Mancherial District Latest News
-
ఎకరాకు రూ.30 లక్షలు ఇవ్వాలి
● ఆర్డీవో శ్రీనివాస్రావుకు ఓసీపీ నిర్వాసితుల వినతి జైపూర్: ఇందారం ఓపెన్కాస్టు డంపింగ్ యా ర్డు కోసం సేకరించిన 129 ఎకరాల భూములకు మార్కెట్ రేటుకు అనుగుణంగా రూ.30 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆర్డీవో శ్రీని వాస్ రావుకు రామారావుపేట, ఇందారం రైతులు శనివారం వినతిపత్రం అందజేశారు. ఓపె న్కాస్టు డంపింగ్ యార్డు కోసం రామారావుపేట శివారులో 129 ఎకరాలు సేకరించారని, పరి హారం నిర్ణయించకుండా సింగరేణి యా జమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని తెలిపారు. రాజీ వ్ రహదారికి సమీపంగా ఉన్న విలువైన భూ ములు సింగరేణి యాజమాన్యం తీసుకుంటుంద ని, ప్రస్తుతం ఎకరాకు రూ.కోటి ఉందని పేర్కొన్నారు. యాజమాన్యం రైతులకు సరైన పరి హారం చెల్లించేలా చూడాలని కోరారు. లేదంటే తమ భూములు తమకు ఇవ్వాలన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నిర్వాసితులు జిట్ట దే వయ్య, నామాల తిరుపతి, యాదగిరి, సరిత, అక్షత్, సాగర్, సత్తయ్య, వేణుగోపాల్, వెంకటేశ్, జీవన్, మధుకర్ తదితరులు ఉన్నారు. -
ఎస్టీపీపీలో వర్క్స్ కమిటీ సమావేశం నిర్వహించాలి
జైపూర్: ఎస్టీపీపీలో వర్క్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర అ ధ్యక్షుడు రియాజ్ అ హ్మద్ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. 2016–20 వరకు స్టీగ్ కంపెనీ నుంచి కార్మికులకు ఫుల్అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. ఒక్కో కార్మికుడికి రూ.70వేలకు పైగా వస్తాయని, ఆ డబ్బులు సి ంగరేణి యాజమాన్యం కాజేసిందా అని ప్రశ్నించారు. పవర్మేక్ కంపెనీ సబ్ కాంట్రాక్టు వీ వీఆర్ అనే కంపెనీ 2016–23 వరకు కార్మికులకు ఫుల్అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయలేదన్నారు. కంపెనీ నిబంధనలు ప్రకారం బోసన్ 8.33 ఇవ్వాలని అలా చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. పవర్మేక్ కంపెనీ వెంటనే డబ్బులు చెల్లించాలని లేకపోతే కార్మి కులు ఆందోళన చేపడుతారని హెచ్చరించారు. పులిని హతమార్చిన 30 మంది అరెస్టు కాగజ్నగర్టౌన్: పెంచికల్పేట మండలంలో ని ఎల్లూరు అటవీప్రాంతంలో విద్యుత్ తీగల ఉచ్చుతో పులిని హతమార్చిన 30 మందిని శని వారం అరెస్టు చేసినట్లు కాగజ్నగర్ ఫారెస్టు డి విజన్ అధికారి సుశాంత్ సుఖ్దేవ్ బోబాడే తెలి పారు. అప్పాజి శ్రీనివాస్, వెంకటేశ్,ఎల్కరి శే ఖర్, రోహిని శ్రావణ్, చప్పిడె అశోక్, పవన్కుమార్,ఎల్కరి ప్రకాశ్, వెంకటేశ్, కాటెల సాగర్, నికాడి వెంకటేశ్, లా త్కరి శ్రీనివాస్, భీంకరి వెంకటేశ్, భీంకరి రంగయ్య, లేగల గోపాల్, రాచకొండ లచ్చయ్య, ఓండ్రె సంతోశ్, తుమ్మి డె శ్రీనివాస్, ఎల్కరి సుగుణాకర్, బుర్రి తిరుపతి, ఓండ్రె నారాయణ, లేగల వెంకటేశ్, గో మాసు రాజన్న, మడె మధునయ్య, లేగల స త్యనారాయణ, ఎల్లూరి లచ్చన్న, మౌల్కార్ ది వాకర్, బిన్కర్ తిరుపతి, తుమిడె సత్తయ్య, పె ద్దల నీలయ్య, గావుడె శంకర్ ఉన్నారన్నారు. సిర్పూర్(టి) సివిల్కోర్టులో హాజరుపర్చామ ని, 14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీ విధించగా, ఆసిఫాబాద్ జైలుకు తరలించినట్లు తెలిపారు. -
జీపీవో పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
● సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్మంచిర్యాలఅగ్రికల్చర్: గ్రామ పాలన అధికారులకు ఆదివారం రాత పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్, అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించా రు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తె లిపారు. లోటుపాట్లకు, అవకతవకలకు తావులేకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరిగే విధంగా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ పరీక్షకు జిల్లాల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జవాబు పత్రాల తరలింపు, స్ట్రాంగ్ రూమ్, పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు తెలుసుకునేలా అధికారులను ఆదేశించామన్నారు. వీసీలో ఆర్డీవో శ్రీని వాస్రావు, కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్, మంచిర్యాల తహసీల్దార్ రఫతుల్లా, విద్యాశాఖ పరిశీలకులు సత్యనారాయణ, ముఖ్య పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో పశువులు మృతి
లక్ష్మణచాంద: మండలంలోని పార్పెల్లితండాలో విద్యుత్ షాక్తో గేదె మృతిచెందింది. గేదె ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం మేతకు వెళ్లి ంది. తిరిగి సాయంత్రం ఇంటికి రాకపోవడంతో రైతు బానావత్ రాంజీ చుట్టూపక్కల వెతి కాడు. శనివారం అటు వైపుగా వెళ్లిన గ్రామస్తులకు గేదె మృతి చెంది కనిపించడంతో రైతుకు సమాచారమిచ్చారు. మేత మేసేక్రమంలో వి ద్యుత్ షాక్ తగలి మృతి చెందినట్లు గుర్తించా రు. దీని విలువ రూ.55 వేలు ఉంటుందని ప్ర భుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు. దిలావర్పూర్లో.. దిలావర్పూర్: మండల కేంద్రానికి చెందిన రైతు నంద ముత్యం ఎద్దు శనివారం విద్యుత్ షాక్తో మృతి చెందింది. ఎప్పటిలాగే తన పంటచేలకు ఎడ్లబండితో వెళ్లి అక్కడ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. మేతకోసం ఎద్దులను పొలంలో ఉంచగా ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. అక్కడ 11 కేవీ విద్యుత్ తీగలకు ఎద్దు తోక తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. ఎద్దు కిందపడిపోగానే అక్కడకు చేరుకున్న రైతు ఏం జరిగిందో తెలియక వేలాడుతున్న విద్యుత్ తీగను చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే విద్యుత్ సరఫరా నిలుపుదల చేయాలని అధికారులకు సమాచారమిచ్చారు. మృతి చెందిన ఎద్దు విలువ రూ.80 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. కడెంలో.. కడెం: మండలంలోని అల్లంపల్లి జీపీ పరిధి పాలరేగడి గ్రామ గిరిజన రైతు పెంద్రం మధుకు చెందిన ఆవు విద్యుత్ షాక్తో మృతిచెందింది. దత్తోజిపేట సమీపంలో శుక్రవారం ఆవు మేతకు వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తుండగా ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ తీగలకు తగిలి షాక్తో మృతిచెందింది. దీని విలువ రూ.40 వేలు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతు వేడుకున్నాడు. -
‘ఉపాధి’పై విజిలెన్స్
● పనుల్లో పారదర్శకత కోసం పర్యవేక్షణ కమిటీలు ● గ్రామస్థాయిలోనే అక్రమాలకు చెక్..పాతమంచిర్యాల: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి హమీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఆర్థిక బలోపేతం చేస్తోంది. పనులలో పారదర్శకత, నాణ్యతను నిర్ధారించేందుకు 2025 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతీ గ్రామ పంచాయతీలో విజిలెన్స్ మానిటరింగ్ కమి టీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. విజిలెన్స్ కమిటీలు.. ఉపాధి పనుల పర్యవేక్షణకు వేసే ఈ కమిటీలను గ్రామసభల ద్వారా ఎంపికై న ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేస్తారు. కమిటీలో మూడింట ఒక వంతు మహిళల భాగస్వామ్యం తప్పనిసరి. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, యువజన సంఘాలు లేదా స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఇందులో ఉంటారు. ఈ కమిటీల కాలపరిమితి ఆరు నెలలు, సభ్యులు స్వచ్ఛందంగా ఎలాంటి వేతనం లేకుండా పనిచేస్తారు. గత నెలలో ఏర్పాటు ప్రారంభమై, మే రెండవ వారంలో జిల్లాలోని 16 మండలాల్లోని గ్రామ పంచాయతీలలో కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీల విధులు, బాధ్యతలు ప్రతీవారం గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే ఉపాధి పనులను కమిటీలు సమీక్షిస్తాయి. పని స్థలాలను సందర్శించి, కూలీలతో సంప్రదించి, సౌకర్యాలు, నాణ్యత, వేతన చెల్లింపులు, పనుల పరిమాణం వంటి అంశాలను పరిశీలిస్తాయి. నెలవారీ నివేదికలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పిస్తాయి. సమస్యల పరిష్కారానికి అధికారులకు సిఫారసులు చేస్తాయి. సామాజిక తనిఖీలలో కమిటీ నివేదికలను పరిగణనలోకి తీసుకుంటారు. పారదర్శకతకు కేంద్రం మార్గదర్శకాలు అవకతవకలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. విజిలెన్స్ కమిటీలు గ్రామీణ ఉపాధి పథకంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.పారదర్శకత పెంచడానికే..ఉపాధి హామీ పనులలో పారదర్శకత పెంచడానికి విజిలెన్సు మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేశాం. గ్రామపంచాయతీ స్థాయిలో ఏర్పాటైన కమిటీలు గ్రామాభివృద్దికి అవసరమైన పనుల ఎంపిక, చేపట్టిన పనులు పరిశీలన, పనులలో అవకతవకలు నిరోధించేలా పనిచేస్తాయి. – ఎస్.కిషన్, డీఆర్డీవోజిల్లా వివరాలు.. జాబ్కార్డులు 1,02,119 కూలీలు 2,37,449 యాక్టివ్ జాబ్కార్డులు 77,586 యాక్టివ్ కూలీలు 1,32,245 గ్రామపంచాయతీలు 305 -
20 క్వింటాళ్ల నకిలీ పత్తివిత్తనాలు పట్టివేత
కాగజ్నగర్రూరల్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో రూ.60 లక్షల విలువైన 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కాగజ్నగర్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ డీవీ.శ్రీనివాస్రావు శనివారం వివరాలు వెల్లడించారు. నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయని టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో కాగజ్నగర్ సమీపంలోని పెద్దవాగు సమీపంలో తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అటుగా వచ్చిన ఏపీ39 టీవై 9741 నంబర్ ఐచర్ వ్యాన్ను తనిఖీ చేయగా అందులో 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు. విత్తనాలకు సంబంధించిన వివరాలు తెలుపకపోవడంతో కాగజ్నగర్ పట్టణంలోని కాపువాడకు చెందిన కొత్తపల్లి సదాశివ్, కర్నూల్ జిల్లా అదోనికి చెందిన డ్రైవర్ పుప్పాల లక్ష్మణ్, మహారాష్ట్రలోని అహేరికి చెందిన సంతోష్కిశోర్ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో నిందితుడు వేణుగోపాల్రెడ్డి పరారీలో ఉన్నారని తెలిపారు. జిల్లాలో ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, టాస్క్ఫోర్స్ సీఐ రాణాప్రతాప్, కాగజ్నగర్రూరల్ సీఐ శ్రీనివాస్రావు, టాస్క్ఫోర్స్ ఎస్సై వెంకటేశ్, రూరల్ ఎస్సై సందీప్ పాల్గొన్నారు. ఇచ్చోడ: మండలంలోని కోకస్మన్నూర్, ఇస్లాంనగర్ గ్రామాల్లో ఆదిలాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆధ్వర్యంలో శనివారం నకిలీ విత్తనాలు పట్టుకున్నట్లు తెలిసింది. ఉదయం 8 గంటలకు ఏకకాలంలో దాడులు నిర్వహించి నకిలీ బీజీ–3 విత్తనాలను పట్టుకున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో 18 నకిలీ విత్తనాల బ్యాగులతో పాటు ముగ్గురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై స్థానిక ఎస్సై పురుషోత్తం వివరణ కోరగా ఆకస్మికంగా దాడులు జరిపిన మాట వాస్తవమన్నారు. విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. -
కార్మికులకు అండగా ఉండాలి
శ్రీరాంపూర్: కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉండాలని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ప్రసాద్ తెలిపారు. శుక్రవారం రాత్రి రసూల్పల్లెలోని తన నివాసంలో శ్రీరాంపూర్ డివిజన్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఏ సమస్య వచ్చినా యజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. కార్మికుల చిరకాల వాంఛ అయిన సొంతింటి పథకం అమలు కోసం కృషి చేస్తున్నామన్నారు. అలవెన్స్లపై ఆదాయ పన్ను రీయింబర్స్మెంట్, రూ.25 లక్షల వడ్డీ లేని రుణం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎన్నికల వేళ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు యూనియన్ పదవులు అప్పగించి నియామకపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ బ్రాంచి ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు, కేంద్ర కమిటీ నాయకులు భీంరావు గరిగే స్వామి, కలవేన శ్యామ్, ఏనుగు రవీందర్రెడ్డి, జీవన్జోయల్, తిరుపతిరాజు, నాయకులు పేరం రమేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీ అనుమతులకు ప్రత్యేక చర్యలు
● గిరిజనుల అభివృద్ధికి కృషి ● రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖమంచిర్యాలఅగ్రికల్చర్: అభివృద్ది పనులకు అవసరమైన అటవీ అనుమతుల జారీకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ, పర్యావరణ, అటవీ, శాస్త్రసాంకేతిక శాఖ కార్యదర్శి అహ్మద్ నదీంతో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొండా సురేఖ మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, తాగునీటి సరఫరా, విద్యుత్, పాఠశాలలు, ఆస్పత్రులు ఇతర అభివృద్ధి పనుల కోసం సమర్పించిన ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల పరిధిలో చేపట్టే రహదారుల పనులకు అటవీ శాఖ అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అటవీ నిబంధనలకు లోబడి అనుమతులు జారీ చేయాలన్నారు. అవసరమైతే అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో పనుల జరిగేలా చూడాలని తెలిపారు. పనుల పురోగతిపై ఈనెల 28లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. అభివృద్ధిలో వెనుకబాటు.. ప్రస్తుతం సమాజంతో పొలిస్తే అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు అభివృద్ధిలో వెనకబడ్డారని మంత్రి సీతక్క అన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రహదారుల నిర్మాణం, విస్తరణ, జాతీయ రహదారులకు అనుసంధానం ద్వారా మారుమూల గిరిజనులకు, బాహ్య ప్రపంచానికి సంబంధాలు మెరుగు పడతాయని పేర్కొన్నారు. పోడు వ్యవసాయానికి తోడ్పాటు.. జిల్లాలోని పోడు భూములలో వెదురు మొక్కల పెంపకంపై గిరిజనలకు అవగాహన కల్పించి సాగు చేసేలా తోడ్పాటు అందిస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నర్సరీలలో వెదురు మొక్కలు పెంచుతున్నామని జిల్లాలో కొన్నేళ్లుగా పట్టుపురుగలు పెంచుతున్నట్లు వెల్లడించారు. మట్టి రోడ్లను సీసీ, బీటీ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంద ని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఎంసీహెచ్లో సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలటౌన్: మాతా శిశు ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలకు సమస్యలు ఎదురుకాకుండా చూడాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు వైద్యులకు సూచించారు. ఎంసీహెచ్ను శనివారం సందర్శించి వైద్యులు, గర్భిణులతో మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన సూచించారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, ఆర్ఎంవోలు భీష్మ, శ్రీధర్, కార్పొరేషన్ కమిషనర్ శివాజీ ఉన్నారు. పనులు వేగవంతం చేయాలి లక్సెట్టిపేట: పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు సూచించారు. నిర్మాణ పనులను శనివారం పరిశీలించారు. నాణ్యతతో పనులు చేయాలన్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. అనంతంర ఐదు రోజులుగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను విద్యార్థులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో యాదయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ.ఆరీఫ్, నాయకులు శ్రీనివాస్, చింత అశోక్, నాగభూషణం, పింగిళి రమేశ్, స్వామి, సురేశ్ పాల్గొన్నారు. -
బాక్సింగ్ చాంపియన్లుగా నిలవాలి
మంచిర్యాలటౌన్: బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులు చాంపియన్లుగా నిలిచి, జాతీయస్థాయిలోనూ రాణించాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కీర్తిరాజ్వీర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో టైసన్ కప్–2025 చాంపియన్షిప్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలను శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈనెల 26వ తేదీ వరకు నిర్వహించనున్న బాక్సింగ్ పోటీలకు రాష్ట్రస్థాయి నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పురుషోత్తం నాయక్, నిర్వాహకుడు చిలువేరు రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సాహిత్యంలో ‘అరుణ’ కిరణం!
● ఆకట్టుకుంటున్న బట్టువార్ బాల సాహిత్యం.. ● విద్యార్థుల్లో సాహిత్య బీజాలు నాటుతున్న ఉపాధ్యాయురాలు.. ● తాను రచిస్తూ.. పిల్లల్లో సాహిత్యం పెంపొందించేలా ప్రేరణ.. ● ఐదు భాషల్లో మధుర గేయాల పుస్తకాలు ముద్రణ ● సొంతంగా 1,937 కవితలు రాసిన టీచర్.. ● నేడు ‘తెలంగాణ సారస్వత పరిషత్’ ఆధ్వర్యంలో సన్మానంఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా భీంసరికి చెందిన ఉపాధ్యాయురాలు అరుణ బట్టువార్ ప్రాథమిక స్థాయి విద్యార్థులను బాల కవులు, సాహిత్యవేత్తలుగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఇంద్రవెల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న ఆమె.. బాలల్లో సాహిత్య ఆసక్తిని పెంపొందిస్తున్నారు. ఆమె స్వయంగా 1,937 కవితలు రాసి, 10 సాహిత్య పుస్తకాలను ప్రచురించారు. విద్యార్థుల ద్వారా ఐదు భాషల్లో ఆరు బాల గేయ పుస్తకాలను ముద్రించారు. ఆమె సేవలను గుర్తించి, ‘తెలంగాణ సారస్వత పరిషత్’82వ స్థాపన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం జరిగే బాల సాహిత్య సమ్మేళనంలో సన్మానించనుంది. సాహిత్య సేవలకు గుర్తింపు అరుణ బట్టువార్ 1997లో ఎంఏ, బీఎడ్ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. కథలు, నాటికలు రాసి రేడియో ప్రోగ్రామ్ల ద్వారా ప్రసారం చే శారు. ఆమెకు విశ్వవిఖ్యాత గౌతమి నంది, ఎస్వీఆ ర్ డిజిటల్ అండ్ గౌతమేశ్వర కామధేను, ప్రైడ్ ఇండియా, కలం భూషణ్, సాహితీ కిరణం, గుడిహత్నూర్ బెస్ట్ టీచర్, సావిత్రిబాయి ఫూలే, చతుర్ముఖ సింహ, కథరత్న, మధుర కవయిత్రి వంటి అనేక అ వార్డులు లభించాయి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, వి శ్వవిఖ్యాత కీర్తి, తెలుగు వెలుగు జాతీయ సాహిత్య పురస్కారాలు, ఆర్ఎస్ఎన్ సేవ ఫౌండేషన్ కవితా పురస్కారాలు కూడా ఆమె సొంతం చేసుకున్నారు. ఐదు భాషల్లో బాల గేయాలు అరుణ బట్టువార్ పనిచేసిన పాఠశాలల్లో విద్యార్థులతో కవితలు, సాహిత్య రచనలు చేయించారు. 2021–24 మధ్య గుడిహత్నూర్ మండలం మన్నూ ర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ, విద్యార్థులతో తెలుగు, హిందీ, మరాఠీ, ఇంగ్లిష్ భాషల్లో గేయాలు రాయించారు. వాటిని ‘మన్నూర్ బాలల మధుర గేయాలు’, ‘మన్నూర్ చిల్డ్రన్స్ మెలోడీయస్ రైమ్స్’వంటి పుస్తకాలను ముద్రించారు. 2013లో సీతారాంగూడ పాఠశాలలో గొండి భాషలో ‘చుడూర్ కాండీరా... చుడూర్ పాటింగ్’గేయాల పుస్తకాన్ని రాయించారు. ఇంద్రవెల్లిలో గత విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులతో అలంకార కవితలు రాయించి పుస్తకం ముద్రించారు. సాహిత్య బీజం నాటి.. అరుణ బట్టువార్ సాహిత్య ప్రతిభను విద్యార్థుల్లో నాటడం ద్వారా బాల సాహిత్యానికి కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. ఆమె కృషిని జిల్లా వాసులు, తోటి ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు. ఆమె బోధన, సాహిత్య రచనలు భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. బాల కవులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం పిల్లల్లో సాహిత్యాన్ని పెంపొందిస్తాం. చక్కని కథలు, గేయాలు, వచన కవితలు రాసేటట్టు తర్పీదునిస్తాం. పిల్లలను బాల కవులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం. సాహితీ పుస్తకాలు చదవడం, రాయడంతో నైపుణ్యం పెరుగుతుంది. – అరుణ బట్టువార్, ఇంద్రవెల్లి జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయురాలు టీచర్ కృషితోనే.. తెలుగులో అలంకారాలు నేర్పుకోవడంలో టీచర్ సులువు పద్ధతి చెప్పేవారు. ఉదాహరణలు ఇస్తూ వాటి ద్వారా కవితలు రాయిస్తే గుర్తుంటాయని మాతో కవితలు రాయించేది. మొదట్లో కొంత తికమకపడ్డాం. మేడం సలహాలతో 20 మంది పదో తరగతి విద్యార్థులు వివిధ అలంకార కవితలు రాశాం. ఇలా రాయడంలో టీచర్ కృషి ఉంది. – చంద్రకాంత్, మన్నూర్ పాఠశాల విద్యార్థి పట్టు సాధించాం టీచర్తోనే సాహిత్యం, బాలగేయం పరిచయమైంది. ఆమె ప్రోత్సాహంతో బాలగేయాలు రాసేవాళ్లం. అందులో తప్పులు సరిచేస్తూ మళ్లీ రాయించేది. ఇలా రాయడం ద్వారా సాహిత్యం, బాల గేయాలపై పట్టు సాధించగలిగాం. ఆంగ్ల బాలగేయ పుస్తకాన్ని ముద్రించగలిగాం. టీచర్ కృషితో ఇది సాధ్యమైంది. – పెందోర్ లక్ష్మి, మన్నూర్ విద్యార్థిని సంతోషించారు గోండి భాషకు లిపి లేదు. మాతో గోండి భాషలో బా లగేయాలు రాయించాలని టీచర్ కృషి చేశారు. తెలు గులో చెబుతుంటే మేము గోండి భాషలో రాశాం. మా తప్పులు సరిచేస్తూ మళ్లీ రాయిస్తూ చక్కటి బాలగేయ పుస్తకాలను టీచర్తో కలిసి సమాజానికి అందించాం. మేం రాసిన పుస్తకం చదివి మా గ్రామస్తులు సంతోషించారు – కినక గణేశ్, సీతారాంగూడ విద్యార్థి -
అంగన్వాడీ కేంద్రంలో చోరీ
కోటపల్లి: మండలంలోని రోయ్యపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చోరీ జరిగింది. శనివారం ఉదయం కేంద్రం తలుపులు పగులకొట్టి ఉండటంతో స్థానికులు నిర్వాహకురాలు విజయలక్ష్మికి సమాచారం అందించారు. ఆమె అక్కడికి వచ్చి చూడగా కేంద్రంలో 17 పాల ప్యాకెట్లు, 10 పప్పు ప్యాకెట్లు, 5 ట్రేల కోడిగుడ్లను గుర్తుతెలియని దుండుగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. శనివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాలేజీరోడ్లో.. మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్లో ఈనెల 22న చోరీ జరిగినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కాలేజీరోడ్కు చెందిన ముక్తా ప్రసాద్ జైపూర్ మండలం ఇందారంలో రేషన్ షాపులో పనిచేసేవాడు. ప్రసాద్ ప్రతీ రోజు ఉదయం ఇందారం వెళ్లి సాయంత్రం వచ్చేవాడు. ఈనెల 21న ప్రసాద్ భార్య ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తూ పక్కనే ఉన్న చందా ప్రసన్నలక్ష్మికి తాళం చెవి ఇచ్చింది. ఈనెల 22న ఉదయం ఇంట్లో బీరువాలో 120 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. సుమారు వీటి విలువ రూ.7.20 లక్షలు ఉంటుందన్నారు. ప్రసన్నలక్ష్మి, మరో వ్యక్తిపై అనుమానం ఉందని బాధితుడు ప్రసాద్ ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
కుళ్లిన చికెన్, పాడైన గుడ్లు
బోథ్: సొనాల మండలంలోని ఓ పెట్రోల్ పంపు సమీపంలో గల దాబాలో కుళ్లిన చికెన్, పాడైన గుడ్లు దర్శనమిచ్చాయి. అంతేకాదు దాబాలో తింటున్న ఓ యువకుడి అన్నంలో బొద్దింక వచ్చింది. బోథ్ మండలంలోని కౌఠ(బి) గ్రామానికి చెందిన యువకుడు శనివారం సొనాల మండలం గుట్టపక్కతండా సమీపంలో ఓ పెట్రోల్ పంపు వద్ద ఉన్న దాబాకు వెళ్లాడు. భోజనం చేస్తుండగా అన్నంలో బొద్దింక ప్రత్యక్షంతో కంగుతిన్నాడు. వెంటనే దాబా సిబ్బందిని పిలిచి ఇదేంటని అడిగితే, అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. యువకుడు పలువురు స్థానికులు, విలేకరులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని తనిఖీ చేయగా బొద్దింక ఉన్న అన్నంతోపాటు, రిఫ్రిజిరేటర్లో కుళ్లిన చికెన్ మాంసంతోపాటు పాడైన ఉడకబెట్టిన గుడ్లు కనిపించాయి. అప్పటికే దాబాలో తింటున్న వారు అవాక్కయ్యారు. మధ్యలో భోజనం ఆపివేశారు. భోజనంలో బొద్దింక రావడంపై సదరు సిబ్బందిని అడుగగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని వారు తెలిపారు. అధికారులు వెంటనే దాబాను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దాబాలో నాసిరకం ఆహార పదార్థాలు తాజాగా అన్నంలో బొద్దింక ప్రత్యక్షం -
ఏరియాలో పర్యటించిన కార్పొరేట్ జీఎం
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో సింగరేణి కార్పొరేట్ జీఎం(ఐ అండ్ పీఎం) మధుసూదన్ శనివారం పర్యటించారు. జీఎం కార్యాలయం ఆవరణలో అధికారులతో కలిసి ఉత్పత్తి ఉత్పాదకతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంస్థ నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్య సాధనలో రక్షణ పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మధుసూదన్ను ఏరియా జీఎం దేవేందర్తో పాటు అధికారులు శాలువాలు క ప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఏస్వోటు జీఎం విజయ్ ప్రసాద్, ఇంజనీర్ వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్ తదితరులు ఉన్నారు. -
● జిల్లాలో మూడు రోజులుగా వాన ● కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యం.. ● కుప్పలు, కవర్లు మార్చడానికి అదనపు ఖర్చు..
