Mancherial District News
-
నాన్న కష్టమే ఎస్సైని చేసింది
జన్నారం: నాన్నంటే నడిపించే దైవమంటున్నారు జన్నారం ఎస్సై గొల్లపెల్లి అనూష. ‘కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లె గ్రామానికి చెందిన గొల్లపెల్లి తిరుపతి, పుష్పలత దంపతులకు మేము నలుగురు ఆడపిల్లలం. మాది మధ్య తరగతి కుటుంబం. ఆడపిల్లలమని అధైర్య పడకుండా నాన్న నలుగురిని చదివించారు. అందరూ డిగ్రీ పూర్తి చేయగా నేను మాత్రం బీటెక్ పూర్తి చేశాను. మా అందరికీ వివాహాలు, కాన్పులు చేశారు. నేను కష్టపడి ఎస్సై ఉద్యోగం సాధించాను. నాన్న కష్టపడి చదివించడంతోనే నేను ప్రయోజకురాలిగా ఈ రోజు ఉద్యోగం చేస్తున్నాను. మమ్ములను చదివించేందుకు నాన్న దుబాయ్ వెళ్లేవారు. మాకు వివాహాలు చేసిన తర్వాత కూడా అప్పులు తీర్చడం కోసం ఇంకా దుబాయ్ వెళ్తూనే ఉన్నారు. రెండేళ్లకోసారి మా కోసం ఇక్కడికి వస్తూ తిరిగి వెళ్తుంటారు. ఆయన కష్టమే మమ్ములను ప్రయోజకులుగా చేసింది’ అంటున్నారు అనూష. -
నిత్యస్ఫూర్తి..
నిర్మల్: మా నాన్న నాళం సాయన్న అంటే.. ఫిజిక్స్ లెక్చరర్గా అందరికీ తెలుసు. జూనియర్ లెక్చరర్గా సేవలందించి, ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. విధినిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా.. మా గురించి రోజూ ఆలోచించేవారు. తన తపనకు తగ్గట్లుగా మంచి స్థానాల్లో స్థిరపడ్డాం. నన్ను డాక్టర్ను చేసిన నాన్న ఇప్పటికీ ఆస్పత్రిలో నిత్యం సహకరిస్తున్నారు. నేను నా పిల్లలతో ఎలా ఉండాలోనన్న నిత్య స్ఫూర్తినిస్తున్నారు. – నాళం శశికాంత్, జనరల్ సర్జన్, నిర్మల్నాన్న స్ఫూర్తితోనే.. నిర్మల్: ‘మెదడుకు పదును’ అంటూ చిన్నప్పుడు నాన్న నాకిడి గంగన్న మాకు అందుబాటులో ఉంచిన పుస్తకాలు, తను చెప్పిన మాటలే ఇవ్వాళ్ల ఐఆర్ఎస్ అధికారిని చేశాయి. రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్గా నాన్న అడ్మినిస్ట్రేషన్ను దగ్గరుండి చూశాను. అంత బిజీగా ఉంటున్నా.. నాన్న మా గురించి నిత్యం ఆలోచించేవారు. తన స్ఫూర్తితోనే సివిల్స్లో ఆలిండియా 293ర్యాంక్ సాధించగలిగాను. ప్రస్తుతం గుజరాత్లోని జామ్నగర్లో కస్టమ్స్ అండ్ సీజీఎస్టీ అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్నాను. నేను ఎక్కడ ఉన్నా.. నాన్న ఆదర్శాలు నిత్యం నన్ను నడిపిస్తూనే ఉంటాయి. – నాకిడి సృజన్, అడిషనల్ కమిషనర్, కస్టమ్స్ అండ్ సీజీఎస్టీ, గుజరాత్ -
రెడ్క్రాస్ సొసైటీకి అవార్డులు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లా రెడ్క్రాస్ సొసైటీకి అరుదైన అవార్డు లభించింది. రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్లోని రాజ్భవన్లో ఉన్న సంస్కృతి కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ సొసైటీ సభ్యులకు అవార్డు అందజేశారు. స్వచ్ఛంద రక్తదాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రక్తదాన శిబిరాల నిర్వాహకుల కృషితో రాష్ట్రంలోనే అత్యధిక రక్త నిల్వలు సేకరించడంలో రెండోస్థానంలో నిలవడంతో అవార్డు దక్కింది. దీంతోపాటు రక్తదాన శిబిరంలో ఎక్కువ మంది స్వచ్ఛంద రక్తదాతలను సేకరించడం, ప్రభుత్వ రంగ సంస్థ కేటగిరీలో రామగుండం పోలీసు కమిషనరేట్, ప్రైవేటు రంగ సంస్థ కేటగిరీలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ దేవాపూర్లకు అవార్డులు అందజేశారు. మంచిర్యాల రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్రెడ్డిని అభినందించారు. -
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
మంచిర్యాలక్రైం: మంచిర్యాల, రవీంద్రఖని రైల్వేస్టేషన్ల మధ్య ఈ నెల 13న రాత్రి గుర్తు తెలియని వ్యక్తి (35) రైలు కిందపడి ఆత్మహ త్య చేసుకున్నట్లు జీఆర్పీ హెడ్కా నిస్టేబుల్ సంపత్ తెలిపారు. ఆయ న తెలిపిన వివరాల ప్రకారం.. రై లు కిందపడి ఒకరు చనిపోయిన ట్లు అందిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించగా మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు, అడ్రస్ లభించలేదని తెలిపా రు. ఎడమ చేతిపై ‘ఇండియా’ అని ఇంగ్లిష్లో రాసిన పచ్చబొట్టు ఉంద ని, మృతుడి ఒంటిపై బ్లూకలర్ టీష ర్ట్, జీన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మృతదేహాన్ని స్థానిక ప్రభు త్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలకు 9701112343, 8328512176 నంబర్లలో సంప్రదించాలని హెడ్కానిస్టేబుల్ సూచించారు. -
నాన్నే.. రోల్మోడల్..
నిర్మల్: మానాన్న బీఎన్.సర్కార్. జార్ఖండ్ కేడర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. మేం నలుగురం పిల్లలం. ఇద్దరు అక్కచెల్లెళ్లం. ఇద్దరు అన్నదమ్ములు. మా అందరినీ నాన్న బాగా చదివించారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మా గురించి ప్రతిరోజు ఆలోచించేవారు. అందుకు తగ్గట్లుగానే ఈరోజు అందరం ఉన్నత స్థాయిలో స్థిరపడ్డాం. న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చదివిన నాన్న మమ్మల్ని కూడా చదువులో ప్రోత్సహించారు. అందుకే పబ్లిక్ పాలసీలో డబుల్ మాస్టర్స్, సోషియాలజీలో మాస్టర్స్ చదివాను. సివిల్స్ లక్ష్యంగా పెట్టుకోవాలని నాన్నే నాకు సూచించారు. ఐఏఎస్ సాధించడంలోనూ నాన్న అడుగడుగునా వెన్నుతట్టి ప్రోత్సహించారు. నా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటికీ చాలా విషయాల్లో నాన్నే రోల్మోడల్. – అభిలాష అభినవ్, కలెక్టర్, నిర్మల్ -
జన్నారం ఎఫ్డీవోగా రామ్మోహన్
● ఉత్తర్వులు జారీ చేసిన పీసీసీఎఫ్ ● 20 నెలల తర్వాత నియామకం జన్నారం: కవ్వాల్ టైగ ర్ రిజర్వులోని మంచి ర్యాల జిల్లా జన్నారం ఫారెస్టు డివిజల్ అధికా రి(ఎఫ్డీవో)గా ఎం.రా మ్మోహన్ను నియమి స్తూ రాష్ట్ర ముఖ్య అట వీశాఖ అధికారి(పీసీసీఎఫ్) సి.సువర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రామ్మోహన్ హైదరాబాద్లోని దూలపల్లి శిక్షణ అకాడమీలో రేంజ్ ఆఫీసర్ హోదాలో ఉంటూ కోర్సు డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10మంది సీనియర్ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించగా.. ఇందులో రామ్మోహన్ను పదోన్నతితో ఎఫ్డీవోగా నియమించారు. గత 2023అక్టోబర్లో ఇక్కడ ఎఫ్డీవోగా పనిచేసిన ఎస్.మాధవరావును హైదరా బాద్లోని రాష్ట్ర ముఖ్య అటవీశాఖ కార్యాలయానికి బదిలీ చేశారు. అప్పటి నుంచి 20నెలలుగా మంచిర్యాల డీఎఫ్వో శివ్ ఆశిష్సింగ్ అ దనపు బాధ్యతలతో ఇన్చార్జి ఎఫ్డీవోగా ఉన్నారు. ఎట్టకేలకు రామ్మోహన్ను జన్నారం ఎఫ్డీవోగా నియమించారు. -
అనుక్షణం అండగా నిలిచారు..
మాది తలమడుగు మండలంలోని గిరిజన గ్రామమైన పల్సి(బి)తండా. నాన్న జాదవ్ గోవింద్ రావు హెడ్ కానిస్టేబుల్. మా ఊరిలో తొలి ప్రభు త్వ ఉద్యోగి నాన్నే. చదువుతోనే గొప్ప భవిష్యత్తు ఉంటుందని నమ్మిన వ్యక్తి. చిన్నతనం నుంచే నాకు విద్యా ప్రాధాన్యతను వివరించారు. ఒకటి నుంచి ఐదు వరకు ఉట్నూర్లో, ఆరు నుంచి పదో తరగతి వరకు కాగజ్నగర్ నవోదయలో చదివాను. ఇంటర్ హైదరాబాద్లో, తిరుచ్చి ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా ను. నాన్న పోలీస్ శాఖలో పనిచేస్తుండటంతో జిల్లాకు వచ్చిన ఎస్పీ, కలెక్టర్ల గొప్పతనం, వారికి సమాజంలో ఉండే గౌరవం గురించి చెప్పేవారు. ఆ దిశగా లక్ష్యాన్ని ఎంచుకోవాలని సూచించేవారు. దీంతో బీటెక్ పూర్తికాగానే ఐఏఎస్ సాధించాలని నిర్ణయించుకున్నాను. తొలి నాలుగు ప్రయత్నాల్లో విఫలమయ్యాను. ఐదో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్కు ఎంపికై నా అందులో చేరలేదు. 2024లో 68వ ర్యాంకు సాధించి ఐఏఎస్గా ఎంపికయ్యాను. ప్రస్తుతం ముస్సోరిలో శిక్షణలో ఉన్నా. పోలీస్ ఉద్యోగమంటే సెలవులుండేవి కావు. కానీ నేను పరీక్షలు రాసే సమయంలో నాన్న నా వెంటే ఉండేవారు. లక్ష్యాన్ని చేరుకునే దిశగా అనుక్షణం నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన పడిన కష్టం, అందించిన మార్గదర్శనంతోనే నేను విజయం సాధించగలిగాను. – జాదవ్ సాయి చైతన్య, ఐఏఎస్ -
బాసర క్షేత్రంలో భక్తుల రద్దీ
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనా నికి భక్తులు పోటెత్తారు. శనివారం సంకటచతుర్థి శు భ ముహూర్తం కావడంతో ఆలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మ హారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని ద ర్శించుకున్నారు. చిన్నారులతో అక్షరాభ్యాస మండపంలో అర్చకులతో అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు జరిపించారు. వివిధ అర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.9,14,500 ఆదాయం వచ్చినట్లు ఆల య కార్యనిర్వహణాధికారి సుధాకర్రెడ్డి తెలిపారు. గంజాయి పట్టివేతనస్పూర్: పట్టణ పరిధిలో గంజాయి కలిగి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం స్థానిక ఎస్సై ఉపేందర్రావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి సీతారాంపల్లిరోడ్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో విద్యానగర్కు చెందిన నాధరి వంశీ వద్ద 99 గ్రాముల గంజాయి లభ్యమైంది. గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చౌడేశ్వరీ మాత ఆలయంలో చోరీ ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణ శివారులోని చౌడేశ్వరీ మాత ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయ ప్రధాన ద్వారం గేట్లకు వేసిన తా ళాలను పగులగొట్టి లోనికి చొరబడ్డ దొంగలు బీరువాలోని వస్తువులను చిందరవందర చేశారు. ఆల య సిబ్బంది శనివారం ఉదయం ఆలయానికి వ చ్చి చూడగా తాళం పగులగొట్టి సామగ్రి చిందరవందరగా ఉండగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీ సులకు సమాచారమందించారు. దీంతో టూ టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పరిసరాలను తనిఖీ చేసి ఆధారాలు సేకరించారు. కాగా, ఓ ముక్కు పుడక కనిపించడం లేదని ఆలయ పూజారి తెలిపారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బావిలో పడి చుక్కల దుప్పి మృతిదస్తురాబాద్: దాహార్తి తీర్చుకునేందుకు వచ్చిన చుక్కల దుప్పిని ఊరకుక్కలు తరమడంతో వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. ఎఫ్ఎస్వో కింగ్ఫిషర్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఆకోండపేట గ్రామం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతంలో గ్రాస్ ప్లాంటేషన్లో భాగంగా గడ్డి పెంచుతున్నారు. సమీపంలో చెరువు ఉండటంతో గ్రాస్ ప్లాంటేషన్ ప్రాంతానికి తరచూ వన్యప్రాణులు మే త, నీటి కోసం వస్తుంటాయి. ఈ క్రమంలో శనివా రం ఇక్కడికి వచ్చిన చుక్కల దుప్పులను ఊర కుక్కలు తరిమాయి. ఈ క్రమంలో ఓ చుక్కల దుప్పి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో పడింది. స్థానికులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు తాళ్ల సాయంతో దానిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన చుక్కల దుప్పికి పశువైద్యాధికారులు చికిత్స అందించినా మృతి చెందింది. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి అటవీ ప్రాంతంలో దానిని ఖననం చేశారు. -
పట్టుబట్టి.. కొలువు కొట్టాడు
● అసిస్టెంట్ కమాండెంట్గా అభినవ్వర్మదండేపల్లి: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు మండలంలోని నెల్కి వెంకటాపూర్కు చెందిన పెట్టెం అభినవ్వర్మ. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తండ్రి లచ్చన్న ప్ర భుత్వ ఉపాధ్యాయుడు. అభినవ్వర్మ పదోతరగ తి వరకు మంచిర్యాలలో, ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివాడు. ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ ఐఐటీ జోదాపూర్లో పూర్తిచేశాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా గతంలో కంబైండ్ డిఫెన్స్ సర్వీస్ లో ఉద్యోగం కోసం నాలుగుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. యూపీఎస్సీ నిర్వహించిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) ఉద్యోగానికి గతంలో ఒకసారి ప్రయత్నించి ఫెయిలయ్యాడు. అయినా ఏమాత్రం కుంగిపోకుండా ప ట్టువదలని విక్రమార్కుడిలా క ష్టపడ్డాడు. మళ్లీ కసితో చదివా డు. గతేడాది నోటిఫికేషన్ విడుదల కాగా ఆగస్టులో నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ కనబరిచి క్వాలిఫై అయ్యాడు. ఫిజి కల్ ఫిట్నెస్, మెడికల్, ఇంట ర్వ్యూ అన్నింటా పాస్కావడంతో 138వ ర్యాంక్ సాధించి సీఏపీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉ ద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా కుటుంబీకులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, పలువురు అతడిని అభినందించారు. -
పిల్లల కోసమే ప్రమోషన్ వదిలి..
వేమనపల్లి: మండలంలోని బుయ్యారం గ్రామానికి చెందిన అర్క పోచయ్య పిల్లల బాగోగుల కో సం ఉద్యోగ రీత్యా ప్రమోషన్ వదులుకుని వారి జీవితాలను తీర్చిదిద్దాడు. తన తండ్రి గంగయ్య గ్రామంలో భూస్వాములకు పాలేరుగా ఉండి పో చయ్యను 10 వతరగతి వరకు చదివించాడు. మంచిర్యాలలో డిగ్రీ, ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేశాడు. ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్గా చేరి న పోచయ్య ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్గా ప ని చేస్తున్నారు. మేనేజర్గా ప్రమోషన్ వచ్చినా కొడుకుల చదువులకు ఆటంకమేర్పడుతుందని వదులుకున్నాడు. ఉద్యోగరీత్యా మంచిర్యాలలో ఉంటున్నాడు. పెద్ద కొడుకు మనోజ్ గాంధీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి మల్లారెడ్డి మెడికల్ కాలేజీ లో పీజీ చేస్తున్నాడు. రెండో కొడుకు మహర్షి బీటె క్ ‘సివిల్’ పూర్తి చేసి అల్ట్రాటెక్ కంపెనీలో పని చే స్తున్నాడు. మనీశ్ బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తిచేసి ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. -
రక్తదానానికి ముందుకు రావాలి
మంచిర్యాలటౌన్: రక్తదానం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న బ్లడ్బ్యాంకులో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం మంచిర్యాల పోలీసుశాఖ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని కాపాడేందుకు, తలసేమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని ఎక్కించేందుకు శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, ఏఎస్ఐ జి.నందయ్య, రెడ్క్రాస్ సెక్రెటరీ చందూరి మహేందర్, డాక్టర్ శరత్బాబు, రెడ్క్రాస్ కోశాధికారి కె.సత్యపాల్రెడ్డి, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, యెడ్ల కిషన్, కే.సంతోశ్కుమార్, ఎం.సత్యనారాయణరెడ్డి, చుంచు శంకర్వర్మ, బి.సత్యనారాయణరావు, రక్తనిధి వైద్యులు డాక్టర్ ప్రియాంక సక్సేనా, డాక్టర్ కే.సురేశ్, డాక్టర్ స్పందన పాల్గొన్నారు. -
జీవిత గమ్యాన్ని నిర్దేశించారు
మాది రాజస్థాన్లోని సవాయి మాదాపూర్ జిల్లా మలర్నా చౌర్ గిరిజన గ్రామం. నాన్న సీతారాం మీనా. డీపీఆర్వోగా పనిచేశా రు. 1నుంచి 7వరకు హిందీ మీడియంలో, 8 నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివాను. బీహెచ్యూలో ఐఐటీ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. నాన్న నాకు బాల్యం నుంచే క్రమశిక్షణతో కూడిన జీవిత గమ్యాన్ని నిర్దేశించారు. ఆ దిశగా ప్రోత్సహించారు. ఐఐటీ అనంతరం సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఇంట్లో కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ విషయాన్ని నాకు తెలియనివ్వకుండా చదువుపైనే దృష్టి సారించాలని సూచించారు. ఉన్నత ఉద్యోగంతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం ఉంటుందని చెప్పేవారు. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేఽసేవారు. సివిల్స్లో ఐదు సార్లు నిరాశ ఎదురైనా లక్ష్యాన్ని చేరుకునే దిశగా మరింత కష్టపడాలని వెన్నుతట్టారు. ఆ ప్రోత్సాహంతోనే ఆరో ప్రయత్నంలో 458వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్గా ఎంపికయ్యా. నా జీవిత లక్ష్యాన్ని చేరుకోవడంలో మా నాన్నే నాకు రోల్మోడల్. – యువరాజ్ మర్మాట్, సబ్కలెక్టర్, ఉట్నూర్ తల్లిదండ్రులతో యువరాజ్ మర్మాట్ -
ఐదు సార్లు విఫలమైనా వెన్నుతట్టారు
మాది ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామం. నాన్న సత్యనారాయణ జర్నలిస్టు. చిన్నప్పటి నుంచి ఆయనే నాకు స్ఫూర్తి. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను ఐఆర్ఎస్గా ఎంపికయ్యానంటే అది నాన్న అందించిన ప్రోత్సాహమే. చదువు ప్రాధాన్యతతో పాటు ఎన్నికష్టాలు ఎదురైనా లక్ష్యసాధనను మాత్రం వీడొద్దని ఆయన నుంచే నేర్చుకున్నా. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇంద్రవెల్లిలో చదివాను. 6నుంచి 10 వరకు కాగజ్నగర్ జవహర్ నవోదయలో, ఇంటర్మీడియెట్ హైదరాబాద్లో పూర్తిచేశా. ఐఐటీ గౌహతిలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక సివిల్స్కు సన్నద్ధమయ్యాను. తొలి ప్రయత్నంలో 12 మార్కులతో వెనుకబడ్డాను. రెండో ప్రయత్నంలో మెయిన్స్ కూడా రాలేదు. ఇలా ఐదు ప్రయత్నాల్లో నిరాశే ఎదురైంది. ఆరో ప్రయత్నంలో ఢిల్లీలో కోచింగ్ తీసుకునే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అయినా నా చదువు, భవిష్యత్తు విషయంలో నాన్న ఎప్పుడూ రాజీ పడలేదు. అనునిత్యం నాలో ఆత్మవిశ్వాసం నింపుతూ ప్రోత్సహించారు. పరీక్షలు రాసే సమయంలో భోజనం కూడా చేయకుండా ఓపికగా సెంటర్ వద్దే బయట వేచి ఉండేవారు. ఆరో ప్రయత్నంలో 790వ ర్యాంకు సాధించాను. ప్రస్తుతం నాగ్పూర్లోని ఐఆర్ఎస్ శిక్షణ సంస్థలో ఇన్కంటాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా శిక్షణ పొందుతున్నా. ఇది ముమ్మాటికీ మా నాన్న అందించిన విజయమే. – శుభం రేకుల్వర్, ఐఆర్ఎస్ -
నాన్న.. సేవ..
● తండ్రి యాదిలో చారిటబుల్ ట్రస్టులు ● సామాజిక కార్యక్రమాలతో ముందుకు.. మంచిర్యాలఅర్బన్: మంచిర్యాలకు చెందిన మల్యాల శ్రీపతి తండ్రి రాజయ్య 2007లో చ నిపోయాడు. ఆయన జ్ఞాపకార్థం సేవ చేయాలని శ్రీపతి ఆలోచించాడు. ఓసారి తన స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తం అవసరం కావడంతో దానం చేశాడు. ఆ తర్వా త 2013లో తండ్రి పేరిట మల్యాల రాజయ్య వెల్ఫేర్ సొసైటీ, 2024లో మల్యాల చారిటబు ల్ ట్రస్టు ఏర్పాటు చేసి రక్తదానం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటివరకు 55 సార్లు రక్తదానం చేశాడు. రక్తం అవసరమని ఎవరైనా అడిగిన వెంటనే ట్రస్టు ద్వారా సమకూరుస్తుంటారు. మహిళలు ముందుకు రావా లనే ఉద్దేశంతో తన సతీమణి సుష్మతో ఆరుసార్లు రక్తదానం చేయించాడు. పట్టణానికి చెందిన దివ్యాంగుడు, మరో ఇద్దరు వృద్ధురాళ్లకు ప్రతీ మూడు నెలలకోసారి 25కిలోల బియ్యం అందిస్తున్నాడు. ● దుర్గం రాజేశ్ తన తండ్రి పేరిట దుర్గం పోచం చారిటబుల్ ట్రస్టు ద్వారా సేవలందిస్తున్నాడు. పాత మంచిర్యాలకు చెందిన దుర్గం పోచం కౌన్సిలర్గా పని చేస్తూ చని పోయాడు. 2020లో దుర్గం పోచం చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేశాడు. స్కూల్ పిల్ల లకు యూనిఫాం, అనాథాశ్రమానికి బి య్యం అందజేశాడు. సరస్వతీ శిశుమందిర్లో ఓ పేద విద్యార్థికి ఏడాది పాటు ఫీజు చెల్లించాడు. రాళ్లపేట్ రోడ్ నంబర్–1లో శివపంచాయతన ఆలయానికి తన తండ్రి పేరిట స్థలాన్ని అప్పగించి ఆదర్శంగా నిలి చాడు. పేదల కుటుంబాల్లో వివాహాలకు ఆర్థికసాయం, కళాకారులు, క్రీడాకారులకు పోటీల సమయంలో ఆర్థికసాయం, బహుమతులు అందజేస్తున్నాడు. -
నాన్న కష్టానికి ఫలితంగా డాక్టర్లమయ్యాం
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాలకు చెందిన చిరువ్యాపారి సిద్దంశెట్టి ప్రవీణ్, మధుశ్రీ దంపతులకు కుమారుడు ప్రీతమ్, కుమార్తె అశ్వీత సంతానం. తన పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. చేసేది చిరువ్యాపారమైనా ఇద్దరు పిల్లలను వైద్యులను చేశాడు. తండ్రి ఆశలకు అనుగుణంగా కుమారుడు ప్రీతమ్కుమార్ యూకేలో పీజీ సర్జన్ చేస్తుండగా.. కుమార్తె ఆశ్వీత ఎంజీఎంలో హౌజ్ సర్జన్గా చేస్తోంది. తమ భవిష్యత్ కోసం నాన్న పడిన శ్రమ.. ఆర్థిక కష్టాలు, అన్నీఇన్నీ కావంటున్నారు సిద్దం శెట్టి ఆశ్వీత. ‘నాన్న చదువులో ఎంతో ప్రోత్సహించేవారు. అన్నయ్య ప్రీతమ్తో సమానంగా నన్ను చదివించారు. లోనవెల్లి గ్రామంలో మా నాన్నమ్మకు వైద్యం అందక పడిన ఇబ్బందులు కళ్లారా చూశాం. అప్పుడే డాక్టర్లం అవుతామని నాన్నకు చెప్పాం. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చదువుకు అడ్డం వస్తాయని అనుకున్నప్పటికీ నాన్న వెన్నంటి ప్రోత్సహించారు. నాన్న కల నిజం చేసి అన్నయ్య, నేను డాక్టర్లయ్యాం’ అని ఆశ్వీత గర్వంగా చెబుతున్నారు. -
● గమ్యం నిర్దేశించి.. దిక్సూచిగా నిలిచి ● లక్ష్యసాధనలో ఆ త్యాగం అనిర్వచనీయం ● నేడు అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం
– మరిన్ని కథనాలు 8లోuనాన్న.. రెండక్షరాల పదమే అయినా ప్రతీ ఒక్కరి జీవితంలో విడదీయరాని బంధం. బాల్యంలో వేలుపట్టి నడక నేర్పే తొలిగురువుగా.. తప్పట డుగులు సరిదిద్దే మార్గదర్శిగా.. లక్ష్యసాధనలో దిక్సూచిగా నిలిచే ఆ స్ఫూర్తి ప్రదాత పాత్ర అనిర్వచనీయం. కనుపాపలను తీర్చిదిద్దే ఆ కనురెప్పల మాటున కనిపించని త్యాగాలెన్నో. బిడ్డల విజయ తీరాన అది ఆనంద బాష్పమై వికసిస్తోంది. జీవిత పయనంలో బాధలెన్ని ఎదురైనా పిల్లల వికాసానికి బాటలు వేసే ఆ అలుపెరగని బాటసారికి సలాం చేయాల్సిందే. తాను సాధించని విజయాలను వారి రూపంలో చూసుకుని మురిసిపోయే ఆ ప్రేక్షకుడికి నీరాజనం పలకాల్సిందే. ఉన్నతస్థాయికి ఎదిగిన తమ విజయంలో ఆయనదే అగ్రస్థానమంటున్నారు ఆ బిడ్డలు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా తమ సక్సెస్లో నాన్న పాత్రపై పలువురి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. – కైలాస్నగర్ -
నాన్న రెక్కల కష్టం.. కూతుళ్ల చదువులకే..
తాంసి: మండలంలోని వడ్డాడి గ్రామానికి చెందిన చింతల పురుషోత్తం–మమత దంపతుల కు ఇద్దరు కూతుళ్లు మధుమిత, మనస్విత సంతానం. పురుషోత్తం తననుకున్న ఎకరంలో వ్య వసాయం చేస్తూ, గొర్రెలు కాస్తూ జీవనాన్ని కొ నసాగిస్తున్నాడు. కుటుంబం గడవడానికి, ఇద్ద రు ఆడపిల్లలను ప్రయోజకులుగా చేయడానికి చాలా కష్టపడి చదివించాడు. తను కష్టపడి సంపాదించిన మొత్తాన్నంతా పిల్లల చదువుకే ఖ ర్చు చేస్తున్నాడు. పెద్ద కూతురు మధుమిత ఉ స్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చే సి ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగాల కోసం నంద్యాలలో కోచింగ్ తీసుకుంటోంది. చిన్న కుమార్తె మనస్విత ఎలాంటి కోచింగ్ లేకుండా మూడేళ్ల క్రితం 2వేల ర్యాంక్ సాధించి మద్రాస్ ఐఐటీలో సీఎస్ఈ విభాగంలో సీటు సాధించి ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతోంది. పేద కుటుంబమైనప్పటికీ ఇద్దరు ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్న పురుషోత్తం నాన్నలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. -
నాన్నే నాకు హీరో..
జైనథ్: ‘మాది జైనథ్ మండలంలోని కూర గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి మా నాన్న అల్లూరి నర్సింగ్రెడ్డి నన్ను, మా చెల్లె రిచాను ఎంతో కష్టపడి చదివించారు. ఎంత కష్టం వచ్చినా వ్యవసాయం మానుకోలేదు. అహర్నిశలు శ్రమిస్తూ మమ్మల్ని ఉన్నత చదువులు చదివించారు. సాధారణ రైతు అయినప్పటికీ చదువు విలువ తెలిసి ఆయన నాకు చదువు ప్రాముఖ్యత తెలియజేస్తూ ప్రోత్సహించాడు. నేను ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. 2021లో కానిస్టేబుల్ ఉద్యోగం మూడు మార్కుల తేడాతో చేజారినప్పటికీ కుంగిపోలేదు. నాన్న ఇచ్చిన ఽధైర్యంతో 2023లో మరోసారి ప్రయత్నించి సివిల్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం భీంపూర్ మండలంలోని పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాను. మమ్మల్ని ఇంతటివారిని చేసిన నాన్నే నాకు హీరో..’ అంటున్నాడు అఖిల్రెడ్డి -
‘నీట్’లో ట్రినిటి ప్రభంజనం
కరీంనగర్: నీట్–2025 ఫలితాల్లో ట్రినిటి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అనేకమంది అత్యు త్త మ మార్కులు సాధించడంతో పాటు, కొందరు టా ప్ 1000ర్యాంకుల్లో చోటు సాధించారు. బీ కార్తిక్(519 మార్కులు), ఎం.మానస (504), ఎం.చంద్రశేఖర్ (501), వై.అశ్విత (488) ఎన్.గౌతమి(471), ఎం.శ్రీకాంత్(470), ఎం.శివప్రసాద్(469), ఎస్.అఖిల్ (469), ఎం.హరిశ్చంద్ర (463), ఎం.అభినయ (461మార్కులు) సాధించారు. బీ కార్తిక్ 736వ ర్యాంక్, ఎం.చంద్రశేఖర్ 1,266వ ర్యాంక్, ఎల్.ప్రతిమ 2,149వ ర్యాంక్, డీ తేజస్విని 2,267వ ర్యాంక్, జే అంజని 4212వ ర్యాంక్, కే మయూక 4,286 వ ర్యాంకులతో జాతీయస్థాయిలో రాణించారు. ట్రి నిటి వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి మా ట్లాడుతూ.. తమ విద్యార్థుల పట్టుదల, ట్రినిటిలో అందించే శిక్షణ పద్ధతులు, మెరుగైన విద్యా వాతావరణం ఈ గొప్ప విజయానికి కారమన్నారు. ఈ విజయం ట్రినిటిని దేశంలోని అత్యుత్తమ మెడికల్ శిక్షణ సంస్థల్లో ఒకటిగా నిలబెట్టిందన్నారు. -
క్షయ వ్యాధి నివారణ సులువు
బెల్లంపల్లి: క్షయ వ్యాధిని సత్వరంగా నిర్ధారించడం వల్ల నివారించడం తేలికవుతుందని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ సుధాకర్నాయక్ అన్నారు. శనివారం బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ రడగంబాలబస్తీలోని బస్తీ దవాఖానలో నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ వైద్యశిబిరంలో ఆయన మాట్లాడారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులకు ఈ వ్యాధి సంక్రమిస్తుందని వివరించారు. తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుందని తెలిపారు. అనంతరం శిబిరానికి హాజరైన ప్రజలకు పలు రకాల వ్యాధినిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సహన, సుచరిత, సౌజన్య, రామకృష్ణ, జుబేర్ హుస్సెన్, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ సురేందర్, క్లినికల్ సర్వీసు అధికారి రాజేష్, టీబీ సూపర్వైజర్ శశికాంత్ పాల్గొన్నారు. -
అప్పీళ్లు లేని అంతిమ తీర్పు
మంచిర్యాలక్రైం: లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసులు అప్పీళ్లు లేని అంతిమ తీర్పు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య అన్నారు. జిల్లాలోని వివిధ కోర్టు ప్రాంగణంలో శనివారం ఎనిమిది బెంచ్లు ఏర్పాటు చేసి లోక్ అదాలత్ నిర్వహించినట్లు తెలిపారు. మంచిర్యాల లోక్ అదాలత్లో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్లో 37 బ్యాంకు రికవరీ కేసులు, దాదాపు 5,250 కేసులు పరిష్కరించామని తెలిపారు. కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని కేసుల నుంచి విముక్తి పొందాలని అన్నారు. రాజీమార్గమే రాజమార్గమని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్నాయక్, సీనియర్ సివిల్ జడ్జి రాంమోహన్రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జి జీ.కవిత, కే.నిరోష, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. రాజీ మార్గమే రాజమార్గం లక్సెట్టిపేట: రాజీ మార్గమే రాజమార్గమని జూ నియర్ సివిల్ జడ్జి కాసమల సాయికిరణ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా 552 క్రిమినల్, 2 సివిల్ కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ సత్యం, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సత్తన్న, సత్యగౌడ్, ఎస్సైలు సురేష్, శ్రీలత పాల్గొన్నారు.లోక్ అదాలత్లో 1,458 కేసుల పరిష్కారంచెన్నూర్: చెన్నూర్ జూనియర్ సివిల్ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1,458 కేసులు పరిష్కారమయ్యాయని జూనియర్ సివిల్ జడ్జి పర్వతపు రవి తెలిపారు. కోర్టు పరిధిలో 1,354 డ్రంకెన్ డ్రైవ్, న్యూసెన్స్ కేసులు పరిష్కారమయ్యాయని, ఇందులో రూ.6,36,420, బ్యాంక్ కేసులు 37 పరిష్కారం కాగా రూ.23,96,813 జరిమానా విధించామన్నారు. 44 క్రిమినల్ కేసులు, 4 సివిల్ కేసులు పరిష్కారమయ్యాయన్నారు. -
ఉపాధి కల్పనకు కృషి
కార్మిక, గనుల శాఖల మంత్రిగా సింగరేణి సంస్థ, కార్మికుల విషయంలో మీ ప్రణాళికలు ఏంటి?మంత్రి: సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా గనులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఓపెన్ కాస్ట్ల కంటే భూగర్భ గనులతోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆ దిశగా సింగరేణి యాజమాన్యంతో చర్చించి స్థానికులకు ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంటా.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కార్మికులకు సౌకర్యాలు, యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, కార్మిక, గనుల శాఖ కేటాయింపు తర్వాత శనివారం తొలిసారిగా జిల్లాకు వచ్చిన వివేక్వెంకటస్వామికి చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వివిధకార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడారు. తన తండ్రి కాకా వెంకటస్వామి, అన్నయ్య వినోద్, ఆ తర్వాత తనకు కార్మిక శాఖ మంత్రిగా పని చేసే అవకాశం దక్కిందని గుర్తు చేశారు. సింగరేణి సంస్థతో మరిన్ని కొత్త గనులు ప్రారంభించి యువతకు ఉద్యోగాలు కల్పించాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మంత్రిగా మీ ప్రాధాన్యతలు ఏంటి?మంత్రి: చెన్నూరు నియోజకవర్గంలో ఇన్నాళ్లు సరిగా రోడ్లు కూడా లేకుండే. ప్రజలు ఇబ్బంది పడొద్దని ప్రతీ గ్రామానికి సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు మొదలుపెట్టాను. పట్టణాలకు తాగునీటి సమస్య లేకుండా అమృత్స్కీం కింద ఇంటింటికీ స్వచ్ఛనీరు అందిస్తాను. అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా తీర్చుతాను. సాగునీటి ప్రాజెక్టులతో రైతులకు నీటి వసతులు కల్పించేందుకు కృషి చేస్తాను. దళితులకు ఉపాధి కల్పించే మందమర్రిలోని తోళ్ల పరిశ్రమను తెరిపిస్తారా?మంత్రి: రాష్ట్ర లెదర్ కార్పొరేషన్కు ప్రస్తుతం చైర్మన్ లేరు. నియామకం కావాల్సి ఉంది. ఇ ప్పటికే తోళ్ల పరిశ్రమ ద్వారా ఉపాధి కల్పన కోసం శిక్షణ, యువతకు అవకాశాలపై అధికా రులతో చర్చించా. అవసరమైన వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి యువతకు ఉపాధి కలిగేలా చేస్తా. మందమర్రి పట్టణానికి ఎన్నికలు నిలిచి ఏళ్లుగా పెండింగ్లో ఉంది? మంత్రి: మందమర్రి పట్టణానికి ఎన్నికలు ని ర్వహించేందుకు కృషి చేస్తున్నాను. సుప్రీంకో ర్టులో కేసు ఉన్నందున అడ్వకేట్ జనరల్ను క లసి ఆ మేరకు అఫిడవిట్ సమర్పించాను. త్వరలోనే సమస్య పరిష్కారం చేసేలా ప్రయత్నిస్తా. చెన్నూరుపై ప్రత్యేక దృష్టి సింగరేణిలో కొత్త గనులు ప్రారంభించాలి ‘సాక్షి’తో కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి -
పెద్దగా చదువుకోకపోయినా..
