breaking news
Mancherial District Latest News
-
ఆర్జీయూకేటీ ముగిసిన చర్చలు
బాసర: బాసరలోని ఆర్జీయూకేటీలో 15 మంది విద్యార్థి ప్రతినిధులు, పరిపాలన అధికారులతో ఏబీ–3 కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం చర్చలు జరిగాయి. విద్య, ఇతర సమస్యలపై ఆందోళనలు వ్యక్తం చేశారు. అధికారులు అన్ని అంశాలను ఓపికగా విని రికార్డు చేశారు. విద్యార్థులు ఎక్కువగా నాన్–అకాడమిక్ సమస్యలు లేవనెత్తారు. కొన్ని పాయింట్లు అవగాహన లోపాలు, వాస్తవాలకు విరుద్ధమని పరిపాలన గుర్తించింది. అయినా సానుకూల స్పందనతో పారదర్శక చర్చల ద్వారా ఆరోగ్యకర వాతావరణాన్ని నెలకొల్పుకుంటామని తెలిపారు. 2008 నుంచి అడ్మిషన్లు, టెండర్లు, టెండర్లపై విచారణకు కమిటీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి క్రమబద్ధ పరిష్కారాలు అందిస్తామని స్పష్టం చేశారు. క్యాంపస్ ప్రశాంతంగా ఉండి తరగతులు, పరీక్షలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు.పుకార్లు, ప్రతికూల సందేశాలను నమ్మకూడదని విద్యార్థులు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఓఎస్డీ నియామకంపై దుమారం భైంసా: బాసర ట్రిపుల్ ఐటీలో ఓఎస్డీని పరిపాలనా అధికారిగా కొనసాగించడంపై వివాదం నెలకొంది. ఈ అంశంపై తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ (టీఎస్ఎస్) ప్రతినిధులు సోమవారం వీసీ గోవర్ధన్కు వినతిపత్రం అందజేశారు. ఓఎస్డీ ఎం.మురళీ దర్శన్ను పరిపాలనా అధికారిగా కొనసాగించడంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశా రు. ప్రస్తుతం ఓఎస్డీగా ఉన్న వ్యక్తి పరిపాలనా అధికారిగా వ్యవహరిస్తున్నారని, ఇది ఏ చట్టబద్ధ నిబంధనల ప్రకారం జరిగిందో వెల్లడించాలని కోరారు. పరిపాలనా అధికారిగా నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను బహిరంగంగా వెల్లడించాలని, నియామక ప్రక్రియ, చట్టబద్ధ ఆధారంపై స్పష్టత ఇవ్వాలని, విద్యార్థుల ఫిర్యాదులపై స్వతంత్ర విచారణ జరపాలని, నియామకం నిబంధనలకు విరుద్ధమైతే సంబంధిత అధికారి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. -
గోవింద్నాయక్ అస్తమయం
దండేపల్లి:నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెలే అజ్మీరా గోవింద్నాయక్(75) ఇక లేరు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. 2009 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వయస్సు పైబడడంతో ఆయన స్వగ్రామం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్లో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. నాలుగురోజుల క్రితం జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు రక్తంలో, మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. చికిత్స ప్రారంభించారు. అయితే చికిత్సకు సహకరించకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. సోమవారం సాయంత్రం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య అనుసాయినాయక్, ముగ్గురు కొడుకులు అరవింద్, మిలన్, చందన్ ఉన్నారు. నాలుగుసార్లు పోటీ.. మూడుసార్లు గెలుపు.. గోవింద్నాయక్ ఆరోజుల్లో బీఏ, ఎల్ఎల్బీ చదివాడు. రాజకీయాలకు ముందు హైకోర్టు న్యాయవాదిగా పనిచేశాడు. ప్రజాసేవ చేయాలని 1977లో అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానా పూర్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వేషన్ కావడంతో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అయినా కుంగిపోలేదు. ఎమ్మెల్యేగా ప్రజా సేవా చేయాలని నియోజకవర్గంలో పర్యటిస్తూ, ప్రజలమధ్యే ఉంటూ, ప్రజా సమస్యలపై పోరా డారు. 1985లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎ మ్మెల్యేగా గెలిచారు. 1994లో టీడీపీ నుంచి పోటీచే సి గెలిచారు. 2004లో బీఆర్ఎస్(టీఆర్ఎస్)లో చే రి మూడోసారీ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2009 ఎన్నికలనుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రజల మనిషిగా.. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గోవింద్ నాయక్ ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. ఆయనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో విడదీయని బంధం ఉంది. ఉమ్మడి జిల్లాతోపాటు, రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఒకసారి శాసనసభ కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు. ఈరోజుల్లో ఎన్నికల్లో కోట్లు గుమ్మరిస్తుంటే, గోవింద్నాయక్ మాత్రం మూడుసార్లు ప్రజాభిమానంతోనే గెలుపొందారు. ఈ విషయాన్ని గతంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. నిగర్విగా, సౌమ్యుడిగా, ప్రజల మనిషిగా గుర్తింపు పొందాడు. అయన మరణం ఉమ్మడి జిల్లాకు తీరని లోటని పలువురు విచారం వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం లింగాపూర్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
కాకతీయులనాటి వీరగల్లు శిల్పం గుర్తింపు
నిర్మల్ఖిల్లా: వేల సంవత్సరా లుగా ఆధ్యాత్మిక శోభతో వెలుగుతున్న నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండిరామన్న రాతి గుట్టపై సుమారు 11 నుంచి 13వ శతాబ్దపు కాకతీయుల కాలంనాటి వీరగల్లు శిల్పాన్ని గుర్తించినట్లు జిల్లాకు చెందిన కవి, చరిత్ర పరిశోధకుడు తు మ్మల దేవరావు తెలిపారు. ఈ శిల్పంలో వీరుని చేతిలో ఖడ్గం, డాలు ఉన్నాయి. గండి రామన్నగుట్ట పూర్తిగా పెద్దపెద్ద రాళ్లు, గుహలతో కూడుకుని ఉంటుంది. సముద్ర మట్టానికి సుమారు 300 అడుగుల ఎత్తులో లోతైన గుహలో శివలింగం, నంది, సర్పం, ఉమామహేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. సాధారణంగా యుద్ధంలో మరణించిన వీరుని స్మారకంగానో లేదా గ్రామ రక్షణకోసం పోరాడిన వీరుని గుర్తుగా వీరగల్లు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 16వ శతాబ్దానికి పూర్వమే ఆలయ నిర్మాణంలక్ష్మణచాంద: మండలంలోని బాబాపూర్లో ఉన్న శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం క్రీస్తుశకం 16వ శతాబ్దానికి పూర్వమే నిర్మించారని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్కుమార్, పరిశోధక విద్యార్థి రాజశేఖర్ తెలిపారు. సోమవారం ఆలయాన్ని సందర్శించారు. ఇది త్రికూటాలయమని, కదలీకరణ పద్ధతిలో నిర్మాణం జరిగిందన్నారు. ఆలయ ప్రాంగణంలో కాలభైరవునిగా కొలువబడుతున్న వీరగల్లు శిల్పులచే అద్భుతంగా చెక్కబడిందన్నారు. ఇది వీరుని స్మారకంగా శిల్పులు చెక్కే విగ్రహమన్నారు. -
పొదుపుతో భరోసా..
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు మన దైనందిన జీవితంపై ఎంతటి ప్రభావం చూపగలవో ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్–ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా యుద్ధ సంక్షోభంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతూ ఇంధన వనరుల సరఫరాపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పరిమిత వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో మళ్లీ గుర్తు చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో సహజవనరుల స్థితిగతులు, వినియోగంపై కథనం.నిర్మల్ఖిల్లా/బోథ్: ఇటీవల గ్యాస్ కొరత వస్తుందనే వార్తలు వ్యాపించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అప్రమత్తమయ్యారు. గ్యాస్ గోదాముల వద్ద వి నియోగదారులు బారులు తీరుతున్నారు. కేవలం సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే ముందుచూపు ప్రదర్శించడం కాకుండా, రోజువారీ జీవితంలోనే పొదుపు, మిత వినియోగం వంటి అలవాట్లను అలవరుచుకోవడం అవసరమని ప్రస్తుత పరిస్థితులు పాఠాలు నేర్పుతున్నాయి. పరిమితంగా వాడితేనే వనరులు ఎక్కువకాలం నిలు స్తాయని సందేశం మనకు చేరవేస్తున్నాయి. దుబారా తగ్గితేనే.. ప్రస్తుత జీవన విధానంలో గ్యాస్, విద్యుత్, పెట్రోల్ వంటి వనరులు అనివార్యంగా మారాయి. వంటగదిలో గ్యాస్, ప్రయాణానికి పెట్రోలు, దైనందిన పనులకు విద్యుత్ ఇవన్నీ మన జీవితంలో భాగమయ్యాయి. కానీ అవసరానికి మించి వినియోగించడం వల్ల వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. గ్యాస్ వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అవసరం లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయడం, చిన్న దూరాలకు వాహనాలు వినియోగించకుండా నడకకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి చిన్నచిన్న చర్యలు కూడా పెద్ద మార్పునకు దారితీస్తాయి. వంటగ్యాస్ పొదుపు చిట్కాలివే.. ఉమ్మడి జిల్లా అటవీ విస్తీర్ణం (చదరపు కిలోమీటర్లలో) జిల్లా అటవీ విస్తీర్ణం కుమురంభీం 1,778.26 మంచిర్యాల 1,564.93 ఆదిలాబాద్ 1,145.76 నిర్మల్ 1,085.02 గ్యాస్ కనెక్షన్ల వివరాలు (2025 వరకు) జిల్లా గ్యాస్ కనెక్షన్లు ఆదిలాబాద్ 2,82,200 కుమురంభీం 1,90,000 మంచిర్యాల 3,45,200 నిర్మల్ 2,69,300 పెట్రోల్, డీజిల్ వాహనాల గణాంకాలు జిల్లా వాహనాలు నిర్మల్ 10,194 ఆదిలాబాద్ 9,623 కుమురంభీం 6,626 మంచిర్యాల 11,760ప్రస్తుత తరమే వనరులను అధికంగా వినియోగిస్తే రాబోయే తరాలకు వాటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ప్రకృతి వనరులను సంరక్షించడం ప్రతీ పౌరుడు బాధ్యతగా భావించాలి. పొదుపు, మిత వినియోగం, సంరక్షణ అనే మూడు సూత్రాలను పాటిస్తేనే భవిష్యత్ తరాలకు ఈ వనరులను అందించగలుగుతాం. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
చెన్నూర్: జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎస్టీపీపీ ఈడీ చిరంజీవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీపీపీ సీఎంవో ఏఐ అధ్యక్షుడు పంతులా మాట్లాడుతూ సింగరేణి అధికారుల జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు కోలిండియా మాదిరిగా ఇవ్వాలని, సీఐఎల్ మాదిరిగా ప్రయోజనాలు కల్పించాలని, పదోన్నతులు కల్పించాలని, క్రమశిక్షణ చర్యల ప్రక్రియ సరైన పద్దతిలో జరగడంలేదని, దానిని సరిచేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో జీఎంలు నర్సింహారావు, మదన్మోహన్, డీజీఎంలు శివప్రసాద్, మహేందర్, శ్రీధర్, వేణుగోపాల్, ఎస్ఈ రాము, సీఎంవోఏఐ వైస్ ప్రెసిడెంట్ జనగామ శ్రీనివాస్, అప్పారావు, జాయింట్ సెక్రెటరీ మోహన్సింగ్, ఎస్వోటూ ఈడీ వెంకటయ్య, రక్షణాధికారి పులి సురేశ్ పాల్గొన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి చెన్నూర్: రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఎస్టీపీపీ ఈడీ సీహెచ్.చిరంజీవి అన్నారు. సోమవారం ఎస్టీపీపీలో పవర్మేక్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జీఎంలు మదన్మోహన్, నర్సింహారావు, పీఎంపీఎల్ హెడ్ అఖిల్కపూర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం గొప్ప మానవతా సేవ అని అభినందించారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాల్లో ఉద్యోగులు, కార్మికులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. శిబిరంలో 70 యూనిట్ల రక్తం సేకరించారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ సోసైటీ జిల్లా జనరల్ సెక్రెటరీ చందూరి మహేందర్, ఎస్టీపీపీ వైద్యులు జానకి, అధికారులు పంతులా, కిరణ్బాబు, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలు
తాంసి: కరంజి(టి)లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలు సోమవారం ముగిశాయి. జైశ్రీరాం యూత్ ఆధ్వర్యంలో నితిన్ స్మారకార్థం నిర్వహించిన పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన 17 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్, సిద్దిపేట జట్లు తలపడగా హైదరాబాద్ జట్టు గెలుపొందింది. విజేత జట్టుకు ప్రథమ బహుమతి సర్పంచ్ కల్చప్ యాదవ్ రూ.31 వేల నగదు, ద్వితీయ స్థానంలో నిలిచిన సిద్దిపేట జట్టుకు కప్పల గజానన్ రూ.21వేల నగదు, తృతీయస్థానంలో నిలిచిన మాండ్వి జట్టుకు మాజీ సర్పంచ్ నరేందర్ యాదవ్ రూ.11వేల నగదుతో పాటు టోర్నీ నిర్వాహకులు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు దేవారెడ్డి, రెడ్డివార్ రమేశ్, గ్రామ యువకులు పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలిఉట్నూర్రూరల్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. సోమవారం ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉట్నూర్ మండలం ఘనపూర్కు చెందిన ఆత్రం లోకేష్ పైచదువుల నిమిత్తం ల్యాప్టాప్ మంజూరు చేయాలని, సిర్పూర్కు చెందిన గేడం గజానంద్ ఏకలవ్య పాఠశాలలో స్లీపర్ ఉద్యోగం ఇప్పించాలని, సిరికొండకు చెందిన రామారావు సోలార్ పంపుసెట్ మంజూరు చేయాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మం జూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలపై అర్జీలు అందజేశారు. -
ఖానాపూర్లో విజిలెన్స్ తనిఖీలు
● 12 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం ● 10 మందిపై 6ఏ కేసు నమోదు ఖానాపూర్: గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య దుకాణాల్లో విని యోగిస్తున్నారనే సమాచారం మేరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం ఖానాపూర్లో తనిఖీలు నిర్వహించారు. 10 దుకాణాల్లో 12 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని 10 మందిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శేఖర్రెడ్డి తెలిపారు. గృహాలకు సరఫరా చేసే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని, దుకాణ దారులు తప్పనిసరిగా లైసెన్స్ ఉన్న కమర్షియల్ సిలిండర్లనే వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై రాహెల్ గైక్వాడ్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ కార్తీక్రెడ్డి పాల్గొన్నారు. చిట్ఫండ్ చైర్మన్ రిమాండ్ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని చిట్ఫండ్ చైర్మ న్ పెరాల శ్రీనివాస్ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఈ చిట్ఫండ్లో చిట్టీలు వేసి గడువు ముగిసినప్పటికీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, దాదాపు 10 మంది వరకు బాధితులు ఆయనపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వీరికి రూ.కోటి వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. -
‘మహా’ ఇసుక ముఠా అరెస్ట్
భైంసాటౌన్: మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి నిర్మల్ జిల్లాకు ఇసుక అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణాపై తనిఖీల్లో భాగంగా ఆదివారం ధర్మాబాద్ నుంచి బాసర–నిజామాబాద్ వైపు ఇసుక తరలిస్తున్న రెండు లారీలు, ఒక ఐషర్ను పట్టుకున్నట్లు చెప్పారు. వీటిలో రూ.1,01,400 విలువైన 78 టన్నుల ఇసుక ఉన్నట్లు పేర్కొన్నారు. జేసీబీతోపాటు బైక్ స్వాధీనం చేసుకుని 13 మందిపై కేసు నమోదు చేయగా ప్రధాన నిందితుడు షేక్ రవూఫ్తోపాటు ధర్మాబాద్కు చెందిన షేక్ జావిద్, లక్ష్మణ్, షేక్ ఇర్ఫాన్, రాజస్థాన్లోని అల్వార్కు చెందిన ఇలియాస్ ఖాన్ను రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. రవూఫ్పై ఇదివరకే బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులు, భైంసాటౌన్ పరిధిలో ఒక కేసు, నిర్మల్ టౌన్ పరిధిలో దోపిడీ కేసు, ధర్మాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం, ఇతర తీవ్రమైన నేరాల కేసులు 4 నమోదైనట్లు తెలిపారు. ఏడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత లోకేశ్వరం: మండలంలోని సాథ్గాం సుద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను సోమవారం పట్టుకున్నట్లు తహసీల్దార్ భోజన్న తెలిపారు. ఒక్కో ట్రాక్టర్కు రూ.5 వేల జరిమానా విధించారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత భైంసారూరల్: మండలంలోని వానల్పాడ్ పరిసరా లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు రెవెన్యూఇన్స్పెక్టార్ దత్తాత్రేయ తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. -
స్పెషల్ రైళ్లు రెగ్యులర్ అయ్యేదెప్పుడో?
బెల్లంపల్లి: రైల్వేశాఖ వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టిన స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఏళ్లుగడుస్తున్నా రెగ్యులర్కు నోచుకోవడం లేదు. కాజీపేట– బల్లార్షా, పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేమార్గాల్లో పలు స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఆ మార్గాల్లో ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తున్నా రైళ్లను రెగ్యులర్ చేయడంలో రైల్వేశాఖ తీవ్ర కాలయాపన చేస్తోంది. ఈప్రాంతం నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రులు, ఎంపీలు పట్టింపులేని ధోరణిని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ద.మ రైల్వే జోన్పరిధిలో ఏళ్ల నుంచి ప్రత్యేకంగా నడుస్తున్న వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఇటీవల రెగ్యులర్ వీక్లీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నాంపల్లి (హైదరాబాద్) నుంచి కన్యాకుమారి వయా నల్లగొండ, కాచిగూడ నుంచి తూతుకుడి వయా మహబూబ్నగర్, చర్లపల్లి, నుంచి షాలిమార్ వయా కాజీపేట వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును అమృత్ భారత్గా మార్చి వచ్చే ఏప్రిల్ మొదటివారం నుంచి నడపనున్నారు. కానీ కాజీపేట–బల్లార్షా, పెద్దపల్లి–నిజామాబాద్ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లకు మాత్రం మోక్షం లభించడం లేదు. కాజీపేట మార్గంలో నడుస్తున్న ప్రత్యేక రైళ్లు ఇవే.. వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ బల్లార్షా మార్గంలో ప్రతీసారి నిరాశే రైళ్లకు సంబంధించిన ప్రతీ అంశంలోనూ కాజీపేట–బల్లార్షా మార్గంలో ప్రతిసారి రైల్వే శాఖ తీవ్ర వివక్షత చూపుతోందనే విమర్శలు ఉన్నాయి. సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టకపోవడం, ముఖ్యమైన స్టేషన్లలో పలు రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించకపోవడం, వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రెగ్యులర్ చేయకపోవడం తదితర విషయాల్లో అన్యాయం చేస్తోందనే ప్రయాణికుల నుంచి వ్యక్తమవుతోంది. తూర్పు కోస్తా రైల్వేజోన్ పరిధిలో ఇటీవల పలు వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రైల్వే శాఖ ద.మ రైల్వే జోన్ పరిధిలో ఉన్న కాజీపేట–బల్లార్షా, పెద్దపల్లి నిజామాబాద్ మార్గాలను మరోమారు విస్మరించడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికై నా ఆయా మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రెగ్యులర్ చేయడానికి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
పదో శతాబ్దపు పురాతన ఆలయం
కడెం: మండలంలోని కల్లెడలో క్రీస్తుశకం పదో శతా బ్దానికి చెందిన ఓ పురాతన ఆలయ స్తంభాలను గుర్తించినట్లు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్కుమార్ తెలిపారు. మల్లన్న దేవుని మందిరంలో అద్భుతంగా తీర్చిదిద్దిన రెండు రాతి స్తంభాలు, ఆలయ ప్రాంగణంలో ఒక రాతి దూలాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. రెండు ఎత్తైన, వెడల్పైన, దృఢమైన రాతి ద్వారాల శేరెలపై అందంగా చెక్కిన శైవ ద్వార పాలకులున్నట్లు, ఒక్కొక్క ద్వార పాలకునికి సేవకోసం ఒక్కో చామరధారిణిని చెక్కిన శిల్పాలు రమణీయంగా ఉన్నట్లు తెలిపారు. అవి చాళుక్య శైలికి చెందిన శిల్పాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో వెయ్యేళ్ల క్రితం చాళుక్యుల పరిపాలన అనేక ఏళ్లు వర్థిల్లిందని ఆయన తెలిపారు. అక్కడ పూర్వం విశాలమైన ఆలయం ఉండేదని తెలుస్తోందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ విశ్లేషించారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
నేటి నుంచి ఒంటిపూట బడి
నిర్మల్ఖిల్లా/మంచిర్యాలఅర్బన్: ప్రస్తుత వేసవికాలంలో రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు నడపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. తరగతులు ముగిశాక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టించి ఇంటికి పంపనున్నారు. పదోతరగతి పరీక్ష కేంద్రాలు ఉన్నచోట మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు ఎండబారిన పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు అవసరం వేసవిలో సరైన మోతాదులో నీరు తాగకపోతే తల తిరగడం, వాంతులు, అలసట వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారులు తరచూ నీరుతాగడం, తేలికపాటి ఆహా రం తీసుకోవడం అలవాటు చేయాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే సందర్భాల్లో పిల్లలపై పర్యవేక్షణ త గ్గే అవకాశముండటంతో మరింత జాగ్రత్త అవసరమని పేర్కొంటున్నారు. విద్యార్థుల తలకు రుమాలు, టోపీ లేదా గొడుగు వాడేలా చూడాలని చెబు తున్నారు. మధ్యాహ్నం బడి ముగియడంతో పిల్ల లు వాగులు, చెరువులు, వ్యవసాయ బావుల్లో స్నా నాలు చేసేందుకు పంపించొద్దని పేర్కొంటున్నారు. చదువులకు వినియోగించుకోవాలి మధ్యాహ్నం తర్వాత పిల్లలు ఖాళీగా ఉండే సమయాన్ని చదువులకు వినియోగించుకోవాలి. హోంవర్క్ చేయించడం, పరీక్షలకు సిద్ధం చేయడంతోపాటు క్రాఫ్ట్ పనులు, డ్రాయింగ్, పెయింటింగ్ నేర్చుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండోర్ గేమ్స్, పజిల్స్ వంటి మేధస్సును పెంపొందించే ఆటలపై ఆసక్తి పెంచాలని సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేసి కథల పుస్తకాలు చదివే అలవాటు పెంచాలని చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వివరాలు జిల్లా సంఖ్య నిర్మల్ 1,049 ఆదిలాబాద్ 1,449 మంచిర్యాల 1,051 కుమరంభీమ్ 1,204 మొత్తం 4,753 మొత్తం విద్యార్థులు: సుమారు 5.12 లక్షలు -
తాత మందలించాడని కోపంతో శనగ పంట దగ్ధం
సాత్నాల: జులాయిగా తిరగొద్దు, మద్యం మానేయాలని తాత మందలించాడని కోపంతో మనుమడు శనగ పంటను దగ్ధం చేశాడు. భోరజ్ మండలం పెండల్వాడ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై పవర్ గౌతమ్ కథనం ప్రకారం.. పెండల్వాడ గ్రామానికి చెందిన లాంగ్డే ప్రభాకర్కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇందులో చిన్నవాడు సంతోష్ అతని వద్ద ఉంటున్నాడు. సంతోష్ కుమారుడు సునీల్ మద్యానికి బానిసై, జులాయిగా తిరుగుతున్నాడు. తాత ప్రభాకర్ మందలించడంతో మనుమడు సునీల్ కోపం పెంచుకున్నాడు. వీరికి రెండెకరాల పొలం ఉండగా, ఈ ఏడాది మరో 7 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. సరిగ్గా దిగుబడి రాకపోయేసరికి 4 ఎకరాల్లో శనగ వేయగా కోతదశకు రాగా, కోసి కుప్పలుగా వేశారు. ఆదివారం శనగ దగ్ధమై కనిపించచడంతో ప్రభాకర్ లబోదిబోమన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సునీల్ను విచారించగా నేరం అంగీకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. కాలిపోయిన శనగ పంట విలువ దాదాపు రూ.2 లక్షలు ఉంటుంది. -
ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
ఒంటిపూట బడి వేళ చిన్నారులపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బడికి వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ ఇవ్వాలి. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాక ఎండలో ఆడకుండా చూడాలి. నీటి పరిమాణం ఉన్న పండ్లు అందించాలి. వడదెబ్బ లక్షణాలు జ్వరం, అలసట, వాంతులు ఉంటే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ రవి బాశెట్టి, ఎండీ జనరల్ మెడిసిన్, నిర్మల్ అప్రమత్తంగా ఉండాలి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఎండ ప్రతాపం తెలియని చిన్నారులు ఆటల్లో మునిగి తేలేందుకు ఉత్సాహం చూపుతారు. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూడాలి. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను రివైజ్ చేసుకోవడం.. హోంవర్క్ చేసేలా చూడాలి. సెల్ఫోన్కు దూరంగా ఉంచడం మంచిది. – యాదయ్య, డీఈవో, మంచిర్యాల -
జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న ‘బక్కి’
బాసర: బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని ఆదివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధానార్చకులు సంజీ పూజారి ఆయన్ను సత్కరించి ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో విజయ రామారావు, తహసీల్దార్ పవన్ చంద్ర, ఏఈఓ శ్రీనివాస్, ఎస్హెచ్వో కిరణ్, ఎస్సై నవనీత్రెడ్డి, ఆలయ పీఆర్వో రామారావు, సిబ్బంది ఉన్నారు. ఇసుక తరలిస్తున్న వాహనాలు పట్టివేతబాసర: బాసరలో ఆదివారం రెండు లారీలు, ఐచర్ వాహనాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో బాసర చెక్పోస్ట్ నాయగావ్ వెళ్లే రూట్ వద్ద ఎస్హెచ్ఓ సీఐ కిరణ్ ఆధ్వర్యంలో వాహనాలను పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో సీఐ కిరణ్ తెలిపారు. లోకేశ్వరం: మండలంలోని సాథ్గాం శివారు ప్రాంతం సుద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను ఆదివారం పట్టుకున్నట్లు జీపీవో భీమేశ్ తెలిపారు. ఇసుకను ట్రాక్టర్లో ధర్మోర వైపు తరలిస్తుండగా మండల కేంద్రంలో పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. మహిళా రైతు కూలీ మృతిచెన్నూర్: పొలం వద్ద పనిచేస్తుండగా రైతు కూలీ ఆదివారం మృతిచెందింది. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. జైపూర్ మండలం పౌనూర్కి చెందిన అఖిల(27) అదే గ్రామానికి చెందిన మేడగోని శ్యామ్కుమార్తో 2024లో వివాహామైంది. ఉదయం గ్రామ శివారులో వరిలో కలుపు తీయడానికి కూలీ పనిగా వెళ్లింది. అక్కడ పని చేస్తుండగా ఒడ్డు మీద కరెంట్ బోరు మోటారు నీళ్లు పోసే ఇనుప పైపు తాకి ఆకస్మాతుగా పడిపోయి స్పృహా కోల్పోయింది. గమనించిన తోటి కూలీలు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు అఖిలకు విద్యుత్ షాక్ తగిలిందా, మరేదైనా వేరే కారణంతో చనిపోయిందా అనేది సమగ్ర విచారణ చేయాలని తండ్రి కొమురయ్య కోరాడు. ఈమేరకు తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
దోపిడీకి పాల్పడిన ఇద్దరి రిమాండ్
ఆదిలాబాద్: సోడా వ్యాపారిపై దాడి చేసి నగదు దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. టూ టౌన్లో ఆదివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఈనెల 11న మధ్యాహ్నం పట్టణంలోని తిరుపెల్లి కాలనీలో కనకదుర్గ వైన్స్ సమీపంలో సోడా బండి నడుపుతున్న చిత్తల్వార్ దీపక్ వద్దకు మహాలక్ష్మి వాడకు చెందిన దండేవర్ అనికేష్, పిలివర్ రాజేష్ వచ్చి సోడా తాగారు. డబ్బులు అడగగా, మా ఏరియాలోకి వచ్చి వ్యాపారం చేస్తూ మమ్మల్నే డబ్బులు అడుగుతావా అని బెదిరించారు. బాధితుడిపై దాడి చేసి గల్లా పెట్టెలోని రూ.1200 నగదు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక సెల్ఫోన్, రూ.500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు పీర్ సింగ్, విష్ణు ప్రకాశ్, సిబ్బంది దత్తు, క్రాంతి పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి వుషూ పోటీలు ప్రారంభం
భైంసాటౌన్: పట్టణంలోని మున్నూరుకాపు సంఘ భవనంలో ఆదివారం అస్మిత ఖేలో ఇండియా మహిళల వుషూ రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే పి.రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో మానసిక, శారీరక ధృడత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం అలవడుతుందన్నారు. మహిళలు సైతం క్రీడల్లో ముందుండాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు భైంసా వేదిక కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ అమేచ్యూర్ వుషూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్రాజ్, రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ ఒమర్, జిల్లా అధ్యక్షులు లోలం రాజశ్రీ, కార్యదర్శి జ్ఞానతేజ, కోచ్ శ్రీరాముల సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
నేడు పవిత్ర షబ్బెఖదర్
నెన్నెల: ముస్లింల పవిత్రమాసం రంజాన్ నెలలో 26వ రోజున అల్లా అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్ అవతరించింది. రంజాన్ నెల ప్రారంభమై సోమవారానికి 26వ రోజు, ఈరోజే అవతరించింది. దీన్నే షబ్బెఖదర్గా పిలుస్తారు. ఆధ్యాత్మిక బోధనలతో ఈ మహాగ్రంథం మార్గనిర్దేశం చేస్తుందని నెన్నెల జామా మసీదు మౌలానా షగీర్ అహ్మద్ బర్కద్వా చెప్పారు. ఖురాన్ సన్మార్గ బాటలో పయనించడానికి ఉపకరిస్తుందని వివరించారు. ఖురాన్ మహాగ్రంఽథాన్ని కంఠస్తం చేసేవారి సంఖ్య భారీగా ఉండటం దైవ సంకల్పానికి నిదర్శమన్నారు. చరిత్ర పుటల్లో ఖురాన్ అవతరించి సుమారు 1450 ఏళ్లు దాటుతున్నా అక్షరం కూడా మార్పు చెందలేదన్నారు. ఖురాన్లో 30 ఫారాలు(పాఠాలు), 114 సూరాలు, 6666 వాక్యాలు ఉన్నాయని చెప్పారు. అశాంతి రాజ్యమేలిన నేపథ్యం.. అరబ్బుల హయాంలో అశాంతి రాజ్యమేలిన నేపథ్యమే దివ్య ఖురాన్ అవతరణకు మూలమని మౌ లానా షగీర్ అహ్మద్ బర్కద్వా తెలిపారు. అప్పట్లో ఒకరి హక్కులు మరొకరు కాలరాస్తూ పరస్పరం దూషించుకుంటూ దాడులకు పాల్పడుతూ గడిపేవారని వివరించారు. మహ్మద్ ప్రవక్త చలించిపోయి మానసిక ఉపశమనం కోసం ‘ఘారెహిర’అనే గుహలో ఒంటరిగా కూర్చొని అల్లాను స్మరించుకునేవారని, ఒకరోజు అల్లాహ్ తన దూత జిబ్రాయిల్ ద్వారా మహ్మద్ ప్రవక్తకు చేరవేసిన సందేశం చదివి ప్రవక్త మనస్సు ఆలోచనతో ప్రపంచ గమనాన్ని చుట్టి వచ్చిందన్నారు. ఆ సందేశాలకు విస్తృత ప్రచారం కలిగిస్తే ప్రజలకు చెడు నుంచి విముక్తి కలిగించి సన్మార్గంలో నడపొచ్చని ఆయన ప్రగాఢంగా విశ్వసించారని చెప్పారు. వాటి నుంచి అల్లాహ్ తన సందేశం వినిపించేవారని, అలా నలభయ్యే ఏటా నుంచి దశలవారీగా 30 ఏళ్ల పాటు అల్లాహ్ అందించిన భిన్న సందేశాల సమూహారమే ఖురాన్ మహాగ్రంథం. ప్రతి ముస్లిం విధిగా వజూ చేసి ఆపై ఖురాన్ చేత పట్టుకొని ఖిబ్లా(పడమర) వైపు తిరిగి దైవనామ స్మరణతో చదవాలని వివరించారు. -