మందమర్రి మండలం సారంగపల్లిలో బురదలో నుంచి ధాన్యం మరోచోటకు తరలిస్తున్న రైతులువానలే దెబ్బతీస్తన్నయ్.. ఎకరం పొలంలో ఏటా ట్రాక్టర్ లోడు వడ్లు వచ్చేది. ఈ యేడు రెండు ట్రాక్టర్ల దిగుబడి వచ్చింది. వడ్లను కొనుగోలు కేంద్రానికి తెచ్చి పదిరోజులు దాటింది. మొన్ననే మాయిశ్చర్ వచ్చింది. తూకం వేయడానికి నా సీరియల్ నంబర్ వచ్చేసరికి వానలు మొదలైనయ్. మూడు రోజుల నుంచి వానలతో కవర్లు కప్పుడు, కాలువలు తీసుడే అయితాంది. అయినా వడ్లు తడుస్తున్నయ్. దీంతో నష్టం తప్పేలా లేదు.. – పొట్టాల రామయ్య, చిర్రకుంటమంచిర్యాలఅగ్రికల్చర్: అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లాలో మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు జిల్లా వ్యాప్తంగా 23.7 మిల్లీమీటర్ల సగటు వ ర్షపాతం నమోదైంది. కాసిపేట, దండేపల్లి, హజీ పూర్, తాండూర్, మందమర్రి మండలాల్లో భారీ వ ర్షాలు కురిశాయి. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి న ధాన్యం బస్తాలు, ఆరబోసిన ధాన్యం వర్షంలో తడిసి రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యం మొలకెత్తడం, బూజు పట్టడంతో నష్టం వా టిల్లుతోంది. తడిసిన ధాన్యం చూసి రైతులు కంట తడి పెడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు నాలు గైదు కవర్లు, ఫెక్సీలు ధాన్యం కింద, మీద కప్పినా వరద ధాన్యం కుప్పలోకి చేరుతుంది. కాలువలు తీసి కాపాడుకునేందుకు ఆరిగోస పడుతున్నారు. ధాన్యం తరలింపుతో ఆర్థిక భారం వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాలు బురదమయమవడంతో లారీలు లోపలికి వెళ్లలేక రోడ్లపై నిలిపివేస్తున్నారు. రైతులు ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని రోడ్లపైకి తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్ లోడింగ్కు కూలీలు, కిరాయితో కలిపి రూ.600 ఖర్చవుతోంది. టర్పాలిన్ కవర్ల కిరాయి మరో భారంగా మారుతోంది. ధాన్యాన్ని ఒకచోట నుంచి మరోచోటికి మార్చడం, కవర్లు కప్పడం వంటి పనులతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం సేకరణలో అడ్డంకులు జిల్లాలో 1,50,738.880 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. దీంతో 75 శాతం సేకరణ పూర్తయింది. జన్నారం, దండేపల్లి, హజీపూర్ వంటి మండలాల్లో 90 శాతం సేకరణ పూర్తయింది. వేమనపల్లి, కోటపల్లి వంటి ప్రాంతాల్లో ఆలస్యంగా దిగుబడి వచ్చిన ధాన్యం వర్షాల కారణంగా తడుస్తోంది. 108 కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. పరిష్కారానికి చర్యలు గత నెలలో మిల్లుల వద్ద ధాన్యం తరలింపు ఆలస్యమైనప్పటికీ, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు కేటా యింపుతో సేకరణ వేగవంతమైంది. అయినా అకా ల వర్షాలు తూకం, లోడింగ్కు అడ్డంకిగా మారుతున్నాయి. రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు కా ల్వలు తీసి, కవర్లు మార్చి శ్రమిస్తున్నారు. జిల్లాలో 23.7 మి.మీ వర్ష పాతం.. జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు 23.7 మిల్లిమీటర్ల వర్షపాతం నమైదైంది. కాసిపేటలో 56.8 మిల్లి మీటర్లు, జన్నారంలో 13.5, దండేపల్లిలో 42.6, లక్సెట్టిపేటలో 28.4, హజీపూర్లో 47, తాండూర్లో 38.5, భీమినిలో 15.7, కన్నెపెల్లిలో 10, వేమనపల్లిలో 18.9, నెన్నెలలో 11.5, బెల్లంపల్లిలో 18.1, మందమర్రిలో 29.3, మంచిర్యాలలో 26.6, నస్పూర్లో 24.5, జైపూర్లో 13.3, భీమారంలో 8, చెన్నూర్లో 5.2, కోటపల్లిలో 19.5 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు, రైతులు పడుతున్న ఇబ్బందులు, అధికారులు చేపడుతున్న చర్యల గురించి జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ శ్రీకళను ఫోన్లో సంప్రదించగా, ఆమె స్పందించలేదు. -
రైతుల సేంద్రియ బాట
● లోపాలను అధిగమించేలా వినూత్న పద్ధతులు ● పొలాల్లో గొర్రెలు, మేక మందలు..మంచిర్యాలరూరల్(హాజీపూర్)/దండేపల్లి: ఆధునిక వ్యవసాయంలో పెట్టుబడులు విపరీతంగా పెరిగింది. ఇదే సమయంలో భూసారం గణనీయంగా తగ్గుతోంది. ఫలితంగా పంట దిగుబడులు తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పాడి పశువుల సంఖ్య తగ్గడంతో సేంద్రీయ ఎరువు లభ్యత తగ్గిన నేపథ్యంలో సేంద్రియ ఎరువులు దొరకడం లేదు. దీంతో రసాయన ఎరువులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో లోపాలు, ఆర్థిక నష్టాలను అధిగమించేందుకు మళ్లీ రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నారు. గొర్రెలతో వినూత్న ఎరువు సేకరణ రైతులు గొర్రెలు, మేకలను ఉపయోగించి సేంద్రీయ ఎరువు సమకూర్చుకుంటున్నారు. గతంలో యాదవులకు పంపిణీ చేసిన గొర్రెలను రాత్రిపూట పొలాల్లో మందలు పెడుతున్నారు. ఇందుకు ఎకరాకు రూ.2 వేల నుంచి రూ.2,500 వెచ్చించి సేంద్రీయ ఎరువు సేకరిస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో ఒక రాత్రిలో 800 గొర్రెలు లేదా మేకల మందను ఉంచితే ఏడాదికి సరిపడా ఎరువు, పంటలకు అవసరమైన పోషకాలు లభిస్తాయంటున్నారు. భూసారం పెంపొందేలా.. గొర్రెల పేడ, మూత్రం, వెంట్రుకల ద్వారా భూమికి నత్రజని (3–13 గ్రాములు/లీటర్ మూత్రం), పొటాషియం (18–20 గ్రాములు), పాస్పరస్ వంటి సేంద్రీయ పదార్థాలు అందుతాయి. గొర్రె పేడలోని పీచు పదార్థం మొక్కల వేర్లు సులభంగా ఎదిగేలా చేస్తుందని దండేపల్లి ఏఈవో మౌనిక తెలిపారు. ఒక రాత్రి విసర్జించే లీటరు మూత్రం భూమిలో తేమను నిలుపుతుంది. ఒక్కసారి ఎరువు కోసం పెట్టుబడి పెడితే మూడేళ్ల వరకు ఎరువు అవసరం లేదని రైతులు చెబుతున్నారు. సారవంతమైన భవిష్యత్తు గొర్రెల ద్వారా నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు భూమికి అందుతున్నాయి. ఈ వినూత్న పద్ధతితో తక్కువ ఖర్చుతో భూసారం పెరిగి, రైతులు సేంద్రీయ వ్యవసాయంలో లాభాలు ఆర్జిస్తున్నారు. -
సైకిల్ను ఢీకొట్టిన ఆటో
జన్నారం: సైకిల్ను ఆటో ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందా డు. జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై రాజవర్దన్ కథ నం ప్రకారం.. మండలంలోని అక్కపెల్లిగూడకు చెందిన గోలి రా జన్న (55) పాత ఇనుప సామాను దుకాణంలో పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పని ముగించుకుని సైకిల్పై ఇంటికి వస్తున్నాడు. జన్నారం వైపు వస్తున్న ఆటో వెనుకవైపు నుంచి సైకిల్ను ఢీకొట్టడంతో రాజన్నకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని అతన్ని జన్నారంలో ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం లక్సెట్టిపేట ఆసుపత్రికి పంపించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన ఆటో బాదవత్ జనంత్రావుకు చెందినదిగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య కళావతి ఫిర్యాదుతో శనివారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉండగా పెళ్లయింది. -
నడుమునొప్పి భరించలేక ఆత్మహత్య
తానూరు: నడుమునొప్పి భరించలేక యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్సై భానుప్రసాద్ కథనం ప్రకారం.. మండలంలోని వడ్ఝరి(బి) గ్రామానికి చెందిన గరికే లక్ష్మణ్ (29) రెండేళ్లుగా నడుమునొప్పితో బాధపడుతున్నాడు. గతేడాది శస్త్రచికిత్స చేయించుకున్నా నయం కాలేదు. ఆ తర్వాత వ్యవసాయ పనులు చేస్తుండగా కట్ల పాము కాటేసింది. కాళ్లవాపు తగ్గలేదు. వైద్య పరీక్షలు నిర్వహించుకోగా వ్యాధి నయం కాలేదు. అటు నడుమునొప్పి, ఇటు కాళ్లవాపు తగ్గకపోవడం తీవ్ర మనస్తాపంతో శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. రాత్రయినా లక్ష్మణ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి బాలాజీ వెతుకుంటూ వ్యవసాయ పొలానికి వెళ్లాడు. అక్కడ స్పృహా కోల్పోయిన లక్ష్మణ్ను భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. భార్య నాగమణి ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పాముకాటుకు మధ్యప్రదేశ్వాసి మృతితాండూర్: పాముకాటుకు మధ్యప్రదేశ్ వాసి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వర్కడే విష్ణుప్రసాద్ (52) బతుకుదెరువు కోసం తాండూర్ మండలం రేపల్లెవాడకు వలసవచ్చాడు. ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులో కూలీ పనులు చేస్తూ రేపల్లెవాడలో అద్దెకు ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రించిన విష్ణుప్రసాద్ శనివారం తెల్లారేసరికి పాముకాటుకు గురై మృతి చెంది ఉన్నాడు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి సోదరుడు మాన్సింగ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. విశ్వవాసు నామ సంవత్సరం ఏకాదశి శుభ ముహూర్తం ఉండడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. వేకువ జా మున శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, మహాకాళి అమ్మవా ర్లకు అభిషేకం, అర్చన, హారతి పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వచ్చారు. ముందుగా భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి క్యూలో బారులు తీరారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు జరిపించారు. అక్షరాభ్యాసం, ఇతర సేవల ద్వారా రూ. 8 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
గోదావరి తీరం.. ప్రమాదకరం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణంలోని గోదావరి నదీతీరం, పుణ్యస్నానాలకు వచ్చే ప్రజలకు ప్రమాదకరంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి శివరాత్రి, బంధువుల మరణానంతరం స్నానాల కోసం వచ్చే వారికి ఈ తీరం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం గుంతలు, లోతైన కాలువలతో ప్రమాద స్థితిలో ఉంది. శివరాత్రి సమయంలో నది ఆవలివైపు నీటిని మంచిర్యాల వైపు ప్రవహించేందుకు తవ్విన కాలువలో గుర్రపు డెక్కలు మొలిచాయి. తవ్విన ఇసుకను ఇరువైపులా పోయడంతో నదిలో లోతును అంచనా వేయడం కష్టమైంది. ఇసుక, మట్టి తవ్వకాల వల్ల ఏర్పడిన పెద్ద గుంతలు, వర్షాల సమయంలో వరద నీటితో నిండి, స్నానం చేసేవారికి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. పుష్కరఘాట్లపై అశ్రద్ధ గోదావరి పుష్కరాల సమయంలో నిర్మించిన ఘాట్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఘాట్ల వద్ద నల్లాల నుంచి నిరంతరం పారే నీటితో పాకురు పెరుగుతోంది. దీంతో జారిపడే ప్రమాదం పొంచి ఉంది. నదిలో నీరు లేకపోవడంతో, ఆవలి వైపు వెళ్లలేనివారు నల్లా కింద స్నానాలు చేస్తున్నారు. ఈ పాకురు ప్రాంతం, నిరంతరం నల్లాలు ఆన్లో ఉండడంతో మరింత ప్రమాదకరంగా మారుతోంది. సురక్షిత చర్యలకు విజ్ఞప్తి.. మంచిర్యాలతోపాటు జిల్లా వ్యాప్తంగా వచ్చే ప్రజల సురక్షత కోసం కనీసం సూచిక బోర్డులైనా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గుంతలు, పాకురు ప్రాంతాలను గుర్తించేందుకు తగిన హెచ్చరికలు, భద్రతా చర్యలు అవసరమని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించి, గోదావరి తీరాన్ని సురక్షితంగా మార్చాలని కోరుతున్నారు. నీటి మళ్లింపు గుంతల్లో పెరిగిన గుర్రపు డెక్క మట్టి తరలింపుతో ప్రమాదకర గుంతలు పుష్కరఘాట్లపై పాకురు -
జీపీలకు నిలిచిన నిధులు
● ఆర్థిక సంఘం నిధులు రాక పాలన అస్తవ్యస్తం ● గ్రామాల్లో కుంటుపడిన అభివృద్ధిఉమ్మడి జిల్లా వివరాలుమంచిర్యాలరూరల్(హాజీపూర్)/కుంటాల: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. దీంతో పాలకవర్గాలు లేక స్థానిక సంస్థలకు నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ల పాలకవర్గాల పదవీ కాల పరిమితి ముగియడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను నిలిపివేసింది. రాష్ట్రం ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో 15 నెలలుగా పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల నిర్వహణ కష్టతరంగా మారింది. చేసేది లేక గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు అప్పులు చేసి మరీ అత్యవసర పనులు చేయిస్తున్నారు. నిలిచిన ఆర్థిక సంఘం నిధులు.. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆయా గ్రామాల జనాభాను బట్టి ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తుంది. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర గ్రాంట్ కూడా అందులో కలిపి ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే పాలకవర్గాలు లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధుల విడుదల నిలిపివేసింది. అప్పుల్లో కార్యదర్శులు.. గ్రామాల్లో అభివృద్ధి మాట దేవుడెరుగు..రాబోయే వర్షాకాలంలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ప్రతీనెల విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐలు, పారిశుధ్య కార్మికులకు వేతనా లు, వీధి దీపాల నిర్వహణ, తదితర పనులకోసం అప్పులు చేయాల్సి వచ్చిందని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు వస్తాయనే ఆశతో కార్యదర్శులు అప్పులు తీసుకువచ్చి మరీ పనులు చేయిస్తున్నారు. సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో ఇటు బిల్లులు రాక అటు వడ్డీలు పెరిగి అప్పుల పాలవుతున్నారు. మండల పరిషత్లకు సంబంధించి రెండేళ్ల నుంచి ఎంపీడీవోల వాహనాలకు అద్దె చెల్లింపులు, ఇంటర్నెట్ బిల్లులు, కరంట్ బిల్లుల చెల్లింపులు పెండింగ్లో ఉ న్నాయి. జిల్లా పరిషత్లలో నిల్వ ఉన్న ఫండ్తో కార్యాలయ నిర్వహణ కొనసాగిస్తుండగా రానున్న రోజుల్లో ఫండ్ అయిపోతే కార్యాలయ నిర్వహణ ప్రశ్నార్థకం కానుంది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎ న్నికలు నిర్వహించి ఆర్థిక సంఘ నిధులు రెగ్యులర్గా విడుదల చేయించి గ్రామాల అభివృద్ధికి బాట లు వేయాలని కోరుతున్నారు.ఆర్థిక సంఘం నిధుల ఖర్చు ఇలా..కేంద్రం నుంచి జిల్లాకు వచ్చే మొత్తం నిధుల్లో 5 శాతం జిల్లా పరిషత్కు, 10 శాతం మండల పరిషత్కు, 85 శాతం గ్రామ పంచాయతీలకు కేటాయిస్తారు. దీంతో ఆయా పాలకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు వారి పరిధిలో అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేది. ఆ వచ్చిన నిధుల్లోనే 6 శాతం కార్యాలయాల నిర్వహణకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ 6 శాతం నిధులను విద్యుత్, నెట్ బిల్లులు, వాహనాల అద్దె చెల్లింపు, ఇతర ఖర్చులకు వినియోగించేవారు. కేంద్రం నిధులు నిలిపివేయడంతో ఇప్పుడు ఈ చెల్లింపులన్నీ నిలిచిపోయాయి.ప్రత్యేక అధికారుల పాలనలోనే..2024 ఫిబ్రవరితో గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల పదవీ కాలం పూర్తయ్యింది. వెంటనే ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి ఉండగా కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన పెట్టింది. ఏడాదిన్నర కావస్తున్నా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎలాంటి అడుగులు పడటం లేదు. ఇక మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల కాల పరిమితి కూడా 2024 జులై 5వ తేదీతో ముగిసిపోయింది. దీంతో పరిషత్ ఉన్నికల నిర్వహణ లేకపోవడంతో ఇక్కడ కూడా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. జిల్లా పంచాయతీలు మండలాలు ఆదిలాబాద్ 473 21 మంచిర్యాల 306 16 నిర్మల్ 396 19 కుమురంభీం 334 15హాజీపూర్ మండలంలోని గఢ్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంనిర్వహణ భారంగా మారింది పంచాయతీల అభివృద్ధికి మావంతు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నిధులు విడుదల చేయక నిర్వహణ భారంగా మారింది. – తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి, కోలూరు, కుంటాల ప్రతిపాదనలు పంపించాం పంచాయతీలకు నిధులు విడుదల కాని మాట వాస్తవమే. నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. రెండు, మూడు రోజుల్లో పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేసే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీల అభివృద్ధికి అందరం సమన్వయంతో పని చేయాలి. – పీ.శ్రీనివాస్, డీపీవో, నిర్మల్ -
సెలవుల్లో.. శాశ్వత సెలవు
●ఇద్దరు చిన్నారులను మింగిన నీటి గుంత ● ప్రాణం తీసిన బాటిల్.. ● కుమురంభీం జిల్లా తాటిపల్లిలో ఘటనకౌటాల: వేసవి సెలవుల నేపథ్యంలో గ్రామాల్లో పిల్లలంతా ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారు. కొందరు స్వగ్రామంలో ఉండగా, కొందరు బంధువుల ఇళ్లకు వచ్చి.. ఇరుగు పొరుగు వారితో కలిసి ఆటలు ఆడుతున్నారు. ఈ క్రమంలో కుముంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లిలో కూడా శుక్రవారం ఆటలు ఆడుతూ వెళ్లిన ఇద్దరు చిన్నారులను నీటిగుంత మింగేసింది. దీంతో సెలవుల్లో.. శాశ్వత సెలవు తీసుకున్నారు. కూలీ కుటుంబాలు.. తాటిపల్లి గ్రామానికి చెందిన బోయర్ విశ్వనాథ్, మనీష దంపతులు కష్టజీవులు. విశ్వనాథ్ వార్ధా నదిలో చేపలు పడుతుండగా, మనీష కూలీ పని చేస్తూ కొడుకు జయ్, కూతురు లక్ష్మి(13)ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. లక్ష్మి 7వ తరగతి పూర్తి చేసింది. ఇక మహారాష్ట్రలోని ఎటపల్లి గ్రామానికి చెందిన షిండే విజయ్, రత్నమాల దంపతుల కుమార్తె హన్షిక (11) వేసవి సెలవుల సందర్భంగా తాటిపల్లిలోని తన అత్తమామలు వాగడే నిరుత, నీతేష్ ఇంటికి 12 రోజుల క్రితం వచ్చింది. బలి తీసుకున్న బాటిల్.. వేసవి సెలవుల్లో లక్ష్మి, హన్షిక, కరిష్మా, నవ్య అనే నలుగురు బాలికలు తాటిపల్లి బీసీ కాలనీలో కలిసి ఆడుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చెంబుల్లో నీళ్లు తీసుకుని వ్యవసాయ భూములవైపు బహిర్భూమికి వెళ్లారు. అనంతరం ఆడుకుంటూ సమీపంలోని చెరువు కుంటలో తవ్విన లోతైన గుంత వద్దకు చేరుకున్నారు. కరిష్మా, నవ్య గుంత ఒడ్డున నిలబడగా లక్ష్మి, హన్షిక నీళ్లలో తేలుతున్న వాటర్ బాటిల్ తీయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో లక్ష్మి గుంతలో పడిపోగా ఆమెను రక్షించేందుకు హన్షిక చెయ్యి పట్టుకోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. గుండెలు పగిలే రోదనలు గుంత ఒడ్డున ఉన్న కరిష్మ, నవ్య వెంటనే కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు సమాచారం అందించా రు. వారు వచ్చి నీటిలో గాలించి లక్ష్మి, హన్షికలను బయటకు తీసినప్పటికీ అప్పటికే వారు మృతి చెందారు. పదమూడేళ్లకే నీకు నూరేళ్లు నిండాయా తల్లీ అంటూ లక్ష్మి తల్లిదండ్రులు ఆమె మృతదేహంపై ప డి విలపించారు. ఈ రోజు వద్దు, రేపు వెళ్తానన్నావు, బిడ్డా అంటూ హన్షిక అత్తమామలు గుండెలు బాదుకున్నారు. ఈ దృశ్యం అందరి కళ్లను చెమర్చింది. పోలీసుల దర్యాప్తు ఎస్సై విజయ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లక్ష్మి తల్లి మనీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాలను సిర్పూర్(టి)లోని ప్రభు త్వ ఆస్పత్రికి తరలించి, పోస్ట్మార్టం అనంతరం కు టుంబ సభ్యులకు అప్పగించారు. ఆసుపత్రి వద్ద హన్షిక తల్లిదండ్రులు ‘సెలవులకు వచ్చి శాశ్వతంగా సెలవు తీసుకున్నావా’ అంటూ బోరున విలపించా రు. ఈ ఘటనతో తాటిపల్లిలో విషాదం నెలకొంది. -
ఇద్దరిపై గంజాయి కేసు
భీంపూర్: మండలంలోని తాంసి(కే) గ్రామంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఎస్సై పీర్ సింగ్, సిబ్బందితో కలిసి శుక్రవారం దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన మంచికంటి అశోక్, ఓంకార్ల వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్న 30 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఆరుగురి బైండోవర్ఖానాపూర్: మండలంలో పలుచోట్ల ఎకై ్సజ్ కేసుల్లో పట్టుబడిన ఆరుగురిని శుక్రవారం తహసీల్దార్ సుజాత ఎదుట బైండోవర్ చేసినట్లు ఎకై ్సజ్ ఎస్సై అభిషేకర్ తెలిపారు. నాటుసారా తయారు చేసినా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైండోవర్ ఉల్లఘించిన వారికి రూ.2లక్షల జరిమానా లేదా రెండేళ్ల జైలుశిక్ష విధిస్తారని తహసీల్దార్ తెలిపారు. సిబ్బంది వెంకటేష్, ఇర్ఫాన్, సాయన్న, కల్పన పాల్గొన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టుఇంద్రవెల్లి: బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఉట్నూర్ సీఐ మొగిలి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతమైన ఇంద్రవెల్లి మండల కేంద్రంలో చంపత్రావు నిర్మించిన వాణిజ్య నిర్మాణంపై మెస్రం ఆనందరావు, గవందే బిపిన్కుమార్ 2023లో ఐటీడీఏ కోర్టులో ఫిర్యాదు చేశారన్నారు. ఇరువురు చంపత్రావును కలిసి ఫి ర్యాదును వెనక్కి తీసుకునేందుకు రూ.2లక్షలు వసూలు చేశారని, ఇంద్రవెల్లి పబ్లిక్ స్కూ ల్ యజమాని వద్ద అదే సంవత్సరంలో రూ. 2లక్షలు వసూలు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీఐ తెలిపారు. ఈ ఇరువురు నిందితులు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతరులందరినీ కలిసి తమకు రూ.20 లక్షల ఇవ్వాలని, లేనిపక్షంలో ఐటీడీఏ కోర్టులో కేసులు నమో దు చేయిస్తామని బెదిరింపులకు పాల్పడిన ట్లు పేర్కొన్నారు. మెస్రం ఆనంద్రావుతో పా టు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని మరికొంత మంది గిరిజనేతరులకు నోటీసులు పంపడం జరిగిందని తమ విచారణలో బహిర్గతమైందన్నారు. ఇరువురిని గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
పులిని హతమార్చిన ఘటనలో 30 మంది రిమాండ్
పెంచికల్పేట్/దహెగాం: పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ అటవీ ప్రాంతంలో ఈ నెల 15న వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చి పెద్దపులిని హతమార్చిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం విధితమే. ఈ ఘటనపై అటవీ శాఖ ప్రత్యేక బృందాలు వారం రోజులుగా నిందితులను గుర్తించేందుకు విచారణ చేపట్టాయి. ఈ ఘటనలో పెంచికల్పేట్, దహెగాం మండలాలకు చెందిన 30 మంది పాల్గొన్నట్లు నిర్ధారించారు. శుక్రవారం సిర్పూర్(టి) కోర్టులో దహెగాం, పెంచికల్పేట్ మండలాలకు చెందిన 30 మందిని హాజరుపర్చగా.. నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించినట్లు డీఎఫ్వో నీరజ్కుమార్ టిబ్రేవాల్ తెలిపారు. -
కాల్వ ఆలయ హుండీ లెక్కింపు
దిలావర్పూర్: మండలంలోని అత్యంత ప్రాచీన ప్రాశస్త్యం గల కాల్వ అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీని శుక్రవారం లెక్కించారు. ఇటీవల జరిగిన ఆలయ బ్రహ్మోత్సవాలు ముగియడంతో ఈ హుండీని లెక్కించారు. హుండీ ద్వారా రూ.3,77,446 ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. కల్యాణం సందర్భంగా తాళిబొట్ల రూపంలో మిశ్రమ బంగారం సైతం సమకూరినట్లు వెల్ల డించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంగూరి మహేందర్, దేవాదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్లు మనోహర్, మాధవరావు, పాలక మండలి సభ్యులు గట్టు కాశీనాథ్, రాసరి శ్రీకాంత్, గుమ్ముల నర్సయ్య, సూర నవీన్, పూదరి శివకుమార్, దేవేందర్, లక్ష్మణ్, విఠల్, మహేందర్, నర్సారెడ్డి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్షాక్తో వృద్ధురాలు మృతి
నిర్మల్రూరల్: మండలంలోని ముజిగి గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్తో వృద్ధురాలు మృతి చెందినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. గ్రామానికి చెందిన పెద్దగొండ గంగవ్వ (72) తన ఇంటి బయట మెట్ల సమీపంలో ఉన్న ఇనుపరాడును పట్టుకోవడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్ ఎస్సై లింబాద్రి సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. స్తంభం నుంచి ఇంటికి వచ్చే వైర్కు విద్యుత్ సరఫరా ఉండడంతో భారీ వర్షాలకు ఎర్తింగ్ ద్వారా బయట ఉన్న మెట్ల ఇనుప చువ్వలకు కూడా కరెంటు సరఫరా అయినట్లు ఎస్సై ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
విద్యుత్ షాక్తో మూగజీవాలు..
భైంసారూరల్: మండలంలోని కుంసరలో శుక్రవా రం విద్యుత్షాక్తో ఎద్దు మృతి చెందిన ఘటన చో టు చేసుకుంది. గ్రామానికి చెందిన భూమన్న ఎద్దు గ్రామ శివారులోని పంట చేనులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీగలకు విద్యుత్ సరఫరా కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపా రు. ఎద్దు విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవా లని బాధిత రైతు భూమన్న వేడుకుంటున్నాడు. గొల్లమాడలో మేక.. నర్సాపూర్(జి): మండలంలోని గొల్లమాడలో విద్యుత్షాక్తో మేక మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మస్కిరి లక్ష్మణ్ గ్రామ శివారులో మేకలు మేపుతుండగా తక్కువ ఎత్తులో, కంచె లేని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. పశు వైద్యాధికారి ముక్తార్ అహ్మద్ పంచనామా నిర్వహించారు. ప్రభుత్వం పరిహారం అందించాలని బాధితుడు కోరుతున్నాడు. బోథ్: మండలంలోని కౌట(బీ)లో పడిగెల చిన్న భీముడుకు చెందిన గేదె విద్యుత్ షాక్తో మృతి చెందింది. రెండు రోజులుగా గాలులతో కూడిన వర్షాల కారణంగా గ్రామ సమీపంలోని పంట పొలాల మీదుగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్కు చెందిన తీ గలు తెగి కింద పడిపోయాయి. మేతకు వెళ్లిన గేదె వైర్లను తాకడంతో మృతి చెందింది. గేదె విలువ సు మారు రూ.70 వేలు ఉంటుందని, ప్రభుత్వమే త మను ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. -
మార్కెట్ రోడ్ల అభివృద్ధికి రూ.78 కోట్లు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ రోడ్ల విస్తరణ, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్గ్రౌండ్ పవర్ సిస్టంతోపాటు సెంట్రల్ లైటింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇందుకు రూ.78 కోట్లు మంజూరు చేసింది. దీంతో జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఎంతగానో కృషి చేస్తూ, అవసరమైన నిధులను తీసుకువస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అనాలోచిత నిర్ణయాలతో మంచిర్యాల నియోజకవర్గం 30 ఏళ్లు వెనుకబడిందని పేర్కొన్నారు. విద్య, వైద్యరంగంలో మంచిర్యాలను ముందు ఉంచేందుకు రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందన్నారు. మంచిర్యాల మార్కెట్లో రోడ్లు ఇరుకుగా ఉండడంతో మాస్టర్ప్లాన్ ప్రకారంగా రోడ్ల విస్తరణతోపాటు అభివృద్ధి చేసేందుకు అవసనరమైన నిధులు విడుదల చేయించారని వివరించారు. అనంతరం వ్యాపారులతో కలిసి టపాసులను కాల్చారు. కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ వేణు, నాయకులు సంపత్రెడ్డి, సిరిపురం రాజేశ్, పెంట రజిత, గజ్జల హేమలత, రామగిరి బానేష్, ఖాలిద్, జలీల్, డేగ బాపు, సత్యనారాయణ, రమణరావు, జగన్ మోహన్, ప్రభాకర్, సాయి పాల్గొన్నారు. జిల్లాలో 17.6 మి.మీ వర్షపాతంమంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు 17.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కాసిపేట 43.9 మి.మీలు. దండేపల్లిలో 25.8, జన్నారంలో 5.2, లక్సెట్టిపేటలో 26.6, జైపూర్లో 23.7, హాజీపూర్లో 22.4, బెల్లంపల్లి 21.9, మంచిర్యాలలో 17.1, తాండూర్లో 16.2, కన్నెపెల్లిలో 16.5, వేమనపల్లిలో 15.2, మందమర్రిలో 14.8, చెన్నూర్లో 14.7, నస్పూర్లో 13.9, నెన్నెలలో 10.7, భీమారంలో 10.5, కోటపల్లిలో 8.9, భీమినిలో 8.1, మిల్లిమీటర్ల వర్షం కురిసింది. -
పట్టా భూములపై అటవీ అధికారుల దౌర్జన్యం
వేమనపల్లి: పట్టా భూములపై అటవీ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం అన్నారు. మండలంలోని చామనపల్లి గ్రామంలో శుక్రవారం ఆదివాసీ నాయకులతో కలిసి పట్టా భూములను పరిశీలించారు. చామనపల్లి శివారు సర్వే నంబర్ 67లో ఏళ్లుగా పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్నారని తెలిపారు. అటవీ అధికారులు తమ భూమి అంటూ ఆదివాసీలను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. సాగుచేస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. సమస్యలను రెవెన్యూ అధికారులకు విన్నవిస్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అటవీ హక్కు పత్రాలు ఉన్న భూముల్లో సైతం సాగు చేస్తే ట్రాక్టర్లను సీజ్ చేసి కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘం గ్రామ కమిటీ నాయకులు సాగర్, రెడ్డి కిరణ్, చీకటి మొండి, అంజి, కమల, మధునక్క, ఓదక్క తదితరులు పాల్గొన్నారు. -
గడ్డంగూడలో ఉద్రిక్తత
● గుడిసెల తొలగింపునకు అటవీ అధికారుల యత్నం ● ఎదురు తిరిగిన గిరిజనులు ● నలుగురిపై దాడి..జన్నారం: జన్నారం అటవీరేంజ్ పరిధిలోని గడ్డంగూడలో గిరిజనులు వేసుకున్న గుడిసెల తొలగింపు విషయంలో అటవీ అధికారులు, గిరిజనుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు అటవీ అధికారులు గుడిసెలను తొలగించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గడ్డంగూడలోని అటవీ భూమిలో గిరిజనులు కొన్నేళ్లుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. అటవీఅధికారులు ఈ గుడిసెలను తొలగిస్తుండగా, గిరిజనులు తిరిగి వేసుకోవడం ఆనవాయితీగా మారింది. రెండు నెలల క్రితం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు రాత్రివేళ గుడిసెలు తొలగించారు. గిరిజనులు మళ్లీ గుడిసెలు నిర్మించుకున్నారు. ఈనెల 15న ఎఫ్డీపీటీ శాంతరాం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. గుడిసెలు కనిపించడంతో బీట్ అధికారి శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు. డీఆర్వోకు మెమో జారీ చేసిన ఐదు రోజులకే ఆయనను కూడా కూడా సస్పెండ్ చేశారు. గిరిజనుల ఆగ్రహం.. ఉన్నతాధికారుల ఆదేశాలతో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు జన్నారం అటవీ డివిజన్ సి బ్బంది గడ్డంగూడలో గుడిసెలను తొలగించేందుకు వెళ్లారు. వాహనాల శబ్దం విని బయటకు వచ్చిన గిరిజనులు, తొలగింపు ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ‘సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నామని, మమ్మల్ని ఎలా వెళ్లగొడతారు?.. చావనైనా చస్తాం, కానీ ఇక్కడి నుంచి కదలము’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ భూమిలో నివసించడం చట్టవిరుద్ధమని, గుడిసెలు ఖాళీ చేయాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. ఈ సందర్భంలో ఉద్రిక్తత నెలకొని తోపులాట జరిగింది. ఎఫ్ఎస్వో కృష్ణారావు, బీట్ అధికారులు లాలుబాయి, తిరుమలేశ్, వెంకటకృష్ణపై గిరిజనులు దాడి చేసి గాయపరిచినట్లు రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. గిరిజనుల ఎదురుతిరుగుడుతో అధికారులు వెనుదిరిగారు. డీఎఫ్వో అత్యవసర సమావేశం.. గడ్డంగూడ గుడిసెల తొలగింపు విషయంలో మంచిర్యాల డీఎఫ్వో శివ ఆశిష్ సింగ్, రేంజ్ అధికారులు సుష్మారావు, కారం శ్రీనివాస్లతోపాటు సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమస్యపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరించాలని సూచించారు. గిరిజనుల దాడిని ఖండిస్తూ, నలుగురు అటవి సిబ్బందిపై దాడి చేసిన వారిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సుష్మారావు వెల్లడించారు. -
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు..
భీమారం: అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. అనర్హులకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. మండలంలోని పోలంపల్లి, భీమారం, ఆర్కెపల్లి, అంకూసాపూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలుకేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రాజీవ్ యువవికాసం, ఇందిరమ్మ ఇళ్ల అంశాలను పరిశీలించారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలని ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. సన్నరకం వడ్లకు రూ.500 బోనస్తో పాటు మద్దతు ధర అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో మధుసూదన్, ఐకేపీ ఏపీఎం త్రయంబక్ ఉన్నారు. జైపూర్: జైపూర్ మండలంలోని కొనుగోలు కేంద్రాలను కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. కొ నుగోలు చేసిన ధాన్యం వెంటవెంటనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని ముదిగుంట, షెట్పల్లి, కిష్టంపేట, కుందారం, వేలాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి పరిశీలించారు. కేంద్రాల్లో తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంతోపాటు అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. -
సరస్వతి పుష్కర సేవలో జిల్లా ఉద్యోగులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఈ నెల 14 నుంచి కాళేశ్వరంలో ప్రారంభమైన శ్రీసరస్వతి పుష్కరాల్లో మంచిర్యాల జిల్లా పంచాయతీరాజ్ జిల్లా, మండలస్థాయి ఉద్యోగులు విధులు నిర్వరిస్తున్నారు. పంచాయతీరాజ్ డైరెక్టర్ సుధాకర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్శర్మల ఉత్తర్వుల మేరకు జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు సేవల్లో నిమగ్నమయ్యారు. పుష్కరాల్లో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రకడ్బందీగా నిర్వహిస్తున్నారు. తడి, పొడి చెత్త సేకరణలో కీలకంగా వ్యవహరిస్తూ ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లించడం, వంటివి చేస్తూ భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూస్తున్నారు. పుష్కర విధుల్లో డీపీవో వెంకటేశ్వర్రావుతోపాటు డీఎల్పీవో సఫ్దర్అలీ, మండల పంచాయతీ అధికారులు శ్రీపతి బాపు(జైపూర్), అజ్మత్అలీ(చెన్నూర్), సత్యనారాయణ(మందమర్రి), బి.శ్రీనివాస్(బెల్లంపల్లి), అనిల్(తాండూర్), ప్రసాద్(దండేపల్లి)లు విధులు నిర్వర్తిస్తున్నారు. -
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
శ్రీరాంపూర్: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలోని తన చాంబర్లో ఏరియా ముఖ్య అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉదయం 8 గంటలకు నస్పూర్ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి అక్కడి నుంచి షిర్కే సెంటర్ మీదుగా జీఎం కార్యాలయం వరకు ర్యాలీ జరుగుతుందన్నారు.ఇక్కడి అమరవీరుల స్తూపం వద్ద, ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరుగుతుందన్నారు. అనంతరం జీఎం కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. సాయంత్రం ప్రగతి మైదానంలో వేడుకలు జరుగుతాయని, ప్రత్యేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్ల డించారు. కార్మికులు వారి కుటుంబ సభ్యులు పుర ప్రముఖులు హాజరై విజయవంతం చేసేలా అధికా రులు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏజీఎం(ఫైనాన్స్) బీభత్స, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు కె.వెంకటేశ్వర్రెడ్డి, ఓసీపీ ప్రాజెక్టు అధికారులు ఏ.వెంకటేశ్వరరెడ్డి, టి.శ్రీని వాస్, ఏజెంట్ శ్రీధర్, డీజీఎంలు అరవిందరావు, ఆనంద్కుమార్, రవీందర్ వీటీసీ మేనేజర్ రామారావు, ఎన్విరాన్మెంట్ అధికారి హనుమాన్గౌడ్, సీనియర్ పీవో కాంతారావు పాల్గొన్నారు. సివిల్ జీఎంకు సన్మానం .. ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్న సివిల్ జీఎం సూర్యనారాయణను అధికారులు ఘనంగా సన్మానించారు. జీఎం శ్రీనివాస్ సత్కరించి ఆయన కంపెనీకి చేసిన సేవలను కొనియాడారు. -
ఉపాధ్యాయ శిక్షణను పరిశీలించిన అడిషనల్ డైరెక్టర్
మంచిర్యాలఅర్బన్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ముల్కల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాలను మోడల్స్కూల్ ఆడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మకమైన విద్య అందించడంలో పాఠశాల హెచ్ఎంలు కీలకపాత్ర పోషించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలని సూచించారు. 2025–26 విద్యా సంవత్సరంలో బడిబాటలో భాగంగా విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. విద్యార్థుల ప్రగతిని, వారికి సంబంధించిన ప్రతీ అంశాన్ని తల్లిదండ్రులతో చర్చించాలని తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరం ముగిసేసరికి నాణ్యతతో కూడిన విద్యను అందిస్తూ చక్కని ఫలితాలు సాధిస్తూ పాఠశాలలను ఉన్నతస్థాయిలో నిలపడానికి ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలని తెలిపారు. డీఈవో యాదయ్య మాట్లాడుతూ పరిసరాల విజ్ఞానాన్ని వివిధ రకాల చిత్రాలు, కృత్యాలు, వీడియోలు వినియోగిస్తూ బోధన చేయాలన్నారు. విద్యా సంవత్సరం ఆరంభంలోగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా కృషి చేస్తూ ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో సెంట్రల్ ఇన్చార్జి సత్యనారాయణమూర్తి, డీర్పీలు దత్తకుమార్, గిరిధర్రెడ్డి, ఎంఈవో తిరుపతిరెడ్డి, కోఆర్డినేటర్ చౌదరి, నోడల్ అధికారి హన్మాండ్లు, ముల్కల్ల పాఠశాల ప్రదానోపాధ్యాయుడు గణపతిరెడ్డి, రీసోర్స్పర్సన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
● ఉద్యమంలో ఉమ్మడి జిల్లా వాసులు ● దశాబ్దాలుగా అడవుల్లోనే.. ● వైభవం నుంచి ఉనికి కోల్పోతున్న దశకు.. ● ‘ఆపరేషన్ కగార్’ నేపథ్యంలో సర్వత్రా చర్చ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు వామపక్షవాద ఉద్యమానికి బలమైన కేంద్రంగా ఉండేది. ప్రతీ గ్రామం నక్సలైట్లకు ఆశ్రయంగా మారిన రోజులు గతంలో ఉండేవి. అయితే, ఇప్పుడు ఈ జిల్లా మావోయిస్టు ప్రభావ రహిత ప్రాంతంగా మారింది. కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి మావోయిస్టు పార్టీని అంతం చేసేందుకు ’ఆపరేషన్ కగార్’ చేపట్టింది. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఈ పరిస్థితిలో ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు కీలక నాయకులు ఇంకా సిద్ధాంతంతో పోరు బాటలోనే నడుస్తున్నారు. వారి ఆచూకీపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉనికి కోల్పోతున్న ఉద్యమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దశాబ్దాలపాటు మావోయిస్టు ఉద్యమం బలంగా సాగింది. ప్రస్తుతం దాని ఉనికి దాదాపు క్షీణించింది. వందలాది మంది కార్యకర్తలు ఎన్కౌంటర్లలో మరణించడం లేదా లొంగిపోవడం జరిగింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్(ఆనంద్, 69) 2024 జూన్లో మరణించారు. సీనియర్ నాయకులైన ఒగ్గు సత్వాజీ, కాసర్ల రవి (అశోక్), కంతి లింగవ్వ, గడ్డం మధూకర్, సుమన్, రవిబాబు వంటి వారిని పార్టీ కోల్పోయింది. మూల దేవేందర్రెడ్డి అరెస్టయ్యారు. 2020లో కాగజ్నగర్ మండలం కడంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఛత్తీస్గఢ్కు చెందిన చుక్క మరణించారు. మావోయిస్టు రహిత జిల్లాగా.. కేంద్ర హోంశాఖ ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల జాబితా నుంచి తొలగించింది. ప్రస్తుతం తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాత్రమే ఈ జాబితాలో కొనసాగుతోంది. గతంలో నిర్మల్ నుంచి బెజ్జూరు వరకు, బొగ్గు గనులు, అడవులు, గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలు సాగేవి. పీపుల్స్వార్ గ్రూప్ ద్వారా సింగరేణిలో సికాస (సింగరేణి కార్మిక సమాఖ్య) బలంగా పనిచేసిన రోజుల్లో ఎన్కౌంటర్లు తరచూ జరిగేవి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సానుభూతిపరుల బలంతో ఉద్యమం విస్తరించింది. కొత్త నియామకాలతో విద్యావంతులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే, గత రెండు దశాబ్దాలలో పరిస్థితులు మారాయి. తెలంగాణ ఏర్పా టు తర్వాత పార్టీ ఉనికి దాదాపు క్షీణించింది. ప్రస్తుతం అప్పుడప్పుడు పత్రికా ప్రకటనలు మినహా ఎలాంటి కార్యకలాపాలు కనిపించడం లేదు. ఇప్పటికీ కీలక స్థానాల్లో కొందరు.. ఇదిలా ఉంటే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు నాయకులు ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇర్రి మోహన్ రెడ్డి: సెంట్రల్ బ్యూరో, కేంద్ర సాంకేతిక కమిటీ సభ్యుడు. బండి ప్రకాశ్: సింగరేణి కోల్బెల్ట్ కమిటీ సెక్రెటరీ, ఇటీవల కేంద్ర కమిటీలో చేరారు. మైలారపు అడెల్లు: స్టేట్ కమిటీ సభ్యుడు, కుమురం భీం, మంచిర్యాల కమిటీ ఇన్చార్జి. సలాకుల సరోజ: సీనియర్ నాయకురాలు, పార్టీ ప్రింటింగ్ ప్రెస్ బాధ్యతలు. జాడి వెంకటి, పుష్పలత: సీనియర్ నాయకులు, దండకారణ్యంలో బాధ్యతలు. చౌదరి అంకుబాయి, లచ్చన్న, తూము శ్రీనివాస్: సీనియర్ కేడర్గా కొనసాగుతున్నారు.ఉమ్మడి జిల్లాకు చెందిన మావోయిస్టులు(ఫైల్)కుటుంబాల్లో ఆందోళన.. దండకారణ్యం, అబూజ్మడ్ వంటి ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు కొనసాగుతున్న నేపథ్యంలో, ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన నాయకుల ఆచూకీపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి బలమైన ఉద్యమం ఇప్పుడు దాదాపు అంతరించిన స్థితిలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యాచరణ, ఆపరేషన్ కగార్ వంటి చర్యలతో మావోయిస్టు ఉద్యమం మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, జిల్లాలో గతంలో ఉన్న సానుభూతి, కార్యకలాపాలు గణనీయంగా తగ్గడం, భవిష్యత్తులో ఈ ఉద్యమం పూర్తిగా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 25న జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే గ్రామ పరిపాలన అధికారి పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించే ఈ పరీక్షకు 155 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. ఉదయం 9:30 నుంచి అభ్యర్థులను అనుమతిస్తారని పేర్కొన్నారు. 10 గంటలకు గేట్లు మూసివేస్తారని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించారు. సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు, జిరాక్స్ సెంటర్ల మూసివేత, ఐదుగురు కంటే ఎక్కువ గుంపుల నిషేధం వంటి చర్యలతో భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. అభ్యర్థులు హాల్టికెట్, గుర్తింపు కార్డు, బ్లూ/బ్లాక్ పెన్లు మాత్రమే తీసుకురావాలని సూచించారు. డీఈఈటీతో ఉపాధి అవకాశాలు జిల్లాలో నిరుద్యోగులు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఆసుపత్రుల వివరాలను డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) ఆన్లైన్ ప్లాట్ఫామ్లో నమోదు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఈఈటీ ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ కమిటీ పురోగతిపై సమీక్షించారు. జూన్లో జాబ్ మేళాలు నిర్వహించి, యువతకు ఉపాధి కల్పించేందుకు కంపెనీల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. డిగ్రీ, పీజీ, నర్సింగ్ కళాశాలల యజమన్యాల సమన్వయంతో జాబ్మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిరుద్యోగులు deet.telangana.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. సమీక్షలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సి.రవికిరణ్, జిల్లా క్రీడలు, యువజన సేవల శాఖ అధికారి కీర్తి రాజ్వీర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ, బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ వై.రమేశ్, టాస్క్, మెప్మా కార్మిక శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. -
20 రోజులుగా అరిగోస పడుతున్నా..
