Mancherial District Latest News
-
బడి గంట మోగింది..
● మామిడితోరణాలు, బెలూన్లు, రంగు కాగితాలతో స్కూళ్ల అలంకరణ ● స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ, పూలు అందజేత ● నోట్, పాఠ్య పుస్తకాలు పంపిణీ మంచిర్యాలఅర్బన్: వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలల్లో సోమవారం బడి గంట మోగింది. స్కూళ్లకు వచ్చిన విద్యార్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. విద్యాసంవత్సరం ప్రారంభమైన వేళ అమావాస్య ప్రభావం కొన్ని చోట్ల విద్యార్థుల హాజరుపై పడింది. జిల్లాలో ఉపాధ్యాయులు పాఠశాలలను మామిడి తోరణాలు, రంగుల కాగితాలు, పూల దండలు, బెలూన్లతో అలంకరించి ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. టీచర్ల రాక కోసం ఎదురు చూశారు. పాఠశాలల ప్రాంగణంలో చిన్నారులకు స్వాగతం పలుకుతూ రంగుల బెలూన్లూ, పెన్సిల్, స్వీట్లు పంపిణీ చేశారు. పలు చోట్ల ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నోట్, పాఠ్య పుస్తకాలు అందజేశారు. తొలి రోజు విద్యార్థుల హాజరు నామమాత్రంగా నమోదైంది. మధ్యాహ్నం 3.30గంటల వరకు యూడైస్ వివరాల ప్రకారం జిల్లాలోని 767 పాఠశాలల్లో 34,192 మందికి గాను 4,369 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ లెక్కన 13.58శాతం హాజరు నమోదైంది. ఉదయం నుంచి యాప్లో సాంకేతిక లోపం వల్ల మధ్యాహ్నం వరకు హాజరుకు కొంతమేర ఆటంకం ఏర్పడింది. కొన్ని చోట్ల విద్యార్థుల హాజరు తీసుకోకపోవడంతో తగ్గినట్లు చెబుతున్నారు. అమావాస్య కారణంగా తల్లిదండ్రులు పిల్లలను పంపించడంలో ఆసక్తి చూపకపోవడం కూడా హాజరు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు కొన్ని ప్రైవేటు పాఠశాలలు తెరవకపోవడం గమనార్హం. ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యార్థులు బడిబాట పట్టే అవకాశాలున్నాయి. భీమారంలో వినూత్నంగా ఫ్రేమ్భీమారం: మండలంలోని ఆర్కెపల్లి పాఠశాలలో విద్యార్థులకు వినూత్నంగా స్వాగతం పలికారు. ఫ్రేమ్ చేయించి విద్యార్థులను ఫొటో తీశారు. దాంపూర్లో పాఠశాలను సర్పంచ్ కొమురయ్య విద్యార్థులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. -
అమావాస్య సెంటిమెంట్
● తొలిరోజు విద్యార్థుల హాజరు శాతం తక్కువే.. ● దండేపల్లిలో సార్లు ఫుల్.. విద్యార్థులు నిల్! దండేపల్లి/చెన్నూర్రూరల్/చెన్నూర్/బెల్లంపల్లి: అమావాస్య సెంటిమెంటుతో జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు హాజరు కాలేదు. దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 161మందికి ఐదుగురే వచ్చారు. 27మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేయగా.. ఈ రోజు అమావాస్య రేపు లేదా ఎల్లుండి నుంచి వస్తారు అంటూ సమాధానం వచ్చింది. దండేపల్లి ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులకు నలుగురే హాజరయ్యారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. మండలంలోని గుడిరేవు, నెల్కివెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలతోపాటు వెల్గనూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో కొత్తగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పూలు ఇచ్చి స్వాగతం పలికారు. దండేపల్లి: ఐదుగురే విద్యార్థులు హాజరుకత్తెరసాల ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు.. -
కొత్త యూనిట్ పనులు పూర్తి చేయాలి
జైపూర్: 800మెగావాట్ల కొత్త యూనిట్ నిర్మాణ పనుల్లో భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) తిరుమల్రావు అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో సోమవారం ఆయన పర్యటించారు. ఎస్టీపీపీలో కొనసాగుతున్న 800మెగావాట్ల నిర్మాణ పనులు పరిశీలించారు. సేఫ్టీ కంట్రోల్ రూమ్, ట్రాక్హాపర్ పనులు సందర్శించి భద్రతా చర్యలు, ఆధునిక రైల్ వ్యాగన్ టిప్లర్ విధానంపై అధి కారులతో సమీక్షించారు. ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం మదన్మోహన్, ఏజీఎంలు సుధాకర్రెడ్డి, సూర్యనారాయణరాజు, కొత్త ప్లాంటు కోఆర్డినేటర్ వేణుగోపాల్, డీజీఎం శ్రీనివాస్, ఎస్వోటూ ఈడీ వెంకటయ్య, ఎస్ఈ రాము, రక్షణాధికారి సురేశ్ పాల్గొన్నారు.విద్యాసంస్థల బస్సులు తనిఖీ మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సోమవారం విద్యాసంస్థల బస్సుల తనిఖీలు ప్రారంభించారు. మంచిర్యా ల ఐబీ చౌరస్తాలో బస్సుల ఫిట్నెస్, వాహన ధ్రువీకరణ, బీమా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక యంత్రాల నిర్వహణ, విద్యార్థుల రిజిష్టర్ పరిశీలించారు. ఓ కళాశాల బస్సు నిబంధనలకు విరుద్ధంగా ఉందని గుర్తించి కేసు నమోదు చేసి సీజ్ చేశామని జిల్లా రవాణా శాఖ అధికారి వెల్ది గోపికృష్ణ తెలిపారు. ఈ నెల 25వరకు రోజూవారీగా తనిఖీలు చేపడుతామని తెలిపారు. ఏఎంవీఐ సూర్యతేజ, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
సింగరేణిలో కార్మికుల వెట్టిచాకిరీ
పాతమంచిర్యాల/కాసిపేట/బెల్లంపల్లి: సింగరేణి కార్మికులతో యాజమాన్యం వెట్టిచాకిరీ చేయించుకుంటోందని, కనీస వసతులు కల్పించకుండా ఎక్కువ గంటలు పని చేయిస్తూ పెత్తనం చెలాయిస్తోందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట కవిత విమర్శించారు. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లాలో పర్యటించారు. మంచిర్యాలలోని ఎం కన్వెన్షన్ హాల్లో సమావేశంలో మాట్లాడారు. బెల్లంపల్లిలోని తిలక్ స్టేడియం ఎదుట పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాసిపేట గనిపై కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో కవిత మాట్లాడుతూ సింగరేణిలో పని ముట్ల కొరత తీవ్రంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్కోడ్లను అమలు చేయబోమని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థలో కార్మికుల అలియాస్ పేర్ల సమస్య పరిష్కరించాలని, డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. సంస్థలో బొగ్గు మాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సమయం ఆస్నమైందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే రెండు నెలలకోసారి కూడా ప్రజలకు దర్శనం ఇవ్వడం లేదని, ఇక్కడి రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం సింగరేణి కార్మికులను మభ్యపెడుతున్నారని, బొగ్గు బావులు తేవాల్సిన వారు వినతిపత్రాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాల్లో హెచ్ఎంస్ స్టేట్ జనరల్ సెక్రెటరీ రియాజ్ అహ్మద్, మాజీ మంత్రి బోడ జనార్ధన్, నాయకులు ఉదారి చంద్రమోహన్గౌడ్, సాజన్, వెంకట్, నాయకులు సురేష్, రాజ్కుమార్ పాల్గొన్నారు. విద్య, వైద్యం ఉచితం లక్సెట్టిపేట: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యం అమ్ముకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. -
అధికారం కోసమే బీజేపీ ఓటు చోరీ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): అధికారం కోసమే బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతోందని, ఇందులో భాగంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తీసుకువచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వేంపల్లిలో పద్మావతి గార్డెన్స్లో నిర్వహించిన సర్ అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుతో కలిసి మాట్లాడారు. పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఇప్పటికే బీజేపీ భారీ ఓట్లను తొలగించిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల తొలగించేందుకు చేస్తున్న కుట్రతో పౌరసత్వానికే ప్రమాదం పొంచి ఉందన్నారు. గతంలో ఓటరు నమోదు సవరణకు బీజేపీ తీసుకువచ్చిన ది ఎలక్షన్ లాస్(అమెండ్మెంట్) బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. సర్తో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఎమ్మెల్యేల సంక్షిప్త సమాచారాన్ని సేకరించి ఏఐతో క్రోడీకరిస్తూ అనుకూల ఓటర్లను తొలగించే యత్నం చేస్తోందన్నారు. ఇప్పటికే మ్యాపింగ్తో 2 లక్షల వరకు, అన్ మ్యాపింగ్తో 85 వేల వరకు ఓట్ల తొలగింపు చర్యలకు సిద్ధం కాగా, ఓటు కోసం తగిన ఆధారాలు చూపించాల్సి ందేనని ఆంక్షలు విధిస్తోందని తెలిపారు. సర్ ప్రక్రియ ముగిసే వరకు బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఎల్ఏలు తక్కువ సంఖ్యలో హా జరుకావడంపై ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సీరియస్ అయ్యారు. ఇష్టం లేని వాళ్లు ముందుగా సమాచారం ఇస్తే వారిస్థానంలో మరొకరికి బీఎల్ఏగా అవకాశం ఇస్తామన్నారు. సర్ పేరిట తెలంగాణలో ఓట్లు గల్లంతు కాకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చేలా సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సభ్యత్వ నమోదు పార్లమెంట్ ఇన్చార్జి రహమత్ హుస్సేన్, నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణ్రావు, శిక్షకుడు అవేజ్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు తూముల నర్సయ్య, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. -
‘ఫిట్’పై నజర్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యా సంస్థలు ప్రారంభం కానుండడంతో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సుల ఫిట్నెస్పై దృష్టి సారించారు. డీటీవో గోపీకృష్ణ ఆధ్వర్యంలో ఎంవీఐలు, ఏఎంవీఐలు 15 రోజులుగా బస్సుల ఫిట్నెస్ పరీక్షల్లో నిమగ్నమై ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రైవేటు విద్యాసంస్థల్లో 375 బస్సులు ఉన్నాయి. అందులో 303 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించగా 17 వాహనాలు ఫిట్గా లేవని వాటిని రిజెక్ట్ చేశారు. మిగిలిన 55 బస్సులు ఇంకా ఫిట్నెస్ పరీక్షలకు రాలేదు. రూ.వేల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బస్సుల నిర్వహణను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. పాఠశాలల్లో పేరెంట్ కమిటీలు ఉంటే బస్సు ఫిట్నెస్, ప్రమాదాల విషయంలో ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కానీ ఏక్కడా కూడా ఈ కమిటీల ఏర్పాటు జరగడం లేదు. ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలని, లేనిపక్షంలో తనిఖీల్లో పట్టుబడితే సీజ్ చేస్తామని డీటీవో హెచ్చరించినా యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనార్హం. అటెండర్ ఉండాలి ప్రతీ స్కూల్ బస్సుకు విధిగా అటెండర్ ఉండాలి. బస్సు రివర్స్ తీసుకునే సమయంలోనే కాదు.. పిల్లలను ఎక్కించడం, దించడంతో పాటు రోడ్లు దాటించే సమయంలో వీరి పాత్ర కీలకంగా ఉంటుంది. బస్సులో సీసీ కెమెరాలు, జీపీఎస్, అత్యవసర ద్వారం, ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక యంత్రాలతో పాటు ఐదేళ్ల అనుభవం కలిగిన డ్రైవర్ నియామకం ఇలా అన్నీ మార్గదర్శకాల మేరకు ఉండాలి. కానీ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రవాణా, విద్య, పోలీస్ శాఖలు టాస్క్ఫోర్స్గా ప్రతీ మూడు నెలలకోసారి తనిఖీలు జరుపుతూ కఠినంగా వ్యవహరిస్తే భద్రతతో పాటు ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం అవుతారు. 25 వరకు స్పెషల్ డ్రైవ్..విద్యా సంవత్సరం ప్రా రంభం రోజు నుంచి 25వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఉ దయం, సాయంత్రం వేళల్లో తనిఖీలు ఉంటాయి. బస్సుల ఫిట్నెస్తో పాటు విద్యార్థులను పరి మితికి మించి ఎక్కించడం, ప్రథమ చికిత్స, అగ్నిమాపక నివారణ యంత్రాల ఏర్పా టు వంటి వాటి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. పాఠశాల యాజమాన్యాలు ఎలాంటి నిర్లక్ష్యం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవు. – వెల్ది గోపీకృష్ణ, డీటీవో, మంచిర్యాల -
గుండెపోటుతో బాలింత మృతి
ఇంద్రవెల్లి: గుండెపోటుతో బాలింత మృతి చెందిన ఘటన మండలంలోని మల్లాపూర్ పంచాయతీ పరిధి బోరుజ్గూడలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరప ప్రమీల(28), గణపతి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రమీల మొదటి కాన్పులో జన్మించిన మగబిడ్డ నాలుగు నెలలకే అనారోగ్యంతో మృతిచెందాడు. చాలా రోజుల తర్వాత ప్రెగ్నంట్ అయింది. శనివారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు అంబులెన్స్లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ప్రసవం అనంతరం మగబిడ్డకు జన్మనివ్వగా, రెండు గంటలకు బిడ్డకు పాలు పట్టించింది. రాత్రి సమయంలో ప్రమీలకు ఒక్కసారిగా గుండెపోటు రాగా, చికిత్సపొందుతూ మృతి చెందింది. తల్లి మృతితో బిడ్డను చూసేదెవరని కుటుంబీకులు, గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. బిడ్డ సంరక్షణ కోసం దాతలు ముందుకొచ్చి మరప గణపతికి ఆర్థికసాయం చేయాలని కోరుతున్నారు. పార్పెల్లితండాలో యువకుడు..లక్ష్మణచాంద: మండలంలోని పార్పెల్లి అనుబంధ గ్రామం పార్పెల్లి తండాకు చెందిన గుగ్లవత్ నవీన్ గుండెపోటుతో మృతిచెందాడు. ధర్సింగ్–జమున దంపతులకు ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు గుగ్లవత్ నవీన్(22) జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. శనివారం పనులు ముగించుకుని ఇంటికి చేరుకుని నిద్రించాడు. అర్థరాత్రి సమయంలో ఛాతీ నొప్పి వస్తుందని తల్లిదండ్రులకు తెలిపాడు. గతంలోని ఉపయోగించిన టాబ్లెట్స్ వేశారు. కొంత సమయం తర్వాత మళ్లీ నొప్పిరావడంతో నిద్రలో మృతిచెందాడు. కుమారుడి మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ తీస్తుండగా వివాహిత..వాంకిడి: చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ తీస్తుండగా విద్యుత్ షాక్తో వివాహిత మృతి చెందింది. మండలంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం..తేజిగూడ గ్రామానికి చెందిన మొహర్లె రమేశ్కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె మహేశ్వరి(20)ని మూడు నెలల క్రితం లక్ష్మిపూర్కు చెందిన నగోసే వేణుతో వివాహం చేశారు. కాగా, శనివారం సాయంత్రం మహేశ్వరి తన ఇంట్లో సెల్ఫోన్కు చార్జింగ్ పెట్టింది. ఈ క్రమంలో చార్జింగ్ వైర్ను తొలగిస్తుండగా విద్యుత్ షాక్కు గురై కిందపడింది. గమనించిన అత్త కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు. కుటుంబీకులు ఆమెను వాంకిడి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
లోకేశ్వరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1986–87 బ్యాచ్ పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. బాగాపూర్ గ్రామంలోని ఓ తోటలో జరిగిన వీరి అపూర్వ సమ్మేళనానికి హాజరయ్యారు. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలో గడిపిన మధురస్మృతులను గుర్తుచేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు గంగారెడ్డి, సుదర్శన్రెడ్డి, శివలింగం, శంకర్రెడ్డి, లోలం గంగన్న, దేవేందర్రెడ్డి, రమణయ్య, కాశీరాం, కిష్ణారెడ్డి, సూర్యకాంత్లను సన్మానించారు. – లోకేశ్వరం32 ఏళ్ల తర్వాత..ఖానాపూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1993–94 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు 32 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఆది వారం వీరి ఆత్మీయ సమ్మేళనానికి జి.వి.ఆర్. ఫంక్షన్ హాల్ వేదికై ంది. పాఠశాలలో గడిపిన తీపిగుర్తులు, అల్లరి పనులను గుర్తుచేసుకున్నారు. రోజంతా సంతోషంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ప్రహ్లాద్, దేవన్న, నరసింహరావు, విఠల్ను సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి తమవంతు సహాయ సహకారం అందించాలని పూర్వవిద్యార్థులు తీర్మానం చేశారు. – ఖానాపూర్ -
పచ్చిరొట్టతో నేల సారవంతం
మంచిర్యాలఅగ్రికల్చర్: వానాకాలం పంటల సాగుకు రైతన్నలు ఇప్పటికే దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ఖరీఫ్ సాగు ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులకు రాయితీపై అందించేందుకు ఎరువులు, విత్తనాలు మండలాలకు తరలిస్తున్నారు. పచ్చిరొట్ట పైర్ల నుంచి లభించే సేంద్రియ ఎరువుల విత్తనాలు మండలాలకు తరలించారు. ఎల్నినో ప్ర భావంతో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వర్షపు నీరు వృథా పోకుండా భూమిలో ఇంకేలా పొలానికి నీటిని, తేమశాతం, పోషక పదార్థాలను నిల్వ ఉంచుకునే శక్తి పెంచుకునేందుకు పచ్చిరొట్ట సాగుతో ఎంతో ప్రయోజనం చేకురనుంది. ముఖ్యంగా వరి సాగుకు నీటి తడులు ఎక్కువ అవసరం ఉంటుంది. నీటి తడులకు, నేల సారవంతం, పంటలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగించేందుకు ప్రభుత్వం జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలు సరఫరా చేస్తుంది. 50 శాతం రాయితీపై 4,355 క్వింటాళ్ల విత్తనాలు ఆయా మండలాల్లో రైతుల డిమాండ్కు అనుగుణంగా అందుబాటులో ఉంచారు. గత నెల 26న దండేపల్లి మండలంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ రైతులకు విత్తనాల పంపిణీ ప్రారంభించారు. ఇప్పటి వరకు 929.4 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. నేలలో తేమ శాతం పెరుగుదల ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు సేంద్రియ ఎరువులపై దృష్టి సారించా ల్సి ఉంటుందని జిల్లా వ్యవసాయ అఽ ది కారి సురేఖ వివరిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం పెరగడంతో పంట లకు తెగుళ్లు, పురుగుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. భూసారం పెంపునకు పచ్చి రొట్ట నుంచి లభించే ఎరువులు పంటలకు వేయడం వల్ల అధిక దిగుబడులు, నాణ్య మైన పంట ఉత్పత్తులు పొ ందవచ్చు. భూమి గుళ్లబా రుతుంది, భూసారం బాగా పెరుగుతుంది. మొక్క వేర్లకు గాలి, నీరు పుష్కలంగా అందుతాయి. చీడపీడల వ్యాప్తి సైతం తగ్గుతుంది. వరిసాగులో కీలకం జిల్లాలో 1.57 లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం ఉంటుంది. సేంద్రియ ఎరువులను తగు పాళ్లలో భూమికి అందించడంలో చాలా మంది రైతులు విఫలమవుతున్నారు. దీంతో పంట దిగుబడి తగ్గిపోతుంది. ముందస్తు భూసారం పెంపునకు జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలు పొలాల్లో చల్లుకుంటే నాటువేసే సమయానికి బురదలో కలియ దున్ని ఎరువుగా వినియోగించవచ్చు. పెరిగిన విత్తన ధరలు.. గతేడాది 30 కిలోల జీలుగ బ్యాగుకు రూ.4,274 ఉండగా రాయితీపై రూ.2,137కు అందించారు. ఈ ఏడాది రూ.4,905 ఉండగా రాయితీపై రూ.2,450కు విక్రయిస్తున్నారు. జనుము 40 కిలోల బ్యాగు గతేడాది రూ.5,350 ఉండగా 2,860కి అందించారు. ఈ ఏడాది రూ.6,220 ఉండగా రాయితీపై 3,110కి ఇస్తున్నారు. పిల్లిపెసర 20 కిలోల బ్యాగు గతేడాది రూ.3,680 ఉండగా రాయితీపై రూ.1,820కి ఇచ్చారు. ఈ ఏడాది రూ.3,990 ఉండగా రాయితీపై రూ.1,995కి అందిస్తున్నారు. పిల్లిపెసర..ఎకరాకు 6 నుంచి 8 కిలోల విత్తనం వేసుకోవాలి. పూతదశలో 4 నుంచి 5 టన్నుల పచ్చిరొట్ట ఇస్తుంది. దీన్ని పశుగ్రాసంగా కూడా వాడుకోవచ్చు. ఒక టన్ను పిల్లి పెసరలో నాలుగు కిలోల నత్రజని, కిలో భాస్వరం, మూడు కిలోల పోటాష్ ఇస్తుంది. విత్తనం క్వింటాళ్లు కొనుగోలు చేసింది(క్వింటాళ్లలో) జీలుగ 3,350 733.8 జనుము 840 185.2 పిల్లిపెసర 165 11 మొత్తం 4,355 929.4 ఇప్పటి వరకు జిల్లాకు చేరిన విత్తనాలుజీలుగ ఎకరాకు 12 నుంచి 15 కిలోల జీలుగ విత్తనం వేసుకోవాలి. పూతదశలో కోసినప్పుడు ఎకరాకు 5 నుంచి 6 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. ఒక టన్ను జీలుగ సాగులో ఐదు కిలోల నత్రజని, 1.5 కిలోల భాస్వరం, 4 కిలోల పోటాష్ వస్తుంది. చౌడు భూములకు బాగా పనికి వస్తుంది. జనుముఎకరాకు 20 నుంచి 25 కిలోల విత్తనం వేసుకోవాలి. పంట వేసిన 8 వారాల తర్వాత కోస్తే 6 నుంచి 8 టన్నుల పచ్చిరొట్ట ఇస్తుంది. ఒక టన్ను జనుములో నాలుగు కిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, మూడు కిలోల పొటాష్ ఉంటుంది. -
రిసార్ట్లో అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి
నస్పూర్/చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి శివారు ఓ రిసార్ట్లో శనివారం అర్ధరాత్రి యువకుడు అనుమానా స్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని విలేజ్ శ్రీరాంపూర్కు చెందిన గాండ్ల రాము(27) హైదరాబాద్ ఉప్పల్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కూకట్పల్లిలో ఉంటున్నాడు. వీకెండ్ కావడంతో కంపెనీకి చెందిన 20 మంది స్నేహితులు కలిసి పార్టీ చేసుకునేందుకు ఎల్లంబావి శివారులోని ఓ రిసార్ట్ను బుక్ చేసుకున్నారు. స్నేహితుల మధ్య ఘర్షణ రాము, అతని స్నేహితులు శనివారం సాయంత్రం రిసార్ట్కు చేరుకున్నారు. అందరూ కలిసి మద్యం తాగారు. అర్ధరాత్రి సమయంలో స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో గొడవ జరిగింది. కొంతసేపటి తర్వాత సద్దుమణిగింది. అర్ధరాత్రి తర్వాత నలుగురు స్నేహితులు కలిసి రిసార్ట్లోని స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టేందుకు వెళ్లారు. అందులో ఒక వ్యక్తికి ఈత రాకపోవడంతో స్విమ్మింగ్ పూల్లో నడుచుకుంటూ మిగతావారిని అనుసరించసాగాడు. ఈ క్రమంలో అతని కాళ్లకు నీటి అడుగున ఏదో తగిలింది. ఈ విషయాన్ని మిగిలిన ముగ్గురు మిత్రులకు చెప్పడంతో వారు స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్లి చూడగా.. రాము కనిపించగా బయటకు తీసుకువచ్చారు. మిగతా స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారు బయటకు వచ్చి రాముకు సీపీఆర్ చేశారు. వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్, ఎస్సై యాదగిరి ఘటనస్థలానికి వెళ్లి పరిశీలించి ఆధారాలు సేకరించారు. తన కుమారుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని, స్నేహితులే కొట్టి హత్య చేశారని తండ్రి అంజయ్య ఫిర్యాదు చేశారు. ఈమేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు. -
ఆదివాసీల హక్కుల కోసం పోరాటం
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీల హక్కులు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేశ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కేసీబీ గార్డెన్లో ఆదివారం రాష్ట్రస్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలకే ఉద్యోగవకాశాలు కల్పించే జీవో నంబర్ 3ను యథావిధిగా అమలు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీని వెంటనే ప్రకటించాలన్నారు. 1/70, పెసా చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఆదివాసీలు సాగుచేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అంతకుముందు పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో జాతీయ అధ్యక్షుడు వట్టం ఉపేందర్, ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బక శ్రావణ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉయక సుదర్శన్, నాయకులు వెట్టి మనోజ్, అర్క శేషారావు, గోడం రేణుక బాయి, ఉయిక ఇంద్ర పాల్గొన్నారు. -
నేత్రాలు దానం
బెల్లంపల్లి: గుండెపోటుతో వ్యక్తి మృతిచెందగా, కు టుంబ సభ్యులు ఆయన నేత్రాలు దానం చేశారు. మున్సిపాలిటీ షంషీర్నగర్ బస్తీకి చెందిన జడల రమేశ్ ఆదివారం గుండెపోటుతో అకాల మృతిచెందాడు. అతని కళ్లు దానం చేసి అంధులకు కంటి చూపు ప్రసాదించవచ్చని జనహిత సేవా సమితి నిర్వాహకులు బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించగా వారు ముందుకొచ్చారు. వాసన్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ చందు వచ్చి రమేశ్ నేత్రాలను సేకరించాడు. పుట్టెడు దు:ఖంలో కూడా నేత్రదానం చేసేందుకు అంగీకరించిన కుటుంబ సభ్యులకు జనహిత సేవాసమితి అధ్యక్షుడు ఆడేపు మహేశ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సర్టిఫికేట్ అందజేశారు. కార్యక్రమంలో జనహిత సేవా సమితి నిర్వాహకులు ఇప్ప రవి, కె.గిరిప్రసాద్, గురుస్వామి, సుకుమార్, కనకయ్యతోపాటు దేవసాని వెంకన్న పాల్గొన్నారు. నేడు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత పర్యటన -
వైద్య సేవలకు కష్టమే?
