్ద రెండు రోజులుగా సందడి కనిపిస్తోంది. డిసెంబర్ 1నుంచి నూతన మద్యం దుకాణాలు ప్రారంభం కానుండగా లైసెన్స్ పొందిన వారు కొత్త మద్యం పాలసీ మేరకు సోమవారం నుంచి షాపులు ప్రారంభించనున్నారు. గుడిపేట లిక్కర్ గోదాం పరిధిలో 135 షాపులుండగా ఇందులో మంచిర్యాలకు జిల్లా కు చెందిన 73 దుకాణాలున్నాయి. ఇక ఈ గుడిపేట లిక్కర్ గోదాము నుంచి మంచిర్యాల జిల్లాతో పా టు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, మంథని, భూపాలపల్లి జిల్లాలోని కాటారం, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ప్రాంతాల్లోని వైన్స్షాపులకు ఇక్కడి నుంచి నిల్వలు సరఫరా చేస్తారు. సోమవారం నుంచి నూతన మద్యం దుకాణాలు తెరుచుకోనుండగా రెండు రోజుల నుంచి లిక్కర్ నిల్వలు సరఫరా చేస్తున్నారు. డిపోకు వస్తున్న ఇండెంట్ల ఆధారంగా ఒక్కో దుకాణానికి మద్యాన్ని కేటాయిస్తున్నారు. రెండు రోజుల్లో కొత్త మద్యం దుకాణాలకు ఇప్పటివరకు దాదాపుగా 20వేల కేసులకు పైగా లిక్కర్, 18వేలకు పైగా బీరు కేసులు సరఫరా జరిగినట్లు స మాచారం. నూతన మద్యం దుకాణాలకు పూర్తి స్థా యిలో మద్యం నిల్వలు సరఫరా చేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతుండగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్రావు తెలిపారు. కాగా, గుడిపేట లిక్క ర్ గోదాము ఎదురుగా ఏర్పాటు చేసిన వివిధ లిక్క ర్ కంపెనీల స్వాగత ఫ్లెక్సీలు ఆకర్షణగా నిలిచాయి. -
చెత్తను తరలించేలా చూస్తాం
మంచిర్యాల మున్సి పల్ కార్పొరేషన్ పరి ధిలో శాశ్వత డంప్ యార్డు కోసం స్థలం సేకరిస్తున్నాం. ప్రస్తు తం వినియోగిస్తున్న ఆండాళమ్మ కాలనీ డంప్యార్డులోని చెత్తను బయోమైనింగ్ ప్రక్రియతో లేకుండా చేస్తున్నాం. శాశ్వత డంప్యార్డుకు స్థలం గుర్తించినా దానిని కార్పొరేషన్కు అప్పగించడంలో కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. దీంతోమరోచోట స్థలాన్ని సేకరించి ఆండాళమ్మ కాలనీలో వేసే చెత్తను తరలించేలా చూస్తాం. – సంపత్కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
ఇష్టపడి చదివితేనే విజయం
మంచిర్యాలఅర్బన్: ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని అదనపు కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక షెడ్యూల్ కులాల కళాశాల బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించాల ని, మంచి స్థానంలో స్థిరపడాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వసతిగృహ కిచెన్, స్టోర్ గదులు పరిశీలించారు. అధికారులు దుర్గాప్రసాద్, ధర్మానంద్గౌడ్, చందన తదితరులు పాల్గొన్నారు. జైపూర్: మండలంలోని గంగిపల్లి, షెట్పల్లి, కుందారం, నర్సింగాపూర్ తదితర గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి ఇ బ్బందులు తెలుసుకున్నారు. తేమశాతాన్ని బట్టి వెంటవెంటనే కొనుగోలు చేయాలని సిబ్బందికి సూ చించారు. డీపీఎం సారయ్య, ఏపీఎం సంతోష్కుమార్, కేంద్రాల నిర్వహకులు, ఐకేపీ సీసీలున్నారు. -
● లైసెన్స్డ్ పిస్టళ్లు డిపాజిట్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారుల హెచ్చరిక ● రౌడీ షీటర్లు, మాజీలకు కౌన్సెలింగ్ ● సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ● ఎన్నికల నిర్వహణకు పక్కా ప్రణాళిక
మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్ కమి షనరేట్ పరిధిలో పంచాయతీ ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సీపీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడ మే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలోని వివిధ వ్యక్తుల వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకులను ఆయా పో లీస్స్టేషన్లలో అప్పగించాలని హెచ్చరికలు జారీ చే శారు. ఠాణాల పరిధిలోని పాత నేరస్తులు, రౌడీ షీ టర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ బైండోవర్ చేసేందుకు వారి జాబితా సిద్ధం చేశారు. మద్యం, డబ్బు ను కట్టడి చేసేందుకు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు, ఎక్కడికక్కడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, రామగుండం, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాలతోపాటు ఖానా పూర్ నియోజకవర్గ పరిధిలోని జన్నారం ఉన్నాయి. చెన్నూర్ నియోజకవర్గంలో కోటపల్లి, సిర్సా, అన్నా రం, అర్జునగుట్ట, నీల్వాయి, వేమనపల్లి ప్రాంతాలు మావోలకు పెట్టిన కోటగా పేరుంది. ఇటీవల జరిగి న ఎన్కౌంటర్లు, మావోల లొంగుబాటుతో జిల్లాలో మావోయిజం మసకబారినట్లు చర్చ జరుగుతోంది. ‘సరిహద్దు’లో ప్రత్యేక నిఘా ప్రాణహితకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు కావడంతో పోలీసులు అక్కడి గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో 306 గ్రామపంచాయతీలకు గాను 83 పంచాయతీలను పోలీస్శాఖ అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించింది. ఆయా పంచాయితీల్లో ప్ర త్యేక నిఘా పెట్టింది. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏ ర్పాటు చేశారు. జిల్లాలో ఒకటి అంతర్రాష్ట్ర, నాలుగు అంతర్ జిల్లా చెక్ పోస్టులున్నాయి. కోటపల్లి మండలం నుంచి ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్ర రోడ్డు మార్గంలో అంతర్రాష్ట్ర వారధి ఉండడంతో పార్పెల్లి సమీపంలో అంతర్ర్రాష్ట్ర చెక్పోస్ట్ ఏర్పా టు చేశారు. జైపూర్ మండలం ఇందారం, తాండూర్ మండలం రెబ్బెనపల్లి, దండేపల్లి మండలం గూడెం, జన్నారం మండలం ఇందన్పెల్లి వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్టులూ ఏర్పాటయ్యాయి. జిల్లాలో 17 లైసెన్స్డ్ తుపాకులు జిల్లాలో 17 లైసెన్స్డ్ తుపాకులున్నాయి. ఎన్నికల సందర్భంగా తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నవారి నుంచి పోలీసులు ఆయుధాలను డిపాజిట్ చేయించుకుంటున్నారు. ఇందులో 11బ్యాంక్ సెక్యూరిటీ సి బ్బంది వద్ద ఉన్నాయి. పోలీసుల ఆదేశాలతో బ్యాంకుల సెక్యూరిటీ అధికారుల వద్ద ఉన్నవి మినహా మిగతావి ఆయా ఠాణాల్లో డిపాజిట్ చేయాలని పోలీసులు హెచ్చరించారు. డిపాజిట్ చేసిన తుపాకులను కమిషనరేట్లోని ఆయుధ కారాగారంలోకి తరలించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్ గన్ పొందిన వారు ఆయుధాలు తమవద్ద ఉంచుకోవడం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన కిందకే వస్తుందని ఇప్పటికే వారికి ఆదేశాలు జారీ చేశారు. కౌన్సెలింగ్.. బైండోవర్లుజిల్లాలో 250 మందిపై రౌడీ షీట్ ఉంది. ఇందులో కొందరు మృతి చెందగా మరి కొందరు మకాం మార్చేశారు. ఇందులో కొందరు సత్ప్రవర్తనతో మెలుగుతుండగా.. కొందరు యథావిధిగా తమ పంథాను కొనసాగిస్తున్నారు. పోలీస్స్టేషన్ల వారీగా రౌడీ షీట్ రికార్డ్ల ఆధారంగా వారిని గుర్తించి వారు ఎక్కడున్నారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో? పూర్తి వివరాలు సేకరించే పనిలో ఇప్పటికే నిమగ్నమయ్యారు. వారిపై పూర్తి స్థాయి నిఘాకు ప్రత్యేక యంత్రాంగాన్నే నియమించారు. ఎన్నికల వేళ అల్లరి మూకలను కట్టడి చేసేందుకు బైండోవర్లు చేయాలని సీపీ ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ పార్టీల్లో ఉంటూ గొడవలు సృష్టించే వారి జాబితాను ఇప్పటి కే సిద్ధం చేశారు. గతంలో బైండోవర్లు చేసినవారందరినీ మళ్లీ బైండోవర్ చేయనున్నారు. -
నియమావళి పాటించాలి
బెల్లంపల్లిరూరల్: ఎన్నికల నియమావళిని పా టించాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ సూ చించారు. మండలంలోని గురిజాల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసి న నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ దాఖ లు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు అవగాహ న కల్పించారు. కేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణ, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భీమిని: కన్నెపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ మనోజ్ పరిశీలించారు. తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు. నెన్నెల: మండలంలోని నెన్నెల, నందులపల్లి గ్రామాల్లోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సబ్ కలెక్టర్ మనోజ్ సందర్శించారు. విధులు బాధ్యతలపై అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో అబ్దుల్హై, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో నరేశ్ తదితరులున్నారు. వేమనపల్లి: మండలంలోని జిల్లెడ క్లస్టర్ నా మినేషన్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ మనోజ్కుమా ర్ సందర్శించారు. ఎంపీవో వెంకటేశ్, ఆర్ఐ ఖాలిక్, పంచాయితీ సిబ్బంది ఉన్నారు. -
పర్వం షురూ..
రెండో విడత నామినేషన్లమంచిర్యాలరూరల్(హాజీపూర్): రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం మొదలైంది. బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్లోని ఏడు మండలాల పరిధిలో 114పంచాయతీలుండగా స ర్పంచ్ స్థానానికి 45నామినేషన్లు, 996 వార్డులుండగా 30నామినేషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 1, 2 తేదీల్లోనూ నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. రెండోవిడత ఎన్నికలు నిర్వహించనున్న ఏడు మండలాల పరిధిలో 1,39,312 మంది ఓటర్లున్నారు. వీరిలో 69,249 మంది పురుషులు, 70,055 మంది మహిళలు, ఎనిమిది మంది ఇతరులున్నారు. మిగతా ప్రక్రియ ఇలా.. రెండో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఈ నెల 3న నామినేషన్ల పరిశీలన, 4న అభ్యంతరాల స్వీకరణ, 5న అభ్యంతరాల పరిశీలన ఉంటుంది. 6న నామినేషన్ల ఉపసంహరణ అనంత రం బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. 14న ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి అదేరోజు మధ్యాహ్నం 2నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి చేస్తారు. -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం
పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. ఎన్నిక ల వేళ లైసెన్స్డ్ గన్లను డిపాజిట్ చేసుకున్నాం. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాం. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదు. ఎవరైనా ఓటర్లను ప్ర లోభాలకు గురిచేయడం, భయపెట్టడం లాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది లాంటివి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు నిర్భయంగా, నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలి. – భాస్కర్, మంచిర్యాల డీసీపీ -
బకాయిలు చెల్లించాలి
మంచిర్యాలటౌన్: ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, ఐదు డీఏలు వెంటనే చెల్లించా లని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించా లని పోరాటం చేయాలని తీర్మానించినట్లు టీఎ న్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి తె లిపారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో ఆదివారం టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ హరి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరి ష్కారానికి పోరాటం, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, బెనిఫిట్స్ ప్రభుత్వం అందించేలా చూడాలని రాష్ట్ర కార్యవర్గానికి ఏకగ్రీవ తీర్మా నం చేసి పంపినట్లు తెలిపారు. జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీశ్కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియారాణి, రాంకుమార్, తిరుపతి, అంజయ్య, శ్రీధర్రావు, శివప్రసాద్, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రావణ్కుమార్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు గోపాల్, కార్యదర్శి అజయ్ప్రశాంత్ పాల్గొన్నారు. -
మొదటివిడత నామినేషన్ల పరిశీలన పూర్తి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మొదటివిడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ పరిశీలన ప్రక్రియ ఆదివారం పూర్తయింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు దాఖలైన నామినేషన్ పత్రాలను కుణ్ణంగా పరిశీలించారు. చివరిరోజు భారీగా నామినేషన్లు రావడంతో 90 పంచాయతీలకు 408 నామినేషన్లు, 816 వార్డు సభ్యుల స్థానాలకు 1,697 నామినేషన్లు వచ్చాయి. అయితే, ఆయా మండలాల్లో రాత్రి వరకు కూడా నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగింది. పలు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు వివిధ కారణాలతో రిజెక్ట్ కాగా, కొందరు బాధితులు అప్పీల్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆమోదించిన నామినేషన్లపై సోమవారం అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ అభ్యంతరాలను మంగళవారం పరిశీలించి పరిష్కరిస్తారు. 3న మధ్యాహ్నం 3వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. బుజ్జగింపులు.. బేరసారాలు..సర్పంచ్గా నామినేషన్ వేసినవారిలోని ప్రధాన పా ర్టీల ముఖ్య నేతలు తమ పట్టు నిలుపుకొనేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. కొన్నిచోట్ల పోటీగా నామినేషన్ వేసినవారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. వారి నామినేషన్ ఉపసంహరించుకునేలా బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 3న మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ఉండటంతో సర్పంచ్గా ఎలాగైనా గెలువా లనుకునేవారు ఎదుటివారిని తప్పించే యత్నాలు ప్రారంభించారు. ఒక్కో పంచాయతీకి ఒక్కొక్కరే బరిలో నిలిచి ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఇప్పటికే అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. గుర్తులు ఇంకా రాకు న్నా వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక కొంతమంది అభ్యర్థులు ఓటర్లకు మద్యం, డబ్బు పంపిణీ చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. -
షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్లు దగ్ధం
లోకేశ్వరం: మండలంలోని కన్కపూర్లో దూదిగాం చిన్న సాయన్నకు చెందిన పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయన్న కుటుంబ సభ్యులు శనివారం ఉదయం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో శుభకార్యం కోసం వెళ్లారు. అదేగ్రామానికి చెందిన గండ్ల తులసిబాయి పక్కన అద్దెకు ఉంటుంది. ఈమె నూతనంగా ఇంటి నిర్మించుకుంటుంది. ఇంటి పని నిమిత్తం బయటకు వెళ్లింది. మధ్యాహ్నం ఒక్కసారిగా చిన్న సాయన్న పెంకుటిల్లు నుంచి మంటలు వచ్చాయి. ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని సింగిల్ ఫేజ్ మోటారుతో మంటలార్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న భైంసా ఆగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పేశారు. సాయన్నకు చెందిన రెండు తులాల బంగారు ఆభరణాలు, తులసిబాయి ఉన్న అద్దెంట్లో రూ.5 లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఆర్ఐ లలిత ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాదాపు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. కాగా, దేవుడి వద్ద వెలిగించే దీపం వల్ల షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగి ఉండవచ్చనని గ్రామస్తులు భావిస్తున్నారు. -
లింగయ్యపల్లి ఏకగ్రీవం!
