breaking news
Mancherial District Latest News
-
నిందితులను అరెస్ట్ చేయాలి
చెన్నూర్: వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ డిమాండ్ చేశారు. స్థాని క ప్రెస్క్లబ్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వారం రోజులైనా కేసులో పురోగతి లేదని, పోలీసులు స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం 48గంటల్లో నిందితులను అరెస్టు చేయాలని డెడ్లైన్ విధించి ఐదు రోజులు కావస్తున్నా పోలీసుల్లో చలనం లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. నిందితులు అధికార కాంగ్రెస్ నాయకులు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, వెంకటేశ్వర్రావు, నాయకులు బత్తుల సమ్మయ్య, రాపర్తి వెంకటేశ్వర్, మంత్రి రామయ్య, శివకృష్ణ, కమ్మల శ్రీనివాస్, జాడి తిరుపతి పాల్గొన్నారు. -
ఏరియా ఆసుపత్రిలో తనిఖీ
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని డీసీహెచ్ఎస్ డాక్టర్ కోటేశ్వర్ గురువా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభా గాల వార్డులు, లేబర్ రూమ్లు, ల్యాబ్, డయాలసిస్ సెంటర్, రికార్డులు పరిశీలించా రు. పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు అందిస్తున్న భోజనంపై ఆరా తీశారు. రోగులకు సరైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూ చించారు. ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ జోస్పిన్, జూనియర్ అసిస్టెంట్ అనిల్కుమార్, ల్యాబ్టెక్నీషియన్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళా శక్తి భవన్ పనులు పూర్తి చేయాలి
మంచిర్యాలటౌన్/చెన్నూర్/కోటపల్లి: మంచిర్యాలలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన భవన నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం రుణ సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. చెన్నూర్ మండలం కిష్టంపేట, చెన్నూర్ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, 2.0 వాటర్ ట్యాంకు పనుల పురోగతి పరిశీలించారు. చెన్నూర్లో మూత్రశాలలు వెంటనే నిర్మించాలని, తాగునీటి ట్యాంకు నిర్మాణం పూర్తి చేసి ఇంటింటికీ నీటి సరఫరా చేయాలని సూచించారు. కోటపల్లిలో గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి అభివృద్ధి పనులు పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్, కమిషనర్ మురళికృష్ణ పాల్గొన్నారు. -
కొత్తవారికే డీసీసీ పీఠం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షులుగా కొత్తవారికే అవకాశం దక్కనుంది. పార్టీ అధిష్టానం విధించిన నియమాలే అందుకు కారణమని స్పష్టమవుతోంది. వరుసగా ఐదేళ్లపాటు పార్టీలో పని చేసిన కార్యకర్తలు, నాయకులు డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కనీస అర్హతగా నిర్ణయించారు. అంతేగాక ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నవారికి మరోసారి ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. అలాగే ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధువులకు కాకుండా పార్టీలోని ఇతరులకే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలో సీనియర్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు. ఈ మేరకు ఏఐసీసీ పరిశీలకులు, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి డాక్టర్ నరేశ్కుమార్ ఒక్కొక్కరి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. డీసీసీ అధ్యక్షులుగా పోటీ చేసే వారు పార్టీలో తమ సీనియార్టీతో కూడిన బయోడేటాను పరిశీలకులకు అందజేస్తున్నారు. ఢిల్లీ నుంచే ఎంపికగతంలో మాదిరిగా కాకుండా ఈసారి డీసీసీ అధ్యక్ష ఎన్నికల్లో కీలక మార్పులు చేశారు. స్థానికంగా పార్టీ ప్రాధాన్యతలు దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేస్తున్నారు. గతంలో ప్రజాప్రతినిధులు, గాంధీభవన్లో పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రుల ఎంపికనే తుది నిర్ణయంగా ఉండేది. ఈసారి ఐదేళ్లు పార్టీ కోసం పని చేసిన వారిని అధ్యక్ష పదవికి అర్హులుగా పరిగణించి వారందరి నుంచి అర్జీలు తీసుకుని పరిశీలకులతో అభిప్రాయాలు సేకరించి ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవి దక్కేలా అందరినీ దృష్టిలో పెట్టుకుని జిల్లాకు కనీసం ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను ఢిల్లీకి పంపిస్తే అక్కడ అన్ని రకాలుగా పరిశీలించి ఎంపిక చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఏఐసీసీ పరిశీలకులు జాబితా మాత్రమే రూపొందించి.. ఫైనల్ చేయడం మాత్రం అధిష్టానం చేతిలో పెట్టారు. మద్దతు దక్కితేనే పదవిడీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లా నుంచి అనేక మంది పోటీలో ఉంటున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్తో పాటు ఖానాపూర్(జన్నారం మండలం) పరిధిలోని నాయకులు ఈ మేరకు అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో తమ పరిధిలో ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రితో కార్యకర్తలు, నాయకులు మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న జనరల్ కేటగిరీతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, యువజన విభాగం నుంచి పలువురు పోటీ పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది నుంచి మద్దతు దొరికి ఎవరిని పదవి వరిస్తుందోనని పార్టీలో ఆసక్తి రేపుతోంది. పారదర్శకంగా అధ్యక్షుడి ఎన్నిక : ఏఐసీసీ పరిశీలకులుజిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని ఏఐసీసీ పరిశీలకులు డాక్టర్ నరేశ్కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని నార్త్ఇన్ హోటల్లో పీసీసీ ఆర్గనైజర్లు అడువాల జ్యోతి, బత్తిని శ్రీనివాస్గౌడ్, పులి అనిల్కుమార్, గిరిజన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక విజయ్కుమార్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా అధ్యక్ష పదవుల ఎంపిక జరుగుతోందని, అలాగే రాష్ట్రంలో చేపడుతున్నామని తెలిపారు. మొదట అధ్యక్ష, తర్వాత బ్లాక్, బూత్ స్థాయిలో నియామకాలు ఉంటాయన్నారు. పార్టీ కోసం పని చేసేవారికే అధ్యక్ష పదవి దక్కుతుందన్నారు. అధ్యక్ష ఎంపికలో స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను పరిశీలించి అధిష్టానానికి పంపుతామని అన్నారు. ఆసిఫాబాద్లో జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న వారితో ఒక్కొక్కరిగా మాట్లాడినట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాల్లోనూ అభిప్రాయాల సేకరణ చేపడతామని తెలిపారు. వచ్చే ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో కొత్తగా ఎంపికై న డీసీసీ అధ్యక్షులు ప్రధాన పాత్ర పోషిస్తారని తెలిపారు. అధ్యక్ష పదవికి కోసం దరఖాస్తులు అందజేయగా.. పార్టీ నుంచి కేవీ.ప్రతాప్, దయానంద్, డా.నీలకంఠేశ్వర్రావు, నూకల రమేశ్, గడ్డం త్రిమూర్తి తదితర నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో మంచిర్యాల నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో ఏఐసీసీ అబ్జర్వర్, పీసీసీ ఆర్గనైజర్లు సమావేశం అయ్యారు. -
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
బెల్లంపల్లిరూరల్: పౌష్టికాహారం ప్రతీ రోజు తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా సంక్షే మ శాఖ అధికారి రౌఫ్ఖాన్ అన్నారు. గురువారం మండలంలోని గురిజాల రైతువేదికలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోషక విలువలు కలిగిన ఆకుకూరలు, పప్పుదినుసులు క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలకలు ఐసీ డీఎస్ ద్వారా అందిస్తున్న సేవలను సద్విని యోగం చేసుకోవాలన్నారు. గ్రామీణులకు ఐసీడీఎస్ సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం చి న్నారులకు అన్నప్రాసన, గర్భిణులకు చీరసారెలు అందజేశారు. సీడీపీవో స్వరూపరాణి, తాళ్లగురిజాల పీహెచ్సీ వైద్యాధికారి ఇవాంజలీన్, పోషణ అభియాన్ జిల్లా కో–ఆర్డినేటర్ రజిత, డీపీఏ శ్యామల, మహిళా హబ్ జిల్లా కో–ఆర్డినేటర్ సౌజన్య, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
ఆదాయం ఉన్నా బస్సుల్లేవు..!
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ఉన్న ఏకై న బస్సు డిపో మంచిర్యాలకు బస్సుల కేటాయింపు అంతంత మాత్రంగానే ఉంది. ఆర్టీసీకి ఆదాయం తెస్తున్నా బస్సుల మంజూరులో ఆలస్యం జరుగుతోంది. రద్దీ రూట్లలో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్కు వెళ్లేందుకు ఎక్స్ప్రెస్ బస్సులూ తక్కువే ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల శకం మొదలైనా మంచిర్యాల డిపోకు కేటాయింపుపై ఊసే లేకుండా పోయింది. వాయుకాలుష్యంతో పర్యావరణానికి ఇబ్బంది కలిగించే వాహనాల స్థానంలో ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా డిపోలకు కేటాయించారు. జిల్లాకు ఒక్కటి కూడా చేరలేదు. ఇందిర మహిళా శక్తి పథకంలో అందించే బస్సుల కోసమూ అతివల ఎదురుచూపులు తప్పడం లేదు. రద్దీ రూట్లలో కొరతప్రయాణికుల రద్దీ రూట్లలో బస్సుల కొరత ఏర్పడుతోంది. చెన్నూర్, ఆసిఫాబాద్, కాగజ్నగర్ రూట్ల లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. బస్సుల్లో గంటల త రబడి నిల్చుని కిక్కిరిసి ప్రయాణిస్తుంటారు. హైదరాబాద్కు 44 లగ్జరీ, లహరీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చి న తర్వాత ఏమో గానీ ఎక్స్ప్రెస్ బస్సులను కుదించారు. తెల్లవారు జామున 3.45గంటలకు తప్పితే సాయంత్రం 7గంటలకు వరకు బస్సులు కనిపించవు. దీంతో మహిళలు గోదావరిఖని, కరీంనగర్ వరకు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తోంది. ఎక్స్ప్రెస్ బస్సుల సంఖ్య పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది. పండుగ వేళ రద్దీ ఎక్కువగా ఉండడం.. అదే తీరున డిపోకు ఆదాయం సమకూరుతోంది. రాఖీ పండుగ వేళ నాలుగు రోజులపాటు 3.31లక్షల కిలోమీటర్లు బస్సులు తిప్పగా రూ.2.13కోట్ల ఆదాయం సమకూరింది. దసరా, బతుకమ్మ కోసం సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 6వరకు ప్రత్యేక బస్సులతో భారీగా ఆదాయం వచ్చింది. 198 ప్రత్యేక బస్సులు 59,536 కిలోమీటర్లు నడపడం ద్వారా 23,655 మంది ప్రయాణికులను చేరవేశారు. రూ.62,70,066 ఆదాయం సమకూరడంతో మిగతా డిపోల కంటే ముందుస్థానంలో నిలిచింది. పండుగలు, పర్యాటక సీజన్లతోపా టు ఉచిత ప్రయాణికులతో రద్దీగా మారుతోంది. కొత్త బస్సులు వస్తే కొంత మేర ఒత్తిడి తగ్గుతుంది. ‘ఈవీ’లు వచ్చేదెన్నడో..!ఈవీ బస్సుల శకం మొదలైనా డిపోకు కేటాయింపు జరగలేదు. ఇబ్బందులు లేని ప్రయాణం, ఇంధన ఖర్చు ఆదాతోపాటు ఈ బస్సుల వైపు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. ఆయా డిపోలకు బస్సులు మంజూరు చేసినా ఇక్కడి ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అప్పట్లో బస్సుల చార్జింగ్కు ప్రతిపాదనలు చేసినా ఊసే లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ద్వారా ఇందిర మహిళా శక్తి పథకంలో మహిళా సంఘాల సభ్యులకు ఆర్టీసీ బస్సులు అందజేస్తోంది. ఈ పథకంలో మండల సమాఖ్యకు అద్దె బస్సుల కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదికలు అందించారు. అయినా ఆమె చేతికి ప్రగతిచక్రాలు చేరలేదు. దీంతో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు కాలేకపోతున్నారు. ఈవీ బస్సులతోపాటు మహిళా సమాఖ్యలకు బస్సులు కేటాయిస్తే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా మారనుంది.40ఏళ్లలో 29..మంచిర్యాల డిపో 1975లో ఫిబ్రవరి 6న ఏర్పా టు చేశారు. అదే సమయంలో బస్స్టేషన్లో తొమ్మిది ప్లాట్ఫారాలు, 32 బస్సులతో ప్రారంభించారు. 3.21 ఎకరాల్లో డిపో, 1.34 ఎకరాల్లో బస్టాండ్ నిర్మించారు. 1985 నాటికి 32 బస్సుల సంఖ్యను 118కి పెంచగా.. ప్రస్తుతం డిపో పరిధి లో 147 ఉన్నాయి. ఈ లెక్కన 40ఏళ్ల(1985నుంచి)లో 29 బస్సులు మాత్రమే డిపోకు కేటాయించారు. ఏడాదికి ఒక్క బస్సు కేటాయించినా 40బస్సులు రావాల్సి ఉండగా.. వివక్ష చూపినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా బస్సుల సంఖ్య పెరగకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. మంచిర్యాల బస్టాండ్ మీదుగా రోజుకు 62వేల కిలోమీటర్ల మేర బస్సులు నడపడం ద్వారా రూ.34లక్షల నుంచి రూ.36లక్షల(మహాలక్ష్మి పథకం కలిపి) వరకు ఆదాయం సమకూరుతుంది. ఏళ్ల తరబడి బస్టాండ్ విస్తరించకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. 1985లో నిర్మించిన తొమ్మిది ప్లాట్ఫారాలు మినహా ఒక్కటి కూడా అదనంగా ఏర్పాటు కాకపోవడంతో బస్సులు నిలిపేందుకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. -
రైతులు సామూహిక నివారణ చర్యలు చేపట్టాలి
ఎఫెక్ట్ నెన్నెల: మండలంలోని నందులపల్లి గ్రామంలో మండల వ్యవసాయాధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పంటలను పరిశీ లించారు. పండ్లు, పత్తి, కూరగా యల తోటలకు హాని కలిగిస్తు న్న నత్తలను గుర్తించారు. ఈ నెల 12న ‘సాక్షి’లో ‘పంటలపై దండెత్తిన నత్తలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అ ధికారులు స్పందించారు. నత్తల నివారణపై రైతుల కు అవగాహన కల్పించారు. ఏఓ సృజన మాట్లాడు తూ ఉద్యాన, వ్యవసాయ పంటలపై ఆశించి విపరీ తంగా నష్టం కలిగిస్తున్న నత్తలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామూహిక నివా రణ చర్యలు చేపట్టాలని పలు సూచనలు చేశారు. -
డైట్ సక్రమంగా అందించాలి
లక్సెట్టిపేట: రోగులకు డైట్ను సక్రమంగా అందించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రి లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూ డాలని అన్నారు. సిబ్బంది సమయపాలన, పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యల కొరత ఉందని, నూతన వైద్యులను త్వరలోనే నియమిస్తామని అన్నారు. సిబ్బంది హాజరు రిజిష్టర్ వివరాలను నమోదు చేసుకున్నారు. నూతన ఆసుపత్రి భవనం నిర్మాణం తర్వాత రోగుల సంఖ్య పెరిగింద ని, ఐపీ, ఓపీ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చె ప్పారు. రోగులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని, మెనూ పాటించాలని సూచించారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడి.. రికార్డులు, పరిసరాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ యూనుస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాధితులకు భరోసా కల్పించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పోలీస్స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ వారికి భరోసా కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ఝా అన్నారు. గురువా రం ఆయన హాజీపూర్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశా రు. పోలీస్ సిబ్బంది సమస్యలు, విధులు, పని తీరుపై తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలు, స్టేషన్ పరిధిలో జరిగే నేరాలు, రౌడీషీటర్లు తదితర వాటిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విజిబుల్ పోలీ సింగ్, పెట్రోలింగ్ విధులు బాధ్యతగా నిర్వర్తించా లని అన్నారు. మంచిర్యాల డీసీసీ ఏ.భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్ పాల్గొన్నారు. 21 నుంచి అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు మంచిర్యాలక్రైం: ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీ అంబర్ కిషోర్ఝా ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్స్టేషన్లలో ఓపెన్ హౌజ్ నిర్వహించి పోలీసు విధులు, ఆయుధాలు, సాంకేతిక వినియోగం, త్యాగాలు తదితర విషయాలను తెలియజేస్తామని తెలిపారు. కానిస్టేబుల్ నుంచి పై అధికారుల వరకు పలు అంశాలపై వ్యాసరచన పోటీలు ఉంటాయని తెలిపారు. షార్ట్ఫిలిం తీసి 23లోగా స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో అందించాలని, ఉత్తమమైన వాటిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరికి పాము కాటు
బేల: మండలంలోని సిర్సన్న, జూనోని రెవెన్యూ గ్రామ శివారుల్లోని పొలాల్లో గురువారం ఇద్దరు రైతులు పాముకాటుకు గురయ్యారు. సిర్సన్న గ్రామ శివారులోని పొలంలో పనిచేస్తున్న బబన్కు, జూనోని గ్రామ శివారులోని పొలంలో పనిచేస్తున్న వైశాలిని వేర్వేరుగా పాములు కాటేశాయి. గమినించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ అనిల్, పైలెట్ అర్షద్ఖాన్ బాధితులకు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించారు. వైశాలికి చికిత్స చేస్తున్న ఈఎంటీ అనిల్ -
ఉరేసుకుని వివాహిత..
బాసర: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ సాయికుమార్ తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని హజిని గ్రామానికి చెందిన మాధవి (23)కి బాసర మండలంలోని దౌడాపూర్ గ్రామానికి చెందిన కర్మానే మనోజ్తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు సంతానం. కొంతకాలంగా మనోజ్ మద్యం సేవించి ఇంటికి వచ్చి అదనపు కట్నం తేవాలని మా ధవిని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేసేవా డు. దీంతో మనస్తాపానికి గు రైన మహిళ బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులతో నే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురా లి తండ్రి రాంచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
హోరాహోరీగా బ్మాడ్మింటన్ పోటీలు
మంచిర్యాలఅర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల క్లబ్లో గురువారం నిర్వహించిన అండర్–14, 17, 19 బాలబాలికల జోనల్స్థాయి ఎంపిక పోటీలు హోరాహోరీగా సాగాయి. బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేష్గౌడ్ పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 120 మంది క్రీడాకారులు పాల్గొనగా ఒక్కో గ్రూపు నుంచి ఐదుగురు చొప్పున 30 మంది ఎంపికయ్యారు. అండర్–14 హైదరాబాద్, అండర్–17 మేడ్చల్, అండర్–19 మహబూబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి యాకూబ్ తెలిపారు. కార్యక్రమంలో అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పులూరి సుధాకర్, జెడ్పీబాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి రమేశ్, ఫిజికల్ డైరెక్టర్ రేణి రాజయ్య, కుమురంభీం జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరి ధిలోని గద్దెరాగిడిలో బుధవారం రాత్రి జరిగిన రో డ్డు ప్రమాదంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భీ మా సుధాకర్ (65) మృతి చెందాడు. గద్దెరాగిడిలో ని ఓ కిరాణ దుకాణానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో వేగంగా ఢీకొనడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని వెంటనే మంచి ర్యాల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వై ద్యులు నిర్ధారించారు. మృతుని కి భార్య, ఇద్దరు కుమారులు న్నారు. కేసు నమోదు చేసి ద ర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. -
విద్యుత్ షాక్తో గుర్తు తెలియని వ్యక్తి..
నేరడిగొండ: మండలంలోని బుద్దికొండ గ్రామ స మీపంలో స్థానిక రైతు నవీన్ రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి (45) విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు తెల్ల టి చొక్కా, జీన్స్ ప్యాంటు ధరి ంచి ఉన్నట్లు తెలిపాడు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. వివరాలు తెలిసిన వారు 8712659947 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. -
పశువులను తరలిస్తున్న లారీ పట్టివేత
బోథ్: మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు పశువులను తరలిస్తున్న లారీని గురువారం సోనాల మండలంలోని ఘన్పూర్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు ఘన్పూర్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్న లారీని ఆపి పరిశీలించగా అందులో పశువులు కనిపించాయి. లారీలో 26 పశువులు ఉండగా రెండు మృతి చెంది ఉన్నాయి. వాహనాన్ని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించి డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుకున్న పశువులను బజార్హత్నూర్లోని గోశాలకు తరలించినట్లు ఎస్సై శ్రీసాయి పేర్కొన్నారు. లారీ ఓనర్తో పాటు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
గెలిచిన సంఘాలు విఫలం
శ్రీరాంపూర్: కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గెలిచిన సంఘాలు విఫలమయ్యాయని సీఐటీయూ కేంద్ర కమిటీ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. గురువారం ఆర్కే 7 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, ఇన్వాలిడేషన్ అయిన వారి స్థానంలో డిపెండెంట్లకు కారుణ్య ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. కార్మికుల సమస్యలపై కొట్లాడటానికి వేదికలైన స్ట్రక్చర్ సమావేశాలు బహిష్కరించి ఇక్కడ గనులపై మెమోరాండాలు ఇస్తూ కార్మికులను ఆయోమయానికి గురి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ యూని యన్ బ్రాంచి అధ్యక్షుడు గుల్ల బాలాజీ, రాష్ట్ర కమిటీ సభ్యుడు కస్తూరి చంద్రశేఖర్, నాయకులు వెంగళ కుమారస్వామి, వెంకట్రెడ్డి, సమ్మయ్య, ప్రవీణ్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. -
స్వగ్రామం చేరిన మృతదేహం
నర్సాపూర్(జి): ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం దుబా య్ వెళ్లిన మండలంలోని తిమ్మాపూర్ (జి) గ్రా మానికి చెందిన గోపు భూ మయ్య (42) నెల రోజు ల క్రితం గుండెపోటుతో మృతి చెందగా గురువా రం మృతదేహం స్వగ్రామానికి చేరింది. గ్రామానికి చెందిన గోపు భూమయ్య దుబాయ్లోని సోనా పూర్ ప్రాంతంలో గల సీఆర్సీ కంపెనీలో ఏడాదిన్నరగా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నెలరోజుల క్రి తం గుండెపోటుతో మృతి చెందగా యూఏఈ హె ల్పింగ్ ఆర్గనైజేషన్ సంస్థ సహకారంతో బొమ్మ ప్రవీ ణ్, బొడ్డుపల్లి రాము, గన్నారపు హన్మాండ్లు, శ్రీనివాస్ కంపెనీ యాజమాన్యం, పీఆర్వోలతో మాట్లాడి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించే ఏర్పా ట్లు చేశారు. గురువారం స్వగ్రామానికి మృతదేహం చేరడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఇసుక ట్రాక్టర్లు పట్టివేతఇచ్చోడ: మండలంలోని అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకు తరలిస్తున్న మూడు ట్రా క్టర్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొంతమంది ట్రాక్టర్ యజమానులు ఇసుకను తరలించి మండల కేంద్రంలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. అటవీ శాఖ అధికారి పుండలిక్ రెండు రోజుల క్రితం ట్రాక్టర్ను పట్టుకోగా గురువారం టైగర్జోన్ అధికారులు మరో మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఈ మేరకే కేసులు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేశారు. బాలిక అదృశ్యంఆదిలాబాద్టౌన్: తలమడుగు మండలంలోని దహెగాంలో అత్తాగారి ఊర్లో నివాసం ఉంటున్న మహారాష్ట్రకు చెందిన ఆకాష్ కూతురు అదృశ్యమైనట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఈ నెల 13న భార్యభర్తలు కూలీ పనులకు వెళ్లగా కూతురు కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసును తలమడుగు పోలీసు స్టేషన్కు బదిలీ చేయనున్నట్లు వివరించారు. కాసిపేట గని ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకాసిపేట: నీటిసమస్య పరిష్కరించాలని డిమా ండ్ చేస్తూ మండల బీజేపీ మండల అధ్యక్షుడు సూరం సంపత్ ఆధ్వర్యంలో మందమర్రి ఏరి యా కాసిపేట గని ఎదుట గురువారం మహిళలు, గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన తెలి పారు. మండలంలోని ముత్యంపల్లి, చిన్నధర్మారం, కాసిపేట గ్రామాల్లో నీటి సమస్య తీవ్ర ంగా ఉందన్నారు. అధికారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, నిధుల కొరత అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు మేనేజర్ నిఖిల్ అయ్యర్ మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు బాకీ కిరణ్, ప్రనన్న, మహిళలు పోసు, లచ్చక్క, కవిత, పద్మ, మహేశ్వరి, లక్ష్మి, యువకులు పాల్గొన్నారు. -
ఉద్యోగ వేట ఇక సులభతరం
బోథ్: డిజిటల్ యుగంలో నిరుద్యోగులకు ఉ ద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతతో కూడిన ‘డీట్’ (డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎకేస్ఛ్ంజ్ ఆఫ్ తెలంగాణ) యాప్ను అందుబాటులోకి తెచ్చింది. నిరుద్యోగులు, ప్రైవేటు రంగ సంస్థల మధ్య ప్రత్యక్ష వారధిగా ఈ యాప్ పనిచేయనుంది. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. విద్యా సంస్థలు, ప్ర భుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థల సమన్వయంతో ఇది పర్యవేక్షించబడుతుంది. తద్వారా, అ భ్యర్థులు తమ అర్హతలకు తగిన ప్రైవేటు రంగ ఉద్యోగ అవకాశాలను సులభంగా పొందేందు కు మార్గం సుగమం అవుతుంది. పరిశ్రమలు, నిరుద్యోగులు ఈ యాప్లో నమోదు చేసుకుంటే కంపెనీలు తమకు అవసరమైన, స్కిల్ ఉన్న వారికి సందేశాన్ని పంపిస్తారు. వందల కంపె నీలన్నీ ఒకే చోట ఉండటంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉటుంది. అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగాలు డీట్ యాప్ ద్వారా పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఆపై చదివిన అభ్యర్థులు ప్రయోజనం పొందవచ్చు. వారి విద్యార్హత, నైపుణ్యాలు, అనుభవం ఆధారంగా కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. డిగ్రీ చదువుతున్న అభ్యర్థులకు కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించడం అదనపు విశేషం. ఫార్మా, ఇండస్ట్రియల్, బీపీవో, కస్టమర్ ఎగ్జిక్యూటివ్ సపోర్ట్, బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్తో పాటు అనేక ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ● నిరుద్యోగులు, ఉద్యోగాలు కల్పించే ఔత్సాహిక కంపెనీలు ఈ యాప్లో నమోదు చేసుకోవచ్చు. ● కంపెనీ నిర్వాహకులు, యాప్లో నమోదైన అభ్యర్థుల విద్య, నైపుణ్య వివరాలను పరిశీలించి, నేరుగా వారిని సంప్రదిస్తారు. ● కంపెనీల నియమావళిని బట్టి రాత లేదా మౌఖిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయానికి ఇందులో అవకాశం ఉండదు. నమోదు విధానం ● నిరుద్యోగులు తమ పూర్తి వివరాలను డీట్ యాప్లో లేదా అధికారిక వెబ్సైట్ www. deet.telangana.gov.in లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ● ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా యాప్ను తెరవాలి. ● విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు, అనుభవం, ఇంటర్న్షిప్ల వివరాలు నమోదు చేయాలి. ● పార్ట్టైమ్, ఫుల్టైమ్, అప్రెంటిస్షిప్లలో దేని కోసం అన్వేషిస్తున్నారో, ఏ రంగంలో ఉద్యోగం కావాలో స్పష్టం చేయాలి. ● విద్యార్హత పత్రాలను యాప్లో అప్లోడ్ చేయడంతో నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. -
భార్యను కడతేర్చిన భర్త
గుడిహత్నూర్: మద్యం తాగొద్దని మందలించిన భార్యను గొడ్డలితో నరికి చంపిన సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలి పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సీతాగోంది గ్రామానికి చెందిన సిడాం సంతోష్, లక్ష్మీబాయి (35) దంపతులు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. సంతోష్ మద్యానికి బానిసై తరచూ ఇంట్లో భార్యతో గొడవపడేవా డు. గురువారం ఉదయం సైతం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తాగి మోటార్ సైకిల్ నడుపొద్దని లక్ష్మీబాయి మందలించింది. మద్యం మత్తులో ఉన్న సంతోష్ కోపంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో ఆమె చెంప భాగంలో బలంగా కొట్టడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి తన భార్యను హత్య చేశానని పోలీసులకు లొంగిపోయాడు. సీఐ బండారి రాజు, ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు. -
లక్ష్మీదేవర ఆలయంలో చోరీ
భీమారం: మండల కేంద్రంలోని లక్ష్మీదేవర ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. ముది రాజ్ సంఘం పెద్దలు తెలిపిన వివరాలు ఇలా ఉ న్నాయి.. సమీపంలోని పత్తి చేను మీదుగావచ్చిన దుండగులు మొదట ఆలయం తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. హుండీలో ఉన్న 4 కిలో ల 500గ్రాములు వెండి, రూ. 36 వేల నగదు, అ మ్మవారిపై ఉన్న రెండు తులాల బంగారు అభరణా లను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో ఇంత పెద్దఎ త్తున వెండి ఉందన్న సమాచారం దొంగలకు ఎలా చేరిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మందు పార్టీ చేసుకుని దోపిడీ చోరీకి పాల్పడిన దొంగలు మొదట సమీపంలోని పత్తి చేనులో మందు పార్టీ చేసుకున్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పథకం ప్రకారం మొదట ఆలయ పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆలయం ఎదుటే నివాస గృహాలు ఉన్నప్పటికీ దుండగులు దోచుకుని యథేచ్ఛగా వెళ్లి పోవడం వెనుక స్థానికులు ఎవరైనా వారికి సహకరించారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 500 మీటర్ల దూరంలోనే పోలీస్స్టేషన్ పోలీస్స్టేషన్కు కేవలం 500 మీటర్ల దూరంలోనే చోరీ, జాతీయ రహదారికి సమీపంలోనే చోరీ జరగడం మండలంలో సంచలనంగా మారింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ సంఘటన స్థలాన్ని శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ గురువారం సందర్శించి స్థానికులను అడిగి వివరా లు తెలుసుకున్నారు. డాగ్స్వ్వాడ్తో పరిసరాలు గా లించగా అది పత్తిచేనులోకి వెళ్లి ఆగిపోయింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
కడెం ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత
కడెం: కడెం ప్రాజెక్ట్కు గురువారం రాత్రి 1000 క్యూసెక్కుల స్వల్ప ఇన్ఫ్లో రావడంతో ఇరిగేషన్ అధికారులు ఒక వరద గేటు ఎత్తి 4,178 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు వెల్లడించారు. నిజాయతీ చాటుకున్న సాయితేజలోకేశ్వరం: మండలంలోని పుస్పూర్ గ్రామానికి చెందిన గొడిసెల సాయితేజగౌడ్ దొరికిన బ్యాగును లోకేశ్వరం పోలీసులకు అప్పగించి నిజాయతీ చాటుకున్నాడు. బుధవారం నిజా మాబాద్ నుంచి పుస్పూర్కు బైక్పై వస్తున్న సాయితేజకు నందిపేట్ మండలం పలుగుగుట్ట సమీపంలో ఓ హ్యాండ్బ్యాగు దొరికింది. అందులో సెల్ఫోన్, రెండు గ్రాముల బంగా రం, ఆధార్ కార్డు ఉంది. ఆధార్ ఆధారంగా నందిపేట్ మండల కేంద్రానికి చెందిన ప్రవళికగా గుర్తించి లోకేశ్వరం పోలీసులకు బ్యాగ్ను అప్పగించాడు. సుమారు రూ.40 వేల విలువైన వస్తువులను అప్పగించిన యువకుడిని పోలీసులు అభినందించారు. గురువారం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి బ్యాగును అప్పగించారు. డబ్బులు దండుకున్న మధ్యవర్తిపై కేసుఆదిలాబాద్టౌన్: మధ్యవర్తిగా వ్యవహరిస్తూ కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చేలా చూస్తానని, పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేస్తానని డబ్బులు వసూలు చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కె.నాగరాజు తెలిపారు. హైకోర్టులో జడ్జీలు, న్యాయవాదులు పరిచయం ఉన్నారని నమ్మబలికి బాధితుల నుంచి రూ.3 లక్షల 50వేలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన ఫిర్యాదుదారు కుమారుడు, కోడలు మధ్య గొడవలు ఉన్నాయి. మధ్యవర్తిగా పరిచయం ఉన్న జైనూర్ మండలంలోని బూసిమెట్టకు చెందిన జాడే రవీందర్ బాధితులను నమ్మబలికి అందినకాడికి దండుకున్నా డు. తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. మొదట రూ.3లక్షలు ఇవ్వగా ఆ త ర్వాత కేసు నమోదు చేయిస్తానని బెదిరించి మ రో రూ.50 వేలు తీసుకున్నాడు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడడంతో బాధితురా లు గురువారం ఫిర్యాదు చేయగా కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. 42 కిలోల గంజాయి దహనంఆదిలాబాద్టౌన్: జిల్లాలో నమోదైన 18 కేసుల్లో పట్టుబడిన 42 కిలోల గంజాయిని గంజాయి డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలోని శ్రీ మెడికేర్ సర్వీసెస్ సెంటర్లో గురువారం గంజాయి డిస్పోజల్ చేశారు. ఇందులో 22 కిలోల గంజాయి మొక్కలు, 20 కిలోల ఎండు గంజాయిని దహనం చేశారు. అడిషనల్ ఎస్పీ సు రేందర్ రావు, డీసీఆర్బీ సీఐ హకీమ్ ఈ ప్రక్రియను పరిశీలించారు. -
పురుగుల మందు తాగి వ్యక్తి..