దుఃఖాన్ని దిగమింగుకుని నేత్రదానం
బెల్లంపల్లి: గుండెపోటుకు గురై తండ్రి అకాల మృతిచెందగా, ఆ కుటుంబం పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని ఆయన రెండు కళ్లను దానం చేసి మానవత్వాన్ని చాటుకుంది. ఆ రెండుకళ్లతో మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించడానికి దోహదపడ్డారు. బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాకు చెందిన కొట్టే సత్యప్రకాశ్ (68) ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. భార్య నాగమణి, కుమారుడు నవీన్, కుటుంబ సభ్యులు ఆయన కళ్లను దానం చేయడానికి ముందుకు వచ్చారు. జనహిత సేవా సమితిలో సభ్యుడైన నవీన్.. సదాశయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్.లింగమూర్తి సౌజన్యంతో మృతుడు రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్, ఐ బ్యాంక్ సిబ్బంది ప్రదీప్ వచ్చి సేకరించి సర్టిఫికేట్ అందజేశారు. జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడేపు సతీశ్, సహాయ కార్యదర్శి పెద్ది వినయ్కుమార్, సభ్యుడు సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీలో ప్రాజెక్ట్ ఎక్స్పో
బాసర: ఆర్జీయూకేటీలో అంతఃప్రజ్ఞ 2కే26 కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ఆదివారం కెమి కల్, సివిల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ విభాగాలు సంయుక్తంగా ప్రాజెక్ట్ ఎక్స్పో నిర్వహించాయి. విద్యార్థులు పలు సృజనాత్మక ప్రా జెక్టులను ప్రదర్శించారు. వీసీ, ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శన్ పరిశీలించారు. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి పర్యావరణానికి అనుకూలమైన శుభ్రపర్చే పదార్థాన్ని తయారు చేసే హస్క్ ఆధారిత డిటర్జెంట్, బయోప్లాస్టిక్, తక్కువ ఖర్చుతో నీటిని శుద్ధి చేసే వాటర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. బైమెటాలిక్ స్ట్రిప్, సన్ఫ్లవర్ ఆధారిత సోలార్ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ ద్వారా పునరుత్పత్తి శక్తిని వినియోగం, భవనాల ఎత్తు పెంచే ఆధునిక హైడ్రాలిక్ జాక్ సిస్టమ్, ఆటోమొబైల్ మోడళ్లు ఇంజినీరింగ్ నమూనాలను ప్రదర్శించారు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఎస్.వినయ్కుమార్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఎ.కిరణ్ కుమార్, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఎస్.కె. ఖలీల్, ఫ్యాకల్టీ కన్వీనర్ జంగలే స్వప్నిల్, అధ్యాపకులు ఉన్నారు. -
దివ్యాంగులకు ఉపకరణాలు
మంచిర్యాలటౌన్: దివ్యాంగులకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఉపకరణాలను పంపిణీ చేసేందుకు అర్హులైన వారి నుంచి ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించింది. శారీరక వైకల్యంతో కొందరు సొంతంగా నడవలేని వారు ట్రై సైకిళ్లపై కూర్చుని ఎక్కడికై నా ప్రయాణం చేసేందుకు అవకాశం ఉండగా, చేతులు, కాళ్లు లేని వారి కోసం బ్యాటరీతో నడిచే వీల్చైర్లను అందించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. దివ్యాంగులు ఆర్థికంగా ఎదిగేందుకు సొంతంగా ఉపాధి పొందాలనుకునే వారికి సైతం పెట్రోలు ఖర్చు లేకుండా బ్యాటరీతో నడిచే మొబైల్ బిజినెస్ ట్రైసైకిళ్లు, మినీ ట్రేడింగ్ ఆటోలు, డిగ్రీ విద్యార్థులు, ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారికి అవసరమైన ల్యాప్టాప్లను దివ్యాంగుల సంక్షేమ శాఖ, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు చేరుతున్న ఉపకరణాలు ఉపకరణాలకోసం ఇప్పటికే పలువురు అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాకు 45 స్కూటీలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 40 మాత్రమే వచ్చాయి. మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్లు 18, ల్యాప్టాప్లు 14 జిల్లాకు చేరుకున్నాయి. బ్యాటరీ వీల్చైర్లు 14, హైబ్రిడ్ అటాచ్మెంట్ వీల్చైర్లు 5, రెండు 5జి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు 12 రావాల్సి ఉంది. ప్రస్తుతం వచ్చిన స్కూటీలు, ట్రైసైకిళ్లను సమీకృత కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచారు. మిగతా ఉపకరణాలు వచ్చేంత వరకు వేచి ఉండకుండా వచ్చిన వాటిని అర్హులైన వారికి పంపిణీ చేయాలని దివ్యాంగులు కోరుతున్నారు.జిల్లాకు కేటాయించిన ఉపకరణాలు స్కూటీలు 45 మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్లు 18 బ్యాటరీ వీల్చైర్లు 14 హైబ్రిడ్ అటాచ్మెంట్ వీల్చైర్లు 5 బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో 1 ల్యాప్టాప్ (డిగ్రీ విద్యార్థులు) 7 ల్యాప్టాప్ (హయ్యర్ టెక్నికల్ విద్య) 7 ట్యాబ్లు 12 5జీ స్మార్ట్ ఫోన్లు 2 -
‘ప్రగతి ప్రణాళిక’పై నిర్లక్ష్యం వద్దు
చెన్నూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’పై అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని పలు వా ర్డుల్లో పర్యటించారు. వాటర్ ట్యాంకుల నిర్మాణాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కమిషనర్ మురళీకృష్ణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరా ల మాదిరి వీధులు శుభ్రంగా ఉంచాలన్నారు. డ్రెయినేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. సకాలంలో ఇంటిపన్ను చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలన్నారు. వార్డుల పరిశుభ్రత మున్సిపల్ అధికా రుల బాధ్యత అన్నారు. ఎక్కడైనా పారిశుధ్యం లోపి స్తే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రగతి ప్రణాళిక 8 వార్డుల్లో పూర్తి అయ్యిందని, మరో 10 వార్డుల్లో చేపట్టాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, వైస్ చైర్మన్ వినయ్కుమార్, కౌన్సిలర్లు నజ్మాఅమేర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
చెరువుల పునరుజ్జీవమే ప్రభుత్వ లక్ష్యం
మంచిర్యాలటౌన్: జిల్లాలోని చెరువుల పునరుజ్జీవ మే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాముని చెరువు, నస్పూర్లోని చెరువు పునరుజ్జీవ పనులకు ఆదివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుతో కలిసి శంకుస్థాపన చేశా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అమృత్ 2.0 పథకం కింద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాముని చెరువు, నస్పూరు పరిధిలోని చెరువుల పునరుజ్జీవ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల నగరం, లక్సెట్టిపేట్ మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక వసతులు కల్పించేలా పనులను చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అవసరమని, అధికారులు సైతం ప్రజలను సమస్యలపై అడిగి తెలుసుకుని, పరిష్కారం దిశగా పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాలక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల అభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాలలో చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమృత్ పథకం ద్వారా రూ.3.14 కోట్లతో చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పట్టణంలో ఇప్పటికే రోడ్డువెడల్పు పనులు పూర్తి కాగా రానున్న రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు తొలగిపోనున్నాయన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్పర్సన్ రాజేశ్వరి, కమిషనర్ విజయ్కుమార్, తహసీల్దార్ దిలీప్కుమార్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ నాయకులపై కుట్రపూరితంగా కేసులు
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో అరెస్టయి ప్రస్తుతం బెయిల్పై ఉన్న మాజీ ఎ మ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ షరతుల ప్రకా రం ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్కు వచ్చి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులపై కుట్ర పూరితంగా కేసులు నమోదు చేశారని, ఎన్ని కల సమయంలో తమ కార్యకర్తలెవరూ దాడులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, చట్టంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. ఆయన వెంట బీ ఆర్ఎస్ నాయకులు మూల రాజిరెడ్డి, మేలిపెల్లి సంపత్, సుదర్శన్గౌడ్, తదితరులు ఉన్నారు. -
అంగన్వాడీ పటిష్టతలో సర్పంచులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పల్లెల్లోని అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థ మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంలో భాగంగా సర్పంచులు విశేష పాత్ర పోషిస్తున్నారు. గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించే బాధ్యతలు సర్పంచులకు అప్పగించా రు. అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేయడం, వి ద్యార్థులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా తీ సుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయంలో భాగంగా ఇప్పటికే విడుదలైన ఉత్తర్వుల మేరకు కమిటీలు ఏర్పాటయ్యాయి. 11 మంది సభ్యులతో కూడిన కమిటీకి చైర్మన్గా సర్పంచ్, కన్వీనర్గా అంగన్వాడీ ఉపాధ్యాయురాలు, స భ్యులుగా సామాన్య శాస్త్రం భోధించే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, ఒక విశ్రాంత ఉద్యోగి, ఒక ఏఎన్ఎం, చిన్నారుల తల్లులు, గర్భిణులు ఉంటారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలోని మంచిర్యాల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 244, బెల్లంపల్లి అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్లో 282, లక్సెట్టిపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్లో 203, చెన్నూర్ రూ రల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 245తో కలిపి మొ త్తంగా 974 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో అర్బన్ ప్రాంతాల్లో 526, రూరల్ ప్రాంతాల్లో 446 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలను సర్పంచులు పర్యవేక్షించనున్నారు. నిరంతర పర్యవేక్షణ.. అంగన్వాడీ కేంద్రాలపై సర్పంచుల పర్యవేక్షణ ఇకపై నిరంతరాయంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి కేంద్రాలకు ప్రతీ నెల సరఫరా అవుతున్న సరుకులు వివరాలు, చిన్నారులకు సకాలంలో పౌష్టికాహారం అందేలా చూడటంపై సర్పంచులు పర్యవేక్షించనున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు అందించే భోజనం నాణ్యతనూ తనిఖీ చేసే అధికారం ఉంది. పిల్లలు, కిషోర బాలికలు, బాలింతలు, గర్భిణులతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంపై అవగాహన కల్పించడంలో కూడా వీరి పాత్ర ఉంటుంది. అంగన్వాడీ కేంద్రానికి ప్రతీనెల వచ్చే రూ.లక్షల విలువ చేసే సరుకులు పక్కదారి పట్టకుండా, అంగన్వాడీ వ్యవస్థ పకడ్బందీగా సాగేలా పర్యవేక్షించనున్నారు. బాలామృతం, పాలు, గుడ్లు, బియ్యం, కందిపప్పు, తదితర పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలను లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూడనున్నారు. చిన్నారుల భద్రత, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం వంటి బాధ్యతలను కూడా సర్పంచులు చూడనున్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీలు ప్రతీ నెల సమావేశమై నివేదికను తయారుచేసి ఉన్నతాధికారులకు పంపించి కేంద్ర బాగోగులకు చర్యలు చేపట్టనున్నారు.సర్పంచులకు బాధ్యతలుగ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా ఎన్నికై న సర్పంచులకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. సర్పంచులు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ ప్రతీనెల కమిటీ సభ్యులతో సమావేశమై కేంద్రాలను పటిష్టం చేసేలా చర్యలు చేపడతాం. – రౌఫ్ఖాన్, జిల్లా సంక్షేమాధికారి -
ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివా రం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెయి నీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ఖాన్, డీపీఆర్వో కృష్ణమూర్తి, దేవాపూర్ సిమెంట్ కంపెనీ యూనియన్ అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్రావు, తహసీల్దార్ రఫతుల్లా, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేశ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
ఉగాది కవి సమ్మేళనం
మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్లో ఆదివారం సాహితీ సంరక్షణ సమి తి ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ ఉగాదికి స్వా గతం పలుకుతూ కవి సమ్మేళనం నిర్వహించా రు. ఈ సందర్భంగా కవులు పద్యవచనము, గే యము ద్వారా కవితాగానం చేశారు. పర అంటే బయట, ఉన్నతి అభవ అంటే లయము, అంతము మనలోని అహంకారము ద్వేషము లోభము, నెగిటివ్ భాగాలను అంతమయ్యే కా లమని, లోపాలను గుర్తించి ఆత్మపరిశీలన చే సుకొని సద్గుణాలతో నడవటం, బలహీనతపై విజయం సాధించే సంవత్సరమంటూ వక్తలు అభిప్రాయపడ్డారు. అనంతరం పలువురు కవులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు వామన్రావు, రెడ్క్రాస్ సొసైటీ సభ్యుడు మహేందర్, సుబ్బాయమ్మ, అడ్డగూరి శ్రీలక్ష్మి, శ్రీనివాస్, సంతోష్, చంద్రశేఖర్, బ్రహ్మయ్యచార్య పాల్గొన్నారు. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
● కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలటౌన్: క్రీడాపోటీలతో మానసిక ఉల్లా సం కలుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఉషోదయ పాఠశాలలో రెవెన్యూ ఉద్యోగులకు ఆదిలాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఒక్కోసారి నిర్ణీత పనివేళలను మించి పని చేయాల్సి ఉంటుందన్నారు. వ్యాయామం, యోగ, క్రీడలు, ప్ర తీఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలన్నారు. అనంతరం పోటీల్లో విజేతలకు బ హుమతులు, మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ మ హమ్మద్ విలాయత్ అలీ, తదితరులు పాల్గొన్నారు. నేడు తహసీల్ కార్యాలయాల ఎదుట ధర్నాచెన్నూర్: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల ఎదుట ఉదయం 11గంటలకు ధర్నా నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ తెలిపా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు ఇళ్లు, వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు పిలుపు మేరకు ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. పేదలు, రైతులు అష్టకష్టాలు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ తహసీల్ కార్యాలయాల ఎదుట చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
భీమారం: మంచిర్యాల–చెన్నూర్ జాతీయ రహదారిపై కుందారం ఎక్స్రోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం... తాండూరు మండలం మాదారంకు చెందిన ఏరుకొండ వెంకటేశ్ చెన్నూర్లో ఉన్న తన తల్లిని చూసేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. కుందారం ఎక్స్రోడ్డు వద్దకు రాగానే చెన్నూర్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి బైక్ను బలంగా ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఘటనలో బైక్ నడుపుతున్న వెంకటేశ్కు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. జాతీయరహదారి గుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులు 108 కి సమాచారం అందించారు. పైలట్ హరీశ్, ఈఎంటీ రమేశ్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం
బాసర: గత నెల 28న అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యమైంది. తానూరు మండలం బమ్మిని గ్రామానికి దుర్గావార్ నీలాబాయి (58) బాబు దంపతులు కొంతకాలంగా బాసరలోని గణేశ్నగర్లో నివాసం ఉంటున్నారు. బాబు ట్రిపుల్ఐటీలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తుండగా వారి కుమారుడు విష్ణుమూర్తి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నీలాబాయి ఫిబ్రవరి 28న ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మార్చి 1న బాసర పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. శనివారం గణేశ్నగర్ గుట్ట ప్రాంతంలో దుర్వాసన రావడంతో స్థానికులు అటుగా వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకుని కనిపించింది. విష్ణుమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ కిరణ్ తెలిపారు. వివాహిత అదృశ్యం ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన 25 ఏళ్ల వివాహిత అదృశ్యమైంది. శనివారం ఇంట్లో భర్తతో గొడవజరగడంతో సదరు మహిళ బయటకు వెళ్ళిపోయింది. రాత్రి వరకూ రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. -
క్రీడలతోనే మానసిక ఉల్లాసం
మంచిర్యాలటౌన్: క్రీడల ద్వారానే శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని, విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు క్రీడలు ఉపశమనాన్ని కలిగిస్తాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీఉషోదయ పాఠశాల మైదానంలో శనివారం ఆదిలాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, శ్రీనివాస్రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీలతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఒక్కోసారి నిర్ణీత పనివేళలను మించి పనిచేయాల్సి ఉంటుందన్నా రు. కార్యాలయాల్లో పని ఒత్తిడి దృష్ట్యా శారీరక శ్రమ లేకుండా పని చేయడంతో 40ఏళ్ల వయస్సుకే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగులకు శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలని, నిత్య జీవితంలో వ్యాయామం ఒక భాగంగా పాటించాలన్నారు. అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీని సందర్శించిన ‘బక్కి’
బాసర: బాసర ఆర్జీయూకేటీని శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష స మావేశం నిర్వహించారు. విద్యార్థుల రక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. అడ్మిషన్ల ప్రక్రి య గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ని యామకంలో తప్పనిసరిగా రిజర్వేషన్ పద్ధతిని పా టించాలని ఆదేశించారు. వివిధ అంశాలపై అధికా రులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులతో మా ట్లాడి వారికి అందిస్తున్న వసతులు, సౌకర్యాలు అడి గి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్, సభ్యులను యూనివర్సిటీ అధికారులు సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ స భ్యురాలు కుస్త్రం నీలాదేవి, వైస్ చాన్స్లర్ గోవర్ధన్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. -
నూతన ఆవిష్కరణలకు ముందుకు రావాలి
కై లాస్నగర్: గ్రామీణ ప్రాంతాల్లోని నూతన ఆవి ష్కరణలను వెలికితీసి వాటిని వ్యాపార మార్గాలుగా మలిచేందుకు యువత ముందుకు రావాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 40 మంది కి పైగా యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలు, పర్యావరణహి త ఇంధన వనరులు, ఆరోగ్య రంగానికి సంబంధించిన వినూత్న నమూనాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ అభివృద్ధి కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉన్న ప్రతిభను వెలికితీయాల్సిన అవసరముందన్నారు. స్థానికంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్లకు ప్రో త్సాహం అందించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణుల బృందం ఆవిష్కర్తలతో ప్రత్యక్షంగా చర్చించి వారి ఆలోచనలను మరింత మెరుగుపరుచుకునేలా మార్గనిర్దేశం చేసింది. ఐడియా వ్యాలిడేషన్, ప్రోటోటైపింగ్, గో టు మార్కెట్ స్ట్రాటజీ, నిధుల సమీకరణ, మార్కెటింగ్, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీపీవో రమేశ్, డీపీఆర్వో విష్ణువర్ధన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఈడీఎం రవి, రెడ్కో డీఎం శ్రీనివాస్, వివేకానంద కళాశాల ప్రిన్సిపాల్ నికినీ వర్మ, టీజీఐసీ ప్రతినిధులు ప్రణయ్, రమేశ్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీలో రెండో రోజు అంతఃప్రజ్ఞ
బాసర: బాసర ఆర్జీయూకేటీలో శనివారం రెండోరోజు అంతఃప్రజ్ఞ 2కే–26 నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ తన జీవిత ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, విజయానికి దారితీసిన పట్టుదల గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా కార్లు, బైక్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్చాన్స్లర్ గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఈ.మురళీదర్శన్, ఫ్యాకల్టీ కన్వీనర్ స్వప్నిల్ జంగలే విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులను పరిశీలించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో నినా ఏఐ ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్, పిల్లల కోసం రూపొందించిన ఏఐ ఆధారిత లెర్నింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో స్మార్ట్ వాటర్ ఫ్లో అండ్ పైప్లైన్ లీకేజ్ డిటెక్షన్ సిస్టమ్, స్మార్ట్ డ్రగ్ డిస్పెన్సర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో హెలియో ఆక్వా రిఫైనర్ , ఈవీ ఛార్జింగ్ స్టేషన్ వంటి ప్రాజెక్టులు ప్రదర్శించబడ్డాయి. పోస్టర్ ప్రజెంటేషన్ విభాగంలో క్వాంటం కమ్యూనికేషన్ ప్రాజెక్ట్ విజేతగా నిలిచింది. బహుమతులు అందజేతఅంత ప్రజ్ఞలో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బహుమతులు అందజేశారు. -
కాసిపేట గనిని సందర్శించిన డీఎఫ్వో
కాసిపేట: మందమర్రి ఏరియాలోని కాసిపేట గనిని శనివారం ఆసిఫాబాద్ డీఎఫ్వో నీరజ్ టిబ్రేవాల్ ఐఎఫ్ఎస్ సందర్శించారు. గని మేనేజర్ సతీష్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు ఆయన ను శాలువాలతో సత్కరించారు. అనంతరం మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి పనిస్థలాల వద్దకు వెళ్లారు. గనిలో బొగ్గు ఉత్పత్తి, మిషన రీ పనితీరు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఐ టీయూసీ పిట్ కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మణ్దాస్, రక్షణాధికారి నిఖిల్, డెప్యూటీ మేనేజర్ వెంకటేష్, సంక్షేమాధికారి మీర్జాగౌస్జీషాన్, సర్వేయర్ ప్రభాకర్, టీబీజీకేఎస్ నాయకులు అఫ్జలు ద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
గుండు గీయించారని నిలదీత
ఖానాపూర్: పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీలో గల మైనార్టీ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్న విద్యార్థికి తల్లిదండ్రుల అనుమతి లేకుండా పాఠశాల సిబ్బంది గుండు గీయించారు. విషయం తెలుసుకున్న సదరు విద్యార్థి తండ్రి రవి శనివారం పాఠశాలకు చేరుకుని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంప్రదాయం ప్రకారం తల్లి దండ్రులు చనిపోయినప్పుడు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మాత్రమే గుండు చేయించుకుంటారని, ఇలాంటి చర్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ హైమద్ను వివరణ కోరగా గుండు తీసిన విషయం తన దృష్టికి రాలేదని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. -
తాళం వేసి ఉన్న రెండిళ్లలో చోరీ
తానూరు: మండలంలోని భోసి గ్రామంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. గ్రామానికి చెందిన అర్ధాపూర్ గంగాధర్ కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లగా, సాయినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి మరో ఇంట్లో పడుకున్నారు. గుర్తు తెలి యని దుండగులు ఇళ్ల తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. గంగాధర్ ఇంట్లో బీరువాలో ఉన్న రూ.79 వేలు, సాయినాథ్ గౌడ్ ఇంట్లో రూ.వెయ్యి నగదు అపహరించారు. శనివారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ముధోల్ సీఐ రవీందర్నాయక్, ఎస్సై షేక్ జుబేర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
పశుగ్రాసం సాగు ఎంతో మేలు
చెన్నూర్రూరల్: వరి కోసేందుకు రైతులు ఎక్కువగా యంత్రాలను వినియోగిస్తున్నారు. దీంతో వరిగడ్డి ముక్కలు, ముక్కలుగా కావడంతో ఎక్కువగా పశువుల మేతకు పనికిరాకుండా పోతోంది. దీంతో వేసవిలో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు రైతులు గడ్డిజొన్నను సాగుచేస్తే పశుగ్రాసానికి కొరత ఏర్పడకుండా ఉంటుంది. జిల్లా కేంద్రంలోని వెటర్నటీ ఆసుపత్రి స్టోర్లో గడ్డిజొన్న ఎస్హెచ్జీ రకం విత్తనాలు 8.9 టన్నులు అందుబాటులో ఉన్నాయని, రైతులకు 75 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి యాకూబ్రెడ్డి తెలిపారు. జిల్లాలో 12,09,436 మూగజీవాలుజిల్లాలో 1,38,536 ఆవులు, 1,04,080 గేదెలు, 2,42,616 ఎద్దులు, 5,36,913 గొర్రెలు, 1,87,291 మేకలు ఉన్నాయి. మండలాల వారీగా పశువుల సంఖ్యను బట్టి గడ్డిజొన్న విత్తనాలు పంపిణీ చేయనున్నారు. రైతులు సూపర్ నేవియర్ అనే గడ్డిజాతి రకాన్ని పెంచుకుంటే ఏళ్ల తరబడి పశువులకు గ్రాసం లభిస్తుంది. డెయిరీ ఫాంలు ఉన్న రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గడ్డి రకం కట్ చేసిన కొద్దీ పెరుగుతుంది. చిన్నచిన్నగా కట్ చేసిన ముక్కలను రెండున్నర ఫీట్లకు ఒకటి చొప్పున భూమిలో నాటుకుంటే ఇవి మొలకెత్తుతాయి. అలాగే హెడ్జ్ లూసర్న్ రకం మొక్కలలో మాంసకృత్తులు అధికంగా ఉండి ఆవులు, గేదెలు పాలను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. విత్తనాలు విత్తిన 45 రోజులకు ఈ గడ్డిజొన్న కోతకు వస్తుంది. కోత కోసి పశువులకు మేతగా వేసిన తర్వాత మళ్లీ పిలకలు వచ్చి మొక్కలు ఎదుగుతాయి. ఏళ్లతరబడి పశుగ్రాసం లభిస్తుంది. బహు వార్షికాలను కూడా పెంచవచ్చు. ఇవి విత్తనాలు కాకుండా మొక్కలను లేదా కాండపు పిలకలను నాటగానే కలుపు పెరగకుండా ఉండేందుకు 30 నుంచి 60 రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి నీటితడులు ఇవ్వాలి. యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పశుగ్రాసం సాగు చేసుకుంటే వేసవిలో కూడా పశువులకు గ్రాసం కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఎస్హెచ్జీ ఏక వార్షిక గడ్డిజొన్న సాగు చేస్తే ఏడాది పాటు పశువులకు గ్రాసం లభిస్తుంది.రైతులు దృష్టి సారించాలి వేసవిలో పశువులకు మేత సరిగా దొరకదు. కాబట్టి రైతులు పశుగ్రాసం సాగుపై దృష్టి సారించాలి. ఎస్హెచ్జీ రకం గడ్డి జొన్న విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా డెయిరీఫాంలు నడిపించే రైతులు పశుగ్రాసాలను తప్పకుండా సాగు చేయాలి. అలాగే వేసవిలో పశువులు, జీవాల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి. – యాకూబ్రెడ్డి, జిల్లా పశువైద్యాధికారి, మంచిర్యాల -
కట్నం ఇడే కాద్ తోద్.. అంటున్న ‘కొలాం’
