breaking news
Mancherial District News
-
కాంగ్రెస్ గూటికి చెన్నూర్ తాజా మాజీ చైర్పర్సన్
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాల్టీలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ అర్చన, రాంలాల్గిల్డా దంపతులు హైదరాబాద్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్య వహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పా ర్టీ సీనియర్ నాయకులు గొడిసెల బాపురెడ్డి, పెద్దింటి శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా, చె న్నూర్కు చెందిన మైనార్టీ నాయకుడు షఫీ యొద్దీన్ అనుచరులతో బీజేపీలో చేరారు. -
ఖా‘కీ’చకుడిపై సస్పెన్షన్ వేటు
మంచిర్యాలక్రైం: అతనో పోలీస్ ఉద్యోగి... అదే శాఖలో పనిచేస్తున్న అతనికంటే పెద్ద హోదాలో ఉన్న ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం ఇద్దరి దాంపత్య జీవనం సాఫీగానే సాగింది. ఫలితంగా దంపతులకు బాబు జన్మించాడు. స్థానిక రెడ్డికాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 1న అర్ధరాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవ రోడ్డున పడింది. కానిస్టేబుల్ అర్ధనగ్నంగా (డ్రాయర్పై) ఉండి నడిరోడ్డుపై భార్యను చితకబాదిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతని భార్య ఈ నెల 2న పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కానిస్టేబుల్ రవిప్రసాద్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాలను పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం రవిప్రసాద్ను సస్పెండ్ చేశారు. -
‘పది’ విద్యార్థులకు ప్రేరణ
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి విద్యార్థుల ను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక ప్రే రణ తరగతులు నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బీసీ సమీకృత వసతిగృహంలో అవగాహన తరగతులు నిర్వహించారు. పరీక్షలంటే భయాందోళన, ఒత్తిడి కి గురికా వొద్దని, ప్రణాళికతో చదివి మంచి మార్చులు సాధించాలని సూచించారు. జిల్లా వెనుకబడి న తరగతుల అభివృద్ధిశాఖ అధికారి భాగ్యవ తి, షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ ఉపసంచాలకుడు దుర్గాప్రసాద్, డీఈవో యాదయ్య, మైనార్టీ సంక్షేమాధికారి రాజేశ్వరి, ఏటీడీవో సురేశ్, మానసిక వైద్యనిపుణుడు సునీల్, టీ ఎన్జీవో ప్రతినిధి శ్రీహరి తదితరులున్నారు. -
డ్రంకెన్ డ్రైవ్ కేసులో పదిరోజుల జైలు
భీమారం: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన పోలంపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ పున్నంకు మంగళవారం చెన్నూ ర్ మున్సిఫ్కోర్టు న్యాయమూరి పర్వతపు రవి పదిరోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడమే కాకుండా పదేపదే 100 నంబర్కు కాల్చేసి పోలీసుల సమయాన్ని వృధా చేస్తున్నాడన్నారు. నిందితుడిని లక్సెట్టిపేట సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు. బస్సులో నుంచి కిందపడి ఒకరికి గాయాలు కోటపల్లి: మండలంలోని రావులపల్లికి చెందిన శేఖర్ మంగళవారం మధ్యాహ్న ం చెన్నూర్ నుంచి కొల్లూర్కు ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. కొల్లూర్ స్టేజీ వద్ద బస్సు ఆపాలని ఎంతమొత్తుకున్నా డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయా డు. స్టేజీ దాటాక బస్సు స్లో చేయడంతో దిగే క్రమంలో జారి కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. దేశీదారు విక్రయిస్తే జైలుకే.. తలమడుగు: దేశీదారు విక్రయిస్తే జైలుశిక్ష త ప్పదని ఆదిలాబాద్ ఎక్సైజ్ సీఐ రెడ్ల విజయేందర్ అన్నారు. మంగళవారం మండలంలోని కుచులాపూర్లో దేశీదారు విక్రయిస్తున్న నింది తుడిని పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి గ్రామంలో తనిఖీలు నిర్వహించగా దర్శనాల సాయినాథ్ వద్ద 96 దేశీదా రు బాటిళ్లు లభ్యమైనట్లు తెలిపారు. వాటి విలు వ దాదాపు రూ.3,840 ఉంటుందన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రెచ్చగొట్టేలా పోస్టుపెట్టిన వ్యక్తి అరెస్ట్ కై లాస్నగర్(బేల): మతాల మధ్య చిచ్చుపెట్టేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బేల మండలం చెప్రాలకు చెందిన బొట్ల వంశీయాదవ్ తన వ్యక్తిగత ఇన్స్రాగ్రామ్ అకౌంట్లో మతాల మధ్య చిచ్చుపెట్టేలా పోస్టు చేశాడని మండల కేంద్రానికి చెందిన హుజూర్ ఖాన్ బేల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వివరించారు. సమావేశంలో బేల ఎస్సై ఎల్.ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్నికల కేంద్రం.. ‘పోస్టుమార్టం’
నామినేషన్ కేంద్రంఆరుబయట సిబ్బంది కోసం భోజనాలు మృతదేహం తీసుకెళ్తున్న కుటుంబీకులులక్సెట్టిపేట: ఎన్నికల ఫలితాల్లో గెలుపోటములపై అభ్యర్థులు పోస్టుమార్టం చేస్తుంటారు. కానీ.. ఇక్కడ ఎన్నికల కేంద్రం పక్కనే మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తున్నారు. యాదృచ్ఛికమే అయినా ఆసక్తికరంగా మారింది. లక్సెట్టిపేటలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం నామినేషన్ ఉపసంహరణ, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్కు ఏర్పాట్లు చేశారు. ఇరవై రోజులుగా ఎన్నికల కార్యకలాపాలు ఇక్కడి నుంచే కొనసాగుతున్నాయి. ఇదే భవనంలో కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రి కొనసాగింది. ఆస్పత్రికి నూతన భవనం నిర్మించడంతో ఇటీవల ప్రారంభించి అందులోకి మార్చారు. మార్చురీ భవన నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో ఇక్కడ ఉన్న మార్చురీ గదిలోనే మృతదేహాలను భద్రపరుస్తూ పోస్టుమార్టం చేస్తున్నారు. మంగళవారం దండేపల్లి మండలం రాసపెల్లి గ్రామానికి చెందిన మృతదేహాన్ని ఇక్కడే భద్రపర్చి పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. మరోవైపు ఎన్నికల సిబ్బందికి ఆరుబయటనే భోజనాలు వడ్డిస్తున్నారు. -
తాండూర్లో శునకాల బీభత్సం
తాండూర్: మండల కేంద్రంలోని బస్టాండ్ ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లో మంగళవారం శునకాలు బీభత్సం సృష్టించాయి. మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్, ముక్త సదయ్య, ఆర్.రాజేశ్వరి, పి.రాజేశ్, బి.సునీల్, బి.శ్వేత, ఎల్.శోభ, ఇ.స్వర్ణలతపై దాడిచేసి గాయపర్చాయి. క్షతగాత్రులను తాండూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు.గాయాల తీవ్రత అధికంగా ఉన్న సదయ్య, రాజేశ్, లక్ష్మణ్ను బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేసినట్లు వైద్యురాలు లక్ష్మీప్రసన్న తెలిపారు. ఒకేరోజు ఎనిమిది మందిపై దాడి చేయడంతో మండల వాసులు భయాందోళనకు గురవుతున్నారు. బేలలో బాలుడిపై దాడి కై లాస్నగర్(బేల): ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపర్చిన ఘటన మంగళవారం బేల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన భోయర్ దేవాన్ష్ (4) ఇంటిబయట ఆడుకుంటుండగా నాలుగు కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి గాయపర్చాయి. బాలుడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు వచ్చి కుక్కలను తరిమేశారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో ప్రాథమిక చికిత్స అనంతరం రిమ్స్కు తరలించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి బాలుడిని పరామర్శించారు. గాయపడిన సదయ్య గాయపడిన బాలుడు -
మంచిర్యాల
Iఎన్నికల కేంద్రం.. పోస్టుమార్టం! లక్సెట్టిపేటలో ఎన్నికల కేంద్రం పక్కనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ప క్కనే ఆస్పత్రి మార్చురీ, పోస్టుమార్టం గది ఉండడంతో ఈ పరిస్థితి కనిపించింది. గీత దాటితే వేటే..! ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఆకా శం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. చలి తగ్గుతుంది. -
అప్పులు తీర్చే మార్గంలేక ఒకరు..
మంచిర్యాలక్రైం: అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల మేరకు చున్నంబట్టి వాడలోని నాగదేవత కాలనీకి చెందిన మల్యాల చిరంజీవి(46) కొంతకాలంగా ఏపనీ చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. ఈక్రమంలో కుటుంబ అవసరాలకోసం స్నేహితుల వద్ద రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. తీర్చే మార్గం లేకపోవడంతో బాధపడుతూ ఉండేవాడు. మంగళవారం ఇంట్లో ఎ వరూలేని సమయంలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
అనారోగ్యం భరించలేక వివాహిత ఆత్మహత్య
దండేపల్లి: అనారోగ్యం భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ కథనం ప్రకారం.. మండలంలోని రాసపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ పద్మ (46) కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపం చెంది మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగింది. చేపల వేటకు వెళ్లిన భర్త ఇంటికి రాగానే ‘పిల్ల లను బాగా చూసుకో.. నేను ఇక బతకను..’ పురుగుల మందు తాగానని చెప్పింది. వెంటనే అతను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున మృతి చెందింది. భర్త సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రచారం షురూ..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో కీ లక ఘట్టం ముగిసింది. నామినేషన్ల దాఖలు, పరిశీ లన, ఉపసంహరణ ప్రక్రియల తర్వాత బరిలో మి గిలిన అభ్యర్థుల సంఖ్య తేలింది. తుదిగా పోటీలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. దీంతో అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. ఇప్పటికే సోషల్మీడియాలో ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రచార రథాలతో ప్రత్యే క పాటలు, నినాదాలతో గల్లీల్లో హోరెత్తిస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో ఇంటింటా ప్రచారం మొదలు పెట్టారు. మంగళవారం వరకు ‘బీ ఫాం’లపై పంపిణీపై కొంత సందిగ్ధం నెలకొనగా, సాయంత్రం గుర్తులు కే టాయించిన నుంచి అభ్యర్థులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. ప్రత్యర్థులెవరో తేలిపోవడంతో పోటాపోటీగా ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యా రు. ఈ నెల 9వ తేదీ వరకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉండడంతో ఈ మేరకు ప్రతీ ఓటరు ను కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తమ పార్టీ టికెట్ దక్కడంతో గెలుపే లక్ష్యంగా రూ.లక్షల్లో ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. ఉపసంహరణకు బేరసారాలుమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తోపాటు జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో పోటీగా నామినేషన్లు వేసిన వారితో పలువురు రెండురోజులుగా మంతనాలు జరిపారు. ఉపసంహరణ చివరిరోజు మధ్యాహ్నం వరకు వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో పలు వార్డుల్లో హైడ్రామా కొనసాగింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు, లక్సెట్టిపేట మున్సిపాలిటీకి అధికార కాంగ్రెస్ ముందే అభ్యర్థులను ప్రకటించడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కాగా, బీఆర్ఎస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థుల్లో ‘బీ ఫాం’ కేటాయింపులపై అంతర్గతంగా విబేధాలు తలెత్తాయి. బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ‘బీ ఫాం’ విషయంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. మిగతా మున్సి పాలిటీల్లో స్వతంత్రులు, సొంత పార్టీలో రెబెల్స్ను తప్పించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు విశ్వప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొన్నిచోట్ల పలువు రు పోటీలోనే ఉన్నారు. దీంతో జిల్లాలోని ఏ మున్సి పాలిటీలోనూ ఒక్క వార్డు ఏకగ్రీవం కాలేదు. చివరి గంటలో ‘బీ ఫాం’లుమంచిర్యాల మున్సిపాల్ కార్పొరేషన్లోని 60డివిజన్లలో వివిధ పార్టీల నుంచి అభ్యర్థిత్వం ఖరారైనవారు స్వతంత్రులతో నామినేషన్ల విత్ డ్రా చేయించేందుకు నానా ప్రయత్నాలు చేశారు. మంచిర్యాలలో కార్పొరేటర్గా నామినేషన్ వేసినవారికి మధ్యాహ్నం 2గంటల వరకు ‘బీ ఫాం’లు అందజేశారు. ఇక అధికార పార్టీని అనురిస్తూ ప్రతిపక్ష పార్టీల నుంచి పలు వార్డుల్లో అభ్యర్థులు మంతనాలు జరి పారు. బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థి, బీజేపీ నుంచి డివిజన్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకొన్నారు. చివరి క్షణంలో కొందరు అభ్యర్థులు విత్డ్రా కోసం రాగా, మూడు గంటల సమయం దాటిపోయిందని అధి కారులు అనుమతించలేదు. నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో అనివార్యంగా వారు బరిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొత్తులో భాగంగా మంచిర్యాలలో సీపీఐ నుంచి ఎనిమిది స్థానాల్లో అభ్యర్థులు నామినేషన్ వేయగా చివరికి ఒక్క స్థానమే కేటాయించడంతో మిగతావారు పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని మొత్తం 22వార్డుల్లో ఎనిమిది స్థానాలు సీపీఐకి పొత్తులో అప్పగించగా, ఒక చోట బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకోలేదు. అయితే 14వార్డుల్లో బీఆర్ఎస్ పోటీలో ఉన్నప్పటికీ విత్ డ్రా చేసుకోని అభ్యర్థికి పార్టీ నుంచి ‘బీ ఫాం’ ఇవ్వలేదు. బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు పార్టీలో కష్టపడిన వారికి ‘బీ ఫాం’లు ఇవ్వలేదని తాను రాజీనామా చేస్తానని ప్ర కటించారు. పలుచోట్ల పార్టీ టికెట్లు దక్కని ఆశా వహులు ఆగ్రహంతో రగులుతున్నారు. మంచిర్యాల బరిలో 240మంది మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా 122మంది నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇందులో బీజేపీ నుంచి 48 మంది, బీఆర్ఎస్ నుంచి 37మంది, కాంగ్రెస్ నుంచి 14మంది, ఆప్, బీఎస్పీ నుంచి ఒక్కొక్కరు, స్వతంత్రులు పది మంది, సీపీఐ నుంచి ఏడుగురు, ఏఐఎఫ్బీ నుంచి నలుగురు విత్ డ్రా చేసుకున్నారు. మొత్తంగా 240మంది బరిలో ఉన్నారు. అంటే.. సగటున ఒక్కో డివిజన్లో నలుగురు చొప్పున పోటీలో ఉన్నారు. అత్యల్పంగా 54డివిజన్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరే పోటీలో ఉండడం గమనార్హం. ఐదో డివిజన్ నుంచి నుంచి అత్యధికంగా ఏడుగురు బరిలో నిలిచారు. -
ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలి
బెల్లంపల్లి: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను సక్రమంగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం బెల్లంపల్లి మున్సిపాలిటీలోని బజా రు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏ ర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం, మున్సిపల్ కా ర్యాలయాన్ని సందర్శించారు. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎ క్కడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు 08736–250501 నంబర్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ వీడియోగ్రఫీ చేయనున్నట్లు తెలిపారు. 11న పోలింగ్, అవసరమైన చోట్ల 12న రీపోలింగ్, 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం రామ్నగర్ బస్తీలో కొనసాగుతున్న మండల పరిషత్ ప్రాథమి కోన్నత పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీ లించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికా రులను ఆదేశించారు. కేజీబీవీ భవన నిర్మాణ పనులను పర్యవేక్షించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ సంపత్, పలువురు అధికారులున్నారు. కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలినస్పూర్: వరి ధాన్యం, పత్తి పంటల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టరేట్ సమవేశ మందిరంలో అదనపు కలెక్టర్తో కలిసి వ్యవసాయ, సహకారశాఖల అధికారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 2లక్షల మెట్రిక్ టన్నుల వరి ధా న్యం దిగుబడి వచ్చే అవకాశముందని తెలిపారు. రైస్ మిల్లులకు ఒక మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని సూచించారు. జిల్లా సివిల్ సప్లయ్ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, జిల్లా సహాయ అధికారులు, మార్కెటింగ్ అధికారి షాహబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
హడలెత్తించిన ఏసీబీ దాడులు
మంచిర్యాలక్రైం: కలెక్టరేట్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి హడలెత్తించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏక కాలంలో రెండు బృందాలుగా ఏర్పడి పశు సంవర్థక శాఖ కార్యాలయం, ఆ శాఖ ఏడీ శంకర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలో పనిచేస్తున్న నలుగురు పశుసంవర్ధక శాఖ వైద్యుల వద్ద నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కొంతవాటను కమీషన్ రూపంలో ఆన్లైన్ చెల్లింపులు జరిగినట్లు సమాచారం. కాగా తనిఖీల్లో 42 వివిధ రకాల బ్రాండ్లకు చెందిన మద్యం బాటిళ్లు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఎకై ్సజ్ శాఖ అధికారులకు అప్పగించారు. కాగా సోదాలు రాత్రి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయమై ఏసీబీ డీఎస్పీ మధును వివరణ కోరగా సాధారణ తనిఖీల్లో భాగమేనన్నారు. పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. -
గీత దాటితే వేటే..!
మంచిర్యాలటౌన్: మున్సిపాలిటీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో డేగకళ్లు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుంచి ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రభుత్వం, ఎన్నికల విధుల్లో ఉండే అధికార యంత్రాంగం, సిబ్బంది అందరూ ప్రవర్తనా నియమావళి అనుసరించాల్సిందే. ఎవరైనా ఉల్లంఘిస్తే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి -
ఒక్కోచోట నలుగురిపైనే..
సాక్షి, ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో డివిజన్/వార్డు స్థానం నుంచి సగటు న నలుగురిపైనే అభ్యర్థులు బరిలో ఉన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్సెట్టిపేట మున్సి పాలిటీల పరిధిలో మొత్తం 149వార్డులు/డివిజన్లుండగా 693మంది బరిలో నిలిచారు. మంచిర్యాల కార్పొరేషన్లో రెండు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ ‘బీ ఫాం’లకు పోటీ లేకుండా పోయింది. పదో డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి ‘బీ ఫాం’ అందుకున్నాక విత్డ్రా చేసుకున్నారు. ఇక మూడో వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బడికె లక్ష్మి నామినేషన్ వేశారు. నామినేషన్ ఫాంలో పార్టీ పేరు నమోదు చేయకపోవడంతో ఆమెకు బీఆర్ఎస్ మద్దతు తెలిపినా కారు గుర్తు దక్కలేదు. కాంగ్రెస్ 59 స్థానాల్లో అభ్యర్థులను దింపి ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. -
ఎకై ్సజ్ కానిస్టేబుల్కు నివాళి
మంచిర్యాలక్రైం: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎకై ్సజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కు జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో మంగళవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎకై ్సజ్శాఖ అధికారి కేజీ నందగోపాల్ మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎకై ్సజ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సౌమ్య గత నెల 23న గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో వారు కారుతో ఢీకొట్టిన ఘటనలో మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తంజేశారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సౌమ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఎక్సైజ్ సీఐలు సమ్మయ్య, గురువయ్య, ఇంద్రప్రసాద్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
మెనూ పాటించాలి
లక్సెట్టిపేట: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికలు, బాలుర వసతిగృహాలను పరిశీలించి మా ట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉ త్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని సూ చించారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. వసతిగృహంలోని వంట గదులు, రికార్డులు, పరిసరాలు పరిశీలించారు. వార్డెన్లు, ఉపాధ్యాయులున్నారు. మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని గిరిజ న బాలుర పాఠశాలను ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్ సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం, ఇతర స దుపాయాలు, సమస్యల గురించి తెలుసుకున్నారు. కంప్యూటర్ ల్యాబ్ పరిశీలించారు. ఐ టీడీఏ పల్స్యాప్ పనితీరుపై ఆరా తీశారు. -
నువ్వక్కడ.. నేనిక్కడ..!
