Mancherial District Latest News
-
వేసవి క్రీడల శిక్షణకు వేళాయె..
మంచిర్యాలటౌన్: ప్రతీయేటా వేసవి సెలవుల్లో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇప్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటి నుంచి 31వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రీడల్లో శిక్షణకు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. పట్టణ ప్రాంతాల్లో అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్బాల్, వాలీబాల్, కరాటే, కబడ్డీ, బ్యాడ్మింటన్కు శిక్షణకు నామమాత్రంగా రూ.100 చొప్పున, బాస్కెట్బాల్కు రూ.300, బ్యాడ్మింటన్కు రూ.500 ఫీజు తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. పట్టణ ప్రాంతాల్లో 11, గ్రామీణ ప్రాంతాల్లో 10 శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ఆటల్లో ఆసక్తి ఉండి నేర్చుకోవాలనే తపన ఉన్న పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు శిక్షకులు, పీడీలు, సీనియర్ క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు. నెల రోజులపాటు 14రకాల క్రీడల్లో ఉదయం 6గంటల నుంచి 9గంటల వరకు, సాయంత్రం 5గంటల నుంచి 7గంటల వరకు శిక్షణ ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 14ఏళ్లలోపు బాలబాలికలు మాత్రమే అర్హులు. క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకుంటే పిల్ల లకు ఆటల్లో ప్రావీణ్యం లభిస్తుంది. -
స్వీయ గణన వేగవంతం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ వేగవంతం అవుతోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం హాజీపూర్ మండలం సబ్బేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాలు, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్వీయ గణనపై ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. స్వీయగణన పూర్తి చేసిన వారు ఎన్యుమరేటర్ ఇళ్ల గణనకు వచ్చిన సమయంలో స్వీయగణన నంబరు ఇవ్వాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ హాజీపూర్ పీహెచ్సీని సందర్శించి ఫార్మసి, వార్డు, ల్యాబ్, పరిసరాలు పరిశీలించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి పాతమంచిర్యాల: ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ భారతి, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెట్రోల్బంక్లు, సోలార్ప్లాంట్లు, ప్లంబింగ్ రంగాల్లో ముందుకు రావాలని అన్నారు. మహిళల సామార్థ్యాల అభివృద్ధి కోసం 100 రోజుల శిక్షణ కార్యక్రమం అమలు చేస్తోందని, శిక్షణ తర్వాత ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి శ్రీలత, కోశాధికారి మాలతి, అదనపు డీఆర్డీఓ అంజయ్య, డీపీఎంలు స్వర్ణలత, రాజుబాయి, సారయ్య, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు పకడ్బందీగా నిర్వహించాలి లక్సెట్టిపేట: వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలోని లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల, తిమ్మాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ దిలీప్కుమార్తో కలిసి సందర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. రోగుల రిజిష్టర్, మందుల నిల్వలు, ల్యాబ్, వార్డులు, పరిసరాలను పరిశీలించారు. -
ఇళ్ల నిర్మాణాలు అడ్డుకోవద్దు
వేమనపల్లి: సుంపుటం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోవద్దని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అటవీ శాఖ అదికారులకు సూచించారు. ఇటీవల సుంపుటం గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సంతోష్కుమార్, స్థానిక సర్పంచు దుర్గం భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. దీంతో గురువారం అదనపు కలెక్టర్ అటవీ, రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామ రికార్డులు పరిశీలించి గ్రామం రెవెన్యూ పరిధిలో ఉందని, అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. నీల్వాయిలో పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. బుయ్యారం, నాగారం గ్రామాల్లో పర్యటించారు. డీఎల్పీఓ సతీష్, ఎంపీడీఓ కుమారస్వామి, డీటీ సాయికృష్ణ, ఎఫ్ఆర్ఓ దయాకర్, సర్పంచులు భాగ్యలక్ష్మి, చెన్నూరి సమ్మయ్య, కొండి మానస, ముల్కల్ల శ్రీలత పాల్గొన్నారు. -
పల్లె వృద్ధి అంతంతే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: దేశ ప్రగతిలో పట్టుగొమ్మలైన పల్లెల్లో సౌకర్యాలు ఇంకా మెరుగుపడాల్సి ఉంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించే ‘పంచాయతీ అడ్వాన్స్మెంటు ఇండెక్స్(పీఏఐ) 2.0’లో జిల్లా పంచాయతీలు వెనుకబడ్డాయి. దేశంలో పంచాయతీ పరిస్థితిని సమగ్రంగా అధ్యయనం చేసి సమ్మిళిత వృద్ధి సాధించేందుకు ప్రతీయేటా ఓ నివేదికను రూపొందిస్తారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపోజిట్ ఇండెక్స్(1.0) మొదలు కాగా, తర్వాత పల్లెల సమగ్ర ప్రగతిని అంచనా వేసేలా 2.0లో మరిన్ని అంశాలు జోడించారు. తాజాగా 2023–24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం పంచాయతీల వారీగా సాధించిన స్కోరును విడుదల చేసింది. ఈ నివేదిక జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి తీరును వెల్లడించింది. ఈ జాబితాలో జిల్లా నుంచి పీఏఐ ఓవరాల్గా ఏ పంచాయతీ కూడా ఏ ప్లస్ స్కోరుతో చోటు దక్కించుకోలేకపోయింది. చెన్నూర్ మండలం పొన్నారం రాష్ట్రంలోనే చివరి పది స్థానాల్లో ఒకటిగా నిలిచింది. ఇక రాష్ట్ర స్థాయిలో మొదటి పది స్థానాల్లో ఏ పంచాయతీ కూడా లేదు. జిల్లా పరిధిలో అత్యుత్తమంగా జన్నారం మండలం లింగయ్యపల్లి పంచాయతీ పీఏఐ ఓవరాల్గా 77.42 స్కోర్తో ఏ కేటగిరీలో ఉంది. పరిస్థితిపై అంచనా ప్రతీ పంచాయతీ నుంచి తొమ్మిది అంశాల్లో డేటా సేకరించారు. పేదరికం, వైద్యం, శిశు, మహిళా స్నేహ పూర్వక వాతావరణం, తాగునీరు, పర్యావరణం, మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం, సుపరిపాలన అంశాలను పరిగణనలోకి తీసుకుని సూచీలను ప్రకటించారు. జిల్లాలో 18 మండలాల్లోని 304 పంచాయతీలు ఉండగా వీటిలో 102 పంచాయతీల నుంచి అన్ని విభాగాల్లో డేటా తీసుకున్నారు. స్థానిక అధికారులు గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలను పాయింట్ల వారీగా డేటాను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేశారు. వీటిని మరోసారి ఆన్లైన్ డేటాతో సరిపోల్చుకుని కేంద్రం ప్రకటించింది. ఈ స్కోరులో ఏ ప్లస్ 90పైన, ఏ 75 నుంచి 90, బీ 60 నుంచి 75, సీ 40 నుంచి 60, డీ 0 నుంచి 40గా కేటగిరీలుగా ప్రకటించారు. -
ఫిష్పాండ్తో జాతీయస్థాయిలో గుర్తింపు
మంచిర్యాలటౌన్: దేశంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫిష్పాండ్ మంచిర్యాలకు వచ్చిందని, దీంతో మత్స్య సంపద అభివృద్ధి చేయడంతోపాటు రాష్ట్రానికి కావాల్సిన చేపల విత్తన ఉత్పత్తి చేయడం జరుగుతుందని, జాతీయస్థాయిలోనే మంచిర్యాలకు ఒక గొప్ప గుర్తింపు లభించిందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ ఏర్పాటుకు నిధులు, 85.10 ఎకరాలు కేటాయింపు పూర్తయిందని అన్నారు. ఫిష్పాండ్ ఏర్పాటుతో 100 నుంచి 150 మంది మత్స్యకారులకు నేరుగా ఉపాధి లభిస్తుందని అన్నారు. మొట్టల పెంపకం, చేప పిల్లల విత్తన ఉత్పత్తి చేసి రాష్ట్రం మొత్తం సరఫరా చేస్తారని తెలిపారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరుకు ఆమోదం వచ్చిందని, అన్నవరానికి దీటుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయానికి రూ.10 కోట్ల నిధులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. బీజేపీ ధాన్యం కొనుగోలుపై రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యేకు మంచిర్యాల అభివృద్ధి నచ్చడం లేదని, మహాప్రస్థానంతోపాటు ఇండస్ట్రియల్ పార్కు పనులు అడ్డుకునేందుకే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారని అన్నారు. మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య పాల్గొన్నారు. -
అటు పరీక్షలు.. ఇటు మూల్యాంకనం
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి పరీక్షలు ఓ వైపు కొనసాగుతుండగానే మరోవైపు జవాబు పత్రాల మూల్యాంకనం వేగవంతంగా పూర్తి కావడంతో ఫలితాల వెల్లడికి మార్గం సులువైంది. గతంలో పరీక్షలు ముగిశాక మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కాగా ఈ ఏడాది పరీక్షల మధ్యలో మూడు విడతల్లో మూల్యాంకనం సాగింది. ఒకేసారి అన్ని సబ్జెక్టుల జవాబు పత్రాల మూల్యాంకనం వల్ల గందరగోళం నెలకొనగా.. ఈసారి సబ్జెక్టుల వారీగా టీచర్లకు అదే రోజు విధులు కేటాయించడం కూడా సాఫీగా సాగేందుకు దోహదపడింది. సమాంతరంగా పరీక్షలు, మూల్యాంకనం సాగడంతో ఫలితాలు జాప్యం లేకుండా వెలువడ్డాయి. ఒకరోజు ముందుగానే.. గత ఏడాది కంటే ఒక రోజు ముందుగానే ఫలితాలు వెలువడ్డాయి. గత ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వరకు పరీక్షలు కొనసాగగా.. ఈ ఏడాది మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్ 16న ముగిసాయి. ఎన్నడూ లేని విధంగా సీబీఎస్ఈ తరహాలో నిర్వహణతో ఎనిమిది పేపర్లకు 33రోజులపాటు పరీక్షలు సాగాయి. గత ఏడాది వరకు తొమ్మిది, పది రోజులపాటు కార్మెల్ హైస్కూల్ వేదికగా మూల్యాంకనం సాగింది. విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు సకాలంలో రిపోర్టు చేయకపోవడం వల్ల మూల్యాంకన ప్రక్రియ ఆలస్యమయ్యేది. ఒంటిపూట బడులు కొనసాగుతుండడం, మూల్యాంకన విధుల్లో పొద్దంతా ఉండడం ఇష్టం లేకనో ఏమోగానీ ఉపాధ్యాయులు మూల్యాంకన విధుల నుంచి తప్పించుకునేందుకు మొగ్గు చూపేవారు. అన్ని సబ్జెక్టుల టీచర్లు ఒకేసారి రావడంతో గందరగోళంగా మారేది. ఈ ఏడాది మూడు విడతలుగా మూల్యాంకనం సాగింది. ప్రతీ పరీక్షకు మూడు నాలుగు రోజుల వ్యవధి ఉండడంతో గణితం పరీక్షలు ముగియగానే మూల్యాంకన ప్రక్రియ చేపట్టారు. ఏప్రిల్ ఒకటి నుంచి 9వరకు తెలుగు, హిందీ, గణితం, ఇంగ్లిషు, ఏప్రిల్ 10 నుంచి 17వరకు ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, మూడో విడత ఏప్రిల్ 17నుంచి 23వరకు సోషల్ సబ్జెక్టు జవాబు పత్రాల మూల్యాంకనం సాగింది. దీంతో ఆయా సబ్జెక్టుల టీచర్లు మాత్రమే రావడం వల్ల సాఫీగా మారింది. గత ఏడాది ఏప్రిల్ 30న ఫలితాలు వెలువడగా, ఈ ఏడాది 29న వెలువడ్డాయి. గతంలో కంటే మూల్యాంకన పనిదినాలు ఎక్కువైనా ఒక రోజు ముందే ఫలితాలు వెలవడడం గమనార్హం. సాగిందిలా.. ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆయా పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. గతేడాది 1,29,243 జవాబు పత్రాలు రాగా ఈ ఏడాది 1,31,398 పేపర్లు స్పాట్ కేంద్రానికి వచ్చాయి. మూల్యాంకన విధులకు ఏఈ, సీఈ, స్పెషల్ అసిస్టెంట్లుగా 2025లో 596 మందిని కేటాయించగా ఈసారి 645 మంది హాజరయ్యారు. అప్పట్లో మూ ల్యాంకనం తొమ్మిది రోజులు.. ఈ ఏడాది పరీక్షలకు విరామం ఉండడం.. మూడు విడతల్లో మూల్యాంకనం చేయడం(పనిదినాలు ఎక్కువైన) సులువుగా మారి ఫలితాలకు మార్గం సుగమమైంది. -
నగర కమిషనర్గా రాజు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.అన్వేష్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ జి.రాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్వేష్ను వేములవాడ మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేసింది. ‘రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వం’ జన్నారం: రైతుబంధు ఇవ్వడంలో, ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని, రైతులను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్రాథోడ్ అన్నారు. గురువారం జన్నారంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. వెంటనే వడ్లు కొనాలని, లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జి.మధుసూదన్రావు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బద్రి నాయక్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్, బీజేపీ జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య, నాయకులు గోలి చందు, ఎం.వీరాచారి, అప్పాల జలపతి, ఎస్.పవన్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల కల్పతరువు ‘ఇప్ప’
ఉట్నూర్రూరల్:అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు వేసవికాలంలో ఇప్పపూల సేకరణలో బిజీగా ఉన్నారు. ఉట్నూర్ మండలంలోని దొంగచింత, నర్సాపూర్(జే), తాటిగూడ, బాబాపూర్, కామాయిపేట, దేవుగూడ, మారుతిగూడ, తదితర గిరిజన గ్రామాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, జన్నారం, గాదిగూడ, ఇంద్రవెల్లి, తదితర మండలాల గిరిజనులు కోడి కూయకముందే అడవిబాట పడుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉండే లభించే బంక, జిగురు, మొర్రి పండ్లు, తునికాకు, తునికి పండ్లు, ఇతర ఉత్పత్తులతో పాటు వేసవిలో ఇప్పపువ్వుతో గిరిజనులు ఉపాది పొందుతున్నారు. అడవిలో సేకరించిన ఇప్పపూలను ఇంటికి తెచ్చి మూడు రోజులపాటు ఎండలో ఆరబెడతారు. ఎండిన తర్వాత వాటిని విక్రయిస్తారు. ఇప్పపూల తర్వాత ఇప్ప పరక లభ్యమవుతుంది. ఇప్పపరక నుంచి నూనె తీస్తారు. నూనె తీయడానికి ‘గానె’ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇప్పపరక నూనె మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇప్పచెట్లను గిరిజనులు తమ సొంత భూముల్లో కూడా పెంచుకుంటారు. ఆహారంగా వినియోగం ఇప్పపూలను గిరిజనులు ఆహారంగా వినియోగిస్తారు. ఇప్పపూలను ఎండ బెట్టిన తర్వాత సలపతో బాగా దంచి మెత్తగా చేసి కుండలో వండి భుజిస్తారు. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సల్దిగా ఉపయోగించుకుంటారు. వేసవికాలంలో వ్యవసాయ పనులు చేసి అలసిపోయిన సమయంలో, వడదెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి జొన్న అంబలితో పాటు ఇప్పపూలతో చేసిన వంటకాలను భుజిస్తారు. వేసవి కాలంలో గిరిజన గ్రామాల్లోని ఏ ఇంటికి వెళ్లినా జొన్న అంబలి, ఇప్పపూలు తప్పనిసరిగా లభిస్తాయి. గిరిజనుల సంప్రదాయ పండుగలకు ఇప్పపూలతో కుడుములు, గారెలు, లడ్డూలు, వడలు, తదితర వంటకాలు తయారు చేస్తారు. పానియాలు తయారీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయ ఉత్సవాలు, వివాహాల్లో ఉత్సాహం కోసం వారే స్వయంగా ఇప్పసారా తయారుచేసి సేవిస్తారు. వ్యవసాయ పనులు చేసి అలసిపోయిన సమయంలో అలసట తీరేందుకు ఇప్పసారా సేవిస్తారు. ఇప్పపూల సారా తయారు చేయగా మిగిలిన ఇప్పపూలను పశువులకు దాణాగా వేస్తారు. జీసీసీ ద్వారా కొనుగోళ్లు ఆదివాసీలు అడవి నుంచి సేకరించిన ఇప్పపూలను గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలు ఇప్పపూలకు రూ.3వేల చొప్పున ధర చెల్లిస్తూ ఆదివాసీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని, సేకరించిన ఇప్పపూలను జీసీసీకి విక్రయించి ఉపాధి పొందాలని అధికారులు సూచిస్తున్నారు.బుట్టల్లో నింపిన ఇప్పపువ్వు ఇప్పపూలతో తయారు చేసిన వంటకాలుప్రకృతి ప్రసాదించిన ఇప్ప పువ్వు గిరిజనుల కల్పతరువుగా నిలుస్తోంది. వేసవిలో అటవీ ప్రాంతంలో ఇప్ప పువ్వు, పరక, తునికి పండ్లు, మొర్రిపండ్లు విరివిగా లభిస్తాయి. కొండకోనలు, అటవీ ప్రాంతాల్లో నివసించే గోండి, కొలాం గిరిజనులు వాటిని సేకరించి జీవనోపాధి పొందుతున్నారు. మరోవైపు ఆదివాసీల పండుగల్లో ఇప్పపూలను పిండివంటలకు వాడుతున్నారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా పెరిగిన ఇప్పచెట్లు గిరిజనులకు బతుకుదెరువు చూపుతున్నాయి. వాటితో గిరిజనులకు ఉన్న అనుబంధంపై ప్రత్యేక కథనం. -
ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం
చెన్నూర్: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం వరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోటపల్లి, జైపూర్ మండలాల లబ్ధిదారులు 144 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి అందజేశారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని అన్నారు. రెండో విడత మరో 2500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా అర్హులకు నేరుగా మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం చెన్నూర్ మండలం పొక్కూర్ సర్పంచ్ ఐత స్వరూప, సత్తయ్య మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బెల్లంకొండ కరుణసాగర్రావు, మాజీ సర్పంచ్ గొడిసెల బాపురెడ్డి పాల్గొన్నారు. నిరుపేదల కోసమే ఇదిరమ్మ ఇళ్ల పథకం చెన్నూర్రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. మండలంలోని బావురావుపేట గ్రామంలో ఎగుడ శేఖర్ ఇందిరమ్మ గృహ ప్రవేశంలో కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం సత్ఫలితాలు ఇస్తోందని, నిరుపేదలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. బావురావుపేట నుంచి కత్తెరసాల, కాచన్పల్లి వరకు వంతెన నిర్మాణాల కోసం సుమారు రూ.5కోట్లు మంజూరు చేసినట్లు తెలిపా రు. సర్పంచ్ తాటి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. -
నీటిగుంతలో పడి బాలుడు మృతి
పెంచికల్పేట్: నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన రజిత, సంతోష్ దంపతుల కుమారుడు దోబే మహేష్ (13) వేసవి సెలవుల నేపథ్యంలో చేడ్వాయిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. మంగళవారం సాయంత్రం తోటి స్నేహితులతో కలిసి ఇంటినుంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం గ్రామంలోని రైతు వేదిక వెనుక ఉన్న నీటి గుంతలో మృతదేహం గమనించిన స్థానికులు బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. కాగజ్నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, పెంచికల్పేట్ ఎస్సై అనిల్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పంచనామ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. . మృతుని తల్లి రజిత ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామానికి చెందిన వడ్డపెల్లి రవీందర్ (40) మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఓ ప్రైవేట్ బ్యాంక్లో రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు. కిస్తీలు రెగ్యులర్గా కట్టలేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. జీవితంపై విరక్తితో బుధవారం ఉదయం ఇంటి ముందున్న బాల్కనీలో చీరతో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య రమ, కుమారుడు అక్షిత్, కుమార్తె వైశాలి ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నిర్మల్ కలెక్టరేట్లో రైతు ఆత్మహత్యాయత్నంనిర్మల్చైన్గేట్: తాను పండించిన పంటను అదే గ్రామానికి చెందిన వ్యక్తి కోయనీయకుండా అడ్డుపడుతున్నాడని ఆరోపిస్తూ నిర్మల్ కలెక్టరేట్ ప్రాంగణంలో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. సారంగపూర్ మండలం ఆలూరుకు చెందిన గజ్జ శ్రీధర్ తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న, వరి సాగు చేశానని, పంటను కోయనీయకుండా, అమ్మ నియకుండా అదే గ్రామానికి చెందిన వ్యక్తి అడ్డుపడుతున్నాడని వాపోయాడు. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి కలెక్టరేట్ ప్రాంగణంలో పడిపోయాడు. గమనించిన సిబ్బంది 108కు సమాచారం అందించడంతో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భార్య చేతిలో భర్త హతంఆదిలాబాద్రూరల్: భార్య చేతిలో భర్త హతమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై విష్ణువర్ధన్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని లోహరకు చెందిన సొలంకే గణపతి (54) కుల వృత్తి కమ్మరి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతీరోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి అతని భార్య మథుర బాయితో గొడవ పడుతున్నాడు. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవలో మథురబాయి రాడ్తో కొట్టడంతో తీవ్రగాయాలపాలైన గణపతి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు సొలంకే సురేష్ ఫిర్యాదు మేరకు మథురబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
● జిల్లాలో 97.20శాతం పాస్ ● రాష్ట్ర స్థాయిలో జిల్లా 20వ స్థానం ● మూడు స్థానాలు వెనక్కి.. ● బాలికలే మళ్లీ ముందంజ
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగి విద్యార్థుల్లో ఆనందం నింపింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 20వ స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణత శాతం మెరుగైనా ఫలితాల పరంగా చూస్తే రాష్ట్ర స్థాయిలో మూడు స్థానాలు పడిపోయింది. గత ఏడాది 96.54శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది 97.20శాతంతో ఉత్తీర్ణత గణనీయంగా పెరిగింది. గతేడాది రాష్ట్ర స్థాయిలో జిల్లా 17వ స్థానం సాధించగా.. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 20వ స్థానంలో నిలువడం నిరాశపర్చింది. జిల్లాలో 9,684 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 9,413 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 4,879 మంది పరీక్షలకు హాజరు కాగా 4,720 మంది పాసయ్యారు. బాలికలు 4,805 మందికి 4,693 ఉత్తీర్ణత పొందారు. కాగా, బాలురు 96.74 ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 97.67 ఉత్తీర్ణత శాతంతో పైచేయి సాధించారు. శతశాతం పాఠశాలలు జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పాఠశాలలు శత శాతం సాధించాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత పొందారు. విద్యార్థులు కష్టపడి చదవడం, ఉపాధ్యాయుల మార్గదర్శనం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి. జిల్లాలో మొత్తం 132 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు నూరుశాతం ఫలితాలు సాధించాయి. ఇందులో 81 ప్రభుత్వ, 51 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. 18 కేజీబీవీల్లో 11 వందశాతం ఫలితాలతో దూసుకెళ్లగా.. ఐదు తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఒక్కటి కూడా శతశాాతం ఫలితాలు సాధించలేకపోయాయి. జూన్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 5 నుంచి 12వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 30 నుంచి మే 14వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో యాదయ్య తెలిపారు. రీకౌంటింగ్కు విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున 15రోజుల్లో ఎస్బీఐ ద్వారా చలానా చెల్లించి దరఖాస్తులను డీజీఈ హైదరాబాద్ కార్యాలయానికి పంపించాలని తెలిపారు.మంచిర్యాల మోడల్స్కూల్ విద్యార్థి సంజనను అభినందిస్తున్న ఉపాధ్యాయులు‘లెక్క’ తప్పింది..! మంచిర్యాలఅర్బన్: విద్యార్థి భవిష్యత్కు కీలకమైన పదో తరగతి ఫలితాల్లో గణితం సబ్జెక్టులోనే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ లెక్కల్లో తప్పారు. ఫార్ములాలు తెలియకపోవడమో, బేసిక్ కాన్సెప్ట్లు బలంగా లేకపోవడమో ఏమోగానీ మార్కులపై ప్రభావం చూపింది. గణితం తర్వాత చాలామంది ఇంగ్లిష్ పరీక్ష తప్పారు. భయంతో సరైన ప్రాక్టీస్ చేయకపోవడం కారణంగా తెలుస్తోంది. పాఠశాలలకు సక్రమంగా హాజరు కాని విద్యార్థులే లెక్కల్లో తప్పినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లాలో 271 మంది ఫెయిల్ కాగా, వీరిలో గణితం పరీక్షలో 136 మంది అ నుత్తీర్ణులయ్యారు. 124 మంది ఇంగ్లిష్ సబ్జెక్టులో ఫెయిలయ్యారు. సైన్స్లో 87 మంది, తెలుగులో 53 మంది, హిందీలో 24, సోషల్లో 14 మంది ఫెయిలయ్యారు. సబ్జెక్టుల్లో వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే సప్లిమెంటరీ పరీక్షల్లో ఫలితాల్లో మంచి విజయాలు సాధించవచ్చు. మంచిర్యాలలో అత్యధికంగా.. పదో తరగతిలో మండలాల వారీగా ఫలితాలు చూస్తే గణితం, ఇంగ్లిష్ ,సైన్స్ సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులు జిల్లా కేంద్రం మంచిర్యాలలోనే అత్యధికంగా ఉన్నారు. గణితంలో 39 మంది ఉంటే తర్వాత చెన్నూర్లో 21 మంది, బెల్లంపల్లిలో 15 మంది ఫెయిలయ్యారు. ఇంగ్లిష్లో మంచిర్యాలలో 28 మంది, బెల్లంపల్లి మండలంలో 15 మంది అనుత్తీర్ణులయ్యారు. మంచిర్యాలలో సైన్స్ సబ్జెక్టు విద్యార్థులు 28 మంది, 15 మంది తెలుగు సబ్జెక్టులో ఫెయిలయ్యారు.నాలుగేళ్లుగా ౖపైపెకి..పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం అంతకంతకు పెరిగిపోతోంది. నాలుగేళ్లుగా పోల్చి చూస్తే విద్యార్థుల ఉత్తీర్ణత పెరగడం ఉత్సాహాన్ని నింపుతోంది. బాలికలు నిరతరంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. 2023లో 84.87శాతం, 2024లో 92.42శాతం, 2025లో 96.54 శాతం ఉత్తీర్ణత సాధించగా 2025–26లో 97.20శాతం సాధించడంతో పాఠశాల పనితీరు మెరుగైందని చెప్పవచ్చు. -
గిరిజనుల సంక్షేమానికి కృషి
ఉట్నూర్రూరల్: ఉమ్మడి జిల్లాలోని గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తానని ఐటీడీఏ పీవో మంద మకరందు తెలిపారు. బుధవారం బాధ్యతల స్వీకరణ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల జీవనోపాధి మెరుగుదలకు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తానన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావ్పేటకు చెందిన తాను ఐటీ ఇంజినీరింగ్ను 2016–17లో పూర్తి చేసినట్లు తెలిపారు. అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఐఏఎస్ పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే 2020–21లో అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్లో శిక్షణ పూర్తి చేసిన అనంతరం జగిత్యాల జిల్లాలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ)గా తొలి నియామకం పొందానని, ఆ తర్వాత నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా, హైదరాబాద్ రాజేంద్రనగర్లో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా సేవలందించినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. -
సన్న రకం వరి సాగుపై దృష్టి సారించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ నస్పూర్: జిల్లాలోని రైతులు సన్న రకం వరి సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన నస్పూర్లోని కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సన్న రకం వడ్లు సాగు చేసేలా అధికారులు ప్రోత్సహించాలని తెలిపారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం బోనస్ అందిస్తుందని, వానాకాలం సీజన్లో సాగు చేయాలని సూచించారు. అధిక దిగుబడి సాధించేందుకు మెలకువలు పాటించాలని అన్నారు. జిల్లాలో దాదాపు 1.57 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. ప్యాడి క్లీనర్లు, తూకం యంత్రాలు, తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి మంచిర్యాలటౌన్: సైబర్ మోసాలు అరికట్టేందుకు సైబర్ క్రైమ్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ఖాన్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై విద్యార్థులు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని, ఆన్లైన్లో సురక్షితంగా ఉండే విధానాలను తెలుసుకోవాలని అన్నారు. అత్యవసర సహాయం కోసం సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930, పిల్లల సమస్యల కోసం చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098లో సంప్రదించవచ్చని తెలిపారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలు, లింక్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మధుసూదన్, కళాశాల ప్రిన్సిపాల్ కె.సుజాత, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆనంద్ పాల్గొన్నారు. -
జూన్లోగా డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మె
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల ప్రధాన డిమాండ్లను జూన్లోగా నెరవేర్చని పక్షంలో మెరుపు సమ్మె చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసఫ్ తెలిపారు. మంగళవారం రాత్రి సీసీసీ కార్నర్లోని నరసయ్య భవన్లో ఏఐటీయూసీ శ్రీరాంపూర్ ఏరియా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, నూతన గనులను ప్రారంభించాలని, మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, కార్మికుల సొంతింటి పథకం అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు, హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ ప్రధా న కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్రావు, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు. -
100 వికెట్లు తీసిన అర్జున్
నిర్మల్టౌన్: పట్టణానికి చెందిన కొప్పుల విజయ,సంజయ్ దంపతుల కుమారుడు కొప్పుల అర్జున్ హైదరాబాద్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి టోర్నమెంట్లలో మొత్తం 100 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 85 మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించి అబ్బుర పరిచాడు. 14 సంవత్సరాల వయసులో ఈ మైలురాయిని అందుకున్న మొదటి వ్యక్తి జిల్లా వాసి కావడం గర్వకారణంగా ఉందని పలువురు ప్రముఖులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా కోచ్రామరాజు అర్జున్ను ప్రత్యేకంగా అభినందించారు. స్క్రాప్ దొంగ అరెస్ట్ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని కృష్ణానగర్లో గల స్క్రాప్ గోదాంలో చోరీకి పాల్పడిన నింది తుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ని ఖార్ అహ్మద్ అనే వ్యక్తి కృష్ణానగర్లో స్క్రాప్ దుకాణం నిర్వహిస్తున్నాడు. మంగళవారం దు కాణంలో వెళ్లి చూడగా గోదాములో సామగ్రి తక్కువగా కనిపించింది. సీసీ కెమెరాలను పరి శీలించగా 15 రోజులుగా మసూద్నగర్కు చెందిన షేక్ తబ్రేజ్ అనే వ్యక్తి చోరీకి పాల్పడుతున్నట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. కలెక్టరేట్ ఎదుట రైతు ఆమరణ దీక్షకై లాస్నగర్: రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలని, పూర్తిస్థాయిలో రైతుభరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తలమడుగు మండల కేంద్రానికి చెందిన రైతు కిషోర్రావు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలన్నారు. రబీ రైతుభరోసా విడుదలలో జాప్యం చేయకుండా తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ డిమాండ్లను అమలు చేయని పక్షంలో రైతులను సంఘటితం చేసి ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. -
మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ వృథా
సిబ్బంది లేకపోయినా వెలుగుతున్న లైట్లు, తిరుగుతున్న ఫ్యాన్లు విద్యుత్ను ఆదా చేయాల్సిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విభాగంలో అవసరం లేకపోయినా ఫ్యాన్లు, లైట్లు ఆన్లో కనిపించాయి. కార్యాలయ గదుల్లో సిబ్బంది లేకపోయినా విద్యుత్ పరికరాలు పనిచేస్తుండటంతో ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ చార్జీలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఖచ్చితంగా పొదుపు చర్యలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయండి
నస్పూర్: మే నెల 9, 10న హైదరాబాద్లోని రవీంద్రభారతీలో నిర్వహించే సైకలాజిస్టుల రాష్ట్ర స్థాయి దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సైకాలజిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రంగు వేణుకుమార్ కోరారు. బుధవారం ఆయన నస్పూర్లోని ప్రకృతి మిత్ర కార్యాలయంలో జిల్లా ముఖ్య బాధ్యులతో సమావేశం నిర్వహించారు. పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 5 నుంచి 10 వరకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో మానసిక ఆరోగ్యం, జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. సైకాలజిస్టులు, మేధావులు, ప్రజ లు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. రాష్ట్ర బాధ్యులు బి.నారాయణరావు, ముఖ్య సలహాదారులు గుండేటి యోగేశ్వర్, కస్తూరి పద్మచరణ్, బాధ్యులు పప్పుల నాగరాజు, చిందం మొగిలి తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్ లక్ష్యం..
