breaking news
Mancherial District Latest News
-
రిజర్వేషన్.. కుటుంబసభ్యుల రొటేషన్!
బెల్లంపల్లి: మున్సిపాలిటీలో రెండు కుటుంబాలు ఏళ్ల తరబడి నుంచి పురఎన్నికల్లో విజయ పరంపర కొనసాగిస్తున్నాయి. ఓ మారు తప్పా పోటీ చేసిన ప్రతిసారి జయకేతనం ఎగురవేయడం జరుగుతోంది. రిజర్వేషన్ ప్రకారం భార్యభర్తలు, కుటుంబ సభ్యులు పోటీచేసి కౌన్సిలర్గా ఎన్నిక కావడం ఆనవాయితీగా వస్తోంది. ఓ కుటుంబం ఆరుసార్లు కౌన్సిలర్గా గెలవగా, మరో కుటుంబం ఐదుసార్లు మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం వహించడం విశేషంగా చెప్పవచ్చు. గెల్లి రాజలింగు బీజీ శంకర్సింగ్ -
బీ ఫారంతోనే గుర్తుంపు..!
మంచిర్యాలటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఇటు అభ్యర్థులు.. అటు రాజకీయ పార్టీల నాయకుల అందరి నోటా వినిపిస్తున్న మాట ఒక్కటే.. బీ ఫారం. బల్ది యాల్లో పోటీకి ఆశావహులు వివిధ రాజకీయ పా ర్టీల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఒ కే పార్టీ నుంచి వార్డు, డివిజన్లలో పోటీకి పార్టీ అభ్యర్థిత్వం తమకే వస్తుందనే ధీమాతో ఇద్దరు కంటే ఎక్కువమంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో పలు పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేశారు. మరికొన్ని పార్టీలు ఖరారు చేయాల్సి ఉంది. కానీ అభ్యర్థుల చేతికి ఇంకా బీ ఫారం అందలే దు.శనివారం నామినేషన్లను అధికారులు పరిశీలించారు.తిరస్కరణ, ఉపసంహరణకు ఈనెల 3న మ ధ్యాహ్నం 3గంటలవరకు సమయం ఉంది. ఆలో పు బీఫారం అందజేసిన వారినే ఆయా పార్టీల అ భ్యర్థులుగా పరిగణిస్తూ బరిలో ఉన్నవారి జాబి తా ను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. బీ ఫారం ఇ వ్వనివారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తారు. ఎవరు జారీ చేస్తారు.. పార్టీ ప్రాతిపదికన జరిగే ఎన్నికల్లో అభ్యర్థులు బీ ఫారం పొంది పోటీ చేయాల్సి ఉంటుంది.సర్పంచ్ మినహా, స్థానికసంస్థలు, మున్సి పాలిటీ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతాయి. బీ ఫారం లేకుండా పోటీచేస్తే ఎన్నికల అధికారులు వారిని స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తిస్తారు. వీరు కా కుండా పార్టీ పరిశీలకులుగా ఉన్న వారికి ‘ఏ’ ఫా రం ఇస్తారు. వారు కూడా బీ ఫారం ఇచ్చేందుకు అర్హులు. బీ ఫారాల కోసం పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉండాలనుకునే ఆశవాహులు బీఫారం పొందేందుకు నానా తంటాలు పడుతుంటారు. పార్టీ అధినేతలు నామినేషన్ల చివరి ఘట్టం వరకు ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంటుంది. గెలుపు గుర్రాల కోసం పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో కసరత్తు చేసి చివరికి బీ ఫారం అందజేస్తారు. -
బ్లేడ్తో గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఇంద్రవెల్లి: బ్లేడ్తో గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఏమాయికుంట పంచాయతీ పరిధి రమాయినగర్కు చెందిన రాందాస్ కూలీ పనిచేసుకుని జీవిస్తున్నాడు. ఇతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. కూలీ పనిచేసి వచ్చిన డబ్బులతో మద్యం తాగేవాడు. శుక్రవారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. శనివారం మళ్లీ మద్యం తాగి క్షణికావేశంలో బ్లేడ్తో గొంతుకోసుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫైలెట్ రాజేష్, ఈఎంటీ రాందాస్ అతనికి ప్రాథమిక చికిత్స అందించి ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. -
మైసమ్మ తల్లికి పూజలు
తరలివస్తున్న ఆదివాసీలుబోనాలతో వెళ్తున్న మహిళలు రామకృష్ణాపూర్: మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో రెండోరోజైన శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. సాయంత్రం సదర్ భీమన్న వద్ద దేవతామూర్తులకు ఆదివాసీల సంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి దేవతామూర్తులను గాంధారి ఖిల్లా దిగువ భాగంలోని జీడికోటకు పిల్లనగ్రోవి వాయిద్యాలు, తప్పెటగూళ్ల ఆటలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ వాటిని ఉంచి రాత్రి లక్ష్మిదేవర, తప్పెటగూళ్ల నృత్యాలు చేశారు. అనంతరం మహిళలు ఖిల్లాపై భాగంలో కొలువుదీరిన అమ్మవారిని నదీజలాలతో శుద్ధిచేసి మైసమ్మ తల్లికి పట్నాలు వేశారు. అర్ధరాత్రి సమయంలో పెద్దపూజ నిర్వహించారు. -
‘జీవన్దాన్’ సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్టౌన్: కిడ్నీ బాధితులు జీవన్దాన్ను సద్వినియోగం చేసుకోవాలని నిమ్స్ అడిషనల్ ప్రొఫెసర్ డా.రాజాకార్తీక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని రిమ్స్లో డయాలసిస్ కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. కిడ్నీ చెడిపోయినవారు జీవన్దాన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వారికి మరో కిడ్నీ ని అమర్చనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కుటుంబంలో ఎవరైన కిడ్నీ దానానికి ముందుకు వస్తే కూడా అమర్చుకోవచ్చన్నారు. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేసుకోవాలన్నారు. నీటిని తక్కువగా తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆయన వెంట డా.శశాంక్, కిషన్, డయాలసిస్ విభాగం ఇన్చార్జి ప్రేందాస్ ఉన్నారు. -
బరిలో భార్యాభర్తలు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో ఒకే పార్టీ నుంచి భార్యభర్తలు పోటీ చేస్తున్నారు. 43వ డివిజన్కు చెందిన గాదె సత్యం, గాదె రమాదేవి గతంలో ఒక్కోసారి కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. 2014లో రమాదేవి అప్పటి 23వ కౌన్సిలర్గా గెలుపొందగా, వార్డుల సంఖ్య పెంపుతో వార్డు 32గా మారగా 2020లో భర్త కౌన్సిలర్గా గెలుపొందారు. ప్రస్తుతం బీఆర్ఎస్ తరపున 43వ డివిజన్ నుంచి భార్య, 20వ డివిజన్ నుంచి భర్త అదే పార్టీ నుంచి బరిలో నిలిచారు. రెండు డివిజన్లలో భార్యభర్తలు విస్తృతంగా ప్రచారం చేపట్టారు.అదృష్టం వరించేనా! నస్పూర్: ఈనెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ బరిలో నస్పూర్కు చెందిన అగల్డ్యూటి రాజు, భార్య రాణి నిలిచా రు. 34వ వార్డు నుంచి అగల్డ్యూటి రాజు, 36వ వార్డు నుంచి అగల్డ్యూటి రాణి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అగల్డ్యూటి రాజు గతంలో నస్పూర్ ము న్సిపాలిటీలో కౌన్సిలర్గా పనిచేశాడు. -
నిజాం పాలన నుంచి
నస్పూర్: సుమారు 1900 సంవత్సరకాలంలో నిజాం సంస్థానీశులు విలేజ్ నస్పూర్లోని గడి నుంచి జన్నారం, తపాలాపూర్, ఇందారం, మంథని, పెద్దపల్లి, భూపాలపల్లి, మహారాష్ట్రలో ని సిరొంచ, మధ్యప్రదేశ్లోని బస్తర్ వరకు పాల న కొనసాగించేవారు. కాలక్రమేణా 1986లో న స్పూర్ పంచాయతీగా, 2018లో నస్పూర్, తీగల్పహడ్, తాళ్లపల్లి, సింగాపూర్ గ్రామాలు కలిపి మున్సిపాలిటీగా ఏర్పడింది. 2020లో ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ తొలి చై ర్మన్గా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్ నుంచి సురమిల్ల వేణు చైర్మన్గా ఏడాది బాధ్యతలు నిర్వహించారు. 2025 జనవరి 27న మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలతోపాటు మరో ఏడు గ్రామాలు కలిసి మంచిర్యాల కార్పొరేషన్గా ఏర్పడింది. దీంతో నస్పూర్ మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలే చివరిగా మిగిలిపోయాయి. -
మందమర్రిలో 80 శాతం బొగ్గు ఉత్పత్తి
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో జనవరిలో 80 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని జీఎం ఎన్.రాధాకృష్ణ తెలిపారు. శనివారం జీఎం కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. శాంతఖనిలో 11,170 టన్నులు, కేకే–5లో 20,185, కాసిపేట 13,049, కాసిపేట–2లో 11,956, కేకే ఓసీ 1,58,675 టన్నులు బొగ్గు ఉత్పత్తి అయినట్లు తెలిపారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం ఏరియాలో 65 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగినట్లు జీఎం వెల్లడించారు. మందమర్రి ఏరియాలోని భూగర్భ గనుల్లో పలువురు కార్మికులు గైర్హాజరు కావడం వల్ల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని తెలిపారు. ఇప్పటికే గైర్హాజరు కార్మికులు పలు మార్లు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. సంస్థ నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు ఇంకా రెండు నెలలు సమయం ఉందని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్వోటూ జీఎం లలితేంద్ర ప్రసాద్, డీజీఎం (పర్సనల్) అశోక్, ఏరియా ఇంజినీర్ బాలాజీ భగవతి, ఐఈడీ కిరణ్కుమార్, సివిల్ ఎస్ఈ శ్రీధర్, సీనియర్ పీవో సత్యనారాయణ పాల్గొన్నారు. సోషల్మీడియాలో పోస్టుచేసిన వ్యక్తిపై కేసు ఆదిలాబాద్టౌన్: మున్సిపల్ ఎన్నికల సందర్బంగా సోషల్మీడియాలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పోస్టు పెట్టిన వ్యక్తిపై శనివారం కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపా రు. పట్టణంలోని ఒడ్డెరకాలనీకి చెందిన దుండుగుల నాగన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోస్ట్ చేయడంపై ఆ పార్టీ నాయకుడు ఎంఏ ఖ య్యూం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైన సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు. -
పాలిటిక్స్కు బ్రాండ్నేమ్
నిర్మల్టౌన్: రాజకీయాల్లో ఒకతరం గెలవాలంటే ఎంతో కష్టపడాలి. అలా కష్టపడిన పదవి భరిస్తుందని గ్యారంటీ లేదు. అలాంటిది ఇప్పటివరకు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నిర్మల్ మున్సిపల్ చైర్మన్లు పనిచేశారు. నిర్మల్ రాజకీయాల్లో ఇలాంటి అరుదైన ఘనత వారికే దక్కింది. తాతబాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన మనుమడు ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగుతూ..మున్సిపాలిటీ పరిపాలనలో కీలకపాత్ర పోషించారు. వేరువేరు కాలాల్లో చైర్మన్లుగా పనిచేస్తూ.. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజాసమస్యల పరిష్కారంలో తమదైన ముద్రవేశారు. ఒక్క కుటుంబానికి వరుసగా ప్రజలు అవకాశమివ్వడం, వారిపై నమ్మకానికి నిదర్శనమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటగా అప్పాల నర్సయ్య..మొదటిగా అప్పాల నర్సయ్య 1981 నుంచి 1982 వరకు నిర్మల్ మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. చేసిన రెండేళ్లలో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై నిలకడమై పోరాడారు. మున్సిపాలిటీ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత 2006లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళ రిజర్వేషన్ రావడంతో నర్సయ్య కుమారుడు అప్పాల మహేశ్ భార్య అనురాధ కౌన్సిలర్గా గెలిచి చైర్మన్ పదవిని అధిరోహించింది. ఐదేళ్లు పట్టణ అభివృద్ధిని పరుగులు పెట్టించారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సమస్యలు భూకబ్జాల నియంత్రణ వంటి సున్నిత అంశాల్లో వీరి నిర్ణయాలు ప్రశంసలు పొందాయి. మూడోసారి అప్పాల గణేశ్ చక్రవర్తినర్సయ్య పెద్ద కుమారుడైన చక్రపాణి కొడుకు అప్పాల గణేశ్ చక్రవర్తి తాత బాటలో నిర్మల్పై పట్టు సాధించాడు. తాత వేసిన పునాదులపై నిలబడి రాజకీయ రంగ ప్రవేశం చేసి మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకున్నారు. నిర్మల్ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. రాజకీయ బలం, క్యాడర్పై పట్టు పెంచుకున్నారు. ఈయన 2014 నుంచి 2019 వరకు నిర్మల్ మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. మళ్లీ ఈసారి బరిలో..2026 మున్సిపల్ ఎన్నికల వేళ మున్సిపల్ చైర్మన్ (జనరల్ బీసీ మహిళ) రిజర్వేషన్ కావడంతో.. మరోసారి బరిలో దిగారు. మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి భార్య కావ్యను అధికార కాంగ్రెస్ నుంచి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. ప్రత్యర్థులు ఎంత వ్యూహాలు రచించిన ఈ కుటుంబ రాజకీయ పట్టు చదరకపోవడం, మున్సిపాలిటీ రాజకీయాల్లో ఇప్పటికీ హాట్ టాపిక్గా మారింది. ఈ కుటుంబ ప్రత్యేకత అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై నిలకడైన పోరాటంతో మున్సిపాలిటీ పనుల్లో తనదైన ముద్రవేసింది. ఇలాంటి రాజకీయ వారసత్వం నిర్మల్ మున్సిపల్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. -
అధ్యక్షుడి నుంచి ‘అధ్యక్షా’ దాకా.. ఖుర్షిద్
● అంచెలంచెలుగా ఎదిగి.. ● ఎమ్మెల్యేలుగా ఎన్నికై న కౌన్సిలర్లు, చైర్మన్లుఆదిలాబాద్ మున్సిపాలిటీకి నిర్వహించిన రెండో ఎన్నికల్లో మసూద్ హైమద్ ఖుర్షిద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1962 నుంచి 1965 వరకు ఆ బాధ్యతలు నిర్వహించారు. స్నేహశీలిగా, మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. మున్సిపల్ పరిధిలో అందించిన సేవలతో ప్రజల ఆదరణ చూరగొన్నారు. ఈ క్రమంలో 1972లో కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీచేశారు. ప్రజలు ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేసిన ఆయనను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. -
ఎడ్లబండిపై వెళ్లి సబ్ కలెక్టర్ పరిశీలన
భీమిని: కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి, గొల్ల గట్టు గ్రామాల్లో పలు వివాదాస్పద భూములను బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ శనివారం ఎడ్లబండిపై వెళ్లి పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించాలని సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక తహసీల్దార్ రాంచందర్తో కలిసి వెళ్లారు. వాహనాలు వెళ్లే దారి లేకపోవడంతో ఎడ్లబండిలో వాగు దాటి వెళ్లి పరిశీలించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు వేడుకున్నారు. తహసీల్దార్ రాంచందర్, ఆర్ఐ చంద్రమౌళి, నాయకులు నర్సింగరావు, బానేష్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ‘నడిపెల్లి’
నడిపెల్లి దివాకర్రావు సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. కిరాణ దుకాణ వ్యాపారిగా, ఎల్ఐసీ ఏజెంట్గా పని చేశారు. 1981లో జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో అప్పటి 7వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచారు. 1987లో మంచిర్యాల సింగిల్ విండో చైర్మన్గా పోటీ చేసి విజ యం సాధించారు. బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలోనే 1999లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో టికెట్ లభించింది. విజయం సాధించిన ఆయన మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2004లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందా రు. ఇక 2009లో టీఆర్ఎస్ ప్రభంజనంలో ఓ టమి చెందారు. తిరిగి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి మూడోసారి, 2018లో ఎన్నికల్లో గెలి చి నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం బీ ఆర్ఎస్ తరఫున రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. -
బీఆర్ఎస్, సీపీఐ కలిసి పని చేస్తాయి
రామకృష్ణాపూర్: స్థానికంగా నెలకొన్న పరిస్థితులతోపాటు భావసారూప్యత కలిగిన అనేక అంశాల్లో సమాలోచన విధానాలు ఉన్న సీపీఐ, బీఆర్ఎస్ పార్టీలు క్యాతనపల్లి మున్సిపాల్టీ ఎన్నికల్లో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రకటించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రెండు పార్టీల నాయకులు కొన్ని గంటలపాటు విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ఎన్నికలకే పరిమితం కాకుండా భవిష్యత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై కలిసి పోరాడాలన్నది తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఆయన అన్నారు. క్యాతనపల్లి మున్సిపాల్టీలో 22 వార్డుల్లో 8 నుంచి 10 లేదా ఒకటి ఎక్కువో తక్కువో స్థానాలు సీపీఐకి కేటాయించే దిశగా చర్చలు జరిగాయని తెలిపారు. సర్వే ఆధారంగా ఇరుపార్టీల బలబలాలను అంచనా వేసిన అనంతరం ఈ నెల 3న సీట్ల పంపకంపై స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. ఏఐటీయూసీ నేత సీతారామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా ఉన్నా పొత్తు చర్చల సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సీపీఐని తక్కువగా చేసి మాట్లాడారని, అది తమను బాధించిందని అన్నారు. పార్టీని కాపాడుకోవడానికి బీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మిట్టపెల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజారమేష్, మేడిపెల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
విత్డ్రాపై మంతనాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా దాఖలైన నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. ఒక్కో వార్డు, డివిజన్ నుంచి పదుల సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో పోటీ రసవత్తరంగా మారుతోంది. దీంతో నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ అభ్యర్థులతో మంతనాలు మొదలయ్యాయి. ఒకే రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు వేసిన చోట్ల ఈ పరిస్థితి అధికంగా ఉంది. జాతీయ పార్టీ నుంచి రాష్ట్ర, గుర్తింపు పొందిన పార్టీలు, స్వతంత్రుల వరకు ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారు. దీంతో ఒక్కో చోట ఐదు కంటే ఎక్కువగానే అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంది. అభ్యర్థుల వారీగా ఓట్లు చీలిపోయే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు మిగతా వారిని పోటి నుంచి తప్పుకోవాలని కోరుతున్నారు. మూడు రోజుల్లో జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లో ఉన్న 149 వార్డుల్లో 1061 మంది 1599 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, ఆమ్ ఆద్మీ, ఎంఐఎంతోపాటు స్వతంత్రులు నామినేషన్లు వేశారు. వీరిలో కాంగ్రెస్ 519, బీఆర్ఎస్ 411, బీజేపీ 326, స్వతంత్రులు 117 మంది ఉండగా.. మిగతా వారు వివిధ పార్టీల కు చెందిన వారు ఉన్నారు. ఒక్కొక్కరు రెండేసి, మూడేసి చోట్ల నామినేషన్లు వేశారు. నిబంధనల ప్రకారం లేని వాటిని అధికారులు పరిశీలన అనంతరం తిరస్కరించారు. బెల్లంపల్లిలో ఒకటి, మంచిర్యాల, చెన్నూర్లో రెండు చొప్పున మొత్తంగా ఐదు తిరస్కరణకు గురయ్యాయి. క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో అన్ని నామినేషన్లు ఆమోదించారు. ఈ నెల 3న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు తుదిగా పోలింగ్ బ్యాలెట్ పేపర్లో బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. అన్ని చోట్ల రెబల్స్ టికెట్లు దక్కయని తెలిసిపోయిన చోట్ల వార్డుల్లో బరిలో ఉన్న అభ్యర్థులతో బ్యాలెట్ పేపర్లో గుర్తులు, వరుస క్రమంతో రానున్నాయి. దీంతో కొద్ది పాటి ఓట్లతోనే గెలుపోటములు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీతో సహా బీఆర్ఎస్, బీజేపీలో సొంత పార్టీ నాయకులు బరిలో ఉన్నారు. తమకు టికెట్ కేటాయించకున్నా పోటీ పడుతున్నారు. దీంతో పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులకు రెబల్స్ బెడద తప్పడం లేదు. కొందరు చివరి క్షణంలో తమకు బీ ఫాం దక్కే అవకాశం ఉందనే నమ్మకంతో ఉంటున్నారు. ఇంకా అధికారికంగా బీ ఫాంలు అందకపోయే సరికి అందరూ ఆతృతతో ఉన్నారు. బెల్లంపల్లిలో అధికార పార్టీ నాయకుల మధ్య టికెట్ల విషయంలో పోటాపోటీ నడుస్తోంది. జిల్లా కేంద్రంలోనూ రెబల్స్ పోటీలో ఉన్నారు.పరిశీల అనంతరం నామినేషన్ల వివరాలుమున్సిపాలిటీ వార్డులు అభ్యర్థులు నామినేషన్లు మంచిర్యాల 60 362 386 బెల్లంపల్లి 34 252 279 చెన్నూరు 18 154 171 క్యాతనపల్లి 22 193 241 లక్సెట్టిపేట 15 100 100 మొత్తం 149 1061 1177 తిరస్కరణ గురైనవి 05 -
వనంలోకి తల్లులు
మంచిర్యాలఅర్బన్: స్థానిక గోదావరి నదీ తీరాన మూడు రోజులపాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వనదేవతల జాతర శనివారం ముగిసింది. చివరి రోజు తల్లుల దర్శనానికి భక్తజనం పోటెత్తింది. మధ్యాహ్నం 12.30గంటలకు గిరిజన పూజారి సతీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం సమ్మక్క, సారలమ్మలను వన ప్రవేశం చేయించారు. జాతర ప్రత్యేక అధికారి రవికిషన్గౌడ్, ఈవో ముక్తా రవి, పూజారి సతీష్ వనదేవతలకు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి గౌతమేశ్వర ఆలయ సమీపంలోని చెట్లపొదల్లో ఇల్లారిలో దేవతలను వనప్రవేశం చేయించారు. భక్తులు పెద్దయెత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. జాతర ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు, ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ సభ్యులు సేవలందించారు. పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రత చర్యలు చేపట్టారు. జాతర హుండీ లెక్కింపు జాతరలో ఏర్పాటు చేసిన హుండీలను శనివారం పోలీసుల పర్యవేక్షణలో దేవదాయ, ధర్మదాయ శాఖ సిబ్బంది, జాతర సేవా కమిటీ సభ్యులు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్లు లెక్కించారు. రూ.14,67,450 ఆదాయం రాగా, 900 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, 444గ్రాముల మిశ్రమ వెండి కానుకల రూపంలో భక్తులు సమర్పించారు. దుకాణాల ఏర్పాటుకు బహిరంగ వేలం, హుండీ, టెంకాయ రశీదు, కేశఖండనం, ప్రత్యేక దర్శనం రశీదు ఆదాయం మొత్తం రూ.31,19,080 సమకూరింది. జాతర పర్యవేక్షణాధికారి రంగు రవికిషన్గౌడ్, ఈవో ముక్తా రవి, తదితరులు పాల్గొన్నారు. -
‘చేయి’ కలిపి ‘కారు’లో సీపీఐ
బెల్లంపల్లి: జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలతో వేర్వేరుగా జత కలిసి పోటీ చేయడానికి సీపీఐ సిద్ధమైంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, బెల్లంపల్లి, క్యాతనపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట మున్సిపాల్టీల్లో ఒక్కోచోట ఒక్కో పార్టీతో పొత్తుకు సానుకూల పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయనుండగా.. క్యాతనపల్లిలో కారెక్కడం ఖాయమైంది. బెల్లంపల్లిలో పొత్తుకు తుది ప్రయత్నాల్లో ఉన్నారు. చెన్నూర్, లక్సెట్టిపేటలో ఒంటరిగా పోటీకి సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్నేహపూర్వకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ మంచిర్యాలలో తప్ప చెన్నూర్, బెల్లంపల్లి బల్దియాల్లో కమ్యూనిస్టులతో చెలిమికి నిరాకరించడంతో పొత్తుకు తలుపులు మూసుకుపోయినట్లు తెలుస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు స్నేహహస్తం అందించి పొత్తుకు ముందుకు రాగా, క్యాతనపల్లి, బెల్లంపల్లిలో స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతోపాటు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మొండిచేయి చూపినట్లు సీపీఐ శ్రేణులు చెబుతున్నారు. ఇ దే అదునుగా కామ్రేడ్లతో పొత్తుకు బీఆర్ఎస్ ముందుకు రావడంతో పొత్తులు ఒక్కసారిగా మలుపులు తిరిగాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని సీపీఐ, బీఆర్ఎస్ పొత్తుకు సిద్ధపడినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సీట్ల ఒప్పందం ఇలా.. -
తెలంగాణ సాయుధ పోరు నుంచి.. రంగనాథ్రావు
తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ రంగనాథ్ రావు బొల్లాన్వార్ ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఆవిర్భావంతోనే ఎన్నికల బరిలో నిలిచారు. నాడు నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సీపీఐపై అప్పట్లో నిషేధం విధించారు. దీంతో ఆ పార్టీకి చెందిన నాయకుడైనప్పటికీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) తరఫున మున్సిపల్ బరిలో నిలిచారు. అధ్యక్షుడిగా విజయం సాధించి 1952 నుంచి 1961 వరకు దాదాపు దశాబ్దకాలం పాటు పట్టణ ప్రజలకు సేవలందించారు. ఈ క్రమంలో అదే పార్టీ తరఫున 1957లో ఎమ్మెల్యేగా పోటీచేసి ప్రజల మద్దతుతో అసెంబ్లీలో అడుగు పెట్టారు. చైర్మన్, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మరోసారి మున్సిపల్ బరిలో నిలిచి గెలుపొందారు. రెండోసారి 1967 నుంచి 1972 వరకు చైర్మన్గా సేవలందించారు. పదవులు చేపట్టినప్పటికీ అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్యుడివలే కాలినడకన తిరిగేవారని ఆయన వ్యక్తిత్వాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు ఆయన సమకాలికులు. -
పారదర్శకంగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల(ప్రాక్టికల్స్)ను పారదర్శకంగా నిర్వహించాలని డీఐఈవో అంజయ్య సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష నిర్వహణ మార్గదర్శకాలపై చీఫ్ సూపరింటెండెంట్లు, పరీక్షల నిర్వహణ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ నెల 2నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని, 20 పరీక్ష కేంద్రాల్లో 5,398 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. సందేహాలు, సలహాలకు జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, 8328172384, 9291658408 నంబర్లలో సంప్రదించాలని తలెఇపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు శంకర్, విజిత్కుమార్ పాల్గొన్నారు. -
నిర్మలమ్మ కరుణించేనా..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆదివారం ప్రవేశపెడుతున్న బడ్జెట్పై జిల్లా వాసుల్లో ఆశలు నెలకొన్నాయి. దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న పలు పథకాల్లో భాగంగానే జిల్లాకు నిధులు వస్తున్నాయి. కానీ ఏటా కేంద్రం నుంచి ప్రత్యేకంగా జిల్లాకు నిధులేమీ దక్కడం లేదు. ఈసారైనా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ప్రాంత వాసులపై కరుణ చూపాలని కోరుతున్నారు. సింగరేణి కార్మికుల ఆదాయపన్ను కోల్ ఇండియాలో మాదిరి యాజమాన్యామే చెల్లించేలా వెసులుబాటు, కొత్త గనులు సింగరేణికి కేటాయింపులు చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది జూన్లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ క్రమంలో గోదావరి పరిరక్షణ, అభివృద్ధి కోసం కేంద్రం దయ చూపాల్సి ఉంది. మంచిర్యాలకు స్మార్ట్సిటీ హోదా.. జిల్లాలో ప్రస్తుతం అమృత్ భారత్ స్కీం కింద జిల్లా కేంద్రంతో మంచిర్యాలతో సహా బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి, లక్సెట్టిపేటలో పనులు కొనసాగుతున్నాయి. నీటి ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణం జరుగుతోంది. ఇక కార్పొరేషన్గా మారిన మంచిర్యాల నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటిస్తే నిధులు మౌలిక వసతుల పెంపునకు దండిగా వచ్చే అవకాశం ఉంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల సరసన జిల్లా కేంద్రం చేరే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారు. మంచిర్యాల నగరం రాముని చెరువు ముందు నుంచి టు టౌన్కు రాకపోకలు మెరుగు పర్చేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. ప్రస్తుతం టు టౌన్ వెళ్లాలంటే అండర్ బ్రిడ్జితో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఐబీ నుంచి వెళ్లే ఓవర్ బ్రిడ్జి పై నుంచి రోజువారీగా ట్రాఫిక్ పెరుగుతోంది. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే హమాలీవాడ వెళ్లేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జి మంజూరు చేసింది తెలిసిందే. రైల్వేస్టేషన్ల ఆధునీకరణ రైల్వేస్టేషన్ల ఆధునీకరణ కోసం నిధులు రావాల్సి ఉంది. మంచిర్యాల స్టేషన్ అమృత్భారత్లో ఎంపికై ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచినీ రోడ్, ఆసిఫాబాద్ రోడ్, కాగజ్నగర్, సిర్పూర్ టీ వరకు స్టేషన్ల ఆధునీకరణ జరగాల్సి ఉంది. వీటిలో రేచినీ రోడ్లో కనీసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులో లేదు. ఇక మధ్య తరహా స్టేషన్లలో రైళ్లు నిలపకవపోడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. -
కౌన్సిలర్ నుంచే ‘గోనె’ ప్రస్థానం
కాంగ్రెస్ నుంచి గోనె హన్మంతరావు రెండు పర్యాయాలు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 1961 ఎన్నికల్లో పాతమంచిర్యాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1967లో మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. 1987లో కాసిపేట మండలం ముత్యంపల్లి నుంచి సింగిల్ విండో చైర్మన్గా గెలిచారు. ఆ తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవిని అలంకరించారు. 1989లో లక్సెటిపేట(ప్రస్తుతం మంచిర్యాల) నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి టికెట్ కోసం విఫలయత్నం చేశారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టికెట్ లభించగా విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. 1999, 2010లో పోటీ చేసినా ఓటమి చవిచూశారు. రాజకీయాల నుంచి వైదొలిగిన ఆయన అనారోగ్యంతో మృతిచెందారు. -
మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
● రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారి, కలెక్టర్, ఈఆర్వోలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు ముందుగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి ఆయా పార్టీల నుంచి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలోని బూత్ స్థాయి అధికారులు ప్రతీ ఇంటికి వెళ్లి పరిశీలిస్తారని తెలిపారు. మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
చెన్నూర్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చెన్నూర్లో శుక్రవారం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు పెద్దఎత్తున తరలిరావడంతో నామినేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంది. కేంద్రంలోకి ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా పెద్దఎత్తున ఆయా పార్టీల కార్యకర్తలు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను అనుమతిస్తూ బీఆర్ఎస్ నాయకులను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. సీఐ బన్సీలాల్ సంఘటన స్థలానికి చేరుకొని అన్ని పార్టీలకు నిబంధనలు ఒకే విధంగా ఉంటాయని, అందరూ పోలీసులకు సహకరించాలని సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు. -
చికిత్సతోనే టీబీ నివారణ
నెన్నెల: టీబీ వ్యాధిని ముందస్తుగా గుర్తించి చికిత్స అందిస్తే పూర్తిగా నివారించవచ్చని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుధాకర్నాయక్ అన్నారు. శుక్రవారం ఆవుడంలో ఏర్పాటు చేసిన ముక్త భారత్ అభియాన్లో పాల్గొని అవగాహన కల్పించారు. ప్రతీ పీహెచ్సీలో తెమడ, ఎక్స్రే పరీక్షలు ఉచితంగా చేస్తున్నారన్నారు. వ్యాధి నిర్ధారణ జరిగితే పూర్తిగా నయం అయ్యే వరకు ప్రతీనెల రూ.వెయ్యి చొప్పున పోషణ భత్యాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. 22 మందికి తెమడ పరీక్ష, 116 మందికి ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ లక్ష్మణ్, సర్పంచ్ పావని, తదితరులు పాల్గొన్నారు. -
గూడెం గుట్టలో కల్యాణ వైభోగం
దండేపల్లి: తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం లోని గూడెం గుట్టపై వెలసిన శ్రీసత్యనారాయణస్వామి–రమాదేవి కల్యాణోత్స వం శుక్రవారం రాత్రి కనుల పండువగా జరిగింది. వేద పండితులు నారాయణశర్మ, భరత్శర్మ, ప్రధా న అర్చకులు రఘుస్వామి, సంపత్స్వామి వేదమంత్రోచ్ఛరణలతో స్వామివారి కల్యాణాన్ని కమణీయంగా జరిపించారు. ఈవో శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. వేడుకల్లో ఎమ్మెల్యే సతీమణీ కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
వ్యక్తిత్వాన్ని బట్టి ఓటేసేవారు
నేను 1987లో మంచిర్యాల మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు ఈ ప్రాంతంలోని ప్రజలు నన్ను కేవలం వ్యక్తిత్వం ఆధారంగానే గెలిపించారు. ఎన్నికలంటే మందీ మార్బలంతో ప్రచారం నిర్వహించేందుకు చేసే ఖర్చు తప్ప, ఇతర ఖర్చులేవి ఉండేవి కావు. రూ.20 వేల లోపు మాత్రమే ఖర్చు అయ్యే ఎన్నికలు 1995లో రూ.1.50 లక్షల ఖర్చుతో ప్రజలు గెలిపించారు. 2020లో ఖర్చు 20 రెట్లు పెరిగింది. ప్రస్తుతం 30 రెట్లు పెరిగి రాజకీయాలంటేనే ఖర్చు అనే స్థితికి వచ్చింది. – పెంట రాజయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ఖర్చుతో కూడుకున్నవి మొదటిసారి 2000 సంవత్సరంలో కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు ఖర్చు రూ.30 వేలు. 2005లో రెట్టింపు అయ్యింది. 2020లో పదింతలు అయ్యింది. వార్డులోని ప్రజలతో ఎప్పటికప్పుడు మాట్లాడి, వారి సమస్యలను తీర్చేందుకు ముందుండడం వల్ల గెలుపు సులభతరంగా మారింది. ప్రస్తుత కాలంలో ఎన్నికల వ్యయం అనుకున్న దానికంటే ఎక్కువవుతోంది. ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నదిగా మారిపోయింది. – బుద్దార్థి రాంచందర్, మాజీ కౌన్సిలర్, మంచిర్యాల -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కాగజ్నగర్టౌన్: దహెగాం మండలంలోని రాళ్ళగూడకు చెందిన ఆత్మకూరి కళావతి గురువారం అనుమానస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ కుమారస్వామి తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆత్మకూరి కళావతి అదే గ్రామానికి చెందిన వగాడే బడేరామ్ వద్ద రూ.40 వేలు అప్పుగా తీసుకుంది. డబ్బుల విషయంలో కొన్ని రోజుల క్రితం జరిగిన గొడవల్లో బడేరామ్ ఎప్పటికై నా చంపుతానని బెదిరించాడు. ఈనెల 28న మృతురాలు ఇట్యాలలోని ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్కు వెళ్లివస్తుండగా బడేరామ్ ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. సదరు మహిళ కిందపడడంతో చీరకొంగుతో గొంతుచుట్టు చుట్టి గొంతునులిమి హత్యచేసి సమీపంలోని పత్తి చేనులో పడేశాడు. ఈమేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
అనారోగ్యంతో తల్లి మరణం.. దుఃఖంలోనూ నామినేషన్
కాగజ్నగర్టౌన్: అనారోగ్యం తల్లి చనిపోయి తీవ్ర దుఃఖంలోనూ ఓ అభ్యర్థి మున్సిపల్ ఎన్నికల్లో నా మినేషన్ దాఖలు చేశారు. కుమురంభీం ఆసిఫాబా ద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని 25వ వార్డుకు చెందిన కుడుక శ్రీను తల్లి తారాబాయి గురువారం రా త్రి అనారోగ్యంతో మృతిచెందింది. శుక్రవారం నా మినేషన్లకు చివరిరోజు కావడంతో ఇంట్లో తల్లి మృతదేహం ఉండగానే.. కాలనీ ప్రజలకు సేవ చేయాలనే తపనతో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆ ప్రక్రియ పూర్తయిన అనంతరం తిరి గి వచ్చి మధ్యాహ్నం తల్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. -
కానిస్టేబుల్ సమయస్ఫూర్తి..