నిర్మల్టౌన్: మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈసారి నిర్మల్ మున్సిపాల్టీలో పోటీ ఆసక్తికరంగా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భార్యాభర్తలు వేర్వేరు వార్డుల్లో బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్థానికంగా పట్టున్న కుటుంబాలు కావడంతో పార్టీల నుంచి రెండేసి సీట్లు సాధించారు. నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. మూడు జంటలు బరిలో నిలువడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అప్పాల కావ్య, గణేశ్ చక్రవర్తి నిర్మల్ మున్సిపల్ చైర్మన్ పదవి మహిళలకు కేటాయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి భార్య కావ్య 36వ వార్డు నుంచి పోటీలో దిగారు. ఆయన 37వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. ఇలా భార్యాభర్తలిద్దరూ.. పక్కపక్క వార్డులో పోటీలో ఉండి రాజకీయాల్లో ఆసక్తి పెంచుతున్నారు. అధికార పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి కావడంతో అందరి దృష్టి ఈ వార్డుపై ఉంది. 27, 39వ వార్డుల్లోనూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా 27, 39 వార్డుల నుంచి భార్యాభర్తలు పోటీలో దిగారు. వీరిద్దరూ ప్రస్తుతం తాజా మాజీ కౌన్సిలర్లు. వీరే మళ్లీ పోటీలో ఉన్నారు. 27వ వార్డు నుంచి అయేషా కౌసర్ పోటీలో ఉండగా..39వ వార్డు గుల్జర్ మార్కెట్ నుంచి ఆమె భర్త తౌహీద్ ఉద్దీన్ రఫ్ఫు పోటీలోకి దిగారు. వీరిద్దరూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 30, 40వ వార్డుల్లో.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా 30, 40 వార్డుల నుంచి భార్యాభర్తలు పోటీలో దిగారు. భర్త అయ్యన్నగారి రాజేందర్ 9వ వార్డు నుంచి నా లుగు సార్లు కౌన్సిలర్గా పనిచేశారు. ప్రస్తుతం 30వ వార్డు నుంచి పోటీలోకి దిగారు. అలాగే ఈసారి అతని భార్య మాధవిని 40వ వార్డు చింతకుంట వాడ నుంచి పోటీలోకి దించారు. అప్పాల కావ్య, గణేశ్ చక్రవర్తి అయ్యన్నగారి మాధవి, రాజేందర్అయేషా కౌసర్, తౌహీద్ ఉద్దీన్ -
ఎఫ్డీపీటీ వాహనం అడ్డగింత
జన్నారం: ఇందిరమ్మ ఇళ్లకు అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని మంగళవారం మండలంలోని ఇందన్పల్లి కుమురంభీం చౌరస్తా వద్ద ఎఫ్డీపీటీ శాంతారాం వాహనాన్ని లబ్ధిదారులు అడ్డుకున్నారు. జన్నారం అటవీ డివిజన్లోని గడ్డంగూడ, మురిమడుగు, దమ్మన్నపేట ప్రాంతాల పరిశీలనకు ఎఫ్డీపీటీ వచ్చారు. మురిమడుగుకు వస్తున్న విషయం తెలుసుకున్న ఇందన్పల్లికి చెందిన ఇందిరమ్మ లబ్ధిదారులు కుమురంభీం చౌరస్తా వద్దకు వెళ్లి వాహనాలను అడ్డుకున్నారు. ఇసుక కొరతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఆగిపోతోందని, ఇసుక తీసుకువచ్చేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ఎఫ్డీపీటీ వెంట ఉన్న రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ వారిని వారించారు. డివిజన్ కార్యాలయానికి వచ్చి సమస్య చెప్పుకొంటే పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వగా వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
భీమిని: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కన్నెపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై భాస్కర్రావు తెలిపిన వివరాల మేరకు కన్నెపల్లి మండలం నాయకునిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కుమ్మరిగూడెంకు చెందిన సోండ్ల భీమయ్య, కాంతల దంపతుల కుమారుడు సోండ్ల శంకర్ (26) మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. మద్యం మానేయాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఒంటికి నిప్పంటించుకుని యువకుడు..మామడ: మండలంలోని న్యూసాంగ్వి గ్రామానికి చెందిన పోతగంటి సంతోష్ (26) సోమవారం ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉపాధికోసం దుబాయ్ వెళ్లిన సంతోష్ ఐదురోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. మానసికస్థితి సరిగా లేనికారణంగా ఇంట్లో ఎవరులేని సమయంలో ఒంటికి నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించగా ఈఎంటీ శేఖర్ ప్రాథమిక చికిత్స అందించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ‘బడ్జెట్లో బడుగులకు తీరని అన్యాయం’తాండూర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దాగం రాజారాం ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దశ, దిశ నిర్ధేశం లేని ప్రజావ్యతిరేక బడ్జెట్ను ప్రవేశపెట్టడం శోచనీయమన్నారు. ఈ బడ్జెట్ను సీఐటీయూ తరపున వ్యతిరేకిస్తున్నామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ క్లిష్టదశకు చేరుకున్న ఈ సందర్భంలో ప్రపంచ పెట్టుబడిదారీ సంక్షోభ భారాన్ని కార్మికులు, సామాన్య ప్రజలపై నెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రజా ఆమోదయోగ్యమైన బడ్జెట్ను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నాయకులు నానయ్య, శంకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు -
పోరాటాల పొద్దుపొడుపు ‘బెల్లంపల్లి’
బెల్లంపల్లి: మున్సిపాలిటీగా అవతరించక ముందు బెల్లంపల్లి చంద్రవెళ్లి గ్రామ పంచాయతీలో అ నుబంధ గ్రామంగా కొనసాగింది. కార్మికులు, కార్మికేతర బస్తీలతో ఏర్పడి లక్షకు పైగా జనాభా కలి గిన బెల్లంపల్లి అనివార్యంగా గ్రా మ పంచాయతీ పాలనలో కొనసాగాల్సి వచ్చింది. శాంతిఖని, 44 డీప్, 68 డీప్, 65 డీప్, 24 డీప్, 2 ఇంక్లైన్, మార్గన్స్ఫిట్, సౌత్ క్రాస్కట్ భూగర్భ గనులు, 8 మెగావాట్స్ సామర్థ్యం కలిగిన పవర్ హౌజ్, వర్క్షాప్, ఆటో గ్యారేజ్ , స్టోర్, సింగరేణి ఎక్స్ప్లోరేషన్ పదికి పైగా విభాగాలతో 1980 వరకు కళకళలాడింది. సమస్యలపై నిత్యం కార్మికోద్యమాలు జరి గాయి. బాయి దొరల దాష్టీకాలు, గూండాలు, రౌడీలకు వ్యతిరేకంగా రాడికల్ విద్యార్థి, యువజనులు, సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఇతర పార్టీలు, సంఘాలు చైతన్యవంతమైన పోరాటాలు నిర్వహించారు. ఓ బాయి దొర కొడుకు రాజేశ్వరి అనే మహిళపై లైంగికదాడికి పా ల్పడి హత్యచేసిన ఘటనకు నిరసనగా యువజనులు, విద్యార్థులు, బస్తీవాసులు, రాజకీయ పక్షాలు నిర్వహించిన ర్యాలీ పోలీసు కాల్పులకు దారి తీసింది. ఆ కాల్పుల్లో ముగ్గురు మృత్యువాత పడగా పలువురు గాయపడ్డారు. ఆ తీరుగా బెల్లంపల్లి పోరాటాలకు నెలవుగా మారింది. అప్పటి స్ఫూర్తిదాయకమైన సమరశీల పోరాటాలు బెల్లంపల్లి చరిత్రకు తలమానికంగా నిలుస్తున్నాయి. సర్పంచ్ ఎన్నిక చరిత్రాత్మకం చంద్రవెళ్లి గ్రామపంచాయతీ ఏలుబడిలో ఉన్న బెల్లంపల్లి నుంచి సర్పంచ్ పదవికి కాకలు తీరిన యోధులు పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్, సీపీఐ తప్ప ఇతర ప్రధాన రాజకీయ పార్టీల ప్రభావం అంతగా ఉండేది కాదు. కాంగ్రెస్ మద్దతు దారుడిగా ప్రముఖ వ్యాపార వేత్త సోమశేఖరరావు, సీపీఐ బలపర్చిన కార్మిక నాయకుడు చిప్ప నర్సయ్య పోటీ పడ్డారు. అర్థబలం, అంగబలం కలిగిన సోమశేఖరరావుతో సింగరేణిలో మైనింగ్ సర్దార్గా పని చేస్తున్న నర్సయ్య పోటీకి దిగడం ఆరోజుల్లో పెను సంచలనమైంది. హోరాహోరీగా ఎన్నికల్లో పోటీ పడ్డారు. 1981 మే 30న జరిగిన ఎన్నికల్లో చంద్రవెళ్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా చిప్ప నర్సయ్య గెలుపొంది రికార్డు సృష్టించారు. కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న బెల్లంపల్లి అప్పట్లో ఆసిఫాబాద్ అసెంబ్లీ, సమితి ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి ఎర్రజెండాకు ఎదురు లేదని నిరూపించింది. 1987లో బెల్లంపల్లి ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కమ్యూనిస్టులు మున్సిపాలిటీపై ఎర్రజెండా ఎగుర వేయలేక పోయారు. టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వరుసగా తలో మూడుసార్లు మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు.బెల్లంపల్లి పట్టణం వ్యూ -
ఇద్దరి బైండోవర్
జన్నారం: అక్రమంగా టేకు చెట్లు నరికిన కేసులో ఇద్దరిని బైండోవర్ చేసినట్లు తాళ్లపేట రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. ఎఫ్డీవో రా మ్మోహన్రావు ఆదేశాల మేరకు జన్నారం అ టవీ డివిజన్ తాళ్లపేట రేంజ్ పరిధిలోని మహ్మదాబాద్ గ్రామానికి చెందిన కునారపు నరేష్, రోటిగూడ గ్రామానికి చెందిన సందె శ్రీనును సోమవారం జన్నారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే జైలుశిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించడం జరుగుతుందని రేంజ్ అధికారి పేర్కొన్నారు. -
ఘరానా మోసగాడి రిమాండ్
ఆదిలాబాద్టౌన్: ఘరాన మోసగాడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. సోమవారం పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన చిత్తూరి రాజశేఖర్ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బాధితుడు గాజుల అనిల్ను నమ్మించి ఫ్రాంచైజ్లో సభ్యత్వం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు. సరుకులు సరఫరా చేయకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అరెస్టు చేసి విచారించగా బోయన్పల్లికి చెందిన ద్వారకనాథ్ నుంచి రూ.2.50 లక్షలు, మెడ్చల్కు చెందిన శశికాంత్ నుంచి రూ.4.60 లక్షలు, కల్వకుర్తికి చెందిన ప్రవీణ్ వద్ద నుంచి రూ.4లక్షలు, వరంగల్కు చెందిన శివ నుంచి రూ.4లక్షలు, నర్సంపేటకు చెందిన వంశీగౌడ్ నుంచి రూ.2లక్షలు, ఆదోనికి చెందిన గౌతమ్ నుంచి రూ.4లక్షలు, నేరెడిమెట్కు చెందిన హరికృష్ణ నుంచి రూ.3లక్షలు, మహబూబ్నగర్కు చెందిన రఘురాం నుంచి రూ.4లక్షలు, ఘట్కేసర్కు చెందిన శ్రీను నుంచి రూ.4లక్షలు, కసాయిగూడకు చెందిన వెంకటేష్ నుంచి రూ.4లక్షలు, హిందూపురంకు చెందిన పవన్ నుంచి రూ.2లక్షలు, చైన్నెకు చెందిన పుష్పాంజలి నుంచి రూ.2లక్షలు, కూకట్పల్లికి చెందిన గోపిచంద్ నుంచి రూ.19 లక్షలు వసూలు చేసి సొంతానికి వాడుకున్నట్లు ఒప్పుకున్నాడు. ప్రజలు ప్రాంచెస్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఎస్సై విష్ణుప్రకాష్, సిబ్బంది కోటేశ్వర్రావు, నరేందర్లు పాల్గొన్నారు. -
సమ్మె నోటీస్ అందజేత
పాతమంచిర్యాల: కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపడుతున్నట్లు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబందం) జిల్లా గౌరవ అధ్యక్షుడు ఖలీందర్ అలీఖాన్ తెలిపారు. సోమవారం అంగన్వాడీ ఉద్యోగులతో కలిసి జిల్లా సంక్షేమాధికారి రవూఫ్ఖాన్కు సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కోడ్లుగా విభజించి కార్మికుల హక్కులను హరించే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు సురేఖ, ఉపాధ్యక్షురాలు అపర్ణ, నాయకులు కవిత, నాగమణి, పద్మావతి, కృపా, రాజవ్వ, సూరజ, అరుణ, రాజమణి, తదితరులు పాల్గొన్నారు. -
కజ్జర్లలో రూ.10 కోట్లతో గోదాం నిర్మాణం
తలమడుగు: మండలంలోని కజ్జర్ల శివారులో ఐదెకరాల స్థలంలో రూ.10 కోట్ల వ్యయంతో రై తులకు ఉపయోగపడేలా గోదాం నిర్మాణం చే పట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ కా ర్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలి పారు. సోమవారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూ పల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు తహసీల్దార్ రాజమోహన్తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారాయణరెడ్డి, ఆర్ఐ రోహిదాస్, గ్రామస్తులు శ్రీనివాస్, పోశెట్టి, పూర్ణచందర్, తిరుపతి పాల్గొన్నారు. ఆటో డ్రైవర్పై కత్తులతో దాడిబోథ్: మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఆటో డ్రైవర్ షేక్ అజీమ్పై ఆరుగురు వ్యక్తులు కత్తులతో దాడికి పా ల్పడ్డారు. బాధిత కు టుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న అజీమ్ను ఒక్కసారిగా చుట్టుముట్టిన దుండగులు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో దాడి చేశారు. గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే బోథ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యులు ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. కాగా ఈ దాడికి పాల్పడింది బాధితుడికి అత్యంత సన్నిహితులైన బంధువులేనని కు టుంబ సభ్యులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై పురుషోత్తం ఆస్పత్రిని సందర్శించి వివరాలు సేకరించారు. కాగా సంఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదన్నారు. అప్పగించిన పశువులు ఏమవుతున్నాయ్?దండేపల్లి: జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న ఆవులు, ఎడ్లు, కోడెలను సంరక్షణ ని మిత్తం పలు సందర్భాల్లో దండేపల్లి మండలంలోని మాదాపూర్ గోశాలకు అప్పగిస్తున్నారు. కానీ వీటిని కొందరు ఎలాంటి నిబంధనలు పాటించకుండా తీసుకెళ్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఓ బొలెరో వాహనంలో తరలిస్తున్న 2 ఎడ్లు, 7 కోడెలను జన్నారం సమీపంలో గోరక్షక కార్యకర్తలు పట్టుకుని పో లీసులకు అప్పగించారు. వాటిని మాదాపూర్ గోశాలకు అప్పగించగా అందులోంచి రెండు ఎడ్లను దండేపల్లి పోలీస్స్టేషన్లో పనిచేసే ఓ కానిస్టేబుల్ ఆదివారం తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇవే కాకుండా గతంలోను పోలీసులు పట్టుకుని అప్పగించిన పశువులను గోశాల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈవిషయమై గోశాల సేవకుడు వెంకటేష్ను ఫోన్లో సంప్రదించగా వివరాలు తర్వాత ఇస్తానని చెప్పి కానిస్టేబుల్ జన్నారం నుంచి వచ్చిన రెండు ఎడ్లను తీసుకెళ్లినట్లు తెలిపాడు. బీఫాం కోసం పడిగాపులు బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీ ఫామ్ కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. బీ ఫామ్ అందజేయడానికి మంగళవారం తుది గడువు కావడంతో ఎమ్మెల్యేను కలవడానికి అభ్యర్థులు తరలివచ్చారు. మున్సిపాలిటీలోని 34 వార్డుల నుంచి నామినేషన్ వేసిన కాంగ్రెస్ ఆశావహులు 180 మందికి పైగా రావడంతో ఒక్కసారిగా సందడిగా మారింది. ఈ మేరకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, ఆ ప్రక్రియ పూర్తికాగానే బీఫామ్ అందజేస్తామని తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఆర్జీయూకేటీలో బీఎఫ్ఎస్ఐ ప్రోగ్రాం
బాసర: బాసర ఆర్జీయూకేటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకోసం సోమవారం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ (బీఎఫ్ఎస్ఐ) అధికారికంగా ప్రారంభించారు. మొదటి విడతలో మొత్తం 156 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో బీఎఫ్ఎస్ఐ రంగం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ మైనర్ డిగ్రీ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ కోర్ సబ్జెక్టులతో పాటు ఆర్థిక, విశ్లేషణాత్మక, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు. విద్యార్థులు తమ కెరీర్ను మెరుగుపర్చుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఓఎస్డీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ మురళీ దర్శన్, అసోసియేట్ డీన్ (అకడమిక్స్ అండ్ ప్లానింగ్) శేఖర్ శీలం, అసోసియేట్ డీన్ (సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్) డాక్టర్ ఎస్.విఠల్, డాక్టర్ స్వాతి, జి.స్వప్నిల్, చరణ్ రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
భైంసా బల్దియా ఆ రెండు పార్టీలదే
నాటి బల్దియా చైర్మన్లు వీరే... పదవీకాలం చైర్మన్ పార్టీ 1953–65 బాపురావు మైసేకర్ కాంగ్రెస్ 1965–68 ఎండీ ఖాజా ఇబ్రహీం కాంగ్రెస్ 1968–73 ఎంఏ జబ్బార్ కాంగ్రెస్ 1981–85 దిగంబర్ మాశెట్టివార్ కాంగ్రెస్ 1987–92 దిగంబర్ మాశెట్టివార్ కాంగ్రెస్ 1995–2000 ఎండీ జాబీర్ అహ్మద్ ఏఐఎంఐఎం 2000–05 ఎండీ జాబీర్ అహ్మద్ ఏఐఎంఐఎం 2005–10 బి.గంగాధర్ టీటీడీపీ 2014–19 సబియాబేగం ఏఐఎంఐఎం 2019–25 సబియాబేగం ఏఐఎంఐఎం భైంసాటౌన్: నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ తొలుత కాంగ్రెస్ కంచుకోటగా ఉండగా, ఆతర్వాత వరుసగా ఎంఐఎం ఆ స్థానాన్ని భర్తీ చేస్తోంది. గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుంచి వరుసగా ఐదు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా, అనంతరం వరుసగా రెండుసార్లు ఏఐఎంఐఎం, మధ్యలో తెలంగాణ తెలుగుదేశం, ఆపై మళ్లీ ఇప్పటి వరకు ఏఐఎంఐఎం విజయకేతనం ఎగురవేస్తూనే ఉంది. తాజాగా 18 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపి ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. -
అనుమానాస్పదస్థితిలో ఒకరు మృతి
నేరడిగొండ: అనుమానస్పదస్థితిలో బావిలో పడి ఒక రు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లఖంపూర్ గ్రామానికి చెందిన అర్క భీంరావు (38) తన భార్యతో కలిసి నిర్మల్ జిల్లా మామడ మండలం రాయదారిలో నివాసం ఉంటున్నాడు. దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఇచ్చోడలో చదువుతుండగా, చిన్న కుమారుడు అర్క భీంరావు నానమ్మ, తాతయ్యతో కలిసి లఖంపూర్లో ఉంటున్నాడు. శుక్రవారం ఇచ్చోడలోని పెద్ద కుమారుడును చూసిన భీంరావు చిన్న కుమారుడిని చూసేందుకు లఖంపూర్ వచ్చాడు. అదేరోజు రాత్రి అతని తమ్ముడు లక్ష్మణ్ నేరడిగొండ బస్టాప్లో దించివెళ్లాడు. సోమవారం ఉదయం ఒక హోటల్ సమీపంలో దుర్వాసన రావడంతో యజమాని అక్కడికి వెళ్లి చూడగా బావిలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
నన్ను చూసైనా నేర్చుకోండి..
ఈ ఫొటోలో కనిపిస్తోంది ఆదిలాబాద్ జిల్లా కుప్టి ఘాట్రోడ్డులో జాతీయ రహదారి పక్కన నేషనల్ హైవే అధికారులు ఏర్పాటు చేసిన ప్రమాదానికి గురైన కారు. రెండు రోజుల కిత్రం కుప్టిఘాట్లో ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వెళ్లే జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన ఓ కారును ‘నన్ను చూసైనా నేర్చుకోండి’ అని సంకేతం ఇచ్చేలా వాహనదారులకు కనిపించే విధంగా 5 ఫీట్ల ఎత్తులో ర్యాంప్పై ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం ద్వారా అయినా కుప్టిఘాట్లో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టేనా? లేదా అన్నది వేచి చూడాల్సిందే మరి. – ఇచ్చోడ -
అభ్యర్థుల జాబితా తయారు చేయాలి
చెన్నూర్: మున్సిపల్ ఎన్నికల నిబంధనల ప్రకారం మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా పకడ్బందీగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం స్థానిక నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారంపై అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 11న పోలింగ్, 12న రీపోలింగ్ ఉంటే నిర్వహిస్తామని, 13న ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత విజేతల వివరాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. అనంతరం 100 పడకల ఆసుపత్రి, అమృత్ 2.0 నిర్మాణం పనులు పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. కస్తూర్బా పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, పది పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని తెలిపారు. సబ్జెక్ ఉపాధ్యాయులు ఉత్తమ ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘పది’ విద్యార్థులకు టాలెంట్ పరీక్ష
మంచిర్యాలఅర్బన్: జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సోషల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 80 ప్రభుత్వ పాఠశాలల నుంచి 173 మంది హాజరయ్యారు. తెలుగు మీడియం నుంచి జెడ్పీహెచ్ఎస్ నీల్వాయికి చెందిన అక్షిత(ప్రథమ), జెడ్పీహెచ్ఎస్ చింతగూడకు చెందిన వైష్ణవి(ద్వితీయ), కేజీబీవీ బెల్లంపల్లికి చెందిన శ్రీవాణి(తృతీయ), ఇంగ్లిష్ మీడియంలో మోడల్స్కూల్ మంచిర్యాలకు చెందిన సాయిహర్ష(ప్రథమ), జెడ్పీహెచ్ఎస్ కలమడుగుకు చెందిన జశ్వంత్(ద్వితీయ), జెడ్పీహెచ్ఎస్ దండేపల్లికి చెందిన జస్విత్, కలమడుగు జెడ్పీహెచ్ఎస్కు చెందిన ఆంజనేయప్రసాద్(తృతీయ బహుమతి) సాధించారు. విజేతలకు డీఈవో యాదయ్య బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారులు సత్యనారాయమూర్తి, భరత్కుమార్, సాంఘిక శాస్త్ర ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు మహేష్, మధుకర్, కోశాధికారి రమేశ్కుమార్, జెడ్పీ హెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి రమేష్ పాల్గొన్నారు. -
మేయర్, చైర్మన్ ఎన్నిక పకడ్బందీగా చేపట్టాలి
నస్పూర్: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణీకుముదిని అన్నారు. సోమవారం ఆమె హైదరాబాద్ నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో మేయర్, చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రకటించాలని అన్నారు. 11న పోలింగ్, 12న రీపోలింగ్, 13న ఓట్ల లెక్కింపు ఉంటాయని తెలిపారు. అనంతరం మేయర్, చైర్పర్సన్ ఎన్నిక ఎంపిక ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు జశ్వంత్, రాజేంద్రప్రసాద్, మహేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
బెల్లంపల్లి: రైల్వే కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ చైర్మన్ ఎస్.నాగరాజు, సెక్రెటరీ జి.సాంబశివుడు, కోశాధికారి షాకిన్ మీనా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అఖిల భారత కోర్కెల దినం పాటించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రైల్వేస్టేషన్లోని ఆర్ఓహెచ్ డిపో, ఇంజనీరింగ్, లోకో పైలెట్ డిపార్ట్మెంట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనిమిదో వేతన సంఘం సిఫారసులను ప్రస్తుత ఏడాది జనవరి 1 నుంచి అందరు ఉద్యోగులు, పింఛన్దారులకు అమలు చేయాలని తెలిపారు. ట్రాక్ మెయింటనర్లకు రూ.4,200 గ్రేడ్ పే మంజూరు చేయాలని, డైరెక్టు రిక్రూట్మెంట్ కోటాలోని 10శాతం పోస్టులను ఎల్డీసీఈకి కేటాయించాలని పేర్కొన్నారు. రైల్వేలోని పలు విభాగాల్లో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్, సీఎండబ్ల్యూ షెడ్ కార్మికులు, లోకో పైలెట్లు, పలు విభాగాల కార్మికులు, దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పీఎంశ్రీపై పార్లమెంట్లో ప్రశ్నించిన ఎంపీ
ఆదిలాబాద్: ప్రధాన మంత్రి (పీఎంశ్రీ) పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ్డాయనే అంశంపై ఎంపీ గోడం నగేష్ సోమవారం పార్లమెంట్లో ప్రశ్నించారు. ఈ పథకం అమలుపై ఇప్పటివరకు నిర్వహించిన మూల్యాంకన వివరాలు ఏమిటని, భవిష్యత్లో మరిన్ని పాఠశాలలకు ఈ పథకాన్ని విస్తరించే ఆలోచన ఉందా? అని అడిగారు. ఎంపీ అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి సానుకూలంగా స్పందించి భవిష్యత్లో మరిన్ని పాఠశాలలను ఈ పథకంలో చేర్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా పీఎం శ్రీ పథకాన్ని మరింత విస్తరించేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. -
సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి
మంచిర్యాలటౌన్: నూతనంగా జిల్లాకు ఎంపికై న 71మంది ల్యాబ్ టెక్నీషియన్లు విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమయపాలన పాటించాలని, తెలంగాణ డయోగ్నస్టిక్స్కు రక్త నమూనాలను సరైన మోతాదులో పంపించాలని తెలిపారు. ఆయా వివరాలన్నీ రిజిష్టరులో, ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. రోగి అడ్రస్, మొబైల్ నంబర్ను తీసుకుని, బార్కోడ్ను సక్రమంగా నమోదు చేస్తే పరీక్షా ఫలితాలు నేరుగా రోగి మొబైల్ నంబర్కు వెళ్తాయని అన్నారు. మలేరియా, డెంగీ, గర్భిణుల పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ సుధాకర్నాయక్, టీ హబ్ మేనేజర్ వెంకటేశ్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ రమేశ్, సీహెచ్వోలు వెంకటేశ్వర్లు, నాందేవ్, శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, డీపీహెచ్ఎన్ పద్మ మార్త, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
నాటి తాలూకా.. నేటి బల్దియా
లక్సెట్టిపేట: లక్సెట్టిపేట తాలూకా నుంచి గ్రామ పంచాయతీగా ఆ తర్వాత మున్సిపాల్టీగా ఏర్పడింది. దశాబ్దాల క్రితం నాటి పంచాయతీ కార్యాలయ భవనమే నేటి మున్సిపల్ కార్యాలయం గానూ కొనసాగుతోంది. 1956లో లక్సెటిపేటను తాలూకా కేంద్రంగా ఏర్పాటు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని అంగడిబజార్లోని పెంకుటింట్లో కొద్ది సంవత్సరాలు కొనసాగించారు. మొదటి సర్పంచ్గా సాంబశివరావు పని చేసినట్లు పూర్వీకులు చెబుతున్నారు. 1961లో పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో నూతన పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించి గ్రామ పంచాయతీ వ్యవస్థను పునః ప్రారంభించారు. అప్పట్లో నూనె పెద్దన్న సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2018వరకు సర్పంచ్లతో కొనసాగగా.. చివరిగా మినుముల సుమతి సర్పంచ్గా పని చేశారు. లక్సెట్టిపేట పట్టణాన్ని ఇటిక్యాల, ఊత్కూరు, మోదెల గ్రామ పంచాయతీలను కలుపుతూ 2018 ఆగస్టు 2న అప్పటి ప్రభుత్వం మున్సిపాల్టీగా ప్రకటించింది. గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం బోర్డును మార్చి అందులోనే మున్సిపాల్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పురాతన కాలం నాటి భవనం కావడంతో ప్రస్తుతం సరిపోవడం లేదు. మున్సిపల్ మొదటి చైర్మన్గా నల్మాసు కాంతయ్య, వైస్ చైర్మన్గా పోడెటి శ్రీనివాస్ పని చేశారు. ప్రస్తుతం రెండోసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. -
ప్రాక్టికల్ పరీక్షలకు 170 మంది గైర్హాజరు
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు మొదటి రోజు సోమవారం 170 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 20 పరీక్షా కేంద్రాల్లో రెండు పూటలు పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు 1279 మందికి గాను 1161 మంది హాజరుకాగా 118 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 604 మందికి గాను 589 మంది హాజరు కాగా 15 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్లో 675 మందికి 572 మంది హాజరు కాగా 103 గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు నిర్వహించిన ప్రాక్టికల్కు 1099 మందికి 1047 మంది హాజరు కాగా 52 మంది గైర్హాజరయ్యారు. జనరల్ 537 మందికి 516 హాజరు కాగా 21 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విద్యార్థులు 562 మందికి 531 హాజరు కాగా 31 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను డీఐఈవో అంజయ్య పరిశీలించారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
తాండూర్: రాష్ట్రస్థాయి బాలికల సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు మండలంలోని అచ్చలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.అమూల్య ఎంపికై ంది. ఈ నెల 1న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో నిర్వహించిన పోటీల్లో అమూల్య అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 5 నుంచి 8 వరకు నిజామాబాద్ జిల్లా కుమ్మరపల్లి మండలంలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీల్లో పాల్గొననుంది. సదరు విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమాదేవి, ఫిజికల్ డైరెక్టర్ సాంబమూర్తి, ఉపాధ్యాయులు అభినందించారు. -
హోరాహోరీగా ఎస్టీపీపీ క్రికెట్ లీగ్
జైపూర్:మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో 12వ సీజన్ క్రికెట్ లీగ్ ఫైనల్ పోటీలు ఆదివారం హోరాహోరీగా సాగాయి. ఉదయం సింగరేణి, పీఎంపీఎల్ హెచ్వోడీల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సింగరేణి హెచ్వోడీల జట్టు, పీఎంపీఎల్ హెచ్వోడీ జట్టుపై విజయం సాధించింది. సింగరేణి హెచ్వోడీ జట్టుకి ఎస్టీపీపీ ఈడీ చిరంజివి నాయకత్వం వహించారు. అనంతరం ఫైనల్కు చేరుకున్న పీఎంపీఎల్ ఽథండర్ టైటాన్స్, సీఐఎస్ఎఫ్ జట్ల మధ్యన ఫైనల్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన థండర్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా థండర్ టైటాన్స్ బాట్స్ మాన్ ముకేశ్ బాబు 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన సీఐఎస్ఎఫ్ జట్టు 120 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. బౌలింగ్లో ముకేశ్బాబు 2 వికెట్లు తీసి మ్యాన్ఆఫ్ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. థండర్ టైటాన్స్ జట్టుకు ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, చీఫ్ కోఆర్డినేటర్ పంతులా, సుబ్బారావు ట్రోఫీలు అందజేశారు. -
ఆశలు చిగురించేనా?
చెన్నూర్రూరల్: ఈ ఏడాది మామిడి చెట్లకు పూత జనవరిలోనే అధికంగా వచ్చింది. దీంతో రైతుల్లో ఆ నందం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమా రు 18 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు సా గు చేస్తున్నారు. బెల్లంపల్లి, నెన్నెల, ఆవుడం, చిత్తాపూర్, భీమారంతోపాటు చెన్నూర్ మండలంలోని ఎర్రగుంటపల్లి, కొమ్మెర, ఆస్నాద, బుద్దారం,సంకారం, కన్నెపల్లి, సుద్దాల,కమ్మరిపల్లి, గంగారం, త దితర గ్రామాల్లో ఎక్కువ మొత్తంలో సాగవుతోంది. ప్రకృతి కరుణిస్తేనే.. డిసెంబర్ నెల చివరి నుంచి మామిడి పూత రావాల్సి ఉంటుంది. ఈ ఏడాది అలాగే పూత అధికంగా వచ్చింది. మామిడి చెట్లకు తేనె మంచు పురుగు ఆశించకుండా రైతులు పురుగు నివారణకు మందులను స్ప్రే చేస్తున్నారు. అలాగే మామిడి చెట్లకు పూత నుంచి పిందెలు వస్తున్నాయి. మార్చి, ఏప్రిల్ మే నెలల వరకు ప్రకృతి కరుణిస్తే వచ్చిన పిందెలు రాలిపోకుండా పెరుగుదల ఉంటుంది. మే నెల వరకు కాయలు పూర్తిగా ఎదిగి రైతులకు ఆశించిన దిగుబడి వస్తాయి. కానీ ఏటా ఈదురుగాలులు, అకాలవర్షాలతో కాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాకుండా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటే పిందె దశకు చేరుకునే సమయానికి కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తోటలకు ఏ పరిస్థితుల్లో ఎలాంటి మందులు పిచికారి చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అని తెలియజేయాలని రైతులు అంటున్నారు. అలాగే ఏటా గాలులు, అకాలవర్షాలతో మామిడి కాయలు నేలరాలిపోతున్నా, నష్టపరిహారం అందడం లేదు. దీనికి తోడు మామిడి కాయలు అమ్మేందుకు మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో యజమానులు తోటలను కౌలుకు ఇస్తుంటారు. కొంత డబ్బును ముందుగా యజమానులకు ఇచ్చి, పంట పూర్తిగా చేతికి రాగానే మిగతా డబ్బు అందిస్తారు. -
కాంగ్రెస్ గెలుపుతో కోల్బెల్ట్ అభివృద్ధి
శ్రీరాంపూర్: కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తే కోల్బెల్ట్ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బి.జనక్ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన మంచిర్యాల కార్పొరేషన్ పరిధి నస్పూర్ కాలనీ, షిర్కే ప్రాంతంలోని 34, 36 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు అగల్డ్యూటీ రాజు, అగల్డ్యూటీ రాణికు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో తిరుగుతూ కార్మిక కుటుంబాల ఓట్లను అభ్యర్థించారు. వారిని ఆదరించి అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ఐఎన్టీయూసీ కృషి చేస్తోందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ అభ్యర్థులు అగల్డ్యూటీ రాజు, రాణి, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు శంకర్రావు, కేంద్ర కమిటీ నాయకులు గరిగే స్వామి, కలవేని శ్యాం, ఏనుగు ర వీందర్రెడ్డి, తిరుపతిరాజు, ల్యాగల శ్రీనివాస్, రా వుల అనిల్, జయభరత్రెడ్డి, మనోజ్ పాల్గొన్నారు. -
చిరుతనా..తోడేళ్లా?