అధికారులు చెప్పేది ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఒకటి. ధాన్యం సెంటర్కు తెచ్చి 20 రోజులు అవుతుంది. పోయిన వారం కురిసిన వర్షంతో తడవకుండా కాపాడుకునేందుకు అరిగోస పడుడు అయ్యింది. బస్తాలు తడిసిపోవడంతో మళ్లీ అరబోసుకొని బస్తాలు నింపి తూకం కోసం ఎదురు చూసుడు అయ్యింది. రెండు సార్లు బస్తాలు మార్చుడు అయ్యింది. ఇప్పుడు కాంటా పెడుతుంటే రోజులుగా వర్షం వీడడం లేదు. బస్తాల్లోకి నీళ్లు ఎక్కడ పోతాయోనని వర్షంలోనే కాల్వలు తీస్తున్నా. – రాజగౌడ్, గ్రామం: కిష్టంపేట్, మం: చెన్నూర్ -
రూ.లక్షల్లో వసూళ్లు
గురువారం బెల్లంపల్లి పట్టణంలో నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నిరుద్యోగులను ఓ సంస్థ నట్టేట ముంచింది. గత ఏడాది జూన్ విద్యాసంవత్సరం ఆరంభంలోనే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, గురుకులాల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఆశ చూపి రూ.లక్షలు వసూలు చేసింది. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘విద్యాంజలి 2.0’ పథకం అమలవుతోంది. ఈ పథకం కింద ఓ స్వచ్ఛంద సంస్థ స్కూల్, కాలేజీ, వసతిగృహాల్లో సిబ్బంది నియామకాలంటూ పలు రకాలుగా ప్రచారం చేసి ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేసింది. స్వీపర్ నుంచి టీచింగ్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్, ఏఎన్ఎంలు, వాచ్మెన్, వంటమనుషులు పలు రకాల పోస్టులు ఉన్నాయని, వేతనం నెలకు రూ.10వేల నుంచి రూ.18వేల వరకు ఉంటుందని నమ్మబలికింది. దీంతో విద్యాశాఖలో నిజంగానే ఉద్యోగాలుగా భావించి అనేకమంది అప్పులు చేసి మరీ ఉద్యోగాల్లో చేరారు. వీరితో మరికొంతమందిని చేర్చారు. నెలలు గడుస్తున్నా వారికి జీతాలు రాకపోవడంతో అసలు కథ బయటపడింది. అనుమానం వచ్చి నిలదీయడంతో సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్నారు. అప్పటికే పది నెలల దాక పని చేయడం గమనార్హం. ఎలా చేర్చుకున్నారో..? విద్యాశాఖతో సంబంధం లేని ఓ ప్రైవేటు సంస్థ ఆయా స్కూళ్లు, కాలేజీలు, వసతిగృహాల్లో సిబ్బందిని నియమించుకోవాలని చెబితే సంబంధిత బాధ్యులు ఎలా చేర్చుకున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. స్కూళ్ల హెచ్ఎంలు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, హాస్టళ్ల ఇన్చార్జీలు సిబ్బందితో నెలల తరబడి విధులు నిర్వర్తించుకున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఆయా చోట్ల రిజిష్టర్లు పెట్టి హాజరు సైతం తీసుకున్నారు. తీరా జీతం కోసం అడిగితే ఆ సంస్థ చేర్చుకోమని చెబితే విధుల్లోకి తీసుకున్నామని సంబంధిత విద్యాధికారులు అంటున్నారు. అధికారులను సైతం ఆ సంస్థ ఏదైనా ప్రలోభాలకు గురి చేసిందా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మరోవైపు విద్యాంజలి పథకం తమ విద్యాసంస్థలో అమలవుతుందా? లేదా? జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి తెలుసుకోకుండానే సిబ్బందిని ఎలా విధుల్లోకి తీసుకున్నారనేది సందేహాలకు తావిస్తోంది. వాస్తవానికి ఈ పథకం ఎంపిక చేసిన చోట్ల, స్వచ్ఛందంగా ఎలాంటి జీతభత్యాలు చెల్లించకుండా నిర్వహించేది. దీని గురించి అవగాహన లేక ఓ సంస్థ చెప్పిన అబద్ధాన్ని నమ్మేస్తూ ఆర్థికంగా నష్టపోయారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో ఓ సంస్థ నియామకాలు రూ.లక్షలు కట్టి నెలల తరబడి డ్యూటీ చేసిన వైనం జీతం లేక మోసపోయామని తెలుసుకున్న నిరుద్యోగులు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అనేక మంది బాధితులు కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వంద మంది వరకు బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చాలామంది బయట చెప్పుకుంటే అవమానంగా భావించి వివరాలు వెల్లడించడం లేదు. మంచిర్యాల జిల్లాలో ఇద్దరు మధ్యవర్తులుగా పని చేసి రెండు జిల్లాల నుంచి అనేక మందిని చేర్పించారు. ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి తదితర చోట్ల బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేశారు. గతేడాది ఈ సంస్థ నిరుద్యోగులను మఽభ్యపెడుతున్న తీరుపై ‘సాక్షి’లో కథనం ప్రచురించగా, కొందరు చేరేందుకు వెనుకాడారు. అయినా డబ్బులు వస్తున్నాయని, కమీషన్ల ఆశతో సంస్థ సీఈవోగా ఉన్న ఓ వ్యక్తి, ఆయన కింద జిల్లా కో ఆర్డినేటర్లు, ఇన్చార్జీలు నమ్మిస్తూ అందరినీ బురిడీ కొట్టించి రూ.కోట్లు వసూలు చేసి పరారయ్యారు. ఇంతా జరిగినా బాధితులు ఎక్కడా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం లేదు. కానీ నమ్మి డబ్బులు పెట్టిన వారి ఇంటికి వెళ్లి గొడవలు చేస్తున్నారు. ఇటీవల కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. మధ్యవర్తులు సైతం ఆ సంస్థను నమ్మి నిండా మునిగామని, తమ వద్ద కూడా డబ్బులు లేవని వాపోతున్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యా యి. జిల్లా వ్యాప్తంగా 16 పరీక్షా కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. మొదటి రోజు ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1509 మందికి గాను 1428మంది హాజరుకాగా 81 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 1391 మందికి గాను 1324 మంది హాజరుకాగా 67మంది రాలేదు. ఒకేషనల్ పరీక్షలకు 118 మందికి గాను 104 మంది హాజరు కాగా 14 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 506 మందికి గాను 483 మంది హాజరుకాగా 23 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 479 మందికి గాను 459 మంది హాజరుకాగా 20 మంది, ఒకేషనల్లో 27 మందికి గాను 24 మంది హాజరుకాగా ముగ్గురు గైర్హాజరైనట్లు డీఐఈవో అంజయ్య తెలిపారు. -
కారులో చెలరేగిన మంటలు
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పార్కింగ్ చేసి ఉన్న కారులో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడే కుడి వైపు ఉన్న పాఠశాల గదిలో డీఈవో రామారావుతో శిక్షణ పొందుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఎడమ వైపున ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్, ఎమ్మెల్యేతో సమీక్షలో పాల్గొన్న అధికారులు, ఇతర కార్యాలయాల అధికారులు ఒక్కసారిగా హైరానా పడ్డారు. కాగా కలెక్టర్ సమీక్షలో పాల్గొన్న సత్తన్పల్లి డిప్యూటీ రేంజ్ అధికారి మహేశ్కు చెందిన కారుగా గుర్తించారు. కారులోని బ్యాటరీ వైర్లు ఎర్తింగ్ అయి మంటలు చెలరేగినట్లు గుర్తించారు. వెంటనే కారు. అద్దాలు పగుల గొట్టి అందులోని బ్యాగులు, ఇతర సామగ్రి బయటకు తీసి అక్కడే అందుబాటులో ఉన్న మినరల్ వాటర్ పోసి మంటలు అదుపు చేయడంతో పాటు ఫైర్ ఇంజన్కు సమాచారం ఇచ్చారు. దీంతో సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. -
వివాహానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు..
● చెట్టు విరిగిపడి మహిళ మృతిజన్నారం: బంధువుల ఇంట్లో పెండ్లికి హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఈదురు గాలులకు చెట్టు విరిగి మీదపడడంతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజవర్దన్ తెలిపిన వివరాల ప్రకారం దండేపల్లి మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన శనిగారపు జగన్, అతని భార్య సునీత (37)తో కలిసి బుధవారం కడెం మండలంలోని లింగపూర్లో ఉన్న బంధువుల ఇంటికి బైక్పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో జన్నారం మండలం మహ్మదబాద్ గ్రామ సమీపంలోకి చేరుకునే సరికి బలమైన గాలులు వీయడంతో చెట్టు విరిగి సునీతపై పడడంతో బైక్పై నుంచి ఇద్దరు కిందపడిపోయారు. తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థాని కులు లక్సెట్టిపేట ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సునీత అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. జగన్ను మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి చెవుల మద్ది శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
‘బెస్ట్’ నిర్వహణ భారమే..!
● బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల బకాయిలు రూ.3.22 కోట్లు ● కొత్త పాఠశాలల ఎంపికకు కసరత్తు మంచిర్యాలఅర్బన్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల(బీఏఎస్)కు నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. ఏళ్ల తరబడి సకాలంలో విడుదల కాక బీఏఎస్ నిర్వహణ భారంగా మారుతోంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు బీఏఎస్ ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో 2025–26 విద్యాసంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల కింద ప్రైవేటు పాఠశాలల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. సదుపాయాలు, భవనం ప్రణాళిక, అగ్నిమాపక భద్రత, ఐదేళ్ల ఉత్తీర్ణత శాతం, ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలు అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మరో నాలుగు పాఠశాలల నుంచి దరఖాస్తులు రాగా సౌకర్యాలు, పేరున్న పాఠశాలలు తక్కువేనని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం బెస్ట్ అవైలబుల్ కింద నిర్వహిస్తున్న పాఠశాలలకు బకాయిలు పేరుకుపోవడంతో స్కూళ్లు నడపలేమంటూ యాజమాన్యాలు చేతులెత్తుస్తుండంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఇలా.. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల కింద ఐదు ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతున్నాయి. రివిలేషన్ స్కూల్, మదర్థెరిస్సా, ట్రినిటీ, బ్రిలియంట్, శ్రీచైతన్య(దొనబండ) పాఠశాలలు ఉన్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ఒకటో తరగతిలో చేరిన వారు ఇంటి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఐదో తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులందరికీ పదో తరగతి వరకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తారు. ఒకటో తరగతిలో 91 సీట్లు, ఐదో తరగతిలో 92 సీట్లు ఉంటాయి. బెస్ట్ అవైలబుల్ పాఠశాలల కింద ప్రవేశం పొందిన డే స్కాలర్ విద్యార్థికి రూ.28వేలు, హాస్టల్ సౌకర్యం ఉన్న వారికి రూ.42వేల చొప్పున యాజమాన్యాలకు చెల్లిస్తుంటారు. ప్రభుత్వం ఎప్పుడూ పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వహణ భారంగా మారుతోందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వసతితో కూడిన విద్యనందిస్తున్న పాఠశాలలో చదువు మాటేలా ఉన్నా భోజనం ఖర్చులు తడిసి మోపెడు అవుతుండడం, ప్రభుత్వం నిధుల మంజూరులో జాప్యం చేస్తుండడం వల్ల డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావడం లేదని ఓ పాఠశాల నిర్వాహకుడు ఆందోళన వ్యక్తం చేశారు. బకాయిలు ప్రతియేటా బకాయిలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. జిల్లాకు బడ్జెట్ విడుదల అవుతున్నా పాఠశాల యాజమాన్యాల ఖాతాలో చేరడం లేదు. బడ్జెట్ విడుదల కావడం, టోకెన్లు రిలీజ్ చేస్తున్నా బ్యాంకు ఖాతాలో చూస్తే మాత్రం ట్రెజరీ వద్ద పెండింగ్లో ఉన్నట్లు ఆన్లైన్లో కనిపిస్తోంది. జిల్లాలో నాలుగేళ్ల వరకు కొంతలో కొంత చెల్లిస్తున్నా 2024–25నుంచి బకాయిలు ఏమాత్రం చెల్లించలేదు. రూ.1.47 కోట్లకు పైగా పాఠశాలల యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంది. ఐదేళ్లుగా మొత్తం రూ.4,37,66,000కు గాను రూ.1,15,47,000 చెల్లించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది జీతాలు చెల్లించడం కష్టతరంగా మారుతోందని, వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. -
‘బూటకపు ఎన్కౌంటర్లను ఖండించాలి’
పాతమంచిర్యాల: బూటకపు ఎన్కౌంటర్లను ఖండించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2026 నాటికి మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం నరమేధానికి ఒడిగట్టిందన్నారు. ఏడాదికాలంలో 540 మందిని ఎన్కౌంటర్ల పేర చంపేశారని, అందులో అమాయకులు, సా మాన్య పౌరులు కూడా ఉన్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యలపై సుప్రీంకోర్టుచే న్యాయ విచా రణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి లాల్ కు మార్, ఐఎఫ్టియూ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీని వాస్, కార్యదర్శి బ్రహ్మనందం, పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ, సీపీఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి దేవరాజ్, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట సత్యం పాల్గొన్నారు. -
మూడు తరాల నుంచి భూదానం
● వారసత్వంగా భూమిని దానం చేస్తున్న కుటుంబంసాత్నాల: తాత నుంచి మనవళ్ల వరకు భూదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది భోరజ్ మండలంలోని గిమ్మ గ్రామానికి చెందిన నాలం కుటుంబం. ఊరి కోసం తమవంతు సాయంగా లక్షల రూపాయల విలువచేసే భూమిని విరాళంగా అందించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. భోరజ్ మండలంలోని జాతీయ రహదారికి ఐదు కిలో మీటర్ల దూరంలో గిమ్మ గ్రామం ఉంది. గ్రామానికి చెందిన నాలం కుటుంబ సభ్యులు తమ సొంత భూమిలో ఆ ఊరి ప్రజల రాకపోక కోసం తారురోడ్డు నిర్మాణం కోసం భూమిని వదిలిపెట్టారు. గ్రామంలోని పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పాఠశాల భవనం, వసతిగృహం కోసం, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆస్పత్రి, పశువుల కోసం వెటర్నరి ఆస్పత్రి, శ్మశాన వాటిక, రైతువేదిక నిర్మాణానికి ఆరున్నర ఎకరాల భూమిని విరాళంగా అందించారు. తాత నాలం రాములు నుంచి మనవళ్లు నాలం వామన్, నాలం అనిల్ వారసత్వంగా భూదానం చేస్తున్నారు. నాలం రాములు, అతని కుమారుడు వామన్ కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. వామన్ కుమారుడు నాలం అనిల్సైతం తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ తాత దారిలోనే పయనిస్తున్నాడు. తోచిన సాయం చేస్తా మా తాత రాములు, నాన్న వామన్ మదిలో గ్రామాభివృద్ధికోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేది. ఊరి కోసం ఆరెకరాల భూమిని అందించారు. నేను కూడా నాకు తోచిన సాయం చేసేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ఇటీవల రైతు వేదిక కోసం భూమిని విరాళంగా ఇచ్చాం. – నాలం అనిల్ -
భాగ్యరెడ్డి వర్మ గొప్ప సంఘ సంస్కర్త
మంచిర్యాలక్రైం: భాగ్యరెడ్డి వర్మ గొప్ప సంఘ సంస్కర్త, ఆయన సేవలు చిరస్మరణీయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురువారం భాగ్యరెడ్డి వర్మ జ యంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఆ యన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ సంస్థానంలో సంఘ సంస్కరణల కోసం అనేక పోరా టాలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, స్పెషల్బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, మల్లేష్, సీపీవో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
దళితుల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ కృషి
మంచిర్యాలఅగ్రికల్చర్: దళితుల అభ్యున్నతికి విశే ష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం క లెక్టరేట్లో ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతి కార్యక్రమానికి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పోటు రవీందర్రెడ్డి, షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఈడీ దుర్గప్రసాద్, వివిధ సంఘాలతో కలిసి హాజరయ్యారు. భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్ట ర్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం భాగ్యరెడ్డి వర్మ విశేష కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి సంతోష్కుమార్, వివిధ శాఖల అధికారులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించాలి మందమర్రిరూరల్: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తక్షణమే రైస్మిల్లులకు తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం ఆయన మండలంలోని బొక్కలగుట్ట, సారంగపల్లి, గుడిపెల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ సతీష్కుమార్తో కలిసి సందర్శించారు. కేంద్రాల బాధ్యులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. -
ఆరోగ్య సమాచారం.. ‘ఆభా’
● యాప్లో రోగి వివరాలు నిక్షిప్తం ● ఓపీ సమయంలోనే నేరుగా నమోదు ● అవగాహన కల్పిస్తున్న వైద్యారోగ్య శాఖ అధికారులు మంచిర్యాలటౌన్: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మిషన్ డైరెక్టర్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆభా(ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్–ఏబీహెచ్) యాప్ ద్వారా సత్వర వైద్యసేవలకు అవకాశం కల్పిస్తోంది. దేశంలో ఆరోగ్య రంగంలో ఆధునిక, సాంకేతికతను ఉపయోగించుకుని పౌరుల ఆరోగ్య సమాచారాన్ని కచ్చితంగా భద్రపర్చుకోవడానికి, పౌరులకు మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఈ బృహత్తరమైన కార్యక్రమంపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అవగాహన కల్పిస్తోంది. ఇలా పొందాలి.. ఆభా నంబరును ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్త, ఏబీడీఎం వెబ్సైట్ ద్వారా ఉచితంగా పొందవచ్చు. ఇందుకోసం వెబ్సైట్లోకి వెళ్లి క్రియేట్ ఆభా నంబ రుపై క్లిక్ చేయాలి. ఆధార్, మొబైల్ నంబర్లు నమో దు చేసి డౌన్లోడ్ చేసుకునేందుకు సబ్మిట్ చేయా లి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆభా సంఖ్య నమోదు, ఆరోగ్య పరీక్షల సమాచారం నమోదుకు ఆధార్కార్డుతోపాటు ఓటీపీ వచ్చే మొబైల్ను వెంట తీసుకెళ్లాలి. ఆస్పత్రిలోని సిబ్బంది ఆభా నంబరు సృష్టించడం, హెల్త్కార్డులను యాప్లో అప్లోడ్ చేస్తారు. ఓపీ సేవలు సులభతరం ప్రజలు ఆభా యాప్ ద్వారా వైద్య సేవలు నేరుగా పొందవచ్చు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఓపీ కోసం వచ్చిన వారి వివరాలను యాప్లో నమోదు చేసేలా జాతీయ ఆరోగ్య మిషన్ ఆభా ప్రోగ్రాం అధికారి నరేశ్ అవగాహన కల్పిస్తున్నారు. ఓపీ రోగులకు ఆభాపై అవగాహన కల్పించి, యాప్ డౌన్లోడ్ చేసి వివరాలు నమోదు చేస్తున్నారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతీరోజు 400కు పైగా ఓపీ కోసం రోగులు వస్తుండగా, ఓపీ స్లిప్ పొందేందుకు క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఆభా యాప్ ద్వారా అక్కడే ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేస్తే వెంటనే ఓపీ స్లిప్ వస్తుంది. సిబ్బంది వద్దకు వెళితే ఏ రకమైన వైద్య సేవలు అవసరమో అడిగి తెలుసుకుని చీటి రాసి నేరుగా వైద్యుడి వద్దకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. వైద్య సేవలు, ల్యాబ్ రిపోర్టులు నమోదుతో రోగికి ఎలాంటి వైద్యం అందించారనే పూర్తి వివరాలు వైద్యులు తెలుసుకుని అందుకు తగినట్లుగా వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని జాతీయ ఆరోగ్య మిషన్ ఆభా ప్రోగ్రాం అధికారి నరేశ్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. -
విత్తన ఎంపికే కీలకం
మధ్యకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలుబెల్లంపల్లి: వానాకాలం సమీపిస్తోంది. మరో పక్షం రోజుల్లోగా ఖరీఫ్ సీజన్ ఆరంభం కానుంది. ఇప్పటికే అల్పపీడనంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 25 నుంచి రోహిణి కార్తె మొదలు కానుంది. ఈ మేరకు రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. వానాకాలం సీజన్లో రైతులు అనువైన వరి వంగడాలను సాగు చేసుకోవాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్, శాస్త్రవేత్త కోట శివకృష్ణ సూచిస్తున్నారు. పంట దిగుబడి, చీడపీడలు తట్టుకునే గుణం కలిగిన వరి వంగడాల గురించి వివరించారు. వరి రకాలు ఖరీఫ్ సీజన్లో సాగు చేయడానికి అనువైన వరి వంగడాలు దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్ప కాలిక రకాలు ఉన్నాయి. దీర్ఘకాలిక రకం (150 రోజులు). ఈ రకం వంగడాలను జూన్ నెలాఖరు వరకు నాటుకోవాలి. మధ్యకాలిక రకాలు (135–140 రోజులు). జులై 15 వరకు నాటుకోవాలి. స్వల్పకాలిక రకాలు (120–125రోజులు) జులై చివరి వరకు నార్లు పోసుకుని 25 రోజుల్లోపు నాట్లు వేయాలి.స్పల్పకాలిక రకాలుతెలంగాణ వరి–4 (జేజీఎల్–25958): ఈ రకం వంగడం స్వల్పకాలిక దొడ్డు గింజ రకం. 115 నుంచి 120 రోజుల్లో పంట కోతకు వస్తుంది. హెక్టారుకు 65 క్వింటాళ్ల నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. కూనారం వరి–2 (కేఎన్ఎం–1638): 120 నుంచి 125 రోజుల్లో పంట కోతకు వస్తుంది. హెక్టార్కు 76 నుంచి 85 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఉల్లికోడు, బయోటైప్–3, అగ్గి తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది. బతుకమ్మ: హెక్టారుకు 70 క్వింటాళ్ల నుంచి 80 క్వింటాళ్ల పంట దిగుబడిని ఇస్తుంది. 115 నుంచి 120 రోజుల్లో పంటచేతికి వస్తుంది. ఎండాకు తెగులు, సుడిదోమ, పచ్చదోమ తట్టుకుంటుంది. విత్తన నిద్రావస్థ మూడు వారాలు ఉంటుంది. గింజ రాలేగుణం తక్కువ. జగిత్యాల రైస్(జేజీఎల్–24423): 120 నుంచి 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. హెక్టార్కు 85 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఉల్లికోడు, సుడిదోమ, గో ధుమ రంగు, ఆకుపచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజ రాలేగుణం తక్కువ. చేను నే లపై పడిపోదు. విత్తన నిద్రావస్థ రెండు వారాలు ఉంటుంది. రైతులు సరైన వరి వంగడాలు ఎంచుకోవాలి కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ కోట శివకృష్ణవరంగల్ రైస్–1 (డబ్ల్యూజీఎల్–915): ఈ రకం వంగడం పొడవు, దొడ్డు, గింజనాణ్యత కలిగి ఉంటుంది. అటుకులు, మరమరాల (పేలాలు) తయారీకి అనువైనరకం. 135 రోజులకు కోతకు వస్తుంది. వానాకాలం సాగుకు ఈరకం ఎంతో ఉత్తమమైంది. అగ్గి తెగులు, సుడిదోమ, ఎండాకు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. హెక్టార్కు 65 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కూనారం సన్నాలు(కేఎన్ఎం–118): ఈ రకం వంగడం 118 నుంచి 120 రోజుల్లో పంట కోతకు వస్తుంది. హెక్టార్కు 70 క్వింటాళ్ల నుంచి 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అగ్గి తెగులు, మెడ విరుపు తెగుళ్లను తట్టుకుంటుంది. సుడిదోమను కొంతవరకు నివారిస్తుంది. తెలంగాణ వరి–2 (డబ్ల్యూజీఎల్–697): ఈరకం వంగడం పంటకాలం 135 రోజులు. సన్నగింజ, నాణ్యతతో ఉంటుంది. హెక్టార్కు 65 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సుడిదోమ, అగ్గి తెగులు, పొట్టకుళ్లు తెగులును తట్టుకుంటుంది. సోమనాథ్: ఈ రకం వంగడం 130 నుంచి 135 రోజులకు పంట చేతికి వస్తుంది. హెక్టార్కు 65 నుంచి 70 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. సన్న గింజరకం. ఉల్లికోడును తట్టుకుంటుంది. అగ్గితెగులును కొంతవరకు తట్టుకునే శక్తి ఉంటుంది. నారుమడి దశలో కొంతవరకు చలిని సైతం తట్టుకుంటుంది. కంపాసాగర్ వరి (కేపీఎస్ 2874): ఈరకం వంగడం 140 రోజుల్లో పంట చేతికి అందివస్తుంది. అధిక దిగుబడిని ఇస్తుంది. గింజలు సన్నగా ఉంటాయి. సాంబమసూరితో పోలిస్తే పైరు ఎత్తు ఎక్కువగా పెరుగుతుంది. సుడిదోమ, అగ్గి తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. హెక్టార్కు 65 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.ఇంద్ర (ఎంటీయూ–1061): ఈ రకం వంగడం 160 రోజుల్లో పంట చేతికి వస్తుంది. హెక్టార్కు 65 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. దోమను తట్టుకుంటుంది. నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేయడానికి అనువైనది. తెలంగాణ సోన (ఆర్ఎన్ఆర్–15048): ఈ రకం వంగడం పంట కాలం 125 రోజులు. హెక్టార్కు 65 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అగ్గి తెగులును తట్టుకుంటుంది. అతి సన్నబియ్యం. తక్కువ నూక శాతంతో అన్నం నాణ్యత కలిగి ఉంటుంది. గ్లైమిక్ ఇండెక్స్ తక్కువ. జగిత్యాల సన్నాలు (జేజీఎల్–1798): ఈరకం వంగడం పంటకాలం 120 రోజులు. హెక్టార్కు 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఉల్లికోడును తట్టుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. సాగుకు అనువైన రక. సాంబ మసూరి (బీపీటీ–5204): ఈ రకం వంగడం 150 రోజుల్లో పంట చేతికి వస్తుంది. హెక్టార్కు 65 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. బియ్యం సన్నగా ఉంటాయి. అన్నం ఎంతో నాణ్యతగా ఉంటుంది. ఏ రకమైన చీడపీడలను తట్టుకోలేదు. -
● జిల్లాలో 37మిల్లీమీటర్ల వర్షపాతం ● కేంద్రాల్లో వేల క్వింటాళ్ల ధాన్యం
మంచిర్యాలఅగ్రికల్చర్: ఓ వైపు ఉరుములు, మెరుపులు, పిడుగులు, భారీ వర్షం. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం ఉండడంతో రైతుల గుండెల్లో గుబు లు పుడుతోంది. ఇంటి వద్ద ఉండలేక పార పట్టుకుని కొనుగోలు కేంద్రానికి పరుగులు తీస్తున్నారు. పైన, కింద ఎన్ని కవర్లు కప్పినా వరద ఆగడం లే దు. చేతికందిన పంటను చెడగొట్టు వాన దెబ్బతీ స్తోందని రైతులు కన్నీరు పెడుతున్నారు. వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో తమ పరిస్థితి ఏమిటంటూ ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో రెండ్రోజులుగా వర్షాలు వీడడం లేదు. బుధవారం నుంచి గురువారం వరకు 37మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, తాండూర్, భీమారం, జైపూర్, చెన్నూర్, మందమర్రి, కోటపల్లి, వేమనపల్లి, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎమ్మెస్ కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు 6 వేల నుంచి 7 వేల క్వింటాళ్ల వరకు, ఆరబోసిన ధాన్యం 8 వేల నుంచి 9 వేల క్వింటాళ్లు తడిసిపోయింది. గురువారం ఉదయం ఎండ, ఉక్కపోత, మధ్యాహ్నం 3గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులు కమ్ముకుని మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. 15నుంచి 20రోజులుగా సకాలంలో తూకం వేయక, లారీలు రాక ధాన్యాన్ని అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నారు. వర్షాలకు ధాన్యం కొట్టుకుపోకుండా, తడవకుండా పడరాని పాట్లు పడుతున్నారు. గత శుక్ర, శనివారాల్లో కురిసిన వానతో అవస్థలు పడ్డామని, అయినా ధాన్యం సేకరణ వేగవంతం చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం మొలకలు వచ్చే పరిస్థితి నెలకొందని వాపోయారు. జిల్లాలో వర్షపాతం.. జిల్లాలో గురువారం 37మిల్లీమీటర్ల వర్షపాతం నమోందైంది. మంచిర్యాల మండలంలో 64.6 మిల్లీమీటర్లు, హాజీపూర్లో 58.5, నస్పూర్లో 52.6, చెన్నూర్లో 50.7, దండేపల్లిలో 48.1, తాండూర్లో 44.8, జన్నారంలో 41.5, భీమారంలో 38, కాసిపేటలో 38.1, కోటపల్లిలో 36.8, జైపూర్లో 33.6, మందమర్రిలో 28.1, బెల్లంపల్లిలో 26.6, వేమనపల్లిలో 23.5, నెన్నెలలో 21.7, భీమినిలో 24.2, లక్సెట్టిపేటలో 24.2, కన్నెపల్లిలో 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
కేంద్ర ప్రభుత్వ నిధులు పక్కదారి
● ఎంపీ గోడం నగేష్ఆదిలాబాద్: రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడారు. గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించకుండా దుర్వినియోగం చే స్తోందని ఆరోపించారు. ముఖ్యంగా గిరిజనుల్లో అ త్యంత వెనుకబడిన వర్గాలైన చెంచు, కోయ వర్గాల ప్రగతికి సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటికి ఖర్చు చేయడం లేదని మండిపడ్డారు. ఓవైపు రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిస్తే ఏమి చేయలేదని విమర్శిస్తూనే, కేంద్రం నుంచి వచ్చిన నిధులను విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. గతేడాది అక్టోబర్లో పోస్ట్మెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించి రూ.152 కోట్లు కేంద్రం నుంచి విడుదలైతే ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని విమర్శించారు. అక్టోబర్, మార్చి నెలల్లో సుమారుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.397 కోట్లు రాగా, వాటిని విడుదల చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని అడ్డుకుంటుందని మండిపడ్డారు. ఈ నెల 25లోగా కేంద్రం విడుదల చేసిన నిధులు అన్నింటినీ రిలీజ్ చేయాలని, లేనిచో గిరిజన సంఘాలతో కలిసి ఒత్తిడి తీసుకువస్తామన్నారు. సమావేశంలో ఎమ్మె ల్యే పాయల్ శంకర్, నాయకులు అస్తక్ సుభాష్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ఆవు మృతి
దండేపల్లి: మండలంలోని తాళ్లపేటలో గోళ్ల తిరుపతికి గల పాడి ఆవు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. మేతకు వెళ్లే సమయంలో రోడ్డు పక్కన ఉన్న ఇనుప స్తంభానికి తగలడంతో షాక్కు గురైన ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు విలువ రూ.50 వేలు ఉంటుందని బాధిత రైతు వాపోయాడు. ఇనుప స్తంభానికి షాక్ వస్తోందని రెండు మూడు రోజులుగా విద్యుత్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందన్నారు. గ్రామంలో గల ఇనుప విద్యుత్ స్తంభాలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. అంజనీతండాలో..నర్సాపూర్(జి): మండలంలోని అంజనీతండాలో రాథోడ్ దుర్గాదాస్ అనే రైతుకు చెందిన ఆవు గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మృతి చెందింది. దేవుని చెరువు దారిలో ఆవు మేత వేస్తుండగా మినీ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఎర్తింగ్ రాడ్, వైర్లకు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన స్థలాన్ని పశు వైద్యాధికారి ముక్తార్ అహ్మద్, విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి పంచనామా నిర్వహించారు. ఆవు విలువ సుమారు రూ.40 వేలు ఉంటుందని, నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతు కోరుతున్నాడు. -
ఘనంగా రాజీవ్గాంధీ వర్ధంతి
పాతమంచిర్యాల: మాజీ ప్రధాని దివంగత రాజీవ్గాంధీ 33వ వర్ధంతిని జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్టులో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్డర్ నీలకంఠేశ్వర్రావు మాట్లాడుతూ రాజీవ్గాంధీ దేశంలోని యువతకు ప్రోత్సాహం అందించడానికి ఐటీ పరిశ్రమ అబివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఓపెన్ యూనివర్సిటీలు నెలకొల్పారని, 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించారని, గ్రామీణాభివృద్ధి కోసం ప్రణాళికలు రచించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ఇంచార్జి రాజేశం, జైపూర్ మండల కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు శ్రీనివాస్గౌడ్, టైబల్ సేవాదల్ ఇంచార్జి కోవ జంగు, శ్రీరాంపూర్ సేవాదల్ నాయకులు యాకూబ్రెడ్డి, నాయకులు మార్కండేయ, చంద్రమౌళి పాల్గొన్నారు. -
టీచర్ల నైపుణ్యాల పెంపునకు శిక్షణ
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅర్బన్: టీచర్లు వృత్తి పరంగా విద్యాబోధన నైపుణ్యాలు పెంపొందించుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మంచిర్యాల గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులే సమాజ మార్పుకు దిక్సూచిలని, దేశ భవిష్యత్ తరగతి గదిలో నిర్మితమవుతుందని అన్నారు. పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయులు, పాఠశాలలపై మరింత పర్యవేక్షణ పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కోర్సు సెంటర్ క్వాలిటీ కో–ఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, రిసోర్స్పర్సన్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. గ్రామ పరిపాలన పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలిమంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 25న గ్రామ పరిపాలన పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావులతో కలిసి జిల్లా విద్య, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్, సమాచార శాఖల అధికారులు, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ శివాజితో గ్రామ పరిపాలన అధికారుల పరీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తామని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణకు ముఖ్య పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులు, సిబ్బందిని నియమించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, అగ్నిమాపక శాఖ అధికారి రమేష్బాబు, విద్యుత్ శాఖ అధికారి రమ్యశ్రీ, కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లకు ధరాఘాతం
● పెరిగిన స్టీల్, సిమెంటు, ఇసుక ధరలు ● పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో 2,150 ఇళ్ల మంజూరు ● పనులు ప్రారంభించినవి 897 మాత్రమే.. ● బేస్మెంటు స్థాయి వరకు పూర్తయినవి 134 మంచిర్యాలటౌన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రోజు రోజుకు పెరుగుతున్న ధరలు కళ్లెం వేస్తున్నాయి. స్టీల్, సిమెంటు, ఇసుక ధరలు పెరగడం, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోకపోవడంతో నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంటి స్థలం ఉండి ఇళ్లులేని నిరుపేదల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదటి విడతలో అవకాశం కల్పించింది. జిల్లాలోని 16మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంటిస్థలం ఉండి, ఇల్లు లేని 2,150మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో 897మంది మాత్రమే ఇళ్లకు ముగ్గు పోసి పనులు చేపట్టారు. 134 బేస్మెంటు స్థాయి వరకు పూర్తి చేయగా.. ప్రభుత్వం రూ.1లక్ష చొప్పున హౌసింగ్ శాఖ ద్వారా అందజేసింది. ఇంటి నిర్మాణాన్ని బేస్మెంటు వరకు నిర్మిస్తే రూ.లక్ష, రూఫ్ లెవల్ వరకు పూర్తి చేస్తే రూ.1.25లక్షలు, స్లాబ్ వేస్తే రూ.1.75లక్షలు, రంగులు వేసిన తర్వాత రూ.లక్ష మొత్తంగా నాలుగు విడతల్లో రూ.5లక్షలు అందించనుంది. 897 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించినా మిగతా వారు నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంటు, ఇసుక ధరలు పెరగడం, ప్రభుత్వం ఇచ్చే డబ్బు సరిపోకపోవడంతోనే నిర్మాణానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. వేసవి కాలం ముగుస్తుండడంతో వర్షాకాలంలో నిర్మాణం ఇబ్బందిగా మారనుంది. ఇసుక దొరకని పరిస్థితి ఎదురవుతుంది. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలా అధికారులు చూడాల్సి ఉంది. రెండో విడత జాబితాపై ఆశలుమొదటి విడతలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారిలో సగం కూడా ప్రారంభించలేదు. ఒక్కో నియోజకవర్గంలో 3,500 చొప్పున వచ్చేలా అన్ని మండలాలు, మున్సిపాల్టీల్లో ఇళ్లు మంజూరు చేయాల్సి ఉంది. రెండో విడతలో లబ్ధిదారులను ఎంపిక చేయడంలో మండల, మున్సిపల్ అధికారులు తాత్సారం చేస్తున్నారు. రెండో విడతలోనైనా ఇళ్లు వస్తుందా లేదా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మండలాల్లో లబ్ధిదారుల ఎంపికపై అధికారులు ఇంకా కసరత్తు చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. జాబితా సిద్ధం చేస్తున్నాం ఇందిరమ్మ ఇళ్లు బేస్మెంటు స్థాయి వరకు నిర్మించుకున్న వారికి రూ.లక్ష చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. ఇల్లు మంజూరైన వారు నిర్మాణం చేపట్టి పనులు పూర్తి చేసుకుంటే డబ్బులు ఖాతాల్లో వేస్తాం. పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకునేలా చూస్తున్నాం. రెండో విడత జాబితా మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేస్తున్నారు. అర్హతను బట్టి ఇళ్లు మంజూరు చేస్తాం. – బన్సీలాల్, హౌసింగ్ పీడీ, మంచిర్యాల -
పోలీసుల పని తీరు భేష్
● మూడో స్థానంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ● సిటిజన్ ఫిడ్ బ్యాక్ ఆధారంగా ఎంపిక ● డీజీపీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న డీసీపీ భాస్కర్ మంచిర్యాలక్రైం: పోలీసుల పనితీరు, బాధితులకు అందిస్తున్న సేవలు తదితర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ ద్వారా సిటిజన్ ఫీడ్ బ్యాక్ సేకరణకు పోలీస్ శాఖ గత ఏడాది శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా టాప్ 10 యూనిట్లను ఎంపిక చేసింది. ఇందులో రామగుండం పోలీస్ కమిషనరేట్కు మూడో స్థానం దక్కింది. డీజీపీ జితేందర్ చేతులమీదుగా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో ఉత్తమ అవార్డును మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అందుకున్నారు. క్యూఆర్ కోడ్లను కమిషనరేట్లోని అన్ని పోలీస్స్టేషన్లు, గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసి వాటిపై అవగాహన కల్పించారు. ప్రజలు అభిప్రాయాలను తెలియజేశారు. అవార్డు రావడంపై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులను అభినందించారు. -
వ్యాక్సిన్ వేసుకోవాలి
మంచిర్యాలటౌన్: వ్యాక్సిన్ను సమయానుసారంగా వేసుకోవాలని, తప్పిపోయిన వ్యాక్సిన్లను వేసేందుకు ఈ నెల 21 నుంచి 28వరకు వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నామని జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ అనిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాతమంచిర్యాల అర్బన్ హెల్త్సెంటర్లో క్యాచ్ అప్ టీకాల రెండో విడత కార్యక్రమాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణులు, చిన్నారులు వేసుకునే వ్యాక్సిన్లలో ఏవైనా త ప్పిపోయి ఉంటే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేసేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని తెలిపారు. సరైన సమయంలో టీకాలు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. -
టోల్ ట్యాక్స్ నిలిపివేయాలని ధర్నా
చెన్నూర్రూరల్: కిష్టంపేట సమీపంలోని వైజంక్షన్ వద్ద టోల్ ట్యాక్స్ నిలిపి వేయాలని బీజేపీ జిల్లా అద్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో టోల్గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా ట్యాక్స్ పేరుతో దోపిడీకి గురిచేస్తున్నారన్నారు. అటవీశాఖలో ఎక్కడా ఈ టాక్స్లు వసూలు చేయడం లేదన్నారు. కాళేశ్వరంలో పుష్కరాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ట్యాక్స్ వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బత్తుల సమ్మయ్య, రాపర్తి వెంకటేశ్వర్గౌడ్, బుర్ర రాజశేఖర్గౌడ్, తుమ్మ శ్రీపాల్, తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు యువకుల బైండోవర్
నిర్మల్రూరల్: గంజాయి విక్రయిస్తున్నారన్న అనుమానంతో జిల్లా కేంద్రంలో ఇద్దరు యువకులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. గుండంపెళ్లి గ్రామానికి చెందిన సత్యపోలు యోగేష్, భైంసా పట్టణం పురాణ బజార్కు చెందిన షేక్ కై ఫ్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేట్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా వారి వద్ద ఎలాంటి గంజాయి లభించలేదు. కానీ భవిష్యత్లో గంజాయి సేవించడం లేదా విక్రయిస్తారన్న అనుమానంతో వారిద్దరిని రూరల్ తహసీల్దార్ సంతోష్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు సరికాదు’
జైపూర్: జైపూర్ మండలంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న తిరుపతిపై మాదిగ హక్కుల దండోరా నాయకులు చేసిన అసత్యపు, నిరాధారమైన ఆరోపణలు ఖండిస్తున్నామని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాన్గెజిటెడ్ ఉద్యోగుల సంఘం మందమర్రి యూనిట్ అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి సతీశ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులపై కక్షపూరితంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ తిరుపతి, సభ్యులు రవిచందర్, శ్రీనివాస్, ప్రశాంత్, సత్యనారాయణ, సురేశ్, ఉదేయ్కుమార్, స్వామి, అపర్ణదేవి, రజిత, విజయ్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు. -
విత్తనాలు కొంటున్నారా?