భవిష్యత్లో ఐఐటీ పూర్తి చేసి.. సివిల్స్ సాధించడం, సమాజానికి చేయాలన్నదే లక్ష్యమని అమన్ అమృత తెలిపాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధించానని పేర్కొన్నాడు. మంచిర్యాలలోని శ్రీచైతన్య పాఠశాలలో చదివాడు. కాగా, తండ్రి కిషోర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి హరిత గృహిణి. జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన అమన్ అమృతను పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం అరవిందరెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజ్, ప్రధానోపాధ్యాయుడు సంజీవ్ అభినందించారు. -
ఆర్జీయూకేటీలో టీజీసీహెచ్ఈ కమిటీ పర్యటన
బాసర: బాసర ఆర్జీయూకేటీని బుధవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్ఈ) కమిటీ సభ్యులు సందర్శించారు. క్యాంపస్లోని విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏబీ3 భవనంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్యాంపస్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, అకడమిక్ క్యాలెండర్ అమలు, వసతుల లేమిపై విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించారు. తమకు ఎదురవుతున్న ఇబ్బందులను కమిటీ సభ్యుల దృష్టికి విద్యార్థులు నేరుగా తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, నాన్టీచింగ్ స్టాఫ్ కమిటీ సభ్యులు వినతిపత్రాలు అందజేశారు. నివేదికను ప్రభుత్వానికి అందజేసి సమస్యల శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు. -
డీఎఫ్వో శివ్ ఆశిష్సింగ్ బదిలీ
● కొత్త డీఎఫ్వోగా రాహుల్ కిషన్ జాదవ్ నియామకం మంచిర్యాలక్రైం: రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖలో 12మంది జిల్లా అధికారులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్సింగ్ బదిలీ అయ్యారు. రెండున్నరేళ్లుగా ఇక్కడ పని చేస్తున్న ఆయనను మహబూబ్నగర్ జిల్లా అటవీశాఖ అధికారిగా నియమించారు. ఆయన స్థానంలో ఇక్కడికి ములుగు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్(2018 బ్యాచ్ ఐఎఫ్ఎస్)ను బదిలీ చేశారు. కాగా, 2022 సెప్టెంబర్ 14న శివ్ ఆశిష్సింగ్ జిల్లా అటవీ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, అర్బన్ పార్క్ అభివృద్ధి పనుల్లో తనదైన ముద్ర వేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, జాప్యం చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. -
పురుగుల మందు తాగి ఒకరు బలవన్మరణం
వాంకిడి: మద్యం తాగడం మానేయాలని మందలించినందుకు మనస్తాపానికి గురై ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఖమాన గ్రామానికి చెందిన తపాసె నాందేవ్ (46) కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన నాందేవ్ను కుటుంబ సభ్యులు మందలించారు. మనస్తాపానికి గురై రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా గ్రామ శివారులోని పంటచేలలో పడిపోయి కన్పించాడు. నోట్లో నుంచి నురుగు రావడంతో పురుగుల మందు తాగినట్లు గుర్తించారు. మృతుని భార్య పిసుబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
నస్పూర్: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం మంచిర్యాల పరిశీలకులు ఆర్.దశరథ్ అన్నారు. బుధవారం నస్పూర్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన జిల్లా అదనపు కలెక్టర్ రాములు, ఆర్డీఓ శ్రీనివాస్రావు, ప్రత్యేక ఉప పాలనాధికారి చంద్రకళతో కలిసి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో మ్యాపింగ్ శాతాన్ని పెంపొందించడం అత్యవసరమని తెలిపారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫారం 6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తులు నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను ధ్రువీకరించి తొలగించడం లేదా సవరించాలని సూచించారు. ఓటరు జాబితా సమగ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమం విజయవంతానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. -
మహిళా సంఘాలకు పక్కా భవనం
పాతమంచిర్యాల: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల పక్కా భవనాల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. మండల సమాఖ్యలు, గ్రామైక్య సంఘాల(వీవో)కు భవనాలు అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అనువైన స్థలాలను ఎంపిక చేసి నిర్మాణాలు ప్రారంభించారు. సంఘాలకు కొన్ని చోట్ల భవనాలు ఉండగా.. కొన్ని అద్దె, మండల అభివృద్ధి కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి. నెన్నెల మండల సమాఖ్యకు పక్కా భవనం ఉండగా.. దండేపల్లి, మందమర్రిలో భవనాలు శిథిలావస్థకు చేరాయి. భీమారం, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మహిళా సంఘాలకు భవనాలు లేకపోవడంతో సభ్యులకు సమావేశాల నిర్వహణ ఇబ్బందిగా మారింది. దీంతో ప్రతీ గ్రామైక్య సంఘానికి భవనం నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించి రూ.17.4 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.10లక్షల చొప్పున కేటాయించారు. ఉపాధి హామీ నిధులతో నిర్మాణాలు చేపడుతున్నారు. మహిళలు సమావేశాలు నిర్వహించుకునేలా నిర్మిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 170 భవనాల నిర్మాణాలు చేపట్టారు. వీటిలో 20 భవనాల నిర్మాణం పూర్తి కాగా, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. భీమారం మండలంలో 4, చెన్నూర్లో 9, జైపూర్లో 18, కోటపల్లిలో 11, బెల్లంపల్లిలో 26, భీమినిలో 6, కన్నెపల్లిలో 15, కాసిపేటలో 5, నెన్నెలలో 10, తాండూరులో 11, వేమనపల్లిలో 10, దండేపల్లిలో 17, లక్సెటిపేటలో 6, జన్నారంలో 22 గ్రామైక్య సంఘాలకు భవనాలు మంజూరయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 426 గ్రామైక్య సంఘాలు ఉండగా ప్రస్తుతం 170 భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. వేమనపల్లి, కన్నెపల్లి, బెల్లంపల్లి, భీమారం మండల సమాఖ్యల భవనాలు, జైపూర్ మండలంలో గోదాంల నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరయ్యాయి. భవనాల నిర్మాణంతో సామగ్రి నిల్వ చేసుకోవడం, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలకు సౌకర్యంగా ఉంటుందని మహిళా సంఘాల సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ముగిసిన ఖేలో ఇండియా ఫుట్బాల్ పోటీలు
రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా అండర్–16 బాలికల ఫుట్బాల్ పోటీలు బుధవారం ముగిశాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించిన పోటీల్లో కరీంనగర్, రంగారెడ్డి జట్లు ఫైనల్స్కు చేరాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో కరీంనగర్ జట్టు 1–0 గోల్స్ తేడాతో ఛాంపియన్గా, రంగారెడ్డి జట్టు రన్నరప్గా నిలిచాయి. సెమీఫైనల్స్లో ఓడిన ఆదిలాబాద్, నిజామాబాద్ జట్లకు సంయుక్తంగా తృతీయ బహుమతి అందజేశారు. క్రీడలకు సమయం కేటాయించాలి ప్రతిఒక్కరూ క్రీడల కోసం సమయం కేటాయించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఖేలో ఇండియా పోటీల బహుమతి ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల వల్ల పట్టుదల అనేది పెంపొందుతుందని, జీవితంలో ఉన్నతంగా రాణించాలంటే పట్టుదల అనేది చాలా ముఖ్యమన్నారు. స్థానిక ఠాగూర్ స్టేడియంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటు చేయాలని సింగరేణి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మందమర్రి జీఎం రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, స్థానిక ఏరియా ఆసుపత్రి డీవైసీఎంఓ డాక్టర్ మధుకుమార్, ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫాల్గుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గోదావరిలో మునిగి వృద్ధుడు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రమాదవశాత్తు గోదావరిలో నీటమునిగి వృద్ధుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు రంగంపేటకు చెందిన కాయితీ మల్లయ్య (66)కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం పాతమంచిర్యాలకు చెందిన ముదాం ఉమాకర్కు చెందిన గేదెలను మేపేందుకు ముల్కల్ల శివారులోని గోదావరివైపు వెళ్లాడు. సాయంత్రం గోదావరి నీటిలో సేద తీరుతున్న గేదెలను తోలుకు రావడానికి నీటిలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మంగళవారం ఉదయం మృతదేహం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతునికి భార్య రాజేశ్వరి, కుమారుడు కుమార్, కుమార్తెలు మానస, మల్లీశ్వరి ఉన్నారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. వడదెబ్బతో ఒకరు..వాంకిడి: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి వడదెబ్బతో మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొత్త దుబ్బగూడకు చెందిన చిచోల్కర్ రాందాస్(44) చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం చిచోల్కర్ శంకర్, బోయిరె శ్రావణ్తో కలిసి చేపలు పట్టేందుకు అడ ప్రాజెక్టుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చారు. కొద్ది సేపటికి వాంతులు, విరేచనాలు కావడంతో రాందాస్ స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని తండ్రి పొచ్చు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పదేళ్ల క్రితం తల్లి, ప్రస్తుతం తండ్రి మృతితో పిల్లలిద్దరూ అనాధలుగా మిగిలారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..లక్సెట్టిపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల మేరకు హాజీపూర్ మండలం సబ్బపల్లికి చెందిన తురుపాటి పౌల్ (44) గ్యాస్ స్టౌవ్లు రిపేరు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడన్నాడు. వృత్తిలో భాగంగా మంగళవారం ద్విచక్ర వాహనంపై దండేపల్లి వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన జీబు ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుని కుమారుడు మనోజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మట్కా నిర్వాహకుడిపై కేసుఆదిలాబాద్టౌన్: మట్కా నిర్వహిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన క్యాతం శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. మంగళవారం నిందితుడు మట్కా ఆడుతుండగా పట్టుకుని అతని వద్ద నుంచి రూ.300 నగదు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
సబ్సిడీ పేరుతో మోసగించిన నిందితుడు అరెస్ట్
ఉట్నూర్రూరల్: సబ్సిడీ పేరుతో రైతులను మోసగించిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ మడావి ప్రసాద్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన కామెర చంద్రమౌళి మంచిర్యాల లోని ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్లో మేనేజర్నని, భారత్ కిసాన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా ట్రాక్టర్లు , ఇతర పరికరాలు 50 శాతం సబ్సిడీపై ఇప్పిస్తానని భూపేటకు చెందిన రాజమౌళి వద్ద ట్రాక్టర్ కోసం రూ.4 లక్షలతో పాటు డాక్యుమెంట్ చార్జీల పేరుతో రూ.36 వేలు, గంగన్నపేట్కు చెందిన బోర్లకుంట రాజన్న వద్ద రూ.4.25 లక్షలు, దంతనపల్లికి చెందిన సింగిరెడ్డి రవీందర్ రెడ్డి వద్ద గడ్డి కట్టల యంత్రం పేరుతో రూ.1.70 లక్షలు, అదే గ్రామానికి చెందిన కొమ్ముల సందీప్ రెడ్డి వద్ద రూ.1.70 లక్షలు వసూలు చేశాడు. గతేడాది ఆగస్టులో సదరు రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు అందిన సమాచారం మేరకు మంగళవారం ఉట్నూర్ వినాయక చౌక్ వద్ద నిందితుడిని ఎస్సై విజయ్, పోలీస్ సిబ్బంది భూపతి, నరేష్, తానాజీ అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడిపై మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లోని పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు పేర్కొన్నారు. -
భీమినిలో రైతు ఆత్మహత్యాయత్నం
భీమిని: తన భూమిని ఇతరుల పేరిట పట్టా చేశారంటూ ఆరోపిస్తూ ఓ రైతు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నగుడిపేటకు చెందిన రైతు రెడ్డి స్వామి గ్రామ శివారులోని సర్వే నంబర్ 107లో 2.16 ఎకరాల భూమిని పదేళ్ల క్రితం ఏటకారి రామయ్య దగ్గర కొనుగోలు చేశాడు. కాగా, ఈ భూమిలోంచి 1.16 ఎకరాలు కమలాపూర్ ప్రాజెక్ట్ కాలువలో ముంపునకు గురైంది. మిగతా ఎకరంలో తాను పంటలు సాగు చేస్తున్నాడు. కాగా, తన భూమిని మరొకరికి పట్టా చేయించారని స్వామి ఆరోపిస్తూ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాతో భార్యాపిల్ల్ల లతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోనే తాగడానికి యత్నించాడు. దీంతో అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై కోటేశ్వర్ తన సిబ్బందితో చేరుకుని సదరు రైతు నుంచి పురుగుల మందు డబ్బా లాక్కున్నాడు. తనకు దక్కాల్సిన భూమిని మరొకరి పేరిట పట్టా చేశారని, తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నాడు. అనంతరం బాధితులను పోలీస్స్టేషన్కు తరలించారు. భూమి కొనుగోలు వ్యవహారంలో తనను మోసం చేసిన ముగ్గురిపై స్థానిక పోలీస్స్టేషన్లో స్వామి ఫిర్యాదు చేశాడు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్ బికర్ణదాస్ను వివరణ కోరగా నిబంధనల మేరకు సదరు వ్యక్తులు స్లాట్బుక్ చేసుకోవడంతో వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశామని వివరించారు. -
మంచిర్యాల
7ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి వేసవిలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లో ఫ్యాన్లు తిరగక, కూలర్లు నడవక ఎండ వేడిమిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఎండ వేడిమి అధికంగా ఉంటుంది. ఉక్కపోత పెరుగుతుంది.‘నెట్టింట్లో’ కథలు ‘బాలవినోదం బ్లాగ్స్పాట్, ఇన్’ వెబ్సైట్లో చాలా కథలున్నాయి. యానిమేటెడ్ చిత్రాలతో రూపొందించగా వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఎంతో వినోదం అందించనున్నాయి. -
ఆయన కళ్లు సజీవం
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన టి.పాల్ (45) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు అతని నేత్రాలను హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మధుసూదన్రెడ్డి నేత్ర దానానికి ముందుకు వచ్చిన మృతుని కుమారుడు మనో జ్, కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల శాఖ అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి, సభ్యులు డా.సుగుణాకర్రెడ్డి, భాస్కర్రెడ్డి, శంకర్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా ఖేలోఇండియా పోటీలు
రామకృష్ణాపూర్: పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో జరుగుతున్న అస్మిత ఖేలో ఇండియా అండర్–16 బాలికల ఫుట్బాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఎనిమిది జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పోటీలు ముగియగా రంగారెడ్డి, కరీంనగర్ జట్లు ఫైనల్స్కు చేరుకున్నాయి. మంగళవారం సాయంత్రం మొదటి సెమీఫైనల్ మ్యాచ్ కరీంనగర్–ఆదిలాబాద్ జట్ల మధ్య జరుగగా 3–1 గోల్స్తో కరీంనగర్ గెలుపొంది ఫైనల్కు చేరింది. మరో సెమీఫైనల్ మ్యాచ్ స్పోర్ట్స్ స్కూల్ రంగారెడ్డి, నిజామాబాద్ల మధ్య జరుగగా 1–1 గోల్స్తో ఇరు జట్ల మ్యాచ్ టై కావడంతో పెనాల్టీ షూట్అవుట్ నిర్వహించారు. ఉత్కంఠ భరితంగా సాగిన షూట్అవుట్లో 5–4 గోల్స్తో స్పోర్ట్స్ స్కూల్ రంగారెడ్డి జట్టు గెలుపొంది ఫైనల్కు చేరుకుంది. బుధవారం కరీంనగర్, రంగారెడ్డి జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫాల్గుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి, సీనియర్ క్రీడాకారులు ఈశ్వరాచారీ, బెల్లం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీలో ‘ఫిజిక్స్ హబ్’ ప్రారంభం
బాసర: బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన భౌతికశాస్త్ర ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్ ‘ఫిజిక్స్ హబ్’ను మంగళవారం విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ ఏ.గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ భౌతికశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి.దేవరాజు ఈ ఇంటరాక్టివ్ పోర్టల్ను రూపొందించినట్లు తెలిపారు. కఠినమైన భౌతికశాస్త్ర భావనలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఇందులో విజువల్ సిమ్యులేషన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. క్యాంపస్లోని సుమారు 1,500 మంది పీయూసీ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. -
‘నీట్’ పకడ్బందీగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రిల్చర్: నీట్ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రాములు, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావు, జిల్లా విద్యాధికారి యాదయ్యతో కలిసి నీట్ పరీక్ష నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. నీట్ పరీక్ష నిర్వహణ కోసం అవసరమైన ఏ ర్పాట్లు చేయాలని తెలిపారు. కంట్రోల్ రూమ్, పరీ క్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షాకేంద్రాల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. పాలనా విభాగం నుంచి ఒక నోడల్ అధికారి, పోలీస్శాఖ నుంచి నోడల్ అధి కారిని నియమించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష స మయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యు త్ సరఫరా చేయాలని సూచించారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని నియమించి, ఓఆర్ఎస్తోపాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. నిబంధనల ప్ర కారం జిల్లాలో అవసరమైన పరీక్షాకేంద్రాలు ఏర్పా టు చేయాలని, దివ్యాంగ అభ్యర్థుల కోసం సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జిల్లాలో నీట్ పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. -
పాఠ్యపుస్తకాలొచ్చాయ్..
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు 84.39శాతం జిల్లాకు చేరాయి. ఇంకా 15.61శాతం రావాల్సి ఉంది. పాత మంచిర్యాలలోని బుక్డిపోకు పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతున్నాయి. గతంలో ఆలస్యం కారణంగా విద్యార్థులకు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈసారి బడులు తెరిచేనాటికే పుస్తకాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాకు అవసరమైన పుస్తకాలుజిల్లాలో 480 ప్రాథమిక, 96 ప్రాథమికోన్నత, 108 ఉన్నత పాఠశాలలుండగా 38,298 మంది విద్యార్థులు చదువుతున్నారు. 18 కేజీబీవీల్లో 4,640 మంది, ఐదు మోడల్ స్కూళ్లలో 3,073 మంది విద్యార్థులు న్నారు. జిల్లాకు 4,06,052 పాఠ్యపుస్తకాలు అవసరమున్నాయి. పార్ట్–1 పుస్తకాలు 3,05,620 అవస రం కాగా, ఇప్పటికే 2,57,910 జిల్లాకు చేరాయి. ఇంకా 47,710 పుస్తకాలు రావాల్సి ఉంది. పార్ట్–2 లో ఇంకా 90,290 పుస్తకాలు చేరాల్సి ఉంది. గ్రౌండ్ బ్యాలెన్స్లో 10,142 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మే చివరివరకు పుస్తక విక్రయ కేంద్రం నుంచి పాఠ్యపుస్తకాలను మండల పాయింట్లకు సరఫరా చేసేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. నేరుగా పాఠశాలలకే నోట్ పుస్తకాలుహైదరాబాద్ నుంచి నేరుగా పాఠశాలలకే నోట్ పుస్తకాలు సరఫరా కానున్నాయి. వీటిని సకాలంలో పంపిణీ చేసేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. కేజీబీవీల్లో విద్యార్థినులంతా పేదవారే కావడంతో ఉచితంగా పంపిణీ చేసే నోట్బుక్స్పైనే ఆధారపడుతుంటారు. నోట్పుస్తకాలు గతంలో సకాలంలో సరఫరా కాకపోవటంతో వారిపై ఆర్థికభారం పడింది. ఈ నేపథ్యంలోనే ఈసారి 1నుంచి 12వ వతరగతి విద్యార్థినులకు నోట్బుక్స్ సరఫరా, పంపిణీ షె డ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 22 నుంచి ప్రారంభమై మే 31నాటికి పూర్తి కావాలని ఆదేశాలు వచ్చాయి. మండల విద్యాశాఖ అధికారులు ప్రతిరోజూ సరఫరాను పర్యవేక్షిస్తూ.. పాఠశాల ల వారీగా నిల్వల వివరాలు డీఈవోలకు నివేదించా ల్సి ఉంటుంది. హెచ్ఎం లేదా ఒక ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, వర్క్పుస్తకాల స్వీకరణ, పంపిణీకి సంబంధించిన వివరాలను ఐఎస్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని అధి కారులు సూచించారు. జీరో ఎన్రోల్మెంట్ (విద్యార్థులు లేని) పాఠశాలలకు నోట్ బుక్స్ వెళ్తే వాటిని వెంటనే గుర్తించి జిల్లా ప్లానింగ్ కో ఆర్డినేటర్, డీఈ వో కార్యాలయానికి అప్పగించాలని ఆదేశించారు. -
‘గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి పోరాడుదాం’
జన్నారం: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికుల సంక్షేమం కోసం పోరాడుదామని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లెడ భూమన్న అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. ఉపాధి కోసం వివిధ దేశాలకు వెళ్లిన 1900 పైగా గల్ఫ్ కార్మికులు ఉపాధి వేటలో మృతి చెందారన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చినప్పటికీ గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో నష్టపోవాల్సి వస్తుందన్నారు. గల్ఫ్ దేశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన కార్మికులకు ఆసరా పెన్షన్ అందజేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సేపూరి గోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరగొండ తిరుపతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరుగు మల్లికార్జున్, మండల అధ్యక్షుడు మగ్గిడి తిరుపతి, ప్రధాన కార్యదర్శి దుమ్మల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్ట్ పనులు సక్రమంగా చేపట్టాలి
తాండూర్: మండలంలోని చౌటపల్లి గ్రామపంచా యతీ పరిధిలో పీఎం అజయ్ పథకం ప్రాజెక్ట్ పనులు సక్రమంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్ర య్య సూచించారు. మంగళవారం చౌటపల్లి గ్రామపంచాయతీని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పీఎం అజయ్ పథకం కింద చేపట్టిన పనుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య పనులు, మురుగుకాలువల్లో పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేసవిలో నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఆయన వెంట చౌటపల్లి సర్పంచ్ ముదాం సునీత, డీఎల్పీవో సతీశ్కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో అనిల్కుమార్, పంచాయతీ కార్యదర్శి వసంత ఉన్నారు. -
రవాణా వ్యవస్థ మెరుగుపరుస్తాం
భీమారం: అన్ని గ్రామాలకు రోడ్లు నిర్మించి రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి పేర్కొన్నారు. మండలంలోని గెర్రిగూడెం నుంచి నర్సింగాపూర్ మీదుగా కాజిపల్లి వరకు రూ.4.40 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. బూర్గుపల్లి నుంచి కాజిపల్లి, ధాంపూర్ మధ్య రింగ్ రోడ్డు ని ర్మించనున్నట్లు పేర్కొన్నారు. వేసవిలో ప్రజలకు నీ టి సమస్య రాకుండా అనేక చర్యలు చేపట్టినట్లు తెలి పారు. అదనంగా బోరువెల్స్ ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చుతున్నట్లు పేర్కొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపా రు. దాంపూర్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని విజయవంతం చేసినందు కు అధికారులను అభినందించారు. వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, నాయకులున్నారు. -
క్రీడలూ ముఖ్యమే..
శ్రీరాంపూర్: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమేనని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ.. 25రోజు ల పా టు శిక్షణ శిబిరం కొనసాగుతుందని తెలిపా రు. విద్యార్థులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొ ని రాణించాలని సూచించారు. సెలవుల్లో సె ల్ఫోన్లు పట్టుకుని సమయం వృథా చేయరా దని తెలిపారు. మైదానంలో ఆటలు ఆడడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పిల్లల్లో శా రీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసాని కి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయ ని చెప్పా రు. ఏరియా ఎస్వోటూ జీఎం ఎన్.సత్యనారా యణ, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్రావు, డీజీఎం (పర్సనల్) అనిల్కుమార్, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి, స్పోర్ట్స్ గౌరవ కార్యదర్శి పాల్సృజన్, కోఆర్డినేటర్ నర్సయ్య పాల్గొన్నారు. -
సుర్రుమంటున్న ఓసీపీలు
శ్రీరాంపూర్: భానుడి ప్రతాపానికి సింగరేణి ఓసీపీలు సుర్రుమంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో కార్మికులు విలవిల్లాడుతున్నారు. సాధారణ ప్రాంతాలతో పోల్చితే మైనింగ్ ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయి. మూడురోజులుగా 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ఓసీపీల్లో బొగ్గు వేడికి మరో రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతుతున్నాయి. మే లో దంచికొట్టే ఎండలు ఈ సారి ముందే ప్రతాపం చూపుతున్నాయని కార్మికులు పేర్కొంటున్నారు. భూగర్భ గనుల్లో పని చేసే కార్మికుల కన్నా ఓసీపీల్లో పని చేసేవారిపైనే తీవ్ర ప్రభావం ఉంటుంది. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో ఐదు ఓసీపీలున్నాయి. వీటిలో బెల్లంపల్లి ఏరియాలోని కై రిగూడ, మందమర్రి పరిధిలోని కేకే, ఆర్కేపీ, శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ, ఇందారం ఓసీపీలున్నాయి. వీటన్నింటిలో కార్మికులు ఎండ తీవ్రతను తట్టుకోవడం కోసం యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈసారి కూడా క్వారీల్లో అధికారులు చలువ పందిళ్లు వేయించి మట్టి కుండల్లో నీటిని ఉంచుతున్నారు. కొన్నిచోట్ల కూల్ క్యాన్లు పెట్టించారు. టవల్స్, గొడుగులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు. కొన్ని డిసిగ్నేషన్ల వారికి కూల్ బాటిళ్లు అందించారు. డంపర్లు, షవల్స్, ఇతర భారీ యంత్రాల్లో ఏసీలు పూర్తి కండిషన్ చేయించారు. కాగా, ఓసీపీల్లో మాదిరిగా అన్ని భూగర్భ గనులు, సర్ఫేస్ డిపార్టుమెంట్లు, సీహెచ్పీలతోపాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా మార్చని షిఫ్ట్ వేళలుఓసీపీల్లో ఎన్ని ఉపశమన చర్యలు చేపట్టినా ఎండదెబ్బ నుంచి కాపాడలేకపోతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా గతంలో మే నెలలో పని వేళలు మార్చేవారు. రెండేళ్లుగా షిఫ్ట్ వేళలు మార్చడం లేదు. దీంతో కార్మికులు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఈసారి ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా యాజమాన్యం షిఫ్ట్ వేళలు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం షిఫ్ట్ ఉదయం 7నుంచి మధ్యాహ్నం 3గంటలకు వరకు ఉండగా.. ఉదయం 6నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 3నుంచి రాత్రి 11గంటల వరకు ఉన్న సెకండ్ షిఫ్ట్ను సాయంత్రం 4నుంచి రాత్రి 11గంటల వరకు మార్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. షిఫ్ట్ వేళలు మార్చాలి గత రెండేళ్ల కంటే ఈసారి ఎండలు తీవ్రంగా ఉన్నందునా షిఫ్ట్ వేళలు మార్చాలి. ఎన్ని ఉపశమన చర్యలు చేపట్టినా కార్మికులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. తక్షణమే కంపెనీ దీనిపై ఉత్తర్వులు జారీ చేయాలి. అన్ని సర్ఫేస్ విభాగాల్లో పని చేసే కార్మికులకు కూడా ఓసీపీల్లో మాదిరిగా ఉపశమన చర్యలు చేపట్టాలి – బండి రమేశ్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు -
వేర్వేరుచోట్ల మొక్కజొన్న దగ్ధం
పెంబి: మండల కేంద్రం శివారులో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్సర్క్యూట్తో పదెకరాల మొక్కజొన్న దగ్ధమంది. స్థానికులు తెలిపిన వివరా ల మేరకు పెంబి శివారులో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ తీగలు తాకి నిప్పురవ్వలు ఎగిసిపడటంతో గోస్కూల శ్రీనివాస్, గోస్కూల తిరుమల, ఎలిగేటి అనిల్ కుమార్, కోప్పుల జ్యోతి, ఒద్నాల ఉమకు చెందిన పదెకరాల మొక్కజొన్న పూర్తిగా కా లి బూడిదయ్యింది. విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ని వివరణ కోరగా.. సంఘటన స్థలాన్ని పరిశీలించా మని, షార్ట్సర్క్యూట్తో జరిగిన ఆనవాళ్లు లేవన్నా రు. సంఘటన స్థలాన్ని ఎంఆర్ఐ శ్రావణ్ రెడ్డి, ఏ ఈవో నాగమణి, జీపీవో భాస్కర్ పరిశీలించారు. రూ.7.56 లక్షలనష్టంవాటిల్లినట్లు అంచనా వేశారు. మాలేగాంలో... కుభీర్: మండలంలోని మాలేగాంలో మంగళవారం ఉదయం బండారి భోజన్న అనే రైతుకు చెందిన 2ఎకరాల 30 గుంటల్లో మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. సుమారు రూ.2లక్షల నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు భోజన్న కోరుతున్నాడు. -
జీయర్ గురుకులంలో ఇంటర్ విద్య
కడెం: విద్య, వినయం, విధేయతతో కూడిన విద్య కు ప్రతి రూపంగా నిలుస్తోంది. కడెం మండలంలోని అల్లంపల్లి జీయర్ గురుకుల పాఠశాల. మారుమూల గ్రామాల పిల్లలకు నేటికీ విద్య అందని ద్రాక్షే. కనీస మౌలిక సౌకర్యాలు నోచుకొని గిరి గ్రామంలో చిన జీయర్స్వామి సకల వసతులతో గురుకుల పాఠశాలను నెలకొల్పి కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తున్నారు. గురుకులంలో ఈ విద్యాసంవత్సరం నుంచి కళాశాలను ప్రారంభిస్తున్నారు. ఇంటర్ విద్య.. మండలంలోని అల్లంపల్లిలో పాఠశాల విద్యనే అందని ద్రాక్షగా మారింది. ఈ తరుణంలో చిన జీయర్స్వామి చొరవతో 2004లో ఇక్కడ జీయర్ గురుకులాన్ని స్థాపించారు. ఇందులో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచిత వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. ఈ ఏడాది నుంచి గురుకులంలో ఇంటర్ కళాశాలను ప్రారంభిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో పాటు మారుమూల విద్యార్థులు సివిల్స్ సాధించేలా సీబీఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు బాలలత ఆధ్వర్యంలో సివిల్స్ ఫౌండేషన్ కోర్సు అందించనున్నారు. కార్పొరేట్ స్థాయి కళాశాల, హాస్టల్ వసతికి ఏడాదికి నామమాత్రంగా ఎస్టీ విద్యార్థులకు రూ.10 వేలు, ఇతరులకు రూ.50 వేలు ఫీజు నిర్ణయించారు. గురుకుల విద్యార్థులు మెరికలు చినజీయర్స్వామి గురుకుల పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, యోగా, అర్చరీలో రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు. ఇక్కడ విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే తల్లిదండ్రులు కళాశాలలో ప్రవేశం కొరకు 8179923758, 9951666316 నంబర్లలో సంప్రదించాలని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్) అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, ప్రిన్సిపాల్ అడెపు మహేందర్ కోరారు. -
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్విని యోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మంచిర్యాల అదనపు వి.రాములు సూచించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాప్రాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా బాల పరిరక్షణ విభాగం ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీనేజ్ ప్రెగ్నెన్సీ, ఎల్లోప్మెంట్ కేసెస్పై అవగాహన కార్యక్రమానికి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ఖాన్, సంక్షేమశాఖ అధికారి దుర్గాప్రసాద్, జిల్లా వైద్య, ఆరో గ్యశాఖ అధికారి అనిత, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులతో హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కౌమార దశలో పిల్లల్లో ఏర్పడే మా ర్పులపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ, ఎల్లోప్ మెంట్ కేసులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. -
‘నెట్టింట్లో’ కథలు
లక్ష్మణచాంద:పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. సెలవుల్లో విద్యార్థులు ఇంటివద్ద మొబైల్ ఫోన్లలో పనికి రాని గేములు, అనవసరమైన సినిమాలు, పాటలు చూసి సమయం వృధా చేయకుండా మంచి పుస్తకాలు చదివేలా అంతర్జాలం వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కథలు చదివేలా... గతంలో వేసవి సెలవులు వచ్చాయంటే చాలు తల్లిదండ్రులు తమ పిల్లలను పల్లెటూర్లలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యల ఇళ్లకు తీసుకెళ్లేవారు. రాత్రి అయ్యిందంటే చాలు అక్కడ ఆరు బయట మంచాలు వేసుకుని తాతయ్య, అమ్మమ్మలు పిల్లలను తమ వద్ద కూర్చోబెట్టుకుని ఆకాశంలో చుక్కలను చూపిస్తూ ‘అనగనగా ఒక రాజు.. ఆ రాజుకు నలుగురు కుమారులు..’ అంటూ మంచి మంచి నీతి కథలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కానరావడం లేదు. అంతర్జాలంలో ఎన్నో... కాలం మారింది. కథలు చెప్పే తాతయ్యలు లేరు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లో అంతర్జాలంలో చాలా కథల బ్లాగులు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వాటిని ఆన్లైన్లో పిల్లలు చదివేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని కోరుతున్నారు. నీతి కథలు, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, మహనీయుల జీవిత చరిత్రలు వంటివి పిల్లలు చదివేలాగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బాల వినోదం బ్లాగ్స్పాట్.ఇన్ అంతర్జాలంలో బాలవినోదం బ్లాగ్స్పాట్.ఇన్ వెబ్సైట్లో కథలు ఉన్నాయి. యానిమేటెడ్ చిత్రాలతో ఈ వెబ్సైట్ను రూపొందించారు. ప్రతీపేజీలో అందమైన డిజైన్లతో కూడిన బొమ్మలు, నీతి కథలు కనిపిస్తాయి. పిల్లలకు ఇందులో ఫొటో కాంటెస్ట్ పరీక్ష కూడా ఉంటుంది. మ్యాజిక్కీస్.కామ్ ఇది మరొక వైబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా పిల్లలు స్టోరీ బుక్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇందులో యానిమేషన్తో కూడిన కథలు చాలా ఉంటాయి. చిట్టి పొట్టి కథల పుస్తకాలతో పాటు మనకు కావాల్సిన వివిధ రకాల పుస్తకాలు కొనుగోలు చేసేందుకు కూడా అవకాశం ఉంది. పిల్లలను ఇట్టే ఆకట్టుకునేందుకు వివిధ రకాల బొమ్మలతో కూడిన కథలు గల మంచి పుస్తకం.ఇన్ అనే వెబ్సైట్ ఉంది. ఇందులో ప్రధానంగా పరమానందయ్య శిష్యులు, చిట్టి చిలుకమ్మా, చిట్టి కథలు.. వంటివి ఉంటాయి. వీటిని పిల్లలు చూడవచ్చు. -
మ్యాపింగ్ జాప్యం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కోసం చేపట్టిన ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ జిల్లాలో ఆశించిన మేర ముందుకుసాగడం లేదు. గత నాలుగు నెలలకుపైగా సాగుతున్నా.. ఇంకా 70శాతం ప్రక్రియ కూ డా పూర్తి కాలేదు. దేశ వ్యాప్తంగా సమగ్ర ఓటర్ల జా బితా కోసం ఎన్నికల కమిషన్ ప్రతీ 25 ఏళ్లకోసారి సర్వే చేయడం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002లో సర్వే నిర్వహించగా ప్రస్తుతం మళ్లీ జరుగుతోంది. తెలంగాణలో ఏప్రిల్ నుంచే ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సర్వే ప్రారంభం కావాల్సి ఉన్నా ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు, జనగణన తదితర కారణాలతో జాప్యం జరుగుతోంది. రికార్డుల్లో 6.67లక్షల మంది ఓటర్లుజిల్లాలోని ప్రధాన నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు పరిధిలో 6.67లక్షల మంది ఓ టర్లున్నట్లు రికార్డుల్లో ఉంది. ప్రస్తుతం ఓటరు మ్యా పింగ్ ప్రక్రియ జరుగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి మ్యా పింగ్ చేస్తున్నారు. అంటే.. గతంలో జరిగిన సవరణ ఆధారంగా ఉన్న జాబితా ప్రకారం ఒక్కో కుటుంబంలో ఇంటి పెద్ద తల్లి, తండ్రి, భర్త, కొడుకు, కూ తురు ఓటరును పోల్చుతూ ఒకేచోట మ్యాపింగ్ చే స్తున్నారు. అంటే, ఒక కుటుంబాన్ని ఒకేచోట చేర్చి మ్యాపింగ్ చేస్తుంటారు. ఒకవేళ ఓటరు జాబితాలో ఉన్న అడ్రస్ ప్రకారం వ్యక్తులు స్థానికంగా నివాసం లేకుంటే మ్యాపింగ్ చేయరు. దీంతో త్వరలో సమగ్రంగా చేపట్టే సర్వేలో ఇక్కడే ఓటు ఉండాలని భావి స్తే, ఈ ప్రాంతానికి చెందిన వారిమేనని దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు పొందిన 12రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించాలి. లేకుంటే ఆ ఓటరును జాబితా నుంచి తొలగిస్తారు.జిల్లాలో మ్యాపింగ్ వివరాలుఅడ్డగోలుగా రెండేసి ఓట్లుస్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టే ముందు జరుగుతున్న ఈ మ్యాపింగ్లో డబుల్ ఓట్లు బయటపడుతున్నాయి. ఇప్పటికే రెండేసి ఓట్లు, వలస వెళ్లి మరోచోట ఉన్న ఓట్లు, మృతులు, ఇతర నియోజకవర్గాలకు అడ్రస్ మార్చుకున్న ఓటర్ల వివరాలు తెలిసిపోతున్నాయి. చాలాచోట్ల ఓట రు జాబితాలో ఉన్న ఓటర్లు స్థానిక పోలింగ్ కేంద్రాల పరిధిలో నివాసం లేరు. దీంతో వారందరి ఓట్లు మ్యాపింగ్కు దూరంగా ఉంటున్నాయి. బూత్ లెవెల్ అధికారులు వారి ఫోన్ నంబర్లు తెలుసుకుని ఆరా తీసి ఎక్కడ ఓటు ఉందో.. లేదో.. కనుక్కుని ఆ మేరకు వివరాలు నమోదు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఫోన్ నంబర్లు, వారంతా ఎక్కడ ఉంటున్నారో కూడా స్పష్టత లేకుండా ఉంది. జిల్లా కేంద్రంతోపాటు సింగరేణి కార్మికులు, పట్టణాల్లో ఉన్న వారంతా జిల్లాలో కొంతకాలం ఉండి ఆ తర్వాత శాశ్వతంగా వలస వెళ్లి పోయారు. దీంతో ఆ ఓట్లు తదుపరి జాబితాలో తొలగించే అవకాశముంది. ప్రత్యేక సమగ్ర సవరణలో మళ్లీ తమ పేర్లు స్థానికంగా ఉన్నట్లుగా నమోదు చేయాలంటే ఏదైన ధ్రువీకరణ పత్రం తప్పకుండా చూపించాల్సి ఉంది. అయితే, చాలామందికి రెండేసి ప్రాంతాల్లో ఓట్లున్నట్లు తెలుస్తోంది. రెండుచోట్ల ఓట్లున్నవి కూడా సర్వేతో బయటపడుతున్నాయి. మరోవైపు పట్టణా ల్లో మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలంటూ బూత్ స్థాయి అధికారులతో నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. -
