breaking news
Mancherial District Latest News
-
బైక్ను ఢీకొట్టిన లారీ
జైనథ్: బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారు. ఎస్సై గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం నిరాల నుంచి జైనథ్ పోలీస్స్టేషన్కు హెడ్ కానిస్టేబుల్ గౌరీ అశోక్ బైక్పై వస్తుండగా మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా అంతర్రాష్ట్ర రహదారిపై లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ చేతికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. కాగా లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ప్రతీ సమస్య మొదట తెలిసేది సర్పంచ్కే
గ్రామంలోని ప్రతి సమస్య మొదట తెలిసేది ఆ గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్కే. సర్పంచ్లు నేరుగా రాష్ట్రస్థాయి, దేశస్థాయి వరకు కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. నేను 2000 సంవత్సరం నుంచి 2005 వరకు జైనథ్ మండలంలోని అడ గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాను. ఉత్తమ గ్రామపంచాయతీగా రాష్ట్రపతి ద్వారా అవార్డును ప్రణబ్ ముఖర్జి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. కంప్యూటరీకరణ చేపట్టడం జరిగింది. ప్రస్తుతం గ్రామపంచాయతీకి నిధులు తక్కువగా వస్తున్నాయి. నేను సర్పంచ్గా పనిచేసిన సమయంలో తాగునీటి సమస్యను పరిష్కరించాను. ఇంటింటికీ నల్లా, మరుగుదొడ్లు ఏర్పాటు చేయించాను. గ్రామంలోని భూముల కొలతలు చేయించి రికార్డులు తయారు చేయడం జరిగింది. 1995 నుంచి 2000 సంవత్సరం వరకు ఎంపీటీసీగా, ఆ తర్వాత 2000 నుంచి 2005 వరకు సర్పంచ్గా, 2006 నుంచి 2009 వరకు ఎంపీటీసీగా, 2010లో జెడ్పీటీసీగా ఎన్నికయ్యాను. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను. గ్రామ అభివృద్ధి చేసిన వారికి సర్పంచ్గా మంచి గుర్తింపు ఉంటుంది. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే -
సర్పంచ్లు ఎమ్మెల్యే అయ్యారు..
ఆదిలాబాద్టౌన్: సర్పంచ్గా ఎన్నికై ప్రజాప్రతినిధిగా అడుగు వేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేలూ అయ్యారు. ఇద్దరిదీ ఒకే మండలం.. ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం గమనార్హం. వీరిలో ఒకరు ఆదిలాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాగా, మరొకరు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న. సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను.. యూత్ ప్రెసిడెంట్గా అనేక సేవ కార్యక్రమాలు చేయడంతో 1988లో నన్ను జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మా ఊరిలో తాగునీటి సమస్య అధికంగా ఉండేది. దీంతో 1981 నుంచి 1983 వరకు యూత్ సభ్యులం కలిసి గ్రామంలో 300 హ్యాండ్ బోర్లు వేయించాం. అనేక సేవ కార్యక్రమాలు చేసేవాళ్లం. దాంతో నాపై గ్రామస్తులు నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పట్లో సర్పంచ్ అంటే నమ్మకం. గ్రామాభివృద్ధి, అవినీతికి దూరంగా ఉండేవారిని ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. మంచి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి జరిగేదని ఆకాంక్షించేవారు. గ్రామంలో సీసీ రోడ్లు, రాజీవ్ రోజ్గార్ యోజన పథకం కింద సంవత్సరానికి రూ.లక్ష వచ్చేవి. ఆ నిధులను 25 శాతం మొక్కలు నాటించేందుకు, 75 శాతం గ్రామంలో వివిధ పనులు చేయించేందుకు ఖర్చు చేశాను. స్కూల్ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఆ రోజుల్లో నేను ప్రజాసేవ చేయాలని రాజకీయంలోకి వచ్చాను. సర్పంచ్గా ఉన్న నేను 1989లో వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యాను. అంచెలంచెలుగా పదవులు చేపట్టాను. – జోగు రామన్న, మాజీ మంత్రి -
బాలికపై లైంగికదాడి.. హత్య
దండేపల్లి: బాలిక అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు విషయం బయట పడుతుందని చంపి బావిలో పడేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(6) అదృశ్యం కావ డం, మూడు రోజుల తర్వాత వ్యవసాయ బావిలో శవమై తేలడం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దండేపల్లి పోలీసులు మిస్టరీని ఛేదించారు. బాలికపై ఆమెకు దగ్గరి బంధువులైన ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడి హత్య చేశారని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ తెలిపారు. సోమవారం దండేపల్లి పోలీసుస్టేషన్ ఆవరణలో ఏసీపీ ప్రకాశ్తో కలిసి వివరాలు వెల్లడించారు. మండలంలోని నంబాల గ్రామానికి చెందిన శనిగారపు బాపు(52) భార్య ఆరేళ్ల క్రితం చనిపోయింది. కొడుకు, కూతురు ఇతడికి దూరంగా ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఉపారపు సతీష్(40)కు రెండేళ్ల క్రితం భార్యతో విడాకులయ్యాయి. ఇద్దరూ బ్యాండ్ పని చేస్తూ జీవిస్తున్నారు. ఒంటరిగా ఉంటున్న వీరు ఖాళీ సమయంలో సెల్ఫోన్లో అశ్లీల వీడియోలు చూసేవారు. కొద్ది రోజులుగా గ్రామానికి చెందిన బాలికకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకున్నారు. నవంబర్ 24న రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను ఇద్దరు కలిసి నోరు మూసి పత్తి చేనులోకి ఎత్తుకెళ్లారు. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి ఈ విషయం బయట చెబుతుందనే భయంతో గొంతు నులిమి హత్య చేశారని డీసీపీ తెలిపారు. ఆ తర్వాత వ్యవసాయ బావిలో పడేశారని పేర్కొన్నారు. పారిపోయే ప్రయత్నాల్లో భాగంగా మోటార్సైకిళ్లపై ద్వారక నుంచి మేదరిపేట వైపు వెళ్తుండగా సోమవారం పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులపై పోక్సో, అత్యాచార కేసు నమోదు చేశామని తెలిపారు. ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా శిక్ష పడేలా చూస్తామని అన్నారు. ఏసీపీ ప్రకాశ్ పర్యవేక్షణలో కేసును ఛేదించిన లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహాసీనొద్దీన్, లక్సెట్టిపేట ఎస్సై సురేష్, జన్నారం ఎస్సై అనూష, పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
ముగిసిన వెబినార్
బాసర: ఆర్జీయూకేటీలో ‘ఏఐ, పీఈజీఏ ఎమర్జింగ్ టెక్నాలజీస్’పై జరిగిన అంతర్జాతీయ వెబినార్ సిరీస్ సోమవారం విజయవంతంగా ముగిసింది. ఇండియా, యూఎస్ఏ, కొలంబియాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పాల్గొనేవారిని ఆకర్షించే విధంగా బహుళ నిపుణుల సెషన్లు ఇందులో నిర్వహించారు. ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ (వైస్ ఛాన్సలర్) ప్రొఫెసర్ ఇ. మురళి దర్శన్ (ఓఎస్టీ) డా. నమాని రాకేశ్ (కౌన్సిలర్, ఐఈఈఈ ఎస్బి ఆర్జీయూకేటీ బాసర), శ్రీ సాయిరోహిత్ తుమ్మరకోటి మార్గదర్శకత్వంలో వెబినార్ రూపొందించారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు బాసర: బాసర సరస్వతి అమ్మవారిని సోమవారం తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ కమిషనర్ సత్యనారాయణ, హై కోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ జవహర్లు తమ కుటుంబాలతో వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి అమ్మవారి హారతి, తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. కోతుల బెడద తీర్చే వారికే ఓటుదండేపల్లి: మండల కేంద్రంలో నెలకొన్న కోతుల బెడదను తీర్చే వారికే పంచాయతీ ఎన్నికల్లో ఓటేస్తామంటూ, దండేపల్లిలో బస్టాండు వద్ద గ్రామస్తులు సోమవారం ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, కోతుల బెడదను తీరుస్తామని హామీ ఇచ్చే వారికే పంచాయతీ ఎన్నికల్లో ఓటేస్తామని తేల్చి చెప్పారు. లోన్ కట్టకుంటే న్యూడ్ ఫొటోలు పంపుతామని బెదిరింపులుబోథ్: లోన్ కట్టకపోతే న్యూడ్ ఫొటోలు బంధువులకు పంపుతామని మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడికి సోమవారం వాట్సాప్ కాల్ వచ్చింది. గుర్తు తెలియని నంబరు నుంచి కాల్ చేసిన సైబర్ నేరగాడు తీసుకున్న లోన్ను చెల్లించకపోతే. న్యూడ్ ఫొటోలను బంధువులకు పంపుతామని ఉపాధ్యాయుడిని భయపెట్టాడు. అయితే తాను ఎలాంటి లోన్ తీసుకోలేదని ఆయన బదులిచ్చాడు. లోన్ తీసుకున్నారని, వెంటనే చెల్లించాలని, లేకుంటే న్యూడ్ ఫొటోలను బంధువులు, స్నేహితులకు పంపడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని వాట్సాప్ కాల్లో సదరు వ్యక్తి భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో ఉపాధ్యాయుడు వెంటనే బోథ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నంబరును ఎస్సై శ్రీసాయి బ్లాక్ చేయించి, సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఉపాధ్యాయుడికి సూచించారు. గబ్బిలానికి షార్ట్ సర్క్యూట్వేమనపల్లి: మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం వద్ద సోమవారం గబ్బిలం షార్ట్సర్క్యూట్కు గురై మృత్యువాత పడింది. దీంతో ఎల్టీ లైన్ తీగలు తెగిపోగా, ట్రాన్స్ఫార్మర్ వద్ద మంటలు లేచి ఫీజులు మాడిపోయాయి. ప్రాణహిత కాలనీతో పాటు పలు వాడలకు విద్యుత్ పరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సిబ్బంది అప్రమత్తమై విద్యుత్లైన్పై ఉన్న గబ్బిలాన్ని తొలగించి, విద్యుత్ లైన్ సరిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
పల్లె పాలనకు 61 ఏళ్లు
నిర్మల్చైన్గేట్: ప్రజాస్వామ్య వ్యవస్థలో మూలస్తంభమైన గ్రామపంచాయతీల ఏర్పాటు, కాలానుగుణంగా చోటు చేసుకున్న మార్పులు ఆసక్తిగా ఉన్నా యి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పంచాయతీ రాజ్ సంస్థల ఏర్పాటు కోసం 1957లో భారత ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మూడంచెల (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని చేసిన సూచనలను జాతీయాభివృద్ధి సంస్థ, 1958లో ఆమోదించింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీ రాజ్ సంస్థల చట్టం ఏర్పాటు చేసింది. దీన్ని మొట్టమొదటగా రాజస్థాన్ రాష్ట్రం అమలు చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1959 అక్టోబర్ 2న అమలు చేసింది. మొదట్లో పరోక్ష పద్ధతి.. ఆంధ్రప్రదేశ్లో 1964లో సమగ్ర గ్రామ పంచాయతీల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం 500 పైగా జనాభా ఉన్న గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభా ఆధారంగా 5 నుంచి 17 మంది వరకు వార్డు సభ్యులుండవచ్చని పేర్కొన్నారు. 1964లో సర్పంచ్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. వార్డు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటే, ఈ వార్డు సభ్యులు సర్పంచ్ను ఎన్నుకునే వారు. ఎన్నికై న సర్పంచ్లు కలిసి సమితి ప్రెసిడెంట్ను ఎన్నుకునేవారు. సమితి ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునేవారు. 1976 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. వీరి ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండేది. 1978 నుంచి ప్రత్యక్ష పద్ధతి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. సర్పంచ్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని ఈ కమిటీ సూచించింది. దీంతో అప్పటి నుంచి సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు.. 1992లో అమల్లోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే 1/3 వ వంతు మహిళలకు రిజర్వు చేయాలని సూచించింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మండల వ్యవస్థతో మార్పులు.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1986 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తాలూకాలను రద్దు చేసి మండల వ్యవస్థ ఏర్పాటు చేశారు. మండలాలకు 1987లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్ అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకున్నారు. దీనిలో సభ్యులుగా ఆయా మండలాల పరిధిలోని సర్పంచ్లు ఉండే వారు. ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లను ఎన్నుకునేవారు. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 ద్వారా పరిషత్ వ్యవస్థ.. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 ద్వారా అదే సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అనే మూడంచెల వ్యవస్థ రూపొందుకుంది. మండల పరిషత్లో సర్పంచ్లను సభ్యులుగా తొలగించి వారి స్థానంలో ఎంపీటీసీలను, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో ఎంపీపీలను సభ్యులుగా తొలగించి జెడ్పీటీసీలను సభ్యులుగా చేర్చారు. మెజార్టీ ఎంపీటీసీలు ఎంపీపీని, మెజార్టీ జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోవడం ప్రారంభమైంది. -
విద్యార్థిని దూషించిన టీచర్ సస్పెన్షన్
ఆదిలాబాద్టౌన్: గిరిజన విద్యార్థిని కులం పేరుతో దూషించిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవెనగర్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠాలు చెప్పకుండా ఇతర పనుల్లో నిమగ్నమైన హిందీ ఉపాధ్యాయుడు మహ్మద్ యూనుస్ను సిలబస్ వెనుకబడి ఉందని, పాఠాలు చెప్పాలని కోరాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు విద్యార్థిని కులం పేరుతో దూషించడంతో పాటు వారి కుటుంబ సభ్యులను అసభ్యపదజాలంతో దూషించాడు. విద్యార్థి తల్లిదండ్రులకు తెలుపడంతో తల్లిదండ్రులు అదేరోజు విషయాన్ని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకొచ్చారు. కాగా సోమవారం విద్యార్థిని దూషించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల నాయకులు పాఠశాలలో ఆందోళన చేపట్టారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రఘురమణ, ఆదిలాబాద్ అర్బన్ ఎంఈవో సోమయ్యలు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
నార్నూర్: మండలంలోని ఉమ్రీ గ్రామ శివారు వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకుని జాదవ్ నరేశ్ (18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై గణపతి తెలిపారు. జైనూర్ మండలంలోని అంద్గూడ గ్రామానికి చెందిన జాదవ్ సునీత, అన్నాజీ దంపతుల కుమారుడు జాదవ్ నరేశ్ బతుకు దెరువు కోసం నార్నూర్ మండలం ఉమ్రీ గ్రామానికి చెందిన జాదవ్ రాణారంజిత్ దగ్గర నాలుగేళ్లుగా పాలేరుగా పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం ఎద్దులను మేపడానికి జాదవ్ రాణారంజిత్ పొలం వద్దకు వెళ్లాడు. సాయంత్రం ఏడు గంటల వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో యజమాని రాణారంజిత్ పొలానికి వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకుని ఉండడంతో వెంటనే గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు రాత్రి వచ్చి చెట్టుకు శవమై ఉన్న కొడుకును చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ కొడుకు మృతిపై అనుమానం ఉందని మృతుడి తల్లి జాదవ్ సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్యమంచిర్యాల క్రైం: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై మజారొద్దిన్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని హమాలీవాడకు చెందిన ఆకోజి రాజు(45), భార్య భారతిల మధ్య కుటుంబ కలహాలున్నాయి. దీంతో గత ఐదు సంవత్సరాల నుంచి భారతి భర్తకు దూరంగా జైపూర్ మండలం ఇందారంలోని తల్లిగారింటి వద్ద ఉంటుంది. అప్పటి నుంచి రాజు మద్యానికి బానిసయ్యాడు. అప్పుడప్పుడు తన తల్లి విజయలక్ష్మి ఇంటికి వచ్చిపోయేవాడు. గత నెల 25వ తేదీన రాజు ఇంటికి వచ్చి వెళ్లాడు. ఈక్రమంలో సోమవారం స్థానిక కట్ట పోచమ్మ చెరువు కాలువలో రాజు మృతదేహం లభ్యమైంది. సుమారు నాలుగు రోజుల క్రితం మృతి చెంది ఉండడంతో మృతదేహం కుళ్లిపోయింది. రాజుకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రాజు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మోసం చేసిన వ్యక్తిపై కేసుఆదిలాబాద్టౌన్: నమ్మించి మోసం చేయడంతో పాటు బాధితుడిని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు సోమవారం తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన షేక్ అక్బర్, కారులో పాన్మసాలా తరలిస్తూ మహారాష్ట్రలోని మాండ్వి వద్ద అక్కడి పోలీసులకు చిక్కాడు. ఆదిలాబాద్ పట్టణంలో ఓ అడ్వకేట్ వద్ద క్లర్క్గా పని చేసే తాహెర్ అహ్మద్ ఖాన్ వాహనాన్ని విడిపిస్తానని నమ్మించి షేక్ అక్బర్ వద్ద రూ.44వేలు తీసుకున్నాడు. వాహనాన్ని విడిపించకపోవడంతో బాధితుడు ప్రశ్నించాడు. దీంతో అతనిపైనే కేసు పెట్టిస్తానని బెదిరించి మరో రూ.9వేలు వసూలు చేశాడు. వాహనం విడిపించకపోడం, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అన్నను కొట్టి చంపిన తమ్ముడురామకృష్ణాపూర్: తోడబుట్టిన అన్ననే తమ్ముడు కొట్టి చంపిన ఘటన మందమర్రి మండలం సండ్రోన్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మందమర్రి పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మెండ్రపు గోపాల్ (35), మెండ్రపు కుమార్లు అన్నదమ్ములు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. సోమవారం రాత్రి ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో కూర్చొని మద్యం తాగారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘర్షణ చోటుచేసుకోవడంతో తమ్ముడు కుమార్ క్షణికావేశంలో రోకలిబండతో అన్న గోపాల్ తలపై బాది హత్య చేశాడు. సమాచారం అందుకున్న సీఐ శశిధర్రెడ్డి, ఎస్సైలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు. -
పెద్దపులి సంచారం
బెజ్జూర్: మండల పరిధిలో పెద్ద పులి సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులు సోమవారం ధ్రువీకరించారు. ఇటీవల కృష్ణపల్లి గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి అడుగులు కనిపించడంతో అధికారులు గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తత చర్యల్లో భాగంగా కృష్ణపల్లి గ్రామంలో సోమవారం డప్పు చాటింపు ద్వారా ప్రజలకు సమాచారం అందించారు. పులి సంచారం ఉన్న నేపథ్యంలో అడవిలోకి ఒంటరిగా వెళకూడదని సూచించారు. ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించి పులి కదలికలపై నిఘా కొనసాగిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. గ్రామాల్లో పోలీసులు, అటవీ సిబ్బంది సంయుక్తంగా పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. -
బొగ్గు ఉత్పత్తిలో మందమర్రి ఏరియా పురోగతి
రామకృష్ణాపూర్: గతంతో పోలిస్తే బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో మందమర్రి ఏరియా పురోగతి సాధించిందని ఏరియా జీఎం రాధాకృష్ణ అన్నారు. నవంబర్ మాసంలో ఏరియా ఉద్యోగులందరి సమష్టి కృషితో 68శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్పతిలోనే కాకుండా బొగ్గు రవాణాలోనూ పురోగతి సాధించామని, గతంలో 30 రేకుల వరకే రవాణా జరిగితే, ఈ నవంబర్లో 33 రేకుల రవాణా చేశామన్నారు. ఉద్యోగులు, అ ధికారులు, కార్మిక సంఘాల నాయకులు స మష్టిగా సహకరిస్తే అండర్ గ్రౌండ్ గనుల్లో 100శాతం ఉత్పతి లక్ష్యం సాధించవచ్చన్నా రు. రామకృష్ణాపూర్ ఓపెన్కాస్ట్ ఫేజ్–2 ప్రజాభిప్రాయసేకరణ ఈ నెల 3న ఓసీ కా ర్యాలయ ఆవరణలో ఉంటుందని, అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో ఎస్ ఓటు జీఎం జీఎల్ ప్రసాద్, ఏరియా ఇంజినీర్ బాలాజీ భగవతి, డీజీఎం పర్సనల్ అశోక్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఐఈడీ కిరణ్కుమార్, సీనియర్ పీఓ బొంగోని శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఐవీపై అవగాహన ఉండాలి
మంచిర్యాలటౌన్: ప్రజలందరూ హెచ్ఐవీ(ఎయిడ్స్)పై అవగాహన కలిగి ఉండాలని, ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా హెచ్ఐవీ ఎయిడ్స్ సమీకృత వ్యూహ సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విద్యార్థులతో అవగాహన ర్యాలీని సోమవారం డీఎంహెచ్వో ప్రారంభించారు. ఎయిడ్స్ దినోత్స వం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జిల్లా వైద్యాధికారి అనిత మాట్లాడుతూ 2010–2025 మధ్య హెచ్ఐవీ/ఎయిడ్స్ కేసులు దేశంలో గణనీయంగా తగ్గాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్, లెప్రసి జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధాకర్నాయక్, ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్, ఆర్ఎంవోలు డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శ్రీమన్నారాయణ, దిశ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ రమేశ్ పాల్గొన్నారు. ఉత్తమ సేవలకు అవార్డులు హెచ్ఐవీ/ఎయిడ్స్పై ప్రజలకు అవగాహన కల్పించి, వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో కృషి చేసిన ఉద్యోగులకు ఉత్తమ అవార్డులను డీఎంహెచ్వో డాక్టర్ అనిత అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో కాసిపేట వైద్యాధికారి డాక్టర్ శ్రీదివ్య, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, దీపక్నగర్ సీవో సురేఖ, ఐసీటీసీ సిబ్బంది శ్రీనివాస్రెడ్డి, నరేందర్, రాజేందర్ ఉన్నారు. -
కబడ్డీ బాలికల జిల్లా జట్టు ఎంపిక
శ్రీరాంపూర్: జిల్లా జూనియర్స్ బాలికల కబడ్డీ జట్టును ఎంపిక చేశారు. కొద్ది రోజులుగా నస్పూర్లోని సాధన డిఫెన్స్ అకాడమీలో ఎంపిక పోటీలు నిర్వహించగా.. సోమవారం తుది జట్టు ప్రకటించారు. ఈ జట్టు ఈ నెల 2 నుంచి 5వరకు నల్గొండ జిల్లా హాలియ గ్రామంలో జరిగే 51వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటుందని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంచందర్, జిల్లా కార్యదర్శి కార్తీక్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. జట్టు కోచ్లుగా కే.రవీందర్, శివ, మేనేజర్గా సంఘవి వ్యవహరిస్తున్నారు. జట్టుకు ఎంపికై న వారిలో సీహెచ్.రక్షిత(రామకృష్ణాపూర్), యన్.శ్రీజ(మైలారం), ఎం.శృతి(మైలారం), ఎం.వేదనసాయి(ఎల్లారం), ఎస్.వర్షిణి(గుళ్ల సోమారం), టీ.స్రవంతి(మందమర్రి), ఏ.ఆశ్రిత(నెన్నెల), ఎం.స్పందన(కోటపల్లి), డీ.గీత(బోడపల్లి), కే.అవంతిక(పారుపెల్లి), సీహెచ్.హారిక(పార్ధీ), టీ.కల్పన(అర్జునగుట్ట), యన్.అర్చన(కొత్తపల్లి) ఉన్నారు. -
రెండో రోజు జోరుగా నామినేషన్లు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో రోజు సోమవారం జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా.. సోమవారం ఏకాదశి కావడంతో భారీగా వచ్చాయి. బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్లోని ఏడు మండలాల్లో రెండ్రోజులు కలిపి 114 సర్పంచ్ స్థానాలకు గాను 301, 996 వార్డు సభ్యుల స్థానాలకు 739 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో 1,39,312 మంది ఓటర్లు ఉండగా 69,249 మంది పురుషులు, 70,055 మంది మహిళలు, ఇతరులు 8 మంది ఉన్నారు. అభ్యర్థుల బారులు భీమిని: సోమవారం మంచి రోజు కావడంతో మండల కేంద్రం భీమినిలోని మండల విద్యావనరుల కేంద్రం లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రానికి భారీగా తరలివచ్చారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు బారులు తీరి నామినేషన్లు వేశారు. మద్దతు దారులలతో తరలిరావడంతో సందడి నెలకొంది. నామినేషన్ల వివరాలు మండలం పంచా సర్పంచ్ వార్డులు వార్డు సభ్యుల యతీలు నామినేషన్లు నామినేషన్లుబెల్లంపల్లి 17 57 156 140 భీమిని 12 32 100 075 కన్నెపల్లి 15 36 130 088 కాసీపేట 22 35 190 075 నెన్నెల 19 53 158 134 తాండూరు 15 53 144 152 వేమనపల్లి 14 35 118 075 మొత్తం 114 301 996 739భీమినిలో బారులు తీరిన అభ్యర్థులు -
రేపు మొదటి విడత ఉపసంహరణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గ్రామ పంచాయ తీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల పరిశీలన సోమవారం పూర్తయింది. అభ్యంతరాలను స్వీకరించగా.. మంగళవారం ఆర్డీవో ఆధ్వర్యంలో పరిష్కరించనున్నారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన వెంటనే మధ్యాహ్నం అభ్యర్థులను ఖరారు చేస్తూ గుర్తులు కేటాయించనున్నారు. సర్పంచ్ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొనగా.. ఒక్కో స్థానానికి ఐదు నుంచి ఎనిమిది మంది వ రకు నామినేషన్లు వచ్చాయి. దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లోని 90 గ్రామ పంచాయతీలకు గాను మూడు పంచాయతీల్లో నా మినేషన్లు దాఖాలు కాలేదు. దీంతో 87 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 90 సర్పంచ్ స్థానాలకు 408, 816వార్డు సభ్యుల స్థానాలకు 1,697 నామినేషన్లు వచ్చాయి. 816 వార్డులకు గాను 34 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడం, ఏకగ్రీవం కావడం వంటి కారణాలతో మిగతా 782 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యంతరాలు పెద్దగా రాకపోవడంతో వచ్చిన కొన్నింటి పరిష్కార ప్రక్రియ మంగళవారం త్వరగానే పూర్తి కానుంది. బుధవారం చాలా సంఖ్యలో నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ముల్కల్లలో ఇసుక రీచ్ ప్రారంభంమంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల శివారు గోదావరి తీరంలో గనులు, భూగర్భ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ సోమవారం ప్రారంభమైంది. మైనింగ్ శాఖ ఏడీ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఇసుక ట్రాక్టర్ వద్ద టెంకాయ కొట్టి రీచ్ను మళ్లీ యధావిధిగా ప్రారంభించారు. ట్రాక్టర్ యజమానులు సంయమనంతో ఇసుక రవాణా చేయాలని, ముల్కల్ల ఇసుక రీచ్ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
మా దృష్టి రాలేదు
ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు 41కిలోల వరకే తూకం వేయాలని చెబుతున్నాం. 42కిలోలు తీసుకున్నట్లు మా దృష్టి రాలేదు. – కిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి42కిలోలు పెడుతున్నారు6ఎకరాల్లో దిగుబడి వచ్చిన 130క్వింటాళ్ల వడ్లను కేంద్రంలో వారం రోజులపాటు ఆరబోసాను. హమాలీలు రాకపోవడంతో కొంత ఆలస్యమైంది. ధాన్యంలో తేమ లేకున్నా బస్తా 42 కిలోలు తూకం వేశారు. ఇదేంటని అడిగితే తరుగు కోసం అంటున్నారు. – బుచ్చన్న, రైతు, గ్రామం: కొత్తమామిడిపల్లి, మం: దండేపల్లి -
జత కలిసేనని..!
