ఎకై ్సజ్ కానిస్టేబుల్కు నివాళి
మంచిర్యాలక్రైం: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎకై ్సజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కు జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో మంగళవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎకై ్సజ్శాఖ అధికారి కేజీ నందగోపాల్ మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎకై ్సజ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సౌమ్య గత నెల 23న గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో వారు కారుతో ఢీకొట్టిన ఘటనలో మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తంజేశారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సౌమ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఎక్సైజ్ సీఐలు సమ్మయ్య, గురువయ్య, ఇంద్రప్రసాద్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