లక్ష్మణచాంద: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఒడ్డెపెల్లి గ్రామానికి చెందిన పల్లపు బుచ్చన్న (52) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఈ నెల 13న గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఉపాధివేటలో యువకుడు మృతి
నిర్మల్ఖిల్లా: ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు తరలివెళ్లిన జిల్లా వలస కార్మికుడు అక్కడే అసువులు బాశాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని కుప్టి గ్రామానికి చెందిన బోయిడి రాజు (27) అనే యువకుడు ఉపాధి నిమిత్తం గతేడాది జోర్డాన్ దేశానికి వెళ్లాడు. అక్కడ క్లాసిక్ ఫ్యాషన్స్ కంపెనీలో క్లీనర్గా ఉద్యోగం చేస్తున్నాడు. గత మంగళవారం పనులు చేస్తున్న సమయంలో మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు అక్కడి వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా మృతుడి తండ్రి ఎర్రన్న బుధవారం జిల్లా కేంద్రంలోని రాష్ట్ర ఎన్నారై సలహా కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లకు విషయం తెలిపారు. సాధారణ పరిపాలన శాఖ ద్వారా జోర్డాన్ దేశంలోని భారత రాయబార కార్యాలయానికి వివరాలను అందజేసి అక్కడి కంపెనీ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్వదేశ్ పరికిపండ్ల పేర్కొన్నారు. -
తుపాకి దించి.. అజ్ఞాతం వీడి..
బెల్లంపల్లి/నిర్మల్: నమ్మిన సిద్ధాంతాల కోసం అడవి బాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్లారు. సుమారు నాలుగున్నర దశాబ్దాలకు పైగా ఉద్యమం ప్రస్థానం కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ వల్ల ఉద్యమం పలుచనబడి అనేకమంది అమరులు అవుతున్నారని, ఈ క్రమంలో సాయుధ పోరాటం అసాధ్యమని ప్రకటించిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్రావు అభిప్రాయంతో ఏకీభవించి తుపాకి దించి వనం వీడారు. బుధవారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట ‘మల్లోజుల’ నేతృత్వంలో లొంగిపోయిన 60మందిలో ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన దంపతులు సలాకుల సరోజ, ఇర్రి మోహన్రెడ్డి ఉన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సరోజ ఉరఫ్ లత ఉరఫ్ దీప ఉరఫ్ స్వాతి మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్జెడ్సీ) సెక్రెటరీగా, ఆమె భర్త నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్పల్లి గ్రామానికి చెందిన ఇర్రి మోహన్రెడ్డి ఉరఫ్ వివేక్ మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరిపై చేరో రూ.50లక్షల వరకు రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి ఇష్టంలేక ఉద్యమానికి ఆకర్శితురాలై.. బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన సలాకుల రాజమ్మ, సాయిలు దంపతులకు కుమారులు రాజనర్సు, మ ల్లయ్య, రామస్వామి, కూతుళ్లు లక్ష్మీ, ఎల్లక్క, సరో జ సంతానం. సింగరేణి కార్మికుడైన సాయిలు సరో జకు 15ఏళ్ల వయస్సులో బాల్యవివాహం చేశాడు. అప్పటికి ఆమె స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుండేది. ప్రస్తుత పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి మండలానికి చెందిన దగ్గరి బంధువుకు ఇచ్చి పెళ్లి చేయగా భర్త వేధింపులతో పుట్టింటిలో ఉండి అతడికి దూరమైంది. ఉద్యమ ప్రభావంతో.. పీపుల్స్వార్ పార్టీ ఉద్య మం కన్నాలబస్తీలో తీవ్రస్థాయిలో ఉండేది. 1984 లో పీపుల్స్వార్ పార్టీ వా రం రోజులపాటు నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై విప్లవ ఓనమాలు నేర్చుకుంది. ఇష్టంలేని పెళ్లి, భర్త వేధింపులు తదితర అంశాలతో తీవ్రంగా కలతచెంది పోరుమార్గాన్ని ఎంచుకుని రహస్య జీవితంలోకి వెళ్లిపోయింది. దండకారణ్యంలోనే.. సరోజ ఉద్యమ ప్రస్థానమంతా దండకారణ్యం కేంద్రంగా సాగింది. కేవలం ఏడాదిపాటు కొత్తగూడెం నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వరకు కొరియర్గా పని చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన హింసాత్మక కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో పోలీసు రికార్డుల్లో ఆమె పేరు వినిపించలేదు. పార్టీ ఆదేశాల మేరకు దండకారణ్యంలోకి వెళ్లి నాలుగు దశాబ్దాలపాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా ఆదివాసీలతో కలిసి గడిపింది. కొన్నాళ్లపాటు పార్టీ ప్రింటింగ్ ప్రెస్ బాధ్యతలు, ఇతరత్రా కార్యకలాపాలు నిర్వహించింది. దీప పేరుతో వ్యాసం.. అమరుడు మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడు కటకం సుదర్శన్ ఉరఫ్ దూలాదాదా, సరోజ ఇద్దరు కూడా కన్నాలబస్తీ వాస్తవ్యులు. దండకారణ్యంలో ఉద్యమ కార్యకలాపాల్లో భాగంగా పలుమార్లు సుదర్శన్తో మాట్లాడే అవకాశం ఆమెకు దక్కింది. సుదర్శన్ అనారోగ్యం మరణించిన సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ‘అరుణ తా ర’ పత్రికలో దీప పేరుతో సరోజ ప్రత్యేకంగా వ్యా సం రాసి విప్లవ స్మృతులను నెమరు వేసుకుంది. రూర్కేలాలో అరెస్టు ఉద్యమ విస్తరణలో భాగంగా జార్ఖండ్ రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తూ సరోజ, మోహన్రెడ్డి సహచరులతో ఓసారి రూర్కేలా పోలీసులకు పట్టుబడ్డారు. వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించగా.. నేరం రుజువు కాకపోవడంతో కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో 2009లో జైలు నుంచి విడుదలైన ఇద్దరూ నక్సలైట్ అగ్రనాయకులు మూల దేవేందర్రెడ్డి, మాధవ్, అమరుడు జాడి వెంకటితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. -
‘సమస్యల పరిష్కారంలో గెలిచిన సంఘాలు విఫలం’
శ్రీరాంపూర్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన కార్మిక సంఘాలు కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన ఎస్ఆర్పీ1 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి కంపెనీకి రావాల్సిన రూ.42 వేల కోట్ల బకాయిలు ఇప్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. తక్కువ లాభాలు చూపి వాటా పంపిణీ చేసి కార్మికులకు అన్యాయం చేశారన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డు ఎత్తివేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, దీనిపై అన్ని కార్మిక సంఘాలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఆ యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు గుల్ల బాలాజీ, రాష్ట్ర కమిటీ సభ్యుడు కస్తూరి చంద్రశేఖర్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంగళ శ్రీనివాస్, నాయకులు వెంకటరెడ్డి, గోపాల్ సింగ్, రాథోడ్ పాల్గొన్నారు. -
సంపత్కు సాహితీ పురస్కారం
నిర్మల్ఖిల్లా: ప్రతిష్టాత్మక సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2023, జిల్లాకు చెందిన సాహితీవేత్త డాక్టర్ టి.సంపత్ కుమార్ను వరించింది. పలు సాహితీ విభాగాల్లో రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథాలను ఎంపిక చేయగా ఉత్తమ కథా సంపుటిగా ఈయన రాసిన ‘నా నుంచి మన వరకు’ ఉంది. ఇదే రచనకు 2023, మేలో తెలంగాణ సరస్వత పరిషత్ రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అందించింది. ఈ నెల 29న హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ కళామందిరంలో రూ.20,116 నగదు పురస్కారంతో సంపత్కుమార్ను సత్కరించనున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ టి.సంపత్ కుమార్ కెనడా హై కమిషన్ కార్యాలయంలో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. ఢిల్లీలో పదవీ విరమణ పొందిన అనంతరం ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. తెలుగుతోపాటు ఆంగ్ల భాషల్లోనూ అనేక కథలు, నవలలు రచించారు. -
వినోద్కుమార్కు యోగా రిఫరీ అవార్డు
జన్నారం: మండలంలోని మహ్మదాబాద్ గ్రామానికి చెందిన దుర్గం వినోద్కుమార్కు జాతీయస్థాయి యోగా రిఫరీ అవార్డు లభించింది. శ్రీ గణపతి సచ్చితానంద ఆశ్రమం, మై సూర్ వేదికగా అక్టోబర్ 9 నుంచి 12 వరకు, కర్ణాటక స్టేట్ అమెచ్యూర్ యోగా స్పోర్ట్స్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో 50వ గోల్డెన్ జూబ్లీ సీనియర్ నేషనల్ యోగా స్పోర్ట్స్ చాంపియన్షిప్ నిర్వహించారు. తెలంగాణ నుంచి నేషనల్ యోగా రిఫరీగా విశేష సేవలు అందిస్తున్నందుకు వినోద్కుమార్ యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీ అభినవ్ జోషి, వైస్ ప్రెసిడెంట్ మనోహర్, అగర్వాల్ల చేతుల మీదుగా బుధవారం మైసూర్లో అవార్డు అందుకున్నారు. ఆయనను ఘనంగా సత్కరించి మెమెంటో అందజేశారు. ‘ప్రజల సంరక్షణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్’ ఆదిలాబాద్రూరల్: ప్రజల రక్షణ కోసమే పో లీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ సెర్చ్) నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రణదీవేనగర్లో కార్డెన్సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన ధ్రువపత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 31 ఆటోలు, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి తనిఖీ చేశామని, అనుమతులు లేకుండా విక్రయిస్తున్న 16 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐలు బి. సునీల్ కుమార్, కె. నాగరాజు, కె. ఫణిదర్, కర్రె స్వామి, ఎస్సైలు విష్ణువర్ధన్, డి. రాధిక, మహేందర్, రాకేశ్, పోలీసు సిబ్బంది ఉన్నారు. పాఠశాలలో విచారణ పూర్తినర్సాపూర్ (జి): మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గతంలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఉపాధ్యాయులపై బుధవారం అధికారులు విచారణ జరిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఉపాధ్యాయులు మనోహర్ రెడ్డి, మోహన్రావులను గత ఫిబ్రవరి 2న విధుల నుంచి తొలగించిన విషయం విధితమే. విచారణకు ఇటీవల డీఈవో ముగ్గురు విచారణ అధికారులను నియమించారు. నివేదికను త్వరలోనే ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్లు సమాచారం. ‘విధులకు హాజరు కావాలి’ఉట్నూర్రూరల్: విద్యార్థుల సంక్షేమం, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కార్మికులు విధులకు హాజరు కావాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో పార్ట్ టైం, దినసరి వేతనంతో పని చేస్తున్న 220 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్న నేపథ్యంలో వారి మూడు నెలల వేతనాన్ని ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో తాత్కాలికంగా బయట వ్యక్తులు పని చేస్తున్నారన్నారు. కొంత మంది కార్మికులు జీతాలు చెల్లించిన తర్వాత కూడా ముందస్తు అనుమతి లేకుండా, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా సమ్మెలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. -
టెంబుర్నిలో అరుదైన విగ్రహాలు
నర్సాపూర్(జి): నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ప్రాచీన చారిత్రక గ్రామం టెంబుర్నిలో 12వ శతాబ్దపు ఉగ్ర నారసింహుడు, విష్ణుమూర్తి, సరస్వతిదేవి, నృత్య గణపతి, ద్వార పాలకుడు విగ్రహాలు లభ్యమైనట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావ్ తెలి పారు. రెండు దశబ్దాల క్రితం పనికి ఆహార పథకంలో భాగంగా తవ్వకాలు చేస్తున్నప్పుడు అరుదైన వి గ్రహాలు బయటపడ్డాయని తెలిపారు. కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయం శివకేశవులకు భే దం లేదన్న సందేశం ఇస్తుందని పేర్కొన్నారు. ఇ క్కడ ప్రధాన ఆలయం శ్రీచక్ర లింగం కలిగిన శివా లయమే అయినా స్తంభాలకు అరుదైన శిల్ప ప్రతి మలు చెక్కినారని వివరించారు. చామరధారిణి వి గ్రహాలు, ద్వారపాలకుల సుందర విగ్రహాలతో పాటు విలక్షణమైన సరస్వతిదేవి ప్రతిమ, ఉగ్రనారసింహుడు, నృత్య గణపతి, విష్ణుమూర్తి ప్రతిమలు స్తంభా లకు మలిచారని తెలిపారు. ఆలయ పీఠ స్తంభాలు చెల్లాచెదురుగా పడి ఉండడం వల్ల ఆ లయం విధ్వంసానికి గురైనట్లు తెలిపారు. ఈ ప్రాంత పరిసరాలను పరిశీలిస్తే శాతవాహన, కళ్యాణి చాళుక్య, కాకతీయుల కాలంలో గొప్ప నాగరికత విలసిల్లినట్లు తెలుస్తుందన్నారు. పురావస్తు శాఖ ప్రత్యేక దృష్టి సారించి వీటిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అబ్బడి రాజేశ్వర్రెడ్డి, మానస సంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
ఐటీఐ చేస్తూ.. అటే వెళ్లాడు..
నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్పల్లికి చెందిన ఇర్రి నర్సమ్మ, శివారెడ్డి దంపతులకు నలుగురు కుమారులు. మూడో సంతానంగా మోహన్రెడ్డి 1960లో జన్మించాడు. సోన్లోని జెడ్పీహెచ్ఎస్లో 1976లో పదో తరగతి చదివాడు. పెద్దన్నయ్య సింగరేణిలో ఉద్యోగరీత్యా గోదావరిఖనిలో పనిచేస్తుండేవాడు. ఆయన వెంట వెళ్లిన మోహన్రెడ్డి మంచిర్యాలలో ఐటీఐలో చేరాడు. అక్కడ చదువుతూ పీపుల్స్వార్ భావజాలానికి ప్రభావితుడయ్యాడు. అలా.. అక్కడి నుంచే మోహన్రెడ్డి దళంలోకి వెళ్లి మళ్లీ ఇంటిముఖం చూడలేదు. వరంగల్ జైలులో ఉన్నప్పుడు చాలా ఏళ్లకు కుటుంబసభ్యులు ఆయనను చూడగలిగారు. జైలు నుంచి విడుదల తర్వాత మళ్లీ దళం వైపే వెళ్లాడు. 2010లో తండ్రి శివారెడ్డి, 2021లో తల్లి నర్సమ్మ మరణించినా ఆఖరి చూపులకూ రాలేదు. ఆచూకీ లేని తూము శ్రీనివాస్.. నిర్మల్ జిల్లా నుంచి కేంద్రకమిటీ స్థాయికి ఎదిగిన మావోయిస్టు నేతలు ఉన్నారు. సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన ఒగ్గు సట్వాజీ అలియాస్ సుధాకర్/బురియార్/కిరణ్ మావోయిస్టు పార్టీ కేంద్ర పొలిట్బ్యూరో సభ్యుడిగా, సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా కొనసాగారు. ఆయన 2019 ఫిబ్రవరిలో తన భార్యతో కలిసి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఆ స్థాయిలో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు దళంలో కొనసాగిన మోహన్రెడ్డి తాజాగా లొంగిపోయారు. కడెం మండలం లక్ష్మీసాగర్కు చెందిన కంతి లింగవ్వ అలియాస్ అనిత 2022 డిసెంబర్లో ఎన్కౌంటర్లో మృతిచెందింది. మిగతావాళ్లు లొంగిపోగా, ఖానాపూర్ మండలం బాబాపూర్(ఆర్)కు చెందిన తూము శ్రీనివాస్ అలియాస్ శ్రీను ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. అటు పోలీసులు, ఇటు కుటుంబసభ్యులు ఎవరికీ తూము శ్రీనివాస్ జాడ తెలియకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా మోహన్రెడ్డి లొంగుబాటుతో జిల్లాలో ఒకప్పుడు వెలుగు వెలిగిన ‘దళం’ ఖాళీ అయ్యింది. జనజీవన స్రవంతిలోకి రావాలి.. జిల్లాలో దాదాపు మా వోయిస్టు నేతలంతా జనజీవన స్రవంతిలోకి వచ్చా రు. తాజాగా మోహన్రెడ్డి కూడా లొంగిపోవడం శుభపరిణామం. ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉంటే వారు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని కోరుతున్నాం. –జానకీషర్మిల, ఎస్పీ, నిర్మల్ -
ఎఫెక్ట్..
చెక్బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది జైలుబెల్లంపల్లి: చెక్బౌన్స్ కేసులో ఓ నిందితుడికి బుధవారం ఏడాది జైలుశిక్ష పడింది. బెల్లంపల్లి వన్టౌన్ ఎస్హెచ్వో కె.శ్రీనివాస రావు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి ఫుట్బాల్ గ్రౌండ్ బస్తీకి చెందిన రత్నం రాజం అనే వ్యక్తి వద్ద 2019లో అదే బస్తీకి చెందిన బోగే మోహన్ రూ.3.5 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈమేరకు మోహన్ తనకు చెందిన చెక్ను రాజంకు ఇచ్చాడు. చెక్ను రాజం బ్యాంక్లో డిపాజిట్ చేయగా ఖాతాలో నగదు లేక చెక్ బౌన్స్ అయ్యింది. బాధితుడు రాజం కోర్టులో కేసు వేయగా విచారించిన బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జె.ముఖేశ్ నేరం రుజువు కావడంతో బుధవారం బోగే మోహన్కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. బైక్లో నుంచి నగదు చోరీకాగజ్నగర్టౌన్: బైక్లో ఉంచిన నగదును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కాగజ్నగర్ మండలంలోని ఆరెగూడ గ్రామానికి చెందిన బీమన్కార్ ఇస్తారి తన కుమారుడు బీమన్కార్ బబ్లుతో కలిసి పట్టణంలోని తెలంగాణ గ్రామీణబ్యాంక్లో రూ.2.25 లక్షలు డ్రా చేసుకున్నారు. డ్రా చేసుకున్న డబ్బులను బైక్లో పెట్టుకొని కాగజ్నగర్ తహసీల్దార్ కార్యాలయానికి సర్టిఫికెట్ కోసం వెళ్లారు. బబ్లు బైక్ను కార్యాలయ ఆవరణలో నిలిపి కార్యాలయం లోనికి వెళ్లాడు. ఇస్తారి బైక్కు కొంచెం దూరంగా ఉండడాన్ని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు బైక్లో ఉన్న నగదు ఎత్తుకెళ్లారు. చుట్టుపక్కల వారిని అడిగినా తెలియదని చెప్పడంతో చేసేదేం లేక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తగ్గిన డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజులు లక్ష్మణచాంద: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థులకు పెంచిన పరీక్ష ఫీజులను అధికారులు తగ్గించారు. ఇటీవల మొదటి సెమిస్టర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.3250గా నిర్ణయించారు. దీంతో మధ్యతరగతి విద్యార్థులు పెంచిన ఫీజులు కట్టలేమని వాపోయారు. వారి ఇబ్బందులపై ‘సాక్షి’లో ఈ నెల 10న ‘మోయలేని భారం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు పరీక్ష ఫీజులు తగ్గించి గత సంవత్సరం ఫీజులు చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. బీఏ ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులు రూ.1440, బీఎస్సీ, బీకాం విద్యార్థులు రూ.1640 చెల్లించాలని నిర్ణయించారు. ఇంద్రాదేవి ఆలయంలో గుస్సాడీల పూజలుఇంద్రవెల్లి: మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో బుధవారం సిరికొండ మండలం నేరడిగొండ గ్రామానికి చెందిన గుస్సాడీలు, దండారీ బృందం ఆదివాసీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించి ఇంద్రాదేవికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గుస్సాడీలు చేసిన నృత్యం, యువకులు చేసిన కోలాటం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం జన్నారం మండలంలోని గుడిరేవు పద్మల్పూరి కాకో ఆలయానికి బయల్దేరి వెళ్లారు. ఇందులో గ్రామపెద్దలు ఉన్నారు. -
వైద్యం వికటించి యువకుడి మృతి!
బెల్లంపల్లి: జ్వరంతో బాధపడుతున్న తాండూర్ మండలానికి చెందిన ఓ యువకుడు ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి మృతి చెందినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మండలంలోని ద్వారకాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి గత నెలలో జ్వరం రాగా చికిత్స కోసం ఓ ఆర్ఎంపీని ఆశ్రయించాడు. సదరు ఆర్ఎంపీ రెండు ఇంజక్షన్లు ఇచ్చి, సైలెన్ పెట్టాడు. దీంతో సదరు యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గతనెల 27న ఈ ఘటన జరగ్గా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డట్లు తెలుస్తోంది. తాజాగా వైద్యం వికటించి యువకుడు మృతి చెందినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం. కరెంట్ షాక్తో వ్యక్తి మృతినిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి కరెంట్ షాక్తో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఈద్గాంకు చెందిన జానా రమేశ్ (40) తన అన్న పాత ఇంటి పక్కన మరో కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టాడు. దీంతో కొత్త ఇల్లుకు పాత ఇంటి నుంచి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. ఈక్రమంలో రమేశ్ తెలియక కరెంట్ వైర్ను ముట్టుకోవడంతో షాక్ కొట్టి కిందపడిపోయాడు. వెంటనే అక్కడ పనిచేసే వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రమేశ్కు భార్య, కొడుకు ఉన్నారు. వీరు గత పది సంవత్సరాల నుంచి రమేశ్కు దూరంగా ఉంటున్నారు. రమేశ్ అన్న మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ కౌలు రైతు మృతినెన్నెల: అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేసిన కౌలు రౌతు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగారాం గ్రామానికి చెందిన కౌలు రైతు కడారి బక్కన్న(40) మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. పెట్టుబడి కోసం రూ.2 లక్షలు వరకు అప్పు చేశాడు. అధిక వర్షాలతో పంట నష్టపోగా అప్పులు ఎలా తీర్చాలో తెలియలేదు. దీంతో ఈ నెల 3న ఇంటి వద్ద గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి వరంగల్కు తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అతని భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పాముకాటుతో మహిళ మృతిదహెగాం: మండల కేంద్రానికి చెందిన దాసరి ఆద్యశ్రీ (స్రవంతి(22)) అనే మహిళ పాము కాటుకు గురై మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం భర్త శ్రావణ్తో కలిసి స్రవంతి వ్యవసాయ పనులకు వెళ్లింది. వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో దాహం వేయడంతో పొలంలో ఉన్న మోటర్ వద్దకు వెళ్లగా పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందింది. ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని వృద్ధురాలి మృతిసారంగపూర్: మండల కేంద్రానికి చెందిన దేవి సాయమ్మ(80) అనే వృద్ధురాలు బుధవారం ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని మృతిచెందింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు సాయంత్రం పిల్లలను దింపేందుకు ఎస్సీకాలనీకి వెళ్లింది. బస్సు డ్రైవర్ జాదవ్ అంకుష్ విద్యార్థులను దింపేసి తిరిగి బస్సును రివర్స్ చేసే క్రమంలో ఇంటి ముందు నిలబడి ఉన్న వృద్ధురాలిని ఢీకొట్టాడు. ప్రమాదంలో దేవి సాయమ్మకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు సాయమ్మను నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈమేరకు బస్సుడ్రైవర్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
దొంగతనానికి వచ్చి దొరికిపోయారు..!
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే –ఓసీలో దొంగతనానికి వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరిని సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నా రు. ఏరియా జీఎం రాధాకృష్ణ తెలిపిన వివరాలు.. మంగళవారం రాత్రి సుమారు 9.30 గంటలకు ఏరియాలోని కేకే –ఓసీ ఆవరణలోని స్టోర్ వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చి దొంగతనానికి యత్నించారు. అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు సదానందం వారిని గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎంటీఎఫ్ టీంను అలర్ట్ చేశారు. వారు అక్కడికి చేరుకుని స్టోర్ పరిసర ప్రాంతాల్లో పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా, ఒకరు పారిపోయారు. పట్టుబడిన వారిని ఏరియాలోని ఎస్అండ్పీసీ ఆఫీస్లోని కంట్రోల్రూంకు తరలించి బుధవారం పోలీస్స్టేషన్లో అప్పగించామని జీఎం తెలిపారు. ఓసీ ఆవరణలోకి చొరబడిన వ్యక్తులను పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బందిని ఏరియా జీఎం రాధాకృష్ణ, ఎస్వో టూ జీఎం విజయప్రసాద్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ రవి తదితరులు ప్రశంసాపత్రం అందించి అభినందించారు. -
కన్నకొడుకే కడతేర్చాడు..!