సాత్నాల: భోరజ్ మండలం ఆకోలి గ్రామానికి చెందిన మునిగెల విఠల్ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఇంటర్ వరకు విద్యనభ్యసించాడు. తనకున్న బరువు, బాధ్యతలతో పైచదువులు కొనసాగించలేకపోయాడు. ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు శ్రీనివాస్, రెండోవాడు వినోద్. పిల్లలు ఉన్నత స్థానాల్లో చూడాలని తపించేవాడు. వారిని ప్రోత్సహించేవాడు. నాన్న కలను నెరవేర్చుతూ శ్రీనివాస్ జూనియర్ లెక్చరర్, వినోద్ డాక్టర్ అయ్యారు. ప్రోత్సాహం వెలకట్టలేనిదిమా నాన్న బాల్యం నుంచే చదువు ప్రాముఖ్యత, మంచి తనం, మానవత్వం, విలువల గురించి మాకు నేర్పించారు. ఆయన ప్రోత్సాహంతోనే లెక్చరర్ ఉద్యోగం సాధించి ప్రస్తుతం ఇచ్చోడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్నాను. నాన్న ప్రోత్సాహం వెలకట్టలేనిది. ఎన్ని జన్మలెత్తినా ఆయనకే కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్న. – మునిగల శ్రీనివాస్, జూనియర్ లెక్చరర్ నాన్న చూపిన బాటలో నడుస్తా మనం చదువుకున్న చదువు పదిమందికి ఉపయోగపడాలనేది నాన్న ఆశయం. ఆయ న చూపిన మార్గంలోనే కష్టపడి డాక్టరేట్ సాధించాను. పేద ప్రజలు, గ్రామస్తులకు ఉచిత వైద్యమందించాలనేది నాన్న కల. నాన్న చూపిన మార్గంలో నడుస్తూ చేతనైనంత సాయం చేస్తూనే ఉంటాను. ప్రస్తుతం ఈ ఎస్ఐ రామచంద్రపురంలో పని చేస్తున్న. – డాక్టర్ వినోద్, ఎండీ జనరల్ మెడిసిన్ -
అభివృద్ధి పనుల పూర్తికి కృషి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు విస్తరణ కోసం విశ్వనాథ ఆలయం వద్ద దుకాణాల కూల్చివేతను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజలు, అధికారుల సహకారంతోనే ఆలయ అంతర్భాగంలో ఆగమ శాస్త్ర పండితుల సలహాలతో మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. పట్టణంలోని రోడ్ల వెడల్పు, ఐటీ పార్కు, నిర్మాణ పనులను లక్ష్మీటాకీస్ నుంచి రంగంపేట వరకు ఫోర్లేన్ రోడ్డు నిర్మాణాలు, పట్టణంలో మాతాశిశు ఆసుపత్రి పనులను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే ఐదారు నెలల్లో అన్ని పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య
● జిల్లా కలెక్టర్ కుమార్దీపక్ ● విద్యార్థులకు అక్షరాభ్యాసం జైపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గు ణాత్మక విద్య అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మండలంలోని ఇందారం ప్రభుత్వ ఉన్నత పాఠఽశాల, టేకుమట్ల, కిష్టాపూర్లో ప్రాథమికోన్నత పాఠశాల, అంగ న్వాడీ కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు. విద్యార్థుల సంఖ్య, హాజరు పట్టికలు, రిజిష్టర్లు, తరగతి గదులు పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అక్షరా భా స్యం చేయించారు. ఆయా గ్రామాల్లో భూభార తి రెవెన్యూ సదస్సులను తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, రెవెన్యూశాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధార్కార్డు కలిగి ఉండాలి నస్పూర్: జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో యుఐడీ అసిస్టెంట్ మేనేజర్ మహ్మద్ శౌభన్, ప్రత్యేక ఉప పాలానాధికారి డి.చంద్రకళ, ఏసీపీ ప్రకాశ్లతో కలిసి జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని అంన్వాడీ కేంద్రాలు, పాఠాశాలలు, వసతిగృహాల్లో పిల్లలను చేర్పించే సమయంలో ఆధార్కార్డు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఏడుగురు అనాథలకు ఆధార్ కార్డు జారీ చేశామన్నారు. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఒకసారి, పేరు రెండుసార్లు మాత్రమే సవరించుకోవడానికి వీలుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్రావు, డీఈఓ యాద య్య, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ తిరుపతి, ఈ డిస్ట్రిక్ మేనేజర్ సునీల్ పాల్గొన్నారు. -
● ఏటా ఉమ్మడి జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం ● పంట చేన్లలో మరణాలు, జీవాల మృత్యువాత ● అవగాహన లేక పెరుగుతున్న ముప్పు
జాగ్రత్త మరవద్దుఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప డుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ము ప్పు తప్పించుకోవచ్చు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ శబ్దాలు వినిపిస్తే వెంటనే అక్కడ నుంచి దూరంగా వెళ్లాలి. పంట చేన్లలో ఉన్నప్పుడు వీలైనంత తొందరగా ఇళ్ల కు చేరుకోవాలి. సమీపంలో ఉన్న నివాస స్థలాలకు వెళ్లాలి. ఇళ్లలో విద్యుత్ పరికరాలు వినియోగించరాదు. సెల్ఫోన్లు, చార్జింగ్ చే యడం, ఐరన్, వాటర్ హీటర్లు, గీజర్లు వాడరాదు. ఇళ్లకు లైటనింగ్ కండక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి.గాదిగూడ మండలం పిప్పిరి గ్రామంలో పిడుగు పడిన ప్రదేశం(ఫైల్)సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏటా పిడుగుపాటుకు ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. అధికంగా పంట చేన్లలో పని చేస్తుండగానే మృత్యువాత పడుతున్న ఘటనల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కోసారి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు చనిపోతుండడం తీరని విషాదాన్ని మిగుల్చుతోంది. పేద, మధ్య తరగతి రైతు కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. బాధిత కుటుంబాలకు కోలుకోలేని నష్టం జరుగుతోంది. వానా కాలంలో పశువులు, జీవాలు మృత్యువాత పడుతున్నాయి. ప్రతీ సీజన్లో అనేకమంది తమ జీవాలను కోల్పోతున్నారు. పిడుగుపాటుపై చాలామందికి ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదు. ఎక్కువగా చేన్లలో పని చేస్తున్నసమయంలోనే నష్టం జరుగుతోంది. పంట చేన్లలో పని చేసే రైతులు మ రింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పిడుగు అంటే.. ఆకాశంలో సహజసిద్ధంగా ఏర్పడే విద్యుత్పాతమే పిడుగుగా పేర్కొంటారు. సూర్యరశ్మి అధికంగా తాకి, తక్కువ బరువున్న ధనావేశిత మేఘాలు పైకి వెళ్లి, అధిక బరువున్న రుణావేశిత మేఘాలు కిందికి వస్తాయి. ఈ రెండింటి మధ్య దూరం పెరిగితే ధనావేశం గాలి కోసం భూమి వైపు రుణావేశా మేఘాలు వచ్చే క్రమంలో శక్తివంతమైన విద్యుదుత్పాతం ఏర్పడుతుంది. దీనినే పిడుగు అంటారు. ఒక్కో పిడుగు వేల డిగ్రీల సెల్సియస్ శక్తిని విడుదల చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితుల కారణంగా కొన్ని చోట్ల ఎక్కువగా, మరికొన్ని చోట్ల తక్కువగా పిడుగులు పడతాయి. రూ.6లక్షలు పరిహారం గతంలో కేవలం ఆపద్బంధు పథకం కింద నామమాత్రంగానే పరిహారం చెల్లించేవారు. ప్రస్తుతం పిడుగుపాటుకు మరణించిన వారికి రూ.6లక్షలు పరిహారంగా అందజేస్తున్నారు. పిడుగుపాటుతో మరణించినట్లు స్థానిక రెవెన్యూ, వైద్య, పోలీసు అ ధికారులు ధ్రువీకరించాలి. అయితే పరిహారం పొందడంలో కొన్నిసార్లు జాప్యం జరుగుతోంది. స్మార్ట్ఫోన్లలోనూ.. వాతావరణ మార్పులు ఇప్పుడు స్మార్ట్ఫోన్లలోనూ తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్, వాట్సాప్ల్లోనూ అల ర్ట్ పొందవచ్చు. ఐఎండీ(ఇండియన్ మెటీరియలాజిక్ డిపార్ట్మెంట్)తోపాటు పిడుగు పడే ప్రాంతాలను ముందుగానే తెలియజేసే ‘దామిని’తోపా టు ఇతర యాప్లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా స్థానిక కేవీకే, వ్యవసాయ, ప్రణాళిక శాఖ అధికారుల వద్ద వాతావరణ పరిస్థితులు ముందస్తుగా తెలుసుకోవచ్చు. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ముందస్తుగా తెలుసుకుంటూ ప్రాణాలతోపాటు ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవచ్చు.చెట్ల కింద ఉండొద్దువర్షం పడితే చాలామంది చెట్ల కింద తడవకుండా ఉండేందుకు వెళ్తుంటారు. అయితే చెట్లు, ఎత్తయిన కొండలు, నీటి నిల్వ ప్రదేశాలు మరింతగా పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉంది. చెట్ల కింద చెరువులు, కాలువల వద్ద ఉండకూడదు. ఒకే చోట అందరూ గుంపులుగా ఉండకూడదు.ఒకే రోజు ఆరుగురుఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పిప్పిరిలో పంట చేనులోనే నలుగురు, బేల మండలం సాంగిరిలో ఇద్దరు మొత్తం గురువారం ఒకే రోజులో ఆరుగురు ప్రాణాలు విడిచారు. ఉట్నూరు మండలం కుమ్మరితండాలో పిడుగుపాటుకు ముగ్గురు గాయపడ్డారు. -
మంత్రివర్యా సమస్యలు ఆలకించరూ..!
చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా శనివారం చెన్నూర్కు వస్తుండడంతో ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నా పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది. సింగరేణి పారిశ్రామిక, వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో తాగు, సాగునీరు, వైద్య సమస్యలతో సతమతం అవుతున్నారు. స్థానికంగా చిన్నతరహా పరిశ్రమలు లేక ఉపాధి కోసం యువత నగరాలకు వలస వెళ్తున్నారు. నియోజకవర్గం చుట్టూ గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నా ఎత్తిపోతల పథకాలు లేక సాగు, తాగునీటికి ప్రజలు తండ్లాడుతున్నారు. ఇంటింటికీ తాగునీటి సరఫరాకు మిషన్ భగీరథ పథకం ద్వారా రూ.కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోతోంది. పూర్తి స్థాయిలో పనులు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మండలాల వారీగా.. ● చెన్నూర్లో స్కిల్ డెవలప్మెంటు సెంటర్ ఏర్పాటు చేయాలి. ● చెన్నూర్ మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయానికి పక్కా భవనం ● వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాలి. ● అమృత్ 2.0 పనులు పూర్తి చేయించాలి. ● చెన్నూర్లోని 50 పడకల ఆస్పత్రిలో పూర్తి స్థాయి సిబ్బంది, పరికరాలు సమాకూర్చాలి. ● భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్ట్కు పిల్ల కాలువలు నిర్మిస్తే మరో 2500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ● కోటపల్లి మండలంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్తో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. ● పెండింగ్లో ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు పూర్తి చేయాలి. ● మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి. ● పెండింగ్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కేసీ ఆర్ పార్క్, ఇతర పనులు పూర్తి చేయించాలి. ● మందమర్రిలో ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి. ● జైపూర్లోని పవర్ ప్లాంటు ప్రభావిత గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. ● శివ్వారం మొసళ్ల కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి. వివేక్కు అమాత్య పదవితో అభివృద్ధిపై ఆశలు పెండింగ్ పనులు పూర్తయ్యేనా..! చెన్నూర్లో వంద పడకల ఆస్పత్రి 50పడకల ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత -
ఎస్టీపీపీలో కేరళ బృందం పర్యటన
జైపూర్: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)ను కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. పవర్ ప్లాంటు, గనుల పనితీరు అధ్యయనంలో భాగంగా సందర్శనకు వచ్చిన వారికి ప్లాంటు జీఎం శ్రీనివాసులు స్వాగతం పలికారు. విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అడ్మిన్ భవన కార్యాలయంలో విద్యుత్ ఉత్పత్తి, పనితీరు, ఫ్లోటింగ్ సోలార్, గ్రౌండ్ సోలార్, ఎఫ్జీడీ నిర్మాణ పనితీరును పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎఫ్జీడీ నిర్మాణాన్ని పరిశీలించగా అధికారులు పనితీరు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ వోఅండ్ఎం చీఫ్ జెన్సింగ్, ఏజీఎంలు శివప్రసాద్, మదన్మోహన్, సీఎంవోఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాస్, కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు చీఫ్ ఇంజనీర్లు ఎంపీ.రాజన్, వీ.లత, కే.అనిత, డీజీఎంలు కిరణ్బాబు, ఈఈ విష్ణువర్థన్రెడ్డి పాల్గొన్నారు. -
తప్పించారా.. తప్పుకున్నారా!
● ‘జిల్లా ఇన్చార్జి మంత్రి’పై సర్వత్రా చర్చ ● హాట్టాపిక్గా సీతక్క మార్పు ● గతంలోనే ఆమైపె ‘మీనాక్షి’కి ఫిర్యాదు ● అప్పట్లోనే తప్పుకుంటానన్న మినిస్టర్ ● తాజాగా ఆమె నిజామాబాద్కు.. అక్కడి నుంచి ‘జూపల్లి’ ఇక్కడికిసాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కను ఆ బాధ్యతల నుంచి తప్పించారా.. లేక ఆమే తప్పుకున్నారా.. అనే చర్చ ప్రస్తుతం పార్టీలో సాగుతోంది. హైదరా బాద్లో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాల సందర్భంగా కొంతమంది నియోజకవర్గ ఇన్చార్జిలు సీతక్క తమను పట్టించుకోవడం లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు అప్పట్లో ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. అప్పుడే తాను జిల్లా ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఆమె మీనాక్షి ముందే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కను ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నియమించారు. అక్కడి నుంచి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఉమ్మడి ఆదిలాబాద్కు ఇన్చార్జిగా కేటాయించారు. ప్రస్తుతం పార్టీలో ఈ నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ముందుండగా ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జూపల్లి ఇక్కడి నేతలను సమన్వయం చేస్తూ పార్టీ విజయానికి ఏ విధంగా కృషి చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీతక్కకు కలిసిరాని ఎన్నికలు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కకు ఆదిలాబాద్ పార్లమెంట్, పట్టభద్రుల, ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అసలు కలిసిరాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి పనితీరుపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఎన్నికల ప్రణాళిక సరిగా రూపొందించడంలో సీతక్క ఫెయి ల్ అయిందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా నియోజకవర్గాల్లో సీనియర్ నేతల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకోవడంలో ఆమె సమన్వయం చేయలేకపోయారనే అపవాదు వ్యక్తమైంది. అంతేకాకుండా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు పెరగడం కూడా పార్టీ ఓటమికి కారణమయ్యాయని చర్చ సాగింది. ఇదే విషయంలో మీనాక్షి నటరాజన్ పార్టీ ఓటమికి కారణాలపై ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ప్రధానంగా విశ్లేషించారు. అంతేకాకుండా ఇటీవల హైదరా బాద్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అ సెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జీలను ఒక్కొక్కరి నుంచి విడివిడిగా అభిప్రాయ సేకరణ చేశారు. ఆ తర్వాతనే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క మార్పు ఖాయమనే ప్రచారం సాగింది. తాజాగా అదే జరిగింది.వీటిపై ప్రభావం పడేనా..పార్టీ పరంగా ప్రస్తుతం పట్టణ, మండల, బ్లాక్ కమిటీలతో పాటు డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉంది. కమిటీలకు సంబంధించి ఇప్పటికే ప్రతి మండలం, పట్టణంలో సమావేశాలు నిర్వహించి ఐదేసి పేర్లను అధిష్టానానికి నివేదించారు. అది ఖరారు కావాల్సి ఉంది. ఆ తర్వాత ఈనెల చివరిలో డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిశీలిస్తే.. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. ఇక మంచిర్యాలకు కొక్కిరాల సురేఖ, నిర్మల్కు శ్రీహరిరావు, కుమురంభీం ఆసిఫాబాద్కు విశ్వప్రసాద్ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈ నెలలో కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకం జరగనుండగా, కొత్త ఇన్చార్జి మంత్రి రానుండడంతో వీటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది పార్టీలో అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. కొత్త ఇన్చార్జి మంత్రికి సవాల్ఉమ్మడి జిల్లాకు కొత్త ఇన్చార్జి మంత్రిగా రానున్న జూపల్లికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే ఆయన ముందున్న ప్రధాన సవాలు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో నాలుగు చోట్ల బీజేపీ, రెండు చోట్ల బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, కేవలం ఖానాపూర్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ప్రాతి నిధ్యం ఉంది. మిగతా నియోజకవర్గాల్లో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందినవారు నియోజకవర్గ ఇన్చార్జీలుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిందే. -
చెత్త.. బయోవేస్టేజ్..
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో, బయట అపరిశుభ్రతతో కొత్త వ్యాధులు వచ్చే ముప్పు పొంచి ఉంది. ఆస్పత్రి వెనుకభాగాన బయోవేస్టేజ్ చెత్తతోపాటు ఆస్పత్రిలో వెలువడిన ఇతర చెత్త పేరుకుపోతోంది. వర్షం కురిసినప్పుడు చెత్త తడిసి దుర్వాసన వెదజల్లుతోంది. బయోవేస్టేజ్, సాధారణ చెత్తకు వేర్వేరు గదులున్నాయి. బయోవేస్టేజ్ చెత్తతో గది నిండిపోగా.. దానికి తాళం వేసి బయట పడేస్తున్నారు. సమీపంలో సాధారణ చెత్త షెడ్డు ఉన్నా అందులో వేయకుండా ఆస్పత్రి వెనుకాల ఉన్న సిమెంటు రోడ్డు, ఖాళీ ప్రదేశంలో బయెవేస్టేజ్, చెత్త కలిపి వేస్తున్నారు. ఆస్పత్రికి ప్రతీ రోజు 400వరకు ఓపీ ఉండగా.. వివిధ రోగాలతో వార్డుల్లో చికిత్స పొందుతున్న వారు 250మంది ఉంటారు. రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్బ్యాంకుకు నిత్యం తలసేమియా, సికిల్సెల్ బాధితులు 20మంది వరకు వస్తుంటారు. చెత్త కారణంగా కొత్త వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. -
జపాన్ సకురకు సాయి శ్రీవల్లి
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాలకు చెందిన సాయిలు సాయి శ్రీవల్లి జపాన్లో ఆధునిక శాస్త్ర, సాంకేతికతలను వీక్షించేందుకు ఎంపికై ంది. స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా 9వ ఇన్స్పైర్ జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో తన ప్రదర్శనతో మెప్పించింది. దేశవ్యాప్తంగా 54మంది ఎంపిక కాగా తెలంగాణ నుంచి ఎంపికై న ముగ్గురు వి ద్యార్థుల్లో సాయి శ్రీవల్లి ఒకరు. సమాజంలో మహిళలు, విద్యార్థినులకు రుతుక్రమ సమయంలో రసాయనిక శానిటరీప్యాడ్తో ఎదురయ్యే ఇబ్బందులను దూరం చేసేలా రుతుమిత్ర కిట్ ప్రాజెక్టు రూపొందించింది. వివిధ రాష్ట్రాల నుంచి వెయ్యి ప్రాజెక్టులు ప్రదర్శించగా.. జాతీయ స్థాయికి ఎంపిక చేసిన 60 ఉత్తమ ప్రదర్శనల్లో శ్రీవల్లి ఎంపికై ంది. కేంద్రమంత్రి జితేందర్సింగ్, డీఎస్టీ కార్యదర్శి చంద్రశేఖర్, జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ చైర్మన్ పీఎస్ యోయల్ చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకుంది. జపాన్ సైన్స్ స్కూల్ ప్రోగ్రాం(సకుర సైన్స్ పోగ్రాం)కు ఎంపిక కాగా.. ఈ నెల 15నుంచి 21వరకు జపాన్లో నిర్వహించే కార్యక్రమంలో పా ల్గొంటుంది. ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రిన్యూర్షిప్–2023 పే రిట ఢిల్లీ లోని రాష్ట్రప తి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రు తుమిత్ర కిట్ ప్రాజెక్టు ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎదుట ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. శ్రీవల్లి తల్లి దండ్రులు మధుబాబు, ఉమ మంచిర్యాలలో ప్రభు త్వ టీచర్లు. ఇటీవల ప్రకటించిన ‘పది’ ఫలితాల్లో శ్రీవల్లి 588మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది. జపాన్ శాస్త్రవేత్తలతో ముఖాముఖి సాయి శ్రీవల్లి జపాన్లోని టోక్యోలో విరైకాన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎమర్జింగ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్, సుకుబా సైన్స్సిటీలో ఉన్న స్పేస్ సెంటర్, నేచర్ అండ్ సైన్స్ మ్యూజియం, యూనివర్సిటీ ఆప్ టోక్యో వీక్షిస్తుంది. అక్కడ పాఠశాల విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో జపాన్లో అభివృద్ధిపై తెలుసుకుంటుంది. నోబెల్ బహుమతి గ్రహీతలు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చల్లో పాల్గొంటుంది. -
రైతులను మోసగించిన వ్యక్తి అరెస్ట్
భైంసాటౌన్: కుభీర్ మండలంలోని జాంగామ్కు చెందిన రైతులను మోసగించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ అవినాష్కుమార్ తెలిపారు. శుక్రవా రం పట్టణంలోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కుభీర్కు చెందిన సంగి శ్రీనివాస్ జల్సాగా తిరుగుతూ, ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడేవాడు. కొద్దిరోజులకు కుభీర్ మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థకు సీఈవోగా, భైంసాలోని మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) సంస్థకు ఏజెంట్గా పని చేస్తున్నాడు. రైతుల నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి మ్యాక్స్కు విక్రయించి, రైతులకు డబ్బులు చెల్లించేవాడు. ఇలా కొ ద్దిరోజులు రైతులను నమ్మించాడు. ఈ క్రమంలో గ తంలో బెట్టింగ్తో చేసిన అప్పులు తీర్చేందుకు రైతులను మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు కుభీర్ మండలం జాంగామ్లో రైతుల నుంచి రూ.13,37,144 విలువైన 690క్వింటాళ్ల మొక్కజొ న్నలు కొని డబ్బులు చెల్లించకుండా పారిపోయా డు. దీంతో రైతులు కుభీర్ పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం కుభీర్లోని పార్డి(బి) ఎక్స్రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతడిని అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించామని తెలిపారు. అతడి నుంచి రూ.9లక్షల నగదు, రిసిప్ట్ బుక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. లోకేశ్వరం మండలం మన్మధ్, బామ్ని గ్రామాల్లో 32మంది రైతుల నుంచి 3,685 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసి మో సగించినట్లు తెలిపారు. కేసు విచారణ, నిందితుడిని పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన రూరల్ సీ ఐ నైలు, కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి, నిర్మల్ ఐటీ టీంను ఎస్పీ జానకీ షర్మిల అభినందించినట్లు చెప్పారు. -
నేడు మంత్రి వివేక్ రాక
చెన్నూర్: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి శనివారం చెన్నూర్ నియోజకవర్గానికి రానున్నారు. మంత్రిగా ప్ర మాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా వ స్తున్న ఆయనకు ఘనంగా స్వాగతం పలకడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశా రు. ఉదయం 10గంటలకు జైపూర్ మండలం ఇందారం పెట్రోల్బంక్ నుంచి బైక్ ర్యాలీ, ఇందారం బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్, రసూల్పల్లి వద్ద స్వాగతం, జైపూర్ బస్టాండ్లో సమావేశం, భీమారం, కిష్టంపేట ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద కార్యకర్తల స్వాగతం, అక్కడి నుంచి బైక్ ర్యాలీ, చెన్నూర్ జలాల్ పెట్రోల్ వద్ద గజమాల సమర్పణ, గుస్సాడీ నృత్యాలతో స్వాగతం, అంబేద్కర్ చౌక్లో కార్నర్ మీటింగ్, సాయంత్రం 4గంటలకు రామకృష్ణాపూర్ ఏరియా ఆ స్పత్రిలో సింగరేణి కార్మిక విగ్రహ ఆవిష్కరణ, అమరవీరుల స్తూపం వద్ద నివాళులు సమర్పణ, కార్నర్ మీటింగ్, మందమర్రి పాకిస్తాన్ క్యాంప్ స్వాగతం, మందమర్రి పాత బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన మంత్రి చెన్నూర్: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను మంత్రి మంత్రి వివేక్ శుక్రవారం హైదరాబాద్లో మర్వాదపూర్వకంగా కలిశారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరి నట్లు మంత్రి తెలిపారు. -
కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పనిసరి
బాసర: విద్యార్థులకు తమ ప్రసంగాల్లో పదాలు, వాక్యాల నిర్మాణంలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎంతగానో అవసరమని ఆర్జీయూకేటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ సూచించారు. ఇంగ్లిష్ విభాగం, ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మార్గదర్శకత్వంలో విద్యార్థులు, అధికారులకు వివిధ సందర్భాల్లో సరైన భాష, వ్యాకరణం, శైలి, ఫార్మాట్ లోపం లేకుండా లేఖలు రాయడానికి ఉపయోగపడే లేఖ నమూనాలను రూపొందించి శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఇన్చార్జి వీసీ మాట్లాడుతూ.. నమూనా లేఖలు స్టూడెంట్ హబ్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. వాటి ఆధారంగా విద్యార్థులు, అధికారులకు వివిధ అవసరాల కోసం సరైన రూపంలో, నిష్పాక్షికంగా లేఖలు తయారు చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్, అసోసియేట్ డీన్ డాక్టర్ విఠల్, ఇంగ్లిష్ విభాగాధిపతి శ్రీఅప్సింగర్ విజయ్కుమార్, ఇంగ్లిష్ విభాగ అధ్యాపకులు, ఇతర విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
రక్తదానం.. ప్రాణదానం
ఇప్పటివరకు 46సార్లు.. పాతమంచిర్యాల: నాది ఏబీ నెగెటివ్ బ్లడ్ గ్రూప్. ఇప్పటివరకు 46సార్లు రక్తదానం చేశాను. కలెక్టర్లు, గవర్నర్ ద్వారా ప్రశంసాపత్రాలు అందుకున్నాను. రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాను. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో నిల్వలు ఉండేలా కృషి చేస్తున్నాను. రక్తదాతలకు ప్రమాద భీమా పాలసీ అందజేస్తున్నాం. – మధుసూధన్రెడ్డి, లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధి ఎవరు ఫోన్ చేసినా వెళ్తా.. పాతమంచిర్యాల: నాకు రక్తదానంపై అవగాహన ఉంది. ఇప్పటివరకు 15 సార్లు రక్తదానం చేశా ను. 10 సార్లు ప్లేట్లెట్లు దానం చేశా ను. నాది ఏ నెగెటివ్ గ్రూప్ రక్తం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి ఎవరు ఫోన్ చేసినా వెళ్లి రక్తం ఇస్తున్నాను. – మహ్మద్ మజార్, జాఫర్నగర్, మంచిర్యాల ● ఆపదలో ‘సామాజిక’ నేస్తాల అండ ● ప్రత్యేక గ్రూపుల ద్వారా బాధితులకు భరోసా ● ప్రాణదాతలుగా నిలుస్తున్న యువత ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం పాతమంచిర్యాల/ఆసిఫాబాద్అర్బన్/నిర్మల్ఖిల్లా: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం. అత్యవసర సమయాల్లో వైద్యులు ఒకరి నుంచి రక్తాన్ని సేకరించి మరొకరికి ఎక్కించి ప్రాణాపాయం నుంచి కాపాడుతారు. సికిల్సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతీవారం లేదా ప్రతీ నెల క్రమంతప్పకుండా రక్తం ఎక్కించాల్సిందే. అలాంటి వారికి రక్తదాతలు నిజంగా ప్రాణదాతలే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు తమ రక్తాన్ని దానం చేసి ఇతరుల ప్రాణాలు నిలుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. ఉమ్మడి జిల్లాలో సేవలు ఇలా.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో లయన్స్ ఇంటర్నేషనల్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. సంస్థ ప్రతినిధులు కొ ద్ది సంవత్సరాలుగా రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తాన్ని తలసేమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్తులు, ప్రభుత్వాస్పత్రుల్లోని గర్భిణులు, వివిధ ప్ర మాదాల బాధితులకు అందిస్తున్నారు. అలాగే కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కొన్ని స్వ చ్ఛంద సేవా సంస్థలు నిర్వహించే శిబిరాల్లో యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వస్తూ పలు వురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతీ శిబిరంలో తప్పనిసరిగా 20నుంచి 50 యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రక్తదానం ఆవశ్యకతను మరో నలుగురికి తెలియజేయాలనే సంకల్పంతోనే పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా బాధితులకు చేరువవుతున్నారు. నిర్మల్ జి ల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్ర మోద్కుమార్, బైంసా పట్టణానికి చెందిన యోగేశ్ రక్త గ్రూపుల వారీగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ‘ప్రేరణ యువసేన’ పేరిట బాధితులకు రక్తాన్ని స మకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు వందలాది మందికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారారు. ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలకేంద్రానికి చెందిన మునిగెల శ్రీధర్ శుద్ధోధన్, శ్రీనివా స్, నిర్మల్ జిల్లాకు చెందిన కొప్పుల నవీన్, సాగర్ తదితరులు ‘జైహింద్’ గ్రూపును 2018లో ఏర్పాటు చేసి రక్తదానం చేస్తున్నారు. ఇప్పటివరకు 200 మందికి పైగా రక్తదానం చేసినట్లు వీరు తెలిపారు. ఎవరు రక్తదానం చేయొచ్చంటే..ఆరోగ్యవంతులుగా ఉన్న 18–60 ఏళ్ల లోపు వారు రక్తదానం చేయవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చని తెలిపారు. రక్తదానం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని చెబుతున్నా రు. అయితే.. దీర్ఘకాలిక వ్యాధులు, హెచ్ఐవీ, రక్తపోటు, హైపటైటీస్ ఉన్నవారు రక్తదానం చేయరా దని పేర్కొంటున్నారు. ఒక వ్యక్తి రక్తదానం చేసిన తర్వాత తిరిగి మూడు నెలలకు మళ్లీ రక్తదానం చేయవచ్చని సూచిస్తున్నారు. రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనని పేర్కొంటున్నారు. రక్తదానం చేసే సమయంలో ఇతర వ్యాధులు సోకుతాయనే మాటల్లో నిజం లేదని తెలిపారు. అవన్నీ అపోహలేనని చెబుతున్నారు. రక్తదానం ప్రాణదా నంతో సమానమని, పైగా రక్తదానం చేస్తే శరీరంలో ని అవయవాలు సక్రమంగా పనిచేయడంతో పాటు రక్తం శుద్ధి అవుతుందని సూచిస్తున్నారు.అత్యవసరాల్లో తప్పకుండా చేస్తా పాతమంచిర్యాల: నాది ఓ పాజిటివ్ గ్రూప్ రక్తం. అత్యవసర సమయాల్లో ఏ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చినా రాత్రి, పగలు అనే తేడా లేకుండా వెళ్లి రక్తదానం చేస్తున్నాను. రక్తం అవసరమైనపుడు బ్లడ్బ్యాంక్ వారు సమాచారమిచ్చినా వెంటనే వెళ్లి రక్తం ఇస్తున్నాను. – నంది రాజేంద్రప్రసాద్, ఇటిక్యాల 25 ఏళ్లుగా ఇస్తున్న పాతమంచిర్యాల: నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. ఇప్పటివరకు 80 సార్లు రక్తదానం చేశాను. పుట్టినరోజు, అయ్యప్ప దీక్ష తీసుకునే రోజు తప్పనిసరిగా రక్తనిధి కేంద్రానికి వచ్చి రక్తం ఇస్తాను. నా స్నేహితులతో కూడా రక్తదానం చేయిస్తున్నాను. రక్తదానం.. మహాదానం. – పెద్దపల్లి లక్ష్మీకాంత్ పదేళ్లుగా సేవలో.. పాతమంచిర్యాల: పదేళ్లుగా రక్తదా నంపై అవగాహ న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఇప్పటివరకు 2,600 మందికి రక్తదానం చేయించా ను. అత్యవసర వేళల్లో దాతలను పిలిపించి రక్తం ఇప్పిస్తున్నాను. – అబ్దుల్ రహీం, రహీం బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ, మంచిర్యాల సేవలోనే సంతృప్తి భైంసాటౌన్: ఆపదలో ఉన్నవారికి సేవ చేయాలని భావించాం. ఇందుకు ఐక్య త సేవాసమితి గ్రూపును ఏర్పాటు చేశాం. రక్తదానం చేస్తున్నాం. ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రక్తం అవసరమైన వారికి వెంటనే స్పందించి రక్తదానం చేస్తున్నాం. – యోగేశ్, ఐక్యత సేవాసమితి అడ్మిన్, భైంసావెంటనే స్పందిస్తాం భైంసాటౌన్: బ్లడ్ డోనర్ గ్రూప్ ద్వారా అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నాం. రక్తం అవసరమని గ్రూపులో ఎవరు పోస్ట్ చేసినా.. వెంటనే స్పందిస్తాం. ఇప్పటివరకు వందలాదిమందికి గ్రూపులోని సభ్యులు రక్తదానం చేశారు. ఇలాగే సేవలను కొనసాగిస్తాం. – సురేశ్, బ్లడ్ డోనర్ గ్రూప్ అడ్మిన్, భైంసా 100 సార్లు ఇవ్వడమే నా లక్ష్యం ఆసిఫాబాద్అర్బన్: నేను ఇప్పటివరకు 34 సార్లు రక్తదానం చేశాను. 100 సార్లు రక్తం ఇవ్వాలన్నదే నా లక్ష్యం. రక్తదానంపై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నాను. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు నిలపడం ఎంతో సంతృప్తినిస్తుంది. – ఎండీ మొయినొద్దీన్, ఆసిఫాబాద్ 40 సార్లు చేశాను ఆసిఫాబాద్అర్బన్: ఇప్పటివరకు నేను 40 సార్లు రక్తదానం చేశాను. 16 ఏళ్లుగా రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. రక్తాన్ని దానం చేయడం అదృష్టంగా భావిస్తాను. – వైరాగడే ప్రతాప్, ఆసిఫాబాద్రక్తదాతలను ప్రోత్సహిస్తా ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్బ్యాంక్కు దాతలతో వెయ్యి యూనిట్ల రక్తం ఇప్పించాను. అత్యవసర సమయాల్లో ఎంతోమందిని ఆదుకున్నాను. నేను 10 సార్లు రక్తదానం చేశాను. ఎవరికైనా రక్తం అవసరమైతే 8639434390 నంబర్లో సంప్రదించాలి. – మాడిశెట్టి ప్రశాంత్, సామాజిక కార్యకర్త రక్తదాన దినోత్సవ నేపథ్యం1901లో ఆస్ట్రేలియాకు చెంది న నోబెల్ విజేత కార్ల్ లాండ్స్టీనర్ మొదటిసారిగా ర క్తాన్ని వర్గీకరించారు. దీంతో ఆయన జయంతికి గుర్తుగా ప్రపంచ రక్తదాత ల దినోత్సవాన్ని ఏటా జూన్ 14వ తేదీన నిర్వహిస్తున్నారు. రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపం చ దేశాలు జూన్ 14వ తేదీన రక్తదాన దినోత్సవాన్ని 2004నుంచి నిర్వహిస్తున్నాయి. -
శిక్షణ ఐఏఎస్ల పర్యటన
జన్నారం: జన్నారం అటవీ డివిజన్లో శుక్రవారం శిక్షణ ఐఏఎస్ అధికారులు పర్యటించారు. భద్రాద్రి కొతగూడెం నుంచి సౌరబ్ శర్మ, ఆదిలాబాద్ నుంచి సలోని చభ్ర, వికారాబాద్ నుంచి హర్షచౌదరి, నిజామాబాద్ నుంచి కరోలిన్ చింతిన్మవి, నారాయణపేట్ నుంచి కోయ్యాడ ప్రణయ్కుమార్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జన్నారానికి వచ్చారు. వారికి తహసీల్దార్ రాజమనోహర్రెడ్డి, రేంజ్ అధికారి సుష్మారావు స్వాగతం పలికారు. అనంతరం గేట్ నంబర్–1 నుంచి సఫారీ ద్వారా గొండుగూడ బేస్క్యాంపు, బైసన్కుంట, మల్యాల వాచ్టవర్ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం అలీనగర్, దొంగపల్లి గ్రామాల్లో గిరిజనులతో సమావేశం అయ్యారు. అడవి అభివృద్ధి, ఇక్కడి ప్రత్యేకతలను అటవీ బీట్ అధికారి లాలుబాయి వివరించారు. -
చికిత్స పొందుతూ మృతి
ఇంద్రవెల్లి: రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన యువకుడు మృతి చెందిన ట్లు ఎస్సై సాయన్న తెలిపా రు. ఆయన తెలిపిన వివరా ల ప్రకారం.. మండలంలోని హర్కపూర్ ఆంద్గూ డ గ్రామానికి చెందిన మస్కే రామేశ్వర్ (25) ఈ నెల 11న ఇంద్రవెల్లికి చెందిన షేక్ సాజిద్తో కలిసి ద్విచక్రవాహనంపై ఆదిలాబాద్కు వెళ్లాడు. రాత్రి ఇంటికి వస్తున్న సమయంలో మండలంలోని శంకర్గూడ సమీపంలో ప్రధాన రహదారిపై ఇంద్రవెల్లి నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని కా రు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామేశ్వర్కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు, కుటుంబ సభ్యులు ఆ దిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండగా నిజామాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చిక్సిత పొందుతూ మృతి చెందాడు. తల్లి విమలాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పిడుగు పడి ఎద్దు మృతి నార్నూర్: మండలంలోని తాడిహత్నూర్ గ్రామానికి చెందిన రాథోడ్ ప్రకాశ్ అనే రైతుకు చెందిన ఎద్దు గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పిడు గు పడి మృతి చెందింది. వారంరోజుల ముందే విద్యుత్షాక్తో ఒక ఎద్దు మృతి చెందగా.. పిడుగు పడి ఇప్పుడు మరో ఎద్దు మృతి చెందిందని బాధిత రైతు వాపోయాడు. మృతి చెందిన ఎద్దు విలువ రూ.50వేలు ఉంటుందని పేర్కొన్నాడు. బైక్ చోరీ నిందితుల అరెస్ట్ మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో బైక్ చోరీలకు పా ల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ట్లు స్థానిక సీఐ ప్రమోద్రావు తెలిపారు. శుక్రవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని హమాలీవాడ, ముఖరాం చౌరస్తా ప్రాంతాల కు చెందిన భరత్రేణ్వా, కుడుదుల శ్రీనుకు చెందిన రెండు ద్విచక్ర వాహనాలు ఇటీవల చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఐబీ చౌరస్తా వ ద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న స్థానిక సూ ర్యనగర్కు చెందిన గుండేటి రాకేశ్, బొల్లి ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని విచారించగా కుడుదుల శ్రీను కు చెందిన బైక్, భరత్ రేణ్వాకు చెందిన స్కూటీని దొంగిలించినట్లు వారు ఒప్పుకొన్నారని పేర్కొన్నారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