● సర్పంచ్, 10 వార్డు స్థానాలు ● అన్నింటికీ ఒక్కో నామినేషన్ జన్నారం: మండలంలోని లింగయ్యపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు శనివారం వరకు ఒక్కటే నా మినేషన్ దాఖలైంది. పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి నూతనంగా లింగయ్యపల్లి ఏర్పడింది. 1300 మంది జనాభా ఉండగా.. 684మంది ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ స్థానానికి రెండో పర్యాయం ఎన్నిక జరుగుతుండగా.. ఈసారి బీసీ మహిళకు రిజర్వు అయింది. కొత్తపల్లి వనిత సర్పంచ్ అభ్యర్థిగా ఒక్కరే నామినేషన్ వేశారు. అదే విధంగా పది వార్డులకూ ఒక్కొక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే కానుంది. కాగా, వనిత భర్త శ్రీనివాస్ గత పదేళ్లుగా గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజారిగా ఉన్నాడు. పూజారిగా ఉచితంగా సేవలందిస్తానని, సర్పంచ్ స్థానానికి అవకాశం కల్పించాలని కోరడంతో గ్రామస్తులంతా అంగీకరించినట్లు తెలిసింది. లోతొర్రే గ్రామంలోనూ.. జన్నారం: మండలంలోని లోతొర్రే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం కానుంది. సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్ రిజర్వేషన్ వచ్చింది. సర్పంచ్ అభ్యర్థిగా బోడ శంకర్ ఒక్కరే నామినేషన్ వేశారు. 8 వార్డు స భ్యులకు 8 మంది మాత్రమే నామినేషన్ వేశా రు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నిక ఏకగ్రీవంపై ఎన్నికల అధికారి ప్రకటించాల్సి ఉంది. రాపల్లిలో వార్డు సభ్యురాలు.. మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లి గ్రామ పంచాయతీ 8వ వార్డు సభ్యురాలుగా స్వాతి ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. ఒకే నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
‘ఎన్హెచ్’లో కదలిక
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జాతీయ రహదారి–63 పనులు ఓ వైపు హైకోర్టు కేసులతో జాప్యం జరుగుతుండగా.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. గత ఏడాదిన్నరకు పైగా నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్ ఓపెన్ చేయకనే జాప్యం జరిగింది. తాజాగా డిసెంబర్ వరకు గడువు ఉండడంతో పలువురు కాంట్రాక్టర్లు బిడ్ వేశారు. తుదిగా వచ్చే నెలలో బిడ్ ఓపెన్ చేయనుండగా.. ఫిబ్రవరిలో పనులు ప్రారంభించాలని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే భూసేకరణతోపాటు అలైన్మెంటు మార్పు కోరుతూ ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మొదట ఈ రహదారి పనులపై కేంద్ర ప్రభుత్వం సైతం ప్రాధాన్యత జాబితాలో లేకపోవడంతోనూ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. తాజాగా రాష్ట్రం నుంచి పెండింగ్లో ఉన్న జాతీయ రహదారులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు ఆ మేరకు భూసేకరణ, చెల్లింపులు చేసేందుకు తదితరవన్నీ పూర్తవుతున్నాయి. ఇప్పటికే హాజీపూర్ మండలం పోచంపాడ్, వేంపల్లిలో దాదాపు 20 ఎకరాలకు పైగా సుమారు రూ.4కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. మిగతా చోట్ల కూడా భూసేకరణలో పరిహారం చెల్లింపులు జరిగితే పనులు సాగనున్నాయి. ఈ రోడ్డు కోసం జిల్లాలో మొత్తంగా 378 ఎకరాల వరకు సేకరించాల్సి ఉంది. రైతుల ఆందోళన జిల్లా పరిధిలో ప్రస్తుత కార్పొరేషన్ పరిధి హాజీపూర్ మండలం ముల్కల్ల నుంచి మందమర్రి మండలం క్యాతనపల్లి శివారు కుర్మపల్లి క్రాస్ వరకు బైపాస్ రోడ్డు అలైన్మెంటు ఉంది. మొత్తంగా జిల్లా పరిధిలో 33కిలోమీటర్ల నిడివి చూస్తే లక్సెట్టిపేట మండలం నుంచి లక్సెట్టిపేట, మోదెల, ఇట్కాల, పోతేపల్లి, గుల్లకోట, మిట్టపల్లి, కర్ణమామిడి, హాజీపూర్, పడ్తానపల్లి, నర్సింగాపూర్, గుడిపేట, ముల్కల్ల, వేంపల్లి, మంచిర్యాల, తిమ్మాపూర్, క్యాతనపల్లి గుండా రోడ్డు వెళ్తోంది. మొదట ప్రణాళిక ప్రకారం బెపాస్ అలైన్మెంటు మార్చడం పట్ల నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. తమ పంట పొలాల నుంచి వెళ్లొద్దంటూ నిరసనలు చేపట్టారు. ఇప్పటికీ అలైన్మెంటు మార్చుతారా? అనే ఆశతో ఉన్నారు. అయితే ఎన్హెచ్ఏఐ తుదిగా డిజైన్ ఖరారు చేయడంతో ఇక మార్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ఎన్హెచ్–63 పనులు మొదలు కానున్నాయి. ఇక క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. దీంతో తమకు సరైన పరిహారం పొందుతామా? లేదా? అని న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. -
మూడు గ్రామాల్లో పాతకథే..!
● నామినేషన్లు వేసేవారు లేక నిలిచిపోనున్న ఎన్నికలు దండేపల్లి: మండలంలోని గూడెం, నెల్కివెంకటాపూర్, వందుర్గూడ గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఎన్నికలు నిలిచిపోనున్నాయి. గూడెంలో గిరిజనులు లేకున్నా ఏజెన్సీ గ్రామంగా ప్రకటించారు. దీంతో సర్పంచ్, సగం వార్డు స్థానాలు గిరిజనులకే రిజర్వు చేయడంతో అభ్యర్థులు లేని కారణంగా అక్కడ 1987 నుంచి ఇప్పటివరకు సర్పంచ్ ఎన్నికలు నిలిచిపోతున్నాయి. ఏజెన్సీ పరిధి నుంచి గ్రామాన్ని తొలగించాలని మిగతా రిజర్వేషన్ స్థానాల్లో గ్రామస్తులు పోటీ చేయకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నెల్కివెంకటాపూర్, వందుర్గూడలోనూ అంతే.. మండలంలోని నెల్కివెంకటాపూర్, వందుర్గూడ గ్రామాల్లోనూ పంచాయతీ ఎన్నికలు నిలిచిపోనున్నాయి. ఇది రెండోసారి కావడం గమనార్హం. వందుర్గూడ నెల్కివెంకటాపూర్ పంచాయతీలో ఉండేది. వందుర్గూడ నూతన పంచాయతీగా ఏర్పాటు చేశారు. దీన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తూ ఎన్నికలు బహిష్కరిస్తున్నారు. ఇక నెల్కివెంకటాపూర్ ఏజెన్సీ గ్రామం కావడంతో ఇక్కడ సర్పంచ్, సగం వార్డులను ఎస్టీలకు రిజర్వు చేశారు. ఈ గ్రామంలో గిరిజనులు లేని కారణంగా ఎవరూ నామినేషన్ వేయడం లేదు. ఈ కారణంతో ఎన్నికలు నిలిచిపోతున్నాయి. -
ఓసీ ఏర్పాటుతో ఇబ్బందులు ఉండవు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్లో ఓపెన్కాస్ట్ ఫేజ్–2 రాకతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని మందమర్రి జీఎం రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఆర్కే4 గడ్డ ప్రాంత ప్రజలు శనివారం సాయంత్రం జీఎంను తన ఛాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఓసీ మ్యాప్ చూపెడుతూ గని ఎక్కడి నుంచి ఎక్కడికి ఏర్పాటు కానుందో వివరించారు. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. పాత గనులు కలుపుతూ ఏర్పాటు అవుతుందని ఏ ఒక్కరికి నష్టం లేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోనూ స్థానికులకే ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ఎస్ఓటు జీఎం ప్రసాద్, డీజీఎం పర్సనల్ అశోక్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి అక్బర్అలీ తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్ ప్రిపరేషన్.. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఓ విద్యావంతురాలు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామానికి చెందిన బానోత్ కావేరి బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ కోసం మహారాష్ట్రలో శిక్షణ పొందుతూ సన్నద్ధమవుతోంది. ఈమె తండ్రి బానోత్ గజానంద్ నాయక్ 15ఏళ్లు నార్నూర్ సర్పంచ్గా పని చేశారు. ఈసారి రిజర్వేషన్ మారడంతో తన వారసురాలిగా కావేరిని బరిలోకి దింపారు. మండల కేంద్రం నార్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో కలిసి నామినేషన్ వేశారు. పుట్టినగడ్డకుసేవ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నట్లు కావేరి తెలిపారు. -
విద్యార్థినిని వేధించిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని విద్యానగర్లోని పారామెడికల్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ప్రేమ పేరిట వేధింపులకు గురిచేసిన యువకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఫైజాన్.. నెల క్రితం కళాశాలలో పరీక్ష ఫీజు కట్టడానికి వచ్చిన విద్యార్థిని ప్రేమిస్తున్నానని ఇబ్బందులకు గురిచేశాడు. చేతిలో ఉన్న సెల్ఫోన్ను తీసుకుని పగులగొట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసి ఫైజాన్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రీలాన్స్ జర్నలిస్టుపై.. ఆదిలాబాద్రూరల్: పట్టణానికి చెందిన ప్రీలాన్స్ జర్నలిస్టు ఫిరోజ్ఖాన్పై అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈనెల 26న సాయంత్రం ఫిరోజ్ఖాన్తోపాటు మరో వ్యక్తి ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. సరిగా డ్యూటీ చేయడం లేదని రెస్టారెంట్లు తనిఖీ చేయడం లేదని బెదిరించారు. రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష మావల పీఎస్లో ఫిర్యాదు చేసింది. విధులకు ఆటంకం కలిగించడంతోపాటు కులంపేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం కారు నిలిపిన చోట ఫొటో తీసి, అధికారిగా ఉండి బ్లాక్ఫిల్మ్ పెట్టావని వార్త రాసి అధికారికే పోస్టు చేశారు. ‘రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని ప్రభుత్వం’నేరడిగొండ: రైతుల ఆత్మహత్యల గోసను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ, రైతు స్వరాజ్యవేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న అన్నారు. మండలంలోని కిష్టాపూర్కు చెందిన కౌలు రైతు సోలాంకి శ్రీకాంత్ ఇటీవల ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకోగా, శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రెండు మూడేళ్లుగా పంట దిగుబడి రాలేదని మనోవేదనకు గురై ఉరేసుకున్నాడు. పంటకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకున్నారు. బాధిత కుటుంబానికి జీవో నం.194 ప్రకారం రూ.6లక్షల పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. కుటుంబ యజమానురాలికి నెలకు రూ.5వేల పెన్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు. నాయకులు బుపేందర్, సంతోష్, ప్రమోద్ ఉన్నారు. బీజేపీ జిల్లా ఇన్చార్జీల నియామకంఆదిలాబాద్: బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఇన్చార్జీలను శనివారం నియమించింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్కు మాజీ ఎమ్మెల్యే అరుణతార, మంచిర్యాలకు కె.ఓదెలు, నిర్మల్కు గోపిడి స్రవంతిరెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు కోమల ఆంజనేయులను నియమించారు. -
కలమడుగులో హార్వెస్టర్..