జన్నారం: జన్నారం అటవీ డివిజన్లో పులి తోడు కోసం సంచరిస్తోందా..? ఆడ పులి కోసం అన్వేషణ సాగిస్తోందా..? జత కలిసేందుకు అనువైన సమయమిదేనా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. గత కొన్ని రోజులుగా జన్నారం అడవుల్లో పులి మకాం వేసింది. అప్రమత్తమైన అటవీ అధికారులు ఎప్పటికప్పుడు కదలికలను గుర్తిస్తున్నారు. జన్నారం డివిజన్లో పర్యటిస్తున్నది మగపులిగా గుర్తించారు. ఆడపులి జత కోసం అన్వేషిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడే మకాం వేస్తుందా..? 2012 ఏప్రిల్లో కవ్వాల్ అభయారణ్యాన్ని కవ్వాల్ టైగర్ జోన్గా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పులల రాకపోకలే తప్ప ఇక్కడ ఆవాసం ఉన్న దాఖలాలు లేవు. ఒకట్రెండు రోజులు మాత్రమే ఈ ప్రాంతంలో సంచరించి తిరిగి వెళ్లేవి. కానీ గత నెల 26న జన్నారం అటవీ డివిజన్లోని ఇందన్పల్లి రేంజ్ పరిధిలో ఆవుపై దాడి చేసి చంపింది. పరిశీలించిన అటవీశాఖ అధికారులు పులి దాడిగా గుర్తించి ట్రాక్ చేశారు. సీసీ కెమెరాలు అమర్చగా వాటిలో పులి చిక్కినట్లు తెలిసింది. అదే విధంగా పలు ప్రాంతాల్లో పులి పాదముద్రలు గుర్తించి ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు అంచనాకు వచ్చారు. టైగర్జోన్లో టైగర్ తిరగడం అంత ప్రత్యేకత కాకున్నా సంవత్సర కాలంగా పులి రాక కోసం ఎదురు చూస్తున్న అటవీ అధికారులకు మాత్రం ఈ పులి ఆరు రోజులుగా ఇక్కడే మకాం వేయడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఆవాసం ఏర్పాటు చేసుకుంటే.. జన్నారం అటవీ డివిజన్ పులి ఆవాసాలకు అనువుగా ఉంది. గడ్డి మైదానాలతో వన్యప్రాణుల సంఖ్య పెరగడం, నీటిసౌకర్యం, దట్టమైన అడవులు పులికి ఆవాస యోగ్యంగా ఉంటాయి. ఆరు రోజులుగా మకాం వేసిన పులి ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నాయి. ఆడపులి తోడయితే కొన్ని రోజుల్లో పులి పిల్లలను కనే అవకాశం ఉంది. అనువైన ప్రదేశం ఉన్నందున ఇక్కడే మకాం వేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అడవుల్లోకి పశువులు, మనుషులు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. అలజడి తగ్గిస్తే పులి ఆవాసం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటుందని అంటున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.తోడు కోసమేనా..?జన్నారం అడవుల్లో తిరుగుతున్న పులిని మగ పులిగా అధికారులు గుర్తించారు. ఆడ పులికి తోక చిన్నదిగా, పాదముద్ర 4 సెంటీమీటర్లు వెడల్పు ఉంటుంది. ప్రస్తుతం జన్నారంలో తిరుగుతున్న పులి పాదముద్ర 5 సెంటీమీటర్ల వెడల్పు, తోక పొడవుగా ఉండడంతో మగ పులిగా నిర్ధారణకు వచ్చారు. ఆడపులి తోడు కోసమే వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చంద్రపూర్ అటవీ ప్రాంతం నుంచి బేల మీదుగా జన్నారం అడవుల్లోకి వచ్చినట్లు పేర్కొంటున్నారు. గత నాలుగు నెలల క్రితం లక్సెట్టిపేట అడవుల్లో కనిపించింది ఆడపులి కావడంతో దాని తోడు కోసమే ఈ ప్రాంతానికి మగపులి వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రతీ శీతాకాలంలో పులులు సంతతి పెంచుకోవడం జరుగుతుందని, జనవరి వరకు మేటింగ్లో ఉంటాయని అధికారులు తెలిపారు. అందులో భాగంగానే ఈ మగపులి తోడు కోసం వెదుకుతూ ఈ ప్రాంతానికి చేరిందని పేర్కొంటున్నారు.టైగర్ ట్రాకింగ్పై శిక్షణజన్నారం అటవీ సిబ్బందికి టైగర్ ట్రాకింగ్పై శిక్షణ ఇప్పిస్తున్నారు. కాగజ్నగర్కు చెందిన టైగర్ ట్రాకర్లతో నాలుగు రోజులు శిక్షణ ఇప్పించారు. పులి అడుగులు గుర్తించడం, ప్రత్యక్షంగా చూసే విధానం, కెమెరాలు ఏర్పాటు చేయడం, పులి మానిటరింగ్లో మెలకువలు నేర్పించారు. పులి జాడ ఎలా కనుగొనడం, జాగ్రత్తలు వివరించారు. పది రోజుల తర్వాత మరో నాలుగు రోజులు సైతం శిక్షణ ఇప్పించనున్నారు.పులి(ఫైల్) -
మున్సిపల్ కార్యాలయం ముట్టడి
చెన్నూర్: చెన్నూర్లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో సౌకర్యాలు కల్పించిన తర్వాతే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కూరగాయల వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు బొగే భారతి మాట్లాడుతూ 30ఏళ్లుగా జగన్నాథ ఆలయం ఎదుట వందలాది మంది చిరు వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. మరుగుదొడ్లు, కూరగాయల నిల్వ గదులు, తాగునీటి సౌకర్యాలు కల్పించకుండా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ బుధవారం నుంచి కూరగాయలు అక్కడే విక్రయించాలని అల్టీమేటం జారీ చేయడం బాధాకరమని అన్నారు. మహిళా వ్యాపారులని చూడకుండా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వ్యాపారాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్వెంటకస్వామి ఈ విషయంపై స్పందించి వసతులు కల్పించి భవనాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూరగాయల వ్యాపారులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ ● అధికారులకు శిక్షణ మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల్లో అధికారులు నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో 1, 2, 3 విడత స్టేజ్ రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికలు, బ్యాలెట్ నిర్వహణ, పోలింగ్, కౌంటింగ్ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు, ఏర్పాట్లు పరిశీలన, బ్యాలెట్ పేపర్ల నిర్వహణ, పోలింగ్ రోజున అవసరమైన ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ, అధికారులు, సిబ్బందికి ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మాస్టర్ ట్రైనర్లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎన్నికల అధికారి, పంచాయతీ అధికారి వెంకటేశ్వరావు, నోడల్ అధికారి శంకర్, మాస్టర్ ట్రైనర్లు హరిప్రసాద్, మధు, అధికారులు పాల్గొన్నారు. -
ధాన్యం ఆరబెట్టి తీసుకు రావాలి
వేమనపల్లి/కోటపల్లి: తేమ శాతం తగ్గే వరకు వరి ధాన్యం ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. సోమవారం ఆయన వేమనపల్లి, కోటపల్లి మండల కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యమని ధ్రువీకరించిన తర్వాతే కొనుగోలు చేయాలని, అప్పుడే వరి ధాన్యం లోడ్తో వెళ్లిన లారీలకు మిల్లుల వద్ద కోతలు, అభ్యంతరాలు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, డీపీఎం సారయ్య, ఏపీఎంలు పాల్గొన్నారు. నామినేషన్ కేంద్రాల పరిశీలన వేమనపల్లి మండలం నీల్వాయి, వేమనపల్లి నామినేషన్ క్లస్టర్లను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ వివరాలు తెలుసుకున్నారు. ఎంపీడీవో కుమారస్వామి ఆర్ఐ ఖాలిక్ పాల్గొన్నారు. దుప్పట్లు పంపిణీ మంచిర్యాలఅర్బన్: స్థానిక ఎస్సీ కళాశాల బాలుర వసతిగృహంలో సోమవారం రాత్రి విద్యార్థులకు జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య దుప్పుట్లు పంపిణీ చేశారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు దుర్గాప్రసాద్, ఏఎస్డబ్ల్యూవో ధర్మనంద్గౌడ్, ప్రశాంత్, హెచ్డబ్ల్యూవో కుమారస్వామి పాల్గొన్నారు. -
చారిత్రక శిల్పాలు గుర్తింపు
ఖానాపూర్: మండలంలోని బావాపూర్ (ఆర్) తండా సమీపంలోని గోండుగూడలో హనుమాన్ ఆలయంలో క్రీస్తుశకం 12,13 శతాబ్దాలకు చెందిన మధ్యయుగ చారిత్రక శిల్పాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్కుమార్ తెలిపారు. ఆనాటి శైవ ఆలయంలో పెద్ద ద్వారతోరణాన్ని గుర్తించారు. దాని మధ్యలో ప్రధాన శైవ ఆచార్యుడు, ఇరువైపులా అర్థ పద్మాసనాలలో కూర్చొని ఉన్న ఇద్దరు శైవ గురువులు, వారి పరిచారక గణాల శిల్పాలు ఒక్కొక్క గడిలో కూర్చి పేర్చి లతలతో అలంకరించి అందంగా చెక్కారని తెలిపారు. ఇదే గుడిలో కాకతీయుల కాలంలోనే చెక్కబడిన వినాయకుడు, నంది, నాగ శిల్పం, బాణలింగం, విరిగిన స్తంభాలు అనాటి శిల్పకళకు ప్రాణం పోస్తున్నాయి. అదేవిధంగా సింగాపూర్ గోండుగూడలో ఉన్న హనుమాన్ ఆలయంలో కాకతీయుల కాలంలో చెక్కబడిన గణపతి, లింగం, పానవట్టం, తదితర శిల్పాలు సంపూరక స్తంభాలు, ఇతర ఆధునిక శిల్పాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడి ప్రాచీన శిల్పాలు ఇప్పుడు మనుగడలో లేని రెండు లింగాల గుడి నుంచే గ్రహించి పునఃప్రతిష్ట చేసినట్టు భావిస్తున్నారు. పరిశోధనలో యువ పరిశోధకులు రాజశేఖర్, బావాపూర్ గ్రామస్తులు పవన్, రాజేశ్వర్ పాలుపంచుకున్నారు. గుర్తించిన ద్వార తోరణంనంది విగ్రహం -
పర్యాటక అభివృద్ధితో ఉపాధి
జన్నారం: పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆయా అటవీ ప్రాంతాల ను అభివృద్ధి చేసి గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలతోపాటు జన్నారం అటవీ డివిజన్ ఎంపిక చేసింది. ఆయాచోట్ల సఫారీ ప్రయాణం, అక్కడ మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరగడంతోపా టు గిరిజనులకు ఉపాధి అవకాశం ఉంటుంది. ఇందన్పల్లిలో ఇప్పటికే వెదురుతో కళావృత్తులపై శిక్షణ ఇస్తున్నారు. వెదురు కళాకండాలను పర్యాటకులు కొనుగోలు చేస్తే ఉపాధి లభించే అవకాశం ఉంది. అదేవిధంగా గైడ్లుగా, చిన్న హోటళ్లు నిర్వహించుకునే వీలుంటుంది. అభివృద్ధికి దూరంగత ఐదేళ్ల క్రితం జన్నారం అటవీ డివిజన్ను అటవీ శాఖ పర్యాటకంగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత మరిచింది. ఏటా పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అక్టోబర్ నుంచి జూన్ వరకు సఫారీ ప్రయాణానికి అనుమతి, పర్యాటకుల నుంచి కొంత ఫీజు వసూళ్లు చేస్తోంది. ఇందులో భాగంగా జన్నారం డివిజన్ గొండుగూడ బేస్క్యాంపు, బైసన్కుంట, నీలుగాయి కుంట ప్రాంతాల్లో పర్యాటకులను సఫారీ ద్వా రా తిప్పేందుకు ట్రాక్లు ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా జన్నారం డివిజన్ అధికారి పోస్టు ఖాళీ గా ఉండటం, నిధుల కొరతతో పర్యాటక ప్రదేశాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఐదేళ్లలో చేసిన ఏర్పాట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఉపాధి లభిస్తుంది అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు, వివిధ పక్షులు ఉంటాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ప్రాంతాలు అభివృద్ధి జరిగితే గైడ్స్, డ్రైవర్ల నియామకం, గిరిజనులకు చిరు వ్యాపారాల ద్వారా ఉపాధి లభిస్తుంది. – వీరెందర్, మేనేజర్ పర్యాటక శాఖ గోండుగూడ బేస్క్యాంప్బైసన్కుంటలో విహరిస్తున్న విదేశీ డక్స్ -
ఖోఖో విజేత ఆదిలాబాద్
ఆదిలాబాద్: ఖోఖో విజేతలుగా ఆదిలాబాద్ బాలుర, బాలికల జట్లు నిలిచాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వేదికగా నిర్వహించిన 44వ తెలంగాణ జూనియర్ ఇంటర్ డిస్టిక్ర్ట్ ఖోఖో టోర్నమెంట్లో ప్రతిభ కనబర్చారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో రంగారెడ్డిపై ఆదిలాబాద్ బాలుర జట్టు, మహబూబ్నగర్పై ఆదిలాబాద్ బాలికల జట్టు ఘన విజయం సాధించినట్లు శిక్షకులు శంకర్, రామ్కుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర్, కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, సీనియర్ పీడీ దయానంద రెడ్డి, శివ, తిరుమల, కృష్ణ తదితరులు విజేతలుగా నిలిచిన జట్లను అభినందించారు. -
జనవరిలో తెలుగు మహాసభలు
నిర్మల్ఖిల్లా: ప్రపంచ మూడో తెలుగు మహాసభలు జనవరి 3, 4, 5వ తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కవులు, సాహితీవేత్తలు, కళాకారులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో తెలుగు మహాసభల ఆహ్వాన, కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. నిర్మలభారతి సాహితీ సాంస్కృతిక కళాక్షేత్రం జిల్లా ప్రధాన కార్యదర్శి, పద్యకవి బి.వెంకట్ తదితరులు కలిసి ఆవిష్కరించారు. ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతిలో సభలు జరుగుతాయని తెలిపారు. తెలుగు సాహిత్య సభలు, తెలుగు కవి సమ్మేళనాలు, అష్టావదానాలు, శతావధానాలు, తెలుగు కవి సమ్మేళనాలు, తెలుగుసాహిత్య సమీక్షలు, హరికథలు, బుర్రకథలు, పద్య, సాంఘిక నాటకాలు, జానపద, శాసీ్త్రయ నృత్యాలు, హాస్యవల్లరి, హాస్యకదంబం, గ్రంథావిష్కరణలు, సాహితీ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. జిల్లాకు చెందిన సాహితీవేత్తలు నేరెళ్ల హన్మంతు, పత్తి శివప్రసాద్, అంబటి నారాయణ, పోలీస్ భీమేశ్, కొండూరి పోతన్న, కడారి దశరథ్, శశికుమార్, గంగన్న, బస్వరాజు, చెనిగారపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఎస్సై స్వరూప్రాజ్ కథనం ప్రకారం.. బెల్లంపల్లి మండలం లంబాడితండాకు చెందిన నూనె రాజశేఖర్(30) ప్రస్తుతం హాజీపూర్లో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి బీఎస్ఎన్ఎల్ టవర్ సమీపంలో జాతీయ రహదారి పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. లక్సెట్టిపేట నుంచి మంచిర్యాల వైపు వస్తున్న కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో ఢీ కొట్టాడు. తీవ్రగాయాలైన రాజశేఖర్ను వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి వివాహం కాలేదు. మేన వదిన చింతకింది లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యుత్షాక్తో ఒకరు..
ఖానాపూర్: విద్యుత్షాక్కు గురై ఒకరు మృతి చెందినట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన పన్నెల వెంకట్రాములు(49) శనివారం రాత్రి మొక్కజొన్న పంట పొలానికి నీరుపెట్టేందుకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకోలేదు. అయ్యప్ప మాలలో ఉన్న వెంకట్రాములు ఆలయంలో నిద్రిస్తున్నాడని కుటుంబీకులు అనుకున్నారు. ఉదయం పంట వైపు వెళ్లిన వేముల శ్యాంసుందర్ అక్కడ పడి ఉండడం చూసి కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతుడి భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. జైపూర్: మండలంలోని ఎల్కంటి గ్రామానికి చెందిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నా యి.. మండల రెడ్డి జాగృతి అ ధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు బేతు తిరుపతిరెడ్డి–విజయ దంపతుల కుమారుడు భరత్రెడ్డి. వరంగల్ గ్రీన్వుడ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అక్కడే హాస్టల్లో ఉంటూ ఇటీవల స్కూల్లో నిర్వహించిన గేమ్స్లో పాల్గొనగా చేతికి గాయమైంది. విషయం తెలుసుకున్న తిరుపతిరెడ్డి శనివారం భరత్రెడ్డిని మంచిర్యాలలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. శరీరంలో రక్తం గడ్డ కట్టుకుపోయిందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు కరీనంగర్ రెఫర్ చేశారు. అక్కడి వైద్యులు చికిత్స అందించి ఆదివారం హైదరాబాద్కు తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందాడు.భరత్రెడ్డి (ఫైల్) -
వరిధాన్యం తిని 40 గొర్రెలు మృతి
చెన్నూర్రూరల్: మండలంలోని తుర్కపల్లి స మీపంలోని వరి ధాన్యం తిని 40 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. సుద్దాల, తుర్కపల్లి గ్రామాలకు చెందిన గానవేన పోచయ్య, బట్టి శ్రీశైలం, అక్కల పోచ య్యలకు చెందిన గొర్రెలు శనివారం వరి చేలలో మేతకు వెళ్లాయి. అక్కడ వరి ధాన్యం తిని మృత్యువాత పడుతున్నాయి. సమాచారం అందుకున్న కత్తెరసాల పశువైద్యాధికారి సతీశ్ అక్కడకు వెళ్లి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆదివారం వరకు 40 గొర్రెలు మృతి చెందాయి. పరిస్థితి విషమంగా ఉన్న 17 గొర్రెలకు చికిత్స అందిస్తున్నారు. ఇవి కోలుకోవ డం కష్టమేనని తెలిపారు. కత్తెరసాల, ఆస్నాద, భీమారం పశువైద్యాధికారులు శ్రీనివాస్, రాకేష్శర్మ, సిబ్బందితో కలిసి జిల్లా పశు వైద్యాధికారి శంకర్ అక్కడికి వెళ్లి గొర్రెల మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. వాటికి పోస్టుమార్డం నిర్వహించారు. పీఏసీఎస్ చైర్మన్ చల్ల రాంరెడ్డి, యాదవ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ఈర్ల మల్లికార్జున్ బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని గొర్రెల యాజమానులు కోరుతున్నారు. -
సాఫ్ట్బాల్ విజేత రంగారెడ్డి
ఇచ్చోడ: 12వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషు ల సాఫ్ట్బాల్ పోటీల్లో రంగారెడ్డి జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో రంగారెడ్డి 7–2తో మహబూబ్నగర్పై ఘన విజయం సాధించింది. మండల కేంద్రంలోని గిరిజన గురుకు ల బాలుర పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈ పోటీలు ఆదివారం ముగిశా యి. రాష్ట్రవ్యాప్తంగా 21 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్లో మహబూబ్నగర్ జిల్లా జట్టుతో తలపడి రంగారెడ్డి జట్టు గెలుపొందింది. విజే త జట్టుకు కప్తోపాటు బంగారు పతకం, ద్వితీయస్థానంలో మహబూబ్నగర్కు రజ తం సాధించింది. హన్మకొండ జట్టు 4–3తో హైదరాబాద్పై గెలిచి తృతీయస్థానంలో నిలువగా కన్సోలేషన్ బహుమతి పొందింది. గెలుపొందిన జట్లకు జిల్లా యువజన, క్రీడల అధికారి శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు. సాఫ్ట్బాల్ అసోషియేషన్ ఆప్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్బాబు, తెలంగాణ అధ్యక్షుడు అభిషేక్ గౌడ్, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా కార్యదర్శి గంగాధర్, శిక్షకులు చిన్నికృష్ణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం
బాసర: హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి జాహ్నవి బంగారు పతకం సాధించింది. ఇన్చార్జి వీసీ గోవర్ధన్ ఆదివారం ఆమెను అభినందించారు. అసోసియేట్ డీన్లు డా.ఎస్.విట్టల్, డా.కె.మహేశ్, శీలం శేఖర్, స్పోర్ట్స్ సెల్ ఫ్యాకల్టీ ఇన్చార్జి ఎం.రామకృష్ణ పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీలకు జిల్లా స్విమ్మర్ ఆదిలాబాద్: జిల్లా కేంద్రానికి చెందిన కొమ్ము చరణ్తేజ ఎస్జీఎఫ్ అండర్–17 స్విమ్మింగ్ పోటీల్లో జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఆదివారం నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు న్యూఢిల్లీలోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్లో జరిగే పోటీల్లో పాల్గొంటారు. 4x100 ఫ్రీ స్టైల్ రిలేపోటీల్లో చరణ్ తేజ్ పాల్గొననున్నట్లు స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కోచ్ కొమ్ము కృష్ణ తెలిపారు. అండర్–14 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆది వారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసో సియేషన్ అండర్–14 జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చి న 48 మందిని గుర్తించి, నాలుగు టీమ్లుగా ఏర్పాటు చేసినట్లు కోచ్ పి.ప్రదీప్ తెలిపారు. నాలుగు టీమ్ల మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించి, అందులో ఉత్తమ ప్రదర్శన కనబర్చి న వారితో ఉమ్మడి జిల్లా టీమ్ను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. పీడీ గోపాల్, సీనియర్ క్రీడాకారులు చందు, తిరుపతి పాల్గొన్నారు. -
‘కలంస్నేహం’ ఆత్మీయ సమ్మేళనం
నిర్మల్ఖిల్లా: జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఆదివారం ‘కలంస్నేహం’రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి కవులు, కవయిత్రులు, గాయకులు, కళాకారులు పాల్గొని కవితలు, పాటలు వినిపించారు. వ్యవస్థాప అధ్యక్షుడు శ్రీమాన్ గోపాల్ ఆచార్య మాట్లాడుతూ కళలు మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు. సమాజంలో చైతన్యం పెంపొందించే కవితలు రాయాలన్నారు. పూర్వకవులు రాసిన కవితలు చదవాలని ‘కలంస్నేహం’సాహితీవేదిక ద్వారా ఎంతోమంది కొత్త కవులకు మార్గనిర్దేశనం చేస్తున్నామని తెలిపారు. డా.అప్పాల చక్రధారి, నేరెళ్ల హనుమంతు, వాణిజ్యపన్నుల అధికారి గోదావరి, సాంఘికసంక్షేమ విద్యాలయ ప్రిన్సిపాల్ సుమలత, నిర్వాహకులు దేవి ప్రియ, కవులు, రచయితలు కడారి దశరథ్, కొండూరు పోతన్న, శ్యామలరాణి, తోట గంగాధర్, దేవిదాస్ పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ.. సోషల్ మీడియా జోరు
సిరికొండ: పంచాయతీ ఎన్నికల వేళ..సోషల్ మీడియాలో పోస్టులు జోరందుకున్నాయి. యువత తమ ఆలోచనలు వాట్సాప్ గ్రూప్ల్లో పోస్తూ చేసి అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘నువ్వు రాజకీయాలపై నోరు మూస్తే..అవి నీ శ్వాసపై కూడా పన్ను వేస్తాయి’, ‘ఓటేసేవాడి కోసం కష్టపడేవాడు సర్పంచ్ కావాలి’‘ఒక్క ఓటు..ఊరి భవిష్యత్తు’ఈసారైనా పది మందికి ఉపయోగపడే వ్యక్తిని ఎన్నుకోండి అంటూ యువకులు తమ కోటేషన్లతో తమ గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. పార్టీ ఏదైనా సరే రాజకీయాల కోసం స్నేహాన్ని దూరం చేసుకోకండి..అంటూ వాట్సాప్ పోస్టు లు, స్టేటస్లు పెడుతున్నారు. -
పర్వం షురూ..
రెండో విడత నామినేషన్లమంచిర్యాలరూరల్(హాజీపూర్): రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం మొదలైంది. బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్లోని ఏడు మండలాల పరిధిలో 114పంచాయతీలుండగా స ర్పంచ్ స్థానానికి 45నామినేషన్లు, 996 వార్డులుండగా 30నామినేషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 1, 2 తేదీల్లోనూ నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. రెండోవిడత ఎన్నికలు నిర్వహించనున్న ఏడు మండలాల పరిధిలో 1,39,312 మంది ఓటర్లున్నారు. వీరిలో 69,249 మంది పురుషులు, 70,055 మంది మహిళలు, ఎనిమిది మంది ఇతరులున్నారు. మిగతా ప్రక్రియ ఇలా.. రెండో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఈ నెల 3న నామినేషన్ల పరిశీలన, 4న అభ్యంతరాల స్వీకరణ, 5న అభ్యంతరాల పరిశీలన ఉంటుంది. 6న నామినేషన్ల ఉపసంహరణ అనంత రం బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. 14న ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి అదేరోజు మధ్యాహ్నం 2నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి చేస్తారు. -
‘డంపు’.. కంపు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు శాశ్వత డంప్యార్డు కోసం స్థల సేకరణలో జాప్యం జరుగుతోంది. మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాలను నస్పూర్ మున్సిపాలిటీ, హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను విలీనం చేస్తూ ఈ ఏడాది జనవరిలో కార్పొరేషన్గా ఏర్పాటు చేశారు. దీంతో పరిధి పెరగడంతో పాటు రోజువారీ చెత్త సేకరణ కూడా పెరిగింది. చెత్త వేసేందుకు మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలకు శాశ్వత డంప్యార్డులు లేక ఇబ్బంది అవుతోంది. నగరంలోని ఆండాళమ్మ కాలనీలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసేందుకు గాను రెండెకరాల్లో ఏర్పాటు చేసిన డీఆర్సీ కేంద్రాన్ని డంప్యార్డుగా మార్చి కొన్నేళ్లుగా వినియోగిస్తున్నారు. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో డంప్యార్డును తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించడం లేదు. ప్రస్తుతం వినియోగిస్తున్న డంప్యార్డుకు తక్కువ స్థలం ఉండడంతో చెత్తతో నిండి దుర్గంధం వ్యాపిస్తోంది. కాలుతున్న చెత్త నుంచి వస్తున్న పొగతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీరోజు 40 మెట్రిక్ టన్నులకు పైగా చెత్త వేస్తుండడం, తడి, పొడి చెత్తను వేరు చేయక పోవడంతో డంప్యార్డు పూర్తిగా నిండిపోతోంది. ఇటీవల బయోమైనింగ్ ప్రక్రియతో కొంత తొలగించినా రోజువారీగా చెత్త వేస్తుండడంతో డంప్యార్డు స్థలం నిండిపోతోంది. పొగతో కాలనీవాసుల కష్టాలు ఆండాళమ్మ కాలనీలోని డంప్యార్డులోని చెత్త కాల్చడంతో వచ్చే పొగను పీల్చడంతో పాటు దుర్గంధం కారణంగా కాలనీవాసులు అనారోగ్యానికి గురవుతున్నారు. డంప్యార్డుకు సమీపంలోనే అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండడంతో చిన్నారులకూ ఇబ్బందులు తప్పడంలేదు. డంప్యార్డును ఆనుకుని ఆండాళమ్మ కాలనీ ఏర్పడగా, గ్రీన్సిటీ, రంగంపేట్, పవర్ సిటీ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున జరిగి వందలాది కుటుంబాలవారు నివసిస్తున్నారు. చలికాలం కావడంతో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు చెత్త కాల్చడంతో వచ్చే పొగతో మరింత ఇబ్బంది పడుతున్నారు. డంప్యార్డు కోసం ఊరికి దూరంగా శాశ్వత స్థలాన్ని పలుసార్లు అధికారులు గుర్తిస్తున్నా, ఏదో ఓ కారణంతో ఆయా స్థలాలను వినియోగించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం నస్పూరులోని సింగరేణికి చెందిన స్థలాన్ని గుర్తించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతులు తీసుకున్నా డంప్యార్డును అక్కడికి తరలించడంలో జాప్యం జరుగుతోంది. గతంలోనూ వేంపల్లి, ముల్కల్ల, తిమ్మాపూర్లో డంప్యార్డుకు స్థలాలు సేకరించినా వాటిని వినియోగించక ముందే స్థానికులు అడ్డుకున్నారు. ప్రస్తుతం నస్పూరులోనూ స్థలాన్ని గుర్తించినా మంచిర్యాల కార్పొరేషన్కు దానిని అప్పగించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శాశ్వత డంప్యార్డుకు స్థలాన్ని కేటాయించడంలో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆండాళమ్మ కాలనీ, పవర్సిటీ కాలనీ, రంగంపేట, గ్రీన్సిటీ కాలనీల ప్రజలు కోరుతున్నారు. -
● లైసెన్స్డ్ పిస్టళ్లు డిపాజిట్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారుల హెచ్చరిక ● రౌడీ షీటర్లు, మాజీలకు కౌన్సెలింగ్ ● సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ● ఎన్నికల నిర్వహణకు పక్కా ప్రణాళిక
మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్ కమి షనరేట్ పరిధిలో పంచాయతీ ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సీపీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడ మే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలోని వివిధ వ్యక్తుల వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకులను ఆయా పో లీస్స్టేషన్లలో అప్పగించాలని హెచ్చరికలు జారీ చే శారు. ఠాణాల పరిధిలోని పాత నేరస్తులు, రౌడీ షీ టర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ బైండోవర్ చేసేందుకు వారి జాబితా సిద్ధం చేశారు. మద్యం, డబ్బు ను కట్టడి చేసేందుకు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు, ఎక్కడికక్కడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, రామగుండం, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాలతోపాటు ఖానా పూర్ నియోజకవర్గ పరిధిలోని జన్నారం ఉన్నాయి. చెన్నూర్ నియోజకవర్గంలో కోటపల్లి, సిర్సా, అన్నా రం, అర్జునగుట్ట, నీల్వాయి, వేమనపల్లి ప్రాంతాలు మావోలకు పెట్టిన కోటగా పేరుంది. ఇటీవల జరిగి న ఎన్కౌంటర్లు, మావోల లొంగుబాటుతో జిల్లాలో మావోయిజం మసకబారినట్లు చర్చ జరుగుతోంది. ‘సరిహద్దు’లో ప్రత్యేక నిఘా ప్రాణహితకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు కావడంతో పోలీసులు అక్కడి గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో 306 గ్రామపంచాయతీలకు గాను 83 పంచాయతీలను పోలీస్శాఖ అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించింది. ఆయా పంచాయితీల్లో ప్ర త్యేక నిఘా పెట్టింది. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏ ర్పాటు చేశారు. జిల్లాలో ఒకటి అంతర్రాష్ట్ర, నాలుగు అంతర్ జిల్లా చెక్ పోస్టులున్నాయి. కోటపల్లి మండలం నుంచి ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్ర రోడ్డు మార్గంలో అంతర్రాష్ట్ర వారధి ఉండడంతో పార్పెల్లి సమీపంలో అంతర్ర్రాష్ట్ర చెక్పోస్ట్ ఏర్పా టు చేశారు. జైపూర్ మండలం ఇందారం, తాండూర్ మండలం రెబ్బెనపల్లి, దండేపల్లి మండలం గూడెం, జన్నారం మండలం ఇందన్పెల్లి వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్టులూ ఏర్పాటయ్యాయి. జిల్లాలో 17 లైసెన్స్డ్ తుపాకులు జిల్లాలో 17 లైసెన్స్డ్ తుపాకులున్నాయి. ఎన్నికల సందర్భంగా తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నవారి నుంచి పోలీసులు ఆయుధాలను డిపాజిట్ చేయించుకుంటున్నారు. ఇందులో 11బ్యాంక్ సెక్యూరిటీ సి బ్బంది వద్ద ఉన్నాయి. పోలీసుల ఆదేశాలతో బ్యాంకుల సెక్యూరిటీ అధికారుల వద్ద ఉన్నవి మినహా మిగతావి ఆయా ఠాణాల్లో డిపాజిట్ చేయాలని పోలీసులు హెచ్చరించారు. డిపాజిట్ చేసిన తుపాకులను కమిషనరేట్లోని ఆయుధ కారాగారంలోకి తరలించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్ గన్ పొందిన వారు ఆయుధాలు తమవద్ద ఉంచుకోవడం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన కిందకే వస్తుందని ఇప్పటికే వారికి ఆదేశాలు జారీ చేశారు. కౌన్సెలింగ్.. బైండోవర్లుజిల్లాలో 250 మందిపై రౌడీ షీట్ ఉంది. ఇందులో కొందరు మృతి చెందగా మరి కొందరు మకాం మార్చేశారు. ఇందులో కొందరు సత్ప్రవర్తనతో మెలుగుతుండగా.. కొందరు యథావిధిగా తమ పంథాను కొనసాగిస్తున్నారు. పోలీస్స్టేషన్ల వారీగా రౌడీ షీట్ రికార్డ్ల ఆధారంగా వారిని గుర్తించి వారు ఎక్కడున్నారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో? పూర్తి వివరాలు సేకరించే పనిలో ఇప్పటికే నిమగ్నమయ్యారు. వారిపై పూర్తి స్థాయి నిఘాకు ప్రత్యేక యంత్రాంగాన్నే నియమించారు. ఎన్నికల వేళ అల్లరి మూకలను కట్టడి చేసేందుకు బైండోవర్లు చేయాలని సీపీ ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ పార్టీల్లో ఉంటూ గొడవలు సృష్టించే వారి జాబితాను ఇప్పటి కే సిద్ధం చేశారు. గతంలో బైండోవర్లు చేసినవారందరినీ మళ్లీ బైండోవర్ చేయనున్నారు. -