ఆన్లైన్ గేమింగ్ రాకెట్ గుట్టురట్టు
● ఐదుగురిపై కేసు నమోదు.. నలుగురి అరెస్ట్ ● ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: ఆన్లైన్ గేమింగ్ రాకెట్ గుట్టురట్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని వన్టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ పట్టణంలోని పంచవటి హోటల్లో కొంత మంది వ్యక్తులు ఆన్లైన్ గేమింగ్ ఆడి అమాయకులను మోసం చేస్తున్నారనే సమాచారం వచ్చిందన్నారు. గదిలో పోలీసులు తనిఖీ చేయగా ఐదుగురు వ్యక్తులు ఉన్నారని, పోలీసులను చూసి ఓ వ్యక్తి పారిపోయాడన్నారు. వారిలో నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన గొంటి రమేశ్, మహారాష్ట్రలోని ఆకోలకు చెందిన ప్రకాష్ బద్దు రాథోడ్, జిల్లా కేంద్రంలోని మీడియా కాలనీకి చెందిన జాదవ్ ప్రహ్లాద్, మహారాష్ట్రలోని థానేకు చెందిన పంకజ్ నాందేవ్, భోరజ్ మండలంలోని నిరాలకు చెందిన బోంద్రే సూర్యబాన్ ఉన్నారన్నారు. ఏ–1 గొంటి రమేశ్ ఈనెల 10న ఏ–2 ప్రకాష్ బద్దు రాథోడ్కు ఫోన్చేసి పంచవటి హోటల్లో గదిని బుక్ చేయాలని చెప్పాడు. పంకజ్ నాందేవ్తో కలిసి వస్తానని పేర్కొన్నాడు. బోంద్రే సూర్యభాన్ హోటల్లోని గదిలో వేచి ఉండగా వారికి ఆన్లైన్ గేమింగ్ గురించి గొంటి రమేశ్ వివరించాడు. ప్రతీఒక్కరు రూ.9,100 చొప్పున ఆన్లైన్ ద్వారా వేసి సాయంత్రం 4 గంటలకు గేమ్ ఆడటం ప్రారంభించారు. గేమ్లో గెలిస్తే 100 అమెరికన్ డాలర్లు లాభంగా వస్తాయని చెప్పాడు. వీరు గేమ్ ఆడుతుండగా పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి చేరుకోగా రమేశ్ పరారయ్యాడు. ఐదుగురిపై కేసు నమోదు చేసి నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఐదు సెల్ఫోన్లు, ఒక కారు, మూడు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రాల నెపంతో ఒకరి దారుణ హత్య
● నిర్మల్ జిల్లా నగర్లో ఘటనలోకేశ్వరం: తమ కుటుంబ సభ్యులకు మంత్రాలు చేస్తున్నాడని ఒకరిని దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని నగర్లో చోటు చేసుకుంది. ముధోల్ సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల మేరకు నగర్ గ్రామానికి చెందిన గడ్డం పోసులు (64) గురువారం ఉదయం తన వ్యవసాయ పనుల నిమిత్తం నడుచుకుంటూ వెళ్తుండగా బస్టాండ్ ప్రాంతంలో కాచుకుని కూర్చున్న అదే గ్రామానికి చెందిన గడ్డం గంగాధర్, గడ్డం సాయిలు ఒక్కసారిగా పోసులుపై ఇటుకలు, బండాయితో ముఖంపై దాడిచేసి హత్య చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఏడాది క్రితం గంగాధర్ 17 నెలల కూతురు, రెండు నెలల క్రితం రెండు ఆవులు మృతి చెందాయి. అంతేకాకుండా తన తల్లికూడా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, వీటన్నింటికి పోసులు చేతబడే కారణమని హత్యకు పాల్పడినట్లు సీఐ పేర్కొన్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుని కుమారుడు గడ్డం సాయన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని ఏఎస్పీ అవినాష్ కుమార్ పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
విద్యుత్ పోల్స్ టాక్స్ రద్దు చేయాలి
నస్పూర్: జిల్లాలోని కేబుల్ టీవీ ఆపరేటర్లకు విద్యుత్ పోల్ టాక్స్ రద్దు చేయాలని కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గూడ రాంరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట జిల్లాలో ని కేబుల్ ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ రాజేశ్వర్రావుకు వినతిపత్రం సమర్పించారు. గ్రామాలు, ప ట్టణాలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని ప్రాంతాల్లో విద్యుత్ పోల్స్ టాక్స్ చెల్లించా లంటే కేబుల్ టీవీ ఆపరేటర్లపై ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. మంచిర్యాల మండల అధ్యక్షుడు గాండ్ల సత్యం, నస్పూర్ మండల అధ్యక్షుడు పంబాల తిరుపతి, భీమారం అధ్యక్షుడు శ్రీకాంత్, జైపూర్ అధ్యక్షుడు వెంకన్న, చెన్నూర్ అధ్యక్షుడు శ్రీనివాస్, లక్షెట్టిపేట అధ్యక్షుడు భూమేశ్, దండేపల్లి అధ్యక్షుడు శంకర్, నాయకులు ఏల్పుల మల్లేశ్, గుమ్ముల శ్రీనివాస్, లక్ష్మణ్, రాజేందర్, మల్లేశ్, రాజు, శేఖర్, రవీందర్ పాల్గొన్నారు. -
అభివృద్ధిపై మంత్రి దృష్టి సారించాలి
చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి దృష్టి సారించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. చెన్నూర్ బీజేపీ కార్యాలయంలో గురువా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. చెన్నూర్ మున్సిపాలిటీ పక్కనే గోదావరి నది ఉన్నా తాగునీటి కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారని తె లిపారు. ఇసుక తీసుకొస్తే అడ్డుకుంటున్నారని, ఇళ్ల నిర్మాణాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. శ్మ శాన వాటిక లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నో చుకోలేదని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిందని, వర్షాకాలం దృష్ట్యా నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యు డు సమ్మయ్య, పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కొండపాక చారి, మాజీ కోఆప్షన్ సభ్యుడు కేవీఏం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● జీసీసీ ఇన్చార్జి డీఎం సందీప్ కుమార్ ఉట్నూర్రూరల్: గిరిజన సహకార సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఉట్నూర్ జీసీసీ ఇన్చార్జి డీఎం సందీప్ కుమార్ అన్నారు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఆదేశాల మేరకు గురువారం జీసీసీ ఉమ్మడి జిల్లా మేనేజర్లు, అకౌంటెంట్లు, గోడౌన్ క్లర్క్లు, జూనియర్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్న నేపథ్యంలో పిల్లలకు అవసరమైన నిత్యావసరాలు వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు. అన్ని వస్తువుల కాలపరిమితి స్వయంగా పరిశీలించిన తరువాతే సరఫరా చేయాలన్నారు. గోడౌన్లలో ఉన్న రికార్డులను, రిజిస్టర్లను వెంటనే అప్డేట్ చేయాలన్నారు. స్టాక్ వివరాలను డీఎం కార్యాలయానికి పంపించాలన్నారు. అనంతరం ఆయనను మేనేజర్లు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. -
ఎస్టీపీపీలో ‘మహా’ బృందం పర్యటన
జైపూర్: మండల కేంద్రంలోని సింగరేణి థ ర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో మహారాష్ట్ర నేచురల్ గ్యాస్ లిమిటెడ్ బృందం బుధవారం రాత్రి పర్యటించింది. ఎస్టీపీపీలో లిక్విడ్ నేచురల్ గ్యాస్ లేదా నేచురల్ గ్యాస్ వినియోగానికి కావాల్సిన సదుపాయాలు, ఇతర సౌకర్యాలపై అధ్యయనం చేశారు. నేచురల్ గ్యాస్ ను ఇంధనంగా వాడకం వల్ల కర్భన ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. బాయిలర్లో రెండు యూనిట్లను పరిశీలించి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. జీఎం(ఓసీపీఎస్) డీవీఎ స్ఎన్.రాజు, జీఎం శ్రీనివాసులు, వోఅండ్ఎం చీఫ్ జెన్సింగ్, ఏజీఎంలు శివప్రసాద్, మురళీధర్, మదన్మోహన్ పాల్గొన్నారు. -
బతుకులు ఛిద్రం
● పిడుగుపాటుకు ఆరుగురు మృతి ● విత్తనాలు వేస్తుండగా దుర్ఘటన ● భర్త, కూతురిని కోల్పోయిన మహిళ ● తల్లులకు దూరమైన కొడుకు, బిడ్డ ● గాదిగూడ, బేల మండలాల్లో ఘటనలు ● చికిత్స పొందుతున్న క్షతగాత్రులు సాక్షి, ఆదిలాబాద్/నార్నూర్/బేల: వారంతా మట్టి మనుషులు.. మట్టినే నమ్ముకుని జీవించేవారు.. ఆ మనుషుల మధ్య ఉన్న ఆత్మీయత ఎంతచెప్పినా త క్కువే.. భార్యాభర్తలిద్దరు తమ పిల్లలతో కలిసి సొంత చేనులో విత్తనాలు వేస్తున్నారు. విత్తనాలు వేసే మిగతావారు కూడా ఈ కుటుంబానికి దగ్గరి సంబంధీకులే. అంతా ఆదివాసీ గిరిజనులే. వీరంతా హుషారుగా విత్తనాలు వేశారు. మధ్యాహ్నం కా వడంతో 14 మంది ఒకే దగ్గర భోజనం చేశారు. ఆ తర్వాత మళ్లీ విత్తనాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో వర్షం రావడంతో అంతా వెళ్లి స మీపంలోని చిన్న గుడిసెలో ఒకే దగ్గర కూర్చున్నా రు. సరిగ్గా అదే సమయానికి పక్కనున్న టేకు చెట్టు పై భారీ శబ్దంతో పిడుగు పడింది. ఉలిక్కిపడేలోపే గుడిసెలోని నలుగురు ప్రాణాలు విడిచారు. ఆ మట్టిపైనే నేలకొరిగారు. మిగతా వారు చెల్లాచెదురుగా పడిపోయి గాయాలతో బయటపడ్డారు. ఇది ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని పిప్పిరి గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఘట న. మరో రెండు ఘటనల్లో బేల మండలంలోని ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. మొత్తంగా పిడుగుపాటుకు ఆరుగురు మృత్యువాత పడిన ఘటనలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని కలిగించాయి. బాధిత కుటుంబాల్లో విషాదం..గాదిగూడ మండలం పిప్పిరికి చెందిన పెందూర్ మాధవరావు తన చేనులో భార్య, కుమారులు, కూతురుతో పాటు దగ్గరి సంబంధీకులైన 14 మందితో కలిసి గురువారం మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నారు. పిడుగుపాటుకు గురై మాధవరావు, ఆయన కూతురు పెందూర్ సంజన అలియాస్ సుజాత, సంబంధీకులు సిడం రంభాబాయి, మంగం భీమ్బాయి మృతిచెందారు. ఈ ఘటనలో మాధవరావు భార్య పెందూర్ రేణుక, ఇద్దరు కుమారులు పెందూర్ జంగు, పెందూర్ శేఖు గాయపడ్డారు. సిడం రాంబాయి కుమారుడు సిడం శంకర్, మంగం భీమ్బాయి కూతురు మంగం నందిని కూడా గాయాలపాలయ్యారు. వీరితో పాటు దగ్గరి సంబంధీకులైన హెచ్కే ఈశ్వర్, మర్సుకోల అంజలి, మర్సుకోల సోము, గెడం శంభు, గుణవంత్రావు కూడా గాయపడ్డారు. ఇక బేల మండలంలోని సాంగిడి, సోన్కాస్ గ్రామాల్లో పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగుపాటుకు మహిళా కూలీలు గెడం నందిని, కోవ సునీత మృతిచెందారు. వీరిరువురికి భర్త, పిల్లలున్నారు. కాగా, క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. కొందరిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిని పలువురు పరామర్శించారు.మృతుల వివరాలుపిడుగు పడిన ఘటనలో గాదిగూడ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన తండ్రి, కూ తురు పెందూర్ మాధవ్రావు(45), పెందూ ర్ సుజాత అలియాస్ సంజన(16), మాధవ్రావుకు దగ్గరి సంబంధీకులైన సిడం రంభా బాయి(40), మంగం భీమ్బాయి(45) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే బేల మండలం సాంగిడి గ్రామంలో పిడుగుపాటుకు గురై గెడం నందిని(30), సోన్కాస్ గ్రామంలో కోవ సునీత(40) ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా రెండు వేర్వేరు ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా, ఇందులో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడున్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
భైంసాటౌన్: పట్టణంలోని టిప్పుసుల్తాన్ చౌక్ వద్ద గురువారం అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టున్నట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. వాహన తనిఖీలు చేపడుతుండగా బొలెరో వాహనంలో అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో అందులో 25 క్వింటాళ్ల రేషన్బియ్యం లభించడంతో సరైన పత్రాలు లేని కారణంగా సీజ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించి, బియ్యం సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.న్యాక్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణకైలాస్నగర్: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు నాబార్డు ఆధ్వర్యంలో న్యాక్ శిక్షణ కేంద్రం ద్వారా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ల్యాండ్ సర్వేయర్ కోర్సుల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు న్యాక్ ఏడీ నాగేంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ , ఇంటర్, ఐటీఐ అ ర్హత కలిగి ఉండి 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులన్నారు. అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యం సైతం కల్పించనున్న ట్లు ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్, బెల్లంపల్లి కేంద్రంగా అందించే ఈ శిక్షణను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు 9866565156, 6281444199 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.ఒకరి అరెస్టుసిర్పూర్(టి): మండలంలోని బెంగాళీ క్యాంపు కాలనీకి చెందిన అలోక్పాల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కౌటాల సీఐ ముత్యం రమేశ్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సదరు యువకుడు 2024 నుంచి చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తుండడంతో అతనిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని సిర్పూర్(టి) జూనియర్ సివిల్ కోర్టులో రిమాండ్కు తరలించామన్నారు. సమావేశంలో ఎస్సై కమలాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
పచ్చిరొట్టతో ప్రయోజనం
● రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి ● పంటల దిగుబడి పెంచుకోవాలి చెన్నూర్రూరల్: అన్నదాతలు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని ఏడీఏ బానోతు ప్రసాద్ సూచిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకంతో భూమిలో కాలుష్యం పేరుకు పోయి పంటలకు కొత్త తెగులు సోకుతాయన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, 30 కిలోల బ్యాగుకు పూర్తి ధర రూ.4,276 ఉండగా రైతుకు సబ్సిడీపై రూ.2,137కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రైతులు పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, పిల్లి పెసర, జీలుగ, అలసంద, పెసర తదితర విత్తనాలను ఎంపిక చేసుకుంటే ఖర్చు తక్కువతో పాటు ఎక్కువ దిగుబడి సాధించవచ్చని సూచిస్తున్నారు. పచ్చిరొట్టతో లాభాలు పచ్చిరొట్ట సాగుతో భూమిలో 16 రకాల సూక్ష్మ పోషకాలు వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. పచ్చిరొట్ట ఎరువులు వాడితే చౌడుభూములు సారవంత మవుతాయి. మొక్కలకు బాగా ఆక్సిజన్ అందుతుంది. జింకులోపం నివారించడంతో పాటు నత్రజని శాతం పెరుగుతుంది. మేలైన దిగుబడులు సాధించవచ్చు. సాగు చేసే విధానం వరి నారు పోయడానికి వారం రోజుల ముందు పచ్చిరొట్ట విత్తనాలను పొలంలో చల్లాలి. నెల లేదా 45 రోజుల తర్వాత పచ్చిరొట్ట పైరును భూమిలో కలియ దున్నితే మురిగిపోయి ఎరువుగా మారి పంట ఎదుగుదలకు ఉపకరిస్తుంది. మెట్ట పొలాల్లో పెసర, పిల్లి పెసర, అలసంద విత్తనాలు చల్లి 45 రోజుల తర్వాత వాటి ఆకుకోసి భూమిపై పరిచి దుక్కి దున్నాలి. అలా చేస్తే అది కుళ్లి భూమిలో కలిసి పోతుంది. ఇలా చేసిన తర్వాత పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. -
సర్కారు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ
మంచిర్యాలఅర్బన్/నిర్మల్ఖిల్లా: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్య అందుబాటులోకి రానుంది. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో 12 జిల్లాలు ఎంపిక చేశారు. అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలలో పూర్వ ప్రాథమిక విద్య అమలుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు కొనసాగుతుండగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి విద్యార్థులు చదువుకునే వీలుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సర్కారు పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో కూడా ఈ ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా 210 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలలో 14, కుమురంభీం ఆసిఫాబాద్లో 7, నిర్మల్ జిల్లాలో 2 పాఠశాలల్లో పూర్వ విద్య అందుబాటులోకి రానుంది. మంచిర్యాల జిల్లాలో.. మంచిర్యాల జిల్లాలో ఎంపీపీఎస్, గుడిరేవు, ఎంపీపీఎస్, రెబ్బనపల్లి, ఎంపీపీఎస్, గంపలపల్లి, ఎంపీపీఎస్ క్లబ్రోడ్–లక్సెట్టిపేట్, ఎంపీపీఎస్, ముల్కలగూడ, లక్సెట్టిపేట్, ఎంపీపీఎస్ బోయవాడ, లక్సెట్టిపేట్, ఎంపీపీఎస్, నాయకపుగూడ (ఎస్), ఎంపీపీఎస్ రోట్టపల్లి, ఎంపీయూపీఎస్ పెద్దనపల్లి, ఎంపీపీఎస్ గెర్రిగూడెం (కొత్తకాలనీ), ఎంపీపీఎస్ మామడ, ఎంపీపీఎస్ మిట్పల్లె, మందమర్రి (వీ), ఎంపీపీఎస్ సుపాక (కే). కుమురంభీం జిల్లాలో.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎంపీపీఎస్ ధనోరా (యూఎం), ఎంపీపీఎస్ గుండాయిపేట్, ఎంపీపీఎస్ ముత్తంపేట్, ఎంపీపీఎస్ డబ్బా, ఎంపీయూపీఎస్, రుద్రపూర్, ఎంపీపీఎస్ కొండపల్లి, ఎంపీపీఎస్ చడ్వాయి. నిర్మల్ జిల్లాలో... నిర్మల్ జిల్లాలో ఎంపీపీఎస్ చామన్పల్లి, ఎంపీపీఎస్ పేండ్పల్లిలో పూర్వ ప్రాథమిక విద్య అమలుకానుంది. ఉమ్మడి జిల్లాలో 23 పాఠశాలల్లో పూర్వప్రాథమిక తరగతులు తొలిదశలో ఉమ్మడి ఆదిలాబాద్లో మూడు జిల్లాల్లో అమలు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు... నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని పెండ్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 2017 నుంచే ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తూ ప్రవేశాల సంఖ్య క్రమంగా పెంచుతూ వస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి తరగతుల నిర్వహణ వల్ల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపకుండా తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణతో ప్రవేశాల సంఖ్య పెంచామని ప్రధానోపాధ్యాయులు ఎం.అమృతం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 130 వరకు విద్యార్థులున్నారని, ఈ సంవత్సరం సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. అన్ని పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వ బడులను బలోపేతం చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు.ప్రాథమిక పాఠశాలలు పరిపుష్టం ప్రీ ప్రైమరీ తరగతులను అనుసంధానం చేయడం వల్ల ప్రైమరీ స్కూల్స్ బలోపేతం అవుతాయి. మూడేళ్ల వయసు ఉన్నప్పుడే ప్రైవేటు బడుల్లోకి పంపుతున్న తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ప్రైమరీ తరగతికి ప్రత్యేక సిలబస్ ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. – తోట నరేంద్రబాబు, పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్ చిన్నారులకు ప్రయోజనం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల ఏర్పాటుతో చిన్నారులకు ఎంతగానో ప్రయోజనం కలగనుంది. ఇదివరకు ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపించడం వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉన్న ఊళ్లోనే ిపిల్లలను చేర్పించవచ్చు. ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అవుతాయి. పిల్లలకు విద్యాభాస్యం ప్రారంభించేందుకు ఒక మంచి పునాది వేస్తుంది. – ఎస్.యాదయ్య, డీఈవో, మంచిర్యాల -
నేటి బాలలే రేపటి పౌరులు
లక్సెట్టిపేట: నేటి బాలలే రేపటి పౌరులని జూనియర్ సివిల్ జడ్జి కాసమల్ల సాయికిరణ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ట్రినిటి పాఠశాలలో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ వి జ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. వి ద్యార్థులు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకోవాలని, చాలామంది చిన్నతనంలో విద్యకు దూరమవుతూ బాలకార్మికులగా ఉండిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చట్టాలు ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం విద్యార్థులకు హ క్కులు, బాల కార్మిక వ్యవస్థపై అవగాహన క ల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్తన్న, ఏజీపీ సత్యం, న్యాయవాదులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు లక్సెట్టిపేట: నేటి బాలలే రేపటి పౌరులని జూ నియర్ సివిల్ జడ్జి కాసమల్ల సాయికిరణ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ట్రినిటి పాఠశాలలో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ వి జ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. వి ద్యార్థులు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకోవాలని, చాలామంది చిన్నతనంలో విద్యకు దూరమవుతూ బాలకార్మికులగా ఉండిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చట్టాలు ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం విద్యార్థులకు హ క్కులు, బాల కార్మిక వ్యవస్థపై అవగాహన క ల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్తన్న, ఏజీపీ సత్యం, న్యాయవాదులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా ‘జూపల్లి’
● మంత్రి వివేక్కు మెదక్ జిల్లా బాధ్యతలు ● నిజామాబాద్కు మంత్రి సీతక్క కైలాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర ఎకై ్సజ్, పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారా వు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించిన ధనసరి అనసూయ సీతక్కను నిజా మాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్ర భుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఆదివాసీ ల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్కు సీతక్కను ఇన్చార్జిగా నియమించారు. పార్లమెంటు ఎన్నికల వరకు ఆమె ఉత్సాహంగానే పనిచేశారు. జిల్లా అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో నిరాశకు గురైన ఆమె నాటి నుంచి జిల్లాపై అంతగా ఆసక్తి చూపలేదు. ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా ఆది లాబాద్ జిల్లాలో పర్యటించడం దాదాపుగా తగ్గించా రు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగేందుకు కూడా ఆసక్తి చూపలేదు. ఈ విషయాన్ని కొన్ని సందర్భాల్లో సీతక్క బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాల ఇన్చార్జి మంత్రుల మార్పు జరిగితే సీతక్క జిల్లా బాధ్యతల నుంచి తప్పుకుంటారనే చర్చ గత కొంతకాలంగా సాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన ఇన్చార్జి మంత్రుల జాబితాతో ఆ విషయం స్పష్టమైంది. కొత్తగా రానున్న జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఎలాంటి ప్రభావం చూపనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీనియర్ మంత్రి కావడంతో జిల్లాకు మేలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఇటీవల కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం వివేక్వెంకటస్వామికి మెదక్ జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. -
తాటిచెట్లపై పిడుగులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం ధర్మారం గ్రామ శివారులో గురువారం రెండు తాటిచెట్లపై పిడుగులు పడ్డాయి. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి రెండు చెట్లపై పిడుగులు పడడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పిడుగుపడి ఆలయ గోపురం ధ్వంసంతాంసి: గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూ డిన భారీ వర్షానికి బండల్నాగా పూర్లో రా మాలయం గోపురంపై పిడుగుపడింది. ఒక్కసారిగా ఆల య గోపురంపై పిడుగుపడడంతో కలశంతో పాటు గోపురం ధ్వంసమైంది. పిడుగు పడిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పిడుగు పా టు ప్రభావంతో గ్రామంలోని పలువురి ఇళ్లలో గృహోపకరణాలు సైతం కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. మహిళను బెదిరించిన ఒకరిపై కేసుమంచిర్యాలక్రైం: మహిళను బెదిరించిన ఒకరిపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీకి చెందిన దేశవేని సునీత, జన్నారం మండలంలోని ధర్మారంకు చెందిన దుర్గం లింగేశ్వర్ మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నారు. సదరు మహిళ లింగేశ్వర్కు రూ.50 వేల నగ దు, 13 గ్రాముల బంగారం ఇచ్చింది. చెల్లించమనడంతో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకొమ్మని బెదిరించాడు. సునీత ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
విద్యార్థులకు మంచి బోధన అందించాలి
లక్సెట్టిపేట: విద్యార్థులకు ఉపాధ్యాయులు మంచి విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనాన్ని ఆయన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాభివృద్ధి దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని, కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పించాలని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ చదువుకున్న పాఠశాలపై ఉన్న ప్రేమతో పేద విద్యార్థుల ఉజ్వల భవి ష్యత్ కోసం నిధులు మంజూరు చేయించి భవన ని ర్మాణం పూర్తి చేశానని, తన కల నెరవేరిందని అ న్నారు. విద్యార్థులు మంచి చదువులు చదివి సమాజంలో గుర్తింపు తెచ్చుకుని తల్లిదండ్రులకు పేరు తీసుకు రావాలని కోరారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను శాలువాలతో సన్మానించి నోట్ పుస్తకాలు, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందజేశారు. వి ద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నా యి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కళాశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలు అందించారు. జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, నాయకులు ప్రేంచంద్, ఎండీ.ఆరీఫ్, చింత అశోక్, గడ్డం త్రిమూర్తి, నాగభూషణం, పింగిళి రమేష్, డీసీపీ భాస్కర్, డీఈవో యాదయ్య, డీఐఈవో అంజయ్య, డీఆర్డీవో కిషన్, తహసీల్దార్ దిలీప్కుమార్, ఎంపీడీవో సరోజ, ఎంఈవో శైలజ, ఈఈ, ఏఈ పాల్గొన్నారు. గురువుకు ఎమ్మెల్యే పాదాభివందనంఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు తనకు పదవ తరగతిలో చదువు చెప్పిన ఉపాధ్యాయుడు హరిచందర్ను శా లువాతో ఘనంగా సన్మానించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయనకు పాదాభివంద నం చేశారు. 1973–74లో 10వ తరగతి చదువుతు న్న సమయంలో ఇదే బడిలో గణితం బోధించారని అన్నారు. గురుశిష్యులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ ప్రభుత్వ కళాశాల నూతన భవనం ప్రారంభం -
ప్లాట్ల లెక్క తేలేనా?
● ‘టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ’పై మరోసారి విచారణ ● స్థలాల కేటాయింపులు, నిర్వహణలో ఉల్లంఘనలు ● పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల టీఎన్జీవో ఎస్ హౌసింగ్ సొసైటీ అక్రమాల పర్వం వెలుగులోకి రానుంది. మొదటి దఫాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు దక్కించుకున్న వ్యవహారంపై మరోసారి విచారణకు రంగం సిద్ధమైంది. గత కొంత కాలంగా మంచిర్యాల టీఎన్జీవోఎస్ హౌసింగ్ సొసైటీలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ల కేటాయింపులతో పలు అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సహకార చట్టం 1995, సెక్షన్ 29ప్రకారం పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ ఆదేశాలు ఇచ్చారు. అన్యాక్రాంతమైన భూమిసర్వే నంబరు 42లో ఇప్పటికే అనేక కబ్జాలు జరిగా యి. టీఎన్జీవోస్కు కేటాయించిన భూమిలో కొందరు నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు పొందారు. అంతేకాక కొందరు సభ్యులు సైతం ఇతరులకు అమ్ముకున్నారు. చాలామందికి ప్లాట్లు ఇచ్చినట్లు పత్రాలు ఉన్నప్పటికీ తమ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. దీనిపై సభ్యుల మధ్యే తీవ్ర వివాదాలు జరిగాయి. సభ్యులు తమకు ప్లాట్లు రాలేదని ఫిర్యాదులు చేశారు. మరోవైపు అదే భూమిలో కబ్జాలు జరగగా, సభ్యుల నుంచి పైసలు వసూళ్లు చేస్తూ సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ టీఎన్జీవోస్లకు భూమి కేటాయింపు చట్ట విరుద్ధమంటూ కోర్టు తీర్పు సైతం ఇచ్చింది. నివేదికలకే పరిమితమా? సహకార శాఖ పరిధిలో అనేక సంఘాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. పాలకవర్గాల్లో ఉన్న కొంద రు ఇష్టారీతిన వ్యవహరిస్తూ సంఘాల ప్రతిష్టను దె బ్బతీస్తున్నారు. ఏటేటా ఆడిట్లలో చాలా చోట్ల అక్రమాలు జరుగుతున్నాయి. వీటిపై విచారణలు జరుగుతున్నా బాధ్యులపై చర్యలు ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఉమర్మియా హౌసింగ్ సొసైటీ పేరుతో ఎక్కడ భూమి లేకున్నా కూడా, సొసైటీ పేరుతో కొందరు రియల్వ్యాపారం చేసి ప్లాట్లు అమ్మేసుకున్నారు. ఏళ్లపాటు రూ.కోట్ల లో లావాదేవీలు జరిగాయి. సొసైటీ అక్రమాలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పరిధిలో ఉందంటూ సహకారశాఖ అధికారులు చేతులు దులిపేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇవేకాకుండా జిల్లాలో ఆ యా సొసైటీల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయి. విచారణ చేపడతాం టీఎన్జీవోఎస్ హౌసింగ్ సొసైటీలో ప్రాథమికంగా గుర్తించిన అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతాం. ఆ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. – జి.హన్మంత్రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారిఅధికారులే అక్రమాలు చేసిఅప్పటి నస్పూర్ గ్రామ పంచాయతీ, ప్రస్తుత కార్పొరేషన్ పరిధిలో ఉన్న సర్వే నంబరు 42లోని ప్రభుత్వ భూమిలో 29ఎకరాలను తెలంగాణ నాన్గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించారు. 2010లో ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉన్న మొత్తం 340మంది సభ్యులకు 175గజాల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించారు. ఈ ప్లాట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు చాలా ఏళ్లుగా వాదిస్తున్నారు. దీనిపై కొందరు సీసీఎల్ఏకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. జిల్లా సహకార శాఖ అధికా రులతో ఆడిట్ చేయించారు. గతేడు నవంబర్లోనే నివేదిక ఇచ్చారు. ఆడిట్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. ప్లాట్ల నిర్ణీత విస్తీర్ణానికి అధికంగా తీసుకోవడం, ఒక చోట బదులు మరోచోట ఇళ్లు కట్టడం చేశారు. సొసైటీ లెక్కలు, ఎన్నికల, నిర్వహణలు సజావు లేవని ప్రాథమికంగా గుర్తించారు. దీంతో మరోసారి జిల్లా సహకార శాఖ అధికారితో పూర్తి స్థాయిలో విచారణ జరపనున్నారు. -
అన్నావదిన... దీవించండి..
బెల్లంపల్లి: రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ తన సోదరుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, వదిన రమ ఆశీర్వాదం తీసుకున్నారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి వివేక్ హైదరాబాద్లో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అన్నా వదినల కాళ్లకు సమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఎల్లప్పుడు ఇలాగే తనపై ప్రేమానురాగాలు ఉంచాలని వివేక్ తన సోదరుడిని కోరారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేను కాంగ్రెస్ నాయకులు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింగరావు, మునిమంద రమేశ్, కేవీ ప్రతాప్, హరీష్ గౌడ్, ఎం.మహేందర్, తదితరులు పాల్గొన్నారు. -
వ్యాక్సినేషన్ ప్రారంభం
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల పట్టణ ఆరోగ్య కేంద్రంలో రోటసిల్ లిక్విడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇంచార్జి డీఎంహెచ్వో డాక్టర్ ప్రసాద్, డెప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అనిత బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 అర్బన్ హెల్త్సెంటర్లు, 100 ఆయుష్మాన్ భారత్ కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ను ఆరు, పది, 14 వారాలు ఉన్న పిల్లలకు ఇస్తామని అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు డయేరియా, ఇతర వ్యాధులు రాకుండా అరికడుతుందని, ప్రజలందరూ పిల్లలకు వేయించాలని తెలిపారు. వైద్యులు శివప్రతాప్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, డీపీహెచ్ఎం పద్మ పాల్గొన్నారు. -
ఆ బడికి 63ఏళ్లు
భీమారం: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అప్పటి మారుమూల గ్రామమైన భీమారంలో ప్రభుత్వం 1963లో జెడ్పీ పాఠశాలను ఏర్పాటు చేసింది. గ్రామానికి చెందిన సంఘసేవకులు ఎన్వీ.రాజారెడ్డి కృషి కారణంగా మొదట ప్రాథమిక పాఠశాల, 1967లో పదో తరగతి మంజూరు చేసింది. దీనికి తోడు గిరిజన బాలుర హాస్టల్ ఏర్పాటు చేయడంతో ఉమ్మడి జిల్లాలోని గిరిజన గ్రామాలను నుంచి వచ్చి చదువుకున్నారు. ఇక్కడ చదివిన అనేక మంది ఉన్నత పదవులు చేపట్టారు. ఉట్నూరు ప్రాంతానికి చెందిన డాక్టర్లు తొడసం చందు, భీష్మ, పెద్దపల్లి జెడ్పీ సీఈవో నరేందర్ ఇక్కడే చదివారు. ఇప్పుడు టాటాకన్సెల్టెంగ్ సర్వీస్(టీసీఎస్)లో ఉన్నత పదవిలో ఉన్న వీ.రాజయ్య ఇక్కడే చదువుకున్నారు. -
తోరణాలు..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఓ వైపు పరిశుభ్రత కార్యక్రమాలు.. విద్యార్థులకు స్వాగతం పలికేలా ఆవరణల్లో రంగవల్లులు, మామిడి తోరణాలు, అరటి చెట్లు ఏర్పాటు చేశారు. వాటర్ ట్యాంకులు, మూత్రశాలలు, గదులు శుభ్రం చేయించారు. మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలో బడిబాట ద్వారా 250మంది చేరారు. ఆహ్లాదకర స్వాగతం నెన్నెల: మండలంలోని కుశ్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సకల సదుపాయాలు, ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పచ్చని చెట్లతో ఆహ్లాదకర స్వాగతం పలుకుతోంది. ఏపుగా పెరిగిన వృక్షాలతో నందనవనాన్ని తలపిస్తోంది. నా లుగు గదులు ఉండగా 60 మంది పిల్ల లు చదువుకుంటున్నారు. విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచీలు, మరుగుదొడ్లు ఉన్నాయి. ఉపాధ్యాయుల ప్రచారంతో ఈయేడు అడ్మిషన్లు పెరిగాయి. బుధవారం పిల్లలు, ఉపాధ్యాయులు, స్థానికులు గ్రామంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. -
పిల్లల సంక్షేమానికి అంగన్వాడీ బాట
భీమారం: పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం అమ్మ మాట–అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండలంలోని బూర్గుపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఎగ్ బిర్యానీ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో కొత్తగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, పిల్లలతో కలిసి భోజనం చేశారు. జిల్లా మహిళ, శిశు సంక్షేమ అధికారి రౌఫ్ఖాన్, మండల ప్రత్యేక అధికారి కల్పన, తహసీల్దార్ సదానందం, సీడీపీవో మనోరమ పాల్గొన్నారు. ఆ తర్వాత మండల కేంద్రంలో పీహెచ్సీ నూతన భవన నిర్మాణ పనులు, కేజీబీవీ, వసతిగృహాం పరిశీలించారు. ఔషధ మొక్కలతో రోగాలు నయం జన్నారం: అడవుల్లో సహజంగా పెరిగే మొక్కల్లో అనేక ఔషధాలు ఉన్నాయని, వాటితో అనేక రకాల రోగాలు నయమవుతాయని ఇందన్పల్లి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఇందన్పల్లి రేంజ్ పరిధిలోని నార్లపూర్ బీట్లో సిబ్బందితో కలిసి పర్యటించారు. కలుపు మొక్కలు, ఔషధ మొక్కలను గుర్తించారు. ఔషధ మొక్కల ఉపయోగాలను సిబ్బందికి తెలిపారు. ప్రతీ రోజు బీట్ అధికారులు బీట్ పరిధిలో పర్యటించి గడ్డి మైదానాలు ఏర్పాటు చేసుకోవాలని, వన్యప్రాణులు గడ్డిని ఇష్టంగా తింటాయని సూచించారు. సెక్షన్ అధికారులు హన్మంతరావు, రవి, బీట్ అధికారులు పాల్గొన్నారు. -
రండి.. దయచేయండి..
వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు గురువారం పునఃప్రారంభం కానున్నాయి. 48రోజులపాటు ఆటపాటలతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపిన విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తొలిరోజునే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు అందించనున్నారు. ఈ ఏడాది నుంచి 50శాతం అంతకంటే ఎక్కువ మంది ఉన్న పాఠశాలల్లో కృత్రిమ మేధ ఆధారిత అభ్యసన కార్యక్రమం అమలు చేయనున్నారు. 2025–26విద్యాసంవత్సరం పాఠశాలల ప్రారంభం పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పదో తరగతి వరకు ఇక్కడే.. లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నాను. అప్పటి రోజుల్లో తాలూకా హెడ్ కావడంతో ఇక్కడే ప్రభుత్వ పాఠశాల ఉన్నది. 1973–74లో పదవ తరగతి చదివాను. సుదూర ప్రాంతాల నుంచి చాలామంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేశారు. మంచి హోదా, ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తున్నాను. నేను చుదువుకున్న పాఠశాలను మరిచిపోలేక పోతున్నాను. అప్పటి పాఠశాల శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి నిర్మాణం చేపట్టాను. విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ నెల 12న ప్రారంభిస్తున్నాం. – మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు స్టేషన్రోడ్ పాఠశాల ముస్తాబు చెన్నూర్/చెన్నూర్రూరల్/జైపూర్/జన్నారం: చెన్నూర్ మున్సిపాల్టీ పరిధిలోని సర్కారు పాఠశాలలను ఉపాధ్యాయులు రంగు రంగుల పూలు, బెలూన్లతో ఆకర్షణంగా తీర్చిదిద్దారు. తాగునీరు, బెంచీలు, కుర్చీలు, మూత్రశాలలు వంటి సౌకర్యాలు కల్పించారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రధానోపాధ్యాయురాలు స్వప్నశ్రీ తెలిపారు. మండలంలోని సుద్దాల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 57మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల ఫొటోలతో ఎంట్రెన్స్బోర్డు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో ఆటవస్తువులతోపాటు చిత్రాలు వేయించారు. ● జైపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో గదులు, పరిసరాలు శుభ్రం చేయించారు. స్వాగత తోరణాలు, రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. జైపూర్ హైస్కూల్లో అత్యాధునిక వసతులు, ల్యాబ్, వసతిగృహ సౌకర్యం ఉండడంతో ఈ ఏడాది సుమారు 100మంది కొత్త విద్యార్థులు చేరనున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ● జన్నారం మండలం ధర్మారం ప్రాథమికోన్నత పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ప్రతిష్టించారు. ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పాఠశాలకు నూతన భవనం, మరుగుదొడ్లు, మూత్రశాలలు, నిర్మించి అన్ని వసతులు కల్పించారు. -
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
కౌటాల: వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని గుండాయిపేట గ్రామానికి చెందిన ఉర్వత్ కమలాబాయి(56) కొంతకాలంగా మద్యానికి బానిసైంది. మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లో నుంచి వెళ్లిపోయి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలిస్తుండగా బావిలో మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచా రం అందించడంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమి త్తం సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రికి తరలించా రు. మృతురాలి కుమారుడు ఉ ర్వత్ బండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి
మంచిర్యాలఅర్బన్: తెలంగాణలోని ధూప, దీప, నైవేద్య అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చే స్తానని తెలంగాణ అర్చక జేఏసీ చైర్మన్ గంగు ఉ పేంద్రశర్మ అన్నారు. బుధవారం మంచిర్యాల విశ్వనాథస్వామి కాలక్షేప మండపంలో అర్చక సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 99 పీఆర్సీసీకి తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. కార్యక్రమంలో అర్చక వే ల్ఫేర్ బోర్డు సభ్యుడు నారాయణస్వామి, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ నవీన్, సీడీడీఎన్ అధ్యక్షుడు శ్రీ కాంత్స్వామి, డీడీఎన్ అధ్యక్షుడు సతీశ్శర్మ, ఈవో రవి, అర్చకులు నరహరిశర్మ పాల్గొన్నారు. -
పత్తి విత్తేందుకు తొందరొద్దు
‘‘తొలకరి వర్షాలకు తొందరపడి పత్తి విత్తనాలు విత్తుకోవద్దు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నేలలో కనీసం తేమ కూడా రాలేదు. పంటల సాగుకు సమయం మించి పోలేదు. జూలై 15వరకు పత్తి విత్తుకోవచ్చు..’’ అని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీ) ప్రోగ్రం కోఆర్డినేటర్, వ్యవసాయ శాస్త్రవేత్త కోట శివకృష్ణ అన్నారు. బుధవారం పంటల సాగు పద్ధతులు, అధిక దిగుబడి, చీడపీడల నివారణ తదితర అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన లభించింది. సాగులో రైతుల సందేహాలను శాస్త్రవేత్త శివకృష్ణ నివృత్తి చేశారు. రైతుల ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు ఇచ్చారు. బెల్లంపల్లిపత్తిలో అంతర పంటగా ఎన్ని సాళ్లకో కంది సాలు వేసుకోవాలి. – జిల్లెల సుదర్శన్గౌడ్, గ్రామం: నాయకునిపేట, మం: కన్నెపల్లి వ్యవసాయ శాస్త్రవేత్త: పత్తి పంటలో నిరభ్యంతరంగా కందిని అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. పత్తి 4–6 సాళ్ల ఎడంలో కంది సాలు వేసుకోవచ్చు. ఈ తీరుగా సాగు చేయడం వల్ల ఎకరాకు రెండు కిలోల విత్తనం సరిపోతుంది. తొలకరి వర్షాలకు పత్తి విత్తుకోవచ్చా.. – మేడి పవన్, గ్రామం: కిష్టంపేట, మం: తాండూర్, ఇందూరి భూమయ్య, గ్రామం: తంగళ్లపల్లి, మం: భీమిని వ్యవసాయ శాస్త్రవేత్త: పత్తి విత్తుకోవడానికి ఇప్పటికిప్పుడు తొందరపడాల్సిందేమీ లేదు. తొలకరి జల్లులకు ఇంకా నేల ఏమాత్రం తడవలేదు. తేమ కూడా రాలేదు. భూమి కనీసం తొమ్మిది ఇంచుల వరకు తడిసిన తర్వాత విత్తుకోవడం ఉత్తమం. జూలై 15వరకు పత్తి విత్తుకోవడానికి సమయం ఉంది. పత్తిలో అంతర పంటల సాగుకు ఎలాంటి సూచనలు చేస్తారు – కామిని శ్రీనివాస్, గ్రామం: కిష్టంపేట, మం: తాండూర్ వ్యవసాయ శాస్త్రవేత్త: పత్తి పంటలో అంతర పంటలుగా ప్రధానంగా కంది, సోయాబీన్, పెసర సాగు చేసుకోవచ్చు. ఏటా ఏక పంట కాకుండా పంట మార్పిడి పద్ధతి పాటించాలి. ఈ విషయంలో రైతులు సరైన అవగాహన పెంచుకోవాలి. పత్తి పంటలో గూడ రాలడాన్ని నివారించే వీలుందా..? – కాట్న శ్రీకాంత్, గ్రామం: గంగారాం, మం: నెన్నెల వ్యవసాయ శాస్త్రవేత్త: భారీ వర్షాలు కురవడం, ఆకస్మికంగా ప్రకృతిలో మార్పులు చోటు చేసుకోవడం మరీ ముఖ్యంగా పత్తి పంటలో సూక్ష్మపోషకాల లోపాలు ఏర్పడడం వల్ల గూడ రాలుతుంది. అందువల్ల ఫ్లానఫిక్స్ 1ఎంఎల్ 5లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నల్ల, ఎర్రరేగడి నేలల్లో పత్తి సాగుకు వేర్వేరు విత్తనాలు ఉంటాయా.. – రాంటెంకి దశరథ్, గ్రామం: బిట్టూర్పల్లి, మం: భీమిని వ్యవసాయ శాస్త్రవేత్త: నేలల రకాలను బట్టి విత్తుకునే పత్తి విత్తనాలు వేర్వేరుగా ఏమీలేవు. నల్ల, ఎర్ర రేగడి నేలలైనా ఒకే తీరైన పత్తి విత్తనాలు సాగు చేసుకోవచ్చు. విత్తనాలను మాత్రం ధ్రువీకరించిన కేంద్రాల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. తప్పనిసరిగా రశీదు తీసుకుని దగ్గర ఉంచుకోవాలి. వర్షాధారంగా వరి సాగుకు అనువైన వంగడాలు.. – కే.రాజ్కుమార్, గ్రామం: చిన్నగుడిపేట, మం: భీమిని వ్యవసాయ శాస్త్రవేత్త: వరినారు మడులు జూలై 15వరకు పోసుకోవాలి. జనుము, జీలుగ విత్తనాలు చల్లుకుని సాగు చేయాలి. ఏపుగా ఎదిగాక సింగిల్ సూపర్ఫాస్పేట్ వేసి దుక్కి కలియ దున్నాలి. కునారం 1638, 118 దొడ్డురకం, జేజీఎల్ తదితర రకాల వరి వంగడాలు అందుబాటులో ఉన్నాయి. జూలై 15వరకు విత్తుకోవచ్చు.. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ కోట శివకృష్ణ ‘సాక్షి’ ఫోన్ ఇన్కు స్పందనపత్తి పంటలో కలుపు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. గులాబీ రంగు పురుగును నివారించడం ఎలా..? – గుమ్మడి మల్లేష్, గ్రామం: నీలాయపల్లి, మం: తాండూర్, తోట మధు, గ్రామం: నెన్నెల, అప్పని గురవయ్య, గ్రామం: లక్ష్మీపూర్ వ్యవసాయ శాస్త్రవేత్త: పత్తి పంట విత్తుకున్న 48గంటల్లోపు పెండిమిథాలిన్ కలుపు నివారణ మందును పిచికారీ చేయాలి. భూమి పదునుగా ఉన్న సమయంలో ఎకరానికి 700 ఎంఎల్ మందు పిచికారీ చేస్తే సాధ్యమైంతవరకు కలుపు రాకుండా ఉంటుంది. పత్తి పంట సేకరణ పూర్తి కాగానే పత్తి మొదళ్లను భూమిలో కలియ దున్నాలి. అలా చేయడం వల్ల గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గుతుంది. పత్తి పంట విత్తుకున్న 45 రోజుల్లో గులాబీ రంగు పురుగు కనిపించినట్లయితే పంట చుట్టూరా లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి. అదే తీరుగా ప్రతీ 15–20 రోజులకోసారి వేపనూనె పిచికారీ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. వరిలో మొగిపురుగు సమస్యను అధిగమించడం ఎలా.. – కోట సునిల్కుమార్, గ్రామం: దుగినేపల్లి, గోమాస ప్రశాంత్, గ్రామం: మాలగురిజాల, మం: బెల్లంపల్లి వ్యవసాయ శాస్త్రవేత్త: మొగి పురుగు ప్రభావం కనిపించకుండా నారుమడిలో 800 గ్రాముల త్రీజీ గుళికలు వేసుకోవాలి. నారు వేసిన ఎనిమిది రోజుల్లో ఎకరాకు ఎనిమిది కిలోల గుళికలు మరోమారు వేయడం వల్ల మొగి పురుగు ప్రభావం తగ్గుతుంది.అధిక సాంద్రత పత్తి సాగుకు అనుకూలమైన పత్తి రకాలు ఏమిటి.. – బోర్ల తిరుపతి, గ్రామం: చిన్నగుడిపేట, మం: భీమిని వ్యవసాయ శాస్త్రవేత్త: అధిక సాంద్రత కలిగిన పత్తి విత్తుకోవడానికి రైతులు ముందుకు రావాలి. గరిష్టంగా 150–160 రోజుల్లో పంట చేతికి అందే పత్తి సాగు చేసుకోవాలి. పత్తి మొక్క ఎత్తుగా పెరగని రకాలు ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా రాశి కంపెనీకి చెందిన ఆర్సీహెచ్ 929, స్విఫ్ట్, నూజివీడు కంపెనీకి చెందిన అరమిత తదితర రకాలు సాగు చేసుకోవచ్చు. -
విద్యార్థుల సంఖ్య తగ్గేదేలే!
దండేపల్లి: మండలంలోని పెద్దపేట ప్రాథమిక పాఠశాలలో 2018కి ముందు విద్యార్థుల సంఖ్య పది మాత్రమే. అదే సంవత్సరంలో ప్రధానోపాధ్యాయురాలిగా శ్రీలత బదిలీపై వచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, పిల్లలను ప్రైవేటుకు పంపకుండా, వారిలో నమ్మకాన్ని పెంచి, విద్యార్థుల సంఖ్యను 60కి చేర్చారు. 2022లో మన ఊరు–మనబడి పథకంలో భాగంగా రూ.20 లక్షలు మంజూరు కావడంతో పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచీలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా తరగతి గదులు, ఆంగ్లమాధ్యమంలో బోధన చేస్తున్నారు. ప్రతియేటా పది మంది వరకు విద్యార్థులు గురుకులాలకు ఎంపికవుతున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య 50కి పైనే తప్పా తగ్గడం లేదు. బాల్యం గుర్తుకు వస్తది.. దండేపల్లి: మాది దండేపల్లి మండలం కాసిపేట. దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6నుంచి 10 వరకు చదివాను. 1984–85 ఎస్సెస్సీ బ్యాచ్. నాకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. నేను చదివిన దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2005–11 వరకు పనిచేశాను. మళ్లీ రెండోసారి 2018 నుంచి ఇక్కడే పని చేస్తున్నాను. నేను రోజు బడిలో అడుగుపెట్టగానే నాకు నా బాల్యం గుర్తుకు వస్తది. చదివిన పాఠశాలలోనే పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా బాల్యం, నా ఉద్యోగ సర్వీస్, నేను చదివిన పాఠశాలలో గడుపుతున్నందుకు ఆనందంగా ఉంది. – అప్పాల మనోహర్, స్కూల్ అసిస్టెంట్, దండేపల్లి -
● నేడు పండుగలా పాఠశాలల పునఃప్రారంభం ● యూనిఫాం, పుస్తకాలు పంపిణీ
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 1,078 ఉండగా 1,27,568మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇందులో 40 రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 5,941మంది, 684 ఎంపీపీఎస్, జెడ్పీ పాఠశాలల్లో 30,406మంది, 18కేజీబీవీల్లో 4,568మంది, ఐదు మోడల్ స్కూళ్లలో 3,100మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 42,711 యూనిఫామ్లు విద్యార్థులకు అందజేయాల్సి ఉంది. 3,07,820 పుస్తకాలు అవసరం కాగా పాఠశాలలకు చేరాయి. మొదటి రోజు ఒక్కో జత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందజేసేందుకు చర్యలు వేగవంతం చేశారు. ఈ నెల 6నుంచి బడిబాటలో అడ్మిషన్లు చేపట్టారు. ఇలాంటి పిల్లలకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఎలా సర్దుబాటు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో 684 పాఠశాలల్లో 2,474 మంది టీచర్లు పాఠాలు బోధిస్తున్నారు. గత ఏడాది సబ్జెక్టు టీచర్ల కొరతను అధిగమించేందుకు 67మందిని సర్దుబాటు చేశారు. ఈ ఏడాది బడిబాట తర్వాత విద్యార్థుల అడ్మిషన్లు పెరిగే పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై దృష్టి సారించాల్సి ఉంది. బడి శుభ్రత, భోజనంలో నాణ్యత.. సర్కారు పాఠశాలల్లో బడి శుభ్రత, భోజనంలో నాణ్యతపై ప్రభుత్వం దృష్టి సారించింది. వంట శుభ్రత, వడ్డన అంశాలపై 1,290మంది మధ్యాహ్న భోజన కార్మికులు, ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. రూ.63లక్షలతో వంటపాత్రలు, ఇతర సామగ్రి కొనుగోలు చేశారు. బోధన సామర్థ్యాలను పెంపొందించడానికి 1,130 మంది ఎస్జీటీ, 1,811మంది స్కూల్అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. పిల్లలను చేర్పిస్తున్నారా..? ఆలోచించండి.. పిల్లలను ఏయే బడుల్లో చేర్పించాలని తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల హంగు ఆర్భాటాలు చూసి హడావుడిగా పిల్లలను చేర్పించొద్దని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారా..? పాఠశాలకు గుర్తింపు ఉందా..? ఆటస్థలాలు, అర్హులైన ఉపాధ్యాయులు ఉన్నారా తెలుసుకుని చేర్పించాలని, లేదంటే అన్ని వసతులున్నా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే మంచిదని సూచనలు చేస్తున్నారు. తడ‘బడి’ నిలిచింది.. మంచిర్యాలఅర్బన్: ఒకప్పుడు తొమ్మిది మంది విద్యార్థులకు పడిపోయి తడబడిన పాఠశాల 80 మందితో నిలబడింది. దూరంగా ఉన్న పాఠశాల చేరువ కావడం.. ఉపాధ్యాయులు ఉత్సాహం చూపడం విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించింది. అడ్మిషన్లు పెరగడంతో ఒక ఉపాధ్యాయుడి నుంచి ముగ్గురికి చేరింది. స్థానిక మంచిర్యాల(హరిజనవాడ) పాఠశాల భవనంలో మూడు స్కూళ్లు ఉండగా.. విద్యార్థుల ఇబ్బందులపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలతో డీఈవో యాదయ్య చొరవ చూపారు. గత ఏడాది జూలై 9న జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోకి స్టేషన్రోడ్ పాఠశాల తరలించారు. అంతకుముందు హరిజన పాఠశాల ప్రాంగణంలో హరిజనవాడ స్కూల్లో 30, రాళ్లపేట్ రోడ్లో 14, స్టేషన్రోడ్ స్కూల్లో ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. మూడు స్కూళ్లలో 51 మంది విద్యార్థులున్నా పరిస్థితి నుంచి ఒక స్టేషన్రోడ్ స్కూల్లోనే 80కు చేరడం గమనార్హం. స్టేషన్రోడ్ స్కూల్ టీచర్లు పప్పుగుత్తివాడలో బడిబాట నిర్వహించారు. బడి మానేసిన పిల్లలను చేర్పించారు. విద్యార్థుల సంఖ్య 78మంది కాగా 18 మంది ఐదో తరగతి పూర్తయి పైచదువులకు వెళ్లనున్నారు. 60 మంది ఉండగా కొత్తగా 20 మంది అడ్మిషన్లు చేయడంతో సంఖ్య 80కి చేరింది. ప్రవేశాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. చదువులకు ఆటంకం లేకుండా చర్యలు ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు అందజేస్తాం. బడిబాట ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ సాగుతుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమున్నా చోట ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి చదువులకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటాం –ఎస్.యాదయ్య, డీఈవో -
ఆర్జీయూకేటీ, స్విన్ఫీ మధ్య ఒప్పందం
బాసర: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భవిష్యత్కు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు బాసర ఆర్జీయూకేటీ, స్విన్ఫీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మధ్య బుధవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఓఎస్డీ మురళీదర్శన్, స్విన్ఫీ శిక్షణ బృందంలోని సీఈవో రాణి గుంటికడి సంతకాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం గ్రామీణ యువతకు సాంకేతిక పరిజ్ఞానం అందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచిందన్నారు. వీరిని ఐటీ పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయనున్నామన్నారు. ఇందులో భాగంగా ఆర్జీయూకేటీలో చివరి సంవత్సరం చదువుతున్న వందమంది విద్యార్థులకు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ అంశాలపై మూడునెలల పాటు ఇంటెన్సివ్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు డాక్టర్ విట్టల్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ మహేష్, డాక్టర్ ఎన్ విజయ్కుమార్, కంపెనీ ప్రతినిధులు సుమశ్రీ వల్లపు, రాకేష్ గంజి, మహేష్ సద్దాలా, తదితరులు పాల్గొన్నారు. -
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
జన్నారం: మండలంలోని పొనకల్, ధర్మారం గ్రామాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై గొల్లపెల్లి అనూష తెలిపారు. ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు బుధవారం ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా ఇసుక ట్రాక్టర్లు కనిపించడంతో పట్టుకుని సీజ్ చేసి సదరు ట్రాక్టర్ యాజమానులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రేపు అండర్–19 క్రికెట్ జట్టు ఎంపికమంచిర్యాలక్రైం: ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఈనెల 13న జిల్లాస్థాయి అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు క్రికెట్ కోచ్, జిల్లా కార్యదర్శి ప్రదీప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక విధానం రౌండ్ రాబిన్ మ్యాచ్ల రూపంలో ఉంటుందని, ఈ మ్యాచ్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 2006 సెప్టెంబర్ 1 తరువాత జన్మించి ఉన్నావారు మాత్రమే అర్హులన్నారు. అర్హత, ఆసక్తి కలవారు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం వెంట తీసుకుని ఉదయం 8 గంటలకు హాజరు కావాలన్నారు. చెట్టుకొమ్మలు విరిగిపడి బైకులు ధ్వంసంనస్పూర్: సీసీసీ కార్నర్ సమీపంలోని ఓ మద్యం దుకాణం ఎదుట ఉన్న వేపచెట్టు కొమ్మలు బుధవారం గాలికి విరిగి పడడంతో చెట్టు కింద ఉన్న సుమారు 10 బైక్లు ధ్వంసమయ్యాయి. దీంతో పాటు కొమ్మలు విద్యుత్ వైర్ల మీద పడడంతో స్తంభం కిందకు వంగింది. దీంతో తీగలు సైతం కిందకి వేలాడి ప్రమాద కరంగ మారడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో మద్యం దుకాణం ముందున్న ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్జీవో హౌసింగ్ సొసైటీపై విచారణమంచిర్యాలఅగ్రికల్చర్: మంచిర్యాల నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఎన్జీవోస్) హౌసింగ్ సొసైటీలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సహకార శాఖ రాష్ట్ర కమిషనర్ సురేంద్రమోహన్ బుధవారం విచారణకు ఉత్వర్వులు జారీ చేశారు. విచారణ అధికారిగా జిల్లా సహకారశాఖ సూపరింటెండెంట్ జి.హనుమంత్రెడ్డిని నియమించారు. ప్లాట్ల కేటాయింపు, అర్హులు కాకుండా అనర్హులు ఉన్నారని, స్థలాల మధ్య వ్యత్యాసం, తదితర అక్రమాల ఆరోపణలపై 1995లో సెక్షన్ 29 ప్రకారం అప్పటి జిల్లా సహకార శాఖ అధికారి అందజేసిన నివేదిక ఆధారంగా విచారణ చేపట్టనున్నారు. -
శివాలయంలో చోరీ
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న త్రినేత్ర శివాలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్ప డ్డారు. గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భగుడి ద్వారం తాళాన్ని పగులగొట్టి శివలింగంపై ఉన్న వెండి నాగపడిగను అపహరించారు. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకుడు విషయాన్ని గమనించి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. భుక్తాపూర్లో చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన రహెమాన్ ఇంట్లో చోరీ జరిగినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. బక్రీద్ సందర్భంగా ఈనెల 3న కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన గోనధన్నూర్కు వెళ్లాడు. ఈనెల 11న ఇంటికి వచ్చిచూడగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా ఇంట్లో ఉన్న ఐదు గ్రాముల బంగారం, రూ.6వేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. మిస్సింగ్ కేసు నమోదుతానూరు: మండలంలోని కోలూరు గ్రామానికి చెందిన గాడేకర్ శేషారావు (35) అదృశ్యమైనట్లు ట్రెయినీ ఎస్సై నవనీత్రెడ్డి తెలి పారు. శేషారావు ఈ నెల 10న ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కు టుంబ సభ్యులు తెలిసిన చోట్ల వెతికినా ఆ చూకీ లభించలేదు. దీంతో అతని వదినె గాడేకర్ శాంతాబాయి బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ‘భూకబ్జాకు పాల్పడిన మహిళపై చర్యలు తీసుకోవాలి’బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి లోని అంబేడ్కర్ రడగంబాల బస్తీలో ఓ మ హిళ ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రజ లను బెదిరింపులకు గురిచేస్తోందని బాధితులు బుధవారం బెల్లంపల్లి ఆర్డీవో, తహసీ ల్దార్, మున్సిపల్ కమిషనర్లకు వేర్వేరుగా లి ఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా బాధితులు చీకటి మాధురి, ఎండీ రె హెనా బేగం, పెద్దపల్లి వరలక్ష్మి, చీకటి ల క్ష్మి, ఎండీ షహనాజ్ మాట్లాడుతూ తామంతా కూ లీ పనులు చేసుకుని బస్తీలో నివాసం ఉంటున్నామన్నారు. ఎంతో కష్టపడి పక్కా గృహా లు కట్టుకుని జీవిస్తున్న తమను ఆర్పీ మాధవి బెదిరింపులకు గురి చేస్తోందన్నారు. అక్రమంగా రాత్రి పూట నిర్మాణాలు సాగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ప్ర భుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారని, కొందరు పేదల గృహాలను కబ్జా చే యడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని, ఇప్పటికే దాదాపు 40 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని వివరించారు. గతంలో రెవె న్యూ, మున్సిపల్ అధికారులు అడ్డుకోగా తిరి గి కబ్జాకు యత్నాలు సా గిస్తున్నారని వివరించారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి బస్తీలో సాగుతున్న అక్రమ కట్టడాలను వెంటనే ఆపాలని, భూ క బ్జాలు జరగకుండా రెవెన్యూ అధికారులు ని వారించి, మాధవిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
విత్తన చట్టం రూపకల్పనకు కృషి
● తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డికై లాస్నగర్: నూతన విత్తన చట్టం–2025 రూపకల్పనలో రైతుల సూచనలు తీసుకుని త్వరలో అమలులోకి వచ్చేలా చర్యలు చేపడతామని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డితో కలిసి తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన విత్తన చట్టం ముసాయిదా తయారీ కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, సీడ్ ఆర్గనైజర్లు, విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లు, రైతుల నుంచి అభిప్రాయ సే కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ విత్తన చట్టం ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరి సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుని విత్తన చట్టం ఏర్పాటుకు కృషి చేస్తామని వివరించారు. అంతకుముందు బోరంచు శ్రీకాంత్రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించారు. -
మత్స్యసొసైటీ ఖాతాలో నగదు జమచేయాలి
పాతమంచిర్యాల: మత్స్య సొసైటీలకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు సరఫరా చేసేందుకు బదులుగా సొసైటీల ఖాతాలలో నగదు జమచేస్తే సభ్యులకు లాభదాయకంగా ఉంటుందని తెలంగాణ మ త్స్యకారుల, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లల బాలకృష్ణ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని చార్వక ట్రస్ట్ భవన్లో మత్స్య కార్మిక సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్సీడీసీ, ఎన్ఎఫ్డీ స్కీంలను పునరుద్ధరించాలని, మత్స్యకారులకు టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలు 90 శాతం సబ్సిడీపై మంజూరు చేయాలన్నారు. మత్స్యకారులు ప్రమాదాల బారిన పడి చనిపోతే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల సహజ మరణానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో పది ఎకరాల్లో అధునాతన చేపల మార్కెట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోడెంకి చందు, నాయకులు గుమ్ముల శ్రీనివాస్, పెద్దపల్లి మధునయ్య, పందిరి రమాదేవి, లెల్లల మల్లీశ్వరి, బానెం నాగన్న, నాగుల మహేందర్, తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
తాండూర్: మండలంలోని బోయపల్లిలో బుధవారం నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రలోని గోండ్ పిప్పిరి గ్రామం నుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకువస్తున్నట్లు తమకు అందిన సమాచారం మేరకు బోయపల్లి గ్రామ సమీపంలో మాటువేసి మాసాడి రవీందర్ అనే యువకుడు నకిలీ పత్తి విత్తనాలు తీ సుకువస్తుండగా పోలీసులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. నిందితుని వద్ద నుంచి 18 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మండల వ్యవసాయ అధికారి సుష్మ పర్యవేక్షణలో పంచనామా నిర్వహించారు. విత్తనాల విలువ రూ.54 వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. భీమారం: మండలంలోని ఎలకేశ్వరంలో బుధవారం వ్యవసాయశాఖ, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి సూరం సురేష్ వద్ద 2 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏవో అత్తె సుధాకర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సురేష్పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. -
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి
బెల్లంపల్లి: లేబర్ కోడ్ల రద్దు కోరుతూ జూలై 9న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రమణ, బెల్లంపల్లి మండల కన్వీనర్ సీహెచ్ దేవదాస్ కోరారు. మంగళవారం బెల్లంపల్లి సీఐటీయూ కా ర్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మి క, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడానికి సిద్ధపడిందని విమర్శించారు. ఈ తీరు అత్యంత గర్హనీయమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో కార్మికులు సంపూర్ణంగా పాల్గొని విజయవంతం చేయాల ని కోరారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూ నియన్ జిల్లా అధ్యక్షురాలు భానుమతి, శ్రేణులు పద్మ, అనురాధ, రాజేశ్వరి, స్వాతి, సీఐటీయూ శ్రే ణులు యాకూబ్, సుమన్, నారాయణ, రవీందర్, విశ్వనాథ్, అనిల్, రాహుల్, కిశోర్ పాల్గొన్నారు. -
హాకీ చాంపియన్గా ‘హైదరాబాద్’
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రెండురోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. నిజామాబాద్ జట్టుతో జరిగిన పోరులో 3–0 గోల్స్తో విజయదుందుభి మోగించింది. రెండో స్థానంలో నిజామాబాద్, మూడో స్థానంలో నల్గొండ జట్లు నిలిచాయి. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. జిల్లాలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ను విజయవంతంగా పూర్తి చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయ్కుమార్, జనరల్ సెక్రటరీ సీఆర్ భీంసింగ్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, యూనుస్ అక్బాన్, రాష్ట్రపాల్, క్రీడాకారులు, శిక్షకులు పాల్గొన్నారు. -
బస్టాండ్ బాత్రూంలో బోనోఫిక్స్ కలకలం!
● మత్తు కోసం వినియోగిస్తున్న యువతఖానాపూర్: మద్యం, గుట్కాతో పాటు గంజాయి లాంటి పలు మత్తు పదార్థాలకు యువత బానిసలవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇదే తరహాలో సైకిల్ టైర్ పంక్చర్ కోసం వినియోగించే బోనోఫిక్స్తో ద్వారా మత్తును ఆస్వాదిస్తున్న ఘటన ఖానాపూ ర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మరుగుదొ డ్లు, మూత్రశాలల ప్రాంతంలో బోనోఫిక్స్ వినియోగించి పడేసిన ఖాళీ కవర్లు కనిపించాయి. ఈ ఘట న తెలియడంతో పట్టణవాసులు, విద్యార్థుల తల్లి దండ్రులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నా రు. దుకాణాల్లో కొనుగోలు చేసిన బోనోఫిక్స్ను కర్చీఫ్లు, కవర్లలో వేసుకుని యువత మత్తు కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. బోనోఫిక్స్ పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు చెడిపోవడంతో పాటు ఇతర వ్యాధులు వస్తాయని, సైడ్ఎఫెక్ట్లకు దారితీసే ప్ర మాదముందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటి కై నా సంబంధిత అధికారులు బోనోఫిక్స్ విక్రయాలపై నిఘా పెట్టాలని, యువతకు దురలవాట్లపై అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
మహిళా సమాఖ్యకే ‘ట్రిపుల్ఐటీ యూనిఫాం’
నిర్మల్: రాష్ట్రస్థాయిలోనే ఉత్తమ సేవలతో దూసుకుపోతున్న జిల్లా మహిళా సమాఖ్య మరో గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పటికే స్కూల్ యూనిఫాంలను కుడుతున్న సమాఖ్య తాజాగా రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా గుర్తింపు ఉన్న బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల యూనిఫాంలనూ కుట్టించి ఇచ్చే పనిని దక్కించుకుంది. వేలాదిమంది విద్యార్థులుండే ట్రిపుల్ఐటీకి సంబంధించి రూ.54 లక్షల విలువైన యూనిఫాం కాంట్రాక్టు జిల్లా మహిళా సమాఖ్యకు దక్కడంపై డీఆర్డీవో విజయలక్ష్మి, సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గంగామణి హర్షం వ్యక్తంచేశారు. కలెక్టర్ అభిలాషఅభినవ్, ట్రిపుల్ఐటీ వీసీ గోవర్ధన్ సహకారంతో మహిళా సమాఖ్యకు ఈ గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. -
మూడో యూనిట్కు ముహూర్తమెప్పుడో!
● ఎస్టీపీపీలో 2015లో శంకుస్థాపన ● పనులు దక్కించుకున్న బీహెచ్ఈఎల్ ● పదేళ్లయినా ప్రారంభంకాని పనులు ● ఉపాధి కోసం నిరుద్యోగుల నిరీక్షణ జైపూర్: పదేళ్లయినా మండల కేంద్రంలోని ఎస్టీపీపీలో మూడో యూనిట్ ప్లాంట్ నిర్మాణం టెండర్ల దశలోనే నిలిచింది. 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ను విస్తరిస్తూ రెండు యూనిట్లకు అదనంగా మూడో యూనిట్ ఏర్పాటుకు 2015 మార్చిలో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న 600 మెగా థర్మల్ పవర్ ప్లాంట్ల ఎదుట మరో 600 మెగావాట్ల ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణలో భాగంగా సూపర్క్రిటికల్ విధానంతో 800 మెగావాట్ల ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు అనుమతించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నూతనంగా నిర్మించనున్న 800 మెగా వాట్ల థర్మల్ పవర్ ప్లాంట్కు అన్ని అనుమతులు పొందడానికి ఎనిమిదేళ్లు పట్టగా టెండర్లు ఖరారు కావడానికి మొత్తం 10 ఏళ్లు పట్టింది. రెండు దఫా లుగా సింగరేణి నిర్వహించిన టెండర్లలో రెండోసా రి బీహెచ్ఈఎల్ కంపెనీ దక్కించుకోగా సుమారు రూ.8,500కోట్ల అంచనా వ్యయంతో కొత్త ప్లాంట్ నిర్మించనున్నారు. టెండర్ల దశకు చేరుకోవడానికి పదేళ్లు పట్టగా పనుల ప్రారంభోత్సవానికి ముహూర్తం కాలిసి రావడం లేదు. ఓసారి ఉపముఖ్యమంత్రి ప్రోగ్రాం ఖరారై చివరి నిమిషంలో నేతల మధ్య వర్గపోరుతో రద్దయింది. ఉపముఖ్యమంత్రి పవర్ ప్లాంట్ సందర్శన, పలు ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉండగా వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. మళ్లీ సీఎం చేతుల మీదుగా కొత్త ప్లాంట్ ప్రారంభోత్సవం ఉంటుందని అందరూ భావించారు. గత నెలలో అధికార యంత్రాంగం సీఎం ప్రోగ్రాం ఉంటుందని హడావుడి చేసినా అది కూడా ఖరారు కాలేదు. అసలు కొత్త ప్లాంట్ ప్రారంభోత్సవానికి సమయమే కలిసిరావడం లేదని అభిప్రాయపడుతున్నారు. కాగా, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి ఇటీవల మంత్రి వర్గంలో చోటు దక్కింది. మంత్రి హోదాలో అతడు సీఎం రేవంత్రెడ్డి చే తుల మీదుగా ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తారని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆరు నెలలుగా కసరత్తు జరుగుతున్నా.. జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా నిరంతరం విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కాంతులు పంచుతోంది. సింగరేణి సంస్థకు ఇక్కడి వనరులు అనుకూలించడం ప్రధానంగా అంచనాకు మించి సేకరించిన భూములతో థర్మల్ విద్యుత్ కేంద్రాలను విస్తరించే దిశగా ఆదిలోనే అడుగులు వేసింది. అందులో భాగంగానే నూతనంగా మరో 800 మెగావాట్ల ప్లాంట్ను రూ.8,500కోట్ల అంచనాతో నిర్మించాల ని నిర్ణయించింది. కానీ, నిధుల సమీకరణలో జా ప్యం చోటు చేసుకుందో?.. లేదా ఆశించిన స్థాయిలో సింగరేణి సంస్థకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించిందో.. లేదో కానీ 800 మెగావాట్ల ప్లాంట్ పనులు 10 ఏళ్లుగా టెండర్ల దశలోనే నిలిచాయి. ఎట్టకేలకు మళ్లీ బీహెచ్ఈఎల్ కంపెనీ పనులు దక్కించుకోగా పనుల ప్రారంభోత్సవానికి ఆరు నెలలుగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పవర్ప్లాంట్లో కొత్త ప్లాంట్ నిర్మించే ప్రాంతాన్ని చదును చేసి అధికార యంత్రాంగం ఎదురుచూస్తోంది. రాజకీయ నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అధికారిక కార్యక్రమాలూ రద్దుకావడం అంతటా చర్చనీయాంశమైంది. కొత్త ప్లాంట్ నిర్మించనున్న ప్రాంతం ఉపాధి కోసం యువత నిరీక్షణఎస్టీపీపీలో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ పూర్తయితే ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని స్థానిక నిరుద్యోగ యువకులు, భూనిర్వాసితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా కొత్త ప్లాంట్ ప్రారంభమవుతుందని అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ దాని పనులు ప్రారంభం కాకపోవడంతో వారికి నిరాశే మిగులుతోంది. కొత్త ప్లాంట్ ని ర్మాణంతో ప్రభావిత గ్రామాలతో పాటు పరిసరప్రాంతాల్లో ఇక నిరుద్యోగ సమస్య పూర్తిగా తీరుతుందని అందరూ భావిస్తున్నారు. అయి నప్పటికీ ప్లాంట్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుండడం గమనార్హం. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి
కుంటాల: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరా ల ప్రకారం.. కుంటాలకు చెందిన బాస హన్మాండ్లు (58) సోమవారం రాత్రి వర్షంలోనే నిత్యావసరాల కోసం కిరాణా దుకాణానికి వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. తల వెనుక, ముందు భాగం బలమైన గాయాలయ్యాయి. అతడిని 108 అంబులెన్స్లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అతడి కుమారుడు గజేందర్ బతుకుదెరువు కోసం ఏడాదిన్నర క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. భార్య సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పిడుగుపాటుకు మహిళ మృతిభీంపూర్: మండలంలోని నిపా ని గ్రామానికి చెందిన కలిమి నాగమ్మ (48) మంగళవారంపిడుగుపాటుకు గురై మృతి చెందింది. వివరాలు.. నిపాని గ్రామానికి చెందిన నాగమ్మ అత్త కర్మకాండలో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీపూర్ గ్రామ సమీపంలోని చేను వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం రావడంతో బస్టాండ్ వద్ద ఆగిన సమయంలో పిడుగు పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెకు భర్త, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. మిస్సింగ్ కేసు నమోదుమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని హమాలీవాడ కు చెందిన ఓ మహిళ అదృశ్యమైనట్లు స్థానిక ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరా ల ప్రకారం.. హమాలీవాడకు చెందిన తారచాంద్శర్మ భార్య అంకిత (40) ఈ నెల 7న ఉదయం కూ రగాయలు తీసుకువచ్చేందుకు మార్కెట్కు వెళ్లింది. సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించారు. అయినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో తారచాంద్శర్మ మంగళవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఫిర్యాదువేమనపల్లి: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగా యంటూ మండలంలోని కొత్తపల్లి గ్రామ రైతులు మంగళవారం తహసీల్దార్ సంధ్యారాణికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సెంటర్లో జరిగే అవకతవకల గురించి వివరించి ఆధారాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో పీఏసీఎస్ ద్వారా 19 లారీల వడ్లు కొనుగోలు చేసిన నిర్వాహకులు 15 రోజులైనా రైతులకు రషీదులు, ట్రక్షీట్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఇలాంటివె న్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. విచారణ చేపడితే అక్రమాలు బయటపడతాయని తెలిపా రు. అక్రమాలపై సెంటర్ నిర్వాహకులను ప్రశ్నిస్తే రైతులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, నిలదీస్తే బెదిరిస్తున్నారని ఆరోపించారు. బుధవారం కలెక్టర్ను కూడా కలిసి తమ గోడు విన్నవించుకుంటామని వారు తెలిపారు. -
ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చర్యలు
ఆదిలాబాద్రూరల్: ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆది లాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో రౌ డీయిం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పే ర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధి లోని ఇందరమ్మ కాలనీకి చెందిన ఓ వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసి అతడి నుంచి రూ.2వేలు లా క్కున్న బంగారుగూడకు చెందిన షేక్ సలీంతో పా టు మరో ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసి రౌడీయిజం చేస్తే పోలీసులకు ఫి ర్యాదు చేయాలని, అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సీఐ ఫణిధర్, ఎస్సై విష్ణువర్ధన్ ఉన్నారు. -
తేనెటీగల దాడిలో ఆరుగురికి గాయాలు
తానూరు: మండలంలోని ఝరి(బి)తండా గ్రామ శివారులో మంగళవారం పత్తి విత్తనాలు విత్తుతున్న కూలీలపై ఒక్కసారిగా తేనెటీగలు దాడిచేయడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అస్వస్థతకు గురైన బాధితులను గ్రా మస్తులు 108 అంబులెన్స్లో భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. తేనెటీగల దాడిలో రాథో డ్ గోవర్ధన్, హరిదాస్, సుభాష్, ధన్రాజ్, దేవుకబాయి, శివరాజ్కు గాయాలయ్యాయి. బాధితులు ప్రస్తుతం భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జీసీసీ డీఎంగా పీహెచ్వోకు అదనపు బాధ్యతఉట్నూర్రూరల్: ఉట్నూర్ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) డివిజన్ మేనేజర్గా ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ ఉద్యాన అధికారి (పీహెచ్వో) సందీప్కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఎంగా పని చేసిన వీఎల్ఎన్ ప్రసాద్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లినందున తాత్కాలికంగా సందీప్కుమార్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు త్వరలో తెరచుకోనున్న నేపథ్యంలో ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సూచన మేరకు సందీప్కు అదన పు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన సందీప్ను జీసీసీ సిబ్బంది గోవింద్రావు, లింబారావు, సత్యనారాయణ తదితరులు సన్మానించారు. మొక్కలు తొలగించి, చెట్లు నరికి నిరసనకడెం: రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామస్తుల ఆందోళన రెండోరోజూ కొనసాగింది. మంగళవారం గ్రామస్తులు మరిన్ని గుడిసెలు వేసి అక్కడే వంట చేసుకుని మకాం వేశారు. ఉడుంపూర్ ఎఫ్ఆర్వో అనిత ఎదుటే రాంపూర్ గిరిజనులు ప్లాంటేషన్లో మొక్కలు తొలగించారు. చెట్లు నరికి నిరసన తెలిపారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఎఫ్డీవో భవానీశంకర్ ఇరు గ్రామాల గిరిజనులతో మాట్లాడినా వారు వినలేదు. తమ డిమాండ్లు నెరవేర్చేదాకా కదిలేది లేదని తేల్చిచెప్పారు. -
ఆటో బోల్తాపడి ఒకరి మృతి
● ఐదుగురికి గాయాలు ముధోల్: మండలంలోని బోరిగాం, వడ్తాల గ్రామాల మధ్య ఆటో బోల్తా పడ్డ ఘటనలో బ్రహ్మణ్గావ్కు చెందిన రొడ్డ ముత్యం (50) మృతి చెందగా, ఐదుగురికి గాయాలైనట్లు ఎస్సై పెర్సీస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బాసర మండలం కిర్గుల్(కే) గ్రామానికి చెందిన ఆటోలో మంగళవారం లోకేశ్వరం మండలం అబ్ధుల్లాపూర్ గ్రామానికి తమ బంధువు అంత్యక్రియలకు ముత్యం వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడడంతో గాయాల పాలైనవారిని భైంసా ఏరియాస్పత్రికి తరలిస్తుండగా తీవ్రంగా గాయపడ్డ ముత్యం మార్గ మధ్యలో మృతి చెందాడు. గాయపడ్డ వారిలో బాసర మండలం కిర్గుల్(కే) గ్రామానికి చెందిన బుజ్జవ్వ, కాశీ, ముధోల్ మండలంలో బ్రహ్మణ్గావ్ గ్రామానికి చెందిన లక్ష్మి, గంగన్న, రువ్వి గ్రామానికి చెందిన శ్యామల ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. -
బ్లాక్ స్పాట్ల గుర్తింపు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు మంగళవారం మంచిర్యాల రూర ల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్రా జ్, కమిషనరేట్ రోడ్డు భద్రతా విభాగం హెడ్ కాని స్టేబుల్ చంద్రశేఖర్, ఆర్అండ్బీ ఏఈఈ రవికిరణ్, జాతీయ రహదారి జేఈ సతీశ్, పంచాయతీ రాజ్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, రోడ్డు భద్రత కమిటీ సభ్యులు పోలీస్స్టేషన్ పరిధిలో ప్రమాదా లు జరిగే ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యంగా గ్రామాల రహదారులు జాతీయ రహదారిని సమన్వయం చేసే ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు గాను స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, జాతీయ రహదారిపై రంబుల్ స్ట్రిప్స్ లైటింగ్ పెంచడం, సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, అవసరమైన ప్రాంతాలతో పాటు వారసంతల వద్ద బారికేట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలి
మంచిర్యాలక్రైం: అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలని కవ్వాల్ టైగర్జోన్ ఫీల్డ్ డైరెక్టర్(ఎఫ్డీపీటీ) శాంతారాం అన్నారు. మంగళవారం నస్పూర్లోని సమావేశమందిరంలో వన్యప్రాణుల సంరక్షణపై క్షేత్రస్థాయిలో అటవీ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని అన్నారు. జంతువులను కాపాడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నైపుణ్యం కలిగిన వారితో ప్రత్యేక శిక్షణ అవసరమని అన్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 50మందికి గన్ఫైరింగ్తో కూడిన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్సింగ్, ఏ.శంకరన్, సయ్యద్ మోహినొద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
పంట సాగులో రైతులకు చేయూత
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: పంట సాగులో రైతులకు సాగునీరు, రుణాలు, ఎరువులు, విత్తనాలు ఇతర అన్ని విధాలుగా చేయూత అందిస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టర్ సమావేశ మందిరంలో మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతితో కలిసి వానాకాలం సాగు సంసిద్ధత సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పౌల్ట్రీ, డెయిరీ ఫారాలు, చేపల పెంపకం, పట్టు పరిశ్రమ, పెరటి కోళ్ల పెంపకం ఇతర అంశాలపై రాయితీ రుణాలు అందించి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎరువులు, వరి, పత్తి విత్తనాలు సరిపడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ పంట మార్పిడి విధానాన్ని అవలంబించి వాణిజ్యం, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవడం ద్వారా అధిక దిగుబడితోపాటు భూసారం పెంపొందుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ, మార్కెట్ కమిటీ అధికారులు, చైర్మన్ ప్రేమ్చంద్, అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి సింగతి మురళి, బ్యాంకు అధికారులు, ఫర్టిలైజర్ షాపుల యజమానులు, రైతులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు మంచిర్యాలరూరల్(హాజీపూర్): భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు. మంగళవారం హాజీ పూర్ మండలం వేంపల్లి, పెద్దంపేట గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తుతోపాటు రిజిష్టర్డ్ దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు జతపరిస్తే త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని అన్నారు. తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్పాండే, నాయబ్ తహసీల్దార్ అతీశ్, గిర్దావర్లు మంగ, ప్రభు పాల్గొన్నారు. అనంతరం దొనబండ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, వంటశాల పరిసరాలను పరిశీలించి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలన్నారు. -
సాగులో సందేహాలా..!