జన్నారం: మండలంలోని కలమడుగు గ్రామంలో శనివారం వరి పంట కోస్తుండగా అకస్మాత్తుగా మంటలు వ్యాపించి హార్వెస్టర్ దగ్ధమైంది. ఫైర్ అధికారి దేవనంద్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. జక్కుల భూమన్నకు చెందిన హార్వెస్టర్ ప్రకారం కలమడుగులో వరి పంటను కోస్తుండగా డీజిల్ ట్యాంకర్ వేడెక్కి అకస్మత్తుగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే పై నుంచి కిందికి దూకాడు. గ్రామస్తులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని మంటలార్పారు. ప్రమాదంలో సీట్లు, టైర్, పై భాగం దగ్ధమైంది. రూ.4.50 లక్షల నష్టం జరిగినట్లు ఫైర్ అధికారి తెలిపారు. -
పల్లెల్లో చెరగని ముద్ర
గ్రామాలు ప్రగతిపథంలో తీసుకెళ్లాలనే లక్ష్యం.. ప్రజల మద్దతు, సహకారంతో ఒకప్పుడు పంచాయతీల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేవి. సర్పంచులు తమ పదవీకాలంలో సీసీరోడ్లు, డ్రెయినేజీలు నిర్మించడం, పేదలకు ఇళ్లు కట్టించడం, ప్రజలకు సేవలందించారు. పల్లెల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తమదైన చెరగని ముద్రవేశారు. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న సర్పంచులపై సాక్షి ప్రత్యేక కథనం. ఐదు పర్యాయాలు ఏకగ్రీవంతాంసి: ఈయన పేరు జింక జైహింద్. తాంసి సర్పంచ్గా 25 ఏళ్ల పాటు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చదువు అంతంతే అయినే యువకుడి ఉన్నప్పుడు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నారు. 1975 నుంచి 2001 వరకు ఐదు పర్యాయాలు 25 ఏళ్ల పాటు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేశారు. 40 కుటుంబాలకు ఇళ్లు నిర్మించడం, గ్రామస్తుల సహకారంతో పాఠశాల, కళాశాలకు స్థలం కేటాయించారు. మరో ఐదేళ్ల పాటు సర్పంచ్గా ఉండాలని ప్రజలు కోరిన స్వచ్ఛందంగా వద్దనుకుని వేరేవారికి అవకాశమిచ్చారు. గ్రామం చివరలో చాయ్ హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అనారోగ్యంతో 2022 ఆగస్టులో మృతిచెందాడు. ఆయన మంచితనం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తాంసితోపాటు చుట్టూపక్కల గ్రామాల ప్రజలు ఇప్పటికి చెబుతుంటారు. -
అభివృద్ధిలో మార్క్
లక్ష్మణచాంద: ఈయన పేరు అట్ల రాంరెడ్డి. లక్ష్మణచాంద సర్పంచ్గా 31 ఏళ్లుగా పనిచేశారు. 1970 నుంచి 2001 వరకు సర్పంచ్గా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. అభివృద్ధిలో తన మార్క్ చూపించారు. 1970లో ఎన్నికై 1981 వరకు సర్పంచ్గా కొనసాగాడు. 1988 వర కు, అదే ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1995 జ రిగిన ఎన్నికల్లో గెలుపొందారు. గ్రా మ అభివృద్ధిలో తన మార్క్ చూపించారు. ప్రాథమికను ఉన్నత పాఠశాలను అప్గ్రేడ్, బీసీ బాలుర హాస్టల్ ఏర్పాటు, లక్ష్మణచాంద నుంచి న్యూ కంజర్, మండల కేంద్రం నుంచి ధర్మారం, తిర్పెల్లి నుంచి అనంతపేట్ వరకు రోడ్డు నిర్మించారు. గ్రామస్తుల సహకారంతో 1988లో సహకార జూనియర్ కళాశాలఏర్పాటు చేయించారు. 1998లో ఎస్వీజీ డిగ్రీ కళాశాల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. -
జన్నారం అటవీ డివిజన్లో పులి గాండ్రింపు
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ పులి గాండ్రిస్తోంది. గత నాలుగు రోజులుగా అడవిలో పులి కదలికలు కనిపిస్తున్నాయి. రెండ్రోజులు గా ఇందన్పల్లి అటవీ రేంజ్లో పర్యటిస్తూ చంపిన ఆవు మాంసాన్ని తిన్నట్లు అధికారులు గుర్తించారు. మూడో రోజు వేరే ప్రాంతంలో పులి అడుగులు కనిపించాయి. శనివారం రాత్రి 8గంటల ప్రాంతంలో జన్నారం డివిజన్లోని ఓ ప్రాంతానికి పులి పర్యవేక్షణకు వెళ్లిన సిబ్బంది నేరుగా పులి గాండ్రింపులు విన్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. 15సార్లు గాండ్రించిందని, భయంతో పరుగులు తీశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పులి ఉన్న చోట నుంచి రెండు కిలోమీటర్ల చుట్టూ మూత్ర విసర్జన చేస్తుంటుందని తెలిసింది. ఆ వాసన ఆధారంగా పులి సంచారాన్ని అధికారులు ధ్రువీకరిస్తారని సమాచారం. అటవీ ప్రాంతంలో పర్యటించిన పలువురు వ్యక్తులతోపాటుగా అటవీ అధికారులు అలాంటి వాసన గమనించినట్లు తెలిపారు. వీటన్నింటి ఆధారంగా పులి ఈ ప్రాంతంలోనే పర్యటిస్తున్నట్లు నిర్ధారణకు వస్తున్నారు. కదలికలపై అప్రమత్తంగా ఉంటున్నారు. -
20 ఏళ్లుగా సేవలు..
ఇచ్చోడ: ఈయన పేరు పాముల మోతీరాం. ఇచ్చోడ మండలం కోకస్మన్నూర్ సర్పంచ్గా 20 ఏళ్లుగా ప్రజలకు సేవలందించారు. 1974 నుంచి 1994 వరకు పైసా ఖర్చుచేయకుండా నాలుగు పర్యాయాలుగా సర్పంచ్గా ఎంపికయ్యారు. మొదట, రెండుసార్లు వార్డు సభ్యుడిగా, ఆపై సర్పంచ్గా ఎన్నికయ్యారు. అప్పట్లో వార్డు సభ్యుడిగా ఎంపికై న వారే మెజార్టీ సభ్యుల మద్దతుతో సర్పంచ్ పదవిని పొందేవారు. అలా రెండుసార్లు చొప్పున జనరల్, ఎస్సీ రిజర్వేషన్లో సర్పంచ్గా గెలుపొందారు. అప్పట్లో కోకస్మన్నూర్లో వేసవిలో నీటి ఎద్దడి ఉండేది. 1983లో బోథ్ నియోజకవర్గంలోనే మొదటిసారిగా వాటర్ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించారు. ఇంటింటికి నల్లాల ద్వారా నీరందించారు. -
నియమావళి అమలు చేయాలి
● మంచిర్యాల డీసీసీ భాస్కర్ ● పోలింగ్ కేంద్రాల సందర్శనబెల్లంపల్లి/రామకృష్ణాపూర్/దండేపల్లి: ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. శనివారం బెల్లంపల్లి పద్మశాలి భవన్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని సబ్ డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బందికి విధులు, ప్రవర్తన నియమావళి తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మందమర్రి మండలం పులిమడుగు గ్రామాన్ని డీసీపీ భాస్కర్ శనివారం సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామంలో శనివారం రాత్రి పంచాయతీ ఎన్నికలపై గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామాభివృద్ధికి పాటుపడే వ్యక్తిని ఎన్నుకోవాలని, వివాదాలకు పాల్పడవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించబోమని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బెల్లంపల్లి ఏసీపీలు ఏ.రవికుమార్, ప్రకాశ్, సీఐలు కె.శ్రీనివాసరావు, సీ.హెచ్.హనోక్, ఎన్.దేవయ్య, శశిధర్రెడ్డి, రమణమూర్తి, ఎస్సై తహాసీనొద్దీన్ పాల్గొన్నారు. -
సత్యనారాయణస్వామే తిరిగి రప్పించాడు..!