● సమాజ మార్పునకు ఆదివాసీల శ్రీకారం ● ఉమ్మడి జిల్లాలో గోండు, కొలాం, పర్ధాన్ పెద్దల తీర్మానం ● ఇప్పటికే పలు గ్రామాల్లో అమలులోకివరకట్నం.. వివాహ సమయంలో వధువు కుటుంబం నుంచి వరుడి కుటుంబా నికి నగదు, బంగారం, ఆస్తుల రూపేణ బదిలీ చేసే ఒక సామాజిక దురాచారం. ఆడపడుచు కుటుంబా నికి ఇబ్బందిగా మారిన దీనిని రూపుమాపేందుకు ప్రభుత్వాలు చట్టాలెన్ని చేసినా క్షేత్రస్థాయిలో అమలుకు మాత్రం నోచుకోని దుస్థితి. ఈ క్రమంలో సామాజిక బాధ్యతగా గుర్తించిన ఆదివాసీ తెగలు వరకట్నం నిషేధం వైపు మొగ్గు చూపుతున్నాయి. కట్నం ఇవ్వొ ద్దు.. తీసుకోవద్దు అని గ్రామాల్లో తీర్మానాలతో పాటు అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. ‘హైరి కీవల్ సిల్లే’ ‘కట్నం ఇదే కాద్ తోద్’ వంటి తీర్మానాలతో ముందడుగు వేస్తున్న ఆయా తెగలపై ఈ వారం సండే స్పెషల్. సిరికొండ: ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లంటే ఆ కుటుంబంపై ఆర్థిక భా రం చెప్పనవసరం లేదు. కట్నా లు, కానుకలు, ఆర్భాటాలు వంటివి చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టే అవుతోంది. అలాంటిది తమ గూడెంలో అమ్మాయి పెళ్లిని ఆర్భాటం లేకుండా సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ఊరి పెద్దలు భావించారు. ఈనెల 9న సమావేశమయ్యారు.‘హైరి కీవల్ సిల్లే’ వరకట్నం నిషేధించడంతో పాటు పెళ్లి కూతురు కుటుంబానికి తలా కొంత ఆర్థికంగా చేదోడుగా నిలవాలని నిర్ణయించారు. వెంటనే అమలులోకి తెచ్చారు సిరికొండ మండలంలోని కోసుపటేల్ గూడవాసులు. సాత్నాల: వరకట్న సమస్య కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని కొలాం తెగ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెళ్లి అనేది పవిత్ర బంధమని.. దానిని డబ్బు, ఆస్తులతో కొలవకూడదని భావించింది. ఇకపై వరకట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాత్నాల మండలంలోని టెంబ్రీగూడలో పటేళ్లు, కులస్తులు ఇటీవల సమావేశమయ్యారు. సాత్నాల, బేల, జైనథ్, ఇంద్రవెల్లి మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 150 పాల్గొన్నారు. వరకట్నం అనేది తమ సంస్కతిలో భాగం కాదని నిషేధించాలని తీర్మానం చేశారు. ఆడంబరాలకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. పెళ్లిళ్లు సాంప్రదాయబద్ధంగా ఉండాలని, రూ.లక్షలు ఖర్చయ్యే రెడీమేడ్ మండపాలకు దూరంగా ఉండడంతో పాటు మద్యపానం నిషేధించాలన్నారు. డీజేలు వంటి వాటి జోలికి వెళ్లకుండా పిప్రి వాయిద్యాలతో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పెళ్లిలో చదివింపుల్లో భాగంగా వస్తువులు కాకుండా నగదు రూపంలో అందిస్తే కుటుంబాలనికి ఆసరాగా ఉంటుందని తీర్మానించారు.ఆడబిడ్డ పెళ్లికి ఊరంతా సాయం -
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్
జన్నారం: మండలంలోని పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధి మజీద్లో శనివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మభూమేశ్ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు అందజేసి విందు భోజనం చేశారు. పండుగలు మత సామరస్యానికి ప్రతీకగా నిలువాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసీఉల్లా, సర్పంచులు వెంకన్న, సురేశ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముజాఫర్ అలీఖాన్, పార్టీ సీనియర్ నాయకులు గుర్రం మోహర్రెడ్డి, ఇందయ్య, రమేశ్, నందునాయక్, ఇసాక్, రియాజోద్దీన్, షాఖీర్ అలీ, ముజ్జు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలు ప్రారంభం
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 99.72శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం 9.30గంటల నుంచి 12.30గంటల వరకు ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, ఉర్దూ, హిందీ) పరీక్షలు నిర్వహించారు. రెగ్యులర్ విద్యార్థులు 9,682 మందికి గాను 9,655 మంది హాజరు కాగా, 27 మంది గైర్హాజరయ్యారు. గతంలో ఒక్కసారి ఫెయిలైన విద్యార్థులు ఏడుగురికి గాను ఐదుగురు హాజరు కాగా ఇద్దరు రాలేదు. పరీక్ష నిర్ణీత సమయానికి గంట ముందే విద్యార్థులు, తల్లిదండ్రులు కేంద్రాలకు చేరుకున్నారు. గది నంబరును సరిచూసుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కేంద్రాల్లోకి అనుమతించారు. చీఫ్ సూపరింటెండెంట్లు 48 మంది, డిపార్టుమెంటు అధికారులు 48మంది, సిట్టింగ్స్క్వాడ్ బృందాలతోపాటు 460మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించారు. కేంద్రాల్లో ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచారు. ప్రతీ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తనిఖీ అధికారులు, స్వ్వాడ్ ఫోన్లు బయటపెట్టారు. జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, ఐదు కేంద్రాలను డీఈవో యాదయ్య పరిశీలించారు. -
ఇబ్బందులు లేకుండా సిలిండర్ల సరఫరా
● కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు ● కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్లో డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రావు, ఏసీపీ ప్రకాష్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎల్పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో అవసరానికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, బుకింగ్, నిల్వలపై సమీక్షిస్తున్నామని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలు, గోదాములు వద్దకు వెళ్లకుండా ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు. గ్యాస్ డెలివరి సమయంలో ఓటీపీ చెప్పి సహకరించాలని, హోటల్, రెస్టారెంట్లలో వాణిజ్య సిలిండర్ మాత్రమే ఉపయోగించుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్యాస్ సిలిండర్లు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే నిత్యావసరాల చట్టం 1955 కింద చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎల్పీజీ వినియోగదారులు కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని, గ్యాస్ ఏజెన్సీ వద్ద ఆన్లైన్, నిర్వాహకులు, గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్సైట్ యాప్లో పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. -
● అడవుల్లో యథేచ్ఛగా షికారీ ● తాజాగా ఓ చిరుతపులి బలి ● వన్యప్రాణులకు తప్పని ముప్పు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అడవుల్లో వన్యప్రాణుల వేట ఆగడం లేదు. యథేచ్ఛగా షికారీ సాగుతోంది. తాజాగా దండేపల్లి మండలం తాళ్లపేట రేంజ్ మామిడిపల్లి బీట్ అటవీ ప్రాంతంలో చిరుతపులిని ఉచ్చు బిగించి హతమార్చారు. కళేబరాన్ని కా ల్చివేశారు. ఈ ఘటనలో అటవీ అధికారులు ము గ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద చిరుతపులి గోర్లు, దంతాలు, మీసాల వెంట్రుకలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇదే తరహాలో పెద్దపులిని చంపిన ఘటనలోనూ వేటగాళ్లు పట్టుబడ్డారు. ఇటీవల పలు చోట్ల వన్యప్రాణులను వేటాడుతూ అధికారులకు చిక్కారు. జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్, జన్నారం డివిజన్లలో ఇప్పటికీ అడవుల్లో వన్యప్రాణులను వేటాడుతున్నారు. ఇటీవల వేమనపల్లి మండలం నీల్వాయిలో అడవి పందిని హతమార్చిన ఘటనలో కేసు నమో దు చేశారు. ఇంకా పలు చోట్ల పట్టుబడుతూనే ఉన్నారు. అడవుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని చె బుతున్నా చిరుతపులుల వంటి జంతువులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జంతువులనే కాకుండా కొన్ని చోట్ల పక్షులను సైతం వేటాడుతున్నారు. వేసవిలో మరింత అధికం వేసవిలో వన్యప్రాణులు అడవి దాటి బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో కొందరు వేటాడి పట్టుకుంటున్నారు. ఇక నీటికుంటలు, వాగుల వద్ద కాపు కాసి వేటాడుతున్నారు. ఇవేకాక రాత్రి పూట తీగలకు విద్యుత్ సరఫరా చేస్తూ చంపేస్తున్నారు. వేటాడిన వన్యప్రాణుల మాంసాన్ని పట్టణాలకు తరలించి అమ్ముకుంటున్నారు. జిల్లా కేంద్రంతో సహా పట్టణాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రైవేటు కార్యక్రమాలకు ప్రత్యేక వంటకంగా అడవి జంతువుల మాంసం అమ్ముతున్నారు. దీంతో విచ్చలవిడిగా వేటతో అడవుల్లో శాకాహార జంతువుల లభ్యత తగ్గుతోంది. శాకాహార జంతువుల వేటతో వాటిపై ఆధారపడే పులులు, చిరుతలు, ఇతర మాంసాహార వన్యప్రాణులకు ఆహారం దొరకడం లేదు. ఈ క్రమంలో అడవి సమీపంలో ఉన్న పశువులు, మేకలు, గొర్రెలపై దాడులు చేస్తున్నాయి. చనిపోయిన వాటికి అటవీ శాఖ రూ.లక్షల్లో పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఓ వైపు వేటగాళ్ల కారణంగా వన్యప్రాణులకు రక్షణ లేకపోగా, మరోవైపు అడవుల్లో జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది.పొంచి ఉన్న ముప్పువిచ్చల విడిగా వేటతో వన్యప్రాణులకు ప్రాణముప్పు పొంచి ఉంది. అక్రమ కలప రవాణా, పోడుతో అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ మరింత కష్టంగా మారుతోంది. ఈ ప్రభావం స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులపై పడుతోంది. విద్యుత్ తీగలతో వేటాడం వల్ల తీవ్రంగా నష్టం జరుగుతోంది. కొన్నిసార్లు విద్యుత్ తీగలకు మనుషులు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. అయినప్పటికీ పంట చేన్లు కాపాడుకునే సమయంతోపాటు వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ తీగలనే వాడుతున్నారు. దీంతో అనేక జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అటవీ సమీప గ్రామాల్లో కొందరికి వేటాడం నిత్యకృత్యంగా మారింది. అడవుల్లో సీసీ కెమెరాలు, చెక్పోస్టులు, రాత్రి పూట గస్తీ సిబ్బంది ఉన్నప్పటికీ వేటను పూర్తిగా అదుపులోకి తేలేకపోతున్నారు. కొన్ని రేంజ్ల్లో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంతోనూ ముప్పు వాటిల్లుతోంది. -
కేజీబీవీలు ‘ఎక్స్లెన్స్’
మంచిర్యాలఅర్బన్: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు బాలికలకు బాసటగా నిలుస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధన, వసతులతో కూడిన విద్య వారికి వరంగా మారాయి. జిల్లాలో 18 కేజీబీవీ(కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా)లు ఉండగా.. 15చోట్ల ఇంటర్, మూడింటిలో ఆరు నుంచి పదో తరగతి వరకు కొనసాగుతున్నాయి. 4640 మంది బాలికలు విద్యనభ్యసిస్తుండగా.. 241మంది ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు. ఆరు నుంచి పదో తరగతి వరకు నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. తాజాగా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఐఐటీ, నీట్, క్లాట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. మూడు ఎంపిక జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, తాండూర్ కేజీబీవీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్(వైఐఐఓఈ)గా మార్చారు. మంచిర్యాలలో ఐఐటీ, బెల్లంపల్లిలో నీట్, తాండూర్లో క్లాట్కు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకోలేని పరిస్థితి, రూ.లక్షలు ఖర్చు చేసే ఆర్థిక స్థోమత లేని దృష్ట్యా ఎంపిక చేసిన విద్యాలయాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మూడు విద్యాలయాల్లోని ఇంటర్ ప్రథమ సంవత్సరం(2026–27) గాను అడ్మిషన్లు స్వీకరించనున్నారు. ఇందులో చేరికకు విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మార్చి 2026లో పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థినులు ఈ నెల 16నుంచి ఏప్రిల్ 15వరకు ఆన్లైన్లో www.tgrjc.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష మే 3న టీజీఆర్జేసీ సీఈటీ–2026 ద్వారా నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రతిభావంతులకు ఆయా విద్యాలయాల్లో అవకాశం కల్పిస్తారని డీఈవో యాదయ్య తెలిపారు. కాగా, మిగతా కేజీబీవీల్లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో శుద్ధజలం
మంచిర్యాలటౌన్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తుండగా.. ఇకపై శుద్ధమైన జలం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాకు 79 ఆర్వో ప్లాంట్లు మంజూరు చేశారు. జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 974 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో స్వంత భవనాలు 182 ఉండగా, ఉచిత అద్దె భవనాలు 309, అద్దె చెల్లిస్తున్నవి 483 ఉన్నాయి. ప్రస్తుతం స్వంత భవనాలు ఉండి, నల్లా కనెక్షన్ ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధమైన తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్లో ప్రతీ కేంద్రంలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు చిన్నారులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో విద్యుత్ సరఫరాతో ఫ్యాన్ల ఏర్పాటుకు అవకాశం ఉండగా.. వేసవిలో చిన్నారులకు ఉక్కపోత ఇబ్బందులు తొలగనున్నాయి. స్వంత భవనాలు ఉన్నచోట్ల ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ఖాన్ తెలిపారు.జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు 974 ఆర్వోప్లాంట్లు మంజూరు 79 చిన్నారులు 29,635 గర్భిణులు 3,307 బాలింతలు 3,543 -
చెక్బౌన్స్ కేసులో ఇద్దరికి జైలు
మంచిర్యాలక్రైం: చెక్బౌన్స్ కేసులో ఇద్దరికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ మంచిర్యాల జిల్లా జ్యూడిషీయల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్, జూనియర్ సివిల్ జడ్జి కె.నిరోషా శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మందమర్రి మండలం క్యాతన్పల్లికి చెందిన అశోక్కుమార్ లడ్డా వద్ద ఆర్థిక అవసరాల నిమిత్తం మంచిర్యాల సీసీసీ కార్నర్కు చెందిన నేరెళ్ల రమేశ్ 2018లో రూ.5.77 లక్షలు, సీసీసీకి చెందిన నేరెళ్ల సాయికృష్ణ రూ.4.83 లక్షలను అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు వేర్వేరుగా 2018లో కోర్టును ఆశ్రయించాడు. జడ్జి.. ఈ కేసును విచారిస్తున్న సమయంలో అప్పు తిరిగి చెల్లించడంతోపాటు నేరెళ్ల రమేశ్కు సంవత్సర కాలం పాటు జైలుశిక్ష, నేరెళ్ల సాయికృష్ణకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. క్యాతనపల్లి అల్లర్ల కేసులో ఐదుగురికి బెయిల్ రామకష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్ల కేసులో ఐదుగురికి శుక్రవారం మంచిర్యాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామిడికుమార్, మేడిపెల్లి సంపత్, బండారి సూరిబాబు, కుర్మ దినేష్, ముస్తఫాలను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి ఆదిలాబాద్ జిల్లా జైలుకు రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. శుక్రవారం బెయిల్ మంజూరు చేయడంతో రాత్రి విడుదలయ్యారు. ‘అక్రమ కేసులతో వేధిస్తున్నారు’ మంచిర్యాలటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనపై అక్రమ కేసులను పెట్టి వేధిస్తున్నారని మంచిర్యాలకు చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోగుల రవీందర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గజ్వేల్లోని ఎర్రవల్లి ఫాంహౌస్లో మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. మంచిర్యాలలో తనపై ఇప్పటికే 30కి పైగా పోలీసులు కేసులను నమోదు చేశారని, ఇంకా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బీ ఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భయాందోళన చెందా ల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని కేసీఆర్ పేర్కొన్నారని రవీందర్రెడ్డి తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన నలుగురి అరెస్ట్ ఆదిలాబాద్టౌన్: బెదిరింపులకు పాల్పడిన నలుగురిని అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. పోలీసుస్టేషన్లో శుక్రవారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రాంనగర్కు చెందిన సలాం వరుణ్, దుర్గానగర్కు చెందిన వెట్టి మనోజ్, ఇంద్రవెల్లి మండలానికి చెందిన కుమ్రం ప్రభాత్రావు, బజార్హత్నూర్కు చెందిన దుర్వ సుభాష్ ఆర్కే కోఆపరేటీవ్ సొసైటీ ద్వారా డబ్బులు తీసుకున్నారు. తిరిగి చెల్లించాలని సొసైటీ చైర్మన్ కొండూర్ రాకేందర్ అడిగితే తుడుందెబ్బ పేరుతో బెదిరింపులకు దిగారు. సొసైటీ ద్వారా డబ్బులు తీసుకున్న ప్రభాత్రావు, దుర్వ సుభాష్లు తిరిగి ఇవ్వకుండా వెట్టి మనోజ్, సలాం వరుణ్లు ఆదివాసీ నాయకులమని చెబుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. రాకేందర్ నుంచి రెండు, మూడు విడతల్లో ఒక్కోసారి రూ.20వేల చొప్పున డబ్బులు వసూళ్లు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. సెక్యూరిటీగార్డుపై దాడిచేసిన ఇద్దరిపై కేసు ఆదిలాబాద్టౌన్: వసుంధర షాపింగ్ మాల్ సెక్యూరిటీ గా ర్డుపై దాడిచేసిన ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సు నీల్కుమార్ తెలిపా రు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన నిందితులు షేక్ సమీర్, సాబిల్లు గురువారం పార్కింగ్ విషయంలో గొడవపడి సెక్యూరిటీ గార్డు రాథోడ్ రవిపై దాడికి దిగారు. బాధితుడు ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. వారి బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
గాడితప్పిన సమయ ‘పాలన’
కై లాస్నగర్(బేల): బేల మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన పూర్తిగా గాడితప్పింది. సంబంఽధిత అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు తమ ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఎంపీడీవో, తహసీల్దార్, వ్యవసాయాధికారి కార్యాలయాలను సంప్రదించగా ఉద్యోగులెవరూ లేక ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రతినిత్యం ఇదే పరిస్థితి. వివిధ పనుల నిమిత్తం ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుండటం ఉద్యోగులు, సిబ్బంది నిర్వాకానికి నిదర్శనంగా నిలుస్తోంది. మధ్యాహ్నం 12.30 తర్వాత తీరిగ్గా హాజరయ్యే ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకల్లా తిరిగి ఇంటిముఖం పడుతారని అక్కడి సిబ్బంది చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. ఎంపీడీవో కార్యాలయంలో ఖాళీగా పర్యవేక్షకుడి కుర్చీ ఖాళీగా ఉన్న నాయబ్ తహసీల్దార్ సీటు -
జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
చెన్నూర్: రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన ధారావత్ ధనుష్ ప్రతిభ కనబర్చాడు. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ఎన్9 బ్యాడ్మింటన్ అకాడమీలో ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–17 బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబర్చి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన సీఎం కప్–2025 బ్యాడ్మింటన్ పోటీల్లో రెండు పతకాలు సాధించాడు. ధనుష్..సింగరేణి ఎస్టీపీపీలో డీజీఎం (ఈఅండ్ఎం) ధారావత్ దంపతుల కుమారు డు. ఏప్రిల్ 16 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్దీపక్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నాడు. అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా డిప్యూటీ స్పోర్ట్స్ ఆఫీసర్ యాకుబ్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సుధాకర్లు అతన్ని అభినందించారు. -
టెర్మినల్ బెన్ఫిట్స్ వెంటనే అందించాలి
నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలో పదవీ విరమణ పొందిన ప్రతీ ఉద్యోగికి టెర్మినల్ బెన్ఫిట్స్ వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన జీఎం కార్యాలయంలో శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్కాస్టుల మేనేజర్లు, సంక్షేమ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గనుల వారీగా పదవీ విరమణ పొందిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపు వివరాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రాట్యూటీ, సీఎంపీఎఫ్, పెన్షన్ పెండింగ్ వివరాలు సేకరించారు. ఒక్కో గనిలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఏ ఏ కారణాలతో పెండింగ్లో ఉన్నాయో తెలుసుకుని త్వరగతిన పూర్తిచేయాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అర్హత లేనివారు, ఉద్యోగం అవసరం లేని వారికి ఎల్ఎస్పీ, ఎంఎంసీ పొందే వెసులుబాటు కల్పించాలన్నారు. అదేవిధంగా ఉద్యోగి అతని కుటుంబ సభ్యుల వివరాలు ఆన్లైన్లో నమోదు ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీజీఎం పర్సనల్ ఎస్.అనిల్కుమార్, డీవైపీఎంలు రాజేశ్, కిరణ్, సీనియర్ పీఓలు సురేందర్, మురళీ, ప్రశాంత్, వివిధ గనుల మేనేజర్లు, గనుల సంక్షేమాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్లాంటు పనులు వేగవంతం చేయాలి
చెన్నూర్: సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన 800 మెగావాట్ల ప్లాంట్ పనులు వేగవంతం చేయాలని సింగరేణి జీఎం (సివిల్) వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జీఎం నరసింహారావుతో కలిసి శుక్రవారం జైపూర్లోని ఎస్టీపీపీని సందర్శించారు. ప్లాంట్లో భాగంగా నిర్మించబోయే కూలింగ్ టవర్స్ పనులను పర్యవేక్షించారు. ప నుల వివరాలను బీహెచ్ఈఎల్ డైరెక్టర్ మధుకిరణ్, పీఎంపీఎల్, కేపీసీ అధికారులు వివరించారు. ప్లాంటు ప్రస్తుత స్థితిగతులను ఎస్ఈ సివిల్ బానోతు రాము డయాగ్రామ్ ద్వారా ఆయనకు తెలియజేశారు. ప్లాంట్ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు కిరణ్బాబు, రాము ఉన్నారు. యువకుడి అదృశ్యం మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన చిట్టిమల్ల అనిల్(26) అదృశ్యమయ్యారు. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. రాపల్లికి చెందిన అనిల్ వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 10వ తేదీ రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. అతని ఆచూకీపై బంధువులు, స్నేహితులతో ఆరా తీసిన దొరకలేదు. అనిల్ సోదరుడు దిలీప్ ఫిర్యాదు మేరకు శుక్రవారం మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒకరి బైండోవర్ దహెగాం: మండలంలోని కర్జి గ్రామానికి చెందిన కాటెల కమలాకర్ను శుక్రవారం తహసీల్దార్ మునవార్ షరీఫ్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. గ్రామంలో మద్యం తాగి గొడవలకు పాల్పడుతున్నందున సత్ప్రవర్తన కోసం బైండోవర్ చేశామని పేర్కొన్నారు. మరోసారి గొడవలకు పాల్పడితే రూ.లక్ష జరిమానాతోపాటు జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. -
సులభ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నస్పూర్: సింగరేణిలో పనిచేస్తున్న సులభ్ కార్మికు ల సమస్యలు వెంటనే పరష్కరించాలని సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి.బ్రహ్మానందం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన సులభ్ కార్మికులతో కలిసి శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీఎం శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రతీనెల 10 లోపు వేతనాలు చెల్లించ డం లేదన్నారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్, గత సంవత్సర కాలంగా పెండింగ్ ఉన్న డీఏ విడుదల చేయాలన్నారు. కార్మికులు, వారి కుటుంబాలకు హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని కోరారు. సులభ్ కాంప్లెక్స్లు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటికి మరమ్మతులు చేపట్టాలన్నారు.జిల్లా నాయకులు శంకరి, మంతెన లక్ష్మయ్య, నేదురి, నర్సయ్య, లక్ష్మయ్య, రాజేందర్, పరుశరాములు, విజయ, రౌతు లక్ష్మి, జ్యోతి, సుగుణ, తదితరులు పాల్గొన్నారు. -
రామకృష్ణాపూర్ ఓసీపీ–2 విస్తరణపై సమీక్ష
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ ఓపెన్కాస్ట్ ఫేజ్–2 గని అంశంపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శుక్రవారం మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణతో సమీక్షించారు. గద్దెరాగిడిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి అనంతరం ఓసీ ఫేజ్–2పై జీఎంతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓసీ విస్తరణలో భాగంగా ఫేజ్–2 మైన్కు అనుమతులు లభించాయని, అయితే గనికి అవసరమైన భూమికి ఇంకా ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. గనికి కేటాయించాల్సిన భూమి నాన్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నప్పటికీ కొందరు అధికారులు దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా పేర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికే క్లియరెన్స్ కోసం డీఎఫ్ఓ సహా సంబంధిత అధికారులతో మాట్లాడి అనుమతులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కొత్త గని అందుబాటులోకి వస్తే సుమారు 18 ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తి కొనసాగడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గనుల కోసం నిర్వహించిన వేలంలో పాల్గొనకుండా అడ్డుకుందని విమర్శించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి, పల్లెరాజు, గాండ్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ చేపట్టాలి
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జన్నారపు రాజేశ్వర్ డి మాండ్ చేశారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఏటా పదుల సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారని, దీనికి కారణగాలను యూనివర్సిటీ అధికారులు వెల్లడించాలన్నారు. యూనివర్సిటీలో అడ్మిషన్స్ జరిగిన విధానంపై రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి విడుదలైన నిధుల ఖర్చులు, అన్ని టెండర్ ప్రక్రియ చెల్లించిన బిల్లులపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలన్నారు. నాయకులు మనోజ్,అక్షయ్, రాకేశ్, గౌతం, ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు భైంసా: బాసర ట్రిపుల్ఐటీలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ను శుక్రవారం వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పూర్తిచేసిన అర్హులైన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో ఉన్నత విద్యనభ్యసించే అవకాశాన్ని కల్పించేందుకు ఈ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని తెలిపారు. పదిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రతీ సబ్జెక్ట్ మార్కులకు అదనంగా డిప్రైవేషన్ స్కోర్ను జోడించి పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను టీజీ ఆన్లైన్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు లేదా https:// www. rgukt. ac.in/ÌZలో ఆన్లైన్లో సమర్పించవచ్చని అధికా రులు తెలిపారు. ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శ న్, అడ్మిషన్ కన్వీనర్ శీలం శేఖర్, కోకన్వీనర్ బండి హరికృష్ణ, అసోసియేట్ డీన్స్ డా. మహేశ్, డా. విఠ ల్, డా. దేవరాజ్, సునీత తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దుచేయాలి
రెబ్బెన: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్టీయూ ఏరియా అధ్యక్షుడు గోలేటి శ్రీనివాస్, కార్యదర్శి అరికెళ్ల పోచం అన్నారు. ఐఎప్టీయూ ఆధ్వర్యంలో ఈనెల 16న కలెక్టరేట్ల ముట్టడి, 23న హైదరాబాద్ రీజినల్ లేబర్ కమిషనర్ కార్యాల యం ఎదుట నిర్వహించే ధర్నా పోస్టర్లను శుక్రవా రం గోలేటిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను సింగరేణిలో అమలు చేయొద్దన్నా రు. లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుండి అమలు చేయాలని గెజిట్ విడుదల చేసిందన్నారు. వీటిని రద్దు చేసేవరకు దేశవ్యాప్తంగా కార్మికవర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. నాయకులు భీమేశ్, చందు, వెంకటేశ్, చంద్రయ్య, కుమార్, పోసుబాయి, తార, నాగలక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు. -
సరిపడా గ్యాస్ సిలిండర్లు
● కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు ● పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజలకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర్రా వు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో ఎల్పీజీ సిలిండర్ల నిల్వ లు, సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, రబీ పంటల సాగు, ధాన్యం కొనుగోలు కార్యాచరణ అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేద ని, అధికారులు ఆయిల్ కంపెనీలతో ప్రతీరో జు సమీక్షించాలని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎల్పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతీరోజు సమీక్షించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించి బుకింగ్ నిల్వలపై సమీక్షిస్తున్నామని అన్నారు. డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, నీటిపారుదల శాఖ ఈఈ విష్ణుప్రసాద్, వ్యవసాయ అధికారి సురేఖ, పౌరసరఫరాల శాఖ మేనేజర్ శ్రీకళ పాల్గొన్నారు. -
భారీగా పెరగనున్న జనాభా