బోథ్: మండలంలోని నాగపూర్కండి ప్రాంత పరిసరాల్లో ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన వాకర్స్కు జంతువుల పాదముద్రలు కనిపించా యి. గుట్ట ప్రాంతంలో దూరంగా రెండు చిరుతలు, మూడు చిరుత పిల్లలు కనిపించినట్లు వారు తెలిపారు. పలు చోట్ల పాదముద్రలను గుర్తించి ఫోన్లో ఫోటోలు తీశారు. అరుపులు కూడా వినిపించాయని పేర్కొన్నారు. ఈ విషయమై ఫారెస్ట్ సెక్షన్ అధికారి నాగోరావును వివరణ కోరగా పాదముద్రలు చిరుతవి కాదని, తోడేళ్లకు సంబంధించినవని తెలిపారు. అయితే, చిరుతలను చూశామని వాకర్స్ అంటుండగా, అటవీ అధికారులు తోడేళ్ల పాదముద్రలుగా పేర్కొనారు. అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది చిరుతలా? లేక తోడేళ్ల అనే సందేహాలు నెలకొన్నాయి. ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ద్విచక్రవాహనం చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని రైల్వేస్టేషన్లో ద్విచక్రవాహనం చోరి జరిగింది. రైల్వేక్వార్టర్స్కు చెందిన భీంరావు పని నిమిత్తం గతనెల 20న ఊరికి వెళ్లాడు. 31న తిరిగి ఇంటికి వచ్చాడు. పార్కింగ్ చేసిన తన బైక్ కనిపించకపోవడంతో చుట్టూపక్కల గాలించిన ఆచూకీ దొరకలేదు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ కె.నాగరాజు తెలిపారు. -
ఉమ్మడి జిల్లా వాలీబాల్ జట్ల ఎంపిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వాలీబాల్ సబ్ జూనియర్ బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా యువజన క్రీడల అధికారి హన్మంతరెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. పోటీల్లో విశేష ప్రతిభ కనబర్చినవారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈనెల 5 నుంచి 8 వరకు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటాలని సూచించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్గౌడ్, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి రమేశ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, కోశాధికారి గాజుల శ్రీనివాస్, ఆదిలాబాద్ బాధ్యుడు దాసారపు సందీప్, ఎస్జీఎఫ్ కార్యదర్శి యాకూబ్, జిల్లా పీఈటీల సంఘం నాయకులు రామ్మోహన్రావు, గోపాల్, సుదర్శన్, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. -
సల్లంగచూడు మైసమ్మా..
ఖిల్లాపైకి వస్తున్న భక్తులుఅమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్న భక్తులునృత్యాలు చేస్తున్న ఆదివాసీలుసెల్ఫీ తీసుకుంటున్న యువతులు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులోని గాంధారిఖిల్లా వద్ద మైసమ్మ తల్లి జాతర ఆదివారం ముగిసింది. మూడు రోజులు కనుల పండువగా సాగిన ఈ ఉత్సవంలో చివరి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. తెల్లవారుజామున జీడీకోట నుంచి ఆదివాసీలు సంప్రదాయ తప్పెటగూళ్లు, డప్పుచప్పుళ్లతో ఖిల్లాపైకి చేరుకున్నారు. గంగాజలంతో దేవతా మూర్తులను శుద్ధిచేసి పట్నాలు వేశారు. ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యం సమర్పించి కిందకు వెళ్లారు. గిరిజన సంస్కృతి నృత్యాలతో ఉత్సవాలు జరిపారు. పెద్ద సంఖ్యలో ఆదివాసీ నాయక్పోడ్లు, భక్తులు తరలి రావడంతో గాంధారీఖిల్లా ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నాయక్పోడ్ సంఘం నాయకులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. – రామకృష్ణాపూర్ -
పీఎంశ్రీ విద్యార్థులకు అల్పాహారం
లక్ష్మణచాంద:ప్రభుత్వ పాఠశాలల అభివద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో సౌకర్యాలకు నిధులు కేటాయిస్తున్నాయి. ఇటీవలే మరుగుదొడ్లు, కిచెన్షెడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తాజాగా ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ)పథకంలో ఎంపికై న పాఠశాలల్లో కేంద్రం మౌలిక వసతులు కల్పిస్తోంది. తరగతి గదులతోపాటు, మూత్రశాలలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్ వంటి సౌకర్యాలను సమకూరుస్తోంది. తాజాగా పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు అల్పాహారం కోసం నిధులు కేటాయించింది. 34 రోజుల ప్రణాళిక ఈ నెల 28 నుంచి వచ్చే నెల 14 వరకు 34 రోజులు ప్రతీ విద్యార్థికి రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున రూ.510 విలువైన అల్పాహారం అందిస్తారు. ప్రత్యేక తరగతుల సమయంలో ఉదయం, సాయంత్రం అల్పాహారం అందిస్తారు. జిల్లా విద్యా శాఖ అధికారుల ప్రకారం, అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇది అమలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 19 రోజుల ప్రణాళిక.. రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే పదో తరగతి విద్యార్థుల కోసం 19 రోజులపాటు అల్పాహారం అందించేందుకు నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు నిధులు మంజూరయ్యాయి. దీంతో విద్యార్థులకు ఆకలి బాధలు తొలగిపోయి చదువుపై మరింత దృష్టి కేంద్రీకరించి ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 4,760 మందికి లబ్ధి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలలు 51 ఉన్నాయి. నిర్మల్, కుమురంభీం జిల్లాల్లో 10 చొప్పున, మంచిర్యాల జిల్లాలో 16, ఆదిలాబాద్ జిల్లాలో 15 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 4,760 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి చదువుతున్నారు. వీరికి రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున అల్పాహారం కోసం ఖర్చు చేస్తారు. ఉమ్మడి జిల్లా సమాచారం...నిర్మల్ జిల్లా ... పీఎంశ్రీ పాఠశాలలు: 10 ‘పది’ విద్యార్థుల సంఖ్య: 795 మంజూరైన నిధులు: రూ.4,05,450 ఆదిలాబాద్ జిల్లా... పీఎంశ్రీ పాఠశాలలు:15 విద్యార్థుల సంఖ్య; 1943 మంజూరైన నిధులు; రూ.9,90,923 కుమురం భీం జిల్లా... పీఎంశ్రీ పాఠశాలలు:10 విద్యార్థుల సంఖ్య: 928 మంజూరైన నిధులు:రూ.4,73,280 మంచిర్యాల.. పీఎంశ్రీ పాఠశాలలు:16 విద్యార్థులు: 1094 మంజూరైన నిధులు: రూ.5,57,940 -
గొల్లాపూర్ చెరువులో సందడి
సొనాల మండలం గొల్లాపూర్ చెరువులో స్మూత్ కోటెడ్ ఒటర్ (మృదుచర్మ నీటి పిల్లులు) సందడి చేస్తున్నాయి. నదీ తీరప్రాంతాలకే పరిమితమయ్యే ఇవి చెరువులో అరుదుగా కనిపిస్తుంటాయి. ఇక్కడ పుష్కలంగా చేపలు ఉండటం, సురక్షితమైన ఆవాసం లభించడంతోనే అవి ఇక్కడికి వలసవచ్చి ఉంటాయి. చెరువులో స్వేచ్ఛగా విహరిస్తూ కేరింతలు కొడుతున్న దృశ్యాలు పర్యావరణ ప్రేమికులు, గ్రామస్తులను ఆకట్టుకుంటున్నాయి. నీటి శుభ్రత ఎక్కడైతే ఉంటుందో, ఇవి అక్కడ సంచరిస్తుంటాయని బోథ్ ఎఫ్ఆర్వో ప్రణయ్కుమార్ తెలిపారు. – బోథ్ -
గల్ఫ్ కార్మికులకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి
జన్నారం: గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం గల్ఫ్ బోర్డు ప్రకటించి బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమన్న డిమాండ్ చేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం ఆవిర్భవించి ఆరేళ్లు అవుతున్న సందర్భంగా ఆదివారం దుబాయ్లో ఆ శాఖ అధ్యక్షుడు ఎరుకల రాజుగౌడ్ ఆధ్వర్యంలో సంఘ నాయకులతో కలిసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం సంఘం అనేక కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. వివిధ కారణాలతో మృతిచెందిన వారి మృతదేహాలను స్వగ్రామాలకు తెప్పించడంలో కీలకంగా వ్యవహరించామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయలేదన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అలీం, దుబాయ్ కోఆర్డినేటర్లు రమేశ్, రామిరెడ్డి, నాయకులు సత్తన్న, తిరుపతి, రామన్న, మహేశ్, శ్రీనివాస్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బాడీ బిల్డర్కు సన్మానం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఇటీవల న స్పూర్లో నిర్వహించిన వెంకీ క్లాసిక్ బాడీ బి ల్డింగ్ టైటిల్ సాధించి ఓవరాల్ ఛాంపియన్ షిప్ కై వసం చేసుకున్న మాసు వెంకటేశ్ను ఆది వారం మంచిర్యాల ఛాంపియన్ జిమ్లో సన్మానించారు. సీనియర్ బాడీ బిల్డర్లు కొలిపాక బక్కయ్య, ఆసిఫాబాద్ తహసీల్దార్ శశిధర్, కోచ్ విద్యాసాగర్గౌడ్, జిమ్ సభ్యులు దుర్గం ప్రవీణ్, వర్మణి వెంకటేశ్వర్లు, గట్టు శ్యాంకుమార్, శ్రీకాంత్, రాజనాథం, తిరుపతి, అర్జున్, శశిపటేల్, శ్రీనివాస్ నగదు బహుమతి అందించి పూలమాలతో సన్మానించారు. సాఫ్ట్బాల్ కెప్టెన్గా డానియల్ మంచిర్యాలఅర్బన్: కాకతీయ యూనివర్సిటీ సాఫ్ట్బాల్ కెప్టెన్గా స్థానిక మిమ్స్ డిగ్రీ కళాశాల విద్యార్థి డానియల్ ఎంపికయ్యాడు. ఈనెల 2నుంచి 5వరకు మహారాష్ట్రలో నిర్వహించే ఆల్ ఇండియా యూనివర్సిటీ పోటీలకు యూనివర్సిటీ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఎంపీసీఎస్ ఫైనలియర్ జట్టు సభ్యుడిగా సాయికమల్ ఎంపికైనట్లు కరస్పాండెంట్ శ్రీని వాసరాజు, ప్రిన్సిపాల్ ఉపేందర్రెడ్డి తెలిపారు. -
108 అంబులెన్స్లో ప్రసవం
నెన్నెల: కన్నెపల్లి మండలంలోని నాయకునిపేటకు చెందిన నిండు గర్భిణి కవితకు ఆదివారం పురుటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబీ కులు 108కు సమాచారం ఇచ్చారు. నెన్నెల 108 సిబ్బంది ఈఎంటీ రాజేశ్వరి, పైలట్ రాజే శం వెంటనే అంబులెన్స్ నాయకునిపేటకు చే రుకుని కవితను బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా పురుటినొప్పులు తీవ్రమయ్యా యి. ఉన్నతాధికారుల సూచన మేరకు 108 సి బ్బంది ప్రసవం చేయగా కవిత ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉండగా బెల్లంపల్లి సీహెచ్సీకి తరలించారు. అత్యవసర సమయంలో కవితకు పురుడు పోసిన 108 సి బ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. -
నేటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపు విద్యార్థులకు నేటి నుంచి 11వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అధికారులు జిల్లా వ్యాప్తంగా 20పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా అన్ని చోట్ల సీసీ కె మెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 9నుంచి 12వరకు, మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ 65 జనరల్, వృత్తివిద్య జూనియర్ కళాశాలలున్నా యి. ప్రాక్టికల్స్ రాసే విద్యార్థులు 5,398 మంది ఉండగా, ఇందులో ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులు 3,726 మంది, ప్రథమ, ద్వితీయ సంవత్స రం వొకేషనల్ విద్యార్థులు 1,672 మంది ఉన్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాల ని అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు విడుదల చేసిన నిధులతో అవసరమైన పరికరాలు, రసాయనాలు అందుబాటులో ఉంచారు. ప్రయోగ, రాత పరీక్షలన్నీ సీసీ కెమెరాల నిఘాలో నిర్వహిస్తారు. ప్రతీ కళాశాలకు నాలుగు కెమెరాలు అమర్చి ఇంటర్ బోర్డుకు అనుసంధానించారు. వీరితో పాటు ఎగ్జామినర్లు, డిపార్ట్మెంట్ అధికారులు, ఫ్లయింగ్స్క్వాడ్ బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నాయి. సెల్ఫ్ కేంద్రాల్లో ప్ర యోగ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు పూ టలా పరీక్షలు నిర్వహించనున్నారు. ఎగ్జామినర్ మి నహా మరెవరికి అక్కడా అవకాశం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 2నుంచి 6వరకు మొదటి విడత, 7నుంచి 11వరకు రెండో విడతలో ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ కన్వీనర్గా డీఐఈవో అంజయ్య, ఇద్దరు సభ్యులు ఎప్పటికప్పు డు కేంద్రాలను తనిఖీ చేయనున్నారు. కేంద్రాల్లో వి ద్యుత్, ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనట్లు డీఐఈవో అంజయ్య తెలిపారు. పరీక్షాకేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. విద్యార్థులు కళాశాలల్లో హాల్టికెట్లు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు అరగంట ముందు సంబంధిత పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రం డౌన్లోడ్ చేసుకునేలా ప్రభుత్వం ని బంధనలు తెచ్చింది. ఆయా సీఎస్లకు ఆన్లైన్లో పరీక్ష సమయానికి అరగంట ముందు పంపుతారు. -
కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి
మంచిర్యాలటౌన్: మాజీ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం మానుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ సూచించారు. కేసీఆర్పై సిట్ విచారణకు వ్యతిరేకంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి ప్రధాన రహదారుల గుండా బీఆర్ఎస్ నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల గెలుపుతో, మున్సిపల్ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదని కాంగ్రెస్ కేసీఆర్పై కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, పార్టీ నాయకుడు నడిపెల్లి విజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశావహుల్లో ఉత్కంఠ
మంచిర్యాలటౌన్/చెన్నూర్/బెల్లంపల్లి/లక్సెట్టిపేట: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తి కాగా, ప్రధాన పార్టీలు అభ్యర్థులకు బీ ఫారంలు అందలేదు. ఒకే పార్టీకి చెందిన పలువురు ఆశావహులు ఒకే స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 3వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా, ఎందరు విత్డ్రా చేసుకుంటారు? ఎవరికి బీ ఫారం వస్తుందనే దానిపై స్పష్టత రానుంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు మొదటిసా రి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 60 డివిజన్లుండగా ఆయా పార్టీల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. బెల్లంపల్లి, చె న్నూరు, క్యాతన్పల్లి, లక్సెట్టిపేట్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఒక్కోస్థానానికి ఒకరి కంటే ఎక్కువమంది నామినేషన్లు వేశారు. పోటాపోటీగా నామినేషన్లు అధికార కాంగ్రెస్ నుంచి ఆశావహుల సంఖ్య అధి కంగా ఉండడంతో బీ ఫాంరం స్పష్టమైన హామీ తీసుకున్నాకే పలువురు పార్టీ తరఫున నామినేషన్లు వేశారు. ఇదే పరిస్థితి బీఆర్ఎస్, బీజీపీలోనూ కనిపిస్తోంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో 60 డివిజన్లుండగా బీజేపీ నుంచి 108 మంది, బీఆర్ఎస్ నుంచి 98 మంది, కాంగ్రెస్ నుంచి 77 మంది నామినేషన్లు వేశారు. బెల్లంపల్లిలో 34 వార్డులకు కాంగ్రెస్ నుంచి 123 మంది, బీఆర్ఎస్ నుంచి 81మంది నామినేషన్లు వేయగా, బీజేపీ నుంచి 27 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. చె న్నూరు మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను కాంగ్రెస్ నుంచి 56 మంది, బీఆ ర్ఎస్ నుంచి 36 మంది, బీజేపీ నుంచి 24 మంది నామినేషన్లు వేశారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22వార్డులకు కాంగ్రెస్ నుంచి 88 మంది, బీఆర్ఎస్ నుంచి 53 మంది, బీజేపీ నుంచి 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. లక్సెట్టిపేట్లో 15 వార్డులకు గాను కాంగ్రెస్ నుంచి 25మంది, బీఆర్ఎస్ నుంచి 32మంది, బీజేపీ నుంచి 25మంది నామినేషన్లు వేశారు. చెన్నూర్లో రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకమే.. చెన్నూర్, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేసేందుకు రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి రంగంలోకి దిగారు. సమర్ధవంతమైన అభ్యర్థులను బరిలోకి దింపేందేందుకు వార్డుల వారీగా ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మున్సిపాలిటీల్లో గెలిచి సత్తా చాటాలనే ప్రయత్నం ముమ్మరం చేశా రు. బీఆర్ఎస్లో ఇటీవల జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి చేరడంతో పార్టీకి బలం చేకూరింది. లక్సెట్టిపేటలో త్రిముఖ పోరు.. లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్ర ధాన పోటీ ఉంది. గత నెల 30న ఎమ్మె ల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్తో పాటు తుది జాబితాను విడుదల చేశారు. బీజేపీ అభ్యర్థుల జాబితా కూడా విడుదలైంది. బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో అంతర్గతంగా విబేధాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు ఈనెల 1న తొమ్మిది మంది అభ్యర్థుల జాబితా మాత్రమే విడుదల చేసి ఆరు స్థానాలను పెండింగ్లో ఉంచారు. చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లు ఖరారు చేయలేదు. ఎవరికి వారే అన్న రీతిలో అభ్యర్థుల ప్రచారంబీ ఫారం పక్కాగా తమకే వస్తుందని నమ్ముతున్న అభ్యర్థులు ప్రచారంలోకి దిగారు. అయితే, పలుచోట్ల ఒకే పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు తమ అభ్యర్థిత్వం ఖరారవుతుందని ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తూ ఒకే డివిజన్/వార్డులో వేర్వేరుగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీంతో ఆయా స్థానాల్లో గందరగోళం నెలకొంది. ఆదివారం అన్ని పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. కాగా, ఆయా పార్టీలకు రెబల్స్ బెడద తప్పేలా లేదు. ప్రచారానికి వారం రోజులే సమయం ఉండడంతో, ఓటర్లను ఎలా తమవైపు తిప్పుకోవాలనే దానిపై ఎవరికి వారు ప్రణాళికలు రచిస్తున్నారు. స్థానికంగా ఓటుండి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని రప్పించి ఓట్లేయించుకునేందుకు పలువురు అభ్యర్థులు ముందస్తు చర్యలు ప్రారంభించారు.మున్సిపాలిటీల వారీగా నామినేషన్ల వివరాలుమున్సిపాలిటీ వార్డులు/డివిజన్లు నామినేషన్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు మంచిర్యాల 60 386 77 98 108 103 బెల్లంపల్లి 34 279 123 81 27 48 చెన్నూర్ 18 171 56 36 24 55 క్యాతన్పల్లి 22 241 88 53 33 67 లక్సెట్టిపేట 15 100 25 32 25 18 మొత్తం 149 1,177 369 300 217 291 -
సోలార్ ప్యానెల్ ఏర్పాటు
లక్సెట్టిపేట: మండలంలోని వెంకట్రావుపేటలో టీజీ రెడ్కో ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ ప్యానెల్ను సోలార్ విద్యుత్ అధికారులు ఆదివారం ఏర్పాటు చేశారు. సోలార్ గ్రామంగా ఏర్పాటైన జిల్లాలోని ఏకై క గ్రామం కావడంతో పనులు ప్రారంభించి గ్రామానికి చెందిన కిష్టయ్య అనే వ్యక్తి ఇంటిలో సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోలార్ మీటర్ను త్వరలో ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా అందిస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్శాఖ డీఈ ప్రభాకర్, ఏఈ గణేశ్, లైన్ ఇన్స్పెక్టర్ సతీశ్, సోలార్ సిబ్బంది పాల్గొన్నారు.అథ్లెటిక్స్లో తిరుపతి ప్రతిభమంచిర్యాలఅర్బన్: రాజస్థాన్లో జనవరి 30నుంచి నిర్వహిస్తున్న ఏడో నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో మంచిర్యాల డిపోలో విధులు నిర్వహించే ఆర్టీసీ కానిస్టేబుల్ తిరుపతి ప్రతిభ కనబరిచారు. ట్రిపుల్జంప్లో తృతీయ స్థానంలో నిలిచి బ్రాస్ మెడల్ సాధించారు. నేషనల్ నమ ప్రెసిడెంట్ సురేశ్శర్మ, తెలంగాణ స్టేట్ సెక్రటరీ లక్ష్మారెడ్డి చేతుల మీదుగా పతకం, ప్రశంసాపత్రం అందుకున్నారు. -
● నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్ ● జిల్లాకు ప్రత్యేకంగా నిధుల్లేవ్ ● కేంద్రప్రభుత్వ పథకాలే దిక్కు ● బాగుందంటూ బీజేపీ కితాబు ● నిరాశ పరిచిందన్న విపక్షాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర బడ్జెట్తో జిల్లా కు ఎలాంటి ఊరట దక్కలేదు. జాతీయ రహదారులు, సింగరేణి గనులు, కార్మికుల ఆదాయపన్ను మినహాయింపు లాంటి అంశాలు ప్రస్తావనకు రాలే దు. దేశవ్యాప్తంగా అమలయ్యే పథకాలే జిల్లాకు ఒనగూరనున్నాయి. ఇంతకుమించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకించి ఎలాంటి నిధులు, ప్రకటించలేదు. ఆదివారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లావాసులను నిరాశ పరిచింది. సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు లేదా కోల్ఇండియా తరహాలో యాజమాన్యం చెల్లించేలా వెసులుబాటుపై ప్రస్తావన రాలేదు. అలాగే, కొత్త బొగ్గు గనులు ప్రకటించలేదు. వచ్చే ఏడాది జూన్లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల కోసం గోదావరినది తీర ప్రాంత దర్శనీయ ప్రదేశాలు, పర్యాటకం, అభివృద్ధిపై ప్రస్తావన రాలేదు. అయితే బడ్జెట్ సప్లిమెంటరీలో ఏవైనా నిధుల ప్రస్తావన వస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి. జాతీయ రహదారుల అంశమేది? జిల్లాలో జాతీయ రహదారి 363 పూర్తయింది. నిజా మాబాద్–జగ్దల్పూర్ మధ్య నిర్మించే జిల్లా గుండా వెళ్తున్న నాలుగు వరుసలదారి 63 నిర్మాణ పనులు మొదలుకావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఇంకా మొదలు కావడం లేదు. కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఆమోదం రాకపోవడంతో టెండర్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. జాతీయ రహదారుల నిర్మాణ నిధుల అంశం ఈ బడ్జెట్లోనూ చేర్చలేదు. ఇక బె ల్లంపల్లి–గడ్చిరోలి ఫోర్లేన్ రోడ్డు కూడా ఈ ఆర్థికసంవత్సరంలో ప్రారంభమయ్యేలా లేదు.రైల్వే కేటాయింపులు, నిధుల ఖర్చు వెల్లడించలే..కేంద్ర బడ్జెట్లో రైల్వే కేటాయింపులు, నిధుల ఖర్చు తదితర అంశాలపై సమగ్రంగా వివరాలు వెల్లడించే పింక్ బుక్ ఈసారి పూర్తిగా ఎత్తివేశారు. దీంతో రైల్వే కేటాయింపులపై స్పష్టత రావడం లేదు. ఈ మేరకు కేటాయింపుల నోట్ విడుదలైతే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని మంచిర్యాల నుంచి సిర్పూర్ (టీ) వరకు ఉన్న లైన్, స్టేషన్లు, మూడు, నాలుగో లైన్ ప్రారంభం, అభివృద్ధి తదితర అంశాలపై పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. ఇక 7హైస్పీడ్ రైళ్లు నడిచేలా కారిడార్ను ప్రధాన నగరాలకు కేటాయించారు. సికింద్రాబాద్–ఢిల్లీ, నాగ్పూర్ లాంటి నగరాల మధ్య ఎలాంటి ప్రకటన రాలేదు. -
బ్లేడ్తో గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఇంద్రవెల్లి: బ్లేడ్తో గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఏమాయికుంట పంచాయతీ పరిధి రమాయినగర్కు చెందిన రాందాస్ కూలీ పనిచేసుకుని జీవిస్తున్నాడు. ఇతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. కూలీ పనిచేసి వచ్చిన డబ్బులతో మద్యం తాగేవాడు. శుక్రవారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. శనివారం మళ్లీ మద్యం తాగి క్షణికావేశంలో బ్లేడ్తో గొంతుకోసుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫైలెట్ రాజేష్, ఈఎంటీ రాందాస్ అతనికి ప్రాథమిక చికిత్స అందించి ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. -
నిజాం పాలన నుంచి
నస్పూర్: సుమారు 1900 సంవత్సరకాలంలో నిజాం సంస్థానీశులు విలేజ్ నస్పూర్లోని గడి నుంచి జన్నారం, తపాలాపూర్, ఇందారం, మంథని, పెద్దపల్లి, భూపాలపల్లి, మహారాష్ట్రలో ని సిరొంచ, మధ్యప్రదేశ్లోని బస్తర్ వరకు పాల న కొనసాగించేవారు. కాలక్రమేణా 1986లో న స్పూర్ పంచాయతీగా, 2018లో నస్పూర్, తీగల్పహడ్, తాళ్లపల్లి, సింగాపూర్ గ్రామాలు కలిపి మున్సిపాలిటీగా ఏర్పడింది. 2020లో ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ తొలి చై ర్మన్గా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్ నుంచి సురమిల్ల వేణు చైర్మన్గా ఏడాది బాధ్యతలు నిర్వహించారు. 2025 జనవరి 27న మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలతోపాటు మరో ఏడు గ్రామాలు కలిసి మంచిర్యాల కార్పొరేషన్గా ఏర్పడింది. దీంతో నస్పూర్ మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలే చివరిగా మిగిలిపోయాయి. -
బరిలో భార్యాభర్తలు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో ఒకే పార్టీ నుంచి భార్యభర్తలు పోటీ చేస్తున్నారు. 43వ డివిజన్కు చెందిన గాదె సత్యం, గాదె రమాదేవి గతంలో ఒక్కోసారి కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. 2014లో రమాదేవి అప్పటి 23వ కౌన్సిలర్గా గెలుపొందగా, వార్డుల సంఖ్య పెంపుతో వార్డు 32గా మారగా 2020లో భర్త కౌన్సిలర్గా గెలుపొందారు. ప్రస్తుతం బీఆర్ఎస్ తరపున 43వ డివిజన్ నుంచి భార్య, 20వ డివిజన్ నుంచి భర్త అదే పార్టీ నుంచి బరిలో నిలిచారు. రెండు డివిజన్లలో భార్యభర్తలు విస్తృతంగా ప్రచారం చేపట్టారు.అదృష్టం వరించేనా! నస్పూర్: ఈనెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ బరిలో నస్పూర్కు చెందిన అగల్డ్యూటి రాజు, భార్య రాణి నిలిచా రు. 34వ వార్డు నుంచి అగల్డ్యూటి రాజు, 36వ వార్డు నుంచి అగల్డ్యూటి రాణి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అగల్డ్యూటి రాజు గతంలో నస్పూర్ ము న్సిపాలిటీలో కౌన్సిలర్గా పనిచేశాడు. -
బీ ఫారంతోనే గుర్తుంపు..!