భైంసాటౌన్: తానూరు మండలంలోని ఎల్వి గ్రామానికి చెందిన పన్నేవాడ్ లక్ష్మణ్ (56) హత్య కేసు మిస్టరీ వీడింది. కన్న కొడుకే క్షణికావేశంలో తండ్రిని హత్య చేసి పంటచేనులో పాతి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ జీ. జానకీ షర్మిల బుధవారం కేసు వి వరాలు వెల్లడించారు. ఆగస్టు 31న లక్ష్మణ్ అదృశ్యం కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేపట్టారు. రెండురోజుల కిందట గ్రామ స మీపంలోని చెక్డ్యాం వద్ద గోనెసంచిలో లక్ష్మణ్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు విచారణ చేపట్ట గా అతని కొడుకు(17) హత్య చేసినట్లు నిర్ధారించా రు. ఆగస్టు 31న రాత్రి తండ్రితో కలిసి కుమారుడు చేను వద్దకు వెళ్లగా, చేను చుట్టూ చూసి రమ్మని తండ్రి చెప్పాడు. దీంతో తాను వెళ్లనని మొండికేయడంతో తండ్రి మందలించాడు. క్షణికావేశానికి గురైన కొడుకు అక్కడే ఉన్న గొడ్డలితో కొట్టి చంపి అక్కడే చేనులో తండ్రి మృతదేహాన్ని పాతిపెట్టాడు. పెంపుడు కుక్కే పట్టించింది.. వారం రోజులకు తల్లితో కలిసి తన తండ్రి కనిపించడం లేదని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండురోజుల కిందట మృతుడి పెంపుడు కుక్క చేనులో తిరుగుతూ మృతదేహం పాతిపెట్టిన స్థలంలో గోనెసంచిని వెలికితీసింది. దీంతో మృతుడి పుర్రెభాగం బయటికి రాగా గమనించిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారమిచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ మేరకు ఘటనాస్థలంలో లభించిన ఆధారాలతో కొడుకే హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఏఎస్పీ అవినాశ్కుమార్ ఆధ్వర్యలో కేసు చేధనలో కీలకంగా పనిచేసిన ముధోల్ సీఐ మల్లేశ్, ఎస్సై పెర్సిస్, తానూర్ ఎస్సై జుబేర్లను ఎస్పీ అభినందించారు. -
హోరాహోరీగా జోనల్స్థాయి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్రూరల్: జోనల్స్థాయి వాలీబాల్ పోటీలు బుధవారం జిల్లా కేంద్రంలో హోరాహోరీగా సాగాయి. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో జోనల్స్థాయి పోటీలు నిర్వహించారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ జోనల్స్థాయి బాలికల వాలీబాల్ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 48 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 12 మందిని ఎంపిక చేశామని తెలిపారు. వీరిలో ఆసిఫాబాద్ నుంచి ఐదుగురు, మంచిర్యాల నుంచి ఐదుగురు, నిర్మల్ నుంచి ఇద్దరు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. వీరు మహబూబ్నగర్లో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పీడీ మీనారెడ్డి, ఖేల్ ఇండియా కోచ్ రాకేశ్, పీఈటీలు లక్ష్మి, నాగమణి, భవిత, లక్ష్మణ్, శ్రీనివాస్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి సాగు చేస్తున్న ఒకరిపై కేసులింగాపూర్: సిర్పూర్(యూ) మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సిర్పూర్(యూ) మండలంలోని పంగిడి గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దదోబ గ్రామ శివారులోని పత్తి చేనులో 35 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొక్కలు సాగు చేస్తున్న వల్క శంకర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
గాలికుంటు నివారణపై అపోహలొద్దు
దండేపల్లి: పశువుల్లో సోకే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలపై పశు పోషకులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా పశువైద్యాధి కారి శంకర్ అన్నారు. మండలంలోని ముత్యంపేటలో బుధవారం ఉచిత మెగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలలు పైబడిన గోజాతి, గేదెజాతి పశువులకు టీకాలు తప్పక వేయించాలన్నారు. గ్రామంలో 280 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యాకుబ్రెడ్డి, దండేపల్లి, లక్సెట్టిపేట పశువైద్యులు ధన్రాజ్, భూమన్న, సుజాత, ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు త్రిమూర్తి, లక్సెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజన్న, రాకేష్ పాల్గొన్నారు. -
కనెక్షన్.. నిరీక్షణ
మంచిర్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం అన్నదాతలకు నిరీక్షణ తప్పడం లేదు. జిల్లాలో ఏటా వందల సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్న రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కనెక్షన్ కోసం దరఖాస్తు చేసి డీడీలు చెల్లించి లైన్ మ్యాపింగ్, ఎస్టిమేషన్లు వేసి ఇస్తున్నా ఏదో ఓ కారణంతో రేపుమాపంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. డీడీలు, ఎస్టిమేషన్ చార్జీలు చెల్లించినా స్తంభాలు వేసి తీగలు అమర్చకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. బోరుబావులు తవ్వించుకుని ఏళ్లు గడస్తున్నా విద్యుత్ సౌకర్యం లేక నీటి తడులు అందించలేని దుస్థితి ఉంది. దరఖాస్తు చేసుకున్న రైతులకు వెంటనే కనెక్షన్లు ఇవ్వాలని విద్యుత్శాఖ ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. అయినా ఏటా వందల సంఖ్యలో కనెక్షన్లు పెండింగ్ ఉంటున్నాయి. విద్యుత్ శాఖ అధికారులు చుట్టూ రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ కావడంతో మధ్యలోంచి లైన్ వేయడం కష్టంగా ఉంటుందని, యాసంగి సీజన్లో పంటలు ఉన్నాయని దిగుబడి వచ్చిన తర్వాత అని దాట వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పరికరాలు నిర్మల్లోనే వ్యవసాయ కనెక్షన్ మంజూరైన రైతులకు విద్యుత్ శాఖ కండక్టర్ వైరు (సబ్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్కు వచ్చేది), కేబుల్ వైరు (ట్రాన్స్ఫార్మర్ నుంచి రైతు బావి, బోరు వరకు స్తంభాల మధ్య లాగేది) ఇస్తోంది. రైతులు తమ వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న సందర్భంలో ఆ దూరాన్ని బట్టి కేబుల్ వైర్, అవసరాన్ని బట్టి కండక్టర్ వైర్ను విద్యుత్శాఖ సరఫరా చేయాల్సి ఉంటుంది. గతంలో విద్యుత్ పరికరాలు సరఫరా చేసే స్టోర్ ఉమ్మడి జిల్లాలో ఒక్క నిర్మల్లోనే ఉండడం, లైన్లు వేయడానికి అవసరం మేరకు పరికరాలు దొరకక జాప్యం జరుగుతుండేది. దీంతో వ్యవసాయ కనెక్షన్లు పెండింగ్లో ఉండేవి. కానీ.. ఐదేళ్ల క్రితం జిల్లాలో కొత్త స్టోర్ ఏర్పాటు చేయడంతోపాటు పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం స్తంభాలతో పా టు పెద్ద మొత్తంలో కేబుల్, కండక్టర్ తదితర సమగ్రిని పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచడంతో పాటు అంతా పారదర్శకంగా ఉండేందుకు దరఖా స్తులు, మంజూరు, చెల్లింపులు విద్యుత్ శాఖ వెబ్సైట్ అన్ని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వ్యవసాయ మోటర్లకు లైన్ ఇవ్వడంలో మాత్రం కాలయాపన కొనసాగుతోంది. ఆలస్యం చేయకుండా వెంటనే కనెక్షన్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో గత ఐదేళ్లలో కనెక్షన్ వివరాలుసంవత్సరం దరఖాస్తులు మంజూరు తిరస్కరణ పెండింగ్ 2021 3,606 2381 590 635 2022 2,371 1,177 298 896 2023 2,856 1,426 577 853 2024 3,369 1,780 854 735 2025 2,156 977 678 501 (సెప్టెంబర్ 30)పెండింగ్లో ఉంచడం లేదు వ్యవసాయ కనెక్షన్ల కోసం మీసేవ ద్వారా డీడీ చెల్లించిన రైతులు ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత స్తంభాలు, తీగలు, పరికరాలకు చార్జి ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. రైతులు ఆలస్యం చేస్తే కనెక్షన్ ఇవ్వడం ఆలస్యమవుతుంది. పారదర్శకంగా కనెక్షన్లు ఇస్తున్నాం. ప్రస్తుతం వానాకాలం పంటలు వేసుకున్నారు. పంట పొలాల మధ్యలో నుంచి లైన్ వేయడం కుదరదు. ఇబ్బంది లేని చోట వెంటనే ఇస్తున్నాం. కనెక్షన్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశాలు వస్తున్నాయి. పెండింగ్లో ఉంచకుండా చర్యలు తీసుకుంటున్నాం. – ఖైసర్, మంచిర్యాల డీఈ -
తుదిదశకు వైద్యకళాశాల పనులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/మంచిర్యాలటౌన్: ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు తుదిదశకు చేరాయని, మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్దీపక్ తెలిపారు. బుధవారం గుడిపేటలో ప్రభుత్వ వైద్య కళాశాల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు వైద్యులు, వైద్య సిబ్బంది సంఖ్యను మరింతగా పెంపొందించేందుకు వైద్య కళాశాల నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ పరిశీలించారు. నూతన ఆసుపత్రి భవనం పూర్తయితేనే ప్రజలకు అన్ని రకాల వసతులతో కూడిన వైద్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ ఇంజనీరింగ్ సిబ్బంది, కళాశాల ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ సంపూర్ణరావు తదితరులు పాల్గొన్నారు. పశువులకు టీకాలు వేయించాలి మంచిర్యాలఅగ్రికల్చర్: పాడిరైతులు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయంచాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి శంకర్తో కలసి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు నెలల వయసు పై బడిన ప్రతీ పశువుకు ఉచితంగా టీకాలు వేస్తామని తెలిపారు. పశువైద్యులు, అధికారులు గంగాధర్ పాల్గొన్నారు. -
టీఎన్జీవోస్ సొసైటీ భూముల క్రయవిక్రయాలు చెల్లవు
మంచిర్యాలటౌన్: నస్పూరులోని సర్వేనంబర్ 42లో ఇంటి స్థలాలను టీఎన్జీవోస్ సొసైటీకి కేటాయించారని, ఇతర వ్యక్తులకు ఆయా స్థలాలను అమ్మడం, కొనడం చేయవద్దని టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సమావేశం బుధవారం తీర్మానం చేసింది. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సభ్యులు మాట్లాడారు. సొసైటీకి సంబంధం లేని వ్యక్తులు స్థలాలు తమవేనని అమ్మకాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రజలు మోసపోవద్దని కోరారు. ఈ సమావేశంలో టీఎన్జీవోస్ అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి మహ్మద్ హబీబ్ హుస్సేన్, ఉపాధ్యక్షులు సైండ్ల మొండయ్య, సంయుక్త కార్యదర్శి భూముల రామ్మోహన్, కోశాధికారి దొరిశెట్టి రాజమౌళి, కార్యవర్గ సభ్యులు నాగుల గోపాల్, బేతు కళావతి, ఆర్డీ.ప్రసాద్, సయ్యద్ ఇంతియాజ్ పాల్గొన్నారు. -
లొంగుబాటు దిశగా మావోయిస్ట్ నేత బండి ప్రకాష్
మందమర్రిరూరల్: మావోయిస్టు కీలక నేత, సికాస కార్యదర్శి బండి ప్రకాష్ ఉరఫ్ బండి దాదా లొంగుబాటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మందమర్రి పట్టణానికి చెందిన ఆయన గత నాలుగు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆర్ఎస్యూతో మొదలైన ప్రస్థానం సికాస కార్యదర్శి, మావోయిస్టు కీలక నేతగా ఎదిగాడు. అనేక సందర్భాల్లో ఎదురుకాల్పుల్లో మరణించాడని ప్రచారం జరిగినప్పటికీ క్షేమంగానే ఉన్నాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపి ఒత్తిడి తీసుకొస్తుండడం, వరుస ఎన్కౌంటర్ల దృష్ట్యా మావో యిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, కీలక నేతలు లొంగుబాటు బాట పట్టడం తెలిసిందే. బుధవారం అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్రావు 60మంది సహచరులతో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మరికొందరు కూడా లొంగుబాటు బాట పట్టినట్లు సమాచారం. ఇదే బాటలో బండి ప్రకాష్ రాష్ట్ర పోలీసు బాస్లకు అందుబాటులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. -
విడిచి ఉండలేక‘పోయారు’!
మంచిర్యాలక్రైం: చిన్న కుటుంబం.. భార్యాభర్తలు.. ఇద్దరు పిల్లలు.. జీవితం ఆనందంతో సాగిపోతోంది. ఒక్కగానొక్క కుమారుడు.. ఒకే కూతురు కావడంతో కంటికి రెప్పలా చూసుకున్నారు. వారిద్దరే సర్వస్వమని ఏ లోటూ రాకుండా పెంచసాగారు. వారి ఆనందమయ జీవనంపై విధి చిన్నచూపు చూసింది. కుమారుడిని జ్వరమై మృత్యువు కబళించింది. అతడిని విడిచి ఉండలేక తల్లిదండ్రులు, సోదరి ఆత్మహత్యాయత్నం చేసి ఒక్కొక్కరిగా ముగ్గురూ మృత్యువాతపడ్డారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా విషాదం మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్కు చెందిన బండి చక్రవర్తి ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య దివ్య, కుమారుడు పవన్, కూతురు దీక్షిత ఉన్నారు. రెండు నెలల క్రితం పవన్(12) జ్వరంతో మృతిచెందాడు. ఈ సంఘటన కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేసింది. తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ నెల 5న పవన్ బర్త్డే కావడంతో కేక్, కూల్డ్రింక్ తెచ్చుకుని ఏర్పాట్లు చేశారు. గడ్డిమందు, పురుగుల మందు కూల్డ్రింక్స్లో కలుపుకొని ముగ్గురూ తాగారు. విషయం తెలిసిన చక్రవర్తి తమ్ముడు బండి ఓంకార్ వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఈ నెల 8న దీక్షిత(10), వరంగల్ ఎంజీఎంలో 11న దివ్య(29), బుధవారం చక్రవర్తి(32) చనిపోయారు. పవన్ను విడిచి ఉండలేక ముగ్గురూ మృతిచెందడం స్థానికంగా విషాదం నింపింది. ఓంకార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల సీఐ ప్రమోద్రావు తెలిపారు. -
హాస్టళ్లలో ఎఫ్ఆర్ఎస్
మంచిర్యాలఅర్బన్: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు, సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ విధానా(ఎఫ్ఆర్ఎస్)న్ని అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలల్లో బోధన, బోధనేతరులు, విద్యార్థులకు ఈ విధానం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, సిబ్బంది హాజరు నిజసమయంలో ట్రాక్ చేయటా నికి, అవకతవకలకు అడ్టుకట్టవేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ విధానంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల విద్యార్థుల ఫొటోలు తీసి, ఆధార్, ఫోన్ నంబర్, చిరునామా, తరగతి తదితర వివరాలు యాప్లో అప్లోడ్ చేయనున్నారు. యాప్లోని మొబైల్ ఫోన్ పరికరాల్లో విద్యార్థి ముఖం చూపిస్తే హాజరు నమోదవుతుంది. ఏరోజు ఎంతమంది విద్యార్థులున్నారు?.. మిగతావారు ఎందుకు రాలేదు? హాజరు సంబంధ సమాచారంతోపాటు హాస్టల్ సంక్షేమ అధికారుల అలసత్వం, నిర్వహణ లోపాలు తెలవనున్నాయి. తద్వారా అధికారులు చర్యలు చేపట్టే అవకాశముంది. ఈ విధానంతో బోగస్ హాజరుకూ చెక్ పడనుంది. కొరవడిన పర్యవేక్షణసంక్షేమ హాస్టళ్లలో పర్యవేక్షణ కొరవడడంతో నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. సాంకేతికతో ముందుకు వెళ్తున్న తరుణంలో (ఆన్లైన్ హాజరు అమలులోకి ఉన్నప్పటికీ) పాత పద్ధతితో (మాన్యువల్ రిజిస్టర్) సరిపెడుతున్నారు. దీంతో ఎంత మంది విద్యార్థులు వసతిగృహాల్లో ఉంటున్నారు?.. ఎంత మంది బయటకు వెళ్లారో లెక్క తేలడం లేదు. వసతిగృహాల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నా.. ఎక్కువ చూపుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. జిల్లాలో ఎస్సీ ప్రీమెట్రిక్ వసతి గృహలు 17, పోస్టుమెట్రిక్ వసతి గృహాలు ఎనిమిది ఉన్నాయి. ప్రీమెట్రిక్లో 1,208 మంది, పోస్టుమెట్రిక్లో 910 మంది వరకు విద్యార్థులున్నారు. 18 బీసీ పోస్టు మెట్రిక్, పోస్టు మెట్రిక్ వసతిగృహాల్లో 1,420 మంది విద్యారులుంటున్నారు. 16 ఎస్టీ ఆశ్రమ పాఠశాల్లో 2,600 మంది విద్యార్థులున్నారు. ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో గతేడాది ఎఫ్ఆర్ఎస్ ప్రక్రియ ప్రారంభించినా నామమాతంగా అమలవుతోంది. దీంతో విద్యార్థుల హాజరుపై పర్యవేక్షణ లేకుండా పోతోంది.లెక్క పక్కాగా..ఎఫ్ఆర్ఎస్ అమలులోకి వస్తే వసతిగృహాల్లో సంక్షేమాధికారులు, సిబ్బంది విధులకు డుమ్మా కొట్టేందుకు ఆస్కారముండదు. జిల్లాలో కొంతమంది వసతిగృహాల అధికారులు స్థానికంగా ఉండడంలేదు. వీలు దొరికనప్పుడల్లా వసతిగృహాలకు వెళ్లిరావటం.. కింది స్థాయి సిబ్బందితో పనులు చక్కబెట్టుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇదివరకు నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినా నిర్వహణ లేక మూలన పడ్డాయి. కళాశాలలో మాదిరిగా ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు భద్రత, సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా నిఘా నేత్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ఆర్ఎస్ ద్వారా విద్యార్థుల సంఖ్య, భోజన సమయంలో హాజరు, వసతిగృహ అధికారులు, సిబ్బంది ఎఫ్ఆర్ఎస్ ముందు నిలబడితే తెలిసిపోనుంది. భోజనంలో అవకతవకలు, విద్యార్థుల లెక్కల్లో తికమకకు తెరపడనుంది. -
పకడ్బందీగా ధాన్యం సేకరించాలి
మంచిర్యాల అగ్రికల్చర్: ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం సేకరణ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల కమిషనర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాలు, మార్కెటింగ్, సహకార, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ, రవాణా, పోలీస్ శాఖల అధికారులతో ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ వరి ధా న్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఏ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. సన్న రకం వడ్లకు మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రైతులకు కనీస మౌలిక వసతులు కల్పించడంతోపాటు నిర్ణీత వ్యవధిలో చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.చంద్రయ్య, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ పాల్గొన్నారు. -
నేడు కల్వరీ ఉపవాసదీక్షల విరమణ
కాసిపేట: మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ శివారులో గురువారం కల్వరీ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉపవాస దీక్షల విరమణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముగింపు ప్రార్థన సమావేశాలకు క్రైస్తవులు అధిక సంఖ్యలో తరలి రానుండడంతో భారీ ఏర్పాట్లు చేశారు. పాస్టర్ ప్రవీణ్ ఉపవాస దీక్షల విరమణ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి క్రైస్తవులు తరలి రావడంతో సోమగూడెం బెల్లంపల్లి ప్రధాన రహదారి జనసంద్రగా మారింది. సుమారు రెండు లక్షల మంది హాజరు కానుండడంతో ముందస్తు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. -
సీఎంఆర్ లక్ష్యం పూర్తి చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని రైస్మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్ర య్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరా వు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి రైస్మిల్లర్లతో ల క్ష్యసాధనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ వరిధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, బ్యాంకు గ్యారంటీ, డిఫాల్టర్గా ఉన్న రైస్మిల్లులకు ధాన్యం కేటాయించబోమని స్పష్టం చేశారు. కేజీబీవీ ఆకస్మిక తనిఖీమంచిర్యాలరూరల్(హాజీపూర్)/లక్సెట్టిపేట: హాజీపూర్ మండలం కర్ణమామిడిలోని కేజీబీవీని కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంట్రాక్టర్ రేషన్ సరుకులు, కూరగాయలు పంపించడం లేదని వెలువడిన కథనాల మేరకు స్పందించిన కలెక్టర్ తనిఖీలు చేపట్టారు. వంటగదిలో రేషన్ సరుకులు, కూరగాయల నిల్వలపై ఆరా తీసి కాంట్రాక్టర్ గురించి తెలుసుకున్నారు. బిల్లులు ఖాతా లో జమ అయ్యాయని, దీంతో సరుకులు పంపించారని ఎస్వో స్వప్న కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తరగతి గదుల్లో బోధనను పరిశీలించి విద్యార్థుల సామర్థ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. లక్సెట్టిపేటలోని కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, వంటశాల, మధ్యాహ్న భోజనం నాణ్యత, రిజిస్టర్లు, పరిసరాలు పరిశీలించారు. -
రేపు ఏఐసీసీ పరిశీలకుడి రాక
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: డీసీసీ(జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్ష పదవికి ఎంపిక కోసం కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల కాంగ్రెస్ క మిటీ ఏఐసీసీ పరిశీలకులు డాక్టర్ నరేశ్కుమార్ తన కార్యాచరణ ప్రారంభించారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్తో సహా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరా ల సురేఖను కలిశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఆయనను కలవలేకపోయారు. ఈ మేరకు జిల్లాలో డీసీసీ అధ్యక్ష ఎంపిక కోసం నాయకుల అభిప్రాయ సేకరణతో సహా పార్టీ నాయకులకు జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న వారితో ఒక్కొక్కరితో మాట్లాడే విధంగా షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16న మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు ఫారాలు అందజేస్తారు. అదే రోజు మీడియా సమావేశం నిర్వహిస్తారు. 17న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఫారెస్ట్ గెస్ట్హౌజ్ వద్ద ఆ జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న నాయకు లతో ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడతారు. అదే రోజు మధ్యాహ్నం బెల్లంపల్లి నియోజకవర్గ నాయకులతో, 18న చెన్నూర్ నియోజకవర్గ నాయకులతో, 19న మంచిర్యాల జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారితో విడివిడిగా మాట్లాడనున్నారు. 20న హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. -
భూ చిక్కులకు చెక్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూమి కొలతలు, సర్వేలు, హద్దుల నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించే సర్వేయర్ల కొరత తీరనుంది. కొత్తగా లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం ప్రభుత్వం ఎంపిక ప్రక్రియ చేపట్టింది తెలిసిందే. గ్రామాల వారీగా ప్రభుత్వ ఆమోదిత లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన అధికారులు గత జూలైలో వీరికి పరీక్షలు నిర్వహించారు. తొలివిడతలో 331మంది దరఖాస్తు చే సుకోగా అర్హతలున్న 129మంది పరీక్షలు రాశారు. వీరిలో 99మంది ఆసక్తి చూపగా 40రోజుల పాటు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. రెండో విడతలో 169 దరఖాస్తులు రాగా, వీరిలో 135మంది పరీక్షలు రాశారు. వీరికి ఇంకా శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అయితే తొలి దశ సర్వేయర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ స్థానిక ఎన్నికలు, కోడ్ కారణంగా ముందుకు సాగలేదు. తాజాగా ఎన్నికలు వాయిదా పడి కోడ్ లేకపోవడంతో సర్వేయర్ల సేవల్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి లైసెన్స్ పొందిన సర్వేయర్ల సేవలు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో జిల్లాలో సర్కారు ఆమోదిత సర్వేయర్లు పల్లెల్లో సర్వే శాఖకు అందుబాటులోకి రానున్నారు. వేధిస్తున్న కొరతజిల్లాలో రెవెన్యూ శాఖ పరిధిలో సర్వేలు, భూ హ ద్దులు, వివాదాలు, కొలతల నిర్ణయాలకు అనేకంగా దరఖాస్తులు వస్తున్నాయి. అయితే సరిపడా సర్వేయర్లు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 18 రెవెన్యూ మండలాల పరిధిలో సగం మంది కూడా సర్వేయర్లు లేరు. ఇన్చార్జీలతో నెట్టుకురావాల్సి వ స్తోంది. ఒక్కో సర్వేయర్ రెండేసి మండలాలు బాధ్యతలు చూస్తుండగా వీరిపై అదనపు భారం ఉంది. వీటితో పాటు జిల్లాలో భూ సేకరణ కోసం, సింగరేణి బొగ్గు గనుల కోసం, పరిహారం చెల్లింపుల కోసం సర్వేయర్ల అవసరమేర్పడుతోంది. వీటికి తోడు జాతీయ రహదారుల నిర్మాణం కోసం వందల ఎకరాల్లో భూములు సేకరించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సర్వేయర్లు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో భూ సేకరణ సమయంలో స ర్వే చేయకపోవడంతో జాప్యం జరుగుతోంది. వీటితో పాటు రైతులు తమ భూముల హద్దుల విషయంలోనూ అర్జీలు ఇస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, అటవీ భూములు ఇతర వివాదాలు ఏర్పడినప్పుడు సర్వేయర్లు ఇచ్చే నివేదిక ప్రధానంగా మారుతోంది. ఈ క్రమంలో జిల్లాలో కొత్తగా లైసెన్స్డ్ సర్వేయర్లు అందుబాటులోకి వస్తే చాలా వరకు రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది. తొలి విడత సర్వేయర్లకు శిక్షణ పూర్తి జిల్లాలో తొలివిడత సర్వేయర్ల శిక్షణ పూర్తయింది. రెండో విడత పరీక్ష రాసిన వారు శిక్షణ పూర్తి చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు లైసెన్స్ డ్ సర్వేయర్ల సేవలు అందుబాటులోకి తెస్తాం. – వీ శ్రీనివాస్, ఏడీ, సర్వే లాండ్ రికార్డ్స్ -
‘బొర్లకుంట’ వర్సెస్ ‘గోమాసే’
సాక్షి ప్రతినిఽధి, మంచిర్యాల: క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న బీజేపీలో జిల్లా నాయకుల మధ్య దూషణల పర్వం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్రావు ఎదుటనే మాజీ ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత, గోమాసే శ్రీనివాస్ మధ్య పరస్పర మా టల యుద్ధం పార్టీలో అనైక్యతను బయటపెట్టింది. వేమనపల్లి మండలం నీల్వాయిలో ఆత్మహత్య చేసుకున్న పార్టీ మండలాధ్యక్షుడు ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో సహా జిల్లా నాయకులు కింద కూర్చుని ఉన్నా రు. కింద కూర్చున్న వెంకటేశ్నేతను పక్కకు జరు గు అనే క్రమంలో ‘గోమాసే’ మొదట ఓ మాట తూ లాడు. ‘నన్నే అరేయ్ అంటావా.. చెంప పగులు త ది’ అంటూ వెంకటేశ్నేత ఆయనపై ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇందుకు ప్రతిగా ‘గోమాసే’.. ‘బట్టలూ డదీసి కొడతా’ అంటూ ఊగిపోయారు. ఇరువురు కాసేపు ఏయ్.. అంటే ఏయ్.. అనుకుంటూ పరస్పర దూషణలకు దిగారు. ఇరువురు కోపంతో ఉన్న క్రమంలో ఇంకా పరిస్థితి చేజారకుండా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్గౌడ్, నాయకులు దుర్గం అశోక్, రజనీశ్జైన్తో సహా పలువురు వారిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. అయితే పరామర్శకు వెళ్లిన సమయంలో ముఖ్య నాయకులే ఇలా ఒకరిపై ఒకరు విచక్షణ కోల్పోయి నోరు జారడంపై అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. మరోవైపు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నాయకులు అభాసుపాలయ్యారు. ‘గోమాసే’ గత లోక్సభ ఎ న్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలు కాగా, వెంకటేశ్ నేత ఎంపీ ఎన్నికల ముందే కాంగ్రెస్ను వదిలి బీజేపీలో చేరారు. ఇరువురికి లోక్సభ ఎన్నికల ముందు నుంచే ఎంపీ టికె ట్ కోసం వైరం ఉండగా, ఈ ఘటనతో తాజాగా మరోసారి బయటపడినట్లయింది. -
అమ్మో.. పులి
భీమిని: మండలంలోని చిన్నతిమ్మాపూర్ తంగెళ్లపల్లి మధ్యలోగల ఎర్రవాగు సమీపంలో పులి అడుగులు కనబడటంతో స్థానికులు భ యాందోళనకు గురవుతున్నారు సోమవా రం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం బిబ్రా, పెసరికుంట గ్రామాల సమీపంలోని పంట చేలలో పులి పాదముద్రలు కని పించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడి నుంచి మంగళవా రం భీమిని మండలం వైపు రావడంతో గ్రా మస్తులు భయాందోళన చెందుతున్నారు. దీంతో అటవీశాఖ అధికారులు స్పందించి పులి బారి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
పిల్లలకు పోషకాహారం ఇవ్వాలి
జన్నారం: పెరిగే పిల్లలు, గర్భిణులకు పోషకాహా రం అందించాలని జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యూవో) రవూఫ్ ఖాన్ పేర్కొన్నారు. రాష్ట్రీయ పోషణ మాసంలో భాగంగా మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని టీడీసీలో జన్నారం, దండేపల్లి మండలాల గర్భిణులు, బాలింతలు, అంగన్వాడీ పిల్లల తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. వివిధ రకాల పోషకాహారానికి సంబంధించిన ఫుడ్స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేశారు. అనంతరం డీడబ్ల్యూవో మాట్లాడుతూ.. పోషకాహారం అందిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటా రని తెలిపారు. గర్భిణులు పోషకాలు తీసుకుంటే కడుపులోని పిల్లలకు అందుతాయని సూచించారు. గ్రామాల్లోని అంగన్వాడీ టీచర్లు ఎప్పటికప్పుడు పరిశీలించి, సుచనలు ఇవ్వాలని తెలిపారు. సీడీపీవో రేష్మా, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, ఏసీడీపీవో ప్రియదర్శిక, సూపర్వైజర్లు పద్మ, దీపవాహిని, కవిత, రమాదేవి, వెంకటలక్ష్మి, పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ లక్ష్మి, వుమెన్ హబ్ లిప్సిక, విజయ, రెండు మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు. -
ముంపు బాధితులకు పరిహారం
చెన్నూర్: కాళేశ్వరం బ్యాక్ వాటర్తో వేలాది ఎకరా ల్లో పంటలు నీట మునిగి నష్టాల పాలవుతున్న రై తులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకువచ్చింది. ఇందుకు రూ.33.50కోట్లు మంజూరు చే యగా, ప్రస్తుతం రూ.10 కోట్లు విడుదలయ్యాయి. వీటిని రెండు నెలల్లో రైతులకు పరిహారం కింద పంపిణీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ను కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. దీంతో ఐదేళ్ల పాటు వరద ముంపుతో బి క్కుబిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్న కొందరు రై తులు ప్రభుత్వ నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేస్తుండగా మరికొందరు ఆందోళన చెందుతున్నారు. గతంలో అధికారుల తప్పిదాలుకాళేశ్వరం బ్యాక్ వాటర్తో ఐదేళ్లకు పైగా చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, జైపూర్ మండలాల్లోని వేలా ది ఎకరాల పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోతున్నారు. బ్యాక్ వాటర్ ముంపు గ్రామాల ఎంపికలో అప్పటి ఇంజినీరింగ్ అధికారుల తప్పిదాలతో వీరికి ఈ దుస్థితి తలెత్తింది. వరద ముంపు సర్వేలో కొన్ని గ్రామాలనే పరిగణనలోకి తీసుకున్నారు. చె న్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాల్లోని 950.22 ఎ కరాలకే పరిహారం ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో కోటపల్లి, వేమనపల్లి, చెన్నూర్ మండలాల రైతులకు తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదముంది. దేవులవాడలో 264 ఎకరాలకు..కోటపల్లి మండలం దేవులవాడ శివారులోని 264 ఎకరాల పంట చేన్లకు ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇటీవల చెన్నూర్లో జరిగి న సమావేశంలో బ్యాక్ వాటర్ బాధితులకు డిసెంబర్లో పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి వివేక్ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసిన విష యం తెలిసిందే. దీంతో రెవెన్యూ అధికారులు దేవులవాడలో రైతుల వివరాలు సేకరిస్తున్నారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వంతో మాట్లాడి పరిహారం పంపిణీ వ్యవహారాన్ని కొలిక్కితెచ్చారు. నాడు చెన్నూర్, జైపూర్లో..కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా కాళేశ్వరం బ్యారేజ్ నుంచి సుమారు 52కిలో మీటర్ల మేరకు చెన్నూర్, జైపూర్, కోటపల్లి మండలాల్లోని నష్టపో యే పంట భూములను అధికారులు గుర్తించారు. 2016లో చెన్నూర్, జైపూర్ మండలాల్లోని 692.22 ఎకరాలకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. ఇందులో చెన్నూర్ మండలం సుందరశాల, సర్సక్కపేట, పొక్కూర్ గ్రామాల్లోని భూములకు ఎకరాకు రూ.8.40 లక్షల చొప్పున రైతులకు పరిహారం చెల్లించారు. సుందరశాలలోని మరో ఆరెకరాలకు రూ.4.60 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. చెన్నూర్ మండలంలోని భీరెల్లి, నాగపూర్, సోమనపల్లి, జైపూర్ మండలం శివ్వారం గ్రామాల భూములకు రూ.10.60 లక్షల చొప్పున అందజేశారు. ముంపు గ్రామాలివే..చెన్నూర్ మండలంలోని వెంకంపేట, నారాయణపు రం, చెన్నూర్లోని గోదావరి పరిహార ప్రాంతం, శివలింగాపూర్, కోటపల్లి మండలంలోని రాంపూర్ రాపన్పల్లి, అన్నారం, వెంచపల్లి, కోల్లూరు, వెంచపల్లి గ్రామాలున్నాయి. ఈ గ్రామాల రైతులు మూ డో విడత పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు.రెండో విడతకు కసరత్తుప్రాజెక్ట్ బ్యాక్ వాటర్తో ముంపునకు గురయ్యే భూములను గుర్తించిన అప్పటి ప్రభుత్వం చెన్నూర్, జైపూర్ మండలాల రైతులకు పరిహా రం ఇచ్చి చేతులు దులుపుకొంది. ప్రాజెక్ట్ ముంపులో కోటపల్లి మండలం ఉన్నప్పటికీ పరిహా రం ఇవ్వలేదు. మంత్రి వివేక్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. పరిహా రం అందించేలా కృషి చేశారు. దీంతో రెండో విడత పరిహారం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కోటపల్లి మండలం దేవులవాడ శివారులో 264 ఎకరాలు, 80 మంది రైతులను గుర్తించారు. పరిహారం ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు రెండురోజులుగా రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఎకరాకు రూ.12.50 లక్షలు ఇచ్చేందుకు గతంలో భూములు పరిశీలించిన అధికారులు తెలిపినట్లు రైతులు పేర్కొన్నారు. ఐదేళ్లుగా నష్టపోతున్న నాది కోటపల్లి మండలంలోని అన్నారం. నాకు 11ఎకరాల భూమి ఉంది. ఏటా కాళేశ్వరం వరద ముంపుతో పంట నీట మునిగి ఏడాదికి రూ.మూడు లక్షల వరకు నష్టపోతున్న. రెండో విడత దేవులవాడకు పరిహారం ఇస్తున్నరు. మూడో విడతలోనైనా మాకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – గొడిసెల శశిపాల్రెడ్డి, రైతు, అన్నారంమాకెప్పుడిస్తరు ఏటా ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఈ సారి 4నుంచి 5క్వింటాళ్లు కూడా వస్తలేదు. నాలుగేళ్ల నుంచి అప్పులపాలయ్యా. ఈ ఏడాది నిండా ముంచింది. బ్యారేజీ నిర్మించి నుంచి పంటలు దెబ్బతింటున్నయ్. ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుని పరిహారం ఇవ్వాలి. – మేకర్తి రాజేశ్, రైతు, రాంపూర్ -
విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సంక్షేమ శాఖ అధికారులతో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలను కలెక్టర్లు నిరంతం పర్యవేక్షించాలని, విద్యార్థులకు అందిస్తున్న బోధన, ఆరోగ్యం, భోజనం, ఇత ర మౌలిక వసతుల అమలు గురించి తెలుసుకోవా లని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లే కుండా బోధన కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై సంబంధిత శాఖల అధికా రులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బో ధన, ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షించాలని, ఆ యా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఈవో యాదయ్య, సంక్షేమశాఖల అధికారులు దుర్గాప్రసా ద్, నీరటి రాజేశ్వరి, పురుషోత్తం తదితరులున్నారు. -
కాకో ఆలయం వద్ద భక్తుల సందడి
దండేపల్లి: తెలంగాణలోనే ఏకై క ఆలయంగా ప్రసిద్ధి చెందిన మండలంలోని గుడిరేవు గోదావరి నది ఒ డ్డునున్న ఆదివాసీల ఆరాధ్యదైవం శ్రీపద్మల్పురి కా కో ఆలయంలో దండారీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ఆలయానికి భక్తుల తాకి డి పెరగింది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి ఆదివాసీలు అధికసంఖ్యలో తరలివచ్చారు. కాకోను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో గుస్సాడీల నృత్యాలు ఎంతగానో అలరించాయి. రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి కాకోను దర్శించుకుని పూజలు చేశారు. కాకోను దర్శించుకుంటున్న రాష్ట్ర చైర్మన్ తిరుపతి నృత్యం చేస్తున్న గుస్సాడీలు -
అద్దె కారు తిరిగివ్వని ఇద్దరు..