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జనగణనకు అంతా సిద్ధమవుతోంది. గత కొన్నేళ్లుగా వాయిదా పడుతున్న జనాభా లెక్కల సేకరణ వచ్చే మే నెలలో మొదలు కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 2011లో చేపట్టిన జనాభా లెక్కలే ఇప్పటికీ జిల్లా జనాభాకు ప్రామాణికంగా మారాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలన పేరుతోనూ సామాజిక, ఆర్థిక, కుల గణన చేపట్టారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దేశాభివృద్ధి, లోటుపాట్లపై ప్రణాళికలు రూపొందించాలంటే జనాభాపై స్పష్టత ఉండాలి. అలాగే ఆయా వర్గాల్లో అర్హులకు ప్రాయోజితాలు దక్కాలన్నా ఈ జనాభా వివరాలే కీలకం ఈ క్రమంలో జనగణనకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే అంతా సిద్ధం చేసింది. జిల్లాలోనూ ఈ మేరకు గత మూడు రోజులుగా శిక్షణ జరుగుతోంది. మండల పరిధిలో తహసీల్దార్లు, ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లకు శిక్షణ ఇచ్చారు. రెండు దశల్లో వివరాల సేకరణ రెండు దశల్లో జరగనున్న ఈ గణనలో ఎన్యుమరేటర్లు మొదట ప్రతీ యూనిట్(కుటుంబాలు)లను లెక్కిస్తారు. ప్రతీ వంద కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున నియమించనున్నారు. వేసవి సెలవులు పూర్తయితే ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు ఎన్యుమరేటర్లుగా వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలో మే 11నుంచి జూన్ 9వరకు ఇళ్లు, కుటుంబాల వివరాల సేకరించనున్నారు. ఇక రెండో దశలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టనున్నారు. జననాలను మార్చి ఒకటి నుంచి కటాఫ్గా తీసుకుని నమోదు చేయనున్నారు. 33అంశాలతో కూడిన ప్రశ్నావళిని ఎన్యుమరేటర్లు జిల్లాలో ప్రతీ ఇంటి నుంచి వివరాలు తీసుకోనున్నారు. ఇంటి రకం నుంచి మొదలు సౌకర్యాలు, సామాజిక స్థితిని ప్రతిబింబించే పలు ప్రశ్నలతో కూడిన అంశాలను అడిగి నమోదు చేస్తారు. అంతా డిజిటల్, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఈసారి జనగనణలో పూర్తిగా పేపర్ లెస్గా ప్రత్యేక పోర్టల్లో ఎన్యుమరేటర్లు ట్యాబ్లతో నమోదు చేయనున్నారు. పూర్తిగా డిజిటల్గా పద్ధతిలో వివరాలు సేకరించనున్నారు. ఇక పౌరులు సైతం సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. సెన్సస్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్లి నేరుగా వివరాలు పొందుపర్చవచ్చు. మొబైల్ నంబరుతో లాగిన్ అయి పూర్తి వివరాలు ఆన్లైన్లోనే నమోదు చేయొచ్చు. లేకపోతే ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు పూర్తిగా వివరాలైన వెల్లడించాలి. జనాభా లెక్కలే కీలకం కేంద్రం ప్రతీ పదేళ్లకోసారి నిర్వహిస్తున్న జనాభా లెక్కలే అత్యంత ప్రామాణికం. ఈ లెక్కింపుతో సీ్త్ర, పురుష, లింగ నిష్పత్తి, బాల, బాలికలు, అక్షరాస్యత, ఆర్థి క స్థితి, సామాజిక స్థితిగతులు సైతం తెలుస్తాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ, ఈబీసీ, మహిళలకు అవకాశాల కోసం రిజర్వేషన్లు, పథకాల అమలు లెక్కల ఆధారంగా ఉంటుంది. 2021లోనే గణన చేపట్టాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. తర్వాత లోక్సభ ఎన్నికలు తదితర కారణాలతో వాయిదా పడుతూ చివరకు ఈ ఏడాదిలో గణనకు కసరత్తు పూర్తయింది. తమ పూర్తి వివరాలు తెలియజేస్తే దేశపురోగతికి తోడ్పడుతుందని, అందరూ నిజాలే చెప్పాలని అధికారులు కోరుతున్నారు.2011లో చివరగా జనాభా లెక్కలు జరగగా మళ్లీ 15ఏళ్ల తర్వాత జరుగుతున్నాయి. ఈ క్రమంలో గ్రామాలు, పట్టణాల్లో జనాభా పెరగనుంది. జిల్లా కేంద్రం మంచిర్యాల నగరంలోనే రెండు లక్షలకుపైగా జనాభా ఉండగా, మిగతా పట్టణాల్లో 50వేల నుంచి లక్ష వరకు జనాభా ఉండనుంది. ఇక మేజర్ గ్రామ పంచాయతీలు, చిన్న పంచాయతీల్లోనూ గడిచిన పదిహేనేళ్లలో జనన, మరణాలు పెరిగాయి. ఈ క్రమంలో జనాభా పది లక్షలు దాటే అవకాశం ఉన్నట్లు అంచనా ఉంది. -
బాసరలో అంతఃప్రజ్ఞ 2కే–26
బాసర: దేశంలోనే అతిపెద్ద గ్రామీణ సాంకేతిక ఉత్సవంగా గుర్తింపు పొందిన అంతఃప్రజ్ఞ 2కే–26 బాసర రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టె క్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ను గేమింగ్ అరేనాగా మార్చి, ఏఆర్/వీఆర్ సిమ్యులేషన్లు, డ్రోన్ ఆధారిత గేమ్లు, వీడియో గేమింగ్ సెటప్లు ఏర్పాటు చేశారు. ఇవి అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సృజనాత్మక స్టాళ్లు క్యాంపస్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినూత్న ఆవిష్కరణలు, టెక్నాలజీ ప్రదర్శనలు, వినోదాత్మక కార్యక్రమాలతో ప్రాంగణం సందడిగా మారింది. వీసీ, ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ మురళీదర్శన్, ఫ్యాకల్టీ కన్వీనర్ జె.స్వప్నిల్, కాకతీయ శాండ్ బాక్స్ ప్రతినిధి సత్యం కె.చౌబే, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులూ.. విజయీభవ
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈసారి పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఇస్తారు. అంతకుమించితే మాత్రం పరీక్ష రాసే వీలుండదు. జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా 9703మంది పరీక్షలకు హాజరు కానుండగా.. వీరిలో 4896 మంది బాలురు, 4807 మంది బాలికలు ఉన్నారు. ఎనిమి ది పరీక్షలకు 33రోజుల వ్యవధి ఉంది. మార్చి 14, 18, 23, 28, ఏప్రిల్ 2, 7, 13న పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఎస్ఈ తరహాలో మొదటిసారిగా ఒక్కో పరీక్షకు మూడు నాలుగు రోజుల విరామం వస్తోంది. దీంతో విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఏర్పడింది. హాల్టికెట్పై ముద్రించిన క్యూర్ కోడ్ను స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా తెలుసుకోవచ్చు. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. నిఘా.. ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య సిబ్బందితోపాటు మందులు అందుబాటులో ఉంచుతున్నారు. ఫర్నిచర్, డ్యుయల్ డెస్క్లు, ఫ్యాన్లతోపాటు సౌకర్యాలు కల్పించారు. ప్రతీ కేంద్రంలో సీఎస్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిఘా కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలు తెరవడం, జవాబు పత్రాలు సీల్ వేయడం చేస్తారు. ప్రతీ కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్, విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు బృందంతోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్ ఎప్పటికప్పుడు కేంద్రాలను సందర్శిస్తుంది. వాట్సాప్లో హాల్టికెట్లు ఈసారి మూడు రకాలుగా హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయి. ప్రింటెడ్ హాల్టికెట్లు పాఠశాలల్లో పంపిణీ, ఎస్సెస్సీ బోర్డు వెబ్సైట్ bse.te langana.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ 80969 58096 వాట్సప్ నంబరుకు జిజీ సందేశం పంపిన తర్వాత hall ticket march 2026 అని పంపాలి. విద్యార్థి వివరాలు నమోదు చేసి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గంట ముందే చేరుకోవాలిపరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలి. మొబైల్ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి లేదు. ప్రశ్నపత్రం జాగ్రత్తగా చదివి సమాధానాలు రాయాలి. ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలి. విద్యార్థుల సందేహాల నివృత్తికి హెల్ప్లైన్ నంబర్లు 94409 67015, 94406 88034లో సంప్రదించవచ్చు. – యాదయ్య, డీఈవో -
వంటింట్లో ధరల మంట
మంచిర్యాలఅగ్రికల్చర్: వంటింట్లో ధరల మంట మండుతోంది. గ్యాస్ ధరలకు రెక్కలు రాగా.. వంటనూనెలు, పప్పుల ధరలు ఒక్కసారిగా పెరిగి వినియోగదారులపై పెనుభారం పడుతోంది. గత నెల రోజులుగా విదేశాల నుంచి వంటనూనె, పప్పుదినుసుల దిగుమతులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గత నెలలో పొద్దు తిరుగుడు నూనె ప్యాకెట్ ధర రూ.145 నుంచి రూ.150 మధ్య ఉండగా.. ఈ వారంలో రూ.165 నుంచి రూ.180కి చేరింది. పామాయిల్ ధర రూ.140 నుంచి రూ.160కి పెరిగింది. పల్లిలు కిలో రూ.125 నుంచి రూ.135 ఉండగా ప్రస్తుతం రూ.175 నుంచి రూ.180కి చేరింది. కందిపప్పు రూ.120 నుంచి రూ.130 ఉండగా.. రూ.140 నుంచి రూ.150కి చేరింది. హోల్సేల్ దుకాణాల్లో ఇలా ఉంటే రిటెయిల్, గ్రామాల్లోని దుకాణాల్లో నూనె ప్యాకెట్, కిలో పప్పులపై మరో రూ.5 నుంచి రూ.10వరకు పెంచి విక్రయిస్తున్నారు. ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో జిల్లా ప్రజలపై రూ.4.30కోట్ల మేర భారం పడుతోంది. గ్యాస్ ధరలు, ఇటు వంటనూనె, పప్పుల ధరలు ౖపైపెకి చేరడంతో దినసరి కూలీ జేబు ఖాళీ అవుతోంది. ఇతర దేశాల దిగుమతులు తగ్గిపోవడంతో ధరలు పెరిగిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడడంతో కొందరు ముందస్తుగా నిల్వ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి కొంత కృత్రిమ కొరత సృష్టించి కూడా ధరలు పెంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధర పెరుగగా.. వంటనూనెలు, పప్పుల ధరలు పెరగడంతో సామాన్యుడితోపాటు హోటళ్ల నిర్వాహకులపై తీవ్ర ప్రభావం పడుతోంది. యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. -
‘డ్రగ్స్ మహమ్మారిని అరికడుదాం’
మంచిర్యాలఅర్బన్: సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల డీఈవో యాదయ్య అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా సైన్స్ కేంద్రంలో 18 మండలాల నుంచి ఎంపిక చేసిన 20 పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులకు డ్రగ్స్ అరికట్టడం, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు ప్రహరీ క్లబ్లకు చెందిన విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైకియాట్రిస్ట్ వైద్యుడు రామ్నాయక్, పోలీస్ విభాగం నుంచి ఇన్స్పెక్టర్ మధుసూదన్, రిసోర్స్పర్సన్లు కృష్ణారెడ్డి, ముజీర్, సత్యనారాయణమూర్తి, సెక్టోరల్ అధికారి చౌదరి, సైన్స్ అధికారి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. గత నెల 25న ప్రారంభం కాగా.. శుక్రవారం చివరి పరీక్షకు హాజరయ్యారు. చివరి రోజు 5,429మందికి గాను 5,273మంది హాజరు కాగా, 156మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 4,811మందికి గాను 4,704మంది హాజరు కాగా 107మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 618 మందికి 569 మంది హాజరు కాగా 49 మంది రాలేదు. ఇంటర్ పరీక్షలు సజావుగా ముగిసినట్లు డీఐఈవో అంజయ్య తెలిపారు. 14న ఫిజికల్ సైన్స్ ఫస్టియర్, 16న ఫిజికల్ సైన్స్ సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. శుక్రవారం పరీక్షలు పూర్తి కాగానే కేంద్రాల విద్యార్థులు కేరింతలు కొట్టారు. సెల్ఫోన్లలో ఫొటోలు దిగారు. మళ్లీ ఎప్పుడు కలుస్తామోనని కాసేపు కబుర్లలో మునిగితేలారు. పరీక్షలన్నీ పూర్తి కావడంతో విద్యార్థులు హాస్టళ్ల నుంచి స్వగ్రామాలకు తరలివెళ్లారు. ఇంతకాలం కుటుంబసభ్యుల మాదిరిగా కలిసి ఉన్న హాస్టల్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులను విడిచి వెళ్లాల్సి రావడంతో కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థులతో బస్స్టేషన్లు కోలాహలంగా మారాయి. -
వీఆర్ఏతో వ్యక్తిగత పనులు
తానూరు: తానూర్ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించే వీఆర్ఏలతో అధికారులు వ్యక్తిగత పనులు చేయించుకోవ డం చర్చనీయాంశమైంది. కార్యాలయంలో ప్రభుత్వ పనులు చేయించుకోవాల్సిన అధికా రులు తమ సొంత పనులు చేయాలని ఆదేశి స్తున్నారు. గురువారం ఓ అధికారి వీఆర్ఏతో కారు శుభ్రం చేయించుకున్నాడు. కార్యాలయానికి వచ్చిన మండల వాసులు ఈ దృశ్యాన్ని సెల్ఫోన్లో బంధించారు. అధికారుల తీ రుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయ మై ‘సాక్షి’ సదరు అధికారిని వివరణ కోరగా, కారుపై చెత్త పడడంతో తొలగించాడని తెలిపారు. -
బీసీల సంక్షేమానికి నిధులు కేటాయించాలి
నస్పూర్: ఈ నెల 16నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో బీసీల సంక్షేమానికి రూ. 50 వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సమితి ఆధ్వర్యంలో గురువారం సీసీసీ కార్నర్లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. హామీ విస్మరించి మొదటి బడ్జెట్ సమావేశాల్లో రూ.9వేల కోట్లు, రెండో బడ్జెట్ సమావేశాల్లో రూ.11 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టడం బీసీలకు అన్యాయం చేయడమేనని విమర్శించారు. 56శాతం జనాభా ఉన్న బీసీలకు అరకొర నిధులు కే టాయిస్తే వారి ఆర్థికాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అత్యధిక పన్నులు చెల్లించేది బీసీ లేనని చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో బీసీ లకు రూ.50వేల కోట్లు కేటాయించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు గజెల్లి వెంకటయ్య, వేముల అశోక్, చంద్రగిరి చంద్రమౌళి, అంకం సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లోనే గ్యాస్ బుకింగ్
మంచిర్యాలఅగ్రికల్చర్: గ్యాస్ వినియోగదారులు ఆన్లైన్లో మాత్రమే సిలిండర్లు బుక్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు సూచించారు. గురువారం ఆయన చాంబర్లో ఎల్పీజీ డీలర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్యాస్ కంపెనీల సేల్స్ అధికారులతో ఫోన్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో గృహావసరాల కోసం వినియోగించే డొ మెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని తెలిపారు. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలు, గోదాముల వద్దకు వెళ్లకుండా ఆన్లైన్లో మాత్రమే సిలిండ ర్లు బుక్ చేసుకోవాలని సూచించారు. గ్యాస్ బు కింగ్ గడువు సింగిల్ సిలిండర్ వారికి 25రోజు లు, డబుల్ సిలిండర్ వారికి 30 రోజుల వ్యవధి ఉంటుందని పేర్కొన్నారు. సిలిండర్ డెలివరీ స మయంలో డెలివరీ బాయ్కి ఓటీపీ చెప్పి సహకరించాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో వాణిజ్య సిలిండర్ మాత్రమే వినియోగించాలని, నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగించినాస్తే కఠినచర్యలు తీసుకుంటామ ని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్లో సిలిండర్లను విక్రయించాలని చూస్తే నిత్యాసవరాల సరుకుల చట్టం 1955 కింద కఠి నచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవైసీ చేసుకోనివారు వినియోగదారులు వెంటనే చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలి
రామకృష్ణాపూర్: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హుల కు అందేలా చూడాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూ చించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అ మ్మాగార్టెన్స్లో గురువారం ప్రజాపాలన–ప్రగతి ప్ర ణాళికపై సర్పంచులు, మంచిర్యాల మేయర్, డి ప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కా ర్యక్రమానికి హాజరై మాట్లాడారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీ టి సరఫరా, పైపులైన్ల మరమ్మతులు, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై ప్రజాప్రతినిధులకు త్వరలో అవగాహన కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలి క వసతుల కల్పనపై దృష్టి సారించాలని, స్వయం సహాయక సంఘాల మహిళలూ భాగస్వాములు కా వాలని సూచించారు. అర్హులకు రేషన్కార్డులు అందేలా చూడాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నా రు. కాగా, శిక్షణ కార్యక్రమం కొనసాగుతుండగా ప్ర జాప్రతినిధులంతా భోజనాలకు వెళ్లారు. దీంతో భో జనాల ఏర్పాటుకు కారణమైన అధికారికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. డీసీపీ భా స్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీపీవో వెంకటేశ్వర్రావు, ఆయా డిపార్ట్మెంట్ల అధికారులున్నారు. -
శభాష్ ఫైర్సిబ్బంది
మంచిర్యాలక్రైం: ఇంట్లో బెడ్రూంలో డోరు లా క్ పడి లోపల ఉన్న చిన్నారిని సురక్షితంగా కా పాడి ఫైర్ సిబ్బంది శభాష్ అనిపించుకున్నా రు. వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాకేంద్రంలోని చున్నంబట్టివాడలో సుద్దాల అజయ్–సుస్మిత దంపతులకు కుమార్తె అద్వైత(2) ఉంది. గురువారం ఇంట్లో బెడ్రూంలో ఆడుకుంటూ డోర్ లాక్ పడింది. డోర్ తెరువకపోవడంతో అజయ్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకున్నారు. లాడర్ సహాయంతో మూడు అంతస్తులపై భవనం పైకి చేరుకుని వెంటిలేషన్ డ్రిల్స్ తీసివేశారు. గదిలో చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తల్లిదండ్రులు, స్థానికులు ఫైర్ సిబ్బందిని అభినందించారు. -
బెల్లంపల్లిలో బీజేపీ భిక్షాటన
బెల్లంపల్లి: నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇ వ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం పట్టణంలో బీ జేపీ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. పాత బస్టాండ్ ఏరియా రోడ్డుపై పాదచారులు, షాపుల వద్దకు వెళ్లి యాచించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేశ్, కార్యదర్శి రాచర్ల సంతోష్కుమార్ మాట్లాడుతూ.. అర్హులను విస్మరించి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేసి, అధికా ర పార్టీ నాయకులు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికై నా అర్హులకు ఇళ్లు కేటా యించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ పట్టణాధ్యక్షురాలు దార కళ్యాణి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గోమాస కమల, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కోడి సురేశ్, పట్టణ కోశాధికారి సంతోష్ అగర్వాల్, నాయకులు మల్లేశ్, ఓంసాయి, రాము, ప్రశాంత్, శ్రీనివాస్, సా గర్, సందీప్, తేజవంశీ తదితరులు పాల్గొన్నారు. -
17న సింగరేణి పరిరక్షణ కోసం ఆందోళనలు
బెల్లంపల్లి: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కా రం కోసం ఈనెల 17న ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూ నియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటస్వామి, బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, గోలేటి, బెల్లంపల్లి బ్రాంచి ఇన్చా ర్జి చిప్ప నర్సయ్య తెలిపారు. బెల్లంపల్లి సీపీఐ కా ర్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఏసీబీ కేసు నమోదును ఆసరా తీసుకుని సింగరేణిలో మెడికల్ బోర్డును ఆపేయడం సరైంది కాదన్నారు. ఈ విషయాన్ని ఏఐటీయూసీ గుర్తింపు సంఘం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా యధాతథంగా బోర్డు కొనసాగి స్తామని హామీ ఇచ్చిన అమలుకావడం లేదన్నారు. మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల సింగరేణిలో అ వినీతి, కుంభకోణాలు జరుగుతున్నాయని ఈక్రమంలో ఆందోళన కార్యక్రమాలకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందులోభాగంగా ఈనెల 17న గనులు, విభాగాల్లో నల్లబ్యాడ్జీలు ధ రించి ధర్నాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. 18 నుంచి శ్రీరాంపూర్లో సేవ్ సింగరేణి జాతా ప్రారంభించి అన్ని ఏరియాల కార్మికులను చైతన్యపరుస్తామన్నారు. 30న కొత్తగూడెం హెడ్ఆఫీసు ఎదుట ధర్నా, ఏప్రిల్లో సమ్మె చేస్తామని ప్రకటించారు. సమావేశంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ఆడేపు రాజమౌళి, తిరుపతిగౌడ్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, శ్రీధర్, రమేశ్, రాంచందర్, సాగర్, శేషికుమార్, రామకృష్ణ, వివేక్ పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం
నేరడిగొండ: మండలంలోని బోరిగాం గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా క్షణాల్లోనే మంటలు చెలరేగా యి. ఈ ప్రమాదంలో మూడు నివాస గృహాలతో పాటు రెండు పశువుల కొట్టాలు దగ్ధమయ్యాయి. ఇళ్లలో ఉన్న నిత్యావసర వస్తువులు, నగదు, ధాన్యం, ఇతర విలువైన సామగ్రి పూర్తిగా కాలిబూడిదయ్యాయి. గ్రామస్తులు మంటలార్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే కాలిపోయాయి. ఇచ్చోడ నుంచి ఫైరింజన్ ఘటన స్థలానికి చేరుకుని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ప్రమాదంలో జాదవ్ ప్రేమ్సింగ్, జాదవ్ సుందర్, జాదవ్ అంబర్సింగ్ నివాస గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే జాదవ్ రెడ్డియా, రాథోడ్ బిక్కులాల్కు చెందిన పశువుల కొట్టాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.20 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
23న ‘కోడ్’ల రద్దుకు ధర్నా
బెల్లంపల్లి: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నా లుగు లేబర్ కోడ్లు రద్దు చేయాని డిమాండ్ చే స్తూ ఈనెల 23న హైదరాబాద్ ఆర్ఎల్సీ కా ర్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివా స్ తెలిపారు. కార్మికులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. గురువా రం బెల్లంపల్లి సింగరేణి సివిల్ విభాగం కార్యాలయ ఆవరణలో ధర్నా పోస్టర్ ఆవిష్కరించా రు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మి కవర్గానికి అత్యంత ప్రమాదకరమని, వీటిని నివారించాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో ఈనెల 16న కలెక్టరేట్లు ముట్టడిస్తామని తెలిపారు. నాయకులు కృష్ణవేణి, వెంకటి, ల త, కొమురయ్య, శ్రీనివాస్, భాను, అమృత, మైసక్క, చంద్రకళ, కరుణ, వెంకటేశ్, బుచ్చ వ్వ, రాజేశ్వరి, కుమార్ తదితరులున్నారు. పాతమంచిర్యాల: నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని ఈ నెల 16న తలపెట్టిన ‘కలెక్టర్ ముట్టడి’ పోస్టర్ను జిల్లా కేంద్రంలోని మార్క్స్ భవన్లో ఆవిష్కరించారు. కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మంతెన మల్లన్న కోరారు. నాయకులు సురేందర్, రాజేశ్, తిరుపతిరెడ్డి, దేవన్న, అరుణ, సత్యం పాల్గొన్నారు. -
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
మంచిర్యాలక్రైం: పోలీస్శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహించి అనారోగ్యంతో మృతి చెందినవారి కుటుంబాలకు అండగా ఉంటామని రామగుండం పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ (అడ్మిన్) శ్రీని వాస్ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో వివిధ స్టే షన్లలో హోంగార్డుగా విధులు నిర్వహించిన రాములు, తిరుపతి అనారోగ్యంతో మృతి చెందగా తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ సంక్షేమ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.15వేల విలువైన చెక్కులను ఆయన కార్యాలయంలో గురువారం అందజేశారు. ఎస్బీ ఏసీపీ నాగేంద్రగౌడ్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, హోంగార్డు ఆర్ఐ పెద్దన్న తదతరులు పాల్గొన్నారు. -
ఐకే–1ఏ, ఐకే–ఓసీపీలో మైన్క్లోజర్ తనిఖీ
చెనూరు: జైపూర్ మండలం ఇందారం ఐకే–1ఏ, ఐకే–ఓసీపీలో ప్రోగ్రెసివ్ మైన్క్లోజర్ కార్యక్రమంలో భాగంగా వోఎస్డీ(సీసీవో,ఎంవోసీ) కృష్ణమోహన్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ బృందం గురువారం పర్యటించింది. మైన్క్లోజర్ పనులు పరిశీలించి గనుల తవ్వకం పూర్తయిన ప్రదేశాల్లో మట్టి నింపడం, చెట్లు నాటడం వంటి చర్యల ద్వారా పర్యావరణహితంగా పునరుద్ధరించే కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. ఐకే–గ్రూప్ ఏజెంట్ ఏవీ.రెడ్డి గనుల పరిసరాలను బృందానికి వివరించారు. అంతకుముందు శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్.. వోఎస్డీ కృష్ణమోహన్ను సన్మానించారు. కార్పొరేట్ పర్యావరణాధికార విభాగం అదనపు మేనేజర్లు తిరుపతి, శంకర్, బాబ్జీలు, కార్పొరేట్ ఎస్ఎస్వో యాదగిరి, డీజీఎం ఫారెస్టు హరినారాయణ, ఐకే–ఓసీపీ మేనేజర్ నాగన్న, కోటయ్య, పర్యావరణాధికారి హన్మాన్గౌడ్ తదితరులు ఉన్నారు. -
బాలికలు హెచ్పీవీ టీకా తీసుకోవాలి
మంచిర్యాలటౌన్: 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపున్న బాలికలు హెచ్పీవీ టీకా తీసుకోవాలని ప్రోగ్రాం అ ధికారి డాక్టర్ అనిల్కుమార్ సూచించారు. జిల్లా వై ద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బాలికలకు అవగాహన క ల్పించారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివా రించేందుకు ఉద్దేశించిన టీకాలను ప్రభుత్వం ఉచి తంగా ఇస్తోందని తెలిపారు. మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూర్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాలకు తల్లిదండ్రుల నుంచి సమ్మతిపత్రంతో పాటు ఆధార్కార్డు తీసుకువెళ్లాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థినులు ఒత్తిడికి గురికా కుండా పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు. హె ల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు నాందేవ్, దీక్షితారాణి, ప్రిన్సిపాల్ సంధ్య, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసరావు, ఏఎన్ఎం రాజేశ్వరి, పాఠశాల స్టాఫ్ నర్సు శ్రీలత ఉన్నారు. -
క్లుప్తంగా
ఇంట్లో చోరీ.. కడెం: మండల కేంద్రంలో పట్టపగలే ఇంట్లో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శివానందగౌడ్ ఇంటికి తాళం వేసి ఉంది. గురువారం మధ్యాహ్నం ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ప్లాస్టిక్ డబ్బాలు ఎరుకుంటూ ఆ ఇంట్లో చొరబడ్డారు. బీరువా పగులగొట్టి బంగారం, డబ్బులు ఎత్తుకెళ్తుండగా స్థానికులు అనుమానం వచ్చి అడ్డుకున్నారు. వారి వద్ద నుంచి బంగారం చైన్, డబ్బులు స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని దొంగలను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ విషయమై ఎస్సై సాయికిరణ్ను సంప్రదించగా ముగ్గురితోపాటు, మరికొందరు ఉన్నారని, వారి గురించి విచారిస్తున్నట్లు తెలిపారు. -
బెదిరిస్తే స్థలం వదులుకుంటామా?
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలో ప్రభుత్వం పీఆర్టీయూ సంఘానికి కేటాయించిన స్థలంలో పాగా వేసి బెదిరింపులకు పాల్పడినంత మాత్రాన స్థలాన్ని వదులుకుంటామా అని కబ్జాదారులను పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సర్వేనంబర్ 426లో 2004 అప్పటి ప్రభుత్వం కేటాయించిన 484 గజాల భూమిని ఓ కార్పొరేటర్ కబ్జాకు పాల్పడుతున్న విషయం తెలుసుకుని హుటాహుటిన మంచిర్యాలకు చేరుకున్నారు. జిల్లాకు చెందిన టీచర్లతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. కబ్జాకు యత్నించిన విషయమై మేయర్ ధర్ని మధుకర్, డీసీపీ భాస్కర్ను వేర్వేరు కలిసి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు యత్నించడం, జిల్లా నాయకత్వాన్ని బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో కబ్జాదారులు వెనుదిరిగినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్షమయ్యగౌడ్, ఆడిట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొట్టే శంకర్, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి డీసీపీని కలిసి వివరిస్తున్న శ్రీపాల్రెడ్డి, తదితరులు -
నగర అభివృద్ధికి కృషి చేద్దాం
మంచిర్యాలటౌన్: నగర అభివృద్ధికి కృషి చేద్దామని నగరపాలక సంస్థ మేయర్ దర్ని మధుకర్ పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో మొదటి సాధారణ సమావేశాన్ని మేయర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కమిషనర్ అన్వేశ్ ఆధ్వర్యంలో నిర్వహించా రు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తాగునీటి సమస్య లేకుండా చూడాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను ఆదేశించా రు. సమావేశ మందిరం నిర్మాణానికి రూ.50 లక్షలు ముందుగా కేటాయించగా, ఫర్నిచర్, ఇంటీరియర్ డెకరేషన్, సౌండ్ సిస్టం కోసం రూ.10 లక్షలు, మ హాప్రస్థానంలో ట్యాంక్ నిర్మాణానికి రూ.15 లక్షలను సాధారణ నిధుల నుంచి కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మేయర్, డిప్యూటీ మేయర్ క్యాబిన్లు, కమిషనర్ నూతన చాంబర్ కోసం నిధుల కేటాయింపుతోపాటు, వివిధ పనులకు రూ.1.11 కోట్లు కేటాయించారు. ఇంజినీరింగ్ విభాగంలో నీ టి సరఫరా, ఎలక్ట్రికల్ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల కాలపరిమితి మార్చి 2025తో ముగియనుండగా, 2027 మార్చి వరకు వేతనాల కోసం అయ్యే వ్యయం రూ.1.83 కోట్లు మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి చెల్లించేందుకు పరిపాలన ఆమోదం పొందారు. తాత్కాలికంగా 11మంది ట్యాంకర్ డ్రైవర్లను మార్చి 2027వరకు తీసుకునేందుకు గాను రూ.19.80 లక్షల మంజూరుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. నస్పూరుతోపాటు విలీన గ్రా మాల్లో తాగునీటి సరఫరా నిర్వహణ, అభివృద్ధికి రూ.32.95 లక్షలు, మంచిర్యాలలో తాగునీటి సరఫరా నిర్వహణకు రూ.25 లక్షలు, నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు ఫిబ్రవరిలో చేసిన ఖర్చు రూ.24.23 లక్షలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ప్రతీ డివిజన్కో కార్యాలయం చొప్పున 60 డివిజన్లలో నిర్మించేందుకు రూ.1.40 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కా ర్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కోసం రోజువారీ కార్మికులను తీసుకునేందుకు గాను రూ.40లక్షల సాధారణ నిధులకు పరిపాలన ఆమోదం తెలిపారు. మంచిర్యాల కా ర్పొరేషన్లో ఆస్తి పన్ను, నీటి పన్ను, ఇతర పన్నుల బకాయిల వసూలుకు అవగాహన, విస్తృత ప్రచా రం నిర్వహించేందుకు నాలుగు ఆటోలను మార్చి 31వరకు ఎంగేజ్ తీసుకునేందుకు రూ.3.10లక్షలు కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. -
ఉజ్వల భవిష్యత్తుకు పాలిటెక్నిక్..