నిర్మల్టౌన్: పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. శుక్రవారం ఉదయం సుమారు 7:50 గంటల సమయంలో భార్యాభర్తలు బైక్పై స్థానిక పోలీస్ పంపు వద్దకు వచ్చారు. పెట్రోల్ పోయించుకున్న అనంతరం ఆ వ్యక్తికి అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో బైక్పై నుంచి కిందపడ్డాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నవీన్ అప్రమత్తమై సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేసి ప్రాణాలు కాపాడాడు. కానిస్టేబుల్ చూపిన సమయస్ఫూర్తి, ధైర్యం, మానవత్వంతో ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడ్డాయి. తర్వాత ఆ వ్యక్తిని వెంటనే మరో వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. కానిస్టేబుల్ నవీన్ను జిల్లా ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు. -
బాసరలో భక్తుల సందడి
బాసర: బాసర ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహా రాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ద్వా దశి శుభ ముహూర్తంలో తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం చేయించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈఓ అంజనాదేవి పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి సుమారు గంట సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. బీసీలకే ప్రాధాన్యంమంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు శుక్రవారం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రకారం ఆయా సామాజిక వర్గాలకు సీట్లను కేటాయించగా ఎస్సీలకు 9 స్థానాలు, 27వ డివిజన్ జనరల్ మహిళకు రిజర్వు కాగా, ఆ స్థానంలో ఎస్సీ అభ్యర్థికి అవకాశం కల్పించారు. బీసీ స్థానాలు 20, జనరల్ స్థానాల్లో నుంచి 21 స్థానాలను సైతం బీసీలకే కేటాయించారు. జనరల్ స్థానాలు మొత్తం 30 ఉండగా, కేవలం 8 మంది ఓసీ అభ్యర్థులకు ఆయా స్థానాలను కేటాయించారు. బీసీల్లోనూ ఎక్కువగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ఎంపిక చేశారు. -
అదృష్టమంటే ఆ దంపతులదే..
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ చరిత్రలో ఆ దంపతులు ప్రత్యేకత చాటుకున్నారు. భార్యాభర్తలు వరుసగా పదేళ్లు మున్సిపల్ పీఠాన్ని అధిరోహించి ఏకచత్రాధిపత్యంగా పుర రాజకీయాలను శాసించారు. 2001లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గృహిణిగా ఉన్న మత్తమారి సరస్వతి అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటికే ఆమె భర్త మత్తమారి సూరిబాబు కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్నారు. అదృష్టం కలిసి రావడంతో రాజకీయాలకు కొత్త అయినప్పటికీ సరస్వతి ఎన్నికల్లో పోటీచేసి చైర్పర్సన్ అయ్యారు. 2005లో జరిగిన ఎన్నికల్లోనూ సూరిబాబు చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇలా దంపతులిద్దరూ మున్సిపల్ రాజకీయాల్లో తమదైన శైలిలో రాణించి రికార్డు సృష్టించారు. సూరిబాబును వరించిన అదృష్టం 2005లో మున్సిపల్ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా జరిగాయి. మత్తమారి సూరిబా బు (కాంగ్రెస్), పసుల సురేష్ (టీఆర్ఎస్) మున్సిపాలిటీలో ని 15వ వార్డు నుంచి పోటీ చే శారు. సమ ఉజ్జీలు కావడంతో ఆ వార్డు ఓటర్లు ఇద్దర్నీ సమానంగా ఆదరించారు. చెరో 209 చొప్పున ఓట్లు వచ్చాయి. విజేతను ప్రకటించడానికి మున్సిప ల్ ఎన్నికల అధికా రులు డ్రా తీశారు. అందులో సూరిబాబు పేరు రావడంతో కౌన్సిలర్గా ఎన్నికై నట్లు ప్రకటించారు. ఆ తీరుగా డ్రా రూపంలో సూరి బాబును అదృష్టం వరించింది. కౌన్సిలర్గా ఎన్నికై న సూరిబాబు మిగతా కౌన్సిలర్ల మద్దతు కూడగట్టి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. ఆ ప్రకారంగా భార్యాభర్తలు పదేళ్ల పాటు పుర పాలన పగ్గాలు చేపట్టారు. అంతటి అరుదైన అవకాశం ఇంతవరకు మరెవరికీ దక్కక పోవడం గమనార్హం. -
నాటి ఎన్నికలే వేరు..
మంచిర్యాలటౌన్: గతంలో ఎన్ని కలంటే పార్టీలు, అభ్యర్థులను చూసి ఓటేసి గెలిపించేవారు. కా నీ మారుతున్న కాలంలో శ్రీఎవరు ఎక్కువగా ఖర్చు చేస్తే వారికే గెలుపు అవకాశాలుశ్రీ అన్నట్లుగా ఎన్నికలు మారిపోయాయి. సర్పంచ్ ఎన్నికల నుంచి మొదలు ఎంపీ, ఎమ్మెల్యే వరకు డ బ్బే ప్రధానంగా మారుతోంది. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుని, ప్రజాసేవకు అంకితం అయ్యేవారిని ప్రజలు స్వయంగా ఎన్నికల బరిలో ఉంచి మరీ గెలిపించుకున్న రోజుల నుంచి ఎన్నికల్లో ఆ యా పార్టీల టికెట్లను పొందేందుకు ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు పడిగాపులు కాయాల్సిన పరిి స్థతి ఏర్పడింది. ఎన్నికల నిర్వహణ ఖర్చు రూ.10 వేల నుంచి రూ.కోటికి పెరిగిందంటే ఎన్నికలు ఎంత ఖరీదుగా మారాయో తెలుస్తోంది. ఎన్నికల కో సం పనిచేసే వారికి చేసే ఖర్చు మాత్రమే గతంలో ఉండేది. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు ఓటుకు ఇంతా అని లెక్కలేసి పంచాల్సిన పరిస్థితి. అభ్యర్థులు ఇచ్చే డబ్బుకో ఇంకా దేనికో ఆశించి ఓటును అమ్ముకోకుంటేనే ఆ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు వెళుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
15 ఏళ్లయిన పాలన సాగలే!
నిర్మల్ జిల్లాలో 15 ఏళ్ల క్రితం రూ.50 లక్షలతో నిర్మించిన మున్సిపల్ భవనాన్ని సెప్టెంబర్ 23, 2010లో అప్పటి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికీ ఆ భవనంలో పరిపాలనకు నోచుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. పాత మున్సిపల్ కార్యాలయ భవనం పెచ్చులూడుతున్నా అందులోనే పరిపాలన కొనసాగిస్తున్నారు. దాదాపు ముగ్గురు చైర్మన్లు మారినప్పటికీ నూతన భవనంలో వాస్తు దోషం ఉందంటూ పాత భవనంలో పాలన కొనసాగిస్తూ ఉండడం కొసమెరుపు. ప్రస్తుత భవనం పగుళ్లు తేలి, స్లాబ్ పెచ్చులు ఊడుతున్నాయి. దీంతో ఎప్పుడు కూలుతుందోనని అందులో పనిచేసే సిబ్బంది భయపడుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ఏర్పడే నూతన పాలకవర్గమైనా కొత్త భవనంలో పరిపాలన కొనసాగించాలని జిల్లావాసులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
శ్రమ దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు
కాగజ్నగర్టౌన్: నిర్బంద శ్రమ దోపిడీకి పాల్ప డితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజ అన్నారు. శుక్రవారం కాగజ్నగర్ మండలం ఈజ్గాం శివారులోని ఎస్స్టార్ఎస్ ఇటుక బట్టీలో డీసీపీవో బూర్ల మహేష్తో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజ మాట్లాడుతూ ఒరిస్సాకు చెందిన మూడు నెలల బాలింత, 50 ఏళ్ల మహిళ, పదహారేళ్ల బాలుడిని నిర్భంద శ్రమదోపిడికి పాల్పడుతున్నారని, కనీస అవసరాలు కల్పించకుండా యజమాని వారిని కఠినంగా పని చేయించుకుంటున్నారని తమకు అందిన సమాచారం మేరకు తని ఖీలు నిర్వహించి బాధితులను జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ లాయర్ బ్రోమిక్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్, సఖీ కేంద్రం సిబ్బంది శ్రీనిధి, హెడ్ కానిస్టేబుల్ శంకర్, తదితరులు పాల్గొన్నారు. -
గాంధారి మైసమ్మ జాతర షురూ
రామకృష్ణాపూర్: ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యధైవమైన గాంధారి మైసమ్మ జాతర శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులో మూడు రోజుల పాటు నిర్వహించే జాతరలో మొదటిరోజు శుక్రవారం ఆదివాసీలు సంప్రదాయ పూజలు నిర్వహించారు. సదర్ భీమ న్న ఆలయంలో పూజల అనంతరం దేవతామూర్తు ల ఊరేగింపు నిర్వహించారు. తప్పెటగూళ్ళ ఆట లు, పిల్లనగ్రోవి వాయిద్యాలు, డప్పుచప్పుళ్ల నడు మ బొక్కలగుట్ట నుంచి ప్రారంభమైన ఊరేగింపు గాంధారివనం, గద్దెరాగిడి, ఏసీసీ మీదుగా మంచిర్యాల గోదావరి వరకు సాగింది. అక్కడ గిరిజనులు గోదావరినదిలో దేవతామూర్తులకు సంప్రదా యబద్ధంగా నైవేద్యం సమర్పించారు. గోదావరిలో పూజల అనంతరం రాత్రి అక్కడి నుంచి తిరిగి సదర్భీమన్న ఆలయం వద్దకు దేవతామూర్తులను తీసుకువచ్చారు. శనివారం ఉదయం గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భీమన్న దేవునికి పట్నాలు వేస్తారు. సాయంత్రం గోదావరి జలాలతో దేవతామూర్తులకు మరోసారి అభిషేకాలు చేసి జాతర జరిగే ఖిల్లా దిగువ ప్రాంతానికి తరలివెళ్లనున్నారు. రాత్రి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన లక్ష్మీదేవర కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం పూజారులతో మైసమ్మ తల్లికి పెద్దపూజ నిర్వహిహించనున్నారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయక్పోడ్ సంఘం నాయకులు, భక్తులు పాల్గొన్నారు. -
ముగిసిన క్రీడా సంబరాలు
బోథ్: బోథ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల క్రీడా ప్రాంగణంలో మూడు రోజుల పాటు అత్యంత ఉత్సాహంగా సాగిన శ్రీజిల్లాస్థాయి బాలికల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్–2026 (ప్రేరణ)శ్రీ క్రీడాపోటీలు శుక్రవారం ముగిశాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించడమే కాకుండా మానసిక, శారీరక ధృఢత్వానికి తోడ్పడతాయన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ తమ ప్రాంత విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రతిభ కనబరుస్తుండటం గర్వకారణమన్నారు. కలెక్టర్ రాజార్షి షా మాట్లాడుతూ లక్ష్య సాధనలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి క్రీడల ద్వారా లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, క్యారమ్స్, చెస్, టెన్నికాయిట్ అండర్–14, అండర్–17 విభాగాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అథ్లెటిక్స్ అండర్–14, అండర్–17 విభాగాల్లో, ఓవరాల్ గేమ్స్ చాంపియన్షిప్గా ఆశ్రమ పాఠశాల విజేతగా నిలిచింది. ఓవరాల్ చాంపియన్షిప్ ద్వితీయ స్థానాన్ని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం గెలుచుకుంది. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లెపూల నర్సయ్య, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ సంగీత, తదితరులు పాల్గొన్నారు. -
వేలాలలో గట్టు మల్లన్న గిరిప్రదక్షిణ
జైపూర్: మండలంలోని వేలాల గట్టు మల్లన్నస్వామి సన్నిధిలో శుక్రవారం 17వ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. ప్రతీనెల ఆరుద్ర నక్షత్రాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సురేశ్ ఆత్మారాం మహరాజ్ ఆధ్వర్యంలో ఉదయం గిరి ప్రదక్షిణ చేపట్టగా ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డేగ స్వప్న నగేశ్, భక్తులు పాల్గొన్నారు. రంజీ ట్రోఫీలో హిమతేజ సెంచరీఆదిలాబాద్: ఆదిలాబాద్ యువ క్రికెటర్ హిమతేజ రంజీ ట్రోఫీలో మరోసారి మెరిశాడు. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా నుంచి ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీకి ఎంపికై న ఈ యువ కెరటం హైదరాబాద్ తరపున ఆడుతూ ఛత్తీస్గఢ్ జట్టుపై 125 పరుగులతో విజేతగా నిలిచాడు. ఛత్తీస్గఢ్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 238కి ఆలౌట్ అయ్యింది. హైదరాబాద్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 415 పరుగులు చేయగా అందులో హిమతేజ 207 బాల్స్లో 125 పరుగులు సా ధించి సత్తా చాటాడు. రంజీ ట్రోఫీలో మరో సారి పతకం సాధించడంపై కోచ్ జయేంద్ర పటాస్కర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
తల్లులకు ప్రణమిల్లి..
మంచిర్యాలలో సమ్మక్క, సారలమ్మ దర్శించుకుంటున్న భక్తులుమంచిర్యాలఅర్బన్/రామకృష్ణాపూర్: జిల్లా కేంద్రం మంచిర్యాల గోదావరి నదీ తీరాన సమ్మక–సారలమ్మ దర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. బంగారం, ముడుపులతో తల్లులకు ప్రణమిల్లారు. కోళ్లు, మేకలు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గోదావరి తీరమంతా జనసందోహంతో సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో ఈవో ముక్తారవి, జాతర పర్యవేక్షకుడు రవికిషన్ తదితరులు పాల్గొన్నారు. మందమర్రి ఏరియాలోని ఆర్కే1ఏ గని శివారు పాలవాగు ఒడ్డున సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సమ్మక్క–సారలమ్మ జాతర సందడిగా కొనసాగుతోంది. మూడో రోజు శుక్రవారం దర్శనానికి భక్తులు భారీగా బారులు తీరారు. రామకృష్ణాపూర్, మందమర్రితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దయెత్తున తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. సింగరేణి అధికారులు, వివిధ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు దర్శించుకున్నారు. ఏరియా జీఎం రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఎస్ఓటు జీఎం జీఎల్ ప్రసాద్, డీజీఎం అశోక్ ఆయా గనులు, డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే భీమిని: కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధి చర్లపల్లిలో సమ్మక్క–సారలమ్మలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శుక్రవారం మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల చుట్టూ ప్రదక్షిణ చేశారు. నియోజకవర్గంలోని ప్రజలను చల్లంగా చూడాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింగరావు, సర్పంచ్ బోరిగామ వెంకటేష్, నాయకులు పాల్గొన్నారు. -
సొంత భవనాలు కట్టించాలి...
విధి నిర్వహణలో ఎకై ్సజ్ సిబ్బందికి ఆయుధాలు అవసరమే. ఆయుధాలు భద్రపర్చేందుకు సొంత భవనాలు నిర్మించాలి. ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఎకై ్సజ్ స్టేషన్ సిబ్బందితోపాటు డిస్ట్రిక్ టాస్క్ఫోర్స్, స్టేట్ టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంటు టీమ్లకు సైతం ఆయుధాలు అందజేయాలి. విధి నిర్వహణలో మరింత ధైర్యంగా గుడుంబా, గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయడం జరుగుతుంది. నిజామాబాద్ ఘటన బాధాకరం. – సీహెచ్.సమ్మయ్య, జిల్లా టాస్క్ఫోర్స్ ఎకై ్సజ్ సీఐ, మంచిర్యాల -
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ
నస్పూర్: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో రాండమైజేషన్ ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అధికారులకు అవసరమైన శిక్షణ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. నామినేషన్ల కేంద్రం పరిశీలన కలెక్టరేట్లో నామినేషన్ల్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ ఏఓ పిన రాజేశ్వర్, కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్తో కలిసి సందర్శించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా కంట్రోల్ రూం నంబరు 08736–250501 ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. -
నామినేషన్ పత్రాలను పరిశీలించాలి
చెన్నూర్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ పత్రాలను క్షుణంగా పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు కె.గంగాధర్ అన్నారు. చెన్నూర్ మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. నామినేషన్ల స్వీకరణను పరిశీలించి ఆర్వోలతో వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా సాగుతోందని, అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా స్వీకరిస్తున్నామని తెలిపారు. చెన్నూర్ మున్సిపల్ ఎన్నికల ప్రత్యేకాధికారి కిషన్, మున్సిపల్ కమిషనర్ మురళికృష్ణ, సీఐ బన్సీలాల్ పాల్గొన్నారు. -
బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతం
లక్సెట్టిపేట/బెల్లంపల్లి/చెన్నూర్/మంచిర్యాలక్రైం: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం జిల్లాలోని లక్సెట్టిపేట, బెల్లంపల్లి, చెన్నూర్ బార్ అసోసియేషన్ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. లక్సెట్టిపేటలో జూనియర్ సివిల్ జడ్జి కే.సాయికిరణ్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. బార్ అసోసియేషన్లో 45మంది ఓటర్లు ఉండగా 43 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారిగా ప్రదీప్కుమార్, ఇంచార్జిగా సూపరింటెండెంట్ శ్రీనివాస్ వ్యవహరించారు. బెల్లంపల్లిలో 57మంది సభ్యులకు గాను 52మంది ఓటు హక్కు వేశారని ఎన్నికల అధికారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకెం రవికుమార్ తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి జే.ముకేష్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. చెన్నూర్లో 26 మంది ఓటర్లకు గాను 23మంది ఓటు వేశారు. స్థానిక సివిల్ జడ్జి రవి, సూపరింటెండెంట్ జాఫర్ పర్యవేక్షించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, పోలింగ్ అధికారి మద్ది కార్తీక్, న్యాయవాదులు పాల్గొన్నారు. మంచిర్యాలలోని బార్ అసోసియేషన్లో 376మంది ఓటర్లకు గాను 315మంది ఓటు వేశారు. ఎన్నికల పరిశీలకులుగా స్థానిక రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే.నిరోషా, అిసిస్టెంట్గా ఉషారాణి, ఎన్నికల అధికారిగా స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్ వ్యవహరించారు. -
నగరంలో 60 డివిజన్లు గెలిపించాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 59 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, ఒక స్థానంలో మిత్రపక్షం సీపీఐ పోటీ చేస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, రాళ్లవాగుకు కరకట్ట నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోపు పూర్తి చేస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అనంతరం పలు పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్లో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నాయకులు పాల్గొన్నారు. -
రోడ్డుప్రమాదంలో వ్యాన్ క్లీనర్..
రెబ్బెన: మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజాము జరిగిన రోడ్డుప్రమాద ంలో వ్యాన్క్లీనర్ మృతి చెందినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఆరెపల్లికి చెందిన కొత్తపల్లి నరేందర్ (42) గత కొంతకాలంగా వ్యాన్ క్లీనర్గా పనిచేస్తున్నాడు. మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి వ్యాన్ లోడ్తో కరీంనగర్కు బయల్దేరింది. మహారాష్ట్ర నుంచి వస్తున్న లారీ..రెబ్బెన జాతీయరహదారి ఫ్లైఓవర్పై లారీడ్రైవర్ మొహినుద్దీన్ అజాగ్రత్తగా నడుపుతూ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. వెనుక వస్తున్న వ్యాన్ డ్రైవర్ అంకడాల క్రిష్ణ అప్రమత్తమయ్యే లోపే లారీని ఢీకొట్టా డు. ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జుయింది. తీవ్రగాయాలైన వ్యాన్క్లీనర్ నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్పగాయాలైన వ్యాన్ డ్రైవర్ క్రిష్ణను ఆసుపత్రికి తరలించారు.మృతుడి భార్య రోజా ఫిర్యాదుతో లారీడ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
మద్యం పట్టివేత
భైంసాటౌన్: అక్రమంగా మద్యం విక్రయిస్తు న్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సాయికుమార్ తెలిపారు. రాజీవ్నగర్కు చెందిన రాసేట్కర్ బండు ఖడ్డా ప్రాంతంలోని తన హోటల్లో మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. దీంతో రూ.5,290 విలువైన 7.29 లీటర్ల మ ద్యం లభించినట్లు చెప్పారు. అలాగే, హ నుమాన్నగర్లోని ఫైర్స్టేషన్ పక్కన కొండపల్లి నగేశ్కు చెందిన కిరాణా దుకాణంలో తని ఖీ చేయగా, రూ.9620 విలువైన 9.44 లీటర్ల మ ద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
గొడవలో ఇద్దరికి గాయాలు
లక్ష్మణచాంద: వైన్స్ షాపు వద్ద జరిగిన గొడవలో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి..మండలంలోని రాచాపూర్కు చెందిన జడ రజినీకాంత్ (27) గురువారం మధ్యాహ్నం పని ని మిత్తం కనకాపూర్కు వెళ్లి ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో కనకాపూర్ వైన్స్ షాపు వద్ద ఆగాడు. అదే సమయంలో రాచాపూర్కు చెందిన తక్కల సాయికుమార్..రజినీకాంత్ వద్దకు వెళ్లి తనకు మద్యం తాగించాలని కోరాడు. తన వద్ద డబ్బులు లేవని బదులిచ్చాడు. రజినీకాంత్ పేరున స్టఫ్ను సాయికుమార్ తీసుకోవడంతో ఎందుకు తీసుకున్నావని అడిగాడు. ఆగ్రహించి అక్కడ ఉన్న ఖాళీసీసాతో రజినీకాంత్పై దాడి చేశాడు. ఈక్రమంలో ఒకరికొకరు దాడి చేసుకున్నారు. రజినీ కాంత్కు తీవ్రగాయాలయ్యా యి. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స చేశారు. ఆ ఇద్దరిని నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. సోన్ సీఐ గోవర్ధన్రెడ్డి అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. రజినీకాంత్ భార్య రాజశ్రీ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ తెలిపారు. -
అరైవ్–అలైవ్.. ప్రమాదాలకు చెక్!