మంచిర్యాలటౌన్: జిల్లా ప్రజలకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా అందే వైద్యసేవలకు ఈ ఏడాది కూడా కష్టంగానే మారనుంది. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద శిథిలావస్థకు చేరుకున్న భవనంలోనే ప్రస్తుతం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కాలేజ్రోడ్డులో మూడేళ్ల క్రితంరూ. 129.25 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి, రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ విభాగం భవన నిర్మాణాలు ప్రారంభించారు. నిర్మాణంలో జరుగుతున్న ఆలస్య ంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పనులు నత్తనడకన సాగుతుండడంతో భవన నిర్మాణం పూర్తి చేయించడంలో అధికారులు విఫలం చెందుతున్నారు. పదిరోజులకోసారి కలెక్టర్ కుమార్ దీపక్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశిస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరించడంతోనే, భవన నిర్మాణం పూర్తికా వడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వర్షాలు కురిస్తే ఇక అంతే మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో భయం భయంగానే రోగులకు వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి భవనంలోని గదులు సరిపోక ఇబ్బందులు పడుతుంటే, శిథిలావస్థకు చేరిన భవనంలో స్లాబ్ పెచ్చులూడుతుండగానే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదే భవనంలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్బ్యాంక్ను నిర్వహిస్తూ, తలసేమియా, సికిల్సెల్ రోగులకు ప్రతిరోజు రక్తమార్పిడి చేస్తున్నారు. ఓపీ సేవలతో పాటు, ల్యాబ్, ఎక్స్రే, సిటిస్కాన్, మందుల పంపిణీ, డ్రగ్ స్టోర్ అందులోనే నిర్వహిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో ఈ భవనంలోని స్లాబ్ నుంచి ఏదో ఒక గదిలో పెచ్చులూడుతుండడం ఆందోళన కలిగిస్తుండగా, ఈ ఏడాది జనవరిలో మూత్రశాలలోని స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడి కింద పడిపోయి రోగి సహాయకురాలికి గాయాలయ్యాయి. డయాలసిస్ నిర్వహిస్తున్న భవనం స్లాబ్ సైతం పెచ్చులూడుతుండడంతో కిడ్నీ బాధితులకు రక్తం శుద్ధి చేయడం ఇబ్బందిగా మారుతోంది. స్లాబ్ పెచ్చులు కిందపడకుండా అడ్డుగా ఏదో ఒకటి పెడుతూ నెట్టుకొస్తున్నారు. గోదావరి ఒడ్డున నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) సైతం వర్షాకాలం వస్తే వరదలో మునిగి పోతుంది. దీంతో ఎంసీహెచ్ను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న జనరల్ ఆసుపత్రి భవనంలో గర్భిణులు, బాలింతలు సైతం బిక్కుబిక్కుమంటూ చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి. వర్షాకాలం రాకముందే కొత్త భవనం అందుబాటులోకి వచ్చి ఉంటే, రోగులకు ఇబ్బందులు తప్పేవి. ఈ వర్షాకాలంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మాతా శిశు ఆరోగ్య కేంద్రం రోగులకు వైద్య సేవలు కష్టమే. -
ప్రపంచ దేశాలకు మోదీ పాలనే దిక్సూచి
● ఎంపీ గోడం నగేశ్ జన్నారం: ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పాలనే దిక్సూచిగా నిలుస్తోందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని మొర్రిగూడ, కిష్టాపూర్, రోటిగూడ గ్రామాల్లో ఆదివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను (జీడీపీ) మూడో స్థానంలోకి తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ పేరుతో దేశాన్ని 2047 వరకు ప్రపంచంలో ప్రథమస్థానంలో ఉంచడమే ప్రధాని లక్ష్యమన్నారు. ఇళ్ల నిర్మాణం, సన్నబియ్యం పంపిణీలో కేంద్రం వాటా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తనఖాతాలో వేసుకుంటోందని ఆరోపించారు. అనంతరం మొర్రిగూడ, రోటిగూడ గ్రామాలకు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. కిష్టాపూర్లో బీసీమోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల ముఖేశ్గౌడ్ను ఎంపీ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్, మండల అధ్యక్షుడు మధుసూదన్రావు, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రినాయక్, సర్పంచ్ వాసాల నరేశ్, మండల ప్రధాన కార్యదర్శి రమేశ్గౌడ్, జిల్లా కౌిన్సిల్ సభ్యుడు కొంతం శంకరయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాజరావ్, బీసీ మోర్చా అధ్యక్షుడు గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
పిచ్చికుక్కదాడిలో ఇద్దరికి గాయాలు
నెన్నెల: మండల కేంద్రంలో ఆదివారం పి చ్చికుక్క దాడిలో ఇద్దరు గాయపడ్డారు. కోమటివాడకు చెందిన నేతరి విమల ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా పి చ్చికుక్క ఆమె కాలును కరిచింది. అక్కడి నుంచి హనుమాన్ మందిర వద్ద రోడ్డుపై వెళ్తున్న లింగంపల్లి శంకర్పై దాడి చేసి గాయపర్చడంతో అతడి కాలికి తీవ్ర గాయమైంది. గాయపడిన ఇద్దరిని పీహెచ్సీలో చికిత్స అందించి ఇంటికి పంపించారు. గ్రామంలో పిచ్చికుక్కల స్వైరవిహారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పిచ్చికుక్కల బెడద లేకుండా పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
మంచిర్యాల అభివృద్ధి రాష్ట్రానికే మోడల్
మంచిర్యాలటౌన్: మంచిర్యాలలో జరుగుతున్న అభివృద్ధి రాష్ట్రానికే ఒక మోడల్ అవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నివాసంలో ఆదివారం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మేయర్ దర్ని మధుకర్తో కలిసి మాట్లాడారు. మంచిర్యాల పట్టణ ప్రగతిపై ప్రశంసలు కురిపిస్తూనే స్థానిక ఎమ్మెల్యే సంకల్పం, నిబద్ధత వల్లే అద్భుతమైన అభివృద్ధి సాధ్యమైందని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా మంచిర్యాల మోడల్ను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులను, కమిషనర్లను ఇక్కడికి పంపించి, ఈ అభివృద్ధిని ఒక మోడల్గా చూసి స్ఫూర్తి పొందేలా చేయాలని మంత్రి శ్రీధర్బాబుతో చర్చించానన్నారు. ఇక్కడి 50 పడకల ఆస్పత్రి, ఆర్కిటెక్చర్, విశాలమైన వరండాలు, గాలి వెలుతురు వచ్చేలా కట్టిన విధానం నచ్చి, పరిశీలనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్ వారిని ఇక్కడికి పంపించామన్నారు. ఇక్కడి మాదిరి తన నియోజకవర్గంలోనూ 50 పడకల ఆస్పత్రిని సాంక్షన్ చేయించుకున్నామన్నారు. 50 ఏళ్ల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేస్తున్నారని, దూరదృష్టితో పునాదులు వేసేవాడే నిజమైన నాయకుడన్నారు. అలాంటి నాయకత్వం, ప్రజల మద్దతు ఉండడం వల్లే అన్ని రంగాల్లోనూ మంచిర్యాల దూసుకుపోతుందన్నారు. మంచిర్యాల నియోజకవర్గానికి అనేక దశాబ్దాలుగా సరైన ఎమ్మెల్యే దొరకలేదని, ఇప్పుడు ఆ లోటు ఈ ప్రాంత ప్రజలకు తీరిందన్నారు. తమ నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ పార్కు మంజూరు చేయాలని మంత్రి శ్రీధర్బాబును అడిగి రెండున్నరేళ్లు అవుతున్నా ఇప్పటికీ మంజూరు చేయలేదని, కానీ మంచిర్యాలకు మాత్రం మంజూరు చేయగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎవరూ తీసుకోని విధంగా ఒక ఫిష్పాండ్ (చేపల చెరువు) కూడా ఇక్కడికి తెచ్చుకున్నాన్నారు. తాను ఉమ్మడి జిల్లాలో సీఎల్పీ లీడర్గా ఆదిలాబాద్ నుంచి పాతయాత్ర చేపట్టిన సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఎవరికీ లేని సమయంలో ప్రేమ్సాగర్రావు, కొక్కిరాల సురేఖ, శ్రీధర్బాబు తన వెనకుండి ముందుకు నడిపించారన్నారు. రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారంలో మంచిర్యాల నియోజకవర్గానికి సింహభాగం ఉంటుందని హామీ ఇచ్చారు. -
కాంగ్రెస్, బీజేపీలతోనే సింగరేణి నిర్వీర్యం
మంచిర్యాలటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు కుమ్మకై ్క సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టక పోవడం, మెడికల్ బోర్డును ఏర్పాటు చేయక పోవడంతో మాజీ మంత్రి హరీష్రావు ఆధ్వర్యంలో బొగ్గుబాయి బాట పట్టామన్నారు. దీనికి ఖంగుతిన్న కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా 335 మందికి కారుణ్య నియామక పత్రాలు ఇచ్చి, మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గుబాయిల వేలంలో సింగరేణి పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా కేంద్రం ఇవ్వలేదన్నారు. అబద్దాలను వల్లెవేసి ప్రజలను తప్పుదారి పట్టించాలనే బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివా కర్రావు మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి పేరు భట్టి విక్రమార్క కాదని, బకాయి విక్రమార్క అన్నా రు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదన్నారు. విశ్వనాథ ఆలయం అభివృద్ధికి 2023లోనే రూ. 1.97 కోట్ల నిధులు మంజూరు చేయిస్తే, అభివృద్ధి చేయకుండా, అవే నిధులతో కొత్త పనుల పేరిట శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రిటైర్డ్ సింగరేణి కార్మికులకు ఇంటి నిర్మాణం కోసం రెండు గుంటల భూమి ఇస్తానని చెప్పి, ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మునీర్ స్మారక భవన నిర్మాణానికి కృషి
మందమర్రిరూరల్: మందమర్రిలో సీనియర్ జర్నలిస్టు మునీర్ స్మారక భవన నిర్మాణానికి కృషి చేస్తానని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం పట్టణంలోని సీఈఆర్ క్లబ్లో జర్నలిస్ట్ చందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, పూర్వ సంపాదకులు రామచంద్రమూర్తి, సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి మునీర్ భాయ్ (ప్లొటేరియన్ జర్నలిస్ట్) పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మునీర్ చిన్న వయసులోనే పెత్తందారీ విధానంపై పోరాటం చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడన్నారు. జర్నలిస్ట్గా నలబై యేళ్లపాటు ప్రజా, కార్మిక సమస్యలపై అనేక వ్యాసాలు, కథనాలు రాసాడన్నారు. కోల్బెల్ట్ ప్రాంతంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి ముందుకు నడిపించాడన్నారు. నేటి జర్నలిస్ట్లు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వక్తలు మునీర్తో పంచుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంతకు ముందు మునీర్ చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జనంసాక్షి ఎడిటర్ రహమాన్, ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, టీజీబీకేఎస్ వ్యవస్థాపకులు కెంగర్ల మల్లయ్య, పుస్తక రచయితలు మాదాసి రామమూర్తి, నక్క వెంకట్రావ్, తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషిమంచిర్యాలటౌన్: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మంచిర్యాలలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. యోగా, ఫిట్నెస్ సభ్యులతో కలిసి వ్యాయామం చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానం అభివృద్ధికి 20 ట్రిప్పుల మట్టి పోయాల ని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్కు ఫోనులో సూచించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు రెండు క్రికెట్ కిట్లు అందించడం జరుగుతుందన్నారు. -
ఉత్తమ సేవా పురస్కారాలు
పాతమంచిర్యాల: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్లోని లోక్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ మంచిర్యాల శాఖ సభ్యులు గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. అత్యధికంగా రక్తదాతలను సమకూర్చిన విభాగంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్టు సభ్యుడు, ఎమ్మెల్యే తనయుడు కొక్కిరాల చరణ్రావు మొదటి అవార్డు అందుకున్నారు. సంస్థల విభాగంలో 246 మంది రక్తదాతలను సమకూర్చిన జైపూర్ పవర్ ప్లాంట్ డీజీఎం డి.పంతులు పురస్కారం అందుకున్నారు. 91 రక్తదాన శిబిరాల్లో 6,016 యూనిట్ల రక్తం సేకరించిన మంచిర్యాల ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రం రాష్ట్రంలో ద్వితీయ స్ధానంలో నిలి చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ తమ తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టు రక్తదానంలో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించి అవా ర్డును పొందడంతో తనపై మరింత భాధ్యతను పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ మంచిర్యాల శాఖ చైర్మన్ కంకణాల భాస్కర్రెడ్డి, కార్యదర్శి చందూరి మహేందర్, స్టేట్ ఎంసీ సభ్యులు వి.మధుసూదన్రెడ్డి, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ జనరల్ సెక్రెటరీ కాసర్ల రంజిత్, సభ్యులు కాసర్ల శ్రీనివాస్, ఎడ్ల కిషన్, సురభి శరత్రావు, చుంచు శంకర్ వర్మ, తదితరులు పాల్గొన్నారు. -
● మహిళ వేషధారణలో వచ్చి దొంగతనం ● వెంబడించి పట్టుకున్న పోలీసులు ● పరారీలో మరొకరు
జ్యువెలరీ షాపులో చోరీతానూరు: మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఉన్న తుల్జా భవాని జ్యువెలరీ షాపులో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. అంతర్రాష్ట్ర ముఠా ఇద్దరు దొంగలు మహిళ వేషధారణలో చీరలు కట్టుకుని షాప్ వద్దకు వచ్చారు. షటర్ ధ్వంసం చేసి షాపులో చొరబడి మూడు తులాల వెండి ఆభరణాలు, 15 గ్రాముల మూడు నాణెలు ఎత్తుకెళ్లారు. రాత్రి అటు నుంచి వస్తున్న ఇద్దరిని గమనించి దొంగలు.. విఠలేశ్వర ఆలయం వైపు పరుగులు తీయగా వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై షేక్ జుబేర్ సిబ్బందితో కలిసి ఆలయం వైపు వెళ్లారు. ఒక ఇంటి ఆవరణలో దాక్కున్న దొంగలు పోలీసులను చూసి గేటు పైనుంచి దాటే క్రమంలో చీర తట్టుకుంది. చీరను అక్కడే వదిలేసి అక్కడే ఉన్న బైక్ను దొంగలించి జౌలా(బి) మార్గంలో వెళ్లారు. పోలీసులు వెంబడించడంతో జౌలా(బి) శివారులో బైక్ వదిలేసి చేలకు పరుగులు తీశారు. వెంబడించి ఒకరిని పట్టుకోగా మరొకరు పరారైనట్లు ఎస్సై వెల్లడించారు. పట్టుకున్న దొంగ మహారాష్ట్రలోని స్టేషన్ ఉమ్రి గ్రామానికి చెందిన సయ్యద్ సోయల్గా గుర్తించారు. అతని నుంచి మూడు తులాల వెండి ఆభరణాలు. 15 గ్రాముల వెండి నాణేలు రికవరీ చేసినట్లు తెలిపారు. మరో దొంగ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ముధోల్ సీఐ రవీందర్ నాయక్ చేరుకుని జ్యువెలరీ షాపును పరిశీలించారు. ఫింగర్ ప్రింట్ తనిఖీ బృందంతో ఆధారాలు సేకరించాయి. పూర్తి విచారణ తర్వాతే వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. -
వాహన నంబర్లు, ఛాసిస్, ఇంజిన్ నంబర్ల ఫోర్జరీ
బోథ్: వాహన నంబర్లు, ఛాసిస్, ఇంజిన్ నంబర్లను ఫోర్జరీ చేసి తెలంగాణలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడానికి యత్నిస్తున్న ముగ్గురిని బోథ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బోథ్ పోలీస్స్టేషన్లో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి వివరాలు వెల్లడించారు. సొనాల మండల కేంద్రానికి చెందిన డ్రైవర్ ఎస్.కె.నయీమ్ (37) మహారాష్ట్ర లాతూర్ ప్రాంతంలో మహీంద్రా మ్యాక్స్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. సరైన పత్రాలు లేకపోవడంతో, తెలంగాణలో రిజిస్ట్రేషన్ కోసం అడ్డదారిని ఎంచుకున్నాడు. స్క్రాప్నకు వెళ్లిన ఏపీ23జె1036 అనే పాత వాహనానికి సంబంధించిన పత్రాలను పెందూర్ ఇంద్రు నుంచి రూ. 10 వేలకు కొనుగోలు చేశాడు. మాకునూర్ విజయ్ కుమార్ సహాయంతో మహారాష్ట్ర వాహనంపై ఉన్న ఛాసిస్, ఇంజిన్ నంబర్లు తొలగించి, ఫోర్జరీ వెల్డింగ్ పనుల ద్వారా పాత వాహన నంబర్లు చెక్కించారు. శనివారం ఉదయం బోథ్ కోరమాండల్ జంక్షన్ వద్ద ఎస్సై పురుషోత్తం సిబ్బందితో కలిసి వాహన తనిఖీ నిర్వహించారు. మహీంద్రా మ్యాక్స్ వాహనంతో వస్తున్న నయీమ్ పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. సిబ్బంది వాహనాన్ని వెంబడించి ఆపి నయీమ్ను విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్.కె. నయీమ్, మాకునూర్ విజయ్కుమార్, పెందూర్ ఇంద్రుపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ డి.గురుస్వామి, ఎస్సైవి.పురుషోత్తం, హెడ్ కానిస్టేబుల్ మదన్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
● ముగిసిన వేసవి సెలవులు ● నేడు తెరుచుకోనున్న పాఠశాలలు ● తొలిరోజు పుస్తకాలు పంపిణీ ● మామిడితోరణాలు, రంగుల కాగితాలు, జెండాలతో బడులకు అలంకరణ
మంచిర్యాలఅర్బన్: వేసవి సెలవులు ముగియడంతో సోమవారం పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. సెలవులకు స్వస్తి చెప్పి విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో పరిశుభ్రత పనులపై యాజమాన్యాలు దృష్టి సారించాయి. తరగతి గదులు, ప్రాంగణాలను శుభ్రం చేయించారు. తాగునీరు, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లను సరి చూసి అవసరమైన సదుపాయాలు కల్పించారు. మామిడి తోరణాలు, రంగుల కాగి తాలు, బెలూన్లతో సర్కారు పాఠశాలలను అలంకరించి విద్యార్థులకు స్వాగతం పలుకనున్నారు. తొలిరోజు పుస్తకాల పంపిణీ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,051 ఉండగా 1,32,353 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 234 ప్రైవేట్ పాఠశాలల్లో 70,273 మంది విద్యార్థులు చదువుతున్నారు. 817 కేజీబీవీ, మోడల్స్కూల్, రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాలల్లో 62,080 మంది, డీఈవో పరిధిలో 709 పాఠశాలల్లో 43,072 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలు మినహాయిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు అందజేయాల్సి ఉంది. ఇప్పటికే 3,05,620 నోట్, పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేరాయి. పాఠశాలల పున:ప్రారంభం రోజునే విద్యార్థి చేతికి పాఠ్యపుస్తకం అందించనుండగా యూనిఫామ్లు మాత్రం ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. యూనిఫామ్ కలర్ మార్చడంతో సాధారణ దుస్తులతోనే బడికి వెళ్లాల్సిన పరిస్థితి. పాత దుస్తులు చిరిగిపోవడంతో కొత్తవి కావాలని చిన్నారులు మారాం చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రులు కొత్త దుస్తుల కొనుగోలుపై దృష్టి సారించాల్సి వస్తుంది. ఈఏడాది ‘బడి బాట’ తర్వాత అడ్మిషన్లు పెరిగే పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై దృష్టి సారిస్తున్నామని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది 72 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అమలుకానుంది. ఇప్పటికే ఇన్స్ట్రక్టర్లు, ఆయాలను నియమించే ప్రక్రియ పూర్తి చేశారు. బడి శుభ్రత.. భోజనంలో నాణ్యత సర్కారు పాఠశాలల్లో బడి శుభ్రత, భోజనంలో నాణ్యతపై ప్రభుత్వం దృష్టి సారించింది. వంట శుభ్రత, వడ్డన అంశాలపై 1,290 మంది మధ్యాహ్న భోజన కార్మికులు, ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఇదివరకే వంట తయారీకి నాణ్యమైన సామగ్రి కొనుగోలు చేశారు. సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకోనుండటంతో మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియ్యం పాఠశాలలకు చేరింది. వంట కార్మికులు వంటపాత్రలు శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అల్పాహారం అందించేందుకు కొన్ని పాఠశాలలనే పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. దీంతో తొలి విడతలో జిల్లాలో సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అల్పాహారం లేనట్లే.గతేడాది పదో తరగతి పరీక్షలకు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 9,703 మంది హాజరయ్యారు. ఇందులో సర్కారు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 5,499 మంది కాగా తెలుగు మీడియంలో 769 మంది పరీక్షలకు హాజరయ్యారు.ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంతో సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి బడిబాట కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 9,376 మంది విద్యార్థులు సర్కారు పాఠశాలల్లో చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకు 6,909 చేరికలు నమోదయ్యాయి. టీజీఎంఎస్, కేజీబీవీ, యూఆర్ఎస్, టీజీఆర్ఈఐఎస్ పాఠశాలల్లో రెండో తరగతి నుంచి 12వ తరగతి వరకు 2,467 మంది ప్రవేశాలు పొందారు. మంచిర్యాలలో 1,121, లక్సెట్టిపేటలో 1,033, బెల్లంపల్లిలో 715, జన్నారంలో 671 మంది విద్యార్థులు చేరారు. పుస్తకాల ధరలు, ఫీజుల భారంతో ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల మార్పిడి గణనీయంగా పెరిగింది. గతేడాది జూలై 18 నాటికి రెండోతరగతి నుంచి పదోతరగతి వరకు 1,609 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. టీజీఎంఎస్, కేజీబీవీ, యూఆర్ఎస్, టీజీఆర్ఈఐఎస్లో 835 మంది చేరారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన బోధనతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. -
● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ● కారుణ్య నియామక పత్రాల అందజేత ● హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
మంచిర్యాలటౌన్: బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయని, సింగరేణి సంస్థను, కార్మికులను కాపాడుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం స్థానిక పద్మనాయక ఫంక్షన్హాల్లో సింగరేణి సంస్థలో 335 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీప్యూటీ సీఎం మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. గూడెం ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాందండేపల్లి: గూడెం ఆలయాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దుతామని, విద్యాలయాలు, వైద్యశాలలు, దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రూ.58 కోట్ల గోదావరి పుష్కరాల నిధులతో దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయ పునః నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు మక్కాన్సింగ్ఠాకూర్, సత్యనారాయణతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ‘భట్టి’ మాట్లాడారు. పిప్రిలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు గూడెం ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డితో ప్రస్తావించడంతో స్పందించి 37 రోజుల్లోనే నిధులు మంజూరు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ప్రత్యేక నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే దేవాలయాల అభివృద్ధికి రూ.2,216 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఆలయాలు, సాగునీటి రంగాల అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు బహుముఖ వ్యూహంతో ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నారని అభినందించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్దీపక్, దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, అదనపు కలెక్టర్లు రాములు, చంద్రయ్య, డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల మేయర్ మధుకర్, డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, డీఆర్డీవో కిషన్, తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు ఇవే... గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయ పునః నిర్మాణం, అభివృద్ధి పనులతోపాటు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రూ.9.70 కోట్లతో గ్రామ సంఘ భవనాల నిర్మాణం, లక్సెట్టిపేట మున్సిపల్ పరిధిలో రూ.2.30 కోట్లతో సీసీ రోడ్డు పనులు, రూ.2 కోట్లతో డ్రెయినేజీల నిర్మాణం, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల్లోని మోదెల, ద్వారక, గుడిరేవు గ్రామాల సమీపంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎడమవైపున రూ.74.40 కోట్ల నిధులతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఘనస్వాగతం.. గూడెం సత్యనారాయణస్వామి ఆలయానికి విచ్చేసిన డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్లకు ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు, కలెక్టర్ కుమార్దీపక్ ఘనస్వాగతం పలికారు. గూడెం గుట్టపై సత్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు ఆశీర్వచనం చేసి ప్రసాదం అందించారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
సాత్నాల: ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి పని నిమిత్తం నాగపూర్ వెళ్తున్న కారు శనివారం భోరజ్ మండలం పిప్పర్వాడ టోల్ప్లాజా వద్ద చేరుకుంది. టోల్ తీసుకోవడానికి ఆగి ఉన్న లారీని వెనక నుంచి వేగంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డితోపాటు సనత్ కుమార్కు తీవ్రంగా, కుష్బూ నాయుడుకి స్వల్ప గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో లారీని ఢీకొన్నట్టు డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి తెలిపాడు. -
ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన మహిళ అరెస్టు
ఆదిలాబాద్టౌన్: ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన మహిళను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం ఈమే రకు వివరాలు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఏజెంట్ల ద్వారా ప్ర భుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని వందల మంది అభ్యర్థులను మోసం చేసిన ముఠాసభ్యుల్లో ఒకరైన సుజాత ఠాకూర్ను వన్టౌన్ పోలీసులు అరెస్టు చే శారు. జిల్లావ్యాప్తంగా ఈ ముఠా సభ్యులపై 20 కే సులకు పైగా నమోదైంది. ప్రధాన నిందితులను జ నవరి 10న రిమాండ్కు తరలించగా తాజాగా సుజా త ఠాకూర్ను అరెస్టు చేశారు. నిందితులు 2023లో అనంత ఈ సొల్యూషన్స్, విద్యాదాన్ ఆర్గనైజేషన్ అనే సొసైటీ ద్వారా విద్యాంజలి 2.0 స్కీం డబ్బులు దుర్వినియోగం చేయాలని పన్నాగం పన్నారు. కేంద్రప్రభుత్వం ద్వారా వచ్చే సీఎస్ఆర్ నిధులు కాజేయాలని దురుద్దేశంతో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అబద్ధాలు చెప్పి నిరుద్యోగులను నమ్మించారు. నకిలీ ఉద్యోగాలను పాఠశాలలు, కళాశాలల్లో వచ్చేలా చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల లక్షల వరకు వసూళ్లు చేసి దాదాపు 240 అభ్యర్థులను మోసం చేసినట్లు వివరించారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారి మాటలను నమ్మవద్దని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలు రావని పరీక్షల ద్వారా ఉద్యోగాలను సాధించాలని తెలిపారు. నిరుద్యోగులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పారదర్శక నమోదుతోనే పార్టీ నిర్మాణం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పారదర్శకంగా చేపట్టే సభ్యత్వ నమోదుతోనే పార్టీ నిర్మాణం జరుగుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలో గల ఎస్వీఎస్ గార్డెన్స్లో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అధ్యక్షతన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్), పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో బూత్ స్థాయి కార్యకర్తలు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తూ రూ.50తో పార్టీ క్రీయాశీలక సభ్యత్వం, రూ.10తో సాధారణ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టాలన్నారు. కేసీఆర్ ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి కౌశిక హరి మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ రూ.13.50 కోట్లు మంజూరైన రంగపేట బ్రిడ్జ్ పనులు ప్రారంభించకుండా ఆరు వరుసల రోడ్డు నిర్మాణం చేపట్టడం అనాలోచిత నిర్ణయమన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి బెల్లంపల్లి: పార్టీ సభ్యత్వ నమోదును ప్రతీ కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు అన్నారు. బెల్లంపల్లి ఏఎంసీ ఏరియా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యమ పార్టీగా అవతరించి రాజకీయ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ను బలోపేతం చేయడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం దోహద పడుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ టి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లను అడ్డుకోవాలి
శ్రీరాంపూర్: కేంద్ర ప్రభుత్వం కార్మికుల నడ్డి విరిచేలా తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్లను అడ్డుకోవాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. శనివా రం నస్పూర్ కాలనీలోని ప్రెస్క్లబ్లో ఆ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలు గు లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు కట్టు బానిసల్లా పనిచేయాల్సి వస్తుందని, వీటిని పోరాటాలతోనే తిప్పికొట్టాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను, కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. పెట్రోల్, డిజీల్, గ్యాస్ ఇతర నిత్యావసరాల ధరలు పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విద్యా, వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ కొరకు కఠిన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శిగా బోడంకి చందును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవికుమార్, జిల్లా అధ్యక్షుడు కనికరపు అశోక్, రాష్ట్ర కమిటీ సభ్యుడు పీ.ఆశయ్య, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ప్రకాష్, చందు, అశోక్, పున్నం నాయకులు దుంపల రంజిత్ కుమార్, ప్రేంకుమార్, ఉమారాణి, మల్లేశ్వరి పాల్గొన్నారు. -
అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
లక్సెట్టిపేట: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంకతిపల్లి గ్రామానికి చెందిన గణవేని రమేశ్ (41) గత కొన్నిరోజులుగా నడుమునొప్పి, పలు రకాల వ్యాధులతో అనారోగ్యం బారినపడ్డాడు. ఎన్ని ఆసుపత్రుల్లో చూపించుకున్న నయం కాలేదు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందాడు. శుక్రవారం ఉదయం బయటకు వెళ్లి మధ్యాహ్నం వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం లక్ష్మిపూర్ శివారు పొలం వద్ద పురుగుల మందు తాగి ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఈ వి షయం తెలుసుకున్న కుటుంబీకులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మె రుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుప్రతికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా రాత్రి మృతిచెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదుతో శనివారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు. -
దుబాయ్లో ఉద్యోగావకాశాలు
నిర్మల్ఖిల్లా: దుబాయ్లో క్యాబ్డ్రైవర్, బైక్ రైడర్గా పనిచేసేందుకు ఉమ్మడి జిల్లా అభ్యర్థులు టామ్కామ్(తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రవాసీమిత్ర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల పేర్కొన్నారు. 21 నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులని, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టుతోపాటు కనీసం ఏడాది అనుభవం ఉండాలని తెలిపారు. బేసిక్ ఇంగ్లిష్ మాట్లాడటం, చదవడం తెలిసి ఉండాలని పేర్కొన్నారు. నెలకు సుమారు రూ.64 వేల నుంచి రూ.లక్ష వరకు జీతం ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు టామ్కామ్ అధికారిక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈనెల 25 చివరి తేదీ, ఎంపికై నవారికి స్క్రీనింగ్ అనంతరం వైద్యపరీక్షలు, సీజీ/స్క్రీనింగ్ క్లియరెన్స్, వీసా ఆమోదానికి లోబడి తుది ఎంపిక ఉంటుందని వివరించారు. వివరాలకు 9440049520 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
రక్తం.. ప్రాణవాయువు!
● స్వచ్ఛందంగా ముందుకొస్తున్న దాతలు ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఏటా జూన్ 14న.. ప్రముఖ జీవశాస్త్రవేత్త, వైద్యుడు కార్ల్ ల్యాండ్ స్టీనర్ 19వ శతాబ్దంలో మానవ రక్తకణాలు కనుగొన్నందు కు గాను 1930లో నోబెల్ బహుమతి లభించింది. ఆయన జయంతి సందర్భంగా ఏటా జూన్ 14న రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తోంది.మంచిర్యాల జిల్లాలో.. జిల్లా కేంద్రం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం లేదు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ప్రభుత్వ ఆస్పత్రితోపాటు ఇతర ఆస్పత్రులకు సరఫరా చేస్తోంది. 2008 నుంచి ఇప్పటివరకు 1,11,832 యూనిట్లు రక్తదాన శిబిరాల ద్వారా సేకరించి 1,11,639 యూనిట్లు అందజేశారు. 2,500 యూనిట్లు నిల్వ చేసే కోల్డ్స్టోరేజీ ఉంది. ప్రతీ నెల సికిల్సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు 300 యూనిట్లు ఎక్కిస్తున్నారు. ఓ పాజిటివ్ గ్రూపు రక్తం ఎక్కువగా నిల్వ ఉంటుండగా.. వినియోగమూ ఎక్కువే ఉంటోంది. ప్రస్తుతం ఓ పాజిటివ్ 141 యూనిట్లు, ఓ నెగెటివ్ 6, ఏ పాజిటివ్ 86, ఏ నెగెటివ్ 3, బీ పాజిటివ్ 109, బీ నెగెటివ్ 2, ఏబీ పాజిటివ్ 26, ఏబీ నెగెటివ్ 1 మొత్తంగా 374 యూనిట్లు నిల్వ ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో.. నిర్మల్ జిల్లాలో రెండు ప్రభుత్వ బ్లడ్బ్యాంకులు, నిర్మల్ పట్టణంలో మూడు, భైంసాలో ఒక ప్రైవేటు బ్లడ్ బ్యాంకు ఉన్నాయి. రోజు 40 నుంచి 80 మందికి రక్తం అవసరం అవుతుంది. ఇటీవల రోడ్డు ప్రమాద కేసులు గణనీయంగా పెరిగాయి. వీరితోపాటు ప్రసవం, రక్తహీనత కేసులకు దాతల నుంచి రక్తం అవసరం పడుతుంది. జనరల్ ఆస్పత్రిలో 300 యానిట్ల వరకు రక్తం నిల్వ ఉంచవచ్చు. ప్రతీనెలా 200 నుంచి 250 యూనిట్లు అవసరం ఉండటంతో అదేస్థాయిలో సేకరిస్తున్నారు. బ్లడ్ బ్యాంకుల్లో ఒక్కోసారి రక్తనిల్వలు లేకుండా పోతుండడంతో అత్యవసర సమయాల్లో దాతల నుంచి సేకరించాల్సి వస్తోంది. ఏ, బీ, ఓ పాజిటివ్ గ్రూప్లను రక్తదాన శిబిరాల్లో ఎక్కువగా రక్తదాతలు ఇస్తారు. ఏ, బీ నెగెటివ్ వేల మందిలో ఒకరు, ఇద్దరు మాత్రమే ఉంటారు. దాతలకు బీమా పాలసీ వెయ్యిమందికి పైగా 39 సార్లు చేశా..పాతమంచిర్యాల /ఆసిఫాబాద్అర్బన్/నిర్మల్చైన్గేట్: రక్తం.. ప్రత్యామ్నాయం లేనిది. కృత్రిమంగా తయారు చేయలేనిది. మనిషిలో ప్రవహించే రక్తం మాత్రమే మనుషుల ప్రాణాలు కాపాడడంలో దోహదపడుతుంది. రక్తం తక్కువగా ఉన్న వారికి సరైన సమయంలో ఎక్కించకపోతే ప్రాణాలు పోయే ప్రమాదముంది. సికిల్సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతీ వారం లేదా నెలకోసారి క్రమం తప్పకుండా ఎక్కించాల్సిందే. అలాంటి వారితోపాటు అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారి కోసం కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి దానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -
చిన్నారులకు ఘన స్వాగతం
మంచిర్యాలఅర్బన్: ‘ప్రతీ విద్యార్థి ఆనందంగా పాఠశాలకు రావాలనే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. బోధన నాణ్యత పెంపు.. మెరుగైన ఫలితాల కోసం టీచర్లకు మార్గదర్శకాలు ఇచ్చాం. సర్కారు పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంపు.. డ్రాపౌట్ లేకుండా చిన్నారులు బడిబాట పట్టేలా కార్యాచరణ చేపట్టాం’ అని జిల్లా విద్యాధికారి చంద్రయ్య అన్నారు. ఈ నెల 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో వసతిగృహాలు, రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాలలు అందంగా అలంకరించి విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘బడిబాట’లో విద్యార్థుల నమోదు.. జిల్లాలో బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలోని 709 పాఠశాలల్లో 43,072 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ప్రైమరీలో 15,311, అప్పర్ ప్రైమరీలో 4419, సెకండరీలో 15,637, హయ్యర్ సెకండరీలో 7,705 మంది విద్యార్థులున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 10 శాతం అడ్మిషన్లు పెంచాలని నిర్ణయించాం. నాలుగేళ్లు నిండిన చిన్నారులను ప్రీ ప్రైమరీ పాఠశాలలో చేర్పించేలా అంగన్వాడీల్లో ఐదేళ్లు నిండిన చిన్నారులను ప్రభుత్వ యాజమాన్య ప్రాథమిక పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామసభలు, ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లల గుర్తింపు, కరపత్రాల ద్వారా ప్రచారం, సామూహిక అక్షరాభాస్యం, విలీన విద్య, బాలల సభ, బాలికా విద్య, తరగతిగదుల డిజిటలీకరణ, క్రీడాపోటీల నిర్వహణ, సర్కారు బడుల్లో బోధన, సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ విస్తృతంగా ప్రచారం చేపట్టడం ద్వారా విద్యార్థుల నమోదు పెంచనున్నాం. వందశాతం ట్రాన్సిషన్, జీరో డ్రాపౌట్ ప్రతీ ప్రభుత్వ యాజమాన్య ప్రాథమిక, ప్రాథమికోన్నత ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలలో ఐదు, ఏడు, ఎనిమిది తరగతులు పూర్తి చేసిన విద్యార్థులను సమీప ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో చేర్పించి సంబంధిత పాఠశాల హెచ్ఎం యుడైస్లో సటూండెట్ మాడ్యుల్లో ఇంపార్ట్ చేయించాలి. విద్యార్థుల నూతన పాఠశాల, ప్రవేశ వివరాలు మండల విద్యాధికారి నిర్ణీత ప్రొఫార్మాలో స్కూల్ కాంప్లెక్ హెచ్ఎం ద్వారా సమర్పించాలి. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థి ఇష్టానుసారం ఏదైనా జూనియర్ కళాశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థి చదివిన పూర్వ పాఠశాల, నూతన పాఠశాల, కళాశాల హెడ్స్ ఇద్దరూ యుడైస్లో డ్రాప్ బాక్స్లో ఏఒక్క విద్యార్థి ఉండకుండా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతీ విద్యార్థి యుడైస్లో నమోదై ఉండేలా నవీకరించాలి. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాఠశాల పున:ప్రారంభమైన రోజున ప్రతీ విద్యార్థికి మధ్యాహ్న భోజనం అందుతుంది. ఆయా పాఠశాలలకు బియ్యం సరఫరా జరిగింది. పాఠశాల హెచ్ఎం, కమిటీ సభ్యులు మధ్యాహ్న భోజనం రుచి, శుచిపై టెస్టీ చేయాల్సిందే. ప్రారంభం రోజే పుస్తకాలు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజునే నోట్, పాఠ్యపుస్తకాలు అందిస్తాం. జిల్లాకు 3,12,986 నోట్ పుస్తకాలు చేరాయి. 3,05,620 పాఠ్యపుస్తకాలకు 2,86,3400 వచ్చాయి. ఎనిమిదో తరగతి బయోలజీ, రెండో తరగతి ఇంగ్లిష్ మీడియం పుస్తకాలు రావాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో అన్ని పుస్తకాలు రావొచ్చు. గ్రౌండ్ బ్యాలెన్స్ కలుపుకుని మొత్తం 3,05,620 పుస్తకాలు (100 శాతం) ఆయా పాఠశాలలకు చేరాయి. గ్రామస్థాయిలో సర్పంచులు, అమ్మ ఆదర్శ కమిటీలు, మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించాం. ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం వల్ల బడుల్లో ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడు పరిష్కారానికి నోచుకునే అవకాశం ఉంటుంది. కేజీబీవీలకు యూనిఫాం క్లాత్ త్వరలోనే అందనుంది. పరిశుభ్రత, పారిశుద్ధ్యం అమ్మ ఆదర్శ కమిటీ, స్కూల్ ఫెసిలిటీ అండ్ మెయింటెనెన్స్ గ్రాంట్ నుంచి పారిశుద్ధ్య నిర్వహణ కోసం శానిటేషన్ వర్కర్స్ను నియమించుకోవాలి. అవసరమైతే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ సిబ్బందిని వినియోగించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశాం. వేసవి సెలవుల్లో పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండి విషపూరిత కీటకాలు సంచరించే ప్రమాదం ఉంది. తాగునీటి ట్యాంకులు పాకురుతో నిండి ఉంటాయి. ఇంకా ఒకరోజు సమయం ఉంది. తరగతి గదులు, పరిసరాలు, నీటి ట్యాంకులు, వంటపాత్రలు శుభ్రపర్చుకోవాలని ఆదేశించాం. బోధన నాణ్యతలో పెంపునకు చర్యలు గతేడాది విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్, పాఠ్యప్రణాళికలు రాయడం, అభ్యసన సామర్థ్యాలపై విపులంగా శిక్షణ ఇచ్చాం. ఉన్నత పాఠశాలలకు లిప్పై, ప్రధానోపాధ్యాయులకు బోధన తీరు పర్యవేక్షణపై అవసరమైన తర్ఫీదు ఇచ్చాం. ప్రాథమిక పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఐదు ఇన్స్పెక్షన్ టీంలు, ఉన్నత పాఠశాలల పనితీరు పర్యవేక్షణకు రెండు తనిఖీ బృందాలు నియమించాం. బడిబాట ముగిసిన తర్వాత బృందాలకు కేటాయించిన మండలాలను నిరంతరం పర్యవేక్షిస్తారు. దీంతో వ్యవస్థలో జాగరుకత, బాధ్యత పెరిగి ప్రణాళికాబద్ధమైన బోధనలో నాణ్యత, అభ్యసన సామర్థ్యాలలో పెరుగుదల, పాఠశాలల పనితీరులో పురోగతి సాధ్యమవుతుంది.మౌలిక వసతులు..టీచర్ల సర్దుబాటుడిజిటల్ విద్య..ఫీజుల వివరాలు ప్రదర్శించాలిమౌలిక సదుపాయాలకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలతో 545 పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల నవీకరణ, మరమ్మతులు పూర్తయ్యాయి.జిల్లాలో 2,464 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. తక్కువ విద్యార్థులుండి ఎక్కువ ఉపాధ్యాయులుంటే మరో పాఠశాలకు సర్దుబాటు చేశాం. గతేడాది 168 మందిని వర్క్ అడ్జస్ట్మెంట్ చేశాం. ఎక్కడైనా ఖాళీలుంటే కలెక్టర్ అనుమతితో సర్దుబాటు చేస్తాం. జిల్లాలోని 576 ప్రాథమిక పాఠశాలల్లో టాప్స్ ద్వారా, 138 ఉన్నత పాఠశాలల్లో ఐఎఫ్సీ తెరల ద్వారా బోధన జరుగుతోంది. 71 పాఠశాలల్లో ఐసీటీ ల్యాబ్లు ఏర్పాటు చేశాం. 119 పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నాం. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత అభ్యసన కార్యక్రమం కొనసాగుతుంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాఠశాల నోటీస్ బోర్డులో స్కూల్ అనుమతి, ఉత్తర్వుల ప్రతిని, వివరాలు, పాఠశాల గవర్నింగ్ బాడీ అనుమతించిన తరగతి వారీగా విద్యార్థుల నుంచి సేకరించే ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజుల వివరాలను విధిగా ప్రదర్శించాలి. -
హత్యకేసులో భర్త ఉరేసుకుని..