పాఠశాలల్లో మెనూ అమలు చేయాలిబెల్లంపల్లి: పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సందేహాలను వ్యవసాయ శాస్త్రవేత్త దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది. బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. వర్షాధారంగా పత్తి, వరి, కంది, పెసర, మొక్కజొన్న తదితర పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు నూతన సాగు పద్ధతులు, వంగడాలు, అధిక దిగుబడి సాధించే తీరు, చీడపీడల నివారణ, పంటల మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలపై బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్, శాస్త్రవేత్త కోట శివకృష్ణ దృష్టికి తీసుకెళ్లి తెలుసుకోవచ్చు.సమయం : నేడు మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల వరకు సంప్రదించాల్సిన నంబరు : 83338 18267 -
21నుంచి సీపీఐ జిల్లా మహాసభలు
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలో ఈ నెల 21, 22వ తేదీల్లో సీపీఐ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ స భ్యుడు కలవేన శంకర్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రామసుధా రెసిడెన్సిలో మహాసభల నిర్వహణ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21న ప్రదర్శన మహాసభ, 22న ప్రతినిధుల సభ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి హాజరవుతారని అన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, నాయకులు మేకల దాసు, మిట్టపల్లి పౌలు, వెంకట స్వామి, రేగుంట చంద్రశేఖర్, ఖలిందర్ అలీఖాన్, ముష్కె సమ్మయ్య, రేగుంట చంద్రకళ, లింగం రవి పాల్గొన్నారు. -
ప్రయాణికులపై ఆర్టీసీ బాదుడు
● పెరిగిన బస్సుపాస్ చార్జీలు ● మంచిర్యాల–హైదరాబాద్కు టోల్ వాత ● కిలోమీటర్ల రౌండప్ చార్జీలతో అదనపు భారం బస్పాస్ చార్జీలు తగ్గించాలిఆర్టీసీ బస్సుపాస్ చార్జీలు తగ్గించాలి. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. చార్జీల పెంపుతో గ్రామీణ విద్యార్థులపై పె నుభారం పడుతుంది. మూడు నెలల ప్యాకేజీని రూ.1200 నుంచి రూ.1800 వరకు పెంచారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంటు చెల్లించకుండా బస్చా ర్జీలు పెంచడం సరికాదు. పెంచిన 20శాతం బస్సుచార్జీలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లని మంగళవారం ఆర్టీసీ డిపో కార్యాలయంలో వినతిపత్రం అందజేశాం. – బి.అభిరాం, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపింది. టోల్ప్లాజా దారుల్లో యూజర్ చార్జీలను ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.10 వసూలు చేస్తోంది. డిజీల్, ఇతరత్రా పెరిగిన ఖర్చుల సాకుతో అన్ని రకాల బస్పాస్ల ధరలూ పెంచింది. పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కిలోమీటరు రౌండప్, టోల్ యూజర్, బస్పాస్ చార్జీ(రౌండెడ్ అప్)ల పేరిట ప్రయాణికులపై భారం మోపడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. యూజర్ చార్జీలు రూ.10, బస్పాస్ ధరలు రూ.300కు పైగా పెంచడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో 146 బస్సులు ప్రతీ రోజు 62వేల కిలోమీటర్ల తిప్పడం ద్వారా రూ.34లక్షల నుంచి రూ.36లక్షల(మహాలక్ష్మి) మేర ఆదాయం సమకూరుతోంది. పెంచిన బస్చార్జీలు(టోల్ యూజర్ చార్జీ) వల్ల మంచిర్యాల నుంచి హైదరాబాద్కు వెళ్లే ఒక్కో ప్రయాణికుడిపై రూ.10 చొప్పున మూడు టోల్ప్లాజాలు ఉండడం వల్ల రూ.30 వరకు అదనపు భారం పడుతోంది. మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వెళ్లే బస్సుల్లో రూ.10 టోల్ వసూలు చేస్తున్నారు. యాపల్ వరకు మినహాయిస్తే సోమగూడెం, బెల్లంపల్లి, తాండూర్, కాగజ్నగర్, ఆసిఫాబాద్కు వెళ్లే బస్సుల్లో ప్రతీ ప్రయాణికుడిపై రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇంకోవైపు కిలోమీటరు రౌండప్ చార్జీలు వసూలు చేస్తున్నారు. మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ వెళ్లే ప్రయాణికులపై రూ.10 అదనపు భారం పడుతోంది. ఉదాహరణకు ఆదిలాబాద్ 166కిలోమీటర్లు కాగా 170 రౌండప్ కిలోమీటర్లు చేయడం వల్ల రూ.220 ఉంటే రూ.230 వసూలు చేయనున్నారు. మందమర్రి 13కిలోమీటర్లు ఉంటే 15 చేస్తారు. చిల్ల ర రౌండప్ పేరిట పెంచి రూట్లలో మాత్రం అన్ని మార్గాల్లో(స్టేజీలు) కిలోమీటరు రౌండప్ మార్చకపోవచ్చు. కిలోమీటర్లు ఏయే మార్గాల్లో అనేది స్పష్టత రావాల్సి ఉంది. మంచిర్యాల నుంచి కరీంనగర్, కాగజ్నగర్ వైపు వెళ్లే అన్ని రకాల బస్సుల్లో పాత చార్జీల కంటే రూ.10 పెరిగింది. బస్సుపాస్లపై చార్జీల మోత అన్ని రకాల బస్పాస్ చార్జీలు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. 20శాతం మేర బస్సుపాస్ ధరలు పెంచింది. రూ.1150 ఉన్న ఆర్డీనరి బస్పాస్ ధర రూ.1400కు పెరిగింది. జిల్లాలో 499సీజనల్ పాస్లు, 777 స్టూడెంట్ పాస్లు ఉన్నాయి. నెలవారీ పాస్లు తీసుకునే వారి నుంచి 20రోజులు టికెట్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం బస్పాస్ ధర రూ.1750 ఉంటే రూ.2150వరకు పెరిగింది. విద్యాసంస్థలు ప్రారంభమైతే ఎంతమేర స్టూడెంట్ పాస్ చార్జీలు పెరిగాయో తెలుస్తుంది. బస్చార్జీల బాదుడుకు అదనంగా బెల్లంపల్లి, కాగజ్నగర్ రూట్లలో ప్రయాణికులకు టోల్ యూజర్ చార్జీల భారం రూ.10 పడనునంది. ఓ వైపు ఉచితం.. మరోవైపు వాత కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. దీంతో ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. మరోవైపు టోల్చార్జీలు, బస్పాస్ చార్జీలు, కిలోమీటర్ రౌండప్ పేరిట వాత పెడుతోంది. అక్కడ లోకల్ టోల్ మినహాయింపు.. ఆర్టీసీ బస్సులకు టోల్గేట్ వద్ద లోకల్ కన్సెషన్తో ప్రయాణికులపై భారం తగ్గించవచ్చు. ప్రస్తుతం రూ.30 టికెట్ ధర ఉంటే రూ.40 వసూలు చేస్తున్నారు. మంచిర్యాల డిపో నుంచి 20 నుంచి 30కిలోమీటర్లు ఉంటే జిల్లాలో రిజిస్ట్రేషన్ అయిన బస్సులకు లోకల్ కన్సెషన్ వర్తింపు ద్వారా టోల్చార్జీల భారం తగ్గించవచ్చు. బెల్లంపల్లి, కాగజ్నగర్, ఆసిఫాబాద్ వైపు వెళ్లే బస్సులకు మందమర్రి టోల్గేట్ వద్ద లోకల్ కన్సెషన్ ఇవ్వడం వల్ల రూ.10 భారం తగ్గించే వీలుంది. ఉమ్మడి జిల్లాలోని దిలావర్పూర్ టోల్గేట్ వద్ద లోకల్ కన్సెషన్ కింద బస్సులకు సున్న చార్జీలు పడుతున్నట్లు తెలుస్తోంది. మందమర్రి టోల్గేట్ దగ్గర కూడా మినహాయించాలని పలువురు కోరుతున్నారు. మంచిర్యాల–హైదరాబాద్ చార్జీలు(టోల్ యూజర్ చార్జీ కలిపి)బస్సులు పాత బస్సు చార్జీలు పెరిగిన చార్జీలుసూపర్ లగ్జరీ రూ.470(జెబీఎస్) రూ.500 రాజధాని రూ.600(జేబీఎస్) రూ.630 లహరీ నాన్ ఏసీ రూ.480 రూ.510 లహరీ ఏసీ రూ.620 రూ.650 ఎక్స్ప్రేస్ రూ.360 రూ.390 -
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
పాతమంచిర్యాల: సమస్యలు పరిష్కరించాలని డి మాండ్ చేస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్కు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మ ద్దూరి రాజుయాదవ్, కమలాకర్ మాట్లాడుతూ ఈపీఎఫ్–95 కనీస పింఛన్ రూ.1000నుంచి రూ. 5000 వెంటనే చెల్లించాలని, ఈపీఎఫ్ వేతన పరి మితి రూ.15000 నుంచి రూ.30000 పెంచాలని, ఈఎస్ఐ పరిమితిని రూ.21000 నుంచి రూ.42000 పెంచాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై తక్షణమే నిషధం విధించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, ప్రభాకర్, మొగిలి, తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ
● రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి మంచిర్యాలఅగ్రికల్చర్: నూతన పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులుగా ప్రభుత్వ, ఒప్పంద ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఇతర శాఖల ఉద్యోగులను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఒక పోలింగ్ కేంద్రంలో 1200 మంది ఓటర్లు మాత్రమే ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్రావు, హరికృష్ణ పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
భైంసాటౌన్: పట్టణంలోని గీతా కాటన్ ఇండస్ట్రీస్లో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న చంద్రకాంత్ దేశ్ముఖ్ అనే వ్యక్తి సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. కుభీర్ మండలం వర్నికి చెందిన చంద్రకాంత్ కొన్నేళ్లుగా రాహుల్నగర్లో ఉంటూ, గీతా కాటన్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఫ్యాక్టరీలో ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయమై పట్టణ సీఐ జి.గోపినాథ్ను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. గంజాయి దహనంఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లాలో నమోదైన 14 కేసుల్లో పట్టుబడ్డ 77 కిలోల 781 గ్రాముల గంజాయిని దహనం చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి వద్ద గల శ్రీ మెడికేర్ సర్వీసెస్ సెంటర్ వద్ద గంజాయి డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు డీసీఆర్బీ డీఎస్పీ సీహెచ్ నాగేందర్, డీసీఆర్బీ ఎస్సై హకీమ్లు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులో అధికారుల నిలదీతదండేపల్లి: మండలంలోని తాళ్లపేటలో సోమవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో రెవెన్యూ అధికారులను గ్రామానికి చెందిన కొందరు సమస్యలపై నిలదీశారు. గ్రామానికి చెందిన ఎండీ రశీద్ఖాన్ డీఎస్ పెండింగ్ కోసం దరఖాస్తు చేసుకుంటే రిజెక్ట్ చేయడంతో సమస్య పరిష్కారం కాలేదని, సదస్సుకు హాజరైన డీటీ మాధవి, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు లావణ్య, ప్రవీణ్లను ప్రశ్నించారు. అధికారులు కొందరికి అనుకూలంగా, మరికొందరికి ప్రతికూలంగా పనులు చేస్తున్నారని ఆరోపించారు. రశీద్ఖాన్తో పాటు నర్సయ్య అనే మరో రైతు సైతం అధికారులను తన సమస్యపై ప్రశ్నించాడు. మండలంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తాళ్లపేటలోనే భూ సమస్యలపై 57, సాదాబైనామాలకు సంబంధించి 79 దరఖాస్తులు వచ్చాయి. -
ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
మంచిర్యాలటౌన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే రెండు రోజుల క్రికెట్లీగ్ పోటీల కోసం ఉమ్మడి జిల్లా నుంచి క్రికెట్ జట్టు ఎంపిక చేసినట్లు హెడ్కోచ్ పి.ప్రదీప్, సెలెక్టర్లు గోదావర్తి సుధీర్, చందు, పత్తి తిరుపతి, బి.రాకేశ్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 90 మంది క్రీడాకారులు రాగా, వారిని ఆరు జట్లుగా విభజించి, ఎంపిక పోటీలు నిర్వహించామన్నారు. అందులో ప్రతిభ కనబర్చిన వారిని అండర్ 25 ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారిలో మంచిర్యాలకు చెందిన సాయికృష్ణారెడ్డి, ఐ. సందీప్, ఇజాన్ అవాజ్, అశ్రిత్, ఎండీ జాంషెడ్, చరణ్, ఆసిఫాబాద్ నుంచి ఏ.సంతోష్, మందమర్రి నుంచి సింహాద్రి, రామ్యాదవ్, లక్ష్మణ్ యాదవ్, సాయి వర్మ, వేంపల్లి నుంచి సాత్విక్ పటేల్, నిర్మల్ నుంచి వినయ్, ఆదిలాబాద్ నుంచి శ్రీచరణ్, చందన్, దర్శ్ అగర్వాల్, ముసాదిక్, రాజబాబు, గుడిపేట్ నుంచి జే. సంతోష్, బెల్లంపల్లి నుంచి సుభాష్ చంద్రబోస్లు ఎంపికై నట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయించే వ్యక్తిపై కేసుఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్రూరల్ మండల పరిధిలోని బెల్లూరి శివారు ప్రాంతంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న గోలి మనోజ్ కుమార్పై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు సోమవారం టాస్క్ఫోర్స్ పోలీసులు దుకాణంలో తనిఖీలు చేశారు. షాపులో రెండు నకిలీ విత్తన ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఎలాంటి అనుమతి లేకుండా 227 ప్యాకెట్లను నిల్వ ఉంచాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు. ఏవో నగేశ్ రెడ్డి, ఆర్ఐ నారాయణలు ఉన్నారు. మద్యానికి బానిసై ఆత్మహత్యనేరడిగొండ: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన లక్ష్మణ్ (32) మద్యానికి బానిసై సోమవారం మండలంలోని చించోలి గ్రామ సమీపంలో గల వాగులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది నుంచి లక్ష్మణ్ తాగుడికి బానిసై దొంగతనాలు చేసే వాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఆదివారం తన పక్కింట్లో 11 గ్రాముల బంగారం దొంగలిస్తూ పట్టుబడడంతో పంచాయతీ నిర్వహించి గ్రామపెద్దలు మందలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
భూ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి
బెల్లంపల్లి పట్టణ శివా రులోని సర్వే నంబ రు 170లో ఐదు ఎకరాల భూమిని 1990లో అప్పటి ప్రభుత్వం సుభాష్నగర్, ఇంక్లైన్ బస్తీలోని రజకులకు ఇచ్చింది. ఇందులో కొందరు ఇళ్లు, బేస్మెంటు వరకు నిర్మించుకున్నారు. మిగతా వారికి ఆర్థిక స్థోమత లేక నిర్మించుకోలే దు. మా భూమిని బెల్లంపల్లికి చెందిన శంకర్ దౌర్జన్యంగా చదును చేశాడు. అడ్డుకుంటే దుర్భాషాలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. భూమి కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి. – బెల్లంపల్లిలోని వివిధ కాలనీల బాధితులు -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ● సొంత ఇంటి స్థలం ఉన్న తనకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఆర్థికసాయం అందించాలని చెన్నూర్ మండలం ఒతుకులపల్లి గ్రామానికి చెందిన మద్దూరి అఖిల కోరింది. ● మా తాత పేరిట ఉన్న భూమిని ఇతరులు అక్రమంగా పట్టా చేసుకున్నారని మందమర్రికి చెందిన నాగుల కార్తీక్ ఫిర్యాదు చేశాడు. ● దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన నిమ్మల బాపు, తాను కొనుగోలు చేసిన భూమిని తన పేరిటా పట్టామార్పిడి చేయాలని హాజీపూర్ మండలం నంనూర్ గ్రామానికి చెందిన దుర్గయ్య అర్జీ అందజేశారు. ● నస్పూర్ మండలం సీతారాంపల్లి శివారులో తనకు వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తున్నారని జగిత్యాల జిల్లా జిల్లా బుగ్గారం మండలం గోపులపూర్ గ్రామానికి చెందిన నర్వేసి అస్మిత ఫిర్యాదు చేసింది. ● రేషన్కార్డు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు అందించానని, గతంలో మహారాష్ట్రలో ఉంటే తొలగించి ఇక్కడ దరఖాస్తు చేసుకున్నానని, మళ్లీ మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారని మందమర్రి పట్టణంలోని దీపక్నగర్కు చెందిన మాటురి ఆనంద్ దరఖాస్తు అందజేశాడు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ -
చేపమందుకు విశేష స్పందన
దండేపల్లి: ఉబ్బసం వ్యాధి నివారణకు మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా దండేపల్లిలో రంగసాయి ప్రేంరాజ్–భూలక్ష్మీ దంపతులు సోమవారం నిర్వహించిన ఉచిత చేప మందు పంపిణీకి విశేష స్పందన లభించింది. కార్యక్రమాన్ని రాష్ట్ర గిరిజన సహాకార చైర్మన్ కోట్నాక తిరుపతి ప్రారంభించారు. దూర ప్రాంతాలవారు మందు కోసం ఒక రోజు ముందే వచ్చారు. పంపిణీ సమయంలో వర్షం పడడంతో కొంత ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు వివిధ జిల్లాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. గ్రామానికి చెందిన పలువురు వాలంటీర్లుగా సేవలు అందించారు. ఎస్సై తహాసీనొద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
● నేటి నుంచి 17వరకు ప్రత్యేక కార్యక్రమాలు ● జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారుల ఏర్పాట్లు ● చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడమే లక్ష్యం
కార్యక్రమాలు ఇలా...● 10న అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, తల్లిదండ్రుల గ్రూప్ సెల్ఫీ, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశం నిర్వహిస్తారు. ● 11న మూడేళ్లు పైబడిన చిన్నారుల నివాసాలను సందర్శించి అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, పిల్లలను చేర్చేలా ప్రోత్సహించడం చేపడుతారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు దాటిన పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి ప్రైమరీ స్కూళ్లలో చేర్పిస్తారు. ● 12, 13, 16న పోషణ కిచెన్ గార్డెన్, పోషకాహార వివరాలను వివరిస్తూ స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలి. చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ● 17న అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిదండ్రులు, గ్రామపెద్దల సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలి.మంచిర్యాలలో అమ్మమాట–అంగన్వాడీ బాట ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు(ఫైల్)మంచిర్యాలటౌన్: అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గత ఏడాది నుంచి వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశాలను పెంచే కార్యక్రమంలో భాగంగానే గత ఏడాది నుంచి ‘అమ్మ మాట–అంగన్వాడీ బాట’ పేరిట విద్యాసంవత్స రం ఆరంభంలోనే పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నెల 10 నుంచి 17వరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ‘అమ్మ మాట–అంగన్వాడీ బాట’ కార్యక్రమాల నిర్వహణకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. మూడేళ్ల చిన్నారులు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లో చేరేలా, ఐదేళ్లు దాటిన వారిని దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పౌష్టికాహారం, విద్య జిల్లాలో 969 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 3నుంచి 6ఏళ్ల వయస్సు గల పిల్లలు 17,891 మంది ఉన్నారు. వీరిలో 5–6ఏళ్లలోపు చిన్నారులు 2,579మంది ఉన్నారు. ఐదేళ్లు పూర్తయిన వారిని పాఠశాలల్లో చేర్పిస్తే చిన్నారుల సంఖ్య తగ్గుతుంది. దీంతో మూడేళ్లు దాటిన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుని వారిని అంగన్వాడీ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. కేంద్రానికి వచ్చే చిన్నారులకు భోజనం, గుడ్డు, మురుకులు అందజేస్తున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కేంద్రాల్లోనే ఉండి పూర్వ ప్రాథమిక విద్య అభ్యసిస్తున్నారు. ఆటపాటలు, కథలతోపాటు సంభాషణ నైపుణ్యాలు నేర్పించి చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు అలవర్చుకునేలా సంసిద్ధం చేస్తున్నారు. ఆరేళ్ల వరకు పూర్వప్రాథమిక విద్యను అందిస్తూ.. ఆ తర్వాత నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా కార్యక్రమాలు చేపడుతారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకునేలా అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి వివరిస్తారు. రెండున్నరేళ్లు పూర్తయిన చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. ఖాళీలతో సతమతం జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, మంచిర్యాల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 969 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 907 మంది టీచర్లు, 716 మంది ఆయాలు పని చేస్తున్నారు. 62 టీచర్, 253 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలను పక్కనే ఉండే మరో కేంద్రానికి చెందిన టీచర్లు, ఆయాలతో నిర్వహిస్తున్నారు. దీంతో రెండు కేంద్రాల పర్యవేక్షణ టీచర్లకు కష్టంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల బలోపేతం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నా ఖాళీలను భర్తీ చేస్తేనే లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో సేవలు అందే అవకాశం ఉంది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఖాళీలు భర్తీ చేస్తే చిన్నారులను చేర్చేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చే అవకాశం ఉంది.చిన్నారులను చేర్పించేలాజిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్లు దాటిన చిన్నారులను చేర్పించేందుకు అమ్మమాట–అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. ఐదేళ్లు దాటిన చిన్నారులను దగ్గరలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడం, చిన్నారులకు అందించే పౌష్టికాహారం, పూర్వపు ప్రాథమిక విద్యపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. – రౌఫ్ఖాన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి -
బడిలో ప్రవేశాల పెంపే లక్ష్యం
పంటల సాగులో సందేహాలా..!బెల్లంపల్లి: పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సందేహాలను వ్యవసాయ శాస్త్రవేత్త దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది. బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. వర్షాధారంగా పత్తి, వరి, కంది, పెసర, మొక్కజొన్న తదితర పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు నూతన సాగు పద్ధతులు, వంగడాలు, అధిక దిగుబడి సాధించే తీరు, చీడపీడల నివారణ, పంటల మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలపై బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్, శాస్త్రవేత్త కోట శివకృష్ణ దృష్టికి తీసుకెళ్లి తెలుసుకోవచ్చు.సమయం : బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల వరకు సంప్రదించాల్సిన నంబరు : 83338 18267 -
అర్హులకే పథకాలు అందించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: అర్హులైన నిరుపేదలకు రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ మాట్లాడుతూ సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా, పాన్కార్డును పరిగణనలోకి తీసుకోకుండా రాజీవ్ యువ వికాసం అర్హులైన యువతకు అందించాలని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇందిరమ్మ ఇళ్ల మొదటి జాబి తాలో చేర్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, పట్టి వెంకటకృష్ణ, దుర్గం అశోక్, అకుల అశోక్వర్ధన్, ఎనగందుల క్రిష్ణ, పులుగం తిరుపతి, స త్రం రమేష్, జీవీ ఆనంద్కృష్ణ, బొలిశెట్టి అశ్వి న్, నాగేశ్వర్రావు, సదానందం, రాజమౌళి, చక్రి, రాజేశం, సత్యనారాయణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’పై దాడులు అమానుషం
కరీంనగర్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్, ఆంధ్రప్రదేశ్లోని ‘సాక్షి’ కార్యాలయాలపై దుండగుల దాడిని ఖండిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని సాక్షి యూనిట్ ఆఫీస్ వద్ద జర్నలిస్టులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ మీడియా స్వేచ్ఛను కాలరాస్తూ అణచివేయాలని చూడడం దారుణమన్నారు. నిరసనలో యూనిట్ మేనేజర్ వైద శ్రీనివాస్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎడిషన్ ఇన్చార్జీలు ముజఫర్, గుర్రాల మహేశ్, డెస్క్ జర్నలిస్టులు బొగ్గుల సంతోష్, ములుకుంట్ల కనకేశ్వర్, మామిండ్ల బాలనర్సయ్య, డి.రాజశేఖర్, పోలు సంపత్, దూట వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. -
పొట్టకూటి కోసం వెళ్లి అదృశ్యం
● గల్ఫ్దేశంలో జాడ తెలియని నిర్మల్ జిల్లావాసి ● ఆందోళనలో కుటుంబసభ్యులు ● ఇండియాకు రప్పించాలని వినతి నిర్మల్ఖిల్లా: పొట్టకూటి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన జిల్లాకు చెందిన ఓ కార్మికుడి ఆచూకీ తెలియక అతడి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్కు చెందిన పన్నాల శ్రీనివాస్(40) గత 16 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో తోటమాలిగా పనిచేస్తున్నాడు. ప్రతీ రెండూ, మూడేళ్లకొకసారి ఇంటికి వస్తూ పోతుండేవాడు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తాజాగా ఎనిమిది నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చిన శ్రీనివాస్ ఇక ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే సౌదీ అరేబియాలోని తన యజమాని వచ్చి పనిలో చేరాలని కోరగా గత మే నెలలో మళ్లీ వెళ్లాడు. అక్కడ యజమాని ఇంట్లో రెండు రోజులు ఉన్న అనంతరం వ్యవసాయ క్షేత్రానికి పంపగా అక్కడి నుంచి తన భార్యాపిల్లలకు ఫోన్ చేసి క్షేమ సమాచారం అందించాడు. అనంతరం అతని నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అక్కడి యజమానికి ఫోన్ చేయగా స్పందించలేదని, శ్రీనివాస్ క్షేమసమాచారంపై తమకు ఆందోళనగా ఉందని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో శ్రీనివాస్ తల్లి గంగవ్వ, భార్య మమత, ముగ్గురు పిల్లలు వాపోయారు. సౌదీ అరేబియా నుంచి స్వస్థలానికి రప్పించే ఏర్పాటు చేయాలని వేడుకున్నారు. అనంతరం రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను కలిసి పూర్తి వివరాలు అందజేశారు. అక్కడి ఎంబసీతో మాట్లాడి శ్రీనివాస్ ఆచూకీ గుర్తించే ప్రయత్నం చేస్తామని కుటుంబసభ్యులకు ఆయన భరోసానిచ్చారు. -
లారీలో అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత
భీమారం: మహారాష్ట్ర నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న 35 పశువులను సోమవారం భీమారం సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పెద్దఎత్తున పశువులను లారీల్లో తరలిస్తున్నారనే సమాచారం మేరకు భీమారంలో తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న లారీని ఆపగా లారీ డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. పారిపోతున్న డ్రైవర్ను వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించగా ఎద్దులను మహారాష్ట్ర నుంచి జగిత్యాల జిల్లా రాజరాంపల్లికి తరలిస్తున్నామని తెలిపాడు. అనంతరం లారీని పోలీస్స్టేషన్కు తరలించారు. లారీ డ్రైవర్ రుక్సాకా, యజమాని పంకజ్ గోపాల్ సింగ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్వేత తెలిపారు. పశువులను చెన్నూరు పట్టణం సమీపంలోని గోశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. కాగా వెటర్నరీ వైద్యుడు రాకేశ్ శర్మ పశువులకు పరీక్షలు నిర్వహించారు. -
దౌర్జన్యానికి పాల్పడిన ముగ్గురి రిమాండ్
ఆదిలాబాద్రూరల్: దౌర్జన్యానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన బాలు అనే వ్యక్తి బంగారుగూడకు చెందిన షేక్ ముజ్జు అనే వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఈక్రమంలో అధిక వడ్డీ కోసం ఆదివారం ఆయన ఇంటికి షేక్ సలీమ్, షేక్ సమీర్లతో వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఆయన వద్ద నుంచి రూ.2వేల నగదు లాక్కున్నారు. దీంతో బాధితుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితుల నుంచి వాహనం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
‘విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి’
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందిరా మహిళా భవనాలు, మహిళా సంఘాల పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని గుర్తించాలని సూచించారు. సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అక్టోబర్ 2లోగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా విద్యాధికారి యాదయ్య, వెనుబడిన తరుగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం, రౌఫ్ఖాన్, తదితరులు పాల్గొన్నారు. రైతుల ఖాతాల్లో నగదు జమ మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో యాసంగి ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో రూ.360.10 కోట్లు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. 31,702 మంది రైతుల నుంచి 1,99,383 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. సన్నబియ్యం విక్రయిస్తే కార్డు రద్దు మంచిర్యాలఅగ్రికల్చర్: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఒకేసారి మూడు నెలలకు సరిపడా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని, అక్రమంగా విక్రయిస్తే చట్ట ప్రకారం కార్డు రద్దు చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ నెల 30వరకు బియ్యం పొందవచ్చని తెలిపారు. ఉపకరణాల కోసం దరఖాస్తుల స్వీకరణ మంచిర్యాలఅగ్రికల్చర్: దివ్యాంగులకు సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. రెట్రోఫిట్మెంట్ స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్లు, హైబ్రిడ్ వీల్ చైర్లు, ల్యాప్టాప్లు, చేతికర్రలు, ట్రై సైకిళ్లు, వీల్ చైర్స్, క్రచెస్, వాకింగ్ స్టిక్స్ మంజూరైనట్లు తెలిపారు. దివ్యాంగులు https//tgobmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు హెల్ప్లైన్ నంబర్ 155326లో సంప్రదించాలని తెలిపారు. -
‘ఖర్గే’ను కలిసిన మంత్రి వివేక్
చెన్నూర్: రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి తన సతీమణి సరోజ, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖా ర్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిశారు. సోమవారం ఢిల్లీలో వారిని కలి సి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ రా ష్ట్రంలో పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చే యాలని, రానున్న కార్పొరేషన్, మున్సిపాల్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా పని చేయాలని ఖర్గే సూచించినట్లు తెలిపారు. -
విప్లవ వీరుడా.. ఇక సెలవు..!