● జాగ్రత్తలు తప్పనిసరిచెన్నూర్రూరల్: మరికొద్ది రోజుల్లో వానాకాలం సాగు ప్రారంభమవుతోంది. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలులో రైతులు బిజీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమతులు లేని కంపెనీలకు చెందిన విత్తనాలు, కల్తీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. రైతులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అన్ని వివరాలు పరిశీలించాకే కొనుగోలు చేయాలి. అనుమానం వస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించాలని చెన్నూర్ ఏవో యామిని సూచించారు. లైసెన్స్ లేని దుకాణాలు, దళారుల వద్ద ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయకూడదు. సరుకు, లాట్ నంబర్, తయారీ, తేదీ, రకం ఇలా అన్ని వివరాలు ఉండి సంతకం చేసిన బిల్లును విక్రయదారు (షాపు) నుంచి తప్పనిసరిగా తీసుకోవాలి. సంచులపై సీల్ తీసినట్లు లేదా విప్పదీసి తిరిగి కుట్లు వేసినట్లు కనిపిస్తే తీసుకోకూడదు. వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందిన డీలర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సహకార సంఘాల నుంచి మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలి. క్రిమిసంహారక మందుల డబ్బాలపై కంపెనీ పేరు, తేదీ, కాలపరిమితి, గమనించి రసీదులు తీసుకోవాలి. ఏది ఎంత ధరతో కొన్నా.. డీలర్ లేదా దుకాణాదారు సంతకంతో తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలి. మీరు తీసుకున్న విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు నకిలీవని అనుమానం వస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలి. అలాగే లాట్ నంబర్, తయారీ తేదీలను తప్పనిసరిగా చూసుకోవాలి. లేదంటే గతేడాది విత్తనాలు, మందులు, ఎరువులు అంటకడతారు. రైతులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి కాలం చెల్లిన మందులు, ఎరువులు, విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. అలాగే మందు డబ్బాలపై ఆకుపచ్చని లేబుల్ ఉందో లేదో గమనించాలి. ఆకుపచ్చ లేబుల్ ఉంటేనే ఆ మందును కొనుగోలు చేయాలి. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలు విషయంలో రైతులు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించి నాణ్యమైన దిగుబడులు పొందాలి. -
సోలార్ ప్లాంట్ పనులపై సమీక్ష
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో సింగరేణి నూతనంగా ఏర్పాటు చేస్తున్న 67.5 మెగా వాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ పనులపై ఏరియా జీఎం ఆఫీస్ ఆవరణలోని కాన్ఫ్రెన్స్ హాల్లో సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణ బుధవారం ఏరియా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏరియా జీఎం దేవేందర్తో పాటు అధికారులను అడిగి పనుల అభివృద్ధిని తెలుసుకున్నారు. పవర్ ప్లాంట్ ఏర్పాటు పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జీఎం (ఈఅండ్ఎం) సోలార్ ఎనర్జీ జీఎస్ జానకీరామ్, ఎస్వో టూ జీఎం విజ య్ప్రసాద్, ఏరియా ఇంజనీర్ (ఈఅండ్ఎం) వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ శ్యామ్సుందర్, కేకే గ్రూపు ఏజెంట్ రాంబాబు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, ఐఈడీ రాజన్న పాల్గొన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్టు
జైనథ్ : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాం వద్ద బుధవారం గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై గౌతమ్ తెలిపారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖుర్షీద్నగర్కాలనీకి చెందిన సాహీల్, ముషీర్ గంజాయి విక్రయిస్తున్నట్లు తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేసి 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పేకాడుతున్న 13 మంది..నేరడిగొండ: పేకాడుతున్న 13 మందిని బుధవారం అరెస్టు చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు నేరడిగొండ ఎస్సై శ్రీకాంత్ సిబ్బంది తో కలిసి వెళ్లి మండల కేంద్రంలోని నీలిమ దా బా వెనకాల దాడులు నిర్వహించి పేకాడుతు న్న 13 మందిని పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారి వద్ద నుంచి పేక ముక్కలతో పా టు రూ.14,080 నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సయ్యద్ జహీర్, గడ్డం రవి చందర్రెడ్డి, గూడూరు లవకుమార్, రాథోడ్ రవీందర్, అల్లూరి శివారెడ్డి, ఉప్పు పోశెట్టి, సోలంకి శ్రీనివాస్, నల్ల అడెల్లు, సోలంకి కరన్ సింగ్, గోతి గులాబ్ సింగ్, మాడ గంగాధర్, అల్లూరి శ్రీనివాస్ రెడ్డి, పవార్ సంతోష్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. టపాసులతో ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తిపై కేసుఆదిలాబాద్టౌన్: అర్ధరాత్రి టపాసులు పేల్చి జనాలను ఇబ్బందికి గురిచేసిన వ్యక్తిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన చోట ముష్రఫ్ తన జన్మదినం సందర్భంగా ఇంటి ముందు, బిల్డింగ్పై బాణసంచాలు పేల్చాడు. దీంతో చుట్టుపక్కల వారు ఇబ్బందులకు గురయ్యారు. ఓ ఇంటిపై వేసిన ప్లాస్టిక్ కవర్కు నిప్పంటుకోవడంతో కొంతభాగం కాలిపోయింది. దీంతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఐదుగురిపై.. ఆదిలాబాద్రూరల్: మండలంలోని చాందా (టి) శివారు ప్రాంతం మీదుగా ఎలాంటి డా క్యుమెంట్లు లేకుండా వాహనంలో రెండు ఎ డ్లను తరలిస్తున్న రాథోడ్ నితిన్, షేక్ సాకీర్పై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వి ష్ణు వర్ధన్ తెలిపారు. అలాగే వాహనాన్ని అడ్డుకుని బెదిరింపులకు గురి చేసిన చాందా (టి) గ్రామానికి చెందిన ముగ్గురు యువకులపై రాథోడ్ నితిన్, షేక్ సాకీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దాడి చేసిన వ్యక్తులపై.. ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని పండ్ల వాపారిపై దాడికి పాల్పడిన షన్ను, మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో తోపుడు బండ్లపై షేక్ షహెబాజ్ పండ్లు విక్రయిస్తున్నాడు. ఎద్దు వచ్చి పండ్లను తింటుండగా అతను ఎద్దును కొట్టడంతో షన్నుకు తగిలింది. దీంతో ఆయన ద్విచక్ర వాహనం దెబ్బతింది. ఇందుకు రూ.2వేలు ఇవ్వాలని అడిగాడు. తనవద్ద లేవని చెప్పడంతో తన మిత్రులను పిలిచి షహెబాజ్పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు. -
పుష్కర ఘాట్లపై మట్టికుప్పలు
● బాసరలో భక్తులకు తప్పని అవస్థలుబాసర: తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సరస్వతీ అమ్మవారు కొలువైన బాసర గో దావరిన ది పుష్కరఘాట్ల వద్ద పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదటి పుష్కర ఘాట్ నుంచి రెండో పుష్కరఘాట్ వరకు గోదావరి నీటి ప్రవాహం తగ్గడంతో పుష్కరఘాట్లపై నల్లమట్టి పెద్దపెద్ద కుప్పలుగా పే రుకుపోయింది. బాసర సరస్వతీ అమ్మవారి సన్ని ధిలో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దక్షిణాది రా ష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ముందుగా పవిత్ర గోదావరినదిలో పుణ్య స్నానం ఆచరించడం పుణ్యఫలంగా భావిస్తారు. కానీ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనంతో గోదావరి ఘాట్ తీరమంతా అస్తవ్యస్తంగా మారింది. బురద, చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతోంది. బాసర ప్రధాన స్నానఘాట్ పైభాగంలో గంగమ్మ విగ్రహం, ఘాట్ కిందిభా గం మెట్ల వద్ద శివలింగం ఉంది. ఇక్కడ అనేక ఏళ్లుగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల పారిశుద్ధ్య నిర్వహణ గాలి కొదిలేయడంతో శివలింగం కళ తప్పుతోంది. ఎంట్రన్స్లోనే పుష్కర ఘాట్లు చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. కలుషిత నీటిలోనే స్నానాలు మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్లో పుట్టిన గోదారమ్మ బాసర వద్ద చదువులమపాదాలను తాకి తెలుగురాష్ట్రాల్లోకి అడుగిడుతుంది. ఎగువన భారీ వర్షాలు కురిసినపుడు వచ్చే వరదలతో ఘాట్లు పరిశుభ్రమవుతున్నాయే తప్ప అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. గత పుష్కరాల సమయంలో రూ.10 కోట్లు వెచ్చించి నిర్మించిన ఘాట్లు అధ్వానంగా మారిపోయాయి. ఫలితంగా పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. అంతేకాకుండా గోదావరినదిలో నీళ్లు కూడా కలుషితం అయ్యాయి. ఆలయ అధి కారులు భక్తుల సౌకర్యార్థం షవర్స్ ఏర్పాటు చేసినా కొంతమంది భక్తులు కలుషిత నీటిలోనే స్నా నాలు చేస్తున్నారు. ఇప్పటికై నా దేవాదాయశాఖ అధి కారులు స్పందించి పుష్కరఘాట్లను పరిశుభ్రంగా ఉంచాలని భక్తులు కోరుతున్నారు. -
యూత్ కాంగ్రెస్ నాయకుల బాహాబాహీ
మంచిర్యాలటౌన్: సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించకుండా అవమానించడాన్ని నిరసిస్తూ బుధవారం యూత్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించేందుకు వెళ్తుండగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు వర్గీయులు బూతులు తిడుతూ అడ్డుకున్నారని ఎంపీ వర్గీయులు తెలిపారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పినా వినకుండా తమను అడ్డుకోవడం సరికాదని యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్, ఆసంపల్లి శ్రీకాంత్ అన్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరుగుతుండడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పున్నం, సృజన్, మాయ తిరుపతి, దాసరి సంపత్, శ్రీశైలం, అరుణ్, రాజేశ్, వెంకటేశ్, రాకేశ్, తదితరులు పాల్గొన్నారు. -
విదేశీ పర్యటనకు ఏవో
● మంత్రులు, ఐఏఎస్లతో కలిసి వెళ్లనున్న విశ్వనాథ్ ● బెల్లంపల్లికి చెందిన హార్టికల్చర్ అధికారి కూడా..ఆదిలాబాద్టౌన్: వ్యవసాయ శాఖ ద్వారా విదేశాల్లో అధ్యయనం కోసం ఆ శాఖ మంత్రి, ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాన్ని పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బృందంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి ఎం.రఘునందన్రావు, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ కె.సురేంద్ర మోహన్, హార్టికల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తదితరులు ఉన్నారు. వీరితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో టెక్నికల్ ఏవో గా పనిచేస్తున్న విశ్వనాథ్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఉద్యానవన అధికారి జె. అర్చన ఎంపికయ్యారు. వీరు నెదర్లాండ్, ఫ్రాన్స్లోని ప్యారీస్ లలో పర్యటించనున్నారు. జూ న్ 10 నుంచి 15 వరకు కొనసాగే పర్యటనలో ఆ దేశాల్లో వ్యవసాయం, ఉద్యానవన పంటల సాగు స్థితిగతులు, దిగుబడులు సాధించేందుకు అనుసరి స్తున్న విధానాలు, నూతన వంగడాల సృష్టికి అవలంభిస్తున్న పద్ధతులు వంటి పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. మూడు రోజుల చొప్పున ఆయా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్ర బృందంలో ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు ఉండటంతో ఇక్కడి రైతులకు సాగుపరంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
టోర్నమెంట్ సక్సెస్ చేయాలి
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి కో రారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం టోర్నమెంట్ నిర్వహణపై సమావేశమై చర్చించారు. గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. టోర్నమెంట్కు రాష్ట్ర వ్యా ప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి జట్లు హాజరుకా నున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు అన్ని వసతుల కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, హాకీ శిక్షకులు పాల్గొన్నారు. -
పసికందు పాల కోసం ఆవు విరాళం
ఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తిప్పకొలంగూడ గ్రామానికి చెందిన ఆత్రం రాణిబాయి ఏప్రిల్ 18న ఆడపిల్లకు జన్మనిచ్చింది. మే 15న రాణిబాయి అనారోగ్యంతో మృతి చెందింది. పాపకు జన్మనిచ్చిన నెలలోపే రాణిబాయి మృతి చెందగా బాధిత కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి ఇటీవల పరామర్శించారు. పాలకోసం ఆ చిన్నారి పడే తపనను చూసి చలించారు. పాపకు పాలు అందించేందుకు ఓ ఆవును కొనిస్తానని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. మంగళవారం ఓ ఆవుతో పాటు లేగదూడను ఆ చిన్నారి తండ్రి ఆత్రం కృష్ణ, తాత, నానమ్మ కటోడ బూరిబాయికి అందించారు. ఈ సందర్భంగా ఈశ్వరీబాయికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
స్క్రాప్షాప్లో భారీ అగ్ని ప్రమాదం
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని సోఫీనగర్లోగల ఇండస్ట్రియల్ ఏరియాలోని స్క్రాప్ షాప్లో షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాలు.. పట్టణానికి చెందిన షేక్ ఫాజిల్ స్థానిక సోఫీనగర్లో స్క్రాప్ దుకాణం నడుపుతున్నాడు. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో దుకాణం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన వాచ్మన్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.7లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ అధికారులు అంచనా వేశారు. ఎవరికి ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. ట్రాక్టర్ బోల్తాపడి ఒకరి మృతితలమడుగు: ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొలాంగూడ గ్రామానికి చెందిన సీడాం సురేశ్ (22) కొన్నేళ్లుగా బరంపూర్ గ్రామానికి చెందిన లింగారెడ్డి వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ట్రాక్టర్ను అతి వేగంగా, అజాగ్రత్తగా నడుపుకొంటూ బరంపూర్ నుంచి పల్లి గ్రామానికి వెళ్తున్నాడు. ఈక్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సురేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్పై ప్రయాణిస్తున్న మెరుగు ప్రవీణ్కు త్రీవ గాయాలయ్యాయి. ప్రవీణ్ను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. సురేశ్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్సై రాధిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇసీ్త్ర చేస్తూ కరెంట్ షాక్తో ఒకరి దుర్మరణంభైంసారూరల్: మండలంలోని సుంక్లీ గ్రామంలో విద్యుత్ షాక్తో ఒకరు మృత్యువాత పడ్డారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అరిగెల ముత్యం (42) మంగళవారం రోజులాగే తన ఇంటి వద్ద ఎలక్ట్రికల్ ఇసీ్త్రపెట్టెతో బట్టలు ఇసీ్త్ర చేస్తున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. గమనించిన కుటుంబీకులు ము త్యంను చికిత్స కోసం భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతిభైంసాటౌన్: పట్టణంలోని భైంసా–బాసర మార్గంలో భోకర్ చౌరస్తా సమీపంలోగల పెట్రోల్ పంపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వాలేగాంకు చెందిన పవార్ అచ్యుతానంద్ పాటిల్ (46) మంగళవారం సాయంత్రం భోకర్ చౌరస్తా వద్ద గల పెట్రోల్పంపు నుంచి రోడ్డుపైకి వస్తున్నాడు. ఈ సమయంలో బాసర వైపు నుంచి వచ్చిన మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో అచ్యుతానంద్ పాటిల్ కింద పడగా తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆటోలో ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు ఎమ్మెల్యే రామారావు పటేల్కు సమీప బంధువు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పరిచయస్తులు భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు. కంటైనర్ను ఢీకొని యువకుడు..నేరడిగొండ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రంలోని కేఆర్కే కాలనీకి చెందిన శాంతిస్వరూప్ (18) మంగళవారం ద్విచక్రవాహనంపై నిజామాబాద్కు వెళ్లి డిగ్రీ ఎంట్రన్స్ పరీక్ష రాసి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను గమనించక ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శాంతిస్వరూప్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఉదయం పేపర్ బాయ్గా పని చేయడంతోపాటు ఆదిలాబాద్లోని ఓ ఆస్పత్రిలో పార్ట్టైమ్ జాబ్ చేస్తున్నాడు. అతడి మరణాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని ఎన్హెచ్ఏఐ అంబులెన్స్లో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
‘ఉదారి’కి రాష్ట్రస్థాయి పురస్కారం
ఆదిలాబాద్టౌన్: జిల్లాకు చెందిన ప్రముఖ కవి ఉదారి నారాయణ తెలంగాణ సారస్వత పరిషత్ అవార్డుకు ఎంపికై నట్లు సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చిన్నయ్య మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నారాయణ రచించిన ‘మళ్లీ మనిషిలో కి..’ గ్రంథం రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమంలో పురస్కారంతోపాటు రూ.20 వేల నగదు అందజేసి శాలువా, జ్ఞాపికతో సత్కరించనున్నట్లు తెలిపారు. నా రాయణ ఇప్పటివరకు ఏ డు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు, ఎనిమిది ఉత్తమ కవిత పురస్కారాలు అందుకున్నారు. నారాయణకు జిల్లా కవులు, రచయితలు అభినందనలు తెలిపారు. -
నల్లబ్యాడ్జీలతో ఇఫ్టూ నిరసన
బెల్లంపల్లి: లేబర్ కోడ్ల రద్దు కోరుతూ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాయిదా వేయడంపై ఇఫ్టూ శ్రేణులు మంగళవారం బెల్లంపల్లి సివిక్ కార్యాలయం ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 20న దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాల్సి ఉండగా కేంద్ర కార్మిక సంఘాలు వాయిదా వేశాయని తెలిపారు. ఈ తీరును తాము తీవ్రంగా నిరసిస్తున్నామని పేర్కొన్నారు. భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు చెప్ప డం సరికాదని తెలిపారు. ప్రస్తుతం దేశంలో సాధారణ పరిస్థితులున్నా సమ్మె వాయిదా వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇప్టూ జిల్లా అధ్యక్షుడు టీ శ్రీనివాస్, నాయకుడు ఎండీ చాంద్పాషా, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణవేణి, వెంకటి, కొమురయ్య, భానుప్రసాద్, కుమార్, లింగన్న, పద్మ, సునీత, అమృత, కరుణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ బాలబాలికల జట్ల ఎంపిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి ఎస్ఆర్కేఎం నర్సింగ్ కళాశాలలో మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్బాల్ జూనియర్ బాలబా లికల జట్లను ఎంపిక చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హ్యాండ్బాల్ రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు సత్తా చాటాలని సూచించారు. పతకం సాధించి జిల్లా క్రీడా పతాకాన్ని రాష్ట్ర స్థాయిలో ఎగురవేయాలని పిలుపునిచ్చారు. జూనియర్ బాలబాలికల జట్లు ఈ నెల 28నుంచి 30వరకు నల్గొండ జిల్లా నకిరేకల్లో నిర్వహించనున్న 47వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ బాలబాలికల హ్యాండ్బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటాయని తెలి పారు. జట్లకు ఈ నెల 22నుంచి 27వరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హ్యాండ్బాల్ అసో సియేషన్ రెఫరీ బోర్డు చైర్మన్, హ్యాండ్బాల్ కోచ్ అరవింద్ సునార్కర్, జాతీయ క్రీడాకారులు రాకేశ్, సాయి, కార్తిక్, సంజయ్, ప్రవీణ్ పాల్గొన్నారు. జూనియర్ బాలికల జట్టుకు.. జూనియర్ బాలికల జట్టుకు డీ శృతి, డీ మౌనిక, అనూష, జే అశ్విత, పీ శృతి, డీ వర్ష, ఎం.కుమారి, బీ మమత, కే స్వీటీ (మంచిర్యాల), ఏ రేణుక, టీ సౌమ్య, కే మల్లిక (కుమురంభీం ఆసిఫాబాద్), పీ సింధు, కే చైతన్య, ఆర్.మైత్రి (ఆదిలాబాద్), సీ సుధ (నిర్మల్) ఎంపికయ్యారు. జూనియర్ బాలుర జట్టుకు.. జే రవివర్మ, డీ సందేశ్, టీ అరవింద్, జే కార్తిక్, శ్రావణ్, ఎల్.సుందర్, ఎస్.పవన్ (మంచిర్యాల), కే రాంకుమార్, ఎస్.భానుప్రసాద్, డీ యోగి, డీ ఈశాంత్, జే సాయికిరణ్, పీ కార్తిక్ (కుమురంభీం ఆసిఫాబాద్), జే కళ్యాణ్, కే రాకేశ్, (ఆదిలాబాద్), ఆర్.రమేశ్ (నిర్మల్) ఎంపికయ్యారు. -
పశువుల పాకలు దగ్ధం
బోథ్: సొనాల మండల కేంద్రానికి చెందిన అన్నదమ్ములైన రేంజర్ల సుదర్శన్, రేంజర్ల రాములుకు చెందిన రెండు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అ ర్ధరాత్రి పశువుల పాకకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో పశువులు అరవగా స్థాని కులు గమనించి సుదర్శన్, రాములుకు తెలిపారు. ఇచ్చోడలోని ఫైర్స్టేషన్కు సమాచారమిచ్చారు. ఉద యం వరకు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా పా కలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పశువులకు ఎలాంటి ప్రాణహాని సంభవించలేదు. వ్యవసాయ పనిము ట్లు, పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. రూ.5లక్షల నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. చికిత్స పొందుతూ మృతిఆదిలాబాద్టౌన్: మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకా టెంబీ గ్రామానికి చెందిన జాదవ్ శేషారావు (60) రిమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. శేషారావు కూతుళ్ల వివాహాలు చేసి అప్పులపాలయ్యాడు. మానసిక వేదనతో మద్యానికి బానిసయ్యాడు. అప్పులు తీర్చే మార్గం లేక సోమవారం ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు గమనించి రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. పేకాడుతూ ఆరుగురి అరెస్ట్ఆదిలాబాద్రూరల్: మండలంలోని రాంపూర్లో ఓ ఇంట్లో పేకాడుతున్న ఆరుగురిని మంగళవారం అరె స్ట్ చేసినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. వారి నుంచి రూ.1,860 నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
‘ఆదివాసీ నాయకులపై చర్యలు తీసుకుంటాం’
ఇంద్రవెల్లి: ఏజెన్సీ చట్టాలను దుర్వినియోగం చేస్తు న్న ఆదివాసీ సంఘాల నాయకులపై చర్యలు తీసుకోనున్నట్లు రాయిసెంటర్ జిల్లా మేడి మెస్రం దు ర్గు, తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేశ్ తెలిపారు. మంగళవారం మండలంలోని కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్లో గొండ్వా న పంచాయతీ రాయిసెంటర్ ఆధ్వర్యంలో ఆదివా సీ సంఘాల నాయకులు, ఆదివాసీ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. కొందరు నాయకులు ఆదివాసీ పెద్దల తీర్మానాలు పట్టించుకోకుండా, నోటీసులిచ్చి నా ఆదివా సీ సమావేశాలకు దూరంగా ఉంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. త్వరలో వా రిపై కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ బాదిరావ్, రాయిసెంటర్ సార్మేడి మెస్రం వెంకట్రావ్, ఆయా గ్రామాల పెద్దలు పుర్క బాపురావ్, వెట్టి రాజేశ్వర్, ఆదివాసీ సంఘాల నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. -
దాడి ఘటనలో ముగ్గురిపై కేసు
తానూరు: మండలంలోని కోలూరు గ్రామానికి చెందిన రుద్రముడ్ గంగాధర్పై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన రుద్రముడ్ అశోక్, అతడి భార్య కౌసల్య, పెద్ద కుమారుడు సుధాంపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై భానుప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 16న రుద్రముడ్ అశోక్ పొలంలోని ఒడ్డుపై ఉన్న వేపచెట్టు కొట్టివేస్తున్నాడు. ఇంతలో వరుసకు సోదరుడైన గంగాధర్ వచ్చి చెట్టు ఎందుకు కొట్టివేస్తున్నావని ప్రశ్నించాడు. దీంతో గంగాధర్పై అశోక్తోపాటు అతడి భార్య కౌసల్య, పెద్ద కుమారుడు సుధాం గంగాధర్పై రాళ్లతో దాడి చేశారు. గంగాధర్కు తీవ్ర గాయాలు కాగా కుటుంబీకులు అతడిని చికిత్స కోసం భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గంగాధర్ మంగళవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాడికి పాల్పడ్డ అశోక్, కౌసల్య, సుధాంపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. అదుపుతప్పి లారీ బోల్తామందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని యాపల్ ప్రాంతంలో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కై కలూరు నుంచి చేపల లోడుతో అమృత్సర్ (బెల్లంపలి వైపు) వెళ్తున్న లారీని డ్రైవర్ నిద్రమత్తులో నడుపుతుండగా అది అదుపుతప్పి యాపల్ ప్రాంతంలో రోడ్డు పక్కనున్న రెయిలింగ్ను ఢీకొని బోల్తా పడింది. బోల్తాపడ్డ లారీని గమనించక వెనుక నుంచి బొలెరో ఢీకొంది. బొలెరో వెనుక మరో లారీ నిలిచి ఉండగా దానిని డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో, లారీ డ్రైవర్లకు గాయాలయ్యాయి. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ కాగా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తులో అజాగ్రత్తగా లారీ నడిపిన డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ట్రాక్టర్ దగ్ధంచెన్నూర్రూరల్: మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన బోగె శంకర్కు చెందిన ట్రాక్టర్ ప్రమాదవశాత్తు కాలిపోయింది. వివరాలు.. మంగళవారం ఒత్కుపల్లి సమీపంలో ట్రాక్టర్తో డ్రైవర్ దుక్కి దున్నుతుండగా డీజిల్ అయిపోయింది. డ్రైవర్ వెళ్లి డీజిల్ తీసుకుని వచ్చేసరికి ప్రమాదవశాత్తు ట్రాక్టర్కు మంటలు అంటుకున్నాయి. ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. అప్పటికే ట్రాక్టర్ కాలిపోయింది. ట్రాక్టర్ విలువ సుమారు రూ.8లక్షల వరకు ఉంటుందని బాధితుడు శంకర్ తెలిపాడు. -
ఆధునికీకరణ పూర్తయ్యేదెప్పుడో!
● రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల్లో జాప్యం ● దుమ్ముతో నిండిన ప్లాట్ఫాంలు ● రెండేళ్లయినా పూర్తి కాని నిర్మాణాలు ● ఇబ్బందుల్లో బాసర యాత్రికులుభైంసా: అమృత్ భారత్ పథకం కింద చేపట్టిన బాస ర రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు రెండేళ్లుగా నత్తనడకన కొనసాగుతున్నాయి. నిత్యం వేల సంఖ్యలో బాసరలోని సరస్వతీ అమ్మవారి దర్శనానికి వస్తున్న యాత్రికులకు ఇబ్బందులు తప్పడంలేదు. బాసర రైల్వేస్టేషన్ తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దున ఉండడం, ఇక్కడ శ్రీజ్ఞానసర్వతీ ఆలయంతోపాటు ట్రిపుల్ఐటీ ఉండటంతో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటోంది. అమృత్ భారత్ కింద ఎంపికై న బాసర స్టేషన్ ఆధునికీకరణ పనులను 2024 ఫిబ్రవరి 26న అప్పటి ఎంపీ సోయం బాపూరావు, ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కేంద్రం అమృత్ భార త్ నిధులు మంజూరు చేసినా పనులు నత్తనడకన సాగుతుండటంతో వీరికి ఇబ్బందులు తప్పడంలేదు. ఆధునికీకరణలో భాగంగా స్టేషన్లో వెయిటింగ్ హాల్, టాయిలెట్స్ నిర్మాణం, ఎస్కలేటర్, లిఫ్ట్ ఏర్పాటు పనులు చేస్తున్నారు. స్టేషన్లో యా త్రికులు సేదతీరేందుకు విశ్రాంతి గదుల నిర్మాణం చేపట్టగా ఇప్పటికీ పునాది దశలోనే ఉన్నాయి. రైల్వేస్టేషన్ ముందు భాగాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సి ఉండగా ప్రస్తుతం ఇసుక, కంకర, మట్టి కుప్పలతో నిండిపోయి కనిపిస్తోంది. పాత ప్లాట్ఫాంలు తొలగించి.. ఆధునికీకరణలో భాగంగా బాసర స్టేషన్ పాత ప్లాట్ఫాంలు తొలగించారు. మళ్లీ టైల్స్ వేసి పూర్తి గా ఆధునికీకరిస్తున్నారు. రెండు వైపులా ఈ పనులు అర్ధంతరంగా నిలిచాయి. స్టేషన్లో రెండు ప్లాట్ఫాంలుండగా ఇరువైపులా పనులు నిలిచిపోవడంతో ప్రయాణికులు నిలబడే పరిస్థితి లేదు. ప్లాట్ఫాంలపై వివిధ బోగీలను సూచించే ఎలక్ట్రానిక్ మానిటర్లు తొలగించారు. ప్లాట్ఫాంలపైకి వచ్చే రైలులోని ఏ బోగి ఎక్కడ నిలుస్తుందో తెలియక ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. సరిహద్దులోని రైల్వే స్టేషన్.. ప్రయాణికుల పరేషాన్ బాసర రైల్వేస్టేషన్ తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఇక్కడి ట్రిపుల్ఐటీలో 9 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తారు. ఇందులో పనిచేసే అధ్యాపకులు, ఆయా విభాగాల సిబ్బంది రైలు మార్గం ద్వారా రాకపోకలు కొనసాగిస్తారు. ఉత్తర, దక్షిణ భారతాలను కలుపుతూ బాసర మీదుగా రాకపోకలు సాగించే రైళ్లలో నిత్యం సుమారు 4వేలకు పైగా ప్రయాణికులు వెళ్తుంటారు. ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతుండగా నిత్యం రద్దీగా ఉండే ఈ స్టేషన్లో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తి చేయించి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ● గ్రీవెన్స్లో అర్జీల స్వీకరణ ఉట్నూర్రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారా నికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. ఉ ట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. వా టిని సంబంధిత అధికారులకు అందజేసి సమస్యల ను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వా రం 25 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్ల డించారు. ఇందులో ఎక్కువగా పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి పథకాల మంజూరు, రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నట్లు తెలిపారు. ఉట్నూర్ మండలం మార్కగూడకు చెందిన మధు తమ గ్రామాని కి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. తలమడుగు మండలం ఝరి గ్రామానికి చెందిన గేడం శంకర్ బోర్వెల్ మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, ఏవో దామోదరస్వామి, ఈఈ తానాజీ, మేనేజర్ శ్యామల, డీపీవో ప్రవీణ్, జేడీఎం నాగభూషణం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నేతల బాహాబాహీ
● పరిశీలకుల ఎదుటే గలాట ● మాజీ కౌన్సిలర్పై చేయి చేసుకున్న పీసీసీ సభ్యుడు ● పోలీసుల రంగ ప్రవేశం చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశంలో నాయకులు బాహాబాహీకి దిగారు. ఇరువర్గాలు కొట్టుకునే వరకు వెళ్లారు. రాష్ట్ర పరిశీలకుల ఎదుటే మాజీ కౌన్సిలర్పై పీసీసీ సభ్యుడు చేయి చేసుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామి అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. పరిశీలకులు రాష్ట్ర ఆయిల్, ఫర్టిలైజర్స్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పీసీసీ కార్యదర్శి రాంభూపాల్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యరు. ఎమ్మెల్యే, పరిశీలకులు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చాంబర్లోకి వెళ్లారు. అనంతరం సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బ్లాక్, మండల, పట్టణ, గ్రామ అధ్యక్షుల ఎన్నికల కోసం పరిశీలకులు చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల నాయకుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పార్టీ కోసం పని చేసిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెన్నూర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ పోగుల సతీష్ ఫిర్యాదు చేశారు. దీంతో పీసీసీ సభ్యుడు మందమర్రికి చెందిన పిన్నంటి రఘునాథ్రెడ్డి ఆయనతో ఘర్షణకు దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరినొకరు తోసుకున్నారు. సహనం కోల్పోయిన రఘునాథ్రెడ్డి సతీష్పై చేయి చేసుకున్నాడు. దీంతో చెన్నూర్ నాయకులు ఆందోళనకు దిగారు. సీఐ దేవేందర్రావు ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పార్టీ పరిశీలకుల ఎదుటే నాయకులు గలాటకు దిగడంతో కాంగ్రెస్ నాయకుల తీరు మారదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ పాల్గొన్నారు. పరిశీలకులకు ఫిర్యాదు..ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి ముఖ్య అనుచరుడు రఘునాథ్రెడ్డి సతీష్పై చేయిచేసుకున్న తీరును పరిశీలకులు రాఘవరెడ్డి, రాంభూపాల్రెడ్డిలకు జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన పీసీసీ సభ్యున్ని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని కోరినట్లు రాజిరెడ్డి వర్గీయులు తెలిపారు. సమావేశంలో ఘర్షణ జరుగుతున్నా ఎమ్మెల్యే కార్యాలయం నుంచి సంఘటన స్థలానికి రాకపోవడం గమనార్హం. -
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
సాత్నాల: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుందరగిరి గ్రామానికి చెందిన కొక్కుల లచ్చన్న(52) కొంతకాలంగా తమకున్న మూడెకరాలతోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది పత్తి సాగు చేయగా సరైన దిగుబడి రాలేదు. కుటుంబ అవసరాల నిమిత్తం చేసిన అప్పు, సాగుకు తెచ్చిన పెట్టుబడి కలిపి సుమారు రూ.5లక్షల వరకు ఉందని, వాటిని ఎలా తీర్చాలో అంటూ కొంతకాలంగా మదనపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆయన సోమవారం వేకువజామున ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గ్రామ సమీపంలోని శ్మశానవాటిక వద్ద ఉన్న మోదుగు చెట్టుకు ఉరేసుకుని మృతిచెందాడు. స్థానికులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. మృతుడి కుమారుడు వెంకటి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో రమ్య తెలిపారు. -
అక్రమ నిర్మాణం అడ్డగింతలో ఉద్రిక్తత
నెన్నెల: మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబరు 876లో ఇంటి నిర్మాణ పనులు సోమవారం అధికారులు అడ్డుకోవడం రసాభాసగా మారింది. ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు బయటకు రావడానికి నిరాకరించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు మహిళను బయటకు తీసుకొచ్చే క్రమంలో స్పృహా కోల్పోవడంతో 108 అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎంఆర్సీ భవనం ఎదుట కొనుగోలు చేసిన భూమిలో గీసరి సాయికుమార్ ఇంటి నిర్మాణం చేపట్టాడు. ప్రభుత్వ స్థలమని ఫిర్యాదులు రావడంతో రెండ్రోజుల క్రితం బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ ఇంటిని సీజ్ చేశారు. సాయికుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పనులు సాగుతున్నట్లు మరోసారి ఫిర్యాదు రావడంతో ఇంటిని సీజ్ చేసేందుకు డెప్యూటీ తహసీల్దార్ ప్రకాష్, ఆర్ఐ సులోచన, ఎస్సై ప్రసాద్ సిబ్బందితో కలిసి సోమవారం వెళ్లారు. ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు బయటకు వచ్చేందుకు నిరాకరించారు. గంటన్నరపాటు వారిని సముదాయించి బయటకు తీసుకొచ్చి ఇంటికి తాళం వేశారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో అధికారులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సాయికుమార్ వాపోయాడు. చుట్టుపక్కల నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోకుండా తనను అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటిని సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
పేలిన బుష్ ఇన్సులేటర్లు
మందమర్రిరూరల్: పట్టణంలోని రెండవ జోన్ రైల్వేస్టేషన్ రోడ్డు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం సమీపంలో ట్రాన్స్ఫార్మర్ బుష్ ఇన్సులేటర్లు సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా పేలి మంటలు ఎగిసిపడ్డాయి. రోడ్డు పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో ఆయిల్ రోడ్డుపై పడింది. ఆ సమయంలో రోడ్డు గుండా ఎవరూ వెళ్లకపోవడంతో ప్రమాదం తప్పింది. మంటలకు విద్యుత్ స్తంభానికి ఉన్న వైర్లు కాలిపోయాయి. విద్యుత్శాఖ ఏఈ శ్రీనివాస్ను సంప్రదించగా.. బుష్ ఇన్సులేటర్లలో గ్యాస్ ఏర్పడి పేలి ఉంటుందని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సరఫరాలో అంతరాయం కలుగకుండా చూస్తామని తెలిపారు. ట్రాక్టర్ అదుపు తప్పి యువ రైతు మృతి నర్సాపూర్(జి): నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలం నందన్ గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి యువ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నందన్ గ్రామానికి చెందిన సామ రూపేశ్రెడ్డి(35) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం తన సొంత ట్రాక్టర్లో పొలానికి చెరువు మట్టి తరలిస్తుండగా చెరువు కట్ట మార్గంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఇంజన్ ట్రాలీ మధ్యలో రూపేశ్రెడ్డి ఇరుక్కు పోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మహిళ మృతి కాసిపేట: కాసిపేట పోలీస్స్టేషన్ పరిధి సోమగూడెం వారసంత సమీపాన ఉన్న సింగరేణి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గది ఆవరణలో కుక్కల లలిత(48) మృతిచెందినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. చెల్పూర్ గ్రామానికి చెందిన ఆమె సోమగూడెంలోని కుటుంబీకుల వద్ద ఉంటూ మద్యానికి బానిసైందని పేర్కొన్నారు. సోమవారం మృతదేహం కనిపించింది. మృతురాలి కూతురు పెద్దపల్లి రమ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
280 క్వింటాళ్ల జొన్నల పట్టివేత
● ఏపీ నుంచి ఆదిలాబాద్ జిల్లాకు అక్రమంగా తరలింపు ● వేర్వేరు చోట్ల రెండు లారీలు సీజ్ నేరడిగొండ/సిరికొండ: ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లాకు అక్రమంగా జొన్నలను తరలిస్తున్న రెండు లారీలను నేరడిగొండ, సిరికొండ మండలాల్లో పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 280 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు. నేరడిగొండలో 250 క్వింటాళ్లు..నిర్మల్కు చెందిన ఓ ట్రేడర్ ఆంధ్రప్రదేశ్ నుంచి లారీలో 250 క్వింటాళ్ల జొన్నలను తరలిస్తుండగా వాంకిడి గ్రామ సమీపంలో సోమవారం పట్టుకున్నట్లు స్థానిక ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పంచనామా అనంతరం వ్యవసాయ శాఖ, పీఏసీఎస్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. సిరికొండలో 30 క్వింటాళ్లు..ఆంధ్రప్రదేశ్ నుంచి సిరికొండ మండలానికి జొన్నలను అక్రమంగా లారీలో తరలిస్తుండగా స్థానిక పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్సై శ్రీసాయి తెలిపిన ప్రకారం వివరాలు.. మండలంలోని రాంపూర్(బి) గ్రామానికి జొన్నల లోడుతో వచ్చిన లారీని ముందస్తు సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా కావలి నుంచి 30 క్వింటాళ్ల జొన్నలను తీసుకొచ్చినట్లు గుర్తించారు. అయితే వీటిని ఎవరు తీసుకొచ్చారు.. ఎందుకు తీసుకొచ్చారు వంటి సమాధానాలు సదరు డ్రైవర్ పేర్కొనకపోవడం గమనార్హం. రెవెన్యూ అధికారుల పంచనామా అనంతరం పట్టుబడిన లారీని స్టేషన్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
యువకవుల సమ్మేళనం పోస్టర్ల విడుదల
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే యువ కవుల సమ్మేళనం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సోమవారం ఆయన నివాసంలో విడుదల చేశారు. జాగృతి నాయకులు ఐద ప్రశాంత్ మాట్లాడుతూ జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెలంగాణ యువ కెరటాలు శీర్షికతో కల్వకుంట్ల కవిత అధ్యక్షతన హైదరాబాద్ తెలంగాణ సరస్వతి పరిషత్లో ఉదయం 10 గంటల నుంచి తెలంగాణ అస్తిత్వం, తాత్వికత, జీవన విధానం చరిత్ర, భాష, సంస్కృతి, ఉద్యమం అనే అంశాలపై యువ కవులకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు మే 26లోపు మెయిల్(kavitha.telangana@gmail.com)కు పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పడాల రవీందర్, పుల్లూరి మౌనిక, రాకేశ్, బిల్లా మారుతి, గడ్డం మహేశ్, తోట రంజిత్, వికాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో కార్మికుడికి గాయాలు బెల్లంపల్లి: బెల్లంపల్లి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. టూటౌన్ ఎస్సై కే.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి ఏరియా కాసిపేటగనిలో కోల్ కట్టర్ బానోత్ పృథ్విరాజ్ ఆదివారం మధ్యాహ్నం మోటార్సైకిల్పై తాండూర్కు వెళ్లాడు. అక్కడి నుంచి మందమర్రికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో బైపాస్ రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ ముందు ఎదురుగా ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. పృథ్విరాజ్ కాలు పాదం వద్ద నుజ్జునుజ్జయింది. స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు, అక్కడి నుంచి సోమవారం హైదరా బాద్కు తరలించారు. బాఽధితుడి భార్య దివ్య ఫిర్యా దు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. -
కేజీబీవీల్లో మౌలిక వసతులు
● ఉమ్మడి జిల్లాకు రూ.7.31 కోట్లు ● పునఃప్రారంభంలోపు పనులు పూర్తి మంచిర్యాలఅర్బన్: పేద, వెనుకబడిన, మధ్యలో బడిమానేసిన బాలికలకు విద్యనందించేందుకు ఏర్పాటు చేసిన కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) బాగుకు ప్రభుత్వం నడుం బిగించింది. నాణ్యమైన విద్య వసతులు అందించడమే లక్ష్యంగా విద్యాలయాలు నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగుపరిచి భవిష్యత్కు బాటలు వేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.7,31,19,400 మంజూరు చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రత్యేక అధికారులు, టీజీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల సమన్వయంతో మౌలిక సదుపాయాల ఆధారంగా ప్రాధాన్యత ప్రాతిపదికన పనులు, మరమ్మతులు గుర్తించనున్నారు. విద్యాలయాల పునఃప్రారంభంలోపు అన్ని పునరుద్ధరణ, మరమ్మతు పనులను పూర్తి చేయాలని ఉత్తర్వులు రావడంతో అధికారులు పనుల వేగవంతానికి చర్యలు చేపట్టారు. మంచిర్యాల జిల్లాలో.. మంచిర్యాల జిల్లాలో 18 కేజీబీవీలు ఉన్నాయి. మూడింట్లో పదో తరగతి, 15 చోట్ల ఇంటర్మీడియెట్ వరకు తరగతులు కొనసాగతున్నాయి. ఇదివరకు 4,589 మంది బాలికలు అభ్యసిస్తున్నారు. ఇటీవల ఐదు కేజీబీవీల్లో ఇంటర్ తరగతుల నిర్వహణకు అ నుమతులు ఇచ్చారు. రెండు చోట్ల రెండు, మూడు చోట్ల ఒకే కోర్సులో ప్రవేశాలకు అవకాశం కల్పించా రు. గదుల కొరత, సౌకర్యాల లేమి నేపథ్యంలో వి ద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పనులు చేపట్టనున్నారు. ఒక్కో కేజీబీవీకి రూ.4లక్షల నుంచి రూ.31లక్షల వరకు నిధులు మంజూరు కావడం ఊరటనిస్తోంది. చేపట్టనున్న పనులు ఇవే..ఆయా కేజీబీవీల్లో ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టనున్నారు. అంచనా వేసిన, గుర్తించిన పనులు సాగనున్నాయి. అదనపు మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మాణం, అదనపు వసతిగృహాల నిర్మా ణం, అదనపు కిచెన్ షెడ్ల నిర్మాణం, క్రీడా కోర్టుల ని ర్మాణం, సెప్టిక్ ట్యాంకుల ఏర్పాటు, డ్రైనేజీ అవుట్ లెట్ల ఏర్పాటు, సోలార్ ప్యానెల్స్, ఆర్వో ప్లాంట్ల సంస్థాపన, విద్యుత్ వైరింగ్, సానిటరీ ఫిక్చర్స్, ఫిట్టింగుల పూర్తి, ఇతర ముఖ్యమైన సివిల్ లేదా ఎలక్ట్రికల్ పనులు, అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయనుండడంతో దిశ మారనుంది.ఉమ్మడి జిల్లాలో.. జిల్లా నిధులు మంజూరు మంచిర్యాల రూ.2,59,31,600 ఆదిలాబాద్ రూ.1,83,64,200 కుమరంభీం ఆసిఫాబాద్ రూ.1,46,52,800 నిర్మల్ రూ.1,41,70,800 -
గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఏఎస్పీ రాజేశ్మీనా నిర్మల్టౌన్: నిర్మల్లో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్టు ఏఎస్పీ రాజేశ్మీనా తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో సోమవారం వివరాలను వెల్లడించారు. నిర్మల్ కు చెందిన కషప్ సాయిప్రసాద్, పుట్ట శివకుమార్, షేక్ ముక్తార్ మౌలాన్, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉప్పు రాజ్కుమార్ గంజాయి అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఈ మేరకు మహారాష్ట్రలోని కిన్వట్కు చెందిన గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయిని తక్కువ రేటుకు తీసుకువచ్చి, నిర్మల్లో ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు ఏఎస్పీ రాజేశ్మీనా ఆధ్వర్యంలో పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ స్థానిక బైల్ బజార్లో సోమవారం గంజాయి విక్రయిస్తున్న ఈ నాలుగురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 1,200 గ్రాముల గంజాయి, ఒక ఆటో, స్కూటీ, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఇందులో పట్టణ సీఐ ప్రవీణ్కుమార్, కానిస్టేబుళ్లు వినయ్, అవినాష్ పాల్గొన్నారు. -
ఊర చెరువును కాపాడండి..
లక్సెట్టిపేట మండలం వెంకట్రావ్పేట ఊరచెరువు కబ్జాకు గురువుతోంది. వందల ట్రాక్టర్ల మొరం, మట్టి నింపుతూ కొందరు ఆక్రమించుకుంటున్నారు. చెరువు మట్టి శిఖం భూమిలో పోస్తూ ఆక్రమిస్తున్నారు. గతేడాది ఇలానే కొందరు ఆక్రమించుకోగా మైనర్ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రతియేటా కబ్జా కారణంగా చెరువుపై ఉపాధి పొందుతున్న మత్య్సపారిశ్రామిక సంఘానికి చెందిన 150 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. విచారణ చేపట్టి చర్యలు తీసుకుని చెరువును రక్షించాలి. – మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు, గ్రామం: వెంకట్రావ్పేట, మం: లక్సెట్టిపేట -
నేడు మంత్రి ‘పొంగులేటి’ రాక
భీమారం: భూభారతి చట్టంపై మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవా రం నిర్వహించనున్న అవగాహన సదస్సుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా స్రెడ్డి హాజరు కానున్నారు. సదస్సు నిర్వహించే పాఠశాల ప్రాంగణాన్ని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీ పక్, డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వ ర్లు, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావు, డీఆ ర్డీవో కిషన్ సోమవారం వేర్వేరుగా సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. సదస్సుకు హాజ రయ్యే రైతులకు మంచినీటితోపాటు మజ్జిగ అందజేయనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఎస్టీపీపీలో హెలిప్యాడ్ పరిశీలన జైపూర్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంగళవారం జిల్లా పర్యటన నేపథ్యంలో స్థానిక ఎస్టీపీపీలోని హెలిప్యాడ్ స్థలాన్ని సోమవారం కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఉదయం 9:50గంటలకు ప్లాంటుకు హెలికాప్టర్ ద్వారా చేరుకుని ఇక్కడి నుంచి రోడ్డుమార్గంలో భీమారం వెళ్తారు. -
నకిలీ, నిషేధిత విత్తనాలు అరికట్టాలి
● క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: నకిలీ, నిషేధిత విత్తనాల రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జి ల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం క లెక్టరేట్ సమావేశ మందిరంలో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కల్పనతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతీ దుకాణంలో నిల్వలు, ధరల పట్టిక ప్రదర్శించాలని తెలిపారు. ప్రత్యే క నిఘా ఏర్పాటు చేసి నకిలీ విత్తన విక్రయదారుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ నకిలీ, నిషే ధిత విత్తనాల నిల్వ, సరఫరా కేంద్రాలను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్య వసాయ విస్తరణాధికారులు, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. పకడ్బందీగా సదస్సు ఏర్పాట్లు మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 20న భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే భూభారతి సదస్సుకు మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరవుతున్నార ని, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుమా ర్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అదన పు కలెక్టర్ మోతీలాల్తో కలిసి అధికారులతో ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. -
వంతెన.. తీరని చింత!
త్వరగా నిర్మిస్తే మేలుజిల్లాలో పారిశ్రామిక, ఉపాధి రంగాలు మెరుగపడాలంటే మెరుగైన రోడ్డు రవాణా వ్యవస్థ ఉంటే మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో ఎన్హెచ్–363, 63 అందుబాటులోకి వచ్చాయి. లక్సెట్టిపేట, మంచిర్యాల మధ్య విస్తరించాల్సి ఉండగా, ఇటీవల అన్ని అనుమతులు వచ్చాయి. ఇక జైపూర్ మీదుగా వరంగల్ను కలిపే ఎన్హెచ్–163జీ సైతం నిర్మాణం సాగుతోంది. ఈ క్రమంలో గోదావరిపై మరో వంతెన నిర్మిస్తే, జిల్లాలో ఐటీ, పారిశ్రామిక పార్కు, బసంత్నగర్ ఎయిర్పోర్టుకు అనుసంధానంగా మారనుంది. అంతేకాక పర్యాటకంగానూ మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గోదావరినదిపై రోడ్డు బ్రిడ్జి నిర్మాణ పనులు ఈ వేసవిలోనూ మొదలయ్యేలా కనిపించడం లేదు. ఏళ్లుగా మంచిర్యాల నగరాన్ని గోదావరి అవతలి వైపు ఉన్న పెద్దపల్లి జిల్లా అంతర్గాం, రామగుండం, ఎన్టీపీసీ ప్రాంతాలతో చేరువ చేసేందుకు వంతెన నిర్మించాలనే డిమాండ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఇందారం బ్రిడ్జితో దూరభారంతోపాటు భవిష్యత్లో రోడ్డు ట్రాఫిక్ మరింత పెరిగితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పారిశ్రామిక కారిడార్గా ఉన్న కోల్, పవర్ సిటీలుగా ఉన్న ఎన్టీపీసీ, మంచిర్యాల ప్రాంతాలను కలిపేలా గోదావరిపై మరో వంతెన ఆవశ్యకత ఏర్పడింది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ మార్గంతో ప్రజల రవాణా సులభతరం కానుంది. గత కొంతకాలంగా కొత్త వంతెన నిర్మాణం ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. నిర్మాణంలో తీవ్ర జాప్యం గత ఏడేళ్లుగా ఈ వంతెన నిర్మాణంలో జాప్యం జరుగుతుండగా, ఇప్పటికీ ఎక్కడ నిర్మిస్తారనే స్పష్టత రావడం లేదు. 2018 ఫిబ్రవరిలో జిల్లా పర్యటనకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జిపై హామీ ఇచ్చారు. ఆ మేరకు గోదావరిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి మొదట రూ.125కోట్లు అవసరమని అధికారులు అంచనా వేయగా, పరిపాలన అనుమతులు వచ్చాయి. ‘ప్లాన్ ఫర్ వర్క్’ కింద నిధులు కూడా మంజూరు అయ్యాయి. టెండర్లు ఖరారులో తీవ్ర జాప్యం జరిగింది. చివరకు ఓ కాంట్రాక్టు సంస్థ పనులు దక్కించుకుంది. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవ సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ పనులు లాంఛనంగా ప్రారంభించారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలతో జాప్యం జరిగింది. ఆ సమయంలోనే నదిలో వంతెన నిర్మాణం కోసం ప్రాథమిక పరీక్షలు చేశారు. గోదావరి పుష్కరఘాట్ వద్ద నేల స్వభావం, పిల్లర్లు, సామర్థ్యం తదితర ఇంజనీరింగ్ పనులు జరిగాయి. తర్వాత కాంట్రాక్టరు పనులు నిలిపివేశారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డాక ఆ వంతెన పనులను పూర్తిగా పక్కకు పె ట్టింది. ఆ తర్వాత మంజూరు చేసిన వంతెనను పూ ర్తిగా రద్దు చేస్తూ మరో చోట కొత్త నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు ముల్కల పరిధిలో నూతన బ్రిడ్జి నిర్మించి, ఎన్హెచ్–63 కలిపేలా నిర్మిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు స్థల పరిశీలన చేశారు. ఇప్పటికీ అధికారికంగా వంతెన నిర్మాణంపై ప్రకటన రాలేదు. దీంతో కొత్త వంతెన నిర్మాణంలో మరింత జాప్యం అయ్యేలా కనిపిస్తోంది. గోదావరిపై బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం ఈ వేసవిలోనూ మొదలు కాని పనులు ఏడేళ్లుగా స్థానికుల నిరీక్షణ -
కాలితో పరీక్ష రాసిన శంకర్
బెల్లంపల్లి: ఆత్మస్థైర్యం ముందు అంగవైకల్యం చిన్నబోయింది. రెండు చేతులు లేకపోయినా కాలితో పరీక్ష రాసి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాడు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కా కతీయ యూనివర్సిటీ డిగ్రీ వార్షిక పరీక్షలు జ రుగుతున్నాయి. బీకాం కంప్యూటర్స్ ఫైనలియ ర్ విద్యార్థి నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన ఎల్లూరి శంకర్ సోమవారం తెలు గు పరీక్షకు హాజరయ్యాడు. చిన్నతనంలో వి ద్యుత్ షాక్తో రెండు చేతులూ కోల్పోయాడు. అయినా చదువుపై పట్టుదల ఏమాత్రం సడలలేదు. అంగవైకల్యం ఎంత బాధిస్తున్నా మనో నిబ్బరంతో ముందుకు సాగుతున్నాడు. పరీక్షల్లో సహచరులతో సమానంగా బెంచీపై కూ ర్చుని కాలి వేళ్లతో పెన్నును అదిమిపట్టి పరీక్ష రాసి ఆత్మవిశ్వాసాన్ని చాటాడు. పరీక్ష రాయడానికి స్క్రైబ్ను పెట్టుకునే అవకాశాలు ఉన్నా కాలి వేళ్లతో రాయడానికే మొగ్గు చూపాడు. -
● జిల్లాలో భారీ సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ● అగ్ని ప్రమాదాలు జరిగితే తప్పించుకునేదెలా..? ● నిబంధనలు పాటించని యజమానులు ● అగ్నిమాపక శాఖ అధికారులకు ‘మామూలే..’
మంచిర్యాలక్రైం: జిల్లాలోని బహుళ అంతస్తుల భవనాల్లో ఫైర్సేఫ్టీ నిబంధనల ఉల్లంఘన భద్రతకు ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్హౌస్లో అగ్నిప్రమాదం ఘటనతో జిల్లాలోని భవనాల్లో మనమెంత వరకు భద్రమనే సందేహాం తలెత్తుతోంది. గుల్జార్హౌస్ ఘటనలో 17 మంది మృతిచెందడం జిల్లా ప్రజలనూ కలిచివేస్తోంది. జిల్లాలో బహుళ అంతస్తుల భవనాలు, భ వన నిర్మాణాల సంఖ్య కాలక్రమేణా పెరుగుతోంది. గతంలో రెండు మూడంతస్తుల వరకు నిర్మాణాలు ఉన్న స్థలాల్లో అభివృద్ధిలో భాగంగా భారీ భవనా లు నిర్మాణం అవుతున్నాయి. అభివృద్ధి పరంగా అ వసరమే అయినా పౌరుల ప్రాణాలతో ముడిపడి ఉ న్న అగ్నిమాపక చర్యలను విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది. ఫైర్సేఫ్టీ సర్వీస్ యాక్ట్–1999 సెక్షన్–13 ప్రకారం విద్యాసంస్థలు, భవనాలు, ఫంక్షన్హాళ్లు, ఆస్పత్రులకు మాత్రమే నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇచ్చే అధికారం మున్సిపల్ కమిషనర్కు ఉంది. ఇతర నిర్మాణాలకు ఎన్వోసీ జారీ బాధ్యత రాష్ట్ర విపత్తు నిర్వహణ, ఫైర్ సర్వీసెస్ విభాగానికే ఉంటుంది. నిబంధనల ప్రకారం 15మీటర్ల కంటే ఎత్తు ఉన్న నివాస, 18మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న వాణిజ్య నిర్మాణాలకు ఫైర్సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరి. గోదాములు, సినిమా థియేటర్లు, ఇతర నివాసేతర నిర్మాణాల్లోనూ అగ్నిమాపక చర్యలు అవసరం. మున్సిపల్కు సంబంధించిన ఫైర్సేఫ్టీ ఏర్పాట్ల పరిశీలనలు తమ పరిధిలోకి రావంటూ అగ్నిమాపక అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. ఫైర్ సర్వీసెస్ విభాగామూ అంతగా శ్రద్థ చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో అగ్ని ప్రమాదాల్లో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. ఇదివరకు మున్సిపల్, అగ్నిమాపక శాఖ అధికారులు హడావుడి చేసి ఫైర్సేఫ్టీ నిబంధనలు పాటించని షాపింగ్మాల్స్, షోరూమ్లు, బహుళ అంతస్తుల భవన యజమానులకు నోటీసులు జారీ చేసి చేతులు దులిపేసుకున్నారు. జిల్లాలో 90శాతం బహుళ అంతస్తుల భవనాలకు ఫైర్సేఫ్టీ అనుమతులు లేకపోవడం గమనార్హం. అనుమతుల తీరిదీ.. జిల్లాలో 150కి పైగా ప్రైవేటు ఆస్పత్రులు ఉండగా.. ఐదింటికే ఫైర్సేఫ్టీ అనుమతులు ఉన్నాయి. జూనియర్, డిగ్రీ కళాశాలలు 35 ఉండగా.. నాలుగు కళాశాలలకు, 155 పాఠశాలల్లో 20 స్కూళ్లకు అనుమతులు ఉన్నాయి. పేరున్న షాపింగ్మాల్స్ 27 ఉండగా ఒక్క దానికీ అనుమతి లేదు. ఆరు సినిమా థియేటర్లకు అనుమతి ఉండగా.. మూడేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నోటీసులు జారీ చేసినా రెన్యూవల్ చేసుకోవడం లేదని ఫైర్ అధికారులు చెబుతున్నారు. 27లాడ్జీలు, 20 ఫంక్షన్ హాళ్లలో ఒక్కదానికీ అనుమతి లేకపోవడం గమనార్హం. నిబంధనలు శూన్యం నిబంధనల ప్రకారం 500 చదరపు మీటర్ల నిర్మాణ విస్తీర్ణం లేదా ఆరు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉ న్న ఆస్పత్రులు, విద్యాసంస్థలు, వ్యాపార సముదా యాలకు ఫైర్సేఫ్టీ ప్రమాణాలు తప్పనిసరి. ఆయా ఏర్పాట్లను పరిశీలించి మున్సిపల్ అధికారులు ఎన్వోసీ జారీ చేయాలి. వాటి ఆధారంగా భవనాలకు నివాసయోగ్యత(ఓసీ) పత్రం ఇస్తారు. కానీ జిల్లాలో ఎక్కడా అగ్నిమాపక చర్యలు లేకపోవడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భవనం చు ట్టూ ఏడు మీటర్ల సెట్బ్యాక్లు ఉంటేనే ఎన్వోసీ ఇ వ్వాలి. ఆ స్థాయిలో సెట్బ్యాక్లు ఉన్న వ్యాపార స ముదాయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, బహు ళ అంతస్తుల భవనాలు జిల్లాలో 20శాతం కంటే తక్కువే ఉన్నాయి. ఫైర్సేఫ్టీ లేని భవనాల్లో అగ్నిప్రమాదం జరిగితే సురక్షితంగా బయటపడడం ఎంతవరకు సాధ్యం అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సిబ్బంది కొరత జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, జన్నా రం ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ఒక జిల్లా అధికారితో కలిపి 65 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా 46 మంది మాత్రమే ఉన్నారు. 18 పోస్టులు ఖాళీ ఉన్నాయి. పైగా ఫైర్స్టేషన్ నిర్వహణ, శుభ్రత, పరిశుభ్రత ఏర్పాట్లు సైతం సిబ్బంది చూసుకోవాలి. ఒక చోట ప్రమాదం జరిగితే మరో చోటికి మరో బృందం వెళ్లేందుకు సిబ్బంది కొరతతోపాటు ఫైరింజన్లు సైతం ఒక్కొక్కటే ఉండడం వల్ల తిప్పలు తప్పడం లేదు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో మంటలు ఆర్పేందుకు నాలుగు ఫైరింజన్లు వినియోగించాల్సి వచ్చింది. అయినా నయాపైసా విలువ చేసే ఆస్తిని కాపాడలేకపోవడం గమనార్హం.నిబంధనలు పాటించని వారిపై చర్యలుఫైర్ నిబంధనలు పా టించని వారికి నోటీసులు జారీ చేశాం. త్వరలో వ్యాపార స ముదాయాలు, వి ద్యాసంస్థలు, ఫంక్షన్హాళ్లు, బహుళ అంతస్తుల భవనాలను పర్యవేక్షించి ఫైర్ నిబంధనలపై యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తాం. కొందరు ఫైర్ అనుమతులు తీసుకున్న వారు రెన్యూవల్ చేసుకోవడం లేదు. వారికి నోటీసులు జారీ చేస్తాం. జిల్లాలో చాలా ఫంక్షన్ హాళ్లు, విద్యాసంస్థలు, ప్రైవేటు ఆసుపత్రులు, వ్యాపార సముదాయాలకు ఫైర్ అనుమతులు లేవు. వారికి నోటీసులు జారీ చేశాం. అనుమతులు లేని వాటిపై చర్యలు తీసుకుంటాం. – భగవాన్రెడ్డి, జిల్లా ఫైర్ అధికారినిబంధనలు ఏం చెబుతున్నాయి నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనల ప్రకారం భవనాల్లో అగ్ని ప్రమాదాలు నియంత్రించే పరికరాలు ఏర్పాటు చేయాలి. భవంతులకు ఎయిర్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫైర్ సర్వీసెస్ విభాగాల నుంచి విధిగా నిరభ్యంతర ప్రతాలు తీసుకోవాలి. భారీ/నివాస భవంతులపై 25వేల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి వీటికి అనుసంధానంగా నిమిషానికి 900లీటర్ల నీటిని పంప్ చేసే బూస్టర్ పంపులు ఏర్పాటు చేసుకోవాలి. హౌస్ రీల్, ఆలారం, మంటలు ఆర్పే ఫోమ్ అందుబాటులో ఉంచాలి. ఐదంతస్తులతోపాటు సెల్లార్ ఉన్న భవంతుల్లో స్ప్రింక్లర్లు అందుబాటులో ఉంచాలి. భారీ భవనాల చుట్టూ ఫైరింజన్ తిరిగేందుకు అనువుగా ఉండాలి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు త్వరగా బయటకు వెళ్లేందుకు వీలుగా దారులు ఉండాలి. -
అవినీతి నిరోధానికి సహకరించాలి
● ఏసీబీ డైరెక్టర్ తరుణ్జోషి ● సీసీసీ నస్పూర్లో ఏసీబీ కార్యాలయం ప్రారంభంనస్పూర్: అవినీతి నిరోధానికి ప్రజలు సహకారం అందించాలని ఏసీబీ డైరెక్టర్ తరుణ్జోషి అన్నారు. సీసీసీ నస్పూర్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతి అధికారులపై ఫిర్యాదు చేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. గత పదేళ్ల కేసులను పరిశీలిస్తే మంచిర్యాల ప్రాంతం నుంచే ఫిర్యాదులు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో ఏసీబీ కార్యాలయాన్ని ప్రారంభించామని అన్నారు. తనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో అనుబంధం ఉందని, విస్తీర్ణంలో జిల్లా చాలా పెద్దదని తెలిపారు. ఇక్కడ డీఎస్పీ స్థాయి అధికారి అందుబాటులో ఉంటారని, నిర్మల్, ఆదిలాబాద్ ప్రజల సౌకర్యార్థం ఆదిలాబాద్లో ఉన్న కార్యాలయంలో సేవలు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రంలో 10 రేంజ్లు ఉన్నాయని, వాటి పరిధిలో నమోదైన ప్రతీ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, 80శాతం కేసుల్లో నేరం రుజువై అవినీతి అధికారులకు శిక్ష పడిందని తెలిపారు. నేరుగా ఫిర్యాదు చేయడంలో ఇబ్బందులుంటే 1064 టోల్ ఫ్రీ నంబర్ లేదా ఏసీబీ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రాజేశ్ మురళి, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్, ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్, కరీంనగర్ ఏసీబీ కోర్టు పీపీ జ్యోతి, శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం శ్రీనివాస్, సీఐలు పాల్గొన్నారు. -
దరఖాస్తులు పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీ లాల్, ఆర్డీవో హరికృష్ణలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికా రులు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ● సింగరేణి ఓపెన్కాస్టులో భూమి కోల్పోయిన తనకు నష్ట పరిహారం ఇప్పించాలని నస్పూర్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన అక్కపురం రాజయ్య దరఖాస్తు అందజేశాడు. ● ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేయాలని బెల్లంపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన కామెర లక్ష్మి, మేస్త్రి కీర్తిమాల కోరారు. ● తన భూమి ఆక్రమణకు గురవుతోందని, విచారణ జరిపి న్యాయం చేయాలని హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన తిప్పని సాయితేజ, జాతీయ రహదారి నిర్మాణంలో భూమి కోల్పోతున్న తన పేరు బాధితుల జాబితాలో నమోదు చేయాలని లక్సెట్టిపేట మండల కేంద్రానికి చెందిన గొల్లపల్లి మేఘన విన్నవించారు. ● మందమర్రి శివారులో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని, హద్దు ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ కోరారు. ● తన భర్త తిరుపతి గత ఏడాది మే 29న వడదెబ్బతో మృతిచెందాడని, ఆపద్బంధు పథకం వ ర్తించేలా చూడాలని కన్నెపల్లి మండలం ఖాజిపల్లి గ్రామానికి చెందిన తోట శ్రీలత కోరింది. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజావాణిలో అర్జీల స్వీకరణ -
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
పాతమంచిర్యాల: జిల్లాలోని లక్షెట్టిపేట ప్రభు త్వ ఉన్నత పాఠశాల, కళాశాలలో మౌలిక వ సతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాల ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుతో కలిసి ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారులు, ప్రిన్సిపాల్లతో సమావేశం ని ర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యావ్యవస్థ బలోపేతానికి జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో నూతనంగా ఉన్నత పాఠశా ల, కళాశాల నిర్మిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సకల సౌకర్యాల కల్పన, నాణ్యమైన విద్య అందించేందుకు ఫర్నిచర్, బోధన సా మగ్రి ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. పాతభవనంలోని పాఠశాలలో 126 మంది, జూనియర్ కళాశాలలో 320 మంది విద్యార్థులు ఉన్నారని, వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగేలా అధ్యాపకులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
● కొనుగోలు కేంద్రాల్లో నిలిచిన నీరు ● వరదలో కొట్టుకుపోయిన వడ్లు చెన్నూర్రూరల్/భీమిని/భీమారం/బెల్లంపల్లిరూరల్/మందమర్రిరూరల్/వేమనపల్లి: జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన అకాల వర్షానికి పలు మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసింది. అధికారులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. చెన్నూర్ మండలం కిష్టంపేట, లింగంపల్లి, సుందరసాల తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఒక్కసారిగా వర్షం కురిసే సరికి రైతులు ధాన్యంపై కవర్లు కప్పారు. అయినప్పటికీ ధాన్యం తడిసిపోయింది. కల్లాల్లోనూ నిల్వ ఉంచిన ధాన్యం తడిసింది. భీమిని, కన్నెపల్లి మండలాల్లో ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి చేతికొచ్చిన ధాన్యం తడిసిపోకుండా రైతులు పడరాని కష్టాలు పడ్డారు. ● భీమారం మండలంలో వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో నీరు నిలిచి చెరువులా మారాయి. వరి ధాన్యం వరద నీటిలో ఉండిపోయింది. కొత్తగూడెం సమీపంలో ఆరబోసిన ధాన్యం వరద నీటికి కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు తెచ్చిన ధాన్యం సాయంత్రం వరకు ఆరబెట్టి ఇంటికి వెళ్లి పడుకున్నామని, అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువులా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలం వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. ● బెల్లంపల్లి మండలం మాలగురిజాల, చంద్రవెల్లి, బుచ్చయ్యపల్లి గ్రామాల్లో వరి ధాన్యం తడిసింది. ధాన్యంపై కవర్లు కప్పి తడవకుండా ఉండడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. త్వరగా కొనుగోలు చేసి మిల్లులకు తరలించి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ● మందమర్రి మండలం సారంగపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన, తూకం వేసిన బస్తాల్లోని ధాన్యం తడిసింది. గత 20రోజుల క్రితం తీసుకొచ్చి కేంద్రంలో ఆరబోస్తే ఇప్పటికే నాలుగైదుసార్లు కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొంత కొట్టుకుపోయింది. రెండ్రోజుల క్రితం బస్తాల్లో నింపి తూకం వేసి తరలించడానికి సిద్ధంగా ఉంచగా.. మళ్లీ తడిసింది. బస్తాల్లో నుంచి బయటకు తీసి ఆరబోయడంతో కష్టం వృథా అవుతోందని, హమాలీ చార్జీ రెట్టింపు అవుతున్నాయని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ కొనుగోలు కేంద్రం నుంచి 17లారీల ధాన్యం తరలించగా.. ఇంకా సుమారు 20లారీల ధాన్యం ఉంది. వర్షానికి తడిసిపోతోంది. ● వేమనపల్లి మండలంలో అకాల వర్షానికి రైతులు ఆగమాగం అయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో భారీగా ధాన్యపు రాశులు ఉండగా గాలులకు టార్పాలిన్ కవర్లు కొట్టుకుపోయాయి. వర్షానికి వడ్లు తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని ఆరబోసేందుకు పగలంతా రైతులు తంటాలు పడ్డారు. కోటపల్లిలో.. కోటపల్లి: మండలంలో శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోటపల్లి, సర్వాయిపేట కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకంలో ఆలస్యం కావడంతో తడిసి పోయింది. -
మళ్లీ రేషన్ దందా
● సన్న బియ్యమూ అమ్ముతుండ్రు ● దొడ్డు బియ్యం కంటే ధర పెంచి విక్రయం ● జిల్లా దాటుతున్న క్వింటాళ్ల కొద్దీ సన్నబియ్యంసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్ధిదారులు దొడ్డు బియ్యం వినియోగించడం లేదని రూ.కోట్లు వెచ్చించి సర్కారు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అయినా దొడ్డు బియ్యం తరహాలోనే మళ్లీ పాత దందానే మొదలైంది. గత నెలలో సన్న బియ్యం పంపిణీ మొదలు కాగా.. ఆ నెల కాస్త అక్రమ రవాణా తగ్గింది. రెండో నెల నుంచే దళారులు రంగ ప్రవేశం చేసి నల్ల బజారుకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఫలితంగా క్వింటాళ్ల కొద్దీ సన్న బియ్యం పక్కదారి పడుతోంది. దొడ్డు బియ్యానికి కిలోకు రూ.10వరకు చెల్లిస్తే సన్న బియ్యానికి రూ.20పైనే చెల్లిస్తున్నారు. గత నెలలో తాండూర్ మండలం అచ్చలాపూర్లో రేషన్ బియ్యం అమ్ముకున్నారని 11మంది రేషన్కార్డులు రద్దు చేశారు. అయినప్పటికీ జిల్లా నుంచి పెద్దయెత్తున వందల క్వింటాళ్ల కొద్దీ జిల్లా నుంచి సన్నబియ్యం తరలిస్తూ పట్టుబడడం గమనార్హం. పాత కథేనా..!జిల్లా నుంచి దొడ్డు బియ్యం ప్రతీ నెల వందల క్వింటాళ్లు నల్లబజారుకు తరలిపోయేది. దళారులు, మధ్యవర్తులతో రూ.లక్షల్లో వ్యాపారం నడిచేది. రోడ్డు, రైలు మార్గాల్లో మహారాష్ట్రకు రవాణా జరిగేది. తాజాగా పట్టుబడినవి పెద్దపల్లి జిల్లా గుండా వరంగల్కు తీసుకెళ్లడంతో అటువైపు ఎందుకు తీసుకెళ్తున్నారనేది స్పష్టత రావాల్సి ఉంది. టాస్క్ఫోర్స్ అధికారులు విచారణ సందర్భంగా శుక్రవారం హాజీపూర్ తదితర మండలాల్లో రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ, ఎన్ఫోర్స్మెంటు, టాస్క్ఫోర్స్ బృందాలు ఉన్నప్పటికీ లబ్ధిదారులే బియ్యం అమ్ముకోవడంతో గతంలో మాదిరిగా పాత కథే నడుస్తోంది. ప్రభుత్వం సన్న బియ్యం అక్రమాలను తీవ్రంగా పరిగణిస్తున్నప్పటికీ జిల్లాలో దందా మాత్రం ఆగడం లేదు.జిల్లాలో రేషన్ వివరాలు (మే నెల)వారం వ్యవధిలో 266క్వింటాళ్లుఈ నెల 14న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో 211.50క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. లక్షెట్టిపేట మీదుగా వరంగల్కు ఓ లారీలో తరలిస్తుండగా పట్టుడ్డాయి. హసన్పర్తికి చెందిన ఓ వ్యక్తితో కలసి లక్షెట్టిపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమ మార్గాల్లో తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ బియ్యం హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో గ్రామాల నుంచి సేకరించినట్లు సమాచారం. ఈ బియ్యంలో కొన్ని గన్నీ సంచుల్లోనే ఉండడంతో రేషన్ డీలర్లు, లేక గోదాం నుంచే తరలించారా? అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నెల 9న జిల్లా కేంద్రంలో 108బ బస్తాల్లో 55క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను రిమాండ్ చేశారు. పట్టుబడిన బియ్యాన్ని స్థానిక ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు. ఈ ఇద్దరు జిల్లా కేంద్రం, నస్పూర్, శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల నుంచి లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం.బియ్యం కేటాయింపు 4,313.91మెట్రిక్ టన్నులు -
డిగ్రీ విద్యార్థిని..