బ్యాటరీల చోరీ కేసులో నిందితుల అరెస్ట్
మందమర్రిరూరల్: సింగరేణి బ్యాటరీల చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ రమేశ్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మందమర్రి ఏరియాలోని స్టోర్స్లో ఈ నెల 20న విలువైన బ్యాటరీలో చోరీకి గురయ్యాయి. సింగరేణి అధికారుల ఫిర్యాదు మేరకు 25న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలోని నార్లాపూర్ సమీపంలో నేషనల్ హైవేపై ఎస్సై నరేష్, సిబ్బందితో కలిసి ఆటోను తనిఖీ చేయగా 25 బ్యాటరీలు లభించాయి. ఆటోలో ఉన్న వారిని ప్రశ్నించగా స్టోర్స్లో దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. బ్యాటరీలను స్వాధీనం చేసుకుని నిందితులు మునియప్ప, నరేంద్ర, శివప్రసాద్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
రెబ్బెన: నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు సీఐ సంజయ్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొమురవెళ్లికి చెందిన గజ్జల సూర్యకాంత్, అతని స్నేహితులైన జక్కులపెల్లికి చెందిన ధోని రాజేశ్, కొమురవెళ్లికి చెందిన కొల్లూరి సాయికిరణ్లు ఏపీలోని శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద నకిలీ పత్తి విత్తనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడి రైతులకు అంటకట్టే ప్రయత్నం చేశారన్నారు. తమకు అందించిన పక్కా సమాచారం మేరకు సూర్యకాంత్ వద్ద నుండి 175 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.4,37,500 ఉంటుందన్నారు. మండల వ్యవసాయాధికారి దిలీప్ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
గోల్డ్ లోన్ బాధితుల ఆందోళన
చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచిలో గోల్డ్ లోన్ బాధితులు సోమవారం ఆందోళన చేపట్టారు. గత ఏడాది బ్యాంకులో చోరీ అయిన బంగారు ఆభరణాలు లభించినా నేటి వరకు బాధితులకు ఇవ్వకపోవడం దారుణమని వా పోయారు. బ్యాంకును సందర్శించిన డీజీఎం విజయ్ కుమార్ సాహు బాధితులతో మాట్లాడారు. బంగారం కోర్టు పరిధిలో ఉందని, రు ణం పొందే సమయంలో బంగారం ధర ఎంత ఉందో ఆ ధర చెల్లిస్తామని తెలిపారు. బాధితులు ముందుకు వస్తే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. బాధితులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం డీజీఎంకు అందజేశారు. ఏజీఎం రితేష్ గుప్తా, మేనేజర్ రాజేష్, బ్యాంకు అధికారులు, గోల్డ్ లోన్ బాధితులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో మహిళ హత్య
ఆదిలాబాద్టౌన్: మద్యం మత్తులో మహిళపై లైంగికదాడికి యత్నించిన నిందితుడు ఆమె ప్రతిఘటించడంతో హత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్చౌక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వన్టౌన్ పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు. ఈమేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని వన్టౌన్లో ఎస్పీ అఖిల్మహాజన్ విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 24న పంజాబ్చౌక్ సమీపంలోని డ్రెయినేజీలో జనగమ్వార్ అనిత మృతదేహం లభ్యమైంది. మృతురాలి సోదరుడు సంతోష్ ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేశాడు. శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో మహారాష్ట్రకు చెందిన నర్సింగా సంతోబా గంపల్వాడ్ను నిందితుడిగా గుర్తించాం. మృతురాలు ఘటనా స్థలంలో విశ్రాంతి తీసుకునే సమయంలో మద్యం మత్తులో ఉన్న నిందితుడు చెత్త ఏరుకునే ఆమెను ఎవరూ లేని ప్రదేశమైన కాలువ వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురై గొంతు నులిమి హత్య చేశాడు. ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహన్ని డ్రెయినేజీలో పడేశాడు. కాగా, కేసును 48 గంటల్లో చేధించినట్లు ఎస్పీ తెలిపారు. నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసును ఛేదించిన వన్టౌన్ సీఐ సునిల్ కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సైలు సంజయ్, అశోక్ను ప్రత్యేకంగా అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలతో పాటు నగదు రివార్డులు అందజేశారు. -
ప్రాణం పోసిన ‘108’
నార్నూర్: పురిటి నొప్పుల వేళ ఓ నిండు గర్భిణికి సకాలంలో వైద్యసేవలు అందక 108లో ప్రసవించాల్సిన దుస్థితికి నిదర్శనం ఈ ఘటన. వైద్యసిబ్బంది అందుబాటులో లేని ఆసుపత్రుల కంటే ఆపత్కాలంలో అండగా నిలిచిన వారి మానవత్వమే తల్లీ బిడ్డను కాపాడాయి. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చిత్తగూడ గ్రామానికి చెందిన రంభబాయికి సోమవారం ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే గాదిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఝరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడా సిబ్బంది లేకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. చివరకు 108లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలో లోకారి సమీపంలో ఆమె ప్రసవించింది. అంబులెన్స్ సిబ్బంది చొరవతో ఆమె ఆడ శిశువుకు జన్మినిచ్చింది. అనంతరం రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కాగా, ఈ ఘటనలో ఆ తల్లి పురిటి వేదన హృదయ విదారకంగా నిలిచింది. సకాలంలో వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో ఆమె ప్రాణాలకు ముప్పు తలెత్తే పరిస్థితి ఏర్పడింది. రెండు చోట్ల వైద్య సిబ్బంది లేకపోవడం సర్కారు దవాఖానాల దుస్థితికి అద్దం పడుతోంది. -
ద్విచక్ర వాహనంపై నుంచి పడి మహిళ మృతి
బోథ్: సొనాల మండలంలోని గుట్టపక్కతండా గ్రామానికి చెందిన సైనాబాయి (35) ద్విచక్రవాహనంపై నుంచి పడి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సైనాబాయి తన అల్లుడు మట్ట నందుసింగ్ బైక్పై ఉదయం 6.30 గంటల సమయంలో చేనుకు వెళుతోంది. గంపలు తీసుకుని బైక్పై వెళుతుండగా సొనాల సమీపంలో అవి కదలడంతో ఒక్కసారిగా ఆమె జారి కిందపడింది. తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికుల సాయంతో బోథ్లోని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతిచెందింది. కాగా మృతురాలికి భర్త సదాశివ్, కుమారుడు ఉన్నారు. పనిముట్ల కొరత లేకుండా చూడాలిశ్రీరాంపూర్: గనుల్లో పనిముట్లు, యంత్రాల స్పేర్స్ కొరత లేకుండా చూడాలని శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ తెలిపారు. సోమవారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏరియా పర్చేజ్ అధికారులతో సమీక్షించారు. గనుల్లో యంత్రాల ని ర్వహణకు అవసరమయ్యే పరికరాల కొరత లేకుండా చూడాలన్నారు. నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలంటే యంత్రాలు నిర్ధేశించిన పని గంట లు పని చేయాలని తెలిపారు. ఇందుకోసం యంత్రాల బ్రేక్ డౌన్ అయినప్పుడు జాప్యం జరుగకుండా విడిభాగాలు సమకూర్చాలని, కొనుగోలు టెండ ర్లు, పనులు వేగవంతంగా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జీఎం యన్. సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ రమణారావు, ఏజెంట్లు రవికుమార్, శ్రీధర్, ఓసీపీ పీఓ వెంకటేశ్వ ర్లు, అధికారులు నాగరాజు, రామకృష్ణ, మోహన్, మల్లేశ్, రవీందర్, చంద్రలింగం పాల్గొన్నారు. -
ఆర్కేపీలో క్రీడా సందడి
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్లోని సింగరేణి ఠా గూర్స్టేడియంలో అస్మిత ఖేలో ఇండియా అండర్–16 బాలికల ఫుట్బాల్ పోటీలు సోమవారం ఘ నంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఫుట్బాల్ అసో సియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో ఎనిమిది జిల్లాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఎండల దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు మైదానాల్లో మ్యాచ్లు జరుగుతున్నాయి. ఉదయం జరిగిన మ్యాచ్ల్లో తొలుత నిజామాబాద్, గజ్వేల్ జట్లు తలపడగా 7–0 గోల్స్తో నిజామాబాద్ విజయం సాధించింది. రెండో మ్యాచ్ ఆదిలాబాద్, సిద్దిపేట జట్ల మధ్య జరుగగా 13–0 గోల్స్తో ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్ రంగారెడ్డి, హైదరాబాద్ జట్ల మధ్య జరుగగా 1–0 గోల్స్తో రంగారెడ్డి జట్టు గెలుపొందింది. మరో మ్యాచ్ కరీంనగర్, వనపర్తి జట్ల మధ్య జరుగగా 1–0 గోల్స్తో కరీంనగర్ జట్టు విజయం సాధించింది. ఇక సాయంత్రం జరిగిన మ్యాచ్ల్లో కరీంనగర్, గజ్వేల్ జట్లు తలపడగా 6–0 గోల్స్తో కరీంనగర్ గెలుపొందింది. ఆదిలాబాద్, మల్కాజిగిరి మధ్య జరిగిన మ్యాచ్లో 2–0 గోల్స్తో ఆదిలాబాద్ గెలిచింది. సిద్దిపేట, రంగారెడ్డి జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 0–10 గోల్స్తో రంగారెడ్డి, వనపర్తి, నిజామాబాద్ మధ్య జరిగిన మ్యచ్లో 6–0 గోల్స్తో నిజామాబాద్ గెలుపొందాయి. పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన మార్చ్ఫాస్ట్ ఆకట్టుకుంది. క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలి – సీఐ రమేష్, మందమర్రి క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలని గెలుపోటములను సమానంగా స్వీకరించాలని మందమర్రి సీఐ పర్స రమేష్ అన్నారు. క్రీడల్లో రాణించటం వల్ల మంచి భవిష్యత్ ఉంటుందని, ముఖ్యంగా క్రమశిక్షణ ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరిత, సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, పట్టణ ఎస్సై శ్రీధర్, ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫాల్గుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పల్లె రాజు, వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు ఈశ్వరాచారి, బెల్లం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
బడి ముగిసింది.. బాధ్యత మిగిలింది..!
నిర్మల్ఖిల్లా: వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. పిల్లలు పుస్తకాలు పక్కనపెట్టేశారు. ఆట పాటలతో ఎంజాయ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల అసలు బాధ్యత ఇప్పుడే మొదలైంది. వచ్చే 45 రోజులు పిల్లలను ఎండల దెబ్బ నుంచి రక్షించి, కాలక్షేపం, మంచి ప్రవర్తన, ఆరోగ్యం విషయాల్లో శ్రద్ధ చూపాలి. ఈ 45 రోజుల కాలంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలతో ప్రమాదాలు.. ఈసారి ఎండలు తీవ్రంగా ఉండటంతో పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. దీంతో బయ టకు వెళ్లకుండా పిల్లలు మొబైల్లు, టీవీలకు అతుక్కునే ప్రమాదం ఉంది. ఇది కంటి సమస్యలు, నిద్రలేమి, ఆగ్రహ స్వభావాన్ని తీసుకొస్తుంది. సరైన మార్గదర్శకత లేకపోతే అలవాట్లు దెబ్బతింటాయి. సృజనాత్మక కార్యక్రమాలు.. పిల్లలను ఇండోర్ ఆటలు, పుస్తక పఠనం, కథలు, చిత్రలేఖనం, పజిల్స్ వైపు మళ్లించండి. కుటుంబ సభ్యులతో ఆటలు ఆడటం సామాజిక నైపుణ్యాలను పెంచుతుంది. మొబైల్, టీవీ వాడకాన్ని పరిమితం చేసి, మేధోపరమైన కార్యక్రమాలకు ప్రోత్సాహించండి. ఆరోగ్య జాగ్రత్తలు.. మధ్యాహ్నం వేళల్లో పిల్లలను బయటకు పంపొద్దు. ఉదయం తొందరగా లేదా సాయంత్రం చల్లని సమయాల్లో మాత్రమే అనుమతించాలి. తగినంత నీరు, పండ్ల రసాలు, తేలికపాటి ఆహారం ఇవ్వాలి. హైడ్రేషన్పై శ్రద్ధ పెట్టండి. చదువు, ఆటలు, విశ్రాంతి సమయాలను సమతుల్యం చేసే షెడ్యూల్ రూపొందించాలి. ఇది క్రమశిక్షణను పెంచుతుంది. బాధ్యతలు తెలిసేలా... క్లే మోడలింగ్ (మట్టితో బొమ్మలు చేయడం), పెయింటింగ్, ఒరిగామి (కాగితపు కళలు) నేర్పించాలి. అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పురాణ గాధలు, నీతికథలు వినేలా ప్రోత్సహించాలి. ఇది వారి భాషా పరిజ్ఞానాన్ని, విలువలను పెంచుతుంది. మొక్కలకు నీళ్లు పోయడం, ఇంటిని సర్దడం వంటి పనుల్లో పిల్లలను భాగస్వామ్యం చేస్తే వారికి బాధ్యత తెలుస్తుంది. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. -
శతాధిక వృద్ధురాలి నేత్రదానం
బెల్లంపల్లి: బెల్లంపల్లికి చెందిన ఓ శతాధిక వృద్ధురాలి రెండు కళ్లను సోమవారం ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. పట్టణంలో ని హన్మాన్బస్తీకి చెందిన డోలి నర్సమ్మ(103) అనా రోగ్యంతో మృతిచెందింది. జనహిత సేవా సమితి బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఆడేపు సతీష్, సభ్యుడు డోలి సుకుమార్ మృతురాలి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో నేత్రదానానికి ముందుకొచ్చా రు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బంది ప్రదీప్ ఆమె కళ్లను సేకరించి తీసుకెళ్లారు. మృతురాలి కొడుకులు డోలి దశరథ్, విజయ్కుమార్, కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. -
వడదెబ్బతో ఒకరి మృతి
నెన్నెల: పెళ్లి డప్పు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. మరో పక్షం రోజుల్లో కూతురు పెళ్లి చేయాల్సిన తండ్రి మరణం విషాదం మిగిల్చింది. మండలంలోని మైలారం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోగారపు మారయ్య(56) చిన్న కూతురు వివాహం వచ్చే నెల 13న జరగాల్సి ఉంది. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ నెల 24న మధ్యాహ్నం వంట చెరుకు కోసం ఎడ్లబండిలో అడవికి వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతడి జాడ కోసం అదే రోజు రాత్రి అడవంతా వెతికినా దొరకలేదు. రెండో రోజు ఉదయం మళ్లీ అడవిలోకి వెళ్లి గాలించగా ఓ చోట ఎడ్లు, బండి కనిపించాయి. మారయ్య ఆచూకీ లభించలేదు. మూడో రోజు ఆదివారం సాయంత్రం మైలారం గ్రామ శివారులో ఓ వాగు ఒడ్డున విగత జీవిగా కనిపించాడు. మారయ్య అడవిలో దారి తప్పి నీటి కోసం వెతుకుతూ వాగు వద్దకు వెళ్లి వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి పెద్ద అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్సై రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుడి కుమారుడు వెంకటేషం ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
తెలంగాణ సాధించిన ఘనత బీఆర్ఎస్దే..
నస్పూర్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్దేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నస్పూర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో, తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ స్వరాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడిందని, ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కే.సురేందర్రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. -
స్వీయ గణన షురూ
మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన ప్రక్రియలో సెల్ఫ్ ఎన్యుమరేషన్(స్వీయ గణ న) ప్రక్రియ మొదలైంది. మే 10వరకు ఎవరికి వా రు స్వీయ గణన చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం పోర్టల్లో కుటుంబంలోని ఒకరి సెల్ నంబరుతో లాగిన్ అయి, వారి కుటుంబ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లా అధికారులు పలువురు స్వీయ గణన ద్వారా వివరాలను నమోదు చేసుకోగా, ప్రజలు సైతం ముందుకు వచ్చేందుకు అవగాహన కల్పిస్తున్నారు. మే 11నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి జనగణన చేపడుతారు. అందుకు ముందుగానే స్వీయ గణన చేసుకోవడం వల్ల ఎన్యుమరేటర్లు వచ్చిన సమయంలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న సమయంలో వచ్చిన 11 అంకెల రెఫ రెన్స్ ఐడీని ఇస్తే సరిపోతుంది. ఒకవేళ వివరాలు తప్పుగా ఉన్నా, ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కూడా ఉండగా, ఇంటి పెద్ద వివరాలను మాత్రం మార్చేందుకు అవకాశం ఉండదు. ఎన్యుమరేటర్లు వచ్చిన సమయంలో ఇంట్లో లేకున్నా, ఇతర ప్రాంతాలకు వెళ్లినా ఆన్లైన్ ద్వారా స్వీయ గణన చేసుకున్న రెఫరెన్స్ ఐడీని ఎన్యుమరేటర్కు చెబితే సరిపోతుంది. ఎక్కడున్నా నమోదుకు అవకాశంజనగణన వివరాలను ఎక్కడ ఉన్నా నమోదు చేసుకునేందుకుhttp://se.census.gov. inవెబ్సైట్లో లేదా మొబైల్ యాప్ ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించింది. జనగణన తొలిదశ మే 11నుంచి ప్రారంభం కానుంది. అందులో భాగంగా హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ జరగనుండగా, వీటిని ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి చేపట్టనున్నారు. ఏ ఒక్క కుటుంబం వివరాలను కూడా తప్పిపోవద్దనే ఉద్దేశ్యంతో స్వీయ గణనకు అవకాశం కల్పించారు. మే 10వరకు ప్రజలే ఎన్యుమరేటర్లుగా మారి వారి వివరాలను నమోదు చేసుకోవచ్చు. కుటుంబ యజమాని పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ నమోదు చేసిన తరువాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేసిన వెంటనే 33 రకాల ప్రశ్నలకు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత సబ్మిట్ చేయడంతో హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల సంఖ్యతో ఐడీ వస్తుంది. దీనిని భద్రపరుచుకుని, జనగణనకు ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు చెబితే సరిపోతుంది. -
మండే సూర్యుడు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో భానుడు భగ భగ మండుతూ నిప్పులు చెరుగుతున్నాడు. రికార్డు స్థా యి గరిష్ట ఉష్ణోగ్రతలతో దడ పుట్టిస్తున్నాడు. వడగాలుల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 33.1 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 45.8 డిగ్రీలుగా నమోదైంది. జిల్లాలో 18మండలాలకు గాను నాలుగు మండలాల్లో 45 నుంచి 46 డిగ్రీలు, 14మండలాల్లో 42 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జిల్లా మొత్తం రెడ్, ఆరెంజ్ జోన్లోకి వెళ్లింది. అత్యధికంగా భీమారం మండల కేంద్రంలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతన్నాయి. ఉదయం తొమ్మి ది గంటల నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతతో జనం బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం ఎండకు తోడు అర్ధరాత్రి వరకు వడగాలులు, ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటి నీటి ఎద్దడి తలెత్తుతోంది. ఎండలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వేడి, ఓవర్లోడ్తో ట్రిప్ అవుతూ కాలిపోతున్నాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఓసీపీల్లో నిప్పుల కుంపటి మండుటెండల్లో భూ ఉపరితలాల్లో పని చేసే సింగరేణి కార్మికుల పరిస్థితి నెత్తిమీద నిప్పుల కుంపటి మాదిరిగా తయారైంది. ఎండల్లో విధులు నిర్వర్తిస్తూ కొందరు వడదెబ్బ బారినపడి ఆస్పత్రి పాలవుతున్నారు. అనారోగ్యానికి గురవడంతో మధ్యాహ్నం రెండో షిఫ్టుకు వెళ్లే కార్మికుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. బోసిపోతున్న చిరువ్యాపారాలు గత పది రోజులుగా మండుతున్న ఎండల్లో చిరువ్యాపారాలు, ఆటోవాలల గిరాకీలు తగ్గాయి. రోజువారీగా కూరగాయలు, పండ్లు, ఇతర చిరు వ్యాపారులు రావడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరాకీలు దెబ్బతిన్నాయని అంటున్నారు. సాధారణ ప్రయాణాలు వాయిదాలు వేసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితులతోపాటు శుభకార్యల సీజన్ కావడంతో వాటికి హాజరయ్యేందుకు ప్రయాణాలు చేయడం పెద్ద సమస్యగా మారింది. మధ్యాహ్నం వేళ ఇళ్లలో కూలర్లు వినియోగిస్తున్నా వేడి తగ్గడం లేదు. ఎండ తీవ్రత నుంచి ఉమశమనం కోసం ప్రజలు శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు, చల్లని పండ్ల రసాల తాగేందుకు ఇష్టపడుతుండడంతో వీటి విక్రయాలు పెరిగాయి. భీమారం నస్పూర్ కన్నెపల్లి దండేపల్లి లక్సెట్టిపేట జైపూర్ మంచిర్యాల భీమిని జన్నారం చెన్నూర్ హాజీపూర్ నెన్నెల వేమనపల్లి మందమర్రి కోటపల్లి తాండూర్ బెల్లంపల్లి కాసిపేట కనిష్టం 33.6 32.2 32.8 32.3 33.6 32.4 32.8 33.8 33.9 32.4 34.0 31.8 29.8 33.6 31.8 32.9 32.2 32.3 గరిష్టం 45.8 45.4 45.3 45.2 44.8 44.6 44.5 44.4 44.4 44.3 44.2 44.2 44.0 43.8 43.8 43.3 43.3 43.1నిర్మానుష్యంగా..చున్నీ కప్పుకుని వెళ్తున్న యువతులుమంచిర్యాలలో కూరగాయలు విక్రయిస్తున్న మహిళలు -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్లో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఐటీడీ ఏ ఏపీవో వసంత్రావ్ అన్నారు. మండలకేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవా రం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ యా ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆ యన ఆర్టీలు స్వీకరించారు. వాటిని సంబంధి త అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరి ష్కరించేలాచొరవ చూపాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. పోడు భూములకు పట్టాలివ్వాలని ఆందోళనఉట్నూర్రూరల్: ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో సోమవా రం ఆందోళన చేపట్టారు. ఐటీడీఏ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏపీవో వసంత్రావ్కు సమస్యలతో కూ డిన వినతిపత్రం అందజేశారు. ఇందులో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేతావత్ రాందాస్, ప్రధాన కార్యదర్శి జి వెంకటాద్రి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కుటికెల శంకర్, ఉపాధ్యక్షుడు ధర్మం, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు నర్సయ్య, మహిళా సంఘం జి ల్లా అధ్యక్షురాలు సంధ్యారాణి, బాలసాని మల్లేశ్గౌడ్, నాగరావ్, భగవంతరావ్, రవి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
విజ్ఞానం, వినోదానికి సైన్స్ ప్రయోగాలు
మంచిర్యాలఅర్బన్: వేసవి సెలవుల్లో విజ్ఞానం, వినోదం, సైన్స్ ప్రయోగాలకు సమ్మర్ సైన్స్ క్యాంపు ఎంతో దోహదం చేస్తుందని డీఈవో యాదయ్య అన్నారు. సోమవారం జిల్లా సైన్స్ కేంద్రంలో 15 రోజుల వేసవి సైన్స్ సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను సెల్ఫోన్లకు దూరంగా ఉంచడం, సైన్స్పై ఆసక్తి పెంచేందుకు శిబిరం తోడ్పడుతుంద ని అన్నారు. 92 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. కృత్యాధార పద్ధతిలో ప్రయోగాలను తమకు తామే చేస్తూ సైన్స్పై అవగా హన పొందాలని తెలిపారు. జిల్లా పరీక్షల విభాగం సహాయ సంచాలకుడు మల్లేశం మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి మూఢనమ్మకాలపై సరైన అవగాహన పెంచుకోవాలని, సైన్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. మొదటిరోజు సైన్స్ ఉపాధ్యాయుడు జాకీర్ కొన్ని ప్రయోగాలతో విద్యార్థులను ఆలోచింపజేశారు. జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి మహేశ్వర్రెడ్డి, సెక్టోరి యల్ అధికారులు భరత్కుమార్, విజయలక్ష్మి, సత్తయ్య, చౌదరి, జూనియర్ కళాశాల లెక్చరర్ నాగవర్మ, ఉపాధ్యాయులు తిరుపతి, రాజేశం, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పురాతన ఆలయాలను పునర్నిర్మిద్దాం
వేమనపల్లి: పురాతన ఆలయాలను పునర్నిర్మించి ఆలయ చరిత్రను కాపాడుకుందామని టీటీడీ దేవాలయాల పర్యవేక్షణ అధికారి రామనాథం అన్నారు. సోమవారం మండల కేంద్రానికి సమీపంలోని రాజారం గ్రామంలో కొలువై న దశావతార దేవస్థానం, కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదు వేల ఆలయాలు నిర్మించామని, రాజా రంలో కొలువుదీరిన దశావతార, కాల భైరవ స్వామి దేవతామూర్తుల వద్ద ఆలయ నిర్మాణా నికి కృషి చేస్తామని అన్నారు. ఆలయ పురాతన చరిత్రను సూచించే వివరాలు, ఫొటోలు అందజేయాలని తెలిపారు. సర్పంచులు మళ్లీశ్వరి, సాయికృష్ణ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యుడు సత్యనారాయణ, ధర్మాచార్యులు పరమేశ్వర్, జయప్రద, చంద్రశేఖర్, సభ్యులు అమోల్, మహేష్ పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
సారంగపూర్: వేసవి తాపం తీర్చుకునేందుకు సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు వాగులో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్లో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైకుంఠాపూర్ గ్రామానికి చెందిన సాతెల్లి సాయన్న–పోసవ్వ దంపతులకు కొడుకు సాయిప్రసాద్(23), కూతురు సంతానం. సాయిప్రసాద్ తన స్నేహతులతో కలిసి సరదాగా సమీపంలోని వాగుకు ఈతకు వెళ్లాడు. వాగులో దిగిన కొంత దూరం వెళ్లాక లోతు ఉండడంతో స్నేహితులు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. ఈతరాని సాయిప్రసాద్ నీటిలో మునిగి మృతి చెందాడు. ఒడ్డున ఉన్న స్నేహితులు కేకలు వేయగా సమీపంలోని రైతులు వచ్చే సరికే సాయిప్రసాద్ నీటిలో మునిగిపోయాడు. ఎదిగిన ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
‘మున్నూరు కాపులను మోసగిస్తున్న ప్రభుత్వం’
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మున్నూరు కాపులను తక్కువ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జి గాదె సత్యం అన్నారు. సోమవారం మంచిర్యాలలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా ఉన్న మున్నూరు కాపులను ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం 13.75 లక్షల వరకు ఉన్నట్లు లెక్కలు చూపించడం అన్యాయమని అన్నారు. అన్ని బీసీ కులాల సంఖ్యను చాలా తక్కువ లెక్కల్లో చూపించారని ఆరోపించారు. మున్నూరు కాపుల గణాంకాల వాస్తవాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి నియామకమైన గాదె సత్యంను జిల్లా మున్నూరు కాపు కులబాంధవులు ఘనంగా సన్మానించారు. రేసు కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతికోటపల్లి: రేసుకుక్కల దాడిలో 15గొర్రెలు మృతిచెందాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి నక్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధి బ్రహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన కొండ మల్లయ్య తన గొర్రెలను అటవీ ప్రాంతంలో మేతకు తీసుకెళ్లగా రేసుకుక్కలు ఒక్కసారిగా గుంపుతో వచ్చి దాడి చేశాయి. గొర్రెలు అటవీ ప్రాంతంలో చెల్లాచెదురుగా వెళ్లిపోయాయి. కొన్ని గొర్రెలు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోగా, మిగిలిన వాటిని కాపరి గ్రామంలోకి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం దాడి చేసిన స్థలానికి కాపరులతో వెళ్లి పరిశీలించగా 15 గొర్రెలు మృతిచెంది కనిపించాయి. అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. -
పెన్గంగలో విద్యార్థి గల్లంతు
సాత్నాల: భోరజ్ మండలం పెన్గంగ నదిలో స్నానానికి వెళ్లి తోటవార్ కిరణ్(19) అనే విద్యార్థి సోమవారం గల్లంతయ్యాడు. ఎస్సై పవర్ గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ముధోల్ మండలానికి చెందిన కిరణ్ ఆదిలాబాద్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్నాడు. పిట్టలవాడలోని ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్ వాచ్మెన్ సాయి వంశీ పెన్గంగ వద్ద పూజ ఉందని ఉదయం కుటుంబంతో సహా వెళ్లాడు. వారితోపాటు హాస్టల్ విద్యార్థులైన కిరణ్, తరుణ్ కూడా వెళ్లారు. నదీ తీరంలో వారు పూజలు నిర్వహిస్తుండగా, స్నానం కోసం కిరణ్, తరుణ్ నదిలోకి దిగారు. ప్రమాదవశాత్తు ఇరువురు నీటిలో మునిగే క్రమంలో కేకలు వేశారు. సమీపంలో ఉన్న ఓ వ్యక్తి దూకి వారిని కాపాడేందుకు యత్నించాడు. తరుణ్ను ముందుగా ఒడ్డుకు చేర్చగా, కిరణ్ నీటిలో కొట్టుకుపోయాడు. ఎంత వెదికినా ఆచూకీ లభించకపోవడంతో విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. వారు అక్కడికి చేరుకుని రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. చీకటి పడడంతో పోలీసులు గాలింపు చర్యలను నిలిపివేశారు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెల్లడించారు. -
ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో
దండేపల్లి: వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ముత్యంపేట గ్రామంలో రైతులు సోమవారం రోడ్డెక్కారు. లక్సెట్టిపేట–నిర్మల్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు పోసి రోజులు గడుస్తున్నా మిల్లుల ట్యాగింగ్ రాలేదని, కాంటాలు వేయడం లేదని అన్నారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోళ్లు ప్రాంభించి, ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. రైతుల ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు పలికారు. ఎస్సై తహాసీనొద్దీన్ రైతులు, నాయకులతో మాట్లాడి సమస్యను ఫోన్లో తహసీల్దార్ రోహిత్దేశ్పాండే దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో కాంటాలు ప్రారంభిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్, నాయకులు వెంకటేష్, కిషన్, సురేష్, అనిల్, శ్రీనివాస్, మొండయ్య, గురువయ్య, హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
మామిడి.. మొక్కుబడి కొనుగోళ్లు
బెల్లంపల్లి: బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్కు రోజు వారీగా కనీసం టన్ను మామిడికాయలు కూడా అ మ్మకానికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెటింగ్ అధికారుల నిర్లక్ష్యం, దిగుబడి గణనీయంగా పడిపోవడం, కొద్దిపాటిగా చేతికందిన కాయలకు మంగు, మచ్చలు ఏర్పడడం, మద్దతు ధర లేకపోవ డం వంటి ప్రతికూల అంశాలు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బెల్లంపల్లి మార్కెట్లో మామిడి కొనుగోళ్లు ప్రారంభించి వారం రోజులు కావస్తున్నా వ్యాపారులు, రైతుల నుంచి కనీస స్పందన లేదు. ఓ చిరువ్యాపారి ద్వారా మొక్కుబడిగా కొనుగోళ్లు చేపట్టి ఆనవాయితీని కొనసాగిస్తున్నార నే విమర్శలు వస్తున్నాయి. తొలిసారిగా గత ఏడాది బెల్లంపల్లిలో ప్రారంభించిన మామిడికాయల కొనుగోళ్లు ఆశాజనకంగా సాగాయి. పక్షం రోజులపాటు క్రయవిక్రయాలు సాగి సుమారు ఆరు వేల క్వింటాళ్ల వరకు అమ్మకానికి వచ్చాయి. ఒకరిద్దరు బడా వ్యాపారులు రావడంతో రైతులు మ్యాంగో మార్కెట్కు తీసుకొచ్చి కాయలు విక్రయించారు. రైతులకు పెద్దగా లాభాలు రాకపోయినా నాగ్పూర్కు తీసుకెళ్లే వెతలు తప్పి రవాణా ఖర్చులు మిగిలాయి. ఈసారి ఆమాత్రం వెసులుబాటు కూడా లేకపోవడం రైతులను నిరాశకు గురి చేస్తోంది. తగ్గిన దిగుబడి మామిడి కాతపై ఈసారి ప్రకృతి తీవ్ర ప్రభావం చూపింది. పూత విరబూసినా అకాల వర్షాలు, చీడపీడల వల్ల పూత అధిక శాతం నేలపాలైంది. అక్కడక్కడ నిలిచిన పూత పిందె దశకు చేరుకునే క్రమంలో అకాల వర్షాలకు రాలిపోయింది. ప్రతికూల పరిస్థితులతో దిగుబడి పడిపోయింది. ఉద్యానవన అధికారుల లెక్కల ప్రకారం సాధారణంగా ఒక ఎకరాకు ఐదు నుంచి ఆరు టన్నుల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం టన్ను కూడా రాకుండాపోయింది. దీనికి తోడు కాయలపై మంగు, మచ్చలు ఏర్పడడంతో మద్దతు ధర కరువైంది. నాగ్పూర్ మార్కెట్లో ధర ఇలా.. బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్కు డిమాండ్ ఉన్నా మామిడి కాయలు రావడం లేదు. కొద్దిపాటి నీలం, తోతపరి తదితర రకాల కాయలు మాత్రమే వస్తున్నాయి. దశేరి, బంగెనపల్లి, హిమాయతి వంటి ము ఖ్యమైన రకాలు కానరావడం లేదు. వీటికి మార్కెట్లో కనీస మద్దతు ధర ఉంటుంది. బడా వ్యాపారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో నాగ్పూర్ మార్కెట్కు తీసుకెళ్లి అమ్మాలనే తలంపులో రైతులు ఉన్నారు. ప్రస్తుతం నాగ్పూర్ మ్యాంగో మార్కెట్లో దశేరి రకం కాయలకు టన్నుకు రూ.25 వేలు ధర చెల్లిస్తుండగా, బంగెనపల్లి రకానికి రూ.20 వేలు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. ఆదిలో దశేరి కాయలు టన్నుకు రూ.60 వేలు ధర పలుకగా, బంగెనపల్లి కాయల ధర రూ.50 వేలు చెల్లించి బడా వ్యాపారులు రైతుల్లో ఆశలు కల్పించారు. ఆయా రకాల కాయల ధరలు ప్రస్తుతం సగానికి పడిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితులను చవి చూస్తున్నారు. బెల్లంపల్లి మార్కెట్కు బడా వ్యాపారులను రప్పించి కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవడంలో మార్కెటింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.మద్దతు ధర లేదు చెట్లకు వచ్చిన పూత చూసి కాపు లీజుకు తీసుకున్న. తీరా పూతంతా రాలిపోయింది. తోటలన్నీ కాపులేక వెలవెలబోతున్నాయి. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి లీజుకు తీసుకున్న తోటల్లో దిగుబడి పడిపోయింది. కొద్దిపాటిగా చేతికందిన కాయలకు మద్దతు ధర దక్కుతుందనే ఆశతో ఉండగా నాగ్పూర్ బడా వ్యాపారులు దశేరి, బంగెనపల్లి రకాల ధరలు బాగా తగ్గించి కొంటున్నారు. బెల్లంపల్లిలోనూ మద్దతు ధర లేకుండాపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – బాబా, గుత్తేదారు, బెల్లంపల్లి కాపు పడిపోయింది గత మూడు నాలుగేళ్ల నుంచి మామిడి కాపు పడిపోతున్నది. చెట్టు నిండా పూత విరబూసిన ఫాయిదా ఉంటలేదు. వచ్చిన పూత వచ్చినట్లే రాలిపోయి కొద్దిపాటి పూత మాత్రమే నిలుస్తున్నది. ఈసారి కూడా అట్లనే జరిగింది. అక్కడక్కడ పిందెలు నిలిచి కాయ దశకు చేరుకోగానే అకాల వర్షాలతో పంట నేలపాలైంది. అమ్మకానికి తీసుకెళ్లడానికి కాయలు కానరాకుండా ఉన్నాయి. కాపు పడిపోయి కష్టాలు మిగిలాయి. – గోమాస మల్లయ్య, మామిడి రైతు, మాలగురిజాల -
ఇందిరమ్మ నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలు అధికారులను ఆదేశించారు. హిమాయత్నగర్లోని హౌసింగ్ కా ర్పొరేషన్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో మంత్రులు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల ఆత్మగౌరవానికి ప్రతీ క అని అన్నారు. నిర్మాణ ప్రక్రియలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. లబ్ధిదారుల దరఖాస్తులను పెండింగ్ పెట్టవద్దని, అధికారుల వద్ద ఫైల్ వారం రోజులకు మించి ఉండవద్దని పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉంటే తక్షణమే అధికారులను డిప్యూటేషన్పై తీసుకొని పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రతీ దశలో పనుల ను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. స్థోమతలేని నిరుపేద లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. దశ ల వారీగా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మంజూ రయ్యే నిధుల ద్వారా రుణం తీర్చేలా చూడాలని తెలిపారు. సమావేశంలో ఎంపీలు నగేశ్, గడ్డం వంశీ, ఎమ్మెల్సీలు దండే విఠల్, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావు, గడ్డం వినోద్, రామారావు పటే ల్, పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీష్బాబు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీసీ గౌతమ్, ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, మంచిర్యాల కలెక్టర్లు రాజర్షిషా, హరిత, భవేష్ మిశ్రా, కుమార్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాల పేరుతో మోసం.. ముగ్గురు అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: రిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగి వద్ద డబ్బులు వసూలు చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆదివారం పోలీస్స్టేషన్లో వివరాలను వెల్లడించారు. భోరజ్ మండలంలోని పూసాయి గ్రామానికి చెందిన తప్రే సంతోష్ అనే వ్యక్తి గతంలో రిమ్స్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసి మానేశాడు. తిరిగి అదే ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికిన నిందితులు అతని వద్ద నుంచి రూ.40,000 వసూలు చేశారు. కాగా ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడంతో బాధితుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన లేబర్ యూనియన్ నాయకుడు సిర్ర దేవేందర్, సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్లు అబ్దుల్ ముజీబ్, డోంగ్రి చంద్రకాంత్లను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు ఉద్యోగాల పేరుతో మధ్యవర్తులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీఐ సూచించారు. -
శంకుస్థాపన దాటని బ్యూటిఫికేషన్!
మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లోని చెరువులను పునరుద్ధరించడంతో పాటు, బ్యూటిఫికేషన్ చేపట్టేందుకు నిధులు విడుదల చేసింది. ప్రజారోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో నెలన్నర క్రితమే ఆయా చెరువుల్లో పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. చెరువుల పునరుద్ధరణకు వేసవి కాలంలో పనులు చేపడితేనే వర్షాకాలంలోపు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. పనులకు శంకుస్థాపన చేసినా, జిల్లాలోని ఒక్క చెరువు పనులను కూడా ప్రారంభించక పోవడంతో చెరువుల బ్యూటిఫికేషన్ వర్షాకాలంలోపు పూర్తి చేయడం కష్టంగానే ఉంది. పునరుద్ధరణతో ప్రయోజనం పురపాలికల్లో డ్రెయినేజీల నుంచి మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి వెళ్తుండడంతో మురుగు నీటితో నిండిపోయి, గుర్రపు డెక్క, నాచు పెరగడంతో పాటు, చెత్తా చెదారంతో నిండి కంపు కొడుతున్నాయి. చెరువుకు హద్దులుగా కట్టలను ఏర్పాటు చేసిన కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణకు గురవుతున్నాయి. చెరువుల వద్ద కాస్త సేదతీరేందుకు అవకాశం లేకుండా పోయింది. పట్టణ ప్రాంతాల్లోని చెరువులను ప్రజలకు ఆహ్లాదం పంచేలా, వాటిని పునరుద్ధరించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని ఒక్కో చెరువుకు పనులను బట్టి నిధులను విడుదల చేసింది. అందులో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాముని చెరువుకు రూ.1.98 కోట్లు, నస్పూర్ చెరువుకు రూ.3.14 కోట్లు, బెల్లంపల్లి మున్సిపాలిటీలోని జాజికుంట చెరువుకు రూ.1.57 కోట్లు, మందమర్రి మున్సిపాలిటీలోని మందమర్రి చెరువుకు రూ.3.14 కోట్లు, చెన్నూరు మున్సిపాలిటీలోని కుమ్మరి చెరువుకు రూ.1.87 కోట్లు, క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని కుమ్మరికుంటకు రూ.1.98 కోట్లు, లక్సెట్టిపేట్ మున్సిపాలిటీలోని ఇటిక్యాల చెరువుకు రూ.3.14 కోట్ల నిధులు కేటాయించారు. వీటితో చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా తక్షణ చర్యలు చేపడతారు. చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, చెరువు కట్ట నిర్మాణం చేసి, ఫోర్ షోర్ బండ్ పనులు చేపడతారు. చెరువుల్లోకి వర్షపు నీరు మాత్రమే చేరేలా చర్యలు చేపట్టి, పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తారు. జిల్లాలో ఎంపిక చేసిన చెరువులు, అమృత్ 2.0 పథకం కింద మంజూరైన నిధులుమున్సిపాలిటీ/కార్పొరేషన్ ఎంపిక చేసిన చెరువులు నిధులు మంచిర్యాల కార్పొరేషన్ రాముని చెరువు రూ.1.98 కోట్లు నస్పూర్ నస్పూర్ చెరువు రూ.3.14 కోట్లు బెల్లంపల్లి జాజికుంట చెరువు రూ.1.57 కోట్లు మందమర్రి మందమర్రి చెరువు రూ.3.14 కోట్లు చెన్నూర్ కుమ్మరి చెరువు రూ.1.87 కోట్లు క్యాతన్పల్లి కుమ్మరికుంట రూ.1.98 కోట్లు లక్సెట్టిపేట్ ఇటిక్యాల చెరువు రూ.3.14 కోట్లు -
‘నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టండి’
రామకృష్ణాపూర్: కేసీఆర్, బీఆర్ఎస్ను విమర్శించడం మాని చెన్నూర్ నియోజకవర్గ సమస్యలపై మంత్రి వివేక్ దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి ఎన్నికల నేపథ్యంలో నమోదైన కేసుల్లో భాగంగా బెయిల్ షరతుల మేరకు ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్లో సంతకం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మంత్రి స్థానిక సమస్యలు పక్కనబెట్టి ఎక్కువగా ఇతర జిల్లాల్లోనే తిరుగుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో ని రుద్యోగ యువతకు 45 వేల ఉద్యోగాలు, ఈ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీ, మందమర్రి–ఆర్కేపీలో 100 ప డకల ఆసుపత్రి తెస్తామని చెప్పిన మంత్రి ఆ హా మీల అమలుకు ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు. జీవో 76 కింద సింగరేణి స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇవ్వాల్సిఉండగా దానిని పట్టించుకోవడం లేదన్నారు. కవిత కొత్త పార్టీ గురించి ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యంలో పార్టీలు వస్తూంటాయని కేఏ పాల్, షర్మిల, విజయశాంతి లాంటి వారు కూడా పార్టీలు పెట్టారని ఇప్పుడా ఆ పార్టీలు ఎక్కడపోయాయని ఎద్దేవాచేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి, బీఆర్ఎస్ నాయకులు మూల రాజిరెడ్డి, సుదర్శన్గౌడ్, మేడిపెల్లి సంపత్, తదితరులు పాల్గొన్నారు. -
గిన్నీస్ రికార్డ్లో జిల్లా క్రీడాకారులు
ఆదిలాబాద్: హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, జె.సి ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ‘లార్జెస్ట్ కరాటే డిస్ప్లే’ గిన్నిస్ వరల్డ్ రికార్డు అటెంప్ట్లో జిల్లా చిన్నారులు భాగస్వాములయ్యారు. 30 నిమిషాల వ్యవధిలో 50 సార్లు ‘మొదటి కటా తైకీకి షోడాన్’ ప్రదర్శన నిర్వహించారు. దీంతో గతంలో ఉన్న రికార్డును బద్దలు కొడుతూ మొత్తం 1212 మందితో కలిసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. బాల కేంద్రం శిక్షకులు మిట్టు దత్తు, గాజుల జగన్నాథ ఋషిల నేతృత్వంలో శిక్షణ పొందిన మందోల్ల మహాశ్విని, పడాల ధన్విక, హర్షిణి ఠాకూర్, కోండ్రా అలేఖ్య, క్షీరసాగర జాహ్నవి, దువాస హర్షినీ, జాగృతి, లింగంపల్లి సాయి కార్తీక, రోహిత్, యం. అయాన్ష్, గడ్డం శ్రీనిధి, దీరేన్ సింగ్లు ఈ ప్రదర్శనలో పాల్గొని గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకున్నారని బాల కేంద్రం పర్యవేక్షకుడు మిట్టు రవి వెల్లడించారు. -
భూసార పరీక్షలకు వేళాయె..!
చెన్నూర్రూరల్: భూసారానికి అనుగుణంగా పంటలను సాగు చేయించి, నాణ్యమైన అధిక దిగుబడులను సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూసార పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురి చొప్పున వలంటీర్లను నియమిస్తోంది. చెన్నూర్ డివిజన్లోని చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాలకు సుమారుగా 310 మందిని ఎంపిక చేశారు. వీరికి త్వరలో వ్యవసాయ శాస్త్రవేత్తలచే శిక్షణ ఇచ్చి పంట పొలాల్లోని మట్టిని సేకరించి ఆదిలాబాద్లోని భూసార పరీక్ష కేంద్రానికి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భూసార పరీక్షలతో మేలు.. భూసార పరీక్షల వల్ల భూముల్లోని పోషకాల మోతాదు తెలుస్తుంది. పోషకాలు తక్కువగా ఉంటే వ్యవసాయాధికారులు వాటిని పెంచడానికి చర్యలు తీసుకుంటారు. నత్రజని, భాస్వరం, పొటాషియం, ఐరన్, జింక్, బోరాన్, మెగ్నీషియం తదితరాల శాతాన్ని గుర్తిస్తారు. వీటికి అనుగుణంగా ఎలాంటి పంటలు సాగు చేయాలో వ్యవసాయాధికారులు సూచిస్తారు. ఎరువులను ఎంత మోతాదులో వాడాలో సిఫారసు చేస్తారు. ఫలితంగా ఎరువుల వినియోగం, పెట్టుబడుల ఖర్చులు తగ్గించుకోవచ్చు. సేద్యపు రంగంలో ఆధునిక శాసీ్త్రయ పద్ధతులను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు భూసార పరీక్షల కోసం మట్టినమూనాలను సేకరించేందుకు వలంటీర్లు, ఏఈవోలు వ్యవసాయ క్షేత్రాలను ఏవిధంగా ఎంపిక చేసుకోవాలి? ఏవిధంగా సేకరించాలి? అనే అంశాలు, అలాగే పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శిక్షణ ఇస్తారు. సేకరించిన మట్టి నమూనాలను ఆదిలాబాద్లోని భూసార పరీక్ష కేంద్రానికి పంపించి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఫలితాలను రైతులకు తెలియజేయనున్నారు. పరీక్షల ఫలితాల అనంతరం భూసారం ఎంత ఉంది? ఎలాంటి పంటలు సాగు చేయాలి? ఎరువులు ఎంత మోతాదులో వాడాలి. అనేది వ్యవసాయశాఖ అధికారులు రైతులకు తెలియజేస్తారు. -
పది రోజులైంది
వరి కోసి పది రోజులు అవుతుంది. కొనుగోలు కేంద్రంలో ఆరబోసినాం. మైచర్ కూడా తక్కువగానే వస్తుంది. కొనుగోలు కేంద్రం ఎప్పుడో ప్రారంభించారు కాని కాంటా పెట్టడం లేదు. గత నాలుగు రోజులుగా మబ్బులు, వర్షం పడుతుంది. భారీ వర్షం కురిస్తే పంట తడిసిపోతుందని భయంగా ఉంది. రాత్రనక పగలనక ధాన్యం వద్దనే ఉండాల్సి వస్తుంది. కాంటా పెట్టి మిల్లులకు తరలించాలి. – గొల్ల శ్రీకాంత్, గ్రామం: ఇటిక్యాల, మం: లక్సెట్టిపేట కాంటా పెడ్తలేరు..వడ్లు ఆరబోసుకొని వారం రోజులు అవుతుంది. కాంటా పెడతలేరు. మిల్లుకు ట్యాగింగ్ కాలేదని ఆపుతున్నారు. ఎప్పుడు అయితదో ఎప్పుడు వడ్లు పోతాయో తెల్వడం లేదు. రోజు కుప్ప జేసుడు, నేర్పుడు అవుతుంది. – ముత్తే రాజం, గ్రామం: గుల్లకోట, మం: లక్సెట్టిపేట ఆరబోసుడు.. కుప్పజేసుడుకల్లంలో ధాన్యం ఆరబోసుకుని వారం రోజులు అవుతుంది. గన్నీ సంచులు వచ్చి నాలుగు రోజులు అవుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా ఉదయం ఆరబోసుకునుడు, సాయంత్రం కుప్పజేసి కవర్లు కప్పుడు అవుతుంది. మాపటి పూట మబ్బులు ఈదురుగాలు చినుకులు వస్తున్నాయి. కవర్లు ఇయ్యలే కొనుక్కొని కప్పుకునుడు అయితంది. వెంటనే కాంటాబెట్టి మిల్లుకు పంపితే మంచిగుండు. – శ్రీనివాస్, గ్రామం: ఇటిక్యాల, మం: లక్సెట్టిపేట -
ఒత్తిడి లేని విద్య..!
జన్నారం: ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ కలిగిన దేశంగా గుర్తింపు పొందిన ఫిన్లాండ్లోని బోధనా పద్ధతులను అధ్యయనం చేసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్లిన నలుగురు ఉపాధ్యాయులు ఐదు రోజుల ఎక్స్పోజర్ విజిట్ను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. ఒత్తిడి లేని అభ్యాసం, ప్రాక్టికల్స్కు ప్రాధాన్యత, విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానాలను నేరుగా పరిశీలించడం ద్వారా తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ఈ బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫిన్లాండ్ విద్యా విధానం ప్రత్యేకతలు ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ ‘చదువు అంటే ఒత్తిడి కాదు, ఒక ఆనందకరమైన అనుభవం’ అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అక్కడ విద్యార్థులకు చాలా తక్కువ హోంవర్క్ ఉంటుంది, ట్యూషన్ల అవసరం అసలే ఉండదు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడం, పాఠశాలల్లో ఆటలకు, కళలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం, విద్యార్థుల సామర్థ్యాలను బట్టి వొకేషనల్ కోర్సులను ప్రోత్సహించడం వంటి అంశాలు ఫిన్లాండ్ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. తెలంగాణ బృందం సందర్శించిన సంస్థలు తెలంగాణ విద్యాశాఖ తరఫున వెళ్లిన ఈ బృందంలో జైపూర్ ఎంఈవో బి.శ్రీనివాస్, జన్నారం మండలంలోని కిష్టాపూర్ హైస్కూల్ ఉపాధ్యాయుడు దాముక కమలాకర్, పొనకల్ అక్కపల్లిగూడ ఎంపీఎస్ ఉపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా ఏమాయికుంట ఎంపీఎస్ ఉపాధ్యాయుడు బి.గంగయ్య ఉన్నారు. వీరు తమ పర్యటనలో హెల్సింకిలోని పలు పాఠశాలలు, యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి, టీచర్ ట్రైనింగ్ స్కూల్స్, వివిధ వొకేషనల్, టెక్నికల్ ఇనిస్టిట్యూషన్లు సందర్శించారు. అక్కడి ప్రొఫెసర్లతో సమావేశమై బోధనా పద్ధతులపై, శిక్షణ విధానాలపై లోతైన చర్చలు జరిపారు.ప్రభుత్వానికి సమగ్ర నివేదికఈ పర్యటనలో తాము నేర్చుకున్న అంశాలను, ఫిన్లాండ్ విద్యా వ్యవస్థలో తాము గమనించిన కీలక మార్పులను క్రోడీకరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. ముఖ్యంగా జీవిత నైపుణ్యాలను పెంపొందించే విలువలతో కూడిన అభ్యాసం, తరగతి గదుల్లో ప్రయోగాత్మక బోధనా పద్ధతుల అమలు వంటివి తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎలా ఉపయోగపడతాయో ఈ నివేదికలో పొందుపర్చనున్నారు. ఈ పర్యటన ద్వారా అందిన అనుభవాలు భవిష్యత్తులో తెలంగాణ విద్యారంగంలో సృజనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయని ఉపాధ్యాయ బృందం ధీమా వ్యక్తం చేసింది. -
మధుర ఫలం.. విషతుల్యం
నెన్నెల: కాయలు పక్వానికి వచ్చాక తింటే వాటి రుచే వేరు. కానీ కొందరు పచ్చికాయలుగా ఉన్నప్పుడే వాటిలో కార్బైడ్, ఇతర మందులు వినియోగించి మగ్గిన తర్వాత విక్రయిస్తున్నారు. విచ్ఛలవిడిగా కార్బైడ్ వాడుతూ వ్యాపారులు వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి పండ్లు తింటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పండ్ల మార్కెట్లపై అధికారులు దాడులు నిర్వహించి వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. మామిడి పండ్లను విషతుల్యమైన రసాయనాలతో పండిస్తున్నారు. ఆరోగ్యంపై దుష్ప్రభావం.. కార్బైడ్తో మగ్గపెట్టిన మామిడి పండ్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ రసాయనం సాధారణంగా గ్యాస్ వెల్డింగ్లో వినియోగించేందుకు ఉపయోగిస్తారు. ఈ కార్బైడ్తో మగ్గపెట్టిన పండ్లను తీసుకునే వారికి జీర్ణకోశవ్యాధులు, ఎలర్జీ, కడుపునొప్పి, మూత్రపిండ వ్యాధులు వస్తుంటాయి. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు గర్భిణులు, పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. నిషేధం అమలులో ఉందా..? మామిడికాయలను కార్బైడ్తో మగ్గపెట్టడం నేరమని గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని నిషేధించాయి. 1995 చట్టం కింద ఎవరైనా మామిడి పండ్లను రసాయనాలతో మగ్గపెడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. సీజనల్ వ్యాపారాల్లో మామిడి పండ్ల విక్రయాలు సాధారణమవడంతో మగ్గపెట్టిన మామిడి విక్రయాలు ఏటా జోరందుకుంటున్నాయి. సహజంగా పండిన పండ్లు రుచికరం.. సహజంగా మగ్గిన పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు ఎంతో రుచికరంగా ఉంటాయి. సహజంగా చెట్టుపై పక్వానికి వచ్చిన కాయలను చూసి వాటిని వరిగడ్డితో, తునికాకులతో కప్పి ఉంచితే నాలుగు రోజులు నుంచి వారం రోజుల్లో బాగా మగ్గి పండుగా మారుతాయి. ఇలాంటివి రంగు, రుచితో మదురంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం గంటల వ్యవధిలోనే మామిడికాయలను రసాయనాలతో మగ్గపెట్టి వ్యాపారాలు సాగిస్తూ ఆరోగ్యాలపై ప్రభావం చూపించే విధానంతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు కార్బైడ్తో పండించే మామిడి పండ్లను నిషేధించాలని, మార్కెట్లో దాడులు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. -
వైభవంగా వాసవీ మాత జయంతి ఉత్సవాలు
మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని విశ్వనాథస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం వాసవీ మాత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కలెక్టర్ కుమార్ దీపక్ దంపతులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య, వాసవీ క్లబ్ సభ్యులు కలెక్టర్ దంపతులను ఘనంగా సన్మానించారు. 350 మంది మహిళలు అమ్మవారికి చీరె సారె సమర్పించారు. సాయంత్రం పట్టణ పురవీధుల గుండా అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సత్యనారాయణ, జ్యోతి, కోఆప్షన్ సభ్యురాలు పద్మ, వాసవి క్లబ్ జాతీయ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్లు ముక్త శ్రీనివాస్, సిరిపుర రాజేశ్, కటుకం హరీష్, వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ పుల్లూరి బాలమోహన్, క్యాబినెట్ సెక్రెటరీ కేశెట్టి వంశీకృష్ణ, కోశాధికారి వెంకటేశ్వర్లు, పీఆర్వో రమేశ్, తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా సంతోష్చారిశ్రీరాంపూర్: అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సంతోష్ చారి నియామకమయ్యారు. ఆదివారం హైదరాబాద్లోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షుడు అశ్విన్ కుమార్ నియామకపత్రం అందజేశారు. తన నియామకానికి సహకరించిన జాతీయ కమిటీకి సంతోష్ చారి కృతజ్ఞతలు తెలియజేశారు. -
● కొనుగోలు కేంద్రాలు ప్రారంభాలతోనే సరి ● తూకం వేయని ధాన్యం.. రైతుల ఎదురు చూపులు ● ఉదయం ఎండలు, సాయంత్రం మబ్బులు.. చిరుజల్లులు
మంచిర్యాలఅగ్రికల్చర్: అట్టహాసంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. వారం రోజులైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు కుప్పల వద్ద తిప్పలు పడుతున్నారు. నాలుగైదు రోజులుగా ఉదయం ఎండ, సాయంత్రం మబ్బులు, అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఎండలో ఆరబోస్తూ.. సాయంత్రం కుప్పలు చేసి కవర్లు కప్పుతున్నారు. భారీ వర్షం కురిస్తే ధాన్యం నేలపాలవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి ధాన్యం దిగుబడి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోశారు. ఈ నెల 13న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం తూకం, మిల్లులకు తరలింపు లేక నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే ప్రారంభించిన కేంద్రాల్లో మిల్లులకు ట్యాగింగ్ లేక, తూకం వేయక, లారీలు రాక ధాన్యం కదలడం లేదు. వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయింది. పూర్తి స్థాయిలో కేంద్రాలు, మిల్లులకు ట్యాగింగ్ చేయలేదు. ఏ కేంద్రం ఏ మిల్లుకు కేటాయిస్తారోనని గందరగోళం నెలకొంది. 58 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జిల్లాలో వివిధ ఏజెన్సీల ద్వారా 313 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటివరకు 58 కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం తరలింపు లేదు. తూకం వేసిన ధాన్యం ట్రక్షీట్ ఎంట్రీ, మి ల్లులకు తరలించి అన్లోడ్, రిసీవింగ్ ఎంట్రీ తదిత ర వివరాలు ట్యాబ్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. కానీ కేంద్రాల కేటాయింపు, మిల్లులకు ట్యాగింగ్లో స్పష్టత రాలేదు. ధాన్యం తరలించకపోవడంతో నిర్వాహకులు రైతుల ధాన్యాన్ని తూకం వేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. తూకం వేసిన ధాన్యం రోజుల తరబడి కేంద్రంలో నిల్వ చేస్తే మిల్లుకు తరలించిన సమయంలో బరువు తగ్గి నష్టపోవాల్సి వస్తుందని, తరుగు పేరుతో మిల్లర్లు కోత విధించే అవకాశం ఉందని నిర్వాహకులు వాపోతున్నారు. లక్ష్యం భారీగా.. సేకరణ ఆలస్యం..జిల్లాలో ఈ యాసంగి 1.22 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 2.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేసి 313 కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నారు. దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో 58 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా క్వింటా ధాన్యం కూడా మిల్లుకు తరలించినట్లు ట్యాబ్ ఎంట్రీ లెక్కలో రాలేదు. జిల్లాలో ధాన్యం సేకరణపై అదనపు కలెక్టర్, పౌరసరఫరాల శాఖ అధికారులను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. -
వారంలో కూతురు పెళ్లి.. అంతలోనే..