లక్సెట్టిపేట: ‘నన్ను ఆ గూడెం సత్యనారాయణస్వామే తిరిగి రప్పించాడు. నా ఆరోగ్యం గురించి సహకరించిన వారికి, దేవుళ్లకు ప్రార్థించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు..’ అంటూ మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు(పీఎస్సార్) భావోద్వేగానికి గురయ్యారు. శనివారం మండల కేంద్రంలోని ఐబీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక దశలో ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. తన ఆరోగ్యం బాగా లేకున్నా సీఎం రేవంత్రెడ్డి, వైద్యులు వెళ్లవద్దని చెప్పినా సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో ప్రజల కోసమే వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే ఒకసారి సర్జరీ అయిందని, మరోసారి చిన్నపాటి సర్జరీ కోసం మళ్లీ కోయంబత్తూరు వెళ్తున్నట్లు తెలిపారు. తనకు వచ్చిన అనారోగ్య సమస్యలు ఎవరికీ రావొద్దని, వచ్చినా చికిత్స అందుబాటులో ఉండేందుకు మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. అన్ని విధాల శస్త్రచికిత్సలు అందుబాటులో ఉంటాయని, సుదూర ప్రాంతాలకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు. తన ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతున్నానని, అందుకు సహకరించిన సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల బృందానికి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని, పార్టీ అభ్యర్థులకు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాలుగు నెలల తర్వాత పట్టణానికి వచ్చిన పీఎస్సార్కు కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి ఐబీ వరకు బైక్ ర్యాలీ, డీజే చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల సర్పంచ్ అభ్యర్థుల పేర్ల జాబితాను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం త్రిమూర్తి, ఎండీ ఆరీఫ్, పింగిళి రమేష్, చెల్ల నాగభూషణం, చింత అశోక్కుమార్, పూర్ణచందర్, శ్రీనివాస్, దాసరి ప్రేంకుమార్, రాజు పాల్గొన్నారు. -
విత్తనచట్టంపై అభిప్రాయ సేకరణ
మంచిర్యాలఅగ్రికల్చర్: కేంద్ర ప్రభుత్వం పాత విత్తన చట్టాన్ని మార్చి నూతన విత్తన చట్టాన్ని తీసుకురావడానికి రైతుల అభిప్రాయాన్ని సేకరిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఎర్పాటు చేసిన అభిప్రాయ సేకరణపై జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, బెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్త మహేశ్తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నూతన విత్తన చట్టం–2025 ముసాయిదాపై అందరి భాగస్వామ్యంతో అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. రైతుల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వనికి నివేదిక అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ, ఏవో, ఏఈవోలు పాల్గొన్నారు. -
ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్(టీజీఆర్ఏసీ) సంచాలకులు, అదనపు జనరల్ సంచాలకులు, ఎన్నికల సాధారణ పరిశీలకులు పి.మనోహర్, ఎన్నికల ఖర్చుల పరిశీలకులు ఈ.రాజేశ్వర్తో కలిసి నోడల్ అధికారులు, సహాయ ఖర్చుల పరిశీలకులు, ప్రత్యేక బృందాల అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ అభ్యర్థులు ప్రచారంలో వినియోగించే ప్రతీ అంశాన్ని ఎన్నికల సంఘం జారీ చేసిన ధరల పట్టికను అనుసరించి లెక్కించాలని తెలిపారు. ఎన్నికల ఖర్చుల వివరాలు ప్రతీరోజు నమోదు చేయాలని, సహాయ ఖర్చుల పరిశీలకులు ఖర్చుల వివరాలను పరిశీలించాలని తెలిపారు. ఫిర్యాదులు, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నంబరు 08736– 250501 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
ఉదయం అలా.. సాయంత్రం ఇలా
నేరడిగొండ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని నాగమల్యాల్ గ్రామంలో శనివారం ఉదయం కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడారు. మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడంతోపాటు మాజీ సర్పంచ్ భీముడుతోపాటు పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా సాయంత్రం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో మాజీ సర్పంచ్ భీముడుతోపాటు పలువురు గ్రామస్తులు ఆయన్ను కలిసి మేము పార్టీలో చేరలేదని, వారే మాకు కండువా కప్పారని తెలిపారు. కాగా ఒకేరోజు రెండు పార్టీల కండువాలు కప్పుకోవడం పట్ల పలువురు చర్చించుకుంటున్నారు. -
● రాష్ట్ర స్థాయికి ప్రతిపాదన ● త్వరలో తనిఖీ బృందాల సందర్శన
‘స్వచ్ఛ’ అవార్డుకు ఎనిమిది స్కూళ్లు ఎంపికమంచిర్యాలఅర్బన్: స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రాష్ట్ర స్థాయి అవార్డుకు జిల్లాలోని ఎనిమిది పాఠశాలలను ఎంపిక చేశారు. సమగ్ర విద్య జిల్లా స్థాయిలో స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ స్క్రీనింగ్ కోసం కలెక్టర్ చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా రిజిష్టర్ చేసుకున్న 908 పాఠశాలలను జిల్లా స్థాయి తనిఖీ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించారు. వీటిలో ఏడు ప్రభుత్వ, ఒక ప్రైవేటు పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయగా.. అర్బన్ 2, రూరల్ 6 పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలలను రాష్ట్ర కమిటీ తనిఖీ బృందం త్వరలో సందర్శించనుంది. పాఠశాలలు ఇవే.. రాష్ట్ర స్థాయికి ఎంపికై న పాఠశాలల వివరాలను డీఈవో యాదయ్య శనివారం ప్రకటించారు. అర్బన్ కేటగిరీలో ఎయిడెడ్ సింగరేణి కాలరీస్ పబ్లిక్ స్కూల్ కల్యాణిఖని, కేటగిరి 2లో కేంద్రియ విద్యాలయం మంచిర్యాల, రూరల్లో కేటగిరి–1 నుంచి ఎంపీపీఎస్ రసూల్పల్లి, జైపూర్ ఎంపీపీఎస్ మాలగురిజాల బెల్లంపల్లి, స్లేట్ స్కూల్ జన్నారం, కేటగిరి–2లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందారం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిష్టాపూర్ జన్నారం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీల్వాయి వేమనపల్లి ఎంపిక య్యాయి. ఎస్హెచ్వీఆర్ కార్యక్రమంలో భాగంగా అప్లోడ్ చేసిన వివరాలు, చిత్రాలను బృందం తనిఖీ చేసింది. 5 స్టార్, 4స్టార్ పాఠశాలలో అప్లోడ్ చేసిన వివరాలు నిర్ధారించాయి. ఆయా స్కూల్ క్లాంపెక్స్ పరిధిలో కాంప్లెక్స్ హెచ్ఎం, సహాయకుడితో క్షేత్రస్థాయిలో పాఠశాలలను పరిశీలించి రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ప్రతీ రాష్ట్రం నుంచి 20 పాఠశాలలను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు. జాతీయ స్థాయిలో మొత్తం 200 పాఠశాలలను ఎంపిక చేసి రూ.లక్ష స్కూల్ గ్రాంట్గా ఇవ్వనున్నారు. పాఠశాల ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు ఎక్స్ఫోజర్ విజిట్(క్షేత్రసందర్శన)కు తీసుకెళ్తారు. పరిశీలించిన అంశాలు ఇవీ.. నీటి లభ్యత, నాణ్యత, వర్షపు నీటి నిల్వకు చర్యలు, మరుగుదొడ్లు, పనితీరు, రక్షణ చర్యలు, చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బు వినియోగం, అవగాహన కార్యక్రమాలు, పాఠశాలల నిర్వహణ, వ్యర్థాల విసర్జన, ఆస్తుల సంరక్షణ, సోలార్ వినియోగం, ఎకో క్లబ్లు, పరివర్తన మార్పులపై అవగాహన సదస్సులు, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, నీటి సంరక్షణ పథకాలు అమలు తీరుపై పలు అంశాలను పరిశీలించారు. -
భర్త రెండు పర్యాయాలు..భార్య ఏకగ్రీవానికి నిర్ణయం
ఇంద్రవెల్లి: ఈయన పేరు కినక జుగాదిరావ్. ఇంద్రవెల్లి మండలం వాల్గోండ సర్పంచ్గా రెండు పర్యాయాలు పనిచేసి ప్రజలకు సేవలందించారు. 2014లో వాల్గోండహిరపూర్ ఉమ్మడి పంచాయతీ సర్పంచ్గా ఈయన విజయం సాధించారు. సీసీరోడ్డు, డ్రెయినేజీ నిర్మాణాలు నిర్మించారు. తాగునీటి సమస్య పరిష్కరించారు. హీరపూర్ నుంచి వేరు అయిన వాల్గోండ పంచాయతీకి 2019 ఎన్నికల్లో తొలి సర్పంచ్గా గెలిచారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం వాల్గోండ పంచాయతీ (ఎస్టీ మహిళ) రిజర్వేషన్ వచ్చినప్పటికి ఆయన భార్య సునీతకు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఇటీవల పంచాయతీ పరిధి గ్రామాల ప్రజలు నిర్ణయించారు. -
● ముగిసిన తొలి విడత దాఖలు ● భారీ సంఖ్యలో అభ్యర్థులు రావడంతో టోకెన్లు ● రాత్రివరకు సాగిన స్వీకరణ ప్రక్రియ ● రేపటి నుంచి రెండో విడత షురూ
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/జన్నారం/దండేపల్లి: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి నామినేషన్ల ఘట్టం ముగిసింది. గత రెండ్రోజులుగా సాగిన దాఖలు ప్రక్రియ శనివారంతో పూర్తయింది. చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు తరలి రావడంతో వేచి చూడాల్సి వచ్చింది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసుకుని మరీ నామినేషన్ల దాఖలుకు మందీమార్బలంతో పోటాపోటీగా తరలివచ్చారు. నామినేషన్ల స్వీకరణ గడువు సాయంత్రం 5గంటల వరకే ఉండగా.. అప్పటికే వచ్చిన వారంతా వరుసలో ఉన్నారు. దీంతో సమయంలోపు వచ్చి వారందరికీ టోకెన్లు ఇచ్చి నామినేషన్లు స్వీకరించారు. టోకెన్లు తీసుకున్న వారంతా రాత్రి వరకు వేచి ఉండి నామినేషన్లు అందజేశారు. రాత్రయినా నామినేషన్ల స్వీకరణ పూర్తి కాకపోవడంతో ఎన్ని దాఖలయ్యాయనే లెక్క తేలలేదు. దండేపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో వార్డు స్థానాలకు అభ్యర్థులు కరువయ్యారు. దీంతో అప్పటికప్పుడు అభ్యర్థులను వెతికి నామినేషన్ వేయించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు హాజీపూర్, లక్సెట్టిపేట, జన్నారం, దండేపల్లి మండలాల్లో డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. 1,28,694 మంది ఓటర్లు ఉండగా.. 62,778 మంది పురుషులు, 65,913 మంది మహిళలు, ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నారు. నేడు పరిశీలన.. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామి నేషన్లను అధికారులు ఆదివారం పరిశీలిస్తారు. అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఎన్నికల అధికారుల పర్యవేక్షణ హాజీపూర్ మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రానికి పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకుడు మనోహర్, ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజేశ్వర్ సందర్శించారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియను పర్యవేక్షించారు. డీపీఓ వెంకటేశ్వర్రావు, ఎంపీడీఓ వెంకటరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్పాండే, సీఐ అశోక్ పాల్గొన్నారు. -
ఏరియా ఆసుపత్రికి ఆధునిక లాండ్రి మంజూరు
బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆస్పత్రికి మెకనైజ్డ్ లాండ్రి మంజూరైంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 19 ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులకు మెకనైజ్డ్ లినెన్ లాండ్రి సర్వీసెస్ మంజూరు చేస్తూ రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ నిర్ణయం తీసుకుంది. ఇందులో బెల్లంపల్లి ఒకటి కాగా.. రూ.25లక్షల అంచనా వ్యయంతో యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఆస్పత్రిలో పక్కా భవన నిర్మాణం చేపట్టగా పనులు తుది దశకు చేరాయి. ఆస్పత్రిలో వినియోగించే బెడ్షీట్స్, పిల్లో కవర్స్, ఓపీ గౌన్స్, మాస్క్ ఇతర వస్త్రాలను ప్రస్తుతం దోభీ ద్వారా శుభ్రం చేయిస్తున్నారు. ఆస్పత్రిలో ఒక్కరే దోభీ ఉండడంతో ఉతకడం కష్టతరం అవుతున్నట్లు గ్రహించిన రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ కమిషనర్ యంత్రాలు మంజూరు చేశారు. ఇకపై మెకనైజ్డ్ లాండ్రి ద్వారా దుస్తులు శుభ్రం చేయనున్నారు. తద్వారా దుస్తుల శుభ్రత వేగవంతం అవుతుంది. ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి కాగా.. జోన్–1 పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లో ప్రైవేటు కంపెనీ లాండ్రిని నిర్వహించనుంది. -
ఆస్తులు లేకున్నా మంచి పేరుంది
మందమర్రిరూరల్: ఈయన పేరు లింగాల మల్లయ్య. మందమర్రి మండలం అందుగులపేట పంచాయతీకి వరుసగా రెండుసార్లు సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2006లో (జనరల్), 2012లో (ఎస్సీ జనరల్) జరిగిన పోటీల్లో ఇండిపెండెంట్గా గెలిచి ప్రజలకు సేవలందించారు. 2017లో (జనరల్ సీటు) కావడంతో ఓడిపోయాడు. 2001లో ఎస్సీ మహిళ రిజర్వేషన్తో ఆయన భార్య లక్ష్మి పోటీ చేసి గెలిచింది. ప్రస్తుతం అందుగులపేటకు రిజర్వేషన్ మారడంతో పోటీ చేయడం లేదు. ప్రస్తుతం ఇంటి వద్ద టైలర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దంపతులకు ఎలాంటి ఆస్తులు లేవని, గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నారు. -
ఈ మూడు గ్రామాల్లో ఎన్నికల్లేవ్?
దండేపల్లి: పంచాయతీ ఎన్నికల వేళ మండలంలోని అన్ని గ్రామాలు సందడిగా మారగా.. గూడెం, నెల్కివెంకటాపూర్, వందుర్గూడ గ్రామాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. గూడెం గ్రామానికి సర్పంచ్ లేక 38 ఏళ్లవుతోంది. నెల్కివెంకటాపూర్ గ్రామంతోపాటు కొత్తగా ఏర్పాటైన వందుర్గూడ పంచాయతీకి గత 2019 పంచాయతీ ఎన్నికల్లో ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఈ రెండు గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు. శుక్రవారం వరకు ఈ మూడు గ్రామాల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. గూడెం ఏజెన్సీ గ్రామం కానప్పటికీ.. గూడెం గ్రామంలో 2,140 మంది ఓటర్లున్నారు. ఇందులో గిరిజనులెవ్వరూ లేరు. అయినప్పటికీ ఈ గ్రామాన్ని ఏజెన్సీ గ్రామంగా గుర్తించారు. దీంతో గ్రామంలోని సర్పంచ్ పదవితో పాటు సగం వార్డు స్థానాలు ఎస్టీలకే రిజర్వ్ చేశారు. దీంతో గ్రామంలో సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు స్థానాలకు పోటీ చేసేందుకు గ్రామంలో గిరిజనులెవరూ లేరు. 1987 నుంచి గూడెం పంచాయతీకి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో ఆ గ్రామానికి సర్పంచ్ లేక 38ఏళ్లు గడిచింది. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. నెల్కివెంకటాపూర్, వందుర్గూడలోనూ.. కొత్త పంచాయతీల ఏర్పాటుకు ముందు వందుర్గూడ గ్రామం నెల్కివెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. వందుర్గూడను నెల్కివెంకటాపూర్ నుంచి విడదీసి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. అయితే వందుర్గూడ పంచాయతీ ఏర్పాటును గ్రామస్తులు వ్యతిరేకించారు. తమ గ్రామాన్ని నెల్కివెంకటాపూర్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో పంచాయతీ ఎన్నికలు బహిష్కరించారు. వందుర్గూడను విడదీయడంతో నెల్కివెంకటాపూర్లో గ్రామంలో గిరిజనులెవరూ లేని పరిస్థితి ఏర్పడింది. నెల్కివెంకటాపూర్ గ్రామం కూడా ఏజెన్నీ గ్రామం కావడంతో ఇక్కడ గిరిజనులు లేని కారణంగా గత 2019 పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎస్టీ అభ్యర్థులు లేక నామినేషన్లు వేయలేదు. దీంతో అప్పటి పంచాయతీ ఎన్నిక నిలిచిపోయింది. ఈ రెండు గ్రామాల పంచాయితీ ఎటూ తేలక పోవడంతో, ఈసారి కూడా ఎన్నికలు జరగడం అనుమానమే. -
మేమున్నామనీ..