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ అంత్యక్రియలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ఆయన స్వగ్రామం పొచ్చెరలో కు టుంబ సభ్యులు, ప్రజాసంఘాలు, అభిమానుల మధ్య ముగిశాయి. అడెల్లు అంతిమయాత్రలో గ్రా మం ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. ఆదివారం రార తి బీజాపూర్ నుంచి పొచ్చెర గ్రామానికి ఆడెల్లు మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. అడెల్లు భౌతికకాయంపై ఎర్రని వస్త్రం ఉంచి నివాళులర్పించారు. సోమవారం ఉదయం బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), సీపీఐ డెమొక్రటిక్, ప్రజాసంఘాల నాయకులు, మాజీ మావోయిస్టులు, అభిమానులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అడెల్లు భౌతికకాయానికి నివాళులర్పించా రు. గ్రామంలోని వీధుల గుండా అంతిమయాత్ర ని ర్వహించారు. పౌర హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, విరసం నేతలు, మాజీ మావోయిస్టులు, కళాకారులు పాటలు, నృత్యాలు చేస్తూ అడెల్లుకు నివాళులర్పించారు. ఎర్రజెండాలు చేతపట్టి, అడెల్లు అమర్రహే అంటూ నినాదాలు చేస్తూ అంత్యక్రియలో ముందుకుసాగారు. ‘ఆదివాసీలదే అడవి, కగా ర్ ఆపరేషన్ ఆపివేయాలని’ ప్లకార్డులు పట్టుకుని అంతిమయాత్ర నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర 3 గంటలకు ముగిసింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు అంతిమయాత్ర కొనసాగింది. ప్రజా సంఘా ల నేతలు సైతం కన్నీరుమున్నీరయ్యారు. మాజీ మావోయిస్టులు ఉద్యమంలో అడెల్లుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని విలపించారు. కాగా గ్రామంలోని వైకుంఠధామం వద్ద అడెల్లుకు అంత్యక్రియలు నిర్వహించారు. అడెల్లు అన్న పెద్ద అడెల్లు దహన సంస్కారం నిర్వహించారు. ‘చంపే హక్కు ఎవరికీ లేదు’.. అడెల్లు భౌతికకాయం వద్ద పౌర హక్కుల నాయకులు, అమరుల బంధు,మిత్ర సభ్యులు, మానవహక్కుల వేదిక నాయకులు, విప్లవ రచయిత సంఘం(విరసం) నేతలు మాట్లాడారు. ఒక మనిషిని చంపే హక్కు రాజ్యాంగం కల్పించలేదని, అలాంటిది రాజ్యాంగాన్ని విస్మరిస్తూ మావోయిస్టులను పిట్టల్లా చంపుతున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తే వారిని చంపుతారా అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భజంగ్ రావ్ అన్నారు. అడెల్లును పట్టుకుని, విషంతో కూడిన ఆహారం తినిపించి చెట్టుకు కట్టి కాల్చి చంపారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. మఫ్తీలో పోలీసులు.. అడెల్లు అంత్యక్రియల్లో పోలీసులు మఫ్తీలో ఉండి నిఘా వేశారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం అంత్యక్రియలు ముగిసే వరకు కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించారు. భౌతికకాయంపై ఎర్రజెండా కప్పుతున్న విరసం, అమరుల బంధుమిత్ర సభ్యులు 30 ఏళ్ల ఉద్యమ బాటకు ఇక సెలవు.. నూనూగు మీసాల వయస్సులో పేగు బంధాన్ని తెంచుకుని పోరు బాటలో నడిచి, చివరకు అడవిలో రక్తపు సింధూరమై 30 ఏళ్ల తరువాత స్వగ్రామానికి తిరిగి వచ్చిన అడెల్లు మృతదేహం ఎర్రని వర్ణపు తాకిడికి తడిసి ముద్దయింది. కట్టెలో తన మేను కాలినా, అంతిమయాత్రలో పాల్గొన్న అశేష జనాలను చూస్తే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాడని రుజువైంది. – బోథ్ ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయి : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మైలారపు అడెల్లు భౌతికకాయానికి బోథ్ ఎ మ్మెల్యే అనిల్ జాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడెల్లు సొంత లాభం కోసం పనిచేయలేదని, పేద ప్రజల కోసమే చిన్న వయస్సులోనే ఉద్యమంలోకి వెళ్లాడన్నారు. 30 ఏళ్ల పాటు ఉద్యమంలో ఉండి పేద ప్రజల పక్షాన నిలబడ్డాడని తెలిపారు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కగార్ పేరుతో చేపట్టిన ఎన్కౌంటర్లు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. ఇవి ఎన్కౌంటర్లు కావని పట్టుకొచ్చి కాల్చి చంపడమని ఆరోపించారు. అడెల్లు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా అంత్యక్రియలకు రూ.10 వేలు అందించారు. -
● ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన ● ‘సాక్షి’తో డీఈవో ఎస్.యాదయ్య
మంచిర్యాలఅర్బన్: ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల పెంపు, నాణ్యమైన విద్యాబోధన, ఉత్తమ ఫలితాల సాధననే విద్యాశాఖ లక్ష్యం. ఉచితంగా అందిస్తున్న యూనిఫాం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, బోధన తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం..’’ అని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య అన్నారు. మరో రెండ్రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో సోమవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు, పాఠశాలల నిర్వహణపై పలు విషయాలు వెల్లడించారు. సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు డీఈవో: ఈ నెల ఆరు నుంచి 19వరకు బడిబాట చేపడుతున్నాం. గ్రామసభలు, స్వయం సహాయక సంఘాల సమావేశాల నిర్వహణ, ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లల గుర్తింపు, కరపత్రాల ద్వారా ప్రచారం చేపట్టాం. సామూహిక అక్షరాభ్యాసం, విలీన విద్య, బాలల సభ, బాలిక విద్య, తరగతుల డిజిటలీకరణతోపాటు చివరి రోజున క్రీడాపోటీలు నిర్వహించనున్నాం. సర్కారు బడుల్లో బోధన తీరు, సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. సర్కారు పాఠశాలల్లో నాలుగు వేల మందికి పైగా ప్రవేశాలు చేపట్టేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. అడ్మిషన్లు ఎక్కువగా చేసే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను జిల్లా, రాష్ట్ర స్థాయిలో సన్మానిస్తాం. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ మాటేమిటి..? డీఈవో: బడులు ప్రారంభమైన తొలిరోజే అందరికీ పాఠ్యపుస్తకాలు, ఒక జత దుస్తులు పంపిణీ చేస్తాం. జిల్లాకు అవసరమైన 3,07,820 పాఠ్యపుస్తకాలకు గాను 2,98,670 పుస్తకాలు వచ్చాయి. ఇంకా 9, 10వ తరగతులకు పర్యావరణం పుస్తకాలు రావాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో అన్ని పుస్తకాలు రావొచ్చు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు 56వేల వర్క్బుక్స్ ఉచితంగా పంపిణీ చేయనున్నాం. 42,711 యూనిఫామ్లు అవసరం. పాఠశాల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు అందజేస్తాం. బడుల్లో చేపట్టిన పనులు పూర్తవుతాయా..? డీఈవో: సర్కారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 739 అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలతో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల నవీకరణ, మరమ్మతులకు రూ.22 కోట్లు కేటాయించారు. దాదాపుగా 95శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మన ఊరు–మన బడి కింద 245 పాఠశాలల్లో పనులు చేపట్టాం. ఇందులో అసంపూర్తి పనులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తాగునీరు, మరుగుదొడ్డి, ప్రహరీ వంటివి మొదలు కాకపోతే కలెక్టర్ అనుమతి ఇస్తామని తెలిపారు. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లతోపాటు కనీస వసతుల కల్పనలో ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కృత్రిమమేధ ఆధారిత అభ్యసనపై వివరించండి.. డీఈవో: ప్రాథమిక స్థాయిలో అభ్యసనలో తెలుగు, ఆంగ్లం, గణితంలో వెనకబడిన విద్యార్థులు నేర్చుకోవడం, నేర్చుకున్న దాన్ని స్వయంగా పరీక్షించుకోవడం, తద్వారా అభ్యసనలో చురుగ్గా పాల్గొనడం లక్ష్యాలుగా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత అభ్యసన కార్యక్రమం రూపొందించాం. గతేడాది ప్రయోగత్మకంగా 13 మండలాల్లో 22 ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేశాం. ఈ విద్యాసంవత్సరంలో 50శాతం అంతకంటే ఎక్కువ మంది 68 పాఠశాలల్లో అమలుకు చర్యలు వేగంగా సాగుతున్నాయి. విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు ఐదు కంప్యూటర్లు అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఉపాధ్యాయుల ఖాళీలు..డీఈవో: 2024 డీఎస్సీ ద్వారా వివిధ కేటగిరీల్లో 265 మంది ఉపాధ్యాయులను నియమించాం. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత అధిగమించాం. ఎక్కడైనా రిటైర్మెంట్లు, పలు కారణాల వల్ల ఉపాధ్యాయ ఖాళీలు ఉంటే కలెక్టర్ అనుమతితో సర్దుబాటు చేస్తాం. విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకుంటాం. అనుమతిలేని ప్రైవేట్ పాఠశాలలపై తీసుకుంటున్న చర్యలేమిటి..?డీఈవో: అనుమతి లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నడపకూడదని ఆదేశాలు ఇచ్చాం. ఒకవేళ ఎవరైనా అనుమతులు లేకుండా నిర్వహిస్తే తమ దృష్టికి తీసుకువస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ పా ఠశాలల్లో చేర్పించే ముందు అ నుమతులు, సౌకర్యాలు ఉన్నాయా..? లేదా అని ఒకటికి రెండు సార్లు తల్లిదండ్రులు ఆలో చించాలి. ఫీజుల భారం లేకుండా ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్, డిజిటల్ బోధన అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం
మంచిర్యాలటౌన్: జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం సమష్టిగా కృషి చేద్దామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ఖాన్ అన్నారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్స్తో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18ఏళ్లలోపు పిల్లలతో పని చేయించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల కార్మికుల సమాచారాన్ని 1098 నంబరులో అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్వో రామ్మోహన్, డీసీపీవో ఆనంద్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్ సిబ్బంది పాల్గొన్నారు. -
రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం నిల్వలు
● మూడు నెలలుగా అక్కడే.. ● జిల్లాలో 5,335 క్వింటాళ్లు ● తరలింపునకు ఆదేశాలు రాలేదంటున్న అధికారులు ● డీలర్ల అవస్థలుమంచిర్యాలఅగ్రికల్చర్: పేద ప్రజల ఆత్మగౌరవం కోసం మూడు నెలలుగా ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అయితే మార్చి నెలలో సరఫరా చేసిన దొడ్డుబియ్యం రేషన్ దుకాణాల్లో నిల్వలుగా మిగిలి, మూడు నెలలుగా ముక్కిపోతున్నాయి. జిల్లాలోని 423 మంది రేషన్ దుకాణాల్లో 5,335.03 క్వింటాళ్ల బియ్యం పేరుకు పోవడంతో డీలర్లలో ఆందోళన నెలకొంది. పురుగులు, ఎలుకలు, వర్షాకాల సమస్యలతో నిల్వలు దెబ్బతినే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు. డీలర్ల ఇబ్బందులు.. మార్చిలో సరఫరా చేసిన దొడ్డుబియ్యం నెలల తరబడి రేషన్ దుకాణాల్లో నిల్వ ఉండటంతో పురుగులు పట్టడం, తుట్టెలు కట్టడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎలుకల సంచారం ఉన్న ప్రాంతాల్లో బియ్యం నష్టపోయే అవకాశం ఉంది. తిరిగి బియ్య ం తీసుకునే సమయంలో నిల్వల లెక్కల్లో తేడాలు వస్తాయని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. రేష న్ దుకాణాల్లో సరిపడా నిల్వ సౌకర్యాలు లేకపోవడంతో, బయట వరండాల్లో బియ్యం ఉంచాల్సి వస్తోంది. వర్షాకాలంలో ఈ నిల్వలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. సన్న బియ్యం పంపిణీ.. ఏప్రిల్ నుంచి ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేపట్టడంతో, పోర్టబులిటీ సౌకర్యం కారణంగా కా ర్డుదారులు ఏ రేషన్ దుకాణంలోనైనా బియ్యం తీ సుకునే అవకాశం పొందారు. దీంతో డీలర్లు నిర్ణీత కోటాకు మించి బియ్యం తీసుకున్నారు. అయితే, సన్నబియ్యం పంపిణీతో దొడ్డుబియ్యం నిల్వలు భారీగా మిగిలిపోయాయి. ఒక్కో దుకాణంలో 10 నుంచి 50 క్వింటాళ్ల వరకు ఉన్నాయి. ప్రభుత్వం మిగులు బియ్యం తిరిగి తీసుకోకపోవడంతో డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్ పంపిణీ విధానం.. రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డు (ఎఫ్ఎస్సీ) హోల్డర్లకు ఒక్కో యూనిట్కు 6 కిలోలు, అంత్యోదయ ఆహార భద్రత కార్డుదారులకు 30 కిలోలు, అన్నపూర్ణ అన్నయోజన (ఏఏవై) కార్డుదారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. సాధారణంగా ప్రతీనెల 1 నుంచి 15 వరకు పంపిణీ జరిగేది. కానీ కేటాయింపుల ఆలస్యం వల్ల ఈ నెల 30వరకు పంపిణీ చేయనున్నారు. మూడు నెలల బియ్యం తీసుకోవడానికి లబ్ధిదారులు మూడుసార్లు బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాల్సి ఉండటంతో దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మూడు నెలల కోటా సరఫరా.. వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదలు, రవాణా స మస్యల వల్ల బియ్యం సరఫరాలో అంతరాయం ఏ ర్పడకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తుగా జూన్, జులై, ఆగస్టు మాసాల బియ్యం సరఫరా చేపట్టారు. గత నెల కోటా 43,139.19 క్వింటాళ్లు కాగా మూడు నెలలకు 1.30 లక్షల క్వింటాళ్ల బియ్యం సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని 423 రేషన్ దుకాణాల ద్వారా 2,20,055 మంది కార్డుదారులకు ఈ నెల 1 నుంచి 30 వరకు బియ్యం అందజేస్తున్నారు. అయితే దొడ్డుబియ్యం నిల్వలు ఖాళీ చేయకపోవడం డీలర్లకు ఇబ్బందిగా మారింది. -
సీజనల్ వ్యాధులపై అలర్ట్
● కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ ● జిల్లాలో రాపిడ్ రెస్పాన్స్ టీంల ఏర్పాటు ● డీఎంహెచ్వో కార్యాలయంలో హెల్ప్డెస్క్..జిల్లాలో ఎనిమిదేళ్లుగా నమోదైన వ్యాధులు.. ఏడాది మలేరియా డెంగీ చికెన్గున్యా2018 3 88 3 2019 2 346 2 2020 9 32 2 2021 0 116 0 2022 0 118 0 2023 0 72 0 2024 2 224 0 2025 1 1 0 -
వివేక్ అనే నేను...
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రిగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నూర్ నుంచి వరుసగా ఆయన సోదరుడు వినోద్ తరువాత మంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. ఇప్పటికే గడ్డం ఫ్యామిలీ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్ ఉండగా ఎంపీగా వంశీకృష్ణ కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వివేక్కు మంత్రి మండలిలో చోటు దక్కుతుందని ఊహాగానాలు వెలువడ్డాయి. అయినప్పటికీ జిల్లా నుంచే మరో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, వినోద్ సైతం పోటీలో ఉండగా చివరకు అధిష్టానం వివేక్కే మంత్రి పదవి కట్టబెట్టింది. వివేక్ వర్గీయులు శనివారం నుంచే సంబురాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో చెన్నూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. చెన్నూర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్పార్టీ నాయకులు మంత్రి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు. భీమారంలోని జాతీయ రహదారిపై టపాసులు కాల్చారు. దండేపల్లిలో మాల సామాజిక వర్గం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మంత్రిని కలిసిన నాయకులు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మంచిర్యాలకు చెందిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కాంట్రా క్టు కార్మిక సంఘం అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్డర్ నీలకంఠేశ్వర్రావు, మందమర్రి కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు నీల య్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గందె రాంచందర్, కోటపల్లి మాజీ సర్పంచ్లు కుమ్మరిసంతోశ్, గట్టు లక్ష్మణ్గౌడ్, మాజీ ఎంపీటీసీ జేక శేఖర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రభాకర్, నాయకులు గుర్రం రాజన్న, తదితరులు కలిసి అభినందనలు తెలియజేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే చెన్నూర్ నుంచి అన్నయ్య తరువాత తమ్ముడికి అవకాశం ప్రేమ్సాగర్రావు, వినోద్కు ఆశాభంగంతీవ్ర నిరాశలో ప్రేమ్సాగర్రావు... కొంతకాలంగా కేబినెట్లో తనకు తప్పనిసరిగా స్థానం ఉంటుందని ఆశించిన మంచిర్యాల ఎమ్మెల్యేకు తీవ్ర ఆశాభంగం కలిగింది. దీంతో ఆయన వర్గీయులు శనివా రం నుంచే తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రేమ్సాగర్రావును బుజ్జగించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగి ఆయ నకు పలు విధాలుగా నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.హామీలు నెరవేర్చడమే నా లక్ష్యం... నియోజక వర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని మీడియాతో మంత్రి వివేక్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమవుతానని ఈ సందర్భంగా తెలియజేశారు. -
అప్రమత్తంగా ఉన్నాం
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలో అప్రమత్తం చేశాం. జిల్లా టాస్క్ఫోర్స్ టీంను ఏర్పాటు చేశారు. వర్షాలు కురవకముందే జిల్లావ్యాప్తంగా పారిశుద్ధ్యం, తాగునీరు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. రాపిడ్ రెస్పాన్స్ టీంలను జిల్లాతోపాటు, మండలాల వారీగా ఏర్పాటు చేసి, ఫోన్ నంబర్ను అందుబాటులో ఉంచాం. ఎక్కడ సీజనల్ వ్యాధులు వచ్చినా, వెంటనే అన్ని శాఖ అధికారులు అప్రమత్తమై, వ్యాధులు ప్రబలకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటాం. అన్ని ప్రభుత్వ హాస్టళ్లలోనూ పరిశుభ్రత, తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు చర్యలు చేపడతాం. – డాక్టర్ హరీశ్రాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి
దండేపల్లి: బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి పురుషోత్తంనా యక్ అన్నారు. దండేపల్లి మండలంలోని కొర్వి చెల్మలో ఆదివారం నిర్వహించిన బడిబాట కా ర్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ సర్కారు పాఠశాలల్లో చది వే విద్యార్థులకు ప్రభుత్వం అందించే బెనిఫి ట్స్, సాధిస్తున్న ఫలితాలను తల్లిదండ్రులకు వి వరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యా డీఆర్పీ ప్రకాశం, ఉ పాధ్యాయులు జనార్దన్, సుధాకర్, రవి, భూమన్న, శ్రీనివాస్, విజయ్చందర్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పద్మ, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘దళితుడిననే వేధిస్తున్నారు..’
జన్నారం: ఇసుకను అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కొందరు వ్యక్తులు కక్షగట్టి దళిత అధికారినని వేధిస్తున్నారని ఇందన్పల్లి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఓ ఇసుక ట్రాక్టర్ను ఆపిన బీట్ అధికారిపై దాడి చేసినందుకు కేసు పెడితే కావాలని వేధిస్తున్నాడన్నారు. ఓ యూట్యూబ్ చానల్లో తనపై తప్పుడు ఆరోపణలు చేయించారన్నారు. అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. సమావేశంలో సెక్షన్ అధికారి హన్మంతరావు, బీట్ అధికారులు బానయ్య, రుబీనా, ప్రణయ్, పోచయ్య, రాజేశ్వర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి
లక్సెట్టిపేట: విద్యార్థులు చదువుతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎస్సార్ ఫంక్షన్ హాల్లో గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ ధ్రువీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం త్రిమూర్తి, చింత అశోక్, పూర్ణచందర్, శ్రీనివాస్, ఆరీఫ్, పింగిళి రమేశ్, రాజు, రవీందర్, శ్రీనివాస్, నిర్వాహకులు బొప్పు సుమన్, తదితరులు పాల్గొన్నారు. -
బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని హైటెక్సిటీ కాలనీలోని మంచిర్యాల క్లబ్లో స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గాజుల ముఖేశ్ గౌడ్, సింగరేణి పవర్ప్లాంట్ డీజీఎం పంతుల హాజరై పోటీలు ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా నుంచి వందకుపైగా క్రీడాకారులు హాజరయ్యారు. అండర్ 11, 13, 15, 17, 19 బాలబాలికలు, మెన్ అండ్ వుమెన్, మాస్టర్స్ 35 ప్లస్ నుంచి 75 ప్లస్ వరకు క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరు సుధాకర్, హర్షవర్దన్, కృష్ణ, రవి, మధు, శ్రీనివాస్ రెడ్డి, నంద శ్రీనివాస్, మహేశ్, మురళి, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
జంగల్ సఫారీలోకి 15 జింకలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): లక్సెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలోని పాతమంచిర్యాల అట వీ సెక్షన్ పరిధిలో గల తిమ్మాపూర్ అటవీ బీట్లోని జంగల్ సఫారీలోకి ఆదివారం 15 జింకలను వదిలిపెట్టారు. హైదరాబాద్ హయత్నగర్ మహావీర్ హరిని వనస్థలి జాతీయపార్కు నుంచి తీసుకువచ్చిన జింకలను సఫారీలోని గ డ్డి మైదానాల్లోకి వదిలిపెట్టారు. అవి గెంతులు వేస్తూ పరుగులు పెట్టాయి. లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి అత్తె సుభాశ్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ఎస్ఓ కొప్పుల రవి, ఎఫ్ఎస్ఓ అతావుల్లా, ఎఫ్బీఓలు రాజేందర్, స్వప్న పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సందర్శనఉట్నూర్రూరల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆ సుపత్రిని ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొ జ్జు సందర్శించారు. ఆసుపత్రిలో ఆయన ఆరోగ్య స్థితిని పరీక్షించుకున్నారు. అనంతరం చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. పార్టీ నాయకులు అబ్దుల్ ఖయ్యుం, నాయకులు ఉన్నారు. -
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు సర్వం సిద్ధం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శి ని స్టేడియంలో నేటి నుంచి ఈనెల 11 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీలకు సర్వం సిద్ధమయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాల నుండి హాకీ టీంలు పాల్గొననున్నాయి. ఇప్పటికే ఐదు జిల్లాల క్రీడాకారులు చేరుకున్నారు. స్టేడియంలోని మేజర్ ధ్యాన్చంద్ హాకీ ఫీల్డ్లో ఏర్పాట్లను ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, హాకీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పార్థసారథి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు పోటీల ప్రా రంభోత్సవానికి ఎంపీ గోడం నగేశ్, ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరుకానునట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా క్రీడాకారులకు జెర్సీలను అందించారు. పోటీల్లో ప్రతిభ కనబరచాలని సూచించారు. -
ఇద్దరి మధ్య గొడవ..ఒకరి మృతి
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ధన్గర్గల్లీకి చెందిన ముఖీమ్ (20), అదే కాలనీకి చెందిన షరీఫొ ద్దీన్లకు మధ్య శనివారం రాత్రి గొడవ చోటుచేసుకుంది. షరీఫొద్దీన్ ముఖీమ్ను నెట్టివేయడంతో కిందపడ్డాడు. శ్వాస ఆడక మృతిచెందాడు. స్థానికులు గమనించి వైద్యం కోసం రిమ్స్కు తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తుచేస్తున్నట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. బావిలో పడి బాలుడి..కౌటాల: మేకలు మేపడానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..మండలంలోని గురుడుపేటకు చెందిన నాగోసే రవీందర్, భాగ్య దంపతుల కుమారుడు అంజన్న(16) పది తరగతి పరీక్షల్లో ఫెయిలయ్యాడు. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధపడుతున్నాడు. ఆదివారం ఉదయం తమ మేకలను మేపడానికి మరో ముగ్గురు యువకులతో కలిసి గ్రామశివారులో వెళ్లారు. పొక్లెయిన్తో తవ్విన వ్యవసాయ బావిలో నీరు తాగేందుకు వెళ్లిన అంజన్న ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయాడు. ఈత రాక నీటిలో మునిగిపోయాడు. సదరు యువకులు గ్రామస్తులకు ఫోన్ చేసి చెప్పారు. వారు అక్కడికి చేరుకుని అంజన్నకు బయటకు తీసి సిర్పూర్(టి) ప్రభుత్వ సామాజికి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిర్పూర్(టి) ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. చేతికందిన కుమారుడు మృతితో కుటుంబీకులు బోరున విలపించారు. మృతుడికి చెల్లి అనురాధ, తమ్ముడు అనుదీప్ ఉన్నారు. చికిత్సపొందుతూ విద్యార్థి..మాక్లూర్(ఆర్మూర్): ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన నిర్మల్ జిల్లాకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం..నిర్మల్ జిల్లా నరసాపురం గ్రామానికి చెందిన సిందే శివకుమార్(17) నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో అతడిని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన శివకుమార్.. ఈనెల 6న సెమిస్టర్ పరీక్షలు రాయడానికి నిజామాబాద్కు వచ్చాడు. మాక్లూర్ మండలం దాస్నగర్ శివారులో గడ్డి మందు తాగి హాస్టల్కు వెళ్లాడు. అక్కడ వాంతులు చేసుకోవడంతో స్నేహితులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు. సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలి ఆదిలాబాద్రూరల్: ఆదివాసీ పర్ధాన్ సమాజ్ ఏకతాటిపైకి వచ్చి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పర్ధాన్ జన్జాతి ఉత్తన్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్వ నగేశ్ పిలుపునిచ్చారు. బజార్హత్నూర్ మండలం ఏసాపూర్లో ఈనెల 28న నిర్వహించనున్న గోండి ధర్మ గురువు హీరా సుకా విగ్ర హ ప్రతిష్ఠాపన, భారీ బహిరంగసభ విజయవంత ం కార్యచరణపై జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి దుర్గదాస్ ఉయికే, మహారాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అశోక్, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అందరి సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. యాదవ్ రావ్, రాంకిషన్, నారాయణ, వనిత, గీత, పాండురంగ్, విఠల్ పాల్గొన్నారు. -
● తరలివచ్చిన పూర్వ గురువులు, విద్యార్థులు
ఉట్నూర్రూరల్: విద్యార్థులు ఒక చోట చేరి, తమ గత స్మృతులను పంచుకోవడానికి, ఒకరినొకరు కలుసుకోవడానికి నిర్వహించే ఆత్మీయ సమ్మేళనం పండుగలా నిర్వహించారు. ఉట్నూర్ జెడ్పీహెచ్ఎస్లో 1950 నుంచి 2025 బ్యాచ్ల వరకు పదో తరగతి చదివిన పూర్వవిద్యార్థులు, గురువులు తరలివచ్చారు. ఆదివారం ఆత్మీయ సమ్మేళనానికి మండలంలోని జేసీఎన్ ఫంక్షన్ హాల్ వేదికై ంది. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి గుర్తులను నెమరువేసుకున్నారు. 75 బ్యాచ్ల పూర్వవిద్యార్థులు, గురువులు ఒకే వేదికపై కలుసుకోవడం రాష్ట్రస్థాయిలో తొలి సమ్మేళనంగా చెబుతున్నారు. అంతకుముందు గురువులను బ్యాండుమేళాలతో స్వాగతం పలికారు. వారిని శాలువతో సత్కరించి సమస్కరించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడారు. ఉపాధ్యాయులు సూచించిన మార్గంలో ప్రస్తుతం వివిధ రంగాల్లో, హో దాల్లో ఉన్నామన్నారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ అదే పాఠశాలలో ఛాత్రోపాధ్యాయుడిగా పనిచేశానని గుర్తుచేశారు. ఆత్మీయ సమ్మేళననిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. -
వాతావరణం ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమవుతుంది. అక్కడక్కడా చిన్నపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
పీఎస్సార్ను కలిసిన మీనాక్షి నటరాజన్మంచిర్యాలటౌన్: మంత్రి పదవి ఆశించి భంగపడిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావును ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివా సంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లు కలిశారు. పీఎస్సార్కు కాకుండా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడంతో వారిద్దరూ ఆయనను కలిసి బుజ్జగింపు యత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, మొదటి నుంచి పార్టీని ఉమ్మడి జిల్లాలో కాపాడుకుంటూ వచ్చిన పీఎస్సార్కే మంత్రి పదవి వస్తుందనే అంతా భావించారు. తీరా రాకపోవడంతో ఆయన వర్గీయుల్లో నైరాశ్యం నెలకొంది. -
వైద్య విద్యార్థికి ఆర్థికసాయం
చెన్నూర్రూరల్: మండలంలోని రాయిపేట గ్రామానికి చెందిన దుర్గం రంజిత్ ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుకునేందుకు ఆర్థిక ంగా కష్టాలు పడుతున్నాడు. సాక్షి మెయిన్ పేజీలో ఈనెల 6న ‘డాక్టర్ కలకు ఆర్థిక కష్టాలు’శీర్షికన ప్రచురితమైన కథనానికి మాజీ వైస్ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి స్పందించారు. రంజిత్ వైద్యవిద్యకోసం తల్లిదండ్రులు కిష్టయ్య, చిన్నక్కలకు ఆదివారం రూ.25 వేల ఆర్థికసాయం చేశారు. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దామోదర్రెడ్డి, మాజీ రైతు సమన్వయసమితి అధ్యక్షులు రత్నసమ్మిరెడ్డి పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రం పరిశీలన బోథ్: సొనాల మండలంలోని గుట్టపక్కతండా గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో సరుకులు కాలం చెల్లిపోగా, గుడ్లు, ఇతర పదార్థాలు కుళ్లిపోయాయి. ‘అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు, సరుకులు’శీర్షికన సాక్షిలో ఆదివారం ప్రచురితమైన కథనానికి జిల్లా మహిళా శిశు, సంక్షేమ అధికారి మిల్కా, సీడీపీవో వినూత్న స్పందించారు. ఆదివారం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. 15 రోజులకు సరిపడా సరుకులను లబ్ధిదారులకు అందించారు. కేంద్రం ఇన్చార్జిని మార్చినట్లు తెలిపారు. అంగన్వాడీ టీచర్తోపాటు ఆయాపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఆదివాసీ బిడ్డ చదువుకు అడ్డంకులు
● పాల్పంచలోని కళాశాలలో బీటెక్ (ఈఈఈ)లో సీటు ● జంగుబాయికు ఆర్థిక ఇబ్బందులు ● అనారోగ్యంతో పరీక్షకు హాజరుకాని వైనం ● ఎస్వీఆర్ ఫౌండేషన్, సాక్షి చొరవతో అన్ని భరిస్తామన్న కళాశాల యాజమాన్యం ఆదిలాబాద్రూరల్: పట్టుదలతో చదువులో రాణిస్తున్న ఆదివాసీ బిడ్డకు ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. ఆదిలాబాద్ జిల్లాలోని మొలాల్గుట్ట–1 గ్రామంలో ఆదివాసీ కొలాం తెగకు చెందిన మడావి సంగీత–రాము దంపతుల కుమార్తె జంగుబాయి. ఈమె ఎంసెట్–2021లో పరీక్ష రాసి మంచి ర్యాంకుతో భద్రాచలంలోని పాల్వంచలో అనూబొస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో సీటు వచ్చింది. బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ (ఈఈఈ) థర్డ్ ఇయర్లో అనారోగ్యం బారిన పడింది. దీంతో పరీక్షకు హాజరుకాలేకపోయింది. ప్రస్తుతం ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటోంది. ఆమె తన చదువు ముందుకు సాగేందుకు ఆర్థిక చేయూతనందించాలని వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేసింది. ఈ విషయాన్ని ఎస్వీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు వామన్రావ్ ‘సాక్షి’దృష్టికి తీసుకువచ్చాడు. ఆదివారం ఫౌండేషన్ సభ్యులతోపాటు సాక్షి..మొలాల్గుట్ట–1 గ్రామానికి చేరుకుని ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. కళాశాల యాజమాన్యంతో ఫోన్లో సంప్రదింపు మడావి జంగుబాయి..విషయమై పాల్వంచలోని అనూబొస్ కళాశాల యాజమాన్యంతో ఎస్వీఆర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి ‘సాక్షి’ఫోన్లో మాట్లాడింది. సదరు విద్యార్థిని ఫీజుల డబ్బులు మొత్తం కళాశాల యాజమాన్యం ఖర్చులు, అన్ని భరిస్తామని వైస్ ప్రిన్సిపాల్ వెంకన్న తెలిపారు. ఎస్వీఆర్ ఫౌండేషన్, సాక్షి చొరవతో అన్ని భరిస్తామని పేర్కొన్నారు. దీంతో కళాశాల యాజమాన్యానికి ఎస్వీఆర్ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలిపింది. చిన్నప్పుడే తల్లి మృతి.. జంగుబాయికు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ఒకరు 9వ తరగతి చదివి మానేశాడు. మరొకరు ఇటీవల పదో తరగతి పూర్తిచేశాడు. కాగా, జంగుబాయి 9వ తరగతి చదువుతున్నప్పుడే తల్లి సంగీత మృతిచెందింది. తండ్రి రాము ఇంద్రవెల్లి మండలంలోని ధనోరా గ్రామంలో మేకల కాపరి పనిచేస్తున్నాడు. ఐఏఎస్ నా లక్ష్యం తల్లి మృతిచెందడం, తండ్రి వేరే గ్రామంలో పనిచేస్తున్నాడు. నా ఇద్దరు సోదరులతో కలిసి పిన్ని, బాబాయి వద్దే ఉంటున్నాను. పాల్వంచకు వెళ్లి చదవడానికి, అక్కడి వెళ్లేందుకు బస్సు చార్జీలు లేవు. ప్రభుత్వం, ఐటీడీఏ సహకరిస్తే అక్కడికి వెళ్లి ఫైనల్ ఈయర్లో ఉత్తీర్ణత సాధిస్తాను. ఐఏఎస్ కావడమే తన లక్ష్యం. – జంగుబాయి -
పొచ్చెరకు అడెల్లు మృతదేహం
బోథ్:మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అ లియాస్ భాస్కర్ మృతదేహం ఆదివారం రాత్రి పొచ్చెర గ్రా మానికి చేరుకుంది. చత్తీస్గఢ్లోని బీజాపూర్లో పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. ప్రత్యేక అంబులెన్స్లో స్వగ్రామానికి తీసుకువచ్చారు. యువకుడిగా దళంలోకి వెళ్లిన అడెల్లు 30 ఏళ్ల తర్వాత శవమై ఇంటికి చేరడంతో వారి రోదనలు మిన్నంటాయి. రెండురోజులుగా ఎదురుచూసినవారంతా మృతదేహం కనిపించడంతో కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామస్తులు ఎరుపు వస్త్రంను పార్థివదేహంపై కప్పి భాస్కర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కు టుంబీకులు తెలిపారు. అభిమానులు, పౌర హ క్కుల సంఘం నేతలు భారీగా వచ్చే తరలివచ్చే అవకాశం ఉంది. కాగా, అక్కడి అదివాసీలు మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరారు. తామే దహన సంస్కారాలు నిర్వహిస్తామని పేర్కొనగా అక్కడి పోలీసులు దాదాపు 200 ఎస్కార్ట్తో అంబులెన్స్లో అడెల్లు మృతదేహాన్ని తెలంగాణ బార్డర్ వరకు పంపించారు. స్వగ్రామంలో కుటుంబీకుల రోదనలు నేడు అంత్యక్రియలు -
అర్చకులకు ఊతం..
● ఆలయాలకు వరం ● పరిశీలనలో డీడీఎన్ఎస్ దరఖాస్తులు ● ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 726 దరఖాస్తులు దండేపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని పురాతన, చారి త్రాత్మక దేవాలయాల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం, దేవాదాయ, ధర్మాదాయశాఖ దూపదీప నైవేద్య పథకం(డీడీఎన్ఎస్)ను ప్రవేశపెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత మే నెలలో డీడీఎన్ఎస్ కింద దేవాలయాలను చేర్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి నుంచి గతనెల మే 24 వరకు దేవాదాయశాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. కొత్తగా ఆలయాల ఎంపికకు అధి కారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. ఈప్రక్రియ పూర్తయితే గ్రామీణ, పురపాలికల్లోని ఆలయాలకు మహర్దశ పట్టనుంది. దేవతామూర్తులకు అర్చకులతో దూపదీప, నైవేద్య, పూజాది కార్యక్రమాలు నిరంతరం కొనసాగనున్నాయి. భక్తుల దర్శనంతోపాటు దాతల సహకారంతో సౌకర్యాలు కల్పించేందుకు వీలు కలిగే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం పథకం కింద ఉమ్మడి జిల్లాలో 729 దేవాలయాలు కొనసాగుతున్నాయి. ఎంపిక ప్రక్రియ షురూ.. దూపదీప నైవేద్యం పథకం కింద పూజాది కార్యక్రమాలకు రూ.4 వేలు, ఆలయ అర్చకుడికి గౌరవ వేతనం రూ.6 వేలు అందజేస్తారు. ఈ పథకంలో దే వాలయాల ఎంపికకు జిల్లాస్థాయి కమిటీని నియమిస్తారు. ఇందులో దేవాదాయశాఖ సహాయ కమి షనర్తోపాటు అధికారులు, ఆగమశాస్త్ర వేదపండితులు సభ్యులుగా ఉంటారు. అన్ని అర్హతలున్నా ఆలయాల సమాచారాన్ని దేవాదాయశాఖ కమిషనరేట్ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డీడీఎన్ఎస్ పథకాన్ని అమలు చేసి మంజూరు పత్రాలు అందజేస్తారు. గత నోటిఫికేషన్ 2022 ఏప్రిల్–మే నెలలో విడుదలైంది. అప్పుడు 767 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి నోటిఫికేషన్కు 726 దరఖాస్తులు వచ్చా యి. అప్పటితో పోలిస్తే ఈసారి దరఖాస్తుల సంఖ్య కొద్దిగా తగ్గింది. అర్హతలున్నా పలు దేవాలయాలకు రిజిస్ట్రేషన్ సక్రమంగా లేకపోవడంతో దరఖాస్తు చేయలేదు. నూతన దేవాలయాలు నిర్మించిన వారు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో అవకాశం కో ల్పోయారు. కొందరు అర్చకులకు అవగాహన లేక కూడా దరఖాస్తు చేసుకోలేకపోయారు. దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది ఉమ్మడి జిల్లాలోని దేవాలయాల నుంచి డీడీఎన్ఎస్ కింద దరఖాస్తులు స్వీకరించాం. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. త్వరలో జిల్లా కమిటీని ఏర్పాటు చేసి, డీడీఎన్ఎస్ కింద దరఖాస్తులు చేసుకున్న ఆలయాలను సందర్శిస్తారు. సందర్శనాంతరం నివేదికను తయారు చేసి, ఎంపిక కోసం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనరేట్ కార్యాలయానికి పంపిస్తాం. – ఎన్.నవీన్, దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ ఉమ్మడి జిల్లాలో డీడీఎన్ఎస్ కింద వచ్చిన దరఖాస్తులు ఆదిలాబాద్ – 219 ఆసిఫాబాద్ – 102 మంచిర్యాల – 110 నిర్మల్ – 295 -
మృగశిర కార్తె సందడి
● చేపల కొనుగోలుకు ఎగబడిన జనం ● జిల్లాలో 400 నుంచి 500 క్వింటాళ్ల విక్రయాలుమంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని చేపల మార్కెట్లు ఆదివారం జనసందడిగా మారాయి. మృగశిరకార్తె కావడంతో జిల్లా కేంద్రంలోని చేపలమార్కెట్, కాలేజ్రోడ్డు, హమాలీవాడ రైల్వేగేట్, ప్రభుత్వ ఐటీఐ వద్ద చేపల కొనుగోలుకు జనం ఎగబడ్డారు. ఇదే అ దనుగా భావించిన మత్స్యకారులు సాధరణ రోజు ల కంటే రెట్టింపు ధరలకు చేపలు విక్రయించారు. మృగశిర కార్తె నాడు చేపలు తింటే సర్వరోగాలు న యమవుతాయని ప్రజల నమ్మకం. జిల్లాలో సుమా రు 400 నుంచి 500 క్వింటాళ్ల చేపల విక్రయాలు జ రిగాయి. బొమ్మ చేప కిలో రూ.400 నుంచి రూ. 600, రవులు, మెరిగే, బొచ్చె చేపలు కిలోకు రూ. 200 నుంచి రూ. 300 ధర పలికాయి. చేపల మసా ల వాసనతో వీధులన్నీ ఘుమఘుమలాడాయి. -
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ
మంచిర్యాలటౌన్: గోవాలో జరిగిన జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకా రులు ప్రతిభ చాటారు. క్రితి అగర్వాల్, ఉబైద్ఖాన్లు సిల్వర్ మెడల్స్ సా ధించినట్లు ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్ రాజేశ్ తెలిపారు. మొదటి గోవా జూ నియర్ మెన్, వుమెన్ నేషనల్ లెవల్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలకు తెలంగాణ నుంచి ప లువురు క్రీడాకారులు పాల్గొనగా, మంచి ర్యాల నుంచి ఇద్దరు క్రితి అగర్వాల్, ఉబైద్ఖాన్లు పాల్గొని సిల్వ ర్ మెడల్స్ను సాధించి, రన్నరఫ్లుగా నిలిచారు. 50–52 కేజీల బరువు విభాగంలో జూనియర్ గరల్స్లో క్రి తిఅగర్వాల్, 48–50 కిలోల బరువు విభాగంలో జూనియర్ బాయ్స్ కేటగిరిలో ఉబైద్ఖాన్లు మెడల్స్ను సాధించారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కీర్తి రాజ్వీర్, క్రీడాసంఘాల సభ్యులు వారిని అభినందించారు. -
జువాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లైఫ్ మెంబర్గా రాకేశ్
జన్నారం: వివిధ రకాల పరిశోధనల ద్వారా అనేక అంశాలు గుర్తించడంలో చేసిన కృషికి మండలవాసికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. జన్నా రం మండలం మొర్రి గూడ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ రాకేశ్ దావెల్ల లక్నోలోని జువాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లైఫ్ మెంబర్గా ఎంపికయ్యారు. జంతుశాస్త్ర పరిశోధనల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. ప్రస్తుతం ఆయన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీలోని పెస్టిసైడ్ రెసిడ్యూస్ లేబొరేటరీలో రీసెర్చ్ అసోసియేట్గా సేవలు అందిస్తున్నారు. ఈ గుర్తింపు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, మరిన్ని పరిశోధనలు చేసి ప్రజలకు సేవలందించాలనే తన లక్ష్యమని తెలిపారు. -
గిరి గ్రామాల్లో విత్తనపూజ
● ప్రారంభమైన ‘మొహతుక్’ ● చంచి భీమల్ దేవునికి పూజలు ● అనాదిగా వస్తున్న ఆచారం గ్రామాల్లో విత్తన పూజలు మృగశిర కార్తె ప్రవేశించడంతో ప్రతీ గ్రామాల్లో విత్తన పూజలు(మొహతుక్) కొనసాగుతున్నాయి. ఆదివాసీ కులదేవతలకు విత్తనాలు చూపించాకే తమతమ పొలాల్లో విత్తనాలు నాటుతున్నాం. అనాదిగా వస్తున్న ఆచారం. – దుర్పతబాయి, మాజీ జెడ్పీటీసీ, కెరమెరి దేవతలకు చూపించాకే! పొలాల్లో విత్తనాలు నాటేకంటే కొద్ది రోజుల ముందు కులదైవాలకు విత్తనాలను చూపిస్తాం. అక్కడ ప్రత్యేక పూజలు చేశాకే పొలానికి వెళ్లి జొన్నగట్కాను ఆరగిస్తారు. అనంతరం నేలతల్లికి ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటడం ప్రారంభిస్తాం. – ధర్మారావు, దేవారి సాకడ(సీ) కెరమెరి(ఆసిఫాబాద్): ఏడాదిలో ఆరు మాసాలు ఏవో పండుగలు చేస్తూ.. తమకు తామే సాటిగా నిలుస్తున్నారు ఆదివాసీలు. తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో వారు ముందుంటున్నారు. మృగశిరకార్తె ప్రవేశించడంతో ఉమ్మడి జిల్లాలోని గిరి గ్రామాల్లో విత్తనపూజకు శ్రీకారం చుట్టారు. విత్తన (మొహతుక్) పూజలు పొలాల్లో రెండురోజులుగా కొనసాగుతున్నాయి. ప్రతీఏటా జరుపుకునే విత్తన పూజలతోనే తమతమ పొలాల్లో విత్తనాలు నాటడం ప్రారంభిస్తారు. దేవతలకు విత్తనాలను చూపించారు ఈ మాసంలో అన్ని గ్రామాల్లో గ్రామ పటేల్ ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివాసీల కు లదైవమైన పాటేరు అమ్మోరు, జంగుబాయి, గాంధారి కిల్ల, పద్మాల్పురి కాకో వద్దకు వెళ్లి విత్తనాలను చూపించారు. అక్కడే దేవతల ఆశీర్వాదం తీసుకుని తిరుగుపయనమయ్యారు. అనంతరం గ్రామంలో ఉన్న ఆకీపేన్, అమ్మోరు, పొచమ్మ వద్దకు విత్తనాలతో పూజలు చేశారు. అక్కడే పటేల్ ఇచ్చే విత్తనాలను తమతమ ఇళ్లకు తీసుకెళ్లారు. మళ్లీ అదేరోజు అర్ధరాత్రి 2.5 కిలోల జొన్నలను ఇంట్లోనే పడతారు. పట్టిన జొన్నలతో గట్కా తయారు చేసి ఆరగిస్తారు. జొన్న గట్క ఆరగించాక అర్ధరాత్రి అడవికి వెళ్లి (కుమ్ముడ్) చెట్టు ఆకులను తీసుకువచ్చారు. ఆ ఆకులతో డొప్పలు తయారు చేసి అన్ని ఇళ్లల్లో ఇస్తారు. అందులో పూజ చేసిన విత్తనాలు వేస్తారు. ఈ పూజలు మరో రెండు రోజులు కొనసాగుతాయి. విత్తన పూజలు(మొహతుక్)! మృగశిర కార్తె ప్రవేశం నుంచి విత్తన పూజలు(మొహతుక్) పొలాల్లో సంప్రదాయ బద్ధంగా చేస్తారు. విత్తన పూజ చేసే రోజు రైతు కుటుంబమంతా ఉదయం పొలంబాట పడతారు. జొన్నతో గట్కా తయారీ చేసి కులదైవతలతోపాటు, నేలతల్లికి సమర్పిస్తారు. అనంతరం పొలంలో విత్తనాలు చల్లి అరకకు ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటుతారు. గ్రామపటేల్ ఇంటి ఎదుట మహిళలు అందరూ పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలు చేస్తారు. పురుషులు గిల్లిదండా ఆట ఆడుతారు. అనంతరం సహపంక్తి భోజనం చేస్తారు. తర్వాత భేటింగ్ అయ్యారు. చంచి భీమల్ దేవుడి కల్యాణంతో.. ఆదివాసీల ఇష్టదైవమైన చంచి భీమల్ దేవుడి కల్యాణం సందర్భంగా ఏటా మే నెలలో విత్తనాలను భీమల్ దేవుడికి చూపిస్తారు. ఆ రోజు ఆదివాసీలు భీమల్ దేవుడికి సంప్రదాయ పూజలు చేస్తారు. అడవుల్లో లభించే ఆకులతో ఆరు డొప్పలను తయారు చేస్తారు. అందులో పొలాల్లో పండించే అన్ని విత్తనాలను కలిపి దేవునికి చూపిస్తారు. అనంతరం వాటిని ఇళ్లకు తీసుకెళ్లి దాచి పెడుతారు. ఆ రోజు పిండి వంటలు చేసి ఆరగిస్తారు. మృగశిర కార్తె ప్రారంభంతో దాచి పెట్టిన విత్తనాలను తమ పంట పొలాల్లో చల్లుతారని చెబుతున్నారు. ఇంద్రాదేవికి విత్తన పూజలు ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో విత్తన పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు తరలివచ్చి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి తయారీ చేసిన నవధాన్యాలతో నైవేద్యం సమర్పించారు. ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురువాలని, పంటలు బాగా పండాలని అమ్మవారికి మొక్కుకున్నారు. -
రోడ్డు పనులను అడ్డుకున్న అటవీ అధికారులు
తాండూర్: మండలంలోని నర్సాపూర్ గ్రామపంచా యతీలోని బెజ్జాల గ్రామానికి నూతనంగా నిర్మించే బీటీ రోడ్డు పనులను అటవీ శాఖ బెల్లంపల్లి రేంజర్ పూర్ణచందర్ స్థానిక సిబ్బందితో కలిసి శనివారం అడ్డుకున్నారు. దీంతో గిరిజనులు అటవీ శాఖ అధి కారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న సీఐ కుమారస్వామి, ఎస్సై సౌజన్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సూరం రవీందర్రెడ్డి అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. బీటీ రోడ్డు చేపట్టిన భూమి అటవీ శాఖ పరిధిలోకి వస్తుందంటూ ఆ శాఖ అధికారులు పేర్కొంటుండగా, సదరు భూమికి సంబంధించి తమకు రెవెన్యూ పట్టాలు అటవీ హక్కు పత్రాలు ఉన్నాయని గిరిజనులు పేర్కొంటున్నారు. పోలీసులు, నాయకులు కలగజేసుకుని ఇరు వర్గాలతో మాట్లాడారు. అటవీ శాఖ అనుమతులు తీసుకుని పనులు చేపట్టాలని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే వినోద్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని, రోడ్డు పనులు త్వరితగతిన చేపట్టేలా చేస్తామని స్థానిక నాయకులు హామీ ఇచ్చారు. అంతకుముందు పోచంపల్లి గ్రామంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న వారిని అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. వారం క్రితం ఎమ్మెల్యే వినోద్ ఉన్నతాధికారులతో మాట్లాడారని ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టవద్దని నాయకులు కోరారు. కార్యక్రమంలో డెప్యూటీ రేంజ్ అధికారి తిరుపతి, నాయకులు సూరం దామోదర్రెడ్డి, కాపర్తి సుభాష్, బానేష్, పర్వత రావు, అమృతరావు, మాణిక్రావు, భగవంతురావు తదితరులు పాల్గొన్నారు. -
మురిపించి.. ముఖం చాటేసి
● భగ్గుమంటున్న భానుడు ● రుతుపవనాలు వచ్చినా.. జాడలేని వాన ● వర్షాల అనిశ్చితితో రైతుల్లో ఆందోళన ● మిరుగుపైనే అన్నదాత ఆశలు..మంచిర్యాలఅగ్రికల్చర్: మే నెలలో కురిసిన ముందస్తు వర్షాలు రైతుల్లో ఆశలు రేకెత్తించాయి. మిరు గు కార్తెలో విత్తనాలు వేసేందుకు చేలను సిద్ధం చేసుకున్న రైతులు, వారం రోజులుగా వర్షాలు లేకపోవడం, ఎండలు మండిపోవడంతో నిరాశ నెలకొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ, ఈ నెలలో చిరుజల్లులకే పరిమితమవుతుండడం రైతులను కలవరపెడుతోంది. ముందస్తు వర్షాలతో ఆశలు గత నెల 23 నుంచి 30 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో సగటున 94 మిల్లీమీ టర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో వాతావరణం చల్లబడడంతో రైతులు పొలంబాట పట్టారు. గత ఖరీఫ్, యాసంగి పంటల మొదళ్లను ఏరివేసి, దుక్కులు సిద్ధం చేసుకున్నారు. మిరుగు కార్తె నుంచి ఖరీఫ్ సాగు పనులు ముమ్మరం చేయడానికి సన్నద్ధమయ్యారు. అయితే, ఈ నెలలో వాతావరణం ఒక్కసారిగా మారడంతో ఉదయం ఎండలు మండిపోతుండగా, సాయంత్రం మబ్బులు కమ్మినా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ఆలస్యం.. జూన్ మొదటి వారం నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది. రుతుపవనాల రాకతో తొలకరి వర్షాలు కురిస్తే పంట విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో పత్తి, వరి పంటలు ప్రధానంగా సాగవుతాయి. సాధారణంగా జూన్ చివరి నుంచి జులై చివరి వరకు పత్తి విత్తనాలు వేయగా, జులైలో వరి నారు పోసి, ఆగస్టు చివరి వరకు నాట్లు వేస్తారు. అయితే, గతంలో వర్షాలు ఆలస్యం కావడంతో పంట దిగుబడులు ఆలస్యమై, యాసంగి సీజన్ కూడా వెనుకబడి, ఆకాల వర్షాలతో నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది ముందస్తు వర్షాలతో జూన్లోనే పత్తి విత్తనాలు, జులై చివరి నాటికి వరి నాట్లు పూర్తి చేయాలని రైతులు ఆశించారు. కానీ, వర్షాలు ఆగిపోవడంతో ఈ ఆశలు నిరాశగా మారాయి. మిరుగుపై ఆశలు.. మిరుగు కార్తె ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో రైతులు సాగు పనులను ముమ్మరం చేస్తారు. అయితే, ఈ నెలలో వర్షాలు చిరుజల్లులకే పరిమితమవడంతో, వాగులు, వంకలు పొంగి ప్రవహించే పరిస్థితి లేదు. రెండు లేదా మూడు భారీ వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ కార్తె నుంచి విత్తనాలు వేసే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు. మరో వారం వర్షాలు లేకపోతే, ముందస్తు సాగు సాధ్యం కాక, గత సంవత్సరం లాగానే పంటలు ఆలస్యమవుతాయని రైతులు పేర్కొంటున్నారు. ఆరు రోజుల్లో నమోదైన కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలుతేదీ కనిష్టం గరిష్టం 2 28.4 36.3 3 29.0 37.4 4 28.6 38.2 5 28.2 38.6 6 28.0 37.8 7 29.2 39.4 -
లంచావతారులు..