బకాయిలు చెల్లించాలి
మంచిర్యాలటౌన్: ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, ఐదు డీఏలు వెంటనే చెల్లించా లని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించా లని పోరాటం చేయాలని తీర్మానించినట్లు టీఎ న్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి తె లిపారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో ఆదివారం టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ హరి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరి ష్కారానికి పోరాటం, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, బెనిఫిట్స్ ప్రభుత్వం అందించేలా చూడాలని రాష్ట్ర కార్యవర్గానికి ఏకగ్రీవ తీర్మా నం చేసి పంపినట్లు తెలిపారు. జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీశ్కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియారాణి, రాంకుమార్, తిరుపతి, అంజయ్య, శ్రీధర్రావు, శివప్రసాద్, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రావణ్కుమార్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు గోపాల్, కార్యదర్శి అజయ్ప్రశాంత్ పాల్గొన్నారు. -
నేటి నుంచి కొత్త వైన్స్షాపులు ప్రారంభం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలోని లిక్కర్ గోదాము వద్ద రెండు రోజులుగా సందడి కనిపిస్తోంది. డిసెంబర్ 1నుంచి నూతన మద్యం దుకాణాలు ప్రారంభం కానుండగా లైసెన్స్ పొందిన వారు కొత్త మద్యం పాలసీ మేరకు సోమవారం నుంచి షాపులు ప్రారంభించనున్నారు. గుడిపేట లిక్కర్ గోదాం పరిధిలో 135 షాపులుండగా ఇందులో మంచిర్యాలకు జిల్లా కు చెందిన 73 దుకాణాలున్నాయి. ఇక ఈ గుడిపేట లిక్కర్ గోదాము నుంచి మంచిర్యాల జిల్లాతో పా టు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, మంథని, భూపాలపల్లి జిల్లాలోని కాటారం, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ప్రాంతాల్లోని వైన్స్షాపులకు ఇక్కడి నుంచి నిల్వలు సరఫరా చేస్తారు. సోమవారం నుంచి నూతన మద్యం దుకాణాలు తెరుచుకోనుండగా రెండు రోజుల నుంచి లిక్కర్ నిల్వలు సరఫరా చేస్తున్నారు. డిపోకు వస్తున్న ఇండెంట్ల ఆధారంగా ఒక్కో దుకాణానికి మద్యాన్ని కేటాయిస్తున్నారు. రెండు రోజుల్లో కొత్త మద్యం దుకాణాలకు ఇప్పటివరకు దాదాపుగా 20వేల కేసులకు పైగా లిక్కర్, 18వేలకు పైగా బీరు కేసులు సరఫరా జరిగినట్లు స మాచారం. నూతన మద్యం దుకాణాలకు పూర్తి స్థా యిలో మద్యం నిల్వలు సరఫరా చేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతుండగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్రావు తెలిపారు. కాగా, గుడిపేట లిక్క ర్ గోదాము ఎదురుగా ఏర్పాటు చేసిన వివిధ లిక్క ర్ కంపెనీల స్వాగత ఫ్లెక్సీలు ఆకర్షణగా నిలిచాయి. -
మొదటివిడత నామినేషన్ల పరిశీలన పూర్తి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మొదటివిడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ పరిశీలన ప్రక్రియ ఆదివారం పూర్తయింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు దాఖలైన నామినేషన్ పత్రాలను కుణ్ణంగా పరిశీలించారు. చివరిరోజు భారీగా నామినేషన్లు రావడంతో 90 పంచాయతీలకు 408 నామినేషన్లు, 816 వార్డు సభ్యుల స్థానాలకు 1,697 నామినేషన్లు వచ్చాయి. అయితే, ఆయా మండలాల్లో రాత్రి వరకు కూడా నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగింది. పలు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు వివిధ కారణాలతో రిజెక్ట్ కాగా, కొందరు బాధితులు అప్పీల్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆమోదించిన నామినేషన్లపై సోమవారం అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ అభ్యంతరాలను మంగళవారం పరిశీలించి పరిష్కరిస్తారు. 3న మధ్యాహ్నం 3వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. బుజ్జగింపులు.. బేరసారాలు..సర్పంచ్గా నామినేషన్ వేసినవారిలోని ప్రధాన పా ర్టీల ముఖ్య నేతలు తమ పట్టు నిలుపుకొనేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. కొన్నిచోట్ల పోటీగా నామినేషన్ వేసినవారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. వారి నామినేషన్ ఉపసంహరించుకునేలా బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 3న మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ఉండటంతో సర్పంచ్గా ఎలాగైనా గెలువా లనుకునేవారు ఎదుటివారిని తప్పించే యత్నాలు ప్రారంభించారు. ఒక్కో పంచాయతీకి ఒక్కొక్కరే బరిలో నిలిచి ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఇప్పటికే అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. గుర్తులు ఇంకా రాకు న్నా వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక కొంతమంది అభ్యర్థులు ఓటర్లకు మద్యం, డబ్బు పంపిణీ చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం
పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. ఎన్నిక ల వేళ లైసెన్స్డ్ గన్లను డిపాజిట్ చేసుకున్నాం. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాం. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదు. ఎవరైనా ఓటర్లను ప్ర లోభాలకు గురిచేయడం, భయపెట్టడం లాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది లాంటివి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు నిర్భయంగా, నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలి. – భాస్కర్, మంచిర్యాల డీసీపీ -
చెత్తను తరలించేలా చూస్తాం
మంచిర్యాల మున్సి పల్ కార్పొరేషన్ పరి ధిలో శాశ్వత డంప్ యార్డు కోసం స్థలం సేకరిస్తున్నాం. ప్రస్తు తం వినియోగిస్తున్న ఆండాళమ్మ కాలనీ డంప్యార్డులోని చెత్తను బయోమైనింగ్ ప్రక్రియతో లేకుండా చేస్తున్నాం. శాశ్వత డంప్యార్డుకు స్థలం గుర్తించినా దానిని కార్పొరేషన్కు అప్పగించడంలో కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. దీంతోమరోచోట స్థలాన్ని సేకరించి ఆండాళమ్మ కాలనీలో వేసే చెత్తను తరలించేలా చూస్తాం. – సంపత్కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
నియమావళి పాటించాలి
బెల్లంపల్లిరూరల్: ఎన్నికల నియమావళిని పా టించాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ సూ చించారు. మండలంలోని గురిజాల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసి న నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ దాఖ లు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు అవగాహ న కల్పించారు. కేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణ, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భీమిని: కన్నెపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ మనోజ్ పరిశీలించారు. తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు. నెన్నెల: మండలంలోని నెన్నెల, నందులపల్లి గ్రామాల్లోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సబ్ కలెక్టర్ మనోజ్ సందర్శించారు. విధులు బాధ్యతలపై అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో అబ్దుల్హై, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో నరేశ్ తదితరులున్నారు. వేమనపల్లి: మండలంలోని జిల్లెడ క్లస్టర్ నా మినేషన్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ మనోజ్కుమా ర్ సందర్శించారు. ఎంపీవో వెంకటేశ్, ఆర్ఐ ఖాలిక్, పంచాయితీ సిబ్బంది ఉన్నారు. -
ఇష్టపడి చదివితేనే విజయం
మంచిర్యాలఅర్బన్: ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని అదనపు కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక షెడ్యూల్ కులాల కళాశాల బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించాల ని, మంచి స్థానంలో స్థిరపడాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వసతిగృహ కిచెన్, స్టోర్ గదులు పరిశీలించారు. అధికారులు దుర్గాప్రసాద్, ధర్మానంద్గౌడ్, చందన తదితరులు పాల్గొన్నారు. జైపూర్: మండలంలోని గంగిపల్లి, షెట్పల్లి, కుందారం, నర్సింగాపూర్ తదితర గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి ఇ బ్బందులు తెలుసుకున్నారు. తేమశాతాన్ని బట్టి వెంటవెంటనే కొనుగోలు చేయాలని సిబ్బందికి సూ చించారు. డీపీఎం సారయ్య, ఏపీఎం సంతోష్కుమార్, కేంద్రాల నిర్వహకులు, ఐకేపీ సీసీలున్నారు. -
భర్త రెండు పర్యాయాలు..భార్య ఏకగ్రీవానికి నిర్ణయం
ఇంద్రవెల్లి: ఈయన పేరు కినక జుగాదిరావ్. ఇంద్రవెల్లి మండలం వాల్గోండ సర్పంచ్గా రెండు పర్యాయాలు పనిచేసి ప్రజలకు సేవలందించారు. 2014లో వాల్గోండహిరపూర్ ఉమ్మడి పంచాయతీ సర్పంచ్గా ఈయన విజయం సాధించారు. సీసీరోడ్డు, డ్రెయినేజీ నిర్మాణాలు నిర్మించారు. తాగునీటి సమస్య పరిష్కరించారు. హీరపూర్ నుంచి వేరు అయిన వాల్గోండ పంచాయతీకి 2019 ఎన్నికల్లో తొలి సర్పంచ్గా గెలిచారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం వాల్గోండ పంచాయతీ (ఎస్టీ మహిళ) రిజర్వేషన్ వచ్చినప్పటికి ఆయన భార్య సునీతకు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఇటీవల పంచాయతీ పరిధి గ్రామాల ప్రజలు నిర్ణయించారు. -
పల్లెల్లో చెరగని ముద్ర
గ్రామాలు ప్రగతిపథంలో తీసుకెళ్లాలనే లక్ష్యం.. ప్రజల మద్దతు, సహకారంతో ఒకప్పుడు పంచాయతీల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేవి. సర్పంచులు తమ పదవీకాలంలో సీసీరోడ్లు, డ్రెయినేజీలు నిర్మించడం, పేదలకు ఇళ్లు కట్టించడం, ప్రజలకు సేవలందించారు. పల్లెల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తమదైన చెరగని ముద్రవేశారు. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న సర్పంచులపై సాక్షి ప్రత్యేక కథనం. ఐదు పర్యాయాలు ఏకగ్రీవంతాంసి: ఈయన పేరు జింక జైహింద్. తాంసి సర్పంచ్గా 25 ఏళ్ల పాటు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చదువు అంతంతే అయినే యువకుడి ఉన్నప్పుడు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నారు. 1975 నుంచి 2001 వరకు ఐదు పర్యాయాలు 25 ఏళ్ల పాటు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేశారు. 40 కుటుంబాలకు ఇళ్లు నిర్మించడం, గ్రామస్తుల సహకారంతో పాఠశాల, కళాశాలకు స్థలం కేటాయించారు. మరో ఐదేళ్ల పాటు సర్పంచ్గా ఉండాలని ప్రజలు కోరిన స్వచ్ఛందంగా వద్దనుకుని వేరేవారికి అవకాశమిచ్చారు. గ్రామం చివరలో చాయ్ హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అనారోగ్యంతో 2022 ఆగస్టులో మృతిచెందాడు. ఆయన మంచితనం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తాంసితోపాటు చుట్టూపక్కల గ్రామాల ప్రజలు ఇప్పటికి చెబుతుంటారు. -
● రాష్ట్ర స్థాయికి ప్రతిపాదన ● త్వరలో తనిఖీ బృందాల సందర్శన
‘స్వచ్ఛ’ అవార్డుకు ఎనిమిది స్కూళ్లు ఎంపికమంచిర్యాలఅర్బన్: స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రాష్ట్ర స్థాయి అవార్డుకు జిల్లాలోని ఎనిమిది పాఠశాలలను ఎంపిక చేశారు. సమగ్ర విద్య జిల్లా స్థాయిలో స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ స్క్రీనింగ్ కోసం కలెక్టర్ చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా రిజిష్టర్ చేసుకున్న 908 పాఠశాలలను జిల్లా స్థాయి తనిఖీ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించారు. వీటిలో ఏడు ప్రభుత్వ, ఒక ప్రైవేటు పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయగా.. అర్బన్ 2, రూరల్ 6 పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలలను రాష్ట్ర కమిటీ తనిఖీ బృందం త్వరలో సందర్శించనుంది. పాఠశాలలు ఇవే.. రాష్ట్ర స్థాయికి ఎంపికై న పాఠశాలల వివరాలను డీఈవో యాదయ్య శనివారం ప్రకటించారు. అర్బన్ కేటగిరీలో ఎయిడెడ్ సింగరేణి కాలరీస్ పబ్లిక్ స్కూల్ కల్యాణిఖని, కేటగిరి 2లో కేంద్రియ విద్యాలయం మంచిర్యాల, రూరల్లో కేటగిరి–1 నుంచి ఎంపీపీఎస్ రసూల్పల్లి, జైపూర్ ఎంపీపీఎస్ మాలగురిజాల బెల్లంపల్లి, స్లేట్ స్కూల్ జన్నారం, కేటగిరి–2లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందారం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిష్టాపూర్ జన్నారం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీల్వాయి వేమనపల్లి ఎంపిక య్యాయి. ఎస్హెచ్వీఆర్ కార్యక్రమంలో భాగంగా అప్లోడ్ చేసిన వివరాలు, చిత్రాలను బృందం తనిఖీ చేసింది. 5 స్టార్, 4స్టార్ పాఠశాలలో అప్లోడ్ చేసిన వివరాలు నిర్ధారించాయి. ఆయా స్కూల్ క్లాంపెక్స్ పరిధిలో కాంప్లెక్స్ హెచ్ఎం, సహాయకుడితో క్షేత్రస్థాయిలో పాఠశాలలను పరిశీలించి రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ప్రతీ రాష్ట్రం నుంచి 20 పాఠశాలలను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు. జాతీయ స్థాయిలో మొత్తం 200 పాఠశాలలను ఎంపిక చేసి రూ.లక్ష స్కూల్ గ్రాంట్గా ఇవ్వనున్నారు. పాఠశాల ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు ఎక్స్ఫోజర్ విజిట్(క్షేత్రసందర్శన)కు తీసుకెళ్తారు. పరిశీలించిన అంశాలు ఇవీ.. నీటి లభ్యత, నాణ్యత, వర్షపు నీటి నిల్వకు చర్యలు, మరుగుదొడ్లు, పనితీరు, రక్షణ చర్యలు, చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బు వినియోగం, అవగాహన కార్యక్రమాలు, పాఠశాలల నిర్వహణ, వ్యర్థాల విసర్జన, ఆస్తుల సంరక్షణ, సోలార్ వినియోగం, ఎకో క్లబ్లు, పరివర్తన మార్పులపై అవగాహన సదస్సులు, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, నీటి సంరక్షణ పథకాలు అమలు తీరుపై పలు అంశాలను పరిశీలించారు. -
అభివృద్ధిలో మార్క్
లక్ష్మణచాంద: ఈయన పేరు అట్ల రాంరెడ్డి. లక్ష్మణచాంద సర్పంచ్గా 31 ఏళ్లుగా పనిచేశారు. 1970 నుంచి 2001 వరకు సర్పంచ్గా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. అభివృద్ధిలో తన మార్క్ చూపించారు. 1970లో ఎన్నికై 1981 వరకు సర్పంచ్గా కొనసాగాడు. 1988 వర కు, అదే ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1995 జ రిగిన ఎన్నికల్లో గెలుపొందారు. గ్రా మ అభివృద్ధిలో తన మార్క్ చూపించారు. ప్రాథమికను ఉన్నత పాఠశాలను అప్గ్రేడ్, బీసీ బాలుర హాస్టల్ ఏర్పాటు, లక్ష్మణచాంద నుంచి న్యూ కంజర్, మండల కేంద్రం నుంచి ధర్మారం, తిర్పెల్లి నుంచి అనంతపేట్ వరకు రోడ్డు నిర్మించారు. గ్రామస్తుల సహకారంతో 1988లో సహకార జూనియర్ కళాశాలఏర్పాటు చేయించారు. 1998లో ఎస్వీజీ డిగ్రీ కళాశాల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. -
లింగయ్యపల్లి ఏకగ్రీవం!
● సర్పంచ్, 10 వార్డు స్థానాలు ● అన్నింటికీ ఒక్కో నామినేషన్ జన్నారం: మండలంలోని లింగయ్యపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు శనివారం వరకు ఒక్కటే నా మినేషన్ దాఖలైంది. పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి నూతనంగా లింగయ్యపల్లి ఏర్పడింది. 1300 మంది జనాభా ఉండగా.. 684మంది ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ స్థానానికి రెండో పర్యాయం ఎన్నిక జరుగుతుండగా.. ఈసారి బీసీ మహిళకు రిజర్వు అయింది. కొత్తపల్లి వనిత సర్పంచ్ అభ్యర్థిగా ఒక్కరే నామినేషన్ వేశారు. అదే విధంగా పది వార్డులకూ ఒక్కొక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే కానుంది. కాగా, వనిత భర్త శ్రీనివాస్ గత పదేళ్లుగా గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజారిగా ఉన్నాడు. పూజారిగా ఉచితంగా సేవలందిస్తానని, సర్పంచ్ స్థానానికి అవకాశం కల్పించాలని కోరడంతో గ్రామస్తులంతా అంగీకరించినట్లు తెలిసింది. లోతొర్రే గ్రామంలోనూ.. జన్నారం: మండలంలోని లోతొర్రే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం కానుంది. సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్ రిజర్వేషన్ వచ్చింది. సర్పంచ్ అభ్యర్థిగా బోడ శంకర్ ఒక్కరే నామినేషన్ వేశారు. 8 వార్డు స భ్యులకు 8 మంది మాత్రమే నామినేషన్ వేశా రు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నిక ఏకగ్రీవంపై ఎన్నికల అధికారి ప్రకటించాల్సి ఉంది. రాపల్లిలో వార్డు సభ్యురాలు.. మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లి గ్రామ పంచాయతీ 8వ వార్డు సభ్యురాలుగా స్వాతి ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. ఒకే నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
● ముగిసిన తొలి విడత దాఖలు ● భారీ సంఖ్యలో అభ్యర్థులు రావడంతో టోకెన్లు ● రాత్రివరకు సాగిన స్వీకరణ ప్రక్రియ ● రేపటి నుంచి రెండో విడత షురూ
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/జన్నారం/దండేపల్లి: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి నామినేషన్ల ఘట్టం ముగిసింది. గత రెండ్రోజులుగా సాగిన దాఖలు ప్రక్రియ శనివారంతో పూర్తయింది. చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు తరలి రావడంతో వేచి చూడాల్సి వచ్చింది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసుకుని మరీ నామినేషన్ల దాఖలుకు మందీమార్బలంతో పోటాపోటీగా తరలివచ్చారు. నామినేషన్ల స్వీకరణ గడువు సాయంత్రం 5గంటల వరకే ఉండగా.. అప్పటికే వచ్చిన వారంతా వరుసలో ఉన్నారు. దీంతో సమయంలోపు వచ్చి వారందరికీ టోకెన్లు ఇచ్చి నామినేషన్లు స్వీకరించారు. టోకెన్లు తీసుకున్న వారంతా రాత్రి వరకు వేచి ఉండి నామినేషన్లు అందజేశారు. రాత్రయినా నామినేషన్ల స్వీకరణ పూర్తి కాకపోవడంతో ఎన్ని దాఖలయ్యాయనే లెక్క తేలలేదు. దండేపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో వార్డు స్థానాలకు అభ్యర్థులు కరువయ్యారు. దీంతో అప్పటికప్పుడు అభ్యర్థులను వెతికి నామినేషన్ వేయించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు హాజీపూర్, లక్సెట్టిపేట, జన్నారం, దండేపల్లి మండలాల్లో డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. 1,28,694 మంది ఓటర్లు ఉండగా.. 62,778 మంది పురుషులు, 65,913 మంది మహిళలు, ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నారు. నేడు పరిశీలన.. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామి నేషన్లను అధికారులు ఆదివారం పరిశీలిస్తారు. అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఎన్నికల అధికారుల పర్యవేక్షణ హాజీపూర్ మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రానికి పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకుడు మనోహర్, ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజేశ్వర్ సందర్శించారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియను పర్యవేక్షించారు. డీపీఓ వెంకటేశ్వర్రావు, ఎంపీడీఓ వెంకటరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్పాండే, సీఐ అశోక్ పాల్గొన్నారు. -
నియమావళి అమలు చేయాలి
● మంచిర్యాల డీసీసీ భాస్కర్ ● పోలింగ్ కేంద్రాల సందర్శనబెల్లంపల్లి/రామకృష్ణాపూర్/దండేపల్లి: ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. శనివారం బెల్లంపల్లి పద్మశాలి భవన్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని సబ్ డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బందికి విధులు, ప్రవర్తన నియమావళి తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మందమర్రి మండలం పులిమడుగు గ్రామాన్ని డీసీపీ భాస్కర్ శనివారం సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామంలో శనివారం రాత్రి పంచాయతీ ఎన్నికలపై గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామాభివృద్ధికి పాటుపడే వ్యక్తిని ఎన్నుకోవాలని, వివాదాలకు పాల్పడవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించబోమని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బెల్లంపల్లి ఏసీపీలు ఏ.రవికుమార్, ప్రకాశ్, సీఐలు కె.శ్రీనివాసరావు, సీ.హెచ్.హనోక్, ఎన్.దేవయ్య, శశిధర్రెడ్డి, రమణమూర్తి, ఎస్సై తహాసీనొద్దీన్ పాల్గొన్నారు. -
కలమడుగులో హార్వెస్టర్..
జన్నారం: మండలంలోని కలమడుగు గ్రామంలో శనివారం వరి పంట కోస్తుండగా అకస్మాత్తుగా మంటలు వ్యాపించి హార్వెస్టర్ దగ్ధమైంది. ఫైర్ అధికారి దేవనంద్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. జక్కుల భూమన్నకు చెందిన హార్వెస్టర్ ప్రకారం కలమడుగులో వరి పంటను కోస్తుండగా డీజిల్ ట్యాంకర్ వేడెక్కి అకస్మత్తుగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే పై నుంచి కిందికి దూకాడు. గ్రామస్తులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని మంటలార్పారు. ప్రమాదంలో సీట్లు, టైర్, పై భాగం దగ్ధమైంది. రూ.4.50 లక్షల నష్టం జరిగినట్లు ఫైర్ అధికారి తెలిపారు. -
‘ఎన్హెచ్’లో కదలిక
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జాతీయ రహదారి–63 పనులు ఓ వైపు హైకోర్టు కేసులతో జాప్యం జరుగుతుండగా.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. గత ఏడాదిన్నరకు పైగా నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్ ఓపెన్ చేయకనే జాప్యం జరిగింది. తాజాగా డిసెంబర్ వరకు గడువు ఉండడంతో పలువురు కాంట్రాక్టర్లు బిడ్ వేశారు. తుదిగా వచ్చే నెలలో బిడ్ ఓపెన్ చేయనుండగా.. ఫిబ్రవరిలో పనులు ప్రారంభించాలని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే భూసేకరణతోపాటు అలైన్మెంటు మార్పు కోరుతూ ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మొదట ఈ రహదారి పనులపై కేంద్ర ప్రభుత్వం సైతం ప్రాధాన్యత జాబితాలో లేకపోవడంతోనూ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. తాజాగా రాష్ట్రం నుంచి పెండింగ్లో ఉన్న జాతీయ రహదారులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు ఆ మేరకు భూసేకరణ, చెల్లింపులు చేసేందుకు తదితరవన్నీ పూర్తవుతున్నాయి. ఇప్పటికే హాజీపూర్ మండలం పోచంపాడ్, వేంపల్లిలో దాదాపు 20 ఎకరాలకు పైగా సుమారు రూ.4కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. మిగతా చోట్ల కూడా భూసేకరణలో పరిహారం చెల్లింపులు జరిగితే పనులు సాగనున్నాయి. ఈ రోడ్డు కోసం జిల్లాలో మొత్తంగా 378 ఎకరాల వరకు సేకరించాల్సి ఉంది. రైతుల ఆందోళన జిల్లా పరిధిలో ప్రస్తుత కార్పొరేషన్ పరిధి హాజీపూర్ మండలం ముల్కల్ల నుంచి మందమర్రి మండలం క్యాతనపల్లి శివారు కుర్మపల్లి క్రాస్ వరకు బైపాస్ రోడ్డు అలైన్మెంటు ఉంది. మొత్తంగా జిల్లా పరిధిలో 33కిలోమీటర్ల నిడివి చూస్తే లక్సెట్టిపేట మండలం నుంచి లక్సెట్టిపేట, మోదెల, ఇట్కాల, పోతేపల్లి, గుల్లకోట, మిట్టపల్లి, కర్ణమామిడి, హాజీపూర్, పడ్తానపల్లి, నర్సింగాపూర్, గుడిపేట, ముల్కల్ల, వేంపల్లి, మంచిర్యాల, తిమ్మాపూర్, క్యాతనపల్లి గుండా రోడ్డు వెళ్తోంది. మొదట ప్రణాళిక ప్రకారం బెపాస్ అలైన్మెంటు మార్చడం పట్ల నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. తమ పంట పొలాల నుంచి వెళ్లొద్దంటూ నిరసనలు చేపట్టారు. ఇప్పటికీ అలైన్మెంటు మార్చుతారా? అనే ఆశతో ఉన్నారు. అయితే ఎన్హెచ్ఏఐ తుదిగా డిజైన్ ఖరారు చేయడంతో ఇక మార్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ఎన్హెచ్–63 పనులు మొదలు కానున్నాయి. ఇక క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. దీంతో తమకు సరైన పరిహారం పొందుతామా? లేదా? అని న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. -
ఏరియా ఆసుపత్రికి ఆధునిక లాండ్రి మంజూరు
బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆస్పత్రికి మెకనైజ్డ్ లాండ్రి మంజూరైంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 19 ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులకు మెకనైజ్డ్ లినెన్ లాండ్రి సర్వీసెస్ మంజూరు చేస్తూ రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ నిర్ణయం తీసుకుంది. ఇందులో బెల్లంపల్లి ఒకటి కాగా.. రూ.25లక్షల అంచనా వ్యయంతో యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఆస్పత్రిలో పక్కా భవన నిర్మాణం చేపట్టగా పనులు తుది దశకు చేరాయి. ఆస్పత్రిలో వినియోగించే బెడ్షీట్స్, పిల్లో కవర్స్, ఓపీ గౌన్స్, మాస్క్ ఇతర వస్త్రాలను ప్రస్తుతం దోభీ ద్వారా శుభ్రం చేయిస్తున్నారు. ఆస్పత్రిలో ఒక్కరే దోభీ ఉండడంతో ఉతకడం కష్టతరం అవుతున్నట్లు గ్రహించిన రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ కమిషనర్ యంత్రాలు మంజూరు చేశారు. ఇకపై మెకనైజ్డ్ లాండ్రి ద్వారా దుస్తులు శుభ్రం చేయనున్నారు. తద్వారా దుస్తుల శుభ్రత వేగవంతం అవుతుంది. ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి కాగా.. జోన్–1 పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లో ప్రైవేటు కంపెనీ లాండ్రిని నిర్వహించనుంది. -
20 ఏళ్లుగా సేవలు..
ఇచ్చోడ: ఈయన పేరు పాముల మోతీరాం. ఇచ్చోడ మండలం కోకస్మన్నూర్ సర్పంచ్గా 20 ఏళ్లుగా ప్రజలకు సేవలందించారు. 1974 నుంచి 1994 వరకు పైసా ఖర్చుచేయకుండా నాలుగు పర్యాయాలుగా సర్పంచ్గా ఎంపికయ్యారు. మొదట, రెండుసార్లు వార్డు సభ్యుడిగా, ఆపై సర్పంచ్గా ఎన్నికయ్యారు. అప్పట్లో వార్డు సభ్యుడిగా ఎంపికై న వారే మెజార్టీ సభ్యుల మద్దతుతో సర్పంచ్ పదవిని పొందేవారు. అలా రెండుసార్లు చొప్పున జనరల్, ఎస్సీ రిజర్వేషన్లో సర్పంచ్గా గెలుపొందారు. అప్పట్లో కోకస్మన్నూర్లో వేసవిలో నీటి ఎద్దడి ఉండేది. 1983లో బోథ్ నియోజకవర్గంలోనే మొదటిసారిగా వాటర్ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించారు. ఇంటింటికి నల్లాల ద్వారా నీరందించారు. -
ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్(టీజీఆర్ఏసీ) సంచాలకులు, అదనపు జనరల్ సంచాలకులు, ఎన్నికల సాధారణ పరిశీలకులు పి.మనోహర్, ఎన్నికల ఖర్చుల పరిశీలకులు ఈ.రాజేశ్వర్తో కలిసి నోడల్ అధికారులు, సహాయ ఖర్చుల పరిశీలకులు, ప్రత్యేక బృందాల అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ అభ్యర్థులు ప్రచారంలో వినియోగించే ప్రతీ అంశాన్ని ఎన్నికల సంఘం జారీ చేసిన ధరల పట్టికను అనుసరించి లెక్కించాలని తెలిపారు. ఎన్నికల ఖర్చుల వివరాలు ప్రతీరోజు నమోదు చేయాలని, సహాయ ఖర్చుల పరిశీలకులు ఖర్చుల వివరాలను పరిశీలించాలని తెలిపారు. ఫిర్యాదులు, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నంబరు 08736– 250501 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
సత్యనారాయణస్వామే తిరిగి రప్పించాడు..!