లక్ష్మణచాంద: ఉజ్వల భవిష్యత్తుకు పాలిటెక్నిక్ విద్య పాలిటెక్నిక్ బాటలు వేస్తోంది. ఈ విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇంజినీర్గా ఎదగాలనుకునే వారికి ఈ కోర్సు ముఖ్యమైందని నిర్మల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా.రమేశ్ తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లొమా సాంకేతిక విద్యలో ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయని, ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. అందుబాటులో కోర్సులుడిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్, ఇతర స్పెషలైజేషన్లు, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, వెటర్నరీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పాలిసెట్ ద్వారానే అడ్మిషన్స్ పొందవచ్చు. ఉద్యోగావకాశాలుజూనియర్ ఇంజినీర్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేయడం, ప్రాజెక్టులను పర్యవేక్షించడం, బృందాలు నిర్వహించడం. టెక్నీషియన్: పరిశోధన, అభివృద్ధి, పరీక్ష, నిర్వహణలో ఇంజినీర్లు, శాస్త్రవేత్తలకు సహాయం చేయడం. సూపర్వైజర్: తయారీ పరిశ్రమల్లో ఉత్పత్తి, నాణ్యత నియంత్రణ, నిర్వహణ పర్యవేక్షించడం. తయారీ రంగం: ఆటోమొబైల్, ఏరోస్పేస్, హెవీ మెషినరీ, ఎలక్ట్రానిక్స్, వివిధ పరిశ్రమలకు డిప్లొమా హోల్డర్లను నియమించుకుంటాయి. నిర్మాణ రంగం: భవనం, పౌర, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిర్మాణం, ఎలక్ట్రికల్ ఇతర మెకానికల్ ఇంజినీరింగ్లో డిప్లొమా హోల్డర్లు అవసరం. ఐటీ,ఐటీఈఎస్: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, మెయింటెనెన్స్ కోసం కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో డిప్లొమా హోల్డర్లు అవసరం. జీతం ప్యాకేజీలు: డిప్లొమా హోల్డర్లు పరిశ్రమ, ఉద్యోగ పాత్ర, స్థానాన్ని బట్టి నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం ప్యాకేజీ ఉంది. విద్యార్థులకు వరంలాంటిది ఆదిలాబాద్, నిర్మల్, బెల్లంపల్లి, ఉట్నూర్లో మెకానికల్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, సివిల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి జిల్లా విద్యార్థులకు పాలిటెక్నిక్ విద్య వరంలాంటిది. పాలిసెట్ పరీక్ష రాసి డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ పొందాలి. సాంకేతిక విద్యనభ్యసించి ఉద్యోగావకాశాలు పొందాలి. ఈ సంవత్సరం నూతనంగా కంప్యూటర్ సైన్స్, ఆటోమేషన్ రోబోటిక్స్ కోర్సులు మంజూరు చేయాలని కోరుతూ ఏఐసీటీకి దరఖాస్తు చేశాం. మరో రెండు కోర్సులు నిర్మల్లో అదనంగా అందుబాటులోకి వస్తాయి. – డా.టి.రమేశ్, ప్రిన్సిపాల్, పాలిటెక్నిక్ కళాశాల, నిర్మల్ పరీక్ష వివరాలు: అధికారిక వెబ్సైట్: polycet. sbtet. telangana. gov. inÌ దరఖాస్తుకు చివరి తేదీ: 20.04.2026అపరాధ రుసుము: రూ.100 (21.04.26) అపరాధ రుసుము: రూ.300 (22.04.26) పరీక్ష తేదీ: మే 13, 2026 రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీలకు: రూ.250 ఇతరులకు: రూ.500 పరీక్ష విధానం: ఆఫ్లైన్ (పెన్–అండ్–పేపర్ టెస్ట్) 2:30 గంటలు, మ్యాథమెటిక్స్(60), ఫిజిక్స్(30), కెమిస్ట్రీ(30), బయాలజీ(30) నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, వెటర్నరీ డిప్లొమా కోర్సులు చేయాల్సినవారికి బయాలజీ ప్రశ్నలు కూడా ఉంటాయి. ఉన్నత విద్యావకాశాలు: పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఇంజినీరింగ్ కోర్సుల్లో రెండో సంవత్సరం నేరుగా ఈ సెట్ పరీక్ష ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు. -
డబ్బులు వెంటనే చెల్లించాలి
నస్పూర్: సహారా ఇండియా సంస్థలో గడువు తీరిన ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు వెంటనే చెల్లించాలని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, తె లంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య డిమాండ్ చేశారు. గురువా రం ఆయన బాధితులతో కలిసి సీసీసీ కార్నర్లోని సహారా ఇండియా సంస్థ కార్యాలయం ఎ దుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ కుమారస్వామికి వినతిపత్రం అందజేశారు. 15రోజుల్లో డబ్బులు చెల్లించకుంటే మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, నస్పూర్ కార్యాలయాల ఎదుట సామూహిక ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. బాధితులు వెంకట్రె డ్డి, పెద్దపల్లి మల్లయ్య, మోతె కాంతయ్య, రాజ మౌళి, అంకం సతీశ్, శంకర్, మల్లయ్య, అరుణ, నక్షత్ర, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభం
జన్నారం: మండలంలోని చింతగూడలో ని ర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని గురువారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుతారి సుమలత ఎమ్మెల్యే దృష్టికి గ్రామ సమస్యలు తీసుకెళ్లగా, ఆయన స్పందించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తదితరులున్నారు. క్రీడా పోటీలు ప్రారంభంమంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాల మైదానంలో మై భారత్ (మేరా యువ భారత్) ఆధ్వర్యంలో క్లస్టర్ బ్లాక్ స్థాయి క్రీడాపోటీలు గురువారం అట్ట హాసంగా ప్రారంభమయ్యాయి. రెండ్రోజుల పాటు నిర్వహించనున్న పోటీలను కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వై.నరేందర్రెడ్డి ప్రారంభించారు. రన్నింగ్, షటిల్, బ్యాడ్మింటన్, వాలీబాల్ పోటీల్లో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఇన్చార్జి గోపాలకృష్ణ, కళాశాల అధ్యాపకులున్నారు. నూతన నియామకంమంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన బీజేపీ నాయకుడు, న్యాయవాది తులా ఆంజనేయులును పార్టీ తెలంగాణ మీడియా ప్యానలిస్ట్గా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నియమిస్తూ ఉ త్తర్వులు జారీ చేశారు. ఆంజనేయులు విద్యార్థి దశలోనే ఏబీవీపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. బీజేవైఎం మంచిర్యాల జిల్లా క న్వీనర్గా, అధ్యక్షుడిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా సేవలందించారు. తనను బీజేపీ మీడియా ప్యానలిస్ట్గా నియమించినందుకు గాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్గౌడ్కు ఈ సందర్భంగా ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. -
ముగిసిన ఫస్టియర్ పరీక్షలు
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ముగి శాయి. చివరిరోజు 6,319 మంది విద్యార్థులకు గాను 6,065 మంది హాజరు కాగా, 254 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 5,665 మందికిగాను 5,472 మంది హాజరు కాగా, 193 మంది పరీక్షలు రాయలేదు. వొకేషనల్లో 654 మందికి గాను 593 మంది హా జరుకాగా 61 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో అంజయ్య తెలిపారు. కాగా, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు పూర్తి కావడంతో వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు ఇంటిబాట పట్టారు. చివరి పరీక్ష రాసి బయటకు వచ్చిన వారంతా కేరింతలు పెట్టారు. సెల్ఫీలు దిగి సందడి చేశారు. అనంతరం హాస్టల్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామాలకు తరలివెళ్లారు. -
ల్యాప్టాప్ కష్టాలు
భైంసా: గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బాసరలోని ట్రిపుల్ఐటీ ప్రస్తుతం సమస్యల గూడంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక విద్యకు ప్రతీకగా నిలవాల్సిన ఈ విద్యాసంస్థలో విద్యార్థుల చేతుల్లో పుస్తకాలే తప్ప, వారి చదువుకు అవసరమైన ల్యాప్టాప్లు కనిపించడం లేదు. ఇంజినీరింగ్ మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న సుమారు 3 వేల మందికి ఇప్పటివరకు ల్యాప్టాప్లు ఇవ్వకపోవడంతో వారి భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులకు కలగానే..గతంలో పదో తరగతి అనంతరం ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందిన వెంటనే పీయూసీ చదువుతున్న విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేసే విధానం ఉండేది. కానీ గత ఆరేళ్లుగా ఆ సంప్రదాయం నిలిచిపోయింది. కనీసం ఇంజినీరింగ్లోకి వచ్చిన తర్వాత అయినా ల్యాప్టాప్లు అందుతాయని ఆశించిన విద్యార్థులకు అది కలగానే మిగిలింది. ఇంజినీరింగ్ విద్యలో కీలకమైన కోడింగ్, డిజైనింగ్, ప్రోగ్రామింగ్ వంటి అంశాలను కంప్యూటర్ లేకుండానే నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాక్టికల్స్ చేయడానికి అవకాశం లేకపోవడంతో అనేక మంది పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే వేధింపులుయూనివర్సిటీకి వచ్చే మంత్రులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని విద్యార్థులు చెబుతున్నారు. తమ సమస్యలను బయటకు చెబుతున్న వారిపై అధికారులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమస్యలపై ప్రశ్నించిన విద్యార్థులను వేధిస్తున్నారని, ఈ విషయమై మంత్రులు, మానవ హక్కుల సంఘానికి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు పేర్కొంటున్నారు. రెండేళ్లలో ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటకు వెళ్లాల్సిన విద్యార్థులు కనీసం కంప్యూటర్ మౌస్ పట్టుకోకుండా డిగ్రీలు పూర్తిచేసి వెళ్తేవారికి ఉద్యోగాలు ఎలా వస్తాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గ్రామీణప్రాంతాల నుంచి పెద్ద ఆశలతో వచ్చిన పేద విద్యార్థులు ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే నిధులు విడుదల చేసి విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. పంపిణీకి నిధుల కొరత సాకు!ల్యాప్టాప్ల పంపిణీకి నిధుల కొరతను సాకుగా చూపుతున్న అధికారులు పీయూసీ విద్యార్థుల కోసం నామమాత్రంగా ఒక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. 3,300 మంది విద్యార్థులు ఉన్న విభాగంలో కేవలం వంద నుంచి రెండు వందల డెస్క్టాప్ కంప్యూటర్లను మాత్రమే ఉంచడం వారిలో అసంతృప్తిని కలిగిస్తోంది. కంప్యూటర్ ఉపయోగించేందుకు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. మరో రెండునెలల్లో ల్యాప్టాప్లు ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మరో రెండు నెలల్లో ల్యాప్టాప్లు అందజేస్తాం. పీయూసీ విద్యార్థుల కోసం ప్రస్తుతం ల్యాబ్లో 1,250 ల్యాప్టాప్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. – వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ -
గుడుంబా స్థావరాలపై దాడులు
కోటపల్లి: మండలంలోని ఆలుగామలో బుధవారం పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సుమారు 1500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. నలుగురు మహిళల నుంచి 70 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ గుడుంబా మహమ్మరి వల్ల ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. గ్రామంలో గుడుంబా తయారు చేసినా విక్రయించినా దానికి అవసరమైన ముడిసరుకులు సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడుంబా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ సమ్మయ్య, కోటపల్లి ఎస్సై రాజశేఖర్, ఎకై ్సజ్ ఎస్సై వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. -
చదువుతోపాటు స్కిల్స్ నేర్చుకోవాలి
ఉట్నూర్రూరల్: విద్యార్థులు చదువుతో పాటు స్కిల్స్ నేర్చుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ పీఎమ్మార్సీ భవనంలో ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా యూత్ ఫెస్టివల్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేతో పాటు కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 రకాల అంశాలలో కాంపిటీషన్లలో పాల్గొని ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తానుకూడా డిగ్రీ చదివేటప్పుడు ఎన్ఎస్ఎస్ విద్యార్థినేనని గుర్తు చేసుకున్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించడం సులభం అన్నారు. వీసీ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కమ్యూనికేట్, స్కిల్స్, లీడర్షిప్ కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి ప్రసాద్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలి
చెన్నూర్: పారిశుద్ధ్య నిర్వహణ పనులు పకడ్బందీ గా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం కలెక్టర్ మున్సిపాలిటీలోని ఐదో వార్డులో చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కింద చేపట్టిన పారిశుద్ధ్య పనులు, వంద పడకల ఆస్పత్రి పనులు, స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అ నంతరం తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశం బోధించారు. ఆయన మాట్లాడుతూ.. మెనూ తప్పకుండా పాటించాలని సూచించారు. మున్సిప ల్ కమిషనర్ మురళీకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్కుమార్, ఆయా శాఖల అధికారులున్నారు. విధులు సమర్థవంతంగా నిర్వహించాలి మంచిర్యాలఅగ్రికల్చర్: జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. జనాభా లెక్కల ప్రక్రియ నిర్వహణ, సాంకేతికత వినియోగం, ఇతర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దండేపల్లి: మండలంలో కలెక్టర్ కుమార్ దీపక్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. కొర్విచెల్మలో మెగా గాలికుంటు నిర్మూలన శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలోని డైనేజీలు, నర్సరీని పరిశీలించారు. స ర్పంచ్ సోనియా, ఉపసర్పంచ్ తిరుపతి, ఎంపీడీవో ప్రసాద్, మండల పశువైద్యాధికారి ధన్రాజ్, సి బ్బంది పాల్గొన్నారు. అలాగే, ద్వారక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో చేపట్టిన హాస్టల్ భవన నిర్మాణ పనులు, గోదావరి పుష్కరఘాట్ను పరిశీలించా రు. వెల్గనూర్ గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని సూచించారు. రెబ్బనపల్లి ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెబ్బనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఆరోగ్య ఉ పకేంద్రాన్ని తనిఖీచేశారు. గూడెం గ్రామాన్ని సందర్శించి డ్రైనేజీలు పరిశీలించారు. అనంతరం గుట్టపై కి ఎక్కి పార్కింగ్ స్థలాల గురించి చర్చించారు. ఖాళీ ప్రదేశాల్లో వసతి గృహాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలని సూచించారు. తహసీల్దార్ రోహిత్దేశ్పాండే, ఎంపీడీవో ప్రసాద్, ఎంపీవో కేవీ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
లైఫ్ అండ్ కెరియర్పై అవగాహన
బాసర: ఆర్జీయూకేటీ బాసర విశ్వవిద్యాలయంలో విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని బుధవారం ‘లైఫ్ అండ్ కెరియర్’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అమెరికా, యూకేలోని ప్రముఖ కంపెనీల మాజీ సీఈవో హెచ్.టి.చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్ వైపు మళ్లాలని, కేవలం సీనియర్ల నుంచి మాత్రమే కాకుండా జూనియర్లు, స్నేహితుల నుంచి కూడా నేర్చుకోవాలని సూచించారు. ప్రతీ విద్యార్థి డైరీ రాసే అలవాటు చేసుకోవాలన్నారు. డ్రగ్స్, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండి, కేవలం చదువు, స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలన్నారు. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. అన్నింటికంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అత్యంత ముఖ్యమన్నారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీ దర్శన్, డాక్టర్ టి.నాగ సాయికుమార్, అసోసియేట్ డీన్ (ఇంజనీరింగ్) మహేశ్, విఠల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కిడ్నీలు పదిలమేనా..?
నిర్మల్ఖిల్లా/నిర్మల్చైన్గేట్: కిడ్నీ వ్యాధులు నిశ్శబ్దంగా మనిషి శరీరాన్ని కబళిస్తున్నాయి. ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించకపోవడంతో చాలా మంది తీవ్ర స్థాయికి చేరిన తర్వాతే సమస్యను గుర్తిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల డయాలసిస్ బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం, ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అలవాటు లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మూత్రపిండాల ఆరోగ్యం, డయాలసిస్పై అవగాహన కోసం 2006 నుంచి ఏటా మార్చి రెండో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న బాధితులు మనిషి శరీరంలో కిడ్నీలు (మూత్రపిండాలు) అత్యంత కీలకమైన అవయవాలు. రక్తాన్ని శుద్ధి చేస్తూ, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే ఈ ’ఫిల్టర్లు’ దెబ్బతింటే ప్రాణాలకే ప్రమాదం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మారుతున్న ఆహారపు అలవాట్లు, కలుషిత నీరు, మితిమీరిన పెయిన్ కిల్లర్స్ వాడకం వల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్నినెలలక్రితం ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, భీమ్పూర్, ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలాల్లో వందలసంఖ్యలో ఏకకాలంలో కిడ్నీ వ్యాధిబారిన పడిన సంఘటన విస్మయానికి గురిచేసింది. కలుషిత నీటివనరులు, వంశపారంపర్య కారణాలతోనే ఇలా జరిగే అవకాశముందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. కిడ్నీల పనితీరు ఇలా.. కిడ్నీలు శరీరంలో వెన్నుముకకు ఇరువైపులా 9–10 సెంటీమీటర్ల వెడల్పుతో పాటు 150 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. కిడ్నీలు ప్రధానంగా శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. నీటి లవణాల సమతుల్యత కాపాడుతాయి. రక్తపోటు నియంత్రణకు సహకరిస్తాయి. నిర్మల్ జనరల్ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రంనిర్మల్కుమురంభీంఉమ్మడి జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు కిడ్నీలు దెబ్బతినడానికి ప్రధాన కారణాలు లక్షణాలు కిడ్నీల ఆరోగ్య సూత్రాలు -
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
బెల్లంపల్లి: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీఓఈ) పాఠశాల/కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగుర వేశారు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి 9 వరకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో అండర్–14 విభాగంలో జరిగిన పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లా జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. 03–02 పరుగుల తేడాతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు బంగారు పతకాలు సాధించిందని సీవోఈ కళాశాల ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ తెలిపారు. -
బెల్లంపల్లి పట్టణంలో..
బెల్లంపల్లి: మున్సిపాలిటీలో 34 వార్డులుండగా దాదాపు ప్రతీ వార్డులో కరెంట్ తీగల సమస్య ఉంది. కన్నాల బస్తీ, టేకుల బస్తీ, 24 డీప్ ఏరియా, హన్మాన్ బస్తీ, బూడిదగడ్డ, నంబర్ 2 ఇంక్లైన్, శాంతిఖని, 65డీప్ ఏరియా, బెల్లంపల్లి బస్తీ, పోస్టాఫీస్ బస్తీ తదితర కార్మిక వాడలు, కార్మికేతర ప్రాంతాలైన షంషీర్ నగర్, ఇంక్లైన్ రడగంబాలబస్తీ, అంబేడ్కర్ నగర్, గంగారాం నగర్, రాంనగర్, అశోక్నగర్, బాబుక్యాంపు బస్తీల్లో ఇళ్ల మీదుగా విద్యుత్ తీగలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. బస్తీల్లో కరెంట్ లైన్లు సవరించడంలేదు. కంపెనీ ఏరియాల్లో కరెంట్లైన్ల సమస్య తీవ్రంగా ఉంది. వేలాడుతు న్న విద్యుత్ తీగలు సవరించాలని పలు బస్తీల ప్ర జలు ఫిర్యాదు కోరుతున్నా ఫలితం ఉండడంలేదు. కాగా, కొత్తబస్టాండ్ ఏరియాలో నాలుగేళ్ల క్రితం ఓ ఇంటి పైకప్పు పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు ఇనుప నిచ్చెన కరెంట్ తీగలకు తగలడంతో షాక్తో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. -
చెన్నూర్ మండలంలో..
చెన్నూర్రూరల్: మండలంలోని కత్తెరసాల గ్రామంలో విద్యుత్ స్తంభానికి అమర్చిన మినీ ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ తీగలు ప్రమాదకరంగా మారాయి. రక్షణ కంచె ఏర్పాటు చేయకపోవడంతో పశువులు, అటుగా వెళ్లేవారు దానిని తాకే ప్రమాదముంది. అలాగే, తుర్కపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభం ఇంటి పక్కనే ఒక వైపునకు వంగింది. గాలిదుమారాలు వస్తే స్తంభం పడిపోయే ప్రమాదముంది. గతంలో పలుసార్లు ప్రమాదాలు కూడా జరిగిన ఘటనలున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
ఎల్లంపల్లి వద్ద ముర్రెల్ క్లస్టర్..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట వద్ద గల ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సమీపంలో ముర్రెల్ క్లస్టర్ ప్రాజెక్ట్కు వేదిక కానుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై) కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు గుడిపేటలో ముర్రెల్ చేపల ఉత్పత్తి, సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు కేంద్ర మత్స్య, పశుసంవర్దక శాఖ మంత్రి రాజీవ్ రంజన్సింగ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద రూ. 2.5 కోట్లతో ముర్రెల్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం లభించినట్లు వివరించారు. ముర్రెల్ చేప అంటే రాష్ట్ర చేప కాగా దీనినే బొమ్మె, కొరమీను, కొర్రమట్ట, మట్టగిడసగా పిలుస్తూ ఉంటారు. మత్స్యశాఖకు ఇంకా అందని స్థలం మంచిర్యాల జిల్లా గుడిపేట శివారులో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద ముర్రెల్ క్లస్టర్ కోసం ఇంకా స్థలం మంజూరు పత్రాలు అందలేదు. ఇప్పటికే 85 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేయగా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ద్వారా మత్స్య శాఖకు స్థలాన్ని అప్పగించాల్సి ఉన్నా ఇంకా ఎలాంటి అనుమతులు, పత్రాలు అందలేదు. ఎంపిక చేసిన 85 ఎకరాల్లో 30 ఎకరాల్లో ముర్రెల్ క్లస్టర్ ఏర్పాటు జరగనుండగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముర్రెల్ చేపల పెంపకం, సంరక్షణ చేపట్టనున్నారు. ముర్రెల్ క్లస్టర్ ఏర్పాటుతో మత్స్యకారుల కు, మహిళా స్వయం సహాయ సంఘాలకు లబ్ధి చే కూరనుండగా ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగనున్నారు. మొత్తంగా మంచిర్యాల ముర్రెల్ క్లస్టర్ రాష్ట్ర, దేశానికి తలమానికంగా నిలవబోనుంది. -
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూ పాలి. ప్రతీరోజు వ్యా యామం చేయడం అలవాటు చేసుకోవాలి. బీపీ, షుగర్ అదుపులో ఉంచుకోవాలి. పాయిజన్ తీసుకున్న వారిలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. నిర్మల్ జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం 78 మంది డయాలసిస్ సేవలు పొందుతున్నారు. – డాక్టర్ గోపాల్ సింగ్, నిర్మల్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ జీవన శైలితోనే నియంత్రణ కిడ్నీ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే మందులతోనే నియంత్రించవచ్చు. ఎక్కువ ప్రభావితమైన తర్వాత డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి తప్పదు. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలు కనిపిస్తే డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్లను సంప్రదించకుండా మితిమీరిన పెయిన్కిల్లర్స్ వాడకూడదు. ఆరోగ్య అవగాహనే కిడ్నీలకు ఉత్తమ రక్షణ. – డాక్టర్ అశోక్, యూరాలజిస్టు, నిర్మల్ -
‘గ్యాస్’ గుది బండ!
జిల్లాలో ఎల్పీజీ కనెక్షన్ల వివరాలుగృహావసర కనెక్షన్లు 2,59,850 కమర్షియల్ కనెక్షన్లు 1,475సాక్షి ప్రతినిఽధి, మంచిర్యాల: ఇరాన్–అమెరియా ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా జిల్లాలో ఎల్పీజీ కొరత ఏర్పడింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఫుడ్ బిజినెస్ వ్యాపారులతోపాటు ప్రతీ ఇంట్లోనూ గ్యాస్తో ఇబ్బంది పడే అవకాశముంది. ఇటీవల గృహావసర సిలిండర్ (14.02కిలోలు)పై రూ.60 పెరిగి ధర రూ.987కు చేరింది. వ్యాపారపరంగా వాడే సిలిండర్ (19కిలోలు)పై రూ.115 పెరిగి ధర రూ.2,200కు చేరుకుంది. వాహనాల్లో వాడే సీఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్లలోనూ కిలోకు రూ.91చొప్పున విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలో ప్రతీనెల మొత్తం గ్యాస్ కనెక్షన్లలో 10 శాతం రీఫిల్లింగ్కు వస్తాయనే అంచనా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు వినియోగదారులు మొగ్గు చూపడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. ఇదే అదనుగా కొన్ని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వ్యాపారులకు బ్లాక్లో అమ్ముకునేందుకు పక్కదారి పట్టించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిలిచిన కమర్షియల్ సరఫరా రెండురోజులుగా జిల్లాకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచింది. దీంతో హోటళ్లు, రెస్ట్రారెంట్ల నిర్వాహకులు, స్ట్రీట్ఫుడ్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల గృహావసర సిలిండర్లనే వాడుతున్నారు. వీటిని నివారించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు కేసులు నమోదు చేసేందుకు తనిఖీలు చేస్తున్నారు. రెండురోజుల క్రితం రామకృష్ణాపూర్ పట్టణంలో అనధికారికంగా వాడుతున్న 12 సిలిండర్లు సీజ్ చేశారు. పెరుగుతున్న ఆంక్షలు ఎల్పీజీ ప్రధాన సరఫరాదారులైన ప్రభుత్వ రంగ హిందూస్థాన్, భారత్, ఇండేన్ కంపెనీలు ఇప్పటికే వాడకం, బుకింగ్పై ఆంక్షలు విధించాయి. వినియోగదారులు రీఫిల్ సిలిండర్ తీసుకున్నాక 21రోజులకు మరోటి పొందేలా గడువు పెట్టారు. తాజాగా మళ్లీ మరో ఐదురోజులకు పెంచి, 25రోజులకు చేశారు. ఇక రెండు ఉంటే నెలవరకు గడువు విఽధించారు. ఇలాగే సరఫరాలో అంతరాయం ఏర్పడితే సరఫరా గడువు మరింత పెరిగే అవకాశముంది. మరోవైపు గృహ వినియోగదారులూ ముందస్తుగా సిలిండర్లు బుక్ చేసుకుంటూ నిల్వలు పెంచుకుంటున్నారు. దీంతో బుకింగ్ల సంఖ్య పెరిగినట్లు ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు కమర్షియల్ సిలిండర్లపై ఆయిల్ కంపెనీలు రూ.150చొప్పున ఇచ్చే సబ్సిడీ నిలిచిపోయింది. కట్టెల పొయ్యిలు, పొదుపుగా గ్యాస్ కొరతతో హోటళ్లల్లో గ్యాస్ వాడకంలో పొదుపు మొదలైంది. కొన్నిచోట్ల కట్టెల పొయ్యిపై వంట చేసేందుకు సిద్ధమయ్యారు. కట్టెలకు గతంలో క్వింటాల్కు రూ.400చొప్పున విక్రయించగా, ప్రస్తుతం రూ.800కు చేరినట్లు హోటళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. ఎలక్ట్రికల్ కుక్కర్లు, స్ట్రీమ్, ఇతర ప్రత్యామ్నాయం వెతుకున్నారు. ఎక్కువగా గ్యాస్ అవసరమయ్యే వంటలను తగ్గిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఇబ్బందులు లేనప్పటికీ ఇదే తీరుగా కొనసాగితే ఫుడ్ బిజినెస్పై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాపారాలు వాపోతున్నారు. కమర్షియల్ సరఫరా లేనప్పుడు గృహావసరాలకు వాడే సిలిండర్లు వాడేందుకు అనుమతివ్వాలని కోరుతున్నారు. బ్లాక్ చేస్తే కఠినచర్యలుజిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొంత అంతరాయం ఉన్నప్పటికీ ఇంకా సరిపడా నిల్వలున్నాయి. ఇంకా ఎక్కడా కొరత ఏర్పడలేదు. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా సిలిండర్ల నిల్వలు, రీఫిల్లింగ్ చేస్తే కఠినచర్యలు తీసుకుంటాం. – వేణుగోపాల్, ఏఎస్వో -
మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం
చెన్నూర్: మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం తొలిప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి పేర్కొన్నారు. జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో రూ.30లక్షలతో చేపట్టిన మూడు గ్రామసమైక్య సంఘ భవనాలు, జైపూర్లో రూ.30లక్షలతో చేపట్టిన గోదాం నిర్మాణాలకు బుధవారం కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇందారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. నియోజకవర్గంలో ఒక్కో భవనానికి రూ.30లక్షల చొప్పున వెచ్చించి 35 భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్, పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు ఇందిరా శక్తి క్యాంటీన్లు, పెరటి కోళ్ల పెంపకం, ఇతర అనేక వ్యాపారాల్లో ప్రోత్సహిస్తూ మహిళలను ముందంజలో ఉంచేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించి, బ్యాంక్ లింకేజీ రుణాల ద్వారా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రుణం పొందిన స్వయం సహాయక సంఘాలు సకాలంలో చెల్లించి తిరిగి రుణం పొంది వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలని సూచించారు. మండలానికి 753 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 200 నిర్మాణాలు స్లాబ్ దశలో ఉన్నట్లు తెలిపారు. అనంతరం 39మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి కిషన్, తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్రెడ్డి, స్థానిక సర్పంచ్ ఫయాజ్, భాస్కర్, గ్రామసమైక్య సంఘాల మహిళలు పాల్గొన్నారు. -
ఎస్సార్పీలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ పర్యటన
నస్పూర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నాలుగు కొత్త లేబర్ కోడ్లపై కార్మికులకు అవగాహన కల్పించేందుకు బుధవారం సెంట్రల్ డిప్యూటి చీఫ్ లేబర్ కమిషనర్ భిస్వ భూషన్ సృష్టి శ్రీరాంపూర్ ఏరియాలో పర్యటించారు. కార్మికులకు అందుతున్న వైద్య సేవలను, పీఎఫ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల వివరాల నమోదు, సంక్షేమ కార్యక్రమాల నిర్వాహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను ఏరియా జీఎం శ్రీనివాస్ పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు ఓంకార్బాబు, డీజీఎం అనిల్కుమార్, ఐకే–1ఏ ఓసీ గ్రూప్ ఏజెంట్ ఏవీ రెడ్డి ఏజీఎం ఫైనాన్స్ సు మలత, డీజీఎం అనిల్కుమార్ పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో విఫలంనస్పూర్: సమస్యల పరిష్కారంలో యాజమాన్యం విఫలమైందని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య అన్నారు. నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. అనారోగ్యంతో బాధపడుతూ 10 నెలలుగా బో ర్డుకు దరఖాస్తు చేసుకున్న వారిని పిలవకుండా విఽ దులకు గైర్హాజరవుతున్నారని చర్యలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. స్ట్రక్చర్ సమావేశాల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు పరిష్కరించక పోవడం సరికదాన్నారు. ఈ నెల 17న అన్ని గనులపై నల్లబ్యాడ్జీలతో నిరసన, 18 నుంచి అన్ని ఏరియాల్లో జాత, 30న కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం వద్ద ధర్న నిర్వహించనున్నట్లు తెలి పారు. సమావేశంలో బ్రాంచి కార్యదర్శి కొముర య్య, ఉపాధ్యక్షుడు కిషన్రావు, పిట్ కార్యదర్శి న ర్సింగరావు, కాంట్రాక్ట్ కార్మిక సంఘం బెల్లంపెల్లి రీ జియన్ కార్యాదర్శి అప్రోజ్ఖాన్ పాల్గొన్నారు. -
మందమర్రి మండలంలో..