ఆదిలాబాద్టౌన్: కారు అద్దెకు తీసుకొని తిరిగి ఇవ్వని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. మంగళవారం వన్టౌన్ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. 2025 మార్చి 28న సునార్ గల్లికి చెందిన అన్నదమ్ములు ముమ్మడివార్ రాకేష్, ముమ్మడివార్ కృష్ణ హైదరాబాద్కు వెళ్తామని చెప్పి రవీంద్రనగర్కు చెందిన బొడ్గం రాజేశ్ వద్ద కారు అద్దెకు తీసుకున్నారు. ఇప్పటి వరకూ తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. -
పాఠశాల ఆవరణలో నాగుపాము కలకలం
నిర్మల్ఖిల్లా: జిల్లా కేంద్రంలోని వెంకటపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం నాగుపాము కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం ఇంటర్వెల్ సమయంలో మూత్రశాలల సమీపంలో నాగుపామును గమనించిన విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులతో చెప్పా రు. ప్రధానోపాధ్యాయురాలు సుహాసిని శాంతినగర్ కాలనీకి చెందిన స్నేక్క్యాచర్ గిరిగంటి అనిల్కు సమాచారం అందించడంతో చాకచక్యంగా పామును బంధించి అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ సందర్భంగా స్నేక్క్యాచర్ అనిల్ను అభినందించారు. -
ఆత్మీయం.. ఆదివాసీ వైభవం
దండేపల్లి మండలం గుడిరేవులోని ఏత్మాసూర్ పద్మల్పురి కాకో ఆలయంగుస్సాడీలు అశ్వీయుజ పౌర్ణమి మరుసటి రోజు భోగితో మాలధారణ చేసి పది రోజుల పాటు కఠినదీక్ష చేపడతారు. దీక్ష పూర్తయ్యే వరకు స్నానం ఆచరించరు. ఒంటిపై చుక్క నీరుకూడా పడకుండా.. కాళ్లకు చెప్పులు ధరించకుండా.. ఒంటిపై ఎలాంటి వస్త్రాన్ని కప్పుకోకుండా అర్ధనగ్నంగానే గడుపుతారు. నేలపైనే కూర్చోవడం, నేలపైనే పడుకోవడం వారి ఆచారం. గుస్సాడీల్లో పోరీలది మరింత ప్రాముఖ్యత. సీ్త్ర వేషధారణలో ఉండే యువకులను ఆదివాసీలు పోరీలు అని పిలుస్తారు. వారు ఏ ఊరికి వెళ్లినా.. ఏ ఇంటిని సందర్శించినా మహిళలు మంగళహారతులు ఇచ్చి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆరాధ్యదైవం ఏత్మాసూర్ పద్మల్పురి కాకో ఆదివాసీలకు పెద్ద పండుగ దీపావళి.. ఇందులో భాగంగానే గోండులకు ఆరాధ్యదైవమైన ఏత్మాసూర్ పద్మల్పురి కాకో ఆలయానికి భక్తజన దండు కదులుతుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలో కొలువై ఉన్న పద్మల్ పురి కాకో ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల నుంచి ఆదివాసీలు అధికసంఖ్యలో తరలివస్తారు. గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకుంటారు. గుస్సాడి టోపీ ప్రత్యేకం గుస్సాడీ టోపీలను నిపుణులైన గోండులు, కొలాంలు తయారు చేస్తారు. నెమలి ఈకలను సేకరించి వాటి తెల్లని కాడలను అల్లికగా మెలివేసి తలకు పట్టే ఒక చిన్న వెదురు బుట్ట అంచు చుట్టూ గట్టిగా కుట్టేసి, నెమలి పింఛాలు పై వైపు అందంగా బయటకు గుండ్రని బుట్టలాగా విస్తరిస్తూ, కదిలినప్పుడు విలాసంగా ఊగేలా ఏర్పాటు చేస్తారు. టోపీకి చుట్టూ ముఖ్యంగా ముందు వైపు, పలు వరుసల్లో, పెద్ద అద్దాలతో, రంగురంగుల జరీ దారాలు, చక్కటి డిజైన్లు ఉన్న గుడ్డపట్టీలతో, పలు ఆకారాల రంగురంగుల చెమ్కీ బిళ్లలు, చిన్ని గంటల మాలలతో, కొన్నిసార్లు రెండు వైపులా జింక కొమ్ములతోనూ అలంకరిస్తారు. ఆదివాసీల మధ్య ఆత్మీయ బంధం దండారీ అంటేనే ఐకమత్యానికి నిదర్శనం. ఈ పండుగ వేళ ఆదివాసీ గ్రామాల గిరిజనం ఒక ఊరి నుంచి మరో ఊరికి విడిది వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రంతా నృత్యం చేస్తూ రేలారె రేలా పాటలతో పాటు గోండి హాస్యపు నాటికలు ప్రదర్శించి వినోదాన్ని అందిస్తారు. తెల్లవారుజామునే కాలకృత్యాలు తీర్చుకుని మాన్కోలాతో నృత్య ప్రదర్శనలు చేసి సాయంత్రం సార్కోలాతో ముగిస్తారు. ఈ సందర్భంగా ఆదివాసీలు అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసి వీడ్కోలు పలుకుతారు. అలా చేయడం ద్వారా రెండు గ్రామాల మధ్య సత్సంబంధాలు, బాంధవ్యాలు పెరుగుతాయని ఆదివాసీ పటేళ్లు పేర్కొంటున్నారు. నాలుగు సగల పేరిట ఉత్సవాలు దండారీ పండుగలో ఏత్మాసార్ పేన్ పేరిట గిరిజనులు నాలుగు సగ(గోత్రం)లలో ఉత్సవాలు జరుపుకుంటారు. నాలుగు సగల అంటే గుమ్మేల, ఐదు సగల వారు అంటే ఫర్ర, ఆరు సగల వారు అంటే కోడల్, ఏడు సగల వారు అంటే తపల్ పేరిట ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. వేడుకల్లో భేటికోలా, మాన్కోలా, సదర్కోలా, కోడల్కోలా, సార్కోలా, కలివల్కోలా నృత్యాలు చేయడం ఆదివాసీలకే సొంతం. పేర్లు ఎంత వైవిధ్యంగా ఉన్నాయో వారి ఆటపాటలు కూడా అంతే వైవిద్యంగా సాగుతాయి. చచోయ్ ఇట్ కోలారా.. దేనే దేనారా.. రేలా.. రేలా.. లాంటి ఆట పాటల నడుమ ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతాయి. కొలబొడితో ముగింపు దీపావళి రెండు రోజుల తరువాత గురువారం కొలబొడితో ఈ దండారీ వేడుకలు ముగుస్తాయి. ఈ సందర్భంగా దండారీ బృందం ఇంటింటికీ వెళ్లగా గృహిణి ఓ పల్లెంలో ధాన్యాలు, తోచినంత నగదు ఉంచిన హారతిని వారికి అందిస్తుంది. దానిని వారు సంతోషంగా స్వీకరించి ఇంట్లో అందరూ బాగుండాలని, పాడిపంటలు సమృద్ధిగా పెంపొందాలని ఆశీర్వదిస్తారు. పాటలు పాడుతూ హారతి పూజ ఇస్తారు. అనంతరం గ్రామ పొలిమేరలో ఉన్న ఇప్పచెట్టు వద్ద తమ ఇలవేల్పు అయిన భీందేవుని సన్నిధికి చేరుకుంటారు. తలకు ధరించిన నెమలి టోపీలను తొలగిస్తారు. గుస్సాడీ వేషధారణ, అలంకరణ వస్తువులను భీందేవుని సన్నిధిలో పెట్టి కోళ్ళు, మేకలను బలి ఇస్తారు. భీం దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం విందు భోజనాలతో కొలబొడి నిర్వహించి కార్యక్రమాన్ని ముగిస్తారు. ఆదివాసీ గూడేల్లో అంగరంగ వైభవంగా సాగే దండారీ సంబరం మొదలైంది. డప్పుల దరువులు, గజ్జెల మోతలు, గుస్సాడీ నృత్యాలతో అడవితల్లి మురిసి పోనుంది. ఆదివాసీల ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్ పేన్’ పేరిట చేసే ప్రత్యేక పూజలతో దండారీ పండుగ ప్రారంభమైంది. దీపావళికి ముందు అశ్వియుజ పౌర్ణమి మరుసటి రోజు భోగితో ప్రారంభమై కొలబొడితో ముగియనుంది. పక్షం రోజుల పాటు కొనసాగే ఉత్సవాలకు గూడేలన్నీ సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దండారిని ప్రత్యేక పండుగగా గుర్తించింది. – బజార్హత్నూర్ ప్రోత్సాహం అందించాలి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత సంవత్సరం రూ.15 వేలు అందించింది. ఈ సంవత్సరం కూడా ప్రోత్సాహకం అందించాలని జిల్లా సార్మేడీలు, కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాను కలిసి విన్నవించాం. – మేస్రం దుర్గు, జిల్లా సార్మేడి, ఉట్నూర్ పవిత్రమైన పండుగ మా ఆదివాసీ గోండు గిరిజనులకు దీపావళి పవిత్రమైన పండుగ. ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకుంటాం. గిరిజన దేవతలను, వన దేవతలను పూజిస్తాం. బంధువుల ఇళ్లకు వెళ్తాం. గుస్సాడీల థింసా నృత్యం, ఆడపడుచుల రేలారేరేలా నృత్యం ఆకట్టుకుంటాయి. – కొడప భీంరావ్ పటేల్, చింతలసాంగ్వీఘనంగా జరుపుకుంటాం దీపావళికి పక్షం రోజుల ముందే అన్నీ సిద్ధం చేసుకుంటాం. ఎంత పేద గిరిజనుడైనా ఈ పండుగకు ఇంటిని శుభ్రపరచడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, పిండివంటలకు సామగ్రి సమకూర్చుకుంటారు. నెమలి ఈకలతో టోపీలు తయారు చేసుకుంటాం. దండారీ ఘనంగా జరుపుకుంటాం. – కనక లంకు మహాజన్, తుమ్ముగూడ, ఇంద్రవెల్లి -
బాసర ఆలయ హుండీ లెక్కింపు
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ హుండీని మంగళవారం లెక్కించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనాదేవి తెలిపారు. 83 రోజులకు రూ.81,69,099 నగదు, 91 గ్రాముల 500 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, మూడు కిలోల 500 గ్రాముల మిశ్రమ వెండి, 79 విదేశీ కరెన్సీ నోట్లు సమకూరినట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పాఠక్, ఏఈవో సుదర్శన్ పర్యవేక్షకులు శివరాజ్, తదితరులు పాల్గొన్నారు. 108 ఈఎంటీకి ఉత్తమ సేవా పురస్కారంఉట్నూర్రూరల్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 108 సిబ్బందికి రాష్ట్ర ఎంఆర్ఐ సంస్థ అందించే ఉత్తమ సేవా పురస్కారానికి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ 108లో మెడికల్ టెక్నీషియన్గా పనిచేస్తున్న గణేశ్ ఎంపికయ్యారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఖుష్బూ గుప్తా చేతుల మీదుగా పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్, జిల్లా ఇన్చార్జి రాజశేఖర్, పైలట్ సుందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
దాడి కేసులో నలుగురి రిమాండ్
జైపూర్: మండలంలోని వేలాలలో జరిగిన దాడి కేసులో నలుగురిని రిమాండ్కు తరలించినట్లు శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపారు. గ్రామంలో ప్యాగ రాజ సమ్మయ్య, అతని సోదరులకు 33 గుంటల భూమి ఉంది. ఆ భూమి విషయంలో అన్న మైసయ్య, అతని కుమారులు సమ్మయ్య, నగేష్, మల్లేశ్తో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అందులో ఇటీవల మైసయ్య ఇల్లు నిర్మాణం చేపట్టగా రాజ సమ్మయ్య కుమారులు శ్రీనివాస్, సంతోష్, భార్య మల్లక్క భూమి వద్దకు వెళ్లి భూమిని పంచుకున్న తర్వాత ఇల్లు కట్టుకొమ్మన్నారు. ఈ విషయంలో సమ్మయ్య, నగేష్, మల్లేశ్, లక్ష్మి వారిపై దాడికి పాల్పడ్డారు. బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
తిర్యాణి: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామానికి చెందిన కల్పన (28)కు తిర్యాణి మండలంలోని గంభీరావుపేటకు చెందిన సైదం శేఖర్తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్లుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో కల్పన పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించడంతో ఇటీవల మళ్లీ అత్తారింటికి వచ్చింది. సోమవారం మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తన కుమార్తె మృతికి అల్లుడే కారణమని మృతురాలి తల్లి దేవక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
33వ రోజుకు కార్మికుల సమ్మె
ఉట్నూర్రూరల్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఐటీడీఏ కార్యాలయం ఎదుట కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. మంగళవారం గిరిజన సంఘాలు, వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు మాట్లాడుతూ సమ్మె చేపట్టి 33 రోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మద్దతు తెలిపిన వారిలో కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనేరావు, కుంర రాజు, భీంరావు, సంజయ్, విజయ్, బీఆర్ఎస్ నాయకులు కొమ్ము విజయ్, కాటం రమేశ్, ధరణి, రాజేశ్, బాజీరావు, దావుల రమేశ్, తదితరులు ఉన్నారు. -
మనస్తాపంతో ఒకరు..
దండేపల్లి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని గుడిరేవు గ్రామానికి చెందిన పూసాల రాజు (36) ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్య రాజేశ్వరితో గొడవపడటంతో రెండు రోజుల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన రాజు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం చిట్టీడబ్బులకోసం వెళ్లిన వ్యక్తి చూడగా ఉరేసుకుని కనిపించాడు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఐటీఐ గేట్కు తాళం వేసి నిరసన
మంచిర్యాలఅర్బన్: 2022–24 విద్యాసంవత్సరానికి సంబంధించిన కోర్సు ఫీజు చెల్లించినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో మంగళవారం డింపి ఐటీఐ గేట్కు తాళం వేసి విద్యార్థులు నిరసన తెలిపారు. కళాశాల చైర్మన్ వచ్చారన్న సమాచారంతో వెళ్లి సర్టిఫికెట్లు అడిగితే దాటవేత సమాధానం ఇవ్వడంతో గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పీడీఎస్యూ, ఏఐఎస్బీ, జేవీఎస్ విద్యార్థి సంఘాల నేతలు శ్రీకాంత్, వంశీ వారికి మద్దతు తెలిపారు. ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కళాశాల యజమానులను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లగా విద్యార్థులు, విద్యార్థిసంఘాల నేతలు కూడా అక్కడికి వెళ్లారు. కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్ మధ్య డబ్బుల వివాదంతో సర్టిఫికెట్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి వరకు సర్టిఫికెట్ల సమస్య పరిష్కారంపై కొలిక్కిరాలేదు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
మళ్లీ బెబ్బులి అలజడి
దహెగాం: రెండు సంవత్సరాలుగా పులి అలజడి లేక దహెగాం మండలం స్తబ్దతగా ఉంది. ఇటీవల మండలంలోని బీబ్రా, పెసరికుంట గ్రామాల సమీపంలో పంట చేలలో పులి పాదముద్రలు కనిపించడంతో రైతులు, సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సోమవారం పెసరికుంట బస్టాప్ సమీపంలో పంట పొలాల వద్ద పులి పాదముద్రలు గమనించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. టైగర్ ట్రాకింగ్ టీం సభ్యులు గ్రామానికి చేరుకుని పరిశీలించి పులి పాదముద్రలేనని నిర్థారించారు. పులి ఎటు వైపు వెళ్లిందోనని సభ్యులు ట్రాకింగ్ చేపట్టారు. పెసరికుంట, బీబ్రా వైపు వచ్చింది కొత్త పులి అని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర నుంచి సిర్పూర్(టీ), కడంబా, ఈస్గాం మండలం సార్సాల మీదుగా బీబ్రా వైపు వచ్చిందని, బీబ్రా నుంచి భీమిని మండలం చినగుడిపేట వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా మండలంలోని మురళీగూడ, పోలంపల్లి, జెండాగూడా, దుబ్బగూడ గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళన చెందుతున్నారు. మరో ఇరవై రోజుల్లో పత్తి తీత పనులు.. మరో ఇరవై రోజుల్లో మండలంలో పత్తి తీత పనులు ముమ్మరం కానున్నాయి. పులి సంచారంతో రైతులు, కూలీలు భయాందోళన చెందుతున్నారు. 2021 నవంబర్లో దహెగాం మండలంలోని దిగిడ గ్రామానికి చెందిన సిడాం విగ్నేష్, పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన మహిళా కూలీ, 2023 నవంబర్లో వాంకిడి మండలం ఖా నాపూర్ గ్రామానికి చెందిన ఒకరు, ఈస్గాం మండలం నజ్రుల్ నగర్ వద్ద మహిళ పెద్దపులి దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రతీ సంవత్స రం పత్తి తీత పనులు ప్రారంభ సమయంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులు స్పందించి పులి బారి నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఫైలేరియా వ్యాధి నిర్మూలిద్దాం
మంచిర్యాలటౌన్: జిల్లాలో ఫైలేరియా(బోదకాలు) వ్యాధిని పూర్తిగా నిర్మూలిద్దామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా కేంద్రంలోని రాళ్లపేట్లో ఫైలేరియా నియంత్రణపై టాస్–1 సర్వేను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఫైలేరియా నిర్ధారణకు ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాతమంచిర్యాల అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యుడు శివప్రతాప్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్, ఆరోగ్య కార్యకర్తలు సంతోశ్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, శ్రీనివాస్, పాల్గొన్నారు. -
ఐటీడీఏ ఎదుట 72 గంటల నిరసన
ఉట్నూర్రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్సోర్సింగ్ వర్కర్లు చేపట్టిన సమ్మె 32వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా సోమవారం యూనియన్ జేఏసీ పిలుపు మేరకు ఐటీడీఏ కార్యాలయం ఎదుట 72 గంటలపాటు ని రసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తె లంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ వర్కర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించడంతో పాటు టైంస్కేల్ వేతనాలు ఇవ్వాలని, కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, వారసత్వ ఉద్యోగాలు, త దితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యక్షుడు వెలిశాల కృష్ణమాచారి, టీఏజీఎస్ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొడసం శంభు, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, తొడసం వసంత్రావు, అడ శ్యాంరావు, రాంబాయి, తదితరులు పాల్గొన్నారు. నాయకుల అరెస్టుతో స్వల్ప ఉద్రిక్తత ఉట్నూర్రూరల్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చేపట్టిన నిరసన రాత్రి వరకు కొనసాగింది. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సమస్య విన్నవించి వెళ్లాలని చెప్పినా యధావిధిగా కొనసాగించారు.. దీంతో పోలీసులు పలువురిని స్టేషన్కు తరలించగా నాలుగో తరగతి ఉద్యోగులు ఐటీడీఏ ద్వారం వద్ద ధర్నాకు దిగారు. తమ నాయకులను పోలీసులు విడిచి పెట్టడంతో శాంతించారు. -
మొక్కుబడిగా పోషణ మాసోత్సవం
మంచిర్యాలటౌన్: చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న పోషణ మాసోత్సవం జిల్లాలో మొక్కుబడిగా సాగుతోంది. గత నెల 17న ప్రారంభం కాగా.. ఈ నెల 16వరకు నిర్వహించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బూత్ లెవల్ అధికారులుగా అంగన్వాడీ టీచర్లకు అదనపు విధులు కేటాయించడం, దసరా పండుగకు సెలవుల నేపథ్యంలో పోషణ మాసం నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. లక్సెట్టిపేట, బెల్లంపల్లి ప్రాజెక్టుల పరిధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల, చెన్నూర్ ప్రాజెక్టుల పరిధిలో అంతంత మాత్రంగానే సాగుతోంది. జిల్లాలో 969 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 4,245మంది గర్భిణులు, 3,186 మంది బాలింతలు, 39,229మంది చిన్నారులు ఉన్నారు. 39,229 మంది చిన్నారులను పరీక్షించి 1,282మంది తీవ్ర పోషకాహార లోపం, 199మంది అతి తీవ్ర పోషకాహారలోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. గర్భిణుల ఆరోగ్య రక్షణ, రక్తహీనత నివారణ, పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, పరిశుభ్రత వంటి పలు అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. బాలికలకు పోషకాహారం ప్రాముఖ్యత, పౌష్టికాహారం లేకపోతే ఎదురయ్యే రుగ్మతలపై అవగాహన కల్పించాలి. కానీ ఈ ఏడాది పూర్తి స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం లేదు. రోజుకో కార్యక్రమం పోషణ మాసం పురస్కరించుకుని ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో నెల రోజులపాటు రోజుకో కార్యక్రమం చేపట్టాలి. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల భాగస్వామ్యంతోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పిల్లల ఎత్తు, బరువు, కొలతలు సేకరించడం, గర్భిణుల బరువు, భుజం కొలతలను తీసుకోవడం, పోషకాహారంపై అవగాహన కల్పించి, రోగ నిరోధక శక్తిని పెంచడంపై దృష్టి సారించాలి. చిన్నారుల గ్రోత్ మానిటరింగ్లో తక్కువ బరువు ఉన్న పిల్లలకు వైద్య పరీక్షలు, మందులు, బాలామృతం, బాలామృతం ప్లస్ పంపిణీ చేసి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. ‘మీరు తినే ఆహారం మీ పెరుగుదల’ అనే అంశంపై పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు, ఆహార సమూహాలు, విటమిన్లు, రక్తహీనత, పరిశుభ్రతపై పలు కార్యక్రమాలు నిర్వహించి, హ్యాండ్వాష్ ప్రదర్శనలు, తల్లిదండ్రులతో సమావేశాలు, పిల్లల ఎదుగుదలకు అవసరమైన పౌష్టికాహారంపై నెలంతా కార్యక్రమాలు నిర్వహించాలి. నెలంతా ప్రతీ అంగన్వాడీ కేంద్ర పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సెక్టార్ల వారీగా కూడా చేపట్టకపోవడం, చివరి మూడు రోజుల్లో ప్రాజెక్టుల వారీగా ఒకేసారి నిర్వహించేలా అధికారులు ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. -
‘హామీల అమలుపై చేతెలెత్తేసిన కాంగ్రెస్’
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు అబద్దపు హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అమలు చేయకుండా చేతులెత్తేసిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు విమర్శించా రు. జిల్లా కేంద్రంలోని 43వ డివిజన్ రాంనగర్ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం ఆధ్వర్యంలో ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డులను మాజీ ఎమ్మెల్యే పంపిణీ చేశా రు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో మేలు జరుగుతుందని ఓట్లు వేసి గెలిపిస్తే, ఆ హామీలను తుంగలో తొక్కి మోసం చేసిందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. -
మంత్రాల పేరుతో బాలికపై లైంగిక వేధింపులు
ఆదిలాబాద్టౌన్: మంత్రాల పేరుతో బాలికను లైంగికంగా వేధించిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆదిలా బాద్ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలిక ఆరోగ్యం సరిగా లేకపోవటంతో కుటుంబ సభ్యులు గాదిగూడ మండలం మారెగాంకు చెందిన షేక్ కలీంను సంప్రదించారు. బాలికను పరిశీలించి దుష్టశక్తి సోకిందని నమ్మించాడు. బాలికను నిర్మల్ మండలం సోన్ వద్ద గల గోదావరి వద్దకు తీసుకెళ్లి పూజలు చేసి తీసుకొచ్చాడు. రెండు రోజుల క్రితం ఇంట్లో ఒంటరిగా అమ్మాయితో కొన్ని పూజలు చేయాలని నమ్మబలికి గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలుపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు, బ్లాక్ మ్యాజిక్ రిమైడీస్ యాక్ట్, మోసం తదితర కేసులు నమోదు చేసినట్లు వివరించారు. గోదావరిలో చిక్కుకున్న ఇద్దరు యువకులుకడెం: మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామ సమీ పంలోని గోదావరిలో చిక్కుకున్న ఇద్దరు యు వకులను గ్రామస్తులు కాపాడారు. మండలంలోని మద్దిపడగ గ్రామానికి చెందిన రాజ్కుమార్, రాజేశ్ సోమవారం లక్ష్మీసాగర్ గోదావరి రేవులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఎస్సారెస్పీ వరద గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో చుట్టూ నీళ్లు చేరాయి. దీంతో కుర్రులో ఉన్న యువకులు లక్ష్మీసాగర్ గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు గజ ఈతగాడి సహాయంతో కుర్రులో చిక్కుకున్న యువకులను తెప్పపై బయటకు తీసుకొచ్చారు. -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టా మంజూరు చేయాలని మందమర్రికి చెందిన అమృత, ఉపాధి కల్పించాలని నార్నూర్ మండలం భీంపూర్కు చెందిన తిరుపతి, ఉమ్రికి చెందిన సునీల్ ఎంబీబీఎస్ చదువులకు ఫీజు మంజూరు చేయాలని, ఆసిఫాబాద్కు చెందిన సువర్ణ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, గాదిగూడ మండలం రాయిగూడకు చెందిన ఆత్రం సునీబాయి సోలార్ యూనిట్ ఇప్పించాలని కోరారు. అనంతరం పీవో ఈ నెల 17 నుంచి గుడిరేవులో గల ఆదివాసుల ఆరాధ్య దైవం పద్మల్ పూరి కాకో ఏత్మాసూర్ ఆలయ ప్రాంగణంలో జరగనున్న గుస్సాడీ, దండారీ, దర్బార్ ఉత్సవాలకు సంబంధించిన గోడ ప్రతులు, ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. -
వేటకు అమర్చిన విద్యుత్ తీగ తగిలి ఒకరు మృతి
పెంబి: వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ తీగ తగిలి ఒకరు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఖానాపూర్ సీఐ అజయ్, ఎస్సై హన్మాండ్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెంబితండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఆక్టోనిమాడ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు పస్పుల తండా గ్రామానికి చెందిన ఆత్రం రాజు ఈ నెల 11న విద్యుత్ తీగ ఏర్పాటు చేశారు. దాదాపుగా 400 మీటర్ల దూరం విద్యుత్ కంచె అమర్చాడు. పెంబిలో మేకల కాపరిగా పనిచేస్తున్న ఆక్టోనిమాడ గ్రామానికి చెందిన ఆత్రం లింబారావు (29)శనివారం సాయంత్రం మేకలను కొట్టంలోకి పంపి ఇంటికి బయల్దేరాడు. ఆదివారం ఉదయం మేకలను తీసుకెళ్లేందుకు లింబారావు రాకపోవడంతో యజమాని కుటుంబ సభ్యులను ఆరా తీశాడు. శనివారం సాయంత్రం ఇంటికి కూడా రాలేదని చెప్పడంతో ఆందోళన చెందిన యజమాని, బాధిత కుటుంబ సభ్యులు సమీప ప్రాంతంలో వెతికారు. గ్రామానికి చెందిన పశువుల కాపరికి కాలిపోయిన మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా లింబారావుగా గుర్తించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. విద్యుత్ కంచె ఏర్పాటు చేసిన రాజు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. -
వందేళ్ల సమస్య తీర్చిన కలెక్టర్కు సన్మానం
నస్పూర్: జన్నారం మండలం మహ్మదాబాద్ గ్రామంలో వందేళ్ల భూసమస్యను పరిష్కరించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ను గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్లో శాలువాతో ఘనంగా సన్మానించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చింతగూడ శివారు సర్వేనంబరు 98లో 457 ఎకరాల భూమిని ప్రభుత్వం చింతగూడ, మహ్మదాబాద్ గ్రామస్తులకు అసైన్డ్ చేసింది. కానీ రికార్డుల్లో 457 ఎకరాలకు బదులు 658 ఎకరాలు చూపిస్తోంది. సుమారు 200 ఎకరాల భూమి ఎక్కువగా చూపిస్తుండడంతో ఆయా గ్రామాల్లోని భూ హక్కుదారులకు బదలాయింపులో సమస్యలు తలెత్తాయి. వారసులకూ హక్కులు సంక్రమించకుండా పోయాయి. కలెక్టర్ చొరవ చూపి ఎంజాయ్మెంటు సర్వేకు ఆదేశించి పూర్తయ్యేలా చూశారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పూర్తవడంతో వందేళ్లుగా పరిష్కారం కాని సమస్యకు పరిష్కారం చూపారని, 170 కుటుంబాలకు చెందిన భూ సమస్యను పరిష్కరించారని మహ్మదాబాద్ గ్రామస్తులు సోమవారం కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేసి శాలువాతో సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సుల్లో భూ సంబంధిత సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు మొఖా, సర్వేనంబర్లు ఇతర పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
కరెంట్ కనెక్షన్ ఇచ్చారు..