లక్సెట్టిపేట: ‘నన్ను ఆ గూడెం సత్యనారాయణస్వామే తిరిగి రప్పించాడు. నా ఆరోగ్యం గురించి సహకరించిన వారికి, దేవుళ్లకు ప్రార్థించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు..’ అంటూ మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు(పీఎస్సార్) భావోద్వేగానికి గురయ్యారు. శనివారం మండల కేంద్రంలోని ఐబీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక దశలో ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. తన ఆరోగ్యం బాగా లేకున్నా సీఎం రేవంత్రెడ్డి, వైద్యులు వెళ్లవద్దని చెప్పినా సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో ప్రజల కోసమే వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే ఒకసారి సర్జరీ అయిందని, మరోసారి చిన్నపాటి సర్జరీ కోసం మళ్లీ కోయంబత్తూరు వెళ్తున్నట్లు తెలిపారు. తనకు వచ్చిన అనారోగ్య సమస్యలు ఎవరికీ రావొద్దని, వచ్చినా చికిత్స అందుబాటులో ఉండేందుకు మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. అన్ని విధాల శస్త్రచికిత్సలు అందుబాటులో ఉంటాయని, సుదూర ప్రాంతాలకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు. తన ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతున్నానని, అందుకు సహకరించిన సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల బృందానికి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని, పార్టీ అభ్యర్థులకు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాలుగు నెలల తర్వాత పట్టణానికి వచ్చిన పీఎస్సార్కు కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి ఐబీ వరకు బైక్ ర్యాలీ, డీజే చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల సర్పంచ్ అభ్యర్థుల పేర్ల జాబితాను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం త్రిమూర్తి, ఎండీ ఆరీఫ్, పింగిళి రమేష్, చెల్ల నాగభూషణం, చింత అశోక్కుమార్, పూర్ణచందర్, శ్రీనివాస్, దాసరి ప్రేంకుమార్, రాజు పాల్గొన్నారు. -
జన్నారం అటవీ డివిజన్లో పులి గాండ్రింపు
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ పులి గాండ్రిస్తోంది. గత నాలుగు రోజులుగా అడవిలో పులి కదలికలు కనిపిస్తున్నాయి. రెండ్రోజులు గా ఇందన్పల్లి అటవీ రేంజ్లో పర్యటిస్తూ చంపిన ఆవు మాంసాన్ని తిన్నట్లు అధికారులు గుర్తించారు. మూడో రోజు వేరే ప్రాంతంలో పులి అడుగులు కనిపించాయి. శనివారం రాత్రి 8గంటల ప్రాంతంలో జన్నారం డివిజన్లోని ఓ ప్రాంతానికి పులి పర్యవేక్షణకు వెళ్లిన సిబ్బంది నేరుగా పులి గాండ్రింపులు విన్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. 15సార్లు గాండ్రించిందని, భయంతో పరుగులు తీశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పులి ఉన్న చోట నుంచి రెండు కిలోమీటర్ల చుట్టూ మూత్ర విసర్జన చేస్తుంటుందని తెలిసింది. ఆ వాసన ఆధారంగా పులి సంచారాన్ని అధికారులు ధ్రువీకరిస్తారని సమాచారం. అటవీ ప్రాంతంలో పర్యటించిన పలువురు వ్యక్తులతోపాటుగా అటవీ అధికారులు అలాంటి వాసన గమనించినట్లు తెలిపారు. వీటన్నింటి ఆధారంగా పులి ఈ ప్రాంతంలోనే పర్యటిస్తున్నట్లు నిర్ధారణకు వస్తున్నారు. కదలికలపై అప్రమత్తంగా ఉంటున్నారు. -
విద్యార్థినిని వేధించిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని విద్యానగర్లోని పారామెడికల్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ప్రేమ పేరిట వేధింపులకు గురిచేసిన యువకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఫైజాన్.. నెల క్రితం కళాశాలలో పరీక్ష ఫీజు కట్టడానికి వచ్చిన విద్యార్థిని ప్రేమిస్తున్నానని ఇబ్బందులకు గురిచేశాడు. చేతిలో ఉన్న సెల్ఫోన్ను తీసుకుని పగులగొట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసి ఫైజాన్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రీలాన్స్ జర్నలిస్టుపై.. ఆదిలాబాద్రూరల్: పట్టణానికి చెందిన ప్రీలాన్స్ జర్నలిస్టు ఫిరోజ్ఖాన్పై అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈనెల 26న సాయంత్రం ఫిరోజ్ఖాన్తోపాటు మరో వ్యక్తి ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. సరిగా డ్యూటీ చేయడం లేదని రెస్టారెంట్లు తనిఖీ చేయడం లేదని బెదిరించారు. రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష మావల పీఎస్లో ఫిర్యాదు చేసింది. విధులకు ఆటంకం కలిగించడంతోపాటు కులంపేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం కారు నిలిపిన చోట ఫొటో తీసి, అధికారిగా ఉండి బ్లాక్ఫిల్మ్ పెట్టావని వార్త రాసి అధికారికే పోస్టు చేశారు. ‘రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని ప్రభుత్వం’నేరడిగొండ: రైతుల ఆత్మహత్యల గోసను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ, రైతు స్వరాజ్యవేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న అన్నారు. మండలంలోని కిష్టాపూర్కు చెందిన కౌలు రైతు సోలాంకి శ్రీకాంత్ ఇటీవల ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకోగా, శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రెండు మూడేళ్లుగా పంట దిగుబడి రాలేదని మనోవేదనకు గురై ఉరేసుకున్నాడు. పంటకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకున్నారు. బాధిత కుటుంబానికి జీవో నం.194 ప్రకారం రూ.6లక్షల పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. కుటుంబ యజమానురాలికి నెలకు రూ.5వేల పెన్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు. నాయకులు బుపేందర్, సంతోష్, ప్రమోద్ ఉన్నారు. బీజేపీ జిల్లా ఇన్చార్జీల నియామకంఆదిలాబాద్: బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఇన్చార్జీలను శనివారం నియమించింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్కు మాజీ ఎమ్మెల్యే అరుణతార, మంచిర్యాలకు కె.ఓదెలు, నిర్మల్కు గోపిడి స్రవంతిరెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు కోమల ఆంజనేయులను నియమించారు. -
ఉదయం అలా.. సాయంత్రం ఇలా
నేరడిగొండ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని నాగమల్యాల్ గ్రామంలో శనివారం ఉదయం కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడారు. మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడంతోపాటు మాజీ సర్పంచ్ భీముడుతోపాటు పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా సాయంత్రం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో మాజీ సర్పంచ్ భీముడుతోపాటు పలువురు గ్రామస్తులు ఆయన్ను కలిసి మేము పార్టీలో చేరలేదని, వారే మాకు కండువా కప్పారని తెలిపారు. కాగా ఒకేరోజు రెండు పార్టీల కండువాలు కప్పుకోవడం పట్ల పలువురు చర్చించుకుంటున్నారు. -
ఆస్తులు లేకున్నా మంచి పేరుంది
మందమర్రిరూరల్: ఈయన పేరు లింగాల మల్లయ్య. మందమర్రి మండలం అందుగులపేట పంచాయతీకి వరుసగా రెండుసార్లు సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2006లో (జనరల్), 2012లో (ఎస్సీ జనరల్) జరిగిన పోటీల్లో ఇండిపెండెంట్గా గెలిచి ప్రజలకు సేవలందించారు. 2017లో (జనరల్ సీటు) కావడంతో ఓడిపోయాడు. 2001లో ఎస్సీ మహిళ రిజర్వేషన్తో ఆయన భార్య లక్ష్మి పోటీ చేసి గెలిచింది. ప్రస్తుతం అందుగులపేటకు రిజర్వేషన్ మారడంతో పోటీ చేయడం లేదు. ప్రస్తుతం ఇంటి వద్ద టైలర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దంపతులకు ఎలాంటి ఆస్తులు లేవని, గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నారు. -
షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్లు దగ్ధం
లోకేశ్వరం: మండలంలోని కన్కపూర్లో దూదిగాం చిన్న సాయన్నకు చెందిన పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయన్న కుటుంబ సభ్యులు శనివారం ఉదయం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో శుభకార్యం కోసం వెళ్లారు. అదేగ్రామానికి చెందిన గండ్ల తులసిబాయి పక్కన అద్దెకు ఉంటుంది. ఈమె నూతనంగా ఇంటి నిర్మించుకుంటుంది. ఇంటి పని నిమిత్తం బయటకు వెళ్లింది. మధ్యాహ్నం ఒక్కసారిగా చిన్న సాయన్న పెంకుటిల్లు నుంచి మంటలు వచ్చాయి. ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని సింగిల్ ఫేజ్ మోటారుతో మంటలార్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న భైంసా ఆగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పేశారు. సాయన్నకు చెందిన రెండు తులాల బంగారు ఆభరణాలు, తులసిబాయి ఉన్న అద్దెంట్లో రూ.5 లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఆర్ఐ లలిత ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాదాపు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. కాగా, దేవుడి వద్ద వెలిగించే దీపం వల్ల షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగి ఉండవచ్చనని గ్రామస్తులు భావిస్తున్నారు. -
సివిల్స్ ప్రిపరేషన్.. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఓ విద్యావంతురాలు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామానికి చెందిన బానోత్ కావేరి బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ కోసం మహారాష్ట్రలో శిక్షణ పొందుతూ సన్నద్ధమవుతోంది. ఈమె తండ్రి బానోత్ గజానంద్ నాయక్ 15ఏళ్లు నార్నూర్ సర్పంచ్గా పని చేశారు. ఈసారి రిజర్వేషన్ మారడంతో తన వారసురాలిగా కావేరిని బరిలోకి దింపారు. మండల కేంద్రం నార్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో కలిసి నామినేషన్ వేశారు. పుట్టినగడ్డకుసేవ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నట్లు కావేరి తెలిపారు. -
మూడు గ్రామాల్లో పాతకథే..!
● నామినేషన్లు వేసేవారు లేక నిలిచిపోనున్న ఎన్నికలు దండేపల్లి: మండలంలోని గూడెం, నెల్కివెంకటాపూర్, వందుర్గూడ గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఎన్నికలు నిలిచిపోనున్నాయి. గూడెంలో గిరిజనులు లేకున్నా ఏజెన్సీ గ్రామంగా ప్రకటించారు. దీంతో సర్పంచ్, సగం వార్డు స్థానాలు గిరిజనులకే రిజర్వు చేయడంతో అభ్యర్థులు లేని కారణంగా అక్కడ 1987 నుంచి ఇప్పటివరకు సర్పంచ్ ఎన్నికలు నిలిచిపోతున్నాయి. ఏజెన్సీ పరిధి నుంచి గ్రామాన్ని తొలగించాలని మిగతా రిజర్వేషన్ స్థానాల్లో గ్రామస్తులు పోటీ చేయకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నెల్కివెంకటాపూర్, వందుర్గూడలోనూ అంతే.. మండలంలోని నెల్కివెంకటాపూర్, వందుర్గూడ గ్రామాల్లోనూ పంచాయతీ ఎన్నికలు నిలిచిపోనున్నాయి. ఇది రెండోసారి కావడం గమనార్హం. వందుర్గూడ నెల్కివెంకటాపూర్ పంచాయతీలో ఉండేది. వందుర్గూడ నూతన పంచాయతీగా ఏర్పాటు చేశారు. దీన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తూ ఎన్నికలు బహిష్కరిస్తున్నారు. ఇక నెల్కివెంకటాపూర్ ఏజెన్సీ గ్రామం కావడంతో ఇక్కడ సర్పంచ్, సగం వార్డులను ఎస్టీలకు రిజర్వు చేశారు. ఈ గ్రామంలో గిరిజనులు లేని కారణంగా ఎవరూ నామినేషన్ వేయడం లేదు. ఈ కారణంతో ఎన్నికలు నిలిచిపోతున్నాయి. -
ఓసీ ఏర్పాటుతో ఇబ్బందులు ఉండవు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్లో ఓపెన్కాస్ట్ ఫేజ్–2 రాకతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని మందమర్రి జీఎం రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఆర్కే4 గడ్డ ప్రాంత ప్రజలు శనివారం సాయంత్రం జీఎంను తన ఛాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఓసీ మ్యాప్ చూపెడుతూ గని ఎక్కడి నుంచి ఎక్కడికి ఏర్పాటు కానుందో వివరించారు. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. పాత గనులు కలుపుతూ ఏర్పాటు అవుతుందని ఏ ఒక్కరికి నష్టం లేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోనూ స్థానికులకే ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ఎస్ఓటు జీఎం ప్రసాద్, డీజీఎం పర్సనల్ అశోక్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి అక్బర్అలీ తదితరులు పాల్గొన్నారు. -
విత్తనచట్టంపై అభిప్రాయ సేకరణ
మంచిర్యాలఅగ్రికల్చర్: కేంద్ర ప్రభుత్వం పాత విత్తన చట్టాన్ని మార్చి నూతన విత్తన చట్టాన్ని తీసుకురావడానికి రైతుల అభిప్రాయాన్ని సేకరిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఎర్పాటు చేసిన అభిప్రాయ సేకరణపై జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, బెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్త మహేశ్తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నూతన విత్తన చట్టం–2025 ముసాయిదాపై అందరి భాగస్వామ్యంతో అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. రైతుల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వనికి నివేదిక అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ, ఏవో, ఏఈవోలు పాల్గొన్నారు. -
తాగిన మైకంలో ఒకరి ఆత్మహత్య
ఉట్నూర్రూరల్: తాగిన మైకంలో ఒకరు ఆత్మహ త్య చేసుకున్న ఘటన మండలంలోని పాత ఉట్నూర్లో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాత ఉట్నూర్లో నివాసముండే రా థోడ్ నూర్సింగ్ (63) మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించి తరచూ కుటుంబ సభ్యులతో గొ డవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి మద్యం సేవించి వచ్చి గొడవకు దిగాడు. కుటుంబ సభ్యులు సర్ధి చెబుతుండగా అకస్మాత్తుగా కింద పడ్డాడు. ఈ సమయంలో అతడి తలకు దెబ్బ తగలగా ఆస్పత్రికి వెళ్తామని చె ప్పినా వినలేదు. ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఇంటిలోని గది లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన స్థానిక ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలి పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఈ మూడు గ్రామాల్లో ఎన్నికల్లేవ్?
దండేపల్లి: పంచాయతీ ఎన్నికల వేళ మండలంలోని అన్ని గ్రామాలు సందడిగా మారగా.. గూడెం, నెల్కివెంకటాపూర్, వందుర్గూడ గ్రామాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. గూడెం గ్రామానికి సర్పంచ్ లేక 38 ఏళ్లవుతోంది. నెల్కివెంకటాపూర్ గ్రామంతోపాటు కొత్తగా ఏర్పాటైన వందుర్గూడ పంచాయతీకి గత 2019 పంచాయతీ ఎన్నికల్లో ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఈ రెండు గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు. శుక్రవారం వరకు ఈ మూడు గ్రామాల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. గూడెం ఏజెన్సీ గ్రామం కానప్పటికీ.. గూడెం గ్రామంలో 2,140 మంది ఓటర్లున్నారు. ఇందులో గిరిజనులెవ్వరూ లేరు. అయినప్పటికీ ఈ గ్రామాన్ని ఏజెన్సీ గ్రామంగా గుర్తించారు. దీంతో గ్రామంలోని సర్పంచ్ పదవితో పాటు సగం వార్డు స్థానాలు ఎస్టీలకే రిజర్వ్ చేశారు. దీంతో గ్రామంలో సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు స్థానాలకు పోటీ చేసేందుకు గ్రామంలో గిరిజనులెవరూ లేరు. 1987 నుంచి గూడెం పంచాయతీకి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో ఆ గ్రామానికి సర్పంచ్ లేక 38ఏళ్లు గడిచింది. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. నెల్కివెంకటాపూర్, వందుర్గూడలోనూ.. కొత్త పంచాయతీల ఏర్పాటుకు ముందు వందుర్గూడ గ్రామం నెల్కివెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. వందుర్గూడను నెల్కివెంకటాపూర్ నుంచి విడదీసి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. అయితే వందుర్గూడ పంచాయతీ ఏర్పాటును గ్రామస్తులు వ్యతిరేకించారు. తమ గ్రామాన్ని నెల్కివెంకటాపూర్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో పంచాయతీ ఎన్నికలు బహిష్కరించారు. వందుర్గూడను విడదీయడంతో నెల్కివెంకటాపూర్లో గ్రామంలో గిరిజనులెవరూ లేని పరిస్థితి ఏర్పడింది. నెల్కివెంకటాపూర్ గ్రామం కూడా ఏజెన్నీ గ్రామం కావడంతో ఇక్కడ గిరిజనులు లేని కారణంగా గత 2019 పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎస్టీ అభ్యర్థులు లేక నామినేషన్లు వేయలేదు. దీంతో అప్పటి పంచాయతీ ఎన్నిక నిలిచిపోయింది. ఈ రెండు గ్రామాల పంచాయితీ ఎటూ తేలక పోవడంతో, ఈసారి కూడా ఎన్నికలు జరగడం అనుమానమే. -
మిస్టరీగా బాలిక మరణం
దండేపల్లి: మండలంలోని నంబాల గ్రామానికి చెందిన శనిగారపు మహన్విత (7) మృతి మిస్టరీగా మారింది. ఆడుకోవడానికి వెళ్లిన బాలిక సోమవారం అదృశ్యం కావడం.. మూడు రోజు ల తర్వాత గురువారం బావిలో శవమై తేలడం తెలిసిందే. బాలిక మృతదేహం లభించిన బావి ఇంటి నుంచి దూరంగా ఉంది. బాలిక ఒక్కరే అంతదూరం ఒంటరిగా వెళ్లలేని విధంగా పరిస ర ప్రాంతాలున్నాయి. దీంతో ఎవరైనా హత్య చేసి బావిలో పడేసి ఉండొచ్చని, మరోవైపు చి న్నారిని లైంగిక వేధింపులకు గురి చేసి చంపి ఉంటారనే అనుమానాలూ వ్యక్తమవుతున్నా యి. బాలిక అదృశ్యమైన రోజు పోలీస్ డాగ్స్క్వాడ్ ఇంటివద్దే కొద్దిసేపు సంచరించాయి. మృతదేహం లభించిన రోజు మాత్రం డాగ్స్క్వాడ్ బా వి నుంచి ఇంటి వద్దకు వచ్చాయి. బాలిక మృతి పై గ్రామంలో పలు విధాలుగా చర్చ జరుగుతోంది. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ మరణానికి కారణాలేమిటనేది చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. మృతదేహం నీళ్లలో ఎ క్కువ రోజులు ఉండడంతో కారణాలు కనుగొ నడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. బంధువుల ఆందోళన బాలిక మృతిపై న్యాయం చేయాలని తల్లిదండ్రులు, బంధువులు గ్రామస్తులు వంద మందికిపైగా శుక్రవారం దండేపల్లి పోలీస్స్టేషన్ వద్దకు వచ్చారు. స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు ప్రయత్నం చేశారు. మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చే శారు. ఇదే సమయంలో కేసు విచారణలో భా గంగా దండేపల్లి స్టేషన్కు వచ్చిన ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి వెంటనే బయట కు వచ్చి బాలిక తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. బాలిక కుటుంబానికి న్యాయం చే స్తామని, పోస్టుమార్టం నివేదిక రాగానే దాని ఆ ధారంగా నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు. జైలుకు పంపించి శిక్షపడేలా చూస్తామని భరోసానివ్వడంతో వారు వెళ్లిపోయారు. పోలీసు విచారణ ముమ్మరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు న మోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఏసీపీ ప్రకాశ్ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహసీనొద్దీన్, లక్సెట్టిపేట ఎ స్సై సురేష్ పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకోగా.. విచారణ వేగవంతం చేశారు. -
హిల్ట్ పాలసీపై బహిరంగ చర్చకు సిద్ధమా?
నిర్మల్చైన్గేట్: హిల్ట్ పాలసీ అత్యంత పారదర్శకంగా ఉందని, ఎలాంటి కుంభకోణానికి ఆస్కారం లే దంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి బహిరంగ చ ర్చకు సిద్ధమా.. అని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. ఓపెన్ డిబేట్కు మంత్రి సిద్ధపడితే శనివారం ఉదయం 11గంటలకు అసెంబ్లీ మీ డియా పాయింట్ వద్దకు జర్నలిస్టుల సమక్షంలో చ ర్చకు రావాలన్నారు. లేదంటే డేట్, టై మ్, వేదికను మంత్రి ఖరారు చేసినా తనకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ప్రతిపక్షాలకు అర్థం కాలేదని మంత్రి మాట్లాడడం సరికాదన్నారు. ప్రభుత్వ విధానంలో పారదర్శకత ఉంటే, దానిపై చర్చించేందుకు అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడం లేద ని, పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించినవి రూ.6.30 లక్షల కోట్లయితే రూ.5వేల కోట్లకే కట్టబెట్టడం కుంభకోణం కాదా? అని ప్రశ్నించారు. ఈ భూ కుంభకోణంలో మంత్రితోపాటు మొత్తం కేబినె ట్, కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు వాటా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ల్యాండ్ కన్వర్షన్ పేరు చెప్పి ల్యాండ్ లూటీకి పాల్పడుతోందన్నారు. -
ఖాతాల కోసం అభ్యర్థుల పాట్లు
దండేపల్లి: పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు చూపేందుకు గతంలో ఉన్న సేవింగ్ బ్యాంక్ ఖాతాలు కాకుండా మళ్లీ కొత్తగా ఖాతా తీసుకోవాలని ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించింది. దీంతో చాలా మంది అభ్యర్థులు బ్యాంక్లు, పోస్టాఫీసులకు వెళ్లి కొత్తగా ఖాతాలు తెరుస్తున్నారు. బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్కు రూ.2వేలు కావడంతో చాలామంది పోస్టాఫీస్లో రూ.200తో ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. దండేపల్లి పోస్టాఫీస్ శుక్రవారం ఖాతాలు తెరిచేందుకు వచ్చినవారితో సందడిగా మారింది. సర్పంచ్ పదవికి వేలం?సారంగపూర్: మండలంలోని మహవీర్తండా గ్రా మపంచాయతీ సర్పంచ్ పదవికి శుక్రవారం వేలం నిర్వహించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. వేలం పాటలో మహవీర్తండాకు చెందిన ఓమహిళ తరఫున వారి కుటుంబీకులు పాల్గొని రూ.5.60లక్షలకు పదవి దక్కించుకున్నట్లు సమాచారం. మహవీర్తండా, దుర్గానగర్ ఈరెండు తండాలు ఒకే పంచాయతీ కాగా, వీటి పరిధిలో 500 మంది ఓటర్లున్నారు. ఈ తండా సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయగా దుర్గానగర్, మహవీర్తండాల ప్ర జలు సర్పంచ్ పదవి తమకంటే తమకేనంటూ పో టీకి దిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జామ్ గ్రామ సమీపంలో ఇరుగ్రామాల ప్రజలు పంచాయితీకి కూర్చున్నారు. సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా మహవీర్తండాకు చెందిన ఓ మహిళ సర్పంచ్ పదవిని రూ.5.60లక్షలకు దక్కించుకున్న ట్లు తెలిసింది. అయితే.. ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తి విరుద్ధమని, వీటిని ఎన్నికల సంఘం నిరోధించాల్సిన అవసరముందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మేమున్నామనీ..
మంచిర్యాలక్రైం: మహిళలకు భద్రత కల్పించడంలో షీ టీమ్స్ సఫలమవుతున్నాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో వీటి పనితీరు ఈ ఏడాది బాగుంది. షీ టీమ్స్ ని రంతరం గస్తీ నిర్వహిస్తూ అతివలకు భరోసా క ల్పిస్తున్నాయి. విద్యాసంస్థలు, రైల్వేస్టేషన్లు, బ స్టాండ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతా ల్లో పోలీసులు మఫ్టీలో ఉంటూ ఆకతాయిల భర తం పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, విద్యాసంస్థల్లో ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, ప్రేమ పేరుతో వేధింపులకు గురవుతున్న విద్యార్థినులు, మహిళలకు షీ టీమ్స్ అండగా ఉంటూ పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తున్నాయి. మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బృందాల్లోని పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ భరోసా కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోనే కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి ఈవ్ టీజర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. స్పై కెమెరాలు వినియోగిస్తున్నారు. అవసరమనుకుంటే పరిసర ప్రాంతాలను వీడియో రికార్డు చేస్తున్నారు. సరైన ఆధారాలతో పోకిరీలను అదుపులోకి తీసుకుని ఈవ్టీజింగ్, మహిిళలను వేధించిన కేసులో పట్టుబడిన వారికి పోలీస్ పద్ధతిలో వారి చేష్టలను కుటుంబ సభ్యులకు చూపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తు్ాన్నరు. మహిళలను బహిరంగంగా వే ధించడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా వే ధించేవారి తాట తీస్తున్నారు. వీరు చేసిన ఆపరేష న్స్, నిర్వహించిన అవగాహన సదస్సులు మహిళల భద్రతకు రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. మహిళలు, బాలికలను వేధించినా.. మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేసినట్లు రుజువైతే చట్టపరమైన శిక్షలతో పాటు విద్యాపరంగా శిక్షలుంటాయి. విద్యాలయాలనుంచి తాత్కాలి కంగా లేదా శాశ్వతంగా తొలగించడానికి, ఏ ఇతర విద్యాలయాల్లో ప్రవేశాలు లేకుండా చేసేందుకు అ వకాశముంది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేకుండా చేయడం, పాస్పోర్టు జారీ చేయకుండా చర్యలు తీసుకోవచ్చు. యూజీసీ విధానాల ప్రకారం ర్యాగింగ్, ఈవ్టీజింగ్కు పాల్పడిన వారి ఉపకారవేతనా లు నిలిపివేయడం, పోటీ పరీక్షలకు హాజరుకాకుండా చేయడం, ఫలితాల నిలిపివేత, రూ.2.50 లక్షల వరకు జరిమానా విధించే ఛాన్స్ ఉంది. పోక్సో కేసులో పిల్లలకు రక్షణ కల్పించేందు ప్రభుత్వం 2012 లో పోక్సో చట్టాన్ని రూపొందించింది. చట్టంలో పే ర్కొన్న మేరకు బాలిక ఆమోదం తెలిపినా, తెలుపకపోయినా బీఎన్ఎస్ 63 ప్రకారం 18ఏళ్లలోపు వారి పై లైంగిక కలయిక జరిగితే అది అత్యాచారంగానే పరిగణించబడుతుంది. పిల్లలపై లైంగికదాడికి పా ల్పడితే ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, జరిమానా, లేదా జీవిత ఖైదు కూడా విధించవచ్చు.జిల్లా ఫిర్యాదులు ఎఫ్ఐఆర్ కౌన్సిలింగ్ అవగాహన రెడ్హ్యాండెడ్గా సదస్సులు పట్టుకున్నవి మంచిర్యాల 210 22 188 285 148 ఆదిలాబాద్ 217 25 192 190 43 ఆసిఫాబాద్ 142 37 105 206 63 నిర్మల్ 30 14 88 115 276సమాచారం ఇవ్వడం ఇలా..వేధింపులకు గురైనవారిలో చాలామంది పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడతారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని పోలీస్శాఖ వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నంబర్లను అందుబాటులో ఉంచింది. ఫోన్లో సమాచారం ఇచ్చేందుకు ‘డయల్ 100’కు ఫోన్ చేసి సమాచారం అందించాలి.6303923700 నంబర్కు వాట్సాప్ మెస్సేజ్ చేయవచ్చు. క్యూ ఆర్కోడ్, ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతారు కాబట్టి నిర్భయంగా సమాచారం అందించవచ్చు. షీటీమ్ బృందాలు ఘటనా స్థలానికి రహస్యంగా చేరుకుని సమస్య పరిష్కరిస్తారు.ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు షీ టీమ్ కేసుల వివరాలు -
ఇంటి స్థలం కోసం టవరెక్కి నిరసన
జైపూర్: మండల కేంద్రానికి చెందిన అహ్మద్ అనే యువకుడు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం స్థ లం కేటాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సె ల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తనకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ సరిపడా స్థలం లేక ఇంటి నిర్మాణం నిలిచిపోయిందని వాపోయాడు. స్థలం కే టాయించాలని టవర్ ఎక్కి నిరసన తెలుపగా స్థాని కంగా కలకలం రేపింది. దీంతో ఘటనా స్థలానికి ఎస్సై శ్రీధర్ చేరుకుని యువకుడితో మాట్లాడారు. అతనికి నచ్చజెప్పడంతో అహ్మద్ సెల్ టవర్ పైనుంచి కిందకు దిగాడు. ఎస్సై మాట్లాడుతూ.. అహ్మద్ది నిరుపేద కుటుంబమని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినా ఉన్న కొద్ది స్థలంలో ఇల్లు నిర్మించకపోవడంతో హోల్డ్లో పెట్టారని తెలి పారు. ఇంటి ని ర్మాణానికి స్థ లం కేటాయించి ఆదుకోవాల ని కోరారు. -
ఘనంగా దుర్గామాత పూజలు
కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట గనిపై శుక్రవారం ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మైసమ్మతల్లి(దుర్గామాత) పూజలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, కార్మిక దంపతులు హోమం, ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్య అతిథిగా మందమర్రి జీఎం రాధాకృష్ణ హాజరై పూజల్లో పాల్గొన్నారు. అధికారులు, రాజకీయ పార్టీ, కార్మిక సంఘాల నాయకులు తరలిరావడంతో గని ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారుల నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఏజెంట్ రాంబాబు, వివిధ గనుల మేనేజర్లు మేనేజర్ సతీష్, అల్లావుద్దీన్, సునిల్కుమార్, డెప్యూటీ మేనేజర్ నిఖిల్ అయ్యర్, హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్, సీఐటీయూ నాయకుడు రాజిరెడ్డి, టీబీజీకేఎస్ నాయకుడు మేడిపల్లి సంపత్, ఐఎన్టీయూసీ నాయకుడు బన్న లక్ష్మణ్దాస్, మల్లేష్ పాల్గొన్నారు. -
కుష్ఠువ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
మంచిర్యాలటౌన్: కుష్ఠువ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్బాబు అన్నారు. జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు, జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాలపై శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్యులు, నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డాక్టర్ జాన్బాబు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 87 కుష్ఠువ్యాధి కేసులు నమోదు అయ్యాయని, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించి, మందులు వాడేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అనిత, ప్రోగ్రాం ఆఫీసర్ ఏ.ప్రసాద్, జిల్లా ఉప వైద్యాధికారి సుధాకర్నాయక్, డీపీఎంవో రాఘవయ్య, చారి, సకలరెడ్డి, డీపీవో ప్రశాంతి పాల్గొన్నారు. -
పల్లె వెలుగు.. ఎక్స్ప్రెస్ చార్జీ
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ తీరు ఇటీవల కాలంలో వివాదాస్పదంగా మారుతోంది. పల్లెవెలుగు బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు తగిలించి తిప్పడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎక్స్ప్రెస్ చార్జీ వసూలు చేయడంపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలు దూరప్రాంత మార్గాల్లో ఎక్స్ప్రెస్ బస్సులు రద్దు చేయగా.. మరికొన్ని మార్గాల్లో పల్లెవెలుగు బస్సులకే ముందు భాగంలో ఎక్స్ప్రెస్ కలర్, బోర్డులతో తిప్పి అధిక చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. పల్లెవెలుగు బస్సులు ప్రతీ స్టేజీలో రెండు నిమిషాలు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లాలి. మార్గమధ్యంలో చెయ్యి ఎత్తిన చోట ఆపడం, కోరిన చోట దించడం చేస్తుంటారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యంగా, టికెట్ చార్జీ తక్కువగా ఉంటుంది. ఎక్స్ప్రెస్గా మార్చడం వల్ల చాలా స్టేజీల్లో నిలపకుండా వెళ్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు బస్సుల్లేక గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. పల్లెవెలుగు బస్సులతో పోల్చితే ఎక్స్ప్రెస్ చార్జీలు ఎక్కువగా ఉంటాయి. బస్సు పక్కన చూస్తే పల్లెవెలుగు కనిపిస్తుంది. ఎవరైనా హడావుడిలో బస్సు ఎక్కితే అంతే సంగతులు. పల్లెవెలుగు బస్సు కదా అంటే ముందు చూడలేదా..? ఎక్స్ప్రెస్ అనే సమాధానం రావడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. ఉదాహరణకు.. లక్సెట్టిపేట నుంచి మంచిర్యాలకు వచ్చే పల్లెవెలుగు(ఎక్స్ప్రెస్) బస్సు దొనబండ, హాజీపూర్ స్టేజీల్లో మాత్రమే నిలుపుతారు. పల్లె వెలుగు అనుకుని ఎక్కితే మార్గమధ్యంలో ఎక్కడ నిలిపినా చార్జీలు తడిసి మోపెడవుతాయి. మంచిర్యాల నుంచి హాజీపూర్కు పల్లెవెలుగుకు రూ.30 కాగా, ఎక్స్ప్రెస్కు రూ.40, లక్సెట్టిపేటకు రూ.30 టికెట్ చార్జీలు ఉండగా.. ఎక్స్ప్రెస్కు రూ.50 చార్జీలు వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. ఏ బస్సు ఏ రూట్లో ఎక్కడికి వెళ్తుంది..? పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్ అనే వివరాలు, కిలోమీటర్లు, ఆదాయం పొందుపరిచే ఎస్ఆర్(స్టార్)లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. ఎస్ఆర్లో కచ్చితంగా రాసిన చోటుకు మాత్రమే బస్సు నడపాలి. బస్సు వివరాలు లేకుంటే రాకపోకలు సాగించిన సమయంలో ఏదైనా జరిగితే ఉద్యోగుల(డ్రైవర్, కండక్టర్)కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇదేంటని ప్రయాణికులు నిలదీస్తే అధికారులు తమకు తెలియదంటూ తప్పించుకునే వీలులేకపోలేదు. ఎస్ఆర్లో వివరాలు నమోదు చేయకుండా నోటిమాటగా వచ్చిన ఉద్యోగులకు అన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. లబోదిబోమంటున్న ప్రయాణికులు చెన్నూర్: మంచిర్యాల నుంచి సిరోంచ, కాళేశ్వరానికి రాకపోకలు సాగిస్తున్న ఆర్టీసీ బస్సు రెండు రంగులతో ప్రయాణికులను గందరగోళానికి గురి చేస్తోంది. ఓ వైపు పల్లెవెలుగు అని ఉండడంతో ఆర్డినరీ బస్సు అనుకుని ఎక్కితే ఎక్స్ప్రెస్ చార్జీ వేస్తుండడంతో ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాల నుంచి చెన్నూర్కు పల్లెవెలుగు బస్సు చార్జీ రూ.50 ఉండగా ఎక్స్ప్రెస్కు రూ.70 ఉంది. మంచిర్యాల నుంచి చెన్నూర్ మీదుగా కాళేశ్వరం వెళ్లే బస్సుకు ముందు భాగంలో ఎక్స్ప్రెస్ కలర్ వేసి దోపిడీ చేస్తున్నారని ప్రయాణికులు సాగర్, రమేశ్ ఆరోపించారు. ఈ విషయమై ఆర్టీసీ డీఏం శ్రీనివాస్ను సంప్రదించగా.. ఎక్స్ప్రెస్ బస్సులు తక్కువగా ఉండడంతో కండీషన్ ఉన్న బస్సులకు ఎక్స్ప్రెస్ చార్జీ తీసుకుంటున్నామని తెలిపారు. కొత్త బస్సులు వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్లు నడిపిస్తామని పేర్కొన్నారు. -