మంచిర్యాలక్రైం: మహిళలకు భద్రత కల్పించడంలో షీ టీమ్స్ సఫలమవుతున్నాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో వీటి పనితీరు ఈ ఏడాది బాగుంది. షీ టీమ్స్ ని రంతరం గస్తీ నిర్వహిస్తూ అతివలకు భరోసా క ల్పిస్తున్నాయి. విద్యాసంస్థలు, రైల్వేస్టేషన్లు, బ స్టాండ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతా ల్లో పోలీసులు మఫ్టీలో ఉంటూ ఆకతాయిల భర తం పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, విద్యాసంస్థల్లో ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, ప్రేమ పేరుతో వేధింపులకు గురవుతున్న విద్యార్థినులు, మహిళలకు షీ టీమ్స్ అండగా ఉంటూ పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తున్నాయి. మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బృందాల్లోని పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ భరోసా కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోనే కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి ఈవ్ టీజర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. స్పై కెమెరాలు వినియోగిస్తున్నారు. అవసరమనుకుంటే పరిసర ప్రాంతాలను వీడియో రికార్డు చేస్తున్నారు. సరైన ఆధారాలతో పోకిరీలను అదుపులోకి తీసుకుని ఈవ్టీజింగ్, మహిిళలను వేధించిన కేసులో పట్టుబడిన వారికి పోలీస్ పద్ధతిలో వారి చేష్టలను కుటుంబ సభ్యులకు చూపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తు్ాన్నరు. మహిళలను బహిరంగంగా వే ధించడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా వే ధించేవారి తాట తీస్తున్నారు. వీరు చేసిన ఆపరేష న్స్, నిర్వహించిన అవగాహన సదస్సులు మహిళల భద్రతకు రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. మహిళలు, బాలికలను వేధించినా.. మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేసినట్లు రుజువైతే చట్టపరమైన శిక్షలతో పాటు విద్యాపరంగా శిక్షలుంటాయి. విద్యాలయాలనుంచి తాత్కాలి కంగా లేదా శాశ్వతంగా తొలగించడానికి, ఏ ఇతర విద్యాలయాల్లో ప్రవేశాలు లేకుండా చేసేందుకు అ వకాశముంది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేకుండా చేయడం, పాస్పోర్టు జారీ చేయకుండా చర్యలు తీసుకోవచ్చు. యూజీసీ విధానాల ప్రకారం ర్యాగింగ్, ఈవ్టీజింగ్కు పాల్పడిన వారి ఉపకారవేతనా లు నిలిపివేయడం, పోటీ పరీక్షలకు హాజరుకాకుండా చేయడం, ఫలితాల నిలిపివేత, రూ.2.50 లక్షల వరకు జరిమానా విధించే ఛాన్స్ ఉంది. పోక్సో కేసులో పిల్లలకు రక్షణ కల్పించేందు ప్రభుత్వం 2012 లో పోక్సో చట్టాన్ని రూపొందించింది. చట్టంలో పే ర్కొన్న మేరకు బాలిక ఆమోదం తెలిపినా, తెలుపకపోయినా బీఎన్ఎస్ 63 ప్రకారం 18ఏళ్లలోపు వారి పై లైంగిక కలయిక జరిగితే అది అత్యాచారంగానే పరిగణించబడుతుంది. పిల్లలపై లైంగికదాడికి పా ల్పడితే ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, జరిమానా, లేదా జీవిత ఖైదు కూడా విధించవచ్చు.జిల్లా ఫిర్యాదులు ఎఫ్ఐఆర్ కౌన్సిలింగ్ అవగాహన రెడ్హ్యాండెడ్గా సదస్సులు పట్టుకున్నవి మంచిర్యాల 210 22 188 285 148 ఆదిలాబాద్ 217 25 192 190 43 ఆసిఫాబాద్ 142 37 105 206 63 నిర్మల్ 30 14 88 115 276సమాచారం ఇవ్వడం ఇలా..వేధింపులకు గురైనవారిలో చాలామంది పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడతారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని పోలీస్శాఖ వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నంబర్లను అందుబాటులో ఉంచింది. ఫోన్లో సమాచారం ఇచ్చేందుకు ‘డయల్ 100’కు ఫోన్ చేసి సమాచారం అందించాలి.6303923700 నంబర్కు వాట్సాప్ మెస్సేజ్ చేయవచ్చు. క్యూ ఆర్కోడ్, ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతారు కాబట్టి నిర్భయంగా సమాచారం అందించవచ్చు. షీటీమ్ బృందాలు ఘటనా స్థలానికి రహస్యంగా చేరుకుని సమస్య పరిష్కరిస్తారు.ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు షీ టీమ్ కేసుల వివరాలు -
మిస్టరీగా బాలిక మరణం
దండేపల్లి: మండలంలోని నంబాల గ్రామానికి చెందిన శనిగారపు మహన్విత (7) మృతి మిస్టరీగా మారింది. ఆడుకోవడానికి వెళ్లిన బాలిక సోమవారం అదృశ్యం కావడం.. మూడు రోజు ల తర్వాత గురువారం బావిలో శవమై తేలడం తెలిసిందే. బాలిక మృతదేహం లభించిన బావి ఇంటి నుంచి దూరంగా ఉంది. బాలిక ఒక్కరే అంతదూరం ఒంటరిగా వెళ్లలేని విధంగా పరిస ర ప్రాంతాలున్నాయి. దీంతో ఎవరైనా హత్య చేసి బావిలో పడేసి ఉండొచ్చని, మరోవైపు చి న్నారిని లైంగిక వేధింపులకు గురి చేసి చంపి ఉంటారనే అనుమానాలూ వ్యక్తమవుతున్నా యి. బాలిక అదృశ్యమైన రోజు పోలీస్ డాగ్స్క్వాడ్ ఇంటివద్దే కొద్దిసేపు సంచరించాయి. మృతదేహం లభించిన రోజు మాత్రం డాగ్స్క్వాడ్ బా వి నుంచి ఇంటి వద్దకు వచ్చాయి. బాలిక మృతి పై గ్రామంలో పలు విధాలుగా చర్చ జరుగుతోంది. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ మరణానికి కారణాలేమిటనేది చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. మృతదేహం నీళ్లలో ఎ క్కువ రోజులు ఉండడంతో కారణాలు కనుగొ నడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. బంధువుల ఆందోళన బాలిక మృతిపై న్యాయం చేయాలని తల్లిదండ్రులు, బంధువులు గ్రామస్తులు వంద మందికిపైగా శుక్రవారం దండేపల్లి పోలీస్స్టేషన్ వద్దకు వచ్చారు. స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు ప్రయత్నం చేశారు. మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చే శారు. ఇదే సమయంలో కేసు విచారణలో భా గంగా దండేపల్లి స్టేషన్కు వచ్చిన ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి వెంటనే బయట కు వచ్చి బాలిక తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. బాలిక కుటుంబానికి న్యాయం చే స్తామని, పోస్టుమార్టం నివేదిక రాగానే దాని ఆ ధారంగా నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు. జైలుకు పంపించి శిక్షపడేలా చూస్తామని భరోసానివ్వడంతో వారు వెళ్లిపోయారు. పోలీసు విచారణ ముమ్మరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు న మోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఏసీపీ ప్రకాశ్ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహసీనొద్దీన్, లక్సెట్టిపేట ఎ స్సై సురేష్ పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకోగా.. విచారణ వేగవంతం చేశారు. -
ఇంటి స్థలం కోసం టవరెక్కి నిరసన
జైపూర్: మండల కేంద్రానికి చెందిన అహ్మద్ అనే యువకుడు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం స్థ లం కేటాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సె ల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తనకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ సరిపడా స్థలం లేక ఇంటి నిర్మాణం నిలిచిపోయిందని వాపోయాడు. స్థలం కే టాయించాలని టవర్ ఎక్కి నిరసన తెలుపగా స్థాని కంగా కలకలం రేపింది. దీంతో ఘటనా స్థలానికి ఎస్సై శ్రీధర్ చేరుకుని యువకుడితో మాట్లాడారు. అతనికి నచ్చజెప్పడంతో అహ్మద్ సెల్ టవర్ పైనుంచి కిందకు దిగాడు. ఎస్సై మాట్లాడుతూ.. అహ్మద్ది నిరుపేద కుటుంబమని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినా ఉన్న కొద్ది స్థలంలో ఇల్లు నిర్మించకపోవడంతో హోల్డ్లో పెట్టారని తెలి పారు. ఇంటి ని ర్మాణానికి స్థ లం కేటాయించి ఆదుకోవాల ని కోరారు. -
హిల్ట్ పాలసీపై బహిరంగ చర్చకు సిద్ధమా?
నిర్మల్చైన్గేట్: హిల్ట్ పాలసీ అత్యంత పారదర్శకంగా ఉందని, ఎలాంటి కుంభకోణానికి ఆస్కారం లే దంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి బహిరంగ చ ర్చకు సిద్ధమా.. అని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. ఓపెన్ డిబేట్కు మంత్రి సిద్ధపడితే శనివారం ఉదయం 11గంటలకు అసెంబ్లీ మీ డియా పాయింట్ వద్దకు జర్నలిస్టుల సమక్షంలో చ ర్చకు రావాలన్నారు. లేదంటే డేట్, టై మ్, వేదికను మంత్రి ఖరారు చేసినా తనకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ప్రతిపక్షాలకు అర్థం కాలేదని మంత్రి మాట్లాడడం సరికాదన్నారు. ప్రభుత్వ విధానంలో పారదర్శకత ఉంటే, దానిపై చర్చించేందుకు అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడం లేద ని, పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించినవి రూ.6.30 లక్షల కోట్లయితే రూ.5వేల కోట్లకే కట్టబెట్టడం కుంభకోణం కాదా? అని ప్రశ్నించారు. ఈ భూ కుంభకోణంలో మంత్రితోపాటు మొత్తం కేబినె ట్, కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు వాటా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ల్యాండ్ కన్వర్షన్ పేరు చెప్పి ల్యాండ్ లూటీకి పాల్పడుతోందన్నారు. -
ఖాతాల కోసం అభ్యర్థుల పాట్లు
దండేపల్లి: పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు చూపేందుకు గతంలో ఉన్న సేవింగ్ బ్యాంక్ ఖాతాలు కాకుండా మళ్లీ కొత్తగా ఖాతా తీసుకోవాలని ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించింది. దీంతో చాలా మంది అభ్యర్థులు బ్యాంక్లు, పోస్టాఫీసులకు వెళ్లి కొత్తగా ఖాతాలు తెరుస్తున్నారు. బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్కు రూ.2వేలు కావడంతో చాలామంది పోస్టాఫీస్లో రూ.200తో ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. దండేపల్లి పోస్టాఫీస్ శుక్రవారం ఖాతాలు తెరిచేందుకు వచ్చినవారితో సందడిగా మారింది. సర్పంచ్ పదవికి వేలం?సారంగపూర్: మండలంలోని మహవీర్తండా గ్రా మపంచాయతీ సర్పంచ్ పదవికి శుక్రవారం వేలం నిర్వహించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. వేలం పాటలో మహవీర్తండాకు చెందిన ఓమహిళ తరఫున వారి కుటుంబీకులు పాల్గొని రూ.5.60లక్షలకు పదవి దక్కించుకున్నట్లు సమాచారం. మహవీర్తండా, దుర్గానగర్ ఈరెండు తండాలు ఒకే పంచాయతీ కాగా, వీటి పరిధిలో 500 మంది ఓటర్లున్నారు. ఈ తండా సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయగా దుర్గానగర్, మహవీర్తండాల ప్ర జలు సర్పంచ్ పదవి తమకంటే తమకేనంటూ పో టీకి దిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జామ్ గ్రామ సమీపంలో ఇరుగ్రామాల ప్రజలు పంచాయితీకి కూర్చున్నారు. సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా మహవీర్తండాకు చెందిన ఓ మహిళ సర్పంచ్ పదవిని రూ.5.60లక్షలకు దక్కించుకున్న ట్లు తెలిసింది. అయితే.. ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తి విరుద్ధమని, వీటిని ఎన్నికల సంఘం నిరోధించాల్సిన అవసరముందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