తాంసి: వారం రోజుల్లో కూ తురు పెళ్లితో ఆ ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉండగా కు మార్తె పెళ్లి పత్రికలు పంచేందు కు వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మండలంలోని గిరిగాం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గిరిగాం గ్రామానికి చెందిన అదే జ్ఞానేశ్వర్ కూతురు వివాహం ఇటీవల నిశ్చయమైంది. వచ్చే నెల 4వ తేదీన వివాహం ఉండగా పెళ్లి పత్రికలు బంధువులకు పంచేందుకు గ్రామానికి చెందిన అమృత్తో కలిసి ద్విచక్రవాహనంపై మహారాష్ట్రకు వెళ్లాడు. ఈక్రమంలో మహారాష్ట్రలోని బోరి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో జ్ఞానేశ్వర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడు. అమృత్కు సైతం బలమైన గాయాలు కావడంతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల్లో కుమార్తె పెళ్లి జరగాల్సి ఉండగా తండ్రి ప్రమాదంలో మృతి చెందడంతో గిరిగాం గ్రామంలో ఆదివారం విషాధచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తి రైతుకు తీపికబురు
లక్ష్మణచాంద: వ్యవసాయ జిల్లాగా పేరున్న నిర్మల్ జిల్లాలో అన్నదాతలు పత్తి, వరి, సోయా పంటలను ప్రధాన పంటలుగా సాగు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువ సాగు చేసే పంట పత్తి. పత్తి విత్తనాలు అధిక ధరలు ఉండటంతో రైతులకు సాగు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈనేపథ్యంలో పత్తి సాగు చేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రతీ సంవత్సరం పెరుగుతున్న సాగు ఖర్చులతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలకు ఊరటనిస్తూ పత్తి విత్తనాల ధరలను ప్రస్తుతానికి పెంచకూడదని నిర్ణయం తీసుకుంది. పాత ధరలే కొనసాగింపు.. అధిక సాగు ఖర్చులతో సతమతమవుతున్న రైతులకు 2026 –27 సంవత్సరానికి పాత ధరలనే కొనసాగిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి రైతులు ఎక్కువ మొగ్గు చూపే బీజీ –2 (475 గ్రాములు) ప్యాకెట్ ధర రూ.901, బీజీ –1 (475 గ్రాములు) ప్యాకెట్ ధర రూ.635 పాత ధర ఉంది. ఈ ధరలే 2026 –27లో కొనసాగించాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది. ఉమ్మడి జిల్లా వివరాలు.. నిర్మల్ జిల్లాలో ఈ వానాకాలం 1.40లక్షలు –1.50 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతుందని జిల్లా వ్యవసాయాధికారులు అంటున్నారు. ఎకరానికి రెండు ప్యాకెట్ల చొప్పున 1.50 లక్షల ఎకరా లకు 3 లక్షల ప్యాకెట్ల విత్తనాలు అవసరం అవుతాయి. మంచిర్యాలలో 1.60 లక్షల ఎకరాలు, ఆసిఫాబాద్లో 3.5 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్లో 4.26 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశం ఉంది. మొత్తంగా 25లక్షల విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయి. జిల్లా సాగు విస్తీర్ణం విత్తనాలు (లక్షల ఎకరాలు) (లక్షల ప్యాకెట్లు) ఆదిలాబాద్ 4.26 11.50 మంచిర్యాల 1.60 3.10 ఆసిఫాబాద్ 3.5 7.5– 8 నిర్మల్ 1.40– 1.50 3జిల్లాల వారీగా పత్తి సాగు విస్తీర్ణం, అవసరమైన విత్తనాలు.. -
ఇంద్రాదేవి ఆలయంలో ఆదివాసీల పూజలు
ఇంద్రవెల్లి: మండలకేంద్రంలోని ఆదివాసీల ఆరా ధ్యదైవం ఇంద్రాదేవి ఆలయంలో ఆదివాసీలు ఘ నంగా పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు. బావై (వైశాఖ) మాసం పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీలు ఆలయానికి తరలివచ్చి నైవేద్యం తయారు చేసి సమర్పించారు. ఆదివారం మండలంలోని మారుతిగూడ, హీరపూర్, దొడందా, వడగామ్, గట్టెపల్లి, తుమ్మగూడ గ్రామాలతో పాటు నార్నూర్ మండలాల ఆదివాసీలు తరలివచ్చి ఇంద్రాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ మహరాజ్ చహకటి సూర్యరావ్, ఆయా గ్రామాల భక్తులున్నారు. -
● రిమ్స్లో ఘనంగా ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ డే ● ముఖ్య అతిథిగా హాజరైన కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ రమేశ్రెడ్డి
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో 2020–26 బ్యాచ్ వైద్య విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రమేశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, అదనపు కలెక్టర్ చిత్రులో కలిసి వైద్య విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. అంతకుముందు మెడికోలు గుస్సాడీ నృత్యాలతో అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రమేశ్రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైద్య విద్యను అభ్యసించి పట్టా పొందడం అభినందనీయమని ప్రశంసించారు. ఉస్మానియా, గాంధీ వంటి ప్రముఖ వైద్య కళాశాలలకు దీటుగా రిమ్స్లో నాణ్యమైన విద్యాబోధన అందుతుందన్నారు. డాక్టర్ పూర్తిచేసుకున్న మెడికోలు పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. నిరంతర విద్యార్థిలా భవిష్యత్లో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా సేవలు అందించాలని సూచించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులందరూ పీజీ సీట్లు సాధించాలన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కేరింతలు, చప్పట్లతో ప్రాంగణం మార్మోగింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలతో ఫొటోలూ దిగుతూ సందడి చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వంజారి, వైస్ ప్రిన్సిపల్ సరోజ, విద్యావిల్సన్, మెడికల్ డిప్యూటీ సూపరింటెండెంట్లు నరేందర్ బండారి, దీపక్ పుష్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కాళ్లకు వల చుట్టుకొని వ్యక్తి మృతి
లక్ష్మణచాంద: చేపల వల కాళ్లకు చుట్టుకోవడంతో నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని బాబాపూర్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్నేళ్లుగా రాజమండ్రికి చెందిన కొందరు జాలర్లు తెలంగాణకు వలస వచ్చి వేసవి కాలంలో చేపలు పడుతూ జీవనం సాగిస్తుంటారు. ఆదివారం మండలంలో గల బాబాపూర్ పెద్ద చెరువులో రాజమండ్రికి చెందిన జాలర్లు సుమారు 15 మంది బృందం చెరువులో చేపలు పట్టడానికి దిగారు. సాయంత్రం 3.30 గంటలకు నందిపల్లి గోవింద్(34) అనే జాలరి కాళ్లకు వల చుట్టుకొని ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి మేనమామ రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు. అనుమానాస్పదంగా గుర్తు తెలియని వ్యక్తి మృతినిర్మల్టౌన్: పట్టణంలోని శాంతినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద అనుమానాస్పదంగా గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెండో ఫ్లోర్పై నుంచి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రూరల్ సీఐ కృష్ణ అక్కడికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు చేతిపై జాలమ్మ అనే పచ్చబొట్టు ఉందని, ఎవరికై నా వివరాలు తెలిస్తే పట్టణ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. ఉరేసుకొని ఒకరి ఆత్మహత్యకుంటాల: మండలంలోని లింబా(కె) గ్రా మానికి చెందిన సూర్యవంశీ పండిత్ ఆది వారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్గా పని చేస్తున్న సూర్యవంశీకి అప్పులు పెరిగిపోవడంతో తన ఇంట్లో నే ఇనుప కొక్కానికి నైలాన్ తా డుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య అంజనా బాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. -
● కెమెరా కంటికి చిక్కిన వన్యప్రాణులు ● జన్నారం అడవుల్లో స్వేచ్ఛగా విహారం
మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్, కవ్వాల్ అభయారణ్యంలో తాళ్లపేట రేంజ్లో వన్యప్రాణుల అడవంతా తమదే అన్నట్లుగా స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. పగలు ఎండ తీవ్రతకు పొదల మాటున ఉంటున్న జంతువులు చీకటి పడగానే అడవంతా తమదే అన్నట్లుగా స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు అమర్చిన నిఘా కెమెరాలకు చిక్కుతున్నాయి. తాజాగా కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల్లో చిరుతపులి, ఎలుగుబంటి, దుప్పి, ముళ్లపందులు తమ సహజ సిద్ధమైన ప్రవర్తనతో కదలుతూ కనిపించాయి. తాళ్లపేట రేంజ్ అధికారి సుష్మారావు మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ నిఘా కెమెరాలు వన్యప్రాణుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా జంతువుల ప్రవర్తనా తీరును అర్థం చేసుకోవడంతోపాటు, అడవిలో వన్యప్రాణుల జనాభాను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. – జన్నారంవనమంతా మాదే -
‘అపూర్వ’ సమ్మేళనం..!
పాత జ్ఞాపకాలతో..!నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని బాగులవాడలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మండలంలోని కొండాపూర్లో గల ఓ ఫంక్షన్ హాల్లో 1993 –94 పదో తరగతి బ్యాచ్కు చెందిన 120 మంది విద్యార్థులు, 14 మంది ఆచార్యులు ఒకచోట చేరి పాత జ్ఞాపకాలు, అనుభవాలను పంచుకున్నారు. ప్రధానాచార్యులు రావుల సూర్యనారాయణ, ఆచార్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాలఅర్బన్: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2002 –2003 పదో తరగతి బ్యాచ్కు చెందిన విద్యార్థుల సమ్మేళనం ఆదివారం మంచిర్యాలలో నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు పాఠశాలలో గడిపిన రోజులు.. పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పాఠాలు బోధించిన సత్యనారాయణ, జమునరాణి, రఫీయా సుల్తానా, ఆశ్లేష తదితర ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. నర్సాపూర్(జి): మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. 1992 –93 బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థులు 33 ఏళ్ల తర్వాత ఒకచోట కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. గురువులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.గుర్తుకొస్తున్నాయి..! -
‘కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి’
మంచిర్యాలఅర్బన్: నిబంధనలు పాటించకుండా ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఆదివారం మార్క్స్భవన్లో పీడీఎస్యూ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తోకపేర్లతో విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, సికిందర్, కార్తీక్, సంజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
‘లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం’
మందమర్రిరూరల్: లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యూసఫ్ అన్నారు. ఆదివారం మందమర్రిలోని సీఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పనిగంటలు 8 నుంచి 14 గంటలకు పెంచే ప్రయత్నాలు శ్రమ దోపిడీకి దారితీస్తాయన్నారు. మే డే స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ సింగరేణి విభాగం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ మెడికల్ బోర్డులు, సొంతింటి పథకం, ఇన్కంటాక్స్ మాఫీ, తదితర సమస్యలను యాజమాన్యం పరిష్కరించని పక్షంలో జూన్లో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు రాజ్కుమార్, సలెంద్ర సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
వెలుగులోకి డివైన్ గ్రూప్ మోసాలు
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్లో కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన డివైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రధాన నిందితురాలు ఠాకూర్ శివరంజినిబాయి అరెస్టుతో కేసులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్కు చెందిన ఒక కుటుంబం అధిక లాభం పేరిట వల విసిరి రూ.2 కోట్లకు పైగా దండుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగజ్నగర్లో మకాం.. ఠాకూర్ కరణ్ సింగ్ 2021 ఆగస్టులో కాగజ్నగర్లో మకాం వేశాడు. పట్టణంలో రిటైర్డ్ ఉద్యోగులు, కా ర్మికులు, సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉండటంతో వారిని టార్గెట్గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మొదట స్థానికంగా కొంత మంది ఏజెంట్లను నియమించుకున్నారు. నెలకు 5 శాతం నుంచి 20 శాతం లాభం, డబ్బు డబుల్ అని ప్రచారం చేయించారు. మొదట నమ్మించి.. తర్వాత బురిడీ మొదట్లో కొంత మందికి చెప్పినట్లుగానే లాభాలు ఇచ్చి నమ్మకం కలిగించారు. రూ.లక్ష కడితే నెలకు రూ.10వేలు చేతిలో పెట్టారు. దీంతో నోటిమాట ద్వారా ప్రచారం జరిగి వందల మంది పెట్టుబడులు పెట్టారు. భారీగా డబ్బులు చేతికొచ్చాక 2023 జనవరిలో ఒక్కసారిగా కార్యాలయానికి తాళం వేసి కుటుంబంతో సహా పారిపోయారు. ఈ ముఠా కాగజ్నగర్లోనే కాకుండా హైదరాబాద్, పెంచికల్పే ట్, లాలాగూడ పరిధిలోనూ ఇదే తరహాలో మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కానీ ఇప్పటి వరకు తేలిన మోసం రూ.2.91 కోట్లు కానీ ఫిర్యాదు చేయని బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని, వాస్తవ మోసం రూ.5 కోట్లు దాటుతుందని బాధితులు వాపోతున్నారు. బాధితుల్లో ఆందోళన.. శివరంజినిబాయి అరెస్టుతో మరికొంత మంది బాధితులు ధైర్యం చేసి ముందుకొస్తున్నారు. ‘మా డబ్బులు మాకు వస్తాయా? నిందితుల ఆస్తులు అమ్మి అయినా సరే మాకు న్యాయం చేయండి’ అని బాధితులు వేడుకుంటున్నారు. ‘ఆర్బీఐ, సెబీ అనుమతి లేకుండా డిపాజిట్లు సేకరించడం నేరం. 5శాతం, 10శాతం, నెలవారి లాభం అంటే అది మోసమే. ప్రజలు అత్యాశకు పోయి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు. ఇలాంటి సంస్థల సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు కాల్ చేయండి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని పోలీసులు సూచిస్తున్నారు. -
శాసీ్త్రయ దృక్పథం పెంచుకుందాం..
మంచిర్యాలఅర్బన్: వేసవి సెలవులు ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను మరింత పెంచుకునేలా జిల్లా కేంద్రంలోని సైన్స్ కేంద్రంలో సైన్స్ సమ్మర్ క్యాంపు నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు ప్రయోగత్మాక సైన్స్ విద్య అమలు చేస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆలోచనలను మార్చడంతోపాటు ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం జిజ్ఞాస సంచార వాహనం ద్వారా 128 పాఠశాలలకు చెందిన 750 ప్రదర్శనలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా సైన్స్ ప్రయోగాలపై అవగాహన కల్పించడానికి ఈ నెల 27 నుంచి మే 8 వరకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. 80 మందికి అవకాశం.. వేసవి సెలవుల్లో విద్యార్థులు కాలక్షేపానికి పరిమితం కాకుండా సైన్స్పై ఆసక్తి పెంపొందించుకునేలా విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా నూతన ఆవిష్కరణలపై విద్యార్థులకు వివిధ అంశాలపై తర్పీదు ఇవ్వనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులకు చెందిన 80 మంది విద్యార్థులు శిబిరాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ కొనసాగనుంది. సైన్స్ సెంటర్లో భౌతిక రసాయన, బయోసైన్స్పై వివిధ అంశాల్లో ప్రయోగాత్మకంగా సులభతరంగా శిభిరాల నిర్వహణకు రూపకల్పన చేశారు. శిబిరంలో పాఠ్యపుస్తకాన్ని ప్రయోగాత్మకంగా, భయం నుంచి విశ్వాసానికి మార్చుటకు, సబ్జెక్టు నిపుణుల సెషన్లతో పాటు, ప్రేరణాత్మక సెషన్లు, ఎలక్ట్రానిక్, రోబిటిక్ సెషన్లపై నేర్పించనున్నారని డీఈవో యాదయ్య ప్రకటించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్ను సంప్రదించాలన్నారు. సైన్స్ సమ్మర్క్యాంపులో.. వేసవి సెలవుల్లో పాఠశాల విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంచడం, ప్రయోగాల ద్వారా నేర్పించడం, క్రియేటివిటీ, ఆలోచనాశక్తి పెంచడం, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, ప్రాజెక్టులు తయారు చేయడం, తదితర అంశాలపై శిభిరంలో నేర్పించనున్నారు. -
భవనాలు చూసి ఆశ్చర్యపోయాం
మేము మా పనులు తప్పితే ఊరు దాటి వెళ్లింది లేదు. మొదటిసారి హైదరాబాద్ వెళ్లొచ్చినం. ఉట్నూర్లో రెండంతస్తుల భవనాలు మించి కనబడవు. అక్కడ మాత్రం 50 అంతస్తుల భవనాలను బస్సులో వెళ్తూ చూశాం. నగరం ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాం. – సోయం భీంరావు మంచి విడిది, భోజనాలుఈ పర్యటనలో మాకు చారిత్రక కట్టడమైన తా రాబందీ బారాదరీలో వసతి కల్పించారు. మంచి వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. మంత్రి జూపల్లి మాతో కలిసి భోజనం చేశారు. అ లాగే ఎమ్మెల్యే బొజ్జు కుటుంబ సభ్యులతో కలి సి మాలో ఒకడిగా వచ్చారు. – మేస్రం జాగు ఆదివాసీలకు అద్భుత అవకాశం ఆదివాసీలకు ఇదో అద్భుత అవకాశం. ప్రస్తుతం విడతల వారీగా ఆదిలాబాద్ జిల్లా నుంచి గిరిపుత్రులను హైదరాబాద్ నగర సందర్శనకు తీసుకెళ్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఖమ్మంలోని పీవీటీజీలు బాహ్య సమాజానికి దూరంగా జీవితాలను వెల్ల దీస్తున్నారు. అలాంటి వారిలో నగర సందర్శన కొత్త అనుభూతినిస్తుంది. వారి కుటుంబాలు సైతం అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉంటుంది. – వెడ్మ బొజ్జుపటేల్, ఎమ్మెల్యే, ఖానాపూర్ -
ఆర్టీసీలో ముగిసిన సమ్మె
● విధుల్లో చేరిన కార్మికులు ● రోడ్డెక్కిన బస్సులు మంచిర్యాలఅర్బన్: మూడు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు తెరపడింది. ప్రభుత్వం, సంఘాల మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరారు. దీంతో శనివారం తెల్లవారుజాము నుంచి బస్సులు ప్రారంభం కావడంతో ఉద్యోగులు, అత్యవసర ప్రయాణికలకు ఉపశమనం కలిగించింది. మూడు రోజులుగా 148 బస్సుల్లో కేవలం 62 బస్సులు మాత్రమే రాకపోకలు సాగించాయి. బస్సుల కొరత వల్ల ప్రయాణికులు ప్రయాసపడాల్సి వచ్చింది. సమ్మెతో మహిళలతో పాటు పురుషులకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. సమ్మెతో ఆర్టీసీ రోజుకు రూ.24 లక్షలపైన ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. కార్మికుల సంబురాలు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల డిపోలో మూడు రోజులుగా సమ్మె చేపట్టిన కార్మికులు ప్రభుత్వ హామీతో సమ్మెను విరమించి శనివారం విధుల్లో చేరారు. స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. సమ్మెకు మద్దతు పలికిన ప్రతి ఒక్కరికీ జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలి దండేపల్లి: వరి ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఎక్కడ కూడా ధాన్యం కాంటా వేయడం లేదన్నారు. దీంతో యాసంగిలో వరి పండించిన రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలుగా పోసి నిరీక్షిస్తున్నారన్నారు. వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారన్నారు. అధికారులు, పాలకుల వైఫల్యంతోనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్, నాయకులు రవీందర్, భూమన్న, శ్రీనివాస్, తిరుపతి, అజయ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య
లింగాపూర్: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కంచన్పల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై గంగన్న కథనం ప్రకారం.. కంచన్పల్లికి చెందిన పేందుర్ గిరిజాబాయి (36), పేందుర్ బంధు దంపతులు. సిర్పూర్(యూ) మండలం నేట్నూర్ గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు గత కొంతకాలంగా గిరిజాబాయిను వేధిస్తున్నాడు. ఆమెను వెంబడించడం, ఫోన్లో వేధింపులకు గురిచేయడం, నీ జీవితం నాశనం చేస్తానని బెదిరిస్తుండేవాడు. గురువారం రాత్రి గిరిజాబాయి బయటకు వెళ్లిన సమయంలో ఆత్రం లచ్చు వెంబడించగా ఆమె ఆరుస్తూ ఇంటికి చేరుకుని బాబాయి కనకజ్యోతిరామ్కు విషయం చెప్పింది. సమీప బంధువు కోట్నాకపావుతో కలిసి అక్కడికి వెళ్లగా లచ్చు పారిపోయాడు. నిరంతరం వేధింపులతో మనస్తాపం చెందిన గిరిజాబాయి శుక్రవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. అంబులెన్స్లో ఆమెను జైనూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. మృతురాలి తండ్రి బాపురావు, సోదరి జ్ఞానేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పిచ్చికుక్క దాడిలో ఆవులకు గాయాలుజన్నారం: వుండలంలోని కవ్వాల్ గ్రామంలో శనివారం పిచ్చికుక్క దాడిలో మూడు ఆవులకు గాయాలయ్యాయి. దుర్గం రాజన్న, దొంగరి లింగన్న, తుడుం దేవయ్యలకు మూడు ఆవులు, దూడలపై కుక్క దాడి చేసి గాయపర్చాయి. పిచ్చికుక్క స్వైరవిహారంతో గ్రామస్తులు భయందోళనకు గురవుతున్నారు. కుక్క ల బెడద నివారించాలని కోరుతున్నారు. -
● పీఏసీఎస్లకు పాలకవర్గాల ఎంపిక ● పదవులపై అధికార పార్టీ నాయకుల ఆశలు ● ఎమ్మెల్యేల ఆశీర్వాదంతోనే దక్కనున్న అవకాశం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాలను నా మినేటెడ్ పద్ధతిలో ప్రభుత్వం నియమించనుంది. చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల నియామకం జరుగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అధికార పార్టీ నాయకుల్లో పదవులపై ఆశలు రేకెత్తుతున్నాయి. గతంలో ప్రతీ సహకార సంఘానికి 13మంది చొప్పున డైరెక్టర్ల స్థానా లకు ఎన్నికలు జరిగేవి. సంఘ సభ్యులు ఓట్లు వేసి ఎన్నుకునేవారు. అలా ఎన్నికై న డైరెక్టర్లలో ఒకరిని చైర్మన్, మరొకరిని వైస్చైర్మన్గా ఎన్నుకునేవారు. తాజాగా ప్రభుత్వం ఎన్నికలు లేకుండా నేరుగా నా మినేటెడ్ పద్ధతిలో సంఘాల పాలకవర్గాలను పూర్తి చేయనుంది. దీనిపై ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆశావహులు పదవుల కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాది దాటింది. గత ఫిబ్రవరిలో పదవీకాలం ముగియగా ప్రభుత్వం రెండుసార్లు పొడిగించింది. తర్వాత పలుచోట్ల సంఘాల చైర్మన్, వైస్చైర్మన్లపై ఆరోపణల కారణంగా పక్కన పెట్టింది. చివరికి గత డిసెంబర్ నుంచి పర్సన్ ఇన్చార్జీ లుగా సంఘాలకు అధికారులే ఉన్నారు. నూతన పాలకవర్గాలు రాక సంఘాల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ముగ్గురా? ఐదుగురా? నామినేటెడ్ పద్ధతిలో ఒక్కో సంఘానికి ఎంతమందిని ఎంపిక చేస్తారనేది ఇంకా స్పష్టత లేదు. ఒక్కో సంఘానికి ముగ్గురిని ఎంపిక చేసి, వారిలో చైర్మన్, వైస్ చైర్మన్, ఓ డైరెక్టర్, లేక ఐదుగురిలో ముగ్గురు డైరెక్టర్లు, చైర్మన్, వైస్ చైర్మన్గా ఉంటారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. అధికారులకు దీనిపై ఇంకా విధి విధానాలు రావాల్సి ఉంది. ఏపీలో కొత్తగా మార్పులు చేసిన చట్టం ప్రకారం ముగ్గురిని ఎంపిక చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో నామినేటెడ్ సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. నామినేటెడ్ చేసే సభ్యుల్లో జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు మహిళా వర్గాల కు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. జిల్లాలో 20సంఘాలు జిల్లాలో 20ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాలు ఉండగా 23వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీటితోపాటు కొత్తగా ఏర్పడిన మండలాల్లో హాజీపూర్, నస్పూర్, కన్నెపల్లిలో మూడు కొత్తగా ఏర్పాటు చేసేందుకు జిల్లా సహకార శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇవి ఏర్పడితే సంఘాల సంఖ్య 23 కు చేరనుంది. ఇంకా ఉమ్మడి జిల్లా పరిధి కేంద్రంగా సహకారశాఖ కొనసాగుతోంది. కొత్త జిల్లాల వారీ గా ఏర్పాటు కాలేదు. దీంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా మార్కెటింగ్ సహకార సంఘం(డీసీఎంఎస్) సైతం కొత్త జిల్లాల వారీగా ఏర్పాటు చే యాల్సి ఉన్నా, ఆ దిశగా ముందడుగు పడడం లే దు. కొత్తగా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చై ర్మన్లు, డైరెక్టర్లను సైతం ఎంపిక చే యాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పాత సంఘాలకే నామినెటేడ్ పద్ధతిలో ఎంపిక జరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పరపతి కల్పనలో ప్రాథమిక సహకార సంఘాలు కీలకంగా పని చేస్తున్నాయి. పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యంత్రాల సబ్సిడీలు, సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంలో ఉపయోగపడుతున్నాయి. రైతు వర్గాల్లో కీలకంగా ఉన్న ఈ పదవులు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు సూచించిన వారికే దక్కే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ కమిటీ పాలకవర్గాల తరహాలో సహకార సంఘాల్లోనూ ఇదే తీరుగా సాగనుంది. దీంతో అధికార పార్టీ రైతు నాయకులు ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. గత రెండున్నర ఏళ్లుగా అనేక మంది నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికార పార్టీ నాయకులకు అవకాశాలు దక్కనున్నాయి.ఎంపిక ఎమ్మెల్యేలదే.. -
బాల్య వివాహాలు చట్ట విరుద్ధం
లక్సెట్టిపేట: బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. బాల్య వివాహాలు జరిపిస్తే అందులో పాల్గొన్న ప్రతీ ఒక్కరిపై కేసు నమోదవుతుందన్నారు. బాల్య వివాహా లు చట్ట పరంగా నేరమని, వాటిని ప్రోత్రహించవద్దన్నారు. చట్ట పరంగా అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాలు వచ్చినప్పుడే వివాహానికి అర్హులవుతారన్నారు. అనంతరం బాల్య వివాహాల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవిందరావు, మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్పర్సన్ రాజేశ్వరి, కమిషనర్ విజయ్కుమార్, న్యాయవాదులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
అధ్యాపకుల తోడ్పాటు
ఉచిత శిక్షణకు కళాశాల అధ్యాపకులు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆనందంగా ఉంది. చాలామట్టుకు పల్లె, పట్టణ ప్రాంతాల విద్యార్థులు సరైన అవగాహన లేక పాలిసెట్ ఉత్తమ ర్యాంకులు సాధించలేక పోతున్నారు. కోచింగ్ సెంటర్లలో వేల రూపాయలు ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు. అలాంటి వారికి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయి. – దేవేందర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బెల్లంపల్లి, -
● మూడో అంతస్తు నుంచి పడి బాలుడి మృత్యువాత ● తల్లిదండ్రుల కళ్లముందే ఘటన
అయ్యో బాబు..!రామకృష్ణాపూర్: కూలీ పనుల కోసం ఓ కుటుంబం పొట్ట చేతబట్టుకుని వలస వచ్చింది. తల్లిదండ్రులు భవన నిర్మాణ పనుల్లో నిమగ్నం కాగా.. కుమారుడు ఆడుకుంటూ మూడో అంతస్తు నుంచి పడిపోయాడు. తీవ్ర గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గద్దెరాగిడి ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాగాడ్ జిల్లా సిరిగ్రామ్ గ్రామానికి చెందిన దాల్సింగ్, కిశోరి దంపతులు కూలీ పనుల నిమిత్తం ఐదు నెలల క్రితం కుటుంబంతో కలిసి ఈ ప్రాంతానికి వలస వచ్చారు. మేసీ్త్ర పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గద్దెరాగిడి ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఆసుపత్రి భవన నిర్మాణ పనుల్లో శనివారం మధ్యాహ్నం దాల్సింగ్, కిశోరి దంపతులు నిమగ్నమై ఉన్నారు. వీరి కుమారుడు నితేష్(8) భవనం మూడో అంతస్తుపై ఆడుకుంటూ ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తీవ్ర గాయాలైన అతడిని వెంటనే మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. తల్లిదండ్రుల కళ్లముందే ఘటన చోటుచేసుకోవడం అందరిని కంటతడి పెట్టించింది. బతుకు పోరాటం కోసం వచ్చిన కుటుంబానికి కుమారుడి మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అభాగ్యులు
ఎవరికి పట్టనిపాలి‘సెట్’ సాధించేలా..బెల్లంపల్లి: సాంకేతిక విద్య అభ్యసించాలని కుతూహలం ఉన్న విద్యార్థులు పాలిసెట్లో నెగ్గేలా బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన శిక్షణ తరగతులు మే 11వరకు నిర్వహించనున్నారు. 13న పాలిసెట్–2026 జరగనుంది. 2025–26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎస్టీ, ఎ స్సీ, బీసీ గురుకులాల్లో పదోతరగతి పూర్తి చేసిన వందమంది నిరుపేద విద్యార్థులకు కళాశాల ప్రిన్సి పాల్ దేవేందర్ పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. సబ్జెక్టులపై పట్టుసాధించేలా... శిక్షణ తరగతులను మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. సి ర్పూర్(టి), కాగజ్నగర్, సిర్పూర్ (యూ), ఆసిఫా బాద్, రెబ్బెన, తాండూర్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, శ్రీరాంపూర్, కాసిపేట, నెన్నెల, తది తర మండలాల విద్యార్థులు శిక్షణకు హాజరవుతున్నారు. సబ్జెక్టులపై పట్టుసాధించేలా ఉదయం 9 ను ంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తూ నే నిర్ధేశించిన పరీక్ష సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసే విధంగా మెలకువలు నేర్పిస్తున్నారు. కోర్సులపై అవగాహన పాలిటెక్నిక్లో ఏఏ కోర్సుల్లో ఉన్నాయి.. ఏ కోర్సులో చేరితే ఉద్యోగావకాశాలు ఉంటాయి.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తట్టుకునే తీరు, తదితర అంశాల్లో అవగాహన కల్పిస్తున్నారు. మైనింగ్, ఈఈఈ, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఏఐ, ఆటోమేషన్ రోబోటిక్, తదితర కోర్సులను వివరిస్తున్నారు.సమాన స్థాయిలో హాజరు... కళాశాలలో మూడేళ్ల క్రితం ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు. మొదటిసారి 2024లో 60 మంది విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరుకాగా పాలిసెట్లో 40 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత అప్పటి అధ్యాపకుల్లో కొందరు బదిలీపై వెళ్లగా రెండేళ్ల పాటు శిక్షణ తరగతులు నిలిపివేశారు. ప్రస్తుతం ప్రభుత్వం సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుండడంతో అధ్యాపకుల్లో ఉచితంగా బోధించాలనే జిజ్ఞాస ఏర్పడి ఈ ఏడాది నుంచి ఉచిత శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టినట్లు కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్ పేర్కొన్నారు. కాగా ఈ శిక్షణ తరగతులకు బాలబాలికలు సమాంతరంగా హాజరవుతుండడం గమనార్హం. -
భారీ పెట్టుబడి మోసం కేసులో నిందితురాలు అరెస్ట్
ఆసిఫాబాద్అర్బన్: కాగజ్నగర్ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన రూ.2 కోట్ల భారీ పెట్టుబడి మో సం చేసిన కేసులో నిందితురాలు థాకూర్ శివరంజనిబాయిని అరెస్టు చేసినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శనివారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. డివైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరిట నకిలీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను పెట్టుబడి పెట్టమని, అధిక లాభాలు వస్తాయని నమ్మించి సుమారు రూ. 2 కోట్ల మొత్తంలో నగదు వసూళ్లు చేశారు. 5 నుంచి 20 శాతం లాభాలు ఇస్తామని చెప్పి మోసాలకు పా ల్పడ్డారు. కాగజ్నగర్, పెంచికల్పేట్, హైదరాబాద్ ప్రాంతాల్లో 2021 నుంచి 2023 మధ్య కాగజ్నగర్లో ఉంఉడి ప్రజల నుంచి డబ్బులు తీసుకుని పరారయ్యారు. కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఉండగా ఇందులో థాకూర్ శివరంజనిబాయిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మిగతా నిందితులు ఠాకూర్ కరణ్సింగ్, థాకూర్ రతన్సింగ్, ధా కూర్ రవీందర్, థాకూర్ రాణాసింగ్ పరారీలో ఉ న్నారని వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కీలక నిందితురాలిని అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన కాగజ్నగర్ డీఎస్పీ వహిదుద్దీన్, టౌన్ సీఐ ప్రేమ్కుమార్, ఎస్సై రాజు, కానిస్టేబుళ్లు లక్ష్మి, జ్యోత్స్న, బ్లేస్సీ, షమీనా, కానిస్టేబుల్ విజయను ఎస్పీ అభినందించారు. -
సింగరేణి కార్మికులకు వైద్యసేవలు మెరుగుపరుస్తాం