శాస్త్రవేత్తల చేతుల్లో దేశ భవిష్యత్
నస్పూర్: దేశ భవిష్యత్ శాస్త్రవేత్తల చేతుల్లో ఉందని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. నగరంలోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో బుధవారం ప్రారంభమైన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమం శుక్రవారం ముగిసింది. విజేతలకు అదనపు కలెక్టర్ చంద్రయ్య బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ ఇన్స్పైర్లో పాల్గొన్న ప్రతీ విద్యార్థి ఒక జూనియర్ శాస్త్రవేత్త అని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. అంతకుముందు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీఈఓ యాద య్య, జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, ఎంఈఓ పద్మజ, ట్రస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, నస్పూర్ పట్టణ అధ్యక్షుడు మైదం రామకృష్ణ, నాయకులు రామకృష్ణరెడ్డి, ఉపేందర్, దేవయ్య, సతీష్రెడ్డి, సిద్దయ్య పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి ఇన్స్పైర్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు ఉత్తమ ప్రాజెక్టులు ప్రదర్శించిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఫర్హజ్(బెల్లంపల్లి), కారెంగుల కీర్తన(భీమిని), జిల్లపల్లి అభిరామ్(చెన్నూర్), లవుడ్య అక్షర(జన్నారం), సహిస్త(దేవాపూర్), కామెర సాయితేజ(కాసిపేట), టేకుమట్ల హరిప్రియ(మంచిర్యాల), శ్రీరాంబట్ల సాయి విగ్నేష్(మంచిర్యాల), మెడం అశ్విత్ వర్మ(మంచిర్యాల), గొల్లపల్లి శ్రీసాన్వి(మందమర్రి), గంగిసెట్టి ప్రశాంత్ జీవన్(రామకృష్ణాపూర్), టీఎల్టీ(టీచర్ లెర్నింగ్ మెటీరియల్)లో ఇద్దరు ఉపాధ్యాయులు గంప శ్రీనివాస్(కాసిపేట), ఇ.మల్లేశ్(మందమర్రి), సెమినార్లో ఇద్దరు విద్యార్థులు మంతెన అభిగ్న(కలమడుగు), శాన్వి లక్ష్మి(తాండూర్) వీరితోపాటు డీఎల్బీవీలో మరో 28 మంది విద్యార్థులు రాష్టస్థాయి పోటీలకు ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపారు. -
ఊపందుకున్న నామినేషన్ల దాఖలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లో నామినేషన్ల దాఖలు ఊపందుకుంది. దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లోని ఆయా క్లస్టర్లలో రెండో రోజు శుక్రవారం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం చివరి రోజు కావడంతో భారీగా దాఖలు చేసే అవకాశం ఉంది. మొదటి రోజు గురువారం సర్పంచ్ స్థానాలకు 25, రెండో రోజు శుక్రవారం 99 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తంగా నామినేషన్ల సంఖ్య 124కు చేరింది. ఇక వార్డు సభ్యుల స్థానాలకు మొదటి రోజు 14న రెండో రోజు 222 నామినేషన్లు వేశారు. వాటి సంఖ్య మొత్తంగా 236కు చేరింది. కాగా, ఆయా మండలాల్లోని 90 గ్రామ పంచాయతీలు, 816 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు డిసెంబర్ 11న జరగనుండగా 1,28,694 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సమయం పాటించాలి : కలెక్టర్ దండేపల్లి: నామినేషన్ల స్వీకరణలో సమయం కచ్చితంగా పాటించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కొర్విచెల్మ, నెల్కివెంకటాపూర్, ద్వారక, మేదరిపేట, దండేపల్లిలో నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. ఎన్ని నామినేషన్లు వచ్చాయని ఆర్వోలను అడిగి తెలుసుకున్నారు. చివరి రోజు నామినేషన్లువేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఐదు గంటల్లోపు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి వరుస క్రమంలో నామినేషన్లు తీసుకోవాలని, సమయం దాటిన తర్వాత ఎవరినీ లోనికి అనుమతించొద్దని తెలిపారు. ద్వారక ఉన్నత పాఠశాల ఆవరణలో హాస్టల్ భవనం పనులను పరిశీలించారు. దండేపల్లిలో జీపీ భవనం అసంపూర్తిగా ఉండడంపై ఎంపీడీవో ప్రసాద్తో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేయించాలని సూచించారు. పరిశీలించిన అదనపు కలెక్టర్ లక్సెట్టిపేట: మండలంలోని జెండావెంకటాపూర్, చందారం గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య శుక్రవారం పరిశీలించారు. అభ్యర్థుల పూర్తి వివరాలు పరిశీలించాలని, ఎలాంటి ఇబ్బందులున్నా తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్కుమార్, ఎంపీడీవో సరోజ పాల్గొన్నారు.నామినేషన్ల వివరాలు... మండలం గ్రామాలు నామినేషన్లు వార్డులు నామినేషన్లుదండేపల్లి 31 34 278 68 హజీపూర్ 12 07 106 23 జన్నారం 29 34 272 96 లక్సెట్టిపేట 18 24 160 35 మొత్తం 90 99 816 222 -
పూలే ఆశయ సాధనకు పాటుపడాలి
పాతమంచిర్యాల: సమాజంలోని నిమ్న వర్గాల న్యాయమైన హక్కుల కోసం సామాజిక న్యాయ పోరాటం చేసిన మహాత్మా జ్యోతిభా పూలే ఆశయసాధనకు అందరూ పాటుపడాలని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పూలే భవన్లో మహాత్మాజ్యోతిభా పూలే 135వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ పూలే పోరాటాల ఫలితంగానే నేడు బడుగు బలహీన వర్గాల ప్రజలు సమాజంలో గౌరవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి కనికరపు రాజన్న, సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ మేధావుల ఫోరం జిల్లా కో అర్డినేటర్ కొండయ్య, డీహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచన్న తదితరులు పాల్గొన్నారు. -
మధుకర్ కేసులో నిందితులను అరెస్టు చేయాలి
మంచిర్యాలటౌన్: వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్య కేసులో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీస్ యంత్రాంగం గతంలో నిందితులను అరెస్టు చేయడంలో జాప్యం చేయడం వల్ల హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, బీజేపీ న్యాయవాదుల వాదనలతో శుక్రవారం స్టే వెకేట్ చేసిందని తెలిపారు. మధుకర్ మరణానికి కారణమైన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. గతంలో నిందితులను శిక్షిస్తామని హామీనిచ్చిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అదే నిందితులతో అధికారిక కార్యక్రమాలు చేపట్టి, వారికి బాసటగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పానుగంటి మధు, తిరుపతి, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
జైపూర్: ప్రశాంత వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి సందర్శించారు. నర్వ, శివ్వారం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు, వసతులు పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్లో జైపూర్, భీమారం, శ్రీరాంపూర్ పోలీస్స్టేషన్ల సిబ్బందికి ఎన్నికల నియమావళిపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని అన్నారు. డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు నవీన్కుమార్, శ్రీలత, ఎస్సైలు శ్రీధర్, సంతోశ్, శ్వేత, తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్లో అరకొరగా భోజనం
మంచిర్యాలఅర్బన్: అరకొర భోజనం సరిపోక అర్ధాకలితో అలమటిస్తున్నామని, వంటవాళ్లు సమయానికి రాకపోవడంతో తామే వంట చేసుకుంటున్నామని నగరంలోని సాయికుంట బీసీ సమీకృత వసతిగృహ విద్యార్థులు శుక్రవారం డీబీసీడీవో భాగ్యవతికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం ఆమె హాస్టల్ తనిఖీకి వెళ్లగా అల్పాహారం(అటుకులు) విద్యార్థులందరికీ అందకపోవడంతో వార్డెన్పై మండిపడ్డారు. అప్పటికప్పుడు అటుకుల టిఫిన్ తయారు చేయించి పెట్టగా విద్యార్థులు బడికి ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. గురువారం చికెన్తో భోజనం సరిపడా లేకపోవడంతో కోడిగుడ్లు వండి వడ్డించిన ఘటన మరవకముందే మరోసారి ఇలా చేయడమేంటని ప్రశ్నించారు. అక్కడే ఉన్న పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, ఏఐఎస్బీ కార్యదర్శి సన్నీగౌడ్ వార్డెన్, వసతిగృహ ఉద్యోగుల విధి నిర్వహణలో అలసత్వం, నిబంధనల ప్రకారం మెనూ అమలు చేయకపోవడంపై ఫిర్యాదు చేశారు. నిర్వహణ అస్తవ్యస్తం బీసీ సమీకృత(ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కలిపి) బాలుర వసతిగృహ పర్యవేక్షణ అస్తవ్యస్తంగా మారింది. 201 మంది విద్యార్థులు ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ముగ్గురు వార్డెన్లు, వాచ్మెన్, కామటీ, వంటమనిషి ఒక్కో హస్టల్కు ముగ్గురు చొప్పున 12 మంది విధులు నిర్వర్తించాలి. రెగ్యులర్ ఎస్టీ వసతిగృహ వార్డెన్ జన్నారం, వాచ్మెన్ను సిర్పూర్కు డిప్యూటేషన్ ఇచ్చారు. ఎస్టీ వసతిగృహం వంటమనిషి పనిచేస్తోంది. బీసీ వసతిగృహం నుంచి ఇద్దరు ఔట్ సోర్సింగ్ వంటకార్మికులు, వాచ్మెన్ ఉన్నారు. ఎస్సీ వార్డెన్ ఉన్నా సరుకులు, భోజనం నిర్వహణ బీసీ వార్డెన్ పెత్తనం సాగుతోంది. వార్డెన్ చెప్పినట్లుగా కూరగాయల నుంచి అరటిపండ్ల వరకు విద్యార్థులే కొనుగోలు చేసి తీసుకొస్తారని తెలుస్తోంది. ఇటీవల డీబీసీడీవో తనిఖీ సమయంలో రిజిష్టర్లో ఉద్యోగుల హాజరు ఏరోజుకారోజు లేకపోవడంపై చివాట్లు పెట్టారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కార్యాలయంలో ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధుల నిర్వహిస్తున్నారు. వసతిగృహాల్లో పనిచేసేందుకు తీసుకున్న ఉద్యోగులు కార్యాలయానికి పరిమితం కావడంపై భిన్నాభిప్రాయాలున్నాయి. బీసీ సమీకృత వసతిగృహనికి సర్దుబాటుకు అవకాశం లేకపోలేదు. డిప్యూటేషన్పై వెళ్లిన ఎస్టీ వసతిగృహం వార్డెన్, వాచ్మెన్లను వెనక్కి పిలిపిస్తే కొంత మేర సమస్య తీరనుంది. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లు, పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ, ఫలితాలు వంటి ప్రతీ అంశంపై ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో బెల్లంపల్లి సబ్కలెక్టర్ మనోజ్, అదనపు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, నోడల్ అధికారి శంకర్తో కలిసి 2వ, 3వ విడత రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియపై ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అవసరమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. నామినేషన్లు పరిశీలించి అర్హులు, అనర్హుల జాబితాలో పూర్తి వివరాలతో రూపొందించాలని అన్నారు. ఎన్నికల గుర్తుల కేటాయింపులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు, అధికారులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని పరిశీలన లక్సెట్టిపేట: మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం పరిశీలించారు. రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి తీసుకురావాలని తెలిపారు. సన్నరకానికి మద్దతు ధరతోపాటు బోనస్ రూ.500 వస్తాయని తెలిపారు. -
నిబంధనలు అమలయ్యేనా?
నస్పూర్/మంచిర్యాలక్రైం: ప్రస్తుత మద్యం పాలసీ ఈ నెల 30తో ముగియనుంది. 2025–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త మద్యం పాలసీ డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ప్రభుత్వానికి ఆదాయ నిధిగా ఉన్న ఎకై ్సజ్శాఖ అమ్మకాలపై చూపిస్తున్న శ్రద్ధ కొత్త మద్యం పాలసీ నిర్వహణలో మద్యం షాపుల ఏర్పాటుపై ఎకై ్సజ్ శాఖ నిబంధనలు అమలు చేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది. జిల్లాలోని ప్రధాన పట్టణ కేంద్రాల్లో గ తంలో జనావాసాలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళనలు చేసిన ఘటనలు ఉన్నాయి. అయినా ఎకై ్సజ్ శాఖ అధికారులు అవేం పట్టవన్నట్లుగా మద్యం వ్యాపారులకు వత్తాసు పలుకుతూ వారికి అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తూ ‘మామూలు’గా తీసుకున్నార నే ఆరోపణలు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ని ర్వహణలోనైనా నిబంధనలు అమలు చేస్తారా? మా మూలుగానే వదిలేస్తారా? అనే చర్చ జరుగుతోంది. పాత మద్యం పాలసీలో నిబంధనలు తూచ్... ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్ జోన్స్, దేవాలయాలు, మసీదులు, చర్చిలకు 100 మీటర్ల దూరంలో, గ్రామాల్లో జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలి. 50 స్క్వేర్ మీటర్లు కలిగిన రూంలో సిట్టింగ్ ఏర్పాటు చేసుకోవాలి. వాటర్ బాటిళ్లు, కూల్డ్రింక్స్, తినుబండారాలు విక్రయించకూడదు. కానీ జిల్లాలో ఎక్కడా ఈ నిబంధనలు అమలు కాకపోవడం గమనార్హం. జిల్లా కేంద్రంలో ప్రశాంతి హాస్పటల్ పక్కనే ఓ వైన్స్ కొనసాగుతోంది. కాలేజ్ రోడ్, హమాలివాడ, ఐబీ సమీపంలో లక్సెట్టిపేటరోడ్లో ఉన్న వైన్స్లు హాస్పటల్స్కు దగ్గరలోనే, రోడ్డుపక్కనే ఉన్నాయి. నస్పూర్ పరిధిలో ప్రస్తుతం 9 మద్యం దుకాణాలు ఉండగా ఆరు జాతీయ రహదా రికి ఆనుకుని ఉన్నాయి. సీసీసీలోని రాయల్ గార్డెన్ సమీపంలో స్కూల్స్ జోన్ పరిధిలో రెండు మద్యం దుకాణాలు, ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త మద్యం పాలసీలో జనవాసాలకు దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చే యాలని, ప్రభుత్వ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. క్లస్టర్ తొలగింపుతో వ్యాపారుల్లో ఊరట...ఈసారి పట్టణాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎకై ్సజ్ శాఖ క్లస్టర్ విధానాన్ని తొలగించింది. మద్యం దుకాణం లక్కీ డ్రాలో వస్తే పట్టణం, నగరాల్లో ఎక్కడైనా దుకాణం ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. బడి, గుడి, హాస్పిటల్స్కు వంద మీటర్ల దూరం అనేది అమలులో ఉంది. ఇది కచ్చితంగా పాటించాల్సిందే. మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో నేషనల్ హైవే, స్టేట్హైవే పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. దీంతో మంచి అడ్డాలపై దుకాణాలు ఏర్పాటు చేసేందుకు కన్నేస్తున్నారు.నిబంధనల మేరకే.. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవాలి. సమాచారం ఎకై ్సజ్ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. గుడి, బడి, ప్రభుత్వ అనుమతితో నడపబడుతున్న ప్రైవేటు హాస్పటల్స్కు వంద మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. పరిశీలించిన తర్వాతనే లైసెన్స్ జారీ చేస్తాం. – కేజీ నందగోపాల్, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి, మంచిర్యాల -
● పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రత్యేకం ● బ్యాలెట్లో చేర్చిన ఎన్నికల అధికారులు
ఎన్నికల గుర్తులు సిద్ధంమంచిర్యాలరూరల్(హాజీపూర్): మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గుర్తులు సిద్ధంగా ఉన్నాయి. సర్పంచ్గా అభ్యర్థుల బ్యాలెట్ పేపర్ గులాబీరంగులో, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్ తెలుపురంగులో ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్పేస్ట్, స్పానర్, కప్పు సాసర్, విమానం, బంతి, షటిల్, కుర్చీ, వంకాయ, బ్లాక్ బోర్డు, కొబ్బరికాయ, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, క్యారెట్, గొడ్డలి, గాలి బుడగ, బిస్కట్, వేణువు, ఫోర్కు, చెంచా గుర్తులు కేటాయించారు. వీటికింద నోటా గుర్తు విధిగా ఉంటుంది. వార్డు సభ్యుల గుర్తులు జగ్గు, గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, గాజు గ్లాసు, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటెనా, గరాటా, మూకుడు, కేటిల్, విల్లు–బాణము, కవరు, హాకీ బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పోస్టుడబ్బా, విద్యుత్ స్తంభం గుర్తులు ఉన్నాయి. వీటి కింద కూడా నోటా గుర్తు ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు‘నోటా’కు చోటు..నిర్మల్ఖిల్లా/నిర్మల్చైన్గేట్: పల్లె పోరు హడావుడి ప్రారంభమైంది. గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ అభ్యర్థుల గుర్తులతోపాటు ‘నోటా’ (నన్ ఆఫ్ ది ఎబోవ్)ను అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. బ్యాలెట్ పత్రంలో ప్రత్యేకంగా పొందుపరచనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ సరైన వారు లేరని ఓటరు భావించినప్పుడు ఓటును నోటాకు వేసేందుకు అవకాశం కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ఎంతో పవిత్రమైంది. ఓటరు తన ఇష్టానుసారం నాయకుడిని ఎన్నుకోవడమే కాదు.. సరైన అభ్యర్థులు లేరని భావించినప్పుడు తిరస్కరించే హక్కు కూడా కలిగి ఉండాలనే అభిప్రాయం ఏళ్లుగా చర్చకు వచ్చిన అంశమే. ఈ నేపథ్యంలోనే ‘నోటా’ భారత ఎన్నికల వ్యవస్థలో ప్రత్యేక గుర్తింపుతో నిలిచింది. 2013 సెప్టెంబర్ 27న సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ఈ భావనకు చట్టబద్ధత లభించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో, బ్యాలెట్ పత్రాల్లో ‘నోటా’ తప్పనిసరిగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. అదే ఏడాది డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలన్నింటిలోనూ నోటాకు స్థానం కల్పించింది. లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటింగ్ యంత్రాల చివరి బటన్గా నోటా ప్రత్యక్షమైంది. నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎన్నికల ఫలితంలో మార్పేమీ ఉండదు.ఒక్క క్లిక్తో ఓటరు జాబితా ప్రత్యక్షంనిర్మల్చైన్గేట్: పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ఆన్లైన్లో ఉంచింది. సదరు వెబ్సైట్లోకి వెళ్లి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. వార్డుల వారీగా జాబితా చూడవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.tsec.gov.in వెబ్సైట్ ద్వారా తుది జాబితాను చూసుకోవచ్చు. final rolls GP/ward wise voter list an on 02-09–2025 ఆప్షన్ క్లిక్ చేసి మండలం, జీపీ ఎంచుకుంటే ఓటరు జాబితా ప్రత్యక్షమవుతుంది. క్యాప్చాకోడ్ను ఎంటర్ చేసి వార్డువైజ్ డేటాపై క్లిక్ చేస్తే మీ గ్రామ పంచాయతీలోని వార్డుల వైజ్గా ఓటరు లిస్ట్ వస్తుంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇలా ఓటరు జాబితాను సులభంగా చూసుకోవచ్చు. -
మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య
ఉట్నూర్రూరల్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగాపూర్కు చెందిన సయ్యద్ యూసుఫ్ (58)కు సంతానం కాకపోవడంతో మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. బుధవారం సాయంత్రం మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన అతని భార్య భాను స్థానికుల సాయంతో ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య భాను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రైలు కిందపడి ఒకరు...మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్నగర్కు చెందిన రాళ్లబండి వెంకటి (55) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై మహేందర్ తెలిపారు. వెంకటి ఆరు నెలల క్రితం ద్విచక్రవాహనంపై నుంచి కిందపడడంతో తొంటి విరిగింది. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతున్నాడు. గురువారం స్థానిక గోదావరి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటికి భార్య రాజేశ్వరి, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జీఆర్పీ ఎస్సై తెలిపారు. అనారోగ్య సమస్యలతో..సారంగాపూర్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకుడు మండలంలోని చించోలి(బి) సమీపంలో ఉరేసుకున్నాడు. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండకు చెందిన ఆల్వేకర్ చరణ్ (25)కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం నిర్మల్కు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి సారంగాపూర్ మండలం చించోలి(బి) గ్రామ సమీపంలోని మహబూబాఘాట్స్ వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. గురువారం పశువుల కాపరులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని సోదరుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిప్పు.. భూసారానికి ముప్పు
చెన్నూర్రూరల్: ఏటా వరికోతలు పూర్తికాగానే పొలంలో ఉండే వరికొయ్యలు, ఇతర మూ లా లకు రైతులు నిప్పుపెడుతుంటారు. దీంతో పంటచేనులో భూసారం బుగ్గిపాలవుతుందని వ్య వసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పొలాలను హార్వెస్టర్లతో కోయించడంతో వరిగడ్డి(పశుగ్రాసం)కొయ్యలు ఎక్కువ మొత్తంలో మిగిలి ఉంటున్నాయి. పొ లం పనులు మొదలు పెట్టే రైతులు వ్యర్థాలు ఉండకూడదని పంట మూలాలకు నిప్పంటించి మళ్లీ సాగుకు సిద్ధం అవుతున్నారు. గతంలో వ్యవసాయ కూలీలతో వరి కోతల ప్రక్రియ చేపడుతుండటంతో ఎలాంటి కుదుళ్లు లేకుండా నేల మట్టంగా కోసేవారు. ప్రస్తుత తరుణంలో కూ లీల కొరత ఉండటంతో చిన్నపాటి రైతులు కూ డా యంత్రాలతో పంటను కోయిస్తున్నారు. దీంతొ సుమారు అడుగు నుంచి అడుగున్నర మేర వరికొయ్యలు మిగిలి పోతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు వాటిని కాల్చివేస్తున్నారు. ఇ లాంటి చర్యలతో భూమిలో సారం తగ్గి పోవడమే కాకుండా, పంటకు మేలు చేసే క్రిములు కూడా పూర్తిగా నశించే పోయే ప్రమాదం ఉంది. వరికొయ్యలకు నిప్పుతో భూసారానికి ఎంత ముప్పు కలుగుతుందనే విషయాలపై అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది.వరికొయ్యలు కాల్చొద్దు కోతలు ముగిసిన తర్వాత వరి కుదుళ్లను దుక్కిలో కలిపి దున్నితే భూసార విలువలు పెరుగుతాయి. నిప్పు పెడితే భూసారం దెబ్బతింటుంది. దున్నే ముందు నీటితడులు అందించి భూమి నానిన తర్వాత అందులోనే కలియ దున్నితే భూమిలో ఉండే మెగ్నీషియం, కాల్షియం, సూక్ష్మజీవులు పంటకు మేలు చేస్తాయి. అలాగే పొలంలో జీలుగ పంట వేసి కలియ దున్నితే మంచి ఎరువుగా ఉపయోగ పడుతుంది. – బానోతు ప్రసాద్, ఏడీఏ, చెన్నూర్ -
పులి కదలికలపై అప్రమత్తం
హరిత వనాల వెంట పయనం వేమనపల్లి: రాజారం, ఒడ్డుగూడెం అడవుల్లో ఇటీవల పులి సంచారం కలకలం రేపుతోంది. రాజారం హరిత వనాల వెంట తిరిగిన పులి మత్తడి ఒర్రె ప్రాంతంలో నీళ్లు తాగేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. పులి ఇటీవల సంచరించిందా వారం రోజుల క్రితం తిరిగి వెళ్లిందా అనేది తెలియడం లేదు. మత్తడిఒర్రె, హరిత వనాల ఒర్రెల వెంట పులి పాదముద్రలు కనిపిస్తుండడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజుల క్రితమే అటవీ అధికారులకు విషయం తెలిసి పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పొరుగున ఉన్న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల వైపు వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.జన్నారం: జన్నారం అటవీ డివిజన్కు పులి వచ్చినట్లు తేలడంతో కదలికలను గమనించేందుకు అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎఫ్డీవో రామ్మోహన్, రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ సిబ్బందితో కలిసి పులి పాదముద్రలను గుర్తించి ఆ వైపున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు సిబ్బందిని అప్రమత్తం చేశారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు, అటవీ సిబ్బంది పులి కదలికలపై పర్యవేక్షణ చేస్తున్నారు. బుధవారం ఆవును చంపిన పులి గురువారం కూడా ఆ ఆవు మాంసాన్ని తిన్నట్లు అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాలకు పులి చిక్కినప్పటికీ కదలికలు బయటకు వస్తే ప్రమాదం ఉన్నందున అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. పులి సంచరిస్తున్నందున అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డీవో రామ్మోహన్ సూచించారు. ఆవు యజమానికి పరిహారం అందేలా చూస్తామని తెలిపారు. సెక్షన్ అధికారులు రవి, హన్మంతరావు, హిటికాస్ సభ్యులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో బలమైన శక్తిగా నిలవాలి
జైపూర్/భీమారం: కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సమన్వయంతో కలిసిమెలిసి పని చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలమైన శక్తిగా నిలవాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. గురువారం ఆయన జైపూర్ మండలం దుబ్బపల్లి, భీమారం మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో మెజార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు దిశగా ప్రతీ కార్యకర్త పని చేయాలన్నారు. గెలుపు గుర్రాలను బరిలో నిలపాలని స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. సర్పంచు స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి వివరాలు సేకరించారు. భీమారం మండలంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారిని పిలిచి వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకున్నారు. గ్రామాల్లో పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా కృషి చేస్తామని అన్నారు. పంచాయతీల వారీగా సర్వే చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ రిక్కుల శ్రీనివాస్రెడ్డి, జైపూర్ మండల అధ్యక్షుడు ఫయాజ్, నాయకులు గుడెల్లి శ్రీనివాస్రెడ్డి, చల్ల విశ్వంభర్రెడ్డి పాల్గొన్నారు. బయటపడ్డ విభేదాలు భీమారంలో జరిగిన సమావేశంలో రెండు వర్గాలు మధ్య ఉన్న విభేదాలు బహిర్గతం అయ్యాయి. మంత్రి పర్యటన సందర్భంగా రెండు చోట్ల సమావేశానికి ఏర్పాట్లు చేశారు. మంత్రి భీమారంలోని ఆవిడం ఎక్స్రోడ్డు వద్దకు చేరుకున్న వెంటనే జిల్లా కాంగ్రెస్ నాయకుడు పొడేటి రవి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై భీమారం గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇంతలోనే మంత్రి పీఏ రమణారావు సమావేశ మందిరానికి వచ్చి మరోచోట కూడా సమావేశం ఉందని చెప్పారు. దీంతో మంత్రి వివేక్ స్పందిస్తూ తన సమయం వృథా చేస్తారా అంటూ పొడేటి రవిపై మండిపడ్డారు. అభిప్రాయ సేకరణ మధ్యలోనే నిలిపివేసి మరోవర్గం నేత జిల్లా నాయకుడు చేకూర్తి సత్యనారాయణరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశం హాల్ వద్దకు వెళ్తాం పదా అంటూ మంత్రి కార్యకర్తలందరినీ అక్కడికి తీసుకెళ్లారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
లక్సెట్టిపేట: గ్రామ సర్పంచ్ ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండలంలోని పోతపల్లి, గుల్లకోట, చందారం గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. నియమావళి ప్రకారం నామినేషన్లు స్వీకరించాలని, కేంద్రాల్లో అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇటిక్యాల గ్రామ సమీపంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, స్థానిక ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలోని మార్చూరీ నిర్మాణాన్ని పరిశీలించారు. ఆర్డీవో శ్రీనివాస్రావు వెంకట్రావుపేట గ్రామంలోని నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్కుమార్, ఎంపీడీవో సరోజ అధికారులు పాల్గొన్నారు. -
మొదటి ఘట్టం షురూ
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/జన్నారం/లక్సెట్టిపేట/దండేపల్లి: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఘట్టానికి తెరలేచింది. పంచాయతీ పోరులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభమైంది. మంచిర్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 90 గ్రామ పంచాయతీలు, 816 వార్డు స్థానాలు ఉండగా.. నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 25, వార్డు సభ్యుల స్థానాలకు 14 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా మండలాల్లోని నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఈ ప్రక్రియ స్వీకరణ ఈ నెల 29 వరకు సాగనుంది. డిసెంబర్ 11న జరిగే మొదటి విడత ఎన్నికల్లో 1,28,694 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సందర్శించిన డీసీపీ, ఆర్డీఓ హాజీపూర్ మండలంలోని నామినేషన్ కేంద్రాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఆర్డీఓ శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. బందోబస్తు, అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ిసీఐ అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్కు సూచించారు. నామినేషన్ల దాఖలు వివరాలు.. మండలం పంచాయతీలు సర్పంచ్ వార్డులు వార్డు సభ్యుల నామినేషన్లు నామినేషన్లు దండేపల్లి 31 09 278 09 హాజీపూర్ 12 04 106 02 జన్నారం 29 11 272 03 లక్సెట్టిపేట 18 01 160 – మొత్తం 90 25 816 14 -
పీఎస్సార్కు ఘన స్వాగతం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుకు గురువారం మంచిర్యాలకు రాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కలెక్టరేట్లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. నాయకులు ఘనస్వాగతం పలికి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో సర్పంచ్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించారు. దసరా పండుగ వరకు మంచిర్యాలలో ఉన్న ఎమ్మెల్యే ఆ తర్వాత హైదరాబాద్కు వెళ్లి అక్కడే ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన విషయం తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం కోయంబత్తూర్కు వెళ్లిన ఆయన ఇటీవల హైదరాబాద్కు పూర్తి ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాలకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, విజయానికి చేపట్టాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. -
విద్యుత్ షాక్తో బీఆర్ఎస్ కార్యకర్త మృతి
నార్నూర్: విద్యుత్ షాక్తో బీఆర్ఎస్ కార్యకర్త మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. నార్నూర్ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కాంబ్లె హన్మంతు (37) గురువారం ఉదయం ఇంట్లో బట్టలు సర్దుతుండగా విద్యుత్ తీగలకు చేయి తగలడంతో షాక్కు గురై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఉట్నూర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య జయశ్రీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. జాగృతి యాత్రకు ఎంపికబాసర: జాగృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మహోన్నత భారతదేశ నిర్మాణమే ధ్యేయంగా యువత కోసం ఉద్దేశించబడిన యాత్రలో ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్ ఐటీలో ప్రథమ సంవత్సరం చదువుతున్న జశ్వంత్కు చోటు దక్కింది. కేవలం 15 రోజులలో దేశం మొత్తం చుట్టివచ్చే ఈ రైలుయాత్రలో అనుభవజ్ఞులైన పారిశ్రామికవేత్తలు, మేధావులు, శాస్త్రవేత్తలు వారికి మార్గ నిర్దేశం చేస్తారు. సాధారణంగా 21 ఏళ్ల పైబడిన వారే ఈ యాత్రకు అర్హులైనప్పటికీ 18 ఏళ్ల జశ్వంత్ తన ప్రతిభతో ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఇ.మురళీ దర్శన్ విద్యార్థిని అభినందించారు. -
చిన్నారులను ఆకట్టుకునేలా బడి
మంచిర్యాలఅర్బన్: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ముస్తాబవుతున్నాయి. పాఠ్యాంశాలకు సంబంధించిన బొమ్మలు, వివిధ రకాల చిత్రాలు విద్యార్థులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో అధునాతన వసతులు సమకూరుతున్నాయి. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ ఏడాది నుంచే ప్రీప్రైమరీ విద్య ఐదేళ్లలోపు చిన్నారులకు బోధన సాగుతోంది. బోధనభ్యసన సామగ్రి సమగ్ర శిక్ష అధికారులు సమకూరుస్తున్నారు. ఆటపాటలతో బోధనకు సామగ్రి దోహదపడనుంది. బాలలకు ఏకరూప దుస్తులు అందించనున్నారు. పూర్వ విద్యాబోధనకు నిధులు జిల్లాలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ అమలవుతోంది. మూడు పీఎంశ్రీ ప్రీప్రైమరీ పాఠశాలలు(రూ.1.50లక్షలు) మినహాయిస్తే ఈ ఏడాది ప్రారంభమైన 31న స్కూళ్లలో ఒక్కోదాని కి రూ.1.70లక్షలు కేటాయించారు. గత ఏడాది ప్రారంభమైన 10 స్కూళ్లకు రూ.50వేల చొప్పున ఇచ్చారు. వీటితో సామగ్రి, బోధనభ్యాస సామగ్రి కొనుగోలు చేయనున్నారు. తరగతి గదుల గోడలపై రంగులతో కూడిన చిత్రాలు వేసే పనులు చకచకా సాగుతున్నాయి. రూ.20వేలతో చిన్నారులకు ఏకరూప దుస్తులు, స్టేషనరీ సమకూర్చాల్సి ఉంది. ఆటపాటలతో బోధనభ్యాసనకు ఆటపరికాలు వినియోగించాల్సి ఉంది. ఇందుకు అవసరమైన టెండర్ను పూర్తి చేయగా ఒకట్రెండు రోజుల్లో ఆటపరికరాలు, ఫర్నిచర్ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఆయా పాఠశాలల తరగతి గదులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. గతేడాది నుంచి ప్రారంభమైన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో సామగ్రి కొనుగోలు చేయగా ప్రస్తుతం కేటాయించిన రూ.50వేలతో గదులపై రంగుల చిత్రాలు వేసి చిన్నారులను ఆకర్షించనున్నారు. ఆయా పాఠశాలల్లో నియమించిన ఇన్స్ట్రక్టర్లకు ఈ నెల 25న శిక్షణ ప్రారంభించగా.. ఈ నెల 29వరకు కొనసాగుతుంది. రాష్ట్ర స్థాయిలో తర్ఫీదు పొందిన వారు ఆటపాటలతో బోధనపై శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులను పాఠశాలలకు ఆకర్షితులను చేయడం ఎలా..? కృత్యధార బోధన, ఆటపాటలతో బోధించడం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. -