దహెగాం: మండలంలోని గెర్రె గ్రామంలో ఎనిమిది నెలల క్రితం జరిగిన నిండు గర్భిణి హత్యకేసులో ఏ 4గా నిందితుడిగా ఉన్న భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై చుంచు రమేశ్ కథనం ప్రకారం.. నిండు గర్భిణి తలాండి శ్రావణిని మామ శివార్ల సత్తయ్య అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. హత్య కేసులో ఏ4 గా ఉన్న భర్త శివార్ల శేఖర్(26) జైలు నుంచి విడుదలై బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో మేనకోడలి ఇంట్లో ఉంటున్నాడు. మూడురోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. శనివారం ఇంట్లో నుంచి బైక్పై వెళ్లగా తండ్రి సత్తయ్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. కుటుంబసభ్యులు వెతుకుతుండగా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో బైక్ కనిపించింది. అనుమానంతో వెతకగా చెట్టుకు ఉరేసుకున్నాడు. తన కుమారుడి మృతికి శ్రావణి తల్లిదండ్రులు చెన్నయ్య, అనసూర్యపై అనుమానం వ్యక్తం చేస్తూ సత్తయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పెళ్లి కావడం లేదని యువకుడు.. భైంసారూరల్: పెళ్లి కావడం లేదని మనస్తాపం చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన ఉంగురాల రాజు (34)కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో రాజుకు వివాహం జరగకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. శనివారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబీకులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని భైంసా ఏరియాస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చట్ట వ్యతిరేకులపై కఠినంగా వ్యవహరించాలి
● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా దండేపల్లి: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. శనివారం దండేపల్లి పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. రికార్డులు, రిజిష్టర్లు, రిసెప్షన్ కౌంటర్ను పరిశీలించారు. ఎస్సై రాజవర్ధన్ను అడిగి పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. పరిసరాలను పరిఽశీలించి, పరిశుభ్రంగా ఉంచాలన్నారు. క్రైమ్ వాహనాలు, ప్రాపర్టీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని, స్టేషన్ను వర్టికల్ వారీగా విభజించి సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని, రికార్డులను ఎప్పటికప్పుడు ఆధునీకరించాలని సూచించారు. -
సింగరేణి ప్రాంతానికి పెద్దపీట
– మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుసింగరేణి ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కారుణ్య నియామక పత్రాలు పొందిన వారిలో జిల్లా నుంచి 117 మంది ఉన్నారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. ప్రస్తుతం సింగరేణిలో మారుపేరు సమస్య ఉందని, ఒక కమిటీని వేసి త్వరలోనే పరిష్కారం జరిగేలా చూడాలని డిప్యూటీ సీఎంను కోరారు. రిటైర్డ్ కార్మికులకు తెల్ల రేషన్కార్డులు ఇవ్వాలని తాను సూచించగా, ఇచ్చిన ఘనత ఇందిరమ్మ రాజ్యంలోని సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందని అన్నారు. సింగరేణి ప్రాంతంలో 10 వేలకు పైగా క్వార్టర్లు ఖాళీగా ఉండి, వాడకంలో లేక అవి పాడవుతున్నాయని, వాటిని రిటైర్డ్ కార్మికులకు అందించి, ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీరాంపూర్లోని సింగరేణి ప్రాంతంలో ఇళ్లపట్టాలను ఇప్పించి, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు అందించే బోనస్ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచేలా చూడాలని కోరారు. రిటైర్డ్ కార్మికులకు ఆదాయపు పన్ను వెసులు బాటు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ మంత్రి వేణుగోపాల్చారి, ఐఎన్టీయూసీ, మినిమం వేజేస్ బోర్డు చైర్మన్ జనక్ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్షు డు సీతారామయ్య, సింగరేణి సీఎండీ బుద్ద ప్రకాష్ జ్యోతి, గిరిజన సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, నాయకులు పాల్గొన్నారు. -
పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత
బెల్లంపల్లి: ఆటోలో బ్యాగు పోగొట్టుకున్న వ్యక్తికి టూటౌన్ పోలీసులు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా రాఘవపురానికి చెందిన మాదాసి ఐలయ్య శుక్రవారం దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో బెల్లంపల్లికి వచ్చాడు. కల్వరి చర్చికి వెళ్లడానికి మందమర్రి వైపు వెళ్లే ఆటో ఎక్కాడు. చర్చి వద్ద ఆటో దిగి బ్యాగును అందులో మర్చిపోయాడు. త ర్వాత టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యా గులో బ్యాంకు, పట్టాపాసుపుస్తకాలు, పింఛన్బుక్, ఆధార్కార్డు, రూ.2వేలు నగదు ఉన్నట్లు వెల్లడించాడు. స్పందించిన కానిస్టేబుల్ బుక్య గంగాధర్.. సీసీ పుటేజీలు పరిశీలించి ఆటో మందమర్రికి చెందిన శంకర్దిగా గుర్తించాడు. శనివారం అతని ఇంటికి వెళ్లగా బ్యాగును అప్పగించాడు. కానిస్టేబుల్తోపాటు ఆటోడ్రైవర్కు ఐలయ్య కృతజ్ఞతలు తెలిపాడు. -
రోడ్డుప్రమాదంలో యువకుడు..
నేరడిగొండ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందినట్లు ఎస్సై ఇమ్రాన్ తెలిపారు. ఎస్సై, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని యాపల్గూడ గ్రామానికి చెందిన మండాడి భీంరావ్(30) శనివారం తన బైక్పై బంధువులను వదిలిరావడానికి గుత్పాల గ్రామానికి వెళ్లి తిరిగివస్తున్నాడు. రోల్మామడ సమీపంలోని దేవుల్నాయక్ తండా వద్ద లారీ రాంగ్రూట్లో నిర్లక్ష్యంగా రివర్స్ తీసుకుంటూ బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో భీంరావ్ కిందపడి తల, వీపు భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్లో నిర్మల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ జగన్పై చర్యలు తీసుకోవాలని మృతుడి అన్న కృష్ణ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కవి వెంకట్కు పద్యగాన సత్కారం
నిర్మల్ఖిల్లా: నిర్మల్కు చెందిన సంస్కృత భాషా ప్రచార సమితి ఆదిలాబాద్–నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్యకవి బి.వెంకట్కు పద్యగాన సత్కారం లభించింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగుభాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అక్కి నర్సింలు గౌడ్ రచించిన బాలరామాయణం పుస్తకావిష్కరణ సభలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొన్న డా. బి.వెంకట్ తన స్వీయ పద్యాలను ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు. అతిథులుగా పాల్గొన్న ఆచార్య కసిరెడ్డి వెంకట్రెడ్డి, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, తెలంగాణ భాషా చైతన్య సమితి అధ్యక్షులు బడేసాబ్, కుసుమ ధర్మన్న కళాపీఠం చైర్మన్ రాధాకుసుమ, పంచపదుల ప్రక్రియ రూపకర్త పాండురంగ విఠల్ చేతులమీదుగా ఆయన పద్యగాన సన్మానాన్ని స్వీకరించారు. జిల్లాకు చెందిన పలువురు రచయితలు, సాహితీవేత్తలు ఈ సందర్భంగా వెంకట్కు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కవిసమ్మేళనంలో 51 మంది కవులు పాల్గొన్నారు. -
‘మోదీ అంటే నమ్మకం, విశ్వాసం’
కాసిపేట: మోదీ అంటే ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉందని అందుకే నెహ్రూను మించి 12సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నట్లు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేశ్ తెలిపారు. మండల కేంద్రంలోని శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశమే ఇళ్లుగా, దేశ ప్రజలే కుటుంబంగా బతికేది కేవలం మోడీ అని అన్నారు. సమావేశంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు దేవునూరి సంతోష్, రెడ్డి బాలరాజు, ఉపాధ్యక్షుడు ప్రసన్న, నాయకులు రాంచందర్, రాజేష్, ప్రశాంత్, సురేందర్, తోట మనోజ్, మహిళా మోర్చ నాయకురాళ్లు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా ఆర్టీసీ విలీన ప్రక్రియ
ఆదిలాబాద్: ఆర్టీసీలో ఉద్యోగుల విలీన ప్రక్రియ వే గంగా జరుగుతుందని ఆదిలాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాను అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు. టీజీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే కార్మిక సోదరుల చిరకాల స్వప్నం సాకారం కాబో తోందని పేర్కొన్నారు. గత ఏప్రిల్లో జరిగిన సమ్మె సందర్భంగా కార్మికులు లేవనెత్తిన అంశాలపై ప్ర భుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ పరి శీలించిందని తెలిపారు. ఇప్పటికే విలీనానికి సంబ ంధించిన ఆర్థిక, సాంకేతిక, పరిపాలనాపరమైన అ ంశాలపై సమీక్ష నిర్వహించిందని వెల్లడించారు. రా ష్ట్రంలోని అన్ని డిపోల్లో కార్మిక శాఖ పర్యవేక్షణలో యూ నియన్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మిక సంఘాల ప్రతిని దులను విలీన ప్రక్రియలో భాగస్వాములను చేస్తామని వివరించారు. కార్మికుల భవిష్యత్తుకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ విధులను అంకితభావంతో నిర్వహిస్తూ, సంస్థ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
తెప్పబోల్తా పడి మత్స్యకారుడి మృతి
కడెం: భారీ ఈదురుగాలులు, అలలకు తెప్పబోల్తాపడి మ త్స్యకారుడు నీట మునిగి మృతిచెందాడు. కడెం ప్రాజెక్టు వ ద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నాగుల రాజశేఖర్(54) మత్స్యకారుడు రోజులాగే శనివారం కడెం ప్రాజెక్ట్ బ్యాక్వాటర్లో చేపల వేటకు వెళ్లాడు. సాయంత్రం భారీ ఈదురుగాలులు రావడంతో అప్రమత్తమై ఒడ్డుకు చేరే క్రమంలో ప్రాజెక్ట్లో భారీ నీటి అలలకు తెప్ప బోల్తాపడింది. ఈత కొట్టేందుకు ప్రయత్నించిన రెండు కాళ్లకు చేపల వల చుట్టుకుని నీటిలో మునిగి మృతిచెందాడు. భారీ ఈదురుగాలుల మధ్య ఎలాగైన ఒడ్డుకు చేరాలని కడెం ఎడమ కా లువ వైపు వేగంగా తెడ్డు కొడుతుండగా ఒడ్డునవా రు తీసిన వీడియో వైరలయ్యాయి. రాజశేఖర్ మృతిచెందడం అందరినీ కలిచివేసింది. కుటుంబ స భ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎస్బీ ఎస్సై గంగన్న మృతి
జన్నారం: అనారోగ్యంతో ఎస్బీ ఎస్సై జాడి గంగన్న మృతిచెందారు. మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందిన ఈయన 1989లో కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరారు. 2012లో హెడ్ కానిస్టేబుల్గా, 2018లో ఏఎస్సైగా, 2024 సెప్టెంబర్ 26న ఎస్సైగా ప్రమోషన్ పొంది, ప్రస్తుతం రామగుండం ఎస్బీ ఎస్సైగా పనిచేస్తున్నారు. రెండునెలల క్రితం బ్రెయిన్స్ట్రోక్తో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి వచ్చారు. ఆ తర్వాత అనారోగ్యం బారినపడగా కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. కాగా, గంగన్న మరో 14 నెలల్లో ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంది. ఆయనకు భార్య అన్నపూర్ణ, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
ఆలయాల అభివృద్ధికి రూ.70 కోట్లు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయం అభివృద్ధి, మంచిర్యాల విశ్వనాథ ఆలయం పునర్నిర్మాణ పనులకు రూ.70కోట్లు ఇస్తానని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి 36రోజుల్లోనే ఇవ్వడం, పనులకు శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శనివారం ఆయా పనులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ ప్రారంభిస్తారని తెలి పారు. నియోజకవర్గంలో రూ.9.70కోట్లతో 35ఐకేపీ భవనాలు, నగరంలోని 60 డివిజన్లకు కార్యాలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. డివిజన్ కార్యాలయాల్లో ప్రజలు సమస్యలు తెలియజేస్తే వారం రోజుల్లోనే పరిష్కరించేలా పాలన సాగుతుందని అన్నారు. సింగరేణి ప్రాంత సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారానికి హామీనిచ్చారని, మెడికల్ బోర్డు ఏర్పాటుతోపాటు ఇకపై మూడు నెలలకోసారి దరఖాస్తులను పరిష్కరిస్తుందని చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా 335 మందికి కారుణ్య నియామక ఉద్యోగాలు ఇవ్వనుండగా.. శ్రీరాంపూర్ డివిజన్లోనే వందకు పైగా ఉన్నాయని, మంచిర్యాలలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా పత్రాలు అందజేస్తామని తెలిపారు. డీప్యూటీ సీఎం ‘భట్టి’ శ్రీరాంపూర్ సింగరేణి ఓసీని సందర్శిస్తారని, ఆదివారం వేంపల్లిలోని పద్మావతి గార్డెన్లో జరిగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై బూత్ స్థాయి ఏజెంట్ల అవగాహన శిక్షణ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నగర మేయర్ దర్ని మధుకర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
మంచి నిర్ణయం
రైతులు పంట రుణాల కోసం నేరుగా తమ మొబైల్ ఫోన్ల నుంచి దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిక యాప్ తీసకురావడం మంచి నిర్ణయం. రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగే పని తప్పింది. ఈ యాప్ వల్ల వారికి మేలు చేకూరుతుంది. – నర్సారెడ్డి, రైతు, లక్ష్మణచాంద సద్వినియోగం చేసుకోవాలి కృషిక యాప్ ద్వారా రైతులు తమ పంటల సాగుకు అసవరమైన రుణాలను తమ మొబైల్ ఫోన్ల నుంచే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులకు వెళ్లకుండా రుణాలు పొందవచ్చు. జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి. –రాంగోపాల్, ఎల్డీఎం, నిర్మల్ -
విద్యారంగానికి ప్రాధాన్యం
బెల్లంపల్లి/తాండూర్: విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే జి.వినోద్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని రాంగనగర్ బస్తీలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. వార్డుల్లో రూ.1.44కోట్ల అంచనాతో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. తాండూర్లో మహాత్మాజ్యోతిబాపూలే వసతిగృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, ప్రహరీలు, మూత్రశాలల నిర్మాణాలతోపాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. సబ్ కలెక్టర్ మనోజ్, మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి, సర్పంచ్ ముడిమడుగుల సురేష్, తహసీల్దార్ జ్యోత్స్న, ఎంపీడీఓ శ్రీనివాస్, ఆర్సీఓ బాలభాస్కర్ పాల్గొన్నారు. -
ఆర్జేసీలను కొనసాగించాలి
నార్నూర్: ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ బాలుర, ఉట్నూర్ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను (ఆర్జేసీ) కొనసాగించాలని ఆదివాసీ వి ద్యార్థి సంఘం (ఏఎస్యూ) జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఆర్జేసీ కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈవో)గా మార్చి కొనసాగిస్తామని ప్రభుత్వం భావిస్తే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్జేసీలను య థావిధిగా కొనసాగించాలని కోరారు. అవసరమైతే ప్రత్యేకంగా కొత్త సీఈవో కళాశాలలను మంజూరు చేసి భవనాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సలహాదారుడు పెందోర్ దీపక్, డీఏసీ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి జాదవ్ సుమేష్, రాజ్గొండ విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షుడు కుంరం చతుర్షావ్, మండల అధ్యక్షుడు ఆత్రం ప్రమేశ్వర్, నాయకులు మారప గంగారం, కొట్నాక్ శ్యాంరావు, కొట్నాక్ శ్రీరామ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. -
చికిత్సపొందుతూ వివాహిత..
లక్సెట్టిపేట: కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగిన వివాహిత చికిత్సపొందుతూ మృతిచెందింది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని దౌడపల్లి గ్రామానికి చెందిన అడప ఉమ (51), శ్రీనివాస్ దంపతులు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఉమ గత నాలుగేళ్లుగా కడుపు, నడుము నొప్పితో బాధపడుతోంది. ఆసుపత్రుల్లో చూపించుకున్నా నయం కాలేదు. ఈనెల 10న కడుపునొప్పి అధికం కావడంతో భరించలేక ఇంట్లో పురుగుల మందు తాగింది. కుటుంబీకులు గమనించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కరీంనగర్ తరలించగా చికిత్సపొందుతూ గురువారం రాత్రి మృతిచెందింది. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యుత్షాక్తో ఒకరు..
ముధోల్: విద్యుత్ షాక్తో ఒకరు మృతిచెందినట్లు ఎస్సై బిట్లా పెర్సిస్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని కోలిగల్లీకి చెందిన ముడుగుల సాయినాథ్ (40), సాయినాథ్ భూమేష్ ఎలక్రీషియన్తో కలిసి మాధవ్నగర్ కాలనీలో శుక్రవారం విద్యుత్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సాయినాథ్ ప్రమాదవశాత్తు కరెంటు షాక్కు గురయ్యాడు. స్థానికులు అంబులెన్సుకు సమాచారం అందించి ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జాతీయస్థాయి పోటీల్లో సత్తా
ఆదిలాబాద్: చండీగఢ్లో ఈనెల 10 నుంచి 13 వరకు జరుగుతున్న ‘నేషనల్ క్యాడెట్ జూడో చాంపియన్షిప్ 2026’లో ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పూర్వవిద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జిల్లాకేంద్రంలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో చదువుతున్న మోథం హర్షవర్ధన్ మైనస్ 60 కేజీల విభాగంలో స్వర్ణ పతకం, రమావత్ తరుణ్ మైనస్ 55 కేజీల విభాగంలో కాంస్యం కై వసం చేసుకుని రాష్ట్రకీర్తిని జాతీయ స్థాయిలో చాటారు. త్వరలో జరగనున్న ఏషియన్ క్యాడెట్, వరల్డ్ క్యాడెట్ జూడో చాంపియన్షిప్లో వీరు పాల్గొనే అవకాశం ఉందని కోచ్ రాజు పేర్కొన్నారు. వీరిద్దరి విజయం జిల్లా క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తోందని డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్ తెలిపారు. లక్ష్మణ్కు ఉత్తమ రైతు పురస్కారంతాంసి: మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన రైతు కేమ లక్ష్మణ్ ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో శుక్రవారం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ 62వ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్రవ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, అధికారులు రైతును సన్మానించి పురస్కారం అందజేశారు. వ్యవసాయరంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. గ్రామస్తులు ఆయన్ను అభినందించారు. తనకు సహకరించిన ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రానికి కేమ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఆవుకు అరుదైన శస్త్రచికిత్స
ఆదిలాబాద్(బేల): మండలంలోని పొన్నాల గ్రా మంలో ఆవుకు సోకిన హార్న్ క్యాన్సర్ (కొమ్ము క్యా న్సర్)ను పశువైద్యులు శుక్రవారం విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తొలగించారు. రైతు అశోక్ పుల్మ రేకు చెందిన ఆవు కొమ్ము భాగంలో క్యాన్సర్ గడ్డలతో తీవ్ర ఇబ్బంది పడుతుండగా, పశువైద్యులు స కాలంలో స్పందించి ప్రాణదానం చేశారు. పశువైద్యాధికారి వినోద్ దేశ్పాండే.. శస్త్రచికిత్స చేశారు. కొమ్ము భాగాన్ని శాసీ్త్రయ పద్ధతిలో తొలగించారు. రక్తస్రావం కాకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. శస్త్రచికిత్స అనంతరం ఆవు ఆ రోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు. గాయం మానడానికి అవసరమైన చికి త్స అందిస్తున్నామని, కొన్నిరోజుల అనంతరం ఆ వు పూర్తిగా కోలుకుంటుందని పేర్కొన్నారు. పశువైద్యుల బృందాన్ని స్థానిక రైతులు అభినందించారు. -
నాగోబా స్కూల్ ప్రారంభం
ఇంద్రవెల్లి: కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మెస్రం వంశ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ నాగోబా ఎక్సలెన్స్ స్కూల్ను శుక్రవారం ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతి దేవి చిత్రపటానికి పూజలు చేశారు. ఈప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికే శ్రీ నాగోబా ఎక్సలెన్స్ స్కూల్ను ప్రారంభించినట్లు మెస్రం వంశీయులు తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ, పేద పిల్లలను నాగోబా స్కూల్లో చేర్పించి ఉచిత విద్యను అందిస్తామన్నారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, కేస్లాపూర్ సర్పంచ్ తుకారం, మెస్రం వంశం ఉద్యోగులు దేవ్రావ్, శేఖర్బాబా, మోనోహర్, సోనేరావ్, వంశపెద్దలు కోసేరావ్, హనుమంత్రావ్, నాగ్నాథ్, భీంరావ్ తదితరులున్నారు. -
అధ్యక్షా.. మేముసైతం
నిర్మల్ఖిల్లా: హైదరాబాద్ సచివాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్నేహ మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా చిన్నారులు ప్రతిభ కనబర్చారు. కడెం మండలం కల్లెడ గ్రామానికి చెందిన స్నేహ సంఘం సభ్యురాలు దీటి శ్రీనిజ (8వ తరగతి) డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించి పేదరికంపై అద్భుతంగా ప్రసంగించి అందరి ప్రశంసలు పొందింది. సారంగాపూర్ మండలకేంద్రానికి చెందిన హాసిని ఎంపీగా వ్యవహరించి తన ప్రతిభ చాటుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, అధికారుల సమక్షంలో మాక్ పార్లమెంట్ గురువారం సాయంత్రం నిర్వహించగా ఇందులో పాల్గొన్నారు. వీరిని అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. చిన్నారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతనెల 30న నిర్మల్లో నిర్వహించిన జిల్లాస్థాయి మాక్ పార్లమెంట్లో ఈ చిన్నారులు ప్రతిభ కనబర్చగా కలెక్టర్ భవేశ్మిశ్రా అభినందించారు. -
వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే ప్రాణం తీసింది!
ఖానాపూర్: వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే ఒకరు మృతిచెందారని ఆరోపిస్తూ ఖానాపూర్ ప్రభుత్వ ఆ సుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం ఆందోళనకు దిగా రు. రోగిని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులు, గ్రామస్తులతో కలిసి అధికారులు, వైద్యసిబ్బందిని నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన షేక్ షారుఖ్ తన తండ్రి షేక్ హుస్సేన్ (54)కు గురువారం అర్ధరాత్రి తీవ్రనొప్పులు, అధిక చెమటలు వచ్చాయి. ఆర్ఎంపీ సూచన మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. విధుల్లో ఉన్న సిబ్బంది కేవలం ఒక ఇంజక్షన్, మూడు మాత్రలు ఇచ్చారని, కనీసం బీపీ పరీక్ష నిర్వహించలేదు. వైద్యుడు ప్రత్యక్షంగా వచ్చి చూడలేదు. ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని చెప్పకపోవడంతో దా దాపు 40 నిమిషాల పాటు అక్కడే ఉండి తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం హు స్సేన్ ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విధుల్లో నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రాత్రివేళ వైద్యుడు అందుబాటులో లేరని కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబం చేసిన ఆరోపణలను ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ స్వర్ణరెడ్డి ఖండించారు. రోగికి వైద్యచికిత్స అందించామని, డ్యూటీ వైద్యుడు అందుబాటులో ఉన్నారని, సిబ్బంది రోగి పరిస్థితి వైద్యుడి దృష్టికి తీసుకెళ్లలేదని తెలిపారు. సిబ్బంది అనుమతి లేకుండానే రోగిని ఇంటికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. సుర్జాపూర్ సర్పంచ్ బక్కశెట్టి వెంకట్రాములు, నాయకులు భూసి నరేందర్, బొమ్మెన రాకేశ్, ముషారఫ్ తదితరులు పాల్గొన్నారు. -
పంట రుణం ఇక ఈజీ
లక్ష్మణచాంద: ఇప్పటివరకు సాగు సమయం వచ్చిందంటే చాలు రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు అవసరమైన పంట రుణాల కోసం రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. బ్యాంకు అధికారులు ‘రేపు రండి..మాపు రండి’అంటూ తిప్పించుకునేవారు. ఇక నుంచి పంట రుణాలు కావాలనుకునేవారు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం మొబైల్ యాప్ ద్వారా నేరుగా పంట రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కృషిక అనే నూతన యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ యాప్ ఆంగ్లంలో ఉండగా, త్వరలోనే అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తామని అధికారులు తెలిపారు. కృషిక యాప్ పని తీరు ఇలా.. ప్రయోజనాలు ఇవే.. భవిష్యత్తు లక్ష్యాలు.. -
సర్కారు బడికి కొత్త అ‘డ్రెస్’
నిర్మల్ఖిల్లా/నిర్మల్రూరల్/మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ, స్థానిక సంస్థల్లోని 1వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల అందరి యూనిఫాం మారింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే కొత్త యూనిఫాం అమలు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఈ.నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న యూనిఫాం రంగుల్లో మార్పులు చేస్తూ కొత్త డిజైన్లను ఖరారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ యూనిఫాం విధానం అమలులోకి రానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్, గురుకుల, కేజీబీవీలు తదితర స్కూళ్లు విద్యార్థుల నూతన రంగుల దుస్తులతో శోభను సంతరించుకోనున్నాయి. పాఠశాలల వారీగా విద్యార్థుల కొలతలు, అవసరమైన గుడ్డ సరఫరా, కుట్టింపు ప్రక్రియలను త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం. సమగ్ర శిక్ష, సెర్ప్, మెప్మా సంస్థల సమన్వయంతో యూనిఫాంల తయారీ, పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇంకా చేరని ముడివస్త్రం పాఠశాలలు ఈ నెల 15న పునః ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ విద్యార్థులకు రెండేసి యూనిఫామ్ జతలు అందిస్తారు. ఇప్పటివరకు జిల్లాలకు యూనిఫామ్ వస్త్రం చేరలేదు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ముడివస్త్రం చేరి అక్కడి నుంచి పాఠశాలలకు చేరాలంటే కనీసం నెలరోజులైన పట్టవచ్చు. దీంతో కొన్ని రోజుల వరకు గత సంవత్సరం యూనిఫాంతోనే విద్యార్థులు బడులకు రావాల్సి ఉంటుంది. నిర్మల్ జిల్లాలో గత సంవత్సరం 47,969 మంది విద్యార్థులకు యూనిఫామ్ను స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టించి అందజేశారు. ఈసారి బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున సుమారు 53,100 మందికి అందించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లాలో గత ఏడాది 761 పాఠశాలల్లో 42,711మంది విద్యార్థులకు మొదట 1,86,723 మీటర్ల ముడి వస్త్రం సరఫరా చేశారు. రెండో దఫా 58,059 మీటర్ల వస్త్రం సరఫరా అయింది. గత ఏడాది వేసవి సెలవులకు ముందే యూనిఫామ్కు అవసరమైన వస్త్రం సరఫరా చేసి సకాలంలో విద్యార్థులకు యూనిఫామ్లు పంపిణీ చేశారు. ఈ ఏడాది వేసవి సెలవులు ముగిసిపోతున్నా ముడివస్త్రం సరఫరాకు నోచుకోలేదు. కొత్తగా పాఠశాలల్లో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు మరింత ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు. ప్రత్యేకతలివే.. విద్యాశాఖ విడుదల చేసిన నమూనాల ప్రకారం బాలురకు లైట్ బ్లూ రంగు షర్ట్, నేవీ బ్లూ రంగు ప్యాంట్/నిక్కర్ ఉండనుంది. బాలికలకు లైట్ బ్లూ టాప్తోపాటు నేవీ బ్లూ స్కర్ట్ లేదా దుస్తులు అమలు చేయనున్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికల యూనిఫాంలో ప్రత్యేక నేవీ బ్లూ వేస్ట్కోట్ను కూడా ప్రవేశపెట్టారు. తరగతుల వారీగా డిజైన్లలో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. -
రెండెకరాలే ‘భరోసా’!