మంచిర్యాలక్రైం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. రోజురోజుకు ప్రమాదాల సంఖ్య పెరిగి రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడం, రాంగ్రూట్లో వెళ్లడం, ర్యాష్ డ్రైవింగ్తో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు శాశ్వత అంగవైకల్యం బారిన పడుతున్నారు. ఈ ప్రమాదాలకు చెక్పెట్టేందుకు తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, స్వీయ రక్షణతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రమాదాల నివారణకు పోలీస్, ఆర్టీవో, ఎకై ్సజ్, రెవెన్యూ, ఎన్హెచ్, ఎస్హెచ్, ఇంజినీరింగ్ శాఖల సమన్వయంతో విలేజ్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగితే అక్కడ కారణాలను విశ్లేషించి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో..రోడ్డు ప్రమాదాల్లో ప్రమాదాల్లో మొదటి స్థానం నిర్మల్, రెండో స్థానంలో మంచిర్యాల ఉంది. గతేడాది 1373 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 353 మంది మృత్యువాత పడ్డారు. మృతిచెందిన వారిలో 80 శాతం యువతే కావడం గమనార్హం. విలేజ్ కమిటీలు ఇలా..పోలీస్శాఖ, ఎకై ్సజ్, ఆర్టీవో, ఎన్హెచ్, ఎస్హెచ్, ఆర్ఆండ్బీ అధికారులు, విలేజ్ నుంచి ఇద్దరు, పది మందితో కూడిన విలేజ్ కమిటీ ఉంటుంది. జిల్లా పోలీస్ శాఖ అధికారి సమన్వయంతో పనిచేస్తారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను సందర్శిస్తారు. దీనికి కారకులెవరు అనేదానిపై విశ్లేషిస్తారు. సాంకేతిక లోపాలు, సైన్బోర్టులు, వేగనిరోధక నియంత్రణ, రేడియం స్టిక్కర్స్ ఏర్పాటుకు కృషి చేస్తారు. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, మద్యం మత్తు, మితిమీరిన వేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్, యూటర్న్ చేసుకునే ముందు ఇండికేట్ చేయకపోవడం, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే అధిక శాతం మృత్యువాత పడుతున్నారని విలేజ్ కమిటీ సర్వేలో తేలింది.గతేడాది ఉమ్మడి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు -
దుబాయ్ నుంచి స్వదేశానికి తీసుకెళ్లండి
లక్ష్మణచాంద: మండల కేంద్రానికి చెందిన సంగెం రాజు(32) బతుకుదెరువు కోసం గతేడాది దుబాయ్ వెళ్లాడు. అక్కడ అజ్మన్ ప్రాంతంలోని ఓ కంపెనీలో పని కుదిరాడు. గత రెండునెలల క్రితం అనారోగ్యం బారినపడ్డాడు. తనను ఇంటికి పంపించాలని కొన్ని రోజులుగా కంపెనీ వాళ్లకు మొరపెట్టుకున్నా కనికరించలేదు. ఈ విషయంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి చొరవ చూ పాలని సోషల్ మీడియా వేదికగా విన్నవించాడు. తనను స్వదేశానికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. కుటుంబ సభ్యులు.. రాజును స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, రాజుకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. -
బుగ్గగూడం శివారులో యువకుడు..
కాసిపేట: కాసిపేట పోలీస్స్టేషన్ పరిధి బుగ్గగూడం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాయిని రా జేష్(25) మృతిచెందినట్లు ఎస్సై ఆంజనేయులు తె లిపారు. ఆయన కథనం ప్రకారం.. కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం నాయకపుగూడ చింతపల్లికి చెందిన నాయిడి రాజేష్ అదేగ్రామానికి చెందిన చెదం నాగేశ్లు బైక్పై బుగ్గ దేవాలయం సమీపంలోని సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లి తిరిగివస్తున్నారు. నాగేశ్ బైక్ అతి వేగంగా, అజాగ్రత్తగా నడపడంతో గురువారం తెల్లవారుజాము బుగ్గగూడం శివారు డంపింగ్యార్డు వద్ద అదుపు తప్పి కిందపడ్డారు. వెనుక కూర్చున్న రాజేష్కు తీవ్ర గాయాలై ఘటన స్థలంలో మృతి చెందాడు. మృతుడి మేనమామ చేనేని రాజమల్లు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వైద్యం వికటించి యువతి మృతి
తాండూర్: మండల కేంద్రానికి చెందిన అక్కెపల్లి భాగ్యలక్ష్మి(24) వైద్యం వికటించి మృతిచెందింది. ప్రియుడే కారణమని ఆరోపిస్తూ మృతురాలి సోదరుడు అక్కెపల్లి కుమారస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. భాగ్యలక్ష్మి హైదరాబాద్ హయత్నగర్లోని బీసీ బాలికల గురుకులంలో నాలుగు నెలలుగా ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. తాండూర్కే చెందిన గట్టు జగదీష్ కొంతకాలంగా తన సోదరిని ప్రేమించానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తమకు తెలియకుండా హైదరాబాద్లో గర్భస్రావం చేయించేందుకు పలు రకాలుగా ప్రయత్నించాడని, సఫ లం కాకపోవడంతో కర్నూల్లోని ఓ ఆస్పత్రిలో బుధవారం గర్భస్రావానికి ప్రయత్నించగా తీవ్ర రక్తస్రావమై గురువారం చనిపోయిందని తెలిపారు. ఈ విషయం జగదీష్ తనకు ఫోన్ చేసి మీ సోదరి ఆరోగ్యం బాగా లేదని తన స్నేహితులతో కలిసి ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందిందని చెప్పాడని కుమారస్వామి తెలిపారు. తన సోదరి మృతికి జగదీష్ కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాండూర్ ఇన్చార్జి ఎస్సై సౌజన్య తెలిపారు. -
విదేశీ వద్దు.. స్వదేశీ ముద్దు
లక్ష్మణచాంద: విదేశీ వద్దు–స్వదేశీ ముద్దు అనే నినాదంతో ముందుకు సాగాలని నిర్మల్ జిల్లా సహ సంయోజక్ శివ పిలుపునిచ్చారు. ఈమేరకు సోన్ మండలం న్యూవెల్మల్ బొ ప్పారం గ్రామంలో, లక్ష్మణచాంద మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి స్వదేశీ జాగరణ మంచ్, స్వదేశీ పరుగు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్పై అమెరికా, చైనా, టర్కీ చేస్తున్న ఆర్థిక యుద్ధంపై విద్యార్థులకు, గ్రా మస్తులకు అవగాహన కల్పించారు. స్వదేశీ నినాదాన్ని ఒక జీవన విధానంగా అలవర్చుకుంటామని ఇప్పటి నుంచి స్వదేశీ వస్తువులనే వాడతామని, మన సంస్కృతి, సంప్రదాయాలు, మన వస్త్రాధారణ అన్నింటిలో స్వదేశీగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు లక్ష్మీనర్సయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
పంట చేల నుంచి ఇళ్లలోకి చొరబడి..
● అడవి పందిని హతమార్చిన గ్రామస్తులుతాంసి: మండల కేంద్రంలోని పంట చేల నుంచి అడవి పంది గురువారం ఇళ్లలోకి చొరబడింది. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. పలువురిపై దాడికి యత్నించింది. అప్రమత్తమైన గ్రామస్తులు కర్రలతో కొట్టి హతమార్చారు. రెండునెలల క్రితం గ్రామంలోకి వచ్చిన అడవిపంది ఒకరిని హతమార్చగా, మళ్లీ వరుసగా సంచరిస్తున్నాయి. అటవీ అధికారులు వెంటనే స్పందించి గ్రామంలోకి అడవి పందులు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తనిఖీల్లో నగదు పట్టివేత ఖానాపూర్: పట్టణంలోని ఇంద్రనగర్ శివారులో గురువారం ఎన్నికల లైన్ ప్రారంభ సర్వే బృందం (సర్వేలైన్ స్టార్ట్ టిక్ టీమ్) తనిఖీల్లో భాగంగా ద్విచక్రవాహనదారుడి నుంచి రూ.2,35,100 నగదు లభించాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఒగులాపూర్తండాకు చెందిన భుక్య రాజేందర్ చిట్టీ డబ్బులతో బైక్పై ఖానాపూర్ వస్తున్నాడు. టీం ఇన్చార్జి, ఇరిగేషన్ ఏఈఈ రాథోడ్ విఠల్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఆయన వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని విచారించారు. ఐదు టిప్పర్లు పట్టివేత బోథ్: మండలంలో ఎలాంటి అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మొరం తరలి స్తున్న ఐదు టిప్పర్ల లారీలను పోలీసులు బుధవారం రాత్రి మాటు వేసి పట్టుకున్నారు. మండలంలోని డేరా గ్రామ శివారులో పెద్దఎత్తున మొరం తవ్వకాలు చేసి తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఎస్సై పురుషోత్తం సిబ్బంది సాయికృష్ణ, శ్రీకాంత్, సుధాకర్తో కలిసి దాడులు నిర్వహించారు. మొరం లోడుతో వెళ్తున్న ఐదు టిప్పర్లను గుర్తించి సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. సదరు వాహన యాజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మిస్సింగ్ కేసు ఆసిఫాబాద్రూరల్: మండలంలోని చిలాటిగూడ గ్రామానికి చెందిన బోయిరే మహేశ్ (19) కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. సీఐ బాలాజీ వరప్రసాద్ కథనం ప్రకారం.. ఈనెల 23న మహేశ్ ఇంటి నుంచి ఆదిలాబాద్కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. కుటుంబీకులు సాయంత్రం ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. బంధువుల ఇళ్లలో, చుట్టూపక్కల వెతికిన ఆచూకీ దొరకలేదు. తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు గురువారం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
నేడు గూడెంలో సత్యదేవుడి కల్యాణం
దండేపల్లి: తెలంగాణ అన్నవరంగా పేరొందిన మండలంలోని గూడెం రమాసహిత సత్యనారాయణస్వామి ఆలయంలో ఈ నెల 27నుంచి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. శుక్రవారం సా యంత్రం సత్యనారాయణస్వామి–రమాదేవి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయాన్ని ముస్తాబు చేయడంతోపాటుగా రంగు రంగుల విద్యుత్ దీపాలు, పూలదండలతో అలంకరించారు. గుట్టపై ప్రధాన ఆలయం పక్కనున్న సామూహిక సత్యనారాయణ వ్రత మండపంలో కల్యాణ వేదిక ఏర్పాటు చేశారు. 10వేల మంది భక్తులకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామని, అధిక సంఖ్యలో హాజరై కల్యాణాన్ని తిలకించాలని ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ కోరారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా సప్తాహ భజన కార్యక్రమాలు గురువారం కొనసాగాయి. -
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
పాతమంచిర్యాల: జిల్లా ప్రధాన ఆస్పత్రి(జీజీహెచ్) క్యాజువాలిటీ విభాగంలో సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీజీహెచ్ పారా మెడికల్ జేఏసీ అధ్యక్షుడు నాందేవ్, ప్రధాన కార్యదర్శి రమేష్ అన్నారు. గురువారం సెక్యూరిటీ సిబ్బందిపై దాడిని నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై రోగుల బంధులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని, ఆస్పత్రి వద్ద నిరంతర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పారా మెడికల్ జేఏసీ ప్రధాన సలహాదారు ఆల్లాడి శ్రీనివాస్, కోశాధికారి శంకర్, మహిళా కార్యదర్శి పద్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
● గోదావరి తీరం భక్త జనసంద్రం ● వనదేవతలను దర్శించుకున్న మంత్రి వివేక్
దర్శనానికి బారులు తీరిన భక్తులుమంచిర్యాలఅర్బన్: మంచిర్యాలలోని గోదావరి తీరం భక్తజన సంద్రమైంది. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో శివసత్తులు, మహిళల పూనకాలు, భక్తుల హర్షధ్వానాల మధ్య జాతర నిర్వహించే సమీపంలోని చిలుకల గుట్టగా భావించే తల్లుల ఇల్లారి(గుడి) వద్ద సమ్మక్క గద్దెకు చేరింది. మేడారం నుంచి వచ్చిన గిరిజన పూజారి సతీష్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీరనారి ప్రతిరూపమైన కుంకుమ భరిణె(అమ్మవారు)ను అశేష జనవాహిని తరలి రాగా డప్పు చప్పుళ్లు, టపాసుల మోత మధ్య పోలీసు వలయంలో ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్టించారు. సమ్మక్క రాక నేపథ్యంలో భక్తులు దారి పొడవునా బారులు తీరారు. అంతకుముందు సమ్మక్క–సారలమ్మ జాతరలో భాగంగా గురువారం వేకువజామున ఏకలవ్య ఆశ్రమం సమీపంలోని కంకవనం వద్ద గిరిజన పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించి కంక వనాల(వెదురు కర్ర)ను డప్పు చప్పుళ్ల మధ్య జాతర జరిగే దేవతమూర్తి సమ్మక్క గద్దె వద్దకు తీసుకొచ్చి ప్రతిష్టించారు. గద్దెలపైన కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మ దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. సమ్మక్కను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు దంపతులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో ముక్త రవి పాల్గొన్నారు. జాతరకు పోటెత్తిన భక్తజనం రామకృష్ణాపూర్: సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ ఆర్కే1ఏ గని శివారులోని పాలవాగు వద్ద సమ్మక్క జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య గురువారం సాయంత్రం సమ్మక్కను గద్దెకు తీసుకొచ్చారు. మందమర్రికి చెందిన దూలం కనకయ్య ఇంటి నుంచి సమ్మక్కను ఊరేగింపుగా జాతర ప్రాంగణానికి తీసుకువచ్చి గిరిజన పూజారులు గద్దైపె ప్రతిష్టించారు. జాతర ప్రాంతం జనసంద్రమైంది. కార్మిక కుటంబాలతోపాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఎత్తు బెల్లాలను సమర్పించుకున్న భక్తులు పూనకాలతో ఊగిపోయారు. అమ్మవార్ల దీవెనలు అందరిపై ఉండాలి: మంత్రి వివేక్ సమ్మక్క–సారలమ్మల దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. ఆర్కే1ఏ గని పాలవాగు వద్ద సమ్మక్క జాతరకు గురువారం రాత్రి ఆయన హాజరై మొక్కులు చెల్లించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఎస్ఓటు జీఎం జీఎల్ ప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆయా యూనియన్లు, రాజకీయ పార్టీల నాయకులు వేర్వేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
లక్సెట్టిపేట/బెల్లంపల్లి: ప్రతి ఒక్కరూ ఎన్ని కల నియమావళి పాటించాలని, సమయం ముగిసిన తర్వాత నామినేషన్లు తీసుకోవద్దని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం లక్సెట్టిపేట, బెల్లంపల్లిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, ఎన్నికల పరిశీలకులు గంగాధర్ వేర్వేరుగా పరిశీలించారు. అభ్యర్థులకు దరఖాస్తు ఫారాలను పరిశీలించి తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తెలియజేయాలని అన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న హెల్ప్ డెస్క్ సిబ్బంది అభ్యర్థులకు తలెత్తే అనుమానాలను నివృత్తి చేసి సహాయ పడాలని సూచించారు. నామినేషన్ పత్రం పూర్తి చేయడానికి అభ్యర్థులు ఇబ్బందులు పడుతుంటారని, అలాంటి వారికి సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్సెట్టిపేట తహసీల్దార్ దిలీప్కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్కుమార్, ఎంపీడీవో సరోజ, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ సంపత్ పాల్గొన్నారు. జాతరలో అడుగడుగునా నిఘా మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో సమ్మక్క జాతరలో పోలీసులు అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. జాతర జరిగే ప్రాంతం, భక్తులు బస చేసే ప్రాంతాలు పూర్తిగా పోలీసుల భద్రత వలయంలో ఉన్నాయి. 20 అధునాతన కెమెరాలు, సుమారు ఐదు వందల మీటర్ల దూరం నుంచి రికార్డు అయ్యే సామర్థ్యం కలిగిన కెమెరాలు అమర్చారు. వెయ్యి మంది పోలీస్ సిబ్బందితోపాటు మిమ్స్, సీవీ రామన్ డిగ్రీ కళాశాల ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వంద మంది బందోబస్తులో పాల్గొంటున్నారు. 24గంటలు కమాండ్ కంట్రోల్ రూమ్లో సీఐ స్థాయి అధికారి జాతర ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. -
మైసమ్మ జాతరకు సర్వం సిద్ధం
రామకృష్ణాపూర్: గిరిజనుల ఆరాధ్య దైవం మైసమ్మ తల్లి జాతర నేడు శుక్రవారం నుంచి ప్రారంభకానుంది. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులోని గాంధారి ఖిల్లాలో సర్వం సిద్ధమైంది. చారిత్రాత్మక ప్రాంతం, ఎంతో ప్రాశాస్త్యమున్న ఖిల్లా కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. జాతర జరిగే ఖిల్లా ప్రాంతానికి భక్తులు ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం విద్యుత్, నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, షామియానాలు తదితర ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాతోపాటు ఇరుగు పొరుగు జిల్లాల నుంచి కూడా గిరిజనులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 600 ఏళ్ల క్రితం వెలుగొందిన ఖిల్లా... సుమారు 600 ఏళ్ల పూర్వం కాకతీయుల సామంతులుగా పిలువబడే ఒడ్డెరాజుల కాలంలో గాంధారి ఖిల్లా వెలుగొందినట్లు చరిత్ర చెబుతోంది. ఒడ్డెరాజుల కాలంలో నిర్మించిన ఈ ఖిల్లా అప్పటి వారి కళా నైపుణ్యానికి అద్దం పడుతోంది. ఖిల్లాలో నాగశేషుడి విగ్రహం, శివుడు, విఘ్నేశ్వరుడు, ఆంజనేయుడు, కాలభైరవుని విగ్రహాలతోపాటు దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. ఖిల్లా పై భాగంలో శత్రువుల రాకను పసిగట్టేందుకు నగారా గుండు నిర్మించారు. కొండను తొలిచి నిర్మించిన నాగశేషుడి ఆలయం ఆకట్టుకుంటుంది. దిగువ భాగంలో సహజసిద్ధంగా ఉండే ఊటచెలిమెకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నీళ్లు ఎప్పటికీ ఇంకిపోకుండా పైకి తేలుతుంటాయి. గుట్టపై నిర్మించిన కోటలో అనేక కళారూపాలు, శిలాసంపద, విగ్రహాలు ఉండడంతో జాతరకు హాజరయ్యే భక్తులతోపాటు ఖిల్లాను తిలకించేందుకు వచ్చే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. కార్యక్రమాలు ఇలా.. జాతరలో భాగంగా మొదటి రోజు శుక్రవారం దేవతామూర్తులను సదర్భీమన్న నుంచి సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి గంగ స్నానానికి తరలిస్తారు. గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, పిల్లన గ్రోవి వాయిద్యాలు, డప్పుచప్పుళ్ల నడుమ మంచిర్యాలలోని గోదావరికి వెళ్లి అదే రోజు సాయంత్రం తిరిగి సదర్భీమన్న వద్దకు దేవతామూర్తులను తీసుకువస్తారు. రాత్రి ఆటపాటలతో గడిపి మరుసటి రోజు శనివారం జాతర జరిగే ఖిల్లా ప్రాంతానికి దేవతామూర్తులను తరలిస్తారు. రాత్రి మరోసారి ఆటపాటలు, ఆదివాసీ నాయక్పోడ్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆదివారం తెల్లవారుజామున గాంధారి ఖిల్లా పైభాగంలో ఉన్న మైసమ్మ తల్లి వద్ద పట్నాలు వేసి, నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం జీడికోటలో దర్బార్(సభ) నిర్వహించి అందులో గిరిజనుల సాంస్కృతిక తీరుతెన్నులు, వనదేవతలను పూజించడంలో విశిష్టత, గాంధారి ఖిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు. మూడు రోజులపాటు జరిగే జాతరలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన, నాయక్పోడ్ సంఘాల నాయకులు పాల్గొననున్నారు. -
జోరుగా నామినేషన్లు
రెండ్రోజుల్లో 374 నస్పూర్: జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్, చెన్నూర్, లక్సెట్టిపేట, క్యాతనపల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో రెండ్రోజుల్లో 374 నామినేషన్లు దాఖలయ్యాయి. కలెక్టరేట్లోని మంచిర్యాల కార్పొరేషన్ నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం సందర్శించారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లకు 186, బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 34 వార్డులకు 97, చెన్నూర్లో 18 వార్డులకు 29, క్యాతనపల్లిలో 22 వార్డులకు 32, లక్సెట్టిపేటలో 15 వార్డులకు 30 నామినేషన్లు వచ్చాయి. జిల్లాలో మొత్తం 149 వార్డులకు 374 నామినేషన్లు దాఖలు అయ్యాయి.లక్సెట్టిపేటలో అధికారులకు నామినేషన్ పత్రం అందజేస్తున్న అభ్యర్థిసాక్షి ప్రతినిధి మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు జోరందుకున్నాయి. ఈ నెల 28న స్వీకరణ ప్రారంభం కాగా.. రెండో రోజు గురువారం భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. మంచిర్యాల కార్పొరేషన్, బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్సెట్టిపేటలో భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం ఐదు గంటల వరకే అనుమతిస్తారు. నామినేషన్ల దాఖలుకు సమయం పడితే వరుసలో ఉన్న వారందరికీ నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తారు. అధికార కాంగ్రెస్ పార్టీ మొదలు బీఆర్ఎస్, బీజేపీలో పలు చోట్ల అభ్యర్థులకు టికెట్ల ఖరారులో జాప్యం జరగడంతో పోటీపై మల్లగుల్లాలు పడ్డారు. చివరగా పార్టీ బీ ఫాం సమర్పణకు మరో రోజు గడువు ఉండడంతో ఆయా డివిజన్లు, వార్డుల్లో నామినేషన్లు వేస్తున్నారు. బకాయిలు ఉన్న ఇంటి, నల్లా పన్నులు కడుతూ నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకుంటూ పోటీకి నిలబడ్డారు. ఇక కొందరు పోటీ అధికంగా ఉన్న చోట్ల రెండు వార్డుల్లోనూ నామినేషన్లు వేస్తున్నారు. బీ ఫాం దక్కిన చోట పోటీకి నిలబడే అవకాశం ఉంది. దీంతో ఒక్కో అభ్యర్థి రెండు, మూడు సెట్ల చొప్పున దాఖలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో 60డివిజన్లలో ఓ కొలిక్కి వచ్చాయి. టికెట్లు దక్కని వారు కొందరు రెబల్స్గా వేసేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు ఇతర పార్టీల్లోకి మారి నామినేషన్లు వేస్తున్నారు. కొనసాగుతున్న ప్రక్రియ నస్పూర్/చెన్నూర్/లక్సెట్టిపేట/బెల్లంపల్లి: మంచిర్యాల కార్పొరేషన్లో నామినేషన్ల స్వీకరణ రెండో రోజు గురువారం కొనసాగింది. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. 60 డివిజన్లకు గాను మొదటి రోజు 20 నామినేషన్లు రాగా.. రెండో రోజు 166 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తంగా నామినేషన్ల సంఖ్య 186కు చేరింది. -
విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి
నస్పూర్: జిల్లాలో 5వ తరగతి నుంచి 10వ తరగతి షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం వివరాలు నమోదు చేయాలని అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. గురువారం ఆయన నస్పూర్ కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు దుర్గాప్రసాద్, జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతితో కలిసి ఎంఈఓలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతిగృహ సంక్షేమాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్భంగా 100శాతం ఉపకార వేతనాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. రాజీవ్ విద్యాదీవెన పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అర్హులైన విద్యార్థులకు రూ.3500 చొప్పున ఖాతాల్లో జమ చేస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి బాలికలకు ఒక్కొరికి రూ.1500, బాలురకు రూ.1000 చొప్పున జమ చేస్తారని తెలిపారు. వివరాలు htpp:// telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. -
కడుపు నొప్పి భరించలేక ఒకరు ఆత్మహత్య
వాంకిడి: కడుపు నొప్పి భరించలేక ఒకరు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలం లెండిగూడ గ్రామానికి చెందిన వడై నివృత్తి(28) గత కొంత కాలంగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం హైదరాబాద్, చంద్రపూర్ ఆస్పత్రుల్లో రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినా నయం కాలేదు. మూడు రోజులుగా నొప్పి పెరగడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో బైక్పై చేనుకు వెళ్లి పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని బంధువులకు సమాచారం అందించాడు. వారు చేనుకు వెళ్లి అతడిని ఇంటికి తీసుకువస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఇంటి స్థలం విషయంలో దాడి
లక్ష్మణచాంద: ఇంటి స్థలం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఒకరు గాయపడ్డారు. ఎస్సై శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సల్కం పోశెట్టి పదేళ్ల కిందట ఇదే గ్రామానికి చెందిన దుర్గన్నకు ఇంటి స్థలం విక్రయించాడు. మంగళవారం తాను కొనుగోలు చేసిన స్థలాన్ని దుర్గన్న చదును చేస్తున్నాడు. కాగా, తాను అమ్మిన స్థలానికంటే ఎక్కువ విస్తీర్ణంలో చదును చేస్తున్నావని పోశెట్టి గొడవకు దిగాడు. ఈక్రమంలో పోశెట్టిపై దుర్గన్నతోపాటు అజయ్ దాడి చేశారు. దీంతో పోశెట్టికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స కోసం అతడిని 108లో నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. పోశెట్టి కుమార్తె కావ్య ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆటల ఆధారిత బోధనతో పిల్లల సమగ్రాభివృద్ధి
ఆదిలాబాద్టౌన్: బొమ్మలు, ఆటల ఆధారిత బోధనతో పిల్లల సమగ్రాభివృద్ధి చెందుతారని పీఎంశ్రీ పాఠశాలల శిక్షణ రిసోర్స్పర్సన్ మా దరి ఎల్లన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ డైట్ కళాశాలలో ఉమ్మడి జిల్లా పరిధిలోని పీఎంశ్రీ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొమ్మలు, ఆటలను ఉపయోగించి బోధిస్తే పిల్లల సమగ్ర నైపుణ్యాలు, అభిజ్ఞ, శారీరక, సామాజిక, భావోద్వేగాభివృద్ధి చెందుతాయని తెలి పారు. తెలుగు, ఆంగ్లం, గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో అన్వేషణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నేర్చుకున్నది ఆటల ద్వారా అనుభవంగా మారడంతో పట్టు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డైట్ కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ హై, వైస్ప్రిన్సిపాల్ కిరణ్కుమార్, రిసోర్స్పర్సన్లు సురేశ్, విజయ్, వెంకటేశ్, నాందేవ్ తదితరులు పాల్గొన్నారు -
సమ్మె విజయవంతం చేయండి
నస్పూర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని హెచ్ఎంఎస్ జనరల్ సెక్రెటరీ రియాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన అధ్యక్షుడు తిప్పారపు సారయ్యతో కలిసి కొత్తగూడెంలోని కార్యాలయంలో కార్పొరేట్ జీఎం పర్సనల్ కవితానాయుడుకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తగూడెం వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, శ్రీరాంపూర్ ఏరియా కార్యదర్శి అశోక్, నాయకులు శ్రీనివాస్ పూర్ణ చందర్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
రిమ్స్లో క్రిటికల్ కేర్ సేవలు ప్రారంభం
ఆదిలాబాద్టౌన్: రిమ్స్లో క్రిటికిల్ కేర్ సేవలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. శ్రీసాక్షిశ్రీలో ఇటీవల ప్రచురితమైన కథనానికి డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ స్పందించారు. శ్రీఒక్క రోజు ఆర్బాటంశ్రీ శీర్షికన గత శనివారం కథనం ప్రచురితమైంది. రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ విభాగాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా సేవలు మాత్రం ప్రారంభం కాలేదని అందులో ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం క్రిటికల్ కేర్లో ఆర్థోపెడిక్ ఓపీ సేవలను ప్రారంభించారు. దశలవారీగా మిగతా విభాగాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వివరించారు. -
జాతరే చివరి యాత్ర
కౌటాల: అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు మేడారం మహాజాతరకు బయల్దేరిన తల్లీకుమార్తెకు అదే చివరి యాత్రగా మిగిలింది. ఊహించని ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన కస్తూరి రమేశ్, అతడి భార్య సునీత(45), వారి ఏకై క కుమార్తె అక్షిత(21)తోపాటు అదే గ్రామానికి చెందిన కస్తూరి లక్ష్మి, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు మనవరాళ్లు ఎనిమిది మంది ఈ నెల 26న మంచిర్యాల జిల్లా చెన్నూర్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి బంధువులతో కలిసి ట్రాక్టర్లో మొత్తం 25 మంది మంగళవారం జాతరకు బయల్దేరారు. మంగళవారం రాత్రి భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి– కేశవాపూర్ అటవీ ప్రాంతంలో ట్రాక్టర్ను రహదారి కిందకు దించి మళ్లీ ఎక్కించే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లీకుమార్తెలు సునీత, అక్షిత ట్రాలీ కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. రమేశ్ ఎడమ కాలు, కస్తూరి లక్ష్మి కుడి చేయి విరిగింది. మిగిలినవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ముత్తంపేటలో విషాదం.. రమేశ్, సునీత కూలీ పని చేస్తూ వారి ఏకై క కుమార్తె అక్షితను హైదరబాద్లో డీఈడీ మొదటి సంవత్సరం చదివిస్తున్నారు. తల్లీకుమార్తెల మృతితో ముత్తంపేట గ్రామంలో విషాదం నెలకొంది. భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అనంతరం బుధవారం సాయంత్రం ము త్తంపేటకు తరలించారు. జాతరకు వెళ్లి తల్లీకుమార్తెలు అనంతలోకాలకు వెళ్లడంతో బంధువులు బోరు న విలపించారు. కళ్లెదుటే కట్టుకున్న భార్య, అల్లారుముద్దుగా పెంచిన కుమార్తె చనిపోవడంతో రమేశ్ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మృతదేహాలకు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాళులర్పించారు. అనంతరం అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. కాగజ్నగర్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్న రమేశ్ను ఎమ్మెల్సీ దండె విఠల్ పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. -
ఎస్బీఐలో రైతు డబ్బులు చోరీ
బాసర: బాసరలోని ఎస్ బీఐలో ఓ రైతు విత్డ్రా చేసుకున్న రూ.50వేలను గుర్తు తెలియని మహిళ అపహరించింది. ఎస్సై నవనీత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దొడపూర్ గ్రామానికి చెందిన దత్తారం సాంబాజీ అనే రైతు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఎస్బీఐకి వచ్చాడు. మొదట రూ.50వేలు విత్ డ్రా చేసుకున్నాడు. మరోసారి డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు క్యూలైన్లో నిల్చోగా అతడి వద్ద ఉన్న రూ.50వేలను బురఖాలో ఉన్న గుర్తు తెలియని మహిళ అపహరించినట్లు బాధితుడు తెలిపాడు. వెంటనే బ్యాంక్ మేనేజర్ అశోక్కుమార్తో కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బ్యాంక్కు చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ సారు మాకొద్దు..భీమిని: కన్నెపల్లి మండలంలోని పోలంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కె.రాజు బుధవారం అదే గ్రామంలోని ఓ బెల్ట్షాపులో మద్యం సేవిస్తుండగా గ్రామస్తులు నిలదీశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయుడే పట్టపగలు తప్పతాగి పాఠశాలకు వస్తే ఎలా అని మండిపడ్డారు. గతంలో సైతం పలుమార్లు మద్యం మత్తులో పాఠశాలకు వచ్చాడని వారు పేర్కొన్నారు. మధ్యాహ్నమే ఉపాధ్యాయుడు పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులంతా కలిసి ఈసారు మాకొద్దు అంటూ ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎంఈఓ రామును వివరణ కోరగా విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని, తదుపరి ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
జాతరెళ్తున్నారా.. జాగ్రత్త!