తాగిన మైకంలో ఒకరి ఆత్మహత్య
ఉట్నూర్రూరల్: తాగిన మైకంలో ఒకరు ఆత్మహ త్య చేసుకున్న ఘటన మండలంలోని పాత ఉట్నూర్లో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాత ఉట్నూర్లో నివాసముండే రా థోడ్ నూర్సింగ్ (63) మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించి తరచూ కుటుంబ సభ్యులతో గొ డవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి మద్యం సేవించి వచ్చి గొడవకు దిగాడు. కుటుంబ సభ్యులు సర్ధి చెబుతుండగా అకస్మాత్తుగా కింద పడ్డాడు. ఈ సమయంలో అతడి తలకు దెబ్బ తగలగా ఆస్పత్రికి వెళ్తామని చె ప్పినా వినలేదు. ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఇంటిలోని గది లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన స్థానిక ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలి పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కుష్ఠువ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
మంచిర్యాలటౌన్: కుష్ఠువ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్బాబు అన్నారు. జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు, జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాలపై శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్యులు, నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డాక్టర్ జాన్బాబు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 87 కుష్ఠువ్యాధి కేసులు నమోదు అయ్యాయని, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించి, మందులు వాడేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అనిత, ప్రోగ్రాం ఆఫీసర్ ఏ.ప్రసాద్, జిల్లా ఉప వైద్యాధికారి సుధాకర్నాయక్, డీపీఎంవో రాఘవయ్య, చారి, సకలరెడ్డి, డీపీవో ప్రశాంతి పాల్గొన్నారు. -
ఊపందుకున్న నామినేషన్ల దాఖలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లో నామినేషన్ల దాఖలు ఊపందుకుంది. దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లోని ఆయా క్లస్టర్లలో రెండో రోజు శుక్రవారం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం చివరి రోజు కావడంతో భారీగా దాఖలు చేసే అవకాశం ఉంది. మొదటి రోజు గురువారం సర్పంచ్ స్థానాలకు 25, రెండో రోజు శుక్రవారం 99 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తంగా నామినేషన్ల సంఖ్య 124కు చేరింది. ఇక వార్డు సభ్యుల స్థానాలకు మొదటి రోజు 14న రెండో రోజు 222 నామినేషన్లు వేశారు. వాటి సంఖ్య మొత్తంగా 236కు చేరింది. కాగా, ఆయా మండలాల్లోని 90 గ్రామ పంచాయతీలు, 816 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు డిసెంబర్ 11న జరగనుండగా 1,28,694 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సమయం పాటించాలి : కలెక్టర్ దండేపల్లి: నామినేషన్ల స్వీకరణలో సమయం కచ్చితంగా పాటించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కొర్విచెల్మ, నెల్కివెంకటాపూర్, ద్వారక, మేదరిపేట, దండేపల్లిలో నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. ఎన్ని నామినేషన్లు వచ్చాయని ఆర్వోలను అడిగి తెలుసుకున్నారు. చివరి రోజు నామినేషన్లువేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఐదు గంటల్లోపు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి వరుస క్రమంలో నామినేషన్లు తీసుకోవాలని, సమయం దాటిన తర్వాత ఎవరినీ లోనికి అనుమతించొద్దని తెలిపారు. ద్వారక ఉన్నత పాఠశాల ఆవరణలో హాస్టల్ భవనం పనులను పరిశీలించారు. దండేపల్లిలో జీపీ భవనం అసంపూర్తిగా ఉండడంపై ఎంపీడీవో ప్రసాద్తో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేయించాలని సూచించారు. పరిశీలించిన అదనపు కలెక్టర్ లక్సెట్టిపేట: మండలంలోని జెండావెంకటాపూర్, చందారం గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య శుక్రవారం పరిశీలించారు. అభ్యర్థుల పూర్తి వివరాలు పరిశీలించాలని, ఎలాంటి ఇబ్బందులున్నా తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్కుమార్, ఎంపీడీవో సరోజ పాల్గొన్నారు.నామినేషన్ల వివరాలు... మండలం గ్రామాలు నామినేషన్లు వార్డులు నామినేషన్లుదండేపల్లి 31 34 278 68 హజీపూర్ 12 07 106 23 జన్నారం 29 34 272 96 లక్సెట్టిపేట 18 24 160 35 మొత్తం 90 99 816 222 -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లు, పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ, ఫలితాలు వంటి ప్రతీ అంశంపై ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో బెల్లంపల్లి సబ్కలెక్టర్ మనోజ్, అదనపు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, నోడల్ అధికారి శంకర్తో కలిసి 2వ, 3వ విడత రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియపై ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అవసరమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. నామినేషన్లు పరిశీలించి అర్హులు, అనర్హుల జాబితాలో పూర్తి వివరాలతో రూపొందించాలని అన్నారు. ఎన్నికల గుర్తుల కేటాయింపులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు, అధికారులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని పరిశీలన లక్సెట్టిపేట: మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం పరిశీలించారు. రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి తీసుకురావాలని తెలిపారు. సన్నరకానికి మద్దతు ధరతోపాటు బోనస్ రూ.500 వస్తాయని తెలిపారు. -
హాస్టల్లో అరకొరగా భోజనం
మంచిర్యాలఅర్బన్: అరకొర భోజనం సరిపోక అర్ధాకలితో అలమటిస్తున్నామని, వంటవాళ్లు సమయానికి రాకపోవడంతో తామే వంట చేసుకుంటున్నామని నగరంలోని సాయికుంట బీసీ సమీకృత వసతిగృహ విద్యార్థులు శుక్రవారం డీబీసీడీవో భాగ్యవతికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం ఆమె హాస్టల్ తనిఖీకి వెళ్లగా అల్పాహారం(అటుకులు) విద్యార్థులందరికీ అందకపోవడంతో వార్డెన్పై మండిపడ్డారు. అప్పటికప్పుడు అటుకుల టిఫిన్ తయారు చేయించి పెట్టగా విద్యార్థులు బడికి ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. గురువారం చికెన్తో భోజనం సరిపడా లేకపోవడంతో కోడిగుడ్లు వండి వడ్డించిన ఘటన మరవకముందే మరోసారి ఇలా చేయడమేంటని ప్రశ్నించారు. అక్కడే ఉన్న పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, ఏఐఎస్బీ కార్యదర్శి సన్నీగౌడ్ వార్డెన్, వసతిగృహ ఉద్యోగుల విధి నిర్వహణలో అలసత్వం, నిబంధనల ప్రకారం మెనూ అమలు చేయకపోవడంపై ఫిర్యాదు చేశారు. నిర్వహణ అస్తవ్యస్తం బీసీ సమీకృత(ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కలిపి) బాలుర వసతిగృహ పర్యవేక్షణ అస్తవ్యస్తంగా మారింది. 201 మంది విద్యార్థులు ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ముగ్గురు వార్డెన్లు, వాచ్మెన్, కామటీ, వంటమనిషి ఒక్కో హస్టల్కు ముగ్గురు చొప్పున 12 మంది విధులు నిర్వర్తించాలి. రెగ్యులర్ ఎస్టీ వసతిగృహ వార్డెన్ జన్నారం, వాచ్మెన్ను సిర్పూర్కు డిప్యూటేషన్ ఇచ్చారు. ఎస్టీ వసతిగృహం వంటమనిషి పనిచేస్తోంది. బీసీ వసతిగృహం నుంచి ఇద్దరు ఔట్ సోర్సింగ్ వంటకార్మికులు, వాచ్మెన్ ఉన్నారు. ఎస్సీ వార్డెన్ ఉన్నా సరుకులు, భోజనం నిర్వహణ బీసీ వార్డెన్ పెత్తనం సాగుతోంది. వార్డెన్ చెప్పినట్లుగా కూరగాయల నుంచి అరటిపండ్ల వరకు విద్యార్థులే కొనుగోలు చేసి తీసుకొస్తారని తెలుస్తోంది. ఇటీవల డీబీసీడీవో తనిఖీ సమయంలో రిజిష్టర్లో ఉద్యోగుల హాజరు ఏరోజుకారోజు లేకపోవడంపై చివాట్లు పెట్టారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కార్యాలయంలో ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధుల నిర్వహిస్తున్నారు. వసతిగృహాల్లో పనిచేసేందుకు తీసుకున్న ఉద్యోగులు కార్యాలయానికి పరిమితం కావడంపై భిన్నాభిప్రాయాలున్నాయి. బీసీ సమీకృత వసతిగృహనికి సర్దుబాటుకు అవకాశం లేకపోలేదు. డిప్యూటేషన్పై వెళ్లిన ఎస్టీ వసతిగృహం వార్డెన్, వాచ్మెన్లను వెనక్కి పిలిపిస్తే కొంత మేర సమస్య తీరనుంది. -
మధుకర్ కేసులో నిందితులను అరెస్టు చేయాలి
మంచిర్యాలటౌన్: వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్య కేసులో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీస్ యంత్రాంగం గతంలో నిందితులను అరెస్టు చేయడంలో జాప్యం చేయడం వల్ల హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, బీజేపీ న్యాయవాదుల వాదనలతో శుక్రవారం స్టే వెకేట్ చేసిందని తెలిపారు. మధుకర్ మరణానికి కారణమైన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. గతంలో నిందితులను శిక్షిస్తామని హామీనిచ్చిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అదే నిందితులతో అధికారిక కార్యక్రమాలు చేపట్టి, వారికి బాసటగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పానుగంటి మధు, తిరుపతి, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
పూలే ఆశయ సాధనకు పాటుపడాలి
పాతమంచిర్యాల: సమాజంలోని నిమ్న వర్గాల న్యాయమైన హక్కుల కోసం సామాజిక న్యాయ పోరాటం చేసిన మహాత్మా జ్యోతిభా పూలే ఆశయసాధనకు అందరూ పాటుపడాలని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పూలే భవన్లో మహాత్మాజ్యోతిభా పూలే 135వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ పూలే పోరాటాల ఫలితంగానే నేడు బడుగు బలహీన వర్గాల ప్రజలు సమాజంలో గౌరవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి కనికరపు రాజన్న, సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ మేధావుల ఫోరం జిల్లా కో అర్డినేటర్ కొండయ్య, డీహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచన్న తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రవేత్తల చేతుల్లో దేశ భవిష్యత్