మంచిర్యాలఅగ్రికల్చర్: వానాకాలం సాగు సీజన్ ప్రారంభమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరిట అందించే పంట పెట్టుబడి సాయం రెండెకరాలకే పరిమితం కావడంతో రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. మిగతా సాయం అందుతుందా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. మరోవైపు పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం విత్తనాలు, ఎరువుల వినియోగంపై సమావేశాలు నిర్వహిస్తోంది. యాసంగి సీజన్ రైతు భరోసా మొదటి విడత గత మార్చి 22న ప్రభుత్వం ఎకరానికి రూ.6వేల లెక్కన ఎకరంలోపు వారికి విడుదల చేసింది. రెండో విడత 20 రోజుల తర్వాత, మూడో విడత ఏప్రిల్ చివరలో జమ చేస్తామని ప్రకటించింది. ఏప్రిల్ 23న రెండో విడత రెండెకరాల్లోపు రైతులకు అందజేసింది. మొత్తంగా రెండెకరాల్లోపు రైతులకు 12వేలు జమ చేసింది. జిల్లాలోని 1,56,034 మంది రైతుల ఖాతాల్లో రూ.125.95 కోట్లు జమయ్యాయి. రైతు భరో సా అందజేయాలని రైతులు కోరుతున్నారు. -
‘మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి’
మంచిర్యాలటౌన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి చెందుతోందని, సంక్షేమం దిశగా పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానిగా మోదీ తన 12ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్నారని, అత్యధిక రోజులు ప్రధానిగా రికా ర్డును సృష్టించారని అన్నారు. మంచిర్యాల అమృత్ భారత్ రైల్వేస్టేషన్ అభివృద్ధి కేంద్రం చేపడుతోందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రా బోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధి కారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, నాయకులు గా జుల ముఖేష్గౌడ్, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్రావు, తుల ఆంజనేయులు, పెద్దపల్లి పురుషోత్తం, కస్తూరి నాగరాజు, బొట్ల అనిత, సంజీవరావు, పట్టి వెంకటకృష్ణ, వైద్య శ్రీధర్, అమిరిశెట్టి రాజ్కుమార్, కుర్రె చక్రవర్తి, మోటపలుకుల తిరుపతి, బెల్లంకొండ మురళి, డేగ బాపు, మోతె సుజాత, నాంపల్లి శ్రీనివాస్, కమలాకర్రావు, కర్రె లచ్చన్న పాల్గొన్నారు.మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్గౌడ్ -
అటవీప్రాంత అభివృద్ధికి కృషిచేయాలి
చెన్నూర్రూరల్: అటవీప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అని రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని కిష్టంపేట సమీపంలోని అంబేద్కర్ పా ర్కులో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అటవీశాఖ అధికారి రాహూల్ కిషన్ జాదవ్, చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ తివారితో కలిసి హాజరయ్యారు. ముందుగా మొక్కలు నాటారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. భా వితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించ డం కోసం అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈప్రాంతంలోని మొసళ్ల పార్కును ఇతర ప్రాంతాల పర్యాటకుల కోసం తీ ర్చిదిద్దుతామన్నారు. తద్వారా పర్యాటక ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రజ ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. రైతుల శ్రేయస్సు కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. చె న్నూర్లో త్వరలో వంద పడకల ఆసుపత్రిని ప్రా రంభిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మా ట్లాడారు. అటవీ అభివృద్దిలో భాగంగా ప్రతి ఒక్క రు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. -
పది అంశాలు.. 99రోజులు..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్ శుక్రవారంతో ముగియనుంది. పది అంశాలతో మార్చి 6 నుంచి జూన్ 12వర కు సాగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై అవగాహన కల్పించడంతో పాటు లబ్ధిదారుల ఎంపిక తదితర వాటి పై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు పాల్గొంటూ వార్డు స్థాయి నుంచి మొదలు, గ్రామ, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ పథకాలపై దృష్టిరాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలుపై ప్ర త్యేక దృష్టి సారించింది. సభలు, సమావేశాల నిర్వహణతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించింది. ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రజలను భాగస్వామ్యం చేయడంతో పథకాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. 99రోజుల్లో పది అంశాలపై ఆయా శాఖల అధికారులు కార్యక్రమాలు నిర్వహించారు. పలు చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులపై నిరసన వ్యక్తమైంది. వారోత్సవాల నిర్వహణఒక్కో అంశం వారోత్సవాలు నిర్వహించా రు. పచ్చదనం, పరిశుభ్రతలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో ఇంటింటా పచ్చదనం పెంచ డం, తడిపొడి చెత్త వేరు చేయడం, వ్యర్థాలను తిరిగి వాడేలా చేయడం, ప్లాస్టిక్ నిషేధం, మురికి కాలువలు, పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పించారు. -
ఆదివాసీ గిరిజనులకు వాహనం ఏర్పాటు
జన్నారం: ఇందూరు పోచమ్మ తల్లికి మొక్కు చెల్లించేందుకు ఆదివాసీ గిరిజనుల డీసీఎం వాహనాన్ని ఆర్టీఏ అధికారులు పట్టుకుని పోలీస్టేషన్కు తరలించగా, ఎటు పాలుపోలేని స్థితిలో ఉన్న వారికి మరో వాహనం ఏర్పాటు చేసి జన్నారం ఎస్సై ఉదయ్కిరణ్ ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు గ్రామదేవత ఇందూరు పోచమ్మ తల్లికి మొక్కులు తీర్చుకోవడానికి మూకుమ్మడిగా మల్యాలకు చెందిన సుమారు 50 మంది గిరిజనులు డీసీ ఎం వ్యాను ద్వారా కవ్వాల్కు సామగ్రితో గురువా రం బయల్దేరారు. జన్నారం వచ్చిన ఎంవీఐ.. డీసీ ఎంను తనిఖీ చేయగా పత్రాలు లేకపోవడంతో వ్యా న్ను పోలీసుస్టేషన్కు తరలించారు. స్టేషన్ ఎదురుగా గంటపాటు సామగ్రితో గిరిజనులు కూర్చున్నారు. ఎస్సై ఉదయ్కిరణ్ వెంటనే మరో డీసీఎం తెప్పించి, వారిని పోచమ్మ ఆలయానికి పంపించారు. ఎస్సైకి గిరిజనులు ధన్యవాదాలు తెలిపారు. -
ఓటర్ల పేర్ల తొలగింపును అడ్డుకోవాలి
రామకృష్ణాపూర్: ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ‘సర్’ ముసుగులో ఓటర్ల తొలగింపునకు జరుగుతున్న కుట్రలను బూత్ స్థా యి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి తిపికొట్టాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి పిలుపునిచ్చారు. క్యాతనపల్లి ము న్సిపాలిటీలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్లో గురువారం ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా(ఎస్ఐఆర్)పై బూ త్ స్థాయి ఏజెంట్ల అవగాహన కార్యక్రమంలో మంత్రి వివేక్వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ప్రభుత్వం ‘సర్’ పేరుతో కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలను బలహీనపర్చడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ఓటర్ల పేర్ల తొలగింపునకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ వేస్తే తిరస్కరించి ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాతర వేసిందని విమర్శించారు. నీట్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీల వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేరు భద్రంగా ఉండేలా బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆపన్నహస్తం అందించరూ..
ఖానాపూర్: మండలంలోని బావాపూర్ (కె) గ్రామానికి చెందిన గడుగు శ్రీనివాస్ విద్యుత్ షాక్కు గురై గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు. వైద్యఖర్చులు రూ.లక్షల్లో ఖర్చువుతుండడంతో బాధిత కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. ఈనెల 3న గ్రామంలో గాలిదుమారంతో కూడిన వర్షం కురవడంతో పలుచోట్ల స్తంభాలు కూలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. సరఫరా పునరుద్ధరించే పనుల్లో భాగంగా మరమ్మతు నిర్వహిస్తుండగా శ్రీనివాస్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన కుడిచేతితోపాటు కాలి వేళ్లను కోల్పోయాడు. హైదరాబాద్లోని ఆసుపత్రిలో ఆయన వైద్యానికి కుటుంబీకులు ఇప్పటికే సుమారు రూ.10 లక్షలు వెచ్చించారు. చికిత్సకు ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయని దాతలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆర్థికసాయం అందించాలని కోరుతున్నారు. సాయం చేయదలిచిన వారు గడుగు శ్రీనివాస్ సెల్ నంబర్ 97040 24138 నంబర్లో సంప్రదించవచ్చు. -
14న తుడుందెబ్బ రాష్ట్ర సమావేశం
ఆదిలాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని కేసీబీ గార్డెన్లో ఈనెల 14న ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేశ్ తెలిపారు. మావల మండలంలోని కుమురం భీంగూడలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ హక్కుల సాధన కోసం వ్యూహాలు, ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు, జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ప్రతినిధులు సకాలంలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెట్టి మనోజ్, రాష్ట్ర కార్యదర్శి అర్క శేషారావు, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గేడం విష్ణు, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం వరుణ్, ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం గణపతి, మావల మండల అధ్యక్షుడు వేడామ ముకుందరావు, నాయకులు తొడసం ప్రకాశ్, కుమ్ర గోవింద్, గోడం మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో అమృత్ 2.0 పనులు ఆలస్యం చేయకుండా సత్వరంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ఎమ్మెల్యే జి.వినోద్ అన్నారు. గురువారం బెల్లంపల్లి కన్నాల గ్రామ శివారులో అమృత్ 2.0 అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, కాంగ్రెస్ నాయకులు కారుకూరి రాంచందర్, దావ రమేష్బాబు, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రజల భద్రత.. జీవాల రక్షణ ఎంతో ముఖ్యంబెల్లంపల్లి: ప్రజల భద్రత, జీవాల రక్షణ ఎంతో ముఖ్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గురువారం బెల్లంపల్లి అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో ర్యాపిడ్ రెస్క్యూ టీమ్(ఆర్ఆర్టీ) భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి, జంతు ఘర్షణలను తగ్గించడంలో టీమ్ సభ్యులు ముందుండాలని తెలిపారు. అటవీ సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీవో విజయ్కుమార్, ఎఫ్ఆర్వో పూర్ణచందర్, డెప్యూటీ ఎఫ్ఆర్వో గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్లను ఢీకొట్టిన లారీ
తాండూర్: రెండు ట్రాక్టర్లను లారీ ఢీకొట్టిన ఘటన మండలంలోని బోయపల్లి బోర్డు సమీపంలో జాతీ య రహదారిపై చోటుచేసుకుంది. ఎస్సై ప్రసాద్రావు కథనం ప్రకారం.. తాండూర్ గ్రామం బోయవాడకు చెందిన ముస్కె రాజశేఖర్(19), బొల్లి తిరుపతి ఇద్దరు రెండు ట్రాక్టర్లపై బుధవారం అర్ధరాత్రి సమయంలో మంచిర్యాలలోని ఇసుక రీచ్కు ఇసుక తీసుకువచ్చేందుకు వెళ్తున్నారు. ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాలకు వెళ్తున్న లారీ వేగంగా ఈ రెండు ట్రాక్టర్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముస్కె రాజశేఖర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ట్రాక్టర్ డ్రైవర్ తిరుపతి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతుడి తండ్రి ముస్కె రాజలింగు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కార్మికుల పెన్షన్ పెంచాలని వినతి
శ్రీరాంపూర్: బొగ్గు గని కార్మికుల పెన్షన్ పెంచాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కోరారు. గురువారం హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సమావేశానికి హాజరైన కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన ధరలకు వస్తున్న పెన్షన్ సరిపోవడం లేదన్నారు. కనీసం పెన్షన్ పెంపుదల చేసి ఆర్థిక భద్రత కల్పించాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య చికిత్స అందించే సీపీఆర్ఎంఎస్ కార్డు పరిమితి పెంచాలని కోరారు. వైద్య బిల్లుల రీయింబర్స్మెంట్ సులభతరం చేయాలని, ఇంకా ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. కేంద్ర బొగ్గు సహాయక శాఖ మంత్రి చంద్రు దుబే, సింగరేణి డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్కు ఈమేరకు వినతిపత్రాలు అందజేశారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ.వేణుమాధవ్, ఉపాధ్యక్షుడు కంచ బీరయ్య, కోశాధికారి విజయబాబు పాల్గొన్నారు. -
పురాతన యుద్ధవీరుని శిల్పం లభ్యం
నిర్మల్ఖిల్లా: పట్టణంలోని గాజులపేట్ సమీప పంటపొలాల్లో గురువారం మధ్యయుగ కాలానికి చెందిన పురాతన యుద్ధవీరుని శిల్పం లభ్యమైనట్లు జిల్లాకు చెందిన యువకవి, కళాకారుడు పోలీస్ భీమేశ్ తెలిపారు. సుమారు 12వ లేదా 14వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న ఈ శిల్పం నాలుగు అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు కలిగి ఉందని పేర్కొన్నారు. యోధుని రూపాన్ని అద్భుతంగా చెక్కినట్లు తెలిపారు. తలపై ముడిచిన కురులు, పెద్ద కళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కుడిచేతిలో ఖడ్గం, ఎడమచేతిలో డోలు ధరించి ఉందన్నారు. శిల్పానికి ఎదురుగా సుమారు నాలుగు అడుగుల ఎత్తు గల రాతి దీపస్తంభం ఉన్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో ఇలాంటి వీరగళ్లు శిల్పాలు ఉన్నాయని, పురావస్తు శాఖ గుర్తించి అధ్యయనం చేసి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. నలుగురు ఎస్సైల బదిలీగోదావరిఖని: కాళేశ్వరం జోన్పరిధిలో నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ రామగుండం సీపీ అంబర్కిశోర్ఝా ఆదేశాలు జారీ చేశారు. సీసీఎస్ మంచిర్యాలలో పనిచేస్తున్న కె.నరేశ్ను ఎస్హెచ్వోగా పెద్దపల్లికి బదిలీ చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి ఎస్హెచ్వో ఎన్.మధూకర్ను సీసీఎస్ రామగుండం కమిషనరేట్కు బదిలీ చేశారు. ములుగు జిల్లా డీఎస్బీ ఎస్ఐగా పనిచేస్తున్న యు.ఉపేందర్రావును సీసీఎస్ రామగుండం, ఇటీవలే పెద్దపల్లి ఎస్హెచ్వోగా బదిలీ అయిన బి.జీవన్ను సీసీఎస్ పెద్దపల్లికి బదిలీ చేశారు. -
బైకులు ఢీకొని ముగ్గురికి గాయాలు
లక్ష్మణచాంద: మండలంలోని పార్పెల్లి–ధర్మా రం గ్రామాల మధ్య రెండు బై కులు ఎదురెదురుగా ఢీకొని ము గ్గురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగాపూర్కు చెందిన ఓరుగంటి నర్సయ్య(65) భార్య సునీత(45) పుట్టింటి వారు ధర్మారం పోచమ్మ వద్ద పండుగ చేస్తున్నారని గురువారం పార్పెల్లికి బైక్పై వ స్తున్నారు. పార్పెల్లికి చెందిన కందుకూరి హ రీశ్(35) ధర్మారం పోచమ్మ ఆలయానికి వెళ్లేందుకు బైక్పై వస్తుండగా ఎదురెదురుగా ఢీకొ న్నాయి. ఈప్రమాదంలో నర్సయ్య తలకు తీవ్ర గాయాలు కాగా, సునీత స్వల్పంగా, హరీశ్ తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పైలట్ నవీన్కుమార్, ఈఎంటీ దీపక్లు క్షతగాత్రులను అంబులెన్స్లో నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. నర్సయ్యకు మెరుగైన వైద్యం నిజామాబాద్కు పంపించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. హరీశ్, సునీతలు నిర్మల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓరుగంటి నర్సయ్య బావ మేడిపెల్లి నర్సయ్య ఫిర్యాదుతో హరీశ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణి తెలిపారు. -
కస్టడీలో ఉన్న ధాన్యం లారీ వదిలేయాలి
కోటపల్లి: మండలంలోని రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు మీదుగా ధాన్యం తరలిస్తున్న ఆరు లారీలను అధికారులు పట్టుకున్నారు. కాని ఒక్కలారీని వదిలేయాలని ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం రాత్రి మహారాష్ట్ర నుంచి ధాన్యపు లారీలు మధ్యప్రదేశ్ వెళ్తుండగా చెక్పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేశారు. మహారాష్ట్ర రాజ్య ఆదివాసీ వికాస్ పేరిట టెండర్ వేసి ఆరు లారీలతో ధాన్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కటి మాత్రమే పోలీసు కస్టడీ అప్పగించి మిగిలినవి జాతీయ రహదారిపై నిలిపివేశారు. అయితే కస్టడీలో ఉన్న లారీని వదిలేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఒక్క ధాన్యం లారీని మహారాష్ట్ర(కే) పంపేలా గురువారం రాత్రి ఆదేశాలు జారీ అయింది. వాహనాలపై ఎలాంటి కేసులు లేకుండా పంపడం కొసమెరుపు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
నిర్మల్రూరల్: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. మండలంలోని మేడిపల్లి శివారులో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజాము ఈ ఘటన చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై లింబాద్రి కథనం ప్రకారం... ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం గుట్టపక్క తండాకు చెందిన పవర్ జవహర్ సింగ్ (41) డ్రైవర్ లారీలో జొన్నల లోడ్తో సిరికొండ నుంచి సిద్దిపేటకు బుధవారం అర్ధరాత్రి బయల్దేరాడు. తెల్లవారుజామున మేడిపల్లి శివారు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఒక్కసారిగా జవహర్సింగ్ నడుపుతున్న లారీకి మంటలు అంటుకున్నాయి. క్యాబిన్ పూర్తిగా కాలిపోయింది. అందులో చిక్కుకున్న జవహర్సింగ్ మంటల్లో కాలిపోయి మృతిచెందాడు. స్థానికులు గమనించి పోలీసు, ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పి క్యాబిన్లో జవహర్ సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదానికి కారణమైన లారీ పాక్షికంగా కాలిపోయింది. లారీని నిర్లక్ష్యంగా రోడ్డుపై నిలిపి ఎలాంటి పార్కింగ్ లైట్లు వేయకుండా ప్రమాదానికి కారణమైన డ్రైవర్ చెంచు కోటేశ్వర్రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లక్ష్యం దాటని తునికాకు
కోటపల్లి: చెన్నూర్ ఫారెస్టు డివిజన్ పరిధిలో ఈ ఏడాది తునికాకు సేకరణ లక్ష్యం దాటలేదు. అటవీశాఖ నిర్దేశించిన లక్ష్యానికి కన్నా తక్కువ 50 శాతం మాత్రమే సేకరించారు. చెన్నూర్ అటవీ డివిజన్ పరిధిలో తునికాకు యూనిట్లలో మే రెండోవారం నుంచి అధికారులు ఆకు సేకరణ ప్రారంభించారు. కొన్ని యూనిట్లలో మొదటి వారంలో ప్రారంభం కాగా, మరికొన్నింటిని మూడో వారంలో మొదలైంది. ఉపాధి పనులకు వెళ్లడం, ఎండ తీవ్రతతో ఆదివాసీలు, ఇతర కూలీలు సేకరణకు ఆసక్తిచూపలేదు. దీంతో ఆకు సేకరణ తగ్గినట్లు అటవీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే గతంలో ఆకు సేకరణ ప్రారంభించిన పదిరోజుల్లోనే తునికాకు కట్టలు కల్లాల వద్ద నిండిపోయేవి. లక్ష్యంలో 40 శాతం వరకు పూర్తయ్యేది. ఈసారి మే 31తో ఆకుసేకరణ ముగిసినప్పటికి..ప్రభుత్వం ఆశించిన మేర లక్ష్యాన్ని చేరుకోలేదు. 10,600 ఎస్బీల లక్ష్యం.. చెన్నూర్ ఫారెస్టు డివిజన్ పరిధిలో 10,600 స్టాండర్డ్ బ్యాగులు(ఎస్బీ) ఆకు సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. సీజన్ ముగిసే సమయానికి కోటపల్లి రేంజ్ పరిధిలోని పార్పల్లి యూనిట్ టార్గెట్ 3 వేల యూనిట్లు ఉండగా కేవలం 1,398 బ్యాగులు మాత్రమే సేకరించారు. చెన్నూర్ పరిధిలో 5129.68 బ్యాగులను సేకరించారు. చెన్నూర్లో రెండు కన్నెపల్లి, భీమారం, కోటపల్లిలో పార్పల్లి, నీల్వాయిలో మూడు బద్దంపల్లి, మైలారం, నీల్వాయి మొత్తం ఆరు యూనిట్లలో సేకరణ జరిగింది. సుమారు కేవలం 50 శాతం మాత్రమే. గతేడాది సుమారు నిర్దేశించిన 62 శాతం లక్ష్యానికి ఈసారి ఆకుసేకరణ జరగలేదు. గతం కన్నా తగ్గింది గతం కన్నా ఈసారి తక్కువగా తునికాకు సేకరణ జరిగింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మన వద్ద ఆకు నాణ్యతగా ఉంటుంది. ఆకులు సేకరించి వారి వివరాలు ఆన్లైన్ చేశాం. డబ్బులు త్వరలోనే వారి ఖాతాలో జమవుతుంది. – సదానందం, ఎఫ్ఆర్వో కోటపల్లి -
విచారణ పారదర్శకంగా నిర్వహించాలి
కాసిపేట: ఫిర్యాదులపై తక్షణమే స్పంది స్తూ విచారణ పారదర్శకంగా నిర్వహించాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. గురువారం మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలు పరిశీలించి రిసెప్షన్, పోలీసు సిబ్బంది పనితీరుపై సమీక్షించారు. రికా ర్డులు, కేసుల వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు నమ్మకం, భరోసా కల్పిస్తూ అండగా నిలువాలని తెలిపారు. ప్రతీ కానిస్టేబుల్ తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజల స మస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ ఎస్సై గంగారాం, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చెన్నూర్ నియోజకవర్గంలో..
చెన్నూర్/చెన్నూర్రూరల్/మందమర్రిరూరల్/కోటపల్లి: చెన్నూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల, ప్రాథమిక పాఠశాలలో మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా ఐదు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. రెండేళ్లయినా పనులు ముందుకు సాగలేదు. విద్యార్థుల్లో ఇరుకు గదుల్లో పాఠాలు వినాల్సిన దుస్థితి నెలకొంది. హరిజనవాడ ప్రాథమిక పాఠశాల ప్రహరీ కూలిపోయింది. మందమర్రి మండలం చిర్రకుంట గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.2లక్షలు కేటాయించి టెండర్ పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదు. కోటపల్లి: పార్పల్లి ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న కుళాయిలుచెన్నూర్: జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పూర్తి కాని తరగతి గదులు -
బెల్లంపల్లి నియోజకవర్గంలో..
తాండూర్: కాపువాడ ఎంపీపీఎస్లో అసంపూర్తిగా ఉన్న వంట గది వేమనపల్లి: అసంపూర్తిగా కల్మలపేట పాఠశాల మరుగుదొడ్లు, వంటశాలబెల్లంపల్లి/వేమనపల్లి/తాండూర్/నెన్నెల: బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్నగర్ జిల్లా పరిషత్ ఉర్ధూ మీడియం పాఠశాలలో వంటగది సరిగా లేదు. పైన రేకులు మాత్రమే అమర్చడంతో వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మరుగుదొడ్లకు తలుపులు లేవు. మరుగుదొడ్లు, మూత్రశాలల్లో పిచ్చిమొక్కలు పెరిగాయి. కన్నాలబస్తీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు అధ్వానంగా ఉన్నాయి. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలురకు మూత్రశాలలు నిర్మించాల్సి ఉంది. రాంనగర్బస్తీలో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. -
వడ్డీంచిన పచ్చధనం
రెబ్బెన: బొగ్గు ఉత్పత్తితో దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణలోనూ తన వంతు బాధ్యత నిర్వహిస్తోంది. ఓపెన్ కాస్టు ప్రాజెక్టుల ఏర్పాటుతో ధ్వంసమైన పచ్చదనాన్ని తిరిగి పెంపొందిస్తోంది. ఉత్పత్తి అనంతరం మూసివేసిన గనులపై విస్తృతంగా మొక్కలు పెంచుతూ పర్యావరణ పరిరక్షణ, భూ సంరక్షణ, పునరుద్ధరణకు పాటుపడుతోంది. ఈ క్రమంలో బొగ్గు గనుల నిర్వహణతోపాటు గనుల మూసివేత అనంతరం చేపట్టాల్సిన పర్యావరణ పరిరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించడంతో సింగరేణి సంస్థకు రూ.40 కోట్లు ఎస్క్రో డిపాజిట్ తిరిగి రానుంది. డోర్లి– 2 గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీతో కలిసి చెల్లించేందుకు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఆమోదం తెలిపింది. అడవిని తలపిస్తున్న ‘డోర్లి–2’ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని బెల్లంపల్లి ఏరియా డోర్లి– 2 ఓసీపీకి 2013– 14లో బొగ్గు తవ్వకాలకు అనుమతులు లభించాయి. ఆ సమయంలో గని నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, చర్యల కోసం అంచనా వ్యయం రూ.29.79 కోట్లను సింగరేణి యాజమాన్యం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ పేరుతో డిపాజిట్ చేసింది. ఏడేళ్లపాటు డోర్లి– 2లో బొగ్గు ఉత్పత్తిని చేపట్టి 2023–24లో మూసివేసింది. బొగ్గు ఉత్పత్తిని చేపట్టిన తర్వాత గనిని అలాగే వదిలేయకుండా కేంద్రం నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టింది. గని ప్రారంభ సమయంలో ఆ ప్రాంతంలో 162.517 హెక్టార్లలో అటవీప్రాంతం ఉండగా.. గని ఏర్పాటుతో కనుమరుగైంది. గని మూసివేసిన తర్వాత 162 హెక్టార్ల మేర మొక్కలు నాటి తిరిగి అడవిని మరిపించేలా పెంచింది. అలాగే 19.76 క్యూబిక్ మీటర్ల మేర భూమి పైపొర మట్టిని భద్రపర్చి దాన్ని డంపింగ్ యార్డులపై పర్చి మొక్కలు పెంచింది. గని మూసివేతకు సంబంధించి 2024 జూలైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ప్రత్యేక అడిట్ నిర్వహించింది. అన్ని నిబంధనలను సింగరేణి అమలు చేసినట్లు నివేదించింది. డిప్యూటీ అసిస్టెంట్ కోల్ కంట్రోలర్ ఆకాశ్ శివహరే సింగరేణి జమ చేసిన ఎస్క్రో డిపాజిట్కు వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తున్నట్లు సింగరేణి యాజమాన్యానికి లేఖ రాశారు. చెల్లించాల్సిన మొత్తంలో 90 శాతం రూ.36.63 కోట్లను ప్రస్తుతం విడుదల చేస్తున్నట్లు, మిగిలిన 10 శాతం జస్ట్ ట్రాన్సిషన్ ప్రొవిజన్ అంశాల పరిశీలన అనంతరం విడుదల చేయనున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యానికి వడ్డీతో కలిపి దాదాపు రూ.40 కోట్లు అందనున్నాయి. చేపట్టిన చర్యలివే.. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లి–2 ఓసీపీ ఏర్పాటులో డోర్లి, దంతన్పల్లితోపాటు మరికొన్ని గ్రామాలు ముంపునకు గురికాగా 162.517 హెక్టార్ల అటవీ భూమిని సేకరించి మైనింగ్ చేపట్టారు. గని తవ్వకానికి ముందు ఆ ప్రదేశంలో ఉన్న సారవంతమైన భూమి పైపొర మట్టిని సుమారు 19,76 క్యూబిక్ మీటర్ల మేర తవ్వి వేరే చోట భద్రపర్చారు. ఓవర్ బర్డెన్ డంపులపై తిరిగి పర్చి ఈ మట్టిని పర్చి మొక్కలు పెంచారు. యాజమాన్యం చేపట్టిన ఈ చర్యలతో డోర్లి ఓబీ డంపుల మీద దట్టమైన అడవిగా ప్లాంటేషన్ ఏర్పడింది. అలాగే సీహెచ్పీ, కోల్ బంకర్ల వద్ద మిస్ట్ స్పేయర్లను ఏర్పాటు చేసింది. హాల్ రోడ్లకిరువైపులా పెద్దఎత్తున మొక్కలను నాటి గ్రీన్ బెల్ట్లు ఏర్పాటు చేశారు. జల కాలుష్యం జరగకుండా ఓసీపీ చుట్టూ పది కిలోమీటర్ల మేర గార్ల్యాండ్ డ్రెయినేజీ ఏర్పాటు చేయడంతో పాటు రెండు చెక్డ్యాంలను నిర్మించారు. వాతావరణ కాలుష్యం జరగకుండా డ్రిల్ మిషన్ల వద్ద డస్ట్ కలెక్టర్లను ఏర్పాటు చేసింది. వెట్ డ్రిల్లింగ్ నిర్వహించి వాటర్ స్ప్రింక్లర్లను వినియోగించారు. కోల్ బంకర్లు, సీహెచ్పీల వద్ద మిస్ట్ స్పేయర్లను ఏర్పాటు చేశారు. మూసివేసిన గని పరిసరాల్లోకి మనుషులు, పశువులు ప్రవేశించకుండా చుట్టూ రక్షణ కంచెను ఏర్పాటు చేసి, సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. మైన్క్లోజర్ ప్లాన్, భూ సంరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేశారు. -
పనుల్లో వెనుకబడి
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మన ఊరు–మన బడి పనులు అసంపూర్తిగా నిలిచిపోగా.. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు కొనసాగుతూ ఉన్నాయి. 2022–23లో చేపట్టిన మన ఊరు–మన బడి పనులపై ఊసే లేకపోగా.. బిల్లులు రాక కాంట్రాక్టర్ల అనాసక్తితో పనులు నిలిచిపోయాయి. 245 బడుల్లో పనులకు కలెక్టర్ ఆమోదం లభించగా.. మొదట్లో పనులు చక చక సాగినా ఆ తర్వాత 123 పాఠశాలల్లో పనులు ముందుకు సాగడం లేదు. పది శాతం మేర పనులు పూర్తి చేస్తే వినియోగంలోకి వచ్చే అవకాశాలున్నాయి. రూ.24 కోట్ల 26లక్షల 33వేలు విలువైన పనులు చేసినట్లు మెజర్మెంటు బుక్(ఎంబీ) న మోదు చేయగా.. రూ.18కోట్ల 53లక్షల 96వేలు చెల్లించినట్లు తెలుస్తోంది. పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలల్లో రూ.21కోట్ల 58లక్షల 70వేలతో పనులు పనులు చేపట్టారు. 545 పాఠశాలల్లో 476 పనులు పూర్తి చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యు త్ సౌకర్యం, చిన్న మరమ్మతులు సాగుతున్నాయి. 69 పాఠశాలల్లో పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. దాదాపు 210 పాఠశాలల్లో ప్రహరీ, 280కు పైగా వంట గదుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. గదుల కొరత మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న స్టేషన్రోడ్ పాఠశాలలో గదుల కొరత ఉంది. మూడు గదులు ఉండగా.. నలుగురు ఉపాధ్యాయులు ఐదు తరగతులకు బోధిస్తున్నారు. ఇటీవల ప్రీప్రైమరీ పాఠశాల మంజూరు కాగా ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గదిలో విద్యార్థులు ఇరుకుగా కూర్చుని చదువుకుంటుండగా.. ప్రీ ప్రైమరీ విద్యార్థులను ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియని పరిస్థితి. సైన్స్ సెంటర్పై ఖాళీగా ఉన్న యువజన క్రీడాధికారి, వయోజన విద్య కార్యాలయాల గదులను కేటాయిస్తే విద్యార్థులకు ప్రయోజనకరంగా మారుతుంది. మండల విద్యావనరుల కేంద్రం భవనంలో స్పోర్ట్స్ పేరిట గదిని ఖాళీగా ఉంచారు. నూతనంగా నిర్మిస్తున్న భవనం త్వరగా పూర్తి చేస్తే భవిత కేంద్రం గది కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. భవిత సెంటర్ పూర్తి చేస్తే అక్కడ ఓ గదిలో ప్రీప్రైమరీ, జిల్లా సైన్స్ సెంటర్పై రెండు గదులు అప్పగిస్తే విద్యార్థులకు సౌకర్యంగా మారనుంది. నస్పూర్/లక్సెట్టిపేట: నస్పూర్లోని సంఘం మల్ల య్యపల్లి ఎంపీపీఎస్లో వంటగది అసంపూర్తిగా ఉంది. మోటార్ బిగించకపోవడంతో బోర్వెల్ నిరుపయోగంగా మారింది. కేజీబీవీ లో డైనింగ్ హాల్, అదనపు తరగతి గదుల ని ర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆవరణ లో పిచ్చిమొక్కలు పెరిగి ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. మంచిర్యాలలోని హమాలీవాడలో నిలిచిన అదనపు తరగతి గదుల నిర్మాణం -
సర్కారు బడికి పోదాం పదా..