మంచిర్యాలక్రైం: సమ్మక్క, సారలమ్మ జాతర వేళ ప్రజలు నాలుగు రోజుల పాటు మేడారం వెళ్తుంటా రు. ఇదే అదనుగా భావించిన దొంగల ముఠా తా ళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తోంది. పట్టణ ప్రధాన కేంద్రాల్లో, పల్లెల్లో బస్టాండ్, బ్యాంకుల వద్ద ప్రజ లు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కాపు కాసుకుని ఉన్న ‘అటెన్షన్ డైవర్షన్’ ముఠాలు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీ, హరియాణా, యూపీ, బిహార్ రా ష్ట్రాలకు చెందిన పార్థి గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్ ముఠాగా ఏర్పడి చోరీలు, దారి దోపిడీలకు పాల్పడుతుంటారు. ముఠా సభ్యుల్లో కొందరు రాత్రి, మరికొందరు పగలు రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లలో రాత్రి చోరీలకు పాల్పడుతారు. జనసంచారం ఉండే ప్రాంతాల్లో ప్రజల్లో కలిసిపోయి మాయచేసి రెప్పపాటు సమయంలో సొత్తు మాయం చేస్తారు. చైన్ స్నాచింగ్, పర్స్లు, సెల్ఫోన్లు, బ్యాగులు కొట్టేసేందుకు యత్నిస్తుంటారు. ఏటీఎం సెంటర్కు వచ్చే వృద్ధులు, నిరక్షరాస్యులు, అమాయకులకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తారు. ఈ నెల 28, 29, 30, 31 తేదీలలో సమ్మక్క జాతర నేపథ్యంలో మేడారం వెళ్లే భక్తులు బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన సామగ్రి ఇంట్లో ఉంచకుండా తెలిసినవారి ఇంట్లో లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని, ప్రతిఒక్కరూ తమ ఇంటి వద్ద ఎల్హెచ్ఎస్(లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నిఘా నీడలో జాతర... మంచిర్యాలలో సమ్మక్క, సారలమ్మ జాతర పూర్తిస్థాయిలో నిఘా నీడలో జరుగుతోంది. 20 అధునాతనమైన సీసీ కెమెరాలు, వెయ్యి మంది భద్రత సిబ్బంది, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఓ పోలీస్ అధికారి మానిటరింగ్ చేయనున్నారు. విలువైన వస్తువులు ఇంట్లో ఉంచవద్దు జాతరకు వెళ్లే వారు బంగారు అభరణాలు, విలువైన వస్తువులు, నగదు ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. ప్రయాణాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే పానీయాలు, ఆహారం తీసుకోవద్దు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే డయల్ 100 లేదా జాతర సమీపంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో ఫిర్యాదు చేయాలి. – అంబర్ కిషోర్ఝా, రామగుండం పోలీస్ కమిషనర్ -
గడ్డంగూడ గుడిసెల తొలగింపు
జన్నారం: జన్నారం రేంజ్ పరిధిలోని గడ్డంగూడలో గిరిజనులు, గిరిజనేతరులు అక్రమంగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటుండగా.. బుధవారం అటవీశాఖ అధికారులు తొలగించారు. ఎఫ్డీవో రామ్మోహన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అటవీ సిబ్బంది, డివిజన్లోని ఇందన్పల్లి, జన్నారం, తాళ్లపేట్ రేంజ్ అధికారులు లక్ష్మీనారాయణ, సుష్మారావు, కే.లక్ష్మీనారాయణ, సిబ్బంది మూకుమ్మడిగా జేసీబీలతో తెల్లవారు జామున ఐదు గంటలకు గుడిసెలను కూల్చివేశారు. అటవీ భూమి చుట్టూ కంచెలు తవ్వించారు. గుడిసెలు వేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎఫ్డీవో రామ్మోహన్ మాట్లాడుతూ అటవీ భూమిలో అక్రమంగా గుడిసెలు వేసుకోవడం చట్టవిరుద్ధమని, మరోసారి గుడిసెలు వేసుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుడిసెలు వేసుకోవడానికి కారణమైన బలరామ్పై అరెస్ట్ వారెంట్ ఉందని, తప్పించుకుని తిరుగుతున్నాడని పేర్కొన్నారు. -
జంపన్నవాగులో భీమారం వాసి మృతి
భీమారం: మేడారం సమ్మక్క జాతరకు వెళ్లిన భీ మారం మండల కేంద్రానికి చెందిన కొమ్ము శ్రీ ని వాస్(54) బుధవారం జంపన్నవాగులో మునిగి మృతిచెందాడు. దీంతో భీమారంలో విషాదం నెలకొంది. మంగళవారం రాత్రి శ్రీనివాస్తోపాటు అత ని సోదరుని కుటుంబాలు కలిసి ఆటోరిక్షాలో మంచిర్యాల వరకు వెళ్లి అక్కడ నుంచి మేడారం వెళ్లారు. సమ్మక్క దర్శనానికి ముందు జంపన్న వాగులో పు ణ్య స్నానానికి వెళ్లిన శ్రీనివాస్ అందులోనే మునిగి చనిపోయాడు. నాలుగు రోజు ల క్రితమే మేడారం వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాడని అతడి స్నే హితులు తెలిపారు. మరోసారి కుటుంబంతో వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. శ్రీనివాస్ మండల కాంగ్రెస్ నాయకుడిగా చురుగ్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య లక్ష్మి, కుమారులు వినయ్, హరీష్ ఉన్నారు. -
సింగరేణి ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి
ఆసిఫాబాద్అర్బన్/నస్పూర్: సింగరేణి ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. బుధవారం న్యూఢిల్లీలోని సింగరేణి భవన్ నుంచి దేశంలో కోల్మైన్స్ ఉన్న జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, కోల్మైన్స్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్లోజర్ మైన్స్– 2025లో భాగంగా సామాజిక అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ క్లోజర్ మైన్స్– 2025 కార్యక్రమంలో భాగంగా సింగరేణి సంస్థ 25 శాతం నిధులతో సామాజిక బాధ్యతలో భాగంగా సమీప గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఆ దిశగా కలెక్టర్లు, సింగరేణి అధికారుల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్, బోరుబావులు, పారిశుద్ధ్య పనులు, మురుగు కాలువల నిర్మాణం, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో వసతులు, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి పనులు చేపట్టాలన్నారు. ఆసిఫాబాద్లోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్, బెల్లంపల్లి ఏరియా సింగరేణి జీఎం విజయభాస్కర్, పర్యావరణ అధికారి హరీశ్, జూనియర్ ఎస్టేట్ అధికారి రజనీకాంత్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. మంచిర్యాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ సామాజిక అభివృద్ధి కింద జిల్లాకు రూ.115 కోట్లు కేటాయించారని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, గనులు భూగర్భ శాఖ ఏడీ జగన్ మోహన్, శ్రీరాంపూర్ ఏరియా ఇన్చార్జి జీఎం వెంకటేశ్వర్లు, ఎస్టేట్స్ మేనేజర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో పురుగుల మందు తాగి..
వాంకిడి: మద్యం తాగడం మానేయాలని మందలించినందుకు మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలంలోని ధాబా గ్రామానికి చెందిన కు డ్మెత రాంశావు(56) కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 26న సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి వచ్చి అతడిని భార్య సురేఖ బాయి మందలించింది. అనంతరం రాంశావు కంది చేనుకు వెళ్లొస్తానని ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చాక వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు వాంకిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథ మ చికిత్స అనంతరం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినా ఆరోగ్యం కుదుటపడలేదు. మళ్లీ మంగళవారం మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రాత్రి 9 గంటలకు మృతి చెందాడు. మృతుడి భార్య సురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
యువకుడి ప్రాణాలు కాపాడిన ఎస్సై
దిలావర్పూర్: మండలంలోని సిర్గాపూర్ గ్రామ సమీపంలో నిర్మల్–భైంసా రహదారిని ఆనుకుని ఉన్న కుంటలో దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని ఎస్సై రవీందర్ కాపాడారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సిర్గాపూర్ కుంటలో మునిగి తేలుతూ కనిపించిన గుర్తుతెలి యని వ్యక్తిని స్థానికులు గుర్తించి పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఎస్సై ఘటనాస్థలికి చేరుకుని స దరు యువకుడిని కుంటలోనుంచి బయటకు తీశా రు. యువకుడి ద్వారా వివరాలు తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లా వేంపల్లికి చెందిన కుటుంబం రెండుమూడు రోజులుగా సిర్గాపూర్ గ్రామ బస్టాండ్ ప్రాంతంలో ఉంటుందని ఎస్సై తెలిపారు. వీరంతా గ్రామాల్లో యాచిస్తారని పేర్కొన్నారు. సదరు కుటుంబానికి చెందిన ఫారూఖ్ తన తల్లిదండ్రులతో వివాదం పెట్టుకుని కుంటలోకి దూకినట్లు తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు సదరు యువకుడిని కాపాడినట్లు పేర్కొన్నారు. అతడితోపాటు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేసి వారి స్వస్థలానికి పంపినట్లు తెలిపారు. -
క్యాతనపల్లిలో అన్ని స్థానాల్లో సీపీఐ పోటీ
రామకృష్ణాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో క్యాతనపల్లిలో అన్ని స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐకి పొత్తు ఉందని, అయితే ఇక్కడ మిత్రధర్మాన్ని విస్మరిస్తే కలిసి వచ్చే సెక్యులర్ పార్టీలతో ముందుకు వెళ్తామని అన్నారు. అన్ని వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు పార్టీ అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మిట్టపెల్లి శ్రీనివాస్, పౌల్, వనం సత్యం, రాజేశం పాల్గొన్నారు. -
బల్దియాలకు ఎన్నికల ఆదాయం
మంచిర్యాలటౌన్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలోని మున్సిపాల్టీల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు తప్పనిసరిగా నో డ్యూ సర్టిఫికేట్ మున్సిపాల్టీల నుంచి పొందాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఉంటేనే నామినేషన్ స్వీకరిస్తారు. అభ్యర్థులను ఒకరు బలపర్చాలి, ఇద్దరు సాక్షులు ఉండాలి. కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులు ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు ఉండరాదనే నిబంధనలు ఉన్నాయి. ఇందుకోసం వారి పేరిట ఉన్న ఆస్తి పన్ను, నల్లా బిల్లు, ఇతరత్రా పన్నులు చెల్లించేందుకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, క్యాతనపల్లి మున్సిపాల్టీల్లో బారులు తీరుతున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద కూడా అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. అన్ని పన్నులు చెల్లించాక కూడా నో డ్యూ సర్టిఫికేట్ కోసం కార్పొరేషన్లో రూ.2 వేలు, మున్సిపాలిటీల్లో రూ.1,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది. రిజర్వుడ్ స్థానాల్లో అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని తహసీల్దార్ కార్యాలయాల్లో ఎదురు చూస్తున్నారు. అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు ఖాతా కలిగి ఉండాలనే నిబంధన నేపథ్యంలో ఖాతాలు తెరుస్తున్నారు. మంచిర్యాల నగర పాలక సంస్థ కార్యాలయం బుధవారం అభ్యర్థులు, బలపర్చే వారితో కోలాహలంగా మారింది. ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లించేందుకు తరలి వచ్చారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు ఏమేం అవసరం ఉంటాయనే సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అర్హతలు, ధ్రువీకరణ పత్రాల వివరాలు వంటివి తెలుసుకున్నారు.రికార్డు స్థాయిలో వసూళ్లు చెన్నూర్: చెన్నూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో పన్నుల రూపంలో రూ.1,30,821 వసూలైంది. గత వారం రోజుల నుంచి రూ.2,47,803 రాగా.. మున్సిపాలిటీకి మొత్తం రూ.3,78,624 ఆదాయం వచ్చిందని కమిషనర్ మురళికృష్ణ తెలిపారు. -
నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలి
నస్పూర్/బెల్లంపల్లి/చెన్నూర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్, బెల్లంపల్లి, చెన్నూర్లోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించారు. బెల్లంపల్లిలో నామినేషన్ పత్రాలు తీసుకెళ్లడానికి వచ్చిన అభ్యర్థులతో మాట్లాడి ఎన్నికల నియమావళిపై వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై కలెక్టరేట్లోని కంట్రోల్ రూం నంబరు 08736–250501లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 31న నామినేషన్లు పరిశీలించి అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని, ఫిబ్రవరి 1న నామినేషన్లపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ, 2న పరిష్కారం, 3న నామినేషన్ల ఉపసంహరణ, బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమాల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, డీఆర్డీఏ కిషన్, మున్సిపల్ కమిషనర్లు జే.సంపత్, మురళికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
● మున్సిపల్ ఎన్నికల్లో పైసలతోనే పని! ● అభ్యర్థుల ఎంపిక నుంచి పోటీ దాక ● జిల్లా కేంద్రం సహా, అన్ని చోట్ల ఇదే తీరు ● రూ.లక్షలు సిద్ధం చేసుకున్న అభ్యర్థులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో పైసల ప్రాతిపదికనే రాజకీయ నడుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చు చేసే స్థాయి ఉందా..? లేదా..? అని బేరీజు వేసుకుంటూ ఎంపిక చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. డివిజన్, వార్డుల్లో సర్వేలు నిర్వహించినప్పటికీ అంతిమంగా డబ్బులే ప్రధానంగా మారాయి. ఇప్పటికే జిల్లా కేంద్రం మంచిర్యాల కార్పొరేషన్తోసహా బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపికలో డబ్బే కొలమానంగా సాగుతోంది. కొన్ని చోట్ల ఏళ్లు కష్టపడిన నాయకులు, కార్యకర్తలు ఉన్నప్పటికీ సర్వేల్లో పనితీరు మెరుగ్గా లేదని పక్కకు పెడుతున్నారు. రిజర్వేషన్లు కలిసొచ్చినా, కోరుకున్న డివిజన్లో టికెట్ రాకపోవడంతో మరో చోట నుంచి పోటీకి దిగాల్సి వస్తోంది. దీంతో ఇన్నాళ్లుగా తాము కష్టపడిన చోట కాకుండా వేరే చోట పోటీ చేస్తే ఓట్లు వస్తాయా? రావా? అనే తర్జన భర్జన పడుతున్నారు. జిల్లా కేంద్రంలో పలు డివిజన్లలో ఈ పరిస్థితి అధికంగా ఏర్పడింది. కార్పొరేషన్లో శ్రీమంతులకే.. జిల్లా కేంద్రం కార్పొరేషన్ పరిధి కావడంతో ఖర్చుతో కూడుకున్నది. కార్పొరేటర్గా పోటీ చేయాలంటే అభ్యర్థులకు రూ.30నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో ఒక్కో డివిజన్ నుంచి కనీసం 2500 నుంచి అత్యధికంగా 4వేల మంది వరకు ఓటర్లు ఉన్నారు. పోలింగ్ సమయంలో ఓటర్లకు డబ్బులు, మద్యం తదితరాలకే భారీగా రూ.లక్షల్లో ఖర్చు చేసే అవకాశం ఉంది. దీంతో మొదట ప్రచారం వరకు ఉన్నంతలో సొంత వనరులు వాడుకుంటున్నారు. ఇక కొందరు స్థిరాస్తులను అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. ఇక డివిజన్లలో టికెట్ కోసం నాయకుల నుంచి పోటీ ఉన్న చోట్ల టికెట్ దక్కిన వారు అసమ్మతిని బుజ్జగించేందుకు ఎంతో కొంత మొత్తంలో ఇవ్వాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మేయర్ స్థానం ఆశిస్తున్న వారు ఈ ఖర్చు రూ.కోట్లకు చేరుతోంది. దీంతో ఈసారి ఎన్నికల్లో సగానికిపైగా డివిజన్లలో రియల్టర్లు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఆర్ఎంపీ తదితరులు పోటీలో ఉన్నారు. ఖర్చుల కోసం ఆస్తులు తాకట్టు ఖర్చుల కోసం కొందరు అభ్యర్థులు ఆస్తులను తెలిసిన వారి వద్ద తాకట్టు పెట్టి రూ.లక్షల్లో అప్పు తెచ్చుకుంటున్నారు. నెల నుంచి ఆరు నెలల గడువుతో చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు. భూములు, నివాస స్థలాలు, బంగారం కుదువ పెడుతున్నారు. కొందరైతే ప్రైవేటు ఫైనాన్స్లో లోన్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక పోలింగ్ నాటికి డబ్బు కోసం ఇప్పటి నుంచే సర్దుకుంటున్నారు. టికెట్ తెచ్చుకోవడం ఒక ఎత్తయితే పోటీలో నిలబడి గెలవడం మరో ఎత్తుగా మారింది.అసమ్మతిపై బుజ్జగింపులుఅధికార పార్టీలో టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల అసమ్మతి నాయకులను బుజ్జగింపులు చేస్తున్నారు. మహిళా స్థానాలతో సహా జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ చోట్ల పోటీ నెలకొంది. అధికార పార్టీతో పోలిస్తే బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు సులువుగానే అభ్యర్థులు ఖరారయ్యారు. దీంతో నామినేషన్లు వేసేందుకు పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక బీజేపీ జిల్లా కేంద్రంలో కొన్ని చోట్ల మినహా అన్ని చోట్ల అభ్యర్థులు సిద్ధమయ్యారు. లక్సెట్టిపేట, చెన్నూరు, క్యాతనపల్లి, బెల్లంపల్లిలో వార్డుల్లో సరైన నాయకుల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. కొందరు టికెట్లు రావని తెలిసీ బీ ఫాం సమర్పించే వరకు వేచి చూసి ప్రతిపక్ష పార్టీలోకి జంప్ అవుదామనే ఆలోచనలు చేస్తున్నారు. -
పంచాయతీ నుంచి కార్పొరేషన్
మంచిర్యాలటౌన్: ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న మంచిర్యాల 73ఏళ్ల తర్వాత గత ఏడాది జనవరి 27న కార్పొరేషన్గా అవతరించింది. రైల్వే సౌకర్యం ఉండడం, సిమెంటు కంపెనీ ఏర్పాటు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండడం, ఇతర ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడడం వల్ల జనాభా పెరుగుతూ శరవేగంగా అభివృద్ధి చెందింది. 1952లో 1500 జనాభాతో ఉన్న గ్రామ పంచాయతీని గ్రేడ్–3 మున్సిపాల్టీగా ప్రభుత్వం మార్చింది. మొదటిసారిగా మున్సిపాల్టీకి 1956లో ఎన్నికలు నిర్వహించారు. 1984లో మండల కేంద్రంగా, 1992లో రెవెన్యూ డివిజన్గా, 2016లో జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందింది. గ్రేడ్–3 మున్సిపాల్టీగా ఉండగా 2004లో గ్రేడ్–1 స్థాయికి చేరింది. ప్రస్తుతం మంచిర్యాల కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా.. 2.50లక్షల మంది జనాభా, 601,81,778 మంది ఓటర్లు ఉన్నారు. 12మంది చైర్పర్సన్లు మున్సిపాల్టీగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ప్రజాసోషలిస్టు పార్టీ నుంచి కేవీ.రమణయ్య చైర్మన్గా ఎన్నికయ్యారు. 1956–57 మధ్యకాలంలో పని చేశారు. తర్వాత అదే పార్టీకి చెందిన ఎస్.లక్ష్మికాంతం, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.అర్జున్రావు 1957నుంచి 1962వరకు పని చేశారు. విలీనంపాలకవర్గం పదవీకాలం ముగిసిన వెంటనే గత ఏడాది జనవరి 27న మంచిర్యాల మున్సిపాల్టీలో నస్పూరు మున్సిపాలిటీ, హాజీపూర్ మండలం వేంపల్లి, ముల్కల్ల, చందనాపూర్, గుడిపేట్, నర్సింగాపూర్, నంనూర్, కొత్తపల్లి, పోచంపాడ్ గ్రామాలను విలీనం చేస్తూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్గా మార్చారు. మొదటిసారి కార్పొరేషన్కు ఎన్నికల జరుగుతుండగా.. మేయర్ స్థానాన్ని బీసీ జనరల్ కేటాయించారు. మేయర్ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. -
● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్పర్సన్ పీఠం ● ప్రత్యేకతను చాటుకుంటున్న బెల్లంపల్లి ఓటరు
బెల్లంపల్లి: బెల్లంపల్లి బల్దియా ఓటర్లు ప్రతీసారి మున్సిపల్ ఎన్నికల్లో ఒకే రకమైన తీర్పునిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కార్మిక కుటుంబాలను ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. ఇప్పటివరకు ఏడుసార్లు ఎన్నికలు జరుగగా.. అదే ఆనవాయితీ కొనసాగించారు. చైర్పర్సన్ స్థానం ఏ సామాజిక వర్గానికి రిజర్వు చేసినా కార్మిక వర్గాన్నే అందలం ఎక్కించారు. మున్సిపాల్టీ ఏర్పడి 39ఏళ్లు అవుతుండగా.. ప్రస్తుతం ఎని మిదోసారి ఎన్నికల పర్వం మొదలైంది. ఈసారి చైర్పర్సన్ స్థానం మహిళా జనరల్కు రిజర్వు చేయడంతో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందోననే ఉత్కంఠ నెలకొంది. చైర్పర్సన్లు వీరే.. బొగ్గు గనుల క్షేత్రం బెల్లంపల్లి 1987లో ద్వితీయ శ్రేణి మున్సిపాల్టీగా అవతరించింది. అదే యేటా తొలిసారి జరిగిన ఎన్నికల్లో సింగరేణిలో మైనింగ్ సర్దార్ ఇడిగిరాల చంద్రశేఖర్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అందరి దృష్టి పీఠం పైనే.. ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టి చైర్పర్సన్ సీటుపైనే కేంద్రీకృతమైంది. ఓటర్లు ఎవరిని ఆదరించి చైర్పర్సన్ సీట్లో కూర్చోబెడతారోననే చర్చ జరుగుతోంది. గత చరిత్రను పునరావృతం చేస్తారా లేక కొత్త సంప్రదాయానికి తెర తీస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. తీర్పు.. ఒకేరకంసూరిబాబుసరస్వతిజంగం కేశవులురాజేశ్వర్సునీతారాణిచంద్రశేఖర్జక్కుల శ్వేతస్వరూప -
ఫౌండేషన్ లర్నింగ్ స్టడీ విధానం అమలు చేయాలి
భీమారం: ఫౌండేషన్ లర్నింగ్ స్టడీ విధానంతో విద్యార్థులకు అనేక విధాలుగా మేలు జరుగుతుందని, జిల్లాలోని ప్రతీ పాఠశాలలో అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అకాడమిక్ కోఆర్డి నేటర్ అధికారి సత్యనారాయణమూర్తి తెలిపారు. బుధవారం భీమారంలో నిర్వహించిన మండల స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో నూతన విద్యావిధానం అమలు దృష్ట్యా విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితశాస్త్రంలో మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నారని అన్నారు. ఇప్పటికే ప్రతీ పాఠశాలలో పూర్తి చేశారని, రానున్న రోజుల్లో మరిన్ని పరీక్షలను ఎఫ్ఎల్ఎస్లో పూర్తి చేయాలని కోరారు. సెక్టోరియల్ ఆధికారి భరత్, రిసోర్స్పర్సన్లు కుమార్, స్వ రూప, శ్రీనివాస్, సీఆర్పీ సాగర్ పాల్గొన్నారు. -
మరో ఎనిమిదేళ్లు ప్రభుత్వం మనదే
రామకృష్ణాపూర్: రాబోయే మూడు సంవత్సరాలతోపాటు మరో ఐదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతీ గడపకు తీసుకెళ్లి క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి జూపల్లి హాజరై మాట్లాడారు. ప్రజల్లో ఆదరణ, గెలిచే సత్తా ఉన్న వారికే కౌన్సిలర్ టికెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. టికెట్ రాని వారు నిరాశ పడొద్దని భవిష్యత్లో వారికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి, పల్లెరాజు, అబ్దుల్అజీజ్, గాండ్ల సమ్మ య్య, వొడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య
రెబ్బెన: అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల మేరకు మండలం లోని గంగాపూర్కు చెందిన గుర్లె శ్యాంరావ్ (30 వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతుండగా పలు ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తోటకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. మంగళవారం తెల్ల వారుజామున అతని బంధువైన గుర్లె బాపురావు తోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లగా శ్యాంరావ్ తోటలో మంచంపై స్పృహలేకుండా కనిపించాడు. పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించడంతో పాటు నోటిలో నుంచి నురగలు వస్తుండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఎస్సై వెంకటకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని తండ్రి వెంకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఒంటరితనం భరించలేక వృద్ధుడు..కౌటాల: మండల కేంద్రంలోని సదాశివపేట కాలనీకి చెందిన దెబ్బటి వెంకన్న (75) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై డి.చంద్రశేఖర్ తెలిపారు. వెంకన్న భార్య మూడేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి ఒంటరితనంతో పాటు మానసిక వేదనతో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఉదయం గుర్తు తెలియని మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఎస్టీపీపీ యూనిట్–1లో షడ్డౌన్జైపూర్: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవ ర్ ప్లాంటులో గల యూనిట్–1 (600 మెగావాట్ల) విద్యుత్ కేంద్రంలో మంగళవారం ట్యూబ్ లీకేజీల కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. యూనిట్–1 బాయిలర్లో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన ట్యూబ్స్ పగిలి ఉత్పత్తి నిలిచి పోగా అధికారులు మరమ్మతులు చేపట్టారు. -
నాగోబా ఆదాయం రూ.20.74 లక్షలు
ఇంద్రవెల్లి: మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం ఈ నెల 18 నుంచి నిర్వహించిన నాగోబా జాతర ఆదాయం 20 లక్షల 74 వేల 797 రూపాయలు వచ్చిందని దేవాదాయ శాఖ ఈవో ముక్త రవి తెలిపారు. మంగళవారం మెస్రం వంశీయులు, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు. తైబజర్ ద్వారా రూ.11,81,000, హుండీ ద్వారా రూ.8,93,797 ఆదాయం, మిశ్రమ వెండి 252 గ్రాములు వచ్చినట్లు ఈవో ముక్త రవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, కేస్లాపూర్ మెస్రం తుకారాం, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్రావ్, మెస్రం వంశీయులు కోసేరావ్, దాదారావ్, నాగ్నాథ్, మెస్రం వంశ ఉద్యోగులు దేవ్రావ్, శేఖర్బాబు, తదితరులు పాల్గొన్నారు. -
పుట్టు సుబ్బరాంపల్లి మెట్టు మేడారం
చెన్నూర్రూరల్: మండలంలోని సుబ్బరాంపల్లిలో 50 ఏళ్లకు పైగా జాతర నిర్వహిస్తున్నారు. ఏటా పౌర్ణమికి కూడా జాతర నిర్వహిస్తారు. మంథని, కరీంనగర్, మహారాష్ట్రలోని చంద్రపూర్, రాజూరా, అంకీస, అసరెల్లి ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మొదట మారిశెట్టి రామయ్య పూజలు చేసేవాడు. ఆయన తదనానంతరం కూతురు, అల్లుడు తనుగుల మల్లక్క, లచ్చన్న పూజలు చేస్తున్నారు.ఈప్రాంతం పుట్టు సుబ్బ రాంపల్లి.. మెట్టు మేడారంగా పేరొందింది. వీ టితో పాటు కిష్టంపేట గ్రామ సమీపంలో జా తీయ రహదారిపై జాతర నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు. -
చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి
పెంబి: చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై హన్మండ్లు తెలిపిన వివరాల మేరకు కడెం మండలం చిన్నబెల్లాల్కు చెందిన గెడాం శ్రీకాంత్ (30)కు పెంబి మండలంలోని రాంగూడకు చెందిన నీలభాయితో వివాహమైంది. పుట్టింట్లో ఉన్న భార్యను చూసేందుకు వచ్చిన శ్రీకాంత్ సోమవారం సాయంత్రం బంధువుతో కలిసి మద్యం మత్తులో కడెం వాగుకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. మంగళవారం జాలర్లతో వెతికించగా మృతదేహం లభ్యమైంది. మృతుని తండ్రి గెడాం శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. బస్సు కిందపడి ఒకరు..ముధోల్: బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని తరోడా గ్రామానికి చెందిన పింగ్లే సాహెబ్రావు (26) ధర్మాబాద్ కారేగాం వాసి. నెలరోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి తరోడకు వచ్చి ఇటుక బట్టీలో కూలీగా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం మద్యం సేవించి ధర్మాబాద్ వెళ్లేందుకు నడుస్తున్న బస్సు ఎక్కుతున్న క్రమంలో జారి కిందపడడంతో గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. హత్యాయత్నం కేసులో మూడేళ్ల జైలుమందమర్రిరూరల్: హత్యాయత్నం కేసులో నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ మంచిర్యాల సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నిర్మల మంగళవారం తీ ర్పునిచ్చినట్లు ఎస్సై గోపతి నరేష్ తెలిపారు. మందమర్రి పట్టణంలోని పెట్రోల్ బంకు సమీపంలో ఉండే కోహినూర్ దక్షిణమూర్తితో రామన్కాలనీకి చెందిన దసుకుంట్ల కుమారస్వామికి రెండేళ్ల క్రితం గొడవ జరిగింది. ఈక్రమంలో కుమారస్వామి అతనిపై కత్తితో దాడి చేశాడు. దక్షిణమూర్తి ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చినట్లు ఎస్సై తెలిపారు. -
టేకు చెట్లు నరికిన ఇద్దరి రిమాండ్
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ తాళ్లపేట్ అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా టేకు చెట్లు నరికిన ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. జన్నారం మండలం తపాలపూర్కు చెందిన ఐతే నాగరాజు, దుర్గం శ్రీనివాస్ ఇటీవల పలుమార్లు అడవికి వెళ్లి టేకు చెట్లు నరకడం, తరలించడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను అరెస్ట్ చేసి లక్సెట్టిపేట కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
మహారాష్ట్ర నుంచి భక్తుల రాక
కాగజ్నగర్టౌన్: వంజీరి గ్రామ పంచాయతీ పరిధి నందిగూడ శివారులోని పెద్దవాగు ఒ డ్డు న 2018 నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహిస్తున్నారు. పెద్దవాగు సమీపంలో ఇస్తా రి పటేల్ కుటుంబ సభ్యులు అమ్మవార్లకు దా నంగా ఇచ్చిన భూమిలో కమిటీ ఆధ్వర్యంలో పదేళ్లుగా జాతర నిర్వహిస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచే కాకుండా కౌ టా ల, చింతలమానెపల్లి, సిర్పూర్(టి), దహెగా ం, ఆసిఫాబాద్, రెబ్బెన, బెల్లంపల్లి, మహా రా ష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. -
చైన్నెలో గుస్సాడీ నృత్య ప్రదర్శన
ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని దూబార్పేట్ గ్రామానికి చెందిన ఆదివాసీ కళాకారులు సోమవారం రాత్రి చైన్నెలో జరిగిన కార్యక్రమంలో గుస్సాడీ నృత్య ప్రదర్శన చేసి ప్రేక్షకులను అలరించారు. దక్షిణ చిత్రహెరిటేజ్ మ్యూజియంలో మార్గళి విలేజ్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఆదివాసీ కళాకారులు గుస్సాడీ నృత్య ప్రదర్శన చేసినట్టు ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్ తెలిపారు. ఈ ప్రదర్శనలో కళాకారులు తిరుపతిమాలిక్, రాము, జుగాదిరావు, నగేష్, సంజీవ్, పరశురాం, విశ్వనాథ్, సందీప్, గంగారాం, వినోద్ పాల్గొన్నారు. -
‘పెర్సపేన్’ అభివృద్ధికి కృషి చేద్దాం
ఇంద్రవెల్లి: పెర్సపేన్ కులదేవత ఆలయ అభివృద్ధికి కృషి చేద్దామని జుగ్నాక వంశానికి చెందిన కటోడ జుగ్నాక మహదు, జుగ్నాక్ జైతు అన్నారు. మంగళవారం మండలంలోని పొల్లుగూడలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జుగ్నాక వంశీయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగోబా ఆలయ అభివృద్ధితో పాటు నూతనంగా నిర్మించిన సతీ దేవతల ఆలయ ప్రారంభ కార్యక్రమంపై చర్చించారు. సమావేశంలో జుగ్నాక వంశీయులు కాశీరాం, భరత్, మానిక్రావ్, మాదోరావ్, తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణంమంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా దౌలతాపూర్లోని ఖస్పూర్ గ్రామానికి చెందిన దేవ్జీత్కుమార్ (26) పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ట్రాలీ ఆటోలో మంచిర్యాలకు వెళ్తుండగా వేంపల్లి సమీపంలో అతివేగంగా వచ్చిన గూడ్స్ కారియర్ వెనక నుంచి ఢీ కొట్టింది. దేవ్జీత్కుమార్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా మరో ప్రయాణికుడు కేసిరెడ్డి రాంరెడ్డికి తీవ్రంగా సింగం అరవింద్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాంరెడ్డిని మెరుగైన చికిత్సకోసం కరీంనగర్కు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని సోదరుడు సన్నీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. గూడ్స్ కారియర్ డ్రైవర్ పారిపోతుండగా అటుగా వెళ్తున్న ఏసీబీ అధికారి వాహనం వెంబడించి పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కారియర్ను స్టేషన్కు తరలించారు. బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తామంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్లో ఇటీవల నిర్వహించిన వెంకీ క్లాసిక్ బాడీ బిల్డింగ్ పోటీల్లో మంచిర్యాల చాంపియన్ జిమ్ బాడీ బిల్డర్లు సత్తా చాటారు. ఎం.వెంకటేశ్ మిస్టర్ మంచిర్యాల, మిస్టర్ ఆదిలాబాద్ టైటిళ్లను గెలుచుకున్నారు. పి.విశ్వనాథ్ 75 కిలోల కేటగిరీలో 5వ స్థానం, మాస్టర్స్ కేటగిరీలో 2వ స్థానం, ప్రదీప్ 65 కిలోల విభాగంలో 4వ స్థానం, రాజు 50 కిలోల విభాగంలో 4వ స్థానం సాధించారు. జిమ్ యజమాని కంబగోని సుదర్శన్గౌడ్, సీనియర్ బాడీ బిల్డర్లు, కోచ్ సాగర్గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. -
వనంవీడి జనంలోకి..