మంచిర్యాలటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఇటు అభ్యర్థులు.. అటు రాజకీయ పార్టీల నాయకుల అందరి నోటా వినిపిస్తున్న మాట ఒక్కటే.. బీ ఫారం. బల్ది యాల్లో పోటీకి ఆశావహులు వివిధ రాజకీయ పా ర్టీల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఒ కే పార్టీ నుంచి వార్డు, డివిజన్లలో పోటీకి పార్టీ అభ్యర్థిత్వం తమకే వస్తుందనే ధీమాతో ఇద్దరు కంటే ఎక్కువమంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో పలు పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేశారు. మరికొన్ని పార్టీలు ఖరారు చేయాల్సి ఉంది. కానీ అభ్యర్థుల చేతికి ఇంకా బీ ఫారం అందలే దు.శనివారం నామినేషన్లను అధికారులు పరిశీలించారు.తిరస్కరణ, ఉపసంహరణకు ఈనెల 3న మ ధ్యాహ్నం 3గంటలవరకు సమయం ఉంది. ఆలో పు బీఫారం అందజేసిన వారినే ఆయా పార్టీల అ భ్యర్థులుగా పరిగణిస్తూ బరిలో ఉన్నవారి జాబి తా ను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. బీ ఫారం ఇ వ్వనివారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తారు. ఎవరు జారీ చేస్తారు.. పార్టీ ప్రాతిపదికన జరిగే ఎన్నికల్లో అభ్యర్థులు బీ ఫారం పొంది పోటీ చేయాల్సి ఉంటుంది.సర్పంచ్ మినహా, స్థానికసంస్థలు, మున్సి పాలిటీ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతాయి. బీ ఫారం లేకుండా పోటీచేస్తే ఎన్నికల అధికారులు వారిని స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తిస్తారు. వీరు కా కుండా పార్టీ పరిశీలకులుగా ఉన్న వారికి ‘ఏ’ ఫా రం ఇస్తారు. వారు కూడా బీ ఫారం ఇచ్చేందుకు అర్హులు. బీ ఫారాల కోసం పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉండాలనుకునే ఆశవాహులు బీఫారం పొందేందుకు నానా తంటాలు పడుతుంటారు. పార్టీ అధినేతలు నామినేషన్ల చివరి ఘట్టం వరకు ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంటుంది. గెలుపు గుర్రాల కోసం పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో కసరత్తు చేసి చివరికి బీ ఫారం అందజేస్తారు. -
‘జీవన్దాన్’ సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్టౌన్: కిడ్నీ బాధితులు జీవన్దాన్ను సద్వినియోగం చేసుకోవాలని నిమ్స్ అడిషనల్ ప్రొఫెసర్ డా.రాజాకార్తీక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని రిమ్స్లో డయాలసిస్ కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. కిడ్నీ చెడిపోయినవారు జీవన్దాన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వారికి మరో కిడ్నీ ని అమర్చనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కుటుంబంలో ఎవరైన కిడ్నీ దానానికి ముందుకు వస్తే కూడా అమర్చుకోవచ్చన్నారు. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేసుకోవాలన్నారు. నీటిని తక్కువగా తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆయన వెంట డా.శశాంక్, కిషన్, డయాలసిస్ విభాగం ఇన్చార్జి ప్రేందాస్ ఉన్నారు. -
మైసమ్మ తల్లికి పూజలు
తరలివస్తున్న ఆదివాసీలుబోనాలతో వెళ్తున్న మహిళలు రామకృష్ణాపూర్: మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో రెండోరోజైన శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. సాయంత్రం సదర్ భీమన్న వద్ద దేవతామూర్తులకు ఆదివాసీల సంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి దేవతామూర్తులను గాంధారి ఖిల్లా దిగువ భాగంలోని జీడికోటకు పిల్లనగ్రోవి వాయిద్యాలు, తప్పెటగూళ్ల ఆటలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ వాటిని ఉంచి రాత్రి లక్ష్మిదేవర, తప్పెటగూళ్ల నృత్యాలు చేశారు. అనంతరం మహిళలు ఖిల్లాపై భాగంలో కొలువుదీరిన అమ్మవారిని నదీజలాలతో శుద్ధిచేసి మైసమ్మ తల్లికి పట్నాలు వేశారు. అర్ధరాత్రి సమయంలో పెద్దపూజ నిర్వహించారు. -
రిజర్వేషన్.. కుటుంబసభ్యుల రొటేషన్!
బెల్లంపల్లి: మున్సిపాలిటీలో రెండు కుటుంబాలు ఏళ్ల తరబడి నుంచి పురఎన్నికల్లో విజయ పరంపర కొనసాగిస్తున్నాయి. ఓ మారు తప్పా పోటీ చేసిన ప్రతిసారి జయకేతనం ఎగురవేయడం జరుగుతోంది. రిజర్వేషన్ ప్రకారం భార్యభర్తలు, కుటుంబ సభ్యులు పోటీచేసి కౌన్సిలర్గా ఎన్నిక కావడం ఆనవాయితీగా వస్తోంది. ఓ కుటుంబం ఆరుసార్లు కౌన్సిలర్గా గెలవగా, మరో కుటుంబం ఐదుసార్లు మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం వహించడం విశేషంగా చెప్పవచ్చు. గెల్లి రాజలింగు బీజీ శంకర్సింగ్ -
పాలిటిక్స్కు బ్రాండ్నేమ్
నిర్మల్టౌన్: రాజకీయాల్లో ఒకతరం గెలవాలంటే ఎంతో కష్టపడాలి. అలా కష్టపడిన పదవి భరిస్తుందని గ్యారంటీ లేదు. అలాంటిది ఇప్పటివరకు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నిర్మల్ మున్సిపల్ చైర్మన్లు పనిచేశారు. నిర్మల్ రాజకీయాల్లో ఇలాంటి అరుదైన ఘనత వారికే దక్కింది. తాతబాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన మనుమడు ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగుతూ..మున్సిపాలిటీ పరిపాలనలో కీలకపాత్ర పోషించారు. వేరువేరు కాలాల్లో చైర్మన్లుగా పనిచేస్తూ.. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజాసమస్యల పరిష్కారంలో తమదైన ముద్రవేశారు. ఒక్క కుటుంబానికి వరుసగా ప్రజలు అవకాశమివ్వడం, వారిపై నమ్మకానికి నిదర్శనమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటగా అప్పాల నర్సయ్య..మొదటిగా అప్పాల నర్సయ్య 1981 నుంచి 1982 వరకు నిర్మల్ మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. చేసిన రెండేళ్లలో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై నిలకడమై పోరాడారు. మున్సిపాలిటీ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత 2006లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళ రిజర్వేషన్ రావడంతో నర్సయ్య కుమారుడు అప్పాల మహేశ్ భార్య అనురాధ కౌన్సిలర్గా గెలిచి చైర్మన్ పదవిని అధిరోహించింది. ఐదేళ్లు పట్టణ అభివృద్ధిని పరుగులు పెట్టించారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సమస్యలు భూకబ్జాల నియంత్రణ వంటి సున్నిత అంశాల్లో వీరి నిర్ణయాలు ప్రశంసలు పొందాయి. మూడోసారి అప్పాల గణేశ్ చక్రవర్తినర్సయ్య పెద్ద కుమారుడైన చక్రపాణి కొడుకు అప్పాల గణేశ్ చక్రవర్తి తాత బాటలో నిర్మల్పై పట్టు సాధించాడు. తాత వేసిన పునాదులపై నిలబడి రాజకీయ రంగ ప్రవేశం చేసి మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకున్నారు. నిర్మల్ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. రాజకీయ బలం, క్యాడర్పై పట్టు పెంచుకున్నారు. ఈయన 2014 నుంచి 2019 వరకు నిర్మల్ మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. మళ్లీ ఈసారి బరిలో..2026 మున్సిపల్ ఎన్నికల వేళ మున్సిపల్ చైర్మన్ (జనరల్ బీసీ మహిళ) రిజర్వేషన్ కావడంతో.. మరోసారి బరిలో దిగారు. మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి భార్య కావ్యను అధికార కాంగ్రెస్ నుంచి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. ప్రత్యర్థులు ఎంత వ్యూహాలు రచించిన ఈ కుటుంబ రాజకీయ పట్టు చదరకపోవడం, మున్సిపాలిటీ రాజకీయాల్లో ఇప్పటికీ హాట్ టాపిక్గా మారింది. ఈ కుటుంబ ప్రత్యేకత అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై నిలకడైన పోరాటంతో మున్సిపాలిటీ పనుల్లో తనదైన ముద్రవేసింది. ఇలాంటి రాజకీయ వారసత్వం నిర్మల్ మున్సిపల్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. -
మందమర్రిలో 80 శాతం బొగ్గు ఉత్పత్తి
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో జనవరిలో 80 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని జీఎం ఎన్.రాధాకృష్ణ తెలిపారు. శనివారం జీఎం కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. శాంతఖనిలో 11,170 టన్నులు, కేకే–5లో 20,185, కాసిపేట 13,049, కాసిపేట–2లో 11,956, కేకే ఓసీ 1,58,675 టన్నులు బొగ్గు ఉత్పత్తి అయినట్లు తెలిపారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం ఏరియాలో 65 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగినట్లు జీఎం వెల్లడించారు. మందమర్రి ఏరియాలోని భూగర్భ గనుల్లో పలువురు కార్మికులు గైర్హాజరు కావడం వల్ల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని తెలిపారు. ఇప్పటికే గైర్హాజరు కార్మికులు పలు మార్లు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. సంస్థ నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు ఇంకా రెండు నెలలు సమయం ఉందని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్వోటూ జీఎం లలితేంద్ర ప్రసాద్, డీజీఎం (పర్సనల్) అశోక్, ఏరియా ఇంజినీర్ బాలాజీ భగవతి, ఐఈడీ కిరణ్కుమార్, సివిల్ ఎస్ఈ శ్రీధర్, సీనియర్ పీవో సత్యనారాయణ పాల్గొన్నారు. సోషల్మీడియాలో పోస్టుచేసిన వ్యక్తిపై కేసు ఆదిలాబాద్టౌన్: మున్సిపల్ ఎన్నికల సందర్బంగా సోషల్మీడియాలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పోస్టు పెట్టిన వ్యక్తిపై శనివారం కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపా రు. పట్టణంలోని ఒడ్డెరకాలనీకి చెందిన దుండుగుల నాగన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోస్ట్ చేయడంపై ఆ పార్టీ నాయకుడు ఎంఏ ఖ య్యూం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైన సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు. -
మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
● రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారి, కలెక్టర్, ఈఆర్వోలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు ముందుగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి ఆయా పార్టీల నుంచి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలోని బూత్ స్థాయి అధికారులు ప్రతీ ఇంటికి వెళ్లి పరిశీలిస్తారని తెలిపారు. మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
కౌన్సిలర్ నుంచే ‘గోనె’ ప్రస్థానం
కాంగ్రెస్ నుంచి గోనె హన్మంతరావు రెండు పర్యాయాలు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 1961 ఎన్నికల్లో పాతమంచిర్యాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1967లో మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. 1987లో కాసిపేట మండలం ముత్యంపల్లి నుంచి సింగిల్ విండో చైర్మన్గా గెలిచారు. ఆ తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవిని అలంకరించారు. 1989లో లక్సెటిపేట(ప్రస్తుతం మంచిర్యాల) నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి టికెట్ కోసం విఫలయత్నం చేశారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టికెట్ లభించగా విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. 1999, 2010లో పోటీ చేసినా ఓటమి చవిచూశారు. రాజకీయాల నుంచి వైదొలిగిన ఆయన అనారోగ్యంతో మృతిచెందారు. -
విత్డ్రాపై మంతనాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా దాఖలైన నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. ఒక్కో వార్డు, డివిజన్ నుంచి పదుల సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో పోటీ రసవత్తరంగా మారుతోంది. దీంతో నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ అభ్యర్థులతో మంతనాలు మొదలయ్యాయి. ఒకే రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు వేసిన చోట్ల ఈ పరిస్థితి అధికంగా ఉంది. జాతీయ పార్టీ నుంచి రాష్ట్ర, గుర్తింపు పొందిన పార్టీలు, స్వతంత్రుల వరకు ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారు. దీంతో ఒక్కో చోట ఐదు కంటే ఎక్కువగానే అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంది. అభ్యర్థుల వారీగా ఓట్లు చీలిపోయే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు మిగతా వారిని పోటి నుంచి తప్పుకోవాలని కోరుతున్నారు. మూడు రోజుల్లో జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లో ఉన్న 149 వార్డుల్లో 1061 మంది 1599 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, ఆమ్ ఆద్మీ, ఎంఐఎంతోపాటు స్వతంత్రులు నామినేషన్లు వేశారు. వీరిలో కాంగ్రెస్ 519, బీఆర్ఎస్ 411, బీజేపీ 326, స్వతంత్రులు 117 మంది ఉండగా.. మిగతా వారు వివిధ పార్టీల కు చెందిన వారు ఉన్నారు. ఒక్కొక్కరు రెండేసి, మూడేసి చోట్ల నామినేషన్లు వేశారు. నిబంధనల ప్రకారం లేని వాటిని అధికారులు పరిశీలన అనంతరం తిరస్కరించారు. బెల్లంపల్లిలో ఒకటి, మంచిర్యాల, చెన్నూర్లో రెండు చొప్పున మొత్తంగా ఐదు తిరస్కరణకు గురయ్యాయి. క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో అన్ని నామినేషన్లు ఆమోదించారు. ఈ నెల 3న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు తుదిగా పోలింగ్ బ్యాలెట్ పేపర్లో బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. అన్ని చోట్ల రెబల్స్ టికెట్లు దక్కయని తెలిసిపోయిన చోట్ల వార్డుల్లో బరిలో ఉన్న అభ్యర్థులతో బ్యాలెట్ పేపర్లో గుర్తులు, వరుస క్రమంతో రానున్నాయి. దీంతో కొద్ది పాటి ఓట్లతోనే గెలుపోటములు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీతో సహా బీఆర్ఎస్, బీజేపీలో సొంత పార్టీ నాయకులు బరిలో ఉన్నారు. తమకు టికెట్ కేటాయించకున్నా పోటీ పడుతున్నారు. దీంతో పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులకు రెబల్స్ బెడద తప్పడం లేదు. కొందరు చివరి క్షణంలో తమకు బీ ఫాం దక్కే అవకాశం ఉందనే నమ్మకంతో ఉంటున్నారు. ఇంకా అధికారికంగా బీ ఫాంలు అందకపోయే సరికి అందరూ ఆతృతతో ఉన్నారు. బెల్లంపల్లిలో అధికార పార్టీ నాయకుల మధ్య టికెట్ల విషయంలో పోటాపోటీ నడుస్తోంది. జిల్లా కేంద్రంలోనూ రెబల్స్ పోటీలో ఉన్నారు.పరిశీల అనంతరం నామినేషన్ల వివరాలుమున్సిపాలిటీ వార్డులు అభ్యర్థులు నామినేషన్లు మంచిర్యాల 60 362 386 బెల్లంపల్లి 34 252 279 చెన్నూరు 18 154 171 క్యాతనపల్లి 22 193 241 లక్సెట్టిపేట 15 100 100 మొత్తం 149 1061 1177 తిరస్కరణ గురైనవి 05 -
వనంలోకి తల్లులు
మంచిర్యాలఅర్బన్: స్థానిక గోదావరి నదీ తీరాన మూడు రోజులపాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వనదేవతల జాతర శనివారం ముగిసింది. చివరి రోజు తల్లుల దర్శనానికి భక్తజనం పోటెత్తింది. మధ్యాహ్నం 12.30గంటలకు గిరిజన పూజారి సతీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం సమ్మక్క, సారలమ్మలను వన ప్రవేశం చేయించారు. జాతర ప్రత్యేక అధికారి రవికిషన్గౌడ్, ఈవో ముక్తా రవి, పూజారి సతీష్ వనదేవతలకు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి గౌతమేశ్వర ఆలయ సమీపంలోని చెట్లపొదల్లో ఇల్లారిలో దేవతలను వనప్రవేశం చేయించారు. భక్తులు పెద్దయెత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. జాతర ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు, ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ సభ్యులు సేవలందించారు. పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రత చర్యలు చేపట్టారు. జాతర హుండీ లెక్కింపు జాతరలో ఏర్పాటు చేసిన హుండీలను శనివారం పోలీసుల పర్యవేక్షణలో దేవదాయ, ధర్మదాయ శాఖ సిబ్బంది, జాతర సేవా కమిటీ సభ్యులు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్లు లెక్కించారు. రూ.14,67,450 ఆదాయం రాగా, 900 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, 444గ్రాముల మిశ్రమ వెండి కానుకల రూపంలో భక్తులు సమర్పించారు. దుకాణాల ఏర్పాటుకు బహిరంగ వేలం, హుండీ, టెంకాయ రశీదు, కేశఖండనం, ప్రత్యేక దర్శనం రశీదు ఆదాయం మొత్తం రూ.31,19,080 సమకూరింది. జాతర పర్యవేక్షణాధికారి రంగు రవికిషన్గౌడ్, ఈవో ముక్తా రవి, తదితరులు పాల్గొన్నారు. -
‘చేయి’ కలిపి ‘కారు’లో సీపీఐ
బెల్లంపల్లి: జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలతో వేర్వేరుగా జత కలిసి పోటీ చేయడానికి సీపీఐ సిద్ధమైంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, బెల్లంపల్లి, క్యాతనపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట మున్సిపాల్టీల్లో ఒక్కోచోట ఒక్కో పార్టీతో పొత్తుకు సానుకూల పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయనుండగా.. క్యాతనపల్లిలో కారెక్కడం ఖాయమైంది. బెల్లంపల్లిలో పొత్తుకు తుది ప్రయత్నాల్లో ఉన్నారు. చెన్నూర్, లక్సెట్టిపేటలో ఒంటరిగా పోటీకి సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్నేహపూర్వకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ మంచిర్యాలలో తప్ప చెన్నూర్, బెల్లంపల్లి బల్దియాల్లో కమ్యూనిస్టులతో చెలిమికి నిరాకరించడంతో పొత్తుకు తలుపులు మూసుకుపోయినట్లు తెలుస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు స్నేహహస్తం అందించి పొత్తుకు ముందుకు రాగా, క్యాతనపల్లి, బెల్లంపల్లిలో స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతోపాటు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మొండిచేయి చూపినట్లు సీపీఐ శ్రేణులు చెబుతున్నారు. ఇ దే అదునుగా కామ్రేడ్లతో పొత్తుకు బీఆర్ఎస్ ముందుకు రావడంతో పొత్తులు ఒక్కసారిగా మలుపులు తిరిగాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని సీపీఐ, బీఆర్ఎస్ పొత్తుకు సిద్ధపడినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సీట్ల ఒప్పందం ఇలా.. -
పారదర్శకంగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల(ప్రాక్టికల్స్)ను పారదర్శకంగా నిర్వహించాలని డీఐఈవో అంజయ్య సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష నిర్వహణ మార్గదర్శకాలపై చీఫ్ సూపరింటెండెంట్లు, పరీక్షల నిర్వహణ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ నెల 2నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని, 20 పరీక్ష కేంద్రాల్లో 5,398 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. సందేహాలు, సలహాలకు జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, 8328172384, 9291658408 నంబర్లలో సంప్రదించాలని తలెఇపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు శంకర్, విజిత్కుమార్ పాల్గొన్నారు. -
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ‘నడిపెల్లి’
నడిపెల్లి దివాకర్రావు సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. కిరాణ దుకాణ వ్యాపారిగా, ఎల్ఐసీ ఏజెంట్గా పని చేశారు. 1981లో జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో అప్పటి 7వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచారు. 1987లో మంచిర్యాల సింగిల్ విండో చైర్మన్గా పోటీ చేసి విజ యం సాధించారు. బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలోనే 1999లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో టికెట్ లభించింది. విజయం సాధించిన ఆయన మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2004లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందా రు. ఇక 2009లో టీఆర్ఎస్ ప్రభంజనంలో ఓ టమి చెందారు. తిరిగి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి మూడోసారి, 2018లో ఎన్నికల్లో గెలి చి నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం బీ ఆర్ఎస్ తరఫున రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. -
అధ్యక్షుడి నుంచి ‘అధ్యక్షా’ దాకా.. ఖుర్షిద్
● అంచెలంచెలుగా ఎదిగి.. ● ఎమ్మెల్యేలుగా ఎన్నికై న కౌన్సిలర్లు, చైర్మన్లుఆదిలాబాద్ మున్సిపాలిటీకి నిర్వహించిన రెండో ఎన్నికల్లో మసూద్ హైమద్ ఖుర్షిద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1962 నుంచి 1965 వరకు ఆ బాధ్యతలు నిర్వహించారు. స్నేహశీలిగా, మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. మున్సిపల్ పరిధిలో అందించిన సేవలతో ప్రజల ఆదరణ చూరగొన్నారు. ఈ క్రమంలో 1972లో కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీచేశారు. ప్రజలు ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేసిన ఆయనను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. -
ఎడ్లబండిపై వెళ్లి సబ్ కలెక్టర్ పరిశీలన
భీమిని: కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి, గొల్ల గట్టు గ్రామాల్లో పలు వివాదాస్పద భూములను బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ శనివారం ఎడ్లబండిపై వెళ్లి పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించాలని సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక తహసీల్దార్ రాంచందర్తో కలిసి వెళ్లారు. వాహనాలు వెళ్లే దారి లేకపోవడంతో ఎడ్లబండిలో వాగు దాటి వెళ్లి పరిశీలించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు వేడుకున్నారు. తహసీల్దార్ రాంచందర్, ఆర్ఐ చంద్రమౌళి, నాయకులు నర్సింగరావు, బానేష్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సాయుధ పోరు నుంచి.. రంగనాథ్రావు
తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ రంగనాథ్ రావు బొల్లాన్వార్ ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఆవిర్భావంతోనే ఎన్నికల బరిలో నిలిచారు. నాడు నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సీపీఐపై అప్పట్లో నిషేధం విధించారు. దీంతో ఆ పార్టీకి చెందిన నాయకుడైనప్పటికీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) తరఫున మున్సిపల్ బరిలో నిలిచారు. అధ్యక్షుడిగా విజయం సాధించి 1952 నుంచి 1961 వరకు దాదాపు దశాబ్దకాలం పాటు పట్టణ ప్రజలకు సేవలందించారు. ఈ క్రమంలో అదే పార్టీ తరఫున 1957లో ఎమ్మెల్యేగా పోటీచేసి ప్రజల మద్దతుతో అసెంబ్లీలో అడుగు పెట్టారు. చైర్మన్, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మరోసారి మున్సిపల్ బరిలో నిలిచి గెలుపొందారు. రెండోసారి 1967 నుంచి 1972 వరకు చైర్మన్గా సేవలందించారు. పదవులు చేపట్టినప్పటికీ అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్యుడివలే కాలినడకన తిరిగేవారని ఆయన వ్యక్తిత్వాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు ఆయన సమకాలికులు. -
నిర్మలమ్మ కరుణించేనా..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆదివారం ప్రవేశపెడుతున్న బడ్జెట్పై జిల్లా వాసుల్లో ఆశలు నెలకొన్నాయి. దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న పలు పథకాల్లో భాగంగానే జిల్లాకు నిధులు వస్తున్నాయి. కానీ ఏటా కేంద్రం నుంచి ప్రత్యేకంగా జిల్లాకు నిధులేమీ దక్కడం లేదు. ఈసారైనా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ప్రాంత వాసులపై కరుణ చూపాలని కోరుతున్నారు. సింగరేణి కార్మికుల ఆదాయపన్ను కోల్ ఇండియాలో మాదిరి యాజమాన్యామే చెల్లించేలా వెసులుబాటు, కొత్త గనులు సింగరేణికి కేటాయింపులు చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది జూన్లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ క్రమంలో గోదావరి పరిరక్షణ, అభివృద్ధి కోసం కేంద్రం దయ చూపాల్సి ఉంది. మంచిర్యాలకు స్మార్ట్సిటీ హోదా.. జిల్లాలో ప్రస్తుతం అమృత్ భారత్ స్కీం కింద జిల్లా కేంద్రంతో మంచిర్యాలతో సహా బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి, లక్సెట్టిపేటలో పనులు కొనసాగుతున్నాయి. నీటి ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణం జరుగుతోంది. ఇక కార్పొరేషన్గా మారిన మంచిర్యాల నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటిస్తే నిధులు మౌలిక వసతుల పెంపునకు దండిగా వచ్చే అవకాశం ఉంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల సరసన జిల్లా కేంద్రం చేరే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారు. మంచిర్యాల నగరం రాముని చెరువు ముందు నుంచి టు టౌన్కు రాకపోకలు మెరుగు పర్చేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. ప్రస్తుతం టు టౌన్ వెళ్లాలంటే అండర్ బ్రిడ్జితో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఐబీ నుంచి వెళ్లే ఓవర్ బ్రిడ్జి పై నుంచి రోజువారీగా ట్రాఫిక్ పెరుగుతోంది. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే హమాలీవాడ వెళ్లేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జి మంజూరు చేసింది తెలిసిందే. రైల్వేస్టేషన్ల ఆధునీకరణ రైల్వేస్టేషన్ల ఆధునీకరణ కోసం నిధులు రావాల్సి ఉంది. మంచిర్యాల స్టేషన్ అమృత్భారత్లో ఎంపికై ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచినీ రోడ్, ఆసిఫాబాద్ రోడ్, కాగజ్నగర్, సిర్పూర్ టీ వరకు స్టేషన్ల ఆధునీకరణ జరగాల్సి ఉంది. వీటిలో రేచినీ రోడ్లో కనీసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులో లేదు. ఇక మధ్య తరహా స్టేషన్లలో రైళ్లు నిలపకవపోడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. -
బీఆర్ఎస్, సీపీఐ కలిసి పని చేస్తాయి
రామకృష్ణాపూర్: స్థానికంగా నెలకొన్న పరిస్థితులతోపాటు భావసారూప్యత కలిగిన అనేక అంశాల్లో సమాలోచన విధానాలు ఉన్న సీపీఐ, బీఆర్ఎస్ పార్టీలు క్యాతనపల్లి మున్సిపాల్టీ ఎన్నికల్లో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రకటించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రెండు పార్టీల నాయకులు కొన్ని గంటలపాటు విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ఎన్నికలకే పరిమితం కాకుండా భవిష్యత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై కలిసి పోరాడాలన్నది తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఆయన అన్నారు. క్యాతనపల్లి మున్సిపాల్టీలో 22 వార్డుల్లో 8 నుంచి 10 లేదా ఒకటి ఎక్కువో తక్కువో స్థానాలు సీపీఐకి కేటాయించే దిశగా చర్చలు జరిగాయని తెలిపారు. సర్వే ఆధారంగా ఇరుపార్టీల బలబలాలను అంచనా వేసిన అనంతరం ఈ నెల 3న సీట్ల పంపకంపై స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. ఏఐటీయూసీ నేత సీతారామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా ఉన్నా పొత్తు చర్చల సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సీపీఐని తక్కువగా చేసి మాట్లాడారని, అది తమను బాధించిందని అన్నారు. పార్టీని కాపాడుకోవడానికి బీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మిట్టపెల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజారమేష్, మేడిపెల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
బాసరలో భక్తుల సందడి
బాసర: బాసర ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహా రాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ద్వా దశి శుభ ముహూర్తంలో తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం చేయించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈఓ అంజనాదేవి పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి సుమారు గంట సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. బీసీలకే ప్రాధాన్యంమంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు శుక్రవారం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రకారం ఆయా సామాజిక వర్గాలకు సీట్లను కేటాయించగా ఎస్సీలకు 9 స్థానాలు, 27వ డివిజన్ జనరల్ మహిళకు రిజర్వు కాగా, ఆ స్థానంలో ఎస్సీ అభ్యర్థికి అవకాశం కల్పించారు. బీసీ స్థానాలు 20, జనరల్ స్థానాల్లో నుంచి 21 స్థానాలను సైతం బీసీలకే కేటాయించారు. జనరల్ స్థానాలు మొత్తం 30 ఉండగా, కేవలం 8 మంది ఓసీ అభ్యర్థులకు ఆయా స్థానాలను కేటాయించారు. బీసీల్లోనూ ఎక్కువగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ఎంపిక చేశారు. -
నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
చెన్నూర్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చెన్నూర్లో శుక్రవారం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు పెద్దఎత్తున తరలిరావడంతో నామినేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంది. కేంద్రంలోకి ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా పెద్దఎత్తున ఆయా పార్టీల కార్యకర్తలు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను అనుమతిస్తూ బీఆర్ఎస్ నాయకులను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. సీఐ బన్సీలాల్ సంఘటన స్థలానికి చేరుకొని అన్ని పార్టీలకు నిబంధనలు ఒకే విధంగా ఉంటాయని, అందరూ పోలీసులకు సహకరించాలని సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు. -
చికిత్సతోనే టీబీ నివారణ
నెన్నెల: టీబీ వ్యాధిని ముందస్తుగా గుర్తించి చికిత్స అందిస్తే పూర్తిగా నివారించవచ్చని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుధాకర్నాయక్ అన్నారు. శుక్రవారం ఆవుడంలో ఏర్పాటు చేసిన ముక్త భారత్ అభియాన్లో పాల్గొని అవగాహన కల్పించారు. ప్రతీ పీహెచ్సీలో తెమడ, ఎక్స్రే పరీక్షలు ఉచితంగా చేస్తున్నారన్నారు. వ్యాధి నిర్ధారణ జరిగితే పూర్తిగా నయం అయ్యే వరకు ప్రతీనెల రూ.వెయ్యి చొప్పున పోషణ భత్యాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. 22 మందికి తెమడ పరీక్ష, 116 మందికి ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ లక్ష్మణ్, సర్పంచ్ పావని, తదితరులు పాల్గొన్నారు. -
అనారోగ్యంతో తల్లి మరణం.. దుఃఖంలోనూ నామినేషన్
కాగజ్నగర్టౌన్: అనారోగ్యం తల్లి చనిపోయి తీవ్ర దుఃఖంలోనూ ఓ అభ్యర్థి మున్సిపల్ ఎన్నికల్లో నా మినేషన్ దాఖలు చేశారు. కుమురంభీం ఆసిఫాబా ద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని 25వ వార్డుకు చెందిన కుడుక శ్రీను తల్లి తారాబాయి గురువారం రా త్రి అనారోగ్యంతో మృతిచెందింది. శుక్రవారం నా మినేషన్లకు చివరిరోజు కావడంతో ఇంట్లో తల్లి మృతదేహం ఉండగానే.. కాలనీ ప్రజలకు సేవ చేయాలనే తపనతో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆ ప్రక్రియ పూర్తయిన అనంతరం తిరి గి వచ్చి మధ్యాహ్నం తల్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. -
వ్యక్తిత్వాన్ని బట్టి ఓటేసేవారు
నేను 1987లో మంచిర్యాల మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు ఈ ప్రాంతంలోని ప్రజలు నన్ను కేవలం వ్యక్తిత్వం ఆధారంగానే గెలిపించారు. ఎన్నికలంటే మందీ మార్బలంతో ప్రచారం నిర్వహించేందుకు చేసే ఖర్చు తప్ప, ఇతర ఖర్చులేవి ఉండేవి కావు. రూ.20 వేల లోపు మాత్రమే ఖర్చు అయ్యే ఎన్నికలు 1995లో రూ.1.50 లక్షల ఖర్చుతో ప్రజలు గెలిపించారు. 2020లో ఖర్చు 20 రెట్లు పెరిగింది. ప్రస్తుతం 30 రెట్లు పెరిగి రాజకీయాలంటేనే ఖర్చు అనే స్థితికి వచ్చింది. – పెంట రాజయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ఖర్చుతో కూడుకున్నవి మొదటిసారి 2000 సంవత్సరంలో కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు ఖర్చు రూ.30 వేలు. 2005లో రెట్టింపు అయ్యింది. 2020లో పదింతలు అయ్యింది. వార్డులోని ప్రజలతో ఎప్పటికప్పుడు మాట్లాడి, వారి సమస్యలను తీర్చేందుకు ముందుండడం వల్ల గెలుపు సులభతరంగా మారింది. ప్రస్తుత కాలంలో ఎన్నికల వ్యయం అనుకున్న దానికంటే ఎక్కువవుతోంది. ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నదిగా మారిపోయింది. – బుద్దార్థి రాంచందర్, మాజీ కౌన్సిలర్, మంచిర్యాల -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కాగజ్నగర్టౌన్: దహెగాం మండలంలోని రాళ్ళగూడకు చెందిన ఆత్మకూరి కళావతి గురువారం అనుమానస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ కుమారస్వామి తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆత్మకూరి కళావతి అదే గ్రామానికి చెందిన వగాడే బడేరామ్ వద్ద రూ.40 వేలు అప్పుగా తీసుకుంది. డబ్బుల విషయంలో కొన్ని రోజుల క్రితం జరిగిన గొడవల్లో బడేరామ్ ఎప్పటికై నా చంపుతానని బెదిరించాడు. ఈనెల 28న మృతురాలు ఇట్యాలలోని ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్కు వెళ్లివస్తుండగా బడేరామ్ ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. సదరు మహిళ కిందపడడంతో చీరకొంగుతో గొంతుచుట్టు చుట్టి గొంతునులిమి హత్యచేసి సమీపంలోని పత్తి చేనులో పడేశాడు. ఈమేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
కానిస్టేబుల్ సమయస్ఫూర్తి..