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల బలోపే తం, విద్యార్థుల నమోదు పెంపు, విద్యావిశిష్టతను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో రచించిన పాత మంచిర్యాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆడిచర్ల సాగర్ సర్కారు బడికి పోదాం పదా పాట యూట్యూబ్లో అలరిస్తోంది. కృతిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను వినియోగించి రూపొందించిన బడి పాట వీడియో ఆలోచింపజేస్తోంది. గురువారం ఫోరం ఫర్ సోషల్ కన్సర్న్ రాష్ట్ర చైర్మన్ పర్వతి సత్యనారాయణ ఆన్లైన్ ద్వారా అవిష్కరించారు. సర్కారు బడికి పోదాం పదా..పిల్లలకు అమ్మ బడి కదా..స్వేచ్ఛా స్వాతంత్య్రాల లోగిలి.. వారి మనుసుకు అది జాబిలి అంటూ వీడియో చిత్రీకరణ చూపరులను కట్టిపడేస్తోంది. తల్లిదండ్రుల తర్వాత జ్ఞానపు జ్యోతులు వెలిగించే ఉపాధ్యాయుల పిల్లల జీవితాల్లో కీలకపాత్ర వారిదే అంటూ సాగిన పాట ఆలోచింపజేస్తోంది. -
వెదురు కళాకృతులు అద్భుతం
జన్నారం: వెదురుతో గిరిజన మహిళలు తయా రు చేసిన కళాకృతులు అద్భుతంగా ఉన్నాయని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం జన్నారం అటవీ డివిజన్ ఇందన్పల్లిలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యాలయ ఆవరణలో జిల్లా అటవీ అధికారి రాహుల్కిషన్ జాదవ్తో కలిసి మొక్కలు నాటారు. గిరిజన మహిళలు తయారు చేసిన వెదురు ఉత్పత్తులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కవ్వాల్ వెదురు ఉత్పత్తుల శిక్షణ కేంద్రంలో నిరుద్యోగులు జీవనోపాధి పొందాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుకపై ఆంక్షలు లేకుండా చూడాలని అధికారులకు సూచించా రు. ఈ సమావేశంలో ఎఫ్డీవో రామ్మోహన్, రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ, మార్కెట్ కమి టీ చైర్మన్ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందునాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇసాక్, కార్యదర్శి ముజాఫర్ అలీఖాన్ పాల్గొన్నారు. -
‘మోదీ పాలనలో అభివృద్ధి’
మంచిర్యాలటౌన్: ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు పరిపాలనలో దేశం ప్రపంచంలోనే అభివృద్ధి దిశగా పయనిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు పాలన సందర్భంగా బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం మోదీ చిత్రపటంతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, నాయకులు దుర్గం అశోక్, రంగ శ్రీశైలం, అమిరిశెట్టి రాజ్కుమార్, సత్రం రమేశ్, కుర్రె చక్రవర్తి, వంగపల్లి వెంకటేశ్వర్రావు, ఎనగందుల కృష్ణమూర్తి, గోలి రాము, మాధవరపు రమణరావు, కస్తూరి నాగరాజు, బొట్ల అనిత పాల్గొన్నారు. -
గంజాయి లభ్యం.. ఏడుగురు అరెస్ట్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండల కేంద్రంలో బుధవారం పోలీసులు గంజాయి కలిగి ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హాజీపూర్ ఎస్సై కిరణ్కుమార్ కథనం మేరకు.. మండల కేంద్రంలో నార్కోటిక్ టీం, డాగ్తో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొందరి వద్ద డాగ్ సింబ అనుమానాస్పదంగా వ్యవహరించింది. వెంటనే వారిని తనిఖీ చేయగా 74 గ్రాముల 19 గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ సెంటర్లో చోరీబాసర: మండలంలోని బిద్రెల్లిలో మంగళవారం దొంగలు హల్చల్ చేశారు. గురుకృప ఆన్లైన్ మల్టీసర్వీస్ సెంటర్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కౌంటర్ నుంచి రూ.4వేల నగదు ఎత్తుకెళ్లినట్లు సీఐ దీపక్ తెలిపారు. బుధవారం క్లూస్టీం వచ్చి ఆధారాలను సేకరించిందని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ వెల్లడించారు. విద్యుత్ షాక్తో కాడెద్దు మృతిపెంబి: మండలంలోని కోరకంటి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి సూర్యభాను అనే రైతుకు చెందిన కాడెద్దు బుధవారం మృతి చెందింది. విద్యుత్ స్తంభం వద్ద ఎర్త్ తీగను అధికారులు సరిగా అమర్చకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. -
ఉన్నత విద్యకు ‘లక్ష్మీ’ కటాక్షం
ఆదిలాబాద్: పేదరికం, ఆర్థిక సమస్యలతో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘పీఎం విద్యాలక్ష్మి’ పథకానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర విద్యా, ఆర్థిక, మానవ వనరుల శాఖలు, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్తో ఈ పథకానికి సంబంధించిన పోర్టల్ను ప్రత్యేకంగా రూపొందించాయి. ఈ పోర్టల్ ద్వారా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సుమారు 90 రకాల విద్యా రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి ఆస్తులు, పూచీకత్తు లేకుండానే బ్యాంకుల నుంచి రుణ సాయం పొందే వెసులుబాటు ఉంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకోవాలనే నిరుపేద, బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. రూ.10 లక్షల వరకు.. ఈ పథకం ద్వారా విద్యార్థులకు వారి కోర్సు ఫీజుకు అనుగుణంగా మూడు వేర్వేరు విభాగాల్లో రుణాలు మంజూరు చేస్తారు. రూ.4 లక్షల లోపు, రూ.4 లక్షల నుంచి రూ. 7.50 లక్షల వరకు, రూ. 7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అవసరమైన మొత్తాన్ని ఎంపిక చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ రుణాలు పొందేందుకు ఎలాంటి నిర్దిష్ట గడువు తేదీ లేదు. విద్యార్థులు ఏడాది పొడవునా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కుటుంబం నుంచి కేవలం ఒక్కరికి మాత్రమే ఈ పథకంలో అవకాశం కల్పిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.9 లక్షల కంటే తక్కువగా ఉండాలి. గరిష్టంగా రూ.7.5 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ పథకంలో రూ.10 లక్షల వరకు తీసుకునే రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. రుణాలకు కేంద్ర ప్రభుత్వమే పూచీకత్తుగా (గ్యారెంటీగా) వ్యవహరిస్తుండటంతో, బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఈ రుణం కేవలం ట్యూషన్ ఫీజుకే పరిమితం కాకుండా, హాస్టల్ ఖర్చులు, పరీక్షల ఫీజులు, ల్యాబ్ ఫీజులు, పుస్తకాలు, ఇతర విద్యాసామగ్రి కొనుగోలు వంటి అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. కరువైన ప్రచారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యాలక్ష్మి పథకంపై అవగాహన, ప్రచార కార్యక్రమాలు కరువయ్యాయి. క్షేత్రస్థాయిలో బ్యాంకులు, విద్యా శాఖ నిర్లక్ష్యం కారణంగా పథకంపై ఎవరికీ సరిగ్గా తెలియదు. అర్హులైన విద్యార్థులు సమాచారం అందక ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. పూచీకత్తు లేని రుణాలు, వడ్డీ రాయితీల గురించి తెలియక మధ్యతరగతి, పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అందించే విద్యాలక్ష్మి రుణాలకు దూరమవుతున్నారు. అధికారులు, బ్యాంకులు క్షేత్రస్థాయిలో ప్రచారం కల్పించకపోతే, మారుమూల ప్రాంతాల ప్రతిభావంతులు వెనకబడిపోయే ప్రమాదం ఉంది. దరఖాస్తు చేసుకోండిలా..విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ ( https:// pmvidyalaxmi. co. in/ Index. aspx) లో విద్యార్థి పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్, చిరునామా వివరాలతో నమోదు చేసుకోవాలి. అనంతరం ఈ పోర్టల్లో ఉన్న వివిధ బ్యాంకు రుణ పథకాలను పరిశీలించి తమకు నచ్చిన బ్యాంకును ఎంచుకోవాలి. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మార్కుల జాబితా, కోర్సు సంబంధిత పత్రాలు, అడ్మిషన్ లెటర్ జత చేయాలి. అనంతరం ఎంచుకున్న బ్యాంకులో అకౌంట్ తెరిచి ఆ వివరాలను నమోదు చేసి, రుణ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఇలా దరఖాస్తు చేసిన తర్వాత, దాని పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే పరిశీలించవచ్చు. పోర్టల్లో నమోదైతేనే.. ఇంజినీరింగ్, మెడిసిన్, లా, మేనేజ్మెంట్, టెక్నికల్, సైంటిఫిక్, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఆర్కిటెక్చర్, బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఎంఏ, పరిశోధన కోర్సులతో పాటు, సీఏ, సీఎస్ వంటి డిగ్రీలను పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. దేశంలోని 1000కి పైగా ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశం పొందిన వారికి ఈ పథకం వర్తిస్తోంది. అయితే ఈ ఉన్నత విద్యా సంస్థలు విద్యాలక్ష్మి పోర్టల్లో నమోదై ఉండాలి. -
రొట్టెలు చేస్తూ.. ఆటలు ఆడుతూ..!
పిల్లలకు క్యారంలో మెలకువలు నేర్పిస్తున్న తాతయ్యకాస్తంత సమయం దొరికితే చాలు.. చిన్నారులు సెల్ఫోన్లకు అతుక్కుపోతున్నారు. లేదంటే టీవీ చూస్తూ గడిపేస్తున్నారు. కుంటాలలో మాత్రం చిన్నారులు భిన్నంగా ఆలోచించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతినిత్యం ఆటపాటలతో ఉత్సాహంగా గడుపుతున్నారు. అమ్మమ్మల దగ్గర రొట్టెలు చేయడంతో పాటు వివిధ రకాల వంటకాల్లో ప్రావీణ్యం పొందుతున్నారు. తాతయ్యలతో క్యారం, చెస్లు ఆడుతూ అందులో మెలకువలు నేర్చుకుంటున్నారు. – కుంటాల -
శాంతిఖని గనిని సందర్శించిన ఆస్ట్రేలియా బృందం
బెల్లంపల్లి: మందమర్రి ఏరియా శాంతిఖని భూగర్భ గనిని బుధవారం ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం సందర్శించింది. మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ పర్యవేక్షణలో నలు గురు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం గనిలో దిగి బొగ్గు వెలికితీత చర్యలపై ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. బొగ్గు ఉత్పత్తి సాధన కోసం గతంలో జాయ్ కంపెనీతో ఒప్పందం చేసుకోగా కొంతకాలం పాటు ఆ ప్రక్రియ నిర్వహించారు. ఒప్పంద కాలపరిమితి ముగియడంతో తిరిగి ఆస్ట్రేలియాకు చెందిన తాలిస్మాన్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడానికి సింగరేణి యాజమాన్యం యత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా భూగర్భంలో దిగిన ఆస్ట్రేలియా బృందం పనిస్థలాలను ప్రత్యక్షంగా పరిశీలించింది. బొగ్గు నిక్షేపాల ఉనికి, వెలికితీత చర్యలపై ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. గనిలో ఇంకా అపారమైన బొగ్గు సంపద ఉందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వెలికితీయడం సులువేనని ఆస్ట్రేలియా కంపెనీ ప్రతినిఽధి వర్గం నిర్ధారించింది. మరో రెండు నెలల వ్యవధిలో మరోమారు సందర్శించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియా కంపెనీ ప్రతినిధులు ఇచ్చే నివేదికపై ఆధారపడి గనిలో బొగ్గు వెలికితీత జరగనుంది. తుది నిర్ణయం సింగరేణి యాజమాన్యం తీసుకోనుంది. గనిని సందర్శించిన వారిలో ఆస్ట్రేలియా కంపెనీ ప్రతినిధులు గ్రాంట్ ఫోల్డ్, జెరాల్డ్ మిల్లర్, నందన్, సిన్హా, గని ఏజెంట్ ఖధీర్, సంతోష్కుమార్, గని మేనేజర్ సంజయ్కుమార్ సిన్హా, ఇంజనీర్ బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడే విత్తనం వేయొద్దు
మంచిర్యాలఅగ్రికల్చర్: ‘తొలకరి వర్షాలకు పత్తి విత్తనాలు వేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. రెండు మూడు భారీ వర్షాలు కురిసి నేలలో 70నుంచి 80శాతం తేమ ఉన్నప్పుడే విత్తనం వేసుకోవాలి. డీలర్లు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. వర్షాభావ పరిస్థితులపై వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో రైతులు అధిక సాంద్రత(డబ్బా ఆకారం) పద్ధతిలో పత్తి సాగు, స్వల్పకాలిక వరి సాగు చేస్తే మేలు జరుగుతుంది..’ అని జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ సూచించారు. వానాకాలం సాగు సన్నద్ధతపై బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు అడిగిన సందేహాలు, సాగు సమస్యలపై జిల్లా వ్యవసాయ అధికారి(డీఏవో) సురేఖ, సహాయ వ్యవసాయ అధికారి గోపి నివృత్తి చేవారు. యూరియా బస్తా రూ.350 నుంచి రూ.360 వరకు అమ్ముతున్నారు. ఇతర ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యులు తీసుకోవాలి. – సింగతి రవి, గ్రామం: బట్వాన్పల్లి, మం: బెల్లంపల్లి, మనికంఠ, గ్రామం: రెబ్బెన, రవీందర్, ప్రశాంత్, మం: కన్నెపల్లి, రాములు, గ్రామం: భీమినిడీఈవో: ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే మండల ఏవో దృష్టికి తీసుకు రావాలి. భీమిని మండలంలో అధిక ధరకు ఎరువులు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి రావడంతో అతడిపై చర్యలు తీసుకున్నాం. యూరియా బస్తా రూ.266.50కు మాత్రమే విక్రయించాలి. పంట సాగుకు అనుగుణంగా యూరియా బుకింగ్ చేసుకుని విక్రయించాలి. నెల రెండు నెలలకు సరిపడా ముందస్తు కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం, ఒకరిని చూసి ఒకరు పో టీపడి కొనుగోలు చేయొద్దు. సాగు అవసరానికి అ నుగుణంగా ఎరువులు అందుబాటులో ఉంచాం. వర్షాలు తక్కువగా ఉంటాయి అంటున్నారు. వరి సాగు చేయొచ్చా. తక్కువ వర్షాపాతం ఉంటే ఎలాంటి పంటలు వేసుకోవాలి. ఏ రకం వరి సాగు చేయాలి.. ఏ రకం వరికి ప్రభుత్వం బోనస్ ఇస్తుంది. – రమేష్, జన్నారం, శంకర్, నెన్నెల, బి.శ్రీనివాస్, కుందారం, ప్రసాద్, జైపూర్, చంద్రశేఖర్, గ్రామం: ముత్తపూర్, మం: కన్నెపెల్లి, బొలిశెట్టి లక్ష్మినారాయణ, దండేపల్లి, సీహెచ్.రవి, గ్రామం: ఆస్నాద, మం: చెన్నూర్, శేఖర్, వేమనపల్లి డీఈవో: అధిక సాంద్రత పద్ధతి(డబ్బా ఆకారం)లో గుర్తింపు పొందిన పత్తి విత్తనాలు వేసుకోవాలి. ఎకరానికి నాలుగు నుంచి ఐదు ప్యాకేట్లు అవసరం అవుతాయి. 20వేల నుంచి 30వేల మొక్కలు వస్తాయి. చమత్కార్ రసాయన మందు ఎకరానికి 1ఎంఎల్ 1లీటర్ నీటి చొప్పున విత్తనం వేసిన 45, 65 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. చెట్టు ఎత్తు తక్కువలో మంచి కాయలు కాస్తాయి. 12నుంచి 14క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జూలై మొదటి వారంలో విత్తుకుంటే డిసెంబర్లో పంట ఒకేసారి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. జనవరిలో ఇతర పంటలు సైతం వేసుకోవచ్చు. రేగడి నేలలో పత్తి విత్తనాలు వేసుకోవచ్చా..? ఎలాంటి విత్తనం వేసుకోవాలి. పత్తిలో చీడపీడల వ్యాప్తి పెరుగుతుంది. నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. – మహేష్, కవ్వాల్, జన్నారం, జే.నారాయణ, నెన్నెల, సంతోష్, మందమర్రి డీఈవో: నల్లరేగడి నేలలో పత్తి సాగు చేసుకోవచ్చు. ప్రభుత్వ గుర్తింపు పొందిన నాణ్యమైన విత్తనం డీలర్ల వద్ద కొనుగోలు చేసుకోవాలి. రెండు మూడు వర్షాలు కురిసిన తర్వాతనే విత్తనం వేసుకోవాలి. పత్తి మధ్యలో ఆరు నుంచి పది వరుసల మధ్యలో కంది విత్తన సాలు కూడా వేసుకుంటే మంచిది. ఎలాంటి సేంద్రియ ఎరువులు వేసుకోవచ్చు. ఏవి అందుబాటులో ఉన్నాయి. – బొమ్మెన మహేష్, దండేపల్లి డీఈవో: సేంద్రియ ఎరువులు జీలుగ, జనుము, పిల్లిపెసర ప్రభుత్వం రాయితీపై అందిస్తుంది. ఇవి అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో లభించే పచ్చిరొట్టె, పెసర, జొన్న, గోధుమ వంటి పంటలు కలిపి సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పత్తి విత్తనాలు వేసుకోవచ్చా.. ఎలాంటివి, ఎప్పటివరకు వేసుకోవాలి. – బనావత్ శివలాల్, గ్రామం: లింగపూర్, మం: దండేపల్లి, తాడ మహేష్, చెన్నూర్, తిరుపతి, నెన్నెల డీఈవో: ప్రస్తుతం విత్తనాలు వేసుకునేందుకు అనువైన సమయం కాదు. చిన్నపాటి వర్షాలే కురిసాయి. ఒకట్రెండు భారీ వర్షాలు కురవాలి. జూలై 15 వరకు పత్తి విత్తుకునేందుకు గడువు ఉంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన నాణ్యమైన కంపెనీల విత్తనాలు కొనుగోలు చేసి రశీదు పొందాలి. దిగుబడి వచ్చే వరకు భద్రపర్చుకోవాలి. కలుపు నియంత్రణ, తక్కువ ధరకు లభించే గుర్తింపు లేని విత్తనాలు వేసుకుని నష్టపోవద్దు.డీలర్లు యూరియా, డీఏపీ ఎరువులు కావాలంటే ఇతర ఎరువులు, రసాయన మందులు అంటగడుతున్నారు. ఇవి కొనుగోలు చేస్తేనే అవి ఇస్తాం అంటున్నారు. బెల్లంపల్లిలో ఎరువుల దుకాణం నిర్వాహకులు స్టాక్ వివరాలు, ధరలు పట్టిక ఏర్పాటు చేయడం లేదు. – ప్రశాంత్, పెర్కపల్లి, బెల్లంపల్లి, మోహన్, భీమిని డీఈవో: రైతులకు కావాల్సిన ఎరువులు మాత్రమే అందించాలి. యూరియాతోపాటు నానో యూరియా కూడా వినియోగించుకోవాలి. పత్తి పంట ఎకరానికి రెండు బస్తాల యూరియాతోపాటు ఒక లీటర్ నానో యూరియా కూడా వినియోగించాలి. అవసరం లేని ఎరువులు, రసాయన మందులు తీసుకోబోమని తేల్చి చెప్పండి. స్టాకు వివరాలు, ధరలు పట్టిక ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడైన వివరాలు లేకుంటే ఏవోకు ఫిర్యాదు చేయవచ్చు. -
కాపర్వైర్ దొంగలు అరెస్ట్
బెల్లంపల్లి: మందమర్రి ఏరియా శాంతిఖని గని నుంచి అక్రమంగా కాపర్వైర్ దొంగిలించిన ఏడుగురిని పోలీసులు పట్టుకున్నారు. బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్ హనోక్ తెలిపిన వివరాల ప్రకారం.. శాంతిఖని గనిలో కొద్ది రోజుల క్రితం కాపర్ వైర్ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కాపర్ వైర్ పట్టుకెళ్లారని గని అఽధికారి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం టూటౌన్ ఎస్సై సీ.హెచ్ కిరణ్కుమార్ శాంతిఖని ప్రాంతంలో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకోగా వారి వద్ద 10 కిలోల కాపర్ వైర్ లభ్యమైందని సీఐ తెలిపారు. ఆ వైర్ను శాంతిఖని గనిలో దొంగతనం చేసినట్లు మందమర్రి విద్యానగర్కు చెందిన ఉల్లిగడ్డల వ్యాపారులు పాస్తం గోపాల్, కళమంచి అశోక్, కళమంచి కల్యాణ్, పాస్తం వీరస్వామి, పార్థన్ గణేశ్, రాజసమ్మయ్య, పాస్తం సారయ్య అంగీకరించారు. చోరీ చేసిన వైరును చెట్ల పొదల్లో దాచిపెట్టి తీసుకెళ్లడానికి వచ్చి పోలీసులకు పట్టుబడ్డారు. సదరు వ్యక్తులు రామకృష్ణాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు నేరాలలో నిందితులుగా ఉన్నట్లు సీఐ వెల్లడించారు. ఈమేరకు నిందితులను కోర్టులో హాజరు పర్చినట్లు పేర్కొన్నారు. టూటౌన్ ఎస్సై సీ.హెచ్ కిరణ్కుమార్, సీసీఎస్ ఎస్సై శిరీష, సిబ్బంది పాల్గొన్నారు. -
వరి ధాన్యం లారీల పట్టివేత
కోటపల్లి: మండలంలోని రాపన్పల్లి ప్రాణహిత నదిపై ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వస్తున్న ఆరు వరి ధాన్యం లారీలను వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి టెండర్ వేసి తీసుకొస్తున్నట్లు బిల్లుల ద్వారా గుర్తించినట్లు సమచారం. లారీలన్నీ మహారాష్ట్రలోని కరుసవెల్లికి చెందిన ఓ వ్యక్తికి చెందినవి కావడంతో సదరు వ్యక్తి తెలంగాణలో రాజకీయ నాయకులు, అధికారులతో తనకున్న పలుకుబడి ఉపయోగించి ‘మామూలు’గా వదిలి వేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. పట్టుకున్న ఆరు లారీల్లో ఒకదాన్ని మాత్రమే కోటపల్లి పోలీసుస్టేషన్కు తరలించగా.. మిగతా వాటిని చెన్నూర్ మండలం చింతపల్లి వద్దనే ఉంచి మరో రెండింటిని లక్ష్మిపూర్ పెట్రోల్బంక్లో ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఇటీవల మండలంలోని లక్ష్మిపూర్ గ్రామ సమీపంలో ధాన్యం లారీ పట్టుబడగా అధికారులు ‘మామూలు’గానే వదిలి వేసినట్లు తెలిసింది. పెద్దపల్లి జిల్లాలో లారీలు పట్టుబడగా విచారణలో రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు మీదుగా వెళ్లినట్లు గుర్తించిన అధికారులు రహస్యంగా విచారణ జరిపి చేతులు దులిపేసుకున్నారు. ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, లారీల పట్టివేతపై తహసీల్దార్ రాఘవేంద్రరావును సంప్రదించగా.. సమావేశంలో ఉన్నానంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. సీఐ కృష్ణను సంప్రదించగా.. లారీలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. -
దరఖాస్తుల వెల్లువ
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు అభ్యర్థుల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఖాళీలు తక్కువగా ఉన్నా దరఖాస్తులు వెల్లువెత్తడంతో ఉపాధి అవకాశాలపై ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా 72 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అమలు చేస్తోంది. బోధనకు ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ నెల 8వరకు ఆయా పాఠశాలల్లో దరఖాస్తులు స్వీకరించారు. 72 చొప్పున ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులు ఉండగా.. ఇన్స్ట్రక్టర్ పోస్టులకు 1893 మంది, ఆయా పోస్టులకు 378మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇన్స్ట్రక్టర్కు నెలకు రూ.8వేలు, ఆయాలకు నెలకు రూ.6వేలు గౌరవ వేతనం చెల్లిస్తారు. పూర్వ ప్రాథమిక విద్య కోసం.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2026–27 విద్య సంవత్సరానికి పూర్వ ప్రాథమిక విద్య కోసం 72 ప్రీ ప్రైమరీ సెక్షన్ల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మూడేళ్ల వయస్సు పిల్లలను చేర్చుకుంటారు. ప్రతీ పాఠశాలకు రూ.లక్ష నిధులు కేటాయించింది. చిన్నపాటి మరమ్మతులు, పర్నిచర్, ఇండోర్–అవుట్డోర్ ఆట సామగ్రి, బాల పెయింటింగ్స్ సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు వచ్చాయి. త్రిసభ్య కమిటీ ద్వారా ఎంపిక.. ప్రతీ పాఠశాల పరిధిలో స్థానికులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల అభ్యర్థుల ఎంపికకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఎంఈవో, ఎంపీడీవో, ఐసీడీఎస్ సూపర్వైజర్ లేదా సీడీపీవో సభ్యులుగా ఉంటారు. అభ్యర్థుల మార్కుల ఆధారంగా ఇన్స్ట్రక్టర్ల నియామకం జరగనుంది. డీఈడీ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. అర్హతలు, మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికతపై అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయా పోస్టులకు ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చిన ఏడో తరగతి మార్కుల పట్టికను క్షుణ్ణంగా పరిశీలించాలని అభ్యర్థులు కోరుతున్నారు. త్రిసభ్య కమిటీ దరఖాస్తుల వడపోత చేపట్టి ఒకటి రెండు రోజుల్లో జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి జాబితాను అందజేయనున్నారు. ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇన్స్ట్రక్టర్ పోస్టుకు మందమర్రి మండలంలో అత్యధికంగా 297 దరఖాస్తులు రాగా తర్వాత స్థానంలో బెల్లంపల్లి మండలంలో 258, నస్పూర్లో 213, మంచిర్యాలలో 176 దరఖాస్తులతో మూడంకెలు దాటాయి. ఆయా పోస్టుకు మందమర్రి మండలంలో 65, బెల్లంపల్లిలో 37, నెన్నెలలో 37, కోటపల్లిలో 35, నస్పూర్ మండలంలో 34 దరఖాస్తులు అందాయి. -
డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాలి
● బానిసైన వారు బాధితులు మాత్రమే ● మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్మంచిర్యాలక్రైం: యుద్ధ ప్రాతిపదికన డ్రగ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిషాముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ డ్రగ్స్ నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పోలీసు వ్యవస్థలో నార్కొటిక్ టీమ్ ఏర్పాటైనట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 30 మందికి డీ అడిక్షన్ సెంటర్లో వైద్యం అందించి డ్రగ్స్ నుంచి విముక్తి కల్పించామని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో వారిని బాగు చేసేందుకు అన్ని విధాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డ్రగ్స్కు బానిసైన వారిని నేరస్తులుగా పరిగణనలోకి తీసుకోబోమని, బాధితులుగా చూసి రక్షించడమే ప్రధాన కర్తవ్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. గంజాయి, మద్యం, ఇతర డ్రగ్స్కు బానిసైన వారి వివరాలు డయల్ 100 ద్వారా తెలియజేయాలని అన్నారు. అనంతరం డ్రగ్స్ వాల్పోస్టర్లను విడుదల చేశారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, ఆసుపత్రి ఆర్ఎంఓలు భీష్మ, శ్రీధర్, డీఅడిక్షన్ సెంటర్ వైద్యుడు రామునాయక్, రెడ్ క్రాస్సొసైటీ సభ్యులు మధుసూదన్రెడ్డి, సీఐ ప్రమోద్రావు, ఎస్సై మధుసూదన్ పాల్గొన్నారు. -
మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్య
దహెగాం: పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పెసరికుంట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై చుంచు రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెసరికుంట గ్రామానికి చెందిన రాంటెంకి జ్యోత్స్న (17) కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన తన అక్క సంగీత (పెద్దమ్మ కూతురు) భర్త కత్తెర్ల అరుణ్తో అప్పుడప్పుడు ఫోన్లో చాటింగ్ చేస్తూ మాట్లాడేది. అక్క– బావల ఇంటికి తరచూ వెళ్లి వచ్చేది. జ్యోత్న్స తనతో చాటింగ్ చేస్తుందనే విషయాన్ని అరుణ్ భార్య సంగీతకు తెలిపాడు. దీంతో సంగీత ఈనెల 4న తన తల్లి కమలతో కలిసి పెసరికుంట గ్రామానికి వచ్చి జ్యోత్స్నను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారు. ఈనెల 7వ తేదీన మరోసారి బాలికపై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక అదేరోజు సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. బాలిక తండ్రి రాంటెంకి లస్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
స్పందనకు అండగా నిలిచిన ‘ఆట’
శ్రీరాంపూర్: గత నెల 31న అమెరికాలో మెట్రోస్టేషన్ మెట్లపై నుంచి పడి అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నస్పూర్ యువతి లగిశెట్టి స్పందనకు అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆట) అండగా నిలిచింది. ‘అయ్యో బిడ్డా.. వచ్చేదెట్లా’ శీర్షికన ఈ నెల 4న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో పలువురు దాతలు, మానవతావాదులు వైద్యానికి విరాళాలు అందిస్తున్నారు. తల్లిదండ్రులు శ్రీనివాస్, సునిత ఆర్థిక పరిస్థితి అంతంగా మాత్రంగా ఉండడంతో ఆదుకోవడానికి పలువురు ముందుకు వస్తున్నారు. నస్పూర్ కార్పొరేటర్ రాచకొండ గోపాల్రావు, నాయకులు రాచకొండ వెంకటేశ్వర్రావు, రిటైర్డ్ ఆర్అండ్బీ ఎస్ఈ గందె వేణుమాధవ్రావు మంగళవారం రాత్రి అమెరికాలోని ఆట సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. తల్లిదండ్రుల పరిస్థితి వివరించి స్పందన చికిత్సకు ఆర్థికంగానే కాకుండా అక్కడ ఆసుపత్రి, పోలీస్స్టేషన్లో అన్ని రకాల సహకారం అందించాలని అమెరికా ఆట అధ్యక్షుడు చల్లా జయంత్, చికాగో పట్టణ ఆట సేవక్ కమిటీ ఇన్చార్జీ మహిపాల్ను కోరారు. దీంతో మహిపాల్ ఆసుపత్రి వద్దకు వెళ్లి స్పందనను పరామర్శించి, వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అక్రమంగా పట్టా చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలిజన్నారం: ఆదివాసీ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సర్వే నంబర్ 80లోని భూమిని కబ్జా చేసి అక్రమ పట్టా చేసుకున్న వారిపై చర్యలు తీసుకుని, భూమి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆదివాసీ గిరిజనులు నిరసన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైటాయించారు. పలువురు ఆదివాసీ సంఘ నాయకులు మాట్లాడుతూ జన్నారం గ్రామ పంచాయతీ గడ్డంగూదకు చెందిన సోయం పారుబాయికి చెందిన సర్వే నంబర్ 80లోని భూమిని జన్నారం మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపించారు. అక్రమంగా పట్టా చేసుకున్న భూమిని తిరిగి మహిళకు ఇవ్వకుంటే జిల్లా వ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి అక్కడికి చేరుకొని ఆదివాసీ సంఘ నాయకులతో మాట్లాడారు. అనంతరం వారు తహసీల్దార్ బక్కయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయంలో విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆదివాసీ సంఘ నాయకులు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్కుమార్, కొట్నాక మనోజ్, మర్సకోల మాణిక్రావు, దుందేరావు తదితరులు పాల్గొన్నారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడులుకోటపల్లి: మండలంలోని నక్కలపల్లి గ్రామానికి సమీపంలో పేకాట ఆడుతున్నారనే ముందస్తు సమాచారం మేరకు బుధవారం కోటపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.47,200 నగదుతో పాటు 7 మొబైల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. దాడుల్లో నీల్వాయి ఎస్సై జగదీశ్, స్పెషల్పార్టీ పోలీసులు పాల్గొన్నారు. -
కారు, లారీపై పడిన వృక్షం
ఉట్నూర్రూరల్: మండలంలోని హర్కాపూర్ సమీపంలో బుధవారం ఒక ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఒక భారీ వృక్షం ఒక్కసారిగా ప్రయాణిస్తున్న కారు, లారీపై పడింది. ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ –ఆదిలాబాద్ ప్రధాన రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తులు మంటలు పెట్టారు. దీంతో ఆ చెట్టు లోపల పూర్తిగా కాలిపోయి, బలహీనపడి ఒక్కసారిగా రోడ్డుపై కూలిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక లారీ, కారుపై ఆ భారీ వృక్షం పడింది. అడ్డుగా లారీ ఉండడంతో కారులో ఉన్న వారికి పెద్ద ప్రమాదం తప్పింది. బాధ్యతారాహిత్యంగా చెట్లకు మంటలు పెట్టడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అగ్ని ప్రమాదంలో గడ్డివాము దగ్ధం
దస్తురాబాద్: అగ్ని ప్రమాదంలో గడ్డివాము దగ్ధమైన ఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుట్టాపూర్ గ్రామ పంచాయతీలోని చెన్నూర్ గ్రామానికి చెందిన దాసరి సుధాకర్ పశువుల మేత కోసం ఇంటి పరిసర ప్రాంతంలో గడ్డి నిల్వ చేశారు. ప్రమాదవశాత్తు గడ్డికట్టలకు నిప్పు అంటుకోగా స్థానికులు గమనించి మంటలు అర్పే ప్రయత్నం చేశారు. హుటాహుటిన జన్నారంలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా సకాలంలో ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 3వేల వరకు గడ్డి కట్టలు అగ్నికి అహుతయ్యాయని బాధిత రైతు వాపోయాడు. -
● శిథిలావస్థకు చేరిన ఇల్లు కూలి చిన్నారి మృతి
తాండూర్: ఇల్లు కూలి చిన్నారి మృతి చెందిన ఘటన తాండూర్ మండలం అచ్చలాపూర్ ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. తాండూర్ ఎస్సై ప్రసాద్రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఏముర్ల శేఖర్ –భాగ్యలకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె ఏముర్ల సునైత్రి (5) వేసవి సెలవులు కావడంతో రోజూ ఇంటి సమీపంలోని పిల్లలతో కలిసి ఆడుకుంటుంది. ఈ క్రమంలో బుధవారం తన ఇంటి సమీపంలోని ఏముర్ల పోచవ్వ అనే వృద్ధురాలికి చెందిన ఇంటిలో మరో బాలికతో కలిసి ఆటలాడుతుండగా ఒక్కసారిగా ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో సునైత్రి అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలిక ప్రాణాలతో బయటపడింది. చిన్నారి సునైత్రి తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘సర్’ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
తాండూర్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు సూచించారు. బుధవారం ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై సమీక్షించారు. ఈ నెల 25 నుంచి మూడో విడత ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ప్రతీ ఇంటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు పనుల పురోగతిని పరిశీలించాలని అన్నారు. భూ భారతి పోర్టల్లో పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి ఆమోదించాలని తెలిపారు. తహసీల్దార్ జ్యోత్స్న, డిప్యూటీ తహసీల్దార్ కల్పన, రెవె న్యూ ఇన్స్పెక్టర్లు పద్మజ, మురళీధర్ పాల్గొన్నారు. -
పెరిగిన ధరలు నియంత్రించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ డిమాండ్ చేశారు. ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందని విమర్శించా రు. బీజేపీ పాలనలో సామాన్యుల బతుకు భారంగా మారిందని అన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, పూర్ణిమ, వీరభద్రయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు నగేష్, సుదర్శన్, శ్రీనివాస్, మల్లేష్, రవి, చంద్రకళ, రాజమొగిలి, కొండు బానేష్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అప్పులు తీర్చలేనన్న బెంగతో..