నస్పూర్: దేశ భవిష్యత్ శాస్త్రవేత్తల చేతుల్లో ఉందని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. నగరంలోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో బుధవారం ప్రారంభమైన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమం శుక్రవారం ముగిసింది. విజేతలకు అదనపు కలెక్టర్ చంద్రయ్య బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ ఇన్స్పైర్లో పాల్గొన్న ప్రతీ విద్యార్థి ఒక జూనియర్ శాస్త్రవేత్త అని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. అంతకుముందు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీఈఓ యాద య్య, జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, ఎంఈఓ పద్మజ, ట్రస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, నస్పూర్ పట్టణ అధ్యక్షుడు మైదం రామకృష్ణ, నాయకులు రామకృష్ణరెడ్డి, ఉపేందర్, దేవయ్య, సతీష్రెడ్డి, సిద్దయ్య పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి ఇన్స్పైర్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు ఉత్తమ ప్రాజెక్టులు ప్రదర్శించిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఫర్హజ్(బెల్లంపల్లి), కారెంగుల కీర్తన(భీమిని), జిల్లపల్లి అభిరామ్(చెన్నూర్), లవుడ్య అక్షర(జన్నారం), సహిస్త(దేవాపూర్), కామెర సాయితేజ(కాసిపేట), టేకుమట్ల హరిప్రియ(మంచిర్యాల), శ్రీరాంబట్ల సాయి విగ్నేష్(మంచిర్యాల), మెడం అశ్విత్ వర్మ(మంచిర్యాల), గొల్లపల్లి శ్రీసాన్వి(మందమర్రి), గంగిసెట్టి ప్రశాంత్ జీవన్(రామకృష్ణాపూర్), టీఎల్టీ(టీచర్ లెర్నింగ్ మెటీరియల్)లో ఇద్దరు ఉపాధ్యాయులు గంప శ్రీనివాస్(కాసిపేట), ఇ.మల్లేశ్(మందమర్రి), సెమినార్లో ఇద్దరు విద్యార్థులు మంతెన అభిగ్న(కలమడుగు), శాన్వి లక్ష్మి(తాండూర్) వీరితోపాటు డీఎల్బీవీలో మరో 28 మంది విద్యార్థులు రాష్టస్థాయి పోటీలకు ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపారు. -
ఘనంగా దుర్గామాత పూజలు
కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట గనిపై శుక్రవారం ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మైసమ్మతల్లి(దుర్గామాత) పూజలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, కార్మిక దంపతులు హోమం, ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్య అతిథిగా మందమర్రి జీఎం రాధాకృష్ణ హాజరై పూజల్లో పాల్గొన్నారు. అధికారులు, రాజకీయ పార్టీ, కార్మిక సంఘాల నాయకులు తరలిరావడంతో గని ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారుల నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఏజెంట్ రాంబాబు, వివిధ గనుల మేనేజర్లు మేనేజర్ సతీష్, అల్లావుద్దీన్, సునిల్కుమార్, డెప్యూటీ మేనేజర్ నిఖిల్ అయ్యర్, హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్, సీఐటీయూ నాయకుడు రాజిరెడ్డి, టీబీజీకేఎస్ నాయకుడు మేడిపల్లి సంపత్, ఐఎన్టీయూసీ నాయకుడు బన్న లక్ష్మణ్దాస్, మల్లేష్ పాల్గొన్నారు. -
పల్లె వెలుగు.. ఎక్స్ప్రెస్ చార్జీ
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ తీరు ఇటీవల కాలంలో వివాదాస్పదంగా మారుతోంది. పల్లెవెలుగు బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు తగిలించి తిప్పడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎక్స్ప్రెస్ చార్జీ వసూలు చేయడంపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలు దూరప్రాంత మార్గాల్లో ఎక్స్ప్రెస్ బస్సులు రద్దు చేయగా.. మరికొన్ని మార్గాల్లో పల్లెవెలుగు బస్సులకే ముందు భాగంలో ఎక్స్ప్రెస్ కలర్, బోర్డులతో తిప్పి అధిక చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. పల్లెవెలుగు బస్సులు ప్రతీ స్టేజీలో రెండు నిమిషాలు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లాలి. మార్గమధ్యంలో చెయ్యి ఎత్తిన చోట ఆపడం, కోరిన చోట దించడం చేస్తుంటారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యంగా, టికెట్ చార్జీ తక్కువగా ఉంటుంది. ఎక్స్ప్రెస్గా మార్చడం వల్ల చాలా స్టేజీల్లో నిలపకుండా వెళ్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు బస్సుల్లేక గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. పల్లెవెలుగు బస్సులతో పోల్చితే ఎక్స్ప్రెస్ చార్జీలు ఎక్కువగా ఉంటాయి. బస్సు పక్కన చూస్తే పల్లెవెలుగు కనిపిస్తుంది. ఎవరైనా హడావుడిలో బస్సు ఎక్కితే అంతే సంగతులు. పల్లెవెలుగు బస్సు కదా అంటే ముందు చూడలేదా..? ఎక్స్ప్రెస్ అనే సమాధానం రావడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. ఉదాహరణకు.. లక్సెట్టిపేట నుంచి మంచిర్యాలకు వచ్చే పల్లెవెలుగు(ఎక్స్ప్రెస్) బస్సు దొనబండ, హాజీపూర్ స్టేజీల్లో మాత్రమే నిలుపుతారు. పల్లె వెలుగు అనుకుని ఎక్కితే మార్గమధ్యంలో ఎక్కడ నిలిపినా చార్జీలు తడిసి మోపెడవుతాయి. మంచిర్యాల నుంచి హాజీపూర్కు పల్లెవెలుగుకు రూ.30 కాగా, ఎక్స్ప్రెస్కు రూ.40, లక్సెట్టిపేటకు రూ.30 టికెట్ చార్జీలు ఉండగా.. ఎక్స్ప్రెస్కు రూ.50 చార్జీలు వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. ఏ బస్సు ఏ రూట్లో ఎక్కడికి వెళ్తుంది..? పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్ అనే వివరాలు, కిలోమీటర్లు, ఆదాయం పొందుపరిచే ఎస్ఆర్(స్టార్)లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. ఎస్ఆర్లో కచ్చితంగా రాసిన చోటుకు మాత్రమే బస్సు నడపాలి. బస్సు వివరాలు లేకుంటే రాకపోకలు సాగించిన సమయంలో ఏదైనా జరిగితే ఉద్యోగుల(డ్రైవర్, కండక్టర్)కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇదేంటని ప్రయాణికులు నిలదీస్తే అధికారులు తమకు తెలియదంటూ తప్పించుకునే వీలులేకపోలేదు. ఎస్ఆర్లో వివరాలు నమోదు చేయకుండా నోటిమాటగా వచ్చిన ఉద్యోగులకు అన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. లబోదిబోమంటున్న ప్రయాణికులు చెన్నూర్: మంచిర్యాల నుంచి సిరోంచ, కాళేశ్వరానికి రాకపోకలు సాగిస్తున్న ఆర్టీసీ బస్సు రెండు రంగులతో ప్రయాణికులను గందరగోళానికి గురి చేస్తోంది. ఓ వైపు పల్లెవెలుగు అని ఉండడంతో ఆర్డినరీ బస్సు అనుకుని ఎక్కితే ఎక్స్ప్రెస్ చార్జీ వేస్తుండడంతో ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాల నుంచి చెన్నూర్కు పల్లెవెలుగు బస్సు చార్జీ రూ.50 ఉండగా ఎక్స్ప్రెస్కు రూ.70 ఉంది. మంచిర్యాల నుంచి చెన్నూర్ మీదుగా కాళేశ్వరం వెళ్లే బస్సుకు ముందు భాగంలో ఎక్స్ప్రెస్ కలర్ వేసి దోపిడీ చేస్తున్నారని ప్రయాణికులు సాగర్, రమేశ్ ఆరోపించారు. ఈ విషయమై ఆర్టీసీ డీఏం శ్రీనివాస్ను సంప్రదించగా.. ఎక్స్ప్రెస్ బస్సులు తక్కువగా ఉండడంతో కండీషన్ ఉన్న బస్సులకు ఎక్స్ప్రెస్ చార్జీ తీసుకుంటున్నామని తెలిపారు. కొత్త బస్సులు వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్లు నడిపిస్తామని పేర్కొన్నారు. -
ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
జైపూర్: ప్రశాంత వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి సందర్శించారు. నర్వ, శివ్వారం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు, వసతులు పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్లో జైపూర్, భీమారం, శ్రీరాంపూర్ పోలీస్స్టేషన్ల సిబ్బందికి ఎన్నికల నియమావళిపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని అన్నారు. డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు నవీన్కుమార్, శ్రీలత, ఎస్సైలు శ్రీధర్, సంతోశ్, శ్వేత, తదితరులు పాల్గొన్నారు. -
● పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రత్యేకం ● బ్యాలెట్లో చేర్చిన ఎన్నికల అధికారులు
ఎన్నికల గుర్తులు సిద్ధంమంచిర్యాలరూరల్(హాజీపూర్): మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గుర్తులు సిద్ధంగా ఉన్నాయి. సర్పంచ్గా అభ్యర్థుల బ్యాలెట్ పేపర్ గులాబీరంగులో, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్ తెలుపురంగులో ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్పేస్ట్, స్పానర్, కప్పు సాసర్, విమానం, బంతి, షటిల్, కుర్చీ, వంకాయ, బ్లాక్ బోర్డు, కొబ్బరికాయ, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, క్యారెట్, గొడ్డలి, గాలి బుడగ, బిస్కట్, వేణువు, ఫోర్కు, చెంచా గుర్తులు కేటాయించారు. వీటికింద నోటా గుర్తు విధిగా ఉంటుంది. వార్డు సభ్యుల గుర్తులు జగ్గు, గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, గాజు గ్లాసు, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటెనా, గరాటా, మూకుడు, కేటిల్, విల్లు–బాణము, కవరు, హాకీ బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పోస్టుడబ్బా, విద్యుత్ స్తంభం గుర్తులు ఉన్నాయి. వీటి కింద కూడా నోటా గుర్తు ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు‘నోటా’కు చోటు..నిర్మల్ఖిల్లా/నిర్మల్చైన్గేట్: పల్లె పోరు హడావుడి ప్రారంభమైంది. గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ అభ్యర్థుల గుర్తులతోపాటు ‘నోటా’ (నన్ ఆఫ్ ది ఎబోవ్)ను అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. బ్యాలెట్ పత్రంలో ప్రత్యేకంగా పొందుపరచనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ సరైన వారు లేరని ఓటరు భావించినప్పుడు ఓటును నోటాకు వేసేందుకు అవకాశం కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ఎంతో పవిత్రమైంది. ఓటరు తన ఇష్టానుసారం నాయకుడిని ఎన్నుకోవడమే కాదు.. సరైన అభ్యర్థులు లేరని భావించినప్పుడు తిరస్కరించే హక్కు కూడా కలిగి ఉండాలనే అభిప్రాయం ఏళ్లుగా చర్చకు వచ్చిన అంశమే. ఈ నేపథ్యంలోనే ‘నోటా’ భారత ఎన్నికల వ్యవస్థలో ప్రత్యేక గుర్తింపుతో నిలిచింది. 2013 సెప్టెంబర్ 27న సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ఈ భావనకు చట్టబద్ధత లభించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో, బ్యాలెట్ పత్రాల్లో ‘నోటా’ తప్పనిసరిగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. అదే ఏడాది డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలన్నింటిలోనూ నోటాకు స్థానం కల్పించింది. లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటింగ్ యంత్రాల చివరి బటన్గా నోటా ప్రత్యక్షమైంది. నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎన్నికల ఫలితంలో మార్పేమీ ఉండదు.ఒక్క క్లిక్తో ఓటరు జాబితా ప్రత్యక్షంనిర్మల్చైన్గేట్: పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ఆన్లైన్లో ఉంచింది. సదరు వెబ్సైట్లోకి వెళ్లి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. వార్డుల వారీగా జాబితా చూడవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.tsec.gov.in వెబ్సైట్ ద్వారా తుది జాబితాను చూసుకోవచ్చు. final rolls GP/ward wise voter list an on 02-09–2025 ఆప్షన్ క్లిక్ చేసి మండలం, జీపీ ఎంచుకుంటే ఓటరు జాబితా ప్రత్యక్షమవుతుంది. క్యాప్చాకోడ్ను ఎంటర్ చేసి వార్డువైజ్ డేటాపై క్లిక్ చేస్తే మీ గ్రామ పంచాయతీలోని వార్డుల వైజ్గా ఓటరు లిస్ట్ వస్తుంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇలా ఓటరు జాబితాను సులభంగా చూసుకోవచ్చు. -
నిబంధనలు అమలయ్యేనా?