● ఏసీబీకి పట్టుబడుతున్నా మారని తీరు.. ● పెరిగిన అవినీతి నిరోధక శాఖ దాడులు ● వాయిస్ రికార్డ్, ఫోన్ పే రిసిప్ట్లు ఉన్నా ఊచలు లెక్కపెట్టాల్సిందే ● తాజాగా మంచిర్యాల డిప్యూటీ తహసీల్దార్ మంజుల, చైన్మెన్ ఉదయ్ అరెస్ట్ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత మూడేళ్లలో నమోదైన కేసులు... సంవత్సరం కేసులు2022 06 2023 09 2024 12 2025 మే వరకు 08మంచిర్యాలక్రైం: ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ని ఏర్పాటు చేసినా అధికారుల తీరు మారడం లేదు. జిల్లాస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు లంచం లేనిదే పనులు జరగని దుస్థితి నెలకొంది. ఏసీబీ అధికారులు విస్తృతంగా దాడులు చేస్తున్నా కొందరు అధికారులు డబ్బు కోసం అడ్డదా రులు తొక్కుతూ ప్రభుత్వ శాఖలకు అప్రతిష్ట తెస్తున్నారు. రాజకీయ ముద్రతో అవినీతి ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ ప్రభావం సర్వసాధారణంగా మారింది. అధికారంలో ఉన్న నాయకులు తమకు అనుకూలమైన అధికారులకు కావాల్సిన పోస్టింగ్లు ఇప్పిస్తున్నారు. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ శాఖల్లో అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టింగ్ల కోసం అధికారులు లక్షల రూపాయలు చెల్లించి, నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ పెట్టుబడిని రాబట్టేందుకు అధికారులు లంచం రూపంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. కొందరు అధికారులు పనికి రేటు నిర్ణయించి, డబ్బు చెల్లించకపోతే పని చేయకుండా బహిరంగంగా చెప్పేస్తున్నారు. ఏసీబీ దూకుడు.. స్మార్ట్ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, ఏసీబీ అధికారుల సమాచారం సులభంగా అందుబాటులోకి రావడంతో లంచం డిమాండ్ చేసే అధికారులు సులభంగా ఏసీబీకి చిక్కుతున్నారు. ప్రజలు ఇప్పుడు అవినీతి అధికారులపై ఫిర్యాదు చేయడానికి ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఫోన్పే వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా లంచం తీసుకునే అధికారులు కూడా ఏసీబీకి చిక్కడం వల్ల ప్రభుత్వ శాఖల పరువు దిగజారుతోంది. పర్యవేక్షణ పెరిగినా.. జిల్లాల విభజన తర్వాత ఏసీబీ పర్యవేక్షణ పెరిగింది. గతంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు ఒకే ఏసీబీ కార్యాలయం ఉండగా, ప్రస్తుతం మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాలకు మంచిర్యాలలో ఒక కార్యాలయం ఏర్పాటైంది. దీంతో ఫిర్యాదులపై వెంటనే స్పందించే అవకాశం పెరిగింది. ఈ నెల 4న మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ సర్వేయర్ పోలం మంజుల, చైన్మెన్ ఉదయ్కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అలాగే, ఏప్రిల్ 18న సీసీసీ నస్పూర్ ఎస్సై సుగుణాకర్ ఒక కేసులో లంచం డిమాండ్ చేసి ఏసీబీకి దొరికాడు. గతంలో జిల్లా కేంద్రంలో సీఐగా పనిచేసిన ఓ అధికారి ఏసీబీ రైడ్ను ముందే పసిగట్టి తప్పించుకున్నాడు. ఈ సంఘటనలు అవినీతి అధికారుల తీరు మారడం లేదని సూచిస్తున్నాయి. భూ వివాదాల్లో అవినీతి జిల్లా వ్యాప్తంగా భూముల ధరలు పెరగడంతో భూ వివాదాలు కూడా పెరిగాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు ఈ వివాదాలను తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు, రాజీవ్నగర్లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఒక వ్యక్తి లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన ప్లాట్పై మరో వ్యక్తి దొంగ పట్టా సృష్టించి వివాదం సృష్టించాడు. ఈ విషయంలో స్థానిక సీఐ, రెవెన్యూ అధికారులు అక్రమ లాభాల కోసం సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండిప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఇవ్వకండి.. ఏసీబీకి సమాచారం ఇవ్వండి. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే అవినీతి రహిత సమాజం కోసం ప్రతీ పౌరుడు తమవంతుగా కృషి చేయాలి. ఆదాయానికి మించి అస్తులు కలిగి ఉన్న అధికారుల వివరాలు సైతం ఇవ్వండి. ఏసీబీ అధికారులకు నిర్భయంగా నేరుగా ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసేందుకు టోల్ఫ్రీ నంబర్ 1064, మొబైల్ నంబర్ 9154388963 కు ఫిర్యాదు చేయండి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. – విజయ్కుమార్, ఏసీబీ డీఎస్పీ, మంచిర్యాలఇటీవలి ఏసీబీ కేసులు ఏప్రిల్ 18న సీసీసీ నస్పూర్: ఎస్హెచ్వో సుగుణాకర్ క్షుద్రపూజల పేరుతో రూ.2 లక్షలు జప్తు చేసిన డబ్బును బాధితునికి తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో సుగుణాకర్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. జూన్ 4, మంచిర్యాల డిప్యూటీ సర్వేయర్ మంజుల, చైన్మెన్ ఉదయ్కుమార్ ఒక వ్యవసాయ భూమి సర్వే కోసం రూ.16,500 ఫోన్పే ద్వారా, రూ.10 వేల నగదు తీసుకున్నారు. అయినప్పటికీ మరో రూ.50 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఫోన్పే రసీదులు, ఫోన్ సంభాషణల ఆధారంగా వీరిని అరెస్ట్ చేశారు. ఏసీబీ చర్యలు, పర్యవేక్షణ పెరిగినప్పటికీ, అవినీతి అధికారుల తీరు మారడం లేదు. ప్రజలు ఏసీబీని ఆశ్రయించడం ద్వారా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయితే, అవినీతిని పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చట్టాలు, కట్టుదిట్టమైన అమలు, పారదర్శక విధానాలు అవసరం. -
● ఎట్టకేలకు ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి.. ● చెన్నూర్ ఎమ్మెల్యేకు కేబినెట్లో చోటు ● ప్రేమ్సాగర్రావు, వినోద్ను పక్కన బెట్టిన అధిష్టానం ● నేడే ప్రమాణ స్వీకారం..
మూడో వ్యక్తి.. చెన్నూర్ నుంచి గెలిచిన వారిని మంత్రి పదవులు వరిస్తున్నాయి. గతంలో బోడ జనార్దన్, గడ్డం వినోద్ మంత్రులుగా పనిచేశారు. తాజాగా గడ్డం వివేక్ వెంకటస్వామికి ఛాన్స్ దక్కింది. 1999 నుంచి 2004 వరకు అప్పటి ఎమ్మెల్యే బోడ జనార్దన్ చంద్రబాబు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత 2004 నుంచి 2009 వరకు ప్రస్తుత బెల్లంపల్లి, ఎమ్మెల్యే నాటి చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వైఎస్.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా వివేక్కు కూడా కేబినెట్ బెర్త్ ఖరారైంది. దీంతో చెన్నూర్ను మూడోసారి మంత్రి పదవి వరించనుంది.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లాకు ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. మంత్రి పదవి కోసం మొదటి నుంచి కొనసాగుతున్న పీటముడి వీడింది. ఉమ్మడి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. గతేడాదిన్నరగా తర్జనభర్జనలు కొనసాగగా కేబినెట్ విస్తరణకు అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మాల సామాజికవర్గం నుంచి చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, మాదిగ సామాజికవర్గం కోటాలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి కేబినెట్ బెర్త్ ఖరారు అయినట్లు తెలిసింది. ముగ్గురి మధ్య పోటీ.. జిల్లా నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పోటీ పడ్డారు. గాంఽధీభవన్ నుంచి ఢిల్లీ వరకు పీసీసీ స్థాయి నుంచి ఏఐసీసీ అధిష్టానం దాకా ముగ్గురూ ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకున్నారు. చివరకు అధిష్టానం వివేక్నే ఖరారు చేసింది. దీంతో ప్రేమ్సాగర్, వినోద్ కంగుతిన్నారు. అనుచరులు సైతం ఊహించని షాక్కు గురయ్యారు. కొద్ది రోజులుగా తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు. వివేక్కు పదవి రావడం వారికి మింగుడు పడటం లేదు. మరోవైపు చెన్నూర్ ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివేక్ రాజకీయ ప్రస్థానం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం వెంకటస్వామి తనయుడైన వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో పనిచేసి, తిరిగి కాంగ్రెస్లో చేరారు. చెన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఎట్టకేలకు మంత్రి పదవి సాధించారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక దశలో ఆయనకు పదవి వస్తుందా, రాదా? అనే ఊహాగానాలు వచ్చాయి. అధిష్టానం తొలి విడతలోనే పదవీ ఇస్తున్నట్లుగా ఒకింత ప్రచారం జరిగినా సమీకరణల నేపథ్యంలో సాధ్యం కాలేదు. గతంలో పదవి రాకపోయినా, సామాజిక సమీకరణలు, రాజకీయ పట్టుదలతో అధిష్టానం ఆమోదం పొంది, తన పంతం నెగ్గించుకున్నారు. మరో వైపు జిల్లా నుంచే తన సోదరుడు వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ప్రయత్నాలు చేశారు. అయితే సామాజిక, రాజకీయ పలు కోణాలను లెక్కలోకి తీసుకుని అధిష్టానం వివేక్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. -
దుబాయ్లో జిల్లావాసి తంటాలు
● ఇరాక్ పంపిస్తానని సబ్ ఏజెంట్ మోసం ● బాధితుడిని స్వగ్రామానికి రప్పించాలి ● ఎన్ఆర్ఐ అడ్వైజరీ బోర్డు రాష్ట్రకమిటీ సభ్యుడికి కుటుంబీకుల వినతినిర్మల్ఖిల్లా: ఇరాక్ పంపిస్తానని చెప్పి దుబాయ్కు పంపి సబ్ ఏజెంట్ మోసం చేయడంతో జిల్లావాసి తంటాలు పడుతున్నాడు. వివరాలు ఇలా.. జిల్లాలో ని సోన్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన కిష్టపురం లస్మన్న(42) గత కొన్నేళ్లుగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నాడు. గతేడాది స్వగ్రామానికి తిరిగివచ్చి మెరుగైన ఉపాధికోసం ఇరాక్ వెళ్లాలని గతేడాది నవంబర్లో గ్రామానికి చెందిన ఓ మధ్యవర్తికి రూ.2 లక్షలు ఇచ్చి వీసా కోసం ప్రయత్నించాడు. సదరు వ్యక్తి నిజామాబాద్ జిల్లా చాకిర్యాలకు చెంది న ఓ సబ్ఏజెంట్ ద్వారా ఇరాక్ పంపేందుకు ఏర్పా టు చేశాడు. సబ్ ఏజెంట్ దుబాయ్లోని పవర్ రి క్రూట్మెంట్ ఎల్.ఎల్.సీ లేబర్ సప్లై కంపెనీకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేబర్ వీసా అంటగట్టి దుబాయ్ పంపాడు. ఇరాక్ పంపడానికి కొంత టైం పడుతుందని చెప్పగా చేసేదేమి లేక లస్మన్న కొన్నినెలల క్రితం దుబాయ్ వెళ్లి కార్మికుడిగా పని చేస్తున్నాడు. తక్కువ వేతనంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని కుటుంబీకులకు తెలిపాడు. భార్య లక్ష్మి సదరు సబ్ ఏజెంట్ ఇంటికి వెళ్లి నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అనడంతో మోసపోయామని గుర్తించిన లస్మన్న కుటుంబీకులు శనివారం నిర్మల్లో ఎన్ఆర్ఐ అడ్వైజరీ బోర్డు రాష్ట్ర కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను కలిసి విన్నవించారు. భర్త లస్మన్నను స్వగ్రామానికి తీసుకురావాలని వినతిపత్రం అందజేశారు. -
మావోలపై పోలీసుల పైచేయి!
అడెల్లుకు మామిడిగట్టుతో అనుబంధంసాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు రిక్రూట్మెంట్ను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం చేస్తున్న కృషి ఫలిస్తోంది. నాలుగేళ్ల క్రితం మావోయిస్టు అగ్రనేతలు మైలారపు అడెల్లు, బండి ప్రకాశ్ రిక్రూట్మెంట్ కార్యకలాపాలపై దృష్టి సారించిన పోలీసులు, అప్పటి డీజీపీ మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల అడెల్లు హతమవడంతో జిల్లాలో మావోయిస్టు రిక్రూట్మెంట్ భయం గణనీయంగా తగ్గింది. నాలుగేళ్ల క్రితం వ్యూహం.. నాలుగేళ్ల క్రితం, కరోనా కాలంలో మావోయిస్టు నేతలు అడెల్లు, బండి ప్రకాశ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రిక్రూట్మెంట్ కోసం సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో అప్పటి డీజీపీ మహేందర్రెడ్డి వారం రోజుల పాటు జిల్లాలో మకాం వేశారు. స్థానిక పోలీసు అధికారులతో రోజువారీ సమీక్షలు నిర్వహిస్తూ, గ్రేహౌండ్స్, ఇతర బలగాలతో అడవుల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, అప్పట్లో ఈ ఇద్దరు నేతలు తప్పించుకున్నారు. ఇప్పుడు అడెల్లు హతమవడంతో ఈ జిల్లాపై మావోయిస్టు పట్టు బలహీనపడింది. ఒకప్పటి ఉద్యమ పరిస్థితి గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో మావోయిస్టు దళాలు నిత్యం సంచరించేవి. ఒక్కో దళంలో 20 మంది వరకు సభ్యులు ఉండేవారు. కొత్త రిక్రూట్మెంట్లు, ప్రజావ్యతిరేక విధానాలను హెచ్చరిస్తూ లేఖలు, రాజకీయనేతలపై దాడులు, విధ్వంసాలు, హత్యలు సర్వసాధారణంగా జరిగేవి. అయితే, గత రెండు దశాబ్దాలుగా జిల్లాలో మావోయిస్టు ప్రభావం గణనీయంగా తగ్గింది. ఉమ్మడి జిల్లా నుంచి సెంట్రల్ కమిటీలో కీలకంగా ఉన్న నేతలు ఇప్పటికీ రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, అడెల్లు మరణంతో వారి కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కూంబింగ్, కాల్పులతో దద్దరిల్లిన అడవులు గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో పోలీ సు కూంబింగ్, మావోయిస్టులతో ఎదురుకాల్పులు, ఎన్కౌంటర్లు, పోలీసులకు గాయాలు, మరణాలు సాధారణ ఘటనలుగా ఉండేవి. కడెం మండలం అల్లంపల్లిలో జరిగిన ఎదురుకాల్పుల్లో పోలీ సుల మరణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టులు, ఇన్ఫార్మర్ల హత్యలు కూడా ఈ జిల్లాలో తరచూ జ రిగేవి. అయితే, ఇప్పుడు ఈ పరిస్థితి గణనీయంగా మారి, అడవుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఒకప్పడు దళాలు, ఇప్పుడు నిశ్శబ్దం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్–సింగాపూర్, మంగీ, కాగజ్నగర్, బోథ్, చెన్నూర్, ఇంద్రవెల్లి, సిర్పూర్ దళాలు మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేవి. కోల్బెల్ట్ ఏరియాలో సికాసా, జిల్లా స్పెషల్ గెరిల్లా స్క్వాడ్, మిలిటరీ ప్లాటూన్లు మెరుపుదాడులకు పాల్పడేవి. అయితే, ప్రస్తుతం ఈ దళాల ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. బోథ్, బజార్హత్నూర్, ఖానాపూర్, సిర్పూర్, చెన్నూర్, జన్నారం, బెల్లంపల్లి అడవుల్లో ఒకప్పుడు కాల్పులతో దద్దరిల్లిన వాతావరణం ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. మావోయిస్టుల తగ్గుదల రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 50 మందికి పైగా మావోయిస్టులు చురుకుగా ఉండగా, ఆ సంఖ్య క్రమంగా 20కి చేరింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత, బోథ్ మండలం పొచ్చెరకు చెందిన సెంట్రల్ కమిటీ సభ్యుడు అడెల్లు మరణం, ఇటీవల జిల్లాకు చెందిన ఒకరిద్దరు మహిళా మావోయిస్టుల మరణంతో జిల్లాలో వారి ఉనికి దాదాపు కనుమరుగైంది. నేషనల్ పార్క్లోనే బండి ప్రకాశ్! బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మందమర్రికి చెందిన మరో మావోయిస్ట్ట్ నేత బండి ప్రకాశ్ ఆలియాస్ ప్రభాత్, రమాకాంత్, క్రాంతితోపాటు మరో కొంత మంది మూడు రోజులుగా పోలీసు బలగాల అదుపులో ఉన్నారని పౌరహక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసు బలగాలు ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని, వారిని కోర్టులో హాజరుపర్చాలని పౌరహక్కుల నేతలు ఓ ప్రకటన విడుదల చేయడంతో ఈవిషయం మందమర్రిలో చర్చనీయాంశమైంది. అడెల్లు ఎన్కౌంటర్ ఉద్యమానికి ఎదురుదెబ్బ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మావోయిస్టు.. మళ్లీ రిక్రూట్మెంట్ జరుగుతుందనే భయం 30 ఏళ్ల క్రితమే మామిడిగట్టులో చిక్కాడుమందమర్రిరూరల్: ఛత్తీస్గఢ్ జిల్లా బీజాపూర్ లో గల నేషనల్ పార్క్ అడవుల్లో ఈనెల 6న ఎన్కౌంటర్లో జరిగిన మైలారపు అడెల్లు ఆలియాస్ భాస్కర్ మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని మామిడిగట్టు గ్రామంతో ఆయనకు అనుబంధం ఉంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన ఆయన చెన్నూర్ దళంలో చాలాకాలం పనిచేశారు. 1996 ప్రాంతంలో మందమర్రి మండలం మామిడిగట్టులో గల ఓ ఇంటిలో షల్టర్ తీసుకోగా పోలీసులకు సమాచారం అందింది. అప్పుడు పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి అడెల్లును అదుపులో తీసుకున్నారు. ఎలాంటి అరెస్ట్ చూయించకుండా ఎన్కౌంటర్ చేయడానికి రంగం సిద్ధం చేసుకోవడంతో ఆ షెల్టర్ ఇచ్చిన ఆ యజమాని విలేకరులకు విషయాన్ని తెలియజేయడంతో ఆ వార్తను కవరేజ్ చేయడంతో ఎన్కౌంటర్ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. లేకపోతే 30 ఏళ్ల క్రితమే అడెల్లు ఎన్కౌంటర్లో మృతిచెందేవాడు. తర్వాత అడెల్లు జిల్లా కార్యదర్శిగా ఇన్చార్జిగా ఆలా ఏళ్లుగా బాధ్యతలు నిర్వహించారు. ఎన్కౌంటర్లో చనిపోయే నాటికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహించాడు. అడెల్లును మావోయిస్ట్ పార్టీలోకి తీసుకువచ్చిన నిర్మల్ జిల్లాకు చెందిన సుధాకర్ (సత్వాజీ) లొంగిపోయినప్పటికీ అడెల్లు మాత్రం పార్టీ సిద్ధాంతాలను నమ్మి చివరివరకు ఉద్యమంలో కొనసాగారు.బీజాపూర్కు కుటుంబీకులు బోథ్: మైలారపు అడెల్లు.. అడవి బాటపట్టి పేద ప్రజల కోసం పనిచేస్తే చంపేస్తారా? కుటుంబాన్ని వదిలి మాకు 30 ఏళ్లు దూరమయ్యాడు. కనీసం ఆయన మృతదేహాన్ని అప్పగించండి.. కడసారి చూడాలని ఉందని కుటుంబీకులు, బంధువులు రోదిస్తున్నారు. ఆయన మృతదేహం అప్పగించాలని కోరుతూ అన్న మైలారపు సీతారాం సహా ఎనిమిది మంది బీజాపూర్కు వెళ్లారు. శనివారం హెలికాప్టర్లో తీసుకుచ్చిన ఆరుగురు మావోల మృతదేహాల్లో అడెల్లుని గుర్తించారు. పోస్టుమార్టం తర్వాత అప్పగింతపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని పోలీసులు తెలిపారు. బాబాయి మృతదేహం అప్పగించండి మా బాబాయి అడెల్లు మృతదేహాన్ని అప్పగించండి. ఏ తప్పు చేశారని చంపేశారు. తెలంగాణ బిడ్డ ప్రజల కోసమే పోరాడాడు. కుటుంబాన్ని వదిలి మూడు దశాబ్దాలు గడిచింది. ఆయన ప్రజల కోసమే తన జీవితాన్ని వదులుకున్నాడు. ఆయన కుటుంబీకులు అందరూ పేదవారే. కడసారి చూపునకు మృతదేహాన్ని అప్పగించాలి. – గీత, అడెల్లు అన్న కూతురు -
దరఖాస్తుల స్వీకరణ
మంచిర్యాలటౌన్: తెలంగాణ వైద్య విధానపరిషత్, జిల్లా ప్రధాన పర్యవేక్షణ అధికారి పరిధిలోని లక్సెట్టిపేట సామాజిక ఆస్పత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్ సమకూర్చేందుకు డీపీసీఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షకులు డాక్టర్ ఎం.కోటేశ్వర్ తెలిపారు. వివరాలను జిల్లా అధికారిక వెబ్సైట్లో https://mancheria l.telangana.gov.in పొందుపర్చినట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల ఏజెన్సీల ప్రతినిధులు ఈనెల 13వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా ప్రధాన ఆస్పత్రుల పర్యవేక్షణ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. యోగాసన జడ్జి శిక్షణ పొందిన రోహిత్మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన రేవెల్లి రోహిత్ పంజాబ్లోని పటియాలలో జరిగిన 5వ జాతీయస్థాయి యోగాసన జడ్జెస్ శిక్షణ పూర్తి చేసుకున్నట్లు జిల్లా యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మండ శ్రీనివాస్, అక్కల తిరుపతివర్మ తెలిపారు. నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో నిర్వహించిన శిక్షణను రోహిత్ పూర్తి చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. -
బాసరలో మకాం.. నిజామాబాద్లో చోరీలు
● ముగ్గురి అరెస్ట్.. పరారీలో ఒకరు ఖలీల్వాడి: బాసరలో ఇల్లు అద్దెకు తీసుకుని నిజామాబాద్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చిలుకలవాడకు చెందిన షేక్ యామీన్ అలియాస్ సమీర్ అలియాస్ గోపి (40), ఆదిలాబాద్ జిల్లా తాటిగూడ రైల్వేస్టేషన్కు చెందిన సయ్యద్ ఫరూక్ (22), మహారాష్ట్రకు చెందిన సత్య నిర్మల్ జిల్లా బాసరలో ఇంటిని అద్దెకు తీసుకుని నిజామాబాద్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్నారు. యామీన్, సయ్యద్ ఫరూక్ 20 పైగా కేసుల్లో జైలుకి వెళ్లి వచ్చారు. శనివారం నిజామాబాద్ రైల్వేస్టేషన్లో పార్క్ చేసిన బైక్ను దొంగతనం చేసి, అదేబైక్పై చోరీ కోసం వెళ్తుండగా పోలీసులు పట్టుకుని విచారించారు. నిందితులు ఎడపల్లి పీఎస్ పరిధిలోని ఓ ఇంటితోపాటు పాన్షాప్లో, నగరంలోని మూడో టౌన్ పీఎస్ పరిధిలోని తాళం వేసి ఉన్న ఇంట్లో, జక్రాన్పల్లి పీఎస్ పరిధిలోని బెల్ట్షాప్లో, రైళ్లలో తిరుగుతూ సెల్ఫోన్ల చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. నిందితుల్లో సత్య పరారీలో ఉండగా, పట్టుబడ్డ నిందితుల నుంచి రూ.5 వేల నగదు, ఐదు సెల్ఫోన్లు, ఒక టీవీ, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. నిందితుల నుంచి దొంగసొత్తును కొన్న హైదరాబాద్లోని కొంపెల్లికి చెందిన అరవింద్ ప్రసాద్పై కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించామన్నారు. -
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
రెబ్బెన: గుర్తుతెలియని పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. దండేపల్లి మండలం కొండపల్లికి చెందిన ముత్యాల వెంకటేశ్ (27) మంచిర్యాలలోని మేదరివాడలో వైన్స్ షాప్లో పనిచేస్తున్నాడు. 15 ఏళ్లుగా తిర్యాణిలో అమ్మమ్మ పోశక్క వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఇంటికి వచ్చి వెంకటేశ్ అప్పటికే మద్యం తాగి ఉన్నాడు. ఈక్రమంలో డబ్బుల విషయమై అమ్మమ్మతో చిన్నపాటి ఘర్షణ జరిగింది. తాగొద్దని ఎంత చెప్పినా వినకపోవడంతో అమ్మమ్మ మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన రెబ్బెన మండలంలోని తక్కళ్లపల్లి బస్టాండ్ సమీపంలోని జాతీయ రహాదారి ఫ్రైఓవర్ కిందకు వచ్చి గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. ఈవిషయాన్ని బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. వారు అక్కడికి చేరుకుని అతన్ని మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.నాగోబా ఆలయ ప్రధాన పూజారి మృతి నార్నూర్: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయం ప్రధాన పూజారి, గాదిగూడ మండలంలోని బొడ్డిగూడకు చెందిన మెస్రం కోసు కటోడా (70) అనారోగ్యంతో మృతిచెందారు. గత పదేళ్లుగా నాగోబా ఆలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు. గత కొన్నినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం రాత్రి నుంచి ఆరోగ్యం విషమించడంతో శనివారం తె ల్లవారుజామున ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ఆలయ కమిటీ సభ్యులు మేస్రం శేఖర్ తదితరులు సంతాపం ప్రకటించారు. బావిలో పడి యువకుడు.. సోన్: ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతిచెందాడు. హెడ్ కానిస్టేబుల్ ప్రతాప్రెడ్డి క థనం ప్రకారం..మండలంలోని కూచన్పెల్లి గ్రామానికి చెందిన ఇందూరి మణిచందర్ (21) తన చేనులో పసుపు పంట సాగు చేస్తున్నాడు. శుక్రవారం నీళ్లు పారించడానికి అక్కడికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా దొరకలేదు. రాత్రి చేను వద్దకు వెళ్లి బావి వద్ద చెప్పులు, నగదు కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించారు. శనివారం బావిలో మృతిదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. తండ్రి మల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. అనుమానాస్పదంగా ఒకరు.. ఇచ్చోడ: మండలంలోని కోకస్మన్నూర్లో అర్ల గంగయ్య (52) అనుమానాస్పదంగా మృతి చెంది నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంగయ్య శనివారం ఉదయం తలకు తీవ్రగాయాలై ఆపస్మాకర స్థితిలో పడి ఉన్నాడు. గ్రామస్తుల సమాచారంతో పోలీసు లు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే మృతి చెంది నట్లు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. కుమారుడు గిరిబాబు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎస్టీపీపీలో ఎస్టీ లైజన్ అధికారుల పర్యటన
జైపూర్: జైపూర్ ఎస్టీపీపీలో శనివారం ఎస్టీ లైజన్ అధికారుల బృందం పర్యటించింది. ఎస్టీ చీఫ్ లైజన్ ఆఫీసర్, జీఎం ఇల్లందు కృష్ణయ్యకు ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం శ్రీనివాసులు స్వాగతం పలికారు. అనంతరం అడ్మిన్ భవన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్టీపీపీలో చేపడుతున్న నియమాకాల్లో ప్రమోషన్ పాలసీలో రూల్ఆఫ్ రిజర్వేషన్(ఆర్వోఆర్) అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీపీపీలో ఎస్టీ ఉద్యోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్టీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ పంతులా, ఎస్టీపీపీ లైజన్ ఆఫీసర్ దేవేందర్, డీజీఎం పర్సనఃల్ అజ్మీరా తుకారాం, మోహన్, చంద్రమాణి, తదితరులు పాల్గొన్నారు. బదిలీపై వెళ్తున్న అధికారులు వీడ్కోలు ఎస్టీపీపీలో డీజీఎం(పర్సనల్)గా విధులు నిర్వర్తించిన అజ్మీరా తుకారాంకు అధికారులు ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయనకు ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం శ్రీనివాసులు, శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఎస్టీపీపీకి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్టీపీపీ అఽధికారులు జెన్సింగ్, సముద్రాల శ్రీని వాస్, మురళీధర్, మోహన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
సీవోఈ విద్యార్థుల ప్రభంజనం
బెల్లంపల్లి: ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, నీట్, క్లాట్, యూపీఎస్సీ తదితర ఫౌండేషన్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్షల్లో బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ) పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. శనివారం గురుకుల విద్యాలయ సంస్థ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడించింది. సీవోఈ విద్యార్థులు అత్యధికంగా 15 మంది ఎంపికై రికార్డు సృష్టించారని ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్సాగర్ ప్రకటించారు. ప్రవేశపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఎంపిక చేసిన గురుకులాల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం 2025–26లో 8వ తరగతిలో ప్రవేశం కల్పించి ఐఐటీ, నీట్, క్లాట్, యూపీఎస్సీ వంటి ప్రతిష్టాత్మక కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రతిభావంతంగా తీర్చిదిద్దుతారు. గత ఏప్రిల్ 21 ప్రవేశపరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 7వ తరగతి చదువుతున్న గురుకుల విద్యార్థులను ఎస్ఏ–1లో వచ్చిన మార్కుల ప్రాతిపదిక స్క్రీనింగ్ టెస్ట్కు ఎంపిక చేశారు. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు సీట్లు కేటాయించారు. సీటు సాధించిన విద్యార్థులు వీరే.. ఫౌండేషన్ కోర్సుల్లో విద్యార్థులకు బోధన సాగించడానికి రారష్ట్రవ్యాప్తంగా బాల,బాలికల కోసం 10 గురుకుల సీవోఈ కళాశాలలను ఎంపిక చేశారు. ఐ దు సీవోఈ కళాశాలలను బాలురకు మరో ఐదు సీ వోఈ కళాశాలలను బాలికలకు కేటాయించారు. దా గం శోభిత్, డి.సిద్దార్థ, బి.సాయిసృజన్ (గౌలిదొడ్డి సీవోఈ కళాశాల), కె.నవనీత్ (చిలుకూరు సీవోఈ కళాశాల), డి.ఆశ్రిత్, ఎం.శ్రావణ్, డి.హృతిక్ తేజ, కె.కార్తీక్ (ఉప్పల్ సీవోఈ కళాశాల), ఎన్.రుషికేష్, బి.ఉషాకిరణ్, డి.వరప్రసాద్, సీహెచ్.మిథున్, ఎం.పున్నంచందర్, కె.కార్తీక్, పి.విరాజ్ (ఇబ్రహీంపట్నం సీవోఈ కళాశాల) ఎంపికయ్యారు. రాష్ట్రస్థా యి పోటీపరీక్షల్లో విజయం సాధించి ఫౌండేషన్ కో ర్సుకు ఎంపికై న విద్యార్థులను, ఉపాధ్యాయులు మల్టీజోనల్ అధికారి అలివేలు, సీవోఈ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్సాగర్ అభినందించారు. ఐఐటీ ఫౌండేషన్ ప్రవేశపరీక్షలో ప్రతిభ ఫలితాల్లో 15 మంది ఎంపిక -
ఖైరతాబాద్ గణేశ్ మండపంలో గజ్జలమ్మ
కుంటాల: ఖైరతాబాద్ గణేశుడు 71 ఏళ్ల వసంతాలు పురస్కరించుకుని ఈఏడాది భక్తులకు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా కొలువుదీరి భక్తులకు దర్శనం ఇవ్వనుంది. విగ్రహ నమూనాను శుక్రవారం నిర్వాహకులు విడుదల చేశారు. గణేశ్ మూడు తలలతో గంభీరంగా నిల్చుని, తలపై ఐదు సర్పాలు, ఎనిమిది చేతులతో కనిపించనుంది. గణేశ్ కుడివైపున మండపంలో శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమవైపున కుంటాల ఇలవేల్పు శ్రీ గజ్జలమ్మ విగ్రహాలు కొలువుదీరనున్నాయి. 69 అడుగులు అడుగుల ఖైరతాబాద్ గణేశుడు పక్కన శ్రీ గజ్జలమ్మ విగ్రహాన్ని నెలకొల్పడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
బాసరలో భక్తుల రద్దీ
బాసర: శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చి దర్శనం కోసం బారులు తీరారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తల్లిదండ్రులు చిన్నారులకు అర్చకులతో అక్షరాభ్యాసం చేయించారు. అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, ఆలయంలో వివిధ అర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.11 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి సుధాకర్రెడ్డి తెలిపారు. -
రోస్టర్ విధానం అమలు చేయాలి
● ఎస్టీ చీఫ్ లైజన్ అధికారి కృష్ణయ్య శ్రీరాంపూర్: సింగరేణిలో పని చేస్తున్న ఎస్టీ ఉద్యోగులకు ఖాళీల భర్తీ, పదోన్నతుల కోసం రోస్టర్ విధానం అమలు చేయాలని సింగరేణి ఎస్టీ చీఫ్ లైజన్ అధికారి కృష్ణయ్య తెలిపారు. రోస్టర్ వెరిఫికేషన్ కార్పొరేట్ కమిటీ శ్రీరాంపూర్ ఏరియాలో శనివారం పర్యటించింది. జీ ఎం కార్యాలయంలో జీఎం ఎం శ్రీనివాస్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. రోస్టర్ రిజి స్టర్ను పగడ్బందీగా నమోదు చే యాలని సూ చించారు. కొన్ని పాయింట్స్కి సంబంధించి స లహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో డీ జీఎం(పర్సనల్) అరవిందరావు, కమిటీ అధ్యక్షుడు భాస్కర్రావు, జనరల్ సెక్రెటరీ నాగేశ్వర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పంతుల, ఏరియా ఎస్టీ లైజన్ అధికారి గుండేరావు, ఉపాధ్యక్షుడు మోహన్, నాయకులు హుస్సేన్నాయక్, రాజు నాయక్, డీవైపీఎం రాజేశ్వర్రావుపాల్గొన్నారు. -
గర్భిణులకు స్కానింగ్ కష్టాలు
● గంటల తరబడి పడిగాపులు ● లక్సెట్టిపేట, చెన్నూర్లో రేడియాలజిస్టు కొరత ● బెల్లంపల్లిలో ఉన్నవారికి చెన్నూర్ ఇంచార్జి ● సీహెచ్సీల్లో స్కానింగ్ చేస్తేనే మేలురేడియాలజిస్టులను నియమిస్తేనే.. జిల్లాలోని మూడు సీహెచ్సీల్లో బెల్లంపల్లిలో మాత్రమే రేడియాలజిస్టు ఉన్నారు. ఇక్కడ శుక్రవారం మినహా ప్రతీరోజు స్కానింగ్ చేసేందుకు అందుబాటులో ఉంటారు. మూడు సీహెచ్సీలకు సూపరింటెండెంట్గా ఉంటూనే నేను లక్సెట్టిపేటకు మంగళవారం వెళ్లి స్కానింగ్ చేస్తున్నాను. బెల్లంపల్లి రేడియాలజిస్టు ప్రతీ శుక్రవారం చెన్నూరుకు వెళ్లి స్కానింగ్ చేస్తున్నారు. సరిపడా క్యాడర్ను ఇప్పటికీ కేటాయించకపోవడం వల్లనే లక్సెట్టిపేట, చెన్నూరులో వైద్యులు లేరు. వైద్యుల నియామకం చేపడితే, చెన్నూరు, లక్సెట్టిపేట ఆసుపత్రుల్లో నిత్యం స్కానింగ్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ ఎం.కోటేశ్వర్, డీసీహెచ్ఎస్ సూపరింటెండెంట్మంచిర్యాలటౌన్: గర్భిణులకు స్కానింగ్ కష్టాలు త ప్పడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా అందుకు సరిపడా వైద్యుల నియామకం, వసతులు కల్పించడం లేదు. దీంతో ప్రభుత్వ వైద్యం కోసం వచ్చేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభు త్వ ఆస్పత్రుల్లో మాత్రమే ప్రసవాలు జరిగేలా చూ డాలని ప్రభుత్వం చెబుతుండగా.. అందుకు తగినట్లుగా జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో వైద్యసేవలు అందిస్తున్నారు. గర్భిణులు ప్రతీ రోజు వైద్య పరీక్షలు, స్కానింగ్ కోసం 60మందికి పైగా జిల్లాలోని పలు మండలాల నుంచి వస్తున్నారు. వీరితోపాటు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, మహారాష్ట్రకు చెందిన వారు వస్తుండడంతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. గర్భిణులకు వైద్యపరీక్షలతోపాటు స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. స్కానింగ్ టీఫా యంత్రం ఒకటే ఉండగా.. ఒక రేడియాలజిస్టు ఉన్నారు. ప్రతీ రోజు 60కి పైగా స్కానింగ్లకు రోజంతా సమయం పడుతోంది. దీంతో గర్భిణులు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కానింగ్ గది బయటే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. టీఫా స్కానింగ్లు చేయాల్సి వస్తే మరింత ఎక్కువ సమయం పడుతోంది. సీహెచ్సీల్లో చేస్తేనే.. జిల్లా నలుమూలల నుంచి గర్భిణులు మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి వస్తున్నారు. ఎంసీహెచ్కు వచ్చే గర్భిణుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇక్కడ ఒత్తిడి తగ్గించేందుకు జిల్లాలోని చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల(సీహెచ్సీ)లో స్కానింగ్లను గతంలోనే ప్రారంభించారు. బెల్లంపల్లిలో మాత్రమే ఒక రేడియాలజిస్టు ఉండగా, లక్సెట్టిపేట, చెన్నూర్లో నియమించలేదు. దీంతో ఆయా ప్రాంతాల గర్భిణులు నేరుగా ఎంసీహెచ్కే వస్తున్నారు. బెల్లంపల్లి రేడియాలజిస్టుకు చెన్నూర్ ఇంచార్జి ఇవ్వగా.. ప్రతీ శుక్రవారం స్కానింగ్ చేస్తున్నారు. లక్సెట్టిపేటలో ఎవరూ లేక డీసీహెచ్ఎస్ సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ ఎం.కోటేశ్వర్ రేడియాలజిస్టు కావడంతో ప్రతీ మంగళవారం స్కానింగ్ చేస్తున్నారు. మూడు సీహెచ్సీల్లో స్కానింగ్ యంత్రాలతో టీఫా స్కానింగ్ చేయలేని పరిస్థితి ఉండడంతో టీఫా స్కానింగ్ కోసం ఎంసీహెచ్కే రావాల్సి వస్తోంది. మూడు సీహెచ్సీల్లో స్కానింగ్ యంత్రాలు మార్చి, రేడియాలజిస్టులను నియమిస్తే స్థానిక గర్భిణులు అక్కడే స్కానింగ్ చేసుకోవడం వల్ల వారికి దూరభారంతోపాటు రోజంతా వేచి ఉండే పరిస్థితి తప్పుతుంది. జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటే ఎంసీహెచ్పై భారం తగ్గడంతోపాటు గర్భిణులకు మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అడెల్లు.. అమర్ రహే!