కుంటాల: అప్పులు తీర్చలేనన్న బెంగతో లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామానికి చెందిన కామొల్ల రాములు(42) ఉరేసుకొని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఎస్సై సిరివేని అశోక్ కథనం ప్రకారం.. రాములు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. అప్పుల బాధ భరించలేక మంగళవారం రాత్రి కల్లూరు గ్రామ శివారులోని వైన్స్ వెనుక చెట్టుకు తన ప్యాంటుతో ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కొన ఊపిరితో ఉన్న ఆయనను 108 వాహనంలో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రాములు భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. -
ఆటోలో పాము.. కిందకు దూకిన కూలీలు
కోటపల్లి: ప్రయాణిస్తున్న ఆటోలో పాము కన్పించడంతో ఉపాధిహా మీ కూలీలు కిందికి దూకి గాయాలపాలైన ఘటన మండలంలోని ఎదులబంధం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఉపాధిహామీ పనుల కోసం గ్రామ శివారుకు కూలీలు ఆటోలో వెళ్లారు. పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా ఆటోలో ఒక్కసారిగా పాము కన్పించింది. దీంతో భయాందోళన చెందిన రెవెల్లి శ్రీనివాస్, కొనగిరి తిరుపతి, మల్ల న్నలు కిందకు దూకారు. దీంతో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకున్న సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కూలీలు క్షేమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
అర్హులైన కుటుంబాలకు సంక్షేమ ఫలాలు
చెన్నూర్: అర్హులైన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. బుధవారం ఆయన చెన్నూర్లో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించి, పాత మార్కెట్ కార్యాలయంలో బస్తీ దవాఖానాను ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ బీపీ చెక్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి చెక్కులు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానాను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, వైద్యులు సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. జర్మన్ భాష నేర్చుకుని ఉద్యోగాలు పొందండి మందమర్రిరూరల్: నిరుద్యోగ యువత జర్మన్ భాష నేర్చుకుని ఆ దేశంలో ఉద్యోగావకాశాలు పొందాలని రాష్ట్ర మంత్రి వివేక్వెంకటస్వామి అన్నారు. మందమర్రి పట్టణంలోని ఇల్లందు క్లబ్ ఆవరణలో బుధవారం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపనీ లిమిటెడ్, ఉపాది, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జర్మన్ భాష శిక్షణ కేంద్రాన్ని కమిషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ కాంతి వెస్లీ, అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ రేఖారాణి, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ రమేష్బాబు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ నాగభారతి, ఏరియా జీఎం రాధాకృష్ణ తదితరులతో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ శిక్షణలో 112 మంది యువకులు ఉన్నారని, మూడు నెలలపాటు శిక్షణ కాలంలో కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా రూ.1000 స్టైఫండ్ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ రాము, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి రవికృష్ణ, తహసీల్దార్ సతీష్కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, డీజీఎం(పర్సనల్) అశోక్కుమార్ పాల్గొన్నారు. -
సందడే సందడి
ఉట్నూర్ పోలీస్స్టేషన్లో ప్రస్తుతం చిన్నారుల నవ్వులు, ఆటపాటలతో వారు చేసే సందడి కనిపిస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్లో చిన్నారులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. పార్కులోని జారుడు బల్లలు, ఊయలలు, సీసాలపై ఊగుతూ చిందులు వేస్తున్నారు. ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ నవ్వులు చిందిస్తూ ఆటపాటల్లో మునిగితేలుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా తమ పిల్లలను పార్క్కు తీసుకువస్తున్నారు. కాగా, చిన్నారులకు పోలీస్ సిబ్బంది స్టేషన్లో వారి విధుల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ చిల్డ్రన్స్ పార్క్ వేసవిలో పిల్లలకు మంచి వినోదాన్నిస్తోంది. తమ పిల్లలు ఎలాంటి భయం లేకుండా సురక్షితమైన వాతావరణంలో ఆడుకోవడం చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. – ఉట్నూర్రూరల్ -
వెల్కమ్ పోలీస్ బాస్
సాక్షి, ఆదిలాబాద్/ఆదిలాబాద్టౌన్: జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పోలీస్బాస్ మంగళవారం రాత్రి ఆదిలాబాద్కు వచ్చారు. డీజీపీ సీవీ ఆనంద్కు కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. వారి వెంట ఉమెన్ సేఫ్టీ, సీఐడీ డీజీ చారుసిన్హా ఉన్నారు. నేడు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. బెల్లంపల్లిలో ఏడాదిపాటు అదనపు ఎస్పీగా.. డీజీపీ సీవీ ఆనంద్ తన కెరీర్ ప్రారంభంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో ఆపరేషన్స్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అడిషన ల్ ఎస్పీ)గా ఏడాది పాటు పనిచేశారు. నక్సలైట్లపై కూంబింగ్ ఆపరేషన్లకు స్వయంగా నాయకత్వం వహించారు. డీజీపీగా మే 1న బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు. నేటి పర్యటన ఇలా.. డీజీపీ బుధవారం ఉదయం జిల్లా పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యూ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం కలెక్టరేట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చేరుకుంటారు. ప్రజాపాలనలో భాగంగా నిర్వహించే గ్రామసభలో పాల్గొంటారు. వీటితోపాటు పలు ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు. -
వెళ్లింది 12 మంది.. వచ్చింది ఇద్దరు
ఆదిలాబాద్టౌన్: మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది రిమ్స్ పరిస్థితి. ప్రతీసారి బదిలీల్లో రిమ్స్ ఆస్పత్రిపై నిర్లక్ష్యం జరుగుతోంది. అసలే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు అధిక పో స్టులు కేటాయించాల్సిన అధికారులు ఉన్న వారిని బదిలీ చేసి వారి స్థానంలో కొత్త వారిని కేటాయించకపోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో రోగుల వైద్య సేవలపై ప్రభావం చూపుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్లో ఇప్పుడిప్పుడే ఖాళీలు భర్తీ అవుతుండగా, ఈ బదిలీల్లో ఉన్న పోస్టులు ఖాళీ అయ్యాయి. 12మంది వైద్యులకు బదిలీలు జరగగా, నలుగురిని మాత్రమే కేటా యించారు. వీరిలో ఇద్దరు రిపోర్టు చేశారు. దీంతో పాటు 2021 బ్యాచ్కు చెందిన స్టాఫ్ నర్సులు దా దాపు అందరూ బదిలీ అయ్యారు. 60 మందికి స్థానచలనం జరగగా, మంగళవారం 10లోపు మా త్రమే రిపోర్టు చేశారు. బదిలీ అయిన వారి స్థానాల్లో పూర్తిస్థాయిలో చేరే అవకాశాలు కానరావడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపితే గా ని పరిస్థితి మారే అవకాశం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే రిమ్స్లో వైద్యు ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలుసార్లు నోటిఫికేషన్ జారీ చేసినా భర్తీకి నోచుకోవడం లేదు. ఉన్నవారిని బదిలీ చేయడంతో మరిన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయి. 12మంది వైద్యులకు బదిలీలు సాధారణ బదిలీల్లో భాగంగా రిమ్స్ ఆస్పత్రిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు. రిమ్స్లో పనిచేస్తున్న నలుగురు ప్రొఫెసర్లు తానాజీ జాడే, కరుణాకర్, రత్నకుమారి, సరోజ బదిలీ కాగా, రిమ్స్కు ప్యాథాలజీకి సంబంధించి నీలవేణికు ప్రొఫెసర్ పోస్టు కేటాయించారు. అయితే, ఈమె ఇంకా విధుల్లో చేరలేదు. అ సోసియేట్ ప్రొఫెసర్లను జనరల్ మెడిసిన్ సందీప్ పవార్, గైనిక్ విభాగానికి సంబంధించి పి.క్రాంతి, పీడియాట్రిక్ వైద్యులు హేమలత, కన్నయ్య, జనరల్ సర్జన్ జి.సృజన, ఆర్థోపెడిక్ అవినాష్రెడ్డితో పాటు మరో అసోసియేట్ ప్రొఫెసర్కు ట్రాన్స్ఫర్ అయింది. ఈ విభాగంలో బి.గవస్కర్ మాత్రమే నిజామాబాద్ నుంచి వచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో జనరల్ మెడిసిన్లో కమలాకర్ బదిలీ అయ్యారు. సైకియాట్రిక్ విభాగంలో నిజా మాబాద్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్ బదిలీపై వచ్చారు. మంచిర్యాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నీలవేణి విధుల్లో చేరాల్సి ఉంది. నలుగురు ప్రొఫెసర్ల బదిలీలు జరగగా, ఒకరు వస్తున్నారు. అసోసియేట్లో ఐదుగురికి బదిలీ కాగా, ఒకరిని కేటాయించారు. అసిస్టెంట్ ప్రొఫెర్లలో ముగ్గురికి బదిలీ కాగా, ఇద్దరిని కేటాయించారు. స్టాఫ్ నర్సుల పరిస్థితి కూడా.. 2021 బ్యాచ్కు సంబంధించిన స్టాఫ్ నర్సులకు బదిలీలు జరిగాయి. రిమ్స్ నుంచి అత్యధికంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు బదిలీ చేశారు. 60 మంది వరకు బదిలీలు జరగగా, జిల్లాలో పది మంది వరకు రిపోర్టు చేశారు. స్టాఫ్ నర్సుల పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ అవుతాయా.. లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు చికిత్స చేస్తే, స్టాఫ్ నర్సులు వారికి వైద్యసేవలు అందిస్తారు. ఈ పోస్టులు ఖాళీగా ఉంటే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం గగనమే. -
లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి కృషి
మంచిర్యాలక్రైం: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య అన్నారు. జిల్లా కోర్టు హాల్లో మంగళవారం జిల్లా పోలీస్, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్స్టేషన్ల వారీగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల్లోని కక్షిదారులతో మాట్లాడి రాజీ కుదిర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మోటర్ వెహికిల్ యాక్ట్, క్రిమినల్ కేసులు, సివిల్ తగదాలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఒక్కసారి లోక్ అదాలత్లో కేసు కొట్టి వేస్తే తిరిగి అప్పీలుకు అవకాశం ఉండదని, దీంతో ఇరువర్గాలు కేసు గెలిచినట్లేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి ఏ.నిర్మల, సీనియర్ సివిల్ జడ్జి రాంమోహన్రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జి కవిత, నిరోష, కృష్ణతేజ, డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, కిరణ్కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, న్యాయవాదులు పాల్గొన్నారు. -
● జూన్ నుంచి సెప్టెంబర్ దాక పొంచి ఉన్న ముప్పు ● ఉమ్మడి జిల్లాలో ఏటా పెరుగుతున్న మరణాలు ● అవగాహన, అప్రమత్తత లేక బాధితులకు తీరని నష్టం ● జాగ్రత్తలు, సూచనలు పాటిస్తేనే రక్షణ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/కౌటాల: తొలకరి వానలతో ఉమ్మడి జిల్లా ప్రజలకు పిడుగుల దడ మొదలైంది. ఉరుములు, మెరుపులు, శబ్దాలతో భయం వెంటాడుతోంది. ఏటా ఉమ్మడి జిల్లాలో వానాకాలం ఆరంభం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పిడుగుల వానలు కురుస్తున్నాయి. సీజన్ ముగిసే వరకు పదుల సంఖ్యలో పిడుగుపాటు మరణాలు సంభవిస్తున్నాయి. మూగజీవాలు, ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది. చనిపోతున్న వారిలో గిరిజనులు, పేద, మధ్య తరగతికి చెందిన వారే అధికంగా ఉంటున్నారు. ఒక్కోసారి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు ప్రమాదం బారిన పడుతున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ అధికారి ధ్రువీకరణతో జిల్లా కలెక్టర్ ద్వారా బాధిత కుటుంబాలు రూ.6లక్షలు పొందవచ్చు. రైతుబీమా ఉంటే మరో రూ.5లక్షల సాయం అందుతుంది. అయితే బాధిత కుటుంబాలకు పరిహారం అందడంలో జాప్యం జరుగుతోంది. వానాకాలంలో తీవ్రత ఎక్కువ ప్రధానంగా వానాకాలం సీజన్ ప్రారంభంలో పిడుగుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. సాధారణంగా మేఘాలు రెండు ఒకదానిని మరొకటి తాకినప్పుడు విద్యుత్ శక్తి వెలువడుతుంది. ఇది భూమి వైపు ప్రయాణించే సమయంలో లోహాలు, చెట్లు, ఎత్తయిన కట్టడాలు ఆకర్షిస్తాయి. తొలకరి వర్షాల సమయంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండే రైతులు, కూలీలు ఎక్కువగా పిడుగుపాటుకు గురవుతున్నారు. ప్రాణహానితోపాటు తీవ్ర గాయాలపాలవుతున్నారు. మూగజీవాలు సైతం ఊపిరి విడుస్తున్నాయి. మరికొన్ని సమయాల్లో సెల్టవర్లు, విద్యుత్ ఉపకరణాలు దెబ్బతింటున్నాయి. ‘దామిని’తో తప్పును ముప్పు ఐఎండీ(భారత వాతావరణ శాఖ) 88శాతం కచ్చితత్వంతో జిల్లాల వారీగా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. అధికశాతం నిరక్షరాస్యులే కావడంతో గుర్తించలేకపోతున్నారు. దామిని యాప్ సమాచారాన్ని లోకల్ వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులు, కూలీలకు చేరవేయాల్సి ఉంది. యాప్ వాడే వ్యక్తికి 20నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనూ అప్రమత్తం చేస్తుంది. స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘దామిని’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 7, 14, 21 నిమిషాల ముందు హెచ్చరికలు జారీ చేస్తుంది. రిజిష్టర్ చేసుకుంటే చదువురాని వారు సైతం సులువుగా అప్రమత్తం అయ్యేలా ఆలారం మోగుతుంది. తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ ముందు రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలోనూ అప్రమత్తం చేస్తుంది. ప్రజల మొబైళ్లకు సందేశాలు పంపుతుంది. జిల్లా వ్యవసాయ, ప్రణాళిక శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు, దినపత్రికల్లో వచ్చే వాతావరణ సూచనలు పాటిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. -
చెన్నూర్లో ప్రజామరుగుదొడ్లు కరువు
చెన్నూర్: చెన్నూర్ బల్దియాలో ప్రజామరుగుదొడ్లుకరువయ్యాయి. కోటపల్లి, వేమనపల్లితో పాటు చెన్నూర్ మండలాలకు చెన్నూర్ మున్సిపాలిటీ వ్యాపార కేంద్రంగా మారింది. దీంతో నిత్యం వేలాదిమంది ప్రజలు వివిధ అవసరాల కోసం ఇక్కడికి వస్తుంటారు. బల్దియా పరిధిలో 18 వార్డులుండగా సుమారు 30 వేలకు పైగా జనాభా ఉంది. గతంలో చెన్నూర్లో ఆర్టీసీ బస్టాండ్తో పాటు ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతాల్లో రెండు సులభ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయగా అందరూ వినియోగించుకున్నారు. నూతన ఆస్పత్రి భవన నిర్మాణంలో భాగంగా సులభ్ కాంప్లెక్స్ను తొలగించడంతో అందరికీ బస్టాండ్లోని సులభ్ కాంప్లెక్స్ మాత్రమే దిక్కయింది. దీంతో ప్రధానంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితులుంటే ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధాన వ్యాపార సంస్థలు, బ్యాంక్లు, ఆస్పత్రి గాంధీచౌక్ ఏరియాల్లోనే ఉండడంతో ఇక్కడికి జనం ఎక్కువగా వస్తుంటారు. అధికారులు స్పందించి గాంధీచౌక్, పాత బస్టాండ్ ఏరియాల్లో ప్రజామరుగుదొడ్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. సమస్య పరిష్కరిస్తాం మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన వ్యాపార కేంద్రాల ప్రాంతాల్లో ప్రజామరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలం లేదు. ప్రజల ఇబ్బందులను గుర్తించి పాత బస్టాండ్ ప్రాంతం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సమీపంలో ప్రజామరుగుదొడ్లు నిర్మించాలని ప్రతిపాదించాం. సమస్యను మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లి పాత బస్టాండ్ ప్రాంతంలో సులభ్ కాంప్లెక్ నిర్మించేందుకు కృషి చేస్తాం. – మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ -
కవ్వాల్ల్ శిక్షణ ఐఏఎస్ల పర్యటన
జన్నారం: కవ్వాల్ టైగర్జోన్ జన్నారం అటవీ డివిజన్లో 2025 బ్యాచ్కు చెందిన శిక్షణ ఐఏఎస్ అధికారులు మంగళవారం పర్యటించారు. తెలంగాణ దర్శన్లో భాగంగా ట్రెయినీ ఐఏఎస్ అధికారులు సచిన్ బసవరాజు, ఇ.సాయిశివాని, సురేష్ పామూరి, పి.హరిప్రసాద్ బృందం కవ్వాల్ టైగర్ రిజర్వ్లోని పలు ప్రాంతాలను సందర్శించారు. అటవీ శాఖ సఫారీ వాహనాల్లో గొండుగూడ బేస్క్యాంపు, బైసన్కుంట, నీలుగాయి కుంట, మల్యాల వాచ్ టవర్ ప్రాంతాలు పరిశీలించారు. వన్యప్రాణులు, మల్యాల వాచ్ టవర్ ఎక్కి అడవుల అందాలను వీక్షించారు. బైసన్కుంట ప్రాంతంలో బర్డ్ వాక్ చేశారు. రిజర్వ్ ఫారెస్ట్లోని వివిధ రకాల చెట్లు, వన్యప్రాణులు, పక్షుల వివరాలు, ఎకో టూరిజం కింద చేపడుతున్న అభివృద్ధి పనులపై ఎఫ్డీవో రామ్మోహన్ వివరించారు. దండేపల్లి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పి.రాము, ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు బి.భోజనాయక్, శ్రీకాంత్, అజీజ్ పాల్గొన్నారు. -
నిందితులకు శిక్ష పడేలా చర్యలు
మంచిర్యాలక్రైం: ప్రతీ కేసులో క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం ఈ–సాక్ష్య 2.0 అమలు చేయాలని, నిర్దేశిత గడువులోపు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్షణ పడేలా చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్కిషోర్ ఝా అన్నారు. మంగళవారం రామగుండం కమిషనరేట్లోని సమావేశ మందిరంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్, ఎన్బీడ బ్ల్యూ, మహిళలకు సంబంధించిన కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల్లో న్యాయసలహాలు తీసుకుని దర్యాప్తు వేగవంతం చేయాలని తెలిపారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో నిందితుల అరెస్టు ఆలస్యం చేయొద్దని అన్నారు. వర్షాకాలం దృష్ట్యా పోలీసు వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్, తాళ్లు, డ్రాగన్లైట్ అందుబాటులో ఉండాలని, ఆపదలో ఉన్న వారిని ఎలా రక్షించాలో డ్రిల్ ప్రాక్టీస్ చేయాలని సూచించారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి, అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, కిరణ్కుమార్, సీఐలు ఎస్సైలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం
నేరడిగొండ: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందగా ఆర్ఎంపీకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లఖంపూర్ గ్రామానికి చెందిన మాడవి షేక్రావ్ (45) ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం తన ఆటోలో ఇచ్చోడ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాడవి షేక్రావ్కు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుమారి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ దేవిదాస్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు దేవిదాస్ను చికిత్స కోసం ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. షేక్రావ్కు భార్య సంధ్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కు మరణించడంతో అతడి భార్య, పిల్లల రోదనలు స్థానికులను కలచివేశాయి. ఎస్సై ఇమ్రాన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వృత్తివిద్య కోర్సులతో ఉపాధి కల్పన
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్య, వృత్తి విద్య కోర్సులతో శిక్షణ అందించి ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మాధ్యమిక విద్యాశాఖ అధికారి అంజయ్యతో కలిసి జూనియర్, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, అడ్వాన్ టెక్నాలజీ సెంటర్ల ప్రిన్సిపాల్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని అన్నారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, విద్యార్థుల హాజరు శాతం పెంపొందించేలా కృషి చేయాలని తెలిపారు. ఏటీసీల ద్వారా ఉద్యోగం సాధించిన వారి వివరాలను ప్రచారం చేయడం ద్వారా అడ్మిషన్ల సంఖ్య పెంచాలని తెలిపారు. -
ఓసీ పేలుళ్లపై సోమగూడెం, చొప్పరిపల్లి వాసుల ఆందోళన
కాసిపేట: మందమర్రి ఏరియా కేకే ఓపెన్కాస్ట్ వద్ద మంగళవారం సోమగూడం, చొప్పరిపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అధిక పేలుళ్లతో ఇంట్లో ఉండలేకపోతున్నామని, ఇళ్లు పగుళ్లు తేలాయని, దుమ్ము, విషవాయువులతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పేలుళ్ల తీవ్రత అధికంగా ఉండటంతో తిప్పలు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అడ్డుకున్న క్రమంలో రెండు రోజులు తీవ్ర తగ్గించి తిరిగి యథావిధిగా పేలుళ్లు జరుపుతున్నట్లు ఆరోపించారు. రోజూ సాయంత్రం పేలుళ్ల దాటికి ఇళ్ల గోడలు, రేకులు పగిలి పోతున్నాయని, వర్షాకాలంలో ఇళ్లల్లో ఉండే పరిస్థితి లేదని మండిపడ్డారు. పేలుళ్ల తీవ్రతను తగ్గిస్తామని స్పష్టమైన హామీ ఇస్తూ విస్మరిస్తున్నారని, ఇలా జరిగితే ఆందోళనలు ఉధృతం చేసి ఓపెన్కాస్ట్ను పూర్తిగా అడ్డుకోనున్నట్లు హెచ్చరించారు. ఓసీలో పేలుళ్లను తగ్గిస్తామని, గ్రామంలో సర్వే చేయించి పగుళ్లు తేలిన గోడలకు మరమ్మతులు చేయిస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని సింగరేణి అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. స్థానిక నాయకులు రాంచందర్, గురుమూర్తి, తిరుపతి, లక్ష్మణ్, స్వరూప, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సాగు సన్నద్ధతపైనేడు ఫోన్ ఇన్
మంచిర్యాలఅగ్రికల్చర్: వానాకాలం సాగు సీజన్ ప్రారంభం నేపథ్యంలో వ్యవసాయ అధికారులతో ‘సాక్షి’ బుధవారం ఫోన్ ఇన్ నిర్వహించనుంది. రైతుల సమస్యలు, సాగు సందేహాలపై జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ సమాధానాలు ఇస్తారు. వాతావరణానికి అనుగుణంగా విత్తనాల ఎంపిక, సాగు ప్రణాళిక, ఎరువుల వినియోగం, పంట మార్పిడి తదితర సాగు సంబంధిత సందేహాలపై రైతులు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.సమయం: బుధవారం ఉదయం 11గంటల నుంచి 12.30గంటలకు వరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు : -
సాగుకు సిద్ధం
మంచిర్యాలఅగ్రిల్చర్: ఖరీఫ్ సాగు సీజన్ మొదలైంది. వ్యవసాయ శాఖ వానాకాలం పంటల సాగు ప్రణాళిక సిద్ధం చేసింది. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులపై అంచనాలు రూపొందించింది. గత ఏడాది ఖరీఫ్లో ఆలస్యంగా వర్షాలు కురువడంతో రైతులు ప్రారంభంలో ఇబ్బందులు పడ్డారు. ఆలస్యమైనా.. భారీ వర్షాలతో జలాశయాలు సాధారణ స్థాయికి చేరాయి. దీంతో ఆలస్యంగానైనా సాగు విస్తీర్ణం సాధారణ స్థాయికి చేరింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. రైతులు పంటల సాగుకు సన్నద్ధమవుతూ పొలాల్లో చెత్తాచెదారం, గడ్డి తొలగిస్తున్నారు. జిల్లాలో గత రెండ్రోజులుగా వాతావరణం చల్లబ డింది. సాయంత్రం వేళ ఆకాశం మేఘావృతం అవుతూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో రైతులు దుక్కులు దున్ని చేన్లు చదును చేసి విత్తనాలు వేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. పెరుగనున్న విస్తీర్ణం..! గత ఏడాది 3.32లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా.. ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేశారు. 3,57,253 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేస్తూ విత్తనాలు, ఎరువులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పత్తి 1.76లక్షల ఎకరాలు, వరి 1.57లక్షల ఎకరాలు, 1,547 ఎకరాల్లో కందులు, 1,150 ఎకరాల్లో పెసలు, 978 ఎకరాల్లో మొక్కజొన్న, 20,560 ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతాయని అంచనా వేశారు. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా రాయితీపై విత్తనాలు, ఎరువులు అవసరమవుతాయని ప్రణాళిక రూపొందించారు. విత్తనాలు.. జిల్లాలో అధికంగా సాగయ్యే పత్తి విత్తన ప్యాకేట్లు 3,53,577, వరి విత్తనాలు 28,354 క్వింటాళ్లు, కందులు 66.7 క్వింటాళ్లు, మొక్కజొన్న 7,952 క్వింటాళ్లు, ఇతర విత్తనాలు 21,698 క్వింటాళ్లు అవసరమని అంచనా వేశారు. ఈ విత్తనాలపై ప్రభుత్వ రాయితీ లేకపోవడంతో డీలర్ల వద్దనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జీలుగ 3,350 క్వింటాళ్లు, జనుము 840 క్వింటాళ్లు, పిల్లిపెసర 165 క్వింటాళ్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. సేంద్రియ ఎరువుగా వాడే జీలుగ, జనుము విత్తనాలు ప్రభుత్వం రాయితీపై అందిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు జిల్లాకు జీలుగ 2,997.1క్వింటాళ్లు, జనుము 580 క్వింటాళ్లు, పిల్లిపెసర 56 క్వింటాళ్ల విత్తనాలు చేరాయి. 548 క్వింటాళ్లు జీలుగ, 154 క్వింటాళ్ల జనుము, 9క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలు రైతులకు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది రుణ లక్ష్యం.. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.200 కోట్ల మేర రుణ లక్ష్యం పెరిగింది. గత ఏడాది రూ.1860.75 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా బ్యాంకర్లు ఖరీఫ్, రబీ కలిపి రూ.1630.27 కోట్లు మాత్రమే రైతులకు అందించారు. ఈ ఏడాది రూ.1962.50 కోట్లు ఇవ్వాలని రుణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా రుణ లక్ష్యం భారీగానే పెంచుతున్నా రైతులకు అందివ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఎదురవుతోంది. సమయానికి బ్యాంకర్లు రుణాలు, ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రూ.6వేల చొప్పున అందిస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.పెరుగనున్న విస్తీర్ణం..!ఎరువులు..గత ఏడాది 3.32లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా.. ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేశారు. 3,57,253 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేస్తూ విత్తనాలు, ఎరువులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పత్తి 1.76లక్షల ఎకరాలు, వరి 1.57లక్షల ఎకరాలు, 1,547 ఎకరాల్లో కందులు, 1,150 ఎకరాల్లో పెసలు, 978 ఎకరాల్లో మొక్కజొన్న, 20,560 ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతాయని అంచనా వేశారు. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా రాయితీపై విత్తనాలు, ఎరువులు అవసరమవుతాయని ప్రణాళిక రూపొందించారు. పంటల సాగు అవసరాల మేరకు ఈ ఏడాది 89,010 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని గుర్తించారు. యూరియా 28,620 మెట్రిక్ టన్నులు, డీఏపీ 13,305, ఎంవోపీ 8,352, ఎస్ఎస్పీ 3,308, ఎన్పీకే 35,425 మెట్రిక్ టన్నులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటివరకు 9,160.61మెట్రిక్ టన్నుల యూరియా, 1006.90 మెట్రిక్ టన్నుల డీఏపీ, 174.28 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 370.35 టన్నుల ఎస్ఎస్పీ, 9,458.96 టన్నులు ఎన్పీకే అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. -
రసీదు తీసుకోవాలి..
జిల్లా సాగు విస్తీర్ణానికి అనుగుణంగా విత్తన, ఎరువుల ప్ర ణాళిక సిద్ధం చేశాం. నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకి వర్షాలు పడేలోగా రైతులు పొలాలు సిద్ధం చేసుకోవాలి. వేసిన పంట వేయకుండా మార్పిడి చేస్తుండాలి. ప్రభుత్వ గుర్తింపు లేని, నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు. గుర్తింపు పొందిన డీలర్ నుంచి నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి వెంటనే రసీదు తీసుకోవాలి. పెద్ద మొత్తంలో సాగు చేసే రైతులు ఒకే రకమైన కంపెనీ విత్తనాలు కాకుండా రెండు మూడు రకాల కంపెనీల విత్తనాలు వేసుకోవాలి. దీని ద్వారా వర్షభావ పరిస్థితులను బట్టి దిగుబడులు ఉంటాయి. ఈయేడాది విత్తనాలు, ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. – సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి -
మృత్యువులోనూ వీడని అన్నబంధం!
మృతదేహాలను ఒడ్డుకు చేర్చుతున్న గంగ్రపుత్రులు, పోలీసులు మృతదేహాలను ఒడ్డుకు చేర్చుతున్న గంగపుత్రులు, పోలీసులు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని కాచిగూడ చెప్పల్ బజార్ ప్రాంతంలో నివాసముండే నీలి నాగభూషణ్కు ముగ్గురు కుమారులు చంద్రశేఖర్ (38), రాంచందర్ (36), మల్లేశ్కుమార్ (31) ఉన్నారు. వీరంతా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఫుట్పాత్పై చిరువ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నాగభూషణ్ భార్య చంద్రకళ రెండేళ్ల క్రితమే మృతి చెందగా ముగ్గురు కుమారులైన చంద్రశేఖర్ (38), రాంచందర్ (36), మల్లేశ్కుమార్ (31)తో ఉంటున్నాడు. రాంచందర్–అశ్విని దంపతులకు ఇద్దరు కుమారులు వసంత్, విజయ్ ఉన్నారు. వీరి అక్షరాభ్యాసం కోసం ఈ కుటుంబమంతా మంగళవారం బాసరకు వచ్చింది. ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయానికి వెళ్లి అక్షరాభ్యాసాలు చేయించాలని నిర్ణయించుకున్నారు. స్నానాల కోసం ఇంటెక్వెల్ వద్ద నదిలోకి దిగిన చంద్రశేఖర్, రాంచందర్, మల్లేశ్కుమార్ బురదనీటిలో కూరుకుపోయారు. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు ముగ్గురూ నీటిమునిగి మృత్యువాత పడ్డారు. తన కళ్లెదుటే ముగ్గురు కొడుకులు ప్రాణాలు కోల్పోవడం చూసి నాగభూషణ్ గుండెలు బాదుకున్నాడు. వీరి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రెండు గంటలు గాలింపు గోదావరి నదిలో స్నానాలకు దిగిన ప్రాంతంలో ఇంటెక్ వెల్ ఉంది. నది నీటిని తాగునీటి కోసం మళ్లించేందుకు ఇక్కడ ఫిల్టర్ బెడ్ నిర్మించారు. ఈ ప్రాంతంలో బురద కూడా ఎక్కువగానే ఉంది. ముందుగా స్నానానికి వెళ్లిన చంద్రశేఖర్ అందులో కూరుకుపోతుంటే తమ్ముడు మల్లేశ్కుమార్ కాపాడే ప్రయత్నం చేశాడు. ఇద్దరు మునిగిపోతుండగా రాంచందర్ వారిని కాపాడే ప్రయత్నం చేశాడు. క్షణాల్లోనే ముగ్గురు గల్లంతైపోయారు. కళ్లెదుటే జరిగిన ఈ ఘటనను చూసి కుటుంబీకులంతా తల్లడిల్లిపోయింది. తండ్రి నాగభూషణ్తోపాటు మిగతా కుటుంబీకులంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరి రోదన అక్కడివారిని కంటతడి పెట్టించింది. సీఐ దీపక్ ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు స్థానిక గంగపుత్రులు వెళ్లి మృతదేహాలను బయటకు తీశారు. భైంసా ఏరియాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు ముగ్గురూ తోడబుట్టిన అన్నదమ్ములు. మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం. ఒకరి చేయి పట్టుకుని ఒకరు పెరిగారు. మృత్యువు ఎదురొచ్చినా ఏ ఒక్కరూ చేయి విడువ లేదు. నీట మునిగిపోతున్న ఒకరిని కాపాడబోయి ఒకరు ఇలా ముగ్గురూ గోదావరి నదిలో మృత్యు ఒడికి చేరారు. పిల్లల అక్షరాభ్యాసం కోసం ఆనందంగా మంగళవారం నిర్మల్ జిల్లా బాసరకు వచ్చిన ఆ కుటుంబం పర్యటన విషాదాంతంగా ముగిసింది. ఒక్కసారిగా ముగ్గురు అన్నదమ్ముల మృతితో ఆ కుటుంబాన్ని విషాదం ముంచేసింది. – భైంసా/బాసరబాసర యువకుల మానవత్వంఈ విషాద ఘటన సమయంలో మానవత్వం చూపిన బాసర యువకులు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్వచ్ఛందంగా ముందుకువచ్చి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. సొంత బంధువుల్లా బాధిత కుటుంబాన్ని ఓదారుస్తూ వారి వెంట ఉండి ధైర్యం చెప్పడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఒకవైపు ముగ్గురు కుమారులను కోల్పోయిన తండ్రి ఆవేదన, మరోవైపు భర్తను కోల్పోయిన మహిళల రోదనలు అక్కడి వారిని కన్నీళ్లు పెట్టించాయి. చిన్నారులు తమ తండ్రుల కోసం ఎదురుచూస్తుండగానే వారి మరణవార్త వినాల్సి రావడం అందరి హృదయాలను కలిచివేసింది. అంతటితో ఆగకుండా ఆ యువకులంతా విరాళాలు సేకరించి అంబులెన్స్, కారులో మృతదేహాలు, కుటుంబీకులను హైదరాబాద్కు తరలించారు. -
ఓటర్ల సవరణ పకడ్బందీగా నిర్వహించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జూన్ 25నుంచి చేపట్టనున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు అన్నారు. మంగళవారం హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టరేట్ బీ సెక్షన్ సూపరింటెండెంట్ మధుసూదన్, సిబ్బందితో కలిసి ఓటర్ల సమగ్ర సవరణ, సాదాబైనామా, భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ రాములు మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు ప్రతీ ఇంటికి వెళ్లాలని, సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. భూభారతి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని తెలిపారు. ఓపీఎంఎస్ పూర్తి చేయాలి మంచిర్యాలఅగ్రికల్చర్: ధాన్యం కొనుగోలులో ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంటు సిస్టం(ఓపీఎంఎస్) త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి ఎస్డబ్ల్యూసీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. గడువులోగా ధాన్యం ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. -
ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం!