మందమర్రిరూరల్: మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. సారంగపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో చేతికి అందే ఎత్తులో ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. పన్నేండేళ్ల క్రితం చిర్రకుంట నివాసి రాజు తన పొలంలోంచి వరి నారును మరోచోటకు తీసుకెళ్తుండగా వేలాడే విద్యుత్ తీగలకు తగిలి కరెంట్ షాక్తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో పలు షాపుల మీదుగా వెళ్లే విద్యుత్ తీగలకు నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పైపులు తొడిగారు. రెండో అంతస్తుకు వెళ్లాలంటే కొన్నిచోట్ల విద్యుత్ తీగలకు తొడిగిన పైపులు తగిలే ప్రమాదం లేకపోలేదు. -
లేబర్ కోడ్లపై అవగాహన
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని జీఎం కార్యాలయ ఆవరణలోగల కాన్ఫరెన్స్ హాల్లో కొత్తగా కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తు న్న నాలుగు లేబర్ కోడ్స్పై బుధవారం డిప్యూ టీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) బిశ్వ భూ షణ్ ప్రుస్టి అధికారులకు అవగాహన కల్పించా రు. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21నుంచి 29చట్టాలను కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్గా మా ర్చినట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమం, హ క్కుల భద్రత, వేతన నిర్మాణం, పారదర్శక ఉ ద్యోగ వ్యవస్థ కోసం రూపొందించిన కోడ్స్ను సరిగా అర్థం చేసుకుని అమలు చేయడం అ త్యంత అవసరమని సూచించారు. అనంతరం ఏరియా ఇన్చార్జి జీఎం మల్లయ్య ఆధ్వర్యంలో అధికారులు కమిషనర్ను సన్మానించారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (రామగుండం) యూ సఫ్, ఎస్వోటూ జీఎం లలితేంద్రప్రసాద్, డీజీ ఎం (పర్సనల్) అశోక్కుమార్, కేకే గ్రూపు ఏ జెంట్ రాంబాబు, ఏరియా ఇంజినీర్ బాలాజీ భగవతీఝా, ఏరియా అధికారులు, గనులు, డిపార్ట్మెంట్ల సంక్షేమాధికారులున్నారు. 7వ తేదీకల్లా వేతనాలు చెల్లించాలి చెన్నూర్: ఎస్టీపీపీలో ఆయా కంట్రాక్ట్ ఏజెన్సీ లు ప్రతీనెల 7వ తేదీకల్లా కార్మికులకు వేతనా లు చెల్లించాలని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బిశ్వ భూషణ్ ఆదేశించారు. జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీని సందర్శించగా జీఎంలు నర్సింహారావు, మదన్మోహన్ స్వాగతం పలి కారు. అనంతరం ఆయన స్థానిక ప్రాణహిత అ తిథి గృహంలో పలు ఏజెన్సీలతో సమావేశమై రికార్డులు తనిఖీ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ కూ డా అందించాలని సూచించారు. అనంతరం నూతన కార్మిక చట్టాలపై అవగాహన కల్పించా రు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎండీ యూసఫ్, డీజీఎం శివప్రసాద్, కిరణ్బాబు, ఇతర అధికారులు, ఏజెన్సీల కాంట్రాక్టర్లున్నారు. -
ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీ
భైంసాటౌన్: బాసర వద్ద ఆర్టీసీ బస్సును ఇసుక టిప్పర్ ఢీకొన్న ఘటనలో డ్రైవర్ రియాజ్తో పాటు మరో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యా యి. నిజామాబాద్ నుంచి భైంసాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బాసర రైల్వేస్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ రియాజ్తో పాటు నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై నవనీత్రెడ్డి క్షతగాత్రులను భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ రియాజ్, భైంసా డీఎం హరిప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ ఏరియాస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. -
ఒకరి మృతికి కారణమైన నిందితుడి రిమాండ్
కై లాస్నగర్(బేల): మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒకరి మరణానికి కారణమైన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జైనథ్ సీఐ జి. శ్రావణ్ తెలిపారు. గతేడాది నవంబర్ 5న రాత్రి ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగ్వీ గ్రామానికి చెందిన అంకత్ గణేశ్ మద్యం సేవించి వాహనం నడుపుతూ బేలకు చెందిన బావని శ్రీకాంత్ (25)ను మండల కేంద్రంలోని గణేశ్ గార్డెన్ వద్ద ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి వాగు ఫిర్యాదు మేరకు బేల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
ఆర్జీయూకేటీలో మహిళా దినోత్సవం
బాసర: బాసర ఆర్జీయూకేటీలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా మహిళా సిబ్బంది ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో మహిళా ఉద్యోగుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీ దర్శన్ మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ అధ్యక్షులు డా.కె.రాములు, అసోసియేట్ డీన్స్, డా.ఎం.రమాదేవి, లకుమాదేవి, బి.శ్రీవిద్య, ప్రవల్లిక, సారిక, బి.శ్వేత, శిరీష, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ంతలు ఇంగ్లిష్ మీడియమే..!
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14నుంచి నిర్వహించనున్నారు. జిల్లా నుంచి 9,703 మంది విద్యార్థులు హాజరు కానుండగా.. వీరిలో అత్యధిక శాతం మంది ఇంగ్లిషు మీడియం వారే ఉన్నారు. ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు 91.6శాతం కాగా, తెలుగు మీడియం 8.0శాతం, ఉర్దూ మీడియం 0.5శాతం మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన దాదాపు పది మందిలో తొమ్మిది మంది ఇంగ్లిషు మీడియం ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఉన్నత విద్య ఇంజినీరింగ్, మెడిసిన్, టెక్నాలజీ ఎక్కువగా ఇంగ్లిషు మీడియంలో ఉండడం, ఉద్యోగ అవకాశాల్లోనూ ఆంగ్ల భాషకు ప్రాముఖ్యత పెరగడం, సాంకేతిక పరిజ్ఞానం కోసం ఇంగ్లిషు భాష ప్రాధాన్యం పెరుగుతున్నందున మార్పు కనిపిస్తోంది. జిల్లాలో..జిల్లాలో 372 ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో 9,703 మంది విద్యార్థులు ఉండగా.. వీరిలో 4,896 మంది బాలురు, 4,807 మంది బాలికలు పరీక్షకు హాజరు కానున్నారు. ప్రభుత్వ, లోకల్బాడీ, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో 6,296మంది విద్యార్థులు ఉండగా, ప్రైవేటు విద్యార్థులు 3,407మంది ఉన్నారు. మాధ్యమాల వారీగా..జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యార్థులు 8,884మంది, తెలుగు మీడియం 772మంది, ఉర్దూ మీడియం 47మంది ఉన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 3,385మంది, సర్కారు పాఠశాలలు, కేజీబీవీ, మోడల్స్కూల్, గురుకులాల్లో 5,499 మంది ఇంగ్లిషు మీడియం, చదువుతున్నారు. తెలుగు మీడియం ప్రైవేటులో ముగ్గురు, ప్రభుత్వ స్కూళ్లలో 769మంది ఉన్నారు. ఉర్దూ మీడియం ప్రైవేటు 20మంది, సర్కారు బడుల్లో 27మంది ఉన్నారు. సర్కారు బడుల్లో ఇలా..సర్కారు బడుల్లో తెలుగు మీడియం కంటే ఆంగ్ల బోధన అమలుతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం 9,703 మంది విద్యార్థుల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన 2,556 మంది ఉన్నారు. తెలుగు మీడియంలో 716మంది, ఉర్దూ మీడియంలో 24మంది పరీక్ష రాయనున్నారు. సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా విద్యార్థులు బడిబాట పడుతున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ తరగతులు, ఏఐ పాఠాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. నాణ్యమైన విద్య, ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు, పౌష్టికాహరం, ప్రైవేటులో ఫీజులు భారంగా మారడం, ఆంగ్ల బోధనతో సర్కారు బడుల్లో చేరారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తెలుగు ఇంగ్లిష్ ఉర్దూ మొత్తం బాలురు 407 4479 11 4897 బాలికలు 305 4405 36 4806 మొత్తం 772 8884 47 9703 -
గ్యాస్ కొరతతో హోటళ్లు మూత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ఆ ప్రభావం హోటళ్లపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే బెంగళూర్, చెన్నయ్ మహానగరాల్లో హోటళ్ల బంద్ చేస్తుండగా.. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాలపైనే కాకుండా ఇప్పుడు మంచిర్యాల తదితర ప్రధాన పట్టణాల్లో కూడా హోటళ్ల బంద్కు దారి తీసింది. మంగళవారం కమర్షియల్ సిలిండర్ల కొరతతో మంచిర్యాలలో చాలా వరకు హోటళ్లు నడపలేక బంద్ చేశారు. అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావం ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై పడింది. గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో బుధవారం నుంచి హోటళ్ల బంద్పై తీవ్ర ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. భోజనప్రియులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి, వ్యాపార నిమిత్తం రాకపోకలు సాగించే వారితోపాటు ముఖ్యంగా ఆస్పత్రులకు వచ్చే వారికి ఆకలి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆకలి తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. -
మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం
మంచిర్యాలఅగ్రికల్చర్: మహిళల సంక్షేమం, ఆర్థికా భివృద్ధికి మొదటి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, వివిధ సంక్షేమ శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంటు, పెట్రోల్ బంక్ల నిర్వహణతోపాటు ఇందిరా శక్తి క్యాంటీన్లు, పెరటికోళ్ల పెంపకం, ఇతర అనేక వ్యాపారాల్లో ప్రో త్సహిస్తూ మహిళలను ముందంజలో ఉంచే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వాములను చేస్తూ చర్యలు తీసుకున్నామని, తద్వారా జిల్లాలో 3శాతం విద్యార్థుల సంఖ్య పెరిగిందని, రాష్ట్రంలో జిల్లా ముందంజలో ఉందని వివరించారు. పలువురు మహిళలను కలెక్టర్ సన్మానించి మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు రౌఫ్ ఖాన్, దుర్గాప్రసాద్, డీఆర్డీవో కిషన్, డీపీఆర్వో కృష్ణమూర్తి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, లక్సెట్టిపేట ము న్సిపల్ చైర్పర్సన్ అంజలి, వైస్ చైర్పర్సన్ రాజేశ్వరి, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, వివిధ ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. అక్కాచెల్లెళ్లకు సన్మానంకలెక్టర్ చేతుల మీదుగా అక్కాచెల్లెళ్లు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సిరిపురం విజయలక్ష్మి, జూనియర్ లెక్చరర్ ఆడెవు గీతాంజలి ఉత్తమ ఉద్యోగులుగా సన్మానం, మెమొంటోలు అందుకున్నారు. నస్పూర్ పట్టణాని కి చెందిన వేముల మల్లేష్, సత్యవతి దంపతుల కూతుళ్లు విజయలక్ష్మి బెల్లంపల్లి కళాశాల వసతిగృహంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా, గీతాంజలి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో జూనియర్ లెక్చరర్గా పని చేస్తున్నారు. కోలాటం వేస్తున్న మహిళలుమహిళలను సన్మానిస్తున్న కలెక్టర్ కుమార్ దీపక్ -
గడ్డి మందు కొనలేరు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గత రెండేళ్లుగా ప్రా ణాంతక గడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్పై జిల్లా వైద్యులు చేస్తున్న పోరాటానికి తొలి ఫలితం దక్కింది. ఆత్మహత్య ఘటనల్లో మరణానికి కారణమవుతున్న విరుగుడు లేని, చికిత్సకు లొంగని విషం కలుపు మందుపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక నుంచి విరివిగా కొనుగోళ్లు లేకుండా.. అవసరమైతేనే కొనుగోలు చేసేలా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు ఎవరికై నా గడ్డి మందు అవసరమైతే కచ్చితంగా స్థానిక వ్యవసాయ అధికారి ఆ రైతు పంటను సందర్శించాలి. పిచికారీ చేయాలని అవసరమని భావించి ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే మందుల దుకాణాల్లో కొనుగోలు చేసే వీలుంటుంది. విక్రయదారులు సైతం ఏఈవో ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గడ్డి మందు విక్రయించినప్పుడు ఎవరు కొన్నారో వారి వివరాలు సైతం పొందుపర్చాల్సి ఉంటుంది. కలుపు కంటే ఆత్మహత్యలతో ప్రాణనష్టంగడ్డి మందు పత్తి చేన్లు, పొలం గట్లు, ఇతర చోట్ల కలుపు మొక్కల నివారణకు ఇబ్బడిముబ్బడిగా వాడుతున్నారు. సాగునీరు లేక అధికంగా వర్షాధార పత్తి సాగు చేస్తున్నారు. చేను మొలక దశలో ఉన్నప్పుడు కూలీల కొరత తీరుతుందని నేరుగా గడ్డిపై పిచికారీ చేస్తే మాడిపోయి ఎండిపోతుంది. అయితే ఆత్మహత్య ఘటనల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది క్షణికావేశంతో ఈ గడ్డిమందు తాగిన వారు ఉంటున్నారు. కొద్దిమొత్తంలో తాగినా పెదవుల నుంచి గొంతు, శ్వాస, జీర్ణవ్యవస్థ, కిడ్నీలు దెబ్బతిని రోజుల వ్యవధిలోనే ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అత్యవసర సేవల్లో సైతం విరుగుడు లేని విషంగా వైద్యుల చికిత్సకు లొంగకుండా పోతోంది. వీటిని ప్రత్యక్షంగా చూసి చలించిన మంచిర్యాలకు చెందిన నెఫ్రాలజిస్టు డాక్టర్ రాకేశ్ చెన్న, ఖమ్మంకు చెందిన ఎమర్జెన్సీ కేర్ డాక్టర్ సతీశ్, కరీంనగర్కు చెందిన మత్తు డాక్టర్ సతీశ్తోపాటు పలువురు వైద్యులు గడ్డిమందుపై నిషేధం విధించాలని పోరాటం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలిసి విన్నవించారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్బాబు అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. పారాక్వాట్కు వ్యతిరేకంగా వైద్యులతో ఓ సంఘాన్ని రిజిష్టర్ చేసి విస్తృతంగా పోరాటం చేస్తున్నారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పారాక్వాట్ కేసుల వివరాలుతగ్గనున్న మరణాలుఆత్మహత్య కేసుల్లో గడ్డి మందు కారణంగానే మ రణాలు అధికంగా సంభవిస్తున్నాయి. గత మూ డేళ్లలో మంచిర్యాల జిల్లా ప్రభుత్వాస్పత్రికి 83 మంది గడ్డిమందు తాగి అత్యవసర చికిత్సకు రాగా వీరిలో 27మంది చనిపోయారు. ఇంకా మె రుగైన వైద్యం కోసం 56మందిని ఇతర ప్రాంతా లకు తరలించారు. ఇంకా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంటుంది. ఇ దంతా రికార్డుల్లో నమోదు కావడం లేదు. ప్రైవేటులోనూ చాలామంది గడ్డిమందు తాగి చనిపోతున్నారు. వీరిలో 40ఏళ్లలోపు వారే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ప్రైవేటు వైద్యులు మొదలుపెట్టిన ఈ పోరాటంతో చాలావరకు మరణాలు తగ్గే అవకాశం ఉంది. కలుపు మందు వాడకం ఆగితే లభ్యత తగ్గి ఆత్మహత్యలు నియంత్రణ కానున్నాయి. -
అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి
నస్పూర్: సింగరేణిలో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యా ల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, కాపు కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం వారు పలు డిమాండ్లతో కూడి న వినతిపత్రాన్ని హైదరాబాద్లోని రీజనల్ లేబర్ కార్యాలయంలో కమిషనర్ శర్వానన్కు అందజేశారు. అనంతరం వారు మాట్లాడు తూ సింగరేణిలో 2023 డిసెంబర్ 27న ఎ న్నికలు నిర్వహించారని, నిబంధనల ప్రకా రం 2025 డిసెంబర్ 26తో రెండేళ్ల కాల పరి మితి ముగిసిందని తెలిపారు. ట్రేడ్ యూని యన్ ఎన్నికలు నిర్వహించే వరకు అన్ని రిజి స్టర్డ్ యూనియన్లకు సమాన హోదా కల్పించా లని పేర్కొన్నారు. సమావేశాలు, సంక్షేమ కా ర్యాక్రమాలలో అన్ని సంఘాలకు ప్రాతి నిధ్యం లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఎస్సైల బదిలీలు
మంచిర్యాలక్రైం: రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న నలుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం కే.ప్రసాద్ నెన్నెల పీఎస్ ఎస్హెచ్వో తాండూర్ కే.మహేందర్ సీసీఆర్బీ రామగుండం నెన్నెల పీఎస్ పీ.కోటేశ్వర్ వీఆర్ ములుగు పీఎస్ భీమిని ఎస్హెచ్వో ఎం.విజయ్కుమార్ ఎస్హెచ్వో భీమిని వీఆర్ రామగుండం -
ప్రభుత్వం ప్రజా తీర్పును గౌరవించాలి
చెన్నూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా తీర్పును గౌరవించి క్యాతనపల్లి చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంగళవారం కేసు సందర్భంగా చెన్నూర్ కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ తల్లి, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ చెన్నూర్ మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్ స్వయంగా డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. మంత్రి తీరును నిరసిస్తూ శాంతియుతంగా అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన తమపై చెన్నూర్లో అక్రమ కేసు బనాయించారని తెలిపారు. చెన్నూర్ మున్సిపాలిటీలో 11 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటే ప్రజాతీర్పును గౌరవించామని తెలిపారు. క్యాతనపల్లిలో బీఆర్ఎస్, సీపీఐ మెజార్టీ స్థానాలు గెలిచినా కాంగ్రెస్ ఎన్నికలను అడ్డుకుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే రాళ్ల దాడి చేసి తమపై కేసులు పెట్టించి 16 రోజులు జైల్లో ఉంచారని తెలిపారు. కేసులు తనకు కొత్త కాదని, వారసత్వపు రాజకీయాల నుంచి రాలేదని, ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో 200కు పైగా కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దామోదర్రెడ్డి, విద్యాసాగర్, మోతె తిరుపతి, రెవెల్లి మహేశ్, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అటెండర్ ఆత్మహత్యాయత్నం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా వ్యవసాయ కార్యాలయంలోని అటెండర్ ఆత్మహత్యకు యత్నించడం కలెక్టరేట్లో మంగళవారం కలకలం రేపింది. అధికారులు, సహచర సిబ్బంది అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో బొల్లి శ్రీనివాస్ అటెండర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం రాత్రి 9.30గంటల వరకు కార్యాలయంలోనే ఉండి వెళ్లాడు. మంగళవారం ఉదయం 10గంటలకు జిల్లా వ్యవసాయ అధికారి(డీఏవో) కార్యాలయానికి వచ్చి అతడికి ఫోన్ చేసి ఆఫీసు తాళం తీయలేదని ప్రశ్నించారు. తాను టప్ప కోసం పోస్టాఫీసుకు వెళ్లాలని, మరో అటెండర్ తాళం తీస్తుందని చెప్పానని శ్రీనివాస్ తెలిపాడు. ఎవరూ తీయలేదంటూ ఆమె ఆవేశంగా ఫోన్ కట్ చేయడంతోపాటు కార్యాలయానికి వచ్చిన తర్వాత ఇంతసేపు ఎక్కడికి వెళ్లావంటూ దుర్భాషాలాడిందని తెలిపాడు. కార్యాలయంలో పని, కార్యాలయానికి సంబంధించిన బయట పని చేయాల్సి వస్తోందనే ఒత్తిడి, గత కొంతకాలంగా అధికారి వేధింపులతో మానసిక క్షోభకు గురి చేస్తుండడంతో తట్టుకోలేక నమూనాల కోసం కార్యాలయానికి తీసుకొచ్చిన గడ్డి, చెదల నివారణ మందు తాగాడు. వెంటనే డీఏవో, సహచర సిబ్బంది 108అంబులెన్స్లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. సీసీసీ నస్పూర్ ఎస్సై ప్రశాంత్ బాధితుడి వాంగ్మూలం సేకరించారు. ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. వేధింపులకు గురి చేయలేదు మంగళవారం ఉదయం 10గంటలకు కార్యాలయానికి వస్తే తాళం వేసి ఉండడంతో అటెండర్కు ఫోన్ చేశాను. ఇద్దరు అటెండర్లు ఉన్నా నేనే తాళం తీసుకోవాల్సి వచ్చింది. విధులు సక్రమంగా నిర్వర్తించాలని అన్నందుకే అలా చేశాడు. అప్పుడప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాత్రి సమయం వరకు కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే వారు కూడా ఉండాల్సి వస్తోంది. నేను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదు. – సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి అటెండర్ శ్రీనివాస్ -
ఇఫ్తార్ విందుకు హాజరైన మంత్రి
మందమర్రిరూరల్: పట్టణంలోని సెకండ్ జోన్ రైల్వేస్టేషన్ రోడ్డు పక్కనున్న ఆస్రా మజీద్లో మంగళవారం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ వివేక్వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి హాజరయ్యారు. మత పెద్దలతో కలసి ఇఫ్తార్ విందు ఆరగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ముస్లింలకు తోఫా కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్సింగ్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, తహసీల్దార్ సతీష్కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, మజీద్ కమిటీ పెద్దలు, ముస్లింలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. సోమవారం ఉట్నూర్లోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కడెంకు చెందిన జామ్లాబాయ్ తనకి వ్యవసాయ క్షేత్రానికి సాగునీరు అందించేందుకు పైపులు మంజూరు చేయాలని, సిర్పూర్ (యు)కు చెందిన గేడం గజానంద్ ఏకలవ్య పాఠశాలలో స్లీపర్ ఉద్యోగం ఇప్పించాలని, సిరికొండ మండలానికి చెందిన రామారావు సోలార్ పంపుసెట్ మంజూరు చేయించాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. ఉపాధికోసం తిరుగుతున్నా.. నేను దివ్యాంగురాలిని. కుటుంబ పోషణ భారంగా ఉంది. ఏదైనా ఉపాధి కల్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటా. పలుమార్లు ఐటీడీఏకు వచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికై నా సమస్య పరిష్కరించాలి.– కొడప అంజన బాయి, మాంజ్రీ గ్రామం, నార్నూర్ -
రెండు ట్యాంకర్లు ఢీ.. డ్రైవర్ మృతి
నస్పూర్: సీసీసీ టౌన్షిప్ సమీపంలోని 363 జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ రూప్నార్ అర్జున్ (35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై మేకల ప్రశాంత్ తెలిపిన వివరాల మేరకు జాతీయ రహదారికి సంబంధించిన వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అజ్మీరా శంకర్ వాహనాన్ని నెమ్మదిగా నడుపుకుంటూ వెళ్తుండగా వెనకాల పైపుతో డేగ రాయమల్లు అనే వర్కర్ చెట్లకు నీళ్లు పడుతున్నాడు. ఈ క్రమంలో బెల్లంపల్లి నుంచి శ్రీరాంపూర్ వైపు అతివేగంగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ వాటర్ ట్యాంకర్ను ఢీ కొట్టింది. దీంతో వాటర్ ట్యాంకర్ పల్టీ కొట్టి రోడ్డు పక్కకు పడిపోయింది. ఆయిల్ ట్యాంకర్ ముందు భాగం నుజ్జునుజ్జు అయి డ్రైవర్ అందులోనే ఇరుక్కుని మృతి చెందాడు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు మహారాష్ట్రలోని బీడ్ జిల్లా సిరూర్ తాలుకాకు చెందిన వ్యక్తిగా గుర్తించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
నిర్మల్: పెన్షనర్లను ఇబ్బందికి గురిచేసేలా రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (టీఎస్జీఆర్ఈఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంసీ లింగన్న డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని, వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని కోరా రు. కేంద్రం ప్రభుత్వం పెన్షనర్లకు ఇవ్వాల్సిన పీఆర్సీ, డీఏలకు వ్యతిరేకంగా చేసిన బిల్లుపై పునరాలోచించాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 25న బ్లా క్డే నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొజ్జ జనార్దన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతారెడ్డి, ఆర్థిక కార్యదర్శి లోలం గంగన్న, యూనిట్ అధ్యక్షుడు కాండ్లీకర్ రమేశ్, కార్యదర్శి పూదరి జనార్దన్, యూనిట్ ఆర్థిక కార్యదర్శి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య