నిర్మల్టౌన్: పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. శుక్రవారం ఉదయం సుమారు 7:50 గంటల సమయంలో భార్యాభర్తలు బైక్పై స్థానిక పోలీస్ పంపు వద్దకు వచ్చారు. పెట్రోల్ పోయించుకున్న అనంతరం ఆ వ్యక్తికి అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో బైక్పై నుంచి కిందపడ్డాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నవీన్ అప్రమత్తమై సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేసి ప్రాణాలు కాపాడాడు. కానిస్టేబుల్ చూపిన సమయస్ఫూర్తి, ధైర్యం, మానవత్వంతో ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడ్డాయి. తర్వాత ఆ వ్యక్తిని వెంటనే మరో వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. కానిస్టేబుల్ నవీన్ను జిల్లా ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు. -
గూడెం గుట్టలో కల్యాణ వైభోగం
దండేపల్లి: తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం లోని గూడెం గుట్టపై వెలసిన శ్రీసత్యనారాయణస్వామి–రమాదేవి కల్యాణోత్స వం శుక్రవారం రాత్రి కనుల పండువగా జరిగింది. వేద పండితులు నారాయణశర్మ, భరత్శర్మ, ప్రధా న అర్చకులు రఘుస్వామి, సంపత్స్వామి వేదమంత్రోచ్ఛరణలతో స్వామివారి కల్యాణాన్ని కమణీయంగా జరిపించారు. ఈవో శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. వేడుకల్లో ఎమ్మెల్యే సతీమణీ కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
ముగిసిన క్రీడా సంబరాలు
బోథ్: బోథ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల క్రీడా ప్రాంగణంలో మూడు రోజుల పాటు అత్యంత ఉత్సాహంగా సాగిన శ్రీజిల్లాస్థాయి బాలికల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్–2026 (ప్రేరణ)శ్రీ క్రీడాపోటీలు శుక్రవారం ముగిశాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించడమే కాకుండా మానసిక, శారీరక ధృఢత్వానికి తోడ్పడతాయన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ తమ ప్రాంత విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రతిభ కనబరుస్తుండటం గర్వకారణమన్నారు. కలెక్టర్ రాజార్షి షా మాట్లాడుతూ లక్ష్య సాధనలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి క్రీడల ద్వారా లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, క్యారమ్స్, చెస్, టెన్నికాయిట్ అండర్–14, అండర్–17 విభాగాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అథ్లెటిక్స్ అండర్–14, అండర్–17 విభాగాల్లో, ఓవరాల్ గేమ్స్ చాంపియన్షిప్గా ఆశ్రమ పాఠశాల విజేతగా నిలిచింది. ఓవరాల్ చాంపియన్షిప్ ద్వితీయ స్థానాన్ని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం గెలుచుకుంది. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లెపూల నర్సయ్య, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ సంగీత, తదితరులు పాల్గొన్నారు. -
గాంధారి మైసమ్మ జాతర షురూ
రామకృష్ణాపూర్: ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యధైవమైన గాంధారి మైసమ్మ జాతర శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులో మూడు రోజుల పాటు నిర్వహించే జాతరలో మొదటిరోజు శుక్రవారం ఆదివాసీలు సంప్రదాయ పూజలు నిర్వహించారు. సదర్ భీమ న్న ఆలయంలో పూజల అనంతరం దేవతామూర్తు ల ఊరేగింపు నిర్వహించారు. తప్పెటగూళ్ళ ఆట లు, పిల్లనగ్రోవి వాయిద్యాలు, డప్పుచప్పుళ్ల నడు మ బొక్కలగుట్ట నుంచి ప్రారంభమైన ఊరేగింపు గాంధారివనం, గద్దెరాగిడి, ఏసీసీ మీదుగా మంచిర్యాల గోదావరి వరకు సాగింది. అక్కడ గిరిజనులు గోదావరినదిలో దేవతామూర్తులకు సంప్రదా యబద్ధంగా నైవేద్యం సమర్పించారు. గోదావరిలో పూజల అనంతరం రాత్రి అక్కడి నుంచి తిరిగి సదర్భీమన్న ఆలయం వద్దకు దేవతామూర్తులను తీసుకువచ్చారు. శనివారం ఉదయం గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భీమన్న దేవునికి పట్నాలు వేస్తారు. సాయంత్రం గోదావరి జలాలతో దేవతామూర్తులకు మరోసారి అభిషేకాలు చేసి జాతర జరిగే ఖిల్లా దిగువ ప్రాంతానికి తరలివెళ్లనున్నారు. రాత్రి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన లక్ష్మీదేవర కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం పూజారులతో మైసమ్మ తల్లికి పెద్దపూజ నిర్వహిహించనున్నారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయక్పోడ్ సంఘం నాయకులు, భక్తులు పాల్గొన్నారు. -
అదృష్టమంటే ఆ దంపతులదే..
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ చరిత్రలో ఆ దంపతులు ప్రత్యేకత చాటుకున్నారు. భార్యాభర్తలు వరుసగా పదేళ్లు మున్సిపల్ పీఠాన్ని అధిరోహించి ఏకచత్రాధిపత్యంగా పుర రాజకీయాలను శాసించారు. 2001లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గృహిణిగా ఉన్న మత్తమారి సరస్వతి అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటికే ఆమె భర్త మత్తమారి సూరిబాబు కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్నారు. అదృష్టం కలిసి రావడంతో రాజకీయాలకు కొత్త అయినప్పటికీ సరస్వతి ఎన్నికల్లో పోటీచేసి చైర్పర్సన్ అయ్యారు. 2005లో జరిగిన ఎన్నికల్లోనూ సూరిబాబు చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇలా దంపతులిద్దరూ మున్సిపల్ రాజకీయాల్లో తమదైన శైలిలో రాణించి రికార్డు సృష్టించారు. సూరిబాబును వరించిన అదృష్టం 2005లో మున్సిపల్ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా జరిగాయి. మత్తమారి సూరిబా బు (కాంగ్రెస్), పసుల సురేష్ (టీఆర్ఎస్) మున్సిపాలిటీలో ని 15వ వార్డు నుంచి పోటీ చే శారు. సమ ఉజ్జీలు కావడంతో ఆ వార్డు ఓటర్లు ఇద్దర్నీ సమానంగా ఆదరించారు. చెరో 209 చొప్పున ఓట్లు వచ్చాయి. విజేతను ప్రకటించడానికి మున్సిప ల్ ఎన్నికల అధికా రులు డ్రా తీశారు. అందులో సూరిబాబు పేరు రావడంతో కౌన్సిలర్గా ఎన్నికై నట్లు ప్రకటించారు. ఆ తీరుగా డ్రా రూపంలో సూరి బాబును అదృష్టం వరించింది. కౌన్సిలర్గా ఎన్నికై న సూరిబాబు మిగతా కౌన్సిలర్ల మద్దతు కూడగట్టి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. ఆ ప్రకారంగా భార్యాభర్తలు పదేళ్ల పాటు పుర పాలన పగ్గాలు చేపట్టారు. అంతటి అరుదైన అవకాశం ఇంతవరకు మరెవరికీ దక్కక పోవడం గమనార్హం. -
15 ఏళ్లయిన పాలన సాగలే!
నిర్మల్ జిల్లాలో 15 ఏళ్ల క్రితం రూ.50 లక్షలతో నిర్మించిన మున్సిపల్ భవనాన్ని సెప్టెంబర్ 23, 2010లో అప్పటి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికీ ఆ భవనంలో పరిపాలనకు నోచుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. పాత మున్సిపల్ కార్యాలయ భవనం పెచ్చులూడుతున్నా అందులోనే పరిపాలన కొనసాగిస్తున్నారు. దాదాపు ముగ్గురు చైర్మన్లు మారినప్పటికీ నూతన భవనంలో వాస్తు దోషం ఉందంటూ పాత భవనంలో పాలన కొనసాగిస్తూ ఉండడం కొసమెరుపు. ప్రస్తుత భవనం పగుళ్లు తేలి, స్లాబ్ పెచ్చులు ఊడుతున్నాయి. దీంతో ఎప్పుడు కూలుతుందోనని అందులో పనిచేసే సిబ్బంది భయపడుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ఏర్పడే నూతన పాలకవర్గమైనా కొత్త భవనంలో పరిపాలన కొనసాగించాలని జిల్లావాసులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
నాటి ఎన్నికలే వేరు..
మంచిర్యాలటౌన్: గతంలో ఎన్ని కలంటే పార్టీలు, అభ్యర్థులను చూసి ఓటేసి గెలిపించేవారు. కా నీ మారుతున్న కాలంలో శ్రీఎవరు ఎక్కువగా ఖర్చు చేస్తే వారికే గెలుపు అవకాశాలుశ్రీ అన్నట్లుగా ఎన్నికలు మారిపోయాయి. సర్పంచ్ ఎన్నికల నుంచి మొదలు ఎంపీ, ఎమ్మెల్యే వరకు డ బ్బే ప్రధానంగా మారుతోంది. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుని, ప్రజాసేవకు అంకితం అయ్యేవారిని ప్రజలు స్వయంగా ఎన్నికల బరిలో ఉంచి మరీ గెలిపించుకున్న రోజుల నుంచి ఎన్నికల్లో ఆ యా పార్టీల టికెట్లను పొందేందుకు ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు పడిగాపులు కాయాల్సిన పరిి స్థతి ఏర్పడింది. ఎన్నికల నిర్వహణ ఖర్చు రూ.10 వేల నుంచి రూ.కోటికి పెరిగిందంటే ఎన్నికలు ఎంత ఖరీదుగా మారాయో తెలుస్తోంది. ఎన్నికల కో సం పనిచేసే వారికి చేసే ఖర్చు మాత్రమే గతంలో ఉండేది. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు ఓటుకు ఇంతా అని లెక్కలేసి పంచాల్సిన పరిస్థితి. అభ్యర్థులు ఇచ్చే డబ్బుకో ఇంకా దేనికో ఆశించి ఓటును అమ్ముకోకుంటేనే ఆ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు వెళుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
శ్రమ దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు
కాగజ్నగర్టౌన్: నిర్బంద శ్రమ దోపిడీకి పాల్ప డితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజ అన్నారు. శుక్రవారం కాగజ్నగర్ మండలం ఈజ్గాం శివారులోని ఎస్స్టార్ఎస్ ఇటుక బట్టీలో డీసీపీవో బూర్ల మహేష్తో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజ మాట్లాడుతూ ఒరిస్సాకు చెందిన మూడు నెలల బాలింత, 50 ఏళ్ల మహిళ, పదహారేళ్ల బాలుడిని నిర్భంద శ్రమదోపిడికి పాల్పడుతున్నారని, కనీస అవసరాలు కల్పించకుండా యజమాని వారిని కఠినంగా పని చేయించుకుంటున్నారని తమకు అందిన సమాచారం మేరకు తని ఖీలు నిర్వహించి బాధితులను జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ లాయర్ బ్రోమిక్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్, సఖీ కేంద్రం సిబ్బంది శ్రీనిధి, హెడ్ కానిస్టేబుల్ శంకర్, తదితరులు పాల్గొన్నారు. -
వేలాలలో గట్టు మల్లన్న గిరిప్రదక్షిణ
జైపూర్: మండలంలోని వేలాల గట్టు మల్లన్నస్వామి సన్నిధిలో శుక్రవారం 17వ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. ప్రతీనెల ఆరుద్ర నక్షత్రాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సురేశ్ ఆత్మారాం మహరాజ్ ఆధ్వర్యంలో ఉదయం గిరి ప్రదక్షిణ చేపట్టగా ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డేగ స్వప్న నగేశ్, భక్తులు పాల్గొన్నారు. రంజీ ట్రోఫీలో హిమతేజ సెంచరీఆదిలాబాద్: ఆదిలాబాద్ యువ క్రికెటర్ హిమతేజ రంజీ ట్రోఫీలో మరోసారి మెరిశాడు. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా నుంచి ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీకి ఎంపికై న ఈ యువ కెరటం హైదరాబాద్ తరపున ఆడుతూ ఛత్తీస్గఢ్ జట్టుపై 125 పరుగులతో విజేతగా నిలిచాడు. ఛత్తీస్గఢ్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 238కి ఆలౌట్ అయ్యింది. హైదరాబాద్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 415 పరుగులు చేయగా అందులో హిమతేజ 207 బాల్స్లో 125 పరుగులు సా ధించి సత్తా చాటాడు. రంజీ ట్రోఫీలో మరో సారి పతకం సాధించడంపై కోచ్ జయేంద్ర పటాస్కర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
నామినేషన్ పత్రాలను పరిశీలించాలి
చెన్నూర్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ పత్రాలను క్షుణంగా పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు కె.గంగాధర్ అన్నారు. చెన్నూర్ మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. నామినేషన్ల స్వీకరణను పరిశీలించి ఆర్వోలతో వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా సాగుతోందని, అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా స్వీకరిస్తున్నామని తెలిపారు. చెన్నూర్ మున్సిపల్ ఎన్నికల ప్రత్యేకాధికారి కిషన్, మున్సిపల్ కమిషనర్ మురళికృష్ణ, సీఐ బన్సీలాల్ పాల్గొన్నారు. -
తల్లులకు ప్రణమిల్లి..
మంచిర్యాలలో సమ్మక్క, సారలమ్మ దర్శించుకుంటున్న భక్తులుమంచిర్యాలఅర్బన్/రామకృష్ణాపూర్: జిల్లా కేంద్రం మంచిర్యాల గోదావరి నదీ తీరాన సమ్మక–సారలమ్మ దర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. బంగారం, ముడుపులతో తల్లులకు ప్రణమిల్లారు. కోళ్లు, మేకలు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గోదావరి తీరమంతా జనసందోహంతో సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో ఈవో ముక్తారవి, జాతర పర్యవేక్షకుడు రవికిషన్ తదితరులు పాల్గొన్నారు. మందమర్రి ఏరియాలోని ఆర్కే1ఏ గని శివారు పాలవాగు ఒడ్డున సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సమ్మక్క–సారలమ్మ జాతర సందడిగా కొనసాగుతోంది. మూడో రోజు శుక్రవారం దర్శనానికి భక్తులు భారీగా బారులు తీరారు. రామకృష్ణాపూర్, మందమర్రితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దయెత్తున తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. సింగరేణి అధికారులు, వివిధ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు దర్శించుకున్నారు. ఏరియా జీఎం రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఎస్ఓటు జీఎం జీఎల్ ప్రసాద్, డీజీఎం అశోక్ ఆయా గనులు, డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే భీమిని: కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధి చర్లపల్లిలో సమ్మక్క–సారలమ్మలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శుక్రవారం మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల చుట్టూ ప్రదక్షిణ చేశారు. నియోజకవర్గంలోని ప్రజలను చల్లంగా చూడాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింగరావు, సర్పంచ్ బోరిగామ వెంకటేష్, నాయకులు పాల్గొన్నారు. -
సొంత భవనాలు కట్టించాలి...
విధి నిర్వహణలో ఎకై ్సజ్ సిబ్బందికి ఆయుధాలు అవసరమే. ఆయుధాలు భద్రపర్చేందుకు సొంత భవనాలు నిర్మించాలి. ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఎకై ్సజ్ స్టేషన్ సిబ్బందితోపాటు డిస్ట్రిక్ టాస్క్ఫోర్స్, స్టేట్ టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంటు టీమ్లకు సైతం ఆయుధాలు అందజేయాలి. విధి నిర్వహణలో మరింత ధైర్యంగా గుడుంబా, గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయడం జరుగుతుంది. నిజామాబాద్ ఘటన బాధాకరం. – సీహెచ్.సమ్మయ్య, జిల్లా టాస్క్ఫోర్స్ ఎకై ్సజ్ సీఐ, మంచిర్యాల -
బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతం
లక్సెట్టిపేట/బెల్లంపల్లి/చెన్నూర్/మంచిర్యాలక్రైం: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం జిల్లాలోని లక్సెట్టిపేట, బెల్లంపల్లి, చెన్నూర్ బార్ అసోసియేషన్ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. లక్సెట్టిపేటలో జూనియర్ సివిల్ జడ్జి కే.సాయికిరణ్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. బార్ అసోసియేషన్లో 45మంది ఓటర్లు ఉండగా 43 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారిగా ప్రదీప్కుమార్, ఇంచార్జిగా సూపరింటెండెంట్ శ్రీనివాస్ వ్యవహరించారు. బెల్లంపల్లిలో 57మంది సభ్యులకు గాను 52మంది ఓటు హక్కు వేశారని ఎన్నికల అధికారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకెం రవికుమార్ తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి జే.ముకేష్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. చెన్నూర్లో 26 మంది ఓటర్లకు గాను 23మంది ఓటు వేశారు. స్థానిక సివిల్ జడ్జి రవి, సూపరింటెండెంట్ జాఫర్ పర్యవేక్షించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, పోలింగ్ అధికారి మద్ది కార్తీక్, న్యాయవాదులు పాల్గొన్నారు. మంచిర్యాలలోని బార్ అసోసియేషన్లో 376మంది ఓటర్లకు గాను 315మంది ఓటు వేశారు. ఎన్నికల పరిశీలకులుగా స్థానిక రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే.నిరోషా, అిసిస్టెంట్గా ఉషారాణి, ఎన్నికల అధికారిగా స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్ వ్యవహరించారు. -
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ
నస్పూర్: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో రాండమైజేషన్ ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అధికారులకు అవసరమైన శిక్షణ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. నామినేషన్ల కేంద్రం పరిశీలన కలెక్టరేట్లో నామినేషన్ల్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ ఏఓ పిన రాజేశ్వర్, కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్తో కలిసి సందర్శించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా కంట్రోల్ రూం నంబరు 08736–250501 ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. -
నగరంలో 60 డివిజన్లు గెలిపించాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 59 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, ఒక స్థానంలో మిత్రపక్షం సీపీఐ పోటీ చేస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, రాళ్లవాగుకు కరకట్ట నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోపు పూర్తి చేస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అనంతరం పలు పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్లో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నాయకులు పాల్గొన్నారు. -
దుబాయ్ నుంచి స్వదేశానికి తీసుకెళ్లండి
లక్ష్మణచాంద: మండల కేంద్రానికి చెందిన సంగెం రాజు(32) బతుకుదెరువు కోసం గతేడాది దుబాయ్ వెళ్లాడు. అక్కడ అజ్మన్ ప్రాంతంలోని ఓ కంపెనీలో పని కుదిరాడు. గత రెండునెలల క్రితం అనారోగ్యం బారినపడ్డాడు. తనను ఇంటికి పంపించాలని కొన్ని రోజులుగా కంపెనీ వాళ్లకు మొరపెట్టుకున్నా కనికరించలేదు. ఈ విషయంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి చొరవ చూ పాలని సోషల్ మీడియా వేదికగా విన్నవించాడు. తనను స్వదేశానికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. కుటుంబ సభ్యులు.. రాజును స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, రాజుకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. -
వైద్యం వికటించి యువతి మృతి
తాండూర్: మండల కేంద్రానికి చెందిన అక్కెపల్లి భాగ్యలక్ష్మి(24) వైద్యం వికటించి మృతిచెందింది. ప్రియుడే కారణమని ఆరోపిస్తూ మృతురాలి సోదరుడు అక్కెపల్లి కుమారస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. భాగ్యలక్ష్మి హైదరాబాద్ హయత్నగర్లోని బీసీ బాలికల గురుకులంలో నాలుగు నెలలుగా ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. తాండూర్కే చెందిన గట్టు జగదీష్ కొంతకాలంగా తన సోదరిని ప్రేమించానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తమకు తెలియకుండా హైదరాబాద్లో గర్భస్రావం చేయించేందుకు పలు రకాలుగా ప్రయత్నించాడని, సఫ లం కాకపోవడంతో కర్నూల్లోని ఓ ఆస్పత్రిలో బుధవారం గర్భస్రావానికి ప్రయత్నించగా తీవ్ర రక్తస్రావమై గురువారం చనిపోయిందని తెలిపారు. ఈ విషయం జగదీష్ తనకు ఫోన్ చేసి మీ సోదరి ఆరోగ్యం బాగా లేదని తన స్నేహితులతో కలిసి ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందిందని చెప్పాడని కుమారస్వామి తెలిపారు. తన సోదరి మృతికి జగదీష్ కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాండూర్ ఇన్చార్జి ఎస్సై సౌజన్య తెలిపారు. -
పంట చేల నుంచి ఇళ్లలోకి చొరబడి..