మంచిర్యాలఅగ్రికల్చర్: ‘కరెంటు కనెక్షన్ లేదు’ శీర్షికన ఈ నెల 11న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. మందమర్రి మండలం సారంగపూర్ గ్రామం శంకర్పల్లికి చెందిన రైతు జాడి పద్మ బోరు మోటారు కనెక్షన్ కోసం 2021 జూన్ 21న డీడీ చెల్లించింది. 2023లో విద్యుత్ ప్రజావేదికలో ఫిర్యాదుతో విద్యుత్ శాఖ సిబ్బంది స్తంభాలు వేసి వదిలేశారు. కరెంటు కనెక్షన్ కోసం కలెక్టరేట్, విద్యుత్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ విషయమై కథనం ప్రచురితం కావడంతో సోమవారం విద్యుత్ అధికారులు స్పందించి కరెంటు తీగలు లాగి, కనెక్షన్ ఇచ్చారు. దీంతో రైతు కుటుంబం ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. -
ముగిసిన అటవీశాఖ స్పోర్ట్స్ మీట్
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో అటవీశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఆదివారం రాత్రి అట్టహాసంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా జడ్జి శ్రీవాణి, అటవీశాఖ బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన సుమారు 350 మంది అటవీశాఖ క్రీడాకారులు పాల్గొనగా 35 రకాల క్రీడలు నిర్వహించారు. టగ్ ఆఫ్ వార్ పురుషుల విభాగంలో నిర్మల్ జట్టు, మహిళల విభాగంలో ఆదిలాబాద్ జట్టు విజేతగా నిలిచాయి. వాలీబాల్లో ప్రథమ విజేతగా ఆదిలాబాద్, రన్నర్ ఆఫ్గా నిర్మల్ జట్టు, క్రికెట్లో నిజామాబాద్ జట్టు, కబడ్డీ పురుషుల విభాగంలో నిజామాబాద్, మహిళల విభాగంలో నిర్మల్ జట్టు, త్రో బాల్ మహిళల విభాగంలో ఆదిలాబాద్ జట్టు, మార్చ్పాస్ట్లో నిర్మల్ జట్టు విజేతగా నిలిచాయి. ఓవరాల్ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్మల్ జట్టు కై వసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డీఎఫ్వో వికాస్ మీనా, నిర్మల్ డీఎఫ్వో నాగిని భాను, అధికారులు సుధాకర్రావు, శివకుమార్, నాలుగు జిల్లాల అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పత్తిచేలపై అడవిపందుల దాడి
కోటపల్లి: నాగంపేట గ్రామ శివారులోని పత్తి పంటలపై సోమవారం అడవిపందులు దాడి చే సి ధ్వంసం చేశాయి. రైతులు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించగా పరిశీలించేందు కు వచ్చిన అధికారుల దృష్టికి తమ సమస్యల ను తీసుకవెళ్లారు. అడవిపందులను చంపితే కే సులు పెడతామని హెచ్చరించే ఆధికారులు పంటలు నాశనం చేస్తే మరి మా పరిస్థితి ఏంట ని ఆందోళనకు దిగారు. ఎస్సై రాజేందర్ వ్యవసాయాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు సద్దుమణిగారు. వ్యవసాయాధికారి సాయికృష్ణ, ఏఈవో వైష్ణవి పంటలను పరిశీలించి పంచనామా నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. అనంతరం రైతులు తహసీల్దార్ రాఘవేందర్రావుకు వినతిపత్రం ఇచ్చారు. -
కబడ్డీ జట్టుకు ఘన స్వాగతం
మంచిర్యాలఅర్బన్: ఎస్జీఎఫ్ అండర్–19 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో తృతీయ స్థానం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు క్రీడాకారులకు సోమవారం మంచిర్యాలలో ఘన స్వాగతం పలికారు. ఈ నెల 10 నుంచి 12 వరకు మహబూబాబాద్ జిల్లాలోని కొమ్ములవంచలో నిర్వహించిన పోటీల్లో మహబూబ్నగర్ (ప్రథమ) మెదక్ (ద్వితీయ) స్థానంలో నిలవగా ఆదిలాబాద్ జట్టు తృతీయ స్థానం సాధించింది. ప్రతిభ కనబరిచి మంచిర్యాలకు వచ్చిన జట్టు సభ్యులు, కోచ్ మేనేజర్లు సాంబమూర్తి, రాజన్న, సుదీప్లను మంచిర్యాల రైల్వేస్టేషన్లో అభినందించారు. కార్యక్రమంలో డీఐఈవో అంజయ్య, పాఠశాల, కళాశాల గేమ్స్ కార్యదర్శి బాబురావు, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు రాంచందర్, కార్తీక్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రఘునాథ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకుడు మృతి
తానూరు: మండలంలోని దర్మాబాద్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకుడు మా ల్వే ఎంకోబా (70) మృతి చెందినట్లు ఎస్సై షేక్ జు బేర్ తెలిపారు. మృతుడు కొన్ని రోజులుగా తానూ రు మండలంలో భిక్షాటన చేసుకుంటున్నాడు. ఆదివారం రాత్రి రోడ్డుపై పడుకుని ఉండగా గుర్తు తెలియని వాహనం అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై షేక్ జుబేర్ సోమవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముధోల్కు చెందిన వ్యక్తిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని కుమారుడు మాల్వే బాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. జ్వరంతో ఇంటర్ విద్యార్థిని..మందమర్రిరూరల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వెంకటాపూర్కు చెందిన చిట్టవేణ అశ్విత (17) పది రోజుల క్రితం దసరా సెలవులకు అమ్మమ్మ ఊరైన బెల్లంపల్లి మండలంలోని ఆకెనపెల్లికి వెళ్లింది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నంబెజ్జూర్: పురుగు మందు తాగి ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని మర్థిడిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్థిడికి చెందిన బోర్కుట్ మల్లయ్యకు ఇటీవల అదే గ్రామానికి చెందిన మన్నెంపెల్లి ఓనయ్య దంపతులతో గొడవ జరిగింది. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మల్లయ్యపై ఈనెల 9న కేసు నమోదైంది. దీంతో భయాందోళనకు గురై సోమవారం ఉదయం గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా నా ఆత్మహత్యకు మాజీ ఎమ్మెల్యే అనుచరుడు బషరత్ ఖాన్ కారణమంటూ బాధితుడు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయమై ఎస్సై సర్దాజ్ పాషాను సంప్రదించగా అతనిపై ఈనెల 9న కేసు నమోదు కావడంతో నోటీసు ఇవడానికి పోలీసు సిబ్బంది ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. దాడులకు దారితీసిన ఆస్తుల పంచాయితీ జైపూర్: అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంచాయితీ చివరకు దాడులకు దారితీసింది. జైపూర్ మండలంలోని వేలాలకు చెందిన ప్యాగ మైసయ్య, రాజసమ్మయ్య ఇద్దరు అన్నదమ్ములు. మైసయ్యకు ముగ్గురు కుమారులు సమ్మయ్య, నాగయ్య, మల్లేశ్. వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే ఉంటున్నారు. రాజసమ్మయ్యకు శ్రీనివాస్, సంతోశ్ కుమారులు. శ్రీనివాస్ సింగరేణిలో ఓవర్మెన్ ఉద్యోగం చేస్తుండగా సంతోశ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. మైసయ్య, రాజసమ్మయ్యకు చెందిన భూమి, ఆస్తుల విషయంలో కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి. మైసయ్య వేలాలలో ఇల్లు నిర్మించుకుంటుండగా రాజసమ్మయ్య, అతని కుమారులు అడ్డుకున్నారు. ఇదే విషయంపై ఆదివారం గొడవ చోటు చేసుకోగా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దాడిలో శ్రీనివాస్, సంతోశ్, రాజసమ్మయ్య భార్య మల్లక్కకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ మేరకు రాజసమ్మయ్య ఫిర్యాదు మేరకు సమ్మయ్య, నాగయ్య, మల్లేశ్, లక్ష్మిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. నిందితున్ని పట్టించిన డాగ్ హంటర్దండేపల్లి: మండలంలోని తానిమడుగు ఫారెస్ట్ బీట్ 394 కంపార్ట్ మెంట్లో ఇటీవల టేకుచెట్లు నరికివేతకు గురైనట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆదివారం డాగ్ హంటర్తో అడవిలో తనిఖీలు నిర్వహించారు. లభించిన ఆధారాలను వాసన చూసిన డాగ్ హంటర్ తానిమడుగులోని పెందూర్ రాజేశ్ ఇంటికి చేరుకుంది. అతని ఇంట్లో తనిఖీ చేయగా కలప లభించడంతో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి లక్సెట్టిపేట కోర్టులో హాజరు పర్చగా 12 రోజుల రిమాండ్ విధించినట్లు తాళ్లపేట ఎఫ్ఆర్వో సుష్మారావు తెలిపారు. -
● 16న ఏఐసీసీ పరిశీలకుల రాక ● పార్టీ నాయకులతో అభిప్రాయాల సేకరణ ● జిల్లా నుంచి ముగ్గురి పేర్లతో జాబితా ● అధ్యక్ష పదవికి పోటీలో సీనియర్లు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్ష పీఠానికి నాయకుల్లో పోటీ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో అధికార కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే గ్రామాలు, మండలాలు, బ్లాక్ స్థాయిలో పదవుల్లో ఎంపిక కసరత్తు పూర్తయింది. ఇప్పటికే ఓ దఫా కసరత్తు జరిగింది. అయితే జిల్లా అధ్యక్ష బాధ్యతల అప్పగింతకు మరోసారి అభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ నెల 16నుంచి ఏఐసీసీ పరిశీలకులు నరేశ్కుమార్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులతోపాటు పార్టీ విభాగాలకు చెందిన వారితో జిల్లా కొత్త సారథిపై నేరుగా వివరాలు సేకరించనున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకూ ఇన్చార్జిగా ఉన్న నేపథ్యంలో గత రెండ్రోజులుగా ఆ జిల్లా నాయకులతో అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా బాధ్యతలు అప్పగించేందుకు ముగ్గురు పేర్లతో జాబితా సిద్ధం చేసేందుకు పార్టీ కేడర్ను భాగస్వామ్యం చేసేలా పార్టీ నిర్ణయించింది. ఆ ముగ్గురి పేర్లు ఎవరివో..? గత పదేళ్లుగా ప్రతిపక్ష పార్టీగా ఉండి ప్రస్తుతం అధికారంలోకి రావడంతో పార్టీ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు సైతం ఎవరికీ పెద్దగా దక్కలేదు. ఈ క్రమంలో సీనియర్ నాయకులు తమకు పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు(పీఎస్సార్) వర్గీయులైన రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లికి చెందిన గడ్డం త్రిమూర్తి, నూకల రమేశ్ డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. ఇక బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కార్కూరి రాంచందర్ పోటీలో ఉన్నారు. చెన్నూర్ నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్న పిన్నింటి రఘునాథ్రెడ్డి డీసీసీ అధ్యక్ష బాధ్యతలు తనకే అప్పగించాలని కోరుతున్నారు. వీరితోపాటు పలువురు సీనియర్లు దరఖాస్తు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరాక తనకు పదవి దక్కలేదనే నిరాశలో ఉన్నారు. తనకు అవకాశం కల్పిస్తే జిల్లా బాధ్యతలు చూస్తానని చెబుతున్నారు. కాగా, ఏఐసీసీ పరిశీలకులు జిల్లా నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వా త ముగ్గురు పేర్లతో జాబితా పంపించనున్నారు. సురేఖకు మళ్లీ అవకాశం కల్పించేనా? ప్రస్తుతం డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న కొక్కిరాల సురేఖ సుమారు ఏడేళ్లుగా పార్టీ జిల్లా బాధ్యతలు చూస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం మరోసారి పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తుందా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది. డీసీసీ హోదాలో రెండుసార్లు కంటే ఎక్కువగా ఉండరాదు. ఈ క్రమంలో ఆమెకు బదులు ఎవరైనా కొత్తవారికి అవకాశం కల్పిస్తారా..? లేదా..? ఎమ్మెల్యే పీఎస్సార్కు మంత్రి పదవి రాకపోవడంతో ఆ లోటును ఇలా భర్తీ చేస్తారా..? అనేది పార్టీ అధిష్టానం నిర్ణయించనుంది.ఎమ్మెల్యేల్లో కుదరని సఖ్యతజిల్లాలో మూడు ప్రధాన నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్లో ఎమ్మెల్యేలుగా పీఎస్సార్, వినోద్, మంత్రి వివేక్ ఉన్నారు. వీరంతా ఎవరికి వారే వర్గపోరుతో ఉన్నారు. మంత్రి పదవి విషయంలో మొదలైన రగడ మొన్నటి దేవాపూర్ సిమెంటు ఫ్యాక్టరీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల దాకా రగులుతూనే ఉంది. ఇప్పటికీ ముగ్గురు కలిసి ఏ వేదిక, కార్యక్రమం పంచుకోకపోగా.. సమీక్ష, సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి ఉంది. జిల్లాలో మంత్రిగా వివేక్ ఉన్నప్పటికీ ఆయన కేవలం చెన్నూర్కే పరిమితం అవుతున్నారు. ఎవరికి వారే అన్నట్లుగా ఉన్న ఈ క్రమంలో కొత్తగా నియామకం అయ్యే డీసీసీ అధ్యక్ష స్థానానికి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసే సమర్థులను ఎంపిక చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. -
సంక్షోభంలో శ్రీరాంపూర్ ఓసీపీ
శ్రీరాంపూర్: సింగరేణి సంస్థలో ఎక్కడా లేని విధంగా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గని (ఓసీపీ) తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఓబీ (మట్టి వెలికితీత) పనులు చేసే రెండు కాంట్రాక్టు సంస్థలు చేతులెత్తేయడంతో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. ఓబీ వెలికితీత టెండర్ను సీఆర్ఆర్, జీవీఆర్ సంస్థలు దక్కించుకున్నాయి. నాలుగేళ్లు నిర్ధేశిత ఓబీ వెలికి తీసేలా ఒప్పందం చేసుకున్నాయి. 2022 డిసెంబర్ 1 నుంచి సీఆర్ఆర్ పనులు చేపట్టింది. 2023 అక్టోబర్ 1 నుంచి జీవీఆర్ పనులు ప్రారంభించింది. సీఆర్ఆర్ సంస్థ 720 లక్షల క్యూబిక్ మీటర్లు తీయాల్సి ఉండగా అక్టోబర్ 1 వరకు 360 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే వెలికితీసింది. ఇక జీవీఆర్ సంస్థ 495 లక్షల క్యూబిక్ మీటర్లు తీయాల్సి ఉండగా 220 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే తీసింది. నష్టాలు వస్తున్నాయని.. నష్టాలు వస్తున్నాయని ఆ రెండు సంస్థలు అర్ధంతరంగా పనులు నిలిపివేశాయి. సీఆర్ఆర్ ఆగస్టు 27 నుంచి, జీవీఆర్ అక్టోబర్ 1 నుంచి పనులు చేయడం లేదు. టెండర్ ప్రకారం నాలుగేళ్ల కాలానికి నిర్ధేశించిన ఓబీ తీయాల్సి ఉండగా తమతో ఇక కాదని చేతులెత్తేశాయి. జీవీఆర్ సంస్థ ముందుగా నోటీసులు ఇచ్చి పనులు బంద్ చేయగా, సీఆర్ఆర్ సంస్థ చెప్పా పెట్టకుండానే పనులు నిలిపివేసింది. ఈ సంస్థకు కంపెనీ పలుమార్లు నోటీసులు ఇచ్చింది. ఇదిగో వస్తాం.. చేస్తాం.. అంటూ తప్పించుకున్నారు. చేసేది లేక యాజమాన్యం సీఆర్ఆర్ను టెర్మినేట్ చేసేలా నోటీసులు ఇచ్చింది. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా అధిక డీజిల్ వినియోగంపై సీఆర్ఆర్కు రూ.57 కోట్లు, జీవీఆర్కు రూ.27 కోట్లు మొత్తంగా రూ.84 కోట్లు సింగరేణి యాజమాన్యం జరిమానా విధించింది. పనుల నిలిపివేతకు ఈ జరిమానాలు కూడా ఒక కారణమని తెలుస్తోంది. రోజుకు 12 వేల టన్నుల నష్టం.. ఓబీ సంస్థల నిర్వాహకంతో ఓసీపీలో రోజుకు 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం జరుగుతోంది. రోజుకు రూ.కోటి వరకు నష్టపోతోంది. టెండర్ సమయంలో అధికారులు ఓబీ సంస్థల సామర్థ్యాన్ని అంచనా వేయకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా, ఓబీ సంస్థలు చేతులెత్తేయడంతో సింగరేణి సొంతంగా ఓబీ పనులు చేపడుతోంది. సంస్థ ఉద్యోగులతో 3 షావల్స్తో ఓబీ వెలికి తీస్తున్నా.. రోజుకు కనీసం 5 వేల క్యూబిక్ మీటర్లు కూడా తీయలేకపోతోంది. మరోవైపు కాంట్రాక్టర్తో ఓబీ తీస్తే క్యూబిక్ మీటర్కు రూ.135 ఖర్చయితే నేడు కంపెనీ ఇందుకు రూ.400 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓసీపీలో ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 1 వరకు 16.09 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 14.58 లక్షల టన్నులు మాత్రమే వెలికితీశారు. 83 శాతం లక్ష్యం సాధించారు. సమస్య పరిష్కరించి ఓబీ, బొగ్గు ఉత్పత్తి పెంచకుంటే సంస్థ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కొత్త టెండర్లు పిలిచాం.. జీవీఆర్ సంస్థ స్థానంలో మరో సంస్థ కోసం కొత్త టెండర్ పిలిచాం. రెండు మూడు నెలల్లో పనులు మొదలవుతాయి. ఇక సీఆర్ఆర్ సమస్య పరిష్కరించి, దానికి కూడా టెండర్ పిలుస్తాం. ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. రెండు టెండర్లు పూర్తయితే పనులు పుంజుకుంటాయి. అప్పటి వరకు కంపెనీ ఆధ్వర్యంలో ఓబీ వెలికితీస్తూ వీలైనంత బొగ్గు ఉత్పత్తి చేస్తాం. – చిప్ప వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు అధికారి, ఎస్సార్పీ ఓసీపీ నిత్యం ఆందోళనలు సీఆర్ఆర్ కాంట్రాక్టు సంస్థ నాలుగు నెలలుగా వేతన బకాయిలు రూ.4 కోట్లు చెల్లించకపోవడంతో కార్మికులు నిత్యం ఆందోళనలు చేస్తున్నారు. వాహనాల నిలిపివేత, ఆత్మహత్యాయత్నాలు, అధికారుల ఘెరావ్లతో గని ఉద్రిక్తంగా మారింది. వేతనాలు చెల్లించకుంటే గనిని పూర్తిగా మూసి వేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల పహారాలో ఓసీపీ నడుస్తోంది. వేతనాలు చెల్లించకుంటే మరో రెండు రోజుల్లో అధికారుల కార్యాలయాలకు తాళం వేస్తామని కార్మికులు అల్టిమేటం ఇచ్చారు. -
మారథాన్లో రాణిస్తున్న పద్మ
బెల్లంపల్లి: ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం మరొకటి లేదు. ఆ విషయాన్ని గ్రహించిన బెల్లంపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సోమిశెట్టి పద్మ తన ఆరోగ్యంకోసం నడకను ప్రారంభించింది. క్రమం తప్పకుండా కొనసాగిస్తూనే మారథాన్లో పోటీపడే స్థాయికి చేరుకుంది. గతేడాది హైదరాబాద్లో, కరీంనగర్లో నిర్వహించిన మారథాన్లో పాల్గొని పట్టు సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 11న రాష్ట్ర సివిల్ సర్విస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో 5కే ఈవెంట్లో పాల్గొని జాతీయస్థాయికి ఎంపికై ంది. ఈ నెల 12న కరీంనగర్లో నిర్వహించిన హాప్ మారథాన్లో 21కేలో పాల్గొని ద్వితీయ బహుమతి సాధించింది. 28 నిమిషాల్లో 5కేను పూర్తి చేసింది. గంట 4 నిమిషాల్లో 10 కేను, 2 గంటల 8 నిమిషాల్లో 21కే చేరుకుని నిర్వాహకుల ప్రశంసలు అందుకుంది. -
‘మందు’కొడిగా దరఖాస్తులు
మంచిర్యాలక్రైం: జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్ దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం పాలసీకి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. జిల్లాలోని 73 మద్యం దుకాణాలకు గాను గత నెల 26 నుంచి ఎకై ్సజ్ శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 18 నాటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇంకా నాలుగు రోజుల గడువు మాత్రమే ఉండగా.. ఇప్పటికీ అధికారులు ఆశించిన స్థాయిలో టెండర్లు రాకపోవడంతో ఎకై ్సజ్ శాఖ అధికారులు ఆలోచనలో పడ్డారు. దరఖాస్తుల సంఖ్య పెరిగేలా ఆ శాఖ అధికారులు తమ పరిధి దాటి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 11న రెండో శనివారం ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ ఎకై ్సజ్ అధికారులు పని దినంగానే ప్రకటించారు. 73 దుకాణాలకు గాను సోమవారం వరకు 42 టెండర్లు మాత్రమే రావడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. ఒక్కో దుకాణానికి ఒక్కటైనా రాకపోవడంతో.. ఎలాగైనా గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో వచ్చేలా ఎవరి స్టేషన్ పరిధిలో వారీగా సీఐలు, ఎస్సైలు పాత వ్యాపారులు, కొత్తగా వ్యాపారంలోకి రావాలనే ఆలోచన కలిగిన వారిని ప్రోత్సహిస్తున్నారు. ఫోన్లు చేస్తూ, వాట్సాప్ ద్వారా ప్రచారం చేస్తూ ఇంకా నాలుగు రోజులే గడువు ఉందంటూ గుర్తు చేస్తున్నారు. సిండికేటుకు యత్నాలు జిల్లాలో గతంలో మద్యం వ్యాపారం చేసిన వారు, లిక్కర్డాన్లుగా పేరొందిన వారు దుకాణాలు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సిండికేటుగా ఏర్పడి ఆచితూచి దరఖాస్తులు వేస్తున్నారు. గతంలో ఒక్కో వ్యాపారి 20 నుంచి 50కి పైగా టెండర్లు సమర్పించగా.. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా సులువుగా దుకాణాలు దక్కించుకునేలా సిండికేటుగా ఏర్పడి టెండర్లు వేస్తున్నట్లు సమాచారం. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశాలున్నాయి. దరఖాస్తు ఫీజు రూ.3లక్షలు ఉండడంతో పలువురు భాగస్వామ్యంతో టెండర్లు వేస్తున్నారు. లిక్కర్ వ్యాపారంలో ఏళ్ల తరబడిగా కొనసాగుతున్న మరికొందరు రూ.3లక్షలు పెద్ద లెక్క కాదని భావిస్తున్నారు. కానీ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలు దక్కించుకోవాలని వ్యూహం పన్నుతున్నారు. ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖలో పని చేసే ఉద్యోగులు బినామీ పేర్లతో టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా టెండర్లు అధిక సంఖ్యలో వచ్చేందుకు వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు. పెరిగిన ఫీజు, స్థానిక ఎన్నికలు కారణమా..? మద్యం టెండర్ల నోటిఫికేషన్, స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, దసరా పండుగ రావడంతో చాలామంది రియల్టర్లు, మద్యం వ్యాపారులు ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమయ్యారా..? లేక దసరా పండుగ తర్వాత వేద్దామనుకుని ఆగిపోయారా..? దరఖాస్తు ధర గతం కంటే రూ.లక్ష పెంచడంతో వెనుకడుగు వేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కారణం ఏమిటనే చర్చ జరుగుతోంది. గత టెండర్ల సమయంలో నాలుగు రోజుల గడువు ముందు వరకు సుమారు 500కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అప్పట్లో జిల్లాలో 73 దుకాణాలకు గాను 2,242 టెండర్లు దాఖలయ్యాయి. ఈసారి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఎకై ్సజ్ శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. చివరికి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో ఈ నాలుగు రోజుల వ్యవధిలో మూహూర్తం చూసుకుని భారీగా టెండర్లు వేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.జిల్లా వివరాలుస్టేషన్ దుకాణాలు దరకాస్తులుమంచిర్యాల 26 20 లక్సెట్టిపేట 12 10 బెల్లంపల్లి 25 06 చెన్నూర్ 10 06 మొత్తం 73 42 -
ఉపాధ్యాయుల లెర్నింగ్ టూర్!
నిర్మల్ఖిల్లా: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ ఈ.నవీన్ నికోలస్ ఉపాధ్యాయుల విదేశీ టూర్కు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు రెండురోజుల క్రితం జారీ చేశారు. నవంబర్లో ఒక్కో బృందానికి 40 మంది చొప్పున నాలుగు బృందాల్లో 160 మంది ఐదు రోజులపాటు సింగపూర్, వియత్నాం, జపాన్, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. అక్కడి పాఠశాలల బోధన విధానం, విద్యార్థి–ఉపాధ్యాయ సంబంధాలు, సాంకేతిక వినియోగం వంటి అంశాలను అధ్యయనం చేసి తిరిగి వచ్చాక రాష్ట్రంలో అమలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది... ఉమ్మడి జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల నుంచి ముగ్గురు చొప్పున మొత్తం 12 మంది విదేశీ పర్యటనలో భాగం కానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 2,855 ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలలు ఉండగా దాదాపు 12 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఎంపికై న ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి బృందంలో ఆయా దేశాల్లో పర్యటించి అక్కడి బోధన విధానాలను అధ్యయనం చేయనున్నారు. ఎంపిక ప్రక్రియ ఇలా.. బోధన రంగంలో కనీసం పదేళ్ల అనుభవం, 55 ఏళ్ల లోపు వయస్సు, పాస్పోర్టు కలిగి ఉన్నవారు ఈ పర్యటనకు అర్హులు. కలెక్టర్ చైర్మన్గా అదనపు కలెక్టర్, డీఈవో, జిల్లాస్థాయి సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీ జిల్లాకు ముగ్గురు చొప్పున ఉత్తమ టీచర్ల పేర్లను ఎంపిక చేయనుంది. ఇందుకుగానూ మూడేళ్లలో వారి పనితీరు పరిశీలిస్తారు. ‘పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచడంలో తీసుకున్న చొరవ, విద్యార్థుల సంఖ్య పెంచడం, వృత్తిపరంగా అభివృద్ధి, పాఠశాల అభివృద్ధికి తీసుకున్న చర్యలు, వినూత్న బోధనా పద్ధతులు, సాధించిన పురస్కారాలు, ఆంగ్లంలో సంభాషించే సామర్థ్యం’ అనే ఏడు కొలమానాల ఆధారంగా జిల్లా కమిటీ టూర్కు వెళ్లే ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది. ఈ ఎంపిక ప్రక్రియ ఈనెల 23 లోపు పూర్తి చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు ప్రవేశపెట్టేందుకు మరో అడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యతను పెంపొందించేలా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను విదేశాలకు పంపించాలని నిర్ణయించింది. ‘గ్లోబల్ లెర్నింగ్ టూర్’ పేరిట సుమారు 160 మందిని సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జపాన్ వంటి దేశాలకు పంపనుంది. వీరు ఆయా దేశాల్లో విద్యా విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు. దీంతో విద్యావ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. -
అ‘పూర్వ’సమ్మేళనం..
బెల్లంపల్లి సీఎస్ఐ ఉన్నత పాఠశాల (తె.మీ) 1988–89 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 37 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి వారు హాజరయ్యారు. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఉల్లాసంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. పూర్వవిద్యార్థులు కటకం సతీశ్, ఎల్దండి రవీందర్, గోసిక రమేశ్, కుమారస్వామి, వంశీ, మధు తదితరులు పాల్గొన్నారు. – బెల్లంపల్లిజుమ్మెరథపేట్ పాఠశాలలో.. జిల్లా కేంద్రంలోని జుమ్మెరథపేట్ ఉన్నత పాఠశాల 2008–09 బ్యాచ్ పదో తరగతి పూర్వవిద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్స్లో అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఉన్న అనుభవాలు పంచుకున్నారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. – నిర్మల్రూరల్ -
చదువులు చెప్పలేం..
ఇంద్రవెల్లి/ఉట్నూర్రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్: బెస్ట్ అవైలబుల్ ప్రైవేట్ పాఠశాలల్లోని పేద విద్యార్థుల చదువులకు ఫీజు బకాయిలు అడ్డుపడుతున్నాయి. పాఠశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయలేదు. దీంతో విద్యార్థులకు చదువులు చెప్పలేం.. పాఠశాలలకు రావద్దంటున్నారని యాజమాన్యాలు చెబుతున్నాయి. దసరా సెలవుల్లో ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు అక్కడే ఉంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని పొల్లుగూడ గ్రామానికి చెందిన ఆత్రం రిషి, మర్సుకోల ఆశ్విని, కొరెంగా భీంరావ్, కేస్లాగూడకు చెందిన చహకటి అంజలి, ఉట్నూర్లోని విద్యార్థులు, నిర్మల్ జిల్లా మామడ మండలం తోటిగూడ గ్రామానికి చెందిన పది మంది వివిధ ప్రాంతాల్లోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్నారు. అయితే ఫీజులు కడితే బడికి రావాలని లేకపోతే వద్దని యాజమాన్యాలు చెబుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా వెళ్లలేదు ఫీజులు కడితేనే రావాలని లే దంటే పాఠశాలకు రావద్దని అంటున్నారు. రెండు రో జులుగా బడికి వెళ్లలేదు. పా ఠశాల ప్రారంభం నుంచి తల్లిదండ్రులు పుస్తకాలు కొని ఇచ్చారు. ఫీజు లు కట్టాలని పాఠశాల యాజమాన్యం అంటే చదువులు మధ్యలోనే ఆపాలి. ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలి. –హన్విత, 6వ తరగతి, పులాజీబాబా పాఠశాల -
మిస్టర్ ఆదిలాబాద్.. మొగిలి
బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తీకి చెందిన జనగాం మొగిలి ఖైరిగూడ ఓసీపీలో ఈపీ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. బాడీబిల్డింగ్లో ప్రతిభపాటవాలకు కొదువ లేదు. 2018–19లో బాడీబిల్డింగ్ చాంపియన్షిప్ పోటీల్లో కోలిండియా చాంపియన్షిప్ సాధించి తానేంటో నిరూపించుకున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రోళిలో జరిగిన కోలిండియా పోటీల్లో 70కిలోల విభాగంలో బంగారు పతకం గెల్చుకున్నాడు. వ్యక్తిగతంగా ఓవరాల్ చాంపియన్షిప్ సాధించి శెభాష్ అనిపించుకున్నాడు. మంచిర్యాల జిల్లా కేంద్రం సీసీసీలో ఐదేళ్ల క్రితం జరి గిన మిస్టర్ ఆదిలాబాద్ బాడీబిల్డింగ్ చాంపియన్షిప్ పోటీల్లో 70కిలోల విభాగంలో బంగారు పతకం అందుకున్నాడు. మహానది కోల్ఫీల్డ్స్ ఒడిశాలో గత ఏడాది జరిగిన బాడీబిల్డింగ్ చాంపియన్షిప్ పోటీల్లో వెండి పతకం సాధించాడు. వరుసగా చాంపియన్షిప్ సాధనే లక్ష్యంసింగరేణి కార్మికుడిగా ఇప్పటివరకు వివిధ ఏరియాల్లో విధులు నిర్వర్తించాను. నిలకడ లేకుండా వేరే ప్రాంతాలకు బదిలీ వల్ల బాడీబిల్డింగ్పై సరిగా దృష్టి సారించలేదు. ప్రస్తుతం సొంత ఏరియా బెల్లంపల్లికి బదిలీ కావడంతో పూర్తి సమయం వెచ్చించే అవకాశం లభించింది. బాడీబిల్డింగ్ పోటీల్లో వరుసగా ఐదేళ్లు ఓవరాల్ చాంపియన్షిప్ సాధించడం లక్ష్యంగా పెట్టుకుని కసరత్తు చేస్తున్నాను. మిస్టర్ సింగరేణి సాధించాలనే బలమైన కోరిక కూడా ఉంది. – జనగాం మొగిలి, క్రీడాకారుడు -
గంజాయి సాగుపై పోలీసుల ఉక్కుపాదం
ఆసిఫాబాద్: గంజాయి సాగుపై కుమురంభీం జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయి సాగు నిర్మూలనే లక్ష్యంగా ఆదివారం డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు. అక్రమంగా సాగు చేస్తున్న 86 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఏఎస్పీ చిత్తరంజన్ కెరమెరి మండలంలో డ్రోన్ సహాయంతో పంట భూములను పరిశీలించారు. అంతాపూర్ గ్రామ పంచాయతీలోని నారాయణగూడ గ్రామానికి చెందిన రాథోడ్ బాలాజీ వ్యవసాయ భూమిలో 51 గంజాయి మొక్కలు గుర్తించారు. అలాగే లింగాపూర్ మండలం గుమ్నూర్(కె) గ్రామంలో ఎస్సై గంగన్న ఆధ్వర్యంలో అడె లక్ష్మణ్ పత్తి పొలంలో సాగు చేస్తున్న 35 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. గంజాయి సాగు, రవాణా, అమ్మకం, వినియోగం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ నుంచి ఇప్పటి వరకు ఆసిఫాబాద్ సబ్ డివిజన్లో 51 కేసులు నమోదు కాగా, 560 మొక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు. డ్రోన్తో పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో వాంకిడి సీఐ సత్యనారాయణ, కెరమెరి ఎస్సై మధుకర్ పాల్గొన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
దహెగాం: మండలంలోని బోర్లకుంట గ్రామానికి చెందిన జు మ్మిడి మధుకర్ శుక్రవారం వా గులో గల్లంతైన విషయం తెలి సిందే. అతని ఆచూకీ కోసం మూ డు రోజులుగా గజ ఈతగాళ్లు వెతుకుతుండగా ఆది వారం మృతదేహం లభించింది. డీఎస్పీ వహీదుద్దీన్ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. కో త్మీర్, బీబ్రా గ్రామాల మధ్యలో వాగులో మృతదేహం లభ్యమైందని ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు బోటు సహాయంతో గాలింపు చర్యలను పర్యవేక్షించారు. మృతుడి సోదరుడు దామాజీ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కేజీబీవీల నిర్వహణ ఎలా?