ఆసిఫాబాద్అర్బన్: రెండేళ్లకోసారి జరిగే వనదేవతల జాతర జిల్లా కేంద్రంలోని పెద్దవాగు తీరాన, కేస్లాపూర్ హనుమాన్ ఆలయం ఎదురుగా నేడు ప్రారంభం కానుంది. సుమారు 30 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ పూజారి రమేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసం నుంచి నేడు ఉదయం 10 గంటలకు కుంకుమ భరిణి, పసుపు, కంకవనం, తదితర పూజా సామగ్రితో గద్దెల వరకు భాజా భజంత్రీలతో వచ్చి ప్రత్యేక పూజలు చేసి జాతర ప్రారంభిస్తారు. గద్దెల చరిత్ర.. బూరుగుడాకు చెందిన ముదురుకోల రమేశ్కు 1985లో వివాహమైంది. 20 ఏళ్లయినా సంతాన ం కాకపోవడంతో మేడారం వెళ్లి సమ్మక్క, సారలమ్మను దర్శించున్నాడు. ఇద్దరు కూతుర్లు, కుమారుడు జన్మించడంతో వారికి సమ్మక్క, సారలక్క, జంపన్న అని నామకరణం చేశాడు. 2016లో పెద్దవాగు తీరాన సొంత ఖర్చులతో గద్దెలను నిర్మించాడు. భక్తులు, ప్రముఖుల సహకారంతో నీరు, విద్యుత్, రహదారి సౌకర్యం కల్పించాడు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన ఎల్టా రాష్ట్రస్థాయి ఇంగ్లిష్ ఒలింపియాడ్, టెడ్ టాక్లో పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎస్.అలెగ్జాండర్, ఏ అనన్య, ఏ వికాసిని, ఎస్.అహల్య, ఎన్.సమన్విత, ఎం.సంజన, ఎస్.భవిత, ఎన్. సాహిత్య ప్రతిభ కనబరచగా డీఈవో యాదయ్య అభినందించారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ (ఒలింపియాడ్), ద్వితీయ (టెడ్ టాక్) స్థానాల్లో ఎన్.సంజన, ఎస్.భవిత (మోడల్ స్కూల్, మంచిర్యాల) విజయం సాధించారు. క్వా లిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, బాబ్జి, కళ్యాణి, సత్తయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులను అభినందించిన డీఈవో యాదయ్య -
ముస్తాబైన గద్దెలు
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల గోదావరి నదితీరాన ఈనెల 28 నుంచి 31 వరకు నిర్వహించనున్న సమ్మక్క, సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఇల్లారి (తల్లుల గుడి) నుంచి సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్నను తీసుకువచ్చి మేడారంకు చెందిన గిరిజన పూజారులు జవ్వ సతీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గద్దెలపై ప్రతిష్టించడంతో జాతర ప్రారంభం కానుంది. మహారాష్ట్రతో పాటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. గద్దెల వద్ద షామియానాలు, విద్యుత్ లైట్లు అమర్చారు. తాగునీటి సరఫరా, స్నానాలు ఆచరించేందుకు ఆకాశగంగ (నల్లాలు)లు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు నిర్మించారు. సరస్వతి శిశుమందిర్కు సమీపంతో పాటు ఎదురుగా ఉన్న మాతాశిశు ఆస్పత్రి ఖాళీ స్థలంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. సీఐ ప్రమోద్రావు పార్కింగ్ స్థలాల ను పరిశీలించి పలు సూచనలు చేశారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో.. మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగులకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం స్తానిక బాలుర పాఠశాల మైదానంలో అన్నదానం నిర్వహించారు. మూడు రోజుల పాటు అన్నదానం చేపడుతామని ట్రస్టు సభ్యులు తెలిపారు. -
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
మంచిర్యాల అగ్రికల్చర్: మున్సిపల్ ఎన్నికల నిర్వ హణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన ర్ రాణి కుముదిని సూచించారు. మంగళవారం హై దరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అ న్ని జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు, ఎన్నికల విభా గం అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. జిల్లాలో మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధం చేసినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్ట్రాంగ్రూంను పరిశీలించిన కలెక్టర్లక్సెట్టిపేట: మున్సిపల్ ఎన్నికల కోసం పాత ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని స్ట్రాంగ్రూం, నామినేషన్ కేంద్రంగా ఏర్పాటు చేయడంతో కలెక్టర్ కుమార్దీపక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు కల్పించాల ని అధికారులకు సూచించారు. అనంతరం ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న మార్చురీ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ విజయ్కుమార్, తహసీల్దార్ దిలీప్కుమార్ తదితరులున్నారు.నామినేషన్ కేంద్రాల పరిశీలనమంచిర్యాలటౌన్: నస్పూర్లోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్తో కలిసి పరిశీలించారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీకి సంబంధించి లక్సెట్టిపేట పా త మండల పరిషత్ కార్యాలయంలో, క్యాతన్పల్లి, బెల్లంపల్లి, చెన్నూరు మున్సిపాలిటీలకు సంబంధించి ఆయా మున్సిపల్ కార్యాలయాల్లోనే నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపా రు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చే శామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సమాచారం, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం 08736–205051 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఖజానా ఖాళీ చేసిన గత ప్రభుత్వం
చెన్నూర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి కాగితాలే అప్పగించిందని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడు తూ.. బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో జరిగి న అభివృద్ధి శూన్యమని, వివిధ పనులకు ప్రొసీడింగ్లు ఇచ్చి నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని చెప్పా రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచిందని, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని తెలిపారు. 14వార్డుకు ఇప్పటివరకు రూ.3కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చె ప్పారు. భవిష్యత్లో మున్సిపల్ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి ఉదయం మార్నింగ్ వాక్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, కాంగ్రెస్ నాయకులున్నారు. -
గౌరపూర్లో మెస్రం వంశీయుల పూజలు
ఇంద్రవెల్లి: మండలంలోని గౌరపూర్ గ్రామ సమీపంలో గల పశువుల దొడ్డి వద్ద మంగళవారం మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేశారు. కేస్లాపూర్ నాగోబా మహాపూజతో పాటు ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ బుడుందేవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మెస్రం వంశీయులు తిరుగు ప్రయాణంలో తమ ఆచారం ప్రకారం గౌరపూర్ పశువుల దొడ్డి వద్ద పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ పూజలు చేసిన తర్వాతే తమ గ్రామాలకు వెళ్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరపూర్ సర్పంచ్ కోవా లాల్షావ్, మెస్రం దేవ్రావ్ పటేల్, కటోడ జంగు, మెస్రం సీతారాం డాకలి పటేల్, జంగు, మధవార్, మెస్రం జంగుకటోడ, తదితరులు పాల్గొన్నారు. -
పట్టణాల్లో ఓట్ల జాతర!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పురపాలక సంఘాల్లో ఎన్నికల జాతర మొదలైంది. ఓ వైపు సమ్మక్క–సారలమ్మ జాతర కొనసాగుతుండగా, మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ విడుదల చేయడంతో ఒక్కసారిగా పట్టణాల్లో రాజకీ యం వేడెక్కింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావ డంతో జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో ఆంక్షలూ అమలులోకి వచ్చాయి. బుధవారం వార్డుల వారీగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. దీంతో ఆశావహులు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. తుదిగా బరిలో దిగి న వారి నుంచి పోలింగ్ వరకు ప్రచార సమయం వారం రోజులే ఉంది. దీంతో పార్టీ టికెట్లు ఖరారైన చోట అభ్యర్థులు ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. అన్నింటికీ డబ్బుతోనే పని కావడంతో ఆర్థిక వనరులను సమీకరించుకున్నారు. తెగని టికెట్ల పంచాయితీ!నామినేషన్ల దాఖలకు మూడురోజులే ఉంది. నామి నేషన్ వేసినా బీ ఫాం ఇస్తేనే పార్టీ అభ్యర్థిగా చెల్లుబాటవుతుంది. అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల్లో ఇంకా ఎక్కడా అధి కారికంగా అభ్యర్థులను ఖరారు చేయలేదు. బీ ఫాం చేతిలో పడేవరకు అభ్యర్థులకు టెన్షన్ తప్పడం లే దు. తప్పనిసరిగా బరిలో ఉంటామని చెప్పుకొంటూ టికెట్కు పోటీ ఉన్న చోట్ల నాయకులు బెంగతో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు, క్యా తనపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికే జాబి తా ప్రకటించాల్సి ఉన్నా, ఇంకా జాప్యం చేస్తున్నా రు. మంచిర్యాల నగరపాలక సంస్థ, లక్సెట్టిపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు హామీ ఇచ్చినట్లు పలువురు ఆశావహులు డివిజన్లలో చె ప్పుకొంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, అఽధికార పార్టీ నుంచి సీనియర్ నాయకులు టికెట్ల కోసం సంప్రదిస్తే వారితో టచ్లో ఉంటున్నారు. బీ ఫాం రాకపోతే స్వతంత్రంగా బరిలోకి దిగడమా? పోటీ నుంచి విరమించుకోవడమా? లేక ప్రతిపక్ష పార్టీలోకి జంప్ కావడమా? అనే సందిగ్ధంతో వివి ధ పార్టీల ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అంతా సిద్ధం చేసిన యంత్రాంగంజిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో అధికార యంత్రాంగం నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్, కౌంటింగ్ రూంలు సిద్ధం చేసింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 149 వార్డుల్లో 444 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇందుకు 87మంది రిటర్నింగ్ ఆఫీస ర్లు, 178 మంది సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లు, 533 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,131 మంది ఇతర పో లింగ్ ఆఫీసర్లు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. జిల్లాలో 87 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ నేడు ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో పట్టణాల్లో సీఐల నేతృత్వంలో పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదీ షెడ్యూల్16న చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికబెల్లంపల్లిలో టికెట్ల గోల బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34వార్డులుండగా అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్లోనూ టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. సొంత పార్టీ నుంచి టికెట్ రాని ఆశావహులు వా ర్డు లేదా పార్టీ మారాలా.. లేదా స్వతంత్రంగా బరిలోకి దిగాలా.. అనే కోణాల్లో ఆలోచిస్తున్నా రు. కాంగ్రెస్కు చెందిన ఆశావహులు పోటాపోటీగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వద్ద ప్రయత్నం చే స్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప ర్యవేక్షణలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫైవ్మెన్ కమిటీ ఈపాటికే వార్డుల వారీగా ఆశావహుల వివరాలు ఆరా తీసి ఓ అంచనాకు వచ్చింది. గె లుపు అవకాశాలున్న అభ్యర్థులను ఎంపిక చేసి కాంగ్రెస్ జాబితా ప్రకటించాకే బీఆర్ఎస్ జాబి తాను వెల్లడించాలనే వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. సీపీఐ, బీజేపీ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. కాగా, ఎమ్మెల్యే వినోద్ తమకే టికెట్ ఖరారు చేశారని చెప్పుకొంటూ కొందరు కాంగ్రెస్ ఆశావహులు ప్రచారం మొదలు పెట్టారు. మరోవైపు బీఆర్ఎస్లో పలుచోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీలో పోటీ లేని చోట టికెట్లు ఖరారవుతున్నాయి. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం31న నామినేషన్ల పరిశీలన30వరకు నామినేషన్లు దాఖలు ఫిభ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు -
జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని తెలంగాణ ప్రభు త్వ సాంఘిక సంక్షేమ బాలుర సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీవోఈ) గురుకుల కళాశాల వి ద్యార్థి జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కందుల శ్రీహర్ష ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 9, 11 తేదీల్లో బెల్లంపల్లిలోని తె లంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం (టీజీఎస్ఆర్)లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున ఆడి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు సీవోఈ ప్రిన్సిపాల్ వి జయ్సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా కళా శాలలో శ్రీహర్షకు పుష్పగుచ్ఛం అందజేసి ప్రి న్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. ఈనెల 28నుంచి ఫిబ్రవరి 2వరకు మహారాష్ట్రలోని నాగ్పూర్లో నిర్వహించనున్న జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో అండర్–19 విభా గంలో శ్రీహర్ష పాల్గొననున్నాడు. సీవోఈ వైస్ ప్రిన్సిపాల్ గోపి, ఉపాధ్యాయులు దశరథం, కమలాకర్, తిరుపతి, లక్ష్మణ్, హారిక, శశికుమార్, హెల్త్ సూపర్వైజర్ శ్రీలత, వ్యాయా మ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, ముచ్చకుర్తి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులపై పని భారం తగ్గించాలి
పాతమంచిర్యాల: బ్యాంక్ ఉద్యోగులపై పని భారం తగ్గించాలని, వారంలో ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఒప్పందాలను గౌరవించాలని యునైటెడ్ ఫో రం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ రీజినల్ సెక్రటరీ కొ క్కుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం దే శవ్యాప్త సమ్మెలో భాగంగా బ్యాంక్ ఉద్యోగులు జి ల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి రెడ్డి కాలనీలోని ఎ స్బీఐ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీని వాస్ మాట్లాడుతూ.. ఐదురోజుల పని విధానం అమలు చేస్తామని 2024 మార్చిలో జరిగిన 12వ వే తన సవరణ చర్చల సందర్భంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఒప్పందం చేసుకున్నా ఇప్పటివర కు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడంతో బ్యాంక్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. వెంటనే న్యాయమైన డిమాండ్లు పరిశీ లించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తెలంగాణ స్టేట్ యూబీఐ వైస్ ప్రెసిడెంట్ ఎం.వసంత్కుమార్, డిప్యూటీ రీజినల్ సెక్రటరీ నీలం రమేశ్, తె లంగాణ స్టేట్ కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూని యన్ వైస్ చైర్మన్ ఎస్.విష్ణుచరణ్, ఎల్డీఎం తిరుప తి, ఏఐడీవోసీ రీజినల్ సెక్రటరీ ఆర్ఎస్ వెంకటేశ్, బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
గూడెంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
దండేపల్లి: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో స్వామి వారి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. గుట్టకింది నుంచి సన్నాయి వాయిద్యాలతో పూజాసామగ్రి, స్వామివారి చిత్రపటంతో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయం ముందు న్న మండపం వద్ద సప్తాహ భజనలు ప్రారంభించారు. అనంతరం నిత్యవిధి, ప్రాభోధిక ఆరగింపు, తీర్థప్రసాద గోష్టి, విశ్వక్సేనారాధ న, దీక్ష కంకణ ధారణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్, వ్య వస్థాపక కుటుంబసభ్యులు రఘుస్వామి, సంపత్స్వామి, వేదపండితులు నారాయణశర్మ, భరత్శర్మ, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అ ర్చకులు, భజన కళాకారులు పాల్గొన్నారు. -
జాతర ప్రారంభం
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ ఆర్కే–1ఏ గని సమీపంలోని పాలవాగు ఒడ్డున నిర్వహిస్తున్న జాతరలో భాగంగా మంగళవారం కంకవనాన్ని తీసుకువచ్చారు. గని ఆవరణ నుంచి డప్పుచప్పుళ్ల మధ్య కంకవనాన్ని తీసుకువచ్చి జాతర ప్రాంగణంలోని సమ్మక్క, సారల మ్మ, పగిడిద్దెరాజు గద్దెలపై ప్రతిష్ఠించారు. మూడురోజులు నిర్వహించనున్న జాతరలో కార్మికులు, వారి కుటుంబసభ్యులు అధికసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నా రు. ఏరియా జీఎం రాధాకృష్ణ, ఎస్వోటూ జీ ఎం ప్రసాద్, ఏఐటీయూసీ నాయకులు అక్బర్అలీ, సలెంద్ర సత్యనారాయణ, డీజీఎం పర్సనల్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
డీలర్ల వద్దే వాహన రిజిస్ట్రేషన్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ బాధ్యతలను ప్రభుత్వం షోరూమ్ డీలర్లకు అప్పగించింది. దీంతో వాహనాదారులకు మధ్యవర్తి ప్రమేయం లేకుండా ఉండడమే కాదు ఖర్చు, సమయం ఆదా అవుతుంది. వాహనదారులకు ఇకపై రిజిస్ట్రేషన్ కష్టాలు దూరం కానుండగా.. రవాణా శాఖ అధికారులకు పనిభారం తగ్గింది. ప్రభుత్వం రవాణా శాఖ, డీలర్ షోరూమ్ను అనుసంధానం చేస్తూ ఓ కొత్త సాఫ్ట్వేర్తో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ద్విచక్ర వాహన షోరూమ్లు 20కి పైగా ఉండగా ఇందులో 12 షోరూమ్లకు మాత్రమే వాహన రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించారు. వివిధ కంపెనీల కార్ల షోరూమ్లు ఉన్నా ఒక్క షోరూమ్ మినహా మిగతా వాటి ప్రధాన షోరూములన్నీ కరీంనగర్లోనే ఉన్నాయి. ఇక్కడ కారు కొన్నా రిజిస్ట్రేషన్కు కరీంనగర్ వెళ్లాల్సిందే. ద్విచక్ర వాహనాలు రోజుకు 30 నుంచి 60 వరకు, ఐదు నుంచి పది వరకు కార్లు విక్రయిస్తున్నారు. గతంలో వాహనం విక్రయించిన సమయంలో అన్ని కార్యకలాపాలు, లావాదేవీలు పూర్తి చేసి తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రం ఇచ్చేవారు. ఆ పత్రాలు తీసుకుని వాహనదారుడు రిజిస్ట్రేషన్ కోసం ర వాణా శాఖకు వెళ్లాల్సి వచ్చేది. ఇందుకోసం కొంత డబ్బు ఖర్చు, ఓ మధ్యవర్తి ప్రమేయం ఇలా స మయం వృథా అయ్యేది. ఇప్పడు ఆ సమస్యలేవీ ఉండవు. వాహన డీలర్ వద్దే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ప్ర త్యేక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్యాన్సీ నంబర్కు అదనపు రుసుం వాహనాలకు కోరుకున్న, ఫ్యాన్సీ నంబరు కావాలంటే తాత్కాలిక రిజిస్ట్రేషన్తో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఇందుకు అదనపు రుసుంచెల్లిస్తే నంబ ర్ను రవాణా శాఖ అధికారులు కేటాయిస్తారు. ఇందుకోసం కొంత సమయం పడుతుందని, అప్పటివరకు నిరీక్షించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. -
కర్తవ్య్పథ్లో మనోళ్లు
భీమిని: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఢిల్లీలోని కర్తవ్య్పథ్లో నిర్వహించిన వేడుకల్లో భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన ఇద్దరు కళాకారులు పాల్గొని ఒగ్గుడోలు విన్యాసం ప్రదర్శించారు. సౌత్ జోన్ సెంటర్ నుంచి 30 మందిని ఎంపిక చేయగా అందులో వీగాం గ్రామానికి చెందిన బొప్పనపల్లి రవి, అమరగొండ అజయ్ ఉన్నారు. వీరిద్దరూ ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, జాతీయ పురస్కార గ్రహీత ఒగ్గు రవి నేతృత్వంలో ఈ నెల 8న ఢిల్లీ వెళ్లి రిహార్సల్స్ చేశారు. కర్తవ్య్పథ్ వేదికగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎదుట ఒగ్గు డోలు ప్రదర్శనకు తమకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని రవి, అజయ్ పేర్కొన్నారు. -
● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
మంచిర్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందని, మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ వివిధ వ్యాపార రంగాల్లో మహిళలను భాగస్వామ్యులను చేస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. క్యూర్, ప్యూర్, రేర్ నినాదంతో 2047 రైజింగ్ తెలంగాణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ దేశంలో ప్రథమ స్థానంలో జిల్లాను నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. అర్హులకు ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు అందిస్తున్న పథకాలతో పలువురికి లబ్ధి చేకూరుతోంది. ఉచిత రవాణాతో 5.78లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతోంది. 5,33,149 గ్యాస్ సిలిండర్లను రూ.15.61కోట్ల రాయితీతో మంజూరు చేశాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 18,949 మంది పేదల చికిత్సకు రూ.34.04 కోట్లు ఖర్చు చేయగా, గృహజ్యోతి పథకం కోసం జిల్లాలో 1,28,713 మంది వినియోగదారులకు రూ.95.15కోట్ల లబ్ధి చేకూరింది. జిల్లాలో 10,930 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 7,772 ఇళ్లు నిర్మాణాలు ప్రారంభించారు.. 24 ఇళ్లు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.107.62 కోట్లు చెల్లించాం. మందమర్రి మున్సిపాలిటీలో 243 మందికి, క్యాతనపల్లి మున్సిపల్ పరిధి లో 234మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశాం. జిల్లావ్యాప్తంగా 37వేల నూతన రేషన్కార్డులు జారీ చేయగా.. 2.54లక్షల వినియోగదారులకు సన్నబియ్యం అందిస్తున్నాం. విద్య, వైద్యానికి ప్రాధాన్యం జిల్లాలో 18 కస్తూరిభాగాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్మీడియెట్ వరకు నవీకరించాం. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో 545 పాఠశాలల్లో రూ.21.58కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల విద్యార్థులకు 40శాతం డైట్, 200శాతం కాస్మెటిక్ చార్జీలు పెంచి, నూతన మెనూ అమలు చేస్తూ పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రతీ విద్యార్థికి యూని ఫాం అందించాం. లక్సెట్టిపేటలో రూ.9.80కోట్లతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల నిర్మించి తరగతులు నిర్వహిస్తున్నాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి దండేపల్లి మండలం రెబ్బనపల్లి, చెన్నూరు మండలం సోమనపల్లి, బెల్లంపల్లిలో శంకుస్థాపన చేశాం. వృత్తి విద్య శిక్షణ కోసం జిల్లాలోని మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, జన్నారంలోని ప్రభుత్వ ఐటీఐల్లో నాలుగు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను రూ.170 కోట్లతో సివిల్, మెషినరీ పనులు పూర్తి చేసి తరగతులు నిర్వహిస్తున్నాం. చెన్నూరు పట్టణంలో రూ.47.11కోట్లతో ఏటీసీ నిర్మాణానికి భూమి పూజ చేశాం. నవభారత సాక్షరతా కార్యక్రమంలో 31,436 మందిని గుర్తించి, 3,014 మంది వాలంటీర్లను నియమించి ఉల్లాస్ డిజిటల్ యాప్ లో అభ్యాసన జరుగుతోంది. జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.300 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రూ.23.75 కోట్లతో 50పడకల క్రిటికల్ కేర్ ఆసుపత్రి, రూ.129.25 కోట్లతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి రూ.49కోట్లతో పనులు సాగుతుండగా.. గుడిపేటలో రూ.216 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయి తరగతులు కొనసాగుతున్నాయి. లక్సెట్టిపేటలో రూ.8.50 కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్మించాం. రూ.3.60 కోట్లతో ఔషధ నిల్వ గిడ్డంగి భవనం పూర్తయింది. భీమారం, కన్నెపల్లి మండల కేంద్రాల్లో రూ.1.43కోట్లు చొప్పున వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం సాగుతోంది. జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.17 లక్షలతో రెండు అంబులెన్సులు, మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి రూ.15.2 లక్షలతో రెండు అంబులెన్సులు అందించాం. ఈ కార్యక్రమంలో డీఎఫ్వో శివ్ ఆశిష్సింగ్, మంచిర్యాల అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కళలను కాపాడుకోవాలి నస్పూర్: సంప్రదాయ కళలను కాపాడుకుంటూ వాటిని భావితరాలకు అందించాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నస్పూర్లోని కలెక్టరేట్లో సోమవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి దుర్గాప్రసాద్, డీఆర్డీఓ కిషన్, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ఖాన్, జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, డీఈఓ యాదయ్య, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, పశుసంవర్థక శాఖ అధికారి శంకర్, విద్యార్థులు పాల్గొన్నారు.అగ్నిమాపక, మత్స్యశాఖ, ఆర్టీసీ శకటాలుమహిళల అభ్యున్నతి కోసం..మహిళల అభ్యున్నతి కోసం ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా క్యాంటీన్లు, మీ సేవా కేంద్రాలు, చిన్న పరిశ్రమలు, ఇతర వ్యాపార విభాగాల ఏర్పాటుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూత అందిస్తున్నాం. మూడు నియోజకవర్గాల్లోని ముగ్గురు మహిళలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల విలువైన సంచార చేపల విక్రయ వాహనం 60శాతం రాయితీతో మంజూరు చేయగా రూ.18లక్షల లబ్ధి చేకూరింది. వడ్డీలేని రుణాల కింద గత ఏడాది 2,704 స్వయం సహాయక సంఘాలకు రూ.261 కోట్లు అందించాం. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు దండేపల్లి మండలంలో శంకుస్థాపన చేశాం.రైతులకు లబ్ధి చేకూర్చేలాజిల్లాలోని 64,452 మంది రైతులకు రూ.540.66 కోట్ల రుణమాఫీ చేశాం. రైతు భరోసా కింద 2025–26 వానాకాలం పంటకు 1,52,162 మంది రైతులకు రూ. 198.13 కోట్లు అందించాం. రైతుబీమా పథకం కింద 2025 ఆర్థిక సంవత్సరానికి 109మంది రైతులకు రూ.5 లక్షల చొప్పున రూ.5 కోట్లు చెల్లించాం. 2025 వానాకాలం ధాన్యం కొనుగోలుకు రూ.1,57,642 ఎకరాల్లో పండిన 91,881 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేశాం. 27,114మంది రైతుల నుంచి 5.48 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసి రూ.438 కోట్లను చెల్లించాం. ఆయిల్ఫామ్ తోటల కోసం 485 ఎకరాల్లో మొక్కలు నాటగా, జిల్లాలో 650 మంది రైతులు 2,100 హెక్టార్లలో దసలి పట్టు సాగు చేశారు. స్టాళ్ల వద్ద కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అధికారులుఅలరించిన విద్యార్థుల నృత్యాలు వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని అలరించాయి. శర్వాణి నృత్యాలయం, నందిని నృత్యాలయం, ఎస్సీ హాస్టల్స్ బాలికల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన వారికి కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం ఆరోగ్యశాఖ, మత్స్య శాఖ, ఐసీడీఎస్, రవాణా శాఖ, ఫైర్, అగ్రికల్చర్, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి, సఖి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అభివృద్ధిని శకటాల రూపంలో ప్రదర్శించారు. -
అభివృద్ధిలో సింగరేణి పాత్ర కీలకం