బెల్లంపల్లి: సింగరేణి కార్మికులకు వైద్యసేవలు మెరుగుపరుస్తామని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్టు, ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు అన్నారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో రూ.80లక్షల అంచనాతో పునఃనిర్మాణం చేసిన పలు వైద్యవిభాగాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏరియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ఈసారి బెల్లంపల్లి, సత్తుపల్లి ఏరియాల్లో తప్పా ఇతర ఏరియాల్లో ఆశాజనకంగా బొగ్గు ఉత్పత్తి జరగలేదన్నారు. బెల్లంపల్లి ఏరియాలో కాస్తా ఆలస్యమైనప్పటికినీ గోలేటి, మహావీర్ ఖని (ఎంవీకే) ఓపెన్కాస్ట్ బొగ్గు గనులు ఏర్పాటవుతాయన్నారు. జీఎం విజయ్భాస్కర్రెడ్డి, ఏరియా ఆసుపత్రి డీవైసీఎంఓ పాండురంగాచారి, సింగరేణి కాలరీస్వర్కర్స్ యూని యన్ (ఏఐటీయూసీ) బెల్లంపల్లి, గోలేటి బ్రాంచి ఇన్చార్జి చిప్ప నర్సయ్య, బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్, ఏరియా ఆసుపత్రి పిట్ సెక్రెటరీ శ్రీధర్, టీబీజీకేఎస్ పిట్ సెక్రెటరీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
చెరువులో పడి యువకుడు.. ఆదిలాబాద్రూరల్: చెరువులో పడి యువకుడు మృతిచెందినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు..మండలంలోని జందాపూర్ గ్రామానికి చెందిన సొప్పరి సాయికుమార్ (31) కుటుంబ సభ్యులతో కలిసి ఎడ్లబండిపై శనివారం వ్యవసాయ పొలానికి వెళ్లాడు. కుటుంబ సభ్యులను చెరువు ఒడ్డున దించారు. ఎడ్లకు చెరువులో నీళ్లు తాగించే క్రమంలో లోతు నీళ్లలోకి తీసుకెళ్లాయి. ఎడ్లబండిపై ఉన్న సాయికుమార్ ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఆయన అరుపులు విన్న సమీపంలోని ఉపాధి కూలీలు అతన్ని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం 108లో రిమ్స్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మహిళ.. ఆదిలాబాద్టౌన్: పట్టణంలో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో శుక్రవారం రాత్రి మృతిచెందింది. పట్టణంలోని భుక్తాపూర్లోని హలి ్దరాం షాప్ ముందు గల డ్రెయినేజీలో ఇచ్చోడకు చెందిన జంగల్వార్ అనిత (45) మృతిచెంది ఉంది. శనివారం స్థానికులు గమనించి వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సునీల్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వడదెబ్బతో ఇద్దరు మృతి
ఆదిలాబాద్టౌన్/తాండూర్: ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతిచెందారు. ఆదిలాబాద్లోని తాటిగూడకు చెందిన గొడ్కే రాంగోపాల్ (65) శనివారం పట్టణంలోని పంజాబ్చౌక్లోని ఓ హోటల్ ఎదుట పడి మృతిచెందినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. తాండూర్ మండలం రేచిని పంచాయతీ బారేపల్లికి చెందిన కొట్రంగి జయరాం (40) ట్రాక్టర్ డ్రైవర్ శుక్రవారం పనినిమిత్తం బెల్లంపల్లికి వెళ్లి ఎండదెబ్బకు గురై అస్వస్థతకు గురయ్యాడు. రాత్రి అతన్ని కుటుంబీకులు బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు మంచిర్యాలకు తీసుకెళ్లాలని సూచించారు. మార్గమధ్యలోనే మృతి చెందాడు. భార్య నీలాబాయి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తాండూర్ ఎస్సై ప్రసాద్రావు తెలిపారు. -
● పూర్తయిన ఓటర్ మ్యాపింగ్ ● పెరిగిన ఓటర్లతో 3,79,375 మంది ● జిల్లాలో 16 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలు
‘పరిషత్’ ఎన్నికలకు కసరత్తుమంచిర్యాలరూరల్(హాజీపూర్): పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇక పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ), మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) ఎన్నికలు మే నెలలో నిర్వహించేలా సిద్ధంగా ఉండాలని, ఇందుకు ఏర్పాట్లతో పాటు అదనంగా నమోదైన ఓటర్ల ప్రకారం వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తికాగా 2,699 మంది ఓటర్లు పెరిగారు. మరోవైపు ఇప్పటికే జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఉంచారు. ఓటర్లు పెరగడంతో రిజర్వేషన్లు కూడా మారవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఇక పరిషత్ల పాలకవర్గాల గడువు ముగిసి రెండేళ్లు దాటినా అడుగు ముందుకు పడటం లేదు. పెరిగిన ఓటర్లు 2,699 మంది.. జిల్లాలో 16 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గత ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 3,76,676 మంది ఓటర్లు ఉన్నారు. పెరిగిన 2,699 ఓటర్లతో మొత్తం 3,79,375 మంది ఓటర్లు ఉన్నా రు. ఇందులో పురుషులు 1,86,949మంది, మహిళలు 1,92,411మంది, ఇతరులు 15 మంది ఉండగా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 3,79,375మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. చిగురించిన ఆశలు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికలు ఉంటాయని అందరూ భావి ంచినా బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో తేలాకే ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల ప్రకారం మరోసారి రిజర్వేషన్లు మా రే అవకాశం ఉంది. తాజాగా ఎస్ఈసీ ఓటర్ల జాబి తాకు ఆదేశించడంతో ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే పల్లెల్లో పరిషత్ వేడెక్కడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్ము రం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బుజ్జగింపులు, రాజీపడి పోటీ చేయని వారితో పాటు కొత్తవారూ ఉన్నారు. అవసరమైతే ఎంపీపీ పదవి దక్కించుకోవాలని కొందరు, జెడ్పీటీసీగా గెలుపొంది కేబి నెట్ హోదా ఉన్న జెడ్పీ చైర్మన్ పదవి పొందాలని మరికొందరు చూస్తున్నారు. అయితే ఈ ఎన్నికలు ఇప్పుడు ఉంటాయా.? లేదా మరోసారి రిజర్వేషన్లు ప్రకటించాకే ఉంటాయా? అనే దానిపై అధికారికంగా స్పష్టత లేదు. కానీ ఎస్ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు మాత్రం అధికారులు సిద్ధంగా ఉన్నారు. జిల్లా వివరాలు జెడ్పీటీసీ స్థానాలకు రిటర్నింగ్ అధికారులు 25 ఎంపీటీసీ స్థానాలకు రిటర్నింగ్ అధికారులు 56 ఎంపీటీసీ స్థానాలకు సహాయక రిటర్నింగ్ అధికారులు 56 మొత్తం పోలింగ్ అధికారులు 3,957తేలిన ఓటర్ల లెక్క మండలం ఎంపీటీసీ పోలింగ్ పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఇతరులు మొత్తం స్థానాలు స్టేషన్లు బెల్లంపల్లి 08 41 11,715 11,937 01 23,653 భీమిని 05 24 5,878 5,738 01 11,617 కన్నెపల్లి 05 30 7,645 7,905 01 15,551 కాసిపేట 09 52 13,194 13,448 03 26,645 కోటపల్లి 09 53 13,437 13,853 02 27,292 మందమర్రి 05 21 5,748 5,863 01 11,612 నెన్నెల 07 35 9,688 9,811 01 19,500 తాండూర్ 09 53 13,848 14,164 00 28,012 వేమనపల్లి 05 32 7,608 7,608 01 15,297 భీమారం 05 26 6,432 6,741 00 13,173 చెన్నూర్ 09 53 13,116 13,529 00 26,645 దండేపల్లి 14 78 20,618 21,771 01 42,390 హాజీపూర్ 06 31 8,414 8,655 00 17,069 జైపూర్ 10 52 15,374 15,464 01 30,839 జన్నారం 15 85 21,814 22,868 02 44,684 లక్సెట్టిపేట 08 47 12,340 13,056 00 25,396 మొత్తం 129 713 1,86,949 1,92,411 15 3,79,375సిద్ధంగా ఉన్నాం..రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణలో ముఖ్యమైన ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశాం. గతంలోనే ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎన్నికల సంఘం ఎప్పుడు ఆదేశాలు ఇచ్చినా ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. – గణపతి, జెడ్పీ సీఈవో, మంచిర్యాల -
తెలంగాణలోకి ఇతర ప్రాంతాల ధాన్యం
కోటపల్లి: మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్ర సరిహద్దు మీదుగా తెలంగాణలోకి అక్రమంగా వరి ధాన్యం తరలింపును అడ్డుకునేందుకు ఏర్పాటు చేసి న అంతర్రాష్ట్ర చెక్పోస్టు నామమాత్రమే అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తుండగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి కొంతమంది దళారులు ధాన్యం తెచ్చి సొమ్ము చేసుకుంటుండగా దీనిని అడ్డుకునేందుకు రాష్ట్రాల సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేయించింది. మండలంలోని రాపన్పల్లి ప్రాణహిత నది సమీపంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో బుధవారం అంతర్రాష్ట్ర చెక్పోస్టును రెవెన్యూ, పోలీ స్, వ్యవసాయశాఖల సమన్వయంతో ఏర్పాటు చేశారు. కాగా, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వరి ధాన్యం బస్తాలతో ట్రాక్టర్ రాగా అధికారులు పరిశీలించారు. తిరిగి వెనక్కి పంపడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోకి ధాన్యం రాకుండా అడ్డుకుని సదరు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసులు చేయాల్సిన అధికారులే వదిలివేయడంతో అక్రమ ధాన్యం రవాణాకు ఆజ్యం పోసినట్లయిందని పలువురు చర్చించుకుంటున్నారు. నామమాత్రపు తనిఖీలే.. మండలంలోని రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలు నామమాత్రమే అయ్యాయి. తెలంగాణలో కి ధాన్యం రాకుండా అడ్డుకునేందుకు ఏర్పాటు చేసి న చెక్పోస్టు వద్ద పోలీస్, రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. ఽఇంతమంది అధికారులు విధులు నిర్వహిస్తున్నా గతంలో చెన్నూర్లో రెండు, మూడుసా ర్లు ధాన్యం బస్తాలతో వచ్చిన లారీలను రైతులే అ డ్డుకుని అధికారులకు అప్పగించిన సందర్భాలున్నా యి. కాళేశ్వరం అన్నారం బ్యారేజ్ మీదుగా చెన్నూర్ మండలంలోకి అక్రమంగా ధాన్యం తీసుకువచ్చే అ వకాశాలున్నట్లు గతంలో పలువురు అధికారులు ఉ న్నతాధికారులకు నివేదించినా అటువైపు ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదు. అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద విధులు నిర్వహించే సిబ్బంది కళ్లు గప్పి లోనికి వాహనాలు ఎలా వస్తున్నాయి? పట్టుబడిన వాహనాలకు ఎలాంటి కేసులు చేయరాదని, ధాన్యాన్ని రై తులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని అధికారులే చెబు తుండగా, అలాంటప్పుడు మూడు శాఖల అధికా రులు 24గంటల విధులు నిర్వహిస్తుండడం ఎందుకని పలువురు అధికారులు చర్చించుకోవడం కొసమెరుపు. ఎలాంటి కేసులు చేయకపోతే అక్రమంగా ధాన్యం తీసుకువచ్చే వారికి ఏం భయం ఉంటుందని కొందరి వాదన. దీనిని అలుసుగా తీసుకుని దళారులు అధికారులను మచ్చిక చేసుకుని ధాన్యం వాహనాలను అక్రమంగా రాత్రిపూట, తెల్లవారుజామున మన రాష్ట్రంలోకి తెస్తున్నారని గతంలో పట్టుబడిన వాహనదారులు విచారణ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ధాన్యం బస్తాలతో వచ్చే వాహనాలను తనిఖీ కేంద్రం వద్ద ఆపి వెనక్కి పంపడం మినహా ఎలాంటి కేసులు నమోదు చేసే అధికారం తమకు లేదని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి బ్రహ్మారావు తెలిపారు. ధాన్యాన్ని రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఆయన పేర్కొన్నారు. -
కార్మికుల సంక్షేమానికి కృషి
కాసిపేట/శ్రీరాంపూర్: సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తోందని సింగరేణి డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు) కే.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన మందమర్రి ఏరియా కాసిపేట–1ఏ న్యూటన్నల్ గనిపై మ్యాన్ రైడింగ్ను ప్రారంభించారు. కేకే ఓసీ వ్యూ పాయింట్ నుంచి బొగ్గు వెలికితీత పనులను పర్యవేక్షించారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించి బొగ్గు ఉత్పత్తి వివరాలు తెలుసుకున్నారు. జీఎం కార్యాలయంలో ఏరియా ముఖ్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూగర్భ గనుల ద్వారా నష్టం వాటిల్లుతున్నా కార్మికుల సంక్షేమం కోసం నడిపిస్తున్నామని తెలిపారు. అత్యధికంగా నష్టం వాటిల్లే గనుల్లో మొదటి స్థానంలో కాసిపేట గని ఉందన్నారు. నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ముందుస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. మందమర్రి ఏరియా కేకే ఓసీలో గని వ్యూ పాయింట్ను సందర్శించి బొగ్గు వెలికితీత పనులను పర్యవేక్షించారు. మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ, శ్రీరాంపూర్ జీఎం ఎం శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్లు, ఏజెంట్ రాంబాబు, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్, ఏరియా కార్యదర్శి సత్యనారాయణ, గని మేనేజర్ సతీష్కుమార్, సంక్షేమాధికారి జీషాన్, కేకే ఓసీ ఎస్ఓటూ జీఎం ప్రసాద్, బెల్లంపల్లి రీజియన్ జీఎం క్వాలిటీ వీరభద్రరావు, కేకే ఓసీ మేనేజర్ రామారాజు తదితరులు పాల్గొన్నారు. -
వేతన కమిటీ వేయాలి
శ్రీరాంపూర్: బొగ్గు గని కార్మికుల నూతన ఒప్పందం కోసం వేతన కమిటీ వేయాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఆర్కే5 గనిపై కార్మికులతో మాట్లాడారు. వేతన ఒప్పంద కాల పరిమితి జూన్ 30తో ముగుస్తుందని, జూలై ఒకటి నుంచి కొత్త వేతన కాలపరిమితి అమలు కావాల్సి ఉందని తెలిపారు. ఈ వేతన ఒప్పందం కోసం ముందుగా కోల్ ఇండియా యాజమాన్యం కమిటీ వేసి వేజ్బోర్డ్ను తీర్చిదిద్దాలని తెలిపారు. ఇప్పటికే దీని ఏర్పాటులో జాప్యం జరిగిందని, దీన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టబోతున్నామని అన్నారు. వేతన కమిటీపై తక్షణమే కోలిండియా యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్రెడ్డి, కేంద్ర కమిటీ నాయకులు భూంపల్లి రమేష్, మేకల స్వామి, కొమ్మ బాబు, ఫిట్ కార్యదర్శి కుమ్మరి చంద్రశేఖర్, నాయకులు కుంట రాజు, తెల్ల ప్రశాంత్, అరుణ్గౌడ్, చల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
భర్త ఇంటి ఎదుట బైఠాయింపు
దస్తురాబాద్: భర్త ఇంటి ఎదుట ఓ మహిళ బైఠాంచిన ఘటన మండలంలోని మున్యాల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన సుమలతకు 2024 ఫిబ్రవరి 9న దస్తురాబాద్ మండలం మున్యాల గ్రామానికి చెందిన కొప్పుల సత్తన్నతో వివాహమైంది. పెళ్లయిన నెలకే ఉపాధి నిమిత్తం సతన్న గల్ఫ్ దేశానికి వెళ్లాడు. ఆ సమయంలో సుమలత తన తల్లిగారింట్లో ఆరు నెలలు ఉండి డీఎస్సీ పరీక్షలు రాసి వస్తానని వెళ్లింది. రెండేళ్లయినా తిరిగా రాలేదని, ఇందుకు తన అత్త, మామే కారణమని ఆరోపించింది. వారు తనను ఇంటికి రాకుండా అడ్డు పడుతున్నారని తెలిపింది. కనీసం కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేయకుండా అడ్డుపడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన భర్త ఇంటి ఎదుట బైఠాయించినట్లు తెలిపింది. తనకు న్యాయం చేయాలని గ్రామ పెద్దలను వేడుకుంది. కాగా, స్థానికులు మద్దతు తెలుపగా సుమలత ఆందోళన కొనసాగిస్తోంది. -
ఏకాగ్రతతో నైపుణ్యత సాధించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: నిరుద్యోగ యువత తాము ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో నైపుణ్యత సాధించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారంలో భాగంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల, మైనారిటీ యువతకు నైపుణ్యాభివృద్ధి, కెరీర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వృత్తి విద్య కోర్సుల్లో ఆధునిక సాంకేతికతను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం అందిస్తుందని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దుర్గాప్రసాద్, మైనార్టీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి నీరటి రాజేశ్వరి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. కూలీల సంక్షేమం దిశగా చర్యలు భీమిని: ఉపాధి హామీ పథకం కూలీల సంక్షేమం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం ఆయన భీమిని, కన్నెపల్లి మండలాల్లో పర్యటించారు. భీమిని మండలంలో ఉపాధిహామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. భీమినిలో ప్రజాపాలన గ్రామసభలో పాల్గొన్నారు. భీమిని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, భీమిని, కన్నెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సందర్శించి మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావుతో కలిసి ఉపాధిహామీ పనులు పరిశీలించారు. అనంతరం పీపీరావు ప్రాజెక్టును సందర్శించారు. ఎంపీడీఓలు గంగామోహన్, శ్రీనివాస్రెడ్డి, ఎంపీఓలు రమ్య, తహసీల్దార్ బికర్ణదాస్ పాల్గొన్నారు. -
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో అర్హులైన జర్నలిస్ట్లందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందిస్తామని జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా పౌర సంబంధాల అధికారి, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ కన్వీనర్ మాదంశెట్టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 2026–28 సంవత్సరాలకు గాను ప్రభుత్వ ఉత్తర్వులు 252, ఆర్టీ 103 ప్రకారం అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేయాలని తెలిపారు. ఆన్లైన్లో అందిన దరఖాస్తులను కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు రమేష్రెడ్డి, సిద్ధార్థ, సురేష్ కుమార్, సత్యనారాయణ, ఇమాద్ ఉద్దీన్, ప్రకాష్రెడ్డి, నవీన్కుమార్, నరేష్, సదానందం, సంతోష్, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయ సిబ్బంది సంపత్కుమార్, జి.రవితేజ, సునీల్కుమార్ పాల్గొన్నారు. -
అ‘దృశ్యం’ సినిమాను తలపిస్తోంది..!
జన్నారం: వారం నుంచి ఓ వ్యక్తి కనిపించకపోవడం మిస్టరీగా మారింది. పోలీసులు, గ్రామస్తులు ఎంత వెతికినా అతడి ఆచూకీ దొరకడంలేదు. దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన గూడ మల్లేశ్ ఈ నెల 16న రాత్రి జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో పేకాడుతున్నాడు. దారి వెంట వెళ్లేవారి టార్చిలైట్లను చూసి పోలీసులనుకుని పారిపోయాడు. అప్పటి నుంచి అతడి సెల్ఫోన్ స్విచాఫ్ వస్తోంది. మరుసటి రోజు అతడి భార్య సుజాత జ న్నారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, అతడితోపాటే పేకాడుతున్న మిగతా వారున్నా ఇప్పటివరకు మల్లేశ్ ఆచూకీ లభించలేదు. దీంతో స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. సుజాత ఫిర్యాదు మేరకు ఏసీపీ ప్రకాశ్ ఆదేశాలతో లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై ఉదయ్కిరణ్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు మల్లేశ్ అదృశ్యం ఘటన అతడి కుటుంబ సభ్యుల కు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. పోలీసులు డాగ్స్క్వాడ్, డ్రోన్ కెమెరాలతో ఇదివరకే వెతకగా శుక్రవారం లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సైలు సురేశ్, తహసీనొద్దీన్, ఉదయ్కిరణ్ గ్రామస్తులతో కలిసి చెట్ల పొదలు, గోదావరి తీర ప్రాంతాల్లో గాలించారు. పోలీసులు డాగ్స్క్వాడ్తో వెతకగా గోదావరి సమీపంలో ఆయన చెప్పులు కనిపించాయి. డాగ్ వాటిని పసిగట్టి గోదావరి నీటి వరకు వెళ్లి ఆగింది. దీంతో రిస్క్ టీంతో గోదావరి నీటిలో గాలించారు. డ్రోన్ కెమెరాతో పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. గ్రామస్తులతో కలిసి గోదావరి ప్రాంతంలోని చెట్లపొదలు, గుట్టలను గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో పంట చేలు, పొలాలకు విద్యుత్ తీగలు అమర్చి ఉంటే వాటికి తగిలే ప్రమాదముంది. ఆ కోణంలో పో లీసులు దర్యాప్తు జరిపితే బాగుంటుందని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ విషయంపై ఎస్సై ఉదయ్కిరణ్ను ‘సాక్షి’ సంప్రదించగా, వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు డాగ్స్క్వాడ్, డ్రోన్లతో పరిశీలించామని పేర్కొన్నారు. గ్రామస్తులతో కలిసి పరిసర ప్రాంతాల్లో వెతికామని వివరించారు. -
● 32.5 తులాల బంగారం, కిలో వెండి, రూ.1.50 లక్షల నగదు చోరీ
మంచిర్యాలలో భారీ చోరీ మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని గౌలమేశ్వరీ కాలనీలో ఈ నెల 23న రాత్రి భారీ చోరీ జరిగింది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ముదాం నాగయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 22న జైపూర్ మండలం రామారావుపేటలోని బంధువుల ఇంట్లో జరిగిన సంవత్సరీకం కార్యక్రమానికి వెళ్లాడు. తిరిగి 23న రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే తలుపులు తెరుచుకుని, మాస్టర్ బెడ్రూమ్లోని బీరువా తలు పులు పగులగొట్టి ఉన్నాయి. నాగయ్య దొంగతనం జరిగినట్లు భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకు న్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. 32.5 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ. 1.50 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్ నిపుణులు, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మందమర్రిలో చెస్ పోటీలు
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని బూరుదగూడెంలోగల లిటిల్ఫ్లవర్ హైస్కూల్లో శుక్రవారం అండర్–7, అండర్–11, ఓపెన్ టూ ఆల్ మంచిర్యాల, కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాల విద్యార్థులకు చెస్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ నెల 26న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన వి ద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చదరంగం చైర్మన్ ఈగ కనకయ్య, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సంపత్కుమార్, కొంగల తిరుపతిరెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్, శృతి, కుమార్, కార్యవర్గ సభ్యుడు సతీశ్ తదితరులున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
బాసర: మండలంలోని టాక్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ము థోల్ నుంచి కూలీలు ఆటోలో బాసరకు వెళ్తున్నారు. బాసర–భైంసా రహదారిపై టాక్లి సమీపంలో ఎదురుగా వస్తున్న జేసీబీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముథోల్కు చెందిన రుమోళ్ల పోతన్న (26) అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా కూలీలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సాయన్న ఫిర్యాదు మేరకు బాసర సీఐ కిరణ్కుమార్, ఏఎస్సై గంగాధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆలయాలకు ‘పుష్కర’ శోభ
చెన్నూర్: చెన్నూర్ గోదావరి నదీ తీరంలోని ఆలయాలు పుష్కర శోభను సంతరించుకోనున్నాయి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఆలయాలు, వివిధ అభివృద్ధి పనులకు రూ.130.59 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. 2027 జూన్లో నిర్వహించే గోదావరి పుష్కరాలను టైర్వన్గా గుర్తించడంతో ఇప్పటి నుంచే పనులు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. చెన్నూర్ ప్రాంత దేవాలయాలు, పుష్కర ఘాట్లకు విశాలమైన రోడ్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, పుష్కర ఘాట్లు నిర్మిస్తారు. జాతీయ రోడ్డు నుంచి పుష్కర ఘాట్ల వరకు ఇరువైపుల పూలమొక్కలు, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా పెయింటింగ్లు వేస్తారు. పనులు.. ఆలయాలకు పెద్దయెత్తున నిధులు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. పుష్కరఘాట్ ప్రాంతంలో గోదావరి మాత విగ్రహానికి రూ.50లక్షలు, రూ.కోటితో శివలింగం, గోదావరి తీర హనుమాన్ మందిర్కు రూ.50లక్షలు, చెన్నూర్ మదనం పోచమ్మ ఆలయానికి రూ.3 కోట్లు, జగన్నాథ ఆలయానికి రూ.75 లక్షలు, కల్యాణమండపం, డైనింగ్ హాల్కు రూ.4కోట్లు, గెస్ట్హౌస్ నిర్మాణానికి రూ.50 లక్షలు, కత్తరశాల మల్లికార్జున ఆలయానికి రూ.1.50కోట్లు, భక్తులు సేదదీరేందుకు భవన నిర్మాణానికి రూ.2 కోట్లు, శారద మండప నిర్మాణానికి రూ.50 లక్షలు, ఘాట్ వద్ద కేశఖండన షెడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు, అక్కెపల్లి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయానికి రూ.కోటి, చెన్నూర్ మహాంకాళి దేవాలయానికి రూ.30 లక్షలు ప్రతిపాదించారు. పనులు పూర్తయితే ఆలయాలు కొత్త శోభను సంతరించుకుంటాయి. భూ సేకరణ చెన్నూర్ గోదావరి పుష్కరాల్లో భాగంగా జాతీయ రోడ్డు నుంచి పుష్కర ఘాట్ వరకు రోడ్డు వెడల్పు చేసేందుకు అధికారులు 4.21 ఎకరాల భూమి సేకరించాలని సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో మార్కెట్ ధర ఎకరానికి రూ.12లక్షల నుంచి రూ.15 లక్షలు పలుకుతోంది. రెవెన్యూ అధికారులు రూ.7.88 లక్షలుగా అంచనా వేశారు. రైతులను సంప్రదించి ధర నిర్ణయించే అవకాశం ఉంది. శాఖల వారీగా నిధుల ప్రతిపాదనలు.. -
ఘాట్ ఏర్పాటయ్యేనా..!
కోటపల్లి: పుష్కరాల సమయంలో భక్తుల పుణ్యస్నానాలకు మండలంలో పుష్కరఘాట్ లేదు. ఇటీవల మండలంలోని పార్పల్లి ఎర్రాయిపేట గ్రామ సమీపంలోని గోదావరి నదీ తీరాన్ని అధికారులు పరిశీలించారు. కానీ ఇంతవరకు పనుల వైపు అడుగులు పడలేదు. దీంతో పుష్కరాల సమయానికి పనులు పూర్తవుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్పల్లి నదీ తీరంలో పుష్కరఘాట్లు ఏర్పాటు చేస్తే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తప్పుతాయి. పార్పల్లి ఎర్రాయిపేట సమీపంలోని గోదావరి నది పుష్కరఘాట్కు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. పంచకోశ ఉత్తరవాహిని గోదావరి నదీ తీరం పార్పల్లి వద్దనే ముగుస్తుంది. గోదావరి నది 63వ జాతీయ రహదారిని ఆనుకుని ఉండడంతో ఏటా శివరాత్రి, శుభ కార్యక్రమాల సమయంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. సమీపంలోనే కాలభైరవస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. సుమారు 15కిలోమీటర్ల దూరంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, 10కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఉండడం గమనార్హం. పుష్కరఘాట్కు ఎంతమంది జనం వచ్చినా ఇబ్బందులు లేకుండా పార్కింగ్కు అనువైన స్థలాలు నదీ తీరంలోనే ఉన్నాయి. -
వేదం.. జీవన నాదం
బాసర: బాసరలోని శ్రీవేద భారతి పీఠం ఎంతో మందికి వేదవిద్యను అందిస్తోంది. నిత్యం ఆధ్యాత్మి క కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ తదితర సుదూర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడి వేద విద్యాలయాన్ని సందర్శిస్తున్నా రు. సనాతన ధర్మానికి మూలమైన వేద జ్ఞానాన్ని అందించే కల్పవల్లిగా బాసర వేదవిద్యాలయం వి రాజిల్లుతోంది. ఇక్కడ విద్యార్థులకు వేద తరగతులు నిర్వహిస్తూ ఉచితంగా ఆహారం, ఆశ్రయం అందిస్తోంది. వేద విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీవేదభారతి పీఠం వ్యవస్థాపకుడు వేద విద్యానందస్వామీజీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉచిత వసతి, భోజన సౌకర్యం బాసరలో వేదభారతి పీఠాన్ని 2008లో స్థాపించా రు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తూ వేదవిద్యతో పాటు ఆధునిక విద్య (ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్)ను బోధిస్తున్నారు. కులాలకు అతీతంగా లింగబేధం లేకుండా వేద విజ్ఞానాన్ని అందించే ప్రక్రియ నిరాటంకంగా సాగుతోంది. 12 ఏళ్లు పైబడిన బాలబాలికలకు వేదవిద్యను అందించే ప్రణాళికనూ రూపొందించారు. వేదవిద్య ప్రవేశపెట్టి పదోతరగతి/ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లతో కూడిన కోర్సులు అందుబాటులో ఉంచారు. SVBPయూట్యూబ్ చానెల్ ద్వారా వేలాదిమందికి ఆన్లైన్లో ఉచితంగా వేదవిద్యను అందిస్తున్నారు. ఆఫ్లైన్తోపాటు ఆన్లైన్లోనూ వేదవిద్యను అందిస్తున్న ఏకైక సంస్థగా బాసర శ్రీవేదభారతి పీఠం భక్తులకు చేరువవుతోంది. ఇప్పటివరకు వేదవిద్యలో సుమారు 300మందికి శిక్షణ ఇచ్చిన ఘనత వేద విద్యానందస్వామీజీకి దక్కింది. నిర్వహించే కార్యక్రమాలు వేద విద్యాలయం ఆధ్వర్యంలో హిందూ సంప్రదాయం, వేదవిద్యను పెంపొందించేలా ప్రణాళికలు రూపొందిస్తూనే నిరుపేదలకూ ఉచిత విద్యావకాశాలు కల్పిస్తున్నారు. విద్యార్థులు నిత్యం ఉదయం ప్రార్థన, సూర్యనమస్కారాలు, యోగా, వేద అధ్యయనం, వీణ, గిటా ర్, వయోలిన్ తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ శనివారం సాయంత్రం 5.30నుంచి 7.30గంటల వరకు రుద్రాభిషేకం, త్రినాథ వ్రతం, గోపూజ, గోహారతిని స్వామీజీ సహకారంతో రుషికన్యలు, రుషి పుత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేదవిద్యాలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తారు. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 26న అర్హులైన విద్యార్థులకు ఉపనయన కార్యక్రమం ని ర్వహిస్తున్నారు. కులాలకు అతీతంగా 18–25ఏళ్లవారికి వేదమంత్రాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, పూజా హోమాది క్రతువులు తదితర కార్యక్రమాలపై మూడేళ్ల కాల వ్యవధితో శిక్షణ ఇస్తున్నారు. ఏడాది కిందటివరకు సుమారు తొమ్మిదేళ్లు గోదావరినది తీరంలో నిరంతరాయంగా ‘గోదావరికి నిత్యహారతి’ పేరిట నదీమ తల్లికి హారతులిచ్చి శ్రీవేద భారతి పీఠం పలువురు ప్రముఖుల మన్ననలు పొందింది. శ్రీవేద భారతి పీఠం వ్యవస్థాపకుడు శ్రీవేద విద్యానందస్వామీజీ నేతృత్వంలో గోపూజ, త్రినాథ వ్రతం, గోహారతులు ఇస్తూ వేదవిద్యతోపాటు గోసంపదకు విలువలనిచ్చే ఏకై క సంస్థగా వేదభారతి పీఠాన్ని భక్తులు కొనియాడుతున్నారు. ఆలయాలు క్షేత్రాల వద్ద ఇలాంటి ఆశ్రమాలు, మఠాలు మరిన్ని వృద్ధిలోకి వస్తే ఆలయ క్షేత్రాలు వైదికంగా మరింత అభివృద్ధి చెందుతాయని భక్తులు భావిస్తున్నారు. తొమ్మిదేళ్లు నిత్య గోదావరి హారతి -
ఆర్టీసీ ఉద్యోగుల మౌనదీక్ష
మౌనదీక్షలో పాల్గొన్న కార్మికులుమంచిర్యాలఅర్బన్: సమస్యల పరిష్కారం కోసం టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మూడో రోజు శుక్రవారమూ కొనసాగింది. మంచిర్యాల డిపో వద్ద కార్మికులు నల్ల రిబ్బన్లు ధరించి మౌనదీక్ష నిర్వహించారు. అంతకుముందు ప్రాణత్యాగం చేసిన నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమ్మెకు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అన్నారు. బస్సులు డిపోకే పరిమితం డిపోలో 148 బస్సులు ఉండగా.. 62 అద్దె బస్సుల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. సంస్థ బస్సులు డిపోకే పరిమితం కాగా, అద్దె బస్సులు నడిచాయి. డీఎంతోపాటు మరో నలుగురు మినహయిస్తే మిగతా వారంతా సమ్మెలోనే ఉన్నారు. రెండు రోజులుగా మహిళలతోపాటు పురుషులకు ఉచి తంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు అద్దె బస్సులపై తాత్కాలిక కండక్టర్లను నియమించి పురుషులకు టికెట్ ఇష్యూ చేయించారు. హైదరాబాద్కు వెళ్లే 38 బస్సుల్లో మొత్తం లగ్జరీ, రాజధాని, లహరీ బస్సులన్నీ సంస్థవి ఉన్నా యి. మూడు రోజులుగా ఉద్యోగులు విధులకు దూ రంగా ఉండడంతో శుక్రవారం కూడా హైదారాబా ద్కు వెళ్లే సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. సొంత, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. కొవ్వత్తుల ర్యాలీ ఆర్టీసీ అమరవీరుడు శంకర్గౌడ్ మృతికి సంతాప సూచికంగా కార్మికులు శుక్రవారం రాత్రి మంచిర్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. డిపో నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు వెళ్లి మళ్లీ బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం
ఆదిలాబాద్టౌన్: వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గురువారం జిల్లాలో ఏకకాలంలో 16 మండలాల్లో 45 బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించగా, ఇందుకు సంబంధించిన వివరాలు ఎస్పీ శుక్రవారం వెల్లడించారు. దాదాపు వంద మంది వడ్డీ వ్యాపారులను తనిఖీ చేసి, జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల్లో వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 15 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ భూ ములు కుదువుపెట్టుకుని, కొందరు రైతుల భూములను తమ పేర్లపై రాయించుకుని అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తున్నవారిపై దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో భాగంగా ప్రామిసరీ నోట్లు, చెక్కులు, పాస్బుక్కులు, ఖాళీ స్టాంప్ పేపర్లు, బాండ్ పేపర్లు, సేల్డీడ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్స్టేషన్లో ఖుర్షీద్నగర్కు చెందిన నాయిని సుదర్శన్, తలమడుగు పోలీస్స్టేషన్లో దేవాపూర్కు చెందిన కటకం రాజు, శ్రీనివాస్, మావల పోలీస్స్టేషన్లో 170 కాలనీకి చెందిన కుంటి లింగన్న, మావలకు చెందిన దుర్గారెడ్డి, నేరడిగొండ పోలీస్స్టేషన్లో తేజపూర్కు చెందిన గంగారెడ్డి, నేరడిగొండకు చెందిన శ్రీనివాస్, జుంబేరాత్ రాహుల్, తాంసి పోలీస్స్టేషన్లో కప్పర్లకు చెందిన ఉప్లంచి నగేశ్, ఉప్లంచి గంభీర్, ఇచ్చోడ పోలీస్స్టేషన్లో గొతి సుందర్ సింగ్, గిట్టే మారుతి, కడమ్ సుదర్శన్, కడమ్ సాయికృష్ణ సిద్ధాంత్, గుడిహత్నూర్ పోలీస్స్టేషన్లో మన్నూరు గ్రామానికి చెందిన దహాలే పవన్పై కేసులు నమోదైనట్లు వివరించారు. -
సామేలలో మరొకరు..