నస్పూర్/మంచిర్యాలక్రైం: ప్రస్తుత మద్యం పాలసీ ఈ నెల 30తో ముగియనుంది. 2025–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త మద్యం పాలసీ డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ప్రభుత్వానికి ఆదాయ నిధిగా ఉన్న ఎకై ్సజ్శాఖ అమ్మకాలపై చూపిస్తున్న శ్రద్ధ కొత్త మద్యం పాలసీ నిర్వహణలో మద్యం షాపుల ఏర్పాటుపై ఎకై ్సజ్ శాఖ నిబంధనలు అమలు చేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది. జిల్లాలోని ప్రధాన పట్టణ కేంద్రాల్లో గ తంలో జనావాసాలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళనలు చేసిన ఘటనలు ఉన్నాయి. అయినా ఎకై ్సజ్ శాఖ అధికారులు అవేం పట్టవన్నట్లుగా మద్యం వ్యాపారులకు వత్తాసు పలుకుతూ వారికి అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తూ ‘మామూలు’గా తీసుకున్నార నే ఆరోపణలు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ని ర్వహణలోనైనా నిబంధనలు అమలు చేస్తారా? మా మూలుగానే వదిలేస్తారా? అనే చర్చ జరుగుతోంది. పాత మద్యం పాలసీలో నిబంధనలు తూచ్... ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్ జోన్స్, దేవాలయాలు, మసీదులు, చర్చిలకు 100 మీటర్ల దూరంలో, గ్రామాల్లో జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలి. 50 స్క్వేర్ మీటర్లు కలిగిన రూంలో సిట్టింగ్ ఏర్పాటు చేసుకోవాలి. వాటర్ బాటిళ్లు, కూల్డ్రింక్స్, తినుబండారాలు విక్రయించకూడదు. కానీ జిల్లాలో ఎక్కడా ఈ నిబంధనలు అమలు కాకపోవడం గమనార్హం. జిల్లా కేంద్రంలో ప్రశాంతి హాస్పటల్ పక్కనే ఓ వైన్స్ కొనసాగుతోంది. కాలేజ్ రోడ్, హమాలివాడ, ఐబీ సమీపంలో లక్సెట్టిపేటరోడ్లో ఉన్న వైన్స్లు హాస్పటల్స్కు దగ్గరలోనే, రోడ్డుపక్కనే ఉన్నాయి. నస్పూర్ పరిధిలో ప్రస్తుతం 9 మద్యం దుకాణాలు ఉండగా ఆరు జాతీయ రహదా రికి ఆనుకుని ఉన్నాయి. సీసీసీలోని రాయల్ గార్డెన్ సమీపంలో స్కూల్స్ జోన్ పరిధిలో రెండు మద్యం దుకాణాలు, ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త మద్యం పాలసీలో జనవాసాలకు దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చే యాలని, ప్రభుత్వ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. క్లస్టర్ తొలగింపుతో వ్యాపారుల్లో ఊరట...ఈసారి పట్టణాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎకై ్సజ్ శాఖ క్లస్టర్ విధానాన్ని తొలగించింది. మద్యం దుకాణం లక్కీ డ్రాలో వస్తే పట్టణం, నగరాల్లో ఎక్కడైనా దుకాణం ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. బడి, గుడి, హాస్పిటల్స్కు వంద మీటర్ల దూరం అనేది అమలులో ఉంది. ఇది కచ్చితంగా పాటించాల్సిందే. మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో నేషనల్ హైవే, స్టేట్హైవే పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. దీంతో మంచి అడ్డాలపై దుకాణాలు ఏర్పాటు చేసేందుకు కన్నేస్తున్నారు.నిబంధనల మేరకే.. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవాలి. సమాచారం ఎకై ్సజ్ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. గుడి, బడి, ప్రభుత్వ అనుమతితో నడపబడుతున్న ప్రైవేటు హాస్పటల్స్కు వంద మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. పరిశీలించిన తర్వాతనే లైసెన్స్ జారీ చేస్తాం. – కేజీ నందగోపాల్, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి, మంచిర్యాల -
మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య
ఉట్నూర్రూరల్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగాపూర్కు చెందిన సయ్యద్ యూసుఫ్ (58)కు సంతానం కాకపోవడంతో మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. బుధవారం సాయంత్రం మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన అతని భార్య భాను స్థానికుల సాయంతో ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య భాను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రైలు కిందపడి ఒకరు...మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్నగర్కు చెందిన రాళ్లబండి వెంకటి (55) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై మహేందర్ తెలిపారు. వెంకటి ఆరు నెలల క్రితం ద్విచక్రవాహనంపై నుంచి కిందపడడంతో తొంటి విరిగింది. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతున్నాడు. గురువారం స్థానిక గోదావరి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటికి భార్య రాజేశ్వరి, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జీఆర్పీ ఎస్సై తెలిపారు. అనారోగ్య సమస్యలతో..సారంగాపూర్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకుడు మండలంలోని చించోలి(బి) సమీపంలో ఉరేసుకున్నాడు. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండకు చెందిన ఆల్వేకర్ చరణ్ (25)కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం నిర్మల్కు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి సారంగాపూర్ మండలం చించోలి(బి) గ్రామ సమీపంలోని మహబూబాఘాట్స్ వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. గురువారం పశువుల కాపరులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని సోదరుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిప్పు.. భూసారానికి ముప్పు
చెన్నూర్రూరల్: ఏటా వరికోతలు పూర్తికాగానే పొలంలో ఉండే వరికొయ్యలు, ఇతర మూ లా లకు రైతులు నిప్పుపెడుతుంటారు. దీంతో పంటచేనులో భూసారం బుగ్గిపాలవుతుందని వ్య వసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పొలాలను హార్వెస్టర్లతో కోయించడంతో వరిగడ్డి(పశుగ్రాసం)కొయ్యలు ఎక్కువ మొత్తంలో మిగిలి ఉంటున్నాయి. పొ లం పనులు మొదలు పెట్టే రైతులు వ్యర్థాలు ఉండకూడదని పంట మూలాలకు నిప్పంటించి మళ్లీ సాగుకు సిద్ధం అవుతున్నారు. గతంలో వ్యవసాయ కూలీలతో వరి కోతల ప్రక్రియ చేపడుతుండటంతో ఎలాంటి కుదుళ్లు లేకుండా నేల మట్టంగా కోసేవారు. ప్రస్తుత తరుణంలో కూ లీల కొరత ఉండటంతో చిన్నపాటి రైతులు కూ డా యంత్రాలతో పంటను కోయిస్తున్నారు. దీంతొ సుమారు అడుగు నుంచి అడుగున్నర మేర వరికొయ్యలు మిగిలి పోతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు వాటిని కాల్చివేస్తున్నారు. ఇ లాంటి చర్యలతో భూమిలో సారం తగ్గి పోవడమే కాకుండా, పంటకు మేలు చేసే క్రిములు కూడా పూర్తిగా నశించే పోయే ప్రమాదం ఉంది. వరికొయ్యలకు నిప్పుతో భూసారానికి ఎంత ముప్పు కలుగుతుందనే విషయాలపై అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది.వరికొయ్యలు కాల్చొద్దు కోతలు ముగిసిన తర్వాత వరి కుదుళ్లను దుక్కిలో కలిపి దున్నితే భూసార విలువలు పెరుగుతాయి. నిప్పు పెడితే భూసారం దెబ్బతింటుంది. దున్నే ముందు నీటితడులు అందించి భూమి నానిన తర్వాత అందులోనే కలియ దున్నితే భూమిలో ఉండే మెగ్నీషియం, కాల్షియం, సూక్ష్మజీవులు పంటకు మేలు చేస్తాయి. అలాగే పొలంలో జీలుగ పంట వేసి కలియ దున్నితే మంచి ఎరువుగా ఉపయోగ పడుతుంది. – బానోతు ప్రసాద్, ఏడీఏ, చెన్నూర్ -
పీఎస్సార్కు ఘన స్వాగతం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుకు గురువారం మంచిర్యాలకు రాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కలెక్టరేట్లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. నాయకులు ఘనస్వాగతం పలికి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో సర్పంచ్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించారు. దసరా పండుగ వరకు మంచిర్యాలలో ఉన్న ఎమ్మెల్యే ఆ తర్వాత హైదరాబాద్కు వెళ్లి అక్కడే ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన విషయం తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం కోయంబత్తూర్కు వెళ్లిన ఆయన ఇటీవల హైదరాబాద్కు పూర్తి ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాలకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, విజయానికి చేపట్టాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. -
కేసీఆర్ పోరాట ఫలితమే రాష్ట్రం ఏర్పాటు
నస్పూర్: కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. గురువారం నస్పూర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్నే మలుపు తిప్పిందని అన్నారు. కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధన ఉద్యమంలో పోరాడారని తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో చేపట్టే దీక్షా దివస్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, టీబీజీకేఎస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ కేసీఆర్ యావత్ తెలంగాణను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని ముందుకు సాగించారని అన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చిన్నారులను ఆకట్టుకునేలా బడి
మంచిర్యాలఅర్బన్: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ముస్తాబవుతున్నాయి. పాఠ్యాంశాలకు సంబంధించిన బొమ్మలు, వివిధ రకాల చిత్రాలు విద్యార్థులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో అధునాతన వసతులు సమకూరుతున్నాయి. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ ఏడాది నుంచే ప్రీప్రైమరీ విద్య ఐదేళ్లలోపు చిన్నారులకు బోధన సాగుతోంది. బోధనభ్యసన సామగ్రి సమగ్ర శిక్ష అధికారులు సమకూరుస్తున్నారు. ఆటపాటలతో బోధనకు సామగ్రి దోహదపడనుంది. బాలలకు ఏకరూప దుస్తులు అందించనున్నారు. పూర్వ విద్యాబోధనకు నిధులు జిల్లాలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ అమలవుతోంది. మూడు పీఎంశ్రీ ప్రీప్రైమరీ పాఠశాలలు(రూ.1.50లక్షలు) మినహాయిస్తే ఈ ఏడాది ప్రారంభమైన 31న స్కూళ్లలో ఒక్కోదాని కి రూ.1.70లక్షలు కేటాయించారు. గత ఏడాది ప్రారంభమైన 10 స్కూళ్లకు రూ.50వేల చొప్పున ఇచ్చారు. వీటితో సామగ్రి, బోధనభ్యాస సామగ్రి కొనుగోలు చేయనున్నారు. తరగతి గదుల గోడలపై రంగులతో కూడిన చిత్రాలు వేసే పనులు చకచకా సాగుతున్నాయి. రూ.20వేలతో చిన్నారులకు ఏకరూప దుస్తులు, స్టేషనరీ సమకూర్చాల్సి ఉంది. ఆటపాటలతో బోధనభ్యాసనకు ఆటపరికాలు వినియోగించాల్సి ఉంది. ఇందుకు అవసరమైన టెండర్ను పూర్తి చేయగా ఒకట్రెండు రోజుల్లో ఆటపరికరాలు, ఫర్నిచర్ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఆయా పాఠశాలల తరగతి గదులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. గతేడాది నుంచి ప్రారంభమైన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో సామగ్రి కొనుగోలు చేయగా ప్రస్తుతం కేటాయించిన రూ.50వేలతో గదులపై రంగుల చిత్రాలు వేసి చిన్నారులను ఆకర్షించనున్నారు. ఆయా పాఠశాలల్లో నియమించిన ఇన్స్ట్రక్టర్లకు ఈ నెల 25న శిక్షణ ప్రారంభించగా.. ఈ నెల 29వరకు కొనసాగుతుంది. రాష్ట్ర స్థాయిలో తర్ఫీదు పొందిన వారు ఆటపాటలతో బోధనపై శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులను పాఠశాలలకు ఆకర్షితులను చేయడం ఎలా..? కృత్యధార బోధన, ఆటపాటలతో బోధించడం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
లక్సెట్టిపేట: గ్రామ సర్పంచ్ ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండలంలోని పోతపల్లి, గుల్లకోట, చందారం గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. నియమావళి ప్రకారం నామినేషన్లు స్వీకరించాలని, కేంద్రాల్లో అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇటిక్యాల గ్రామ సమీపంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, స్థానిక ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలోని మార్చూరీ నిర్మాణాన్ని పరిశీలించారు. ఆర్డీవో శ్రీనివాస్రావు వెంకట్రావుపేట గ్రామంలోని నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్కుమార్, ఎంపీడీవో సరోజ అధికారులు పాల్గొన్నారు. -
● నిబంధనల ప్రకారం 150 ● నాలుగేళ్లుగా వందతోనే సరి.. ● వచ్చే ఏడాది సంఖ్యపై ఆశలు ● 2022లో మంచిర్యాల కాలేజీకి అనుమతులు
ప్రభుత్వ మెడికల్ కాలేజీ నూతన భవనంమంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వసతులు సమకూరుతున్నాయి. ఫలితంగా వచ్చే విద్యాసంవత్సరం సీట్ల సంఖ్య పెంపుపై ఆశలు నెలకొన్నాయి. 2022లో మెడికల్ కాలేజీకి అనుమతి రాగా.. అదే ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం సీట్లు కేటాయించి భర్తీ చేశారు. కళాశాల భవనానికి అప్పటికి స్థలం కేటాయించకపోవడంతో జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ఉన్న మంచిర్యాల మార్కెట్ యార్డును తాత్కాలిక మెడికల్ కాలేజీగా మార్చారు. మూడేళ్లుగా అందులోనే నిర్వహిస్తున్నారు. జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) నిబంధల ప్రకారం ప్రతీ మెడికల్ కాలేజీకి 150 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తారు. మంచిర్యాల కాలేజీలో పూర్తి స్థాయిలో వసతులు లేవని మొదటి సంవత్సరంలో కేవలం 100 సీట్లు కేటాయించి.. గత నాలుగేళ్లుగా అవే సీట్ల భర్తీతో కొనసాగిస్తున్నారు. మార్కెట్ యార్డులోని కాలేజీలో ఇన్నాళ్లూ తరగతులు అరకొర వసతులతో నిర్వహించారు. ఇటీవల గుడిపేట్లో నూతనంగా రూ.216 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజీ భవనం పనులు పూర్తి దశకు చేరాయి. దీంతో ప్రస్తుత కాలేజీలోని మూడు సంవత్సరాల విద్యార్థులను నూతన భవనంలోకి తరలించి అక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి భవనం, ఖాళీల భర్తీతోనే.. ప్రభుత్వ కాలేజీకి అనుబంధంగా మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మాతాశిశు ఆరోగ్యం కేంద్రం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడం, సరైన సదుపాయాలు లేకపోవడంతో కాలేజీ రోడ్డులో ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీ ఆవరణలోనే రూ.129.25 కోట్లతో 450 పడకల సామర్థ్యంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు. ఇది పూర్తయ్యేందుకు మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉండగా.. పూర్తయితేనే ఎన్ఎంసీ నిబంధనల మేరకు ఉన్నట్లుగా గుర్తిస్తారు. ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తి, కాలేజీలోని పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు 41మంది ఉండాల్సి ఉండగా.. 19మంది రెగ్యులర్, ఒకరు కాంట్రాక్టు పద్ధతిలో మొత్తంగా 20 మంది మాత్రమే ఉన్నారు. అసొసియేట్ ప్రొఫెసర్లు 51మందికి గాను ఇద్దరు రెగ్యులర్, ఒకరు కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తుండగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 141మందికి గాను 56మంది రెగ్యులర్, 11మంది కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారు. నూతన ఆస్పత్రి భవనం అందుబాటులోకి రావడంతోపాటు ఖాళీలను భర్తీ చేస్తేనే నిబంధనల మేరకు సీట్ల సంఖ్య పెంచేందుకు అవకాశం ఉంది. ఖాళీల భర్తీకి నివేదించాం గుడిపేట్లోని నూతన భవనంలో తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మెడికల్ కాలేజీలో ఎన్ఎంసీ నిబంధనల మేరకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి, ఖాళీలను భర్తీ చేసేలా చూడాలని ఉన్నతాధికారులకు నివేదించాం. ఖాళీలను సీనియర్ రెసిడెంట్ల(ఎస్ఆర్)తో భర్తీ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. వచ్చే ఏడాదికి 150 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించేలా చూడాలని ఎన్ఎంసీని కోరతాం. – డాక్టర్ ఎండీ.సులేమాన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్