మందమర్రిరూరల్: ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మామిడిగట్టు గ్రామానికి చెందిన దుర్గం సాత్విక (19) మంచిర్యాలలోని సీవీ రామన్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శని వారం పరీక్షకు వెళ్లి ఇంటికి వచ్చింది. సాయంత్రం నల్లా వస్తుండడంతో చెప్పేందుకు వెళ్లగా తలుపు మూసి ఉంది. సందులోంచి చూడగా దూలానికి ఉ రేసుకుని కనిపించింది. ఇదిలా ఉండగా శుక్రవారం సాత్విక తండ్రి వెంకటేష్ విష రసాయనం సేవించగా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శనివారం సాత్విక తన తండ్రిని చూసి వచ్చినట్టు సమాచారం. మృతికి కారణలు ఇంకా తెలియరాలేదు. ఈ విషయమై రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ను సంప్రదించగా ఇంకా ఫిర్యాదు అందలేదన్నారు. -
వయోజన విద్యకు ‘ఉల్లాస్’
● నవభారత సాక్షరతకు శ్రీకారం ● జూన్ నుంచి అమలుకు కార్యాచరణదండేపల్లి: సంపూర్ణ అక్షరాస్యత సాధనకు కేంద్రం నూతన విద్యావిధానం–2020లో భాగంగా నవ భారత సాక్షరత(న్యూ ఇండియా లిటరసీ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో సాక్షర భారత్ అమలు చేయగా.. దాని స్థానంలో నవ భారత సాక్షరత తీసుకొచ్చింది. దీని అమలుకు గాను ఉల్లాస్(అండర్ స్టాండింగ్ లైఫ్లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆన్ ది సొసైటీ) యాప్ను రూపొందించింది. కార్యకలా పాలన్నీ యాప్ ద్వారా కొనసాగనున్నాయి. 15ఏళ్లు పైబడిన వయోజనుల్లో, ముఖ్యంగా మహిళల్లో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరజ్ఞానం కల్పించడంతో పాటు డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించి తిరిగి ఓపెన్ టెన్త్, ఇంటర్లో చేర్పించడం దీని ముఖ్యోద్దేశం. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో వయోజన విద్య, స మగ్ర శిక్షా, ఓపెన్ స్కూల్, సెర్ప్ ఆధ్వర్యంలో అమలు చేస్తారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా సర్వేచేసి వచ్చే జూన్ నుంచి ప్రారంభానికి కసరత్తు చేస్తున్నారు. జిల్లా, మండల కమిటీలునవ భారత సాక్షరత కార్యక్రమ నిర్వహణకు జిల్లా, మండల కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా కమిటీలో చైర్మన్గా కలెక్టర్, కన్వీనర్గా డీఈవో, డీపీవో, సీపీవో, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా, మండల కమిటీలో చైర్మన్గా ఎంపీడీవో, ఎంఈవో, ఎంపిక చేసిన హెచ్ఎం, సీఆర్పీలు సభ్యులుగా కొనసాగుతారు. కార్యాచరణ ఇలా..● నవభారత సాక్షరతకు కేంద్రం తీసుకొచ్చిన ‘ఉల్లాస్’ అనే ప్రత్యేక యాప్లో నిరక్షరాస్యుల వివరాలు పొందుపరుస్తారు. ● ప్రస్తుతం మ్యాచ్ అండ్ బ్యాచ్ కార్యక్రమం కొనసాగుతోంది. దీనిద్వారా ఒక్కో వాలంటీర్కు 10 మంది బ్యాచ్ చొప్పున ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. దీనిని ఈ నెల 25లోగా పూర్తి చేస్తారు. ● జిల్లాలో 1,16,780 మంది నిరక్షరాస్యులు ఉండగా, అందులో వంద రోజుల కార్యక్రమంలో 30,636 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు. ● మహిళా సంఘాల సభ్యుల్లో నిరక్షరాస్యుల వివరాలను సెర్ప్ ద్వారా తెలుసుకుంటున్నారు. ● పూర్తి నిరక్షరాస్యులకు చదవడం, రాయడం నేర్పించి అక్షర జ్ఞానం కల్పిస్తారు. పదో తరగతిలోపు చదువు మానేసిన వారిని ఓపెన్ టెన్త్, పది తర్వాత మానేసిన వారిని ఓపెన్ ఇంటర్లో చేర్పిస్తారు. ప్రత్యేక శిక్షణ నవభారత సాక్షరత కార్యక్రమాన్ని వచ్చే జూన్లో ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. జిల్లా, మండల కమిటీలు ఏర్పాటు చేశాం. మ్యాచ్ అండ్ బ్యాచ్ కార్యక్రమాన్ని ఈ నెల 25లోగా పూర్తి చేసి, త్వరలో ఉల్లాస్ యాప్పై ప్రత్యేక శిక్షణ ఇస్తాం. శిక్షణ పూర్తవగానే వివరాలు అందులో నమోదు చేస్తారు. – పురుషోత్తం నాయక్, జిల్లా వయోజన విద్యాధికారి -
కొడుకు అంత్యక్రియలకు వెళ్తూ తండ్రి మృతి
బెల్లంపల్లి: కొడుకు అంత్యక్రియలకు వెళ్తూ తండ్రి మృతి చెందిన సంఘటన బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు బెల్లంపల్లి మున్సిపాలిటీ నంబర్ 2 ఇంక్లైన్ బస్తీకి చెందిన బొమ్మ కుమార్ (60)కుమారుడు విజయ్కుమార్ (36) కొత్తగూడెంలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం విజయ్కుమార్ అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం రావడంతో కుమార్ కారులో కొత్తగూడెం బయలుదేరాడు. మార్గమధ్యలో గుండెపోటు రావడంతో కారులోనే మృతి చెందాడు. కుమారుడి కడచూపు కోసం వెళ్తూ తండ్రి కూడా తిరిగిరాని లోకానికి వెళ్లడం అందరి హృదయాలను కలిచి వేసింది. ఒకరోజు వ్యవధిలో తండ్రీకొడుకు మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారుడి అంత్యక్రియలు కొత్తగూడెంలో, తండ్రి దహన సంస్కారాలు బెల్లంపల్లిలో నిర్వహించారు. టిప్పర్ ఢీకొని యువకుడు.. భైంసారూరల్: టిప్పర్ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ నైలు తెలిపిన వివరాల మేరకు కుభీర్ మండలంలోని సాంగ్వి గ్రామానికి చెందిన గంగాప్రసాద్ (21) శనివారం పనినిమిత్తం ద్విచక్ర వాహనంపై భైంసాకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో భైంసా–కుభీర్ ప్రధాన రహదారిపై మిర్జాపూర్ గ్రామ సమీపంలో టిప్పర్ ఢీ కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. 108లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్ల డించారు. విద్యుత్ షాక్తో వ్యక్తి ..కాసిపేట: మండలంలోని దేవాపూర్ అంగడి బజార్కు చెందిన మన్నే సాంసన్ ప్రశాంత్ కుమార్ (45) శుక్రవారం రాత్రి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. నీటి కోసం ఇంట్లోని బావివద్దకు వెళ్లి కరెంట్ స్వీచ్ ఆన్చేయగా నీళ్లు రాక పోవడంతో మోటర్కు కట్టిన జీఐ వైర్ను పట్టుకుని కదిలిస్తున్న క్రమంలో విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం మృతుని సోదరి మన్నే సలోమి ప్రియదర్శిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు ..నర్సాపూర్ (జి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండల కేంద్రానికి చెందిన అబ్దుల్ ఇర్ఫాన్ అలీ (38) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న ఇర్ఫాన్ అలీ ఈ నెల 7న లారీలో ధాన్యం లోడును లోకేశ్వరం మండలం రైస్మిల్లులో వదిలేసి ద్విచక్ర వాహనంపై నర్సాపూర్ (జి) వస్తుండగా అర్లి ఎక్స్ రోడ్ దాటిన తర్వాత 61వ జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి కిందపడడంతో గాయాలయ్యాయి. నిజామాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య అంజుం బేగం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శంకర్ తెలిపారు. -
మద్యానికి బానిసై ఒకరు..
ఇంద్రవెల్లి: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ఈ.సాయన్న తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని భీంనగర్కు చెందిన కాంబ్లే రాజు (46) కొంతకాలంగా మద్యానికి బాని య్యాడు. శుక్రవారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు మందలించారు. శనివారం ఉదయం ఓ రైతు పంటచేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన మేకల కాపరి గిరి దత్తాత్రేయ గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతుని భార్య కాంబ్లే లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బావిలోపడి యువకుడు..
సారంగపూర్: మద్యం మత్తులో బావిలోపడి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సల్ల శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు గోపాల్పేట్ గ్రామానికి చెందిన బర్కుంట రవి (30) శుక్రవారం మహబూబా ఘాట్స్ సమీపంలోని శేక్ సాహెబ్ దర్గా వద్ద బంధువులు చేసిన పండుగకు హాజరయ్యాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఘాట్స్ సమీపంలో వెతుకుతుండగా బావిలో మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
మహాప్రస్థానం నిర్మాణంలో అక్రమాలు
● రూ.4కోట్లతో నిర్మిస్తామని రూ.11కోట్లు బిల్లు ● మట్టి అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ● మాజీ ఎమ్మెల్యే ఎన్.దివాకర్రావు మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని మహాప్రస్థానం నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, రూ.4కోట్లతో నిర్మిస్తామని ప్రకటించి బిల్లును రూ.11కోట్లకు మార్చారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆరోపించారు. శనివారం దివాకర్రావు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు పాలనలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. మహాప్రస్థానం పేరుతో గోదావరినదిలో ఇసుక, మట్టిని మైనింగ్, ఇరిగేషన్ అధికారుల అనుమతి లేకుండానే అక్రమంగా తరలించారని విమర్శించారు. మట్టి తరలించే టిప్పర్ల యజమాని ఇసుక, మట్టి బయట అమ్ముకునే విధంగా, ఇతర చెరువుల మట్టిని అక్రమంగా అమ్ముకునే విధంగా ప్రోత్సహించి అధికారుల నుంచి ఇబ్బందులు లేకుండా సిఫారసు చేశారని ఆరోపించారు. మహాప్రస్థానంలో జరిగిన అవినీతి, అక్రమాలపై, సహకరించిన అధికారులపై విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. జిల్లాకు తలమానికమైన అంతర్గాం బ్రిడ్జి నిర్మాణాన్ని ఎమ్మెల్యే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో సీఎం కేసీఆర్ రూ.164 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేశారని, టెండర్, స్థల సేకరణ, ఒప్పందం పూర్తయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే బ్రిడ్జిని రద్దు చేయించి తాము తెచ్చిన నిధులను మళ్లించి లక్ష్మి టాకీస్ నుంచి రాళ్లవాగు మీదుగా పాత మంచిర్యాల ఆర్అండ్బీ రోడ్ వరకు మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన నిధులతో పనులు చేస్తూ తామే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. క్యాతన్పల్లి నుంచి ఐబీ వరకు రూ.35 కోట్లతో రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేస్తే అదే పని, అవే నిధులు పేరు మార్చి మళ్లీ శంకుస్థాపన చేశారని అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నిధులు మంజురు చేయించారని ప్రశ్నించారు. ప్రతీ పనికి కమీషన్లు తీసుకునే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ఒక్కరేనని ఆరోపించారు. ఆయన చెప్పిందే వేదం, ఆయనకు ఎవరైన ఎదురు మాట్లాడితే దాడులు చేయించడం ఆయన నైజమని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్కుమార్, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉత్తమ ప్లాంటేషన్ వాచర్గా సాయికిరణ్
జైపూర్: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్డీసీ)లో పనిచేస్తున్న ఎ.సాయికిరణ్ ఉత్తమ ప్లాంటేషన్ వాచర్గా ఎంపికయ్యాడు. టీజీఎఫ్డీసీ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో డివిజన్ల వారీగా ప్రకటించిన జాబితాలో కాగజ్నగర్ డివిజన్ మంచిర్యాల రేంజ్ నుంచి సాయికిరణ్ ఎంపికయ్యాడు. 10 సంవత్సరాలుగా ప్లాంటేషన్లను రక్షిస్తూ ఉత్తమ పనితీరు ప్రదర్శిస్తున్నందుకుగానూ ఈ అవార్డు అందుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాగజ్నగర్లో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ శ్రావణి చేతుల మీదుగా ప్రశంసపత్రంతో పాటు రూ.5వేల నగదు బహుమతి అందుకున్నారు. శని వారం మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ సురేశ్కుమార్, సిబ్బంది అభినందించారు. -
పాము కాటుతో మహిళ..
కౌటాల: మండలంలోని గుండాయిపేటకు చెందిన దుర్గం ప్రియత (26) శుక్రవారం రా త్రి పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై గుంపుల విజయ్ తెలిపారు. మృతురాలు ప్రియ త ఇంటి ఆవరణలో పనిచేస్తుండగా పాము కాటువేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సిర్పూర్(టి)లోని సామాజిక ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు కాగజ్నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. మృతదేహాన్ని శనివారం ఎస్సై పరిశీలించి పూర్తి వివరాలు సేకరించారు. మృతురాలి భర్త దుర్గం ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చలో.. చెన్నూర్!
● ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు నిలయం.. ● అగస్త్య మహాముని నడయాడిన నేల ● దుర్వాస మహర్షి కొలిచిన లక్ష్మీనారసింహుడు.. ● కోటి లింగాలు వెలిసిన గోదావరి తీరం.. ● తిలకించి.. పులకించాల్సిందే.. చెన్నూర్రూరల్: భక్తుల కొంగు బంగారంగా.. కోరిన కోర్కెలు తీర్చే ఆలయంగా పేరున్న శ్రీ మల్లికార్జునస్వామి ఆలయం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కత్తెరసాల గ్రామంలో ఉంది. చెన్నూర్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఎంతో ప్రాసస్త్యం ఉంది. అగస్త్య మహాముని ఇక్కడ శివపార్వతులకు పూజలు చేసే వారని పురాణంలో ఉంది. ఇక్కడ వెలిసిన మల్లికార్జున స్వామి, భ్రమరాంభిక విగ్రహాలకు కాకతీయ మహారాజులు పరిపాలించే కాలంలోనే ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబు తోంది. ఏటా మహా శివరాత్రి పర్వదినాన శివపార్వతుల కల్యాణం, మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. జాతరకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఒగ్గు పూజారులు ఒగ్గు కథలు, పట్నాలతో మల్లన్న స్వామికి బోనాలు సమర్పిస్తారు. ఏడాది పొడవునా ప్రతీ బుధ, ఆది వారాల్లో ఇతర ప్రాంతాల భక్తులు వచ్చి ఇక్కడ బోనాలు చెల్లించి మొక్కులు తీర్చుకుంటారు. లోక రక్షణకోసం దుర్వాస మహర్షి తపస్సు.. చెన్నూర్ మండలంలోని అక్కెపల్లిలో దుర్వాస మహర్షి లోక రక్షణ కోసం ఘోర తపస్సు చేసి లక్ష్మీనారసింహుడిని ప్రసన్నం చేసుకున్నాడని, అనంతరం నరసింహస్వామిని ఇక్కడ ప్రతిష్టించాడని కాళేశ్వర ఖండం చెబుతోంది. ఇక్కడ వెలిి సన నారసింహుడు సర్పాకారంలో వెలిసిన అ త్యంత మహిమాన్వితుడిగా పేర్కొంటారు. నారసింహుడు అక్కెపల్లి నుండి కాళేశ్వరం వరకు విస్తరించి ఉన్నాడని పూర్వీకుల నమ్మకం. పూర్వం ప్ర జలు కాళేశ్వరం నుండి బయలు దేరి గోదావరిలో స్నానమాచరించి వివిధ క్షేత్రములు తిరిగి లోక రక్షకుడైన నారసింహుడుని దర్శించుకునేవారు. చెన్నూర్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. కానీ ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు.ప్రాచీన చరిత్రకు ఆనవాళ్లు కోటిలింగాలుచరిత్ర గొప్పది చెన్నూర్ చరిత్ర ఎంతో గొప్పది. మునులు, ఋషులు నడయాడిన నేల ఇది. కత్తెరసాలలో మల్లికార్జున స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. నారాయణపూర్ సమీపంలోని కోటిలింగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అక్కెపల్లి లక్ష్మీనారసింహుడు స్వయంభుగా బండకు వెలిశాడు. దుర్వాస మహర్షి ఇక్కడ పూజలు చేసే వారని కాళేశ్వర ఖండం చెబుతోంది. – హిమాకర్ శర్మ, వేద పండితుడు, శివాలయం సహజ సిద్ధంగా బండరాళ్లకు వెలిసిన కోటిలింగాలు ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పురాతన కాలం నాటి ఈ కోటిలింగాలకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. కత్తెరసాల నుంచి మూడు కిలోమీటర్లు, చెన్నూర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో నారాయణపూర్ గ్రామ సమీపంలో గోదావరి నది ఒడ్డున వెలిసాయి. సుమారు 1800ల ఏళ్ల క్రితమే ఈ కోటిలింగాలు వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ కోటిలింగేశ్వర ఆలయం ఉన్న ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న బండరాళ్లపై వివిధ రకాల దేవతామూర్తులు కొలువు దీరారు. పార్వతి కొల్లుకుంట, పాయిరాల కొలను, యమకోనం, వినాయక విగ్రహాలు, నందిపాదం, శివలింగం, శివుని ఆత్మలింగాలు, పార్వతి, నంది గుర్తులు ఇక్కడ దర్శన మిస్తాయి. అగస్త్య మహాముని కత్తెరసాలలోని మల్లికార్జునస్వామి ఆలయం నుంచి సొరంగ మార్గం ద్వారా కోటిలింగాలకు వెళ్లి అక్కడ గోదావరి నదిలో స్నానమాచరించి తిరిగి కత్తెరసాలకు వెళ్లి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారని కాళేశ్వర ఖండం చెబుతోంది. కాకతీయులు పరిపాలించే కాలంలో రాజులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేసేవారని స్థల పురాణంలో ఉంది. -
కోడిగుడ్లు నాసిరకం..?
● అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా ● సెలవుల నేపథ్యంలో ఇంటికే సరుకులు ● పాడైనవి వస్తున్నాయంటున్న లబ్ధిదారులుమంచిర్యాలటౌన్: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా కోడిగుడ్లు అందజేస్తోంది. మూడేళ్లు పైబడిన చిన్నారులు, గర్భిణులు, బాలింతలు నేరుగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి పప్పు, ఆకుకూరలు, కోడిగుడ్డుతో కూడిన మధ్యాహ్నం భోజనం చేస్తుండగా.. మూడేళ్లలోపు చిన్నారులకు నెలకు 16 కోడిగుడ్లు, బాలామృతం ఇంటికే ఇస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు మే నెల వేసవి సెలవుల కారణంగా పౌష్టికాహారాన్ని నేరుగా లబ్ధిదారులకే ఇస్తున్నారు. కోడిగుడ్లు ఇంటికి తీసుకెళ్లి మంచివో కావో తెలుసుకునేందుకు నీటిలో వేయగా తేలుతున్నాయి. పగులగొట్టి చూస్తూ పాడై ఉంటుండడంతో పడేస్తున్నారు. సగానికి పైగా పాడైనవి ఉంటున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా నాసిరకం కోడిగుడ్లు, తక్కువ బరువు ఉన్నవి, నిల్వ కోడిగుడ్లను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్ నేరుగా అంగన్వాడీ కేంద్రాలకే గుడ్లు సరఫరా చేస్తుండగా.. నిబంధనల ప్రకారం ఉన్నవాటినే టీచర్లు తీసుకోవాల్సి ఉంటుంది. కోడిగుడ్ల సరఫరాలో జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒక గుడ్డు కనీస బరువు 50గ్రాములు ఉండాలనే నిబంధన ఉంది. కానీ ఒక ట్రేలో 30కోడిగుడ్లు ఉంటే అందులో ఐదు నుంచి పది ఎక్కువ బరువు ఉన్నవాటిని ఉంచి మొత్తం ట్రే బరువు 1500 గ్రాములకు దగ్గరలో ఉండేలా చూస్తున్నారు. కచ్చితంగా బరువు చూసి తీసుకునే టీచర్లు ఉన్నచోట ఈ విధానం అమలు చేస్తుండగా.. ప్రశ్నించని వారి కేంద్రాలకు బరువుతో సంబంధం లేకుండా చిన్న పరిమాణంలో ఉన్నవి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న వాటిని సరఫరా చేయడం వల్ల ఉడకబెట్టే సమయానికి లోపల చెడిపోయి దుర్వాసన వస్తుండడంతో బయట పడేస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం అందడం లేదు.జిల్లా వివరాలుఅంగన్వాడీ కేంద్రాలు : 969 గర్భిణులు : 4.245 బాలింతలు : 3,186 చిన్నారులు : 45,455చిన్నగుడ్లను తిరిగి ఇచ్చేస్తాం అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించినప్పుడు చిన్న పరిమాణంలో కోడిగుడ్లు ఉంటే వెనక్కి పంపించి మళ్లీ తెప్పిస్తున్నాం. అంగన్వాడీ టీచర్లు చిన్న వాటిని, పాడైనవి ఉంటే తీసుకోవద్దని చెబుతున్నాం. ఎవరైనా చిన్నసైజువి, నాణ్యత లేనివి తీసుకుంటే చర్యలు తీసుకుంటాం. – రౌఫ్ఖాన్, జిల్లా సంక్షేమశాఖ అధికారి, మంచిర్యాల -
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు
● ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ● మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్న వారంతా యువకులేనని, మైనర్ మొదలుకుని 35ఏళ్ల వయస్సున్న వారేనని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. మైనర్లకు వాహనం ఇచ్చిన వారిపై, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శనివారం నగరంలోని ఎం కన్వెన్షన్ హాల్లో ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ–ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ మాట్లాడుతూ జల్సాల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందడం బాధాకరమని, మితిమీరిన వేగం, సెల్ఫోన్ డ్రైవింగ్, మైనర్డ్రైవింగ్, రాంగ్రూట్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, నిద్రమత్తు, నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని మ్యాక్స్ భవన్ వద్ద ముగ్గురు మైనర్లు ఒకే మోటార్సైకిల్పై వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరు చనిపోయారని తెలిపారు. జిల్లాలో మైనర్ డ్రైవింగ్లో పట్టుబడిన వారికి, తల్లిదండ్రులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, రవికుమార్, సీఐ ప్రమోద్రావు, రూరల్ సీఐ ఆకుల అశోక్ పాల్గొన్నారు. -
మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య
లక్ష్మణచాంద: మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య చే సుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకున్నట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన ఆలుగొట్టు పెద్ద గంగన్న (61)కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం అతని భార్య లక్ష్మితో గొడవపడగా కూ తురు ఇంటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురై శు క్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకు ని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫి ర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
రోడ్ల సుందరీకరణకు నిధులు మంజూరు
పాతమంచిర్యాల: మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని వ్యాపార ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, సుందరీకరణకు రూ.78 కోట్లు మంజూరైన ట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు తెలిపా రు. శనివారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో కాంగ్రెస్ నాయకులు, వ్యాపారులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మంచిర్యాలలోని మార్కెట్ రో డ్డు, శ్రీనివాసటాకీస్ రోడ్డు, వాటర్ట్యాంకు ఏరి యా రోడ్డు, వేంకటేశ్వర టాకీస్, విశ్వనాథ ఆల యం, కాలేజీ రోడ్ అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపడుతామని అన్నారు. రహదారుల విస్తరణ, భూ గర్భ డ్రెయినేజీలు, ఫుట్పాత్ల నిర్మాణాలు జూన్లో ప్రారంభిస్తామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను తొలగిస్తామన్నారు. లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి టు టౌన్కు అనుసంధానంగా ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని రెండు నెలల్లో చేపడుతామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తి చేసి 2027లోపు ప్రారంభిస్తామని తెలిపారు. వేంపల్లిలో ఇండస్ట్రీయల్ పార్కును వారంలోపు ఏర్పాటు చేస్తామని, లే అవుట్, భూ కేటాయింపులను పరిశీలిస్తామని అన్నారు. కోడిగుడ్ల ఎగుమతి, మామిడిపండ్లు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తామన్నారు. ముల్కల్ల గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి ప్ర ణాళికలు తయారు చేశామని, ఐటీ పార్కును అనుసంధానంగా బసంత్నగర్ వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ వచ్చిందని తెలిపారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..మంచిర్యాల నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి విషయంలో ఎవరు చర్చకు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ లాగా జీవోలు తీసుకొచ్చి పాలాభిషేకాలు చేయడం లేదని, పక్కాగా నిధులు తీసుకొచ్చి పనులు చేయిస్తున్నానని అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలకు ఏడాది ముందే అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని చెప్పారు. స్టోర్ట్స్ స్టేడియం నిర్మిస్తానని, నియోజకవర్గంలో ఆరు వేల మందికి రాజీవ్ యువ వికాసం పథకం అందిస్తామని తెలిపారు. వేంపల్లిలో ఇండస్ట్రీయల్ పార్కు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు -
నల్లబెల్లం, పటిక తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
ఖానాపూర్: ఖానాపూర్ నుంచి మామాడ మండలం వెంకటాపూర్కు ద్విచక్రవాహనంపై నల్లబెల్లం, పటిక తరలిస్తున్న సాయిబాబాను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ రంగస్వామి తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల దుకాణం నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. దుకాణం యజమాని రఫేకాన్, సిబ్బంది రంజిత్తో పాటు సాయిబాబాపై కేసు న మోదు చేశామన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్సై వసంత్రావు, సిబ్బంది గౌతమ్, రవీందర్, కల్పనా, సాయి, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. డబ్బులు వసూలు చేసిన ఇద్దరి రిమాండ్ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని రైల్వే స్టేషన్లో రెండు రోజుల క్రితం ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను శనివారం రిమాండ్కు తరలించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు. పట్టణంలోని తిర్పెల్లికి చెందిన కాసిప్, భగత్సింగ్నగర్కు చెందిన జహీర్ రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉన్న వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు భయభ్రాంతులకు గురిచేశారన్నారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో శనివారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. అడేగామ(కే)లో చోరీఇచ్చోడ: మండలంలోని అడేగామ(కే)లో శుక్రవారం రాత్రి చోరీ జరిగినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. గ్రామానికి చెందిన కుంబోజి నారాయణ ఇంటికి తాళం వేసి ఆదిలాబాద్ మండలంలోని జైనథ్ వెళ్లాడు. గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి రూ.2.50 లక్షలతో పాటు, రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. శనివారం ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
పదోన్నతితో పోలీసులకు గుర్తింపు
మంచిర్యాలక్రైం: పదోన్నతి ద్వారానే పోలీసులకు గుర్తింపు లభిస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం రామగుండం కమిషనరేట్లో ఏఆర్ కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా, హెడ్ కానిస్టేబుళ్లకు ఏఆర్ ఏఎస్సైగా పదోన్నతి లభించిన సందర్భంగా వారిని పదోన్నతి చిహ్నాంతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎలాంటి రిమార్కు లేకుండా మిగిలిన సర్వీస్ పూర్తి చేయాలని, ప్రతిభ కనబరిచి మరిన్ని పదోన్నతులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అడ్మిన్ దామోదర్, సిబ్బంది పాల్గొన్నారు. -
భావితరాలకు మెరుగైన సాగు భూములు అందిద్దాం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రైతులు సేంద్రీయ సాగు చేస్తూ భావితరాలకు మెరుగైన సాగు భూములు అందించాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, శాస్త్రవేత్త డాక్టర్ కోట శివకృష్ణ అన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలం ర్యాలీలో హాజీపూర్ రైతు ఉత్పత్తి సంఘం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతికి నిరంతరం అండగా ఉంటామ ని అన్నారు. ప్రతీ రైతు సేంద్రీయ సాగువైపు మళ్లాలని తెలిపారు. పంటల మార్పిడి చేయాలని, పర్యావరణ పరిరక్షణలో రైతులు భాగస్వామ్యం కావా లని పిలుపునిచ్చారు. జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ అనిత, ఎఫ్పీఓ డైరైక్టర్లు పూస్కూరి శ్రీనివాసరావు, బొడ్డు శంకర్, మండల ఏఓ కృష్ణ, ఏఈఓలు మౌనిక, ఉదయ్కుమార్, రైతులు పాల్గొన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ శివకృష్ణ ర్యాలీలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం -
కొనుగోళ్లు పూర్తి చేయాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ దండేపల్లి/లక్సెట్టిపేట: వరి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. దండేపల్లి మండలం కొర్విచెల్మ, నంబాల, రంగంపల్లె, లకెట్టిపేట మండలం బలరావుపేట, జెండావెంకటాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు. నిర్వాహకులు, రైతులతో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు రావాల్సిన డబ్బులు త్వరలోనే అందుతాయన్నారు. దండేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి, దరఖాస్తులపై ఆరా తీశారు. దరఖాస్తులు పెండింగ్లో ఉండకుండా చూడాలని తహసీల్దార్కు సూచించారు. లక్సెట్టిపేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రేషన్కార్డుల ప్రక్రియ, పేర్ల నమోదు, తొలగింపు వేగవంతం చేయాలని అన్నారు. జూన్ రెండు నుంచి భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో దండేపల్లి తహసీల్దార్ సంధ్యారాణి, ఆర్ఐ బొద్దుల భూమన్న, ఏపీఎం బ్రహ్మయ్య, లక్సెట్టిపేట తహసీల్దార్ దిలీప్కుమార్ పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్రమంచిర్యాలటౌన్: జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడికి బదులిస్తూ ఆపరేషన్ సిందూర్ విజయానికి ప్రతీకగా జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ మాట్లాడుతూ మన వీర సైనికుల స్ఫూర్తి, దేశభక్తిని చాటేందుకు తిరంగా యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్గౌడ్, నాయకులు పాల్గొన్నారు. -
ఫిట్నెస్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం
● డీటీఓ సంతోశ్కుమార్ మంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యాసంస్థల బ స్సుల ఫిట్నెస్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా రవాణా శాఖ(డీటీఓ) అధి కారి సంతోశ్కుమార్ అన్నారు. శుక్రవారం వేంపల్లిలోని జిల్లా ర వాణా శాఖ కార్యాలయంలో విద్యాసంస్థల యాజ మాన్యాలు, బస్సు డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. బస్సుల ఫిట్నెస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధివిధానాలు వివరించారు. కండీషన్లో లేకుండా విద్యార్థులతో ర వాణా సాగిస్తే, ఆకస్మిక తనిఖీల్లో నిర్లక్ష్యం కని పిస్తే ఆ బస్సులను అక్కడికక్కడే సీజ్ చేస్తామ ని స్పష్టం చేశారు. కాలం చెల్లిన బస్సులను స్క్రాప్ కింద జమ చేయాలని చెప్పారు. విద్యాసంస్థల వాహనాల కండీషన్, ధ్రువీకరణ పత్రాలు స్కూళ్ల ప్రారంభంలోగా సరి చూసుకోవాలన్నారు. డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఎంవీఐ రంజిత్, ఏఎంవీఐ ఖాసీంసాహెబ్ పాల్గొన్నారు. -
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద బర్డ్వాచ్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం లక్సెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలో ని అధికారులు బర్డ్వాచ్ కార్యక్రమాన్ని నిర్వహించా రు. లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి సుభాష్, డె ప్యూటీ రేంజ్ అధికారి హఫీజొద్దీన్, గోపీ, ఎఫ్ఎస్ ఓలు అల్తాఫ్హుస్సేన్, అహ్మద్ పాల్గొన్నారు. ప్రా జెక్ట్ నీటిలో చెట్లపైనే కాకుండా పరిసర ప్రాంతాల్లో పలు రకాల పక్షులు గుర్తించారు. నారాయణపక్షి, చి త్వా, నలంచి, చిట్టిపావురం, చెరువుకొంగ, గో రింక, తెల్లమొండం(నీటి కొంగ), వైట్–త్రోటెడ్ కింగ్ఫి షన్, రెడ్–వాటిల్డ్ ల్యాపింగ్, గ్రీన్బీ ఈటర్, బార్న్ స్వాలో, జంగిల్ బబ్లర్, పర్పుల్ సన్బర్డ్, ఏషియన్ కోయల్ తదితన 22 రకాల పక్షులు కనిపించినట్లు అటవీ రేంజ్ అధికారి సుభాష్ తెలిపారు. -
వందశాతం అక్షరాస్యత సాధించాలి
● అదనపు కలెక్టర్ మోతీలాల్ కాసిపేట: వంద రోజుల్లో వంద శాతం అక్షరా స్యతను విజయవంతం చేస్తూ ప్రతి ఒక్కరూ అ క్షరాస్యులు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ తెలిపారు. శుక్రవారం రాత్రి మండలంలోని లంబాడితండాలో అక్షరాస్యత కేంద్రాన్ని సందర్శించి వయోజనులు అక్షరాలు నేర్చుకుంటున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరాస్యతతోపాటు ఆర్థిక వెసులుబాటు లభించేలా కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వాలంటీర్లు ఐదుగురికి కుట్టు శిక్షణ ఇచ్చి వారి ద్వారా మరింత మందికి అక్షరాలు నేర్పిస్తామని అన్నారు. చ దువు సమాజంలో విలువను పెంచుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య అధికారి పురుషోత్తంనాయక్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గప్రసాద్, ఎంపీడీవో స త్యనారాయణసింగ్, ఏపీఎం వెంకటేశ్వర్లు, ఎల్డీఏం తిరుపతి, డీఆర్పీలు బండ శాంకరి, సుమన్, అశోక్రావు, మోడల్స్కూల్ అడిషనల్ ఏడీ శ్రీనివాసచారి, సెక్టోరల్ అధికారి సత్యనారాయణమూర్తి, ఇన్స్ట్రక్టర్లు, వాలంటీర్లు, మహిళలు పాన్నారు. -
● వందల ఫీట్లు బోర్లు ● విరివిగా వాటర్ప్లాంట్లు ● కొన్నింటికే అనుమతి ● జిల్లాలో లక్షల లీటర్ల వ్యాపారం