● నిబంధనల ప్రకారం 150 ● నాలుగేళ్లుగా వందతోనే సరి.. ● వచ్చే ఏడాది సంఖ్యపై ఆశలు ● 2022లో మంచిర్యాల కాలేజీకి అనుమతులు
ప్రభుత్వ మెడికల్ కాలేజీ నూతన భవనంమంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వసతులు సమకూరుతున్నాయి. ఫలితంగా వచ్చే విద్యాసంవత్సరం సీట్ల సంఖ్య పెంపుపై ఆశలు నెలకొన్నాయి. 2022లో మెడికల్ కాలేజీకి అనుమతి రాగా.. అదే ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం సీట్లు కేటాయించి భర్తీ చేశారు. కళాశాల భవనానికి అప్పటికి స్థలం కేటాయించకపోవడంతో జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ఉన్న మంచిర్యాల మార్కెట్ యార్డును తాత్కాలిక మెడికల్ కాలేజీగా మార్చారు. మూడేళ్లుగా అందులోనే నిర్వహిస్తున్నారు. జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) నిబంధల ప్రకారం ప్రతీ మెడికల్ కాలేజీకి 150 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తారు. మంచిర్యాల కాలేజీలో పూర్తి స్థాయిలో వసతులు లేవని మొదటి సంవత్సరంలో కేవలం 100 సీట్లు కేటాయించి.. గత నాలుగేళ్లుగా అవే సీట్ల భర్తీతో కొనసాగిస్తున్నారు. మార్కెట్ యార్డులోని కాలేజీలో ఇన్నాళ్లూ తరగతులు అరకొర వసతులతో నిర్వహించారు. ఇటీవల గుడిపేట్లో నూతనంగా రూ.216 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజీ భవనం పనులు పూర్తి దశకు చేరాయి. దీంతో ప్రస్తుత కాలేజీలోని మూడు సంవత్సరాల విద్యార్థులను నూతన భవనంలోకి తరలించి అక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి భవనం, ఖాళీల భర్తీతోనే.. ప్రభుత్వ కాలేజీకి అనుబంధంగా మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మాతాశిశు ఆరోగ్యం కేంద్రం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడం, సరైన సదుపాయాలు లేకపోవడంతో కాలేజీ రోడ్డులో ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీ ఆవరణలోనే రూ.129.25 కోట్లతో 450 పడకల సామర్థ్యంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు. ఇది పూర్తయ్యేందుకు మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉండగా.. పూర్తయితేనే ఎన్ఎంసీ నిబంధనల మేరకు ఉన్నట్లుగా గుర్తిస్తారు. ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తి, కాలేజీలోని పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు 41మంది ఉండాల్సి ఉండగా.. 19మంది రెగ్యులర్, ఒకరు కాంట్రాక్టు పద్ధతిలో మొత్తంగా 20 మంది మాత్రమే ఉన్నారు. అసొసియేట్ ప్రొఫెసర్లు 51మందికి గాను ఇద్దరు రెగ్యులర్, ఒకరు కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తుండగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 141మందికి గాను 56మంది రెగ్యులర్, 11మంది కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారు. నూతన ఆస్పత్రి భవనం అందుబాటులోకి రావడంతోపాటు ఖాళీలను భర్తీ చేస్తేనే నిబంధనల మేరకు సీట్ల సంఖ్య పెంచేందుకు అవకాశం ఉంది. ఖాళీల భర్తీకి నివేదించాం గుడిపేట్లోని నూతన భవనంలో తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మెడికల్ కాలేజీలో ఎన్ఎంసీ నిబంధనల మేరకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి, ఖాళీలను భర్తీ చేసేలా చూడాలని ఉన్నతాధికారులకు నివేదించాం. ఖాళీలను సీనియర్ రెసిడెంట్ల(ఎస్ఆర్)తో భర్తీ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. వచ్చే ఏడాదికి 150 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించేలా చూడాలని ఎన్ఎంసీని కోరతాం. – డాక్టర్ ఎండీ.సులేమాన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ -
అధికారి నిర్లక్ష్యం.. తప్పిన పెనుప్రమాదం
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకేఓసీ గనిలో గురువారం అధికారి నిర్లక్ష్యంతో బొలెరోను డోజర్ ఢీకొట్టిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. గనిలో మొదటి షిప్టులో పనులు జరుగుతుండగా తన కన్వినెన్స్ బొలెరోలో వచ్చిన మేనేజర్ వాహనం దిగి పనిప్రదేశానికి వెళ్లాడు. ఉద్యోగులతో మాట్లాడుతుండగా డ్రైవర్ వాహనాన్ని తిరిగి వెళ్లడానికి అనుకూలంగా తిప్పిపెట్టాడు. అక్కడే డోజర్ ఆపరేటర్ కోల్ లెవల్ పనులు చేపట్టే క్రమంలో వెనకకు వచ్చి బొలెరోను బలంగా ఢీకొట్టాడు. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనంలోంచి కిందకు దూకడంతో స్వల్పగాయాలుకాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనలో అధికారి నిర్లక్ష్యం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. పనిస్థలం వరకు కన్వినెన్స్ వెహికిల్స్ రాకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ సదరు అధికారి ఎందుకు వచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
● మూడు రోజుల క్రితం అదృశ్యం ● ఇంటికి సమీపంలోని వ్యవసాయ బావిలో మృతదేహం ● చంపి పడేసినట్లు అనుమనాలు ● ఘటన స్థలాన్ని సందర్శించిన ఏసీపీ
దండేపల్లి: నంబాల గ్రామానికి చెందిన శనిగారపు శేఖర్–రజిత దంపతులు. వారికి కుమారుడు, కూతురు మహన్విత(7) సంతానం. శేఖర్ మేకల కాపరిగా పనిచేస్తున్నాడు. రజిత కూలీ పనులు చేస్తుంది. ఇద్దరూ తమ ఇద్దరి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24న (సోమవారం) మహన్విత ఆరుబయట ఆడుకుంటూ అదృశ్యమైంది. బాలిక మిస్సింగ్పై పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేపట్టారు. ఆచూకీ కోసం గాలించారు. కూతురు తిరిగి వస్తుందని ఆ తల్లిదండ్రులు మూడు రోజులుగా ఎదురు చూస్తున్నారు. బావిలో శవమై.. కానీ అదృశ్యమైన మహన్విత గురువారం నంబాల గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో శవమై తేలింది. విషయం తెలిసిన వెంటన గ్రామస్తులతో పాటు, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు బారీగా తరలివచ్చారు. బాలిక మృతిపై బంధువులు, గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలికను ఎవరో చంపి బావిలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి, లక్సెట్టిపేట ఎస్సైలు తహసీనొద్దీన్, సురేష్తో పాటు పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. డాగ్స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. క్లూస్టీంతో ఘటన స్థలంలో కొన్ని ఆధారాలను సేకరించారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. గ్రామంలో విషాదం.. మహన్విత ప్రాణాలతో కనిపిస్తుందనుకుంటే ఇలా గ్రామసమీపంలో వ్యవసాయ బావిలో శవమై కనిపించడంతో, అక్కడికి వచ్చిన పలువురు కంటతడిపెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలం వద్ద రోదించారు. బాలిక మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
కేసీఆర్ పోరాట ఫలితమే రాష్ట్రం ఏర్పాటు
నస్పూర్: కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. గురువారం నస్పూర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్నే మలుపు తిప్పిందని అన్నారు. కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధన ఉద్యమంలో పోరాడారని తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో చేపట్టే దీక్షా దివస్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, టీబీజీకేఎస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ కేసీఆర్ యావత్ తెలంగాణను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని ముందుకు సాగించారని అన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
హాస్టల్లో అమలు కాని మెనూ
మంచిర్యాలఅర్బన్: మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..? అంటే కోడిగుడ్డుకు బదులు సగం అరటిపండు.. సగం బిస్కట్లు ఇస్తున్నారని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి(డీబీసీడీవో) భాగ్యవతి ఎదుట విద్యార్థులు గోడు వెళ్లబోసుకున్నారు. బుధవారం రాత్రి స్థానిక బీసీ సమీకృత వసతిగృహం ఆకస్మిక తనిఖీలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. పాడైన అరటిపండ్లు తెస్తున్నారని, ఒక్కోసారి వెనకాల తినే వారికి రెండోసారి అన్నం వేసుకుంటే కూర ఉండదని, చాలీచాలని భోజనంతో సరిపెట్టుకుంటామని విద్యార్థులు వాపోయారు. వసతిగృహంలో చెప్పిన దానికంటే తక్కువ విద్యార్థులున్నా అందరికీ చికెన్తో భోజనం అందకుండా పోవడంపై వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చికెన్ పులుసు, మజ్జిగ లేకపోవడంపై తీవ్రంగా మందలించారు. అందుబాటులో కనీసం కూరగాయలు లేకపోవడం.. పచ్చడి కూడా లేదని చెప్పడంతో చలించిపోయిన ఆమె అప్పటికప్పుడు కోడిగుడ్లతో కూర చేయించి పిల్లలకు భోజనం పెట్టించారు. వాచ్మెన్ తరచూ గొడవలు చేయడం. వ్యవహరశైలిపై విద్యార్థులు దృష్టికి తీసుకువచ్చారు. వసతిగృహ వాచ్మెన్తోపాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన శ్రీహరిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అలా వచ్చి.. ఇలా వెళ్తున్నారు..
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్(ఎస్ఈ) పోస్టు కుర్చీలాటగా మారింది. ఏడాదిన్నర కాలంలో నలుగురు ఎస్ఈలు బది లీ కావడం చర్చనీయాంశమైంది. జిల్లాకు వస్తున్న అధికారులు ఆరు నెలలు దాటకుండానే బదిలీపై వె ళ్తున్నారు. గత జూన్ 26న బదిలీపై జిల్లాకు వచ్చిన ఎస్ఈ ఉత్తమ్ జాడే ఈ నెల 24న బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని డీఈ రాజన్నకు పదోన్నతి కల్పిస్తూ బాధ్యతలు అప్పగించారు. ఉత్తమ్ జాడే ఆరు నెలలు గడువక ముందే బదిలీ అయ్యారు. స్థానిక సమస్యల కారణంగానే కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. రాజన్న ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాకు బదిలీ కాగా.. తన పలుకుబడితో జిల్లాకు బదిలీ చేయించుకున్నట్లు సమాచారం. ఉత్తమ్జాడే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లడానికి నిరాకరించడంతో ప్రస్తుతం కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేశారు. గత మే నుంచి నలుగురు. బదిలీపై వచ్చే అధికారులు రెండు మూడేళ్లు పని చే యాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో నెలల వ్యవధిలో నే వెళ్లిపోతున్నారు. అక్రమాలు, అవినీతి ఫిర్యాదులు, విద్యుత్ సరఫరాలో అంతరాయం తదితర ఆ రోపణల నేపథ్యంలో ఇక్కడ ఉండేందుకు జంకుతున్నారు. గత ఏడాది మే వరకు విధుల్లో ఉన్న ఆర్.శేషారావును విధుల్లో నిర్లక్ష్యం, పలు ఆరోపణల ఫి ర్యాదులతో బదిలీ చేశారు. ఆయన స్థానంలో కా ర్పొరేట్ కార్యాలయంలోని ఎస్ఈ ఎస్.శ్రావణ్కుమార్ను కేటాయించగా.. ఇక్కడి సమస్యలు, అధికా రులు తీరు ముందే గ్రహించి రావడానికి వెనుకడు గు వేశారు. కొద్ది రోజులు డీఈ రాజన్నకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లాకు వచ్చిన శ్రావణ్కుమార్ కొద్ది నెలల సమయంలోనే విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సా రించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ అధికారులు, సిబ్బందిని విధుల్లో పరుగులు పెట్టించారు. సమావేశాలు, సమీక్షలు నిర్వహించి విధుల్లో నిర్లక్ష్యం వ హించిన వారిని హెచ్చరించారు. ఆరోపణల ఏఈని సస్పెండ్ చేశారు. జిల్లాలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, ఆరోపణలు తలకు మించిన భారంగా మార డం, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు ప్రమేయం అధికంగా ఉండడంతో తన కార్పొరేట్ కార్యాలయ పలుకుబడితో గత నవంబర్ 6న ఇతర జిల్లాకు బదిలీ చేయించుకున్నారు. ఆయన స్థానంలో కరీంనగర్ ఎస్ఈ గంగాధర్ను కేటాయించగా.. జిల్లాకు వచ్చేందుకు ససేమిరా అన్నారు. మళ్లీ కొద్ది రోజులు డీఈ రాజన్న ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. ఇతర జిల్లాకు బదిలీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించక వారం రోజుల తర్వాత గంగాధర్ విధుల్లో చేరారు. ఆయన స్థానికంగా ఉండకపోవడం, సమస్యలపై దృష్టి సారించకపోవడం, డివిజన్ స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఇష్టారాజ్యం కొనసాగింది. ఎట్టకేలకు గంగాధర్ గత జూన్ 26న పెద్దపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన ఉత్తమ్ జాడే ఐదు నెలల వ్యవధిలోనే వెళ్లిపోయారు. దీంతో మళ్లీ రాజన్నను నియమించారు. సమస్యలు.. నిర్లక్ష్యం.. జిల్లాలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం పెరిగిపోతోంది. ఎ స్ఈ ఆదేశాలు పట్టించుకోకపోవడం, యూనియ న్లు, ప్రజాప్రతినిధుల జోక్యం పెరిగిపోవడం కారణంగా ఇక్కడ పని చేయడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. స్థానికంగా స్థిరపడిన డీఈలు, ఏడీఈలు, ఏ ఈలు ఏళ్ల తరబడి ఇటు నుంచి అటు నుంచి బదిలీ అవుతూ పైరవీలతో ఇక్కడే కొనసాగుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఎస్ఈ, ఉన్నతాధికారుల ఆదేశాలు లెక్క చేయడం లేదు. విద్యుత్ సమస్యలు పెరిగిపోయి వినియోగదారులు గ్రీవెన్స్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. స్థానిక సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. సమస్యలను చక్కదిద్తే ప్రయత్నం చేసేలోపే ఎస్ఈలు బదిలీ అవుతున్నారు. -
భారత రాజ్యాంగం దేశానికి గర్వకారణం
నస్పూర్: భారత రాజ్యాంగం దేశానికి గర్వకారణమని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం(సంవిధాన్ దివస్)ను పురస్కరించుకుని నస్పూర్లోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగం ముందుమాట ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా గ్రామీ ణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ఖాన్, జిల్లా వైద్యాధికారి అనిత, మైనార్టీ సంక్షేమాధికారి నీరటి రాజేశ్వరి, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
మందమర్రిరూరల్: పట్టణంలోని రామన్ కాలనీలో గల ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 24న జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ శశిధర్రెడ్డి తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్షిప్కు చెందిన కంది రవి (సింగరేణి కార్మికుడు) కొద్ది రోజులుగా మద్యానికి బానిస్సై జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఆలయంలో హుండీని పగులగొట్టి అందులోని రూ.2,950 నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. టోల్గేట్ సమీపంలో నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 2,450 రికవరీ చేసినట్లు తెలిపారు. ఎస్సై రాజశేఖర్తో పాటు, సిబ్బందిని సీఐ అభినందించారు. -
ప్రపంచ శాంతికి సైకిల్ యాత్ర
సోన్: ప్రపంచ శాంతి, కాలుష్య రహిత సమాజం కొరకు మహారాష్ట్రలోని పూణేకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు దత్త, బ్యాంకు మేనేజర్ అవినాష్ చౌహాన్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన సైకిల్ యాత్ర బుధవారం మండల కేంద్రానికి చేరుకుంది. ఉపాధ్యాయులు తోడిశెట్టి రవికాంత్, తోడిశెట్టి చంద్రయ్య, పోతుగంటి సాయన్న, మారుపాక శ్రీనివాస్, సేర్పూర్ సత్యనారాయణ గంజాల్ టోల్ ప్లాజా వద్ద వారికి స్వాగతం పలికారు. స్వాగతం పలికినట్లు తెలిపారు. ఈ సందర్భంగా యాత్రికులు మాట్లాడుతూ ఈనెల 12న ప్రారంభమైన యాత్ర 25 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. -
అంకోలి పీహెచ్సీ సందర్శన
ఆదిలాబాద్రూరల్: మండలంలోని అంకోలి పీహెచ్సీని బెంగళూరుకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్) అధికారి డాక్టర్ కే.అభయ్ బుధవారం సందర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండాకాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడదెబ్బ తగలకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలను మండల వైద్యాధికారి డాక్టర్ సర్ఫరాజ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీహెచ్సీ ఆవరణలో స్టోర్ రూం, ల్యాబ్, బయోమెడికల్ వేస్టేజ్ పరిశీలించారు. ఆయన వెంట ఎన్సీడీ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్, హెల్త్ సూపర్వైజర్లు బొమ్మెత సుభాష్, శ్రీనివాస్, స్టాఫ్ నర్సులు రాజ్యలక్ష్మి, ప్రతిమ, ల్యాబ్ టెక్నీషియన్ పల్లవి, తదితరులు ఉన్నారు. -
అంబేడ్కర్ ఆశయసాధనకు పాటుపడాలి
బాసర: అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. బుధవారం బాసర ట్రిపుల్ ఐటీలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో డాక్టర్ రేవల్లి అజయ్ అధ్యక్షతన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ మూల సూత్రాలు, ప్రవేశిక, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక హక్కులు, వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి తీసుకున్న అంశాల గురించి వివరించారు. ప్రజలందరూ రాజ్యాంగ ఫలాలను అందుకోవాలన్నారు. ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న పార్లమెంటరీ కమిటీలో బాబు రాజేంద్రప్రసాద్ ప్రవేశపెట్టగా ఆమోదం ముద్ర వేశారన్నారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్వో డాక్టర్ రాజేశ్, అసోసియేట్ డీన్లు డాక్టర్ విఠల్, డాక్టర్ మహేష్, ఎస్.శేఖర్, డాక్టర్ జి.నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పాముకాటు
కైలాస్నగర్(బేల): బేల మండలంలోని సిర్సన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదోతరగతి విద్యార్థి అనూష్ పాముకాటుకు గురయ్యాడు. బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విద్యార్థులు క్రికెట్ ఆడుతుండగా బంతి పాఠశాల బయట డ్రెయినేజీలో పడింది. బాలుడు చేతితో బంతిని తీస్తుండగా పాము కాటువేసింది. ఉపాధ్యాయులకు విషయం చెప్పడంతో 108కు సమాచారం అందించారు. ప్రథమ చికిత్సను అందించిన అనంతరం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రాణపాయం తప్పినట్లుగా వైద్యులు తెలి పారు. మండల విద్యాధికారి మహాలక్ష్మి రిమ్స్ కు చేరుకుని విద్యార్థిని పరామర్శించారు. -
నూతన ఆవిష్కరణలతో అభివృద్ధి
నస్పూర్: నూతన ఆవిష్కరణల ద్వారా వివిధ రంగాల్లో అభివృద్ధి సాద్యమవుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పట్టణ పరిధిలోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో నిర్వహించిన 53వ జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మనం చేసే ప్రతీ ప్రయత్నం దేశ అభివృద్ధికి దోహదపడాలని పేర్కొన్నారు. సైన్స్ రంగం రోజురోజుకి అభివృద్ధి చెందుతోందని, విద్యార్థులను సాంకేతికత వైపు దృష్టి సారించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు. అంతకుముందు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాగా ఈ ప్రదర్శనకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 300 మంది విద్యార్థులు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ యాదయ్య, నస్పూర్ ఎంఈఓ పద్మజ, జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్రావు, ఎంఈఓలు, ట్రస్మా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘గెలుపే లక్ష్యంగా పని చేయాలి’
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/లక్సెట్టిపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పిలుపుని చ్చారు. బుధవారం హాజీపూర్లో, లక్సెట్టిపేట మండలం ఎస్పీఆర్ ఫంక్షన్ హాలులో లక్సెట్టిపేట, దండేపల్లి బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, పంచాయతీల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల మధ్య ఎండగడుతూ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. హాజీపూర్లో మాధవరపు రామారావుకు పార్టీ కండువా కప్పి బీ ఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్రావు, మొగిళి శ్రీనివాస్, గాదె సత్యం, పల్లె భూమేశ్, సాగి వెంకటేశ్వర్రావు, మందపల్లి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిక దండేపల్లి: మండల కేంద్రానికి చెందిన బొలిశెట్టి సిద్దార్థ బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు సమక్షంలో పార్టీలో చేరిన ఆయనకు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
ఎంజేపీ కళాశాలలో విచారణ
ఇచ్చోడ: మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రిన్సిపాల్ నారాయణ విద్యార్థులపై వేధింపులకు పాల్పడుతున్నాడని మంగళవారం అంబేడ్కర్ చౌరస్తాలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. బుధవారం ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, ఉమ్మడి జిల్లా ఆర్సీవో శ్రీధర్ కళాశాలలో విచారణ చేపట్టారు. విద్యార్థులు, కళాశాల సిబ్బంది, ప్రిన్సిపాల్తో వేర్వేరుగా మాట్లాడారు. ప్రిన్సిపాల్ నారాయణపై విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆర్సీవో శ్రీధర్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ను సెలవులపై పంపించారు. విద్యార్థుల ఆందోళనతో ప్రిన్సిపాల్ నారాయణపై బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఆర్కే ఓసీ ఫేజ్–2 మందమర్రి ఏరియాకే కీలకం
రామకృష్ణాపూర్: త్వరలో ప్రారంభంకానున్న రామకృష్ణాపూర్ ఓపెన్కాస్ట్ ఫేజ్–2 గని మందమర్రి ఏరియాకే కీలకం కానుందని జీఎం రాధాకృష్ణ అన్నారు. ఓసీ ప్రాజెక్ట్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటు కానున్న ఓసీ ఫేజ్–2తో మళ్లీ ఈ ప్రాంతానికి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్ 3న ప్రజాభిప్రాయసేకరణ ఉంటుందని స్థానిక ప్రజలు, ఆయా సంఘాల నాయకులు తమ అభిప్రాయాలు వెలువరించాలన్నారు. ఓసీ రాకతో ఏ ఒక్క గ్రామానికి కూడా ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఓసీ వస్తే డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులు వస్తాయని ఆ నిధులు పట్టణ అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. గతంలో మూతబడిన ఆర్కే 4, ఆర్కే 3, ఆర్కే 2, ఆర్కే 1ఏ గనులను కలుపుకుని ఓసీ ఏర్పాటవుతుందన్నారు. స్థానికులకే జీవనోపాధి కల్పిస్తామన్నారు. దాదాపు 400 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అవసరమన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఓసీలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో ఎస్ఓ టు జీఎం జీఎల్.ప్రసాద్, డీజీఎం పర్సనల్ అశోక్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ వెంకట్రెడ్డి, సెక్యూరిటీ ఆఫీసర్ రవికుమార్, ఓసీ మేనేజర్ పంకజ్సింగ్ పాల్గొన్నారు. -
నామినేషన్లకు వేళాయె..
గఢ్పూర్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రం పరిశీలిస్తున్న తహసీల్దార్ శ్రీనివాసరావు లక్సెట్టిపేట: నామినేషన్ క్లస్టర్ వివరాలను నోటీసు బోర్డుపై అతికిస్తున్న ఎంపీడీవో సరోజదండేపల్లి/లక్సెట్టిపేట/మంచిర్యాలరూరల్(హాజీపూర్)/జన్నారం: జిల్లాలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభం కానుంది. ఇందుకోసం మండలాల్లోని గ్రామాలను క్లస్టర్లుగా విభజించి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆయా కేంద్రాలను తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డీఎల్పీఓలు, కార్యదర్శులు, పోలీస్ శాఖ అధికారులు సందర్శించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయించారు. -
నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
నస్పూర్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు ఎన్నికల అధికారి, డీపీవో వెంకటేశ్వర్రావు, నోడల్ అధికారి శంకర్తో కలిసి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, నామినేషన్ ప్రక్రియపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల నుంచి ఫలితాలు వెలువడే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫొటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ, ఫలితాలు వంటి ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత నామినేషన్లు తీసుకోకూడదని, ప్రతీ అభ్యర్థి తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలని తెలిపారు. ఎన్నికల గుర్తులు కేటాయింపులో జాగ్రత్త వహించాలని అన్నారు. మాస్టర్ ట్రైనర్లు, అధికారులు పాల్గొన్నారు. -
అదృశ్యమైన వృద్ధుడి మృతదేహం లభ్యం
భైంసాటౌన్: పట్టణానికి చెందిన శివనాథ్ బచ్చువార్ (76) మృతదేహం బుధవారం లభ్యమైనట్లు పట్టణ ఎస్సై నాగభూషణం యాదవ్ తెలిపారు. శివనాథ్ బచ్చువార్ ఈనెల 23న సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లి ఇంటికి రాలేదు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. వృద్ధుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా బుధవారం నిర్మల్ చౌరస్తాలోని ఎంఎస్ టవర్స్ లిఫ్ట్ సెల్లార్లో అతని మృతదేహం లభ్యమైనట్లు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఎంఎస్ టవర్స్లో బంధువుల ఇంటికి వెళ్లగా లిఫ్ట్ (పనిచేయడం లేదు) ఎక్కే క్రమంలో గమనించక జారి సెల్లార్లో పడి మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
‘మా ఉపాధ్యాయుడు మాకే కావాలి’
జైనథ్: మా ఉపాధ్యాయుడు మాకే కావాలని మండలంలోని పిప్పల్గావ్ గ్రామస్తులు బుధవారం ఎంఈవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుడు తిరుపతిరెడ్డిని డిప్యూటేషన్పై కారింజ పాఠశాలకు పంపిస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేయడంతో సదరు ఉపాధ్యాయుడు కారింజ గ్రామంలోని పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుడి డిప్యూటేషన్ను వ్యతిరేకిస్తూ పిప్పల్గావ్ గ్రామస్తులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారని అందులో ఒకరికి ఆరోగ్యం బాగోలేక సెలవుపై ఉండగా ఉన్న ఒక్క ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్పై పంపించారన్నారు. మా ఉపాధ్యాయుడిని మాకే పంపించాలని కోరారు. -
పులి వచ్చిందోచ్..!
జన్నారం: నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు పులి అలజడి సృష్టించింది. జన్నారం అటవీ డివిజన్లోని ఇందన్పల్లి గ్రామ సమీపంలో ఉన్న భీమన్నగుట్ట వద్ద ఆవుపై దాడి చేసి హతమార్చింది. బుధవారం విష యం తెలుసుకున్న జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్, ఇందన్పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ, ఎఫ్ ఎస్వో రవి సిబ్బందితో కలిసి భీమన్న గుట్ట ప్రాంతంలో పరిశీలించారు. మామిడితోటలో ఆవు కళేబ రం కనిపించింది. ఆవు వెనుకభాగంపై దాడి చేసి తి నడం గమనిస్తే ఇది పులి దాడేనని ఎఫ్డీవో తెలి పా రు. పరిసరాల్లో అడుగులను గుర్తించారు. అటవీ స మీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. అటవీ, చేను, పొలాల్లో కరెంటు తీగలు అమర్చవద్దని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలోకి మేకలు, గొర్రెల కాపరులు వెళ్లకూడదని తెలిపారు. నాలుగేళ్లకు.. జన్నారం అటవీ డివిజన్లో నాలుగేళ్ల క్రితం మహ్మదాబాద్ బీట్ పరిధిలో, కడెం ప్రాంతంలో పులి కెమెరాకు చిక్కింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలోకి రాలేదు. రెండేళ్ల క్రితం ఆవుపై దాడి చేసినా అది పులి అని అధికారులు నిర్ధారించలేదు. ఎట్టకేలకు పులి జన్నారం డివిజన్లోకి రావడంపై అటవీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పులి కదలికలను గమనిస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి వెళ్తుంది.. ఎక్కడ ఉంది అనే అంశాలు పరిశీలిస్తున్నారు. పులి దాడి చేసి ఆవును చంపిందనే వార్త బయటకు రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
కాసిపేట: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా చేపట్టిన ఘటన బుధవారం మండలంలోని సోమగూడం భరత్ కాలనీలో చోటు చేసుకుంది. యువతికి మహిళా సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా బాధిత యువతి అనూష మాట్లాడుతూ సోమగూడెంకు చెందిన సింగరేణి కార్మికుడు షేక్ సలీం, తాను ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నామని, ఇప్పుడు పెళ్లికి పెళ్లికి నిరాకరించడంతో గతంలో పోలీస్స్టేషన్లో కేసు పెట్టగా జైలుశిక్ష అనుభవించినా మార్పు రాలేదంది. ఈ నెల 29న మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేసుకోవడంతో ఆందోళనకు దిగినట్లు పేర్కొంది. సదరు యువకుడి కుటుంబ సభ్యులు కూడా గొడవకు దిగడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. విషయం తెలుసుకున్న సీఐ ఇరువర్గాలను స్టేషన్కు తరలించారు. గతంలో కేసు అయినందున కోర్టులో చూసుకోవాలని ఇన్చార్జి ఎస్సై రవీందర్ నచ్చజెప్పి పంపించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం నాయకురాళ్లు భవాని, కామెర అనూష, తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ స్ఫూర్తితోనే ఆత్మనిర్బర్ భారత్
మంచిర్యాలటౌన్: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే ఆత్మనిర్మర్ భారత్ దిశగా భారతదేశం ముందుకు వెళ్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం అంబేడ్కర్ చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దుర్గం అశోక్, పట్టి వెంకటకృష్ణ, ఎనగందుల కృష్ణమూర్తి, పానుగంటి మధు, వైద్య శ్రీధర్, అమిరిశెట్టి రాజ్కుమార్, రంగ శ్రీశైలనం, మిట్టపల్లి జయరామరావు, బెల్లంకొండ మురళి, కుర్రె చక్రవర్తి, బింగి సత్యనారాయణ, పవన్ పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించాలి
దండేపల్లి: సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ కేంద్రాల వద్ద ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ సూచించారు. దండేపల్లి మండల కేంద్రంతోపాటు లింగాపూర్, నెల్కివెంకటాపూర్ గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తితో కలిసి బుధవారం ఆయన సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించి వద్ద వందమీటర్ల లోపు ఎవరినీ రానివ్వకూడదని, నామినేషన్ వేసే వ్యక్తితో ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతించాలని తెలిపారు. ఎంపీడీవో ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి శ్రీలత, జూనియన్ అసిస్టెంట్ అరుణ్ పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి లక్సెట్టిపేట: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని డీసీపీ భాస్కర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రజలు శాంతియుతంగా ఎన్నికల్లో పాల్గొనేలా చూడాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎన్నికల నిర్వాహణపై అవగాహన కల్పించారు. ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్రావు, రూరల్ ఇన్స్పెక్టర్ అశోక్కుమార్, సీఐ రమణామూర్తి పాల్గొన్నారు. -
ప్రజాహితమే పోలీసుల లక్ష్యం
వేమనపల్లి: ప్రజాహితం, ప్రజల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అ న్నారు. మండల కేంద్రంలోని మంగనపల్లి క్రాస్ రో డ్డు వద్ద ఉన్న గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల ఆవరణలో చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. మంచిర్యాలకు చెందిన పవన్ ఆప్టికల్, కంటి ఆసుపత్రి సౌజన్యంతో నేత్ర వైద్యుల పర్యవేక్షణలో 150 మంది వృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. 64 మంది దృష్టి లోపంతో ఉన్నందున శస్త్రచికిత్స చేయించనున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన 150 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. హాస్టల్ ఆవరణలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్తో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నీల్వాయి, కోటపల్లి పోలీసులు పాల్గొన్నారు. -
పల్లె పోరుకు సై..
బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025ఎమ్మెల్యే పీఎస్సార్ను కలిసిన డిప్యూటీ సీఎం ‘భట్టి’ మంచిర్యాలటౌన్: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు(పీఎస్సార్)ను సోమవారం రాత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థానికి రావాలని ఆహ్వానించారు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోగ్యంగా ఇంటికి విచ్చేసిన సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ కూడా ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సన్మానించారు.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలరూరల్(హాజీపూర్): పల్లె పోరుకు నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక శుక్రవారం(ఈ నెల 27) నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం మొదలు కానుంది. జిల్లాలో 306 గ్రామ పంచాయతీలు ఉండగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 17నాటితో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. గత కొంతకాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇక గత సెప్టెంబర్లోనే ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్యాలెట్ బాక్సుల నుంచి బ్యాలెట్ పేపర్లు, గుర్తులు, సిబ్బంది శిక్షణ, పోలింగ్ కేంద్రాలు, సౌకర్యాలు, రూట్మ్యాప్ తదితరవన్నీ పూర్తి చేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరిగి తుది జాబితా సిద్ధమైంది. ఆశావహుల సందడి పోటీకి సిద్ధమై తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ఆశావహుల సందడి నెలకొంది. మొదటి విడత ఎన్నికల నామినేషన్లకు మూడు రోజులే గడువు ఉంది. దీంతో ఆయా గ్రామాల్లో అభ్యర్థులు తమ ఏర్పాట్లు ముమ్మరం చేసుకుంటున్నారు. అధికార, విపక్ష పార్టీల్లోని నాయకులు తమ పార్టీ నుంచి మద్దతు కోసం నియోజకవర్గ బాధ్యులను కలుస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఎమ్మెల్యేలను రిజర్వేషన్లు అనుకూలించిన వారంతా వారంతా కలిసి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయఢంకా మోగించడంతో తమకు అనుకూల పవనాలు ఉన్నాయని పార్టీ భావిస్తోంది. ఇటీవల డీసీసీ అధ్యక్షులను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలను వేగం చేసింది. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. అధికార పార్టీ నాయకులు గ్రామాల్లో సమరోత్సాహంతో ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం, సర్కారుపై ఉన్న వ్యతిరేకతతో గ్రామాల్లో పట్టు పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీలో నియోజకవర్గ బాధ్యులు, వామపక్ష పార్టీల్లో ఆయా నాయకులు తమ పట్టు పెంచుకునేందుకు కేడర్ను సన్నద్ధం చేసి గెలుపు గుర్రాల కోసం అభ్యర్థులను ఎంపిక చేసే పని మొదలు పెట్టారు. మండలాలు 16 గ్రామ పంచాయతీలు 306 పోలింగ్ కేంద్రాలు 714 వార్డులు 2,680 బ్యాలెట్ బాక్సులు 3,632 ఎన్నికల సిబ్బంది 5,194 నవంబర్ 30న డిసెంబర్ 3 డిసెంబర్ 6డిసెంబర్ 3 డిసెంబర్ 6 డిసెంబర్ 9 ఎన్నికల షెడ్యూల్ ఇదీ.. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11, రెండవ విడత 14, మూడవ విడత 17న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఉపసర్పంచ్నూ ఎన్నుకుంటారు. ఐసీడీఎస్ నిర్వీర్యానికి కుట్ర ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఐటీయూ నాయకురాలు సింధు ఆరోపించారు. ఆదిలాబాద్లో ఐదో రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. విడతల వారీగా ఎన్నికలు... మొదటి విడత రెండో విడత మూడో విడత ఓటరు జాబితా ప్రదర్శన నవంబర్ 17 నవంబర్ 30 డిసెంబర్ 3 నామినేషన్ల స్వీకరణ నవంబర్ 27, 28, 29 నవంబర్ 30, డిసెంబర్ 3, 4, 5 డిసెంబర్ 1, 2 నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల జాబితా అభ్యంతరాల స్వీకరణ డిసెంబర్ 1 డిసెంబర్ 4 డిసెంబర్ 7 అభ్యంతరాల పరిష్కారం డిసెంబర్ 2 డిసెంబర్ 5 డిసెంబర్ 8 నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన పోలింగ్ డిసెంబర్ 11 డిసెంబర్ 14 17 -
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
నస్పూర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎల్డీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రథయాత్ర మంగళవారం నస్పూర్కు చేరింది. ఈ సందర్భంగా దిలీప్కుమార్ మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని, నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలని అన్నా రు. సన్న వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సిద్దం కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మడకం ప్రసాద్దొర, రిషబ్, నర్సింహారావు, కళాబృందం రాష్ట్ర నాయకులు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మికుల రెండు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు నెలలుగా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్యం బారిన పడ్డ వారి స్థానంలో పనిచేస్తున్న వారి పేర్లు ఎక్కించాలని కోరారు. కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లో కార్మికులకు గ్రామ పంచాయతీల్లో ఇచ్చిన వేతనాలనే ఇస్తున్నారని, సమాన వేతనాలు ఇవ్వాలని కోరారు. సంఘం గౌరవ అధ్యక్షుడు దేవి సత్యం, కోకిల శ్రీనివాస్, ఆవునూరి గోపాల్, దాసరి సుమన్, బరిగెల నవీన చిట్యాల శంకరయ్య, రేగుంట వెంకటి, సత్తయ్య, రాయలింగు, మల్లేశ్, మాడుగుల నవీన్, సిర్ర దుర్గమ్మ, పోసక్క, సుజాత, దుర్గక్క, లావణ్య పాల్గొన్నారు. -
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
వాంకిడి: జీవితంపై విరక్తితో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బంబార గ్రామానికి చెందిన నీలం శ్రీలత (31)కు ఐదేళ్ల క్రితం జగిత్యాలకు చెందిన వ్యక్తితో వివాహమైంది. కాగా, మనస్పర్థల కారణంగా నెల రోజులకే విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి శ్రీలత తన తల్లి సత్తమ్మ వద్ద ఉంటోంది. గత ఆగస్టులో జైపూర్ మండలం కిష్టాపూర్కు చెందిన షేర్ల రంజిత్ ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో రంజిత్ ఈ నెల 23న విషం తాగి ఆత్మహత్య చేసుకున్నా డు. తనకు కాబోయే భర్త ఆత్మహత్య చేసుకోగా మనస్తాపానికి గురైన శ్రీలత సోమవారం రాత్రి 8గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి సత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మహిళల అభివృద్ధికి వడ్డీలేని రుణాలు
లక్సెట్టిపేట: మహిళల అభివృద్ధి కోసమే ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాల ఐకేపీ మహిళా సంఘాల సభ్యుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా వడ్డీ లేని రుణాలు, అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని తెలిపారు. మహిళల కోసం ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కోళ్ల పెంపకం, క్యాటరింగ్, డెయిరీఫార్మ్, ఇతర రంగాల్లో ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మహిళలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యమని, దండేపల్లి మండలంలో మహిళల నిర్వహణలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని 1,618 స్వయం సహాయక సంఘాలకు రూ.1.45కోట్ల వడ్డీలేని రుణాల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, తహసీల్దార్ దిలీప్కుమార్, ఎంపీడీవో సరోజ, నాయకులు శ్రీనివాస్, ఆరీఫ్, పింగిళి రమేష్, ఐకేపీ సభ్యులు పాల్గొన్నారు. -
కేజీబీవీలకు మహర్దశ
మంచిర్యాలఅర్బన్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)కు మహర్దశ రానుంది. బాలికలకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు నిధులు కే టాయించింది. దీంతో విద్యాలయాల రూపురేఖలు మారనున్నాయి. నాణ్యమైన విద్య, వసతులు అందించడమే లక్ష్యంగా కేజీబీవీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగుపర్చి భవిష్యత్కు బాటలు వేస్తున్నారు. మొదట్లో కేజీబీవీల్లో పదో తరగతి వరకు మాత్రమే తరగతులు కొనసాగేవి. జిల్లాలో మూడు కేజీబీవీలు మినహా కాలక్రమేణ ఇంటర్మీడియెట్కు అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ కేజీబీవీలతోపాటు మిగతా కేజీబీవీల్లో వసతుల కల్పనకు నాబార్డు నిధులు కేటాయించింది. జిల్లా విద్యాశాఖ అధికారి, స్పెషల్ ఆఫీసర్లు, టీజీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల సమన్వయంతో మౌలిక సదుపాయాల ఆధారంగా ప్రాధాన్యత ప్రాతిపదికన పనులు, మరమ్మతులు గుర్తించనున్నారు. విద్యాలయాల్లో వచ్చే విద్యాసంవత్సరం పునఃప్రారంభంలోపే పునరుద్ధరణ, మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఉత్తర్వులు రావడంతో అధికారులు చర్యలు వేగవంతం చేశారు. మౌలిక వసతులు ఇలా.. జిల్లాలో 18 కేజీబీవీలు ఉన్నాయి. మూడింటిలో పదో తరగతి, 15 చోట్ల ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ఇదివరకు 4,589 మంది బాలికలు అభ్యసిస్తున్నారు. ఇటీవల ఐదు కేజీబీవీ ల్లో ఇంటర్ తరగతుల నిర్వహణకు అనుమతులు ఇచ్చారు. రెండు చోట్ల రెండు, మూడు చోట్ల ఒకే కోర్సులో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. గదుల కొరత, సౌకర్యాల లేమి నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పనులు చేపట్టనున్నారు. ఆయా కేజీబీవీల్లో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతారు. విద్యార్థినుల అవసరాల మేరకు అదనపు తరగతి గదులు, శుద్ధ జలట్యాంకులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీటిపంపులు, బోర్వెల్లు, ప్రహరీల నిర్మాణం, సోలార్ ఫెన్సింగ్, డార్మెటరీ, భోజనశాలలు, దోమలు రాకుండా మెష్ల ఏర్పాటు, భవన మరమ్మతులు, విద్యుత్ ఉపకరణాల మరమ్మతులు చేపట్టనున్నారు. సాధ్యమైన చోట ప్రస్తుత భవనాల మొదటి, రెండో అంతస్తుతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పరిపాలన అనుమతితో కేటాయించిన మొత్తానికి మించి అదనపు ఆర్థిక కేటాయింపు చేయకూడదనే నిబంధనలు విధించారు. అంచనాలు తయారు, పనులు అమలులో నాబార్డు మార్గదర్శకాలు, పీడబ్ల్యూడీ, సీపీడబ్ల్యూడీ నిబంధనల ద్వారా సూచించిన సాంకేతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ పొక్యుర్మెంటు ప్లాట్ఫామ్ ద్వారా పారదర్శకంగా టెండర్లు పిలవాలని ఆదేశాలు వచ్చాయి. 2026–27 విద్యాసంవత్సరం పునః ప్రారంభానికి ముందే పూర్తి చేయాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ క్రమం తప్పకుండా పనుల పురోగతి నివేదికలపై ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉంటుంది. ఒక్కో కేజీబీవీలో మౌలిక వసతులకు అవసరం మేరకు ఒక్కో తీరుగా నాబార్డు నిధులు కేటాయించారు. మండలాల వారీగా నిధుల వివరాలు విద్యాలయం నిధులు(రూ.లక్షల్లో) బెల్లంపల్లి 38.172 చెన్నూర్ 57.400 జన్నారం 38.172 లక్సెట్టిపేట 38.172 మంచిర్యాల 38.172 మందమర్రి 57.500 నెన్నెల 38.172 తాండూర్ 80.152 జైపూర్ 49.950 నస్పూర్ 88.552 భీమిని 42.123 భీమారం 42.123 దండేపలి 42.123 హాజీపూర్ 54.500 కన్నెపల్లి 54.500 కాసిపేట 42.123 కోటపల్లి 42.129 వేమనపల్లి 42.123 -
ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని విద్యార్థుల ఆందోళన
ఇచ్చోడ: కొద్దిరోజులుగా ప్రిన్సిపాల్ నారాయణ వే ధిస్తున్నారని మండల కేంద్రంలోని మహాత్మా జ్యో తిబాపూలే కళాశాల విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్లో రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ప్రిన్సి పాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశా రు. పోలీసులు చేరుకుని విద్యార్థులను పోలీస్స్టేష న్కు తరలించారు. విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థులు పోలీస్స్టేషన్కు చేరుకుని ఆందోళనకు దిగారు. విద్యార్థులకు నచ్చజెప్పిన పోలీసులు వారి ని కళాశాలకు పంపించారు. ఈ సమాచారం తె లుసుకున్న ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, ఆర్సీవో శ్రీధర్ సాయంత్రం కళాశాలకు చేరుకుని తరగతికి ఇద్దరు చొప్పున విద్యార్థులను పిలిపించి ప్రిన్సిపాల్ రూంలో మాట్లాడారు. కాగా, కొద్దిరోజులుగా ప్రిన్సిపాల్ మానసికంగా వేధిస్తున్నట్లు విద్యార్థులు ‘సాక్షి’కి వివరించారు. తరచూ ఉడకని అ న్నం పెడుతున్నారని, ఆటవస్తువులు లేవని తెలి పారు. వీటిపై ప్రశ్నించిన తమను టార్గెట్ చేసి కళాశాల నుంచి బయటికి పంపిస్తానని, చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. కొద్దిరోజుల కిత్రం ప్రిన్సిపాల్ వ్యవహారంపై కొందరు విద్యార్థులు రహస్యంగా ఆర్సీవోకు ఫిర్యాదు చేయగా, అప్పటినుంచే వేధింపులు మొదలైనట్లు తెలిపారు. -
వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బాలికలకు బంగారు పతకాలు
మంచిర్యాలఅర్బన్: హైదరాబా ద్లోని జింఖానా గ్రౌండ్లో మంగళవారం నిర్వహించి న రాష్ట్రస్థాయి కాలే జీ స్కూల్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పో టీల్లో మంచిర్యాల విద్యార్థినులు ప్రతిభ కనబర్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిలాక్లు చెందిన బాలికలు రెండు బంగారు పతకాలు సాధించినట్లు ఉ మ్మడి జిల్లా క్రీడల కార్యదర్శి బాబురావు తెలి పారు. సారంగపూర్ ప్రభుత్వ జూనియర్ కళా శాలలో ద్వితీ య సంవత్సరం చదువుతున్న పగ్గం వర్థిని 77కిలోల విభాగంలో 125 కేజీల బరువు ఎత్తి మొదటి స్థానం సాధించినట్లు పేర్కొన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో మొదటిసంవత్సరం చదువుతున్న వడ్ల జాహ్నవి 69కిలోల విభాగంలో 117కేజీల బరువు ఎత్తి బంగారు పతకం సాధించినట్లు తెలిపారు. -
మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి
మంచిర్యాలటౌన్: బస్తీదవాఖానాలో మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని హమాలీవాడ బస్తీదవాఖానాలో మహిళల ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ఆమె పరిశీలించారు. 7,547 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించినట్లు తెలిపారు. మహిళల్లో అసంక్రమణ వ్యాధులు, బీపీ, షుగర్, క్యాన్సర్, రక్తహీనత, రుగ్మతలను గుర్తించి సరైన వైద్యం అందించాలని వైద్యాధికారి డాక్టర్ రమ్యకు సూచించారు. వ్యాసెక్టమీపై అవగాహన కల్పించాలి మంచిర్యాలటౌన్: జిల్లాలో ఈ నెల 21నుంచి డిసెంబర్ 4వరకు వ్యాసెక్టమీపై ప్రజలకు అవగాహనను కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం వ్యాసెక్టమీ అవగాహన కార్యక్రమాల పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వో కాంతారావు, డెమో బుక్క వెంకటేశ్వర్, డీపీహెచ్ఎన్ పద్మ, దామోదర్, రాజేశ్వర్, సుమన్, వసుమతి, సురేందర్, ప్రవళిక, భాగ్య పాల్గొన్నారు. -
అంజనీతండాలో మనస్తాపంతో ఒకరు..
నర్సాపూర్(జీ): మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంజనీతండా గ్రామానికి చెందిన చవాన్ గణేశ్ (50) రెండేళ్లుగా తన కుటుంబంతో ఉపాధి నిమిత్తం కుస్లీ గ్రామంలో నివాసముంటున్నాడు. సోమవారం అతడి కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో గొడవ జరిగింది. ఈక్రమంలో చవాన్ గణేశ్ ఇంటినుంచి బయకువెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం గాలించారు. మంగళవారం కుస్లీ గ్రామ శివారులోని పత్తి చేనులో విగతజీవిగా పడి ఉన్నాడు. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి మరణించి ఉంటాడని అతడి భార్య చవాన్ లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. విద్యుదాఘాతంతో డ్రైవర్ మృతికాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలంలోని పెంచికల్పేట్ ప్రధాన రహదారి పక్కన టిప్పర్లోంచి కంకర డంపు చేస్తున్న డ్రైవర్ రాములు (43) విద్యుత్షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు.. చింతగూడ గ్రామానికి చెందిన కొట్రంగి రాములు తన సొంత టిప్పర్లో ఇటుక బట్టీల యజమానికి కంకర సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇతర ప్రాంతం నుంచి కంకర లోడ్తో వచ్చి చింతగూడ మూలమలుపు వద్ద డంపు చేస్తున్నాడు. ఈ క్రమంలో పైనున్న విద్యుత్ వైర్లకు టిప్పర్ హైడ్రాలిక్ తగలడంతో విద్యుత్ షాక్తో రాములు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఈజ్గాం ఎస్సై ఘటనా స్థలాన్ని సందర్శించారు. రాములు భార్య చిలుకుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. విద్యుత్ తీగలకు తగిలిన టిప్పర్ -
ఎన్నికలు జరిగే మండలాలు..
మొదటి దశ... రెండో దశ మూడో దశ మండలం జీపీలు వార్డులు మండలం జీపీలు వార్డులు మండలం జీపీలు వార్డులు దండేపల్లి 31 278 బెల్లంపల్లి 17 156 భీమారం 11 94 హాజీపూర్ 12 106 భీమిని 12 100 చెన్నూర్ 30 244 జన్నారం 29 272 కన్నెపల్లి 15 130 జైపూర్ 20 186 లక్సెట్టిపేట 18 160 కాసిపేట 22 190 కోటపల్లి 31 258 మొత్తం 90 816 నెన్నెల 19 158 మందమర్రి 10 86 తాండూర్ 15 144 మొత్తం 102 868 వేమనపల్లి 14 118 మొత్తం 114 996 -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
లక్ష్మణచాంద: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పొట్టపెల్లి (కే) గ్రామానికి చెందిన చించోలి సాయన్న (69)–బుచ్చవ్వ దంపతులు మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై నిర్మల్కు వెళ్లారు. బస్టాండ్లో బుచ్చవ్వను దింపి సాయన్న ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని కనకాపూర్ జాతీయ రహదారిపై చౌరస్తా వద్ద రోడ్డు దాటే క్రమంలో ఖానాపూర్ వైపు నుంచి నిర్మల్ వైపునకు అతివేగంగా పత్తి లోడుతో వస్తున్న బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సా యన్న తీవ్రంగా గాయపడ్డాడు. కనకాపూర్ వాసులు 108కు సమాచారం ఇవ్వగా సిబ్బంది అంబులె న్స్లో నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించగా అప్పటికే సాయన్న మృతి చెందిన ట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో మంచివ్యక్తిగా పేరున్న సాయన్న మృతితో అతడి కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛా యలు అలుముకున్నాయి. మృతుడికి కుమారుడు సాగర్ ఉన్నాడు. బుచ్చవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బాధ్యతలు స్వీకరించిన ఎస్ఈ రాజన్న
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్(ఎస్ఈ) రాజన్న మంగళవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బెల్లంపల్లి డీఈగా పనిచేస్తున్న ఆయనకు ఎస్ఈగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఈ ఉత్తమ్ జాడేను ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేశారు. ప్రస్తుతానికి పోస్టింగ్ వెయిటింగ్ లిస్టులో ఉంచారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్ఈని డీఈ, ఏడీఈలు, ఏఈలు, సబ్ఇంజనీర్లు శాలువాతో సత్కరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఎస్ఈ రాజన్న కలెక్టర్ కుమార్ దీపక్ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఏడీఈ మోహన్రెడ్డి, రాజశేఖర్ పాల్గొన్నారు. -
బాలిక అదృశ్యం కలకలం
దండేపల్లి: ఇంటిముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలిక మిస్సింగ్ ఘటన మండలంలో కలకలం రేపింది. వివరాలు.. మండలంలోని నంబాల గ్రామానికి చెందిన మేకల కాపరి శనిగారపు శేఖర్–రజిత దంపతుల కూతురు మహన్విత (7) సోమవారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఇంటిముందు ఆడుకుంది. కొద్దిసేపటి తర్వాత కనిపించక పోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల వెతికారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహసినొద్దీన్, పోలీసు సిబ్బంది నంబాల గ్రామానికి చేరుకుని బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, స్థానికులతో మాట్లాడారు. బాలిక మిస్సింగ్పై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మంగళవారం డాగ్స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. రాత్రి మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ నంబాలకు వెళ్లి ఘటనపై ఆరా తీశారు. రాత్రి వరకూ బాలిక ఆచూకీ లభించలేదు. -
సింగరేణి పెట్రోల్బంక్లు
బెల్లంపల్లి: సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రిలో పెట్రోల్బంక్ల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా ఆరు బంక్లు ఏర్పాటు చేయనుండగా.. వీటిలో రెండు బెల్లంపల్లి, మందమర్రిలో నిర్మించనున్నారు. బంక్ల ఏర్పాటు అంశం కొన్నాళ్ల క్రితం తెరపైకి వచ్చినా ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చింది. బెల్లంపల్లిలో బొగ్గు గనులు మూతపడి, సింగరేణి విభాగాల ఎత్తివేతతో జనసందడి తగ్గి, కార్మికులు కానరాక కళావిహీనంగా తయారైంది. ఈ క్రమంలో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన సింగరేణి బెల్లంపల్లిలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేయడం శుభపరిణామంగా చెబుతున్నారు. మరోవైపు ఏఆర్ పోలీసుహెడ్క్వార్టర్స్ ముందు, శాంతిఖని శివారులో ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో ఇప్పటికే సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే కంపెనీ తరఫున బంక్లు ఏర్పాటు చేయనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెల్లంపల్లిలో పాత సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం క్రాస్రోడ్డు చౌరస్తా(కంపెనీ క్వార్టర్స్ ముందు) పక్కన ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం పరిశీలించి ఆమోదించినట్లు తెలుస్తోంది. మందమర్రిలోని యాపల్ ఏరియాలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సింగరేణి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) సంయుక్త ఆధ్వర్యంలో బంక్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి బీపీసీఎల్తో సింగరేణి అధికారులు లీజు ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. త్వరలో స్థలాన్ని స్వాధీనం చేసి బంక్ల నిర్మాణ పనులు మొదలు పెట్టాలనే తలంపులో ఉన్నారు. మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లో త్వరలోనే పెట్రోల్ బంక్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని సింగరేణి మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ తెలిపారు. -
ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీ
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులు, హోమియో క్లినిక్లను తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఇటీవల మంచిర్యాలలోని రాఘవేంద్ర, శ్రీమాత పిల్లల ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు చిన్నారులు చనిపోయారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్లు టీజీఎంసీ సభ్యుడు యెగ్గన శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోమి యో క్లినిక్లు సైతం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు సుమైరాస్ హోమియో, ఈస్తటిక్ క్లినిక్(సౌందర్య) సే వలు, నిర్వహణ పద్ధతులపై వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. నివేదికను తెలంగాణ మెడికల్ కౌన్సిల్, డీఎంహెచ్వోకు సమర్పించినట్లు పేర్కొన్నారు. -
2నుంచి ట్రిపుల్ఐటీలో ‘స్పీక్ మాకే’
బాసర: భారతీయ సంప్రదాయ కళలను యువత కు చేరువ చేయడంలో అగ్రగామిగా నిలిచిన ‘స్పీక్ మాకే’ తెలంగాణ రాష్ట్ర స్థాయి నాలుగో సమ్మేళనా న్ని డిసెంబర్ 2నుంచి 5వరకు బాసర ట్రిపుల్ఐటీ వేదికగా నిర్వహించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. దేశంలోని వివిధ ప్రఖ్యాత గురుపరంపరలకు చెందిన 70మంది దిగ్గజ కళాకారులు, శాసీ్త్రయ సంగీత విధ్వాంసులు, నృత్యకారులు పా ల్గొననున్నారు. రాష్ట్రంలోని ఆయా పాఠశాలల నుంచి 300మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారు. వారికి గు రుకుల శైలిలో నడిచే వర్క్షాప్లు, నాదయోగ సె షన్లు, హఠయోగ, ప్రదర్శనలు, ప్రతిభావంతులైన కళాకారులతో సంభాషణలు తదితర కార్యాచరణ లు అందుబాటులో ఉండనున్నాయి. సమ్మేళనం పో స్టర్ను వీసీ గోవర్ధన్, ఓఎస్డీ మురళీదర్శన్ ఆవిష్కరించారు. సీఎస్వో రాజేశ్, కోఆర్డినేటర్ రాకేశ్రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థి వలంటీర్లు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
చౌటుప్పల్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌ టుప్పల్ మండలం పంతంగి గ్రామ ప్రభుత్వ ఉన్న త పాఠశాలలో మూడురోజులుగా నిర్వహిస్తున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు మంగళవారం ముగిశాయి. పోటీల్లో ఉమ్మ డి పది జిల్లాల నుంచి బాలురు, బాలికల జట్లు పా ల్గొన్నాయి. చివరిరోజు జరిగిన సెమీ ఫైనల్స్, ఫైన ల్స్ మ్యాచ్లను తెలంగాణ విద్యాశాఖ అడిషనల్ డై రెక్టర్ లింగయ్య, యాదాద్రి భువనగిరి డీఈవో స త్యనారాయణ ప్రారంభించారు. బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలువగా, ద్వితీయ స్థానంలో మహబూబ్నగర్ జిల్లా, తృతీయ స్థానంలో నల్లగొండ జిల్లా జట్లు ని లిచాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో ఉ మ్మడి ఆదిలాబాద్ జిల్లా, ద్వితీయ స్థానంలో రంగా రెడ్డి జిల్లా, తృతీయ స్థానంలో కరీంనగర్ జిల్లా జ ట్లు నిలిచాయి. విజేతలకు యాదాద్రి భువనగిరి డీ ఈవో సత్యనారాయణ బహుమతులు అందజేశా రు. డిసెంబర్ 20న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం నుంచి 12మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఎంఈవో గురువారావు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి దశరథరెడ్డి, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, తోట జయప్రకాశ్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణమూర్తి, బిక్కునాయక్, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్రెడ్డి, కూరెళ్ల శ్రీనివాస్, వేణుగోపాల్, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి
శ్రీరాంపూర్: నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆందోళన చేపట్టారు. మంగళవారం శ్రీరాంపూర్లోని గనులు, డిపార్ట్మెంట్లపై జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి లేబర్ కోడ్ పత్రాల ను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని మోదీ సర్కార్ రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను 2020లో తీసుకువచ్చి వీటిని అమలు చేస్తూ ఈ నెల 21న గెజిట్ విడుదల చేసిందని పేర్కొన్నారు. ఇవి అమలైతే కార్మికులు 12గంటలు పని చేయాల్సి వస్తుంద ని తెలిపారు. వేతనాల పెరుగుదల ఉండదని, కార్మి కులు బానిసల్లాగా పని చేసే సంస్కృతి మొదలవుతుందని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే లా కేంద్రం ఈ లేబర్ కోడ్లను అమలు చేస్తోందని ఆరోపించారు. గ్రాట్యుటీ చట్టం, బోనస్ చట్టం, పే మెంట్ ఆఫ్ వేజెస్, వర్క్ మెన్ కాంపెన్సేషన్ చట్టం తదితర అనేక హక్కులను కార్మికవర్గం కోల్పోతుందని తెలిపారు. కార్మికులు ఈ లేబర్ కోడ్ల అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చే యాలని పిలుపునిచ్చారు. అవసరమైతే నిరవధిక స మ్మెకు కూడా సిద్ధంగా ఉండాలని కోరారు. ఆయా గనులపై వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మ య్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, సహాయ కార్యదర్శి కొట్టె కిషన్రావు, మోత్కూరి కొముర య్య, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు జట్టి శంకర్రావు, కేంద్ర ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు గరిగే స్వామి, టీబీజీకేఎస్ ప్రధా న కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, కేంద్ర కమిటీ నాయకులు పానుగంటి సత్తయ్య, వెంగళ కుమార్స్వామి, సీఐ టీయూ నాయకుడు బానేశ్, కాంట్రాక్ట్ కార్మికుల సంఘం నాయకుడు అఫ్రోజ్ఖాన్ పాల్గొన్నారు. -
ఐసీడీఎస్ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
ఆదిలాబాద్టౌన్: మాతా శిశు మరణాలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఐటీయూ అంగన్వాడీ యూనియన్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు ఆరోపించా రు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవ నం వద్ద తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హె ల్పర్స్ యూనియన్ ఐదో రాష్ట్ర మహాసభలను మంగళవారం ప్రారంభించారు. రెండు రోజుల పాటు ని ర్వహించనున్న మహాసభల ప్రారంభం సందర్భంగా మున్నూరుకాపు సంఘ భవనం నుంచి ప్రధాన వీధులగుండా ఎర్ర జెండాలతో వేలాదిమంది అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో జాతీయ, రాష్ట్ర నాయకులు సాయిబాబు, పాలగుడు భాస్కర్, సచిన్, సునీత, జయలక్ష్మి, దర్శనాల మల్లేశ్, కిరణ్, బండారు రవికుమార్, బండి దత్తాత్రి, వెంకటమ్మ తదితరులు పాల్గొని అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఐసీడీఎస్ను బలపర్చాల్సిన సమయంలో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయాలతో నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. మూడేళ్లలో ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలు, భవిష్యత్ కార్యాచరణపై మహాసభల్లో చర్చిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరిలో పుణేలో నిర్వహించనున్న జాతీయ మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై దేశ వ్యాప్త ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే సునీత, పీ జయలక్ష్మి, ఆయా సంఘాల నాయకులు ఎస్వీ రమ, పద్మశ్రీ, కూరపాటి రమేశ్, వేముల ఆనంద్, లంకా రాఘవులు, బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్, మల్లేశ్, లంకా జమున, ముంజం శ్రీనివాస్, కుశన్న రాజన్న, బొమ్మెన సురేశ్, దుంపల రంజిత్, ఎం.గంగన్న, లింగాల చిన్నన్న, పీ జితేందర్, దేవిదాస్, నవీన్కుమార్, సురేందర్, సుజాత, శోభ, స్వామి, తనుష్, విష్ణు, నాగోరావ్, కిష్టన్న, శకుంతల, మంజుల, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. -
కళాకారుల కడుపు నిండేదెలా?