బోథ్: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడు దశాబ్దాల ఉద్యమ కెరటం నింగికెగిసింది. నూనుగు మీసాల ప్రాయంలో అడవిబాట పట్టి విప్లవోద్యమంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజన్ ఇన్చార్జి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్(53) ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో అడెల్లు మృతిచెందాడు. ఉదయం నుంచి మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగి న కాల్పుల్లో తుదిశ్వాస విడిచాడు. బాల్యం నుంచి అభ్యుదయ భావాలు కలిగిన అడెల్లు మరణవార్త జిల్లాలోని పొచ్చెర గ్రామాన్ని కలిచివేసింది. 30 ఏళ్ల క్రితం జ్ఞాపకాలను ఆ ఊరు గుర్తు చేసుకుంది. ఇదీ ప్రస్థానం.. అడెల్లు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర గ్రామం. తల్లిదండ్రులు పోతన్న–పోషవ్వకు నలుగురు సంతానం. పెద్ద అడెల్లు, సీతారాం, అడెల్లు, చిన్న అడెల్లు. తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. దున్నే వాడిదే భూమి నినాదం, పేదరికం అడెల్లును నక్సలిజం వైపు నడిపించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయనను 1989లో జరిగిన భూపోరాటం ఆకర్షించింది. అడెల్లు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, సోదరులతో కలిసి కూలీ పనులకు వెళ్తుండేవాడు. భూస్వాముల పెత్తందారీతనాన్ని తరచూ ప్రశ్నించేవాడు. విద్యాభ్యాసం.. బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. 1989లో నిర్మల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. నిర్మల్లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితుడై రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరాడు. రాడికల్ నుంచి దళంలోకి.. రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చురుగ్గా పాల్గొనేవాడు. అధ్యక్షుడిగా పనిచేశాడు. గ్రామాల్లో ప్రజలను చైతన్యపరిచాడు. 1995ప్రాంతంలో నక్సలైటుగా మారి దళంలోకి ప్రవేశించాడు. మొదట బోథ్ దళ సభ్యుడిగా పని చేసిన ఆయన ఇంద్రవెల్లి డిప్యూటీ కమాండర్ స్థాయికి ఎదిగాడు. అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి వెళ్లాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పూర్తిస్థాయి పట్టు సాధించాడు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తూ.. కరోనా సమయంలో ఉమ్మడి జిల్లాలో రిక్రూట్మెంట్ బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. గతంలో అడెల్లు దళాన్ని పట్టుకోవడమే లక్ష్యంగా పోలీస్ బలగాలు ఉమ్మడి జిల్లాలోని తిర్యాణి, మంగి, బోథ్, పెంబి, ఖానాపూర్, మామడ ప్రాంతాల్లో జల్లెడ పట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. పలుమార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నట్లు వినికిడి. 2020 సెప్టెంబర్ 19న కదంబ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో అడెల్లు తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం అడెల్లుపై రూ.25 లక్షల రివార్డు ఉంది. కంతి లింగవ్వతో వివాహం.. అడెల్లుకు అప్పటికే దళంలో కొనసాగుతున్న నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కంతి లింగవ్వతో వివాహం జరిగింది. ఇద్దరూ కీలక సభ్యులుగా ఎదిగారు. లింగవ్వ జిల్లా కమిటీ సభ్యురాలిగా ప్రధాన భూమిక పోషించారు. మంగీ ప్రాంతంలో రిక్రూట్మెంట్ చేసినట్లు తెలుస్తోంది. 2022 డిసెంబర్లో లింగవ్వ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందింది. అప్పటి నుంచి అడెల్లు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి వెళ్లారని తెలుస్తోంది. ఎట్లున్నడో అనుకునేలోపే చేదు వార్త ‘మావో’ల ఏరివేత లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగా ర్ పేరిట అడవుల్లో కూంబింగ్ షురూ చేసింది. ఎన్కౌంటర్లలో మావోయిస్టులు మృతి తరుణంలో అడెల్లు ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడోనని కుటుంబీకులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆయన మరణ వార్త వారి గుండెను చెరువు చేసింది. చివరి చూపు కోసం మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబీకులు, గ్రామస్తులు కోరుతున్నారు. ముగిసిన ‘మైలారపు’ ప్రస్థానం బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతి మూడు దశాబ్దాలుగా అరణ్యంలోనే.. విషాదంలో పొచ్చెర గ్రామం మృతదేహం అప్పగించాలంటున్న కుటుంబీకులు, గ్రామస్తులుచివరి చూపు చూడాలని ఉందినా తమ్ముడు అడెల్లును చివరి చూపు చూడాలని ఉంది. చిన్నతనంలో ద ళంలోకి వెళ్లాడు. ప్రజల కోసమే పని చేశాడు. ఇంతకాలం ఎక్కడున్నా బతికే ఉన్నాడనే ఆశ ఉండేది. ఇప్పటికి దాదాపు 30 ఏళ్లు దాటింది చూసి. మృతదేహాన్ని అప్పగించాలని కోరుతున్నా. – మైలారపు సీతారం, అడెల్లు సోదరుడు, పొచ్చెర విచారణ జరగాలిఅడెల్లును పట్టుకుని కాల్చి చంపారని అనుమానం ఉంది. కగార్ పేరుతో నక్సలైట్లను కాల్చడం దారుణం. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాలి. ఆయన మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించాలి. – బి.రమణయ్య, పొచ్చెర గ్రామం అడెల్లు సోదరుడి ఇంటివద్ద గుమిగూడిన గ్రామస్తులు -
రెవెన్యూ సదస్సులో రైతుల గొడవ
బెల్లంపల్లిరూరల్: మండలంలోని చంద్రవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఇద్దరు రైతుల మధ్య గొడవ జరిగింది. చంద్రవెల్లి శివారులోని సర్వే నంబరు 300/7/1లో నాలుగెకరాల భూమి విషయంలో గ్రామానికి చెందిన పూదరి రమేష్, బుధాకుర్థు గ్రామ పంచాయతీకి చెందిన మైల రాజ్కుమార్ మధ్య విభేదాలు తలెత్తాయి. భూమి పట్టా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇద్దరూ సదస్సుకు వచ్చారు. దరఖాస్తు అందజేసే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాట పెరిగి ఘర్షణకు దిగారు. తహసీల్దార్ కృష్ణ ఎదుటే ఘటన జరగడంతో రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు గొడవ సద్దుమణిగేలా చేశారు. భూమి విషయమై ఇద్దరి మధ్య కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నట్లు సమాచారం. రైతుల గొడవ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాళ్లగురిజాల ఎస్సై రమేష్ అక్కడికి చేరుకుని ఇరువురిని పంపించి వేశారు. అనంతరం తాళ్లగురిజాల పోలీసుస్టేషన్లో ఒకరిపైనొకరు ఫిర్యాదు చేసుకోగా.. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలి పారు. కాగా, గొడవకు, రెవెన్యూ శాఖకు సంబంధం లేదని తహసీల్దార్ కృష్ణ తెలిపారు. వ్యక్తిగతంగా గొడవ జరిగిందని, గొడవకు కారణమైన ఇద్దరి పై పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి
నెన్నెల: ప్రజల భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండలంలోని మెట్పల్లి, జెండావెంకటాపూర్ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని సందేహాలను నివృత్తి చేశారు. ఈ నెల 20వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రెండు బృందాలతో మండలంలోని రెండు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. దరఖాస్తులను రికార్డులతో సరి చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. మంచిర్యాల నుంచి నార్వాయిపేట వరకు ఆర్టీసీ బస్సు నడిపించాలని గ్రామస్తులు కోరగా సానుకూలంగా స్పందించారు. మైలారం గ్రామంలో చౌక ధరల దుకాణం, వరిధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించారు. రేషన్ సన్నబియ్యం ఈ నెల 30వరకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. తహసీల్దార్ మహేంద్రనాథ్, డెప్యూటీ తహసీల్దార్ ప్రకాష్ పాల్గొన్నారు. రైతుల ఖాతాల్లో నగదు జమ మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.345 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. 29,645 మంది రైతుల నుంచి 1,98,307 టన్నుల ధాన్యం సేకరించామని పేర్కొన్నారు. -
● పలు ఓసీపీల విస్తరణకు ప్రతిపాదనలు ● టైగర్ రిజర్వు కన్జర్వేషన్తో ప్రతిబంధకాలు
అనుమతుల కోసం..బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను సాధించడానికి సింగరేణి యాజమాన్యం ఎంతోదూర దృష్టితో వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా గోలేటి, మహావీర్ఖని ఓపెన్కాస్ట్ గనులను ప్రతిపాదించి పావులు కదుపుతున్నా ఇంకా అనుమతుల రాకకు కాలయాపన జరుగుతోంది. వాస్తవానికి 2023–24 ఆర్థిక సంవత్సరంలో గోలేటి ఓపెన్కాస్ట్గనిని ప్రారంభించాలనే పట్టుదలతో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఈ తీరుతో సింగరేణి యాజమాన్యం ఒకింత నిరాశశతో ఉండగా, అనుమతులు వచ్చే ప్రస్తుత కీలక సమయంలో కుమురంభీమ్ టైగర్ కన్జర్వేషన్ రిజర్వు ఏర్పడడంతో సందిగ్ధ పరిస్థితులు ఏర్పడ్డాయనే అభిప్రా యం కార్మిక వర్గం నుంచి వినిపిస్తోంది.బెల్లంపల్లి/తాండూర్: కుమురంభీం ఆసిఫాబాద్ జి ల్లా ఆసిఫాబాద్, కాగజ్నగర్ అటవీ డివిజన్లు ‘టైగ ర్ కన్జర్వేషన్ రిజర్వు’గా రూపాంతరం చెందాయి. దీంతో బెల్లంపల్లి ఏరియాలో కొత్తగా ప్రతిపాదించిన గోలేటి, మహావీర్ఖని(ఎంవీకే) ఓపెన్కాస్టు ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతికి ప్రతి బంధకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మ హారాష్ట్ర ప్రాంతం నుంచి పులుల రాకకు ఆయా డివి జన్లు ప్రధాన కారిడార్గా ఉండగా ప్రస్తుతం ‘కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వు’గా మార్చారు. ఈ మేరకు గత శుక్రవారం అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం ఉత్తర్వులు జారీ చేశారు. 1492.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వులో 78 రిజర్వు బ్లాక్లు గుర్తించి నిర్ధారించా రు. మహారాష్ట్రలోని తడోబా–అంధేరి టైగర్ రిజర్వు నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వుకు కొంతకాలంగా పు లులు వలస రావడం తెలిసిందే. ఈ క్రమంలో తడోబా–కవ్వాల్ టైగర్ రిజర్వులకు వారధిగా ఉన్న ఆసిఫాబాద్–కాగజ్నగర్ అటవీ డివిజన్ల పరిధిలో పు లులు సంచారం చేస్తూ ఆవాసం ఏర్పాటు చేసుకో వడం ప్రాధాన్యతను సంతరించుకోగా.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వన్యప్రాణి అభయారణ్యం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని ఇంద్రావతి టైగర్ రిజర్వుతో అనుసంధానమయ్యే కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రి జర్వు ఎంతో ముఖ్యమైన కారిడార్గా అవతరించనుంది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రిజర్వు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు పుష్కలంగా ఉండడంతో గోలేటి, మహావీర్ ఖని ఓపెన్కాస్టు ప్రాజెక్టులకు సింగరేణి యాజమాన్యం కొన్నాళ్ల క్రితం ప్రతిపాదించింది. ఆయా ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమై న అటవీ, పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తోంది. వాస్తవానికి గత ఏడాదిలోనే అనుమతి రావాల్సి ఉండగా కాలయాపన జరుగుతోంది. కనీసం ఈ ఏడాదైనా అనుమతి వ స్తుందనే ఆశతో ఉండగా ఆకస్మికంగా అటవీ శాఖ కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆందోళనకు గురి చే స్తోంది. బొగ్గు గనులు అంతరించి మనుగడ కోల్పోయిన బెల్లంపల్లి ఏరియాలో గోలేటి, మహావీర్ ఖని ఓపెన్కాస్టు ప్రాజెక్టుల విస్తరణతో పూర్వ వైభవం వస్తుందనే భరోసాతో ఉండగా తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రశ్నార్థకంగా మార్చాయి. ఆసిఫాబాద్ అటవీ డివిజన్ పరిధిలో.. కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వు పరిధిలో ఆ సిఫాబాద్ అటవీ ప్రాంతం 57,564 హెకార్లలో విస్తరించి ఉంది. ఈ డివిజన్ పరిధిలో ఉన్న రెబ్బెన రేంజ్ పరిధి 14574.39 హెక్టార్లుగా గుర్తించారు. రెబ్బె న రేంజ్ పరిధిలో ఉన్న గోలేటి, మహావీర్ ఖని ఓపె న్కాస్ట్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే తలంపులో సింగరేణి యాజమాన్యం ఉంది. గోలేటి ఓపెన్కాస్ట్ గని ఏర్పాటుకు 1358.26 హెక్టార్ల భూమి అవసరమని అంచనా వేశారు. ఇందులో 673.26 హె క్టార్ల వరకు అటవీ భూమి ఉండగా మిగతా 685 హె క్టార్లు ప్రైవేట్, ప్రభుత్వ భూమిని సేకరించాలని ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మహావీర్ ఖని ఓపెన్కాస్ట్ కోసం సుమారు 811 హెక్టార్ల భూ మిని సేకరించనుండగా ఇందులో 600 హెక్టార్ల వర కు అటవీ, మరో 211 హెక్టార్ల ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఉన్నట్లు తెలుస్తోంది. రెబ్బెన అటవీ రేంజ్ పరిధిలో ఉన్న ఆయా ప్రతిపాదిత ఓపెన్కాస్ట్ గ నుల ప్రాంతంలో కొంతకాలం నుంచి పులులు సంచరిస్తుండడంతోపాటు జంతువులను వధించడం జ రుగుతోంది. పులుల ఆవాసానికి ఈ ప్రాంతం ఎంతో కీలకమైనదిగా అటవీ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇబ్బందులు ఉండకపోవచ్చుకొత్తగా ప్రతిపాదించిన గోలేటి, మహావీర్ ఓపెన్కాస్ట్ గనుల ఏర్పాటుకు పర్యావరణ, అటవీ అనుమతులు రావాల్సి ఉంది. వీటి కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా గోలేటి ఓపెన్కాస్ట్ గనికి అనుమతి సత్వరంగా వస్తుందనే ఆశతో ఉన్నాం. ఇప్పటికే ఆలస్యం కావడంతో ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశాం. కొత్తగా ఏర్పాటైన కుమురంభీమ్ టైగర్ కన్జర్వేషన్ రిజర్వుతో ప్రతిపాదిత ఓపెన్కాస్ట్ గనుల అనుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. – విజయభాస్కరరెడ్డి, బెల్లంపల్లి ఏరియా జీఎంప్రతిపాదిత ఓపెన్కాస్ట్ గనుల ప్రొఫైల్ ఓసీపీ గని పేరు విస్తరణకు ప్రతిపాదించిన గనులు బొగ్గు నిక్షేపాలు బొగ్గు గ్రేడ్ ఏడాదికి ఉత్పత్తి లక్ష్యం గని జీవిత కాలం గోలేటి గోలేటి–1, 1ఏ, బీపీఏ ఓసీపీ 62 మి.టన్నులు జీ–10, జీ–11 3.5 మి.టన్నులు 18ఏళ్లు సుమారు మహావీర్ ఖని ఎంవీకే –1, 2, 3, 4, 5, 6 40 మి.టన్నులు జీ–10 2.8 మి.టన్నులు 12 ఏళ్లు సుమారు -
ఎస్టీపీపీలో సింగరేణి ఎస్సీ లైజన్ అధికారుల పర్యటన
జైపూర్: స్థానిక సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో ఎస్సీ లైజన్ అధికారుల బృందం శుక్రవారం పర్యటించింది. సింగరేణి ఎస్సీ చీఫ్ లైజన్ ఆఫీసర్, మణుగూర్ జీఎం రామచందర్కు ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం శ్రీనివాసులు స్వాగతం పలి కారు. అనంతరం అడ్మిన్ భవన కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఉద్యోగాల నియామకాలు, పదో న్నతుల్లో పాలసీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్(ఆర్వోఆర్) అమలు చేయాలని ఆదేశించారు. ఎస్టీపీపీలో ఎస్సీ ఉద్యోగుల వివరాలు అధికారులకు వివరించా రు. ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేశ్వర్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్రావు, జనల్ సెక్రెటరీ నాగేశ్వర్రావు, జాయింట్ సెక్రెటరీ తిరుపతి, ఎస్టీపీపీ ఎస్సీ లైజన్ ఆఫీసర్ పులి సురేశ్, డీజీఎంలు ఆజాజుల్లాఖాన్, అజ్మీరాతుకారాం, తదితరులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల తోడ్పాటు జైపూర్: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పడుతాయని, అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారులు, నాయకులు సహకరించాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ అన్నారు. మండలంలోని టేకుమట్ల గ్రామంలో కమ్యూనిటీ పోలీస్, నేను సైతంలో భాగంగా ఏ ర్పాటు చేసిన 14సీసీ కెమెరాలను శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా రాత్రింబవళ్లు నిఘా ఉంటుందని, గ్రామంలో ఎ లాంటి సంఘటనలు చోటుచేసున్నా తక్షణమే గు ర్తించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు. -
అడవిలో హైకోర్టు జీపీల పర్యటన
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ అడవుల్లో ఇద్దరు అడ్వకేట్ జనరల్లు, ఆరుగురు హైకో ర్టు ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ) శుక్రవారం పర్యటించారు. సఫారీ ద్వారా అడవుల్లో తిరిగి అటవీ అందాలు తిలకించారు. వన్యప్రాణులను చూసి మురిసిపోయారు. జన్నారం రేంజ్ పరిధిలోని గోండ్గూడ బేస్క్యాంపు, బైసన్కుంట, తాళ్లపేట్ రేంజ్ పరిధిలోని మల్యాల వాచ్టవర్ వద్దకు వెళ్లి సందర్శించారు. సఫారీ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని న్యాయవాదులు తెలిపారు. రేంజ్ అధికారి సుష్మారావు, డీఆర్వో మమత, బీట్ అధికారి లాలుబాయి అడవి అభివృద్ధి, తదితర అంశాలను తెలియజేశారు. -
ఓరియంట్ ఎన్నికల తేదీ ప్రకటన వాయిదా
కాసిపేట: మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్ని కల నిర్వహణ తేదీ ప్రకటన వాయిదా పడింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం ఆదిలాబాద్ డీఎల్సీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కార్మిక శాఖ అధికారులు ఎన్నికల తేదీ ప్రకటించనున్నట్లు తెలుపడంతో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు భారీగా తరలి వెళ్లారు. డిప్యూటీ లేబర్ కమిషనర్ సెలవులో ఉన్నందున రెండు మూడు రోజుల్లో తిరిగి సమావేశం నిర్వహించి తేదీని ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. -
సర్కారు బడి పిలుస్తోంది..!
● నేటి నుంచి 19వరకు బడిబాట ● ప్రవేశాల పెంపే లక్ష్యం ● ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ ● వీడియోల ద్వారా విస్తృత ప్రచారం మంచిర్యాలఅర్బన్: పాఠశాలల పునః ప్రారంభ సమయం సమీపిస్తోంది. సర్కారు బడుల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా విద్యాశాఖ ఈ నెల 6నుంచి 19వరకు విద్యాశాఖ బడిబాట చేపడుతోంది. ఈ కార్యక్రమంలో పాఠశాలల్లో ఉచితంగా అందిస్తున్న విద్య, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దస్తులు, మధ్యా హ్న భోజనం, డిజిటల్ తరగతుల బోధన, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ల్యాబ్లు, మౌలిక సదుపాయాలపై ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. కార్యక్రమాలు ఇలా..6న ప్రజలతో గ్రామసభలు, 7న ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లలను గుర్తించడం, 8 నుంచి 10వరకు కరపత్రాలతో ఇంటింటా ప్రచారం, అంగన్వాడీ కేంద్రాల సందర్శన, డ్రాపౌట్ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడం, 11న బడిబాట ఫలితాలపై సమీక్ష, 12న అమ్మ ఆదర్శ పాఠశాలల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల ప్రారంభం, ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందించడం, 13న సామూహిక అక్షరా భ్యాసాలు, బాలల సభ నిర్వహణ, 16న ఎఫ్ఎల్ఎ న్, లీప్ దినోత్సవం, 17న విలీన విద్య, బాలిక దినోత్సవం, 18న మొక్కల పెంపకం దినోత్సవం, తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన, 19న బడిబాట ముగింపు కార్యక్రమాలు, విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహిస్తారు. పిల్లల ప్రవేశాలు పెంచేందుకు..జిల్లాలో 1078 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా 1,25,412 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రభుత్వ యాజమాన్యంలో 2024–25లో 59,756 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు లక్ష్యాన్ని విధించి పిల్లలకు అడ్మిషన్లు కల్పిస్తుండడంతో సర్కారు పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు ముందస్తు ప్రవేశాలు కూడా చేపట్టారు. సర్కారు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ, కృతిమ మేధ(ఏఐ పాఠాలు), డిజిటల్ క్లాస్లు, ఆధునిక హంగులతో పాఠశాలలు తీర్చిదిద్దడం తదితర అంశాలపై విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రవేశాల పెంపు లక్ష్యం.. ఈసారి నాలుగు వేల మంది పిల్లలను పాఠశాల(ఒకటో తరగతి)ల్లో చేర్పించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులున్నాయి. కృతిమ మేధ(ఏఐ), ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ విధానంతో డిజిటల్ తరగతుల బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, రెండు జతల దుస్తులు, రాగిజావ, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి తదితర వాటిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలను చేర్పించేలా కృషి చేస్తాం. – యాదయ్య, డీఈవో ముందస్తు బడిబాటపైసా ఖర్చు లేకుండా పిల్లలకు గుణాత్మకమైన విద్యను అందిస్తూ ఉజ్వలమైన భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు సిద్ధమంటూ ఏప్రిల్లో వేసవి సెలవులకు ముందే సర్కారు పాఠశాలల టీచర్లు బడిబాట నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలపై కరపత్రాలు, వీడియోలు ఆకర్షణీయంగా రూపొందించి సోషల్మీడియా ద్వారా ప్రచారం చేశారు. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నారు. 2025–26 అడ్మిషన్లు ఓపెన్ పేరిట విద్యార్థుల ప్రవేశాలు చేపట్టారు. -
‘పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం’
కోటపల్లి: పేదల అభ్యున్నతి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. గురువారం కొల్లూర్, రాంపూర్, దేవులవాడ, రాజారం, బబ్బరుచెల్క, లక్ష్మీపూర్, వెలమపల్లి, అన్నారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అన్నారం గ్రామ పర్యటనలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదని, బీసీలు, ఓసీలకు మంజూరయ్యాయని గ్రామస్తులు ఎమ్మెల్యేను ప్ర శ్నించారు. రాజారంలో రోడ్డు వేస్తానని ఎన్నికల స మయంలో ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, గ్రామాని కి అంబులెన్స్, గ్యాస్ బండి రావడం లేదని మహిళలు ప్రశ్నించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ త్వరలోనే రోడ్డు అయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు. లక్ష్మీపూర్ గ్రామంలో కార్యకర్తలే తమకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, గ్రామ సమస్యలను విన్నవించినా పట్టించుకోవడం లేదని మాజీ సర్పంచ్ పానెం శంకర్ ఎమ్మెల్యేను ప్రశ్నించగా ఎస్సై రాజేందర్ కలుగజేసుకుని పక్కకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మయ్య, సీఐ సుధాకర్, ఎస్సై రాజేందర్, శ్వేత, నాయకులు పాల్గొన్నారు. -
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి
● సింగరేణి డైరెక్టర్ డి.సత్యనారాయణరావుజైపూర్: పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, లేనిపక్షంలో మానవ మనుగడ సాధ్యం కాదని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) డి.సత్యనారాయణరా వు తెలిపారు. మండల కేంద్రంలోని సింగరేణి థర్మ ల్ పవర్ ప్లాంటులో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సర్వీస్ భ వనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించడానికి బాధ్యతగా మొక్కలు నాటాలని, కర్బన ఉద్గారాలను తగ్గించాలని కోరారు. ఎస్టీపీపీలో ఏటా మొక్కలు నాటి పరిరక్షిస్తున్నామని తెలిపారు. ప్లాంటు ఆవరణలో భూగర్భ జలమట్టం పెంచడానికి నీటి బిందువు–జల సిందువు కార్యక్రమం ద్వారా ఐదు మినీ చెరువులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్టీపీపీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం శ్రీనివాసులు, వోఅండ్ఎం చీఫ్ జెన్సింగ్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరీ సత్యనారాయణ, సీఎంవోఏఐ బ్రాంచ్ సెక్రెటరీ సంతోష్కుమార్, ఏజీఎంలు మురళీధర్, మదన్మోహన్, పవర్మేక్ హెడ్ అఖిల్కపూర్, డీజీఎంలు అజాజుల్లాఖాన్, తుకారాం, వాసుదేవమూర్తి, ఫారెస్టు మేనేజర్ చంద్రమణి పాల్గొన్నారు. మొక్కలు నాటిన న్యాయమూర్తిబెల్లంపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కన్నాల శివారులోని నూతన కోర్టు ఆవరణలో బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు న్యా యమూర్తి జే.ముఖేష్ గురువారం న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. బెల్లంపల్లి అటవీ రేంజ్ అధికారి పూర్ణచందర్, బార్ అసోసియేషన్ ప్రధా న కార్యదర్శి చేను రవికుమార్, న్యాయవాదులు గోపికిషన్ సింగ్, సంగీత, అశోక్, శ్రీనివాస్, సునిల్, ఉమారాణి, అనిల్, రమేష్, జువేర్, రాజు పాల్గొన్నారు. సింగరేణి ఏరియా ఆసుపత్రి ఆవరణలో.. సింగరేణి ఏరియా ఆసుపత్రి ఆవరణలో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఆసుపత్రి డెప్యూటీ సీఎంవో డాక్టర్ మధుకర్, వైద్యులు, సిబ్బంది, కార్మిక సంఘాల శ్రేణులు పాల్గొన్నారు. -
రేషన్కు బారులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో ఇటు డీలర్లు.. అటు లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు. వేలిముద్రలు, సర్వర్ బిజీతోపాటు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు ఒక్కో యూనిట్కు ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తుండగా.. ఇందులో ఐదు కిలోలు కేంద్రం, ఒక కిలో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నాయి. దీంతో ఐదు కిలోలు తీసుకోవాలంటే ఒకసారి, కిలో కోసం మరోసారి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. మూడు నెలల రేషన్ ఒకేసారి తీసుకోవడానికి ఒక్కో నెలకు రెండుసార్లు లెక్కన ఈ–పాస్ యంత్రంపై మొత్తం ఆరుసార్లు వేయాల్సి వస్తోంది. ఒక్కొక్కరికి బియ్యం తూకం వేసి పంపిణీ చేసేందుకు 20నిమిషాలకు పైనే సమయం పడుతోంది. ఒక్కో దుకాణంలో రోజువారీగా లబ్ధిదారులకు బియ్యం ఇచ్చేందుకు గంటల తరబడి సమయం పడుతోంది. గతంలో 200మందికి పంపిణీ చేసేది కేవలం 60మంది వరకు పంపిణీ జరుగుతోంది. మూడు నెలలు ఒకేసారి కావడంతో మరింత ఎక్కువ సమయం పడుతోంది. ఈ నెల 30వరకు పంపిణీ చేసేందుకు గడువు విధించారు. జాప్యంతో ఇబ్బందులుసన్నబియ్యం పంపిణీతో గతంలో కంటే ఎక్కువగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. ఈ నెల కోటాలో ఒక్కో లబ్ధిదారుకు వేలిముద్రతోనే బియ్యం తూకం వేయాల్సి ఉంటుంది. సరిపడా తూకం వేశాకే రశీదు వస్తుంది. తూకం వేసే సమయంలో సర్వర్ బిజీ వచ్చినా, వేలిముద్ర పడకపోయినా మరోసారి వేయాల్సి వస్తోంది. ఉదాహరణకు ఒక రేషన్ కార్డులో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 24కిలోలు ఇవ్వాలి. అలా మూడు నెలలకు కలిపి 72కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. వేలిముద్రలు ఐదుకిలోలకు ఒకసారి, ఒక కిలోకు మరోసారి అలా మూడు నెలల కోసం ఇవ్వాలి. వేలి ముద్ర చూస్తూ వాటికి సమంగా బియ్యం తూకం వేయాలి. దీంతో లబ్ధిదారులు నిలబడి ఎదురు చూడాల్సి వస్తోంది. నేరుగా బియ్యం స్టాక్ పంపి గన్నీ సంచి బరువు తీసి వేసి తమకు బియ్యం కోటా కేటాయించాలని డీలర్లు కోరుతున్నారు. షాపుల్లో కోటా కన్నా తక్కువగా వస్తే లబ్ధిదారులతో ఇబ్బంది పడాల్సి వస్తోందని అంటున్నారు. ప్రస్తుతం మూడు నెలల కోటాలో మొదటి విడత కొంత మొత్తంలో పంపారు. స్టాక్ ఖాళీ అయ్యేకొద్దీ బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందరికీ పంపిణీ ఈ నెల 30వరకు బియ్యం పంపిణీ ఉంటుంది. క్యూ లేకుండా ముందస్తుగా టోకెన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే షాపులకు ఎప్పటికప్పుడు స్టాక్ ఖాళీ అయ్యే కొద్దీ బియ్యం పంపిస్తాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోటాలు కలిపి ఒకేసారి వేలిముద్రలు తీసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. – బ్రహ్మారావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారినెలకు బియ్యం కేటాయింపు: 4313మెట్రిక్ టన్నులుమూడు నెలలకు: 12939మెట్రిక్ టన్నులు(సుమారు) జిల్లా ప్రజాపంపిణీ వివరాలు సన్న బియ్యం కోసం లబ్ధిదారుల క్యూ మూడు నెలలకు ఒకేసారి పంపిణీ వేలిముద్రలు, తూకంలో జాప్యం ఈ నెల 30వరకు పంపిణీకి గడువుసజావుగా బియ్యం పంపిణీకి చర్యలు కలెక్టర్ కుమార్ దీపక్ నస్పూర్: జిల్లాలో రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన నస్పూర్లోని చౌక ధరల దుకాణం–5, 8ను సందర్శించారు. బియ్యం పంపిణీని పరిశీలించారు. డీలర్లు, లబ్ధిదారులతో మాట్లాడారు. పంపిణీ వ్యవస్థలో సమస్యలపై తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతిక సమస్యలను ఈ–పాస్ ఇంజనీర్లు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో సన్న బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. రేషన్ బియ్యం పంపిణీని తహసీల్దార్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.