ఓ వాటర్ ప్లాంటు నుంచి తరలిస్తున్న వాటర్ క్యాన్లుజిల్లా కేంద్రంలోని ఓ గల్లీలో పేరు లేని వాటర్ ప్లాంటుమంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో స్వచ్ఛ నీటి పేరిట వ్యాపారం జోరుగా సాగుతోంది. వందల ఫీట్లు బోర్లు వేస్తూ లక్షల లీటర్ల నీటిని తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్న ప్యూరిఫైడ్ వాటర్ప్లాంట్ల సంఖ్య పెరిగిపోతోంది. భూగర్భ జల శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా బోర్లు వేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 19 వాటర్ప్లాంట్లకు అనుమతి తీసుకోగా.. వందల సంఖ్యలో ఎలాంటి అనుమతి లే కుండా నిర్వహిస్తున్నారు. జిల్లాలో అనుమతి లేని వాటర్ప్లాంట్లతోపాటు ఇటుక బట్టీలు, సిని మా థియేటర్లు, తదితర వ్యాపార సంస్థలకు 235 నోటీసులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు అసలే పాటించడం లేదు. శుభ్రత, స్వచ్ఛత పట్టించుకో వడం లేదు. డబ్బులు తీసుకోవడం, వాటర్ క్యాన్ నింపడం అన్న చందంగా మారింది. ఏళ్ల తరబడి ట్రేడ్ ఫుడ్ లైసెన్స్ లేకుండానే విరివిగా నీళ్ల వ్యాపా రం సాగిస్తున్నారు. ఇళ్ల మధ్యనే 500 నుంచి వెయ్యి ఫీట్ల వరకు బోర్లు వేయించి నీటిని తోడేస్తున్నారు. ఓ వైపు వేసవి కాలం భూగర్భ జలాలు పా తాళానికి పడిపోతున్నాయి. గృహావసరాలకు విని యోగించే బోర్లకు నీరందని పరిస్థితి నెలకొందని పలు చోట్ల కాలనీ వాసులు వాపోతున్నారు. ఇంటింటికీ క్యాన్లు పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ గల్లీకో వాటర్ప్లాంటు ఏర్పాటవుతోంది. ఇంటింటికీ గోదావరి నీ రు, మిషన్ భగీరథ నీరు వస్తున్నా శుభ్రత, శుద్ధమై న నీరు లేక తాగడానికి జిల్లా వాసులు ఇష్టపడడం లేదు. దీంతో వాటర్ప్లాంట్ల నుంచి మినరల్ వాటర్ క్యాన్లు తెప్పించుకుంటున్నారు. 20లీటర్ల క్యాన్కు రూ.15నుంచి రూ.20 చెల్లిస్తున్నారు. గృహావసరాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షా పింగ్మాల్, హోటళ్లు, షోరూంలు, ఆస్పత్రి, చిరువ్యాపార దుకాణాలు తదితర వ్యాపార సంస్థలకు నెలవారీ ఖాతా లెక్కన నీటి క్యాన్లు అందిస్తున్నారు. దీంతోపాటు ప్యాకింగ్ వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్ రూపకంగా సరఫరా చేస్తున్నారు. దీనికి తోడు శుభకార్యాలకు కూల్ క్యాన్ రూ.30 నుంచి రూ.40 చొప్పున వాహనాల్లో సరఫరా చేస్తున్నారు. గల్లీల్లో కొనసాగుతున్న ప్యూరిఫైడ్ వాటర్ప్లాంట్లకు పేరు, ఊరు ఉండడం లేదు. కనీస నిబంధనలు, జాగ్రత్తలు పాటించడం లేదు. మురుగు నీటి కాలువల పక్కనే వాటర్క్యాన్లు నింపుతున్నారు. వాటర్ప్లాంట్లు, స్టీల్పైపులు, ట్యాంకులు, వినియోగించే క్యాన్లు శుభ్రపర్చడం లేదు. కొన్ని వాటర్ప్లాంట్లలో ప్లాస్టిక్ సింథటిక్ ట్యాంకులు వినియోగిస్తున్నారు. కొందరు నేరుగా బోరు నీటిని ట్యాంకుల్లోకి పంపింగ్ చేస్తున్నారు. భూగర్భ జల శాఖ నుంచి ఎన్వోసీ లేకుండా వాటర్ప్లాంట్లు కొనసాగిస్తున్నారు. భూగర్భ జలాలను విరివిగా వినియోగించకుండా వాల్టా చట్టం–2004 కఠినంగా అమలు చేసేందుకు గత ప్రభుత్వం 2023 మే 27న జీవో నంబరు 15 తీసుకొచ్చింది. దీని ప్రకారం వ్యవసాయ, గృహ అవసరాలకు వేసిన బోర్లకు కాకుండా పరిశ్రమలు, ఇతర వాణిజ్య, వ్యాపారంగా బోర్లు వేసి నీటిని వాడుతుంటే తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్వోసీ) తీసుకోవాలనే నిబంధన విధించింది. భూగర్భ జలశాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్లాంట్లకు ఎన్వోసీ తీసుకోవాలని నోటీసులు ఇస్తుండగా.. ప్రజాప్రతినిధులతో ఫోన్లు చేయించి ఒత్తిడి తీసుకొస్తున్నారని అధికారులు వాపోతున్నారు.తప్పనిసరి అనుమతి తీసుకోవాలి వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాలు వినియోగించుకునే వారు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి అవసరాలు, వ్యవసాయ రంగ బోర్లకు స్థానిక మండల కార్యాలయం, మున్సిపాలిటీలో అనుమతి తీసుకోవాలి. దీనికి ఎలాంటి చార్జీలు ఉండవు. జీవో నంబరు 15 ప్రకారం వాటర్ప్లాంట్లు, ఆసుపత్రులు, అపార్టుమెంట్లు, షాపింగ్మాల్స్, ఇటుకబట్టీలు, సర్వీసింగ్ సెంటర్లు తదితర వ్యాపారాల రంగాల బోర్లు వినియోగించుకునే వారు భూగర్భజలశాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. రూ.14,500 నుంచి రూ. 19,500 వరకు చెల్లించి ఎన్వోసీ తీసుకోవా లి. వెయ్యి లీటర్లకు గాను రోజు రూ.1 చొ ప్పున చెల్లించాలి. నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేస్తున్నాం. – శ్రీనివాస్బాబు, జిల్లా భూగర్భజల శాఖ అధికారిఎన్వోసీ చెల్లింపు ఇలా..పరిశ్రమలు, ఇతరత్రా వాణిజ్య అవసరాలకు తీసుకునే ఎన్వోసీలు పలు కేటగిరీల ప్రకారం ఇస్తున్నారు. వాటి గడువు ముగిసిన తర్వాత మళ్లీ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రిటికల్ అండ్ సెమిక్రిటికల్ అండ్ సేఫ్ విభాగంలో ఉత్పాదక పరిశ్రమల్లో తాగడానికి ఇచ్చే ఎన్వోసీ ఐదేళ్ల వరకు, పరిశ్రమలు, బల్క్ వాటర్ సప్లయ్, ప్యాకేజ్, డ్రింకింగ్ సప్లయ్ చేసే వాళ్లకు మూడేళ్ల వరకు, ఇతరత్రా అవసరాలకు ఎన్వోసీ గడువు రెండేళ్ల వరకు ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత నిర్ణీత రుసుం చెల్లించి రెన్యూవల్ చేయించుకోవాలి. ఉత్పాదక పరిశ్రమలకు కొత్తగా ఎన్వోసీ పొందాలనుకునే వారు రూ.10 వేలు, రెన్యూవల్ చేసుకునేటప్పుడు రూ.5 వేలు చెల్లించాలి. పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు వాటర్ప్లాంట్లకు నెలకు 25 వేల లీటర్ల నీటి వాడకానికి రూ.14,500, ఆపై రూ.50 వేల లీటర్ల నీటి వాడకానికి రూ.18 వేలు, ఆపై లక్ష లీటర్ల నీటి వాడకానికి రూ.32 వేలు, లక్షకు పైగా లీటర్ల నీటిని వినియోగించుకునే వాటర్ ప్లాంట్లు రూ.42 వేలు చెల్లించాల్సి ఉంటుంది. -
డెంగీ నివారణకు కృషి చేయాలి
నస్పూర్: డెంగీ వ్యాధి నివారణకు అందరూ కృషి చేయలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ అనిత, డాక్టర్ సుధాకర్నాయక్ అన్నారు. డెంగీ వ్యాధి ని వారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నస్పూర్లోని ప్రాథమిక అరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంగీ నివారణలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, పంచాయతీ, మున్సిపల్, ఆరో గ్య, సంక్షేమ శాఖలను భాస్వామ్యం చేయడం వల్ల దోమలను నిర్మూలించవచ్చని తెలిపారు. దీనివల్ల డెంగీ జ్వరం రాకుండా అరికట్టవచ్చని, డెంగీ ప్రాథమిక నిర్ధారణకు ఆయుష్మాన్ భవ, ఆరోగ్య కేంద్రాల్లో కిట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అనిల్కుమార్, సునిత, రమ్య, ప్రోగ్రామ్ ఆఫీసర్ శివప్రతాప్, ఆమన్ వెంకటేశ్వర్, సబ్ యూనిట్ అధికారులు నాందేవ్, జగదీష్, అల్లాడి శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేష్, సునిల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులపై రాళ్లతో దాడి
● మార్కెట్యార్డులో దొంగతనానికి యత్నించిన మైనర్లు ● ఇద్దరు అన్నదాతలకు గాయాలు ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ మార్కెట్యార్డులో జొన్న పంట విక్రయించేందుకు వచ్చిన రైతులపై రాళ్లదాడి జరిగింది. బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన నలుగురు మైనర్లు పంట దొంగతనానికి యత్నించారు. అప్రమత్తమైన రైతులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా గోడ పైనుంచి దూకి పరారయ్యారు. ఈక్రమంలో వారు రాళ్ల దాడి చేయడంతో ఇద్దరు రైతులు తలకు గాయాలయ్యాయి. రామాయి రాంపూర్కు చెందిన సర్సం దిలీప్రెడ్డి, బరంపూర్కు చెందిన కూతవేణి నారాయణలను రిమ్స్కు తరలించి చికిత్స చేయించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్ యార్డుకు తెచ్చి విక్రయించేవరకు చోరీకి గురికాకుండా రైతులు రాత్రంతా జాగరణ చేయాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో శనగ, సోయాబీన్, పత్తి పంటలను సైతం పలువురు దొంగతనానికి యత్నించారు. మార్కెట్యార్డులో భద్రత పెంచాల్సిన అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మార్కెట్ యార్డులో పోలీసు నిఘా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, రైతులపై దాడిచేసిన నలుగురు మైనర్లపై బరంపూర్కు చెందిన రైతు చింతల రాకేశ్ టూటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసునమోదు చేసినట్లు ఎస్సై విష్ణుప్రకాశ్ వివరించారు. -
కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు నమోదు చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలోని ఫార్మసి ఆఫీసర్లు కుటుంబ నియంత్రణ, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కృపాబాయి అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జిల్లాలోని ఫార్మసీ ఆఫీసర్లకు ఏపీఎల్ఎంఐఎస్ ప్రోగ్రాం కింద శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసీ ఆఫీసర్లు సమీక్ష చేసి కుటుంబ నియంత్రణలో భాగంగా తాత్కాలిక, శాశ్వత పద్ధతులకు అవసరమయ్యే నిరోధ్, అంతర వంటి వాటిని అర్హులైన దంపతులకు అందజేసేందుకు ఇండెంట్ నమోదు చేయాలని అన్నారు. ఇండెంట్, ఖర్చు వివరాల నమోదుపై శిక్షణ ఇచ్చారు. ఎస్వో డాక్టర్ సీతారామరాజు, డీపీవో ప్రశాంతి, ప్రవళిక, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు డాక్టర్ కృష్ణతేజ, ఫార్మసీ ఆఫీసర్ శంకర్, డెమో బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
వేగవంతం చేయాలి
ధాన్యం కొనుగోళ్లు● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● కొనుగోలు కేంద్రాల తనిఖీభీమారం/జైపూర్: వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన భీమారం మండలం కాజిపల్లి, జైపూర్ మండల కేంద్రంతోపాటు రసూల్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి నిర్వాహకులకు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం రైతుల నుంచి నా ణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తామని, సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ అందిస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ సౌకర్యాలు క ల్పించాలని, అవసరమైన గోనె సంచులు, టార్పాలి న్లు సమకూర్చాలని అన్నారు. అనంతరం భీమారం మండలం కాజిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అధి కారులకు సూచనలు చేశారు. మండల పరిషత్ కా ర్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందిర మ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా పారదర్శకంగా రూ పొందించాలని, అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలని ఎంపీడీవో మధుసూదన్ను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత మంచిర్యాలఅగ్రికల్చర్: రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్రావు, హరికృష్ణలతో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల(బ్లాక్ స్పాట్)ను గుర్తించి వాహనదారులకు తెలిసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మూలమలుపులు, వేగనిరోధకాలు, వేగ పరిమితి, యూ టర్న్, ఇతర సూచికలను ఏర్పాటు చేసి వాహనదారుల రక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలోని బోయపల్లి రోడ్ నుంచి తాండూర్ వరకు, బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హనుమాన్ విగ్రహం వరకు, నస్పూర్లోని కృష్ణకాలనీ నుంచి దొరగారిపల్లె వరకు సర్వీస్ రోడ్లు నిర్మించాలని తెలిపారు. లక్సెట్టిపేటలోని ఆంధ్రబోర్ నుంచి ఉత్కూర్ చౌరస్తా వరకు, కోటపల్లి మండలంలో, జన్నారం మండలం చింతగూడ, పొనకల్, బస్టాండ్ ప్రాంతాల్లో, ఇందారం ఫ్లైఓవర్ బ్రిడ్డి నుంచి ప్రమాదాల నివారణలో భాగంగా లైటింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి మేదరివాడ, టీటీడీ కల్యాణమండపం, రైల్వేస్టేషన్, లక్ష్మీ టాకీస్ చౌరస్తాల్లో సిగ్నల్స్, రేడియం ఏర్పాటు చేయాలన్నారు. వారానికి ఒకరోజు వాహనాల విస్తృత తనిఖీలు చేపట్టాలని, జిల్లాలోని ప్రతీ వైన్స్, బార్–రెస్టారెంట్ల వద్ద పార్కింగ్ స్థలం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పోలీసు, రవాణా, రోడ్లు–భవనాలు, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయింపు
బెల్లంపల్లి: బెల్లంపల్లి సమీకృత కూరగాయల మార్కెట్ని దుకాణాలను లాటరీ పద్ధతిలో లబ్ధి దారులకు కేటాయించారు. గురువారం ము న్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో లాటరీ నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్ హాజరై పర్యవేక్షించారు. సముదాయంలో ఖాళీ గా ఉన్న 31 దుకాణాలను పారదర్శకంగా వ్యా పారులకు కట్టబెట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ పుర ప్రజలకు కూరగాయలు, మాంసపు ఉత్పత్తులు ఒకే చోట అందించాలనే ఉద్దేశ్యంతో స మీకృత కూరగాయల మార్కెట్ను నిర్మించిన ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే.శ్రీనివాసరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
పరారైన నిందితుడి అరెస్టు
లక్సెట్టిపేట: చోరీ కేసులో లక్సెట్టిపేట జైలుకు తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి పరారైన నింది తుడిని పట్టుకుని అరెస్టు చేసినట్లు లక్సెట్టిపేట సీఐ అల్లం నరేందర్, ఎస్సై సురేశ్ తెలిపారు. స్థానిక పో లీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండలానికి చెందిన రాంమల్లే గజానంద్ అలియాస్ కరణ్ చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తూ నస్పూర్ పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి ఈనెల 13న లక్సెట్టిపేట సబ్ జైలుకు రిమాండ్ చేసేందుకు తీసుకువస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు. నిందితుడి కోసం గాలిస్తుండగా గురువారం ఉదయం బస్టాండ్ సమీపంలో ఎస్సై, సిబ్బంది పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
జేటీవో ఉద్యోగానికి యువకుడి ఎంపిక
బెల్లంపల్లి: బెల్లంపల్లికి చెందిన నడిగోటి అనుదీప్ కుమార్ నీటి పా రుదల శాఖలో జూని యర్ టెక్నికల్ అధికారి(సివిల్)గా నియామ కం అయ్యాడు. బుధవారం హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అధికారుల చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నాడు. అనుదీప్ కుమార్ తండ్రి నడిగోటి కుమార్ నాయీబ్రాహ్మణ వృత్తి నిర్వహిస్తూ కొడుకును ఉన్నతంగా చదివించాడు. అనుదీప్ కుమార్ బెల్లంపల్లిలో పదో తరగతి వరకు, హైదరాబాద్ రామాంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదివాడు. 2023అక్టోబర్ 19న జేటీవో ఉద్యోగానికి పరీక్ష రాయగా గత జనవరి 24న తుది ఫలితాలు ప్రకటించారు. -
‘పది’ సప్లిమెంటరీకి సన్నద్ధత
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తీర్ణత శాతం మెరుగయ్యేలా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేస్తోంది. జూన్ 3నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా.. ప్రత్యేక తరగతుల నిర్వహణకు డీఈవో యాదయ్య జూమ్ మీటింగ్, ఫోన్ సందేశాలు పంపించారు. దీంతో అనుత్తీర్ణులైన విద్యార్థులకు బోధన, పునశ్చరణ, వెనుకబడిన వారిపై దృష్టి సారించారు. ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైన బడుల్లో ఆన్లైన్, ప్రత్యక్ష తరగతుల ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణపై డీఈవో ప్రధానోపాధ్యాయులకు సందేశాలు పంపిస్తూ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. జిల్లాలో గతం కంటే మెరుగైన ఫలితాలతో ఈసారి 17 స్థానంలో నిలిచింది. మొ త్తం 9,179 మంది విద్యార్థులకు గాను 8,861మంది ఉత్తీర్ణత సాధించారు. 318మంది అనుత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 183మంది, బాలికలు 135మంది ఉన్నారు. ఎక్కువ మంది గణితంలోనే తప్పారు. సబ్జెక్టుల వారీగా పరి శీలిస్తే గణితంలో 166మంది, తెలుగులో 143 మంది, సైన్స్లో 53 మంది, ఇంగ్లిషులో 38మంది ఫెయిలయ్యారు. వీరికి సబ్జెక్టులపై భయం తొలగించి ఉత్తీర్ణులయ్యేలా చర్యలు చేపట్టారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు రెండేసి జిల్లాలకు ఒక్కో ప్రత్యేక అధికారి -
రైల్వే పనులు పరిశీలించిన డీఆర్ఎం
బెల్లంపల్లి: బెల్లంపల్లి రైల్వేస్టేషన్ ఆవరణలో ప నులను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివి జనల్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం) భర్తేష్కుమార్జైన్ గురువారం పరిశీలించారు. ప్రత్యేక రైలు లో మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వేస్టేషన్ నుంచి వచ్చిన ఆయన మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్నగర్ రైల్వేస్టేషన్లను సందర్శించారు. రైల్వే అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. బెల్లంపల్లి రైల్వేస్టేషన్ పరిసరాల్లో ని ర్మాణ పనులను పర్యవేక్షించారు. గతంలో చేప ట్టి అసంపూర్తిగా ఉన్న పనులతోపాటు కొత్తగా మంజూరైన పనులు, గూడ్స్ రైళ్ల ట్రాక్ పనులు, నాణ్యత పరిశీలించారు. అధికారులు పనుల వివరాలు, పురోగతిని వివరించారు. నిర్ధేశించి న గడువు ప్రకారం పనులు పూర్తి చేయాలని డీ ఆర్ఎం ఆదేశించారు. పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కిందిస్థాయి అధి కారులకు సూచించారు. రైల్వేస్టేషన్ ప్లాట్ఫా మ్లను సందర్శించారు. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్(డీసీఎం) బాలాజీకిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
‘వికాసం’ ఆలస్యం..!
● అర్హుల గుర్తింపులో జాప్యం ● మండల స్థాయిలో పూర్తి కాని జాబితా ● సిబిల్ స్కోర్పై ఆదేశాలు రాక పెండింగ్మంచిర్యాలటౌన్: జిల్లాలో రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మండలం, మున్సిపాల్టీ వారీగా ఆన్లైన్, ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులుగా గుర్తించిన వారి వివరాలు బ్యాంకులకు పంపిస్తున్నారు. సిబిల్ స్కోర్ ఆధారంగా సబ్సిడీ రుణాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ పరిశీలన నేపథ్యంలో అర్హుల ఎంపికలో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. సిబిల్ స్కోర్ పరిగణనలోకి తీసుకోబోమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించినా అధికారిక ఉత్తర్వులు వెలుకవడకపోవడం, బ్యాంకర్లు స్పష్టత ఇవ్వకపోవడంతో మండలాల వారీగా అర్హుల జాబితా సిద్ధం కాలేదు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అర్హులకు సబ్సిడీ రుణాలు అందించాలని ప్రభుత్వం భావిస్తుండగా అర్హుల ఎంపికపై తర్జన భర్జన కొనసాగుతోంది. యూనిట్లు తక్కువ... దరఖాస్తులు ఎక్కువ దరఖాస్తుల పరిశీలనకు మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. కన్వీనర్లుగా ఎంపీడీవోలు, ము న్సిపల్ కమిషనర్లు, సభ్యులుగా మండల, ము న్సిపల్ ప్రత్యేక అధికారులు ఉన్నారు. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల నుంచి అధి కారులు, బ్యాంకు మేనేజర్లు, డీఆర్డీవో కార్యాల యం అధికారులను కేటాయించారు. ము న్సిపాల్టీ లు, మండల కార్యాలయాల్లో దరఖాస్తుల్లో ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరి శీలించిన అనంతరం కమిటీల ఆధ్వర్యంలో జాబి తా సిద్ధం చేసి బ్యాంకర్లకు పంపించారు. రుణాలు తీసుకునే వారు తిరిగి చెల్లిస్తారా లేదా, సిబిల్ స్కోర్ ఏ మేరకు ఉందనే వివరాల ప్రకారం జా బితా సిద్ధం చేసి కమిటీ సభ్యులకు అందించాలి. కానీ ఇప్పటికీ బ్యాంకర్ల నుంచి అ ర్హుల జాబితా ఇవ్వకపోవడం, సిబిల్ స్కోర్పై అధికారిక ఉత్తర్వులు లేకపోవంతో తుది జాబితా అందడంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం కేటాయించిన యూనిట్లు తక్కువగా ఉండగా దరఖాస్తులు భారీ సంఖ్యలో వచ్చా యి. అన్ని కార్పొరేషన్లకు కలిపి 55,948 ద రఖాస్తులు రాగా క్షేత్రస్థాయిలో పరిశీలించి 40,270 దరఖాస్తులను బ్యాంకర్లకు పంపించారు. అన్ని కార్పొరేషన్లకు కలిపి 12,129 యూనిట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించగా.. 40,270 మంది దరఖా స్తుదారులు ఉన్నారు. ఈ నెల 17లోపు అర్హుల జాబి తా సిద్ధం చేయాల్సి ఉండగా ఎంతమందికి సబ్సిడీ రుణాలు అందుతాయో తేలనుంది.జిల్లాలో వచ్చిన దరఖాస్తులు, యూనిట్లుకార్పొరేషన్ దరఖాస్తులు యూనిట్లుబీసీ 29690 3,907 ఈబీసీ 1051 698 ఎస్సీ 17,536 5,341 ఎస్టీ 4,199 1,644 మైనారిటీ 3,331 450 క్రిస్టియన్ మైనారిటీ 141 89 -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల శివారు ర్యాలీవాగు కల్వర్టు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. హాజీపూర్ పోలీసుల కథనం ప్రకారం.. గుడిపేటకు చెందిన భయ్యా మధుకర్(31) ఇంటింటికీ వెళ్తూ పాలు అమ్మడంతోపాటు విద్యుత్ వైరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం బైక్పై పాలతో వెళ్తున్నాడు. మంచిర్యాల నుంచి ముల్కల్ల ఇసుక రీచ్కు వస్తున్న ట్రాక్టర్ అజాగ్రత్తగా నడుపుతూ అతివేగంగా బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మధుకర్ తలకు తీవ్ర గాయాలు కాగా, ట్రాక్టర్ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మౌనిక, మూడేళ్ల కుమార్తె శాన్విక ఉంది. మృతుడి తండ్రి సత్తయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వరూప్రాజ్ తెలిపారు. కాగా మధుకర్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో అతని కుమార్తె శాన్విక భవిష్యత్తు కోసం గుడిపేట స్థానికులు విరాళాలు సేకరిస్తున్నారు. -
సన్నరకం వడ్లు కొనుగోలు చేయాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్చెన్నూర్రూరల్: సన్నరకం వడ్లను ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ డిమాండ్ చేశారు. మండలంలోని కిష్టంపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల సాగును ప్రోత్సహించి సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేసిందన్నారు. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని తెలిపారు. ఈ విషయమై రైతులు ఆందోళన చేసిన తర్వాత ఒక్క లోడ్ వడ్లు క్వింటాలుకు 20కిలోలు ఎక్కువగా తూకం వేసుకుని ఒక మిల్లర్ తీసుకున్నాడని ఆరోపించారు. నూకల పేరుతో రైతులను వేధించడం మానేసి కల్లాల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఇంత కష్టపడుతుంటే ఎమ్మెల్యే వివేక్ స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్గౌడ్, మండల సీనియర్ నాయకుడు ఆలం బాపు, కొటారి వెంకటేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏతం శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
డెంగీపై అవగాహన కల్పించాలి
మంచిర్యాలటౌన్: డెంగీ వ్యాధి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన క ల్పించేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హ రీశ్రాజ్ అన్నారు. ఈ నెల 16న జాతీయ డెంగీ దినోత్సవం పురస్కరించుకుని గురువారం స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో అవగాహన పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు. జిల్లాలోని ఆరోగ్య కార్యకర్తలు, ఆశా, అంగన్వాడీ టీచర్లు సమన్వయంతో అవగాహన చేపట్టాలని అన్నారు. జిల్లాలో ఈ ఏడాది 42 మందికి పరీక్ష చేస్తే ఇద్దరికి డెంగీ పాజిటివ్గా వచ్చినట్లు తెలిపారు. ఇల్లు, పరిసరాల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూడాలని, ప్రతీ ఫ్రై డే డ్రై డే పాటించాలని తెలిపా రు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ అనిత, డాక్టర్ కృపాబాయి, డాక్టర్ సీతా రామరాజు, డాక్టర్ అనిల్ కుమార్, ప్రశాంతి, కాంతారావు, దామోదర్, సంతోశ్, మాస్ మీడి యా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
డీసీఎంఎస్కు మంగళం..!
● మరో శాఖలో విలీనానికి కసరత్తు ● సిద్ధమవుతున్న ప్రతిపాదనలు కై లాస్నగర్: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లకు ప్రభుత్వం మంగళం పాడనుంది. అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఈ సంస్థను మరో శాఖలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. డీసీఎంఎస్ చైర్మన్ల పదవీకాలం పొడిగించకపోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ సంస్థను మార్క్ఫెడ్, హాకా శాఖల్లో విలీనం చేయాలని గత ప్రభుత్వం భావించింది. అయితే ఆ దిశగా కార్యాచరణ సాధ్యం కాలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డీసీఎంఎస్ను విలీనం చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఇలా.. జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) మాత్రం ఇప్పటికీ ఉమ్మడిగానే కొనసాగుతుంది. దీని పరిధిలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఎరువులు, వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 150 కేంద్రాల ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టాల్లో కొనసాగిన ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో లాభాల బాటలో పయనిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ సంస్థ చేసిన వ్యాపారాల ద్వారా గతేడాది రూ.12 కోట్ల టర్నోవర్ సాధించింది. వరి ధాన్యం కొనుగోళ్ల ద్వారా మరో రూ.20 లక్షల వరకు కమీషన్ రూపంలో ఆదాయం సమకూరింది. అలాగే ఈ సంస్థ ద్వారా జిల్లా కేంద్రంలోని వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, రిమ్స్ ఆస్పత్రికి అవసరమైన వస్తువులను సరఫరా చేస్తున్నారు. తద్వారా ఏటా సంస్థకు మరో రూ.20 లక్షల ఆదాయం వరకు సమకూరుతుంది. ఇలా ఆర్జించిన లాభాల ద్వారా జిల్లా కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్తో కూడిన సంస్థ కార్యాలయ భవనాన్ని రూ.5 కోట్లతో నిర్మించారు. ఇప్పుడిప్పుడే వ్యాపార పరంగా లాభాల బాటలో ఉన్న ఈ సంస్థను ఇతర శాఖల్లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. జిల్లా కేంద్రంగానే కార్యకలాపాలు.. ఉమ్మడి జిల్లా పరిధిలో సంస్థ పనిచేస్తున్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగానే దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వరిధాన్యం కొనుగోలును పర్యవేక్షించేందుకు మంచిర్యాల, నిర్మల్ జిల్లా కేంద్రాల్లో శాఖలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ పరిధిలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 20 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, నిర్మల్లో ఒకరు, మంచిర్యాలలో ముగ్గురు విధులు నిర్వహిస్తున్నారు. డీసీఎంఎస్ను ఇతర శాఖలో విలీనం చేస్తే వీరంతా ఆయా శాఖల్లో పనిచేయాల్సి వస్తోంది. కాగా, కొన్నేళ్లుగా లాభాలు అర్జిస్తున్న సంస్థను ఉన్నపాటుగా విలీనం చేసినట్లయితే రైతులకు అందాల్సిన సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉద్యోగులు సైతం ఆ శాఖలో అలవాటు లేని విధులను నిర్వహించాల్సి వస్తుందని చెబుతున్నారు. కోర్టును ఆశ్రయించిన డీసీఎంఎస్ చైర్మన్.. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల పదవీకాలం ఇటీవల ఏకకాలంలో ముగిసింది. అయితే డీసీసీబీ చైర్మన్ పదవీకాలాన్ని ఆరు నెలల పాటు పొడగించిన ప్రభుత్వం డీసీఎంఎస్ చైర్మన్ పదవీ కాలం మాత్రం పొడగించలేదు. ఈ సంస్థను ఇతర శాఖలో విలీనం చేసేందుకే చైర్మన్ పదవీకాలాన్ని పొడిగించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ సంస్థకు జిల్లా అదనపు (రెవెన్యూ) కలెక్టర్ శ్యామలాదేవి పర్సన్ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. కాగా, తన పదవీకాలాన్ని పొడగించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో డీసీఎంఎస్ చైర్మన్ కోర్టును ఆశ్రయించారు. డీసీఎంస్ పరిధిలో.. పీఏసీఎస్లు 77 సిబ్బంది 29 వార్షికాదాయం రూ.4కోట్లు అప్పులు రూ.2కోట్లు ప్రతిపాదనలు పంపిస్తున్నాం.. జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థకు సంబంధించి ఆదాయ, వ్యయ, అప్పులు, ఆస్తులు వంటి వివరాలను పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. ఇతర జిల్లాలతో పోల్చితే ఆదిలాబాద్ డీసీఎంఎస్ లాభాల బాటలో ఉంది. దీన్ని ఇతర శాఖల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. – బి.మోహన్, జిల్లా సహకార అధికారి -
డెంగీతో జాగ్రత్త
● దోమల వృద్ధితోనే వ్యాప్తి ● నీటి నిల్వలు లేకుండా చూడాలి ● పారిశుధ్యం మెరుగుపర్చుకోవాలి ● నేడు జాతీయ డెంగీ దినోత్సవంమంచిర్యాలటౌన్: ప్రజలు తమ ఇంటి పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకుని, నీరు నిల్వలేకుండా చేసుకుంటే డెంగీ కట్టడి సాధ్యమవుతుంది. సరైన పారిశుధ్య చర్యలు, ప్రజల్లో అవగాహనతోనే అరికట్టవచ్చు. వర్షాకాలం ముందు నుంచే డెంగీతోపాటు ఇతర వ్యాధులపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలతోపాటు ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహిస్తోంది. అయినప్పటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డెంగీ విజృంబిస్తోంది. ఒక ఏడాది కేసులు తగ్గితే, మరో ఏడాది పెరుగుతున్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోనే ఈ వ్యాధి బారినపడకుండా ఉండవచ్చు. మన ఇల్లు, ఇంటి పరిసరాల్లో నిల్వ నీటిలో అనాఫిలస్, క్యూలెక్సిస ఈడిస్, ఆర్మిజరిస్ దోమలు పెరుగుతాయి. ‘ఏజిస్ ఈజిప్టయి’అనే దోమకాటుతో డెంగీ సోకుతంది. చికెన్ గున్యా కంటే ఎక్కువగా ఒంట్లో శక్తిని హరిస్తుంది. మే 16న (శుక్రవారం) జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ముందు జాగ్రత్తలతోనే మేలు ఏటా డెంగీ బారినపడుతున్న వారి సంఖ్య వందల్లో ఉండగా, అడపాదడపా మరణాలు సంభవించిన ఘటనలు జిల్లాలో చోటుచేసుకున్నాయి. రానున్న వర్షాకాలం దృష్ట్యా జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్తలు పాటిస్తూ, సరైన ప్రణాళికతో ముందడుగు వేయడం, ప్రజలను భాగస్వాములను చేయడంతో డెంగీని అరికట్టే అవకాశం ఉంది. ఏజిస్ ఈజిప్టయి రకం ఆడదోమ కాటు వేయడం డెంగీ వస్తుంది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను ఆవాసంగా చేసుకుని దోమలు వృద్ధి చెందుతాయి. ప్రధానంగా కూలర్లు, పూలకుండీలు, వాడిపడేసిన టైర్లు, కొబ్బరిబొండాల్లో ఆవాసం ఏర్పరుచుకుని, స్వైర విహారం చేస్తాయి. ఈ దోమ కుట్టడం వల్ల తీవ్ర జ్వరం, శరీరంపై ఎర్రని దద్దుర్లు, తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పి, ఆకలి మందగించడం, ఎర్ర రక్తకణాలు(ప్లేట్లెట్స్) తగ్గిపోతాయి. సకాలంలో గుర్తించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, డెంగీ నిర్దారణకు ‘ఎలీసా పరీక్ష’చేసుకుని నిర్దారించుకున్న తర్వాత చికిత్స తీసుకోకువాలి. అధికంగా వృద్ధులు, చిన్నారులు, మధుమేహం బాధితులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వీటి ప్రభావం ఎక్కువే. దోమలను అడ్డుకట్ట వేయడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలి ● దోమల బారినుంచి కాపాడుకోవటమే కాక దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల నుంచి ఎవరికి వారే రక్షించుకోవాలి. ● ఇంట్లో గాని, ఇంటి ఆవరణలో గాని నీళ్ల కుండీలు, డ్రమ్ములు, గోళాలు, ఓవర్హెడ్ ట్యాంకులు, సంపులు వంటి వాటిపై దోమలు గుడ్లు పెట్టకుండా మూతలు పెట్టాలి. ● వారానికోసారి నీరు నిల్వ చేసిన పాత్రలను ఖాళీ చేయాలి. ఇంటి ఆవరణలో నీటి గుంటలు లేకుండా చూడాలి. ● ఇంటిపై ఉన్న ఓవర్హెడ్ ట్యాంకులపై దోమలు గుడ్లు పెట్టకుండా మూతలు పెట్టాలి. ● సెప్టిక్ ట్యాంక్ గొట్టం, గ్యాస్ పైప్లైన్ పైన పలచని బట్ట చుట్టాలి. దీనివల్ల దోమల నివారణ జరుగుతుంది. ● మురుగుకాల్వల్లో ఎప్పటికప్పుడు చెత్తా చెదారం తొలగించాలి. ● పనికిరాని సీసాలు, డబ్బాలు, రబ్బరు టైర్లు, వాటర్ కూలర్లు, ఇతర ఏ పాత్రలైనా సరే నీరు నిల్వ లేకుండా చూడాలి. ● దోమతెరలు, ఇంటి కిటికీలకు జాలీలు వాడడం, దోమలు కుట్టకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. జిల్లాల వారీగా కేసులు ఏడాది మంచిర్యాల కుమురం భీం ఆదిలాబాద్ 2020 32 65 205 2021 116 94 231 2022 118 40 207 2023 72 88 108 2024 224 50 366 2025 2 1 -- నివారణ అందరి బాధ్యత డెంగీతోపాటు ఇతర వ్యాధులను నివారించడం అందరి బాధ్యత. ఇంటి పరిసరాల్లో పారిశుధ్యం మెరుగుపర్చుకోకపోవడం, నీరు నిల్వ లేకుండా చూడకపోవడం వల్ల దోమలు వృద్ధి చెందుతున్నాయి. తద్వారా డెంగీ ప్రబలే అవకాశాలు ఉన్నాయి. డెంగీకి సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే, ప్రాణాంతకంగా మారుతుంది. జిల్లాలో డెంగీ వ్యాధి కట్టడికి వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో చర్యలను తీసుకోవడంతోపాటు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ హరీశ్రాజ్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, మంచిర్యాల -
ఇంటర్ విద్యను బలోపేతం చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఇంటర్మీడియెట్ విద్యను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీ డియెట్ విద్యపై సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కో టపల్లి, జైపూర్, దండేపల్లి, తాండూర్ మండలాల్లో నూతన వసతిగృహాలు మంజూరైనట్లు తెలిపారు. విద్యార్థులను కళాశాలల్లో చేర్పించేందుకు అధికారులు, అధ్యాపకుల బృందం సమష్టిగా కృషి చేయాలన్నారు. 2025–26 సంవత్సరంలో అదనంగా 30శాతం విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. జూనియర్ లెక్చరర్లతో బృందాలు ఏర్పాటు చేసి వారి పరిధిలోని పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు అవగాహన కల్పించి కళాశాలల్లో చేర్పించాలని అన్నారు. మంచిర్యాల, మందమర్రి, కాసిపేట, చెన్నూర్, బెల్లంపల్లి, జైపూర్, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రూ.1.77లక్షల వ్యయంతో అగ్ని నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
సిబిల్ స్కోర్ పరిశీలన పూర్తి చేయాలి
మంచిర్యాలటౌన్: రాజీవ్ యువ వికాసం పథ కం దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ పరిశీలన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని షెడ్యూల్డ్ కు లాల సహకార సంస్థ ఈడీ చాతరాజుల దుర్గాప్రసాద్ అన్నారు. బుధవారం స్థానిక మున్సి పల్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్, హాజీపూర్ మండల బ్యాంక్ మేనేజర్లు, మండ ల పరిషత్ అభివృద్ధి అధికారులు, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల అధికారులు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతితో సమావే శం అ య్యారు. ఈడీ మాట్లాడుతూ అభ్యర్థుల సిబిల్ స్కోర్ పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేసి ఈ నెల 17లోపు వివరాలు అందించాలని తెలిపా రు. జిల్లావ్యాప్తంగా 40,270 దరఖాస్తులు సిబి ల్ పరిశీలన కోసం పంపించినట్లు తెలిపారు. -
బాలిక విద్యకు బాసట