వాంకిడి: ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందారు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సామేల గ్రామానికి చెందిన సెండె శివతేజ (17) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం కనర్గాం గ్రామ శివారులో కోలె గణపతికి చెందిన వ్యవసాయ భూమిలోగల పత్తి కట్టెలు తొలగించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వెనుక ఉన్న కాలువను గమనించక ట్రాక్టర్ను రివర్స్ తీశాడు. దీంతో ట్రాక్టర్ కాలువలో బోల్తా పడగా దాని కింద ఇరుక్కుని మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గుడిపేటలో ఆక్వా పార్కు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలోని గుడిపేట శివారులో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు ఏర్పాటు కానుంది. ఈ మేరకు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుని ఆమోదం తెలిపింది. త్వరలో టెండర్లు పిలిచి.. ఖరారైతే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. 100 నుంచి 150 ఎకరాల్లో దాదాపు రూ.80కోట్లకుపైగా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్రం కూడా 60శాతం నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆక్వా పార్కు నిర్మాణంతో రెండు రకాలుగా అభివృద్ధి జరగనుంది. పర్యాటకులకు వినోదం పంచేందుకు అత్యాధునిక వాటర్పార్కులతోపాటు మత్స్య సంపద అభివృద్ధి చేసే మౌలిక సదుపాయాల కేంద్రంగా నిలువనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై) కింద దేశవ్యాప్తంగా మత్స్యరంగ అభివృద్ధికి ఆక్వా పార్కుల ఏర్పాటులో భాగంగా రాష్ట్ర ప్రతిపాదనల మేరకే గుడిపేటలో ముర్రెల్ చేప ఉత్పత్తి, సంరక్షణ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పుడు రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో జిల్లా టూరిజం ప్రాంతంగానే కాకుండా జల మత్స్య సంపద, విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్కు వేదిక కానుంది. ఉపాధి అవకాశాలూ మెరుగుపడనున్నాయి. ఆక్వా పార్కులో వివిధ రకాల చేపల ప్రదర్శనకు ఆక్వా మ్యూజియం, వాటర్ గేమ్స్, ఆక్వా రైతులకు ఆధునిక పద్ధతుల అవగాహనకు శిక్షణ కేంద్రం, సందర్శకులకు షాపింగ్, హోటళ్లు, కెఫెటేరియాలు, మత్స్య సేవా కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీలు ఉంటాయి. రూ.2.5 కోట్లతో ముర్రెల్ క్లస్టర్..ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద రూ.2.5కోట్లతో ముర్రెల్ క్లస్టర్ ఏర్పాటు కానుంది. ముర్రెల్ చేప అంటే రాష్ట్ర చేప కాగా, దీనినే బొమ్మె చేపగానే కాకుండా కొరమీను, కొర్రమట్ట, మట్టగిడసగా పిలుస్తుంటారు. కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ముర్రెల్ చేపల పెంపకాన్ని చేపట్టబోతోంది. 30 ఎకరాల్లో ముర్రెల్ క్లస్టర్లో ముర్రెల్ చేపల ఉత్పత్తి, మార్కెటింగ్ జరుగుతుంది. ముర్రెల్ క్లస్టర్తో మత్స్యకారులు, మహిళా స్వయం సహాయ సంఘాలకు లబ్ధి చేకూరనుంది. మొత్తంగా ఓ వైపు ముర్రెల్ క్లస్టర్ మరోవైపు ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు ఏర్పాటుతో మంచిర్యాల జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రానుంది. -
ప్రశాంతంగా డీసీసీబీ సీఈవో ఇంటర్వ్యూలు
కై లాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పోస్టు భర్తీకి సంబంధించి ఇంటర్వ్యూ ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పోస్టు భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేయగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్, బ్యాంక్ ప్రత్యేకాధికారి రాజర్షి షా ఆధ్వర్యంలో టెస్కాబ్, నాబార్డు అధికారులు డీసీసీబీ బ్యాంక్లో ఇంటర్వ్యూ నిర్వహించగా ఐదుగురే హాజరయ్యారు. బ్యాంక్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అభ్యర్థుల నైపుణ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని రైతాంగానికి, సహకార సంఘాలకు వెన్నెముకగా నిలిచే డీసీసీబీ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో సీ ఈవో పాత్ర కీలకమని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో విశేష అనుభవం, పరిపాలనా దక్షత కలిగిన అధికారుల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపా రు. పారదర్శకంగా అర్హుడిని ఎంపిక చేసి త్వరలోనే నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర సహకార బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ వైకే రావు, నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ జాంబ్రే, చీఫ్ జనరల్ మేనేజర్ పి.మోహనయ్య తదితరులు పాల్గొన్నారు. భూ ఆక్రమణకు యత్నించిన కొడుకుపై తల్లి ఫిర్యాదునెన్నెల: మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన పెళ్లి శ్రావణ్పై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శ్రావణ్ తల్లి శారద పేరిట గ్రామ శివారులో ఎనిమిదెకరాల భూమి ఉంది. ఆమెకు నలుగురు కుమారులున్నారు. ఆ భూమిని పెద్ద కొడుకు శ్రావణ్ ఒక్కడే ఆక్రమించుకునేందుకు యత్నించగా తల్లి అడ్డుకుంది. దీంతో ఆమెను బెదిరించి చేనులోని పత్తి కట్టెను తొలగించి దున్నాడు. అతడి తల్లి శారద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గొడవ కేసులో ఇరువురి అరెస్ట్ మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీస్స్టేషన్ పరిధి గుడిపేటలో ఇటీవల జరిగి న ఓ తగాదా కేసులో ఇరువురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపేట ప్రభుత్వ వైద్యకళాశాలలో చదువుతున్న విద్యార్థులతో అదే ప్రాంతానికి చెందిన సుంకరి శ్రీకాంత్, దేవి అఖిల్ గొడవకు దిగారు. విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషిస్తూ చేతులతో కొట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నాణ్యమైన విత్తనమే లక్ష్యం
మంచిర్యాలఅగ్రికల్చర్: రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యమని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి అన్నారు. శుక్రవారం మంచిర్యాల కలెక్టరేట్లో మంచిర్యాల, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల వ్యవసాయ అధికారులు సురేఖ, విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఎఫ్పీఓల ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వేష్రెడ్డి మాట్లాడుతూ కల్తీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని నాణ్యమైన విత్తనాల వినియోగం వైపు మళ్లించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరికి ప్రత్యామ్నాయంగా పెసర, కంది, మినుము, శనగ, వేరుశనగ, నువ్వులు వంటి పంటలు సాగు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాల్లో విత్తనాల కొరత లేదని, సన్న, దొడ్డు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రెండు జిల్లాల్లో సుమారు రెండు లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని, ఇందుకు 50 వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని, కనీసం 20 వేల క్వింటాళ్లను విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరాకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు వినియోగించేలా, పంట మార్పిడి చేపట్టేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ(టెక్నికల్), సహకార అధికారులు, ఏడీఏలు, ఎంఏఓలు, ఎఫ్పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడి మృతి
కాసిపేట: మండలంలోని దేవాపూర్ మద్దిమాడ శివారులో ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. కాగా, తోటి సిబ్బంది భయంతో హత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని మరోచోట వేయడం వివాదాస్పదంగా మారింది. దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిమాడకు చెందిన కొడప కృష్ణ (28) గురువారం రాత్రి 9గంటల సమయంలో మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ట్రాక్టర్లో ఇసుక తీసుకువచ్చేందుకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు గ్రామస్తులు దిశ మోడల్ స్కూల్ పక్కన కృష్ణ మృతదేహం ఉన్నట్లు తెలుపగా భార్య స్వప్న, స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు. కృష్ణ తల, కాలు, నడుముకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు గుర్తించారు. రాత్రి ట్రాక్టర్లో ఇసుక నింపుకొని మద్దిమాడ వైపు వస్తుండగా 11గంటల సమయంలో డ్రైవర్ పోశం ట్రాక్టర్ను అజాగ్రత్తగా, అతివేగంగా నడపడంతో బోల్తా పడింది. దీంతో కృష్ణ తల, నడుముకు గాయాలు కావడంతో అక్కడే మృతి చెందాడు. భయపడ్డ డ్రైవర్ పోశం అతడి వెంట ఉన్న గంట రాజయ్య, చంద్రయ్య, అజయ్తో కలిసి సాక్ష్యాలను తారుమారు చేయాలని భావించాడు. దీంతో పోశం కృష్ణ మృతదేహాన్ని ట్రాక్టర్లో తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం బైక్పై మృతదేహాన్ని తీసుకుని వెళ్లి దిశ మోడల్స్కూల్ పక్కన పడేశాడు. ఈ విషయమై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జన్నా‘రాం.. రాం..!’
జన్నారం: కవ్వాల్ టైగర్ జోన్ కోర్ ఏరియా పరిధిలో విధి నిర్వహణకు అటవీశాఖ అధికారులు జంకుతున్నారు. టైగర్జోన్ నిబంధనల అమలులో ఉన్నతాధికారులు, స్థానిక ప్రజలతో సతమతం అవుతున్నారు. నిబంధనలు అమలు చేస్తున్న సిబ్బందికి స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండడంతో మనశ్శాంతి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టైగర్జోన్లోని జన్నారం అటవీ డివిజన్కు రావడానికి సిబ్బంది ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. పక్కనే ఉన్న మంచిర్యాల, చెన్నూర్ వంటి బఫర్ ఏరియా ప్రాంతాల్లో పని ఒత్తిడి తక్కువగా ఉండడంతో.. సస్పెండైన సిబ్బంది తిరిగి అటు వైపు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో జన్నారం అటవీ డివిజన్లో బీట్, సెక్షన్ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొనసాగుతున్న సస్పెన్షన్లు.. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంతోపాటు ఉన్నతాధికారుల ఆదేశాల అమలులో జాప్యంపై గత ఆరు నెలలుగా పదుల సంఖ్యలో సస్పెన్షన్కు గురయ్యారు. ఇప్పటికే సిబ్బంది కొరత ఉన్న జన్నారం అటవీ డివిజన్లో సస్పెన్షన్ల కారణంగా మరింత కొరత ఏర్పడింది. సస్పెండైన వారిని మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్ డివిజన్లకు పంపించడంతో జన్నారం డివిజన్లో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. ఉన్నత అధికారుల ఆదేశాలను పాటించడం, టైగర్ జోన్ నిబంధనలు అమలు చేయడం, స్థానిక ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకత సిబ్బందికి కత్తిమీద సాములా మారింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా జన్నారం అటవీ డివిజన్లో సిబ్బంది కొరత కొంతమేర ఉంది. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. సాధ్యమైనంత వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విధుల నిర్వహణ జరుగుతోంది. ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం ఇక్కడ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. – రామ్మోహన్, ఎఫ్డీవో -
ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా కలెక్టరేట్లోని డీపీఓ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ రాజ్ దినోత్సవం ఘనంగా నిర్వహ/ంచారు. కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. డీపీఓ వెంకటేశ్వర్రావుతోపాటు బెల్లంపల్లి డీఎల్పీఓ సతీశ్, మంచిర్యాల డీఎల్పీఓ ధర్మారాణి, ఎంపీఓలు శ్రీపతి బాపు, సఫ్దర్అలీ, ఉమర్షరీఫ్, సుమన్, శ్రీనివాస్, రమ్య, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రావణ్కుమార్, కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది ప్రజ్ఞ, రాంకుమార్ పాల్గొన్నారు. -
ఆర్టీసీలో సమాఖ్యల అద్దెబస్లు
పాతమంచిర్యాల: స్వయం సహాయక సంఘాల బలోపేతానికి, సభ్యులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందిస్తూ ఆర్థికంగా చేయూతనందిస్తోంది. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసిన ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు బస్సులను మంజూరు చేసింది. వాటిని అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి అప్పగించి ప్రతీనెల వచ్చిన ఆదాయాన్ని మండల సమాఖ్యల ఖాతాల్లో జమ చేయనుంది. జిల్లాలో 11 మండల సమాఖ్యలకు అద్దె బస్లు మంజూరుకాగా వాటిని పెద్దపల్లి జిల్లా మంఽఽథని డిపోకు 09, మంచిర్యాల, సిరిసిల్ల డిపోలకు ఒక్కో బస్సు చొప్పున కేటాయించారు. బస్సుల రిజిస్ట్రేషన్లు, హైపోతికేషన్ పూర్తి చేస్తున్నారు. మండల సమాఖ్యలకు ప్రభుత్వం విడుదల చేసే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్తో బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగిస్తున్నామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు తెలిపారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.36 లక్షలు, నెలవారీ అద్దె రూ.69,468. ఆర్టీసీ, పేదరిక నిర్మూలన సంస్థల మధ్య అవగాహన ఒప్పందం ప్రకారం ఒక్కో బస్సుకు రూ.36 లక్షల చొప్పున 16 బస్సులకు రూ.5 కోట్ల 70 లక్షలు ఆర్టిసీకి చెల్లించారు. ఒక్కో బస్సుకు 7 సంవత్సరాల్లో 84 వాయిదాలలో మండల సమాఖ్యలకు ఆర్టీసీ అద్దె చెల్లించనుంది. 84 వాయిదాలు పూర్తయిన తర్వాత హైపోతికేషన్ రద్దు అవుతుందని అధికారులు తెలిపారు. కాగా జిల్లాలోని జన్నారం, కన్నెపల్లి, కాసిపేట, బెల్లంపల్లి, హజీపూర్, దండేపల్లి, మందమర్రి, కోటపల్లి, చెన్నూర్ భీమారం, జైపూర్ మండలాల మండల సమాఖ్యలకు బస్లు మంజూరయ్యయి, త్వరలోనే ఆయా డిపోలకు కేటాయించిన బస్లను డిపోల పరిధిలోని రూట్లలో నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా జిల్లాలో 16 మండలాలు ఉండగా 16 మండల సమాఖ్యలకు బస్లు ఇవ్వాలని నిర్ణియించింది. కానీ మొదటి విడతగా 11 బస్లు మంజూరు చేసింది. మరో ఐదు మండలాలు లక్సెట్టిపేట, భీమిని, నెన్నెల, తాండూరు, వేమనపల్లి మండల సమాఖ్యలకు కూడా బస్సులు మంజూరవుతాయని అధికారులు తెలిపారు. ప్రక్రియ పూర్తి.. జిల్లాలో 16 మండల సమాఖ్యలకు సెర్ప్ ద్వారా బస్సుల మంజూరు ప్రక్రియ పూర్తయింది. బస్ల హైపోతికేషన్, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఆయా డిపోలకు కేటాయించడం జరుగుతుంది. ప్రస్తుతం డిపోలకు బస్లు రాలేదు. డిపోలకు బస్సులు వచ్చిన తర్వాత నిర్ణీత రూట్లలో తిరుగుతాయి. – ఎస్.కిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
పొన్నారి విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకోవాలి
తాంసి: ఐదోతరగతి చదువుతూనే గేయాలు రచించిన పొన్నారి ప్రాథమిక పాఠశాల విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం పొన్నారి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రచించిన మోదుగ మొగ్గలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయురాలు సరిత సహకారంతో విద్యార్థులు స్థానిక పండుగలు, తదితర వాటిపై గేయాలను రచించడం అభినందనీయమన్నారు. పాఠశాల హెచ్ఎం సుజాత, డీఆర్డీవో రవీందర్, ఎంపీడీవో మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, సర్పంచ్ పొచ్చన్న, రచయిత ఉదారి నారాయణ పాల్గొన్నారు. -
జాతర చూసొద్దాం..!
లక్సెట్టిపేట: తెలంగాణ రాష్ట్రంలో మెదక్ తర్వాత రెండో పెద్ద చర్చిగా లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చికి గుర్తింపు ఉంది. జిల్లాలోని చారిత్రక కట్టాడాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న ఏసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవ ప్రాంతీయ జాతరకు చర్చిని ముస్తాబు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆంగ్లేయుల కాలంలో నిర్మాణం.. 1920లో ఇంగ్లాండ్కు చెందిన రెవసీజీ అర్లి దొర లక్సెట్టిపేటకు వచ్చాడు. ఏసుక్రీస్తు ఆరాధకుడు కావడంతో ఇక్కడ చర్చి నిర్మించాలనుకున్నాడు. ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు, గూడెం గుట్ట, గువ్వల గుట్ట, చిన్నయ్య గుట్టల నుంచి రాళ్ళు తెప్పించాడు. మహారాష్ట్ర నుంచి శిల్పకళాకారులను రప్పించాడు. లక్సెట్టిపేటకు సమీపంలో టేకు చెట్ల వనంలో మిషన్ కాంపౌండ్ ప్రాంతంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చి నిర్మాణ పనులు ప్రారంభించాడు. వేసవిలో వడదెబ్బకు గురికావడంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1935లో రివహెచ్బర్డ్ లక్సెట్టిపేటకు వచ్చి చర్చి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఇక్కడికి మిషనరీగా వచ్చిన రెవ ఫాస్పూట్ సీఎస్ఐ చర్చిగా నామకరణం చేసి ప్రారంభించారు. 86 వసంతాలు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఘనంగా ఏర్పాట్లు జాతర ఏర్పాట్లను చర్చి కమిటీ సభ్యుడు ఫాదర్ డేవిడ్పాల్ చూసుకుంటున్నారు. 25న ఉదయం గ్రామాల్లో పర్యటించి అందర్నీ ఆహ్వానిస్తారు. సాయంత్రం ఊత్కూరు చౌరస్తా నుంచి భాజా భజంత్రీలతో పెద్ద ఎత్తున క్రైస్తువులు ర్యాలీగా చర్చి వద్దకు వస్తారు. 7 గంటలకు సిలువ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసి కీర్తనలు ఆలపిస్తారు. 26న ఉదయం నుంచి చర్చిలో కీర్తనలు ఆలపిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం సిలువ గుట్టపైకి వెళ్లి కొవ్వొత్తులు వెలిగిస్తారు. -
వనంలో వరాహాల గుంపు
దండేపల్లి మండలంలోని తాళ్లపేట అటవీ రేంజీ పరిధిలో గల తానిమడుగు బీట్లో అడవి జంతువుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ సోలార్ బోర్వెల్ ఏర్పాటు చేసింది. బుధవారం రాత్రి నీటి కుంట వద్ద అరుదైన చిత్రం సీసీకెమెరాకు చిక్కింది. అడవి పందులు వరుసక్రమంలో సోలార్ బోర్వెల్ వద్ద ఉన్న నీటికుంట వద్దకు వచ్చి దాహార్తి తీర్చుకున్నాయి. ఒకదానికి ఒకటి ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణగా వచ్చి నీళ్లు తాగుతున్న వాటి సహజ ప్రవర్తన చిత్రంలో ప్రతిబింబిస్తోందని అధికారులు పేర్కొన్నారు. – దండేపల్లి -
ఎస్టీపీపీలో సీఐఎస్ఎఫ్ డీఐజీ పర్యటన
జైపూర్: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటును గురువారం సీఐఎస్ఎఫ్ డీఐజీ జీ.రాఘవేంద్రకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్టీపీపీ జీఎం, వోఅండ్ఎం చీఫ్ మదన్మోహన్ ఆయనకు పూలమొక్క అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం డీఐజీ సీఐఎస్ఎఫ్ యూనిట్ను పరిశీలించా రు. ప్లాంటులో భద్రతపరంగా తీసుకుంటున్న చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. ప్లాంటు ను మరింత సురక్షితంగా ఉంచడానికి, తగిన భద్రతపరమైన చర్యలు తీసుకోవడానికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ సీఐఎస్ఎఫ్ కమాండెంట్ చంఛల్ సర్కార్, డీజీఎం పర్సనల్ కిరణ్బాబు, ఎస్వోటు జీఎం శంకర్, అసిస్టెంట్ కమాండెంట్లు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. -
సరదా.. కారాదు విషాదం
బజార్హత్నూర్: పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చయంటే చాలు వారి ఆనందానికి అవధులు ఉండవు. ఈనెల 24 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పిల్లలు వేసవి సెలవుల్లో తోటి విద్యార్థులతో, మిత్రులతో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్తుంటారు. సరదాకోసం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతుంటారు. పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిస్తే చదువు, ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. పిల్లలు ఇంటి ఆవరణలో, నీడ ప్రదేశంలో ఆడుకునేలా, చదువుకునేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. బావులు, చెరువులకు దూరం చిన్నారుల ఈత సరదా వారి ప్రాణాలను బలిగొనే అవకాశం ఉంది. వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి సరదాగా చెరువులు, నీటి కుంటలు, బావుల్లో ఈతకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఈతకు వెళ్తే జరిగే ప్రమాదాల గురించి తల్లిదండ్రులు పిల్లల కు వివరించి చెప్పాలి. గతంలో సిరికొండ మండలంలోని ముత్యంపేటకు చెందిన ఇద్దరు చిన్నారులు ఫారంఫాండ్ గుంతలో జారిపడి మృతి చెందా రు. బోథ్ మండలంలోని సాకెరా వద్ద ఇద్దరు చిన్నారులు నీటి గుంతలో పడి మృతి చెందారు. ఇలాంటి సంఘటనలు పిల్లలకు గుర్తు చేయాలి. పిల్లలు ఇంటినుంచి బయటకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులు వారి కదలికలను గమనిస్తూ ఉండాలి. ఎండలో ఆడితే ప్రాణాలకే ముప్పు వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కువగా సామూహిక క్రికెట్, డిల్లిదండా, గోలిలాట, కొమ్మకొచ్చి ఆటలతో పాటు పొలాల వెంట తిరుగుతూ పండ్ల సేకరణ చేస్తుంటారు. ఎండ వేడిమికి డీహైడ్రేషన్ అయి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. చెస్, క్యారంబోర్డు వంటి ఆటలు పిల్లల మేదస్సును పెంపొందిస్తాయి. సైకిళ్ళంటే మోజు సైకిళ్ళంటే పిల్లలకు మోజు ఎక్కువ. వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి సైకిళ్లపై పండ్ల తోటలు, చె రువు గట్లకు, మైదానాలకు వెళ్తుంటారు. దీంతో రో డ్లపై వెళ్లేటప్పడుప్రమాదాలబారిన పడుతుంటారు. దృశ్య, శ్రవణ పరికరాలకు దూరంగా ఉంచాలి విద్యార్థులు ఇంటివద్ద ఎక్కువగా టీవీలు, కంప్యూటర్లు, వీడియోగేమ్లు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోతారు. దీంతో దృష్టి లోపం తలెత్తే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు వాటిని ఎక్కువ చూడనీయకుండా జాగ్రత్త పడాలి. -
విద్యుత్ షాక్తో అసిస్టెంట్ లైన్మెన్ మృతి
ఆదిలాబాద్రూరల్: విద్యుత్ షాక్తో అసిస్టెంట్ లైన్మెన్ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు తాంసికి చెందిన అనిల్ పాటిల్ (35)భీంపూర్ మండలంలో అసిస్టెంట్ లైన్మెన్గా చేస్తున్నాడు. బుధవారం భీంపూర్, భోరజ్ మండలాలకు సరఫరా అయ్యే 33 కేవీ విద్యుత్ తీగలు తెగిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ శాఖ ఉద్యోగులు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. గురువారం మరమ్మతులు చేసేందుకు సంబంధిత అధికారులతో కలిసి అక్కడికి వెళ్లారు. అనిల్ పాటిల్ స్తంభంపైకి ఎక్కాడు. అయితే అక్కడ మూడు ప్రాంతాలకు సంబంధించిన 33 కేవీ ఫీడర్లు ఒకే చోట ఉన్నాయి. విద్యుత్ సరఫరా ఉన్న విషయాన్ని మృతుడు గమనించకపోవడంతో షాక్కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా మరో ఉద్యోగి చంద్రశేఖర్కు సైతం గాయాలయ్యాయి. -
జాతర్లలో కూలీ..
బజార్హత్నూర్: విద్యుత్ షాక్తో కూలీ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్శాఖ సబ్ ఇంజినీర్ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు నార్నూర్ మండలంలోని గుంజాలకు చెందిన కాంట్రాక్ట్ కూలీ సోయం గంగాధర్ (26) ఈ నెల 21న బజార్హత్నూర్ మండలంలోని జాతర్ల ఫీడర్ విద్యుత్ లైన్ మరమ్మతు పనుల్లో పాల్గొన్నాడు. అందులో భాగంగా జాతర్ల ఫీడర్ లైన్ ఎల్సీ తీసుకున్నాడు. కానీ అతను జాతర్ల ఫీడర్ 11 కేవీ విద్యుత్ స్తంభం ఎక్కాల్సి ఉండగా పొరపాటున మిషన్ భగీరథ 11 కేవీ విద్యుత్ స్తంభం ఎక్కాడు. విద్యుత్ వైర్లు తగలడంతో షాక్కు గురై కిందపడ్డాడు. వెంటనే ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వడదెబ్బతో వ్యక్తి.. భైంసాటౌన్: పట్టణంలోని ఏఎంసీ యార్డులో దడువా యిగా పనిచేస్తున్న పాపేశ్వర్ (50) గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. సోన్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన పాపేశ్వర్ దడువాయిగా పనిచేస్తూ, ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో రెండురోజుల క్రితం రోజంతా ఎండలో పనిచేస్తూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బుధవారం తోటి దడువాయిలు ముందుగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు ..నేరడిగొండ: బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో తండ్రి మృతి చెందగా, కుమార్తె గాయాలతో బతికి బయటపడింది. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరేపల్లి గ్రామానికి చెందిన గోడం జ్యోతిరామ్ (48) కుమార్తె సారులత బుగ్గారం(బి) గ్రామంలోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు జ్యోతిరామ్ బైక్పై బుగ్గారం వెళ్లాడు. తిరుగుప్రయాణంలో రోల్మామడ వద్ద గల వంతెనను దాటుతున్న క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్ను బలంగా ఢీకొట్టింది. జ్యోతిరామ్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. సారులత స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పథకం ప్రకారమే హత్యాయత్నంమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని పథకం ప్రకారమే హత్య చేసేందుకు ఓ వర్గం మరో వర్గంపై దాడికి పాల్పడిన ఘటన గురువారం సంచలనం సృష్టించింది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల మేరకు సీసీసీ రాంనగర్కు చెందిన పనాస రాజేందర్, అన్వేష్, గొర్రె ప్రసాద్ మండి బిర్యాని తినేందుకు బుధవారం రాత్రి సుమారు 10 గంటలకు మంచిర్యాలకు వచ్చారు. అక్కడ వారి పాత స్నేహితులు దీపక్, బిట్టు, శ్యామ్ కలవడంతో అందరూ కలిసి బార్కు వెళ్లి మద్యం సేవించారు. పాత కక్షలను దృష్టిలో ఉంచుకున్న దీపక్ తన స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. బయటకు వెళ్లిన తర్వాత రాజేందర్, ప్రసాద్, అన్వేష్పై ప్రథకం ప్రకారం కర్రలు, బీరు సీసాలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. రాజేందర్, అన్వేష్కు తీవ్ర గాయాలుకాగా ప్రసాద్ స్వల్ప గాయాలతో తప్పించుకుని పారిపోయాడు. విషయం తెలుసుకున్న పో లీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుల ను ఆస్పత్రికి తరలించారు. రాజేందర్ తండ్రి చిన్న య్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్యామ్, దీపక్, బిట్టు, నితిన్, రంజిత్, భరత్, మరి కొందరిపై కేసు నమె దు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఒకరిపై హత్యాయత్నంనర్సాపూర్ (జి): మండలంలోని టెంబరేణిలో ఒకరిపై హత్యాయత్నం కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. టెంబరేణికి చెందిన ధనుసుల మధును అదే గ్రామానికి చెందిన దాసరి శంకర్ బుధవారం సాయంత్రం మందలించాడు. దాన్ని మనసులో పెట్టుకున్న మధు రాత్రి దాసరి శంకర్ ఇంటికి వెళ్లి గొడ్డలితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. బాధితుడి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసిన పోలీసులు హత్యాయత్నానికి ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ఎక్కడికుప్పలు అక్కడే.. వానొస్తే తిప్పలే!
దండేపల్లి: మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటి వరకు 34 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఎక్కడ కూడా కాంటా వేయడం లేదు. మిల్లుల ట్యాగింగ్ ఇవ్వకపోవడంతో, కాంటాలు వేయడంలేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. దీంతో కొందరు రైతులు కొనుగోలు కేంద్రాల సమీపంలో, రోడ్ల పక్కన ధాన్యాన్ని ఆరబోయగా, మరికొందరు కుప్పలుగా పోసి ఉంచారు. ఉన్నట్టుండి గురువారం అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. రైతులు గుబులు చెంది ఆరబోసిన ధాన్యాన్ని కుప్పచేసి కవర్లు కప్పారు. అధికారులు స్పందించి వెంటనే మిల్లుల ట్యాగింగ్ ఇచ్చి కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ప్రారంభించి, తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఐకేపీ ఏపీఎం లక్ష్మీని సంప్రదించగా, మండలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ, మిల్లుల ట్యాగింగ్ ఇవ్వలేదు. దీంతో ఎక్కడ కూడా కాంటా వేయడం లేదు. ట్యాగింగ్ వచ్చిన వెంటనే కాంటాలు ప్రారంభించి, ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తామని చెప్పారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
జైపూర్: మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఒకరిని కొట్టి చంపిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం అసిస్టెంట్ కమిషనరేట్ కార్యాలయంలో సీఐ నవీన్కుమార్, ఎస్సైలు రాజశేఖర్, రాజేందర్తో కలిసి వివరాలు వెల్లడించారు. జైపూర్ మండలం బెజ్జాలకు చెందిన గుమ్ముల రాజం (56) తమ కుటుంబానికి మంత్రాలు చేయడం మూలంగా ఆస్పత్రుల పాలవుతున్నామని గ్రామానికి చెందిన గుమ్ము ల వెంకటి అతనిపై కక్ష పెంచుకున్నాడు. పథ కం ప్రకారం ఈ నెల 21న గుమ్ముల తిరుపతి, వెంకటి, నర్సమ్మ, రాజబాపుతో కలిసి కొట్టిచంపారు. ఎవరికీ అనుమానం రావద్దని మృతదేహాన్ని పార్వతిబ్యారేజి కాల్వలో పడేశారు. గురువారం సీఐ నవీన్కుమార్ ఆధ్వర్యంలో షెట్పల్లి సమీపంలో నిందితుల ను పట్టుకున్నారు. హత్యకు ఉపయోగించిన రాయి, కర్ర, బైక్ స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
వెంచర్లో వివాదం...