కాసిపేట: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గంగారాం తెలిపిన వివరాల మేరకు దేవాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పూలందేవి వాడకు చెందిన కొత్తకాటు మనోజ్కుమార్ (27) కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 8న అతిగా మద్యం సేవించి ఇంటికి రావడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై అర్ధరాత్రి మామిడిచెట్టుకు ఉరేసుకున్నాడు. తెల్ల వారు జామున గమనించిన కుటుంబ సభ్యులు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బస్టాండులో పర్సు పోగొట్టుకున్న మహిళమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం ఓ ప్రయాణికురాలు పర్సు పోయిందని రోదించిన తీరు ప్రయాణికులను కలచి వేసింది. ఆసిఫాబాద్ జిల్లా బురుగుపల్లికి చెందిన వనిత పనినిమిత్తం మంచిర్యాలకు వచ్చి ఇంటికి వెళ్లేందుకు మంచిర్యాల బస్టాండ్లో ఆసిఫాబాద్ వెళ్లే బస్సు ఎక్కేక్రమంలో ఆమె పర్సు కిందపడిపోయిది. బస్సు ఎక్కిన తర్వాత తనవద్ద ఉన్న పర్స్ కనిపించక పోవడంతో కిందకు దిగి రోదించింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ పుటేజిని పరిశీలించగా ఓ వృద్ధురాలు పర్సును తీసుకొని రోడ్డుపైకి వెళ్లిపోయినట్లు గుర్తించారు. పర్సులో అరతులం బంగారు చైన్ ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. ఘటనపై స్థానిక సీఐని వివరణ కోరగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీస్స్టేషన్లో సంతకం చేసిన ఎమ్మెల్యేమందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఫిబ్రవరి 17న జరిగిన అల్లర్ల ఘటనలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ మంజూరైంది. దీంతో ఎమ్మెల్యే కోవ లక్ష్మి సోమవారం రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్కు వచ్చి ష్యూరిటీ సబ్మిట్ చేసి సంతకం చేసి వెళ్లారు. -
ఉమ్మడి జిల్లాలో పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు
కుమురంభీంనిర్మల్మంచిర్యాల ఆదిలాబాద్పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక రెండురోజుల క్రితం మంచిర్యాల జిల్లా మందమర్రిలో పదోతరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంత చదివినా ఏ పరీక్షలోనైనా పాస్ మార్కులు మాత్రమే వస్తున్నాయని తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేవాడు. ఆదివారం ఉదయం తల్లి నిద్రలేపి చదువుకొమ్మని చెప్పింది. కాసేపటి తర్వాత వచ్చి చూసే సరికి ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. మార్కులు తక్కువ వస్తున్నాయనే ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శిరీష ఇటీవల తరచూ తలనొప్పి, ఆందోళనతో బాధపడుతోంది. పరీక్షలు గుర్తుకొస్తే చేతుల్లో చెమటలు పట్టడం, చదవడానికి కూర్చుంటే గజిబిజి ఆలోచనలు రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటోంది. ఇది ఒక్క గాయత్రి పరిస్థితి మాత్రమే కాదు.. జిల్లాలో అనేక మంది విద్యార్థులు ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
ఆర్జీయూకేటీలో హ్యాకథాన్
బాసర: బాసర ఆర్జీయూకేటీలో సోమవారం 9 ఏఎం కెరీర్స్ సంస్థ ఆధ్వర్యంలో నోవా కోడ్ చాలెంజ్ (హ్యాకథాన్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి సురేశ్ విద్యార్థులకు ఐటీ రంగంలో ఉన్న అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలు పరిశ్రమలో చేరడానికి అనుసరించాల్సిన మార్గాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి టెక్మోజో సంస్థకు చెందిన సీనియర్ హెచ్ఆర్ మణిదీప్ కూడా హాజరై విద్యార్థులతో పరస్పర చర్చలు జరిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ పి.మురళీ దర్శన్, అసోసియేట్ డీన్ కె.మహేష్, కంప్యూటర్ సైన్స్ విభాగం హెడ్ డా.బి.వెంకటరామన్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు శ్రీమతి జి.సృజనా లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో చదవాలి
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న ఈ సమయంలో విద్యార్థులు అనవసరంగా ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛ వాతావరణంలో చదవాలి. లక్ష్యాన్ని ఎంచుకుని క్రమపద్ధతిలో కృషి చేస్తే విజయం సాధించడం కష్టంకాదు. ‘ఒత్తిడిని భయంగా కాకుండా సవాల్గా తీసుకుంటే విజయం కచ్చితంగా సిద్ధిస్తుంది. – అల్లం సాయికృష్ణ, కెరీర్ గైడెన్స్ నిపుణులు, బోథ్, ఆదిలాబాద్ ఒత్తిడికి గురికావొద్దు పరీక్షల సమయంలో విద్యార్థులు అనవసరమైన ఒత్తిడికి గురికావొద్దు. ప్రతిరోజూ చదువు కోసం సమయపట్టిక రూపొందించుకుని మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా సరిపడా నిద్ర, సమతుల్య ఆహారం, తేలికపాటి వ్యాయామం మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి. పరీక్షలను జీవితంలో ఒక దశగా మాత్రమే భావించాలి. ఫలితాలకంటే నేర్చుకున్న జ్ఞానమే ప్రధానం. – అడ్డిగ శ్రీనివాస్, సైకాలజిస్టు, మోటివేషన్ స్పెషలిస్టు -
సీ్త్రనిధి ఏజెంట్ చేతివాటం
● రూ.7 లక్షలు సొంతానికి వాడుకున్న వైనం సాత్నాల: భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో వీవోఏ (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్)గా విధులు నిర్వహిస్తున్న రాయిడి స్వప్న సీ్త్రనిధి సంఘం సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బులు సొంతానికి వాడుకోవడం కలకలం రేపింది. ఎస్సై పవర్ గౌతమ్ కథనం మేరకు గ్రామానికి చెందిన వీవోఏ రాయుడి స్వప్న సీ్త్రనిధి స్వయం సహాయక సంఘాలకు ఏజెంట్గా పనిచేస్తుంది. 2022 నుంచి 10 సంఘాలు, 54 మంది సభ్యులు శ్రీనిధి రుణాలు తీసుకున్నారు. సదరు మహిళల వద్ద నుంచి ప్రతీనెల డబ్బులు వసూలు చేసి బ్యాంకులో కట్టినట్లుగా రసీదులు చూపించింది. గడువు ముగిసిన తర్వాత దుమ్మ సంగీత, దుమ్మ బూమక్క, కోర చిన్నమ్మ, నలిమెల కాంత మళ్లీ రుణంకోసం అడుగగా బ్యాంకులో తీసుకున్న పాత లోన్ డబ్బులు పూర్తిగా కట్టలేదని అన్నారు. దీంతో సదరు మహిళలు స్వప్నను సంప్రదించగా రూ.7 లక్షలు వాడుకున్నట్లు ఒప్పుకుంది. నెలరోజులకు చెల్లిస్తానని బాండు రాసి ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాత సీ్త్రనిధి సంస్థకు చెందిన అధికారులు డబ్బుల విషయం అడుగగా నేను ఇవ్వలేనని చెప్పింది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. చిన్నారికి నారీ పురస్కార్ఆదిలాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన కల్చరల్, ఫ్యాషన్ అవార్డ్స్ కార్యక్రమంలో జిల్లాకు చెందిన కొంకటి ఇతిక్ష విశేష ప్రతిభ కనబర్చింది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గౌరవ సభ్యురాలు సరిత గోగుల, నేషనల్ బంజారా భారత్ మహిళా కన్వీనర్ అద్దంకి నాగమణి, ప్రముఖ నటి సంధ్యారాణి చేతుల మీదుగా నారీ పురస్కారాన్ని అందుకుంది. చిన్నారి తల్లిదండ్రులు కొంకటి సృజన, శ్రావణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
వేసవిలో కూరగాయల సాగు
చెన్నూర్రూరల్: జిల్లాలోని రైతులు యాసంగి సీజన్లో కూరగాయల సాగువైపు దృష్టి సారిస్తున్నా రు. పెట్టుబడి తక్కువ, కొద్ది రోజుల్లోనే పంట చేతికి అందిరావడంతో పాటు లాభాలు కూడా అధికంగానే ఉంటోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది యా సంగి సీజన్లో రైతులు సుమారు వెయ్యికి పైగా ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. చెన్నూర్ మండలంలోని కత్తెరసాల, సుద్దా ల, శివలింగాపూర్, సుబ్బరాంపల్లి, కిష్టంపేట, అంగ్రాజ్పల్లి, దుగ్నెపల్లి, చింతలపల్లి, అక్కెపల్లి, ఆస్నాద, తదితర గ్రామాల్లోని రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. ఒక్కో రైతు 10 గుంటల నుంచి ఎకరం వరకు కూరగాయల సాగుకు కేటాయించారు. అందులో అల్చంత, బెండ, వంకాయ, మిరప, టమాట, గోబీ వంటి కూరగాయలతో పాటు తోటకూర, కొత్తిమీర, పాలకూర, పూదీన, చుక్కకూర లాంటి ఆకుకూరలు సాగు చేస్తున్నారు. మొక్కలకు ప్రతీరోజు ఉదయం బోరుబావుల ద్వారా నీటిని అందిస్తున్నారు. పంటలు వేసినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. రెండు రోజులకు ఒకసారి తోటకూర, బెండ, మిరప, టమాట, వంకాయలు 20 కిలోల నుంచి 30 కిలోల వరకు వెళ్తాయని వాటిని చెన్నూర్ లేదా మంచిర్యాల, గోదావరిఖని మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయిస్తామని ఆయా గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. కూరగాయలకు మార్కెట్లో మంచి ధరలు ఉండడంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. -
బైక్ అదుపుతప్పి సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మృతి
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. నెన్నెల గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు బర్ల శంకర్ (64) తన భార్య రాజేశ్వరితో కలిసి ద్విచక్ర వాహనంపై మంచిర్యాల నుంచి నెన్నెల వైపు వెళ్తుండగా టోల్ప్లాజా వద్ద బైక్ అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేశ్వరికి గాయాలు కావడంతో గమనించిన స్థానికులు మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుమారుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. డ్రెయినేజీలో పడ్డ ఆవు సురక్షితంచెన్నూర్: పట్టణంలోని కోర్టు సమీపంలో ఓ ఆవు సోమవా రం ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడిపోయింది. బయటికి రా వడానికి మార్గం లేక పోవడంతో ఇబ్బంది పడుతోంది. చెత్తను తొలగించేందుకు వెళ్లిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కనిపించడంతో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్కుమార్కు సమాచారం అందించారు. అతని ఆదేశాల మేరకు సిబ్బంది ఆ వును బయటకు తీసి యజమానికి అప్పగించారు. -
అదుపులోకి వచ్చిన మంటలు
కాసిపేట: లక్సెట్టిపేట, బెల్లంపల్లి, దేవాపూర్ రేంజ్ పరిధిలోని అడవిలో రెండ్రోజులుగా చెలరేగిన మంటలు ఆదివారం రాత్రి అదుపులోకి వచ్చాయి. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది శ్రమించి బ్లోయర్లతో మంటలు ఆర్పివేశారు. మూడు రేంజ్ల పరిధిలోని మేడారం, ముత్యంపల్లి, దేవాపూర్, ర్యాలీగడ్పూర్ సెక్షన్లలో తీవ్రమైన అటవీ కొండ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. సుమారు 200 ఎకరాలకుపైగా అటవీ సంపదకు నష్టం వాటిల్లడంతో భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేయడం సిబ్బందికి కష్టతరంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన నిప్పుతోనే అటవీ ఆహుతైనట్లు అధికారులు పేర్కొన్నారు. లక్సెట్టిపేట, దేవాపూర్ రేంజ్లలో ఇన్చార్జిలుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అడవిలో మంటలు చెలరేగిన ప్రదేశాలను బెల్లంపల్లి రేంజ్ అధికారి పూర్ణచందర్ పరిశీలించారు. -
విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి
మంచిర్యాలఅర్బన్/బెల్లంపల్లి: విద్యార్థులు ఒత్తిళ్లకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్నికోలస్, విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా అన్నారు. సోమవారం విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు బెల్లంపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం టీ–శాట్ చానల్ ద్వారా మోటివేషన్, గైడెన్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐఎఫ్పీ స్క్రీన్ ద్వారా విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి నిపుణుల సూచనలు పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షలపై భయాన్ని విద్యార్థులు విడనాడాలని తెలిపారు. స్వేచ్ఛగా పరీక్ష రాయాలని, పరీక్షల మధ్య ఉన్న విరామ సమయాన్ని వృథా చేసుకోవద్దని అన్నారు. పునశ్చరణకు వినియోగించుకోవడం వల్ల ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ప్రశాంతమైన మనస్సుతో విద్యార్థులు పరీక్ష రాయడం వల్ల ఉత్తమ మార్కులు సాధించడానికి వీలవుతుందని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, బెల్లంపల్లిలో మండల విద్యాధికారి జాడి పోచయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మృత్యుపాశాలు..!
– వివరాలు మెయిన్లో...దండేపల్లి: సాయం చేయబోయిన కూలీలకు మృత్యుపాశాలు ఎదురయ్యాయి. రోజువారీ కూలితో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఇద్దరిని మృత్యు ఒడికి చేర్చాయి. ఇనుప స్టాండ్ను తీసుకెళ్తుండగా పైనున్న విద్యుత్ తీగలు తగిలి షాక్తో విలవిలలాడుతున్న వారిని చూసి అక్కడున్న వారి గుండెలవిసిపోయాయి. క్షణాల్లో మంటలు ఎగిసిపడి నిలువునా కాల్చేశాయి. ప్రతిరోజులాగే పనులకు వెళ్లిన వారు ఇంటికి వస్తారని చూసే ఆ కుటుంబాలకు ఇక ఎదురుచూపులే మిగిలాయి. దండేపల్లి మండలం మేదరిపేట పెట్రోల్బంక్ సమీపంలో సోమవారం జరిగిన ఈ విషాదకర సంఘటనలో మండలంలోని మాదాపూర్కు చెందిన చల్ల లక్ష్మీనారాయణ(50), వెల్గనూర్ గ్రామానికి చెందిన చందనగిరి నాగరాజ్(35) మృత్యువాతపడ్డా రు. వారిని కాపాడేందుకు దుకాణంలో ఉండే గంగాధర్ ప్రయత్నించగా.. అతడికీ షాక్ రావడంతో ఎగిరి పక్కకు పడి స్వల్పంగా గాయపడ్డాడు. -
● ‘సీఎంఆర్’ బకాయిలపై సర్కారు సీరియస్ ● ఆర్ఆర్, క్రిమినల్ కేసులతో వ్యాపారుల బెంబేలు ● వడ్డీ, జరిమానాలు మాఫీ చేయాలంటూ వేడుకోలు ● పని లేక రైస్మిల్లులు మూతపడుతున్నాయని ఆందోళన
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మిల్లర్ల బకాయిలపై సర్కారు కఠినంగా వ్యవహరిస్తుండడంతో డీఫాల్టర్లలో గుబులు మొదలైంది. వడ్లు పక్కదారి పట్టించి సకాలంలో సీఎంఆర్(కస్టం మిల్లింగ్ రైస్) ఇవ్వకుండా తాత్సారం చేశారనే కారణంతో మరిన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే డీఫాల్ట్ మిల్లర్లపై ఆర్ఆర్(రెవెన్యూ రికవరీ) యాక్టు, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇంకా వారిపై అప్పులు రికవరీ కోసం చట్టపరంగా ముందుకెళ్తున్నారు. మరోవైపు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేయడంతో కోర్టుల నుంచి ఉత్తర్వులు పొందారు. ఇటీవల ప్రభుత్వం గత నెల 22వరకు పెండింగ్ బియ్యం పౌరసరఫరాల శాఖకు అప్పగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఓ వైపు కేసులతో ఉండగా, మరోవైపు బియ్యం లేదా బ కాయిలు చెల్లించా లని కోరడంతో డీఫాల్ట్ మిల్లర్లు తర్జనభర్జన పడుతున్నారు. తమకు బాకీల్లో మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే జిల్లాలో డీఫాల్ట్ అయిన మిల్లర్లను బ్లాక్ జాబితాలో చేర్చి ధాన్యం ఇవ్వడం నిలిపివేశారు. దీంతో పొరుగున ఉన్న పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ధాన్యం తరలించారు. పేరుకుపోతున్న బకాయిలు ధాన్యం సేకరణ సమయంలో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం కంటే ప్రస్తుత విలువ మరింత పెరిగింది. 2019నుంచి మొదలు 2023వరకు బియ్యం బాకీలు ఉన్నాయి. మొత్తం విలువలో 25శాతం జరిమానా, ఆపైన 12శాతం వడ్డీ విధించారు. దీంతో ఈ విలువ పెరుగుతూ వస్తోంది. గత కొంతకాలంగా వీటిని మాఫీ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బకాయి పడిన మిల్లర్లు రాష్ట్రమంత్రుల నుంచి పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే బకాయిలు ఉన్న వారిపై సర్కారు నుంచి ఎటువంటి సానుకూల నిర్ణయం రావడం లేదు. మరోవైపు ప్రభుత్వం బకాయి బియ్యం పెట్టడమో, ఆ మొత్తం విలువను పౌరసరఫరాల శాఖకు నగదులో కట్టాలంటూ నోటీసులు పంపుతున్నారు. జిల్లాలో 22మంది మిల్లర్లపై కేసులు నమోదు చేయగా, మొత్తంగా జిల్లాలో రూ.వంద కోట్లకు పైనే బాకీలు ఉన్నాయి.మాఫీ చేయాలిడీఫాల్ట్ మిల్లర్లపై 25శాతం పెనాల్టీ, 12శాతం వడ్డీ ఎత్తివేయాలని కోరుతున్నాం. ఎంతోమందికి ఉపాధి ఇచ్చే జిల్లాలోని మిల్లులు మూతపడ్డాయి. ఇక్కడ బ్లాక్ లిస్టులో పెట్టి ధాన్యం పొరుగు జిల్లాలకు ఇస్తున్నారు. మిల్లులు మళ్లీ నడిచేందుకు ప్రభుత్వం మాకు సహకరించాలి. – గుంత నాగరాజు, అధ్యక్షుడు, జిల్లా రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్మూతపడుతున్న మిల్లులుక్రిమినల్ కేసులు, ఈడీ, ఐటీ నోటీసులుధాన్యం పక్కదారి పట్టించారని సర్కారు కఠిన చర్యలకు పూనుకోగా, మొదట ఆర్ఆర్ చట్టంతోపాటు స్థానిక పోలీసుస్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇంకో అడుగు ముందుకేసి మిల్లర్ల ఆస్తుల మదింపు, లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యహారాలన్నింటిపైన చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. అంతేకాక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఆదాయ పన్ను(ఐటీ), ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) నుంచి నోటీసులు వస్తున్నాయి. జిల్లాలో ఓ మిల్లర్ ఈ మేరకు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇంకా కొందరి జాబితా సిద్ధం చేసి చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. జిల్లాలో డీఫాల్ట్ మిల్లులకు ధాన్యం ఇవ్వకపోవడంతో మూడో వంతు మిల్లులు మూతపడ్డాయి. బకాయిలు ఉన్న మిల్లర్లకు ధాన్యం ఇవ్వకపోవడంతోనూ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగడం లేదు. ఇక కొందరు పాత బాకీలు కట్టుకుంటూ ధాన్యం మళ్లీ పొందేందుకు తిప్పలు పడుతున్నారు. అయితే కొందరు బాకీ కట్టలేక సతమతం అవుతున్నారు. చాలామందికి ఆస్తులు ఉన్నప్పటికీ మార్కెట్ ధర లేక అవస్థలు పడుతున్నారు. రియల్ఎస్టేట్ రంగం కుదేలవడంతోనూ భూములు ఉన్న మిల్లర్ల అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా ఇదే వ్యాపారంలో ఉన్న మిల్లర్లు చేతిలో పనిలేక అవస్థలు పడుతున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఓ రైస్మిల్లర్ భార్య అప్పుల బాధతో మరణించగా, జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొందని మిల్లర్లు వాపోతున్నారు. -
సారూ.. సమస్య పరిష్కరించండి
మంచిర్యాలఅగ్రికల్చర్: భూ సమస్యలు, పింఛన్లు, పరిహారం, ఇందిరమ్మ ఇళ్లు, కన్న కొడుకులు పట్టించుకోవడం లేదని.. సమస్య పరిష్కరించండి సారూ.. అంటూ ప్రజలు ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్ను కలిసి విన్నవించారు. సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, శ్రీనివాస్లతో కలిసి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులు అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. -
స్వల్పకాలిక కోర్సులతో ఉద్యోగ అవకాశాలు
మంచిర్యాలఅర్బన్: స్వల్పకాలిక కోర్సులు నైపుణ్యాలను అందించి మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశాలను పెంచుతాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ(ఐటీఐ, ఏటీసీ)లో ఏర్పాటు చేసి షార్ట్ టర్మ్ కోర్సులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా శిక్షణ అందించి ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు విద్యార్థులతో మాట్లాడుతూ విద్యతోపాటు వృత్తి నైపుణ్యం కలిగి ఉండాలని సూచించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నూతన భవనం నిర్మాణానికి చర్యలు చేపడుతామని అన్నారు. రాపల్లి ప్రాంతంలో రూ.6కోట్లతో అన్స్కిల్డ్, సెమీస్కిల్డ్ అభ్యర్థుల కోసం కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. 100 మంది అభ్యర్థులకు వసతి కల్పించి మూడు నెలల కోర్సు అందిస్తామని తెలిపారు. మంచిర్యాల ప్రాంతంలో ఐటీ పార్క్ మంజూరైందని, పనులు వేగవంతం చేసి స్థానిక నిరుద్యోగ యువతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ పాల్గొన్నారు. -
వన్యప్రాణుల దాహార్తి తీర్చేలా
జన్నారం: వేసవి కావడంతో మార్చిలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి పక్షులు, జంతువులు, వన్యప్రాణులు దాహార్తి తీర్చుకునేందుకు పరుగులు తీసే అవకాశం ఉంది. నీటి సమస్య రాకుండా అటవీశాఖ ముందస్తు ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే అడవుల్లో సోలార్ పంపులు, నీటికుంటలు, వాగుల్లో చెలిమెల ఏర్పాటులో అధికారులు నిమగ్నమయ్యారు. జన్నారం అటవీ డివిజన్లోని మూడు అటవీ రేంజ్లు, 40 అటవీ బీట్లలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టారు. వాగులు, నీటి ఊటల నీటిని సహజసిద్ధంగా అందిస్తూనే నీటి ఎద్దడి గల ప్రాంతాల్లో సోలార్పంపుల ద్వారా నీరందించే ప్రయత్నం చేస్తున్నారు. 187 కుంటలు, 34 సోలార్ పంపులతోపాటు ర్యాంపు వెల్, నీటి చెలిమెల ద్వారా నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. చెలిమెలు అడవుల్లో అనేక చోట్ల వాగులు ప్రవహిస్తున్నాయి. వేసవిలో కూడా నీరుండేవి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వన్యప్రాణులు నీరు తాగేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాగుల్లో నీరుండే ప్రాంతంలో చెలిమెలు ఏర్పాటు చేస్తున్నారు. వీలైనన్ని చోట్ల చెలిమెలతోపాటు వాగునీటికి అడ్డంగా రాళ్లు, ఇసుకతో కట్ట కట్టి నీరు నిలిచి చెలిమెలా తయారు చేస్తున్నారు. పారే నీరు శుభ్రంగా ఉండడంతో తాగేందుకు వన్యప్రాణులు ఇష్టపడుతాయి. ర్యాంపు వెల్స్ ఏర్పాటు నీటి ఊటలు ఉన్న ప్రదేశాల్లో బావిలా గుంత తవ్వి నీరు రాగానే వన్యప్రాణులు సులువుగా దిగి తాగే విధంగా ర్యాంపు తయారు చేస్తారు. రెండు వైపుల ర్యాంపులు ఏర్పాటుతో వన్యప్రాణులు అందులో దిగి నీరు తాగుతాయి. గత రెండేళ్ల క్రితం డివిజన్లో 25 వరకు ర్యాంపువెల్లు ఏర్పాటు చేయగా.. అవి ప్రస్తుతం కూరుకుపోయాయి. దీంతో మళ్లీ తయారు చేయనున్నారు. కుంటల ద్వారా నీరు అటవీ ప్రాంతంలో భూగర్భజలాలు పెంచేందుకు, నీటి సౌకర్యం కోసం వర్షపు నీరు వృథా పోకుండా అటవీశాఖ అధికారులు ఉపాధి హామీ కింద నీటికుంటలు తవ్వించారు. జన్నారం అటవీ డివిజన్లో గత రెండేళ్ల క్రితం 300 వరకు నీటికుంటలు తవ్వగా ప్రస్తుతం 100కు పైగా వాటిల్లో నీరుంది. ఏప్రిల్, మేలో మరిన్ని కుంటల్లో నీరు ఎండిపోయే అవకాశం ఉండడంతో సోలార్ పంపుల ద్వారా నీటిని నింపే ప్రయత్నం చేస్తున్నారు. సోలార్ పంపులకే ప్రాధాన్యం అడవిలో సోలార్ విద్యుత్ పంపుల ద్వారా నీటి సౌకర్యం కల్పించేందుకు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. జన్నారం అటవీ డివిజన్లోని మూడు అటవీ రేంజ్ల్లో 34 సోలార్ పంపులున్నాయి. అందులో 10 మరమ్మతులు చేయించాల్సి ఉంది. వీటి ద్వారా నీటిని కుంటల్లోకి వదులుతారు. ఈ ఏడాది మరో 10 సోలార్ పంపులు నూతనంగా వేయనున్నట్లు అధికారులు తెలిపారు. రెండు స్క్వైర్ కిలోమీ టర్లకు ఒక సోలార్ పంపు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గుట్టల ప్రాంతంలో కూడా నీటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సోలార్ ద్వారా నిరంతరంగా పంపులు నడవడంతో నీరు కుంటల్లో నిండి వన్యప్రాణుల దాహార్తి తీర్చుతాయి. -
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తీసుక రానివ్వడం లేదు..