మంచిర్యాలఅర్బన్: కేజీబీవీల్లో నిర్వహణ భారంగా మారుతోంది. పౌష్టికాహారం, ఉచిత పాఠ్యపుస్తకా లు, నాణ్యమైన బోధన, వసతితో కూడిన విద్యతో మంచి ఫలితాలు రావడం.. విద్యార్థుల సీట్లు దొరక ని పరిస్థితి. ప్రభుత్వం వారికి పౌష్టికాహారం అందించేందుకు కొత్త మెనూ అమల్లోకి తెచ్చిన.. టెండర్ల ఖరారులో మాత్రం నిర్లిప్తిత చోటు చేసుకుంది. ఇది వరకు కాంట్రాక్టర్లు సరఫరా చేసిన సరుకులకు నెల ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపులకు ఒత్తిడి చేస్తుండగా.. నెలవారీ అవసరాలకు నిధుల్లేక నిర్వహణ స్పెషల్ ఆఫీసర్లకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. వచ్చే వేతనాలు తక్కువంటే అందులో మెయింటెన్స్కు చేతి నుంచి పెట్టాల్సి వస్తుండటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. టెండర్లో ఖరారులో తాత్సారం కస్తూర్బాల్లో చదువుతున్న బాలికలకు ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచింది. పౌష్టికాహారం కోసం చార్జీలు 6, 7 తరగతులకు రూ.1330, 8, 9, 10 తరగతులకు రూ.1540, ఇంటర్ చదివే బాలికలకు రూ. 2100 డైట్ చార్జీలు ఉన్నాయి. కాస్మెటిక్ చార్జీలు 6 నుంచి 8 వతరగతి వరకు రూ.100 నుంచి రూ.175, 8 నుంచి 10వ తరగతి ఆపై 11 సంవత్సరాల వయస్సు కలిగిన వారందరికి రూ.100 నుంచి రూ.275కు పెరిగాయి. ఈ విద్యాసంవత్స రం ప్రారంభమై నాలుగు నెలలు గడిచిపోయిన కొ త్తగా ఎగ్స్, పాలు టెండర్లు మాత్రం పూర్తి చేశారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు, పండ్లు పాత టెండర్దారులతోనే నెట్టుకువస్తున్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు సరుకులు నిలిపివేస్తుండటంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. మెయింటెన్స్ గ్రాంటు లేక.. ఇదివరకు కేజీబీవీలో విద్యుత్ మరమ్మతు, ఫ్యాన్లు, ప్లంబర్, ఎలక్ట్రీషీయన్, తాగునీటి క్యాన్లు, స్టేషనరీ, రైస్, పుస్తకాల చేరివేతకు ట్రాన్స్పోర్టు, హమాలీ చార్జీలు పలు చెల్లింపులన్నీ స్పెషల్ ఆఫీసర్లు చెల్లించేవారు. ఇందుకు స్కూల్ అకౌంట్లో రూ.లక్ష వరకు ఎప్పటికి నిల్వ ఉండేవి. అత్యవసర అవసరాలు తీర్చుకునేందుకు వీలుండేది. ప్రస్తుతం నిర్వహణ నిధులు ఎస్వోల ఖాతాలో లేకపోవడంతో డైట్ చార్జీలు చెల్లించకపోవడం.. రోజువారీ అవసరాలు తడిసిమోపెడవుతున్నాయి. సిలిండర్లకు రూ.800 చొప్పున నెలకు దాదాపు రూ.25వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు పైమాట. అంతేకాకుండా వాటర్క్యాన్లు కొనుగోలు. స్టేషనరీ ఇతర ఖర్చులు అదనం. స్పెషల్ ఆఫీసర్లకు వచ్చే వేతనం రూ.32,500 కావటంతో అప్పు చేయక తప్పని పరిస్థితి. గతంలో మాదిరిగా స్కూల్ ఖాతాలో ఇంప్రెస్ట్ ఎమౌంట్ (నిర్వహణ నిధులు) రూ.లక్ష నుంచి రూ. 2 లక్షలు ఉంచితే నిర్వహణ సులభతరంగా మారనుంది. ఎస్వోలు ఖర్చుచేసినా డిజిటల్ పేమెంట్ చేయమంటున్నారు రెండు రోజులుగా చెల్లింపు కేజీబీవీల్లో సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన జూన్ సంబంధించిన డైట్ చార్జీలు మంజూరైంది. రెండు రోజుల నుంచి చెల్లింపులు సాగుతున్నాయి. జూలై, ఆగస్టు నెలకు సంబంధించి డైట్ బిల్లులు, నిర్వహణ నిధులు వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు మంజూరు కాగానే చెల్లింపులు చేస్తాం. – చౌదరి, ఎఫ్ఏవో (ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్) మంచిర్యాల బాలికలు 4587 కేజీబీవీలు 18 -
17న బాసరకు శృంగేరి పీఠాధిపతి
బాసర: శృంగేరి జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతి మహాస్వామి ఈనెల 17, 18,19 బాసరకు విచ్చేస్తున్నారని ఈవో అంజనాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాదా య శాఖ ధార్మిక సలహాదారు గోవిందహరి ఆదివారం ప్రత్యేక ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర విజయ యాత్రలో భాగంగా ఆలయంలో పూజలు చేస్తారని పేర్కొన్నారు. దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పాఠక్, ఏఈ వో, ఆలయ వైదిక కమిటీతో సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆలయ వైదిక కమిటీ ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది కార్యాలయ సిబ్బంది ఉన్నారు. ‘కడెం’లో పర్యాటకుల సందడికడెం: కడెం ప్రాజెక్ట్ పరిసరాలు ఆదివారం ప ర్యాటకులతో సందడిగా మారాయి. వివిధ సు దూర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబ స భ్యులు, మిత్రబృందంతో ప్రాజెక్ట్ అందాలను తిలకించారు. అనంతరం బోటింగ్ చేశారు. కడెం @ 700కడెం: కడెం ప్రాజెక్ట్ గరిష్ట నీటిమట్టం 700 అ డుగులకు చేరింది. ప్రాజెక్ట్ నిండానీటితో కళకళాడుతుంది. గంగమ్మ ఆలయం వద్దకు, రిసార్ట్స్లోకి నీళ్లు చేరాయి. ఆదివారం సాయంత్రం ప్రాజెక్ట్కు 819 క్యూసెక్కుల స్వల్ఫ ఇన్ఫ్లో వస్తుంది. ఇన్ ఫ్లో పెరిగితే గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కార్యవర్గంకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఫి జికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ నూ తన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఉమ్మ డి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల క ళాశాలల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా జె.సోమన్న (ములుగు ప్రభు త్వ డిగ్రీ కళాశాల) ఎన్నికయ్యారు. ప్రధాన కా ర్యదర్శిగా కె.సునీల్రెడ్డి (బొల్లికుంట వీసీపీఈ ఫిజికల్ డైరెక్టర్), ఉపాధ్యక్షులుగా పి.అజయ్, ఎస్.కుమారస్వామి, బి.రమేశ్, జి.సునీత, కో శాధికారిగా ఎస్.కిరణ్కుమార్గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా ఎం.కుమారస్వామి, కె.మధుకర్, బి.వెంకట్రామ్, జె.జేత్యాతోపాటు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మహ్మద్ కరీం వ్యవహరించారు. నాలుగేళ్ల పాటు కార్యవర్గం కొనసాగుతుంది. సునీల్రెడ్డి సోమన్న -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
కాగజ్నగర్టౌన్: సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్గౌడ్ తెలిపారు. ఆదివారం కాగజ్నగర్ రైల్వేస్టేషన్ ఫ్లాట్పాం 1 వద్ద దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి జారిపడ్డాడు. ప్లాట్పాం, రైలు మధ్యలో ఇరుక్కుపోయాడు. గమనించిన రైల్వే సిబ్బంది అతన్ని బయటకు తీసి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సదరు వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, గ్రీన్ కలర్ రౌండ్నెక్ ఆఫ్ టీఛర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నాడు. చేపల వలలో చిక్కి జాలరి.. వాగులో పడి యువకుడు.. జ్వరంతో ఒకరు.. ఎదురెదురుగా ట్యాంకర్, లారీ ఢీ కాసిపేట: మండలంలోని సోమగూడెం దేవాపూర్ ప్రధాన రోడ్డుపై కాసిపేట జెడ్పీ పాఠశాల మూలమలుపు వద్ద ఆదివారం సాయంత్రం ట్యాంకర్, లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు నుజ్జునుజ్జుకాగా, డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ఫిర్యాదు తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
పదోన్నతులు ఇప్పించింది పీఆర్టీయూనే
● యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి నస్పూర్: స్కూల్ అసిస్టెంట్లకు పీజీహెచ్ఎంలుగా, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదో న్నతులు ఇప్పించిన ఘనత తమదే అని పీఆర్టీ యూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి అన్నారు. సీసీసీలోని ఎంఎం గార్డెన్లో ఆదివా రం నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్తో కలిసి పాల్గొన్నారు. గురుకుల టీచర్ల టైం టేబుల్ సమస్య పరిష్కరిస్తామని, పెండింగ్ డీఏ బిల్లులు త్వరగా చెల్లించేలా, ఎంప్లాయిమెంట్ హెల్త్ స్కీం అమలయ్యేలా కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయులకు టెట్ నిబంధనను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించామన్నారు. అనంతరం పదోన్నతి పొందిన వారిని సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్, ప్రధా న కార్యదర్శి బచ్చ మోహన్రావు, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర అసోసియేట్ సభ్యులు ప్రసాద్, సాంబమూర్తి, సత్యనారాయణ, జిల్లా నాయకులు కుమారస్వామి, రమణారెడ్డి, రాజన్న, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
ముగిసిన సెపక్తక్రా పోటీలు
రెబ్బెన: గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రెండురోజులుగా నిర్వహిస్తున్న 11వ రాష్ట్రస్థాయి జూనియర్స్, సబ్ జూనియర్ సెపక్తక్రా పోటీలు ఆదివారం ము గిశాయి. హోరాహోరీగా సాగిన చివరిరోజు ఫైనల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ బాలికల జట్టు విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో రంగారెడ్డి జిల్లా జట్టు, సబ్ జూనియర్స్లో వరంగల్ బాలికల జట్టు, మహబూబ్నగర్ బాలుర జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక జూనియర్స్ విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు తృతీయ స్థానంలో నిలవగా సబ్ జూనియర్స్లో ఆదిలాబాద్ బాలుర, బాలికల జట్లు మూడో స్థానంలో నిలిచాయి. విజేతగా నిలిచిన జట్లకు బెల్లంపల్లి ఏరియా ఇన్చార్జి జీఎం నరేందర్ ట్రోఫీతోపాటు షీల్ట్లు అందజేశారు. నిరంతర సాధనతోనే విజయాలు.. అంతకుముందు పోటీల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏరియా ఇన్చార్జి జీఎం నరేందర్ హాజరై మాట్లాడారు. క్రీడాకారులు ఆటలో నైపుణ్యాలు మెరుగుపర్చుకునేందుకు నిరంతర సాధనతోనే అద్భుత విజయాలు సొంతమవుతాయన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. సెపక్తక్రా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, సంయుక్త కార్యదర్శి విజయ భాస్కర్రెడ్డి, జారీఫ్ ఉద్దీన్ఖాన్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎస్.తిరుపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాస్కర్, రామకృష్ణ, కుమ్మరి మల్లేశ్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, ఎస్సై వెంకటకృష్ణ పాల్గొన్నారు. -
ముంపు బాధితులకు పరిహారం ఇస్తాం
చెన్నూర్: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాంక్ వాటర్తో పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందేలా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. స్థానిక ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ కుమార్దీపక్, ఆర్డీవో శ్రీనివాస్తో కలిసి కోటపల్లి మండలం బబ్బెరచెలుక, దేవులవాడ గ్రామాల రైతులతో ఆదివా రం సమావేశం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం అనాలోచిత చర్యల కారణంగా కాళేశ్వరం బ్యాక్ వాటర్తో పంట పొలాలతోపాటు గృహాలు కోల్పోయారని పేర్కొన్నారు. ముంపు బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించి అరులకు అందించే చర్యలు చేపట్టిందన్నారు. భూ సేకరణ నిర్వహించి రైతులకు పరిహా రం ఇస్తామన్నారు. రూ.36 వేల కోట్ల అంచన వ్యయంతో చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్కు మరో రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తే 55 వేల ఎకరాలకు సాగునీరందేదని తెలిపారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి రైతుల పచ్చని పంట పొలాలను నాశనం చేశారని ఆరోపించారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ డిసెంబర్ 18, 19 తేదీల్లో ముంపు రైతులకు పరిహారం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. భూ సంబంధిత వివాదాలకు రాజీ అయిన రైతులకు నిబంధనల ప్రకారం చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. ముంపు రైతుల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు, పీడీ ఖాతాలో మరో రూ.5 కోట్లు ఉన్నాయని తెలిపారు. -
ఆటల్లోనూ ‘ఆమె’
బెల్లంపల్లి ఏరియాకు చెందిన మహిళా కార్మికులు ఒక వైపు ఉద్యోగం.. మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే క్రీడల్లో రాణిస్తున్నారు. సింగరేణి గనుల ఏర్పాటులో భూములు కోల్పోయి ప్రత్యేక జీవో ద్వారా సంస్థలో ఉద్యోగాలు సాధించిన ఇద్దరు ఆదివాసీ గిరిజన మహిళలు వెయిట్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రాణిస్తూ సింగరేణికి గుర్తింపు తెస్తున్నారు. బెల్లంపల్లి ఏరియాకు చెందిన క్రీడాకారులు ఇటీవల జరిగిన కంపెనీ లెవల్ పోటీల్లో బంగారు పతకాలు సాధించి కోలిండియా పోటీలకు ఎంపికయ్యారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ నెల 14 నుంచి జరగనున్న పోటీల్లో పాల్గొననున్నారు. బరువులు ఎత్తడంలో దిట్ట గోలేటి సీహెచ్పీలో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న సిడాం అనురాధ ఐదేళ్ల క్రితం సింగరేణిలో ఉద్యోగంలో చేరింది. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తూనే వెయిట్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు కంపెనీ లెవల్ పోటీల్లో మూడుసార్లు బంగారు పతకాలు సాధించింది. 2023లో మొదటిసారి కోలిండియా పోటీలకు ఎంపికై నాగ్పూర్లో జరిగిన పోటీల్లో 57 కిలోల విభాగంలో తొలి ప్రయత్నంలోనే బ్రాంజ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత ఒరిస్సాలో జరిగిన కోలిండియా పోటీల్లో పాల్గొంది. ఇటీవల భూపాలపల్లిలో జరిగిన కంపెనీ లెవల్ పోటీల్లో బంగారు పతకం సాధించి కోలిండియా పోటీలకు ఎంపికై ంది. అథ్లెటిక్స్ టూ వెయిట్ లిఫ్టింగ్ గోలేటి టౌన్షిప్లోని సింగరేణి డిస్పెన్సరీలో బదిలీ వర్కర్గా పనిచేస్తున్న మమత మూడేళ్ల క్రితం సింగరేణిలో ఉద్యోగంలో చేరింది. మొదట్లో అథ్లెటిక్స్లో ఏరియా, నియర్బై ఏరియాతో పాటు కంపెనీ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపింది. 4x100 మీటర్ల పరుగు పందెంలో కోలిండియా పోటీలకు ఎంపికై ంది. ఏరియా అధికారులు వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ వైపు ప్రోత్సహించారు. భూపాలపల్లిలో జరిగిన కంపెనీ స్థాయి పోటీల్లో 47 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించి కోలిండియా పోటీలకు ఎంపికై ంది. అథ్లెటిక్స్లో చేజారిన కోలిండియా పతకాన్ని వెయిట్ లిఫ్టింగ్ ద్వారా సాధిస్తానని చెబుతోంది. -
ఇందన్పల్లి రేంజ్ అధికారి సస్పెన్షన్
జన్నారం: అక్రమంగా కలప తరలిపోయినా నిర్లక్ష్య ం వహించినందుకు ఇద్దరు అటవీ అధికారులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటువేశారు. జన్నారం అటవీ డివిజన్ ఇందన్పల్లి అటవి రేంజ్, కవ్వాల్ సెక్షన్, బంగారు తాండా బీట్ పరిధిలో టేకు చెట్లు అక్రమంగా నరికినా అధికారులు దృష్టి సారించకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం వహించారనే అభియోగంపై ఇందన్పల్లి రేంజ్ అధికారి శ్రీధరచారి, బంగారుతండా బీట్ అధికారి ప్రణయ్రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎఫ్డీపీటీ శాంతరాం తెలిపారు. గత నెలలో కొందరు బంగారుతాండా బీట్ పరిధిలోని కంపార్టుమెంట్ నంబర్ 244 లో పది టేకు చెట్లు నరికివేశారు. కలప అక్రమంగా తరలించుకుపోయారు. కలప విలువ సుమారుగా రూ.5 లక్షలు ఉంటుందని తెలిసింది. ఉన్నతాధికారులు స్పెషల్ పార్టీ, ప్లయింగ్ స్క్వాడ్ సిబ్బందితో తనిఖీ చేయగా కలప తరలిపోయినట్లు తేలింది. దీంతో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. ఇందన్పల్లి పరిధిలో తడకలు విషయం కూడా ఇందుకు తోడయినట్లు తెలిసింది. అయితే సస్పెన్షన్ ఉత్తర్వులు అధికారులకు చేరలేదని సమాచారం. నాలుగు నెలలకే ఎఫ్ఆర్వో సస్పెండ్ ఆవడం చర్చనీయాంశంగా మారింది.ప్రణయ్రెడ్డిశ్రీధరచారి -
వైన్స్ తరలించాలని నిరసన
దిలావర్పూర్: మండలంలోని సిర్గాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వైన్స్ షాప్ను వేరే ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆదివారం వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన రహదారిపై పాఠశాలకు దగ్గర ఉన్న వైన్స్ షాప్ కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మందుబాబులు హల్చల్ చేస్తుండడంతో విద్యార్థినులు భయాందోళన చెందుతున్నారన్నారు. వైన్స్ను వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలన్నారు. మాజీ సర్పంచ్ గంగారెడ్డి, నరసింహారెడ్డి, విజయ్, కొండుగారి నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
నేరడిగొండ: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఇమ్రాన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన కాడారి వినోద్ (23) ఫర్టిలైజర్ షాప్లో పనిచేస్తున్నాడు. గత నాలుగు రోజుల నుంచి పనికి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తండ్రి రవి ఫోన్ చేయగా సమాధానం ఇవ్వలేదు. అనుమానం వచ్చి చిన్న కుమారుడు వికాస్ను వెంట తీసుకుని వ్యవసాయ భూమికి వెళ్లి చూడగా పత్తి చేనులో వినోద్ అపస్మారక స్థితిలో కిందపడి ఉన్నాడు. చికిత్స నిమిత్తం అంబులెన్స్లో బోథ్ ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఘటన స్థలంలో మోనోసిల్ పురుగుల మందుతోపాటు థమ్సప్ బాటిల్ ఉంది. పంచనామా అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని వివాహిత మంచిర్యాలరూరల్(హాజీపూర్): జీవితంపై విరక్తితో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్ కథనం ప్రకారం..మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని నర్సింగాపూర్కు చెందిన గాదర్ల వెంకటేశ్, వాణి (30) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు హర్షవర్ధన్, ఆదిత్య ఉన్నారు. వెంకటేశ్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. అయితే శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కి చీరతో ఉరేసుకుంది. మృతురాలి తల్లి తుమ్మ కళావతి ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ కలయిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): 1976లో ప్రారంభమైన కుష్ఠు నివారణ కేంద్రం అర్ధ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ఆ విభాగాలకు చెందిన రిటైర్డ్ ఉద్యోగుల కలయిక జిల్లాలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలోని నలుమూలల నుంచి 60 నుంచి 80 ఏళ్ల వయస్సు గల రిటెర్డ్ ఉద్యోగులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి ఆనందోత్సాహాల మధ్య గడిపారు. ముందుగా దివంగత ఉద్యోగులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ వేడుకలో రిటైర్డ్ ఉద్యోగి యూ.రామేశ్వరచారి బృందం నిర్వహించిన సంగీత విభావరిలో సందడి చేశారు. వైద్యాధికారులుగా పని చేసిన సూర్యారావు, విజయవాణిలను సన్మానించారు. -
భారమయ్యానా కొడుకా..?
బెల్లంపల్లి: ‘నవ మాసాలు మోసి కని, పెంచి పెద్ద చేసి.. ప్రయోజకుడిని చేశాను కద కొడుకా.. ముసల్దాన్ని.. చేతనైతలేదు.. మీరు కాకుంటే నాకెవరు దిక్కు.. నేనే మీకు భారమయ్యానా’ అంటూ ఓ వృద్ధురాలు కొడుకు ఇంటి ఎదుట బైఠాయించిన ఘటన బెల్లంపల్లి పట్టణంలో జరిగింది. హన్మాన్బస్తీకి చెందిన వృద్ధురాలు పొట్ట బాలమల్లమ్మ ఆదివారం తన కొడుకు ఇంటి ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. వృద్ధాప్యంలో తనపై కోపం వద్దని కన్నీరు పెట్టుకుంది. జీవితమంతా పిల్లల కోసమే.. బాలమల్లమ్మకు నలుగురు కొడుకులు, కూతురు సంతానం. వీరిలో ముగ్గురు కొడుకులు చనిపోయా రు. రెండో కొడుకు రమేశ్ తండ్రి వారసత్వంగా వచ్చిన సింగరేణి ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు వసంతకు వివాహం చేసి అత్తారింటికి పంపించారు. అయితే, తల్లి పేరుమీద ఉన్న ఇల్లు కొడుకు రమేశ్ అద్దెకు ఇచ్చి, తల్లిని రేకుల షెడ్లో ఉంచాడు. నెలకు రూ.1,500 చెల్లిస్తానని ఇవ్వడం లేదు. కూతురు వద్ద జీవనం.. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడం, వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా బాలమల్లమ్మ పరిస్థితి దారుణంగా మారింది. తన పని కూడా తాను చేసుకోలేకపోతోంది. దీంతో కూతురు వసంత తీసుకెళ్లి బాగోగులు చూసుకుంటోంది. ఈ క్రమంలో పెద్దలు పంచాయితీ నిర్వహించారు. పెద్దల సమక్షంలో కొడుకు రమేశ్ ఒప్పందం చేశాడు. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంతో ఆదివారం కొడుకు ఇంటి ముందు కూతురు, మనుమరాళ్లతో కలిసి బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమైంది. మహిళల మద్దతు.. బాలమల్లమ్మ బాధను చూసి స్థానిక మహిళలు ఆమెకు మద్దతుగా నిలిచారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. తల్లిదండ్రులు లేకుంటే మనం ఉండే వాళ్లం కాదని గుర్తించాలని సూచించారు. కొడుకు స్పందించకపోవడంతో చీకటి పడే వరకూ కన్నీరుపెడుతూ అక్కడే ఉండిపోయింది. -
ఓసీపీలో ఉద్రిక్తత
శ్రీరాంపూర్: వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ ఓసీపీలో ఓబీ కాంట్రాక్టు కార్మికులు శనివారం ఆందోళనను ఉధృతం చేశారు. బొగ్గు ఉత్పత్తిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరాంపూర్ ఓసీపీలో ఓబీ పనులు నిర్వహించే సీఆర్ఆర్ సంస్థ నెలన్నర క్రితం పనులు నిలిపివేసింది. నాలుగు నెలల వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు క్వారీలోకి దిగి వాహనాలను అడ్డుకున్నా రు. అనంతరం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడే టెంటు వేసుకుని భోజ నాలు చేసి రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. అధికారులపై ఆగ్రహం.. కాంట్రాక్ట్ కార్మికులతో శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్, ఎస్వోటు జీఎం సత్యనారాయణ, ఏజెంట్ రాజేందర్, ఓసీపీ పీఓ వెంకటేశ్వర్లు, మేనేజర్ ఐ.శ్రీనివాస్ ఇతర అధికారులు చర్చించారు. కంపెనీ పరిధిలోని చర్యలన్నీ తీసుకుంటున్నామని చెప్పినా కార్మికులు వినలేదు. జీఎంను ఘెరావ్ చేసి రోడ్డుపైనే నిర్బంధించారు. నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ తమను ఇబ్బందులకు గురి చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటూ రాత్రి వరకు అధికారులను ఎటూ కదలనీయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు కార్మికులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కంపెనీ జీపు కమాన్ బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా కార్మికులు దాడికి యత్నించారు. శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కంపెనీ సెక్యూరిటీ గార్డులను పెద్దయెత్తున మొహరించారు. కాంట్రాక్టర్పై పోలీసులకు ఫిర్యాదు జీతాలు ఇవ్వకుండా మోసం చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కంపెనీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కార్మికులు పట్టుబట్టారు. దీంతో ఓసీపీ పీఓ పేరుతో సదరు కాంట్రాక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఆర్ఆర్ సంస్థ కాంట్రాక్ట్ కార్మికులు ఐత కిష్టయ్య, జెట్టి రమేశ్, పెద్దపల్లి సురేశ్, జక్కుల రాజలింగు, సిరిపురం శ్రీను, సన్నిగౌడ్, బొడ్డు తిరుపతి, తోట రాజేశ్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. -
● రాజకీయ కక్షలతో నిండుప్రాణం బలి ● జిల్లాలో కలకలం రేపిన ఏట మధుకర్ బలవన్మరణం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాజకీయ కక్షలు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. బీజేపీ వేమనపల్లి మండల అధ్యక్షుడు ఏట మధుకర్ను స్థానిక కాంగ్రెస్ నాయకులు వేధింపులకు గురి చేయడంతో బలవన్మరణానికి పాల్పడడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ప్రజాసమస్యలపై స్పందిస్తూ.. పార్టీలో చురుగ్గా ఉన్న మధుకర్ చావుకు కక్షపూరితంగా కారణమయ్యారని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ నోట్ అందరినీ కలచివేసింది. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే తప్పుడు కేసులు పెట్టారంటూ రాసిన తీరు అక్కడి వర్గపోరును తెలియజేస్తోంది. మండలంలో కులాల రాజకీయాలు నడుస్తున్నాయంటూ.. గతంలో దుర్గం శ్రవణ్ ఇప్పుడు ఏట మధుకర్ బలికావాల్సిందేనా..? అంటూ రాజకీయాల్లో కులవివక్షను ఎత్తిచూపుతూ తనువు చాలించాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బీజేపీ నాయకత్వం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, తదితర నాయకులు హాజరై నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. నియోజకవర్గంలో జరిగిన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహా కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ స్పందించలేదు. పోలీసుల వత్తాసు? రాజకీయ వివాదాల్లో అధికార పార్టీ నేతలకే వత్తాసు పలుకుతున్నారనే అపవాదు పోలీసులు మూటగట్టుకోవాల్సి వస్తోంది. మధుకర్ ఘటనలో అట్రాసిటీ కేసు నమోదుతోపాటు మహిళపై అత్యాచారయత్నానికి ఒడిగట్టారనే ఫిర్యాదుతో పోలీసుస్టేషన్కు విచారణ పేరుతో పిలిచి వేధించారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో స్థానిక ఎస్సైపైన చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. మరోవైపు ఆత్మహత్యకు కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఏట మధుకర్ కొడుకు రవికుమార్ ఫిర్యాదు మేరకు సూసైడ్ నోట్లో పేర్కొన్న రుద్రభట్ల సంతోష్కుమార్, గాలి మధు, చింతకింది కమలతో సహా మరణానికి కారణమైన మరో పది మందిపై పోలీసు కేసు నమోదైంది. పల్లెల్లో రాజకీయ చిచ్చుస్థానిక ఎన్నికల ముందు పల్లెల్లో నాయకులు రాజకీయ వర్గాలుగా వీడిపోయి ఉన్నారు. స్థానిక నాయకులు ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరులో ఆరోపణలతోపాటు వ్యక్తిగత విమర్శలతో సహా భౌతికదాడులకు తెగబడుతున్నారు. అధికార, ప్రతిపక్ష నాయకుల్లో ఇది తీవ్రతరంగా మారింది. బెల్లంపల్లి నియోజకవర్గంతో సహా జిల్లాలోని అధికార పార్టీ నాయకులు అధికార యంత్రాంగం తాము చెప్పినట్లు చేయాల్సిందే అన్నట్లుగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదాల్లో పోలీసులతోపాటు రెవెన్యూ, ఇతర యంత్రాంగం చాలా చోట్ల మితిమీరి ప్రవర్తిస్తూ స్థానిక నాయకుల మన్ననలు పొందేలా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
ఒకేచోట సేవలకు కోర్టు భవనాలు
నస్పూర్: రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాల దృష్ట్యా అన్ని న్యాయసేవలు ఒకేచోట అందించే విధంగా పలు జిల్లాల్లో కోర్టు భవన నిర్మాణాలు చేపడుతున్నట్లు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్కుమార్ సింగ్ అన్నారు. నస్పూర్లో కోర్టు భవన సముదాయ నిర్మాణానికి శనివారం ఆయన భువనగిరి నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. భూమిపూజలో పాల్గొన్న హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నగేష్ భీమపాక శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగేష్ భీమపాక మాట్లాడుతూ జిల్లా ప్రజల 20ఏళ్ల కల నేటితో తీరనుండడం ఆనందంగా ఉందన్నారు. ఒకేచోట అన్ని రకాల న్యాయసేవలు అందించేందుకు భారత న్యాయ నిర్మాణ్ వ్యవస్థ ద్వారా పోక్సో, ఫ్యామిలీకోర్టులు కలిపి 12 కోర్టులను రూ.81కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. రెండేళ్లలోపు పనులు పూర్తి చేసి సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కోర్టు, వినియోగదారుల ఫోరం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తే త్వరితగతిన ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. తమ జీవితాలను చీకట్లోకి నెట్టి దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి ఉద్యోగులకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానని అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ కోర్టు భవనాల నిర్మాణంతో జిల్లా ప్రజలకు న్యాయసేవలు మరింత అందుబాటులోకి వస్తాయని అన్నారు. నాణ్యతప్రమాణాలు పాటిస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కోర్టు, వినియోగదారుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. అనంతరం వివిధ న్యాయ సంఘాల ప్రతినిధులు హైకోర్టు జడ్జిని సన్మానించారు. అంతకుముందు చిన్నారుల నృత్య ప్రదర్శన, గిరిజనుల సంప్రదాయ గుస్సాడీ నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జిల్లా ఫారెస్టు అధికారి శివ్ఆశిష్ సింగ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్, పలువురు జడ్జిలు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. -
బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించాలి
● రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ ● ఓటు చోరీపై సంతకాల సేకరణ మందమర్రిరూరల్: దేశంలో ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించొద్దని, బ్యాలెట్ పత్రాల ద్వారానే ఓటింగ్ నిర్వహించాలని రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని పాతబస్టాండ్ కూడలి వద్ద ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై సంతకం చేసి ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అద్యక్షుడు నోముల ఉపేందర్గౌడ్, సీనియర్ నాయకులు సుదర్శన్, సట్ల సంతోష్, ఆకారపు రమేష్, తిరుమల్రెడ్డి, నీలయ్య, రాంచందర్, జీవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంతకాల సేకరణ జయప్రదం చేయాలి రామకృష్ణాపూర్: బీజేపీ చేసిన ఓట్ చోరీపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని, ఓట్చోరీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి పిలుపునిచ్చారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఓట్చోరీ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఓటు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరముందని అన్నారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, రఘునాథ్రెడ్డి, వొడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, గోపతి రాజయ్య, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. చెన్నూర్లో.. చెన్నూర్: చెన్నూర్ పట్టణంలోని 12వ వార్డులో ఓటు చోరీపై కాంగ్రెస్ నాయకులు శనివారం ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు చెన్న నారాయణ, లింగంపల్లి మహేశ్, ఈర్ల నారాయణ, ఖదీర్, జక్కుల సత్యనారాయణ పాల్గొన్నారు. -