● జిల్లాలో ఐదు కేజీబీవీలు అప్గ్రేడ్ ● వేమనపల్లి, దండేపల్లి, కన్నెపల్లి, కోటపల్లి, హాజీపూర్లో ఇంటర్ ప్రారంభం ● గ్రామీణ నిరుపేద విద్యార్థినులకు మేలు కేజీబీవీ– విద్యార్థుల సంఖ్యబెల్లంపల్లి 325 భీమారం (జైపూర్) 203 భీమిని 224 చెన్నూర్ 313 దండేపల్లి 178 హాజీపూర్ 200 జైపూర్ 320 జన్నారం 269 కన్నెపల్లి 197 కాసిపేట 184 కోటపల్లి 197 లక్షెట్టిపేట 308 మంచిర్యాల 339 మందమర్రి 287 నస్పూర్ 269 నెన్నెల 243 తాండూర్ 343 వేమనపల్లి 190మంచిర్యాలఅర్బన్: గ్రామీణ ప్రాంత పేద కుటుంబాల బాలికలకు కళాశాల విద్యను ప్రభుత్వం చేరువ చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం నుంచి జిల్లాలో ఐదు చోట్ల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఇంటర్ విద్యను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో 18కేజీబీవీలు ఉండగా ఇదివరకు పదింటిలో ఇంటర్ విద్య అమలవుతోంది. ఈ ఏడాది వేమనపల్లి, కోటపల్లి, హాజీపూర్, దండేపల్లి, కన్నెపల్లి కేజీబీవీలు అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఇంటర్ తరగతులు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో గ్రూపులో 40మందికి ప్రవేశం కల్పించనున్నారు. విద్యార్థినులకు ఎంతో మేలు ప్రస్తుతం ఇంటర్ విద్య భారంగా మారింది. పేద కుటుంబాలకు చెందిన బాలికలు పదో తరగతిలోనే విద్యకు స్వస్తి చెబుతున్నారు. పది కేజీబీవీల్లో మాత్రమే ఇంటర్ విద్య కొనసాగుతుండగా.. మిగతా ఎనిమిది చోట్ల ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్నాయి. వీటిలో ఐదు కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు ప్రారంభించడంతో బాలిక విద్యకు భరోసా కలుగుతోంది. అనాథలు, వెనుకబడిన వర్గాలకు సీట్లు కేటాయిస్తారు. కేజీబీవీల్లో పదో తరగతి వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కొత్తగా అప్గ్రేడ్ చేసిన కేజీబీవీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ప్రచారం చేపట్టారు. రెండు చోట్ల రెండు.. మూడు చోట్ల ఒకే కోర్సు జిల్లాలోని కేజీబీవీల్లో 4,589మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. అప్గ్రేడ్ అయిన ఐదు కేజీబీవీల్లో రెండు చోట్ల రెండు కోర్సులు, మిగతా మూడు చోట్ల ఒక్కో కోర్సు నిర్వహించనున్నారు. అదనపు తరగతి గదులు లేక, ఇతర కారణాల దృష్ట్యా ఒక్కో కోర్సుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. హాజీపూర్లో బైపీసీ, ఎంఎల్టీ, కోటపల్లిలో బైపీసీ, కన్నెపల్లిలో బైపీసీ, దండేపల్లిలో ఎంఎల్టీ, కమర్షియల్ గార్మెంట్స్, వేమనపల్లిలో ఎంఎల్టీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. భీమిని, కాసిపేట, భీమారం కేజీబీవీల్లో గదుల కొరత, సౌకర్యాల లేమి కారణంగా ఇంటర్ విద్య అమలుకు నోచుకోకుండా పోయాయి. జిల్లాలో.. జిల్లాలో ఇప్పటికే తాండూర్, జన్నారం, నెన్నెల, మందమర్రిలో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ, మంచిర్యాల, లక్సెట్టిపేట, జైపూర్, బెల్లంపల్లి, చెన్నూర్ కేజీబీవీల్లో బైపీసీ, ఎంపీసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అప్గ్రేడ్ చేస్తున్న మరో ఐదు కేజీబీవీల్లో ఇంటర్ విద్య అమలుకానుంది. ప్రతీ కోర్సుల్లో 40 మందికి ప్రవేశాలు కల్పిస్తారు.సద్వినియోగం చేసుకోవాలిజిల్లాలో ఐదు కేజీబీవీల్లో ఇంటర్ విద్య అందుబాటులోకి రానుంది. గ్రామీణ నిరుపేద విద్యార్థినులకు లబ్ధి చేకూరనుంది. బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు అడ్మిషన్లు మొదలయ్యాయి. 15 కేజీబీవీల్లో ఇంటర్ తరగతుల నిర్వహణ సాగనుంది. – యశోధర, సెక్టోరల్ అధికారి, మంచిర్యాల -
అకాల వర్షాలు.. ఆగమాగం
● జిల్లాలో 13.1 మిల్లీమీటర్ల వర్షం ● చేతికందిన పంట నీటిపాలు13.1 మిల్లీమీటర్ల వర్షంజిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు 13.1మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కన్నెపల్లి మండలంలో 34.4 మిల్లీమీటర్లు, నస్పూర్లో 32.6, మంచిర్యాలలో 27.4, నెన్నెలలో 25.8, భీమినిలో 19.7, కాసిపేటలో 16.9, తాండూర్లో 15.6, బె ల్లంపల్లిలో 15.5, దండేపల్లిలో 14.7, జైపూర్లో 8.7, మందమర్రిలో 6.8, భీమారంలో 5, చెన్నూర్లో 5.3, వేమనపల్లిలో 2.3, హాజీపూర్లో 2, జన్నారంలో 1.5, కోటపల్లిలో 0.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో అకాల వర్షాలతో రైతులు ఆగమాగం అవుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసుకుని ఎదురుచూస్తుండగా వర్షాలతో ధాన్యం తడిసి, కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయారు. మంగళవారం రాత్రి జిల్లాలోని నస్పూర్, మంచిర్యాల, కన్నెపల్లి, భీమిని, నెన్నెల, బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్, దండేపల్లి మండలాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి, వరద నీటిలో కొట్టుకుపోయింది. పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్ కవర్లు అందక, అద్దెకు తీసుకుని అరిగోసపడ్డారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులైనా సగం కూడా ధాన్యం సేకరణ పూర్తి కాలేదు. జిల్లాలో 3.21లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 99,512.480 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. కాలువ తీసి పండించిన ధాన్యం వర్షార్పణం మంచిర్యాల సమీపంలోని సీతారాంపల్లి గ్రామ రైతులు పంటను కాపాడుకునేందుకు వేసవిలో రెండు కిలోమీటర్ల మేర గోదావరి నదిలో జేసీబీతో కాలువ తీయించారు. 200 ఎకరాల్లోని వరి పంటకు నీరందించారు. ఇందుకోసం ఒక్కో రైతు రూ.600 నుంచిరూ.1500 వరకు పోగు చేసి రూ.2లక్షలు వెచ్చించారు. ఇన్ని కష్టాలు పడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు సీతారాంపల్లి కొనుగోలు కేంద్రంలో ఆరబోసుకున్నారు. అకాల వర్షానికి నలుగురైదుగురు రైతుల వరి ధాన్యం వరద నీటిపాలైంది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొట్టుకుపోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. -
ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా
చెన్నూర్రూరల్: గత మూడు రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయడం లేదని, సన్నరకం ధాన్యంలో తరుగు చాలా తీస్తున్నారని మండలంలోని కిష్టంపేట గ్రామంలో రైతులు బుధవారం చెన్నూర్–మంచిర్యాల రహదారిపై ధర్నా చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని సూచించగా.. నిరాకరించారు. రైతుల ను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పో లీసులు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. అనంతరం రైతులు పోలీసులు, ఏడీఏ భానుప్రసాద్, ఏవో యామినిలను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి కష్టాలను వివరించారు. ఉన్నతాధికారులతో మా ట్లాడి ధాన్యం కొనుగోలు చేపట్టేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కలెక్టరేట్ ఎదుట నిరసన మంచిర్యాలఅగ్రికల్చర్: సన్న రకం ధాన్యాన్ని మిల్ల ర్లు దించుకోకుండా కొర్రీలు పెడుతున్నారని చె న్నూర్ మండలం కిష్టంపేట గ్రామ రైతులు బుధవా రం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఆరబెట్టి, తాలు త ప్ప లేకుండా నిబంధనల మేరకు తరలించినా దించుకోవడం లేదని పేర్కొన్నారు. ధాన్యం నూకలు వ స్తున్నాయని, క్వింటాల్కు 16 నుంచి 20 కిలోల వ రకు ఎక్కువగా ఇస్తే దించుకుంటామని, లేదా బీ గ్రే డ్ కింద బస్తాకు 43 కిలోల చొప్పున దించుకుంటా మని, లేదంటే తీసుకెళ్లాలని కొర్రీలు పెడుతున్నారని రైతులు వాపోయారు. వర్షంతో ధాన్యం త డిసిపోతుందని, అధికారులు జోక్యం చేసుకుని నష్టపోకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రతి ఒక్కరూ రైతు గుర్తింపు పొందాలి
● జిల్లా వ్యవసాయాధికారి కల్పన ● హాజీపూర్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలుమంచిర్యాలరూరల్(హాజీపూర్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫార్మర్ ఐడీ కార్యక్రమం ద్వారా రైతులు ప్రతి ఒక్కరూ రైతు గుర్తింపు పొందాలని జిల్లా వ్యవసాయాధికారి కల్పన అన్నారు. బుధవారం హాజీపూర్ మండలం సబ్బేపల్లి జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలలో హాజీపూర్ రైతు ఉత్పత్తి సంఘం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి కల్పన మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వాడ కం తగ్గించి సేంద్రియ సాగు చేసి భావితరాలకు మెరుగైన సాగు అందించాలని సూచించారు. బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, శాస్త్రవేత్త డాక్టర్ కోట శివకృష్ణ మాట్లాడుతూ ప్రతీ రైతు సేంద్రియ సాగువైపు దృష్టి సారించాలని, నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని, సాగునీటిని ఆదా చేయాలని అన్నారు. పంటల మార్పిడి చేయాలని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు, సబ్సిడీలపై తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ అనిత, నిజామాబాద్, ఆది లాబాద్ విత్తన ధ్రువీకరణ అధికారి సురేశ్కుమార్, ఎఫ్పీఓ డైరైక్టర్లు పూస్కూరి శ్రీనివాసరావు, శంకర్, అభ్యుదయ రైతులు లక్ష్మణ్, సత్తయ్య, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి, పంట ఉత్పాదక శాస్త్రవేత్త డాక్టర్ స్రవంతి, హాజీపూర్ మండల వ్యవసాయాధికారి కృష్ణ, ఉద్యానవన అధికారి సహజ, పట్టుపరిశ్రమ అధికారి సురేందర్, ఏఈఓ ప్రసన్న, ఉదయ్కుమార్, రైతులు పాల్గొన్నారు. -
పాస్పోర్టు లేక..ఇంటికి తిరిగి రాలేక
● ఎడారి దేశంలో గల్ఫ్ కార్మికుడి కష్టాలు ● స్వగ్రామానికి రప్పించాలంటూ కుటుంబ సభ్యుల వేడుకోలు నిర్మల్ఖిల్లా: ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని ఎడారి దేశం పయనమైన నిర్మల్ జిల్లా వాసి అక్కడి కంపెనీ యాజమాన్యం వీసా పునరుద్ధరించకపోవడంతో అక్కడ పనిచేయలేక, తిరిగి ఇండియా రాలేక కష్టాలు అనుభవిస్తున్న ఉదంతమిది. నిర్మల్ పట్టణంలోని శాస్త్రినగర్కు చెందిన అంకం సుధీర్ కుమార్ 2023లో సౌదీ అరేబియాకు వెళ్లి ఆరంకో కంపెనీలో ఫోర్మెన్గా విధుల్లో చేరాడు. 15 నెలల తర్వాత వీసా గడువు ముగిసింది. సదరు కంపెనీ యాజమాన్యం గడువును పునరుద్ధరించలేకపోవడంతో విధులకు వెళ్లలేక, ఇంటికి తిరిగి రాలేక తాను ఉంటున్న గదిలోనే సతమతమవుతున్నాడు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఇండియాకు రప్పించేలా కృషి చేయాలని బాధితుని భార్య అంకం వాణి, తల్లి సుజాత బుధవారం కలెక్టరేట్లోని గల్ఫ్ ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించారు. గల్ఫ్ ఎన్నారై రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యులు స్వదేశ్ పరికిపండ్లను కూడా కలిసి సుధీర్ కుమార్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సమస్యను రాష్ట్ర కమిటీ, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సుధీర్ను ఇండియాకు రప్పించేలా కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
లారీ బోల్తాపడి డ్రైవర్ మృతి
కాసిపేట: లారీ బోల్తాపడి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని మల్కేపల్లి గ్రామానికి చెందిన అడ్లూరి రాకేశ్ (27)లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి లారీలో సిమెంటు లోడ్ చేసుకుని వెళ్తుండగా సిద్దిపేట వద్ద డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో లారీ బోల్తాపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి తండ్రి, సోదరుడు ఉన్నారు. వడదెబ్బతో తునికాకు కూలీ..చింతలమానెపల్లి: మండలంలోని అంబగట్టకు చెందిన తునికాకు కూలీ బండి విమల (58) వడదెబ్బతో మృతి చెందినట్లు ఎస్సై ఇస్లావత్ నరేష్ తెలిపారు. విమల ఈనెల 10న తునికా కు సేకరణకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం అడవికి వెళ్లిన గ్రామస్తులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కుమారుడు కొండ య్య ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. గుడుంబా పట్టివేత దస్తురాబాద్: మండలంలోని గొడిసిర్యాలలో బుధవారం 25 లీటర్ల గుడుంబాను పట్టుకున్నట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహి ంచగా గ్రామానికి చెందిన కొంపెల్లి నర్సయ్య వద్ద 8 లీటర్లు, జక్కుల సత్తవ్వ వద్ద 9 లీటర్లు, బత్తుల రాజన్న వద్ద 12 లీటర్ల గుడుంబాను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది సురేందర్, రజిత, కళ్యాణి పాల్గొన్నారు. -
సింగరేణి హైస్కూల్ లోగో ఆవిష్కరణ
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో సింగరేణి కాలరీస్ హైస్కూల్ (ఎయిడెడ్)ను ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్థ సీఎండీ బలరాం నాయక్ బుధవారం హైదరాబాద్లోని తన చాంబర్లో డైరెక్టర్ (ఆపరేషన్) సూర్యనారాయణతో కలిసి లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదెకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేసిన హైస్కూల్లో ఇప్పటి వరకు సుమారు 40 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారన్నారు. హైస్కూల్ స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. యువతి అదృశ్యంనర్సాపూర్(జి): మండల కేంద్రానికి చెందిన బర్కుంట వాణి (33) అదృశ్యమైనట్లు ఎస్సై సాయికిరణ్ తెలిపారు. ఏప్రిల్ 23న ఇంటినుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. ఇంతకాలం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో యువతి తండ్రి బర్కుంట పెద్ద ముత్యం బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పోడు సాగుదారుల గోస తీరుస్తా
● బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్తాండూర్: పోడు భూములు సాగు చేస్తున్న పేదల సమస్యలు తీరుస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. బుధవారం మాదారం గ్రామపంచాయతీ పోచంపల్లి గ్రామంలో పోడుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి నుంచి పోడు భూములు సాగు చేస్తుండగా అటవీ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని, కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అటవీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అంతలోనే అక్కడికి చేరుకున్న డెప్యూటీ రేంజ్ అధికారి జాడి తిరుపతితో ప్రత్యేకంగా మాట్లాడారు. పోడు భూములు సాగు చేస్తున్న పేదల జోలికి వెళ్లవద్దని సూచించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్, డెప్యూటీ తహసీల్దార్ వీవీఆర్కేడీ ప్రసాద్, డీసీసీ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్రెడ్డి, తాండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ ఈసా, మాజీ ఎంపీపీ సిరంగి శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్.మహేందర్రావు, మాజీ జడ్పీటీసీ బానయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, కొత్తపల్లి బీట్పరిధిలో పోడు పత్రాలు లేకుండా భూములు సాగు చేస్తున్న వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. హక్కు పత్రాలు లేకుండా భూమి సాగు చేస్తే ఊరుకునేది లేదని తాండూర్ సెక్షన్ అటవీ అధికారి సువర్ణ తెలిపారు. -
సబ్స్టేషన్లోకి చొరబడిన ఎలుగుబంటి
జన్నారం: మండలంలోని కవ్వాల్ పులుల అభయారణ్యంలోని ఎలుగుబంట్లు జనావాసాల్లో సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున జన్నారం జింకల పార్కుకు సమీపంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లోకి ఎలుగుబంటి చొరబడటంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత అది బయటికి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజులుగా మండలంలోని జువ్విగూడ, పైడిపెల్లి, జింకలపార్కు సమీపంలో ఎలుగుబంట్లు రోడ్లవెంట కనిపిస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల గుండా రాత్రి వేళ ప్రయాణం చేసేవారు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
కెరమెరి(ఆసిఫాబాద్): తెల్లవారితే డిగ్రీ సెమిష్టర్ పరీక్షలకు హాజరు కావాల్సిన ఆ విద్యార్థి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘట న మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ఎన్.మధుక ర్ తెలిపిన వివరాల మేరకు హన్మాన్వాడకు చెందిన సెండే సోమయ్య, శాంతాబాయి దంపతుల కుమారుడు సెండే ఆకాశ్ (21) ఆసిఫాబాద్లోని డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సదరు విద్యార్థి మూడు నెలలుగా కడుపులో నొప్పితో బాధపడుతున్నాడు. మంగళవారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లిచూడగా పురుగుల మందుతాగి విగతజీవిగా పడిఉన్నాడు. వెంటనే ఆసిఫాబాద్లోని ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా ఆకాశ్ స్వ యంగా ‘కిట్టుబోల్తె’ అనే యూట్యూబ్ చానల్ ఏ ర్పాటు చేశాడు. రీల్స్ చేసేవాడు. కొద్దిరోజుల క్రితం యూట్యూబ్ చానల్ను హ్యాక్ చేసినట్లు తెలిసింది. మృతుని తండ్రి సోమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చెరువులో దూకి మహిళ.. బెల్లంపల్లి: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని బెల్లంపల్లి బస్తీలో చోటు చేసుకుంది. వన్టౌన్ ఎస్హెచ్వో ఎన్.దేవయ్య తెలిపిన వివరాల మేరకు బస్తీలో నివాసం ఉంటున్న ఆయిళ్ల పోశు (60)మూడు నెలల క్రితం పక్షవాతానికి గురైంది. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురైంది. బుధవారం బస్తీ శివారులో ఉన్న పోశమ్మ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త ఆయిళ్ల పోశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో తెలిపారు. సెలంగై నాధంలో ఆదిలాబాద్ కళాకారులుఇచ్చోడ: తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్లో ని ర్వహించిన సెలంగై నాధంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కళాకారులు గుస్సాడీ నృత్య ప్రదర్శన చేసి పలువురిని అలరించారు. ఆదివాసీ సకల కళా సంక్షే మ డైరెక్టర్ కాత్లె శ్రీధర్ ఆధ్వర్యంలో కళాకారులు ఆనంద్, రాము, చిట్టిబాబు, సమ్మక్క, రాజేంద్రప్రసాద్, జలంధర్, దేవురావు, పవన్, సందీప్, లక్ష్మ ణ్, చరణ్, ఉదయ్ గుస్సాడీ, కొమ్ము, కోయ నృతా ్యలు ప్రదర్శించి ప్రశంసపత్రాలు అందుకున్నారు. రోడ్డుపైనే లారీలు..లోకేశ్వరం: మండలంలోని నగర్ శివారులో ఉన్న ప్రైవేటు గోదాంలను ప్రభుత్వం లీజుకు తీసుకుంది. కొనుగోలు కేంద్రాల నుంచి లారీల ద్వారా జొన్నలు తీసుకువచ్చి ఇక్కడ నిల్వ చేస్తున్నారు. గోదాంల వద్ద లారీల్లోంచి బస్తాలను అన్లోడింగ్ చేసేందుకు సరిపడా కూలీలు లేకపోవడంతో లోకేశ్వరం– నిజామాబాద్ రహదారిపై లారీలు ఇలా రెండు, మూడు రోజులుగా నిలిచి ఉంటున్నాయి. -
మామిడి తోటలపై ఎండల ప్రభావం
● రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి ● ఉద్యానవనశాఖ అధికారి కళ్యాణి చెన్నూర్రూరల్: వేసవికాలంలో మండుతున్న ఎండల నుంచి పండ్ల తోటలను రక్షించుకోవడంపై రైతులు దృష్టి సారించాలని హెచ్వో కళ్యాణి సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడం, గాలిలో తేమశాతం తగ్గుముఖం పట్టడంతో పండ్ల తోటల్లో కాయలపై పొడలు ఏర్పడి పెరుగుదల తగ్గిపోవడమే కాకుండా నాణ్యత కూడా దెబ్బతింటుంది. నాణ్యత లోపించిన కాయలకు మార్కెట్లో ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వేసవిలో పండ్ల తోటలపై కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో సుమారు 18 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. ఇందులో చెన్నూర్ మండలంలోని ఎర్రగుంటపల్లి, కొమ్మెర, ఆస్నాద, బుద్దారం, సంకారం, కన్నెపల్లి, పొక్కూరు, తదితర గ్రామాల్లో ఎక్కువ మొత్తంలో సాగవుతున్నాయి. మామిడి తోటల రక్షణ వేసవిలో ఎండలు పెరిగే కొద్ది కాయలపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఎండ వేడిమికి కాయలు దెబ్బతిని పెరుగుదల, నాణ్యత తగ్గిపోతుంది. ఎండ సోకిన ప్రాంతంలో కాయకు గుంత పడుతుంది. చాలా సందర్భాల్లో 20 నుంచి 30 శాతం వరకు కాయలు ఎండ తీవ్రతతో దెబ్బతింటాయి. ఇందులో బంగినపల్లి, నీలం, తోతాపరి, పలు రకాల కాయలకు ఎండ బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో కోతకు ముందే కాయ లోపలి భాగంలో మచ్చలు ఏర్పడి కణజాలం కుళ్లుతుంది. దీంతో చాలా వరకు కాయలు రాలిపోతాయి. 20 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న తోటల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నివారణ పిందెలు గోలి సైజులో ఉన్నప్పుడు ఒకసారి, నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు మరోసారి లీటరు నీటికి 20 గ్రాముల సున్నం, అర మిల్లీ లీటరు జిగురు కలిపిన ద్రావణాన్ని పిందెలు, కాయలపై సన్నటి పార ఏర్పడేలా పిచికారీ చేయాలి. ఎండల నుంచి కాయలకు రక్షణ వేసవిలో ఎండలకు కాయలు కమిలి నాణ్యత బాగా దెబ్బ తినడం వలన ధర తక్కువగా పలికే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతాలకు రవాణా చేసేందుకు పనికి రావు. గెలలకు ఎండిన ఆకులను చుట్టడం, గెలపై ఉన్న రెండు ఆకుల కాడలను మడచి ఆకులతో గెలతో ఆఛ్చాదనను ఏర్పాటు చేస్తే ఎండ నుంచి రక్షణ కల్పించవచ్చు. పాలిథిన్ సంచులు గెలలకు తొడిగి రక్షణ కల్పించవచ్చు. ఇలా చేయడం వల్ల కాయల కోత తరువాత అంత్రాక్నోస్ మచ్చ తెగులు తీవ్రత నుంచి కూడా కాపాడు కోవచ్చు. ఇలాంటి చర్యలు చేపడితే వేసవిలో ఎండ తాకిడికి పండ్ల తోటలను రక్షించుకునేందుకు అవకాశం ఉంది. -
దసలి పట్టుతో వస్త్రం
● దారం, వస్త్ర తయారీలో శిక్షణకు 30మంది రైతుల ఎంపిక ● కాయ దిగుబడిలో తెలంగాణలో అగ్రస్థానం ● యంత్రాల కోసం రూ.20.54 లక్షలు ● మూడు నెలల్లో తయారీ షురూ.. చెన్నూర్: దసలి పట్టుకాయ దిగుబడిలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంటున్న మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టు పరిశ్రమ మరో అడుగు ముందుకేసింది. రైతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పట్టు దారం, వస్త్ర తయారీకి సన్నద్ధం అవుతోంది. వస్త్ర తయారీకి అవసరమైన యంత్రాల కోసం రూ.20.54లక్షలు మంజూరయ్యాయి. దారం, వస్త్రాల తయారీపై శిక్షణకు 30మంది రైతులను ఎంపిక చేశారు. నెల రోజులపాటు నిపుణులతో చెన్నూర్ పట్టు పరిశ్రమలో శిక్షణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో చెన్నూర్ కేంద్రంగా పట్టు వస్త్రాల ఉత్పత్తి ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. చెన్నూర్ నంబర్ వన్ మంచిర్యాల జిల్లా చెన్నూర్ దసలి పట్టు సాగు రా ష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దసలి పట్టు కా య దిగుబడికి పేరుగాంచింది. ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి మించి దసలి పట్టు కా య దిగుబడి వచ్చింది. గతంతో పోలిస్తే ప్రభుత్వం పట్టు పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు పట్టు కాయ దిగుబడి మాత్రమే ఉండగా..రానున్న రోజుల్లో రీలింగ్తోపాటు వస్త్రోత్పత్తికి అవకాశం ఉంది. ఇప్పటికే రైతులు సాగుతో ఉపాధి పొందుతుండగా.. వస్త్రోత్పత్తి జరిగితే మరింత ఉపాధి లభించే అవకాశం ఉంది. భూమి లేని గిరిజన రైతులే.. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గిరిజన, ఎస్సీ, బీసీ నిరుపేద రైతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దసలి పట్టు కాయ సాగును ప్రోత్సహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబా ద్ జిల్లాల్లో భూమి లేని రైతులను గుర్తించి దసలి కా య పండించే విధానంపై శిక్షణ ఇచ్చింది. మూడు దశాబ్దాలుగా జిల్లాలో సుమారు వెయ్యి మంది రైతులు 7,500 ఎకరాల్లో దసలి పట్టు కాయలు పండిస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గొల్లతరివిడి, కౌటాల, బెజ్జూర్, మంచిర్యాల జిల్లా నెన్నెల మ ండలం మన్నెగూడెం, కోటపల్లి మండలం కొత్తపల్లి, రాజారాం, లింగన్నపేట, నాగంపేట, ఎదుల్ల బ ంధం, వేమనపల్లి మండలం ముల్కల్లపేట, చెన్నూ ర్ మండలం కిష్టంపేట, లింగంపల్లి గ్రామాల్లో దసలికాయను పండిస్తూ ఉపాధి పొందుతున్నారు. గత ఏడేళ్లుగా కుమురంభీం జిల్లాలో దసలి పట్టు సాగు కు అటవీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడ సాగు లేదు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా చెన్నూర్లోనే దసలి పట్టు కాయ సాగు చేస్తున్నారు. ఏడాదికి మూడు పంటలు దసలి పట్టు కాయ పంట 45రోజుల్లో చేతికొస్తుంది. వానాకాలం మూడు నెలలు వదిలితే ఏడాదికి మూడు పంటలు పండిస్తారు. కాయలో బైవొల్టిన్, ట్రైవొల్టిన్ అనే రెండు రకాలు ఉన్నాయి. మొదటి రకం వెయ్యి కాయకు రూ.4వేల నుంచి రూ.4,350 వరకు, రెండో రకం రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పలుకుతుంది. దసలి గుడ్లపై 50శాతం రాయితీ ఉండడంతో బైవొల్టిన్ దసలి కాయలనే ఎక్కువగా పండిస్తున్నారు. మొదటి స్థానంలో మంచిర్యాల జిల్లా.. దసలి పట్టు కాయ దిగుబడిలో రాష్ట్రంలోనే మంచి ర్యాల జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలోని భ ద్రాచలం, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలో ద సలి పట్టు కాయ సాగు చేస్తుండగా.. మంచిర్యాల జి ల్లాలోనే అత్యధికంగా రైతులు పండిస్తున్నారు. ఇక్క డి పట్టు కాయకు తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ పలుకుతుంది. చెన్నూర్ పట్టు పరిశ్రమ ఆవరణలో దసలి పట్టు కాయ వేలం పాటల్లో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పాల్గొనడం గమనార్హం. చెన్నూర్ పట్టు పరిశ్రమ ఆధ్వర్యంలో 2024–25 ప్రగతి ఉత్పత్తి లక్ష్యం సాధన గుడ్ల ఉత్పత్తి 0 84,605 పెంచిన పట్టుగుడ్ల సంఖ్య 48,200 1,34,765 పండించిన దసలి కాయలు 24,10,000 32,29,301 ఈ ఏడాది రైతుల సంఖ్య 534 567మూడు నెలల్లో.. గత ఏడాది దసలి పట్టు రైతుల కిసాన్ మేళాలో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.40 లక్షలు మంజూరు చేసింది. భవన నిర్మాణం పూర్తి కావడంతో ఇటీవల మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. భవనంలో దారం తీసే యంత్రాలను అమర్చి రీలింగ్ చేసి వస్త్రం ఉత్పత్తి చేస్తాం. త్వరలో రైతులకు శిక్షణ తరగతులు ప్రారంభించి మూడు నెలల్లో వస్త్రం తయారీ చేస్తాం. – పార్వతీ రాథోడ్, ఏడీ, సెరికల్చర్ రైతుల శ్రమే పెట్టుబడి.. దసలి పట్టు కాయ పంట సాగుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. రైతుల శ్రమనే పెట్టుబడి. ఒక్కో రైతు రూ.2వేల నుంచిరూ.3వేలతో దసలి గుడ్లు కొనుగోలు చేస్తే సరిపోతుంది. గుడ్లు పిల్లలు అయ్యే వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వాటిని చెట్లపై వేస్తారు. పట్టు పురుగులు ఆకులను తింటూ 20రోజులకు దసలి పట్టు కాయగా మారుతాయి. 40 నుంచి 55 రోజుల్లో కాయ చేతికి వస్తుంది. పట్టు పురుగులను పక్షులు తినకుండా కాయ దశకు వచ్చే వరకు జాగ్రత్తలు పాటిస్తే ఆశించిన లాభాలు వస్తాయి. రెండు నెలలు కష్టపడితే ఒక్కో రైతుకు 20వేల నుంచి 40వేల వరకు కాయ చేతికి వస్తుంది. ఒక్కొక్కరూ రూ.80వేల నుంచి రూ.1.50లక్షల వరకు సంపాదిస్తారు. -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
భైంసాటౌన్: పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ అవినాష్కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని నిర్మల్ రోడ్లో ఖడ్డా హోటల్ సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బంగాలగల్లికి చెందిన ముజాహిద్ ఖాన్ అలియాస్ సుల్తాన్ అలియాస్ ఇంతియాజ్, ఓవైసీనగర్కు చెందిన షేక్ అహ్మద్ పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. దీంతో వారిని వెంబడించి పట్టుకోగా వారి వద్ద కిలోన్నర ఎండు గంజాయి లభించినట్లు పేర్కొన్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ గోపీనాథ్తో పాటు ఎస్సై జి.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ప్రమోద్, క్రాంతి, శరత్, హరిబాబు, బాలాజీని అభినందించారు. నిర్మల్లో... నిర్మల్టౌన్: నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏఎస్సీ రాజేశ్ మీనా తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన షేక్ నిజాముద్దీన్ స్థానిక బస్టాండ్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తుండగా పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ పట్టుకున్నారు. అతని వద్ద 200 గ్రాముల గంజాయి లభించడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు అరెస్ట్ నిర్మల్టౌన్: గంజాయి సాగు చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెంబి మండలంలోని చిన్న గోధుమల గ్రామానికి చెందిన కొమరం దండురావు తన పంటచేనులో కూరగాయల చెట్ల మధ్యలో 14 గంజాయి మొక్కలు, పోచంపల్లి గ్రామానికి చెందిన మెగావత్ కై లాష్ రెండు గంజాయి మొక్కలు సాగు చేయగా పక్కా సమాచారం మేరకు ఖానాపూర్ సీఐ అజయ్, పెంబి ఎస్సై హన్మాండ్లు సోమవారం దాడులు నిర్వహించారు. దండురావు వద్ద నుంచి రూ.లక్షా 40 వేల విలువ గల 14 గంజాయి మొక్కలు, కై లాష్ వద్ద రూ.20వేల విలువగల రెండు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. -
ఆదివాసీలు అస్తిత్వాన్ని కాపాడుకోవాలి
● మంత్రి సీతక్కజన్నారం: ఆదివాసీలది ఏడు తరాల చరిత్ర అని, తాత ముత్తాతలు ఇచ్చిన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆదివాసీలందరిపై ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్నారం హరిత రిసార్ట్లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసీల జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుందన్నారు. కేస్లాపూర్లో నాగోబా, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలతో పాటు, చెట్లు, పుట్టలను పూజిస్తారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ వనవాసి పేరుతో మను ధర్మాన్ని ఆదివాసీలపై రుద్దేందుకు ప్రయత్నిస్తుందని, దీనిని ఆదివాసీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే రోడ్లు, నివాస స్థలాలకు అనుమతులివ్వని ప్రధాని మోదీ ఆదివాసీలు నివాసం ఉండే అడవులు, గుట్టలను తవ్వుకునేందుకు అంబానీలాంటి వారికి అనుమతులిస్తున్నారని విమర్శించారు. ఆదివాసీలు చదువుపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. రాజకీయ శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను చైతన్య పరచాలన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ ఆదివాసీ శిక్షణ ప్రోగ్రాం కన్వీనర్ రాహుల్ బల్, పార్టీ ఎస్సీ, ఎస్టీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు, చెన్నూర్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వెడ్మ బొజ్జు పటేల్, మాజీమంత్రి వేణు గోపాలాచారి, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
టీబీ నిర్మూలనకు కృషి చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలో టీబీ నిర్మూలనకు వైద్యారోగ్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు, వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీ, సూపర్వైజర్లు, టీబీ నియంత్రణ అధికారులు, సిబ్బందికి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఈ నెల 19నుంచి వందరోజులపాటు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. టీబీని త్వరగా గుర్తించి సరైన చికిత్స అందించాలని పేర్కొన్నారు. మధుమేహం, హెచ్ఐవీ, క్యాన్సర్, గుండె, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని వందశాతం ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలో ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, ఎంఎల్హెచ్పీల ద్వారా వ్యాధిగ్రస్తులను గుర్తించి, అక్కడే పరీక్షలు నిర్వహించేందుకు రెండు వాహనాలు కేటాయించినట్లు వివరించారు. ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుధాకర్నాయక్, డాక్టర్ ఎస్.అనిత, డాక్టర్ ఎ.ప్రసాద్, డాక్టర్ కృపాబాయి, డాక్టర్ అనిల్, జిల్లా టీబీ మేనేజర్ సురేందర్, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
ఆదిలాబాద్టౌన్: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఖుర్షీద్నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కమ్ కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాత్రి 10.30 గంటల తర్వాత ఇంటిముందు గుంపులుగా కూర్చోవడం వంటివి చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు. కాలనీలో అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్డన్ సెర్చ్లో భాగంగా కాలనీకి చెందిన ఓ వ్యక్తి బైక్ నంబర్ ప్లేట్ మార్చడంతో అతనిపై కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ సీఐ కరుణాకర్రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
136 క్వింటాళ్ల జొన్నలు సీజ్
తాంసి: మండల కేంద్రంలోని సబ్ మార్కెట్యార్డుకు మంగళవారం బయటి వ్యక్తులు తీసుకువచ్చిన 136 క్వింటాళ్ల జొన్నలను సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జొన్నల అక్రమదందాలో భాగంగా వ్యాపారులు తాంసి కొనుగోలు కేంద్రంలో విక్రయించడానికి తీసుకువచ్చిన జొన్నలను గమనించిన రైతులు నాణ్యతగా లేకపోవడం, బూజుపట్టి ఉండడంతో అధికారులకు సమాచారం అందించారు. మండల వ్యవసాయాధికారి రవీందర్, కొనుగోలు కేంద్రం ఇన్చార్జి కేశవ్, ఎస్సై దివ్యభారతి జొన్నలను పరిశీలించి ఎవరివని ఆరా తీయగా ఎవరూ ముందుకు రాలేదు. 272 సంచుల్లో మొత్తం 136 క్వింటాళ్లు ఉన్నట్లుగా ఏవో రవీందర్ పేర్కొన్నారు. జొన్నలతో పాటు వాటిని తరలించిన మ్యాక్స్ వాహనాన్ని సైతం గుర్తించి పోలీసులకు అప్పగించినట్లు ఏవో తెలిపారు. కాగా ఇప్పటికే తాంసి సబ్ మార్కెట్యార్డులో అక్రమంగా వ్యాపారులు మహారాష్ట్ర నుంచి జొన్నలను తీసుకొచ్చి పెద్దఎత్తున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం తాంసి కొనుగోలు కేంద్రానికి మహారాష్ట్ర నుంచి అక్రమంగా జొన్నలను తీసుకొచ్చే క్రమంలో నిపాని వద్ద భీంపూర్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.