జైపూర్: దేశ, రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి తెలిపారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో సోమవారం 77వ గణతంత్ర దినోత్స వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈడీ చిరంజీవి అడ్మిన్ భవన కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతర ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ, ఎంతోమంది మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాంతంత్య్రం సిద్ధించిందని, భారతదేశానికి రాజ్యాంగం ఒక దిక్సూచి లాంటిదని తెలిపారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికై న అవంచ సంతోశ్కుమార్, బర్ల తిరుపతిలను శాలువాలతో సన్మానించి అవార్డులతో సత్కరించారు. ఇటీవల కోల్ఇండియా స్థాయిలో కర్ణాటక సంగీతంలో బంగారు పతకం సాధించిన బండి శ్రీనిధి, వేణుగానంలో కాస్యం పతకం సాధించిన బండి రవీంద్రకుమారస్వామిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరీ సత్యనారాయణ, సీఎంవోఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ పంతులా, సీఐఎస్ఎఫ్ కమాండెంట్ చంచల్ సర్కార్, పీఎంపీఎల్ హెడ్ అఖిల్కపూర్, డీజీఎం కిరణ్బాబు, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఉద్యోగికి సన్మానం
శ్రీరాంపూర్: సింగరేణి ఉత్తమ ఉద్యోగిగా ఎంపికై న కంది సమ్మిరెడ్డిని సోమవారం కొత్తగూడెంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో కంపెనీ సీఎండీ కృష్ణభాస్కర్ సన్మానించారు. ఆర్కే న్యూటెక్ గనిలో ఎస్డీఎల్ ఆపరేటర్గా పనిచేస్తున్న సమ్మిరెడ్డి ఎస్డీఎల్ ద్వారా రక్షణతో కూ డిన అధిక ఉత్పత్తికి కృషి చేయడంతో పాటు మెరుగైన మస్టర్లు కలిగి ఉండటంతో కంపెనీ ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, ఇతర అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రపతి పతకానికి ఎంపికమంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కమాండెంట్ పి.వెంకటరాములు రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. 2026 సంవత్సరానికిగానూ భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాబితాలో వెంకటరాములు చోటు దక్కించుకున్నారు. అసాధారణ సేవలకు గుర్తింపుగా లభించిన ఈ అత్యున్నత పురస్కారంపై బెటాలియన్ అధికారులు, సిబ్బంది వెంకటరాములును ప్రత్యేకంగా అభినందించారు. నలుగురికి ఎకై ్సజ్ ఎస్సైలుగా పదోన్నతిఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నలుగురికి ఎక్సైజ్ ఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎం.రాజేశ్వర్, ఆదిలాబాద్ డీపీఈఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అరుణ్ కుమార్, నిర్మల్ జిల్లా ఎకై ్సజ్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న బి.ముత్యం, కుమురంభీం ఆసిఫాబాద్ డీపీఈఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న డి.రాజశేఖర్కు ఎకై ్సజ్ ఎస్సైలుగా పదోన్నతులు లభించాయి. ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణంబెల్లంపల్లి: మేడారం సమ్మక్క–సారలక్క జాతరకు భక్తులను సురక్షితంగా చేరవేయడం కోసం ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. సోమవారం బెల్లంపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద మేడారం జాతర బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా బెల్లంపల్లి బస్టాండ్ నుంచి 79 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఏసీపీ రవికుమార్, ఆర్టీసీ ఎండీ రాజశేఖర్, ఆసిఫాబాద్ ఆర్టీసీ బస్ డిపో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఓపెన్కాస్ట్ పనులు అడ్డుకున్న నిర్వాసితులు
కాసిపేట: మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని ఓపెన్కాస్ట్లో చేపట్టిన ఓబీ తరలింపు పనులను మండలంలోని ట్యాంకుబస్తీకి చెందిన భూ నిర్వాసిత బాధితులు సోమవారం అడ్డుకున్నారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి శివారులో నష్టపోయిన భూమికి పరిహారం ఇవ్వలేదన్నారు. పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టడం సరికాదని మండిపడుతూ లారీలు, జేసీబీలు అడ్డుకున్నారు. పనులు చేపట్టిన సింగరేణి అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిహారం అందించి పనులు చేపట్టాలని భీష్మించుకు కూర్చోవడంతో పనులు నిలిపివేశారు. పరిహారం అందించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని నిర్వాసిత బాధితులు హెచ్చరించారు. -
కాక రేపుతున్న వలసలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికలకు ముందే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకుల వలసలు కాక రేపుతున్నాయి. టికెట్ రాదని తెలిసి ఎవరి దారి వారు చూసుకుంటుండడంతో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. సర్కారు సంక్షేమ పథకాల లబ్ధిదారులు, పట్టణాల్లో మొదలైన అభివృద్ధి చెప్పుకుని ఓట్లు సాధించి మున్సిపాల్టీల్లో జెండా ఎగురవేయాలని ఆరాటపడుతున్న అధికార పార్టీకి సొంత నాయకులే ఏకు మేకవుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించడంలో స్థానిక నాయకత్వం విఫలం కావడం ప్రతిపక్షాలకు కలిసి వస్తోంది. ఇక అధికారికంగా అభ్యర్థుల పేర్లు ఖరారు తర్వాత ఎంతమంది పార్టీ మారుతారోనని చర్చ జరుగుతోంది. అంతేగాక.. తమకు టికెట్ దక్కని కసితో ప్రతిపక్షంతో చేతులు కలిపినా ‘హస్తం’ పార్టీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో గెలిచే స్థానాలను అధికార పార్టీ కోల్పోయిందనే వాదనలు ఉన్నాయి. గ్రామాల్లో రెబల్గా వేసిన నాయకులతో పార్టీ మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులు దక్కాలంటే ప్రతీ వార్డు, డివిజన్ కీలకం. అధికార పార్టీ నుంచి వలసలు ఎటు మేలు చేస్తాయోననే చర్చ జరుగుతోంది. మరోవైపు కొందరు రెబల్గా పోటీకి సిద్ధమవుతున్నారు. ‘మంత్రి’ ఇలాకాలో తిప్పలే.. చెన్నూరు నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ మూల రాజిరెడ్డి తన అనుచర గణంతో ‘గులాబీ’ పార్టీ గూటికి చేరారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా పని చేసేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. అవసరమైతే సొంత డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో పలు వార్డుల్లో ప్రభావం చూపితే మంత్రి వివేక్కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ సమక్షంలో 9వ వార్డు నుంచి పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఆశావహుల జాబితాలోనే తమ పేర్లు లేవని ఇటీవల ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముందే నాయకులు వాగ్వాదం చేశారు. డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇక పార్టీ అభ్యర్థుల పేర్లు వెల్లడించాక అసమ్మతి నాయకులు ఏం చేస్తారనే ఆసక్తి నెలకొంది. లోలోపల మంతనాలు బెల్లంపల్లి పట్టణంలోనూ అధికార పార్టీ నాయకుల తీరు ఎమ్మెల్యే వినోద్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఒక్కోచోట ఇద్దరు, ముగ్గురేసి పోటీ ఉండడంతో టికెట్ దక్కని వారంతా ఏం చేస్తారనేది హాట్ టాపిక్గా మారింది. రిజర్వేషన్లు కలిసొచ్చిన వారంతా ఎలాగైనా పోటీలో ఉంటామని చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తామని కొందరికి హామీలు దక్కాయి. పార్టీలో చేరి పోటీకి దిగుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో లోలోపల మంతనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో టికెట్ రాకపోతే పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.కార్పొరేషన్లో ‘చేయి’ జారుతున్న లీడర్లు జిల్లా కేంద్రం కార్పొరేషన్గా మారిన తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పెరిగింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు అనుచరులు కొందరు టికెట్ల్ల పంపకంలో చేయి జారిపోతున్నారు. జిల్లా కేంద్రంలో మైనార్టీ నాయకుడు 49వ డివిజన్కు చెందిన అబ్దుల్ సత్తార్ కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. ఆయన పోటీతో ముస్లిం ఓట్లు ప్రభావం అవుతాయనే చర్చ మొదలైంది. ఈయనతోపాటు 13, 55వ డివిజన్ల మాజీ కౌన్సిలర్తో సహా నాయకులు పార్టీ మారారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీ నుంచి పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వీరితోపాటు కొందరు టికెట్ రాకపోతే రెబల్గా పోటికి సిద్ధమవుతున్నారు. మరోవైపు నగరం, పట్టణంలో బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఒక్కో డివిజన్లో త్రిముఖ పోటీ ఏర్పడితే జిల్లా కేంద్రంలో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. -
బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ
బెల్లంపల్లి: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ సీఈఆర్ క్లబ్లో ఆదివారం నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో బెల్లంపల్లి స్కైజిమ్కు చెందిన పలువురు బాడీ బిల్డర్లు పతకాలు సాధించారు. ఆదిలాబాద్ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో బెల్లంపల్లి స్కైజిమ్కు చెందిన జి.లక్ష్మణ్ (75 కిలోలు), జె.మొగిలి (80 కిలోలు), డి.ప్రశాంత్ (85 కిలోలు) ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. మాస్టర్స్ విభాగంలో పి.కృష్ణస్వామి (55 కిలోలు), తృతీయ బహుమతి, ఎం.రోహిత్ (60 కిలోలు) తృతీయ బహుమతి, జూనియర్స్ విభాగంలో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. జూనియర్స్ విభాగంలో మీర్జా హుమాయున్, ఎం.మహేష్, కె.నగేష్ ఐదోస్థానంలో నిలిచిట్లు స్కైజిమ్ నిర్వాహకులు పి.సదానందం, బాలకృష్ణ, చంద్రశేఖర్ తెలిపారు. -
దేశాభివృద్ధికి ప్రతీ పౌరుడు బాధ్యత వహించాలి
చెన్నూర్: ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశాభివృద్ధికి ప్రతీ పౌరుడు బాధ్యతగా ముందుకు సాగాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగం అందరికీ ఉద్యోగ అవకాశాలు, సమాన హక్కులు, స్వేచ్చనిచ్చిందని తెలిపారు. మంత్రి ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
గిరిజనుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి
ఉట్నూర్రూరల్: గిరిజనుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవా న్ని సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీ వో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అర్హులకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ ఆశ్రమాలు, గు రుకులాల విద్యార్థులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. ఎకో టూరిజం శాఖ పరిధిలో కుంటాల, ఉట్నూర్ కోట, అడ ప్రాజెక్టు వద్ద అభివృద్ధి పనులు చేపడుతున్న ట్లు తెలిపారు. అనంతరం కేబీ కాంప్లెక్స్ క్రీడా మై దానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించా రు. విద్యార్థులు పలు సినీ, దేశభక్తి గీతాలపై చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఐటీడీఏ పరిధిలో ఉద్యోగులకు బెస్ట్ అప్రిషియేషన్ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మిట్టపల్లిలో ఎడ్ల పందెం పోటీలు
జైపూర్: మండలంలోని మిట్టపల్లి గ్రామంలో సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎడ్ల పందెం పోటీలు నిర్వహించారు. గ్రామ శివారులోని మహిళా భవన్ వద్ద ప్రతిఏటా నిర్వహిస్తూ వస్తున్న ఎడ్ల పందెం పోటీలను స్థానిక సర్పంచ్ కామెర మనోహర్ ప్రారంభించారు. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన పోటీదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిర్రకుంటకు చెందిన వోడ్నాల మారుతికి మొదటి బహుమతిగా రూ.25వేలు, పొన్నారానికి చెందిన పెంబాల లక్ష్మణ్, బచ్చల శివకృష్ణ రెండో బహుమతిగా రూ.17500 చొప్పున గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ రిక్కుల శ్రీనివాస్రెడ్డి, స్థానిక సర్పంచ్ మనోహర్ బహుమతులు ప్రదానం చేశారు. -
రేపటి నుంచి వనదేవతల జాతర
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రం మంచిర్యాల గోదావరి నదీ తీరంలో ససమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 28నుంచి 31 వరకు జాతర సాగనుంది. మహాప్రస్థానం పక్కన, సరస్వతీ శిశుమందిర్ వెనుక వైపు వాహనాల పార్కింగ్తోపాటు లైటింగ్ పనులు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఖాళీ స్థలాలు చదును చేశారు. తాగునీటి సౌకర్యం, స్నానాలు ఆచరించేందుకు ఆకాశగంగ(కుళాయిలు) క్యూలైన్లు, టెంట్లు, మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేశా రు. ఈ ఏడాది నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో భక్తులు గోదావరినదిలో తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. మేడారం బాటపట్టిన భక్తులు సమ్మక్క–సారాలమ్మ భక్తులు మేడారం జాతర బాటపట్టారు. భక్తులతో మంచిర్యాల బస్స్టేషన్ కోలాహలంగా మారింది. జిల్లాలోని ఆరు పాయింట్ల నుంచి 369 బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ప్రత్యేక సిబ్బందిని నియమించి టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 25నుంచి మంచిర్యాల బస్టాండ్లో కొనసాగిన మేడారం ప్రత్యేక బస్సుల కౌంటర్ను ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా స్థానిక బాలుర ఉన్నత పాఠశాల మైదానానికి మార్చారు. ప్రత్యేక శిబిరంలో క్యూలైన్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంగళవారం నుంచి మేడారానికి బస్సుల రాకపోకలు మైదానం నుంచి సాగనున్నాయి. ఈ నెల 25న 9బస్సులు, 26న 8 బస్సులు నడిపించనున్నట్లు డీఎం శ్రీనివాసులు తెలిపారు. -
నాగోబా సన్నిధిలో భక్తజనం
ఇంద్రవెల్లి: నాగోబా ఆలయంలో సోమవారం భక్తజన సందడి నెలకొంది. సెలవుదినం కావడంతో ఉ మ్మడి జిల్లా నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జీఎస్టీ కమిషనర్ వై.శ్రీలీల నాగోబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు శాలువాతో సత్కరించి నాగోబా ప్రతిమ అందజేశారు. నేడు నాగోబా జాతర హుండీ లెక్కించనున్నట్లు దేవదాయ శాఖ ఈవో ముక్త రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్రావ్, పూజరి మెస్రం శేక్నాథ్, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి కుటుంబానికే పదవులు
● మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ● బీఆర్ఎస్లో భారీగా చేరికలు రామకృష్ణాపూర్: గత ఎన్నికల సమయంలో చెన్నూర్ నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన మంత్రి వివేక్ గెలిచిన తర్వాత ఏ ఒక్కటీ అమలు చేయలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ప్రజలకు ఉద్యోగాల హామీ ఏమో గానీ వివేక్కు మంత్రి పదవి, కొడుకుకు ఎంపీ పదవి, అన్న వినోద్కు ఎమ్మెల్యే పదవి, మరో బంధువుకు స్పీకర్ పదవులైతే వచ్చాయని విమర్శించారు. క్యాతనపల్లిలోని సుమన్ స్వగృహంలో సోమవారం నియోజకవర్గానికి చెందిన ఆయా పార్టీల నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ పరిశ్రమలు తీసుకొస్తానని, అగ్రికల్చరల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తానని, క్యాతనపల్లిలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ‘కన్నీరు పెడుతున్న క్యాతనపల్లి’ అంటూ ఇటీవల తాము ఒక కరపత్రం విడుదల చేశామని, వెంటనే కొబ్బరి కాయలు కొట్టడం ప్రారంభించారని అన్నారు. క్యాతనపల్లి, చెన్నూర్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రాజారమేష్, పార్టీ క్యాతనపల్లి ఇన్చార్జి పల్లె భూమేష్, నాయకులు మేడిపెల్లి సంపత్, జె.రవీందర్, బడికల సంపత్, సుదర్శన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జాతరకు ముమ్మర ఏర్పాట్లు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ ఆర్కే1ఏ గని సమీపంలోని పాలవాగు ఒడ్డున జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సమ్మక్క–సారలమ్మ కొలువుదీరే గద్దెలకు రంగులు వేసి తీర్చిదిద్దారు. జాతర ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల రాకపోకలకు వీలుగా తాత్కాలిక రోడ్ల నిర్మాణం చేపట్టారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలు అమర్చారు. బుధవారం సాయంత్రం సారలమ్మ, గురువారం సమ్మక్కను గద్దైపె ప్రతిష్టించనున్నారు. మందమర్రిలోని దూలం కనకయ్య ఇంటి నుంచి అమ్మవార్లను జాతర ప్రాంగణానికి ఊరేగింపుగా తరలించనున్నారు. శనివారం దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. -
నాగోబాకు మొక్కులు
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కా వడంతో ఆలయం జనసంద్రమైంది. దర్శనం కో సం బారులు తీరారు. అనంతరం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమి షన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రత్యేక పూజలు అ నంతరం దర్శించుకున్నారు. మెస్రం వంశీయులు ఆయన్ను శాలువాతో సత్కరించి నాగోబా చిత్రపటాన్ని బహూకరించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి, రాంబాబు నాయక్, శంకర్, ప్రవీ ణ్, లక్ష్మీనారాయణ, అధికారులు సునీత, అంబాజీ, నర్సింగ్, నారాయణరెడ్డి, సర్పంచ్ తుకారాం, ఆలయ కమిటీ చైర్మన్ ఆనంద్రావు ఉన్నారు. -
పెండింగ్ డీఏలు ప్రకటించాలి
మంచిర్యాలఅర్బన్: ఉపాధ్యాయుల పెండింగ్ ఐదు డీఏలు ప్రకటించి పీఆర్సీని అమలు చేయాలని తప స్ రాష్ట్ర అధ్యక్షుడు ఓడ్నాల రాజశేఖర్ అన్నారు. మంచిర్యాలలో ఆదివారం నిర్వహించిన తపస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమ లు చేయాలని, జీవో 317తో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రెమ్యూనరేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహఅధ్యక్షుడు బండి రమేశ్, వెబ్సైట్ వింగ్ కన్వీనర్ విద్యాసాగర్, మహిళా కోకన్వీనర్ రమాదేవి పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గం..తపస్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బగ్గని రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా భారతీ ఆశోక్, ఉపాధ్యక్షులుగా సమ్మయ్య, నీలేష్కుమార్, శ్రీనివాస్, శ్రీధర్, రాజ్యలక్ష్మి, సత్తిరెడ్డి, నాగరాజ్, కార్యదర్శులుగా పి.శ్రీనివాస్, నాగేందర్, తిరుపతి రెడ్డి, రజిత, శ్రీకాంత్, శ్రీరాములు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, సోషల్ మీడియా, స్పోర్ట్స్, కల్చరల్, డిసిప్లేన్, సేవా వింగ్తోపాటు పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
సమ్మక్క–సారలమ్మకు ఎత్తు బంగారం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రెండేళ్లకోసారి జరి గే సమ్మక్క–సారలమ్మ జాతరలో భాగంగా ఆదివా రం భక్తులు ఇళ్లల్లో అమ్మవార్లకు పూజలు చేసి మొ క్కులు చెల్లించుకున్నారు. ఇక జాతరకు వెళ్లి మొక్కులు చెల్లించుకోవడమే మిగిలి ఉంది. ఈ నెల 28నుంచి 31వరకు సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా చివరిరోజున తల్లులకు అత్యంత ఇష్టమైన బంగారం (బెల్లం) భక్తులు నిలువెత్తు సమర్పించుకోనున్నారు. జిల్లా కేంద్రంతో పాటు బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ తదితర ప్రాంతాల్లో అమ్మవార్లకు పెద్ద ఎత్తున ఇప్పటికే మొక్కులు చెల్లించుకున్నారు. బెల్లం విక్రయించే ప్రధాన మార్కెట్లు భక్తులతో కిటకిటలాడాయి. జాతర సమీపించడంతో బెల్లం అమ్మకాలు జోరుగా సాగాయి. నిలువెత్తు బెల్లం తూకం వేయించి తలలపై ఎత్తుకుని ఇళ్లకు వెళ్లారు. ఆ తర్వాత బెల్లంతోపాటు మేకలు, కోళ్లతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. వీధుల్లో బెల్లాన్ని పంచిపెట్టారు. -
సేవలు విస్తరింపజేయాలి
దండేపల్లి: లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ సింహరాజు కోదండరామ్ సూచించారు. దండేపల్లిలో నిర్మించిన లయన్స్ క్లబ్ సేవాభవన్ను ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. దండేపల్లిలో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన అనతికాలంలోనే అనేక సేవాకార్యక్రమాలు చేపట్టి సొంతభవనం ని ర్మించుకోవడం అభినందనీయమని పేర్కొన్నా రు. అనంతరం స్థలదాత కొండు సత్తన్నను స న్మానించారు. క్లబ్ అధ్యక్షుడు కొండు జనార్దన్, కార్యదర్శి గడ్డం రాంచందర్, కోశాధికారి కల్లెం రాజన్న, జిల్లా చైర్పర్సన్ మాదంశెట్టి మల్లి కార్జున్, భద్రేశం, రమేశ్, సతీశ్, భూమేశ్, కిష న్, సుగుణాకర్, అంజిత్రావ్, లక్ష్మణ్, రామ న్న, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
భీమిని: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. ఆదివారం కన్నెపల్లి మండలంలో సుమారు రూ.1.43కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవనాన్ని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య భద్రత, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయ భవనాల మంజూరుకు కృషి చేయాలని పలువురు కోరారు. సాలీగాం పీపీరావు ప్రాజెక్ట్లో ముంపునకు గురైన బాధితులకు స్థలం కేటాయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం పూర్తయిందని, రామగుండం సీపీతో మాట్లాడి ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింగరావు కోరారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. డీఎంహెచ్వో అనిత, డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్నాయక్, వైద్యులు అనిల్కుమార్, దీప్తి, తహసీల్దార్ రాంచందర్రావు, ఏసీపీ రవికుమార్, సర్పంచులు జయలక్ష్మి, వెంకుమేర తదితరులు పాల్గొన్నారు. -
ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు
నస్పూర్: ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ పేర్కొన్నారు. నస్పూర్లోని కలెక్టరేట్లో ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ‘నా దేశం–నా ఓటు’ నినాదంతో అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకున్న సీనియర్ సిటిజన్లు, యంగ్, దివ్యాంగ ఓటర్లు, ఉత్తమ బూత్స్థాయి అధికారులు, స్వీప్ నోడల్ అధికారి, కళాజాత బృందం సభ్యులు, లక్సెట్టిపేట, హాజీపూర్ తహసీల్దార్లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమో దు చేసుకోవడంతోపాటు ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావు, జిల్లా గ్రా మీణాభివృద్ధి అధికారి కిషన్, డీపీవో వెంకటేశ్వర్రావు, జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శంకర్, ప్రోగ్రాం అధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘భూములు లాక్కుంటే ఊరుకోం’
నెన్నెల: అడవుల అభివృద్ధి పేరుతో గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర నేత కొయ్యల ఏమాజీ హెచ్చరించారు. ఆదివారం మండలంలోని చిత్తాపూర్లో పార్టీ మండలాధ్యక్షుడు అంగలి శేఖర్తో కలిసి గిరిజన కుటుంబాలతో మాట్లాడారు. చిత్తాపూర్లో 82మంది గిరిజనులు 30ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా లాక్కున్నారని ఆరోపించారు. 20మంది గిరిజన రైతుల మీద అక్రమ కేసులు నమోదు చేసి కోర్టుకు పంపడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేసులు ఎత్తివేయాలని, పోడు భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు న్యాయం జరిగేదాకా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇటీవల సర్పంచ్గా గెలుపొందిన ఒడం కమల–మల్లయ్య, ఉపసర్పంచ్ వెంకటేశ్ను శాలువాలతో సన్మానించారు. నాయకులు గోవర్ధన్, శ్రావణ్కుమార్, నర్సింగ్, యాదగిరి, శ్రీనివాస్గౌడ్, షఫీ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం
చెన్నూర్: మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆదివారం చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డుకు చెందిన మాదాసు శ్రీలత, మొండిలకు కమలం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం బీజేపీతోనే అభివృద్ధి జరుగుతుందని, అందరూ బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజ యఢంకా మోగిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, మున్సిపల్ ఎన్ని కల కన్వీనర్ రాపర్తి వెంకటేశ్వర్, కో కన్వీనర్ గర్రెపల్లి వెంకటనర్సయ్య, నాయకులు కొండపాక చారి, ఏతం శివకృష్ణ, శ్రావణి, స్వరూపలు పాల్గొన్నారు. -
కలప పట్టివేత
ఇచ్చోడ: గుడిహత్నూర్ మండలం చింతగూడ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్చోడ అటవీ డివిజనల్ అధికారి చిన్న విశ్వనాథభూస్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పక్కా సమాచారంతో శనివారం రాత్రి అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. కొందరు ఇళ్లల్లో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకుని ఇచ్చోడ ప్రభుత్వ టింబర్ డిపోకు తరలించారు. నిందితులు రాంటెంకి శ్రీకాంత్, దుర్గం నవీన్, రాంటెంకి వికాస్, జాడే రంజిత్, గొల్లపల్లి కిరణ్, కడారి మల్లేశ్, బోర్లకుంట సునీల్, పిప్పాల విజయ్, దుర్గం భగవాండ్లపై కేసులు నమోదు చేశారు. మొత్తం 122 కలప సైజులు ఉండగా, వీటి విలువ రూ.1,60,876 ఉన్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కలప అవసరమైన వారికి ఇచ్చోడ ప్రభుత్వ కలప డిపోలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇచ్చోడ, ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, బోథ్ ఎఫ్ఆర్వోలు టి.పుండలిక్, గులాబ్సింగ్, సంతోష్, ప్రణయ్, బజార్హత్నూర్, ఇచ్చోడ డిప్యూటీ ఏఆర్ఓలు ప్రవీణ్ మహాజన్, ఇబ్రహీం షరీఫ్, గుడిహత్నూర్ ఎఫ్ఎస్ఓ ఇమ్రాన్, దామన్గూడ ఎఫ్బీఓ బి.ప్రశాంత్ పాల్గొన్నారు. -
విద్యార్థినులకు కలెక్టర్ అభినందన
జన్నారం: జాతీయస్థాయి కళోత్సవంలో ప్రతిభ కనబరిచిన కిష్టాపూర్ జెడ్పీ హైస్కూల్కు చెందిన పదో తరగతి విద్యార్థినులు ఎస్.అరవిందరాణి, కే వర్షితతోపాటు గైడ్ టీచర్లు కమలాకర్, ప్రకాశ్ను కలెక్టరేట్లో ఆదివారం కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే గ డ్డం వినోద్, డీఈవో యాదయ్య అభినందించారు. ప్రధానోపాధ్యాయుడు గుండ రాజన్న, సర్పంచ్ వాసల నరేశ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ మంగ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకలను విజయవంతం చేయండినస్పూర్: జిల్లా కేంద్రంలోని బాలుర పాఠాశాల పరేడ్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. ముఖ్య అతిథిగా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కుమార్ దీపక్ హాజరై ఉదయం 9గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవందనం చేస్తారని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ ప్రసంగం, బాలబాలికల సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, ప్రశంసాపత్రాల ప్రదానం, స్టాళ్ల సందర్శన, ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. -
ఆ రైళ్లు ఆగేదెప్పుడో..!