● గోడ కూల్చివేసిన బాధితులు లక్సెట్టిపేట: మండలంలోని సూరారంలో ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసిన వెంచర్లో వివాదం నెలకొంది. బాధితులు గోడ కూల్చడంతో సమస్య తీవ్రమైంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు ఓ ప్రైవేటు వెంచర్ నిర్వాహకులు 2023లో మూడెకరాల్లో వెంచర్ ఏర్పాటు చేశారు. మొత్తం 53 ప్లాట్లు చేసి అమ్మకాలు జరిపారు. వ్యాపారుల్లో ఒక భాగస్వామి వెంచర్లో రహదారులకోసం తీసిన సుమారు ఎకరం భూమిని ఒకరికి విక్రయించాడు. సద రు కొనుగోలు దారుడు అట్టి ప్రదేశం చుట్టూ గోడ నిర్మాణం చేసుకున్నాడు. దీంతో అప్పటి వరకు కొనుగోలు చేసిన 30 మంది బాధితులు గురువారం గోడలు కూల్చివేశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ విజయ్కుమార్ను వివరణ కోరగా మాకు ఎలాంటి సమాచారం రాలేద ని, దీనిపై పూర్తి విచారణ చేపడుతామన్నారు. మందమర్రి వాసులకు డాక్టరేట్మందమర్రిరూరల్: మందమర్రి మండలం సారంగపల్లి గ్రామానికి చెందిన రామగిరి శేఖర్, మందమర్రిలోని దొరలబంగ్లా ప్రాంతా నికి చెందిన బాసాని మంజుల డాక్టరేట్ సాధించారు. సారంగపల్లికి చెందిన రామగిరి లింగ య్య, రత్న దంపతుల కుమారుడు శేఖర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరే ట్ పొందాడు. సింగరేణిలో కోల్కట్టర్గా విధులు నిర్వహిస్తున్న రాజలింగు కుమార్తె బాసాని మంజుల ఓయూ విశ్వ విద్యాలయంలో ‘నేటి విద్యావ్యవస్థ, విద్యార్థులలో విలువలను పెంపొందించడంలో దాని పాత్ర’ అంశంపై పరిశోధనలు నిర్వహించి డాక్టరేట్ అందుకున్నారు. ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సుమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ స మీపంలో గురువారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఘటనలో మందమర్రి మండలం బొక్కలగుట్టకు చెందిన చిప్పరి శ్రీనివాస్కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై స్థానిక పోలీసులను వివరణ కోరగా ప్రమాదం జరిగింది వాస్తవమేనని, బాధితుల నుంచి ఇంకా ఫిర్యాదు రాలేదన్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం అనుభవంలేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. -
తాగునీటి సమస్య లేకుండా చర్యలు
చెన్నూర్/చెన్నూర్రూరల్: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. మండలంలోని సుందరసాల గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. గ్రామాన్ని పీఎంఏజేఏవై పథకంలో ఎంపిక చేసి చేపట్టబోయే పనులపై తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు చేపట్టాలని, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి బాలింతలు, చిన్నారులు, తల్లులకు ఇచ్చే పోషక ఆహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వర్రావు, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజ్మత్అలి, సర్పంచ్ గుండ మంజుల, పంచాయతీ కార్యదర్శి వంశీధర్ పాల్గొన్నారు. కాగా, చెన్నూర్ జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన లేఅవుట్ స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ మురళికృష్ణ, పట్టణ ప్రణాళికాధికారి సంపత్తో కలిసి సందర్శించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూమి అభివృద్ధి చేయాలని సూచించారు. -
ఆర్టీసీ కార్మికుల హామీలు నెరవేర్చాలి
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాలలో ఆర్టీసీ జేఏసీ పిలుపులో భాగంగా చేపట్టిన సమ్మెకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కస్తూ రి నాగరాజ్, నాయకులు అమిరిశెట్టి రాజ్కుమార్, కర్రె లచ్చన్న అశోక్, పవన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
బొగ్గు రవాణా పెంచాలి
● డైరెక్టర్(పీపీ) కే.వెంకటేశ్వర్లు శ్రీరాంపూర్/జైపూర్: రాబోయే మూడు నెలలు కంపెనీ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి పెరుగనుందని, అందుకు అనుగుణంగా రవాణా పెంచాలని సింగరేణి డైరెక్టర్(పీపీ) కే.వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఆయన శ్రీరాంపూర్ సీహెచ్పీ, జైపూర్ మండలం ఇందారం ఐకే–ఓసీపీని సందర్శించారు. ఐకే–ఓసీపీలో క్వారీ, పని ప్రాంతాలు పరిశీలించారు. ఓబీ తొ లగింపు, బొగ్గు ఉత్పత్తి, యంత్రాల పనితీరు ఇతర అంశాలపై స్వయంగా పరిశీలించారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి పెంపుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతీరోజు 1200టన్నుల బొగ్గు ఉత్పత్తి, 5వేల టన్నుల ఓబీ తొలగించాలని ఆదేశించారు. శ్రీరాంపూర్ సీహెచ్పీలో ఏరియా ఇన్చార్జి జీఎం కే.రాజేందర్తో కలిసి బొగ్గు రవాణాపై సమీక్షించారు. బొగ్గు రవాణా కోసం రైల్వేశాఖ కేటాయించిన రేకులు పూర్తిగా నింపి పంపించాలని, నిర్ణీత సమయానికి నింపి పంపించకుంటే జరిమానా భరించాల్సి వస్తుందని తెలిపారు. వార్షిక బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత సాధనే లక్ష్యంగా అందరూ సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. మ్యాన్ పవర్, మెటీరియల్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్రం, ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి ఏవీ రెడ్డి, శ్రీరాంపూర్ సీహెచ్పీ ఇన్చార్జీ చంద్రలింగం, మేనేజర్ ఆపరేషన్స్ శంకర్, రామకృష్ణ, మహేశ్ పాల్గొన్నారు. -
వేసవి సెలవులు వచ్చేశాయ్
మంచిర్యాలఅర్బన్: పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ నెల 24 నుంచి సెలవుల ప్రకటనతో వసతిగృహ విద్యాలయాల్లోని విద్యార్థులు ఇంటిబాట పట్టారు. జిల్లాలోని 684 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, 18 కస్తూర్భా, 5 ఆదర్శ పాఠశాలలు, 95 గురుకులాల్లో 58,386 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 18న పరీక్షలు ముగియడంతో గురువారం ప్రోగ్రెస్ రిపోర్టు అందజేశారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి వేసవి సెలవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు తెలియజేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో చాలామంది ఆటోలు, ఇతర వాహనాల్లో విద్యార్థులను తీసుకెళ్లారు. -
నిషేధం..‘పత్తి’మాటే..!
● జిల్లాకు చేరిన నిషేధిత విత్తనాలు! ● ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో పట్టివేత ● చర్యలు తీసుకుంటున్నా మారని తీరుమంచిర్యాలఅగ్రికల్చర్/బెల్లంపల్లి: నిషేధిత పత్తి విత్తనం జిల్లాకు చేరుతోంది. ఇప్పటికే రహస్య ప్రాంతాల్లో అక్రమార్కులు క్వింటాళ్ల కొద్దీ నిల్వ చేసినట్లు తెలుస్తోంది. గతేడాది ఖరీఫ్ ఆరంభం జూన్లో ప్రభుత్వం పటిష్ట నిఘా ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుని అక్రమార్కులపై కేసులు నమోదు చేసింది. దీంతో ఈ ఏడాది అక్రమార్కులు ముందస్తుగానే సరఫరా చేస్తే తనిఖీలు ఉండవని భావించి దందాకు తెరతీసినట్లు తెలుస్తోంది. లూజు విత్తనాలను కిలోకు రూ.2,600 నుంచి రూ.3వేల చొప్పున రైతులకు అంటగడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో రైతులు వేసవి దుక్కులు దున్ని ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. ఏటా ప్రభుత్వం నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాల నివారణకు చర్యలు చేపడుతున్నా అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి. గ్రామాల్లో గైసిల్ విత్తనంగా పేరుగాంచిన గుర్తింపు లేని పత్తి విత్తన దందా జోరుగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి అక్రమార్కులు విత్తనాలు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నెల 16న తాండూర్ మండలం బోయపల్లి బోర్డు వద్ద పోలీసులు 150 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని నలుగురిపై కేసు నమోదు చేశారు. వీరిపై ఇప్పటికే విత్తనాలు సరఫరా చేసినందుకు పీడీ యాక్టు నమోదై ఉండడం గమనార్హం. గత మంగళవారం మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను వేమనపల్లి మండలం ప్రాణహిత నదీ తీరం వద్ద అదుపులోకి తీసుకున్నారు. 50కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది జిల్లాలో 14 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని 17 కేసులు నమోదు చేసి 54 మందిని అరెస్ట్ చేశారు. కలుపు మందు పిచికారీ చేసినా ఎలాంటి నష్టం ఉండదని, కలుపు నివారణకు ఇబ్బంది రాదని, బుగ్గ పెద్దగా వస్తుందని మాయమాటలు చెబుతూ రైతులకు నిషేధిత విత్తనాలు అంటగడుతున్నారు. ఇలా రైతులు ఏటా మోసపోతున్నా కొందరు బయటకు చెప్పుకుంటే కేసులు నమోదవుతాయని మిన్నకుండిపోతున్నారు. నిషేధిత విత్తనాలు సాగు చేస్తే కలుపు నియంత్రణకు ఉపయోగించే గ్లైపోసెట్ గడ్డి నివారణ మందు వాడకం కూడా పెరిగిపోతుంది. దీని ద్వారా పర్యావరణం, భూసారం దెబ్బతినడంతోపాటు రైతుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విత్తనాలను నిషేధించాయి. బీటీ–3 రైతుల చెంతకు చేరకుండా చూసేందుకు సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా సాగు ఆగుతుందా? అనేది అనుమానమే. గ్రామాల్లో బడా నేతలు విత్తనాలు సరఫరా చేసే ఏజెంట్లుగా అవతారం ఎత్తడమే కారణం. నిషేధిత విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ లాంటి కఠినమైన కేసులు నమోదు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి.. పెద్ద మొత్తంలో ఎవరు సరఫరా చేశారు.. అనే దానిపై ఆరా తీసి కఠినచర్యలు తీసుకుంటేనే గానీ దందా ఆగేలా లేదు. కఠినచర్యలు తప్పవునకిలీ విత్తనాలు అరికట్టడానికి టాస్క్ఫోర్స్ టీంలు ఏర్పాటు చేశాం. రైతుల వద్దకు చేరకుండా అడ్డుకట్ట వేస్తున్నాం. పోలీస్, వ్యవసాయశాఖల అధికారులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ గుర్తింపు లేని విత్తనాలు సాగు చేస్తే రైతులు నష్టపోతారు. భూసారం కూడా దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది. రైతులతో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నాం. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై కఠినచర్యలు తప్పవు. – సురేఖ, జిల్లా వ్యవసాయాధికారికొనేళ్లుగా జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది 1.60 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈసారి విస్తీర్ణం మరింత పెరిగే అవకాశముంది. గతంలో సాధారణ పత్తి విత్తనాలు సాగు చేసిన రైతులు దిగుబడి పెరిగేందుకు బీటీ రకం విత్తనాల వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారు. ఈ రకం విత్తనాలు సాగు చేస్తే దిగుబడి పెరగడంతోపాటు చీడపీడల వ్యాప్తి పెరిగింది. దీనిని తట్టుకునేందుకు బీటీ–2 రకం విత్తనం మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ విత్తనాలు సాగు చేయగా పంటను గులాబీ రంగు పురుగు ఆశించి రైతులకు కొంత మేర నష్టం చేసింది. దీంతో రైతులు ఎక్కువ దిగుబడి కోసం అధిక మోతాదులో ఎరువులు వినియోగిస్తుండడంతో పత్తి పంటలో కలుపు కూడా అధికంగా పెరుగుతోంది. కలుపు నివారణ సమస్యను అధిగమించేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పంట చేతికి వచ్చే వరకు మూడుసార్లు కలుపు నివారించాల్సి ఉంటుంది. కూలీల కొరతతోపాటు ఖర్చూ పెరిగిపోయింది. దీంతో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా బీటీ–3 రకం కలుపు మందు(గ్లైపొసెట్)ను తట్టుకునే సామర్థ్యం ఉన్న విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. రైతులు ఐదారేళ్లుగా ఈ విత్తనాలవైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో పత్తి సాగే అధికంఅవగాహన కల్పిస్తేనే మేలు -
పౌష్టికాహారంతోనే ఆరోగ్యం
మంచిర్యాలటౌన్/మంచిర్యాలరూరల్(హాజీ పూర్): చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని, పౌష్టికాహారంపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించేందుకే పోషణ్ పక్వాడ్ను ఈ నెల 9నుంచి 23వరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ఖాన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని చున్నంబట్టివాడ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ్ ముగింపు కార్యక్రమం, 48వ డివిజన్లోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులకు శ్రీమంతాలు చేసి, అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. అనంతరం పోషణ ప్రతిజ్ఞ, పౌష్టికాహారం ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో చందన, సూపర్వైజర్లు జ్యోతి, సరిత, పోషణ్ అభియాన్ రజిత, శ్యామల, కార్పొరేటర్ పెంట రజిత పాల్గొన్నారు. -
● ధరణి నుంచి ప్రస్తుత భూ భారతి దాక? ● ‘సాక్షి’ కథనంతో సేల్డీడ్ ఆప్షన్లో మోసం వెలుగులోకి ● నెన్నెల మండలంలో మొదలైన విచారణ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సిటిజన్ లాగిన్లో సేల్డీడ్లో ఉన్న ఆప్షన్ను తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు తెరలేపిన తీరుపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఖజానాకు గండి కొట్టారు’ కథనం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. చాలామంది అధికారులు ఈ తరహా మోసంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా మోసంపై రెవెన్యూ అధికారులతోపాటు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. ఇలాంటి మోసం ఇప్పటివరకు ఎక్కడా వెలుగులోకి రాకపోవడంతో జిల్లాలోని రెవెన్యూ అధికారులు అప్రమత్తం అయ్యారు. గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి సబ్డివిజన్లో సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్తో కలసి బెల్లంపల్లి, నెన్నెల, కన్నెపల్లి, తాండూరు మండలాల తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. భూ భారతి పోర్టల్లో దరఖాస్తులను పరిశీలించారు. నెన్నెల మండలంలో ఎప్పటి సేల్డీడ్ అగ్రిమెంట్ విత్ పొసిషన్, సేల్ డీడ్ అగ్రిమెంట్ విత్ అవుట్ పొసిషన్ ఆప్షన్లలో తేడా చూపిస్తూ.. సర్కారుకు స్టాంపు డ్యూటీ తగ్గించేలా చేసి, మిగతా మొత్తాన్ని తమ జేబుల్లో వేసుకున్న తీరుపై విచారణ మొదలైంది. ఈ ఏడాదిలో 31డాక్యుమెంట్లలో ఈ తరహాలో సేల్ విత్ పొసిషన్ ఆప్షన్ ఎంచుకున్నారు. వీటిని ఒక్కొక్కటిగా అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాల్సి ఉంది. అంతకుముందు సైతం ఈ ఆప్షన్తో లావాదేవీలు జరిగాయి. రిజిస్ట్రేషన్ సమయంలో పట్టాదారులు, కొనుగోలుదార్లకు ఈ ఆప్షన్పై అవగాహన లేకపోవడం, మరోవైపు ఎంత మొత్తంలో చలానా చెల్లించాము? ఎంత మొత్తానికి ఈ చలానా వచ్చింది? అంతేకాక రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక తహసీల్దార్ రివర్స్ ఎండార్స్మెంట్ పరిశీలన లేకపోవడం ప్రధాన లోపంగా మారింది. ఈ క్రమంలో జిల్లాలో ఇంకా ఎక్కడైనా ఇలాంటి మోసాలు జరిగాయా? అని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. అయితే ధరణి నుంచి ప్రస్తుత భూ భారతి వరకు ఇలాంటి రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది.వివరాలన్నీ పంపించాలినెన్నెల: భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ పకడ్బందీగా చేపట్టి వెంటనే లావాదేవీల వివరాలన్నీ పంపించాలని కలెక్టర్ కుమార్ దీపక్ తహసీల్దార్ శ్రీనివాస్ను ఆదేశించారు. గురువారం ఆయన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. భూభారతి పోర్టల్లో లావాదేవీలు పరిశీలించారు. 2021 నుంచి లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. స్లాట్ బుకింగ్ చేసిన వ్యక్తుల వద్ద అవకతవకలు జరిగినట్లు గమనించారు. స్టాంప్ డ్యూటీపై తహసీల్దార్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2021 నుంచి జరిగిన సేల్ డీడ్ లావాదేవీల వివరాలన్నీ తనకు పంపించాలని ఆదేశించారు. వివిధ రకాల భూ సమస్యలపై అర్జీదారులు అందించిన దరఖాస్తులను రికార్డులతో సరి చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పకడ్బందీగా పరిష్కరించాలని తెలిపారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భూ భారతి పరిష్కార ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపట్టాలని తెలిపారు.నెన్నెల మండలంలో గత కొంతకాలం ఓ వ్యక్తి సిటిజన్ లాగిన్తో భూ లావాదేవీల్లో ఆరితేరి గత కొంతకాలంగా రెవెన్యూ అధికారులను బురిడీ కొట్టించి రూ.లక్షలు అక్రమంగా సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలు వెలుగులోకి రావాలంటే రెవెన్యూ అధికారులు స్లాట్ బుకింగ్ కోసం సిటిజన్ లాగిన్లో ఎవరి నుంచి అప్లికేషన్ జనరేట్ అయింది? ఎందుకు రెండు సార్లు దరఖాస్తును మార్చుతున్నారు? రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షులు, కొనుగోలుదారులు మధ్యవర్తులకు చలానా కోసం ఎంత మొత్తం చెల్లించారు? అలాగే మొదట దరఖాస్తులో చూపించిన మొత్తం, చివరకు ఈ చలానా వివరాల్లో కనిపిస్తున్న మొత్తానికి ఎందుకు తేడా వస్తోందనే కోణాల్లో పరిశీలన చేస్తే అసలు బాగోతం బయటపడనుంది.అక్రమాలకు నెలవు -
‘కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర బయటపడింది’
మంచిర్యాలటౌన్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డిలు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుపై చేసిన కుట్ర, అసత్య ప్రచారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బయటపడ్డాయని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. గురువారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రూ.94 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని పొంతన లేని ఆరోపణలు చేశారని అన్నారు. మేడిగడ్డ వద్ద కొంత భాగం కుంగిపోతే మరమ్మతు చేసేందుకు అవకాశం ఉన్నా చేయలేదని, బీఆర్ఎస్ను బదానం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని అన్నారు. ఇప్పటికై నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రజాపాలన దిశగా ప్రభుత్వాన్ని నడిపేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, టీబీజీఎకేఎస్ నాయకుడు సురేందర్రెడ్డి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేశ్, పెట్టెం లక్ష్మణ్, ఎర్రం తిరుపతి నాయకులు పాల్గొన్నారు. -
పుస్తకం.. మన నేస్తం!
నిర్మల్ఖిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాహితీ రంగంలో తన ప్రత్యేక స్థానాన్ని మరోసారి చాటుకుంటోంది. గిరిజన సంస్కృతి, జానపద సంపద, సా మాజిక అంశాలను అక్షరాల్లో అల్లిన ఈ నేల ఎన్నో రచయితలను అందించి ‘సాహితీ సౌరభాల నిలయం’గా పేరు తెచ్చుకుంది. నేడు పుస్తకాన్ని మొబైల్ ఫోన్ కబళించి వేస్తుందన్న చేదు నిజం బాధిస్తున్నా ఇప్పటికీ పుస్తకాలపై మక్కువ చూపుతున్న వారెందరో ఉన్నారు. చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పుస్తకాలపై అభిరుచి పెంపొందించే ప్రయత్నం చేయాలని విద్యావేత్తలు, సాహితీనిపుణులు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. సాహితీ పురోగమనం.. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు రచయితలు తమ పుస్తకాల ద్వారా తెలుగు సాహిత్యంలో ముద్రవేశారు. జానపద గేయాలు, కవితా సంకలనాలు, కథా సంపుటాలు, చరిత్రాత్మక గ్రంథాలు వంటి విభిన్న ప్రక్రియల్లో రచనలు వెలువరించి పాఠకులను ఆకట్టుకుంటున్నారు. స్థానిక భాషా మాధుర్యాన్ని కాపాడుతూ, ఆధునిక భావజాలాన్ని కలగలిపి సృజనాత్మకతకు కొత్త దిశ చూపుతున్నారు. సాహిత్యానికి గుర్తింపు.. ఈ ప్రాంతం సంస్కృతికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. గోండు, కొలాం, లంబాడీ వంటి గిరిజన తెగల జీవన విధానాలు, వారి పండుగలు, సంప్రదాయాలు రచయితల కలంతో పుస్తకాల రూపంలో వెలుగులోకి వచ్చాయి. ఈ రచనలు కేవలం సాహిత్యం మాత్రమే కాదు. ఒక సంస్కతికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. విద్యార్థుల్లో పుస్తకాలపై ఆసక్తి పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ పాఠశాలలో రీడింగ్ కార్నర్, లైబ్రరీలను విద్యాశాఖ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. సామల సదాశివ, గూడ అంజయ్య వంటి ప్రముఖుల నుంచి నేటి యువతరం రచయితల వరకు సాహితీ ప్రస్థానం కొనసాగుతోంది. జిల్లా నుంచి వెలువరించిన పుస్తకాలెన్నో గ్రంథాలయాలు, సాహితీవిపణిలో అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ఫోన్లు, డిజి టల్ మీడియా విస్తరించినా పుస్తకాల ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. ఆన్లైన్ వేదికల ద్వారా స్థానిక రచయితల పుస్తకాలు మరింత విస్తృతంగా పాఠకులకు చేరుతున్నాయి. యువత కూడా రచన వైపు మొగ్గు చూపుతూ కొత్త సాహిత్యాన్ని సృష్టిస్తోంది.బాల సాహితీ ‘అంకురాలు’ వీరు.. వీరి వయసు చూస్తే 15 సంవత్సరాల లోపు. కానీ ఇప్పటికే వీరు రెండు పుస్తకాలను రచించి ప్రచురణ కూడా పూర్తి చేసుకుని సాహితీ విపణిలో విడుదల చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ బొప్పారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 6 నుంచి పదో తరగతి విద్యార్థులు అంకురాలు పేరిట ఇప్పటికే రెండు కథల సంపుటిలను విడుదల చేశారు అంకురాలు –1, అంకురాలు –2 పేరిట వీరు విడుదల చేసిన కథల సంపుటి పుస్తకాలు పలువురు సాహితీవేత్తల ప్రశంసలు, పురస్కారాలు అందుకోవడం విశేషం. వీరికి పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుడు కొండూరు పోతన్న మార్గదర్శనం చేశారు. విద్యార్థులు స్వయంగా వారు చూసిన సామాజిక నేపథ్యాలను, గ్రామీణజీవన విధానాలను ఇతివృత్తంగా తీసుకొని వారు గ్రహించిన అంశాల ఆధారంగా కథలు రాశారు. దాదాపు 29 మంది విద్యార్థులు 30 కథలతో సంపుటిని విడుదల చేయగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, డీఈవో దర్శనం భోజన్న తదితరులు ప్రశంసించారు. -
ఇంటి రుణం.. తీసింది ప్రాణం
నార్నూర్: ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కోలాంగూడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్నూర్ మండల కేంద్రంలోని కోలాంగూడకు చెందిన అలవోజు వనిత (45), భర్త శంకరయ్యలు మూడేళ్ల క్రితం ఇంటి నిర్మాణం చేపట్టారు. అందుకు దాదాపు రూ.8 లక్షల వరకు అప్పు చేశారు. మూడేళ్లుగా అప్పు తీర్చలేక వనిత మనోవేధనకు గురైంది. అప్పు ఎలా తీర్చాలి..? పిల్లల భవిష్యత్తు ఏంటి..? అని ఆమె నిరంతరం ఆందోళన చెందుతుండేదని శంకరయ్య కన్నీరుమున్నీరయ్యారు. ఈక్రమంలో బుధవారం ఉదయం ఇంటి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలాన్ని ఏఎస్సై గణపతి పరిశీలించి వివరాలు సేకరించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
జేఈఈ అడ్వాన్స్కు సీవోఈ విద్యార్థుల ఎంపిక
బెల్లంపల్లి: తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమం బెల్లంపల్లి బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ(సీవోఈ) కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటి అడ్వాన్స్కు అర్హత సాధించారు. ఎంపీసీ విద్యార్థులు 33 మంది జేఈఈ పరీక్షకు హాజరు కాగా 15 మంది మెరుగైన పర్సంటైల్తో అడ్వాన్స్కు ఎంపికయ్యారు. మైలారపు విశ్వతేజ, డౌనే ఆదర్శ్, గోదారి అంజన్న, రాంటెంకి గిరిధర్, దుర్గం అభిరామ్, రామటెంకి హవీశ్, ఆవునూరి మనీష్, దుర్గం యశోమార్, జాడి జయవర్ధన్, కామెర బెన్నీ, కలిసి ధనుష్, కొండగొర్ల రామ్చరణ్, ముడిమడుగుల రామ్తేజ, బట్టి క్రాంతి రణదేవ్, మడికొండ అవినాష్ ఉన్నారు. అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించిన సీవోఈ విద్యార్థులను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం రాత్రి ఆయన సీవోఈ గురుకులాన్ని సందర్శించారు. అడ్వాన్స్ పరీక్షల్లో అత్యుత్తమ పర్సంటైల్ తెచ్చుకుని ఐఐటీలో సీట్లు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను సీవోఈ ప్రిన్సిపాల్ విజయ్సాగర్, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. -
రోడ్డు విస్తరణ పనులు అడ్డుకున్న వ్యాపారులు
చెన్నూర్: పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ నుంచి పెద్ద చెరువు రావి చెట్టు వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా డ్రెయినేజీలపై ఉన్న కట్టడాలను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది, అధికారులను బుధవారం వ్యాపారులు, ఇండ్ల యజమానులు అడ్డుకున్నారు. వారు మాట్లాడుతూ నోటీసులు ఇవ్వకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం ఎంత వరకు సమంజమన్నారు. రోడ్డు ఎన్ని ఫీట్లు వెడల్పు చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తారనే వివరాలతో నోటీసులు ఇచ్చిన తర్వాత పనులు ప్రారంభించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు చేసేది లేక పనులు నిలిపివేశారు. శానిటరీ ఇన్స్స్పెక్టర్ ఉదయ్, టౌన్ ప్లానింగ్ అధికారి సిబ్బంది పాల్గొన్నారు. -
మక్కల దొంగలు అరెస్ట్
కుంటాల: మండలంలోని వెంకూర్ గ్రామ శివారు కల్లూరు –కుంటాల రహదారిపై ఉన్న 107 మక్కల బస్తాలను చోరీ చేసిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. బైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ బుధవారం కుంటాల పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. మండలంలోని కొత్త వెంకూర్ గ్రామానికి చెందిన రైతు మగ్గిడి చిన్న నారాయణకు చెందిన మక్కల బస్తాలు ఈనెల 4న వేకువజామున చోరీకి గురయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ రాజేశ్ మీనా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్ వివరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. మహారాష్ట్రలోని బోకర్ ఎక్స్రోడ్ వద్ద దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.75వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. భైంసా పట్టణానికి చెందిన షేహెబాజ్ అహ్మద్, షేక్ అతీఫ్, మహమ్మద్ సాహిల్ ఉద్దీన్, షేక్ జలాల్ అలియాస్ అర్బాజ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. షేక్ నోమన్ అలియాస్ షేక్ మన్నాన్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కేసును చేధించిన ఎస్సై అశోక్, కానిస్టేబుళ్లు రంజిత్ కుమార్, రాజేందర్, శంకర్ రావులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఎస్సై అశోక్, సిబ్బంది పాల్గొన్నారు. -
సింగరేణి కార్మికుడి ఆత్మహత్య
తాండూర్: మండలంలోని రాజీవ్నగర్ గ్రామానికి చెందిన ఉపిరే ప్రణీత్(25) అనే సింగరేణి యువ కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాండూర్ ఏఎస్సై మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజీవ్నగర్లో నివాసం ఉండే రిటైర్డ్ కార్మికుడు ఉప్రే కిషన్ కుమారుడు ప్రణీత్ మందమర్రి ఏరియాలోని కాసిపేట 2 గనిలో ట్రామర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజువారీలాగే మంగళవారం రెండో షిప్ట్ విధులు ముగించుకొని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. స్నానం చేసి తన రూమ్లోకి వెళ్లాడు. చాలా సేపటి వరకు టీవీ ఆన్ చేసి ఉన్నట్లు గమనించిన కిషన్ వెళ్లి తలుపు తీసి చూసే సరికి ప్రణీత్ ఫ్యాన్కు ఉరేసుకొని ఉన్నాడు. వెంటనే ప్రణీత్ను స్థానికుల సాయంతో కిందికి దించి బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాని అప్పటికే ప్రణీత్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తన కుమారుడికి ఎలాంటి సమస్యలు లేవని ఆత్మహత్యకు ఎందుకు పా ల్పడ్డాడో అర్థం కావడం లేదని కిషన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వ్యాపారం కలిసి రాక.. అప్పులు తీర్చలేక..
జైపూర్: వ్యాపారం కలిసి రాలేదు. దాని కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన వ్యక్తి మామిడి తోటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భీమారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమారం మండల కేంద్రానికి చెందిన పోటు తిరుపతిరెడ్డి(50) వ్యవసాయంతో పాటు ఎరువుల దుకాణాన్ని నడిపేవాడు. ఇందుకు అప్పులు చేయగా వ్యాపారం సరిగా జరగలేదు. దీంతో అప్పులు ఎలా తీర్చాలోనని ఎప్పుడూ మానసికంగా బాధపడేవా డు. ఈక్రమంలో బుధవారం ఉదయం 3:30 గంట లకు పొలంకు వెళ్తున్నానని చెప్పి మామిడి తోటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మెడి‘కిల్’ బోర్డు..!
శ్రీరాంపూర్:సింగరేణిలో మెడికల్ బోర్డుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం ఉన్న అనిశ్చితితో మెడికల్ బోర్డు నిర్వహిస్తారా? లేదా ఎత్తేస్తారా? అనే చర్చ జరుగుతోంది. పదేళ్లుగా సక్రమంగా నిర్వహించిన మెడికల్ బోర్డు ఏడాది కాలంగా బంద్ చేశారు. కేవలం రిఫరల్ కేసులకు రెండుసార్లు బోర్డుపెట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో అనారోగ్యం బారిన పడిన కార్మికులు విధులు నిర్వర్తించలేక దరఖాస్తు చేసుకున్నవారు, గుండెకు స్ట్రంట్స్, బైపాస్, ఇతర సర్జరీలు చేసుకున్న సుమారు 2,500 మంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. చివరి సారిగా 2025, మార్చి 21లో బోర్డు నిర్వహించారు. ఆ తర్వాత జూలైలో 54 రిఫరల్ కేసులను పిలిచినా కేవలం ఐదుగురిని ఇన్వాలిడేషన్ (అన్ఫిట్) చేసి మిగిలిన వారిని డ్యూటీ చేసుకోవాలని తిప్పి పంపించారు. నవంబర్లో కూడా ఇలాగే 129 మందిని పిలిచి కేవలం 25 మందినే ఇన్వాలిడేషన్ చేశారు. పర్చేంటేజీ తగ్గించారు.. పదేళ్లలో జరిగిన మెడికల్ బోర్డులు పరిశీలిస్తే జబ్బుపడిన కార్మికుల్లో కనీసం 70 నుంచి 80 శాతం వరకు ఇన్వాలిడేషన్ చేశారు. దీంతో వేలాది మంది కార్మికుల పిల్లలు కారుణ్య ఉద్యోగాలు పొందారు. ఇప్పటి రెండు బోర్డులను పరిశీలిస్తే ఇన్వాలిడేషన్ శాతం చాలా తగ్గించారని, ఇది మున్ముందు ఎత్తివేసే కుట్ర అని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మళ్లీ పాత రోజులే వస్తున్నాయని కార్మికులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే గతంలో నిర్వహించిన మెడికల్ బోర్డులో కారుణ్య ఉద్యోగాలు పొంది మెడికల్ఫిట్ అయిన 350 మంది డిపెండెంట్లకు సైతం పోస్టింగ్ లెటర్లు ఇవ్వడం లేదు. ఎక్సెస్ ఉన్నారనే... కంపెనీలో అవసరానికి మించి సుమారు 2,500 మంది ఎక్సెస్ కార్మికులు ఉన్నారని, ప్రస్తుతం మెడికల్ బోర్డు నిర్వహించి కారుణ్య ఉద్యోగాలు కొనసాగిస్తే మున్ముందు ఈ సంఖ్య మరింత పెరుగుతుందని, అందుకే ఈ సంఖ్య తగ్గించాలనే బోర్డును బంద్ పెట్టారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కంపెనీని ప్రైవేటు పరం చేయడానికి దశల వారీగా యాజమాన్యం, ప్రభుత్వాలు కలిసి కు ట్రలు చేస్తూ కొత్త గనులు తీసుకురావడం లేదని, దీ ని ప్రభావం వల్లే ఉద్యోగుల సంఖ్య ఎక్సెస్ అయ్యిందని, ఆ సాకుతో కారుణ్య ఉద్యోగాలను ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నారని కార్మికులు మండి పడుతున్నారు. ఏసీబీ విచారణ మంట... 2014 నుంచి 2024 వరకు జరిగిన మెడికల్ బోర్డు ఇన్వాలిడేషన్, అందులో పొందిన కారుణ్య ఉద్యోగాలపై ఏసీబీ చేత విచారణ జరిపిస్తామని సా క్షాత్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసన మండలిలో ప్రకటించడం మంటలు రేపింది. దీనిపై అన్ని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. విచారణ పేరుతో కారుణ్య ఉద్యోగాలు చేస్తున్న వారిని ఇ బ్బందులకు గురిచేస్తే సహించబోమని హెచ్చరించా రు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో పాటు ప్రా తినిధ్య సంఘం ఐఎన్టీయూసీ, ఇతర సంఘాలు మెడికల్బోర్డు పెట్టాలని ఆందోళనలు చేస్తున్నాయి. -
ఇంట్లోనే గ్రంథాలయం..
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ నజీర్ఖాన్ అటవీ శాఖలో డిప్యూటీ రేంజ్ అధికారిగా సారంగాపూర్లో విధులు నిర్వహిస్తున్నారు. చిన్నప్పటి నుంచి పఠనాభిరుచి ఎక్కువ. ఇంట్లోనే ఓ ప్రత్యేకగది కేటాయించి ఒక చిన్నపాటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మిత్రులు, బంధువులు ఎవరు వచ్చినా వారికి ఓ పుస్తకాన్ని కానుకగా ఇవ్వడం ఆయనకు అలవాటు. బుక్ ఫెయిర్ ఎక్కడ జరిగిన వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేస్తారు. గ్రంథాలయానికి సంబంధించిన పుస్తకాలను తెలిపే లిస్టు, దానికి తోడు ప్రతీ పుస్తకానికి ఓ సీరియల్ నంబర్ ఏర్పరచుకొని ప్రత్యేకంగా రబ్బర్ స్టాంపు తయారు చేసుకున్నారు. ఇలా తన వద్ద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి.? వాటి క్రమ సంఖ్య ఎంత అనే గణాంకాలు ఉన్నాయంటే ఆయనకు పుస్తకాల పట్ల ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు.