● అడవి పందిని హతమార్చిన గ్రామస్తులుతాంసి: మండల కేంద్రంలోని పంట చేల నుంచి అడవి పంది గురువారం ఇళ్లలోకి చొరబడింది. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. పలువురిపై దాడికి యత్నించింది. అప్రమత్తమైన గ్రామస్తులు కర్రలతో కొట్టి హతమార్చారు. రెండునెలల క్రితం గ్రామంలోకి వచ్చిన అడవిపంది ఒకరిని హతమార్చగా, మళ్లీ వరుసగా సంచరిస్తున్నాయి. అటవీ అధికారులు వెంటనే స్పందించి గ్రామంలోకి అడవి పందులు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తనిఖీల్లో నగదు పట్టివేత ఖానాపూర్: పట్టణంలోని ఇంద్రనగర్ శివారులో గురువారం ఎన్నికల లైన్ ప్రారంభ సర్వే బృందం (సర్వేలైన్ స్టార్ట్ టిక్ టీమ్) తనిఖీల్లో భాగంగా ద్విచక్రవాహనదారుడి నుంచి రూ.2,35,100 నగదు లభించాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఒగులాపూర్తండాకు చెందిన భుక్య రాజేందర్ చిట్టీ డబ్బులతో బైక్పై ఖానాపూర్ వస్తున్నాడు. టీం ఇన్చార్జి, ఇరిగేషన్ ఏఈఈ రాథోడ్ విఠల్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఆయన వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని విచారించారు. ఐదు టిప్పర్లు పట్టివేత బోథ్: మండలంలో ఎలాంటి అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మొరం తరలి స్తున్న ఐదు టిప్పర్ల లారీలను పోలీసులు బుధవారం రాత్రి మాటు వేసి పట్టుకున్నారు. మండలంలోని డేరా గ్రామ శివారులో పెద్దఎత్తున మొరం తవ్వకాలు చేసి తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఎస్సై పురుషోత్తం సిబ్బంది సాయికృష్ణ, శ్రీకాంత్, సుధాకర్తో కలిసి దాడులు నిర్వహించారు. మొరం లోడుతో వెళ్తున్న ఐదు టిప్పర్లను గుర్తించి సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. సదరు వాహన యాజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మిస్సింగ్ కేసు ఆసిఫాబాద్రూరల్: మండలంలోని చిలాటిగూడ గ్రామానికి చెందిన బోయిరే మహేశ్ (19) కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. సీఐ బాలాజీ వరప్రసాద్ కథనం ప్రకారం.. ఈనెల 23న మహేశ్ ఇంటి నుంచి ఆదిలాబాద్కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. కుటుంబీకులు సాయంత్రం ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. బంధువుల ఇళ్లలో, చుట్టూపక్కల వెతికిన ఆచూకీ దొరకలేదు. తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు గురువారం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
అరైవ్–అలైవ్.. ప్రమాదాలకు చెక్!
మంచిర్యాలక్రైం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. రోజురోజుకు ప్రమాదాల సంఖ్య పెరిగి రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడం, రాంగ్రూట్లో వెళ్లడం, ర్యాష్ డ్రైవింగ్తో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు శాశ్వత అంగవైకల్యం బారిన పడుతున్నారు. ఈ ప్రమాదాలకు చెక్పెట్టేందుకు తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, స్వీయ రక్షణతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రమాదాల నివారణకు పోలీస్, ఆర్టీవో, ఎకై ్సజ్, రెవెన్యూ, ఎన్హెచ్, ఎస్హెచ్, ఇంజినీరింగ్ శాఖల సమన్వయంతో విలేజ్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగితే అక్కడ కారణాలను విశ్లేషించి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో..రోడ్డు ప్రమాదాల్లో ప్రమాదాల్లో మొదటి స్థానం నిర్మల్, రెండో స్థానంలో మంచిర్యాల ఉంది. గతేడాది 1373 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 353 మంది మృత్యువాత పడ్డారు. మృతిచెందిన వారిలో 80 శాతం యువతే కావడం గమనార్హం. విలేజ్ కమిటీలు ఇలా..పోలీస్శాఖ, ఎకై ్సజ్, ఆర్టీవో, ఎన్హెచ్, ఎస్హెచ్, ఆర్ఆండ్బీ అధికారులు, విలేజ్ నుంచి ఇద్దరు, పది మందితో కూడిన విలేజ్ కమిటీ ఉంటుంది. జిల్లా పోలీస్ శాఖ అధికారి సమన్వయంతో పనిచేస్తారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను సందర్శిస్తారు. దీనికి కారకులెవరు అనేదానిపై విశ్లేషిస్తారు. సాంకేతిక లోపాలు, సైన్బోర్టులు, వేగనిరోధక నియంత్రణ, రేడియం స్టిక్కర్స్ ఏర్పాటుకు కృషి చేస్తారు. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, మద్యం మత్తు, మితిమీరిన వేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్, యూటర్న్ చేసుకునే ముందు ఇండికేట్ చేయకపోవడం, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే అధిక శాతం మృత్యువాత పడుతున్నారని విలేజ్ కమిటీ సర్వేలో తేలింది.గతేడాది ఉమ్మడి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు -
రోడ్డుప్రమాదంలో వ్యాన్ క్లీనర్..
రెబ్బెన: మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజాము జరిగిన రోడ్డుప్రమాద ంలో వ్యాన్క్లీనర్ మృతి చెందినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఆరెపల్లికి చెందిన కొత్తపల్లి నరేందర్ (42) గత కొంతకాలంగా వ్యాన్ క్లీనర్గా పనిచేస్తున్నాడు. మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి వ్యాన్ లోడ్తో కరీంనగర్కు బయల్దేరింది. మహారాష్ట్ర నుంచి వస్తున్న లారీ..రెబ్బెన జాతీయరహదారి ఫ్లైఓవర్పై లారీడ్రైవర్ మొహినుద్దీన్ అజాగ్రత్తగా నడుపుతూ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. వెనుక వస్తున్న వ్యాన్ డ్రైవర్ అంకడాల క్రిష్ణ అప్రమత్తమయ్యే లోపే లారీని ఢీకొట్టా డు. ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జుయింది. తీవ్రగాయాలైన వ్యాన్క్లీనర్ నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్పగాయాలైన వ్యాన్ డ్రైవర్ క్రిష్ణను ఆసుపత్రికి తరలించారు.మృతుడి భార్య రోజా ఫిర్యాదుతో లారీడ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
గొడవలో ఇద్దరికి గాయాలు
లక్ష్మణచాంద: వైన్స్ షాపు వద్ద జరిగిన గొడవలో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి..మండలంలోని రాచాపూర్కు చెందిన జడ రజినీకాంత్ (27) గురువారం మధ్యాహ్నం పని ని మిత్తం కనకాపూర్కు వెళ్లి ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో కనకాపూర్ వైన్స్ షాపు వద్ద ఆగాడు. అదే సమయంలో రాచాపూర్కు చెందిన తక్కల సాయికుమార్..రజినీకాంత్ వద్దకు వెళ్లి తనకు మద్యం తాగించాలని కోరాడు. తన వద్ద డబ్బులు లేవని బదులిచ్చాడు. రజినీకాంత్ పేరున స్టఫ్ను సాయికుమార్ తీసుకోవడంతో ఎందుకు తీసుకున్నావని అడిగాడు. ఆగ్రహించి అక్కడ ఉన్న ఖాళీసీసాతో రజినీకాంత్పై దాడి చేశాడు. ఈక్రమంలో ఒకరికొకరు దాడి చేసుకున్నారు. రజినీ కాంత్కు తీవ్రగాయాలయ్యా యి. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స చేశారు. ఆ ఇద్దరిని నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. సోన్ సీఐ గోవర్ధన్రెడ్డి అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. రజినీకాంత్ భార్య రాజశ్రీ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ తెలిపారు. -
మద్యం పట్టివేత
భైంసాటౌన్: అక్రమంగా మద్యం విక్రయిస్తు న్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సాయికుమార్ తెలిపారు. రాజీవ్నగర్కు చెందిన రాసేట్కర్ బండు ఖడ్డా ప్రాంతంలోని తన హోటల్లో మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. దీంతో రూ.5,290 విలువైన 7.29 లీటర్ల మ ద్యం లభించినట్లు చెప్పారు. అలాగే, హ నుమాన్నగర్లోని ఫైర్స్టేషన్ పక్కన కొండపల్లి నగేశ్కు చెందిన కిరాణా దుకాణంలో తని ఖీ చేయగా, రూ.9620 విలువైన 9.44 లీటర్ల మ ద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
బుగ్గగూడం శివారులో యువకుడు..
కాసిపేట: కాసిపేట పోలీస్స్టేషన్ పరిధి బుగ్గగూడం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాయిని రా జేష్(25) మృతిచెందినట్లు ఎస్సై ఆంజనేయులు తె లిపారు. ఆయన కథనం ప్రకారం.. కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం నాయకపుగూడ చింతపల్లికి చెందిన నాయిడి రాజేష్ అదేగ్రామానికి చెందిన చెదం నాగేశ్లు బైక్పై బుగ్గ దేవాలయం సమీపంలోని సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లి తిరిగివస్తున్నారు. నాగేశ్ బైక్ అతి వేగంగా, అజాగ్రత్తగా నడపడంతో గురువారం తెల్లవారుజాము బుగ్గగూడం శివారు డంపింగ్యార్డు వద్ద అదుపు తప్పి కిందపడ్డారు. వెనుక కూర్చున్న రాజేష్కు తీవ్ర గాయాలై ఘటన స్థలంలో మృతి చెందాడు. మృతుడి మేనమామ చేనేని రాజమల్లు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విదేశీ వద్దు.. స్వదేశీ ముద్దు
లక్ష్మణచాంద: విదేశీ వద్దు–స్వదేశీ ముద్దు అనే నినాదంతో ముందుకు సాగాలని నిర్మల్ జిల్లా సహ సంయోజక్ శివ పిలుపునిచ్చారు. ఈమేరకు సోన్ మండలం న్యూవెల్మల్ బొ ప్పారం గ్రామంలో, లక్ష్మణచాంద మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి స్వదేశీ జాగరణ మంచ్, స్వదేశీ పరుగు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్పై అమెరికా, చైనా, టర్కీ చేస్తున్న ఆర్థిక యుద్ధంపై విద్యార్థులకు, గ్రా మస్తులకు అవగాహన కల్పించారు. స్వదేశీ నినాదాన్ని ఒక జీవన విధానంగా అలవర్చుకుంటామని ఇప్పటి నుంచి స్వదేశీ వస్తువులనే వాడతామని, మన సంస్కృతి, సంప్రదాయాలు, మన వస్త్రాధారణ అన్నింటిలో స్వదేశీగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు లక్ష్మీనర్సయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
లక్సెట్టిపేట/బెల్లంపల్లి: ప్రతి ఒక్కరూ ఎన్ని కల నియమావళి పాటించాలని, సమయం ముగిసిన తర్వాత నామినేషన్లు తీసుకోవద్దని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం లక్సెట్టిపేట, బెల్లంపల్లిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, ఎన్నికల పరిశీలకులు గంగాధర్ వేర్వేరుగా పరిశీలించారు. అభ్యర్థులకు దరఖాస్తు ఫారాలను పరిశీలించి తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తెలియజేయాలని అన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న హెల్ప్ డెస్క్ సిబ్బంది అభ్యర్థులకు తలెత్తే అనుమానాలను నివృత్తి చేసి సహాయ పడాలని సూచించారు. నామినేషన్ పత్రం పూర్తి చేయడానికి అభ్యర్థులు ఇబ్బందులు పడుతుంటారని, అలాంటి వారికి సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్సెట్టిపేట తహసీల్దార్ దిలీప్కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్కుమార్, ఎంపీడీవో సరోజ, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ సంపత్ పాల్గొన్నారు. జాతరలో అడుగడుగునా నిఘా మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో సమ్మక్క జాతరలో పోలీసులు అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. జాతర జరిగే ప్రాంతం, భక్తులు బస చేసే ప్రాంతాలు పూర్తిగా పోలీసుల భద్రత వలయంలో ఉన్నాయి. 20 అధునాతన కెమెరాలు, సుమారు ఐదు వందల మీటర్ల దూరం నుంచి రికార్డు అయ్యే సామర్థ్యం కలిగిన కెమెరాలు అమర్చారు. వెయ్యి మంది పోలీస్ సిబ్బందితోపాటు మిమ్స్, సీవీ రామన్ డిగ్రీ కళాశాల ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వంద మంది బందోబస్తులో పాల్గొంటున్నారు. 24గంటలు కమాండ్ కంట్రోల్ రూమ్లో సీఐ స్థాయి అధికారి జాతర ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. -
జోరుగా నామినేషన్లు
రెండ్రోజుల్లో 374 నస్పూర్: జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్, చెన్నూర్, లక్సెట్టిపేట, క్యాతనపల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో రెండ్రోజుల్లో 374 నామినేషన్లు దాఖలయ్యాయి. కలెక్టరేట్లోని మంచిర్యాల కార్పొరేషన్ నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం సందర్శించారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లకు 186, బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 34 వార్డులకు 97, చెన్నూర్లో 18 వార్డులకు 29, క్యాతనపల్లిలో 22 వార్డులకు 32, లక్సెట్టిపేటలో 15 వార్డులకు 30 నామినేషన్లు వచ్చాయి. జిల్లాలో మొత్తం 149 వార్డులకు 374 నామినేషన్లు దాఖలు అయ్యాయి.లక్సెట్టిపేటలో అధికారులకు నామినేషన్ పత్రం అందజేస్తున్న అభ్యర్థిసాక్షి ప్రతినిధి మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు జోరందుకున్నాయి. ఈ నెల 28న స్వీకరణ ప్రారంభం కాగా.. రెండో రోజు గురువారం భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. మంచిర్యాల కార్పొరేషన్, బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్సెట్టిపేటలో భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం ఐదు గంటల వరకే అనుమతిస్తారు. నామినేషన్ల దాఖలుకు సమయం పడితే వరుసలో ఉన్న వారందరికీ నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తారు. అధికార కాంగ్రెస్ పార్టీ మొదలు బీఆర్ఎస్, బీజేపీలో పలు చోట్ల అభ్యర్థులకు టికెట్ల ఖరారులో జాప్యం జరగడంతో పోటీపై మల్లగుల్లాలు పడ్డారు. చివరగా పార్టీ బీ ఫాం సమర్పణకు మరో రోజు గడువు ఉండడంతో ఆయా డివిజన్లు, వార్డుల్లో నామినేషన్లు వేస్తున్నారు. బకాయిలు ఉన్న ఇంటి, నల్లా పన్నులు కడుతూ నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకుంటూ పోటీకి నిలబడ్డారు. ఇక కొందరు పోటీ అధికంగా ఉన్న చోట్ల రెండు వార్డుల్లోనూ నామినేషన్లు వేస్తున్నారు. బీ ఫాం దక్కిన చోట పోటీకి నిలబడే అవకాశం ఉంది. దీంతో ఒక్కో అభ్యర్థి రెండు, మూడు సెట్ల చొప్పున దాఖలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో 60డివిజన్లలో ఓ కొలిక్కి వచ్చాయి. టికెట్లు దక్కని వారు కొందరు రెబల్స్గా వేసేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు ఇతర పార్టీల్లోకి మారి నామినేషన్లు వేస్తున్నారు. కొనసాగుతున్న ప్రక్రియ నస్పూర్/చెన్నూర్/లక్సెట్టిపేట/బెల్లంపల్లి: మంచిర్యాల కార్పొరేషన్లో నామినేషన్ల స్వీకరణ రెండో రోజు గురువారం కొనసాగింది. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. 60 డివిజన్లకు గాను మొదటి రోజు 20 నామినేషన్లు రాగా.. రెండో రోజు 166 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తంగా నామినేషన్ల సంఖ్య 186కు చేరింది. -
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
పాతమంచిర్యాల: జిల్లా ప్రధాన ఆస్పత్రి(జీజీహెచ్) క్యాజువాలిటీ విభాగంలో సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీజీహెచ్ పారా మెడికల్ జేఏసీ అధ్యక్షుడు నాందేవ్, ప్రధాన కార్యదర్శి రమేష్ అన్నారు. గురువారం సెక్యూరిటీ సిబ్బందిపై దాడిని నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై రోగుల బంధులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని, ఆస్పత్రి వద్ద నిరంతర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పారా మెడికల్ జేఏసీ ప్రధాన సలహాదారు ఆల్లాడి శ్రీనివాస్, కోశాధికారి శంకర్, మహిళా కార్యదర్శి పద్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి
నస్పూర్: జిల్లాలో 5వ తరగతి నుంచి 10వ తరగతి షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం వివరాలు నమోదు చేయాలని అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. గురువారం ఆయన నస్పూర్ కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు దుర్గాప్రసాద్, జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతితో కలిసి ఎంఈఓలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతిగృహ సంక్షేమాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్భంగా 100శాతం ఉపకార వేతనాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. రాజీవ్ విద్యాదీవెన పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అర్హులైన విద్యార్థులకు రూ.3500 చొప్పున ఖాతాల్లో జమ చేస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి బాలికలకు ఒక్కొరికి రూ.1500, బాలురకు రూ.1000 చొప్పున జమ చేస్తారని తెలిపారు. వివరాలు htpp:// telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. -
నేడు గూడెంలో సత్యదేవుడి కల్యాణం
దండేపల్లి: తెలంగాణ అన్నవరంగా పేరొందిన మండలంలోని గూడెం రమాసహిత సత్యనారాయణస్వామి ఆలయంలో ఈ నెల 27నుంచి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. శుక్రవారం సా యంత్రం సత్యనారాయణస్వామి–రమాదేవి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయాన్ని ముస్తాబు చేయడంతోపాటుగా రంగు రంగుల విద్యుత్ దీపాలు, పూలదండలతో అలంకరించారు. గుట్టపై ప్రధాన ఆలయం పక్కనున్న సామూహిక సత్యనారాయణ వ్రత మండపంలో కల్యాణ వేదిక ఏర్పాటు చేశారు. 10వేల మంది భక్తులకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామని, అధిక సంఖ్యలో హాజరై కల్యాణాన్ని తిలకించాలని ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ కోరారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా సప్తాహ భజన కార్యక్రమాలు గురువారం కొనసాగాయి. -
మైసమ్మ జాతరకు సర్వం సిద్ధం
రామకృష్ణాపూర్: గిరిజనుల ఆరాధ్య దైవం మైసమ్మ తల్లి జాతర నేడు శుక్రవారం నుంచి ప్రారంభకానుంది. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులోని గాంధారి ఖిల్లాలో సర్వం సిద్ధమైంది. చారిత్రాత్మక ప్రాంతం, ఎంతో ప్రాశాస్త్యమున్న ఖిల్లా కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. జాతర జరిగే ఖిల్లా ప్రాంతానికి భక్తులు ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం విద్యుత్, నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, షామియానాలు తదితర ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాతోపాటు ఇరుగు పొరుగు జిల్లాల నుంచి కూడా గిరిజనులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 600 ఏళ్ల క్రితం వెలుగొందిన ఖిల్లా... సుమారు 600 ఏళ్ల పూర్వం కాకతీయుల సామంతులుగా పిలువబడే ఒడ్డెరాజుల కాలంలో గాంధారి ఖిల్లా వెలుగొందినట్లు చరిత్ర చెబుతోంది. ఒడ్డెరాజుల కాలంలో నిర్మించిన ఈ ఖిల్లా అప్పటి వారి కళా నైపుణ్యానికి అద్దం పడుతోంది. ఖిల్లాలో నాగశేషుడి విగ్రహం, శివుడు, విఘ్నేశ్వరుడు, ఆంజనేయుడు, కాలభైరవుని విగ్రహాలతోపాటు దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. ఖిల్లా పై భాగంలో శత్రువుల రాకను పసిగట్టేందుకు నగారా గుండు నిర్మించారు. కొండను తొలిచి నిర్మించిన నాగశేషుడి ఆలయం ఆకట్టుకుంటుంది. దిగువ భాగంలో సహజసిద్ధంగా ఉండే ఊటచెలిమెకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నీళ్లు ఎప్పటికీ ఇంకిపోకుండా పైకి తేలుతుంటాయి. గుట్టపై నిర్మించిన కోటలో అనేక కళారూపాలు, శిలాసంపద, విగ్రహాలు ఉండడంతో జాతరకు హాజరయ్యే భక్తులతోపాటు ఖిల్లాను తిలకించేందుకు వచ్చే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. కార్యక్రమాలు ఇలా.. జాతరలో భాగంగా మొదటి రోజు శుక్రవారం దేవతామూర్తులను సదర్భీమన్న నుంచి సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి గంగ స్నానానికి తరలిస్తారు. గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, పిల్లన గ్రోవి వాయిద్యాలు, డప్పుచప్పుళ్ల నడుమ మంచిర్యాలలోని గోదావరికి వెళ్లి అదే రోజు సాయంత్రం తిరిగి సదర్భీమన్న వద్దకు దేవతామూర్తులను తీసుకువస్తారు. రాత్రి ఆటపాటలతో గడిపి మరుసటి రోజు శనివారం జాతర జరిగే ఖిల్లా ప్రాంతానికి దేవతామూర్తులను తరలిస్తారు. రాత్రి మరోసారి ఆటపాటలు, ఆదివాసీ నాయక్పోడ్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆదివారం తెల్లవారుజామున గాంధారి ఖిల్లా పైభాగంలో ఉన్న మైసమ్మ తల్లి వద్ద పట్నాలు వేసి, నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం జీడికోటలో దర్బార్(సభ) నిర్వహించి అందులో గిరిజనుల సాంస్కృతిక తీరుతెన్నులు, వనదేవతలను పూజించడంలో విశిష్టత, గాంధారి ఖిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు. మూడు రోజులపాటు జరిగే జాతరలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన, నాయక్పోడ్ సంఘాల నాయకులు పాల్గొననున్నారు. -
● గోదావరి తీరం భక్త జనసంద్రం ● వనదేవతలను దర్శించుకున్న మంత్రి వివేక్
దర్శనానికి బారులు తీరిన భక్తులుమంచిర్యాలఅర్బన్: మంచిర్యాలలోని గోదావరి తీరం భక్తజన సంద్రమైంది. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో శివసత్తులు, మహిళల పూనకాలు, భక్తుల హర్షధ్వానాల మధ్య జాతర నిర్వహించే సమీపంలోని చిలుకల గుట్టగా భావించే తల్లుల ఇల్లారి(గుడి) వద్ద సమ్మక్క గద్దెకు చేరింది. మేడారం నుంచి వచ్చిన గిరిజన పూజారి సతీష్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీరనారి ప్రతిరూపమైన కుంకుమ భరిణె(అమ్మవారు)ను అశేష జనవాహిని తరలి రాగా డప్పు చప్పుళ్లు, టపాసుల మోత మధ్య పోలీసు వలయంలో ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్టించారు. సమ్మక్క రాక నేపథ్యంలో భక్తులు దారి పొడవునా బారులు తీరారు. అంతకుముందు సమ్మక్క–సారలమ్మ జాతరలో భాగంగా గురువారం వేకువజామున ఏకలవ్య ఆశ్రమం సమీపంలోని కంకవనం వద్ద గిరిజన పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించి కంక వనాల(వెదురు కర్ర)ను డప్పు చప్పుళ్ల మధ్య జాతర జరిగే దేవతమూర్తి సమ్మక్క గద్దె వద్దకు తీసుకొచ్చి ప్రతిష్టించారు. గద్దెలపైన కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మ దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. సమ్మక్కను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు దంపతులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో ముక్త రవి పాల్గొన్నారు. జాతరకు పోటెత్తిన భక్తజనం రామకృష్ణాపూర్: సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ ఆర్కే1ఏ గని శివారులోని పాలవాగు వద్ద సమ్మక్క జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య గురువారం సాయంత్రం సమ్మక్కను గద్దెకు తీసుకొచ్చారు. మందమర్రికి చెందిన దూలం కనకయ్య ఇంటి నుంచి సమ్మక్కను ఊరేగింపుగా జాతర ప్రాంగణానికి తీసుకువచ్చి గిరిజన పూజారులు గద్దైపె ప్రతిష్టించారు. జాతర ప్రాంతం జనసంద్రమైంది. కార్మిక కుటంబాలతోపాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఎత్తు బెల్లాలను సమర్పించుకున్న భక్తులు పూనకాలతో ఊగిపోయారు. అమ్మవార్ల దీవెనలు అందరిపై ఉండాలి: మంత్రి వివేక్ సమ్మక్క–సారలమ్మల దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. ఆర్కే1ఏ గని పాలవాగు వద్ద సమ్మక్క జాతరకు గురువారం రాత్రి ఆయన హాజరై మొక్కులు చెల్లించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఎస్ఓటు జీఎం జీఎల్ ప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆయా యూనియన్లు, రాజకీయ పార్టీల నాయకులు వేర్వేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించారు. -
గడ్డంగూడ గుడిసెల తొలగింపు
జన్నారం: జన్నారం రేంజ్ పరిధిలోని గడ్డంగూడలో గిరిజనులు, గిరిజనేతరులు అక్రమంగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటుండగా.. బుధవారం అటవీశాఖ అధికారులు తొలగించారు. ఎఫ్డీవో రామ్మోహన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అటవీ సిబ్బంది, డివిజన్లోని ఇందన్పల్లి, జన్నారం, తాళ్లపేట్ రేంజ్ అధికారులు లక్ష్మీనారాయణ, సుష్మారావు, కే.లక్ష్మీనారాయణ, సిబ్బంది మూకుమ్మడిగా జేసీబీలతో తెల్లవారు జామున ఐదు గంటలకు గుడిసెలను కూల్చివేశారు. అటవీ భూమి చుట్టూ కంచెలు తవ్వించారు. గుడిసెలు వేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎఫ్డీవో రామ్మోహన్ మాట్లాడుతూ అటవీ భూమిలో అక్రమంగా గుడిసెలు వేసుకోవడం చట్టవిరుద్ధమని, మరోసారి గుడిసెలు వేసుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుడిసెలు వేసుకోవడానికి కారణమైన బలరామ్పై అరెస్ట్ వారెంట్ ఉందని, తప్పించుకుని తిరుగుతున్నాడని పేర్కొన్నారు. -
కడుపు నొప్పి భరించలేక ఒకరు ఆత్మహత్య
వాంకిడి: కడుపు నొప్పి భరించలేక ఒకరు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలం లెండిగూడ గ్రామానికి చెందిన వడై నివృత్తి(28) గత కొంత కాలంగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం హైదరాబాద్, చంద్రపూర్ ఆస్పత్రుల్లో రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినా నయం కాలేదు. మూడు రోజులుగా నొప్పి పెరగడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో బైక్పై చేనుకు వెళ్లి పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని బంధువులకు సమాచారం అందించాడు. వారు చేనుకు వెళ్లి అతడిని ఇంటికి తీసుకువస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జాతరెళ్తున్నారా.. జాగ్రత్త!