ఆదాయం ఉన్నా రైళ్లేవి?ఆదాయం ఉన్నా మంచిర్యాల రైల్వేస్టేషన్లో ఆ రైళ్ల నిలుపుదల సంఖ్య తక్కువే. ఇక్కడ స్టాఫ్ ఉన్నా తక్కువ రైళ్లతోనే ప్రయాణికుల నుంచి ఆదాయం అధికంగా వస్తున్నట్లు తెలు స్తోంది. 2024–25లో రైల్వే వార్షిక ఆదాయపరంగా చూస్తే దాదాపు మంచిర్యాల రైల్వేస్టేషన్ రూ.21 కోట్లతో ఎన్ఎస్జీ–3 కేటగిరిలో చోటు లభించింది. రామగుండానికి రూ.15 కోట్లు, పెద్దపల్లి జంక్షన్కు రూ.11 కోట్లు, సిర్పూర్కు రూ.11 కోట్లతో ఎన్ఎస్జీ–4వ కేటగిరి లో చోటు దక్కింది. తక్కువ ఆదా యం ఉన్నా బెల్లంపల్లికి 5వ కేటగిరి పరిగణిస్తున్నారు. ఎన్ఎస్జీ–4వ గ్రేడ్ రైల్వేస్టేషన్ సిర్పూర్కాగజ్నగర్లో 124 రైళ్ల హాల్ట్ ఉన్నప్పటికి దాదాపు రూ.11 కోట్లు కాగా, మంచిర్యాలలో 83 రైళ్ల హాల్ట్తో రూ.20 కోట్లపై ఆ దాయం ఉన్న అనుకున్నమేర హాల్టింగ్ ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పనులతో రద్దు..జాతరకు ప్రత్యేక రైళ్లు!మంచిర్యాలఅర్బన్: మేడారం జాతర వేళ రైల్వేశా ఖ నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల నుంచి మే డారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈనెల 28, 30 ఫిబ్రవరి 1 తేదీ ల్లో మంచిర్యాల నుంచి మధ్యాహ్నం 3.30 గంట లకు బయల్దేరి రాత్రి 10.10 గంటలకు సి కింద్రాబాద్కు చేరుకుంటుంది. 28, 30, ఫిబ్రవరి 1 తేదీ ల్లో ఉదయం 5.45 గంటలకు అక్కడి నుంచి బ యల్దేరి మధ్యాహ్నం 1.30గంటలకు మంచి ర్యాలకు చేరుకోనుంది. జనసాధారణ్ పేరుతో రైలు లో రిజర్వేషన్ బోగీలు ఉండవని ప్రకటించింది. 29, 31 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్ కు ఉదయం 5.45 గంటలకు బయల్దేరి కాగజ్నగర్కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని అధికారులు ప్రకటించారు. తిరిగి కాగజ్నగర్ నుంచి మధ్యాహ్నం 2.20 బయల్దేరి సికింద్రాబాద్ కు రాత్రి 10.10 గంటలకు చేరుకుంటుందన్నారు. ఇంటర్ లాకింగ్ పనులతో రైళ్లు రద్దుమందమర్రి నుంచి బెల్లంపల్లి మధ్య 10 కి.మీ మూడవ రైల్వే మార్గం అందుబాటులోకి తీసుకురావడానికి నాన్, ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేశారు. మరికొన్ని పాక్షికంగా, ఇంకొన్ని దారిమళ్లించి ప్రయాణికులు ప్రత్నామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ద.మ. రైల్వే జోన్ అఽధికారులు సూచించారు. ఈనెల 24 నుంచి 17003 కాజీపేట్ నుంచి సిర్పూర్ టౌన్, 17004 బల్లార్షా నుంచి కాజీపేట్ రామగిరి మెము ఎక్స్ప్రెస్ రైలు ఫిబ్రవరి 14వ తేదీ వరకు రద్దు చేశారు. ఈనెల 23 నుంచి ఫిబ్రవరి 13 వర కు 17035 కాజీపేట్ నుంచి బల్లార్షా ఎక్స్ప్రెస్, ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు 17036 బల్లార్షా నుంచి కాజీపేట్ ఎక్స్ప్రెస్ రద్దు చేశారు. ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు 17033 భ ద్రాచలం రోడ్డు నుంచి బల్లార్షా, 17034 సిర్పూ ర్ టౌన్ నుంచి భద్రాచలం రోడ్డు వరకు నడిచే సింగరేణి మెము ఎక్స్ప్రెస్ వరంగల్ నుంచి బల్లార్షా, సిర్పూర్ టౌన్ నుంచి వరంగల్ మధ్య పాక్షికంగా రద్దయింది. వరంగల్ నుంచి భద్రాచలం వరకు యధాతథంగా నడస్తుందని అఽధికా రులు తె లిపారు. బోధన్–కరీంనగర్–సిర్పూర్టౌన్ ప్యా సింజర్ రైలు ఫిబ్రవరి 14 వరకు రద్దు చేశారు. -
భారత్ పర్వ్–2026కు ఎంపిక
కోటపల్లి: గణతంత్ర వేడుకలు పురస్కరించుకుని కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ ఎర్రకోట వేదికగా ఈనెల 26 నుంచి 31 వరకు నిర్వహించే భారత్ పర్వ్–2026కు మండలంలోని కొల్లూర్కు చెందిన నిమ్మల విజయ్కుమార్ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ సంస్కృతులు, కళలు, వారసత్వాన్ని చాటిచేప్పే భారీ ప్రదర్శనలో రాష్ట్రం తరపున జానపద నృత్యాలు ప్రదర్శించనున్నారు. గ్రామస్తులు, నాయకులు విజయ్కుమార్ను అభినందించారు. పొచ్చెర జలపాతం వద్ద వింటర్ క్యాంప్ బోథ్: ప్రకృతి ప్రేమికులు, వన్యప్రాణి ఔత్సాహికులు పొచ్చెర జలపాతం వద్ద వింటర్ క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. జాతీయ పులుల గణనలో భాగంగా వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వలంటీర్లు, నేచర్ సొసైటీ సభ్యులు ప్రత్యేకంగా నైట్ క్యాంపు ఏర్పాటు చేశారు. రాత్రంతా అక్కడే బస చేశారు. ఉదయం అటవీ అందాలు, జలపాతాలను చూసి వలంటీర్లు అబ్బురపడ్డారు. పొచ్చెర జలపాతం వద్ద సహజ సిద్ధమైన ప్రకృతిని చూసి వారు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్, సీపీఐ పొత్తు కుదిరేనా?
బెల్లంపల్లి: జిల్లాలో త్వరలో నిర్వహించనున్న ము న్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తుపై సందిగ్ధత నెలకొంది. రెండు పార్టీలు కలిసికట్టుగా పురపోరుకు సిద్ధమవుతాయా? లేదా అనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ నుంచి సరైన సానుకూలత వ్యక్తం కావడం లేదనే అసంతృప్తి సీపీఐ నేతల్లో వ్య క్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు పార్టీల మధ్య భావసారూప్యత ఏర్పడి సత్ఫలితాలు సాధించగా.. ప్రస్తుతం ఆ సయోధ్య లేదు. ఇరుపార్టీల బలాబలాలు జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తోపాటు బెల్లంపల్లి, క్యాతనపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగనున్నాయి. కోల్బెల్ట్ ప్రాంతాల్లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)కు పట్టుంది. మందమర్రి ఎంపీపీ స్థానాన్ని మూడుసార్లు, క్యాతనపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి రెండు పర్యాయాలు గతంలో గెలుచుకున్న చరిత్ర సీపీఐకి ఉంది. మంచిర్యాల కార్పొరేషన్లో విలీనమైన నస్పూర్ బల్దియాలో గత ఎన్నికల్లో రెండు వార్డుల్లో విజయం సాధించగా.. బెల్లంపల్లి మున్సిపాల్టీలోనూ రెండు వార్డుల్లో గతంలో ప్రాతినిధ్యం వహించింది. తాజాగా రాజకీయ సమీకరణలు కొంత మారినప్పటికీ ప్రత్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే శక్తి ఎర్రజెండా పార్టీకి ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జిల్లాలోని బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని బలంగా ఉంది. ఏ పార్టీ మద్దతు లేకుండా పోటీ చేసే సత్తా కూడా హస్తం పార్టీకి ఉంది. రెండు చోట్ల ప్రాథమిక చర్చలు బెల్లంపల్లి, క్యాతనపల్లి మున్సిపాల్టీల్లో ఇటీవల కాంగ్రెస్, సీపీఐ క్షేత్రస్థాయి నాయకుల మధ్య ప్రాథమికంగా పొత్తులపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. బెల్లంపల్లిలో సీపీఐ ఆరు వార్డులు ఆశిస్తుండగా రెండు, క్యాతనపల్లిలో ఎనిమిది వార్డులు డిమాండ్ చేస్తుండగా నాలుగు కేటాయించడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇరుపక్షాల మధ్య ఇంకా ఎలాంటి అంగీకారం కుదరలేదని సమాచారం. మంచిర్యాల కార్పొరేషన్లో సీట్ల పంపకాలకు ఇంకా ముందడుగు పడలేదు. చెన్నూర్లో పొత్తు కుదరాల్సి ఉంది.పొత్తు కుదరకపోతే.. పొత్తు కుదరకపోతే సీపీఐ ఒంటరి పోరా టానికి సిద్ధపడే అవకాశాలున్నాయి. పొత్తు అంశం తేల్చకుండా అధికారంలోకి రాకముందు ఓ తీరు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరో తీరుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం సీపీఐ నా యకుల్లో వ్యక్తమవుతోంది. అవకాశము న్న ప్రతీ వార్డులో పోటీ చేసేందుకు సూత్రప్రాయంగా సీపీఐ నిర్ణయించినట్లు తెలు స్తోంది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధి నస్పూర్ ప్రాంతంలో దాదాపు 22 డివిజన్లు, క్యాతనపల్లిలో 22 వార్డులు, బెల్లంపల్లిలో 10వార్డులు, చెన్నూర్లో ఓ వార్డులో పోటీ చేయనున్నట్లు సమాచారం. కామ్రేడ్లతో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధపడుతుందా..? ఒంటరిగా పోటీ చేసి పాగా వేయాలని భావిస్తుందా? అనేది తేలాల్సి ఉంది. -
క్షుద్రపూజల కలకలం
చెన్నూర్: మున్సిపాలిటీలోని బేతాళవాడలో క్షుద్రపూజల కలకలం రేపింది. కొండ మాంత య్య, మధునయ్య ఇద్దరు అన్నదమ్ములు. శు క్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆ అన్నదమ్ముళ్ల ఇళ్ల ముందు బొగ్గుతో ముగ్గు వేసి రెండు ముక్కలు చేసిన నిమ్మకాయలు పెట్టి వెళ్లిపోయారు. శనివారం వారు తెల్ల వారుజాము నిద్రలేచి ఇంటి బయటకు వచ్చి చూస్తే ముగ్గు, నిమ్మకాయలను ఉండడాన్ని గమనించారు. ఎవరో క్షుద్రపూజలు చేసి ఉంటారని భయాందోళనకు గురయ్యారు. వెంట నే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఘట న స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాల్క సుమన్ చేసిన అభివృద్ధి ఏమిలేదు
● రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి రామకృష్ణాపూర్: చెన్నూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అభివృద్ధి ఏమిలేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ మూడో కొడుకునని చెప్పుకునే సుమన్ ఈ ప్రాంత ప్రజలకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోయారని ప్రశ్నించారు. పట్టణంలోని బీజోన్ మార్కెట్ ఏరియాలో వీధి వ్యాపారుల సౌకర్యార్థం నిర్మించిన మార్కెట్ ప్రాంగణాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.120 కోట్లు వెచ్చించామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్, కాంగ్రెస్ నాయకులు పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, గోపతి రాజయ్య, వొడ్నాల శ్రీనివా స్, యాకూబ్అలీ తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల పాత్ర కీలకం చెన్నూర్: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూర్, కోటపల్లి మండలాల్లో కొత్తగా ఎన్నికై న సర్పంచులతో శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ తివారి, తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్దపీట
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్లో భాగంగా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.16.24 లక్షల సబ్సిడీపై రైతులకు 6 పవర్ టిల్లర్లు, 6 రోటవేటర్లు, 52 పవర్ స్పేయర్లు, 16 బ్రష్ కట్టర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ, మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మముని, ఆత్మ బీఎఫ్ఏసీ చైర్మన్ సింగతి మురళి, మంచిర్యాల డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి ఎం.కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమించి మోసం చేసిన వ్యక్తి అరెస్టు
లక్సెట్టిపేట: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. పోలీసుస్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి రోడ్కు చెందిన వివాహితకు తన భర్తతో విడాకులయ్యాయి. కొన్నిరోజుల నుంచి ఇంటివద్దే ఉంటుంది. అదే కాలనీకి చెందిన సాయికిరణ్ ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలి ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
మందమర్రి ఏరియా ఉద్యోగులు వీరే..
మందమర్రిరూరల్: రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ అధికారిగా కాసిపేట–1 గని డిప్యూటీ మేనేజర్ ఎం.వెంకటేశ్, కేకే–ఓసీ ఓవర్మెన్ బత్తుల సత్యనారాయణ ఉత్తమ సింగరేణియన్గా ఎంపికయ్యారు. కొత్తగూడెంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం కృష్ణభాస్కర్ చేతుల మీదుగా సన్మానం అందుకోనున్నారు. సీహెచ్.నర్సయ్య (కోల్ కట్టర్, శాంతిఖని), మాటూరి రాజనర్సు (సీనియర్ మైనింగ్ సర్దార్, శాంతిఖని, నాడెం సతీశ్కుమార్ (ఎలక్ట్రీషియన్, కాసిపేట–2), మేకల కుమారస్వామి (కోల్ కట్టర్, కాసిపేట–2), లంక లక్ష్మణ్ (కోల్ కట్టర్, కాసిపేట–1), గొలుసుల వెంకటేశ్ (జనరల్ అసిస్టెంట్, కాసిపేట–1), బడుగు సంపత్రావు (ఫిట్టర్, కేకే–5), బత్తిని రామన్న (ట్రామర్, కేకే–5), కుర్రె రమేశ్ (ఈపీ ఆపరేటర్, కేకే–ఓసీపీ), దుర్గం రమేశ్ (కన్వేయర్ ఆపరేటర్, కేకే–ఓసీపీ) ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికయ్యారు. ఏరియాలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో జీఎం రాధాకృష్ణ వారిని సన్మానించనున్నారు. -
24 గంటల సూర్యనమస్కారాల ప్రదర్శన
మందమర్రిరూరల్: పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో గల స్టేజీపై స్థానికు డు మద్ది శంకర్, రామకృష్ణాపూర్కు చెందిన ముషిని వెంకటేశ్ (హోంగార్డు) శ శనివారం ఉదయం 24 గంటల పాటు సూర్యనమస్కారాల ప్రదర్శన చేపట్టారు. రథసప్తమి సందర్భంగా ఆదివారం ఉదయం 7 గంటల వరకు ఉంటుందని యోగా మాస్టర్ ముల్కల్ల శంకర్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 18న మద్ది శంకర్ ఒక్క గంటలో 180 సెట్లు సూర్క నమస్కారాలు ప్రదర్శించి అంతర్జాతీయ యోగా బుక్లో స్థానం సంపాదించాడు. ముషిని వెంకటేశ్ 2023 జూన్2 365 (ప్రతీరోజు 180 సె ట్ల సూర్య నమస్కారాలు) నాన్స్టాప్ సూర్యనమస్కారాల ప్రదర్శనతో అంతర్జాతీయ యో గా బుక్ ఆఫ్ రికార్డు సాధించాడు. వీరిని మా స్టర్, సభ్యులు, స్థానికులు అభినందించారు. -
తాళ్లపేట్ రేంజ్లో పులి పాదముద్రలు గుర్తింపు
● నేటితో ముగియనున్న పులుల గణన జన్నారం/దండేపల్లి: ఈ నెల 20న ప్రారంభమైన జాతీయ పులుల గణన నేటితో ముగియనుంది. ఎఫ్డీవో రామ్మోహన్ పర్యవేక్షణలో జన్నారం అటవీ డివిజన్లోని 40 అటవీబీట్లలో 86 మంది సిబ్బంది గణన చేస్తున్నారు. 20, 21, 22 తేదీలలో శాకాహార జంతువులు, 23 నుంచి 25 వరకు మాంసాహార జంతుగణన నిర్వహిస్తున్నారు. శనివారం దండేపల్లి మండలం తాళ్లపేట రేంజ్ చింతపల్లి ఈస్ట్, పాతమామిడిపల్లి బీట్లలో పరిశీలించి పులి పాదముద్రలు గుర్తించారు. రోజువారీగా చేస్తున్న జంతుగణన వివరాలను ఎంస్ట్రైబ్ సాఫ్ట్వేర్లో నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఇందన్పల్లి, జన్నారం, తాళ్లపే ట రేంజ్ అధికారులు లక్ష్మీనారాయణ, సుష్మరావు, కే.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
చెన్నూర్ విద్యార్థినికి ప్రతిష్టాత్మక అవార్డు
చెన్నూర్: జాతీయ స్థాయిలో నిర్వహించిన వీర్గాధ 5.0 సూపర్ 100లో చెన్నూర్ విద్యార్థినికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. భారత రక్షణ, విద్యా మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో దేశ, విదేశాల నుంచి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 100 మంది విద్యార్థులు విజేతలుగా ఎంపిక కాగా, రాష్ట్రం నుంచి నలుగురు ఉన్నారు. ఇందులో చెన్నూ ర్ శార్వాణి ఇంగ్లిష్ మీడియం పాఠశాల వి ద్యార్థిని తాండ్ర స్వరమంజుప్రియ ఎంపికై న ట్లు కరస్పాండెంట్ శ్రావణ్కుమార్రెడ్డి తెలిపా రు. శనివారం విద్యార్థినికి ఢిల్లీలో రూ.10 వేల నగదు,అవార్డు అందజేశారు. ఢిల్లీలోని కర్తవ్య పద్ వద్ద జరిగే గణతంత్ర పరేడ్లో ప్రత్యేక అతిథిగా పాల్గొనే అవకాశం లభించింది. -
హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి
ఆదిలాబాద్: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతీ హిందువు పాటుపడాలని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతిస్వామిజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరిలోనూ దైవం కొలువుంటుందన్నారు. దుర్గుణాలను వదిలి, సన్మార్గంలో నడిచినప్పుడు ఆధ్యాత్మికత పెంపొందుతుందన్నారు. ముందుగా నిర్వహించిన గంగాహారతి కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమంలో శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామి, మాహోర్ పీఠాధిపతి చింతామణి భారతి స్వామి, కిషన్ మహారాజ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, సనాతన ధర్మ హిందూ వేదిక ప్రతినిధులు జగదీష్ అగర్వాల్, రాఘవేంద్ర నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలి’
పాతమంచిర్యాల: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫె స్టో అమలు చేయాలని కోరుతూ శనివారం సీఎం రేవంత్రెడ్డికి పోస్టుకార్డులు పంపించా రు. ఈ సందర్భంగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ జ్యోతిబా ఫూలే బీసీ సబ్ప్లాన్, ఉన్నత విద్యకు రుణ సదుపాయం, సివిల్ కన్స్ట్రక్షన్లో 42 శాతం రిజర్వేషన్, జిల్లా కేంద్రాల్లో బీసీ భవన నిర్మాణం, బీసీల సంక్షేమానికి లక్ష కోట్ల బడ్జెట్ కేటాయింపు, బీసీ ఫెడరేషన్ల కింద నమోదైన సొసైటీల కు రూ.10 లక్షల ఆర్థికసాయం, తదితర హమీ లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు వెంకటయ్య, అంజన్న, అశోక్, సంతోష్, సత్యనారాయణ, ధర్మాజీ, మల్లేష్, శంకర్, రాజేశం, భిక్షపతి, రామన్న పాల్గొన్నారు. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి మంచిర్యాలరూరల్(హాజీపూర్): షోరూంలో ఇకపై వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నందున డీలర్లు ఆన్లైన్ నమోదులో పారదర్శకంగా చేపట్టాలని డీటీవో వి.గోపికృష్ణ తెలిపారు. ఆయన కార్యాలయంలో శనివా రం డీలర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. డీలర్ల వద్దే వాహన రిజిస్ట్రేషన్ చేసేలా తీసుకువచ్చిన సాఫ్ట్వేర్లో పత్రాల నమోదు జాగ్రత్తగా చే యాలన్నారు. అన్ని పత్రాలు పరిశీలించాలన్నారు. జిల్లాలోని ద్విచక్ర, కార్ల షోరూంల డీలర్లు పాల్గొన్నారు. ఇంటికి వెళ్లి..ఫిర్యాదు తీసుకుని.. దండేపల్లి: మండలంలోని గుడిరేవు గ్రామానికి చెందిన పంచాయతీ కార్మికుడు అరికిళ్ల రాజ న్నను శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన అరికిళ్ల నర్సయ్య రోకలితో తలపై కొట్టడంతో గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు పోలీస్స్టేషన్కు రాని పరిస్థితుల్లో పోలీ సులకు కేవలం సమాచారం మాత్రమే ఇచ్చా డు. దీంతో ఎస్సై తహసీనొద్దీన్ శనివారం రా త్రి బాధితుడి ఇంటికెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అనారోగ్యంతో మావోయిస్టు తల్లి మృతి మందమర్రిరూరల్: ఊ రు మందమర్రికి చెందిన మావోయిస్టు రవి తల్లి బబ్బెర లక్ష్మి(80) మృతిచెందింది. అనారోగ్యంతో శుక్రవారం రాత్రి కన్నుమూసింది. మృతురాలికి ఐదుగురు కు మార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు వెంకటి, చిన్నకొడుకు రవి ఉన్నారు. రవి ఇంట ర్ చదివే సమయంలో పీపుల్స్వార్ సిద్ధాంతాల కు ఆకర్శితుడై 1995 లో మావోయిస్టు పార్టీలోకి వెళ్లాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ హోదాల్లో పనిచేశాడు. అతనిపై పోలీస్ నిఘా పెట్టడంతో పార్టీ చత్తీస్ఘడ్కు పంపినట్లు సమాచారం. గత పదేళ్ల క్రితం తండ్రి దుర్గయ్య మృతిచెందాడు. శనివారం రాళ్లవాగులో తల్లి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద కుమారుడు వెంకటి తలకొరివి పెట్టాడు. -
● దశాబ్దాలుగా బాధ్యతాయుత డ్రైవింగ్ ● కెరియర్లో నో యాక్సిడెంట్స్ రికార్డు ● ఆదర్శంగా నిలుస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు
మనస్సును నియంత్రించుకోవాలి..నేను 1994లో ఉద్యోగంలో చేరాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమాదరహితంగా బస్సును నడుపుతున్నాను. డ్యూటీలోకి ఎక్కిన తర్వాత డ్రైవింగ్పై మాత్రమే దృష్టి సారించాలి. అప్పుడే వాహనం మన పూర్తి నియంత్రణలో ఉంటుంది. భావోద్వేగాలు లేకుండా, ఓపికతో మన మనస్సును నియంత్రించుకోవాలి. మూడు దశాబ్దాల నా విధి నిర్వహణలో నేను నేర్చుకున్న విషయం ఇదే. ఈ లక్షణమే నాకు మంచి డ్రైవర్ అనే గుర్తింపునిచ్చింది. – ఎండి. యూసుఫ్, మంచిర్యాల డిపో తొందరపాటే ప్రమాదాలకు కారణం..నేను 1991లో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఇన్ని సంవత్సరాలుగా ప్రమాదాలు లేకుండా నడపడానికి ప్రధాన కారణం వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవడమే. ఈ రోజుల్లో వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ వేగంగా వెళ్తున్నారు. ఈ తొందరపాటుతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని బస్సును నడిపితే ప్రయాణికులంతా సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకుంటారు. ఇదే విషయాన్ని ఆలోచనలో పెట్టుకొని నేను డ్రైవింగ్ చేస్తాను. – జి. గబ్బర్ సింగ్, ఉట్నూర్ డిపో ఆ చేతిలో స్టీరింగ్.. సురక్షితంఆదిలాబాద్: రోడ్డు ప్రమాదాలు నిత్య కృత్యమైన ఈ రోజుల్లో దశాబ్దాలుగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్న వారు మాత్రం ప్రమాదాలకు దూరంగా ఉంటున్నారు. లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. డ్రైవింగ్ అంటే ఉద్యోగం మాత్రమే కాదని, బాధ్యతాయుతమైన కర్తవ్యం అని పునఃనిర్వచిస్తున్నారు. ఉద్యోగంలో చేరింది మొదలు, ఇప్పటివరకు ఒక్క ప్రమాదం కూడా జరగకుండా అప్రమత్తంగా వాహనాన్ని నడిపి డ్రైవర్లందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అలాంటి వారిలో కొందరిపై ఓ లుక్కెద్దామా మరి. అన్నింటినీ గమనించాలి..నేను ఉద్యోగంలో చేరి 31 సంవత్సరాలు దాటింది. డ్యూటీ ఎక్కగానే ముందుగా బస్సుకు సంబంధించిన అన్ని భాగాలు సరిగా ఉన్నాయో లేవో సరి చూసుకుంటాను. స్టీరింగ్ మీదికి వచ్చిన తర్వాత మరోసారి కండిషన్ చెక్ చేసుకుంటాను. రోడ్డు పైకి వెళ్లగానే మన వాహనాన్ని కాకుండా చుట్టూ ఉన్న అన్ని వాహనాల వేగం కదలికలను గమనిస్తూ ఉండాలి. అదే సమయంలో భద్రతా నియమాలు పాటించాలి. అప్పుడే ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ఇతర వాహనదారులు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది. – జి. మణి, మంచిర్యాల డిపో తల్లి ఒడిలా భావిస్తా..2016లో ఉద్యోగంలో చేరాను. ఆర్టీసీ ప్రయాణం సుఖప్రదం– సురక్షితం అనే సంస్థ నినాదాన్ని పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నా. క్రమశిక్షణగా, ఏకాగ్రతతో నడిపితే ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవు. బస్సు స్టీరింగ్ పట్టింది మొదలు నేను చేసే ఉద్యోగాన్ని బతుకుదెరువుగా కాకుండా, బాధ్యతగా అనుకుంటాను. బస్సును తల్లి ఒడిలా భావించి, ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకి చేర్చడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. – భాస్కర్, ఆసిఫాబాద్ డిపో కుటుంబ సభ్యులుగా భావించి నడపాలి30 ఏళ్లుగా ఎలాంటి ప్రమాదం జరగకుండా బస్సును నడిపాను. ఒత్తిడి లేకుండా వాహనాన్ని నడిపితే, ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. మన కుటుంబ సభ్యులను ఎంత జాగ్రత్తగా తీసుకువెళ్తామో, అంతే బాధ్యతాయుతంగా ప్రయాణికులను సురక్షితంగా తీసుకువెళ్లాలి. అప్పుడే మన ఉద్యోగానికి తగ్గిన గౌరవం, సార్థకత లభిస్తుంది. – హన్మంతు, ఆసిఫాబాద్ డిపో -
మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు
మంచిర్యాలఅర్బన్: మేడారం మహా జాతరకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 1వరకు ప్రత్యేక బ స్సులు నడపనుంది. మంచిర్యా ల, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, చెన్నూర్తో పా టు ఆసిఫాబాద్ నుంచి బ స్సు సర్వీసులు నడిపేందు కు ఏర్పాట్లు చేస్తోంది. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ జా తరతో ఆదాయం సమకుర్చుకోవాలని ఆర్టీసీ సంస్థ యోచిస్తోంది. సింగరేణి కార్మిక క్షేత్రమైన మంచిర్యాల జిల్లా నుంచే భక్తులు అధికంగా జాతరకు వెళ్లివస్తుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా డిపోల పరిధిలోని బస్సులు ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆరు పాయింట్ల నుంచి బస్సు సర్వీసులు నడిపించనున్నారు. ఈ ఏడాది పెరిగిన బస్సులు.. వన దేవతల జాతరకు ఏటా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుతూ వస్తోంది. మంచిర్యాల, కుమురంభీం జిల్లా నుంచే 2020లో 304, 2022లో 320, 2024లో 365, ప్రస్తుతం 369 బస్సుల ద్వారా ప్రయాణికులను చేరవేయనున్నారు. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, తాండూర్, రామక్రిష్ణాపూర్ తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్నారు. ఆయా పాయింట్ల నుంచి బస్సులు ఇలా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 369 బస్సులు నడపనున్నారు. మంచిర్యాల డిపోకు చెందిన 115 బ స్సులు మంచిర్యాల బస్స్టేషన్ నుంచి నడిపించనున్నారు. ఆదిలాబాద్ డిపోకు చెందిన 70, చెన్నూర్ పాయింట్ నుంచి, ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సులు ఆసిఫాబాద్ 10, బెల్లంపల్లి పాయింట్ నుంచి 79 బస్సులు, భైంసాకు చెంది న 45 బస్సులను శ్రీరాంపూర్ పాయింట్కు, నిర్మల్ డిపోకు చెందిన 50 బస్సులను మందమర్రి పాయింట్కు కేటాయించారు. జాతరకు వెళ్లే ప్రయాణికులపై ఆర్టీసీ చార్జీల భారం మోపింది. దాదాపుగా రూ.30 నుంచి రూ.40 టికెట్ చార్జీలు పెంచింది.టికెట్ చార్జీలు ఇలా బస్పాయింట్ బస్సులు పెద్దలకు చెన్నూర్ 70 రూ.450 శ్రీరాంపూర్ 45 రూ.430 మందమర్రి 50 రూ.470 మంచిర్యాల 115 రూ.440 బెల్లంపల్లి 79 రూ.520 ఆసిఫాబాద్ 10 రూ.590మహిళలకు ఉచిత ప్రయాణం..ప్రత్యేక సర్వీసుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించారు. ప్రతీ మహిళ తప్పనిసరిగా అప్డేట్ చేసిన ఆధార్కార్డు, ప్రభుత్వం గుర్తింపుకార్డు చూపిస్తే అవకాశం కల్పిస్తున్నారు. -
నా దేశం నా ఓటు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఓటు ప్రజాస్వామ్యంలో తిరుగు లేని ఆయుధం. తమను పాలించే వారిని తామే ఎన్నుకునేందుకు వాడే గొప్ప వజ్రాయుధం. ఈ ఆయుధాన్ని సక్రమంగా వాడకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామిక రాజ్యంలో ఓటరు నిర్ణయమే శిరోధార్యం. ఉమ్మడి జిల్లాలో 22 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు సవరణలు, నమోదు, చేర్పులతో క్రమంగా ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. పది అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్సభ స్థానాలు, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మరో రెండు (ఉపాధ్యాయ, టీచర్స్) ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఇవే కాక గ్రామ వార్డు మెంబర్ నుంచి మొదలు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ఎన్నిక ఓటర్లపైనే ఉంది. సరైన వ్యక్తులను చట్టసభలకు ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడానికి ఓటే కీలకం. గత నెలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,505 గ్రామ పంచాయతీలు, 12,792 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరిలో ఉమ్మ డి జిల్లా పరిధిలో 11 మున్సిపాలిటీల కు, ఆ తర్వాత నాలుగు జిల్లాల పరిధి లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానా ల కు ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల నుంచి మొదలు దేశంలో అత్యున్నత పార్లమెంట్లోని లోక్ సభలో ప్రాతినిధ్యం వహించే వారిని నేరుగా ఓటుతోనే ఎన్నుకుంటున్నాం. అంటే మన ఊరి, పట్టణ, నగర పాలక వర్గాల నుంచి రాష్ట్ర, దేశ పాలకవర్గాల ను ఎన్నుకుంటున్నాం. చట్టాలు, శాసనాల రూపకల్పన, దేశాభివృద్ధికి ఉపయోగపడేలా ప్రజాప్రతినిధుల ఎంపికకు ఓటే కీలకంగా మారింది. అయితే ఇప్పటికీ చాలామందికి ఆ ఓటు ప్రాధాన్యత తెలియకపోగా నోటుకు, మద్యానికి, ఇతర బహుమతులకు అమ్ముకోవడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. అమూల్యమైన ఓటు అమ్ముకోకు..ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో రాజ్యాంగం కల్పించిన ఓటును అమ్ముకుంటే దుర్వినియోగమవుతుంది. గె లుపేలక్ష్యంగా అభ్యర్థులు చూపే ప్రలోభాలకు లొంగితే స్వచ్ఛమైన పాలకులను ఎన్నుకునే అవకాశం కోల్పోతాం. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారే ప్రమాదం ఉంది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో ‘ఓటు అమ్ముకోం’ అంటూ కొందరు ఇంటిముందే బోర్డులు పెట్టి తమ తీరును తెలియజేశారు. మరికొంద రు ఓటర్లు తమకు డబ్బులు ఇవ్వలేదని అభ్యర్థుల ను నిలదీశారు. ఇంకొన్నిచోట్ల ఓటర్లకు డబ్బులు పంచితే ఓట్లు వేయలేదని ఇంటింటికీ తిరిగి పైసలు అడుక్కున్నారు. డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదని ఫిర్యాదులు, పంచాయితీలు జరిగాయి. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య పరిణితికి గొడ్డలిపెట్టులా మారుతున్నాయి. ఈ క్రమంలో ఓటు సక్రమంగా వాడితే దేశపురోగతికి దోహదపడుతుంది.‘మై ఇండియా మై ఓట్’దేశవ్యాప్తంగా ఓటరు దినోత్సవం నిర్వహిస్తూ .. ఓటు ఆవశ్యకతను చెబుతూ.. కొత్త వారి నమోదు, వినియోగంపై మరింత అవగాహన పెంచుతున్నారు. ఎన్నికల సంఘం ఏటా ఒక ప్రత్యేక ఇతివృత్తం (థీమ్)తో జరుపుతోంది. ఈ ఏడాది ‘మై ఇండియా మై వోట్’ (నా భార త దేశం – నా ఓటు) సిటిజన్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ (భారత పౌరుడు ప్రజాస్వామ్య గుండెల్లో ఉంటాడు’ అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బ్రిటీష్ వలస పాలన అంతమై, స్వాతంత్య్రం వచ్చాక భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది. సొంత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. గణతంత్ర రాజ్యంగా మారే క్రమంలో 1950 జనవరి 25న దేశ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ రోజుకు గుర్తుగా 2011 నుంచి దేశ వ్యాప్తంగా ఓటరు దినో త్సవం జరుపుకుంటున్నారు. మొదట 21 ఏళ్ల కు ఓటు హక్కు ఉంటే 61వ రాజ్యాంగ సవరణ చేసి, ఆ వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించారు. అప్పటి నుంచి దేశంలో 18 ఏళ్ల పౌరులకు ఓటు హక్కు కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ఓటర్లు (2025 జనవరి సవరణ ప్రకారం)నియోజక పురుషులు సీ్త్రలు ఇతర సర్వీస్ మొత్తం వర్గం ఓట్లు సిర్పూర్ 1,15,323 1,15,811 16 305 2,31,455 చెన్నూర్ 96,964 99,049 07 141 1,96,161 బెల్లంపల్లి 88,109 90,286 13 178 1,78,586 మంచిర్యాల 1,39,306 1,42,421 26 365 2,82,118 ఆసిఫాబాద్ 1,13,815 1,15,813 16 121 2,29,765 ఖానాపూర్ 1,11,157 1,16,549 14 431 2,28,151 ఆదిలాబాద్ 1,21,050 1,26,805 06 248 2,48,109 బోథ్ 1,03,554 1,10,453 02 579 2,14,588 నిర్మల్ 1,23,088 1,37,730 21 248 2,61,087 ముధోల్ 1,25,148 1,32,948 17 293 2,58,406 -
హైస్కూళ్లకు సైన్స్ కిట్లు
మంచిర్యాలఅర్బన్: సర్కారుబడిలో చదివే విద్యార్థులకు ప్రయోగాత్మక అభ్యాసం ద్వారా సైన్స్ సులభ ంగా అర్థమవుతుంది. సృజనాత్మకత, శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు వీలు ఉంటుంది. వి ద్యాశాఖ ద్వారా పాఠశాలలకు సైన్స్ కిట్లు అందించాలని నిర్ణయించింది.ఈ కిట్లలో డీఐవై(డూ ఇంట్ యువర్సెల్ప్)ఎస్టీఈఎంప్రాజెక్టులు,రసాయన ప్ర యోగాలు ఎలక్ట్రానిక్, రోబోటిక్ అంశాలుంటాయి. ఉమ్మడి జిల్లాలో..కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల్లో సృజనాత్మకత, సైన్స్ టెక్నాలజీ నైపుణ్యం పెంపునకు మంచిర్యాల జిల్లాలో 21 అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్)లు ఏ ర్పాటు చేసింది. 6 నుంచి 12వ తరగతి విద్యార్థుల్లో ఆవిష్కరణలు, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు వృద్ధి చేస్తున్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్, సృజనాత్మకత నాయకత్వ లక్షణాలు, అత్యాధునిక సాంకేతికపై అవగాహన కలుగుతుంది. ల్యాబ్లో త్రీడీ ప్రింటింగ్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిసీయల్ ఇంటెలిజెన్స్, సెన్సార్ అధునిక టెక్నాలజీని అందిస్తున్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ లేని పాఠశాలల్లో విద్యార్థులను ఇంజినీరింగ్ నైపుణ్యాలు పెంచేందుకు తొలిదశలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 73 స్కూళ్లు ఎంపిక చేశారు. సమగ్రశిక్ష కింద అందించే సైన్స్ కిట్లను 70 కేజీబీవీలు, పీఎంశ్రీ కింద ఎంపికై న మోడల్ స్కూళ్లు మినహాయిస్తే మిగిలిన మూడు మోడల్స్కూళ్లలో వీటిని అందించనున్నారు. ఆది లాబాద్ జిల్లాలో జైనథ్, బోఽథ్, మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండలం లింగాపూర్ మోడల్ స్కూళ్లు ఉన్నాయి. పాఠశాల స్థాయిలో ఇంజనీరింగ్ నైపుణ్యాల పెంపునకు విద్యార్థులకు ఈ కిట్లు ఎంతో దోహదం కానున్నాయి. -
బెస్ట్ సింగరేణియన్గా సమ్మిరెడ్డి
శ్రీరాంపూర్: గణతంత్ర వేడుకలు పురస్కరించుకొని సింగరేణి ఉత్తమ కార్మికులను ఎంపిక చే సింది. శ్రీరాంపూర్ ఏ రి యా నుంచి ఆర్కే న్యూ టెక్ గనికి చెందిన ఎస్డీఎల్ ఆపరేటర్ కంది సమ్మిరెడ్డి బెస్ట్ సింగరేణియన్గా ఎంపికయ్యారు. ఎస్డీఎల్ ద్వారా అత్యధిక టబ్బులు నింపి, మెరుగైన హాజరుశా తం ఉండటం, యాక్సిండెంట్లకు దూరంగా ఉంటూ పనిచేసినందుకు ఆయన్ను కంపెనీస్థాయిలో ఎంపిక చేసింది. ఆయనతోపాటు ఉత్త మ అధికారిగా ఏరియా నుంచి శ్రీరాంపూర్ ఓ సీపీ మేనేజర్ ఐ.శ్రీనివాస్ ఎంపికకాగా, వీరిని కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద ఈనెల 26న జరిగే వేడుకల్లో సీంఎండీ చేతులమీదుగా సన్మానించనున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో వివిధ గనులు, డిపార్టుమెంట్ల నుంచి మొత్తం 16 మందిని ఉత్తమ కార్మికులుగా ఎంపిక చేశారు. ఇందులో తోట వెంకటేశం(ట్రామర్, ఆర్కే 5), టి.సరోత్తంరెడ్డి(సీనియర్ మైనింగ్ సర్దార్, ఆర్కే 5), దుర్గం తిరుపతి(కోల్ కట్టర్, ఆర్కే 7), ఎం భాస్కర్రెడ్డి (ఫిట్టర్, ఆర్కే 7), టి.అంజయ్య(హాలర్ ఆపరేటర్, ఆర్కే న్యూటెక్), కట్కం శ్రీనివాస్ (ఫిట్టర్, ఆ ర్కే న్యూటెక్), దోర్నాల అనంతరెడ్డి(కోల్కట్ట ర్, ఎస్సార్పీ–1), ఇందుపల్లి జాన్సన్ (సపోర్టుమెన్, ఎస్సార్పీ–1), కోన శ్రీనివాస్(కోల్ కట్టర్, ఎస్సార్పీ–3, 3ఏ), దుంపటి మల్లయ్య(ట్రామర్, ఎస్సార్పీ–3, 3ఏ), పత్తి మల్లారెడ్డి(సీనియర్ మైనింగ్ సర్దార్, ఐకే–1ఏ), సీహెచ్ వెంకటేశ్వర్లు(ఎస్డీఎల్ ఆపరేటర్, ఐకే–1ఏ), ఏ.కిరణ్కుమార్(ఫోర్మెన్, ఐకే ఓసీపీ), పి.కులశేఖర్(ఎలక్ట్రీషియన్, ఐకే–ఓసీపీ), గుడెల్లి నా రాయణ(హెడ్ ఓవర్మెన్, ఎస్సార్పీ–ఓసీపీ), ఓల్లపు నర్సింగం(ఈపీ ఫిట్టర్, ఎస్సార్పీ–ఓసీపీ) ఉన్నారు. శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో జరిగే వేడుకల్లో జీఎం చేతుల మీదుగా సన్మానించి ప్రశంసపత్రం అందించనున్నారు. -
రంజాన్ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ సంక్షేమ శాఖలు, మున్సిపల్ కమిషనర్లు, ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసీదులు, ప్రార్థనా మందిరాలు, ప్రజా ప్రదేశాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. అంతర్గత రహదారుల్లో సరైన లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావు, డీపీవో వెంకటేశ్వర్రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, ఏసీపీ ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. -
బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలఅగ్రికల్చర్: బాలికలు విద్యతో పాటు అన్నిరంగాల్లో రాణించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సీ్త్ర, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల సంరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ బాలికలు ప్రతీ విషయంలో నైపుణ్యం పెంపొందించుకుని ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలన్నారు. అనంతరం జాతీయ బాలికల దినోత్సవం సంబంధిత పోస్టర్ ఆవిష్కరించారు. బేటీ బచావో– బేటీ పడావో ప్రతిజ్ఞ చేశారు. చదువుతో పాటు క్రీడలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన బాలికలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ఖాన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, డీఈవో ఎస్.యాదయ్య, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దు ర్గాప్రసాద్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్లతో కలిసి హాజరయ్యారు. సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సరస్వతీ నమస్తుభ్యం
బాసర:జ్ఞానసరస్వతీదేవి పుట్టిన రోజు అయిన మా ఘ శుద్ధ పంచమిని వసంత పంచమిగా నిర్వహిస్తా రు. శుక్రవారం వసంత పంచమి కావడంతో నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి వేలమంది అమ్మవారి దర్శనం, చిన్నారుల అక్షరాభ్యాస పూజల కోసం వచ్చారు. గురువారం అర్ధరాత్రి దాటిన వెంటనే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో స్నానఘట్టాలు నిండిపోయాయి. దర్శనానికి 4 గంటల సమయం.. వెకువజామున 2 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీ రారు. అమ్మవారి దర్శనానికి 4 గంటల సమ యం పట్టింది. ఇక చాలా మంది భక్తులు బాసరకు పాదయాత్రగా వచ్చారు. వీరిని సిబ్బంది ప్రత్యేకంగా మండపాలకు మళ్లించారు. గంగమ్మతల్లి, సూర్యేశ్వరస్వామి, కాళీమాత వ్యాసగుహవద్దకూడా భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ.. వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతీ దేవి ఆలయాన్ని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున 1:30 నుంచే జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవారులకు అభిషేకం, మంగళ వాయిద్య, సుప్రభాత, కుంకుమార్చనలు జరిగాయి. వైదిక బృందం అంకురార్పణ చేసింది. అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ పట్టు వస్త్రాలు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దర్శనం తర్వాత ఆలయ అధికారులు ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తుందని, గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్ల మాస్టర్ ప్లాన్ రూపొందిస్తుందని తెలిపారు. నిర్మల్, ముధోల్ ఎమ్మెల్యేలు, భైంసా సబ్ కలెక్టర్, ఈవోలు పాల్గొన్నారు. దర్శించుకున్న ప్రాముఖులు.. నిర్మల్ జిల్లా జడ్జి శ్రీవాణి, నిర్మల్, ముధోల్ ఎమ్మెల్యేలు మహేశ్వర్డ్డి, రామారావు పటేల్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, భైంసా సబ్కలెక్టర్ అజ్మీర్ సంకేత్ కుమార్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. పటిష్ట పోలీస్ బందోబస్తు... వసంపంచమి నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సీ జానకీషర్మిల తెలిపారు. ఏఎస్పీలు రాజేశ్మీనా, సాయికిరణ్పాటు 8 మంది సీఐలు, 22 మంది ఎస్సైలు, ముగ్గురు మహిళా ఎస్సైలు, 15 మంది ఏఎస్సైలు, 340 మంది పోలీసులు, మంది మహిళా సిబ్బంది, 64 మంది హోంగార్డులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. ఆదాయం రూ.56.38 లక్షలుబాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. వివిధ ఆర్జిత సేవల టికెట్ల విక్రయంతో మొత్తం రూ.56,38,275 వచ్చింది. 6,325 చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించినట్లు ఈవో అంజనాదేవి తెలిపారు. టికెట్లవారీగా ఆదాయ వివరాలు.. సేవ రకం ధర విక్రయించిన ఆదాయం అక్షరాభ్యాస పూజ 1,000 3,850 38,50,000 అక్షరాభ్యాస పూజ 150 2,475 3,71,250 ప్రత్యేక దర్శనం 100 5,770 5,77,000 లడ్డూ ప్రసాదం 25 23,771 5,94,275 పులిహోర ప్రసాదం 20 12,300 2,46,000 -
ఘనంగా ‘బేతల్’
ఇంద్రవెల్లి: ఈనెల 18న మహాపూజతో కేస్లాపూర్లో నాగోబా జాతరను ప్రారంభించిన మెస్రం వంశీయులు శుక్రవారం గోవడ్ వద్ద బేతల్ అనంతరం సంప్రదాయ పూజలు ముగించారు. ముందుగా వంశపెద్దలు సంప్రదాయ వాయిద్యాల మధ్య గోవడ్కు చేరుకున్నారు. మహిళలు, భేటింగ్ అయిన కొత్త కోడళ్లు వారి ఆశీర్వదం తీసుకున్నారు. పర్ధాన్ కితకు చెందిన వారికి కానుకలు అందించారు. అనంతరం వంశ పెద్దలు ప్రదర్శించిన బేతల్ నృత్యాలు ఆకట్టుకున్నాయి. సతీదేవత ఆలయం ద్వారా కానుకల రూపంలో ఈ సారి రూ.1,01,780 వచ్చినట్లు ఆలయ పీఠాధిపతి వెంకట్రావ్ తెలిపారు. మహాపూజకు తీసుకొచ్చిన కొత్త కుండలను కితల వారీగా మెస్రం వంశీయులకు పంపిణీ చేశారు. సంప్రదాయ పూజలు ముగించిన వంశీయులు రాత్రి ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ బుడుందేవ్ ఆలయానికి బయలుదేరారు. ఈ నెల 25న అక్కడి ఆలయంలో పూజలు చేసి జాతర ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో వంశ పెద్దలు బాదిరావ్పటేల్, కోసు కటోడ, కోసేరావ్, దాదారావ్, తిరుపతి, తదితరులున్నారు. కొనసాగుతున్న జాతర కేస్లాపూర్లో నాగోబా జాతర కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శుక్రవారం గంటల తరబడి క్యూలో నిల్చొని నాగోబాను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వసంత పంచమి పురస్కరించుకొని మెస్రం వంశీయులు తమ చిన్నారులకు ఆలయ ప్రాంగణంలో అక్షరాభ్యాసం చేయించారు. ఈనెల 25 వరకు అధికారికంగా జాతర కొనసాగుతుందని ఈవో ముక్త రవి తెలిపారు. -
ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త, ఆటంకాలను తొలగించాలని, ట్రాఫిక్ పోలీసు విభాగం రోడ్లపై అనధికార వాహన నిలుపుదల, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో 30 హాట్స్పాట్లను గుర్తించామని, నగర పరిధిలో వాహనాల వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాల్సి న అవసరం ఉందని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు -
అట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ
నెన్నెల: మండలంలోని కుశ్నపల్లికి చెందిన ఇద్దరిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. అదే గ్రామానికి చెందిన చల్ల కమల, బాపురెడ్డి ఇంటి వద్ద జరిగిన గొడవలో వారిద్దరు కులం పేరుతో దూషించారని కుశ్నపల్లికి చెందిన రెడ్డి పద్మ 15 రోజుల క్రితం నెన్నెల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సై ప్రసాద్.. కమల, బాపురెడ్డిలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఏసీపీ ఫిర్యాదుదారు పద్మ, సాక్షులు స్థానికులతో మాట్లాడి గొడవకు సంబంధించిన వివరాలు సేకరించి విచారణ జరిపారు. -
● పాఠశాలకు వెళ్లాలంటే తిప్పలు ● సమయానికి రాని బస్సులు ● ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
జిల్లాలోని పలు మండలాల్లో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. మరికొందరు ప్రైవేటు వాహనాల్లో వెళ్తుండగా.. ఇంకొందరు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోవడం, ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులను ఆపకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. విద్యార్థుల ఇబ్బందులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు.నాలుగు కిలోమీటర్లు..దండేపల్లి: మండల కేంద్రం దండేపల్లికి నాలుగు కిలోమీటర్ల దూరంలో లింగాపూర్ మోడల్ స్కూల్ ఉంది. గూడెం నుంచి వయా వెల్గనూర్, మేదరిపే ట మీదుగా లింగాపూర్ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడిపిస్తోంది. ముత్యంపేట, చింతపల్లి, నెల్కివెకంటాపూర్, తానిమడుగు, దండేపల్లి, నర్సాపూర్, గుడిరేవు, అల్లీపూర్ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల్లో కొందరికి బస్టాప్లు దూరంగా ఉండడం, సమయానికి బస్సులు వస్తాయో లేదో, వచ్చినా ఆపుతారో లేదోనని ప్రత్యేకంగా ఆటోలు ఏర్పాటు చేసుకున్నారు. దూరాన్ని బట్టి ఆటోలకు నెలకు రూ.600 నుంచి రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. ఆటోవాళ్లు ఉద యం దింపి సాయంత్రం తీసుకెళ్తుంటారు. గిట్టుబాటు కావాలంటే పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోక తప్పని పరిస్థితి ఎదురవుతోంది.చెన్నూర్రూరల్: మండలంలోని సోమనపల్లి గ్రామ పంచాయతీ పరిధి అనుబంధ గ్రామం లక్ష్మిపూర్ సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 8వ తరగతి నుంచి 10వ తరగతి చదవాలంటే ఆస్నాద గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు వెళ్లాల్సిందే. లక్ష్మిపూర్కు బస్సు సౌకర్యం కాని ప్రైవేటు వాహనాలు ఏవీ లేవు. ఇక్కడి నుంచి విద్యార్థినులు ప్రతీ రోజు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ సోమనపల్లి బస్టాప్ వరకు వచ్చి.. బస్సెక్కి ఆస్నాద గ్రామంలోని బడికి వెళ్లి వస్తుంటారు. ఒత్కులపల్లి, పొన్నారం, చాకెపల్లి గ్రామాల విద్యార్థులదీ అదే పరిస్థితి.కోటపల్లి: మండలంలోని 63వ జాతీయ రహదారిపై ఉన్న కొల్లూర్, రాంపూర్, దేవులవాడ, బబ్బరుచెల్క, లక్ష్మిపూర్ గ్రామాల్లో బస్సులు ఆగడం లేదు. చెన్నూర్ నుంచి కాళేశ్వరం వెళ్లే ఆర్డినరీ బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు తగిలించడంతో పార్పల్లి చింత మినహా లక్ష్మిపూర్ వరకు ఎక్కడా ఆపకపోవడంతో పాఠశాల, అవసరాల నిమిత్తం చెన్నూర్కు వెళ్లే వారికి ప్రైవేటు వాహనాలే దిక్కయ్యాయి. బస్సులు ఆపాలని గతంలో జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నా నిర్వహించినా, ఆర్టీసీ డీఎంకు వినతిపత్రం అందజేసినా ఫలితం లేకుండా పోయింది. బస్సులు ఆపక విద్యార్థులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని వాపోతున్నారు.ఆగని బస్సులు.. -
చిన్నారి అక్రమ దత్తత కేసులో అరెస్టు
లక్సెట్టిపేట: చిన్నారి అక్రమ దత్తత కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రమణామూర్తి, ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామంలో తిరుపతి, కళావతి దంపతులకు సంతానం లేదు. మంచిర్యాలలోని తీగల్పహడ్కు చెందిన విజయలక్ష్మి, సూరారం గ్రామానికి చెందిన స్వరూపలు తొమ్మిది నెలల క్రితం ఓ చిన్నారిని అక్రమంగా తీసుకువచ్చి ఆ దంపతులకు ఇచ్చారు. ఈ విషయమై ఫిర్యాదు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. పిల్లలు లేని దంపతుల నుంచి విజయలక్ష్మి, స్వరూప డబ్బులు వసూళ్లు చేసి చిన్నారిని అప్పగించినట్లు విచారణలో వెల్లడైంది. దత్తత నిబంధనలు పాటించకపోవడంతో దంపతులపై కేసు నమోదు చేశారు. చిన్నారిని అక్రమంగా తీసుకువచ్చిన విజయలక్ష్మి స్వరూపను శుక్రవారం రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. ఇద్దరిని పట్టుకోవడం కృషిచేసిన పోలీసులు శ్రీకాంత్, మల్లేశ్, సత్యనారాయణ, మురళి, ప్రవళికను అభినందించారు. -
బస్సులు లేక..
భీమారం: మండలంలోని కొత్తపల్లి, మద్దికల్, ఆరెపల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సు నడవని కారణంగా విద్యార్థులు ఆటోల్లో భీమారంలోని పాఠశాలలకు వెళ్తున్నారు. మద్దికల్ నుంచి ఒక్కో విద్యార్థి రూ.30, ఆరెపల్లి నుంచి రూ.20 చొప్పున చెల్లిస్తుంటారు. కొందరు తల్లిదండ్రులు నెలవారీగా మాట్లాడి పిల్లలను ఆటోల్లో పంపిస్తున్నారు. భీమారం నుంచి కొత్తపల్లి వరకు బీటీ రోడ్డు ఉన్నా ఆర్టీసీ బస్సు నడిపించడం లేదు. దీంతో ప్రయాణికులు, విద్యార్థులు ఆటోలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆర్టీసీ అధికారులు భీమారం నుంచి ఆరెపల్లి మీదుగా కొత్తపల్లి వరకు బస్సులు నడిపించా లని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