ఆదిలాబాద్రూరల్: కొలాం ఆదివాసీలకు అన్ని అంశాల్లో అవగాహన కల్పిస్తున్న కళాజాత బృందం సభ్యులు నేడు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట ఐటీడీఏ ఆదరణ బాగానే ఉన్నా రెండేళ్లుగా కళాకారులు నిరాదరణకు గురవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా మండలాల పరిధిలోగల ఏజన్సీ గ్రామాల్లోని కొలాం విద్యార్థులు అంతంతా మాత్రంగానే చదువుకుంటూ మధ్యలోనే చదువు మానేస్తున్నారు. వైద్యం చేసుకునేందు కు కూడా ముందుకురావడం లేదు. దీనిని గ్రహించిన ఐటీడీఏ అధికారులు వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని, చదువు ప్రాముఖ్యత తె లుపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే అప్పటి ఐటీడీఏ అధికారులు వారి బాషలోనే వైద్యం, విద్య తదితర అంశాలపై అవగాహన క ల్పించేందుకు 1992–93లో కళాజాత బృందాలను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కళాకారుల సంఖ్య తగ్గింపు సమాచార పౌరసంబంధాల శాఖ పర్యవేక్షణలో ఆటాపాటలతో గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు మొదట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 40మంది కొలాం కళాకారులను నియమించారు. కళాకారు లు బృందాలుగా ఏర్పడి కొలాం ఏజెన్సీ గ్రామాల్లో ఆటాపాటల ద్వారా అవగాహన కార్యక్రమాలు ని ర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, అనారోగ్యానికి గురైన వారు సకాలంలో వైద్య చికిత్స చేయించుకునేందుకు ముందుకు వచ్చేలా అవగాహన క ల్పిస్తున్నారు. దీని ద్వారా కొలాం ఆదివాసుల నుంచి మంచి స్పందన లభించడంతో కళాకారులను అప్పటినుంచి నేటివరకు కొనసాగిస్తున్నారు. కాగా, ప్రస్తుతం తమ సంఖ్య 40నుంచి 20కి తగ్గించారని కళాకారులు వాపోతున్నారు.తగ్గించిన పారితోషికంవైద్యం, విద్యపై ఆటాపాటల రూపంలో అవగాహన కల్పించేందుకు కొలాం కళాకారులకు అధికారులు ఐటీడీఏ ద్వారా వాహన సౌకర్యం కల్పించారు. మైక్సెట్ సమకూర్చారు. వారికి మొదట్లో రోజుకు రూ.600 పారితో షికం అందజేసేవారు. రెండేళ్లుగా రూ.200 పారితోషికం మాత్రమే ఇస్తున్నట్లు కొలాం కళాకారులు వాపోతున్నారు. ఇది తమకు ఏమాత్రం సరిపోవడం లేదని చెబుతున్నారు. ఈ విషయంపై ఇటీవల ఐటీడీఏ పీవోకు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
చెన్నూర్రూరల్: మండలంలోని కత్తెరసాల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమ్మరి యోగి(సాత్విక్)(12) మృతిచెందాడు. అతడి తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటపల్లి మండలం ఆలుగామ గ్రామానికి చెందిన కుమ్మరి రాజయ్య తన కుమారుడు యోగితో కలిసి మోటార్సైకిల్పై చెన్నూర్ మండలం చెల్లాయిపేట గ్రామంలో సోమవారం వివాహానికి హాజరయ్యాడు. ఆలుగామకు తిరిగి వెళ్తున్న క్రమంలో కత్తెరసాల గ్రామం వద్దకు రాగానే చెన్నూర్ నుంచి ఆస్నాద వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి మోటార్సైకిల్ను ఢీకొట్టింది. దీంతో మోటార్సైకిల్పై ఉన్న ఇద్దరూ కిందపడ్డారు. యోగికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెరందాడు. రాజయ్యకు స్వల్ప గాయాలు కాగా చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, యోగి జైపూర్లోని గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి చదవుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెన్నూర్ పట్టణ సీఐ దేవేందర్రావు తెలిపారు. -
అక్రమాలకు చెక్
జన్నారం: కవ్వాల్ టైగర్జోన్ గుండా వెళ్లే వాహనాలకు పర్యావరణ శిస్తు వసూలు విషయంలో అటవీశాఖ నూతన అధ్యయనానికి తెరతీసింది. ఇందులో భాగంగా అటవీశాఖ చెక్పోస్టుల వద్ద డ్యూటీ చేసే సిబ్బంది అక్రమాలకు పాల్పడకుండా, పర్యావరణ శిస్తూ వసూలు ఆటోమేటిక్గా కట్ అయ్యేలా ఫాస్టాగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతం గుండా వెళ్లే వాహనదారులకు శిస్తు ఫాస్టాగ్ రూపంలో అటవీశాఖ ఖాతాలో చేరనుంది. ఐదు మండలాల్లో ఆరువేలకు పైనే టైగర్జోన్ పరిధిలోని ఉట్నూర్, కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి మండలాల్లో గల వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఇచ్చారు. మూడు నెలల క్రితం ఆర్టీవో కార్యాలయం నుంచి తీసుకున్న లిస్టు ప్రకారం ఐదు మండలాల్లో ఆరువేలకు పైగా నాలుగు, ఆరు టైర్ల వాహనాలున్నట్లు గుర్తించారు. అయితే ఫాస్టాగ్ మిషన్లు ఇప్పుడే పూర్తి కావడంతో మరిన్ని వాహనాలు పెరిగే అవకాశం ఉన్నందువల్ల ప్రస్తుతం ఎన్ని వాహనాలు ఉన్నాయనే అంశంపై ఆర్టీవో అధికారులను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. వీటి లెక్క తేలాకే ఫాస్టాగ్ మిషన్లో బెంగళూరుకు చెందిన టెక్నీషియన్ ద్వారా ఐదు మండలాల్లోని వాహనాల నంబర్లు నమోదు చేయడంతో వారికి ఫాస్టాగ్ నుంచి మినహాయింపు వస్తుంది. డబుల్ కట్ అయ్యే ప్రమాదం టైగర్జోన్ పరిఽధిలోని ఉట్నూర్, పాడ్వాపూర్, ఇందన్పల్లి, తపాలాపూర్ చెక్పోస్టుల వద్ద ఫాస్టాగ్ మిషన్లు ఏర్పాటు చేయగా ఇదే దారి గుండా వెళ్లే వాహనాలకు అన్ని చెక్పోస్టుల వద్ద శిస్తు కట్టయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయం ఇటీవల ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధికారులతో మాట్లాడి నిలిపివేయించారు. అయితే టెక్నీషియన్లను పిలిచి ఒక్క చెక్పోస్టు వద్ద డబ్బులు కట్టయితే మరో చెక్పోస్టు కట్ కాకుండా చూసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నూతన వాహనాల నమోదు, ఒకే చెక్పోస్టు వద్ద డబ్బులు కట్ అయ్యేలా నమోదు పూర్తయితే ఫాస్టాగ్ ప్రారంభించే అవకాశం ఉంది. రశీదు లేకుండానే.. చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహించే కొందరు అటవీ సిబ్బంది పర్యావరణ శిస్తు వసూలు విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. రశీదు లేకుండానే డబ్బులు వసూలు చేయడం, ఎక్కువ తీసుకుని తక్కువ రశీదు ఇవ్వడం లాంటి అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఫాస్టాగ్ ఏర్పాటుతో రశీదు ఇవ్వడం ఉండదు కాబట్టి అక్రమాలకు చెక్ పెట్టవచ్చని అధికారులు యోచిస్తున్నారు. నాలుగు చెక్పోస్టుల వద్ద ఏర్పాటు కవ్వాల్ టైగర్జోన్లోని జన్నారం, ఉట్నూర్, ఖానాపూర్ అటవీ డివిజన్లలో నాలుగు చోట్ల ఫాస్టాగ్ ఏర్పాటు చేశారు. జన్నారం డివిజన్లో ని తాళ్లపేట, ఇందన్పల్లి, ఖానాపూర్ డివిజన్లోని పాడ్వాపూర్, ఉట్నూర్ డివిజన్లోని కొత్తగూడెం చెక్పోస్టుల వద్ద ఫాస్టాగ్ మిషన్లు ఏ ర్పాటు చేశారు. ఈ దారి గుండా వెళ్లే వాహనదారులకు ఫాస్టాగ్ ద్వారా పర్యావరణ శిస్తూ క ట్ కానుంది. ఇంతకాలం అటవీ దారిగుండా ప్రయాణించే నాలుగు టైర్ల వాహనాలకు రూ. 50, ఆరు టైర్ల వాహనాలకు రూ.150, హెవీ వాహనాలకు రూ.600 పర్యావరణ శిస్తు రశీదు రూపంలో వసూలు చేసే వారు. ఇటీవల ఖానా పూర్ ఎమ్మెల్యే చొరవతో పగటి పూట భారీ వాహనాల రాకపోకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో హెవీ వాహనాలకు కూడా రూ.150 వసూలు చేస్తున్నారు. -
ఆటో డ్రైవర్కు పదేళ్ల జైలు
ఆదిలాబాద్టౌన్: మద్యం మత్తులో ఆటో నడిపి మహిళ మృతికి కారణమైన డ్రైవర్కు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.8,500 జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సీఎం రాజ్యలక్ష్మి సోమవారం తీర్పునిచ్చారు. లైజన్ అధికారి వెంకటమ్మ తెలిపిన ప్రకారం.. 2021 మార్చి 24న సొనాల గ్రామానికి చెందిన పవర్ నిర్గుణ కూరగాయలు అమ్మి తిరిగి బోథ్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సొనాల ఆటోస్టాండ్ నుంచి మద్యం తాగి ఆటో నడుపుతున్న బోథ్లోని న్యూ కాలనీకి చెందిన షేక్ జావిద్ పాషా ప్రయాణికులతో బోథ్ వైపు వెళ్తుండగా టీవీటీ గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. దీంతో రెండు ఆటోలు పల్టీలు కొట్టగా ప్రయాణికులు గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన పవర్ నిర్గుణను ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందింది. ఈ ఘటనపై బాధితురాలి కుమారుడు పవర్ అరవింద్ ఫిర్యాదు మేరకు బోథ్ పోలీస్ స్టేషన్లో అప్పటి ఎస్సై రాజు కేసు నమోదు చేయగా, సీఐ ఎం.నైలు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు డ్యూటీ అధికారి డి.శ్రీనివాస్ 19 మంది సాక్షులను హాజరుపర్చగా, పీపీ షాహినా సుల్తానా వాదనలు వినిపించగా నేరం రుజువైంది. కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించిన పోలీసులు, కోర్టు డ్యూటీ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి సాగు కేసులో ఐదేళ్ల జైలు శిక్షఆసిఫాబాద్అర్బన్: గంజాయి సాగు చేసిన కేసులో ఒకరికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50వేల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తీర్పు వెలువరించినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ఎస్పీ కథనం ప్రకారం.. జైనూర్ మండలం బూసిమెట్ల గ్రామంలోని పత్తి పంటలో బోలె పాండురంగ్ నిషేధిత గంజాయి సాగు చేస్తున్నట్లు 2023 అక్టోబర్ 18న ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో పోలీసులు గుర్తించారు. తనిఖీల్లో 50 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్సై రాథోడ్ ఉమేశ్ కేసు నమోదు చేయగా, జైనూర్ సీఐలు మల్లేశ్, అంజయ్య విచారణ చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జగన్మోహన్రావు వాదనలు వినిపించగా నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రస్తుత ఎస్సై రవికుమార్, సీఐ రమేశ్, ఏఎస్పీ చిత్తరంజన్, కోర్టు లైజనింగ్ అధికారి రామ్సింగ్ను అభినందించారు. దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలిఉట్నూర్రూరల్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ ఏవో దామోదర స్వామి అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయా సమస్యలపై గిరిజనులు అందించిన దరఖాస్తులు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మభ్యపెట్టి.. నగలతో ఉడాయించి..
కాగజ్నగర్టౌన్: బంగారం, వెండికి పూత పూస్తామని మభ్య పెట్టి ఓ మహిళ నుంచి నగలు అపహరించిన ఘటన ఘటన సోమవారం కాగజ్నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని పెట్రోల్ పంప్ ఏరియాలో గల వీఐపీ స్కూల్ సమీపంలో ఇద్దరు మహిళలు వెండి, బంగారం ఆభరణాలకు పూత పూస్తాం అంటూ కాలనీకి చెందిన సంధ్య వద్దకు వెళ్లారు. బంగారం పూత పూస్తామని చెప్పి చెవి కమ్మలు, నెక్లెస్ తీసుకున్నారు. బాధితురాలిని బురిడీ కొట్టించి నగలతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయమై కాగజ్నగర్ పోలీసులను సంప్రదించగా.. నగలు అపహరించిన విషయం వాస్తవమేనని.. అయితే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
జాతీయ స్థాయి క్రీడా పోటీలు
మందమర్రిరూరల్: పట్టణంలోని కార్మెల్ హైస్కూల్ అకాడమీలో సోమవారం జాతీయ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. రెండ్రోజులపాటు నిర్వహించే పోటీలను బిషప్ జోసఫ్ తచ్చా, కార్మెల్ అకాడమీ డైరెక్టర్ జేవి యర్ రెక్స్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించా రు. వాలీబాల్, ఖోఖో, బాస్కెట్బాల్, వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం పోటీల్లో విద్యార్థులు పోటీ పడ్డారు. పోటీలకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 30 పాఠశాలల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు హాజరయ్యారు. ప్రారంభోత్సవంలో చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రొఫెసర్ ప్రాన్సిస్ జేవియర్, ప్రొఫెసర్ దూసి రవిశేఖర్, కాంచనపల్లి రజిత తదితరులు ఉన్నారు. -
బస్సు టైర్ కింద పడి ప్రయాణికుడి మృతి
ఆదిలాబాద్రూరల్: మండల పరిధిలోని బెల్లూరి గ్రామానికి చెందిన అంచెట్టి స్వామి (42) బస్సులో నుంచి అదుపు తప్పి కింద పడి ఆదివారం రాత్రి మృతి చెందాడు. గ్రామానికి చెందిన స్వామి, తన భార్య మమతతో కలిసి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు ఆర్టీసీ బస్సులో వస్తున్నారు. ఈ క్రమంలో స్వామికి వాంతులు వస్తున్నాయని డ్రైవర్ వద్దకు వెళ్లి చెప్పగా డోర్ వద్ద నిలబడాలని ఆయన సూచించాడు. ఈ క్రమంలో డ్రైవర్ బస్సు నిలపకుండానే డోర్ ఓపెన్ చేయడంతో తన భర్త అదుపు తప్పి కింద పడినట్లు మమత తెలిపారు. బస్సు వెనుక టైర్ స్వామిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బిక్నూర్ సమీపంలోని జంగంపల్లి శివారు జాతీయ రహదారి 44పై ఈ ఘటన చోటు చేసుకుంది. అజాగ్రత్తగా వ్యవహరించిన డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని బిక్నూర్ పోలీసులకు మృతుడి భార్య మమత ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి పోలీసులు పేర్కొన్నారు. -
పీజీ విద్యార్థుల ఫలితాలు తారుమారు
లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో అధికారుల తప్పిదం వల్ల పీజీ(ఎంకాం) ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అకడమిక్ ఇయర్ నష్టపోవాల్సి వచ్చింది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. కళాశాలలోని ఎంకాం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 30మంది మూడో సెమిస్టర్ పూర్తి చేసి నాలుగో సెమిస్టర్ పరీక్షకు ఫీజు చెల్లించి మేలో నిర్వహించిన వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యారు. వార్షిక పరీక్షలో ఒకరు గైర్హాజరు కాగా 29మంది హాజరయ్యారు. పరీక్ష ఫీజు చెల్లించిన సమయంలో కళాశాల పరీక్ష విభాగం అధికారులు మ్యాపింగ్ నమోదు క్రమంలో ఫైనాన్షియల్ సర్వీస్ మేనేజ్మెంటు(ఎఫ్ఎస్ఎం) అనే సబ్జెక్టుకు బదులుగా హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంటు(హెచ్ఆర్డీ) సబ్జెక్టును నమోదు చేశారు. హాల్టికెట్లో హెచ్ఆర్డీ పరీక్ష రావడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. ఈ విషయమై ప్రిన్సిపాల్, పరీక్షల విభాగం అధికారులను నిలదీశారు. పరీక్షకు హాజరైతే తర్వాత తాము చూసుకుంటామని నచ్చజెప్పడంతో విద్యార్థులు హాజరయ్యారు. అక్టోబర్లో విడుదలైన ఫలితాలను ఆన్లైన్లో పరిశీలించగా.. ఎఫ్ఎస్ఎం సబ్జెక్టు ఉండి 29మంది గైర్హాజరైనట్లు ఉంది. ఆబ్సెంట్తో ఫెయిలైనట్లు మెమోలో ఉండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. యూనివర్సిటీ, కళాశాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంవత్సరం, భవిష్యత్ నష్టపోయామని, సంబంధిత అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ మహాత్మా సంతోష్ను సంప్రదించగా.. పరీక్ష ఫలితాల్లో జరిగిన తప్పిదంపై యూనివర్సిటీ వారితో సంప్రదిస్తున్నానని, విద్యార్థులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. -
యువ రైతు ఆత్మహత్య
తాంసి: భారీ వర్షాల కారణంగా సరైన పంట దిగుబడి రాలేదని మనస్తాపం చెందిన ఓ యువ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన ఆదిలా బాద్ జిల్లా తలమడుగు మండలం డోర్లీ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జలారపు లింగన్న (22) తన తండ్రి పేరిట ఉన్న మూడెకరాల 30 గుంటల్లో ఈ వానాకాలం సీజన్లో పత్తి సాగు చేశాడు. పెట్టుబడి కోసం బయట నుంచి దాదాపు రూ.3 లక్షల వరకు తీసుకొచ్చాడు. అయితే అతివృష్టి కారణంగా సరైన దిగుబడి రాలేదు. చేసిన అప్పు ఎలా తీర్చాలో అంటూ మదన పడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన లింగన్న ఈ నెల 23న రాత్రి ఇంటి బయట పురుగుల మందు తాగి స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి తల్లి విమల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పెర్కొన్నారు. భర్త వేధింపులు భరించలేక.. మంచిర్యాలక్రైం: భర్త, అత్తమామల వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల సీఐ ప్రమోద్రావు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కాలనీకి చెందిన మిట్టపల్లి ప్రియాంకకు మందమర్రి మండలం సారంగపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్తో 2014లో వివాహం జరిగింది. వీరికి కవల పిల్లలు రామ్, లక్ష్మణ్(9) ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రియాంకను భర్త, అత్తమామలు రమాదేవి, సత్యనారాయణ, మరిది ప్రదీప్ వేధించేవారు. ఈ నెల 9న ఆమెను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. దీంతో ఎల్ఐసీ కాలనీలోని తల్లిగారింటి వద్దనే ఉంటోంది. అయినా వేధింపులు ఆగకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతికి కారణమైన భర్త, మరిది, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి అంకం ఓదమ్మ ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. -
గల్ఫ్ బాధితుడి భార్యకు ఉద్యోగం
సోన్: ఇటీవల దుబాయిలోని ఓ బేకరీలో సహ ఉద్యోగి, పాకిస్తాన్కు చెందిన ఉన్మాది చేతిలో హత్యకు గురైన మండల కేంద్రానికి చెందిన అష్టం ప్రేమ్సాగర్ భార్య ప్రమీలకు మండలంలోని కూచన్పల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రీప్రైమరీ టీచర్ ఉద్యోగం ఇచ్చినట్లు ఎంఈవో పరమేశ్వర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు నియామకం చేసినట్లు పేర్కొన్నారు. ప్రేమ్సాగర్ భార్య గతంలో హైదరాబాద్లో గల్ఫ్ ప్రజావాణిలో తనకు న్యాయం చేయాలని దరఖాస్తు చేసుకుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిని కలిసి ఉద్యోగం ఇవ్వాలని వినతిపత్రం అందించింది. ఈ నేపథ్యంలో సీఎంవో చొరవతో ఫైల్ వేగంగా కదిలింది. ఈ క్రమంలో సోమవారం ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వెంటనే ప్రమీల ఉద్యోగంలో చేరారు. ఏప్రిల్ 11న హత్య.. సోన్కు చెందిన ప్రేమ్సాగర్ దుబాయ్లోని ఒక బేకరీలో ఉద్యోగం చేసేవాడు. సహోద్యోగి అయిన పాకిస్తాన్ ఉన్మాది ఏప్రిల్ 11న కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో ప్రేమ్సాగర్తోపాటు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్ మరణించారు. -
ఎక్కడ చెట్లు నరికినా బెయిల్ రద్దు
జన్నారం: ఇక నుంచి ఎక్కడ చెట్లు నరికినా బెయిల్ రద్దవుతుందని, ప్రతీ సోమవారం రేంజ్ కార్యాలయంలో హాజరు కావాలని ఇందన్పల్లి అటవీ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. ఇందన్పల్లి అటవీ రేంజ్లోని కవ్వాల్ సెక్షన్ పాలఘోరీ ప్రాంతంలో అక్రమంగా గుడిసెలు వేసుకుని చెట్లను నరి కి జైలుకెళ్లిన 26 మంది ఆదివాసీ గిరిజనులకు న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూ రు చేయగా.. సోమవారం ఇందన్పల్లి రేంజ్ కార్యాలయంలో హాజరయ్యారు. రేంజ్ అధికారి మాట్లాడుతూ బెయిల్ షరతులను వివరించారు. సాక్ష్యాల ను మార్చరాదని, ఏదైనా అటవీ నేరానికి పాల్పడితే కోర్టు ధిక్కరణ కింద తిరిగి జైలుకు వెళ్లాల్సి వస్తుందని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు అనధికార టేకు కలప వాడుకుంటే చర్యలు తీసుకుంటామని, ఫైబర్, రెడీమేడ్ కలప ఉపయోగించుకోవాలని తెలి పారు. సెక్షన్ అధికారి రవి, సిబ్బంది పాల్గొన్నారు. బాసరలో దొంగ అరెస్ట్ బాసర:బాసర రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులతోపాటు ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ముధోల్ సీఐ మల్లేశ్, బాసర ఎస్హెచ్వో సాయికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను పరిశీలించగా రూ.లక్ష విలువైన ల్యాప్టాప్ దొరికింది. దీనిగురించి ఆరా తీయగా నిజామాబాద్ నుంచి బాసరకు వస్తున్న రైళ్లో దొంగిలించినట్లు తెలిపారు. వివరాలు ఆరా తీసి వారిని, ల్యాప్టాప్ను రైల్వే పోలీసులకు అప్పగించారు. షేక్ నదీం, అతనితో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ జీఆర్సీ ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మధుసూదన్ అనే వ్యక్తి ల్యాప్టాప్ పోయినట్లు ఫిర్యాదు చేశాడని వెల్లడించారు. -
లేబర్కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమం
శ్రీరాంపూర్: కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం నస్పూర్ కాలనీలోని ప్రెస్క్లబ్లో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్, సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు జట్టి శంకర్రావు, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. శాశ్వత కార్మికులకు వేతనాల పెరుగుదల ఉండదని, కాంటాక్ట్ కార్మిక వ్యవస్థ మరింత పెరుగుతుందని, కార్మికుడు తమ డిమాండ్ల కోసం సమ్మె చేసే హక్కును కోల్పోతారని తెలిపారు. యూనియన్ల ఏర్పాటకు కూడా నిబంధనలు ఆటంకంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ సంఘాలు కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమయ్యాయని, కార్మికులు కూడా ఈ ఆందోళనలో కలిసి రావాలని అన్నారు. జేఏసీ పిలుపులో భాగంగా మంగళవారం అన్ని గనులపై నిరసనలు చేపడుతామని తెలిపారు. 26న కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రాలు అందజేస్తామని, అదేరోజు సాయంత్రం జీఎం కార్యాలయాల వద్ద ధర్నా ఉంటుందని, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నా విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శులు కే.వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచీ కార్యదర్శి బాజీసైదా, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షులు గరిగే స్వామి, తిరుపతి రాజు, టీబీజీకేఎస్ నాయకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేష్, వెంగళ కుమార్ స్వామి, సీఐటీయూ ఉపాధ్యక్షుడు సదానందం తదితరులు పాల్గొన్నారు. -
దద్దరిల్లిన ‘ధర్మయుద్ధం’
ఉట్నూర్రూరల్: చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని ధర్మయుద్ధం సభ నినదించింది. అప్పటిదాకా పోరాటం ఆగదని సభకు హాజరైన ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఇదే డిమాండ్తో ఆదివాసీలు ఉట్నూర్లోని ఎంపీడీవో గ్రౌండ్లో నిర్వహించిన ఆదివాసీ ధర్మయుద్ధం సభ విజయవంతమైంది. ఉమ్మడి ఆదిలాబాద్తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, మహారాష్ట్ర నుంచి తొమ్మిది తెగల ఆదివాసీలు, ఆయా సంఘాల నాయకులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ముందుగా స్థానిక కేబీ కాంప్లెక్స్లోని కుమురం భీం విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం తుడుం మోగిస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆదివాసీ మేధావులు ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. నాయకులు ఎవరేమన్నారంటే..ధర్మయుద్ధం సభకు హాజరైన తొమ్మిది తెగల ఆదివాసీ నాయకులు, మేధావులు, పెద్దలు ముందుగా ప్రసంగించారు. రాంజీగోండు, కుమురంభీం, సూరు, ఇతర ఆదివాసీ పోరాట యోధులున్న కాలంలో లంబాడీలు లేరని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లోని లంబాడీలు వేరే కులాల్లో కొనసాగుతుండగా, తెలంగాణలో మాత్రం ఎస్టీలుగా కొనసాగుతున్నారని తెలిపారు. ఆదివాసీలకు కల్పించిన హక్కులు, రిజర్వేషన్లు పొందుతూ అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అన్ని రంగాల్లో ఆదివాసీలు వెనుకబడి ఉన్నారని వాపోయారు. పోరాటాల ద్వారా హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ జాతికి ఎవరూ అన్యాయం చేయొద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సూచించారు. సమాజంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి ఆదివాసీ పెద్దలు, మేధావులు, నాయకులను సీఎం రేవంత్రెడ్డి వద్దకు తీసుకెళ్తానని తెలిపారు. ఆదివాసీల కోసం పార్టీలకు అతీతంగా పోరాటాలు చేయాల్సిందేనని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే లంబాడీలు ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారని, ఇప్పుడు అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సభకు జీసీసీ చైర్మన్ తిరుపతి, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, సభ సమన్వయ కర్త మెస్రం దుర్గు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్, వివిధ సంఘాల నాయకులు నగేశ్, గణేశ్, దాదేరావ్, నాగు, రాజు, జంగు, వెంకట్రావ్, ప్రభాకర్, అశోక్, విఠల్రావ్, విజయ్, సంధ్యారాణి, రామారావు, గంగారాం, జైవంత్రావ్, పోచయ్య, కనక యాదవ్రావ్, పుర్క బాపురావ్, మహారాష్ట్ర ఆదివాసీ నేతలు తిరుమల్ మహా బావుజీ, సువర్ణ వేర్కడే తదితరులు హాజరయ్యారు. అడుగడుగునా ఆంక్షలుఆదివాసీ ధర్మయుద్ధ సభ నేపథ్యంలో ఉట్నూర్ పట్టణంలో బంద్ పాటించారు. పట్టణంలో పో లీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. సభకు వెళ్లేదారులు, అష్టకూడలి, అంబేడ్కర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, ఐటీడీఏ ఏరియా, తెలంగా ణ చౌక్, కేబీ కాంప్లెక్స్, పాత ఉట్నూర్, ఎక్స్ రో డ్డు తదితర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు కొనసాగాయి. ఈ కారణంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్స్ రోడ్డు వద్దకు రావాల్సి న పరిస్థితి నెలకొంది. సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, కరీంనగర్, రామగుండం సీ పీలు గౌస్ ఆలం, అంబర్ కిషోర్ ఝా, ఉట్నూ ర్ ఏఎస్పీ కాజల్సింగ్ సభ శాంతియుతంగా సాగేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ తీర్మానాలివే.. -
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ప్రతిభ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వరంగల్లోని నెల్లికుదురులో ఈనెల 22, 23 తేదీల్లో పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో గుడిపేట ఎంజేపీ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. అండర్–17 విభాగంలో భానుతేజ స్వర్ణ పతకం, వెంకటరమణ రజత పతకం, శ్రీహర్షిత్వర్మ కాంస్య పతకం, అండర్–14 విభాగంలో అమన్, ఉదయ్కిరణ్, స్నేహిత్, అరవింద్ కాంస్య పతకాలు సాధించారు. ప్రిన్సిపాల్ సేరు శ్రీధర్, పీడీ సురేశ్, పీఈటీ నగేశ్, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. -
పత్తి రైతుకు గులాబీ గుబులు
మంచిర్యాలఅగ్రికల్చర్:పత్తికాయ చూస్తే పచ్చగా నిగనిగా కనిపిస్తోంది. కానీ కాయను తెంపి చూస్తే అంత ఖాళీగానే కనిపిస్తోంది. గులాబీ పురుగు కాయను తొలిచేస్తుండడంతో దూది రైతులు అందో ళ చెందుతున్నారు. పంట పచ్చగా, చెట్టు నిండా కాయలతో కనిపిస్తోంది. కానీ కాయపగిలి పత్తి బయటకు రావాల్సి ఉండగా, గుల్లగా మారుతోంది. ఒక్కో కాయను పరిశీలించి గుర్తుపట్టే లోపే జరుగాల్సిన నష్టం జరిగిపోతుందని రైతులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే చాలాచోట్ల పత్తి తీత పనులు కొనసాగుతున్నాయి. ఆలస్యంగా వేసుకున్న పంట కాత దశలో ఉంది. ఈ పంటను గులా బీ పురుగు, లద్దె పురుగులు దెబ్బ తీస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే పత్తి కాయలను మొత్తం తినేస్తున్నాయి. రెండు మూడుసార్లు క్రిమి సంహారక మందులు పిచికారీ చేసినా ప్రయోజనం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు భారీ వర్షాలు, వరదలో నష్టపోతే, కాత, దిగుబడి దశలో గులాబీ పురుగుతో మరింత నష్టపోతున్నామని రైతులు పేర్కొంటున్నారు.