జన్నారం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బాదంపల్లి గ్రామ సమీపంలోని గోదావరి నుంచి ఇసుక తీసుకొస్తున్నాం. అటవీశాఖ అధికారులు ‘ఎకో సెన్స్టివ్ ఏరియా’ అంటూ ఇసుక ట్రాక్టర్కు భారీగా జరిమానా విధించి కేసులు నమోదు చేస్తున్నారు. పక్క జిల్లా జగిత్యాలకు జేసీబీలతో ఇసుక తోడి తరలిస్తున్నారు. వారికి ఎలాంటి జరిమానాలు లేవు. ఇందిరమ్మ ఇళ్లు గోడల వరకు వచ్చి ఆగిపోయాయి. ఎస్సీ, ఎస్టీ నిరుపేదలమైన మాకు ఇంటి నిర్మాణానికి తీసుకొచ్చేందుకు అవకాశం కల్పించాలి. – ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, జన్నారం -
స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
దండేపల్లి: అన్నీశాఖల అధికారులు సమన్వయంతో స్వచ్ఛ గ్రామాలుగా తీర్చి దిద్దాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు సూచించారు. దండేపల్లిలో ఆదివారం నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పా రిశుద్ధ్య పనులు పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నిశాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి తాగు, సాగునీరు, విద్యుత్, వైద్యం, విద్య విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా డ్రెయినేజీ వ్యవస్థ బాగు చేయాలన్నారు. దండేపల్లిని స్వచ్ఛ మండలంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలన్నారు. అనంతరం పంచాయతీ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్పండ్ చెక్కులు అందించారు. కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు, లక్సెట్టిపేట ఏఎంసీ చైర్మన్ ప్రేమ్చంద్, ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు త్రిమూర్తి, ఎంపీడీవో ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, సతీష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అడవిలో చిరుత.. చేలల్లో తోడేళ్లు
వేమనపల్లి: మండలంలోని సుంపుటం, జాజులపేట అటవీ ప్రాంతంలో చిరుతపులి వేమనపల్లి ప్రాణహిత తీరంతో పాటు అటవీ ప్రాంతంలో తోడేళ్ల సంచారం పెరిగింది. దీంతో గొల్ల కుర్మలు మేకలు, గొర్రెలు మేపేందుకు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే 6 మేకలపై తోడేళ్లు దాడి చేసి హతమార్చాయి. మండలంలోని రాజారం, ఒడ్డుగూడెం, దస్నాపూర్ అటవీ శివారు ప్రాంతం వెంట తోడేళ్ల మంద తిరుగుతూ మేతకు వెళ్లిన మూగజీవాలను చంపేస్తున్నాయి. నాలుగు తోడేళ్లు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాణహితనది దాటి పత్తి చేలల్లోకి వచ్చినట్లు రైతులు, గొల్ల కుర్మలు పేర్కొంటున్నారు. చల్ల గట్టు, చంద్రయ్యకు చెందిన మేకలను పత్తి చేలల్లోనే చంపేశాయి. సబ్ స్టేషన్ సమీపంలో మేకపై దాడి చేసి కళేబరాన్ని చెట్టు కొమ్మల్లో దాచాయి. తోడేళ్ళు చెట్టు ఎక్కలేవు.. కానీ చెట్టుపై మాంసం అవశేషాలు పెట్టింది చిరుతపులా? లేక ఎవరైనా కావాలని దాచారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వన్య మృగాల దాడిలో మృత్యువాత పడుతున్న మేకలు, గొర్రెలకు పరిహారం ఇప్పించాలని గొల్లకుర్మలు కోరుతున్నారు. -
● ఐదో తరగతి, ఇంటర్లో ప్రవేశాల ప్రక్రియ షురూ ● అడ్మిషన్లకు ముందస్తుగా విస్తృత ప్రచారం
గురుకులం.. మైనార్టీలకు వరంమంచిర్యాలఅర్బన్: తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో 2026–27 విద్యాసంవత్సరంలో ఐదోతరగతి, ఇంటర్ ప్రవేశాలకు ప్రక్రియ షురూ అయ్యింది. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అడ్మిషన్లకోసం అధికారులు ముందస్తు ప్రచారం చేపట్టారు. గురుకులాల్లో అందిస్తున్న ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు, విద్యార్థులకు అందించే వస్తువుల ప్రదర్శనతో మసీదులు, ఆయా బస్తీల్లో ఆకట్టుకుంటున్నారు. ఆధునికత సౌకర్యాలతో పాటు ఉచితంగా అందిస్తున్న యూనిఫాం, బూట్లు, సాక్సులతో కూడిన స్పోర్ట్ డ్రెస్, టై, బెల్ట్, ఐడీకార్డు, 12 వస్తువులతో కూడిన కాస్మొటిక్ కిట్, స్టూడెంట్ స్టేషనరీ, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లపై వివరిస్తున్నారు. గురుకులాల్లో కల్పిస్తున్న వసతులు, మౌలిక సదుపాయాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇదివరకు మైనార్టీ గురుకులాల్లో పూర్తిస్థాయి సీట్లు భర్తీకానీ పరిస్థితి. దీంతో నాన్ మైనార్టీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ముందుస్తు ప్రచారంతో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రవేశాలు ఇలా.. 2026–27 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో కొత్త ప్రవేశాలు, 6,7,8 తరగతుల్లో మిగిలి ఉన్న (బ్యాక్లాగ్) ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం సీట్లలో 75 శాతం మైనార్టీలు (ముస్లిం 62 శాతం, క్రిస్టియన్ 9, సిక్కులు 1, జైనులు 1, బుద్దిస్టు 1, పారిసిస్ 1) నాన్ మైనార్టీ కింద 25 శాతం (ఎస్సీలు 6శాతం, ఎస్టీలు 5, బీసీలు 12, ఓసీ, ఈబీసీలు 2శాతం) సీట్లు భర్తీ చేయనున్నారు. మైనార్టీల్లో ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. మైనార్టీ యేతర విద్యార్థులను లక్కీడిప్ ద్వారా ఎంపిక చేయనున్నారు. ముస్లిం మైనార్టీ విద్యార్థులు చేరని పక్షంలో నాన్ మైనార్టీ విద్యార్థులతో సీట్లు భర్తీ చేయనున్నారు.గతేడాది భర్తీకాని ఖాళీలుఅత్యల్ప పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన టీఎంఆర్ఈఐఎస్లో ప్రవేశాల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాలో గతేడాది 1,240 సీట్లకుగానూ 931 సీట్లు మాత్రమే భర్తీ కాగా 309 సీట్లు మిగిలిపోయాయి. మంచిర్యాల (గర్ల్స్) మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో 480 సీట్లకుగానూ 374 మంది ప్రవేశం పొందగా 106 సీట్లు ఖాళీగా ఉన్నాయి. బెల్లంపల్లి (బాలికల)లో 280 మందిగానూ 235 సీట్లు భర్తీ కాగా 45 సీట్లు మిగిలిపోయాయి. చెన్నూర్లో 480 సీట్లకుగానూ 322 భర్తీ కాగా అత్యధికంగా 158 ఖాళీలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మోడల్స్కూల్, కేజీబీవీ, ఇతర గురుకులాల్లో అడ్మిషన్లకు పోటీ తీవ్రతగా ఎక్కువగా ఉండగా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో మిగిలిపోవడంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఈనేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియకముందే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు తీసిపోని విధంగా ముందస్తుగా అడ్మిషన్ల పెంపునకు అధికారులు విస్తృత ప్రచారం చేపట్టారు. -
కుటుంబానికి యజమాని మహిళే
లక్సెట్టిపేట: కుటుంబానికి యజమాని మహిళే అని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లిన తర్వాత అక్కడ ప్రధాన కర్తగా మహిళ ఉంటుందన్నారు. మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడుతూ బాలికల ఆరోగ్యం కోసం ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రవేశపెట్టిందన్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నాలుగోవార్డు, 10వ వార్డులో పర్యటించారు. పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్పర్సన్ రాజేశ్వరి, కౌన్సిలర్లు, కమిషనర్ విజయ్కుమార్, వైద్యాధికారి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
వన్యప్రాణుల సంరక్షణపై శ్రద్ధ వహించాలి
చెన్నూర్: వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పీసీసీఎఫ్ ఛీఫ్ వినయ్కుమార్ అన్నారు. ఆదివారం కోటపల్లి మండలంలోని ప్రా ణహిత వన్యప్రాణుల అభయారణ్యం, శివ్వారం మొసళ్ల కేంద్రాన్ని సందర్శించారు. శివ్వారం మొసళ్ల కేంద్రంలో డ్రోన్ ద్వారా మొసళ్ల సంచారం, లెక్కింపు తెలుసుకున్నారు. శివ్వారం అభయారణ్యం నుంచి పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములు గు జిల్లాలకు వెళ్నిల పులి రూట్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ కృష్ణజింకల అభయారణ్య పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. మొసళ్ల కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కవ్వాల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతారాం, మంచిర్యాల డీఎఫ్వో శివ ఆశిష్ సింగ్, చెన్నూర్ ఎఫ్డీవో సర్వేశ్వర్, ఫారెస్ట్ అధికారులు చంద్రమౌళి, హఫీజొద్దీన్, సదానందం, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి కరాటే పోటీలు
మందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): రామకృష్ణాపూర్లోని బీజోన్ ఏరియాలో గల ఆర్సీఎం క్లబ్లో ఆదివారం ఫస్ట్ ఇంటర్ రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే పోటీలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఇలాంటి క్రీడలతో క్రీడాకారుల్లో మనోధైర్యం, మానసిక పుష్టితో పాటు పలు శారీరక ధారుఢ్యం పెరుగుతుందన్నారు. విజేతలకు మెడల్స్తో పాటు సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం పలువురు మహిళలను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జూల శ్రీనివాస్, ఆషాఢం శ్రీనివాస్, కరా టే మాస్టర్ రమేశ్రాజా, వివిధ ఏరియాల కరా టే మాస్టర్స్, కాంగ్రెస్ నాయకులు సమ్మయ్య, అజీజ్ తదితరులు ఉన్నారు. -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
నస్పూర్: వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉంటుందని, మున్సిపల్, అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ దర్ని మధూకర్ అన్నారు. ఆదివారం ఎండవేడికి సీసీసీలోని డంప్యార్డులోని చెత్తకు మంటలు అంటుకోవడంతో పొగతో కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మేయర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుట్ట యశోద, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
సామాన్యుడి నడ్డి విరిచిన కేంద్రం
తాండూర్: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర రూ.60 పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దాగం రాజా రాం ఆరోపించారు. వంట గ్యాస్ ధర పెంపుపై ఆదివారం మండల కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ వ్యవస్థలకు దారాదత్తం చేస్తోందన్నారు. ఇప్పటికే ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది అదనపు భారమన్నారు. నిత్యావసరాల ధరలను అదుపులోకి తీసుకొచ్చి పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం నానయ్య, వేల్పుల శంకర్, లక్ష్మి, సుమ పాల్గొన్నారు. -
రాక్షసానందం పొందుతున్న కాంగ్రెస్
మందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టించి రాక్షస ఆనందం పొందుతోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్లో సంతకం చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ప్రమాణ స్వీకారం రోజున కాంగ్రెస్ నాయకులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా నిలుస్తోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు మూల రాజిరెడ్డి, తదితరులు ఉన్నారు. -
ధర పెంచడం సరికాదు
బెల్లంపల్లి: మార్కెట్లో అన్ని రకాల వస్తువులు, కూరగాయల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నయ్. పెరిగిన ధరలతో పేద, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి కొత్తగా గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా, తోచిన రీతిలో గ్యాస్ సిలిండర్ ధర పెంచడం వల్ల రెక్కాడితే కాని డొక్కాడని పేదలపై పెనుభారం పడుతుంది. వెంటనే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. – బొడ్డుపల్లి, రాధ, వితంతు, బెల్లంపల్లి -
● ఇరాన్, అమెరికా యుద్ధంతో పెరిగిన గ్యాస్ ధరలు ● గృహ సిలిండర్కు రూ.60, కమర్షియల్కు రూ.115 ● జిల్లాలో వినియోగదారులపై ఆర్థిక భారం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పశ్చిమాసియా దేశ యుద్ధ మంటలు మన వంటింటిని తాకాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధంతో అక్కడి చమురు కంపెనీల్లో ఉత్పత్తి, రవాణాపై ప్రభావం చూపుతోంది. దీంతో దేశానికి సకాలంలో వచ్చే పెట్రోలియం ఉత్పత్తులైన ఎల్పీజీ (ద్రవ శిలాజ వాయువు) సిలిండర్ల ధరలు అమాంతం పెరిగాయి. గృహా వినియోగదారులు వినియోగించే 14.20 కిలోల సిలిండర్కు రూ.60 చొప్పున, వ్యాపార వర్గాలు వినియోగించే 19 కిలోల సిలిండర్కు రూ.115 చొప్పున అమాంతం పెరిగి వినియోగదారుడికి ధరల మంటలు పుట్టించాయి. జిల్లాలో మొత్తం1.66 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, వీటిలో ప్రతీ నెలా పదిశాతం రీఫిల్కు వస్తాయనే అంచనా ఉంది. నెలకు రూ.పదిలక్షల వరకు గృహ వినియోగదారులపై భారం పడనుంది. వంటలకు ధరల మంటలు గ్యాస్ ధరలు పెరగడంతో ప్రధానంగా హోటళ్ళు, రెస్టారెంటు, బజ్జీకోట్లు, టీ షాపులు, తదితర వంట ఆధారిత రంగాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో వంటకు వినియోగం, శుభకార్యాలు, పండగలు, ప్రత్యేక దినాల్లో వాడకం పెరిగే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. 21 రోజుల బుకింగ్ ఆంక్షలు గృహ వినియోగదారులకు నెలకు ఒకటి చొప్పున ఏడాదిలో 12 గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. గతంలో నిర్ణీత రోజులు పూర్తయితేనే గ్యాస్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా సిలిండర్ వినియోగదారుడికి చేరిన 21 రోజుల తర్వాతనే మరో సిలిండర్ బుకింగ్ చేసుకునే నిబంధన విధించి గ్యాస్ వాడకంపై నిబంధన విధించారు. దీంతో ఎడాపెడా బుకింగ్ చేసుకోవడం తగ్గి పొదుపుగా గ్యాస్ వాడే అవకాశం కలిగింది. అలాగే వ్యాపార వర్గాలు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ ఏజెన్సీలకు ఆయిల్ కంపెనీలు ఎత్తివేయడంతో వినియోగదారులకు అందకుండా పోయింది. గృహ వినియోగదారులకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.46 కలుపుని ఆయిల్ కంపెనీలు అందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూ.500 లబ్ధిదారులకు అందడం లేదు.ప్రస్తుతం సరిపడా నిల్వలుజిల్లాలో ప్రస్తుతం సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, అయితే యుద్ధం ఇలాగే కొనసాగితే మూడు నెలల తర్వాత ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో గల్ఫ్ దేశాల నుంచి నేరుగా పైపులైన్లతో దేశానికి సరఫరా అవుతుండేవి. ప్రస్తుతం యుద్ధం కారణంగా నిలిచిపోయాయి. దీంతో కేవలం సముద్ర మార్గంలో షిప్పుల్లో రవాణా అవుతోంది. దీంతో సరఫరాలో జాప్యం జరుగుతోంది. అంతేకాకుండా ఆయిల్ కంపెనీల్లో చమురు వెలికితీతలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో గ్యాస్ ఉత్పత్తిలోనూ జాప్యం జరుగుతోంది. -
సింగరేణి సిగలో మరో నగ
చెన్నూర్: సింగరేణి సిగలోకి మరో వెలుగు నగ వచ్చిచేరనుంది. విద్యుత్ ఉత్పత్తిలోకి అడుగుపెట్టిన సంస్థ 1200 మెగావాట్ల జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసిన తక్కువ కాలంలోనే రికార్డుస్థాయిలోనే దేశంలో కీర్తిని సంపాదించిన విషయం తెలిసిందే. కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణం చేపడుతోంది. రూ.9500 కోట్ల అంచనాతో నిర్మాణ పనులను బీహెచ్ఈఎల్ కంపెనీకి అప్పగించింది. సూపర్క్రిటికల్ పద్ధతిలో పర్యావరణ హితంగా ఈ నిర్మాణం సాగనుంది. బీహెచ్ఈఎల్ కంపెనీ బీటీజీ సివిల్ విభాగాల పనులు కేపీసీ కంపెనీకి, బీవోపీ పనులు పవర్మేక్ కంపెనీకి అప్పగించింది. ఇప్పటికే పలు కంపెనీలు నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్నాయి. నాలుగేళ్లల్లో పనుల పూర్తికి అధికార యంత్రాంగం ప్రణాళికలు తయారు చేసింది. మూడు షిఫ్టుల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. సింగరేణి, బీహెచ్ఈఎల్ కంపెనీ సంయుక్తంగా ఈ పనులు చేపడుతున్నాయి. జాయింట్ వెంచర్గా ఏర్పాటు కొత్తగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు జాయింట్ వెంచర్(జేవీ)గా తెలంగాణ, రాజస్థాన్ ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్నాయి. తెలంగాణ 74 శాతం వాటా, రాజస్థాన్ 26 శాతం వాటాగా నిర్ణయించగా రాజస్థాన్ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఫైనల్ చేయాల్సి ఉంది. ఇది కొలిక్కివస్తే తర్వాత పీపీఏ (పవర్ పర్చస్ అగ్రిమెంట్) కావాల్సి ఉంటుంది. ఇంతకాలం సింగరేణి సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి ఎస్టీపీపీ ద్వారా సాధిస్తున్న విద్యుత్ ఉత్పత్తిని రూ.4.50కు ఒక్క యూనిట్గా విక్రయిస్తుండగా, ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల ప్లాంటు ద్వారా సాధించే విద్యుత్ను రాజస్థాన్కు విక్రయించడానికి అంగీకారం కావాల్సి ఉంది. అనుకున్న విధంగా రెండు ప్రభుత్వాల మధ్యన ఒప్పందం తర్వాత బ్యాంకుల ద్వారా నిధుల సమీకరణ జరగనుంది. బొగ్గు రవాణాకు రైలు మార్గం.. ఽథర్మల్ పవర్ ప్లాంటు విద్యుత్ ఉత్పత్తికి ప్రధానంగా నీరు, బొగ్గు అవసరం. ఇప్పటికే సింగరేణి సంస్థ ఇక్కడ రెండు రిజర్వాయర్లు నిర్మించగా గోదావరి, ప్రాణహిత నదుల ద్వారా నీళ్లు తరలిస్తుంది. ఇక బొగ్గు రవాణాకు ప్రత్యేకంగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేసింది. సీఎం రాక చివరి నిమిషంలో వాయిదా!కొత్త ప్లాంటు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి రాక కోసం అధికార యంత్రాంగం గతేడాది రెండుసార్లు కార్యక్రమం ఖరారు చేశారు. చివరి నిమిషంలో వాయిదా పడుతూ వచ్చింది. గతంలో సీఎండీగా పని చేసిన ఎన్.బలరాం అనఽధికారికంగా ఇక్కడ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. దీంతో పనులు కొనసాగుతున్నాయి. కానీ కొత్త ప్లాంటు నిర్మాణానికి ఏర్పాటు చేసిన పైలాన్ మాత్రం అలంకారప్రాయంగా మిగిలిపోయింది. -
సమస్యల పరిష్కారానికి కృషి
నస్పూర్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు అన్నారు. శనివారం ఆయన ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికలో భా గంగా కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్యతో కలిసి 30, 16వ డివిజన్లలో పర్యటించారు. 30వ డివిజన్లో వీధి దీపాలు వెలుగడం లేదని స్థానికులు తెలుపగా ఎమ్మెల్యే వెంటనే ఏఈ రాంచందర్కు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని సూచించారు. విలేజ్ శ్రీరాంపూర్ బస్టాప్ వద్ద బస్సులు నిల పడం లేదని మహిళలు దృష్టికి తీసుకు రాగా.. డిపో మేనేజర్ శ్రీనివాస్కు ఫోన్ చేసి బస్సులు నిలపాలని ఆదేశించారు. కార్పొరేటర్లు శ్రీనివాస్, త్రివేణి ఉన్నారు. -
పనికి గుర్తింపునివ్వాలి
మంచిర్యాలటౌన్: ‘‘పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు రోడ్లపై చెత్తాచెదారం తొలగించడం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా మా విధులు పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తున్నాం. మేము చేస్తున్న పనికి గుర్తింపు ఇవ్వాలి..’’ అని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య మహిళా కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో మంచిర్యాల డిప్యూటీ మేయర్ సల్ల రమ్య ‘స్టార్ రిపోర్టర్’గా 53వ డివిజన్లోని కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. కార్మికుల సేవలు, సమస్యలు తెలుసుకున్నారు. నిత్యం సబ్బులు, డ్రెస్లు, చెప్పులు, నూనె వంటివి అందించాలని, కొందరికి వేతనాలు ఆలస్యంగా వస్తున్నాయని డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. మరికొందరు పదేళ్లుగా పనిచేస్తున్నా పీఎఫ్, ఈఎస్ఐలు అందడం లేదని వివరించారు. వేసవి కాలంలో పని సమయాన్ని తగ్గించాలని, ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు గొడుగులు ఇవ్వాలని కోరగా.. ఆమె స్పందిస్తూ ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీనిచ్చారు. అనంతరం డిప్యూటీ మేయర్ రమ్య మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్యం పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉందని అన్నారు. చెత్త తొలగించినప్పుడు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. చెత్తాచెదారం తొలగించేందుకు గ్లౌజులు, మాస్క్, బూట్లు ధరించాలని తెలిపారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత కోసం కార్మికులు చేస్తున్న శ్రమను కొనియాడారు. -
నిర్భయంగా ఫిర్యాదు చేయాలి..
సమాజంలో ప్రతి ఒక్కరూ నైతిక విలువలు నేర్చుకోవాలి. మహిళలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. నిర్భయంగా ఫిర్యాదు చేస్తే పోలీసులు రక్షణ కల్పిస్తారు. నేరం చేసిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారు. చట్టాలు అందరికీ సమానమే. మహిళల రక్షణకు కఠినమైన చట్టాలున్నాయి. వరకట్న వేధింపులు, గృహహింస, పోక్సో కేసుల్లో, లైంగికదాడి కేసుల్లో చట్టాలు కఠినంగా ఉన్నాయి. మహిళలకు సంబంధించిన కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తున్నాం. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల -
దాడులు పెరగడం బాధాకరం..
ఇటీవల కాలంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులు సైతం బాలికలపై లైంగికదాడులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. పని ప్రదేశాలు, పాఠశాలల్లో మహిళలు, బాలికలకు రక్షణ లేకపోతే ఎలా ? సభలు, సమావేశాల్లో మహిళల రక్షణకు మేమున్నమంటూ గొప్పలు చెప్పిన పాలకులు ఏదైనా ఘటన జరిగినప్పుడు నోరు మెదపకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలు చైతన్యవంతం కావాలి. మనల్ని మనమే రక్షించుకోవాలి. – సరిత ఓజా, సామాజిక్ జాగృతి వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపకురాలు, మంచిర్యాల -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి..
ప్రభుత్వాలు మహిళల రక్షణకు అనేక చట్టాలు రూపొందించాయి. వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. సాధారణ మహిళలకు ఉచిత న్యాయ సేవలందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పని చేస్తుంది. చాలామంది మహిహిళలు వారి భర్తలపై వరకట్నం, గృహహింస కేసులు పెడుతూ ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతూ న్యాయం జరగడం లేదని బాధపడుతున్నారు. ఏ కేసులోనైన బలమైన ఆధారాలు ఉంటే కొంత ఆలస్యమైనా సముచిత న్యాయం జరుగుతుంది. – చంద్రకళ, న్యాయవాది. మంచిర్యాల -
మాస్టర్ చెఫ్ పోటీల్లో రన్నరప్గా తల్లీకూతుళ్లు
మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్లు రాచకొండ చందన, సాయిశ్రీ సోనీ టీవీలో ప్రసారం అవుతున్న మాస్టర్ చెఫ్ ఇండియా జోడి 10 సీజన్లో రన్నరప్గా నిలిచారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన జోడితో తలపడి అందరి ప్రశంసలు అందుకున్నారు. మంచిర్యాలలో నివాసం ఉంటున్న రాచకొండ రవిచందర్, చందన దంపతుల కూతురు సాయిశ్రీ బీటెక్ చదివినా వంటలపై ఉన్న ఆసక్తి, అభిరుచితో తెలుగు మాస్టర్ చెఫ్ సీజన్–1లో పాల్గొని టాప్ 6 సెమీఫైనల్ వరకు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఎల్లిపాయకారం రెస్టారెంట్కు కో ఫౌండర్గా ఉంటూనే కుటుంబ వ్యాపారం సిరి క్యాటరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. తల్లి చందన నస్పూరులో ప్రకృతి సేద్యంతో వ్యవసాయం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి జోడి దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది మాస్టర్ చెఫ్ కార్యక్రమానికి హాజరయ్యారు. టాప్ 25లో తల్లీకూతుళ్లు చందన, సాయిశ్రీ ఎంపికై టాప్ 12లో కొనసాగుతూ తెలుగు రాష్ట్రాల నుంచి మాస్టర్ చెఫ్ ఇండియాలో పాల్గొన్న మొదటి జోడిగా చరిత్ర సృష్టించారు. తెలంగాణ వంటకాల సంస్కృతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. టాప్ 12 జోడిల్లో ప్రతిభను కనబరిచి ఫైనల్కు చేరినా రన్నరప్గా నిలిచి రూ.5 లక్షల పారితోషికం అందుకున్నారు. ఫైనల్ శుక్రవారం రాత్రి సోనిలో ప్రసారం కావడంతో తల్లీకూతుళ్లు ప్రశంసలు అందుకుంటున్నారు. -
రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(సీఓఈ) పాఠశాల/కళాశాల, నంబర్ టు ఇంకై ్లన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ నీలికొండలోని సాక్రెడ్ హైస్కూల్లో ఈ నెల 7 నుంచి 9వరకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. అండర్–14 పోటీలకు సీఓఈ గురుకుల విద్యార్థులు డి.విశ్వతేజ, పి.ఋశేంద్ర వర్మ, జి.సుశాంత్, ఏ.శ్రీహర్షవర్థన్, ఎస్.సంకీర్తసాయి, డి.చైతన్య, ఎస్.విజయచంద్ర ఎంపికయ్యారు. హైస్కూల్కు చెందిన బాలికలు విలాక్ష, సామ్రీన్, సన ఎంపికయ్యారు. విద్యార్థులను సీఓఈ గురుకుల ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్సాగర్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కే.విజయలక్ష్మి వేర్వేరుగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొండలరావు, గోపి, దశరథం, ఫిజికల్ డైరెక్టర్ ఎండి.చాంద్పాషా, వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, ఎం.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థులకు అండగా నిలుస్తాం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల చదువుల కోసం ఎలాంటి అవసరాలు అవసరమైనా అండగా నిలుస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం గుడిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎంపీ ల్యాండ్స్, డీఎంఎఫ్టీ నిధుల నుంచి మంజూరైన మూడు బస్సులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రూ.80 లక్షలతో బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. వైద్య విద్యార్థులు జిల్లాను రాష్ట్ర, జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలపాలని, వైద్య విద్య పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. త్వరలోనే విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ కుమార్దీపక్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్లు రేఖ, జగతి, హెచ్ఓడీ శ్రీకాంత్, ఏడీ తులసీదేవి, అధ్యాపక బృందం, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితో విద్యుత్ ఉత్పత్తి
చెన్నూర్: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు అధికారుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు, విభేదాలు లేవని, అందరి సమష్టి కృషితో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి సాధిస్తున్నామని ఎస్టీపీపీ జీఎంలు నర్సింహారావు, మదన్మోహన్ అన్నారు. జైపూర్ మండల కేంద్రంలోని ప్రాణహిత అతిథి గృహంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. యాష్ డిస్పోజల్ ప్రక్రియ పూర్తిగా కార్పొరేట్ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్స్(ఎంవోఈఎఫ్), ఎంవోపీ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని తెలిపారు. ముందు నుంచీ ఎస్టీపీపీలో వంద శాతం యాష్ వినియోగం జరుగుతోందని, పలు ఉత్తమ అవార్డులు సైతం అందుకుందని అన్నారు. ఎస్టీపీపీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతోపాటు కొత్త ప్లాంటు పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని, కొందరు వ్యక్తులు వారి స్వార్థం కోసం ఎస్టీపీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీజీఎం(పర్సనల్) కిరణ్బాబు, స్వామిరాజు, వాసుదేవమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
కారొ‘పరేషాన్’!
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపాలిటీలో నస్పూరు మున్సిపాలిటీ, హాజీపూర్లోని ఎనిమిది గ్రామాల విలీనంతో గత ఏడాది జనవరిలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. నగర పరిధి, ఉద్యోగుల సంఖ్య పెరిగింది. గతంలో 36 వార్డులతో బల్దియా ఉండగా ప్రస్తుతం 60 డివిజన్లుగా విస్తరించింది. కార్పొరేషన్కు ఇటీవల ఎన్నికలూ నిర్వహించగా గత నెలలో పాలకవర్గం కొలువుతీరింది. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. అధికారులు, కార్పొరేటర్లు ఇరుకుగా ఉన్న కార్యాలయంతో ఇబ్బందులు పడుతున్నారు. నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారాన్ని సమావేశ మందిరంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా స్థలం సరిపోదని కార్యాలయం ఆవరణలో టెంటు వేసి నిర్వహించారు. ఈ నెల 4న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘మంచిర్యాల శుభ్రత–ప్రతీ ఒక్కరి ఆరోగ్య భద్రత’ పేరిట 99 రోజుల కార్యక్రమానికి సంబంధించిన సమావేశాన్ని సైతం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలోనే టెంటు వేసి నిర్వహించారు. కార్పొరేషన్గా ఏర్పడి ఏడాది దాటగా, కొత్త పాలకవర్గం కొలువుదీరి 20 రోజులు అవుతోంది. ఇప్పటికీ కార్యాలయానికి అవసరమైన గదులు, సమావేశ మందిరం సిద్ధం కావడం లేదు. ఆదాయం ఉన్నా వసతులు అంతంతే.. మున్సిపల్ కార్పొరేషన్కు పన్నులు, ప్రకటనలు, అద్దెల రూపంలోనే దాదాపుగా రూ.50 కోట్ల ఆదాయం వస్తుంది. అయినా కార్యాలయంలో పూర్తిస్థాయిలో వసతులు, కార్పొరేషన్కు తగినట్లుగా భవనం లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. గతంలో మున్సిపల్ చైర్పర్సన్కు మాత్రమే చాంబర్ ఉండగా, ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్కు రెండు వేర్వేరు చాంబర్లు ఏర్పాటు చేశారు. గతంలో చైర్మన్ చాంబర్ను ప్రస్తుత మేయర్కు, కమిషనర్ చాంబర్ను డిప్యూటీ మేయర్కు కేటాయించారు. దీంతో కమిషనర్కు చాంబర్ లేకుండా పోయింది. ప్రస్తుతం పారిశుద్ధ్య విభాగం, మేనేజర్ కూర్చుంటున్న గదిని కమిషనర్ చాంబర్ కోసం సిద్ధం చేస్తుండగా, కమిషనర్ మాత్రం అదనపు కమిషనర్ చాంబర్తోపాటు సమావేశ మందిరాన్ని తన విధుల నిర్వహణకు తాత్కాలికంగా ఉపయోగిస్తున్నారు. ప్రతీ నెల పాలకవర్గం సమావేశాల నిర్వహణకు ప్రస్తుత సమావేశ మందిరం ఇరుకుగా ఉంటుంది. దీంతో పాలకవర్గ సమావేశం ఇబ్బందిగా మారనుంది. కార్పొరేషన్కు తగినట్లుగా భవనాన్ని నిర్మించి వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది.ఉన్న వాటిని వినియోగిస్తాంకార్పొరేషన్గా మారడంతో డివిజన్లు పెరిగాయి. మేయర్, డిప్యూటీ మేయర్ చాంబర్లకు గదుల కేటాయింపుతో కమిషనర్ చాంబర్ను మరోచోట ఏర్పాటు చేస్తున్నాం. సమావేశ మందిరం సమావేశాలకు వినియోగించేలా సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్నవాటిని సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – అన్వేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
పోటీ పరీక్షలతో ఆత్మవిశ్వాసం
లక్సెట్టిపేట: పోటీ పరీక్షలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని లక్సెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి కే.సాయికిరణ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ సెకండరీ బాలికల పాఠశాలలో యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్టు పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ప్రతిభను పెంపొందించుకోవాలని అన్నారు. మండల విద్యాశాఖ అధికారి శైలజ మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి పరీక్షల్లో పాల్గొనడం ద్వారా జ్ఞానం పెరుగుతుందన్నారు. ఈ టాలెంట్ టెస్ట్లో మండలంలోని తొమ్మిది పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మండల స్థాయిలో ప్రథమ బహుమతి ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన రిషిక, రెండో బహుమతి ట్రినిటి హైస్కూల్ లక్ష్మీప్రసన్న, మూడో బహుమతి ఆర్కేస్ ప్రైవేట్ పాఠశాల దీర తీరి అందుకున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ, కారుకురి సురేందర్, చెల్ల గణేష్, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సిబ్బంది, యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్/కై లాస్నగర్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అలాగే కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా హాజరుకాగా మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు వేగవంతం చేయాలన్నారు. భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, మరమ్మతులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా చూడాలన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మిల్లర్ల నుంచి సీఎంఆర్ రికవరీ, కేసుల పురోగతి వంటి అంశాలపై ఏప్రిల్ 30 నాటికి సమగ్ర నివేదిక అందించాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను ఆధార్, బ్యాంక్ ఖాతాలకు అనుసంధించి వాటి వివరాలను శాఖలు, పనిచేయిస్తున్న ఏజెన్సీల వారీగా అందజేయాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, ఇసుక అక్రమ రవాణా, మైనింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు గాను లబ్ధిదారుల ఎంపిక, అమలు కోసం సాంకేతికత వినియోగించుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను 10–15 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలన్నారు. అనంతరం 25 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు మంజూరు చేశారు. సమావేశంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ అనూష, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా నోడల్ అధికారి అగ్రోస్ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ శాఖల వారీగా ప్రణాళిక సిద్ధం చేశామని, శుక్రవారం నుంచి పారిశుద్ధ్య ప్రక్రియ ప్రాంభించామని తెలిపారు. ఈ–ఆఫీసు ద్వారా పెండింగ్ ఫైళ్లు క్లియరెన్స్ చేస్తామని, భూభారతిలో దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. తాగునీటి సమస్యలు పరిష్కరిస్తున్నామని, అమృత్ పథకం పనులు త్వరగా పూర్తి చేసేలా, ఇందిరమ్మ ఇళ్లు దశలవారీగా త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాన్ఫరెన్స్లో డీసీపీ భాస్కర్, జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశీష్ సింగ్, జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, శ్రీనివాసరావు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మే యర్ సల్లా రమ్య, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు.