భైంసా: బాసర గోదావరి నదిలో మరో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు పుణ్యస్నానానికి వెళ్లి నీటమునిగి మృత్యువాత పడిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో బాసర గోదావరిలో భద్రతా లోపాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రతీ ఏడాది ప్రమాదాలు జరుగుతున్నా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించడం, అనంతరం పరిస్థితి మళ్లీ ఎప్పటిలాగే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది ఐదుగురు.. గతేడాది జూన్ 15న గోదావరి నదిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు నీటి మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరు రాజస్థాన్కు చెందినవారు కాగా, ఈ కుటుంబం హైదరాబాద్లో స్థిర పడింది. ఆ సమయంలో హైదరాబాద్కు చెందిన 30 మంది బృందం ఇంటర్సిటీ రైతులో బాసరకు చేరుకుంది. ఇసుక దిబ్బ నుంచి నీటిలో స్నానాలు చేస్తూ ప్రమాదవశాత్తు రాథోడ్ రాకేశ్, భరత్, మదన్, వినోద్, రుతిక్ మృతిచెందారు. ఈ ఘటన మరువకముందే ఇప్పుడు మరో ముగ్గురు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. ఏటా బాసరకు లక్షలాది మంది భక్తులు వస్తున్నప్పటికీ నదీ తీరంలో శాశ్వత భద్రతా ఏర్పాట్లు మాత్రం లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు నది పరిస్థితులపై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు తక్కువగా ఉండటంతో పాటు నిత్యం విధుల్లో ఉండే లైఫ్గార్డుల సంఖ్య కూడా సరిపడా లేదని తెలుస్తోంది. పండుగలు, సెలవు దినాలు, వారాంతాల్లో భారీగా భక్తులు వచ్చే సమయంలో ప్రత్యేక నిఘా అవసరమని భక్తులు భావిస్తున్నారు. భక్తుల ప్రధాన డిమాండ్లు -
బోథ్, సొనాల మండలాల్లో భారీ వర్షం
బోథ్: బోథ్, సొనాల మండలాల వ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సష్టించింది. ఏకధాటిగా దాదాపు మూడు గంటల పాటు కురియడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సొనాల మండలంలోని పెద్దగూడ గ్రామ సరిహద్దులో ప్రవహిస్తున్న వాగు ఉధృతికి వంతెన సమీపంలో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోథ్ మండల కేంద్రంలోనూ వర్షం కురిసే సమయంలో పిడుగు పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిడుగు తీవ్రతకు పట్టణంలోని పలువురి ఇళ్లలో టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. మరోవైపు ఈ ఏడాది తొలకరి పలకరించడంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వాన పడటంతో అదును చూసుకుని పలు గ్రామాల్లో రైతులు ఆనందంగా విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. -
పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థినికి ఉత్తమ ప్యాకేజీ
శ్రీరాంపూర్: సీసీసీలోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీ పూర్వ విద్యార్థిని మంచాల అక్షయ ఉత్తమ ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది. 2020–23లో ఇక్కడ సివిల్ డిప్లొమా కోర్సు చదివిన ఆమె అనంతరం కంప్యూటర్ ఇంజినీరింగ్ చేసింది. ఇటీవల హెచ్ఎస్బీలో రూ.16.43 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం కాలేజీలో అక్షయను ప్రిన్సిపల్ కుర్మ రాజేందర్, డీజీఎం (పర్సనల్) అనిల్కుమార్ అభినందించారు. సింగరేణి పాలిటెక్నిక్ కాలజీ మంచి విద్యాప్రమాణాలతో కొనసాగుతుందనడానికి ఇది నిదర్శనమని వారు తెలిపారు. పారిశుధ్య కార్మికుడి మృతిభైంసాటౌన్: పట్టణంలోని మున్సిపాలిటీ పారి శుధ్య విభాగంలో పని చేస్తున్న జంగ్మే మారుతి (45) గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పడి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతి కొన్నేళ్లుగా మున్సిపాలిటీలో పారిశుధ్య విభాగంలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రెండురోజులుగా విధులకు హాజరుకావడం లేదు. మంగళవారం సాయంత్రం గడ్డెన్నవాగు ప్రాజెక్టులో అతడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సుకేశ్న బాయి, ఇద్దరు కొడుకులున్నారు. వడదెబ్బతో ఒకరు మృతిఆసిఫాబాద్రూరల్: వడదెబ్బతో ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని రాజురా గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజురా గ్రామానికి చెందిన పిప్రే మోహన్ (40) ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. -
నేరాల నియంత్రణకు సహకరించాలి
మంచిర్యాలక్రైం: నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని 38, 39, 40, 41, 42, 43, 44, 45 డివిజన్లలో వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితులు, జల్సాల కోసం కొందరు నేర ప్రవృత్తిని ఎంచుకుంటున్నారని అన్నారు. డ్రగ్స్, మద్యానికి అలవాటు పడి మత్తులో నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా షీ టీమ్ పని చేస్తోందని, వేధింపులు, మోసాలకు గురైతే 100 డయల్, షీ టీమ్కు సమాచారం అందించాలని అన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మంచి ర్యాల సీఐ ప్రమోద్రావు, ఎస్సైలు తిరుపతి, శ్రావణ్కుమార్, మధుసూధన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల వివరాలు ప్రదర్శించాలి
మంచిర్యాలఅర్బన్: ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల వివరాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలని, ఎంఈవోలు పర్యవేక్షించాలని జిల్లా అదనపు కలెక్టర్, డీఈవో చంద్రయ్య సూచించారు. ఈ నెల 15న పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మోడల్స్కూల్ ప్రిన్సిపాల్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. బడిబాటలో గతేడాది కంటే పదిశాతం అదనంగా విద్యార్థుల నమోదు పెంచాలని తెలిపారు. తరగతి గదులు, ఆవరణ, వంటపాత్రలు శుభ్రం చేయించాలని, మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియ్యం సమకూర్చుకోవాలని అన్నారు. పాఠ్య, నోటుపుస్తకాలను పాఠశాలలకు చేరవేయాలని సూచించారు. ప్రతీ విద్యార్థి ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటర్మీడియెట్ దశ వరకు నిరాటంకంగా చదువు కొనసాగించేలా చూడాలన్నారు. భవిత సెంటర్లను ఎప్పటికప్పుడు ఎంఈవోలు పర్యవేక్షించాలన్నారు. మధ్యాహ్న భోజనం మొదటి రోజు నుంచే అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లలిత, జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు భరత్కుమార్, సత్తయ్య, కృష్ణమూర్తి, విజయలక్ష్మి, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
కేజీబీవీలో భద్రతతో కూడిన విద్య
మంచిర్యాలఅర్బన్: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో బాలికలకు భద్రతతో కూడిన నాణ్యమైన విద్య అందుతోందని సెక్టోరల్ అధికారి విజయలక్ష్మి అన్నారు. సోమవారం స్థానిక కేజీబీవీలో అడ్మిషన్ల మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెసిడెన్షియల్ విధానంలో విద్యార్థినులకు ఉచిత విద్య, వసతి, భోజనం, పుస్తకాలు ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని 18 కేజీబీవీల ప్రత్యేకతను తెలిపే స్టాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులకు వసతులు, విద్య, ఇతర సదుపాయాలపై వివరించారు. 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులు రాగా 20 మంది అడ్మిషన్లు పొందారు. ప్రత్యేక అడ్మిషన్ల స్టాళ్లను ఎంఈవో మాళవీదేవి పరిశీలించారు. కార్యక్రమంలో కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
సాగు సన్నద్ధతపైరేపు ఫోన్ ఇన్
మంచిర్యాలఅగ్రికల్చర్: వానాకాలం సాగు సీజన్ ప్రారంభం నేపథ్యంలో వ్యవసాయ అధికారులతో ‘సాక్షి’ బుధవారం ఫోన్ ఇన్ నిర్వహించనుంది. రైతుల సమస్యలు, సాగు సందేహాలపై జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ సమాధానాలు ఇస్తారు. వాతావరణానికి అనుగుణంగా విత్తనాల ఎంపిక, సాగు ప్రణాళిక, ఎరువుల వినియోగం, పంట మార్పిడి తదితర సాగు సంబంధిత సందేహాలపై రైతులు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.సమయం: బుధవారం ఉదయం 11గంటల నుంచి 12.30గంటలకు వరకు సంపదించాల్సిన ఫోన్ నంబర్లు : -
వాన కురిసె.. రైతు మురిసె
చెన్నూర్/మంచిర్యాలఅగ్రికల్చర్/వేమనపల్లి/లక్సెట్టిపేట: జిల్లాలో గత కొద్దిరోజులుగా ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు సోమవారం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి ఉపశమనం లభించింది. సోమవారం మృగశిర కార్తె ప్రారంభం కావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మృగశిర కార్తె రోజున తొలకరి వర్షం కురువడంతో రైతులు మురిసిపోయారు. కార్తె ప్రారంభంలో వర్షం కురిస్తే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అంటున్నారు. మంచిర్యాల, చెన్నూర్, వేమనపల్లి, లక్సెట్టిపేటలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లక్సెట్టిపేటలోని గోదావరి రోడ్డులో తాడిచెట్టుపై పిడుగు పడడంతో మంటలు వ్యాపించాయి. బలమైన ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వేమనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన తరలించేందుకు భారీ సంఖ్యలో లారీలు వచ్చాయి. లోడ్ చేస్తున్న సమయంలో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. ఇప్పటికే దుక్కి దున్ని చేన్లు, పొలాలు సిద్ధం చేసుకున్న రైతులు తొలకరి వర్షంతో విత్తనా లు వేసేందుకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి. -
● ఏళ్ల తరబడి ఒకే రకం పంటల సాగు చేటు ● మార్పుతోనే మంచి దిగుబడి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఖరీఫ్ సాగు సీజన్ మొదలైంది. కొద్ది రోజుల్లో రుతుపవనాలు జిల్లాను తాకనున్నాయని, సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. పంట మార్పిడి చేపట్టాలని రైతు సంక్షేమ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో పంట మార్పిడిపై జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకే రకమైన పంటను ఏళ్ల తరబడి సాగు చేయడం వల్ల దిగుబడి రాక అనేక సమస్యలు ఎదురవుతాయని, చీడపీడల బెడద అధికం కావడంతోపాటు భూమి సారం కోల్పోతుందని, పంట మార్పిడితో ప్రయోజనం పొందవచ్చని ఆదిలాబాద్ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్ వివరించారు. ఆయన సూచనలు, సలహాలు.. పత్తి, వరి పంటలే అధికం.. జిల్లాలో అన్ని రకాల పంటల సాగుకు నేలలు అనుకూలంగా ఉన్నా రైతులు దాదాపు 15ఏళ్ల నుంచి పత్తి, వరి పంటలే సాగు చేస్తున్నారు. చీడపీడల ఉధృతి పెరగడంతో విపరీతంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. దీంతో భూమి సారవంతం కోల్పోయి పంట ఎదుగుదల క్షీణించి దిగుబడి తగ్గి నష్టపోతున్నారు. వానాకాలంలో 70శాతం మంది రైతులు వర్షాధారంగా ఈ రెండు పంటలే సాగు చేస్తున్నారు. కొందరు అటవీ జంతువుల బెడద ఉంటుందని, మార్కెట్, నీటి సౌకర్యం లేదని, వేరే పంటలు దిగుబడి రావని తదితర కారణాలతో ఇతర పంటల వైపు మొగ్గు చూపడం లేదు. భిన్నమైనవి ఎంచుకోవాలి పంట మార్పిడి చేయాలంటే అంతకుముందు వేసిన పంటకు భిన్నంగా పెరిగే పంటను ఎంచుకోవాలి. నువ్వులు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న పంటల వేరు వ్యవస్థలు భూమి నుంచి పోషకాలు ఎక్కువగా గ్రహిస్తాయి. పంట మార్పిడి చేసే రైతులు భూమి నుంచి పోషకాలను గ్రహించే ఈ పంటలకు బదులుగా భూమికే పోషకాలు అందించే అపరాల పంటలు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇవి కొంతవరకు బెట్ట పరిస్థితులను కూడా తట్టుకుంటాయి. ఆకులను రాల్చి భూమికి సేంద్రియ పదార్థాలను అందిస్తాయి. వేరుబుడిపెలు నత్రజనిని స్థిరీకరిస్తాయి. నల్లరేగడి నేలల్లో నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు పండించిన రైతులు సోయాచిక్కుడు వేసుకుంటే మంచిది. ఈ పంట సమయానికి ఆకులు పూర్తిగా రాలిపోతాయి. తద్వారా ఎకరానికి ఒకటి నుంచి రెండు టన్నుల సేంద్రియ పదార్థం లభిస్తుంది. చీడపీడల నివారణ కోసం.. కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు కొన్ని పంటలను అధికంగా ఆశించి వృద్ధి చెందుతాయి. అలాంటి పంటలను వరుసగా వేసుకోకుండా మార్పిడి చేసుకోవాలి. వరుసగా పత్తి, వరి పంట వేయకుండా పప్పుధాన్యపు పంటలు, నూనెగింజల పంటలు వేసుకోవాలి. మిరుప, వేరుశనగ, క్యాబేజీ పంటలను లద్దె పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. వీటి ఉధృతిని అరికట్టేందుకు జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలతో మార్పిడి చేయాలి. దీనివల్ల ఆయా పంటల్లో కాళహస్తి తెగులు, నులి పురుగులు, ఆకుముడత, లద్దె పురుగుల ఉధృతిని నివారించవచ్చు.వేయకూడని పంటలు..బెండ తర్వాత పత్తి వేస్తే ఉపయోగం ఉండదు. ఈ రెండు పంటలను ఒకే రకమైన చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. జొన్న వేసిన భూమిలో మిరప, పసుపు తర్వాత మిరప, టమాటా, ఆవాలు, బెండ వేయకూడదు. ఆకుముడత పురుగుల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వేరుశనగ, సోయాచిక్కుడు పంటలు సాగు చేయొద్దు.ఏవి వేసుకోవాలి.. గత రబీలో వేరుశనగ వేసిన రైతులు ఈ ఖరీఫ్లో మొక్కజొన్న పంట వేసుకుంటే పంటకు నత్రజని లభిస్తుంది. ఫలితంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల రాబోయే రబీలో మళ్లీ వేరుశనగ వేసినప్పుడు ఆ పంట నులి పురుగుల బెడద చాలా వరకు తగ్గుతుంది. -
పంటల ప్రణాళిక రూపొందించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో కలిసి జిల్లా వ్యవసాయ శాఖ సహాయ అధికారులు, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం జూన్, జూలైలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఆగస్టు, సెప్టెంబర్లో గత ఐదారేళ్లతో పోలిస్తే సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎల్నినో ప్రభావం కారణంగా వాతావరణంలో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని అన్నారు. మూడు నాలుగు రోజులపాటు వర్షాలు కురిసి భూమిలో ఒకటిన్నర అడుగుల లోతు వరకు తేమ ఉన్న తర్వాతే విత్తనాలు విత్తుకోవాలని రైతులకు సూచనలు చేయాలని అన్నారు. పంటల అవశేషాలు తగులబెడితే రైతులకు గ్రామ పంచాయతీల ద్వారా రూ.2,500 నుంచి రూ.15వేల వరకు జరిమానా విధించవచ్చని తెలిపారు. ఎనిమిది రకాల సన్న ధాన్యం సాగు చేసేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. రాబోయే పది రోజులపాటు వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశాలు నిర్వహించి సూచనలు చేయాలని తెలిపారు. -
వైద్యశాఖలో బదిలీలు
మంచిర్యాలటౌన్: జిల్లా వైద్యశాఖలో జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా పలువురు స్థానచలనం పొందారు. మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎండి.సులేమాన్ను నాగర్కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా బదిలీ అయ్యారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్ను హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి ప్రొఫెసర్గా, ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ శ్రీమన్నారాయణను ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎంవోగా, ప్రొఫెసర్ ముసాఖాన్ను ఫీవర్ ఆసుపత్రికి ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ విభాగానికి బదిలీ చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఇంచార్జి అధికారి డాక్టర్ అనితను హైదరాబాద్ డీఎంహెచ్వో కార్యాలయానికి బదిలీ చేశారు.డాక్టర్ వేదవ్యాస్ఎండి సులేమాన్డాక్టర్ అనితశ్రీమన్నారాయణ -
సారూ.. సమస్యలు పరిష్కరించరూ..
మంచిర్యాలఅగ్రికల్చర్: వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు సోమవారం కలెక్టరేట్కు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్కు అర్జీలు అందజేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కొన్ని శాఖల్లో అర్జీలు పెండింగ్లో ఉంటున్నాయని, పరిష్కరించే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్ పాల్గొన్నారు. -
ఇక బ్యాంకుల్లోనే పింఛన్లు
దండేపల్లి: చేయూత పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా అందిస్తుండగా ఇక నుంచి బ్యాంకుల ద్వారానే చెల్లించేందుకు సన్నాహాలు చేస్తోంది. సంబంధిత అధికారులకు దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది. చేయూత పథకం ద్వారా వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 58,254 మంది పోస్టాఫీసు ద్వారా పింఛన్లు పొందుతున్నారు. ఇకపై బ్యాంకుల ద్వారా చెల్లింపులకు చర్యలు చేపడుతుండడంతో ఖాతాలు లేని వారు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బ్యాంకు ద్వారా ఏ విధంగా అందజేస్తారనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఏటీఎం కార్డులు జారీ చేస్తారా లేక ప్రత్యేక రోజులు కేటాయించి బ్యాంకు సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తారా అనే విషయాలపై అధికారికంగా ఆదేశాలు వెలువడాల్సి ఉంది. పోస్టల్ విధానంలో ఇబ్బందులు.. పోస్టాఫీసు ద్వారా పింఛన్ల పంపిణీలో కొన్ని చోట్ల కొందరు పింఛన్దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో పోస్టల్ సేవలు అందుబాటులో ఉన్నా పంపిణీ సమయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ గుర్తింపు, బయోమెట్రిక్ ధ్రువీకరణ సమయంలో సరిగా నమోదు కాకపోవడంతో వృద్ధులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రూ.2016, రూ.4016 పింఛన్ల మొత్తంలో చిల్లర రూ.16 చెల్లించడం లేదనే ఆరోణపణలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఇక ముఖ గుర్తింపు, బయోమెట్రిక్ రాని వారికి పంచాయతీ కార్యదర్శి వేలిముద్రలతో చెల్లిస్తుండడంతో తపాలా కార్యాలయాల చుట్టూ తిరిగేందుకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.ఇంకా ఆదేశాలు రాలే..చేయూత పింఛన్ల పంపిణీలో మార్పులకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇంకా అధికారికంగా ఆదేశాల రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా చెల్లిస్తున్న పింఛన్లను బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. – కిషన్, డీఆర్డీవో, మంచిర్యాల -
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసనలు
పాతమంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో జిల్లా, మండల, మున్సిపాలిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుతూ సామాన్యులపై ఆర్థిక భారం మోపుతోందని, పెరుగుతున్న ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న కలెక్టరేట్ల ఎదుట ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహిస్తామని, పార్టీ బలోపేతం కోసం ఈ నెల 28, 29, 30వ తేదీల్లో జిల్లా కేంద్రంలో మూడు రోజులపాటు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, జోగుల మల్ల య్య, చంద్రశేఖర్, లింగం రవి, శ్రీనివాస్, చంద్రకళ, జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న, బొంతల లక్ష్మీనారాయణ, దుర్గారాజ్, రాజమౌళి, సమ్మయ్య, బానేష్ పాల్గొన్నారు. -
లీవ్ ఇట్
ఆదిలాబాద్: ఆర్టీసీ కార్మికులు పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అనారోగ్యాల బారినపడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. అనారోగ్యం దృష్ట్యా ఆస్పత్రికి వెళ్దామంటే అధికారుల నుంచి అనుమతులు రాక.. విధిలేని పరిస్థితుల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. తమకు సెలవులు మంజూరు చేయాలని విన్నవించుకుంటున్నా అధికారులు ఖరాకండీగా డ్యూటీ చేయాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. ఎవరైనా గట్టిగా వాదిస్తే వారిని టార్గెట్ చేసి ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. యూనియన్లు సైతం లేకపోవడంతో పైఅధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకే ఇబ్బంది అని లీవ్స్ ఇవ్వకపోయినా పని చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. డ్యూటీ చేయాల్సిందే..అనారోగ్యం, పలు కారణాలతో సెలవుల మంజూరు కోసం అధికారులకు అర్జీ పెట్టుకుంటే పూర్తిస్థాయిలో సిబ్బంది లేరని, తప్పకుండా డ్యూటీ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం హాఫ్ పే సెలవులు మంజూరు చేయాలని విన్నవించినా కనికరించడం లేదని ఆందోళన చెందుతున్నారు. పలు సందర్భాల్లో నేషనల్ హాఫ్ పేలను సైతం వాడుకునే పరిస్థితి లేక బలవంతంగా డ్యూటీకి ఎక్కుతున్నారు. ఇలాంటి సమయాల్లోనే పనిఒత్తిడితో పలు సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నిబంధనలు ఇలా..నిబంధనలకు అనుగుణంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సంవత్సరంలో 15 సాధారణ సెలవు దినాలు ఉంటాయి. వీటితో పాటు ఏడాదికి 4 నేషనల్ హాఫ్ డేలను సైతం సెలవులుగా ఇస్తారు. జనవరి 26, అంబేడ్కర్ జయంతి, ఆగస్టు 15, గాంధీ జయంతి రోజున సెలవులుగా ప్రకటించారు. అయితే ఈ సెలవు రోజుల్లో సైతం ఆర్టీసీ బస్సులు నడపాల్సి ఉంటుంది. కార్మికులు డ్యూటీ చేయాల్సి వస్తున్న కారణంగా ఆ నాలుగు రోజులను ఇతర రోజుల్లో సెలవులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ప్రతీ 10 సంవత్సరాల కాలానికి 31 హాఫ్ పే సెలవులను ఆర్టీసీ మంజూరు చేసింది. వీటిని సైతం సెలవులుగా వినియోగించుకునే సౌలభ్యం కార్మికులకు ఉంటుంది. విలీన ప్రకటనతో విధిలేని పరిస్థితిలో..ఇటీవల ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగా రు. దిగివచ్చిన ప్రభుత్వం, వారితో చర్చలు జరిపి విలీన విషయంలో సానుకూలంగా స్పందించింది. ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైతే, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఇతర సౌలభ్యాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే, విలీనం నాటికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసమే పరోక్షంగా కార్మికులపై పని ఒత్తిడి పెంచి, వారు స్వచ్ఛందంగా ఉద్యోగాల నుంచి తప్పుకునేలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. విలీన ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి సంస్థలో ఉండకపోతే తీవ్రంగా నష్టపోతామనే భయంతో, సెలవులు దొరక్కపోయినా విధిలేని పరిస్థితుల్లో కార్మికులు విధులకు హాజరవుతున్నారు. కనీసం అత్యవసర సమయాల్లోనైనా సెలవులు మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు.సెలవులు మంజూరు చేస్తున్నాం.. కార్మికులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న సమయాల్లో సిక్ లీవ్స్ ఇస్తున్నాం. అన్ని సందర్భాల్లో సెలవులు మంజూరు చేస్తున్నాం. ఉద్యోగ విరమణతో సిబ్బంది సంఖ్య తగ్గుతున్నా, ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తున్నాం. కార్మికులకు సెలవుల మంజూరులో ఎటువంటి ఇబ్బంది లేదు. డిపోల పరిధిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నా దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తా. – విజయభాను, ఆర్టీసీ ఆర్ఎం, ఆదిలాబాద్ -
అమాత్య.. ఎలా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రి పదవిపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు(పీఎస్సార్) ఆశలు పెట్టుకున్నారు. ఆయన అనుచరవర్గమూ తప్పకుండా కేబినెట్లో చోటు లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డితో పెరిగిన సాన్నిహిత్యం ఇందుకు తోడవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనను సక్సెస్ చేయడంతో పీఎస్సార్కు మంత్రి పదవి దక్కుతుందనే చర్చ మరోసారి సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభలు విజయవంతం చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇటీవల ఆసిఫాబాద్లో ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేశారు. ఈ క్రమంలోనే కేబినెట్లో మార్పులు చేర్పులు జరిగితే పీఎస్సార్కు చోటు దక్కుతుందా..? అనే చర్చ జోరందుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సన్నిహితంగా ఉంటారు. ఈ క్రమంలో సీఎం వర్గానికి దూరంగా ఉంటారనే ప్రచారం ఉన్నప్పటికీ తాజాగా ఆసిఫాబాద్ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ఎమ్మెల్యే పీఎస్సార్కు పెద్దపీట వేస్తూ ప్రాధాన్యత ఇచ్చారు. తిరుగు ప్రయాణంలో సీఎం హైదరాబాద్కు వెళ్తూ మంచిర్యాలలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద కాసేపు ఆగారు. ఆశించి, భంగపడి ఉమ్మడి జిల్లా నుంచి పీఎస్సార్కు మొదటి, ఆ తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని ఆశించినప్పటికీ చోటు దక్కలేదు. గతేడు ఏప్రిల్లో మంత్రివర్గ విస్తరణకు ముందు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘జై బాపు జై భీమ్, జై సంవిధాన్’ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ ఆయన మంత్రి పదవిపై బహిరంగంగానే తన అసంతృప్తిని వెల్ల డించారు. తర్వాత జిల్లా నుంచే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామికి అవకాశం దక్కింది. దీంతో ఇక పీఎస్సార్కు మంత్రి పదవి రాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి జిల్లా నుంచి రెండో విడతలో చోటు ఖాయం అనుకున్నప్పటికీ దక్కలేదు. నామినెటేడ్కు ససేమిరా మంత్రి పదవి దక్కక అసంతృప్తితో ఉన్న పీఎస్సార్కు నామినేటెడ్తో బుజ్జగించేలా కార్పొరేషన్ పదవిలో నియమించారు. గత అక్టోబర్లో అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ప్రభుత్వం పీఎస్సార్ను కేబినెట్ హోదాతో సివిల్ సప్లయి కార్పొరేషన్ చైర్మన్ పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆయన బాధ్యతలు చేపట్టలేదు. అంతేకాక నామినేటెడ్ పోస్టులపై తనకు ఆసక్తి లేదని తేల్చారు.అవకాశం ఉంటుందా?కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తోంది. అన్ని సామాజిక, ప్రాంతాలకు సీనియర్లకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు మొదలయ్యాయి. దీంతో కేబినెట్లో మార్పులు చేర్పులపై ఇప్పటికే రాష్ట్రంలో పలువురు సీనియర్ నాయకులు మంత్రి పదవిపై గంపెడాశలతో ఉన్నారు. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. దీంతో మూడో విడతలో ఎవరికి అవకాశం ఇస్తారోనని ఎదురు చూస్తునారు. ఇప్పటికే జిల్లా నుంచి మంత్రి ప్రాతినిధ్యం ఉంది. ఈ క్రమంలో పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యే పీఎస్సార్ను పార్టీ అధిష్టానం ఎలా బుజ్జగిస్తారనేది వేచిచూడాలి. -
అంతర్జాతీయ పోటీలకు గ్రామీణ యువకుడు
పెంచికల్పేట్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం బొంబాయిగూడ గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు సాయిక్రిష్ణ అంతర్జాతీయ బేస్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఆసియా ఇంటర్ ప్రైవేట్ నేషనల్ గేమ్స్– 2026లో పాల్గొనే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. కాగా, దేశం తరఫున బేస్బాల్ పోటీల్లో పాల్గొననున్న సాయిక్రిష్ణకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అండగా నిలిచారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బీజేపీ నాయకుడు పాల్వాయి సుధాకర్ రావు క్రీడాకారుడికి నగదు ప్రోత్సాహం అందించారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు పగిడె కాంతారావు, సర్పంచ్ పొట్టె ఉమామహేశ్, ఉప సర్పంచ్ రఘునాథ్, నాయకులు మీసారి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
మంచిర్యాలటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోతరగతిలో అత్యధిక మార్కులు సాధించిన రెడ్డి కులానికి చెందిన విద్యార్థులకు ఆదివారం జిల్లా కేంద్రంలో రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీ య బహుమతి రూ.6 వేలు, తృతీయ బహుమతి రూ.4 వేలు అందించారు. మొత్తం 10 మంది విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి సంఘం జిల్లా సభ్యులు సంతోషం గోపాల్రెడ్డి, వి.మధుసూదన్రెడ్డి, కె.సరేందర్ రెడ్డి, బొమ్మ సత్తిరెడ్డి, తాళ్ల సంపత్రెడ్డి, ఓడేటి బలరాంరెడ్డి, రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు గోనె మణిమాల, పద్మ, భాగ్యలక్ష్మి, పి.సుధా, స్వాతి, లీలా, బి.రాణి, పి.దివ్య, బి.సరిత, ప్రమీల, తదితరులు పాల్గొన్నారు. -
● బెల్లంపల్లిలో పెరిగిన పాముల సంచారం ● ఇళ్లలోకి వస్తున్న తేళ్లు ● వారం రోజుల్లో 30 పాములు పట్టివేత ● ఆందోళన చెందుతున్న ప్రజలు
బెల్లంపల్లి: పురాతన బొగ్గుగనుల ప్రాంతం బెల్లంపల్లి సర్పాలమయంగా మారింది. నిత్యకృత్యంగా విషసర్పాలు విచ్చలవిడిగా సంచారం చేస్తున్నాయి. జననివాసాలు, ఇళ్ల పరిసరాలు, వీధులు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ స్వైరవిహారం చేస్తున్నాయి. రక్తపింజరలు, నాగుపాములు ఇళ్లలో వచ్చి తిష్ట వేస్తుండగా, తేళ్లు సైతం దూరుతున్నాయి. ప్రాణాంతకమైన సర్పాలు, తేళ్ల బెడద పురప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వీటి సంచారంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తుండటంతో పుట్టల్లోంచి పాములు, తేళ్లు బయటకు వస్తున్నాయి. ఏ బస్తీలో చూసినా.. మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా వీటిలో సగానికి పైగా వార్డుల్లో పాముల ప్రభావం ఉంది. ముఖ్యంగా అటవీ, శివారుబస్తీలు, మూసివేతకు గురైన కార్మికవాడలు, తుమ్మ, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి చిత్తడిగా ఉన్న ప్రతీ ప్రాంతం కూడా పాములు, తేళ్లకు నిలయాలుగా మారాయి. శాంతిఖని, 65 డీప్, సుభాష్నగర్, నెంబర్–2 ఇంక్లైన్, రైల్వే రడగంబాల బస్తీ, అంబేడ్కర్ రడగంబాల బస్తీ, పెద్దనపల్లి, సుబ్బారావుపల్లి, కాల్టెక్స్ ఏరి యా, గంగారాం నగర్, గాంధీనగర్, కన్నాల బస్తీ, మధునన్ననగర్, టేకుల బస్తీ, 24 డీప్ ఏరియా, కొత్తబస్టాండ్ ఏరియా ఇందిరమ్మ కాలనీ, కాంట్రాక్టర్ బస్తీ, షంషీర్నగర్, రవీందర్నగర్, అంబేద్కర్నగర్, బెల్లంపల్లి బస్తీ, హన్మాన్ బస్తీ, అశోక్నగర్, బూడిదగడ్డ, బాబుక్యాంపు బస్తీ, గోల్బంగ్లాబ స్తీ తదితర కార్మిక, కార్మికేతర బస్తీల్లో పాములు, తే ళ్ల సమస్య స్థానికులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. వారం రోజుల్లో.. పాముల్లో రక్త పింజర, తాచుపాములు ప్రమాదకరమైనవి. వీటి కాటుకు గురైతే ప్రాణాలు కోల్పోయే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అవి జన నివాసాల్లో సంచరిస్తుండడం గమనార్హం. కాల్టెక్స్, 65 డీప్ ఏరియా, శాంతిఖని, సుబ్బారావుపల్లి, గంగారాంనగర్, గోల్ బంగ్లాబస్తీ, నెంబర్–2 ఇంక్లైన్, సుభాష్నగర్ తదతర ప్రాంతాల్లో రక్త పింజరల ప్రభావం అఽధికంగా ఉండగా ఇతర బస్తీల్లో నాగుపాములు సంచరిస్తున్నాయి. ఇళ్ల పరిసరాలు, గల్లీలు, వీధుల్లో పిచ్చిమొక్కలతో చిత్తడి వాతావరణం ఉండగా , కొన్ని బస్తీలను ఆనుకుని అటవీ ప్రాంతం ఉండటం, మూసివేతకు గురైన బొగ్గు గనులు పాములకు స్థావరాలుగా మారడంతో పాముల సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో ఏకంగా 30కిపైగా స్నేక్ క్యాచర్లు పట్టుకున్నట్లు సమాచారం. వీటిలో 15 వరకు రక్తపింజరలు ఉండగా మిగతా తాచుపాములు ఉన్నాయి. తేళ్లు కూడా లెక్కలేనన్నీ ఇళ్లలోకి వస్తున్నట్లు పురప్రజలు చెబుతున్నారు. పట్టుకున్న పాములను స్నేక్ క్యాచర్లు ప్లాస్టిక్ బాటిళ్లు, సంచుల్లో వేసి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలి పెడుతున్నారు. జననివాసాలకు చేరువలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, సర్పాల సమస్యను పరిష్కరించాలని పురప్రజలు కోరుతున్నారు. భయంగా ఉంది ఇళ్ల చుట్టూ రెండు, మూడు పాములు తిరుగుతున్నయ్. చీకటి పడటంతోనే చేరుతున్నయ్. రెండు రోజుల క్రితం పాము వచ్చింది. కొద్ది దూరం నుంచి చూసి కేకలు వేసి బయటకు పరుగుతీశాను. ఓ యువకుడు చాకచక్యంగా పామును పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో వేసి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఇట్ల పాములతో భయం భయంగా గడుపుతున్నం. – వేల్పుల శాంత, టేకులబస్తీ తేళ్లు వస్తున్నాయి ఇళ్ల పరిసరాల్లో పాములు, తేళ్లు భయపెట్టిస్తున్నాయి. ఒకసారి పాము కనిపిస్తే మరోసారి ఐదారు తేళ్లు వస్తున్నాయి. ఏమాత్రం జాగ్రత్తగా లేకపోతే వాటి కాటుకు గురయ్యేవాళ్లం. పిల్లలు వణికిపోతున్నారు. పాములు, తేళ్లు రాకుండా మున్సిపల్ అధికారులు కట్టడి చర్యలు తీసుకోవాలి. – మేకల భాగ్యలక్ష్మి, టేకులబస్తీ పట్టుకుని వదిలేస్తున్నా మున్సిపాలిటీలో సర్పాలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీటిలో ప్రాణాంతక రక్తపింజరలు, తా చుపాముల సంఖ్య అధికంగా ఉంది. గతంలో రక్త పింజరలు, నాగుపాములు అడపాదడపా కనిపించగా ప్రస్తుతం ప్రతి బస్తీలోనూ దర్శనమిస్తున్నాయి. వీటి సంతతి వృద్ధి చెందినట్లు కనిపిస్తుంది. వారం నుంచి రోజుకు రెండు, మూడు పాములను ప ట్టుకునిసురక్షితంగాఅటవీప్రాంతంలోవదిలేస్తున్నాను. – దుర్గా రాజేష్, సీనియర్ స్నేక్క్యాచర్, బెల్లంపల్లి -
15 నుంచి కొత్త విద్యా సంవత్సరం!