మంచిర్యాలక్రైం: సమ్మక్క, సారలమ్మ జాతర వేళ ప్రజలు నాలుగు రోజుల పాటు మేడారం వెళ్తుంటా రు. ఇదే అదనుగా భావించిన దొంగల ముఠా తా ళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తోంది. పట్టణ ప్రధాన కేంద్రాల్లో, పల్లెల్లో బస్టాండ్, బ్యాంకుల వద్ద ప్రజ లు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కాపు కాసుకుని ఉన్న ‘అటెన్షన్ డైవర్షన్’ ముఠాలు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీ, హరియాణా, యూపీ, బిహార్ రా ష్ట్రాలకు చెందిన పార్థి గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్ ముఠాగా ఏర్పడి చోరీలు, దారి దోపిడీలకు పాల్పడుతుంటారు. ముఠా సభ్యుల్లో కొందరు రాత్రి, మరికొందరు పగలు రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లలో రాత్రి చోరీలకు పాల్పడుతారు. జనసంచారం ఉండే ప్రాంతాల్లో ప్రజల్లో కలిసిపోయి మాయచేసి రెప్పపాటు సమయంలో సొత్తు మాయం చేస్తారు. చైన్ స్నాచింగ్, పర్స్లు, సెల్ఫోన్లు, బ్యాగులు కొట్టేసేందుకు యత్నిస్తుంటారు. ఏటీఎం సెంటర్కు వచ్చే వృద్ధులు, నిరక్షరాస్యులు, అమాయకులకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తారు. ఈ నెల 28, 29, 30, 31 తేదీలలో సమ్మక్క జాతర నేపథ్యంలో మేడారం వెళ్లే భక్తులు బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన సామగ్రి ఇంట్లో ఉంచకుండా తెలిసినవారి ఇంట్లో లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని, ప్రతిఒక్కరూ తమ ఇంటి వద్ద ఎల్హెచ్ఎస్(లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నిఘా నీడలో జాతర... మంచిర్యాలలో సమ్మక్క, సారలమ్మ జాతర పూర్తిస్థాయిలో నిఘా నీడలో జరుగుతోంది. 20 అధునాతనమైన సీసీ కెమెరాలు, వెయ్యి మంది భద్రత సిబ్బంది, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఓ పోలీస్ అధికారి మానిటరింగ్ చేయనున్నారు. విలువైన వస్తువులు ఇంట్లో ఉంచవద్దు జాతరకు వెళ్లే వారు బంగారు అభరణాలు, విలువైన వస్తువులు, నగదు ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. ప్రయాణాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే పానీయాలు, ఆహారం తీసుకోవద్దు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే డయల్ 100 లేదా జాతర సమీపంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో ఫిర్యాదు చేయాలి. – అంబర్ కిషోర్ఝా, రామగుండం పోలీస్ కమిషనర్ -
రిమ్స్లో క్రిటికల్ కేర్ సేవలు ప్రారంభం
ఆదిలాబాద్టౌన్: రిమ్స్లో క్రిటికిల్ కేర్ సేవలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. శ్రీసాక్షిశ్రీలో ఇటీవల ప్రచురితమైన కథనానికి డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ స్పందించారు. శ్రీఒక్క రోజు ఆర్బాటంశ్రీ శీర్షికన గత శనివారం కథనం ప్రచురితమైంది. రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ విభాగాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా సేవలు మాత్రం ప్రారంభం కాలేదని అందులో ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం క్రిటికల్ కేర్లో ఆర్థోపెడిక్ ఓపీ సేవలను ప్రారంభించారు. దశలవారీగా మిగతా విభాగాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వివరించారు. -
జంపన్నవాగులో భీమారం వాసి మృతి
భీమారం: మేడారం సమ్మక్క జాతరకు వెళ్లిన భీ మారం మండల కేంద్రానికి చెందిన కొమ్ము శ్రీ ని వాస్(54) బుధవారం జంపన్నవాగులో మునిగి మృతిచెందాడు. దీంతో భీమారంలో విషాదం నెలకొంది. మంగళవారం రాత్రి శ్రీనివాస్తోపాటు అత ని సోదరుని కుటుంబాలు కలిసి ఆటోరిక్షాలో మంచిర్యాల వరకు వెళ్లి అక్కడ నుంచి మేడారం వెళ్లారు. సమ్మక్క దర్శనానికి ముందు జంపన్న వాగులో పు ణ్య స్నానానికి వెళ్లిన శ్రీనివాస్ అందులోనే మునిగి చనిపోయాడు. నాలుగు రోజు ల క్రితమే మేడారం వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాడని అతడి స్నే హితులు తెలిపారు. మరోసారి కుటుంబంతో వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. శ్రీనివాస్ మండల కాంగ్రెస్ నాయకుడిగా చురుగ్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య లక్ష్మి, కుమారులు వినయ్, హరీష్ ఉన్నారు. -
సింగరేణి ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి
ఆసిఫాబాద్అర్బన్/నస్పూర్: సింగరేణి ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. బుధవారం న్యూఢిల్లీలోని సింగరేణి భవన్ నుంచి దేశంలో కోల్మైన్స్ ఉన్న జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, కోల్మైన్స్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్లోజర్ మైన్స్– 2025లో భాగంగా సామాజిక అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ క్లోజర్ మైన్స్– 2025 కార్యక్రమంలో భాగంగా సింగరేణి సంస్థ 25 శాతం నిధులతో సామాజిక బాధ్యతలో భాగంగా సమీప గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఆ దిశగా కలెక్టర్లు, సింగరేణి అధికారుల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్, బోరుబావులు, పారిశుద్ధ్య పనులు, మురుగు కాలువల నిర్మాణం, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో వసతులు, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి పనులు చేపట్టాలన్నారు. ఆసిఫాబాద్లోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్, బెల్లంపల్లి ఏరియా సింగరేణి జీఎం విజయభాస్కర్, పర్యావరణ అధికారి హరీశ్, జూనియర్ ఎస్టేట్ అధికారి రజనీకాంత్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. మంచిర్యాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ సామాజిక అభివృద్ధి కింద జిల్లాకు రూ.115 కోట్లు కేటాయించారని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, గనులు భూగర్భ శాఖ ఏడీ జగన్ మోహన్, శ్రీరాంపూర్ ఏరియా ఇన్చార్జి జీఎం వెంకటేశ్వర్లు, ఎస్టేట్స్ మేనేజర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆటల ఆధారిత బోధనతో పిల్లల సమగ్రాభివృద్ధి
ఆదిలాబాద్టౌన్: బొమ్మలు, ఆటల ఆధారిత బోధనతో పిల్లల సమగ్రాభివృద్ధి చెందుతారని పీఎంశ్రీ పాఠశాలల శిక్షణ రిసోర్స్పర్సన్ మా దరి ఎల్లన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ డైట్ కళాశాలలో ఉమ్మడి జిల్లా పరిధిలోని పీఎంశ్రీ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొమ్మలు, ఆటలను ఉపయోగించి బోధిస్తే పిల్లల సమగ్ర నైపుణ్యాలు, అభిజ్ఞ, శారీరక, సామాజిక, భావోద్వేగాభివృద్ధి చెందుతాయని తెలి పారు. తెలుగు, ఆంగ్లం, గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో అన్వేషణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నేర్చుకున్నది ఆటల ద్వారా అనుభవంగా మారడంతో పట్టు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డైట్ కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ హై, వైస్ప్రిన్సిపాల్ కిరణ్కుమార్, రిసోర్స్పర్సన్లు సురేశ్, విజయ్, వెంకటేశ్, నాందేవ్ తదితరులు పాల్గొన్నారు -
ఇంటి స్థలం విషయంలో దాడి
లక్ష్మణచాంద: ఇంటి స్థలం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఒకరు గాయపడ్డారు. ఎస్సై శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సల్కం పోశెట్టి పదేళ్ల కిందట ఇదే గ్రామానికి చెందిన దుర్గన్నకు ఇంటి స్థలం విక్రయించాడు. మంగళవారం తాను కొనుగోలు చేసిన స్థలాన్ని దుర్గన్న చదును చేస్తున్నాడు. కాగా, తాను అమ్మిన స్థలానికంటే ఎక్కువ విస్తీర్ణంలో చదును చేస్తున్నావని పోశెట్టి గొడవకు దిగాడు. ఈక్రమంలో పోశెట్టిపై దుర్గన్నతోపాటు అజయ్ దాడి చేశారు. దీంతో పోశెట్టికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స కోసం అతడిని 108లో నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. పోశెట్టి కుమార్తె కావ్య ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎస్బీఐలో రైతు డబ్బులు చోరీ
బాసర: బాసరలోని ఎస్ బీఐలో ఓ రైతు విత్డ్రా చేసుకున్న రూ.50వేలను గుర్తు తెలియని మహిళ అపహరించింది. ఎస్సై నవనీత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దొడపూర్ గ్రామానికి చెందిన దత్తారం సాంబాజీ అనే రైతు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఎస్బీఐకి వచ్చాడు. మొదట రూ.50వేలు విత్ డ్రా చేసుకున్నాడు. మరోసారి డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు క్యూలైన్లో నిల్చోగా అతడి వద్ద ఉన్న రూ.50వేలను బురఖాలో ఉన్న గుర్తు తెలియని మహిళ అపహరించినట్లు బాధితుడు తెలిపాడు. వెంటనే బ్యాంక్ మేనేజర్ అశోక్కుమార్తో కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బ్యాంక్కు చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ సారు మాకొద్దు..భీమిని: కన్నెపల్లి మండలంలోని పోలంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కె.రాజు బుధవారం అదే గ్రామంలోని ఓ బెల్ట్షాపులో మద్యం సేవిస్తుండగా గ్రామస్తులు నిలదీశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయుడే పట్టపగలు తప్పతాగి పాఠశాలకు వస్తే ఎలా అని మండిపడ్డారు. గతంలో సైతం పలుమార్లు మద్యం మత్తులో పాఠశాలకు వచ్చాడని వారు పేర్కొన్నారు. మధ్యాహ్నమే ఉపాధ్యాయుడు పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులంతా కలిసి ఈసారు మాకొద్దు అంటూ ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎంఈఓ రామును వివరణ కోరగా విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని, తదుపరి ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
సమ్మె విజయవంతం చేయండి
నస్పూర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని హెచ్ఎంఎస్ జనరల్ సెక్రెటరీ రియాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన అధ్యక్షుడు తిప్పారపు సారయ్యతో కలిసి కొత్తగూడెంలోని కార్యాలయంలో కార్పొరేట్ జీఎం పర్సనల్ కవితానాయుడుకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తగూడెం వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, శ్రీరాంపూర్ ఏరియా కార్యదర్శి అశోక్, నాయకులు శ్రీనివాస్ పూర్ణ చందర్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
జాతరే చివరి యాత్ర
కౌటాల: అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు మేడారం మహాజాతరకు బయల్దేరిన తల్లీకుమార్తెకు అదే చివరి యాత్రగా మిగిలింది. ఊహించని ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన కస్తూరి రమేశ్, అతడి భార్య సునీత(45), వారి ఏకై క కుమార్తె అక్షిత(21)తోపాటు అదే గ్రామానికి చెందిన కస్తూరి లక్ష్మి, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు మనవరాళ్లు ఎనిమిది మంది ఈ నెల 26న మంచిర్యాల జిల్లా చెన్నూర్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి బంధువులతో కలిసి ట్రాక్టర్లో మొత్తం 25 మంది మంగళవారం జాతరకు బయల్దేరారు. మంగళవారం రాత్రి భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి– కేశవాపూర్ అటవీ ప్రాంతంలో ట్రాక్టర్ను రహదారి కిందకు దించి మళ్లీ ఎక్కించే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లీకుమార్తెలు సునీత, అక్షిత ట్రాలీ కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. రమేశ్ ఎడమ కాలు, కస్తూరి లక్ష్మి కుడి చేయి విరిగింది. మిగిలినవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ముత్తంపేటలో విషాదం.. రమేశ్, సునీత కూలీ పని చేస్తూ వారి ఏకై క కుమార్తె అక్షితను హైదరబాద్లో డీఈడీ మొదటి సంవత్సరం చదివిస్తున్నారు. తల్లీకుమార్తెల మృతితో ముత్తంపేట గ్రామంలో విషాదం నెలకొంది. భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అనంతరం బుధవారం సాయంత్రం ము త్తంపేటకు తరలించారు. జాతరకు వెళ్లి తల్లీకుమార్తెలు అనంతలోకాలకు వెళ్లడంతో బంధువులు బోరు న విలపించారు. కళ్లెదుటే కట్టుకున్న భార్య, అల్లారుముద్దుగా పెంచిన కుమార్తె చనిపోవడంతో రమేశ్ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మృతదేహాలకు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాళులర్పించారు. అనంతరం అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. కాగజ్నగర్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్న రమేశ్ను ఎమ్మెల్సీ దండె విఠల్ పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. -
మద్యం మత్తులో పురుగుల మందు తాగి..
వాంకిడి: మద్యం తాగడం మానేయాలని మందలించినందుకు మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలంలోని ధాబా గ్రామానికి చెందిన కు డ్మెత రాంశావు(56) కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 26న సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి వచ్చి అతడిని భార్య సురేఖ బాయి మందలించింది. అనంతరం రాంశావు కంది చేనుకు వెళ్లొస్తానని ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చాక వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు వాంకిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథ మ చికిత్స అనంతరం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినా ఆరోగ్యం కుదుటపడలేదు. మళ్లీ మంగళవారం మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రాత్రి 9 గంటలకు మృతి చెందాడు. మృతుడి భార్య సురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
యువకుడి ప్రాణాలు కాపాడిన ఎస్సై
దిలావర్పూర్: మండలంలోని సిర్గాపూర్ గ్రామ సమీపంలో నిర్మల్–భైంసా రహదారిని ఆనుకుని ఉన్న కుంటలో దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని ఎస్సై రవీందర్ కాపాడారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సిర్గాపూర్ కుంటలో మునిగి తేలుతూ కనిపించిన గుర్తుతెలి యని వ్యక్తిని స్థానికులు గుర్తించి పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఎస్సై ఘటనాస్థలికి చేరుకుని స దరు యువకుడిని కుంటలోనుంచి బయటకు తీశా రు. యువకుడి ద్వారా వివరాలు తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లా వేంపల్లికి చెందిన కుటుంబం రెండుమూడు రోజులుగా సిర్గాపూర్ గ్రామ బస్టాండ్ ప్రాంతంలో ఉంటుందని ఎస్సై తెలిపారు. వీరంతా గ్రామాల్లో యాచిస్తారని పేర్కొన్నారు. సదరు కుటుంబానికి చెందిన ఫారూఖ్ తన తల్లిదండ్రులతో వివాదం పెట్టుకుని కుంటలోకి దూకినట్లు తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు సదరు యువకుడిని కాపాడినట్లు పేర్కొన్నారు. అతడితోపాటు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేసి వారి స్వస్థలానికి పంపినట్లు తెలిపారు. -
● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్పర్సన్ పీఠం ● ప్రత్యేకతను చాటుకుంటున్న బెల్లంపల్లి ఓటరు
బెల్లంపల్లి: బెల్లంపల్లి బల్దియా ఓటర్లు ప్రతీసారి మున్సిపల్ ఎన్నికల్లో ఒకే రకమైన తీర్పునిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కార్మిక కుటుంబాలను ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. ఇప్పటివరకు ఏడుసార్లు ఎన్నికలు జరుగగా.. అదే ఆనవాయితీ కొనసాగించారు. చైర్పర్సన్ స్థానం ఏ సామాజిక వర్గానికి రిజర్వు చేసినా కార్మిక వర్గాన్నే అందలం ఎక్కించారు. మున్సిపాల్టీ ఏర్పడి 39ఏళ్లు అవుతుండగా.. ప్రస్తుతం ఎని మిదోసారి ఎన్నికల పర్వం మొదలైంది. ఈసారి చైర్పర్సన్ స్థానం మహిళా జనరల్కు రిజర్వు చేయడంతో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందోననే ఉత్కంఠ నెలకొంది. చైర్పర్సన్లు వీరే.. బొగ్గు గనుల క్షేత్రం బెల్లంపల్లి 1987లో ద్వితీయ శ్రేణి మున్సిపాల్టీగా అవతరించింది. అదే యేటా తొలిసారి జరిగిన ఎన్నికల్లో సింగరేణిలో మైనింగ్ సర్దార్ ఇడిగిరాల చంద్రశేఖర్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అందరి దృష్టి పీఠం పైనే.. ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టి చైర్పర్సన్ సీటుపైనే కేంద్రీకృతమైంది. ఓటర్లు ఎవరిని ఆదరించి చైర్పర్సన్ సీట్లో కూర్చోబెడతారోననే చర్చ జరుగుతోంది. గత చరిత్రను పునరావృతం చేస్తారా లేక కొత్త సంప్రదాయానికి తెర తీస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. తీర్పు.. ఒకేరకంసూరిబాబుసరస్వతిజంగం కేశవులురాజేశ్వర్సునీతారాణిచంద్రశేఖర్జక్కుల శ్వేతస్వరూప -
● మున్సిపల్ ఎన్నికల్లో పైసలతోనే పని! ● అభ్యర్థుల ఎంపిక నుంచి పోటీ దాక ● జిల్లా కేంద్రం సహా, అన్ని చోట్ల ఇదే తీరు ● రూ.లక్షలు సిద్ధం చేసుకున్న అభ్యర్థులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో పైసల ప్రాతిపదికనే రాజకీయ నడుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చు చేసే స్థాయి ఉందా..? లేదా..? అని బేరీజు వేసుకుంటూ ఎంపిక చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. డివిజన్, వార్డుల్లో సర్వేలు నిర్వహించినప్పటికీ అంతిమంగా డబ్బులే ప్రధానంగా మారాయి. ఇప్పటికే జిల్లా కేంద్రం మంచిర్యాల కార్పొరేషన్తోసహా బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపికలో డబ్బే కొలమానంగా సాగుతోంది. కొన్ని చోట్ల ఏళ్లు కష్టపడిన నాయకులు, కార్యకర్తలు ఉన్నప్పటికీ సర్వేల్లో పనితీరు మెరుగ్గా లేదని పక్కకు పెడుతున్నారు. రిజర్వేషన్లు కలిసొచ్చినా, కోరుకున్న డివిజన్లో టికెట్ రాకపోవడంతో మరో చోట నుంచి పోటీకి దిగాల్సి వస్తోంది. దీంతో ఇన్నాళ్లుగా తాము కష్టపడిన చోట కాకుండా వేరే చోట పోటీ చేస్తే ఓట్లు వస్తాయా? రావా? అనే తర్జన భర్జన పడుతున్నారు. జిల్లా కేంద్రంలో పలు డివిజన్లలో ఈ పరిస్థితి అధికంగా ఏర్పడింది. కార్పొరేషన్లో శ్రీమంతులకే.. జిల్లా కేంద్రం కార్పొరేషన్ పరిధి కావడంతో ఖర్చుతో కూడుకున్నది. కార్పొరేటర్గా పోటీ చేయాలంటే అభ్యర్థులకు రూ.30నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో ఒక్కో డివిజన్ నుంచి కనీసం 2500 నుంచి అత్యధికంగా 4వేల మంది వరకు ఓటర్లు ఉన్నారు. పోలింగ్ సమయంలో ఓటర్లకు డబ్బులు, మద్యం తదితరాలకే భారీగా రూ.లక్షల్లో ఖర్చు చేసే అవకాశం ఉంది. దీంతో మొదట ప్రచారం వరకు ఉన్నంతలో సొంత వనరులు వాడుకుంటున్నారు. ఇక కొందరు స్థిరాస్తులను అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. ఇక డివిజన్లలో టికెట్ కోసం నాయకుల నుంచి పోటీ ఉన్న చోట్ల టికెట్ దక్కిన వారు అసమ్మతిని బుజ్జగించేందుకు ఎంతో కొంత మొత్తంలో ఇవ్వాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మేయర్ స్థానం ఆశిస్తున్న వారు ఈ ఖర్చు రూ.కోట్లకు చేరుతోంది. దీంతో ఈసారి ఎన్నికల్లో సగానికిపైగా డివిజన్లలో రియల్టర్లు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఆర్ఎంపీ తదితరులు పోటీలో ఉన్నారు. ఖర్చుల కోసం ఆస్తులు తాకట్టు ఖర్చుల కోసం కొందరు అభ్యర్థులు ఆస్తులను తెలిసిన వారి వద్ద తాకట్టు పెట్టి రూ.లక్షల్లో అప్పు తెచ్చుకుంటున్నారు. నెల నుంచి ఆరు నెలల గడువుతో చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు. భూములు, నివాస స్థలాలు, బంగారం కుదువ పెడుతున్నారు. కొందరైతే ప్రైవేటు ఫైనాన్స్లో లోన్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక పోలింగ్ నాటికి డబ్బు కోసం ఇప్పటి నుంచే సర్దుకుంటున్నారు. టికెట్ తెచ్చుకోవడం ఒక ఎత్తయితే పోటీలో నిలబడి గెలవడం మరో ఎత్తుగా మారింది.అసమ్మతిపై బుజ్జగింపులుఅధికార పార్టీలో టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల అసమ్మతి నాయకులను బుజ్జగింపులు చేస్తున్నారు. మహిళా స్థానాలతో సహా జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ చోట్ల పోటీ నెలకొంది. అధికార పార్టీతో పోలిస్తే బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు సులువుగానే అభ్యర్థులు ఖరారయ్యారు. దీంతో నామినేషన్లు వేసేందుకు పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక బీజేపీ జిల్లా కేంద్రంలో కొన్ని చోట్ల మినహా అన్ని చోట్ల అభ్యర్థులు సిద్ధమయ్యారు. లక్సెట్టిపేట, చెన్నూరు, క్యాతనపల్లి, బెల్లంపల్లిలో వార్డుల్లో సరైన నాయకుల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. కొందరు టికెట్లు రావని తెలిసీ బీ ఫాం సమర్పించే వరకు వేచి చూసి ప్రతిపక్ష పార్టీలోకి జంప్ అవుదామనే ఆలోచనలు చేస్తున్నారు. -
పంచాయతీ నుంచి కార్పొరేషన్
మంచిర్యాలటౌన్: ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న మంచిర్యాల 73ఏళ్ల తర్వాత గత ఏడాది జనవరి 27న కార్పొరేషన్గా అవతరించింది. రైల్వే సౌకర్యం ఉండడం, సిమెంటు కంపెనీ ఏర్పాటు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండడం, ఇతర ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడడం వల్ల జనాభా పెరుగుతూ శరవేగంగా అభివృద్ధి చెందింది. 1952లో 1500 జనాభాతో ఉన్న గ్రామ పంచాయతీని గ్రేడ్–3 మున్సిపాల్టీగా ప్రభుత్వం మార్చింది. మొదటిసారిగా మున్సిపాల్టీకి 1956లో ఎన్నికలు నిర్వహించారు. 1984లో మండల కేంద్రంగా, 1992లో రెవెన్యూ డివిజన్గా, 2016లో జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందింది. గ్రేడ్–3 మున్సిపాల్టీగా ఉండగా 2004లో గ్రేడ్–1 స్థాయికి చేరింది. ప్రస్తుతం మంచిర్యాల కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా.. 2.50లక్షల మంది జనాభా, 601,81,778 మంది ఓటర్లు ఉన్నారు. 12మంది చైర్పర్సన్లు మున్సిపాల్టీగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ప్రజాసోషలిస్టు పార్టీ నుంచి కేవీ.రమణయ్య చైర్మన్గా ఎన్నికయ్యారు. 1956–57 మధ్యకాలంలో పని చేశారు. తర్వాత అదే పార్టీకి చెందిన ఎస్.లక్ష్మికాంతం, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.అర్జున్రావు 1957నుంచి 1962వరకు పని చేశారు. విలీనంపాలకవర్గం పదవీకాలం ముగిసిన వెంటనే గత ఏడాది జనవరి 27న మంచిర్యాల మున్సిపాల్టీలో నస్పూరు మున్సిపాలిటీ, హాజీపూర్ మండలం వేంపల్లి, ముల్కల్ల, చందనాపూర్, గుడిపేట్, నర్సింగాపూర్, నంనూర్, కొత్తపల్లి, పోచంపాడ్ గ్రామాలను విలీనం చేస్తూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్గా మార్చారు. మొదటిసారి కార్పొరేషన్కు ఎన్నికల జరుగుతుండగా.. మేయర్ స్థానాన్ని బీసీ జనరల్ కేటాయించారు. మేయర్ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. -
క్యాతనపల్లిలో అన్ని స్థానాల్లో సీపీఐ పోటీ
రామకృష్ణాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో క్యాతనపల్లిలో అన్ని స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐకి పొత్తు ఉందని, అయితే ఇక్కడ మిత్రధర్మాన్ని విస్మరిస్తే కలిసి వచ్చే సెక్యులర్ పార్టీలతో ముందుకు వెళ్తామని అన్నారు. అన్ని వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు పార్టీ అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మిట్టపెల్లి శ్రీనివాస్, పౌల్, వనం సత్యం, రాజేశం పాల్గొన్నారు. -
బల్దియాలకు ఎన్నికల ఆదాయం
మంచిర్యాలటౌన్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలోని మున్సిపాల్టీల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు తప్పనిసరిగా నో డ్యూ సర్టిఫికేట్ మున్సిపాల్టీల నుంచి పొందాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఉంటేనే నామినేషన్ స్వీకరిస్తారు. అభ్యర్థులను ఒకరు బలపర్చాలి, ఇద్దరు సాక్షులు ఉండాలి. కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులు ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు ఉండరాదనే నిబంధనలు ఉన్నాయి. ఇందుకోసం వారి పేరిట ఉన్న ఆస్తి పన్ను, నల్లా బిల్లు, ఇతరత్రా పన్నులు చెల్లించేందుకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, క్యాతనపల్లి మున్సిపాల్టీల్లో బారులు తీరుతున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద కూడా అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. అన్ని పన్నులు చెల్లించాక కూడా నో డ్యూ సర్టిఫికేట్ కోసం కార్పొరేషన్లో రూ.2 వేలు, మున్సిపాలిటీల్లో రూ.1,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది. రిజర్వుడ్ స్థానాల్లో అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని తహసీల్దార్ కార్యాలయాల్లో ఎదురు చూస్తున్నారు. అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు ఖాతా కలిగి ఉండాలనే నిబంధన నేపథ్యంలో ఖాతాలు తెరుస్తున్నారు. మంచిర్యాల నగర పాలక సంస్థ కార్యాలయం బుధవారం అభ్యర్థులు, బలపర్చే వారితో కోలాహలంగా మారింది. ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లించేందుకు తరలి వచ్చారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు ఏమేం అవసరం ఉంటాయనే సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అర్హతలు, ధ్రువీకరణ పత్రాల వివరాలు వంటివి తెలుసుకున్నారు.రికార్డు స్థాయిలో వసూళ్లు చెన్నూర్: చెన్నూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో పన్నుల రూపంలో రూ.1,30,821 వసూలైంది. గత వారం రోజుల నుంచి రూ.2,47,803 రాగా.. మున్సిపాలిటీకి మొత్తం రూ.3,78,624 ఆదాయం వచ్చిందని కమిషనర్ మురళికృష్ణ తెలిపారు. -
మరో ఎనిమిదేళ్లు ప్రభుత్వం మనదే
రామకృష్ణాపూర్: రాబోయే మూడు సంవత్సరాలతోపాటు మరో ఐదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతీ గడపకు తీసుకెళ్లి క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి జూపల్లి హాజరై మాట్లాడారు. ప్రజల్లో ఆదరణ, గెలిచే సత్తా ఉన్న వారికే కౌన్సిలర్ టికెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. టికెట్ రాని వారు నిరాశ పడొద్దని భవిష్యత్లో వారికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి, పల్లెరాజు, అబ్దుల్అజీజ్, గాండ్ల సమ్మ య్య, వొడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఫౌండేషన్ లర్నింగ్ స్టడీ విధానం అమలు చేయాలి
భీమారం: ఫౌండేషన్ లర్నింగ్ స్టడీ విధానంతో విద్యార్థులకు అనేక విధాలుగా మేలు జరుగుతుందని, జిల్లాలోని ప్రతీ పాఠశాలలో అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అకాడమిక్ కోఆర్డి నేటర్ అధికారి సత్యనారాయణమూర్తి తెలిపారు. బుధవారం భీమారంలో నిర్వహించిన మండల స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో నూతన విద్యావిధానం అమలు దృష్ట్యా విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితశాస్త్రంలో మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నారని అన్నారు. ఇప్పటికే ప్రతీ పాఠశాలలో పూర్తి చేశారని, రానున్న రోజుల్లో మరిన్ని పరీక్షలను ఎఫ్ఎల్ఎస్లో పూర్తి చేయాలని కోరారు. సెక్టోరియల్ ఆధికారి భరత్, రిసోర్స్పర్సన్లు కుమార్, స్వ రూప, శ్రీనివాస్, సీఆర్పీ సాగర్ పాల్గొన్నారు. -
నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలి
నస్పూర్/బెల్లంపల్లి/చెన్నూర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్, బెల్లంపల్లి, చెన్నూర్లోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించారు. బెల్లంపల్లిలో నామినేషన్ పత్రాలు తీసుకెళ్లడానికి వచ్చిన అభ్యర్థులతో మాట్లాడి ఎన్నికల నియమావళిపై వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై కలెక్టరేట్లోని కంట్రోల్ రూం నంబరు 08736–250501లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 31న నామినేషన్లు పరిశీలించి అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని, ఫిబ్రవరి 1న నామినేషన్లపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ, 2న పరిష్కారం, 3న నామినేషన్ల ఉపసంహరణ, బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమాల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, డీఆర్డీఏ కిషన్, మున్సిపల్ కమిషనర్లు జే.సంపత్, మురళికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి
పెంబి: చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై హన్మండ్లు తెలిపిన వివరాల మేరకు కడెం మండలం చిన్నబెల్లాల్కు చెందిన గెడాం శ్రీకాంత్ (30)కు పెంబి మండలంలోని రాంగూడకు చెందిన నీలభాయితో వివాహమైంది. పుట్టింట్లో ఉన్న భార్యను చూసేందుకు వచ్చిన శ్రీకాంత్ సోమవారం సాయంత్రం బంధువుతో కలిసి మద్యం మత్తులో కడెం వాగుకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. మంగళవారం జాలర్లతో వెతికించగా మృతదేహం లభ్యమైంది. మృతుని తండ్రి గెడాం శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. బస్సు కిందపడి ఒకరు..ముధోల్: బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని తరోడా గ్రామానికి చెందిన పింగ్లే సాహెబ్రావు (26) ధర్మాబాద్ కారేగాం వాసి. నెలరోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి తరోడకు వచ్చి ఇటుక బట్టీలో కూలీగా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం మద్యం సేవించి ధర్మాబాద్ వెళ్లేందుకు నడుస్తున్న బస్సు ఎక్కుతున్న క్రమంలో జారి కిందపడడంతో గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. హత్యాయత్నం కేసులో మూడేళ్ల జైలుమందమర్రిరూరల్: హత్యాయత్నం కేసులో నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ మంచిర్యాల సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నిర్మల మంగళవారం తీ ర్పునిచ్చినట్లు ఎస్సై గోపతి నరేష్ తెలిపారు. మందమర్రి పట్టణంలోని పెట్రోల్ బంకు సమీపంలో ఉండే కోహినూర్ దక్షిణమూర్తితో రామన్కాలనీకి చెందిన దసుకుంట్ల కుమారస్వామికి రెండేళ్ల క్రితం గొడవ జరిగింది. ఈక్రమంలో కుమారస్వామి అతనిపై కత్తితో దాడి చేశాడు. దక్షిణమూర్తి ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చినట్లు ఎస్సై తెలిపారు. -
జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య
రెబ్బెన: అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల మేరకు మండలం లోని గంగాపూర్కు చెందిన గుర్లె శ్యాంరావ్ (30 వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతుండగా పలు ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తోటకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. మంగళవారం తెల్ల వారుజామున అతని బంధువైన గుర్లె బాపురావు తోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లగా శ్యాంరావ్ తోటలో మంచంపై స్పృహలేకుండా కనిపించాడు. పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించడంతో పాటు నోటిలో నుంచి నురగలు వస్తుండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఎస్సై వెంకటకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని తండ్రి వెంకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఒంటరితనం భరించలేక వృద్ధుడు..కౌటాల: మండల కేంద్రంలోని సదాశివపేట కాలనీకి చెందిన దెబ్బటి వెంకన్న (75) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై డి.చంద్రశేఖర్ తెలిపారు. వెంకన్న భార్య మూడేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి ఒంటరితనంతో పాటు మానసిక వేదనతో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఉదయం గుర్తు తెలియని మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఎస్టీపీపీ యూనిట్–1లో షడ్డౌన్జైపూర్: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవ ర్ ప్లాంటులో గల యూనిట్–1 (600 మెగావాట్ల) విద్యుత్ కేంద్రంలో మంగళవారం ట్యూబ్ లీకేజీల కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. యూనిట్–1 బాయిలర్లో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన ట్యూబ్స్ పగిలి ఉత్పత్తి నిలిచి పోగా అధికారులు మరమ్మతులు చేపట్టారు. -
చైన్నెలో గుస్సాడీ నృత్య ప్రదర్శన
ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని దూబార్పేట్ గ్రామానికి చెందిన ఆదివాసీ కళాకారులు సోమవారం రాత్రి చైన్నెలో జరిగిన కార్యక్రమంలో గుస్సాడీ నృత్య ప్రదర్శన చేసి ప్రేక్షకులను అలరించారు. దక్షిణ చిత్రహెరిటేజ్ మ్యూజియంలో మార్గళి విలేజ్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఆదివాసీ కళాకారులు గుస్సాడీ నృత్య ప్రదర్శన చేసినట్టు ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్ తెలిపారు. ఈ ప్రదర్శనలో కళాకారులు తిరుపతిమాలిక్, రాము, జుగాదిరావు, నగేష్, సంజీవ్, పరశురాం, విశ్వనాథ్, సందీప్, గంగారాం, వినోద్ పాల్గొన్నారు. -
నాగోబా ఆదాయం రూ.20.74 లక్షలు
ఇంద్రవెల్లి: మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం ఈ నెల 18 నుంచి నిర్వహించిన నాగోబా జాతర ఆదాయం 20 లక్షల 74 వేల 797 రూపాయలు వచ్చిందని దేవాదాయ శాఖ ఈవో ముక్త రవి తెలిపారు. మంగళవారం మెస్రం వంశీయులు, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు. తైబజర్ ద్వారా రూ.11,81,000, హుండీ ద్వారా రూ.8,93,797 ఆదాయం, మిశ్రమ వెండి 252 గ్రాములు వచ్చినట్లు ఈవో ముక్త రవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, కేస్లాపూర్ మెస్రం తుకారాం, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్రావ్, మెస్రం వంశీయులు కోసేరావ్, దాదారావ్, నాగ్నాథ్, మెస్రం వంశ ఉద్యోగులు దేవ్రావ్, శేఖర్బాబు, తదితరులు పాల్గొన్నారు. -
పుట్టు సుబ్బరాంపల్లి మెట్టు మేడారం
చెన్నూర్రూరల్: మండలంలోని సుబ్బరాంపల్లిలో 50 ఏళ్లకు పైగా జాతర నిర్వహిస్తున్నారు. ఏటా పౌర్ణమికి కూడా జాతర నిర్వహిస్తారు. మంథని, కరీంనగర్, మహారాష్ట్రలోని చంద్రపూర్, రాజూరా, అంకీస, అసరెల్లి ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మొదట మారిశెట్టి రామయ్య పూజలు చేసేవాడు. ఆయన తదనానంతరం కూతురు, అల్లుడు తనుగుల మల్లక్క, లచ్చన్న పూజలు చేస్తున్నారు.ఈప్రాంతం పుట్టు సుబ్బ రాంపల్లి.. మెట్టు మేడారంగా పేరొందింది. వీ టితో పాటు కిష్టంపేట గ్రామ సమీపంలో జా తీయ రహదారిపై జాతర నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు. -
మహారాష్ట్ర నుంచి భక్తుల రాక
కాగజ్నగర్టౌన్: వంజీరి గ్రామ పంచాయతీ పరిధి నందిగూడ శివారులోని పెద్దవాగు ఒ డ్డు న 2018 నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహిస్తున్నారు. పెద్దవాగు సమీపంలో ఇస్తా రి పటేల్ కుటుంబ సభ్యులు అమ్మవార్లకు దా నంగా ఇచ్చిన భూమిలో కమిటీ ఆధ్వర్యంలో పదేళ్లుగా జాతర నిర్వహిస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచే కాకుండా కౌ టా ల, చింతలమానెపల్లి, సిర్పూర్(టి), దహెగా ం, ఆసిఫాబాద్, రెబ్బెన, బెల్లంపల్లి, మహా రా ష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. -
‘పెర్సపేన్’ అభివృద్ధికి కృషి చేద్దాం
ఇంద్రవెల్లి: పెర్సపేన్ కులదేవత ఆలయ అభివృద్ధికి కృషి చేద్దామని జుగ్నాక వంశానికి చెందిన కటోడ జుగ్నాక మహదు, జుగ్నాక్ జైతు అన్నారు. మంగళవారం మండలంలోని పొల్లుగూడలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జుగ్నాక వంశీయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగోబా ఆలయ అభివృద్ధితో పాటు నూతనంగా నిర్మించిన సతీ దేవతల ఆలయ ప్రారంభ కార్యక్రమంపై చర్చించారు. సమావేశంలో జుగ్నాక వంశీయులు కాశీరాం, భరత్, మానిక్రావ్, మాదోరావ్, తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణంమంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా దౌలతాపూర్లోని ఖస్పూర్ గ్రామానికి చెందిన దేవ్జీత్కుమార్ (26) పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ట్రాలీ ఆటోలో మంచిర్యాలకు వెళ్తుండగా వేంపల్లి సమీపంలో అతివేగంగా వచ్చిన గూడ్స్ కారియర్ వెనక నుంచి ఢీ కొట్టింది. దేవ్జీత్కుమార్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా మరో ప్రయాణికుడు కేసిరెడ్డి రాంరెడ్డికి తీవ్రంగా సింగం అరవింద్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాంరెడ్డిని మెరుగైన చికిత్సకోసం కరీంనగర్కు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని సోదరుడు సన్నీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. గూడ్స్ కారియర్ డ్రైవర్ పారిపోతుండగా అటుగా వెళ్తున్న ఏసీబీ అధికారి వాహనం వెంబడించి పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కారియర్ను స్టేషన్కు తరలించారు. బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తామంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్లో ఇటీవల నిర్వహించిన వెంకీ క్లాసిక్ బాడీ బిల్డింగ్ పోటీల్లో మంచిర్యాల చాంపియన్ జిమ్ బాడీ బిల్డర్లు సత్తా చాటారు. ఎం.వెంకటేశ్ మిస్టర్ మంచిర్యాల, మిస్టర్ ఆదిలాబాద్ టైటిళ్లను గెలుచుకున్నారు. పి.విశ్వనాథ్ 75 కిలోల కేటగిరీలో 5వ స్థానం, మాస్టర్స్ కేటగిరీలో 2వ స్థానం, ప్రదీప్ 65 కిలోల విభాగంలో 4వ స్థానం, రాజు 50 కిలోల విభాగంలో 4వ స్థానం సాధించారు. జిమ్ యజమాని కంబగోని సుదర్శన్గౌడ్, సీనియర్ బాడీ బిల్డర్లు, కోచ్ సాగర్గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. -
టేకు చెట్లు నరికిన ఇద్దరి రిమాండ్
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ తాళ్లపేట్ అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా టేకు చెట్లు నరికిన ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. జన్నారం మండలం తపాలపూర్కు చెందిన ఐతే నాగరాజు, దుర్గం శ్రీనివాస్ ఇటీవల పలుమార్లు అడవికి వెళ్లి టేకు చెట్లు నరకడం, తరలించడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను అరెస్ట్ చేసి లక్సెట్టిపేట కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని తెలంగాణ ప్రభు త్వ సాంఘిక సంక్షేమ బాలుర సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీవోఈ) గురుకుల కళాశాల వి ద్యార్థి జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కందుల శ్రీహర్ష ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 9, 11 తేదీల్లో బెల్లంపల్లిలోని తె లంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం (టీజీఎస్ఆర్)లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున ఆడి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు సీవోఈ ప్రిన్సిపాల్ వి జయ్సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా కళా శాలలో శ్రీహర్షకు పుష్పగుచ్ఛం అందజేసి ప్రి న్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. ఈనెల 28నుంచి ఫిబ్రవరి 2వరకు మహారాష్ట్రలోని నాగ్పూర్లో నిర్వహించనున్న జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో అండర్–19 విభా గంలో శ్రీహర్ష పాల్గొననున్నాడు. సీవోఈ వైస్ ప్రిన్సిపాల్ గోపి, ఉపాధ్యాయులు దశరథం, కమలాకర్, తిరుపతి, లక్ష్మణ్, హారిక, శశికుమార్, హెల్త్ సూపర్వైజర్ శ్రీలత, వ్యాయా మ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, ముచ్చకుర్తి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
గౌరపూర్లో మెస్రం వంశీయుల పూజలు
ఇంద్రవెల్లి: మండలంలోని గౌరపూర్ గ్రామ సమీపంలో గల పశువుల దొడ్డి వద్ద మంగళవారం మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేశారు. కేస్లాపూర్ నాగోబా మహాపూజతో పాటు ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ బుడుందేవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మెస్రం వంశీయులు తిరుగు ప్రయాణంలో తమ ఆచారం ప్రకారం గౌరపూర్ పశువుల దొడ్డి వద్ద పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ పూజలు చేసిన తర్వాతే తమ గ్రామాలకు వెళ్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరపూర్ సర్పంచ్ కోవా లాల్షావ్, మెస్రం దేవ్రావ్ పటేల్, కటోడ జంగు, మెస్రం సీతారాం డాకలి పటేల్, జంగు, మధవార్, మెస్రం జంగుకటోడ, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన ఎల్టా రాష్ట్రస్థాయి ఇంగ్లిష్ ఒలింపియాడ్, టెడ్ టాక్లో పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎస్.అలెగ్జాండర్, ఏ అనన్య, ఏ వికాసిని, ఎస్.అహల్య, ఎన్.సమన్విత, ఎం.సంజన, ఎస్.భవిత, ఎన్. సాహిత్య ప్రతిభ కనబరచగా డీఈవో యాదయ్య అభినందించారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ (ఒలింపియాడ్), ద్వితీయ (టెడ్ టాక్) స్థానాల్లో ఎన్.సంజన, ఎస్.భవిత (మోడల్ స్కూల్, మంచిర్యాల) విజయం సాధించారు. క్వా లిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, బాబ్జి, కళ్యాణి, సత్తయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులను అభినందించిన డీఈవో యాదయ్య -
ముస్తాబైన గద్దెలు
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల గోదావరి నదితీరాన ఈనెల 28 నుంచి 31 వరకు నిర్వహించనున్న సమ్మక్క, సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఇల్లారి (తల్లుల గుడి) నుంచి సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్నను తీసుకువచ్చి మేడారంకు చెందిన గిరిజన పూజారులు జవ్వ సతీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గద్దెలపై ప్రతిష్టించడంతో జాతర ప్రారంభం కానుంది. మహారాష్ట్రతో పాటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. గద్దెల వద్ద షామియానాలు, విద్యుత్ లైట్లు అమర్చారు. తాగునీటి సరఫరా, స్నానాలు ఆచరించేందుకు ఆకాశగంగ (నల్లాలు)లు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు నిర్మించారు. సరస్వతి శిశుమందిర్కు సమీపంతో పాటు ఎదురుగా ఉన్న మాతాశిశు ఆస్పత్రి ఖాళీ స్థలంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. సీఐ ప్రమోద్రావు పార్కింగ్ స్థలాల ను పరిశీలించి పలు సూచనలు చేశారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో.. మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగులకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం స్తానిక బాలుర పాఠశాల మైదానంలో అన్నదానం నిర్వహించారు. మూడు రోజుల పాటు అన్నదానం చేపడుతామని ట్రస్టు సభ్యులు తెలిపారు. -
వనంవీడి జనంలోకి..
ఆసిఫాబాద్అర్బన్: రెండేళ్లకోసారి జరిగే వనదేవతల జాతర జిల్లా కేంద్రంలోని పెద్దవాగు తీరాన, కేస్లాపూర్ హనుమాన్ ఆలయం ఎదురుగా నేడు ప్రారంభం కానుంది. సుమారు 30 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ పూజారి రమేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసం నుంచి నేడు ఉదయం 10 గంటలకు కుంకుమ భరిణి, పసుపు, కంకవనం, తదితర పూజా సామగ్రితో గద్దెల వరకు భాజా భజంత్రీలతో వచ్చి ప్రత్యేక పూజలు చేసి జాతర ప్రారంభిస్తారు. గద్దెల చరిత్ర.. బూరుగుడాకు చెందిన ముదురుకోల రమేశ్కు 1985లో వివాహమైంది. 20 ఏళ్లయినా సంతాన ం కాకపోవడంతో మేడారం వెళ్లి సమ్మక్క, సారలమ్మను దర్శించున్నాడు. ఇద్దరు కూతుర్లు, కుమారుడు జన్మించడంతో వారికి సమ్మక్క, సారలక్క, జంపన్న అని నామకరణం చేశాడు. 2016లో పెద్దవాగు తీరాన సొంత ఖర్చులతో గద్దెలను నిర్మించాడు. భక్తులు, ప్రముఖుల సహకారంతో నీరు, విద్యుత్, రహదారి సౌకర్యం కల్పించాడు. -
జాతర ప్రారంభం
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ ఆర్కే–1ఏ గని సమీపంలోని పాలవాగు ఒడ్డున నిర్వహిస్తున్న జాతరలో భాగంగా మంగళవారం కంకవనాన్ని తీసుకువచ్చారు. గని ఆవరణ నుంచి డప్పుచప్పుళ్ల మధ్య కంకవనాన్ని తీసుకువచ్చి జాతర ప్రాంగణంలోని సమ్మక్క, సారల మ్మ, పగిడిద్దెరాజు గద్దెలపై ప్రతిష్ఠించారు. మూడురోజులు నిర్వహించనున్న జాతరలో కార్మికులు, వారి కుటుంబసభ్యులు అధికసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నా రు. ఏరియా జీఎం రాధాకృష్ణ, ఎస్వోటూ జీ ఎం ప్రసాద్, ఏఐటీయూసీ నాయకులు అక్బర్అలీ, సలెంద్ర సత్యనారాయణ, డీజీఎం పర్సనల్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఖజానా ఖాళీ చేసిన గత ప్రభుత్వం
చెన్నూర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి కాగితాలే అప్పగించిందని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడు తూ.. బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో జరిగి న అభివృద్ధి శూన్యమని, వివిధ పనులకు ప్రొసీడింగ్లు ఇచ్చి నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని చెప్పా రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచిందని, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని తెలిపారు. 14వార్డుకు ఇప్పటివరకు రూ.3కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చె ప్పారు. భవిష్యత్లో మున్సిపల్ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి ఉదయం మార్నింగ్ వాక్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, కాంగ్రెస్ నాయకులున్నారు. -
గూడెంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
దండేపల్లి: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో స్వామి వారి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. గుట్టకింది నుంచి సన్నాయి వాయిద్యాలతో పూజాసామగ్రి, స్వామివారి చిత్రపటంతో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయం ముందు న్న మండపం వద్ద సప్తాహ భజనలు ప్రారంభించారు. అనంతరం నిత్యవిధి, ప్రాభోధిక ఆరగింపు, తీర్థప్రసాద గోష్టి, విశ్వక్సేనారాధ న, దీక్ష కంకణ ధారణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్, వ్య వస్థాపక కుటుంబసభ్యులు రఘుస్వామి, సంపత్స్వామి, వేదపండితులు నారాయణశర్మ, భరత్శర్మ, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అ ర్చకులు, భజన కళాకారులు పాల్గొన్నారు. -
ఉద్యోగులపై పని భారం తగ్గించాలి
పాతమంచిర్యాల: బ్యాంక్ ఉద్యోగులపై పని భారం తగ్గించాలని, వారంలో ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఒప్పందాలను గౌరవించాలని యునైటెడ్ ఫో రం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ రీజినల్ సెక్రటరీ కొ క్కుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం దే శవ్యాప్త సమ్మెలో భాగంగా బ్యాంక్ ఉద్యోగులు జి ల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి రెడ్డి కాలనీలోని ఎ స్బీఐ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీని వాస్ మాట్లాడుతూ.. ఐదురోజుల పని విధానం అమలు చేస్తామని 2024 మార్చిలో జరిగిన 12వ వే తన సవరణ చర్చల సందర్భంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఒప్పందం చేసుకున్నా ఇప్పటివర కు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడంతో బ్యాంక్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. వెంటనే న్యాయమైన డిమాండ్లు పరిశీ లించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తెలంగాణ స్టేట్ యూబీఐ వైస్ ప్రెసిడెంట్ ఎం.వసంత్కుమార్, డిప్యూటీ రీజినల్ సెక్రటరీ నీలం రమేశ్, తె లంగాణ స్టేట్ కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూని యన్ వైస్ చైర్మన్ ఎస్.విష్ణుచరణ్, ఎల్డీఎం తిరుప తి, ఏఐడీవోసీ రీజినల్ సెక్రటరీ ఆర్ఎస్ వెంకటేశ్, బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
పట్టణాల్లో ఓట్ల జాతర!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పురపాలక సంఘాల్లో ఎన్నికల జాతర మొదలైంది. ఓ వైపు సమ్మక్క–సారలమ్మ జాతర కొనసాగుతుండగా, మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ విడుదల చేయడంతో ఒక్కసారిగా పట్టణాల్లో రాజకీ యం వేడెక్కింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావ డంతో జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో ఆంక్షలూ అమలులోకి వచ్చాయి. బుధవారం వార్డుల వారీగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. దీంతో ఆశావహులు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. తుదిగా బరిలో దిగి న వారి నుంచి పోలింగ్ వరకు ప్రచార సమయం వారం రోజులే ఉంది. దీంతో పార్టీ టికెట్లు ఖరారైన చోట అభ్యర్థులు ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. అన్నింటికీ డబ్బుతోనే పని కావడంతో ఆర్థిక వనరులను సమీకరించుకున్నారు. తెగని టికెట్ల పంచాయితీ!నామినేషన్ల దాఖలకు మూడురోజులే ఉంది. నామి నేషన్ వేసినా బీ ఫాం ఇస్తేనే పార్టీ అభ్యర్థిగా చెల్లుబాటవుతుంది. అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల్లో ఇంకా ఎక్కడా అధి కారికంగా అభ్యర్థులను ఖరారు చేయలేదు. బీ ఫాం చేతిలో పడేవరకు అభ్యర్థులకు టెన్షన్ తప్పడం లే దు. తప్పనిసరిగా బరిలో ఉంటామని చెప్పుకొంటూ టికెట్కు పోటీ ఉన్న చోట్ల నాయకులు బెంగతో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు, క్యా తనపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికే జాబి తా ప్రకటించాల్సి ఉన్నా, ఇంకా జాప్యం చేస్తున్నా రు. మంచిర్యాల నగరపాలక సంస్థ, లక్సెట్టిపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు హామీ ఇచ్చినట్లు పలువురు ఆశావహులు డివిజన్లలో చె ప్పుకొంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, అఽధికార పార్టీ నుంచి సీనియర్ నాయకులు టికెట్ల కోసం సంప్రదిస్తే వారితో టచ్లో ఉంటున్నారు. బీ ఫాం రాకపోతే స్వతంత్రంగా బరిలోకి దిగడమా? పోటీ నుంచి విరమించుకోవడమా? లేక ప్రతిపక్ష పార్టీలోకి జంప్ కావడమా? అనే సందిగ్ధంతో వివి ధ పార్టీల ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అంతా సిద్ధం చేసిన యంత్రాంగంజిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో అధికార యంత్రాంగం నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్, కౌంటింగ్ రూంలు సిద్ధం చేసింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 149 వార్డుల్లో 444 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇందుకు 87మంది రిటర్నింగ్ ఆఫీస ర్లు, 178 మంది సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లు, 533 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,131 మంది ఇతర పో లింగ్ ఆఫీసర్లు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. జిల్లాలో 87 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ నేడు ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో పట్టణాల్లో సీఐల నేతృత్వంలో పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదీ షెడ్యూల్16న చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికబెల్లంపల్లిలో టికెట్ల గోల బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34వార్డులుండగా అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్లోనూ టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. సొంత పార్టీ నుంచి టికెట్ రాని ఆశావహులు వా ర్డు లేదా పార్టీ మారాలా.. లేదా స్వతంత్రంగా బరిలోకి దిగాలా.. అనే కోణాల్లో ఆలోచిస్తున్నా రు. కాంగ్రెస్కు చెందిన ఆశావహులు పోటాపోటీగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వద్ద ప్రయత్నం చే స్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప ర్యవేక్షణలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫైవ్మెన్ కమిటీ ఈపాటికే వార్డుల వారీగా ఆశావహుల వివరాలు ఆరా తీసి ఓ అంచనాకు వచ్చింది. గె లుపు అవకాశాలున్న అభ్యర్థులను ఎంపిక చేసి కాంగ్రెస్ జాబితా ప్రకటించాకే బీఆర్ఎస్ జాబి తాను వెల్లడించాలనే వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. సీపీఐ, బీజేపీ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. కాగా, ఎమ్మెల్యే వినోద్ తమకే టికెట్ ఖరారు చేశారని చెప్పుకొంటూ కొందరు కాంగ్రెస్ ఆశావహులు ప్రచారం మొదలు పెట్టారు. మరోవైపు బీఆర్ఎస్లో పలుచోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీలో పోటీ లేని చోట టికెట్లు ఖరారవుతున్నాయి. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం31న నామినేషన్ల పరిశీలన30వరకు నామినేషన్లు దాఖలు ఫిభ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు