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులు మూడురోజులు పొడిగించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా జూన్ 13న రెండో శనివారం, 14న ఆదివారం సెలవులు ఉండటంతో పాటు పలు వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల పున:ప్రారంభం వాయిదా పడినందువల్ల కోల్పోయిన విద్యాదినాలను భర్తీ చేయడానికి జూలై 11న రెండో శనివారం సాధారణ పనిదినంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 1,051 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా 1,32,322 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అన్ని పాఠశాలలు జూన్ 15న ప్రారంభించాలని విద్యాధికారులకు ఆదేశాలు వచ్చాయి. పాఠశాలలు సిద్ధం చేసుకోవాలి.. కొత్త విద్యాసంవత్సరం మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుండటంతో పాఠశాలలు సిద్ధం చేసుకోవాలి. తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలి. విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అన్ని పాఠశాలలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. స్కావెంజర్లకు నిబంధనల ప్రకారం పది నెలలు వేతనాలు చెల్లిస్తారు. జూన్ ఒకటి నుంచి వేతనాలు చెల్లించే నేపథ్యంలో మొక్కలకు నీరు పోయడం, తదితర పనులపై దృష్టి సారించేలా హెచ్ఎంలు చొరవ చూపాలి. వాటర్ ట్యాంకులపై కన్నేయండి.. పాఠశాలల్లో ఉపరితల ట్యాంకులను 15 రోజులకోసారి, భూగర్భ ట్యాంకులను నెలకోసారి శుభ్రం చేయాల్సి ఉంది. రక్షిత నీటితో వంటలు చేయాలని ప్రభుత్వ నిబంధనల్లో పేర్కొంది. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో బోరు నీటితోనే వంటలు చేస్తుండడం పరిపాటిగా మారింది. మరికొన్నింట్లో ట్యాంకుల నుంచి వచ్చే నీటితో వంటలు చేస్తున్న సందర్భాలు న్నాయి. పాఠశాలలకు మిషన్ భగీరథ పైపులున్నా నీటిసరఫరా అంతంతమాత్రంగానే ఉంది. పాఠశాలలు చాలా రోజులుగా మూసివేయడంతో ట్యాంకులు శుభ్రం చేయక నాచు పేరుకుపోయి.. నీటిలో పురుగులు వచ్చే ప్రమాదముంది. అపరిశుభ్ర వా తావరణం వల్ల విద్యార్థులు అనారోగ్యం బారిన ప డే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు వాపోతున్నా రు. ట్యాంకులను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలి. మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తం జిల్లాలోని మండల విద్యావనరుల కేంద్రాలు సమస్యలకు నిలయంగా మారాయి. నిర్వహణ, సౌకర్యా ల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా విని యోగంలో జవాబుదారీతనం లోపిస్తోంది. కొన్ని మండలాల్లో తాగునీరు లేని పరిస్థితి. మరికొన్ని చోట్ల మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అవసరం నిమిత్తం వచ్చినప్పుడు టాయిలెట్కు వెళ్లాలంటే మరుగుదొడ్ల పరిస్థితి చూసి ముక్కుమూసుకుంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవి సెలవుల్లోనే మరుగుదొడ్లు క్లీనింగ్తో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. -
ప్రాణం తీసిన ఈత సరదా
మంచిర్యాలరూరల్(హాజీపూర్):మరో వారం రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. పదో తరగతికి వచ్చిన తమ పెద్ద కొడుకును సన్నద్ధం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. పదో తరగతి పూర్తిచేసి ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని ఆశపడ్డారు. కానీ, కొడుకు ఈత సరదా తల్లిదండ్రులకు తీరని శోఖం మిగిల్చింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట దుబ్బపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి బోగిరి సందీప్(15) ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం సందీప్ తన స్నేహితులైన అభినయ్, అక్షయ్, అశ్విత్, రాంచరణ్తో కలిసి ముల్కల్ల శివారులోని ర్యాలీ ప్రాజెక్టులో ఈతకు వెళ్లాడు. సాయంత్రం వరకు సందీప్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. స్నేహితులు ఇంటికి వచ్చినా సందీప్ రాకపోవడంతో బంధువులు, స్నేహితులు వివిధ చోట్ల వెతికారు. చివరకు సందీప్ తండ్రి రాజు హాజీపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆదివారం ఉదయం సందీప్తో ఈతకు వెళ్లిన స్నేహితులను విచారించారు. సందీప్ ర్యాలీ ప్రాజెక్ట్లోని లోతైన నీటిలో ఈత రాకపోవడంతో మునిగిపోయినట్లు తెలిపారు. భయంతో తాము ఇంటికి వచ్చేశామని వెల్లడించారు. గజ ఈతగాళ్లతో గాలింపు దీంతో పోలీసులు ర్యాలీ ప్రాజెక్టుకు చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో వెతికించగా సందీప్ మృతదేహం లభించింది. సందీప్ ముల్కల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసి 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలు తెరుచుకోవడానికి వారం ముందు జరిగిన ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
కేంద్రాల్లోనే పౌష్టికాహారం
జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో మూడేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పౌష్టికాహారం అందించడంతో పాటు, ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నాం. ఐదేళ్లు దాటిన చిన్నారులను సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి మూడేళ్లు దాటిన చిన్నారులను సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడమే ధ్యేయంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – రౌఫ్ఖాన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి -
ఎస్సార్పీ 3లో కార్మికుడికి గాయాలు
శ్రీరాంపూర్:సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ 3 గనిలో శనివారం నైట్షిఫ్ట్ విధులకు వచ్చిన కార్మికుడు దండు శ్రీకాంత్ గాయపడ్డాడు. ట్రామర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ ఆదివారం తెల్లవారు జామున 5 సీమ్, జీరో లెవల్ 7 రేస్ వద్ద ట్రబ్బు ట్రా క్పై నుంచి జారడంతో బల్ల వేసి దానిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్క సారిగా జంప్ కావడంతో పాయకు, రేస్కు మద్య ఇరుకున్నాడు. దీంతో తుంటి భాగంలో తీవ్ర గాయమైంది. వెంటనే అక్కడున్న కార్మికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం, తుంటి భాగంలో రెండు ఫాక్షర్లు ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈత చెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు.. జన్నారం: మండలంలోని ఇందనపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు గాజుల నారాయణ గౌడ్ ఈత చెట్టు పైనుంచి పడి గాయాలపాలయ్యాడు. శనివారం సాయంత్రం ఈత చెట్టెక్కి కల్లు గీస్తుండగా మోకు జారడంతో కిందపడి రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు అందించిన సమాచారంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పేద గీత కార్మికుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గౌడ సంఘం మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు మూల భాస్కర్గౌడ్, నారాయణగౌడ్ కోరారు. -
కూలీ రేట్ల్ల పెంపుపై ప్రభుత్వం నిర్లక్ష్యం
బెల్లంపల్లి:పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ అన్నారు. బెల్లంపల్లి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా మూడో మహాసభలు ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రసాద్ హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి కూలీ రేట్లను పెంచలేదన్నారు. కూలీలపై వివక్ష ప్రదర్శిసస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టులు పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఎరువుల ధరలు పెంచి రైతులపై భారం మోపుతోందన్నారు. కూలీ రేట్లు పెంచుతామని హామీ ఇచ్చి రా ష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఊసెత్తడం లేదన్నారు. ప్రధాన మంత్రి మోదీ అనుసరిస్తున్న విధానాలతో వ్యవసాయ కూలీలు బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో వ్యవసాయ యంత్రాలు వచ్చిన తర్వాత కూలీలకు పనులు దొరకడం లేదని తెలిపారు. వలసలు పెరుగుతున్నాయన్నారు. వ్యవసాయ కార్మికులు, కూలీలకు ఇందిరమ్మ ఇళ్లు, ఫించన్లు, జాబ్కార్డు, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నూతన కమిటీ ఎన్నిక మహాసభలో మంచిర్యాల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా గుమాస అశోక్, ఉపాధ్యక్షులుగా కృష్ణమాచారి , గోమాసబాపు, ఎం.జయ, కార్యదర్శిగా కనికరపు అశోక్, సహాయ కార్యదర్శులుగా వేల్పుల శంకర్, రాజమణి , నరేందర్, సరిత, కోశాధికారిగా ముడిమడుగుల బ్రహ్మయ్యను ఉన్నుకున్నారు. మరో 10 మందిని సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం, వృత్తిదారుల సంఘం, ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. -
కొత్త వేతన ఒప్పందం ఎప్పుడో!
శ్రీరాంపూర్: బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పంద కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. దేశవ్యాప్తంగా కోలిండియా దాని సబ్సిడరీ కంపెనీల్లో పనిచేసే కార్మికుల వేతనాలకు సంబంధించిన కీలకమైన 11వ వేతన ఒప్పందం కాలపరిమితి జూన్ 30, 2026తో ముగుస్తుంది. జూలై 1, 2026 నుంచి 12వ వేజ్బోర్డు అమలు కావాలి. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి కదలిక లేదు. 1వ వేజ్బోర్డు నుంచి 4వ వేజ్బోర్డు వరకు నాలుగేళ్ల ఒప్పంద కాలపరిమితితో ఒప్పందం జరగ్గా, ఆ తర్వాత నుంచి ఐదేళ్లకోసారి ఒప్పందం జరుగుతోంది. జూన్ 30 తర్వాత కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వేజ్బోర్డు ఏర్పాటు కోసం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. నూతన వేజ్బోర్డు కోసం దేశ వ్యాప్తంగా సుమారు 3.2 లక్షల మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి.. నూతన వేతన ఒప్పందం కోసం జాతీయ సంఘాలు కేంద్రం, కోలిండియా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్ధమయ్యాయి. గడిచిన రెండు వేజ్బోర్డుల సమయానికి బొగ్గు పరిశ్రమలు విస్తరించిన ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో రాజకీయ అవసరాల దృష్యా కేంద్ర ప్రభుత్వం అంతకు ముందు కంటే భిన్నంగా త్వరితగతిన వేజ్బోర్డు ఏర్పాటు, వేతన ఒప్పందానికి సహకరించాయి. ఈ వేతన ఒప్పందాన్ని నేషనల్ కోల్వేజ్ అగ్రిమెంట్(ఎన్సీడబ్ల్యూఏ) అని పిలుస్తారు. ఈసారి అలాంటి వాతావరణం లేకపోవడం, కోలిండియాలో షేర్ల విక్రయాలు, ప్రైవేటు బొగ్గు బ్లాకులు పెరిగి ప్రభుత్వ రంగ పరిశ్రమలు గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఈ సమయంలో వేజ్బోర్డు కమిటీ ఏర్పాటు, ఒప్పందం ఎప్పుడు జరుగుతుందోనన్న సందేహం వ్యక్తమవుతోంది. జేబీసీసీఐ ఏర్పాటుకు ఒత్తిడి.. ప్రతీ వేతన ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వం కోలిండియా యజమాన్యం, జాతీయ కార్మిక సంఘాలతో జాయింట్ బైపార్టియేట్ కన్సల్టేటివ్ కమిటీ ఫర్ కోల్ ఇండస్ట్రీ(జేబీసీసీఐ) పేరుతో కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇస్తారు. దీని ప్రకారం జాతీయ సంఘాలు తమ సభ్యుల పేర్లను అందజేస్తారు. కోలిండియా చైర్మన్ ఈ జేబీసీసీఐకి చైర్మన్గా వ్వవహరిస్తారు. జాతీయ సంఘాల సభ్యుల పేర్లను ఖరారు చేసిన తర్వాత పూర్తి కమిటీ స్వరూపం ఏర్పడి వేతన ఒప్పందం కోసం చర్చలు మొదలవుతాయి. ఈ ప్రక్రియకు ప్రతీసారి జాప్యం జరుగుతుండగా ఈసారి మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు, అలవెన్సుల పెంపు కోసం కార్మిక సంఘాలు తమ డిమాండ్ల తయారీలో నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉంటే 11వ వేతన ఒప్పందం 23 నెలల ఆలస్యంతో మే 20, 2023న ఒప్పందం జరిగింది. ఇందులో సగటు కార్మికుని బేసిక్ వేతనం రూ.6,973.30 పెంపుదల జరిగింది. ఈసారి దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులకు తోడు, యుద్ధాల ప్రభావం కూడా వేతన ఒప్పందాలపై ఉంటుందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా వరుస విజయాలతో రాజకీయ సుస్థిరతను సాధించుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం కోసం తమ ఒత్తిడికి ఏమాత్రం దిగి వస్తుందోనన్న సందేహం కార్మిక సంఘాల నేతల్లో నెలకొంది. -
టీజీ–20 ఖమ్మం ఏసేస్ జట్టులో హిమతేజ
● వేలంలో రూ.8 లక్షలు పలికిన యువ క్రికెటర్ ఆదిలాబాద్: జిల్లాకేంద్రానికి చెందిన యువ క్రికెటర్ కొడిమెల హి మతేజ హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీజీ–20 వేలంలో సత్తాచాటాడు. హైదరాబాద్ వేదికగా ఆదివారం నిర్వహించిన టీజీ–20 క్రికెట్ లీగ్ వేలంలో ఖమ్మం ఏసేస్ జట్టు రూ.8 లక్షలకు దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్లో సత్తాచాటుతున్న యువ కెరటం తాజాగా టీజీ–20 లీగ్లో అత్యధిక ధర పలకడం విశేషం. లీగ్లో ఎంపిక కావడం పట్ల కోచ్ జయేంద్ర పటాస్కర్ అభినందనలు తెలిపారు. మందమర్రిలో ఆర్టీసీ బస్సు బోల్తామందమర్రిరూరల్:మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని జాతీయ రహదారిపై కేకే ఓసీపీ సమీపంలో కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్లగ్జరీబస్సు(టీఎస్28జెడ్ 0109) ఆదివారం తెల్లవారుజామున బోల్తాపడింది. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లికి వస్తుండగా ఓసీపీ సమీపంలో అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి బోల్తాపడింది. తెల్లవారుజామున ప్రమా దం జరగడంతో ఆ సమయంలో రోడ్డుపై రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్ సీతారాం, తాళ్లగురిజాలకు చెందిన ప్రయాణికుడు ప్రవీణ్కుమార్ మాత్రమే ఉన్నారు. వీరికి స్వల్పగాయాలు కాగా స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలుగకుండా పట్టణ ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో బస్సును రోడ్డుపై నుంచి తొలగించారు. బస్సు డ్రైవర్ సీతారాం బీపీ పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. -
హాజీపూర్లో దారుణ హత్య
● పెద్దనాన్నను కత్తితో పొడిచిన కుమారుడు ● భూతగాదాలే కారణం మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్లో దారుణ హ త్య కలకలం సృష్టించింది. పో లీసుల కథనం ప్రకారం.. హా జీపూర్కు చెందిన పెద్దనాన్న పూదరి భాస్కర్(65), కుమారుడు పూదరి వినయ్ మధ్య ఇటీవల భూతగాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఆదివా రం రాత్రి వినయ్ కత్తితో వచ్చి అందరూ చూస్తుండగానే భాస్కర్పై రెండుసార్లు దాడిచేశాడు. తీవ్ర గా యాలైన ఆయన్ను అంబులెన్స్లో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు స త్యనారాయణ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కా గా, ఈ దాడిలో భాస్కర్ కుమారుడు సత్యనారాయణకు గాయాలయ్యాయి. హాజీపూర్ ఎస్సై కిరణ్కుమార్ ఘటనస్థలాన్ని పరిశీలించారు. దాడి చేసిన వినయ్ను అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. కాలుజారి బావిలో పడి వ్యక్తి మృతిజన్నారం: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై ఉదయ్కిరణ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు..మండలంలోని చింతగూడకు చెందిన గజ్జల భూపతి (31) ఆ దివారం తాను కౌలుకు చేస్తున్న భూమిలో పంటవ్యర్థాలు తొలగించడానికి వెళ్లాడు. అక్కడే బహిర్భూమికని వెళ్లాడు. పక్కనే ఉన్న బావివద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందాడు. మృతుడి భార్య శ్వేత ప్రస్తుతం నిండుగర్భిణి. కుమారుడి మృతితో తల్లిదండ్రులు సత్తవ్వ–మల్లేశ్తోపాటు భార్య రోదించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైలు కిందపడి ఆర్మీజవాన్ ఆత్మహత్యకాగజ్నగర్రూరల్: రైలు కిందపడి ఆర్మీజవాన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ సురేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని బురదగూడకు చెందిన కొట్రంగి సురేష్(32) అస్సాంలో ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలో మద్యం తాగుతుండడంతో మానేస్తేనే నీతో అస్సాంకు వస్తానని భార్య తిరుమల చెప్పింది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి మద్యం తాగాడు. మత్తులో క్షణికావేశంలో కాగజ్నగర్, రెబ్బెన రైల్వేస్టేషన్ల మధ్య గల పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో ఆదివారం గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలంలో మద్యం బాటిళ్లు లభించాయి. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ తెలిపారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
జిల్లాకేంద్రంలోని ఎస్బీహెచ్ నం.2 పాఠశాలలో 1985–86 బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 40 ఏళ్ల తర్వాత వీరి అపూర్వ సమ్మేళనానికి జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్ వేదికై ంది. ఎక్కడెక్కడో స్థిరపడినవారు మిత్రులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. మిత్రులు ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు లింబగిరి స్వామి, కుటుంబరావు, చక్రపాణి, టి.రాములు తదితరులను సన్మానించి జ్ఞాపికలు బహుకరించారు. –ఆదిలాబాద్టౌన్సంతోషంగా ఉంది చిన్ననాటి మిత్రులను కుటుంబ సమేతంగా కలుసుకోవడం సంతోషంగా ఉంది. మిత్రుడి కుమారుడి పెళ్లికి వెళ్లిన సమయంలో స్నేహితులందరూ ఒకేచోట కలవాలని నిర్ణయించాం. రెండు నెలల నుంచి ఫోన్ నంబర్లు, వివరాలు సేకరించి గ్రూప్ తయారు చేశాం. సమ్మేళనం ఉందని చెప్పడంతో అందరూ వచ్చారు. – దొగ్గలి గంగయ్య, పూర్వ విద్యార్థి హైదరాబాద్ నుంచి వచ్చా మూడు సెక్షన్లు కలిపి దాదాపు 70 మంది ఉంటాం. సమ్మేళనం ఉందని సమాచారంతో హైదరాబాద్ నుంచి వచ్చాను. గురువులు విలువలతో కూడిన విద్య అందించారు. నేను ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాను. అప్పుడప్పుడు చిన్ననాటి మిత్రులతో ఫోన్లో మాట్లాడతాను. – కుంట గంగయ్య, రిటైర్డ్ ఆర్మీ మరుపురాని అనుభూతి 40 ఏళ్ల క్రితం కలిసిన స్నేహితులందరినీ ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉంది. అనాటి మధురస్మృతులను గుర్తుచేసుకున్నాం. ఆరోగ్య క్షేమాలు, ఇతర విషయాల గురించి పలకరింపులు మరవలేను. కష్టసుఖాల్లో అందరు పాలుపంచుంటాం. – భీమన్న, పూర్వ విద్యార్థి -
కార్మిక వ్యతిరేక విధానాలతోనే సింగరేణికి నష్టాలు
భూపాలపల్లి అర్బన్: కార్మిక వ్యతిరేక విధానాలు, గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల వైఫల్యంతోనే సింగరేణి సంస్థ నష్టాలబాట పట్టిందని బీఎంఎస్ జాతీ య బొగ్గు పరిశ్రమల ఇన్చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి కమ్యూనిటీహాల్లో ఆదివారం సింగరేణి కోల్మైన్స్ కార్మిక సంఘం 29వ ద్వైవార్షిక మహాసభలు నిర్వహించారు. తెలంగాణలోని 12 డివిజన్లకు చెందిన సుమారు 500 మంది ప్రతినిధులు హాజరైన ఈ మహాసభలో లక్ష్మారెడ్డి మాట్లాడా రు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హా మీలు నెరవేర్చడంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిథ్య సంఘం ఐఎన్టీయూసీ పూర్తిగా వి ఫలమయ్యాయని ఆరోపించారు. కార్మికసమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపకుండా యాజమాన్య ం, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. మూడేళ్లుగా కార్మిక సమస్యల పరిష్కారానికి సంఘాలు చర్యలు తీసుకోలేదని, స మ్మె పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టించాయని ఆయన మండిపడ్డారు. కార్మికహక్కుల సాధన, వేతనాల అమలు, కనీస పెన్షన్ వంటి అంశాలపై బీఎంఎస్ జాతీయస్థాయిలో పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం సింగరేణికి రూ.51,149 కోట్ల విద్యుత్ బొగ్గు బకాయిలను వెంటనే చెల్లించా లని డిమాండ్ చేశారు. 12వ వేజ్బోర్డు అమలుకు సంబంధించి కోలిండియా యాజమాన్యం వెంటనే క మిటీ ఏర్పాటు చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని కో రారు. సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నివారించ డం, కొత్త బొగ్గు గనుల అభివృద్ధి, కార్పొరేట్ మెడికల్ బోర్డు పునరుద్ధరణ, తొలగించిన కార్మికులకు మరో అవకాశం కల్పించడం, కాంట్రాక్ట్ కార్మికులకు కోలిండియా తరహా వేతనాలు అమలు చేయడం వంటి డిమాండ్లను ప్రస్తావించారు. జాతీయ నాయకులు మాధవ్నాయక్, యాదగిరి సత్తయ్య, సారంగపాణి, వర్షా ఉడికే, భూపాలపల్లి బ్రాంచ్ నాయకులు వెలబోయిన సుజేందర్, ఆర్ నర్సింగ్రావు, అల్లం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి నాకబందీ, ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీ సులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో లాడ్జీలు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన చౌ రస్తాల వద్ద విస్తృత తనిఖీ జరిపారు. అర్ధరాత్రి బైక్లపై తిరుగుతున్న వారికి డ్రంకెన్ డ్రైవ్పరీక్షలు చేశారు. అదుపులో తీసుకుని విచారించి వివరాలు సేకరించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్లపై స్టంట్ల చేస్తున్నవారిపై లాఠీ ఝులిపించారు. లాడ్జీ గదులను డీసీపీ తనిఖీ చేశారు. అద్దెకు ఉన్నవారిలో అనుమానితులను విచారించారు. సీసీ కెమెరాలు, రికార్డు సక్రమంగా ఉండాలని, రాష్ట్రాల నుంచి వచ్చేవారి వివరాలు సేకరించాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ ప్రమోద్రావు, ఎస్సైలు మధుసూదన్, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. -
బుస కొడుతున్న సర్పాలు
ఈ చిత్రంలో పడగవిప్పి బుస కొడుతున్న నాగుపాము బెల్లంపల్లి బస్తీలో ఉన్న ఓ వాటర్ ప్లాంట్లో గురువారం వచ్చింది. 6 ఫీట్లకు పైగా పొడువు ఉన్న పామును పట్టుకోబోయిన సీనియర్ స్నేక్ క్యాచర్ దుర్గా రాజేష్ను అరగంటకు పైగా ముప్పు తిప్పలు పెట్టింది. ఆఖరుకు అతికష్టంగా పట్టుకున్నాడు. ఈ చిత్రంలో ఉన్న రక్తపింజర పాము సుభాష్నగర్బస్తీలోని ఓ ఇంట్లో రెండు రోజుల క్రితం వచ్చిదూరింది. బస్తీని ఆనుకుని అటవీప్రాంతం ఉండటంతో రక్త పింజర వచ్చినట్లు తెలుస్తుండగా దాని పొడవు 6 ఫీట్లు, బరువు 40 కిలోల వరకు ఉంది. ఈ పాము కాటేస్తే మనిషి బతికే అవకాశాలు ఉండవు. అంతటి ప్రాణాంతకమైన సర్పాన్ని స్నేక్ క్యాచర్ దుర్గా రాజేష్ పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. -
● ఈనెల 15 వరకు వేసవి సెలవులు ● ఈలోగా మూడేళ్ల చిన్నారులను కేంద్రాల్లో.. ● ఐదేళ్లు దాటిన వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యం ● 15 నుంచి చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ పథకం
మంచిర్యాలటౌన్: అంగన్వాడీ కేంద్రాలను బలోపే తం చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ రెండేళ్లుగా వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశాలను పెంచే కార్యక్రమంలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ‘బడిబాట’ మాదిరిగానే రెండేళ్ల నుంచి ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ పేరిట విద్యాసంవత్సరం ప్రారంభంలోనే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సైతం మే 30 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ‘అమ్మమాట అంగన్వాడీ బాట’ పేరిట జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మూడేళ్ల చిన్నారులు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లో చేరేలా, అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు దాటిన వారిని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్లేస్కూల్కు పిల్లలను పంపించే తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలకే వారి పిల్లలను పంపించేలా చేపడుతున్న ఈ కార్యక్రమాలకు ఆకర్షితులవుతుండడం, ప్రైవేటు కంటే మెరుగ్గా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మారుతుండడంతో కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య ఏటా పెరుగుతోంది. బ్రేక్ఫాస్ట్, భోజనం, విద్య ఒకేచోట అందేలా జిల్లాలో 974 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 40,794 మంది ఉన్నారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని పాఠశాలల్లో చేర్పిస్తే చిన్నారుల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో మూడేళ్లు దాటిన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వారిని అంగన్వాడీ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కేంద్రానికి వచ్చే చిన్నారులకు భోజనం, గుడ్డు, మురుకులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంతో పాటు పాలు, గుడ్లు అందిస్తున్నారు. చిన్నారులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాల్లోనే ఉండి పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే చిన్నారులకు మరింత పౌష్టికాహారం అందించేందుకు గానూ ఈ ఏడాది నుంచి బ్రేక్ఫాస్ట్ సైతం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాబోధనలో భాగంగా చిన్నారులకు ఆటపాటలు, కథలతో పాటు, సంభాషణ నైపుణ్యాలు నేర్పించి, చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు అలవర్చుకునేలా సంసిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగానే అందిస్తున్న అంగన్వాడీ కేంద్రాల సేవలను చిన్నారులు సద్వినియోగం చేసుకునేలా, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న పిల్లలను గుర్తించి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలు పుట్టిన వెంటనే తల్లులు, పిల్లల పేర్లను సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసి, బాలింతలకు అవసరమైన పౌష్టికాహారం, చిన్నారులకు బాలామృతం అందిస్తున్నారు. మూడేళ్లు వచ్చిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చుకుని, ఆరేళ్ల వరకు వారికి కేంద్రాల్లోనే పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తూ పౌష్టికాహారంతో కూడిన భోజనం అందజేస్తున్నారు. అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లు పైబడిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల నుంచి నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా కార్యక్రమం చేపట్టనున్నారు.అంగన్వాడీ కేంద్రాలు 974చిన్నారులు 40,794బాలింతలు 3,543గర్భిణులు 3,307జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల వివరాలు -
కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
మంచిర్యాలటౌన్: కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న హైదరాబాద్లో నిర్వహించనున్న మహాసభ విజయవంతం చేయాలని బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు వేముల సత్యమూర్తి, ఉమ్మ డి జిల్లా చైర్మన్ సిరాజ్ ఉర్ రహమాన్ కోరారు. ఆదివారం ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రెయినేజీల నుంచి డ్యామ్ల నిర్మాణం వరకు వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల్లో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్కు అనుగుణంగా ప్రాధాన్యత గల పనులను కొనసాగించి, లేనివాటిని నిలిపివేసి కాంట్రాక్టర్ల డిపాజిట్లు తిరిగి చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ చైర్మన్లు బి.సుగుణాకర్రావు, కట్కూరి దేవేందర్రెడ్డి, యూ.సురేందర్, స్టేట్ అడ్వైజర్ కె.ప్రభాకర్రెడ్డి, ఆదిలాబాద్ మాజీ చైర్మన్ రామారావు, రవీందర్రావు, మనోజ్, జితేందర్, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థికంగా భారం
మంచిర్యాలటౌన్: ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రోజువారీగా వినియోగించే వంట నూనెలు, ఇతర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెంచుతుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థికంగా భారం పడుతోంది. ఏ ధర పెరిగినా, వాటి ప్రభావం ఇతర వాటిపై పడుతోంది. – రాజమణి, గృహిణి, మంచిర్యాల భరించడం కష్టమేమంచిర్యాలటౌన్: అన్నింటి ధరలు ఒకేసారి పెరుగుతుండడంతో సామాన్యుల నెలవారీ ప్రణాళిక మారుతోంది. ఇప్పటికే పెరిగిన ధరలను భరించడం కష్టంగా మారింది. వీటికితోడు వంట గ్యాస్ ధరలను పెంచుతూ పోతున్నారు. వచ్చే వేతనాలకు, ఖర్చులకు పొంతన లేకుండా పోతుంది. పెరిగిన ధరలతో అప్పులు చేయడం తప్ప వేరే గత్యంతరం లేదు. – సునీత, గృహిణి, మంచిర్యాల -
ఆహార భద్రతా నియమాలు పాటించాలి
మంచిర్యాలక్రైం: జిల్లాలోని హోటళ్లు, స్వీట్ షాపులు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఆహార భద్రత నియమాలు పాటించాలని జిల్లా ఆహార భఽద్రత అధికారి జీ.మహేష్ అన్నారు. ఆదివారం ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార ఉత్పత్తులను తయారు చేయకూడదన్నారు. ఆహార ఉత్పత్తుల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ప్లాస్టి క్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురాము నాయక్, 65 మంది వ్యాపారులు పాల్గొన్నారు. -
సామాన్యులపై పెనుభారం
చెన్నూర్: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపుతోంది. రెండు నెలల కాలంలోనే రెండు సార్లు గ్యాస్ ధరలు పెంచడం దారుణం. పెరిగిన ధరలతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1,016లకు చేరింది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచుతూ పోతే నిరుపేదలు బతకడం కష్టమే. పెంచిన ధరలను తగించాలి. – చిలుముల స్వప్న, గృహిణి, చెన్నూర్ కట్టెలపొయ్యే దిక్కు..చెన్నూర్: కేంద్ర ప్రభుత్వం మాటిమాటికి గ్యాస్ ధరలు పెంచుతూ పోతుంటే కట్టెలపొయ్యే దిక్కయ్యేటట్లు ఉంది. వంట చెరుకు సైతం లభించడం లేదు. ఇలా అయితే పేదలు ఎలా బతికేది. పోయిన నెలలోనే ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచింది. మళ్లీ గ్యాస్ ఽసిలిండర్పై రూ.29 పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది. – పాతర్ల నిర్మల, గృహిణి, చెన్నూర్ -
‘బీజేపీ నాయకులను విమర్శించే హక్కు లేదు’
మంచిర్యాలటౌన్: వారసత్వ రాజకీయాలతో పెద్దపల్లి ఎంపీగా ఎన్నికైన గడ్డం వంశీకృష్ణకు బీజేపీ నాయకులను విమర్శించే నైతిక హక్కు లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్, నగరంలోని రోడ్లపై ఎంపీ ఫొటోను ప్రజలకు చూపిస్తూ ఈయనను ఎప్పుడైనా మంచిర్యాలలో చూశారా, గుర్తు పట్టారా అంటూ అడుగుతూ శనివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం వెంకటేశ్వర్గౌడ్ మాట్లాడుతూ మంచిర్యాల రైల్వేస్టేషన్ ఎదుట ముసుగేసి ఉన్న కాకా వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించకుండా తండ్రీకొడుకులు అవమానించారని విమర్శించారు. తాత విగ్రహాన్ని ఆవిష్కరించలేని ఎంపీ వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి, జోనల్ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్కుమార్, కుర్రె చక్రవర్తి, సత్రం రమేశ్, కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బొట్ల అనిత, బొట్ల సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.