48 గంటల్లో అరెస్టు చేయాలి
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేమనపల్లి: బీజేపీ వేమనపల్లి మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ పార్టీ నాయకులను 48 గంటల్లో అరెస్టు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. తీవ్రవాదాన్నే ఎదుర్కొన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకుల కవ్వింపు చర్యలకు వెరవబోదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ అరాచకాలపై పదేళ్లు కొట్లాడింది బీజేపీ నాయకులు అని గుర్తు చేశారు. ఉద్యమాలు తా ము చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని మించిన దమనకాండ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొనసాగిస్తోందని, అరాచకాలను తిప్పికొట్టే రోజులు దగ్గరపడ్డాయని తెలిపారు. యూపీ, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల్లో అరాచకవాదుల భరతం పడుతున్నట్లే తెలంగాణలో దౌర్జన్యాలపై బీజేపీ కొట్లాడుతుందని కి తాబిచ్చారు. బీజేపీ అంటే భద్రత, భరోసా ఇచ్చేదన్నారు. బీజేపీ నాయకులు ఆత్మహత్యలకు పాల్ప డబోరని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. ‘బండి’ కంటతడి.. మధుకర్ ఇంటి పరిస్థితులను చూసి బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. కంటనీరు చెమర్చారు. ఇంటికి సరైన తలుపులు లేక పరదాలు కట్టుకొని జీవనం సాగిస్తున్న కడుదుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి అమ్మి కూతురు పెళ్లి చేశాడని, అలాంటి పేదరికంలో ఉండి కూడా బీజేపీకి బలమైన కార్యకర్తగా ఎదగడం నిజంగా భారతీయ జ నతా పార్టీ అదృష్టం అన్నారు. మధుకర్ కుటుంబానికి బీజేపీ రాష్ట్ర శాఖ ఎల్లవేళలా సహాయ సహ కారాలు అందిస్తుందని తెలిపారు. పోలీస్ అధికా రులు రాజకీయాలకు మడుగులొత్తడం మానుకో వాలని, వచ్చే ప్రభుత్వం బీజేపీదేనని అరాచకవాదులకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించా రు. కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్గౌడ్, దుర్గం అశోక్, గోమాస శ్రీనివాస్, రాపర్తి వెంకటేశ్వర్లు, బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు. -
క్రీడా సంబురం
రెబ్బెన: క్రీడా సంబురం మొదలైంది. రెండు రోజు ల పాటు జరిగే 11వ రాష్ట్రస్థాయి జూనియర్స్, సబ్ జూనియర్స్ సెపక్తక్రా పోటీలకు మండలంలోని గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం వేదికై ంది. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లా ల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, కోచ్లు, క్రీడాఽభిమానులతో మైదానం కోలాహలంగా మారింది. శనివారం ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్రెడ్డి క్రీడా పతకాలను ఆవిష్కరించి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆపై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. సుమారు 200 మంది క్రీడాకారులు, 50 మంది కోచ్లు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు గోలేటి ప్రాంతం పుట్టినిల్లులాంటిదని అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పోటీల్లో రాణిస్తూ మంచి గుర్తింపు పొందారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలను గోలేటిలో నిర్వహించడం అభినందనీయమన్నారు. సెపక్తక్రా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ప్లేస్ సాధిస్తాం సొంత జిల్లాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఫస్ట్ప్లేస్ సాధిస్తామనే నమ్మకం ఉంది. దానికి తగినట్లుగా ఆటతీరును ప్రదర్శిస్తాం. ఇప్పటి వరకు మూడు సార్లు స్టేట్ మీట్ను ఆడాను. త్వరలో గోవాలో జరగబోయే నేషనల్స్ పోటీల్లో పాల్గొనబోతున్నా. – అభినయ రమ్యశ్రీ, ఆదిలాబాద్ సెపక్తక్రా అంటే ఇష్టం నాకు సెపక్తక్రా అంటే ఎంతో ఇష్టం. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నా. 8వ తరగతి నుంచి ఆడటం నేర్చుకున్నా. ఆటపై ఉన్న ఇష్టంతో పోటీల్లో రాణిస్తున్నా. రాష్ట్రస్థాయి పోటీల్లో నాలుగు బంగారు, ఒకసారి వెండి పతకం సాధించాను. – పి.అభినవ్ రాణా, రంగారెడ్డి ఆత్మవిశ్వాసంతో ఆడుతాం జిల్లా జట్టు క్రీడాకారులు ఆత్మ విశ్వాసంతో పోటీల్లో దిగుతున్నాం. ఇప్పటి వరకు ఒకసారి నేషనల్స్, మూడుసార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఒకసారి మూడోస్థానంలో సాధించాను. ఈసారి బంగారు పతకం సాధిస్తాను. – కె.రాంచరణ్, ఆదిలాబాద్ -
‘హామీలు నెరవేర్చని కాంగ్రెస్’
లక్సెట్టిపేట: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు విమర్శించారు. శనివారం మండల కేంద్రంలోని కేఎస్సార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చాలా వాగ్దానాలు చేసిందని, వాటిని అమలు చేయలేదని అన్నారు. రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను విడుదల చేసి కార్యకర్తలు ప్రతీ ఒక్కరికి చేరేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ నల్మాసు కాంతయ్య, నాయకులు విజిత్రావు, తిప్పని లింగయ్య, పొడేటి శ్రీనివాస్గౌడ్, పాదం శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, గంగాధర్, తిరుపతి, శ్రీకాంత్, రాజు, శ్రీనివాస్, రాయమల్లు, అనిల్ పాల్గొన్నారు. -
కొత్త ప్లాంటు పనుల పరిశీలన
జైపూర్: స్థానిక ఎస్టీపీపీలో మూడో యూనిట్ 800మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు పనులను రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ నందకుమార్ శనివారం పరిశీలించారు. కొత్త ప్లాంటు ప్రతిపాదిత ప్రాంతంలో సబ్స్టేషన్ పనులు పూర్తి కాగా ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం నరసింహరావు వివరించారు. అనంతరం రిజర్వాయర్లో 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ప్లాంటును పరిశీలించారు. డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ రాజు, ఏజీఎంలు మదన్మోహన్, శ్రీనివాస్, వేణుగోపాల్, బీహెచ్ఈఎల్ ఇంజనీర్లు మధుకిరణ్, సూర్యరావు పాల్గొన్నారు. -
4 కి.మీ కాలినడకన వెళ్లి.. వైద్యం అందించి
ఆదిలాబాద్రూరల్: మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన మంగ్లీ వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. మండల వైద్యాధికారి సర్ఫరాజ్, సిబ్బంది 4 కి.మీ కాలినడకన వెళ్లి శనివారం గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యపరీక్షలు చేసి మాత్రలు అందజేశారు. పిల్లలకు ఇమ్యూనైజేషన్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి సర్ఫరాజ్ మాట్లాడుతూ గ్రామంలో 11 ఇళ్లు ఉండగా, 64 మంది జనాభా ఉన్నారని పేర్కొన్నారు. అనారోగ్యం బారినపడితే వెంటనే పీహెచ్సీకి, రిమ్స్కు వెళ్లి చికిత్స చేసుకోవాలన్నారు. అంకోలి పీహెచ్సీ హెల్త్ సూపర్ వైజర్ బొమ్మేత సుభాష్, హెల్త్ అసిస్టెంట్స్ వేణుతాయి, పవర్ ప్రేమ్సింగ్, రాథోడ్ నారాయణ, ఆశకార్యకర్తలు సుమిత్ర, రుక్మిణి, దుర్పత బాయి, గ్రామస్తులు ఉన్నారు. -
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురి అరెస్ట్
మందమర్రిరూరల్: గంజాయి రవాణా చేస్తున్న ము గ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మందమర్రి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై రాజశేఖర్ వివరాలు వెల్లడించారు. కాగజ్నగర్ నుంచి గంజాయి తీసుకువస్తున్నారనే సమాచారంతో జాతీయ రహదారి టోల్గోట్ వద్ద తనిఖీ చేపట్టారు. స్కూటీపై వచ్చిన ముగ్గురిని తనిఖీ చేయగా 100 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని స్కూటీతోపాటు వేల్పుల వర్శిత్ (పొన్నారం), వేల్పుల రాహుల్ (ఆదిల్పేట్), మణిదీప్ (నస్పూర్)ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రైతుల కోసమే ధన ధాన్య కృషి యోజన
బెల్లంపల్లి: రైతుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం ధన ధాన్య కృషి యోజన, పుప్పుధాన్యాల స్వావలంబన మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.ప్రసూన అన్నారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలో మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించగా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల రైతులు హాజరయ్యారు. కేవీకే శాస్త్రవేత్తలు ప్రియ సుగంధి, మహేష్, స్రవంతి, సాధ్వి, నాగరాజు, హాజీపూర్ ఎఫ్పీసీ సలహాదారు గోనే శ్యాంసుందర్రావు, డైరెక్టర్లు శ్రీనివాసరావు, తిరుపతి పాల్గొన్నారు. -
ఇంట్లో చోరీ
జైనథ్: మండలంలోని దీపాయిగూ డ గ్రా మంలో దు ర్ల రాజలింగు ఇంట్లో గుర్తుతెలి యని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సమీప బంధువులు చనిపోవడతో రాజలింగు కుటుంబంతో కలిసి మూడురో జుల క్రితం ఊరికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ ్యక్తులు ఇంటికి ఉన్న కిటికీలోంచి లోపలికి చొరబడ్డారు. బీరువా తలుపులు పగులగొట్టి మూ డు తులాల బంగారం, 25 వేల నగదును ఎత్తుకెళ్లారు. శనివారం స్థానికులు గమనించారు. వెంటనే అందించిన సమాచారంతో ఎస్సై గౌతమ్ పవర్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. డాగ్స్క్వాడ్ బృందంతో తనిఖీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బహుదూరపు బాటసారులు
లోకేశ్వరం: మండలంలోని రాజూర, వట్టోలి, ధర్మోర, కన్కపూర్ గ్రామాల గొర్రెల కాపరులు బహుదూరపు బాటసారులు. ఏడాదిలో మూడు నెలలు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గొర్రెల మందతోపాటు మేత కోసం తిరుగుతూనే ఉంటారు. నిర్మల్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాన్ని అనుకుని ఉండటంతో ఇక్కడి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎస్సారెస్పీ నిండనంత వరకు వెనుకభాగం పశుగ్రాసం లభిస్తుండటంతో రోజూ ఉదయం, సాయంత్రం వరకు జీవా లను మేపుతుంటారు. ఏటా జూలై, ఆగస్టులో ఎస్సారెస్పీ నిండుకుండలా మారుతుంది. వెనుకభాగం నీటితో నిండి ఉంటుంది. దీంతో జీవా లకు గ్రాసం దొరకక వలస వెళ్లాల్సిన పరిస్థితి. వీరంతా మళ్లీ వరి నూర్పిడి పూర్తయ్యే వరకు దాదాపు మూడునెలలు ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలోని గుట్టలపై, నిజామాబాద్ జిల్లాలోని బా డ్సీ ప్రాంతాలకు వెళ్తారు. మండలాలకు చెందిన గొర్రెల కాపరులు బృందాలుగా ఏర్పడి మందలతో బయల్దేరుతారు. అడవిలో ఉంటూ వాటిని మేపుతూ అక్కడే వంట, భోజనాలు చేస్తారు. రాత్రి మందల వద్దే నిద్రిస్తారు. వంట సామగ్రి కోసం అక్కడి నుంచి కొందరు రావడమో, లేదంటే ఇక్కడి నుంచి వెళ్లేవారు వెంట తీసుకెళ్తారు. తరచూ ప్రమాదాలు సుదూర ప్రయాణం రోడ్డు మార్గంలో సాగడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనాలు ఢీకొని జీవాలు చనిపోతున్నాయి. ఇన్సూరెన్సు లేకపోవడంతో కాపరులు నష్టపోతున్నారు. ఇప్పటికై న పశుసంవర్థక శాఖ అధికారులు పట్టించుకుని జీవాలకు ఇన్సురెన్సు చేసేలా చర్యలు తీసుకోవాలి.ఇదే వృత్తిని నమ్ముకున్నాం ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాం. ఏడాదిలో మూడు నెలలు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నాం. ఒక్కో మందకు నలుగురు కాపలాగా ఉంటారు. గుట్ట ప్రాంతంలో జీవాలను మేపుతూ తిరుగుతాం. గొర్రెల కాపరులను ప్రభుత్వం పట్టించుకోవాలి. – బరిడే పోతన్న, రాజూర మేత దొరకక దూరప్రాంతాలకు ఎస్సారెస్పీ నిండితే జీవాలకు మేత దొరకడం కష్టమవుతుంది. మేత కోసం దూరప్రాంతాలకు జీవాలతో వెళ్తుంటాం. వంట సామగ్రి తీసుకెళ్తాం. అటవీప్రాంతాల్లో జీవాలను మేపుతున్నాం. – గీజాగంగాధర్, ధర్మోరపొలాల్లో గ్రాసం పెంచుకోవాలి జీవాలు, పశువుల యజమానులు వారి పంట పొలాల్లో గ్రాసం పెంచుకోవాలి. జీవాలు, పశువులకు ఇన్సురెన్సును చేయించుకోవాలి. గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయిస్తున్నాం. పశువైద్యుల సూచనలు పాటించాలి. – రాజేశ్వర్, నిర్మల్ పశుసంవర్థక శాఖ డెప్యూటీౖ డెరెక్టర్పొలాల్లోనే నిద్రమండలంలోని రాజూర గ్రామానికి చెందిన 20 మంది కాపరులు, వట్టోలిలోని 10 కురుమ యాదవ, కుటుంబాల వారు మూడు నెలలు ఇంటికి దూరంగా ఉంటున్నారు. వందలాది కిలోమీటర్లు తిరుగుతూ ఎక్కడ చీకటిపడితే అక్కడే పొలాల్లో నిద్రిస్తున్నారు. సరైన భోజనం, నీటి వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి జీవాలకు సైతం తాగునీరు లభించని పరిస్థితి. వాగులు, వంకలు అందుబాటులో ఉంటేనే నీరు తాగిస్తున్నారు. తమ గ్రామాల్లో మేత దొరకగానే తిరుగుపయనమతారు.జీవాలు సంఖ్య గొర్రెలు 3.50 లక్షలు మేకలు 1.25 లక్షలు నిర్మల్ జిల్లాలో.. వారంతా తమ కులవృత్తి అయిన గొర్రెల పెంపకాన్ని నమ్ముకొని జీవనం సాగించే యాదవులు. ఉన్న ఊరిలో జీవాలకు గ్రాసం దొరకకపోవడంతో పెంపకందారులు బృందంగా ఏర్పడి ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఏడాదిలో మూడు నెలలు అడవిలో ఉంటూ వండుకొని తింటారు. తమ జీవనోపాధితోపాటు జీవాల మేత కోసం వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న బాటసారులపై ప్రత్యేక కథనం. -
మద్యం షాపుల్లో చోరీ కేసు ఛేదింపు
భైంసాటౌన్:ముధోల్, తానూరులోని మద్యం షాపుల్లో మందు బాటిళ్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లో శనివారం అదనపు ఎస్పీ అవినాష్కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్బిలోలికి చెందిన యాపరి వినోద్ గ్రామంలో బెల్టుషాపు నిర్వహిస్తున్నాడు. తన బెల్టుదుకాణంలో మ ద్యం విక్రయం కోసం వైన్స్ షాపుల్లో దొంగతనాలను ఎంచుకున్నాడు. ఇందుకు తన సొంత జిల్లాలో చోరీ చేస్తే దొరికిపోతానని, నిర్మల్ జిల్లాపై ఫోకస్ చేశాడు. తన బెల్టుదుకాణం వద్ద మద్యం తాగేందుకు రెగ్యులర్గా వచ్చే బేగరి రోహిత్, నీరడి శ్రావణ్కుమార్, ఖదులూరి సాయి, ఆదిత్యగౌడ్, సట్ల నవీన్, దిలీప్తో జట్టు కట్టాడు. గత మే నెలలో ముధోల్లోని రాజరాజేశ్వర వైన్స్ షాపు వెనుక రేకులు తొలగించి మందు బాటిళ్లు చోరీకి పాల్పడ్డాడు. తానూరులోని శ్రీ లక్ష్మి వైన్స్షాపులోనూ అదే తరహాలో చోరీ చేశాడు. ఇలా చోరీ చేసిన మందు బాటిళ్లను తన బెల్టుదుకాణంలో విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఇటీవల మరోమారు అదే తరహాలో చోరీ కోసం ముధోల్కు రాగా, అనుమానించిన పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు. ముధోల్లో రూ.2.50 లక్షలు, తానూరులోని వైన్స్ షాప్ల్లో రూ.80 వేల మద్యం బాటిళ్లను చోరీ చేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. నిందితుడి బ్యాంక్ అకౌంట్ను ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో ముధోల్ సీఐ మల్లేశ్, ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణం చెందారు. బావిలో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మద్యానికి బానిసైన యువకుడు, వెన్నునొప్పితో బాధ పడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకున్నారు. బావిలో దూకి ఒకరు.. లక్సెట్టిపేట: బావిలో దూకి ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామానికి చెందిన సౌటేపల్లి మౌళి (32), సంజన దంపతులు. వీరికి పది నెలల కుమారుడు ఉన్నాడు. మౌళి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం ఉదయం వాకింగ్కు వెళ్తున్నానని భార్యతో చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు వెతకుతుండగా లక్సెట్టిపేట మండలం దౌడపల్లి శివారులోని వ్యవసాయ బావి ఒడ్డున చెప్పులు, సెల్ఫోన్ కనిపించాయి. బావిలో గాలించగా మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని రెండో ఎస్సై రామయ్య పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడవచ్చని తండ్రి లచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని యువకుడు.. ఆదిలాబాద్టౌన్: మద్యానికి బానిసైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ సీఐ కె.నాగరాజు కథనం ప్రకారం..పట్టణంలోని తాటిగూడకు చెందిన కుమ్ర రుషికేష్ (24) మద్యానికి బానిసయ్యాడు. కుటుంబీకులు మందలించడంతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. తండ్రి ప్రభు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. జీవితంపై విరక్తితో వ్యక్తి..నర్సాపూర్(జి): వెన్నునొప్పితో బాధపడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహ త్య చేసుకున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. ఆయన కథనం ప్ర కారం.. మండల కేంద్రానికి చెందిన బొల్లి నర్సయ్య (45), లక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నర్సయ్య రెండేళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల్లో చికిత్స పొందిన నయంకాలేదు. ఈక్రమంలో జీవి తంపై విరక్తితో శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ ఆట భిన్నమైనది
సెపక్తక్రా ఆట భిన్నమైనది. కేవలం కాళ్ల సహాయంతోనే ఆడాల్సి ఉంటుంది. నాలుగేళ్ల నుంచి ఆడుతున్నా. ఒకసారి నేషనల్స్కు సెలెక్ట్ అయ్యాను. ఇప్పటి వరకు మూడుసార్లు స్టేట్మీట్లో ఆడితే ఒకసారి గోల్డ్మెడల్ సాధించాను. – నిఖిల్, వరంగల్ బంగారు పతకం సాధిస్తా మూడేళ్లుగా సెపక్తక్రా ఆడుతున్నా. ఒకసారి నేషనల్స్లో, రెండు సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండు సిల్వర్ మెడల్స్ సాధించాను. ఈసారి బంగారు పతకం సాధిస్తాను. – ఆర్.విష్ణువర్థన్, మహబూబ్నగర్ గతేడాది నుంచే ఆడుతున్నా గతేడాది నుంచే సెపక్తక్రా మొదలుపెట్టాను. కోచ్, క్రీడాకారుల ప్రో త్సాహం ఇస్తున్నారు. గ తంలో నేషనల్ పోటీల్లో పాల్గొన్నా ప్లేస్ రా లేదు. రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడోస్థానం సాధించాను. ఈసారి ఫస్ట్ ప్లేస్ కోసం ప్రయత్నిస్తున్నా. – సింగసాని అశ్విత, కరీంనగర్ -
క్రీడలతో ఒత్తిడి దూరం
నిర్మల్టౌన్: అటవీ ఉద్యోగుల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు క్రీడలు నిర్వహిస్తున్నామని రాష్ట్రఅటవీశాఖ చీఫ్ కమిషనర్ జి.చంద్రశేఖర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో అటవీశాఖ ఆధ్వర్యంలో శనివారం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, వాకింగ్, చెస్, లాంగ్ జంప్, షాట్ఫుట్, క్యారమ్, జాలిన్ త్రో, తదితర క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీశాఖ ఉద్యోగులకు మానసికోల్లాసం, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం కోసం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన సుమారు 350 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం వరకు పోటీలు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ డీఎఫ్ఓలు వికాస్ మీనా, రేవంత్ చంద్ర, నాగిని భాను, అధికారులు కుమారి చిన్న, సుధాకర్, శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాకు చేరిన భారత్ అన్యుశుద్ధి యాత్ర
కై లాస్నగర్: దేశంలోని ప్రతి వ్యక్తికి శుద్ధమైన ఆహారం అందాలనే ఉద్దేశంతో గౌరవ్ త్యాగి అనే యువకుడు చేపట్టిన భారత్ అన్యుశుద్ధి యాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరింది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని హపూర్ జిల్లా హైదర్పూర్కు చెందిన త్యాగి జూన్ 26న శ్రీనగర్లోని లాలౌచౌక్ నుంచి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టారు. బాల్య స్నేహితులు రాజత్ భారతి, రియాజ్తో కలిసి ప్రతీరోజుకు 25 నుంచి 30 కి.మీ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తి చేసిన ఆయన మహారాష్ట్ర మీదుగా జిల్లాకు చేరుకున్నారు. పాఠశాల విద్యార్థులు, గృహిణిలు, రైతులను కలుస్తూ ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఇప్పటివరకు 50 వేల మంది చిన్నారులను కలిసి జంక్ఫుడ్ తినొద్దని ప్రతిజ్ఞచేయించినట్లు తెలిపారు. పోకిరీలకు కౌన్సెలింగ్మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్, రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థల వద్ద షీటీమ్ పోలీసులు మఫ్టీలో ఉండి డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద, మినీ బస్టాండ్ వద్ద శనివారం నలుగురు పోకిరీ యువకులను అ దుపులో తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. షీ టీమ్ ఎస్సై ఉషారాణి, పోలీసులు శ్రావణ్కుమార్, శ్రీలత, సిబ్బంది పాల్గొన్నారు. -
కేసులు పెరగకుండా చర్యలు
జిల్లాలో ఫైలేరియా కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. కీటక జనిత నివారణ కార్యక్రమంలో భాగంగానే వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఫైలేరియా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో సర్వే చేపట్టనున్నాం. ఇప్పటికే బృందాలు ఏర్పాటు చేసి రక్త పరీక్షలకు కిట్ల వినియోగంపై ల్యాబ్టెక్నీషియన్లకు అవగాహన కల్పించాం. ఫైలేరియా కేసులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేసుల గుర్తింపు, చికిత్స, కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అనిత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ 2024 మార్చి 31నుంచి పదవీ విరమణ పొందిన వారికి ఇప్పటికీ బెన్ఫిట్స్ అందించలేదని తెలిపారు. కుటుంబ అవసరాలకు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకరయ్య, ఎమ్మెస్రెడ్డి, మాధవరెడ్డి, ఇక్బాల్, కుమారస్వామి, వహిదొద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
ఏళ్ల తరబడిగా తిరుగుతున్నా..
మాకున్న ఎనిమిది ఎకరాల పొలం కోసం బో రుబావి తవ్వించాం. విద్యుత్ కనెక్షన్ కోసం ఏఈని కలిస్తే నాలుగు స్తంభాలు, తీగలు తది తర సామగ్రి కోసం లైన్ ఎస్టిమేషన్, మ్యాప్ వేసి ఇచ్చారు. 2021 జూన్ 11న మా అమ్మ జాడి పద్మ పేరుతో రూ.5,295 చెల్లించి రశీదు, ఇతర ధ్రువీకరణ పత్రాలు అందజేసిన. కొన్ని నెలల వరకు లైన్ ఇవ్వలేదు. పేపర్లు పోయాయి అంటే మళ్లీ అందజేసిన. తహసీల్దార్ కార్యాలయం నుంచి సర్టిఫికేట్ కావాలంటే తీసుకొచ్చిన. ఏళ్ల తరబడి ఏదో కారణం చెబుతూ కనెక్షన్ ఇవ్వడం లేదు. 2023లో విద్యుత్ ప్రజావేదికలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే స్తంభాలు వేశారు. కానీ తీగలు లాగలేదు. కలెక్టరేట్ ప్రజావాణిలో రెండుసార్లు, విద్యుత్ శాఖ డీఈ, ఎస్ఈకి ఫిర్యాదు చేసినా కనెక్షన్ ఇస్తలేరు. – జాడి హర్షవర్థన్, శంకర్పల్లి, సారంగపూర్, మం: మందమర్రి -
13న హోమియోపతి ఉచిత వైద్య శిబిరం
మంచిర్యాలటౌన్: జాతీయ ఆయుష్ పథకంలో భాగంగా ఈ నెల 13న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో హోమియోపతి ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో ఆయుష్ శాఖ వైద్య శిబిరం ఇంచార్జి డాక్టర్ సీహెచ్.స్పందన శిబిరానికి సంబంధించిన కరపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. -
ఆర్జీయూకేటీలో మానసిక ఆరోగ్య దినోత్సవం
బాసర: బాసర ఆర్జీయూకేటీలో శుక్రవారం మానసిక స్వస్థత కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ.. వి ద్యార్థులు మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఉదయం వ్యాయామం, ధ్యానం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శారీరక వ్యా యామాలు, ధ్యానం, మానసిక ఆరోగ్య అవగాహన కోసం క్యాంపస్లో ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శ న్, ఆర్జీయూకేటీ మానసిక స్వస్థత కేంద్రం సిబ్బంది, శారీరక విద్యావిభాగ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన బృందం
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శుక్రవారం అస్కీ బృందం సందర్శించింది. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్ ప్రకారం ఆసుపత్రిలోని పలు విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్వహణ నిర్వహణ తీరు, రోగులకు కల్పిస్తున్న సేవలపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో అస్కీ టీమ్ లీడర్ డాక్టర్ సందేష్రెడ్డి, ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, వైద్యులు మూర్తి, కిరణ్కుమారి, షబ్బీర్, సరిత రాథోడ్, నర్సింగ్ సూపరింటెండెంట్ జోసెఫిన్, సిబ్బంది పాల్గొన్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
రెబ్బెన: మండలంలోని రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని ఖాళీ స్థలం వాగు ఒడ్డు వద్ద శుక్రవారం గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కళాశాల సమీపాన ఉన్న అహ్మద్బిన్ మహ్మద్ ఖాళీ స్థలంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచా రం అందించారు. దీంతో ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించినట్లు ఎస్సై తెలిపారు. మృతు డి వయస్సు 55–60 ఏళ్లు ఉంటుందని, 5.3 అడుగుల ఎత్తు, చామనచాయ రంగు ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుడి ఒంటిపై మెరూన్ రంగు డ్రాయర్, నీలి రంగు టీషర్టు ఉన్నట్లు తెలిపారు. భిక్షాటన చేస్తూ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటాడని, శుక్రవారం తెల్లవారుజామున ఆకలితో మృతి చెంది ఉంటాడని ఎస్సై భావిస్తున్నారు. కాగా, మృతుడి సమాచారం తెలిసినవారు 8712670532 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
‘గిరి’ చిన్నారులకు మిల్లెట్ ఉప్మ
దండేపల్లి: అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా మార్చి చిన్నారుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోంది. చిన్నారుల్లో పోషకాహార లోపాలు అధిగమించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో కొన్నేళ్లుగా మధ్యాహ్న భోజనం అమలు చేస్తోంది. గిరిజన పిల్లలు ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారలోపాన్ని అధిగమించేలా మిల్లెట్ ఉప్మను ఉదయం పూట అల్పాహారంగా అందిస్తున్నారు. మిల్లెట్ ఉప్మ మిక్స్ను గిరి పోషణలో భాగంగా గిరిజన సహకార సంస్థ ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తోంది. గత కొన్ని నెలలుగా వీటి సరఫరా నిలిచిపోగా మళ్లీ ఇప్పుడు సరఫరా అవుతోందని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. జిల్లాలో చెన్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు మినహా మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 974 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని తోటి, కొలాం గిరిజన పిల్లలు ఉన్న 18 అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రమే ప్రస్తుతం మిల్లెట్ ఉప్మను అల్పాహారంగా అందిస్తున్నారు. లక్సెట్టిపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో దండేపల్లి, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లో 203 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటిలో మూడేళ్లలోపు చిన్నారులు 3,714, మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 2,865మంది ఉన్నారు. వీరిలో తీవ్ర పోషణ లోపం గలవాళ్లు 212మంది, అతీ తీవ్ర పోషణ లోపం గలవారు 32మంది ఉన్నారు. తీవ్ర, అతి తీవ్ర పోషణ లోపాల నివారణకు బాలామృతం, కోడిగుడ్లు తదితర ఆహార పదార్థాలు అందిస్తున్నారు. లోప పోషణ గలవారికి బాలామృతం ప్లస్ అందజేస్తున్నారు. లక్సెట్టిపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని తోటి, కొలాం గిరిజన పిల్లలు ఉన్న ఏడు అంగన్వాడీ కేంద్రాల్లో మిల్లెట్ ఉప్మను అల్పాహారంగా అందిస్తున్నట్లు సీడీపీవో రేష్మ తెలిపారు. జన్నారం మండలం తపాలపూర్, జన్నారం–1, కొత్తపేట, పుట్టిగూడ, దండేపల్లి మండలం లింగాపూర్, ముత్యంపేట, లక్సెట్టిపేట మండలం తిమ్మాపూర్ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మిల్లెట్ ఉప్మ అందిస్తున్నారు. -
నెమలిని చంపిన నిందితుల అరెస్ట్
బోథ్: మండలంలోని పొచ్చెర గ్రామ సమీపంలోని చేనులో ముగ్గురు వ్యక్తులు జాతీయ పక్షి నెమలిని చంపారు. ఎఫ్ఆర్వో ప్రణయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాదిగూడ మండలం ఖాండురాంపూర్ గ్రామానికి చెందిన బడ్వాల్ గంగాసింగ్ బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో పాలేరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న చేనులో గడ్డి కోస్తూ ఉండగా గంగాసింగ్కు నాలుగు నెమలి గుడ్లు కనిపించాయి. దీంతో అక్కడికి నెమలి వస్తుందని గమనించాడు. పొచ్చెర గ్రామంలోనే వలస కూలీలుగా ఉన్న గాదిగూడ మండలం లోకారికి చెందిన దత్తు, ఇంద్రవెల్లి మండలం గోపాల్పూర్కు చెందిన బాలాజీతో కలిసి గురువారం రాత్రి గుడ్లపై పొదిగిన నెమలిని కర్రతో కొట్టి చంపాడు. నెమలి, గుడ్లను బైక్పై తీసుకెళ్తుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులు వారి ద్విచక్రవాహనం ఆపి తనిఖీ చేశా రు. వారి వద్ద చని పోయిన నెమలి, గుడ్లు కనిపించగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వారిని రిమాండ్కు తరలించినట్లు ఎఫ్ఆర్వో తెలిపారు. నిందితుల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడిస్తున్న ఎఫ్ఆర్వో -
కరెంటు కనెక్షన్ లేదు..!
మంచిర్యాలఅగ్రికల్చర్: వ్యవసాయానికి కరెంటు కనెక్షన్లు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు విద్యుత్ కార్యాలయాలు, అధికా రుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. విద్యుత్ తీగలు, స్తంభాల కోసం డీడీలు తీసి ఏళ్లు గడుస్తున్నా మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, ప్లాట్లకు మాత్రం స్తంభాలు, తీగలు, లైన్లాగడం, కనెక్షన్లు మంజూరు చేయడం వెంటనే జరిగిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. కొందరు పొలాల వద్దకు ఉన్న పాత స్తంభాల్లో కొంతదూరం కర్రలసాయంతో మరికొంత దూరం సర్వీసు వైరు లాగి మోటార్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. -
బీసీ సంఘాల ఆందోళన.. రాస్తారోకోలు
భీమారం: స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. భీమారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. బంద్కు పిలుపునివ్వగా వ్యాపారస్థంస్థలు, ప్రైవేటు పాఠశాలలు బంద్లో పాల్గొన్నాయి. అంతకుముందు బీసీ కులాల ఐక్య వేదిక నాయకులు ఆవిడం రోడ్డు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బీసీ కులాలకు 42శా తం రిజర్వేషన్లు దక్కకుండా అగ్రవర్ణ కులాలు ప్రయత్నాలు చేస్తున్నాయని మాజీ సర్పంచ్ బెల్లంకొండ నరేందర్, ఆవుల సురేష్, వేముల శ్రీకాంత్గౌడ్, పానుగంటి లక్ష్మణ్ విమర్శించారు. రిజర్వేషన్లను అడ్డుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాస్తారోకోకు ఇతర కుల సంఘాల నాయకులు కూడా సంఘీభావం తెలిపారు. ఎస్సై శ్వేత ఆందోళనకారులతో మాట్లాడి రోడ్డుపై నుంచి పక్కకు జరిపించారు. మంచిర్యాలలో.. పాతమంచిర్యాల: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం బీసీ సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, బీసీ జేఏసీ జల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ బీసీలకు హక్కులు రాకపోవడం వల్ల వెనుకబాటుకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన అనేక ఉద్యమాల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామనే హామీతో బిల్లు తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్ల కల్ప నకు ముందుకు రావాలన్నారు. రాజకీయ పార్టీలు హైకోర్టుకు తమ అభిప్రాయాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బొలిశెట్టి లక్ష్మణ్, కర్నె శ్రీధర్, రమేష్, వైద్య భాస్కర్, రమణాచారీ, రాళ్లబండి రాజన్న, నరసింహ, విద్యార్థి నాయకులు వంశీ పాల్గొన్నారు. దిష్టిబొమ్మ దహనం..పాతమంచిర్యాల: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో శుక్రవారం జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుడు డాక్టర్ నీలకంఠేశ్వర్రావు, బీసీ సంఘం నాయకులు నామని రాజేష్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజబాబు, బీసీ నాయకులు పాల్గొన్నారు. టీఆర్పీ ఆధ్వర్యంలో.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) నాయకులు, తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. -
పేగు బంధానికి వీడ్కోలు
తాండూర్: జీవిత చరమాంకంలో తనకు తలకొరివి పె ట్టి నరకం నుంచి తప్పిస్తాడనుకున్న ఆ కొడుకుకు కన్న తల్లే తలకొరివి పెట్టింది. ఈ విషాద ఘటన మండలంలోని మాదారం టౌన్షిప్లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరా లు.. మాదారం టౌన్షిప్ గ్రామానికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికురాలు సలాకుల రాజమ్మకు రమేశ్, నరేశ్ ఇద్దరు కుమారులున్నారు. వీరిలో రమేశ్ ఏడా ది క్రితమే అనారోగ్యంతో మరణించాడు. ఆ విషా దం నుంచి ఇంకా తేరుకోకముందే ఆ తల్లిని మరో చేదు వార్త వెంటాడింది. చిన్న కుమారుడు నరేశ్ కూడా ఫిట్స్తో గురువారం మృతి చెందాడు. దీంతో ఆమె అంతులేని శోకాన్ని అనుభవించాల్సిన పరి స్థితి నెలకొంది. శుక్రవారం నరేశ్ అంత్యక్రియలు నిర్వహించగా తల్లి రాజమ్మే కుండపట్టి కొడుకును కాటివరకు సాగనంపింది. తీవ్ర దుఃఖాన్ని దిగమింగుతూ కొడుకు చితికి నిప్పంటించి పేగు బంధానికి కన్నీటి వీడ్కోలు పలికింది. రాజమ్మ రోధించిన తీరుకు పలువురు కంటతడి పెట్టుకున్నారు. నరేశ్కు భార్య, కుమార్తె ఉంది. ఏడాది వ్యవధిలోనే రాజమ్మ ఇద్దరు కుమారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
మంచిర్యాలఅర్బన్: ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్–14, 17 బాలబాలికల అథ్లెటిక్ ఎంపిక పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కాసిపేట జెడ్పీహెచ్ఎస్ సహకారంతో మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 600మందికి పైగా క్రీడాకారులు ఉత్సహంగా పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటేశ్వరస్వామి, మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రెటరీ యా కూబ్, పాఠశాల హెచ్ఎం సాంబమూర్తి, పర్యవేక్షకులు రేణి రాజయ్య, భూక్యా రాజన్న, పీడీ మార య్య, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేడు వాలీబాల్ ఎంపిక పోటీలుఈనెల 11న పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో లక్సెట్టిపేట జెడ్పీహెచ్ఎస్ (బాలికలు) పాఠశాలలో అండర్–17, 14 బాలికల జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి యాకూబ్ ఓ ప్రకటనలో తెలిపారు. పాల్గొనే క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. -
మహిళలు.. మహారాణులు!
గ్రామంలోనే వ్యాపారం చేస్తున్న డ్వాక్రా సంఘంలో రూ.5లక్షలు రుణం తీసుకుని గ్రామంలోనే బట్టల షాపు, లేడీస్ టైలర్, ఎంబ్రాయిడరీ, మ్యాచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న. స్వయంగా దూరప్రాంతాలకు వెళ్లి కొత్త కొత్త నమూనాలు ఎంపిక చేసి తీసుకువస్తున్న. కస్టమర్లు కోరిన నమూనాలు అందిస్తున్న. పది మందికి కుట్టు శిక్షణ కూడా ఇస్తున్న. వ్యాపారంలో వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణకు సహకారం అందిస్తున్న. – పద్మ, తానూరు తానూరు: మహిళలు పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇంటిని చక్కదిద్దడమే కాదు.. కుటుంబ పోషణకు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. విద్య, రాజకీయం, ఉద్యోగాలతో పాటు వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. డ్వాక్రా సంఘంలో తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే వివిధ వ్యాపారాల్లో రాణిస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న కొందరు మహిళలపై కథనం..ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న సంఘంలో రుణం తీసుకుని ఆర్సీఎం హోల్సేల్ షాప్ ప్రారంభించిన. వ్యాపారంలో కొనసాగుతూ లాభాలు గడిస్తున్న. వ్యాపారంలో వచ్చిన ఆదాయాన్ని రుణ వాయిదాలు చెల్లించి మిగతా డబ్బులను కుటుంబ పోషణ కోసం ఖర్చు చేస్తున్న. కొంత మొత్తాన్ని పొదుపు కూడా చేస్తున్న. నా భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ ఆర్థికాభివృద్ధి సాధించడం సంతోషంగా ఉంది. – అంజనాబాయి, తానూరు సీ్త్రశక్తి ద్వారా రుణాలిస్తున్నాం గ్రామాల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు వ్యాపారం చేసుకోవడానికి సీ్త్రశక్తి ద్వారా తక్కవ వడ్డీకి రుణాలు ఇస్తున్నాం. స్వయం ఉపాధి వైపు వారిని ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే తానూరు మండలంలో 725 మహిళా సంఘాలు కొనసాగుతున్నాయి. ఈ సంఘాలకు రూ.16కోట్ల రుణాలందించాం. రుణాలు పొందిన మహిళలు వ్యాపారాలు కొనసాగిస్తూ ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు. – సులోచనరెడ్డి, ఐకేపీ ఏపీఎంప్రమిదలు తయారు చేస్తున్న గ్రామంలోని స్వయం సహాయక సంఘం ద్వారా రుణం తీసుకుని మట్టి ప్రమిదలు తయారు చేస్తున్న. వాటిని స్వయం సహాయక సంఘాలు, మార్కెట్కు సరఫరా చేస్తూ లాభాలు పొందుతున్న. ఇప్పటికే డ్వాక్రా సంఘాలకు ఐదువేల ప్రమిదలు సరఫరా చేసేందుకు అధికారుల నుంచి ఆర్డర్ వచ్చింది. రుణం తీసుకుని కులవృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. – చంద్రబాయి, కోలూరు ఇంటి పనులు చేసుకుంటూనే.. డ్వాక్రా సంఘంలో తక్కువ వడ్డీకి రుణం తీసుకుని మార్కెట్లో బ్యూటీ పార్లర్, లేడీస్ టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మ్యాచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న. మా పిల్లలను పాఠశాలకు పంపించి ఇంటి పనులు ముగించుకుని వ్యాపారం చేస్తున్న. టైలరింగ్లో యువతకు శిక్షణ ఇస్తున్న. ఒక వ్యాపారం చేస్తున్నప్పుడే కొత్త ఆలోచనలకు అవకాశం కలుగుతుంది. సమాజంపై అవగాహన వస్తుంది. – విజయలక్ష్మి, తానూరు -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
జైపూర్: మండలంలోని కిష్టాపూర్ గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. శుక్రవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా కిష్టాపూర్ వద్ద గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఒక్క ట్రాక్టర్ షెట్పల్లి వద్ద, మరో రెండు ట్రాక్టర్లు నర్సింగాపూర్ వద్ద పట్టుబడగా వాటిని పోలీస్స్టేష న్ తరలించి యజమానులపై కేసులు నమో దు చేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
● జిల్లాలో 892మంది వ్యాధిగ్రస్తులు ● ట్రాన్స్మిషన్ అసెస్మెంటు సర్వే(టాస్)కు జిల్లా ఎంపిక ● 20ఏళ్లు పైబడిన వారికి రక్త పరీక్షలు ● జిల్లా వ్యాప్తంగా 20బృందాలు ఏర్పాటు
మంచిర్యాలటౌన్: జిల్లాలో బోదకాలు(ఫైలేరియా) కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ట్రాన్స్మిషన్ అసెస్మెంటు సర్వే(టాస్)లో భాగంగా జిల్లాలో ఎక్కువగా ఫైలేరియా కేసులు నమోదవుతున్న ప్రాంతంలో ప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఈ నెల 13నుంచి 22వరకు రక్త పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 20ఏళ్లు పైబడిన వారిని సర్వే చేసి అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరిస్తారు. వ్యాధి నిర్ధారణ కోసం ఇప్పటికే సిద్ధం చేసిన కిట్లపై ల్యాబ్ టెక్నీషియన్లకు ఇటీవల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జిల్లాలో ప్రతియేటా బోదకాలుపై సర్వే చేసి గుర్తించిన వారికి మందులు, చికిత్స అందిస్తున్నారు. అయినా కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడి వారిలోని కొందరికి ర్యాండమ్గా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం వ్యాధి బారిన పడ్డ వారికి చికిత్స అందిస్తూనే 2030నాటికి జిల్లాలో బోదకాలు అనేది లేకుండా చేయాలని, ఫైలేరియా నియంత్రణే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నెల 7న కేంద్ర కీటక జనిత వ్యాధుల అడిషనల్ డైరెక్టర్(రీజినల్) డాక్టర్ అనురాధ జిల్లాలోని వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ల్యాబ్టెక్నీషియన్లు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కల్పించారు. 20బృందాలతో ఇంటింటికి.. బోదకాలు వ్యాధి నిర్ధారణ అయిన గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని 20ఏళ్లు పైబడిన వారిలో ఫైలేరియా ఉందో లేదో తెలుసుకునేందుకు 20 బృందాలు సర్వే చేయనున్నాయి. వ్యాధి నిర్ధారణ కిట్లు ఇప్పటికే వైద్య సిబ్బందికి అందించగా.. వ్యాధి నిర్ధారణ త్వరగా చేసి మందులు, అవసరం మేరకు మెరుగైన వైద్యం కోసం సదుపాయాలు ఉన్న ఆస్పత్రులకు రెఫర్ చేయనున్నారు. దోమకాటు ద్వారా వ్యాప్తిచెందే ఈ వ్యాధి ప్రస్తుతం ఎవరిలో ఉందో గుర్తించి చికిత్స, మందులు అందించడం, వ్యాధిని గుర్తించిన ప్రాంతంలో ఇతరులకు వ్యాధి సోకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోనున్నారు. గతంలో సర్వే చేసినా అనుమానితుల నమూనాలు మాత్రమే సేకరించేవారు. కానీ ఈ ఏడాది బోదకాలు వ్యాధి సోకిన ప్రాంతంలోని ప్రతీ ఒక్కరికి వైద్య పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేశారు. చికిత్స, మందులతో నివారణ ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్న వారికి క్యూలెక్స్ దోమ కుట్టి ఇతరులను కుట్టడం వల్ల వ్యాధి సోకుతుంది. బాధితుల కాళ్లు పెద్దగా వాపు వచ్చి నడవలేని స్థితిలో బాధపడుతుంటారు. వారి పనులను కూడా చేసుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. పురుషుల్లోని కొందరికి కాళ్లవాపులు కాకుండా వృషణాల్లో వాపు వచ్చి బోదకాల వ్యాధికి గురయ్యే అవకాశాలున్నాయి. ఈ వ్యాధి సోకినప్పుడు కాళ్లు, చేతులు, రొమ్ము, వృషణాల్లో ఏదో ఒక చోట పరిమితికి మించిన వాపు కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారి కాళ్లు, చేతులు స్పర్శను కోల్పోయి పరిమితికి మించిన వాపు పెరగడం వల్ల కదిలించే పరిస్థితి ఉండదు. దీంతో వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు గాను రెండేళ్లకు పైబడిన వారందరికీ ప్రతియేటా మందులు పంపిణీ చేస్తున్నారు. బోదకాల వ్యాధి రాకుండా ఉండేందుకు డీఈసీ మాత్రలు(100ఎంజీ), ఆల్బెండజోల్ 400 ఎంజీ మాత్రలు ఇస్తారు. పీహెచ్సీల వారీగా నమోదైన కేసులు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ) పరిధిలో 892మంది బోదకాలు వ్యాధిగ్రస్తులు ఉన్నారు. జన్నారం పీహెచ్సీలో 269, తాళ్లపేట్ 14, దండేపల్లి 99, వెంకట్రావ్పేట్ 64, హాజీపూర్ 50, మందమర్రి 60, కాసిపేట 47, జైపూర్ 25, కుందారం 5, నస్పూర్ 10, భీమిని 66, అంగ్రాజ్పల్లి 5, కోటపల్లి 2, వేమనపల్లి 5, తాళ్లగురిజాల 47, నెన్నెల 29, పాతమంచిర్యాల యూపీహెచ్సీలో 19, రాజీవ్నగర్ 14, దీపక్నగర్ 14, శంశీర్నగర్ 16 కేసులు ఉన్నాయి. -
గంజాయి సాగు చేస్తున్న యువకుడి అరెస్ట్
జైపూర్: గంజాయికి అలవాటు పడిన యువకుడు ఏకంగా ఇంటి సమీపంలోనే మొక్కలు పెంచుతుండడంతో పక్కా సమాచారం మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రామారావుపేట గ్రామానికి చెందిన బొద్దున సత్యనారాయణ అనే యువకు డు గంజాయికి అలవాటు పడ్డాడు. తన ఇంటి స మీపంలోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై శ్రీధర్, తన సిబ్బందితో వెళ్లి తనిఖీ చేశారు. సత్యనారాయణ ఇంటి ఆవరణలో పెంచుతున్న గంజాయి మొక్కలు స్వాధీ నం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. రిమాండ్కు తరలించి చెన్నూర్ కోర్టులో హాజరు పరిచారు. గంజాయి రవాణా చేసినా, విక్రయించినా, సాగు చేసినా కఠినచర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. తిర్యాణి మండలంలో.. ఆసిఫాబాద్అర్బన్: తిర్యాణి మండల పరిధిలోని చెలిమెల గ్రామం కొద్దుగూడ శివారులో ఆత్రం పాపారావ్ (32) తన కంది చేనులో గంజాయి సాగు చేస్తుండగా అతడిపై కేసు నమోదు చేసినట్లు తిర్యాణి ఎస్సై వెంకటేశ్ తెలిపారు. 10గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జైపూర్: గంజాయి మొక్క, నిందితుడితో ఎస్సై ఆసిఫాబాద్అర్బన్: పోలీసుల అదుపులో నిందితుడు -
డిప్యూటీ రేంజ్ ఆఫీసర్పై దాడి
కాగజ్నగర్ రూరల్: మండలంలోని రాస్పెల్లి శి వారు అటవీ భూమి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బాబు పాటేకర్, అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. వాటిని రాస్పెల్లి నుంచి కాగజ్నగర్ రేంజ్ కార్యాలయానికి తరలిస్తున్న క్ర మంలో ట్రాక్టర్ యజమాని నాసిద్అలీ ఖాన్ అ డ్డుకుని ఫారెస్ట్ అధికారులతో వాగ్వాదానికి ది గాడు. తాను పట్టా భూముల నుంచి మాత్రమే ఇసుక తరలిస్తున్నానని, అది అటవీ ప్రాంతం కాదని వాదించాడు. అయితే నాసిద్అలీ ఖాన్ తమ విధులకు ఆటంకం కలిగించడంతో పా టు తనపై దాడి చేశారని డిప్యూటీ రేంజ్ ఆఫీస ర్ బాబుపాటేకర్ ఈజ్గాం పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఈ మేరకు నాసిత్అలీఖాన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈజ్గాం ఎ స్సై కల్యాణ్ తెలిపారు. పట్టుకున్న ఆరు ట్రాక్టర్లను రేంజ్ కార్యాలయానికి తరలించారు. మద్యానికి బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్య అన్నం పెట్టినోడికే కన్నం..ఆదిలాబాద్టౌన్: అన్నం పెట్టినోడికే కన్నం పె ట్టిన సామెత ఈ ఘటనకు అద్దం పడుతోంది. ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్కు చెందిన జీ అశోక్ ఇంటి సమీపంలో అపరిచిత వ్యక్తి శుక్రవారం కూర్చొని ఉన్నాడు. అతడి వద్దకు వెళ్లిన అశోక్ ఇక్కడ ఏం చేస్తున్నావని అడగగా, తనకు ఆకలి అవుతోందని అన్నం పెట్టమని కోరాడు. దీంతో బాధితుడు తన ద్విచక్ర వాహనాన్ని నడపమని చెప్పి తాను వెనుక కూర్చున్నాడు. తెలంగాణ చౌక్ ప్రాంతంలో మద్యం తాగించి భోజనం చేయించాడు. ఈ క్రమంలో అశోక్ అక్కడే ఉండగా నిందితుడు బైక్ తీసుకుని పారిపోయాడు. సీసీ ఫుటేజ్లో ఈ దృశ్యం రికార్డయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ వివరించారు. -
నిబంధనల ప్రకారం సమాచారం అందించాలి
● జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య మంచిర్యాలఅగ్రికల్చర్: సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు నిబంధనల ప్రకారం సమాచారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, అప్పిలేట్ అధికారులు, ప్రజాసమాచార, సహాయ ప్రజా సమాచార అధికారులతో సమాచార హక్కు చట్టం–2025పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంలో పారదర్శకత, జవాబుదారీతనం అవశ్యకమని అన్నారు. దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అందజేయాలని సూచించారు. సమాజంలో ప్రతీ అంశంపై అవగాహన కలిగిన పౌరులు సమాజాభివృద్ధికి పునాది వంటి వారని తెలిపారు. 13న అప్రెంటిస్షిప్ మేళామందమర్రిరూరల్: మండల కేంద్రంలోని ప్ర భుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 13న అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ దేవానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి బహుళజాతి కంపెనీలతోపాటు స్థానిక ఇంజినీరింగ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని వివరించా రు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐటీఐ పూర్తిచేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటర్వ్యూకు వచ్చే వారు సంబంధిత ధ్రువపత్రాలు తీసుకురావాలని సూచించారు. -
‘రాజకీయ ప్రయోజనాల కోసమే రిజర్వేషన్ల అంశం’
పాతమంచిర్యాల: బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే సామాజిక బాధ్యత ప్రభుత్వం గుర్తించినప్పటికీ అందుకు చట్టబద్ధత చర్యలు లేకుండా కేవలం రాజకీయ లాభాల కోసమే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకురావడం దురదృష్టకరమని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చట్ట పరిధిలో ఆలోచన చేయకపోవడం శోచనీయమని తెలిపారు. బీసీల హక్కుల సాధన పోరాటంలో సీపీఐ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలిందర్ అలీఖాన్, నాయకులు వెంకటస్వామి, చంద్రశేఖర్, చిప్ప నర్సయ్య, కే.నగేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పుస్తక రచనలో జిల్లా ఉపాధ్యాయులు
నిర్మల్ఖిల్లా: తెలంగాణ తెలుగు అకాడమీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగే పుస్తక ప్రచురణ సంస్థ. సంస్థ డీఎస్సీకి రూపొందించిన స్టడీ మెటీరియల్లో భౌతిక రసాయన శాస్త్రం కంటెంట్ పుస్తక రచనలో నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. కడెం జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు పీ నారాయణవర్మ, తానూరు మండలం భోసి జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయురాలు సీహెచ్ వందనకుమారి భాగస్వాములయ్యారు. గత జనవరిలో ఈ పుస్తకం తుదిరూపు దిద్దుకోగా తాజాగా ప్రచురితమై అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ పుస్తకం డీఎస్సీ, టెట్ పరీక్షల కోసం తెలుగు మీడియం వారికి ప్రయోజనకారిగా ఉండనున్నట్లు పుస్తక రచయితలు తెలిపారు. వీరిరువురు 24 ఏళ్లుగా సైన్స్ ఫెయిర్, ప్రాజెక్ట్ పద్ధతుల ద్వారా విద్యార్థుల్లో సైన్స్పై జిజ్ఞాస పెంచడంలో సఫలీకృతులయ్యారు. పాఠ్యాంశాల బోధనలోనూ తమదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అందుబాటులోకి వచ్చిన తెలుగుఅకాడమీ పుస్తకం నారాయణవర్మ, వందనకుమారి -
ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే భూకబ్జాలు
నస్పూర్: పట్టణ పరిధిలోని ప్రభుత్వ భూములు స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే కబ్జాకు గురవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. నస్పూర్లోని విలువైన ప్రభుత్వ స్థలాలను కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని, వాటిని పరిరక్షించాల్సిన రెవెన్యు, పోలీస్ అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ప్రతీ గజానికి ఓ ధర నిర్ణయించి మరీ కబ్జాలను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. ఇన్కంటాక్స్ కార్యాలయ స్థలం కబ్జాకు కొందరు చదును చేయగా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా రెవెన్యు అధికారులు స్పందించి ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. సదరు భూమిలో బోర్డు తీయించి కబ్జాను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు రూ.30 లక్షలు డిమాండ్ చేశారనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం కబ్జాకు గురవుతున్నా అదికారులు పట్టనట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. నస్పూర్ శివారులోని 42, 119 సర్వేనంబర్లలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన స్థలాలు కబ్జాకు గురి కాకుండా పరిరక్షించాల్సి బాధ్యత కలెక్టర్, రెవెన్యు, పోలీస్ అదికారులపై ఉందన్నారు. కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేశారు. అనంతరం స్థానిక నాయకుల భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఏఓ రాజేశ్వర్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు, పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సురేందర్రెడ్డి, నాయకులు వంగ తిరుపతి, బేర సత్యనారాయణ, మేరుగు పవన్, రాజేంద్రపాణి, బాకం నగేశ్, జనార్ధన్, పానుగంటి సత్తయ్య, గరిశె రామస్వామి, రఫీక్, తదితరులు పాల్గొన్నారు. -
రూ.19.60 లక్షలు పట్టివేత
కోటపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్లో భాగంగా మండలంలోని పార్పల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో రూ.19.60 లక్షలు పట్టుకున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. మహారాష్ట్రలోని సిరోంచా తాలుకాకు చె ందిన నిఖిల్చందర్ గడ్చిరోలికి కారులో వెళ్తున్నా డు. ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకుండా రూ. 19.60లక్షలు తరలిస్తుండగా కారు తనిఖీ చేశారు. నగదును సీజ్ చేసి కోటపల్లి తహసీల్ధార్ రాఘవేందర్రావుకు అప్పగించినట్లు ఎస్సై రాజేందర్ తెలి పారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
టేకు చెట్ల నరికివేత
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ పరిధిలో స్మగ్లర్లు టేకుచెట్లను నరికివేస్తున్నట్లు తెలుస్తోంది. తాళ్లపేట్ అటవీ రేంజ్లోని తానిమడుగు, చింతపల్లి ప్రాంతాల్లో విలువైన టేకుచెట్లు నరికివేతకు గురైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొండుగూడ బీట్లోని గొండుగూడ, జువ్విగూడ, పైడిపెల్లి ప్రాంతాల్లో సుమారు 20 వరకు టేకుచెట్లు నరికివేతకు గురైనట్లు తెలుస్తోంది. గ్రామాల సమీపం నుంచే చెట్లను నరికి కలపను తరలించుకుపోయారు. జువ్విగూడకు చెందిన ఓ వ్యక్తి ఈ చర్యకు పాల్పడినట్లు అధికారులు గుర్తించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగి మూడు రోజులవుతున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయమై జన్నారం ఇన్చార్జి రేంజ్ అధికారి మమతను ఫోన్లో సంప్రదించగా, చెట్లు నరికివేసిన వ్యక్తిని గుర్తించామన్నారు. శాఖపరమైన సమావేశాల కారణంగా చర్యలు తీసుకోకపోయామని, తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సరైన సాంత్వన అవసరం
యువత, మధ్యవయస్కులు చిన్నచిన్న విషయాలకు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కలిసి మా ట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కుటుంబ పెద్దలు, స్నేహితులు, మానసిక నిపుణుల స హాయం తీసుకుంటే సమస్యల నుంచి బయటపడవచ్చు. మానసిక సాంత్వన ద్వారానే ఈ పరిస్థితులను అధిగమించగలం. – డాక్టర్ అల్లాడి సురేశ్, మానసిక వైద్యనిపుణులు, నిర్మల్ అనుబంధాలు బలపర్చుకోవాలి ప్రతిరోజూ కొంత మనస్సుకు నచ్చిన పనులకు కేటాయించాలి. నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉండాలి. సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో అనుబంధాలను బలపర్చాలి. ఒత్తిడి ఉంటే ధ్యానం, యోగా, నడక చేయాలి. – డా.టి.సంపత్కుమార్, నవలా రచయిత, నిర్మల్ -
ఆవు దాడిలో పలువురికి గాయాలు
ఇంద్రవెల్లి: ఆవు దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలకేంద్రంలో సంచరిస్తున్న ఆవు పిచ్చికుక్క దాడికి గురైంది. గురువారం రహదారిపై వెళ్లేవారు, పాఠశాలకు వెళ్తున్న చావన్ గోలు(12), మతిస్థిమితం లేని కమలపై ఆవు దాడి చేసి గాయపర్చింది. కొందరిపై దా డికి యత్నించింది. గాయాలైన వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. వి షయం తెలుసుకున్న పంచాయతీ అధికారులు.. ఆవును బంధించి ఊరి బయటకు తీసుకెళ్లి చెట్టుకు కట్టేశారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
టేకు కలప పట్టివేత
ఇచ్చోడ: మండలంలోని బావోజిపేట్ అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను గురువారం తెల్లవారుజాము టైగర్జోన్ అటవీ అధికారులు పట్టుకున్నారు. కొందరు స్మగ్లర్లు ఎడ్లబండ్లపై అటవీ ప్రాంతం నుంచి టేకు కలప తరలిస్తున్నారని సమాచారంతో బేస్ క్యాంప్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. స్మగ్లర్లు వారిని గమనించారు. కలప తరలిస్తున్న బండ్లను అక్కడే వదిలి ఎడ్లతో పరారీ అయినట్లు సిరిచెల్మ సెక్షక్షన్ అధికారి రాకేశ్ తెలిపారు. పట్టుకున్న కలప విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని పేర్కొన్నారు. -
మోయలేని భారం..
లక్ష్మణచాంద: కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) పరిధిలో ప్రైవేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులపై ఫీజుల భారం పెరిగింది. మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్ష ఫీజు నిరుపేద, మధ్యతరగతి వారికి భారంగా మారింది. ఈ విద్యా సంవత్సరం ఈనెల 15 వరకు ఫీజు చెల్లించాలని కేయూ ప్రకటించింది. డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు గతేడాది పోల్చితే మూడింతలుగా పెరిగింది. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో గత సంవత్సరం చేరిన విద్యార్థులు మొదటి సెమిస్టర్లో రిజిస్ట్రేషన్ ఫీజు రూ.80, ప్రాసెసింగ్ రూ.300, స్టూడెంట్ రికగ్నిషన్ రూ.300, స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్ రూ.50, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ రూ.60 ఇలా మొత్తం రూ.790 చెల్లించారు. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1200, స్టూడెంట్ రికగ్నిషన్ రూ.800, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ రూ.300, స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్ రూ.200 ఇలా మొత్తం రూ.2500కు పెంచారు. దీంతోపాటు మొదటి సంవత్సరం పరీక్ష ఫీజు రూ.750 కలిపి మొత్తం రూ.3250 చెల్లించాల్సి రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుకు దూరం గత నాలుగేళ్ల నుంచి ప్రైవేటు డిగ్రీ కళాఽశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ ప్రస్తుతం డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రథమ సెమిస్టర్ రాసే విద్యార్థులకు విశ్వవిద్యాలయానికి చెల్లించాల్సిన ఫీజులను మూడింతలు పెంచింది. దీంతో చెల్లించలేక డిగ్రీ చదువులకు దూరమవుతామని పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు పెంచిన పరీక్ష ఫీజులు తగ్గించి చదువు కొనసాగించేలా చూడాలని కోరుతున్నారు. కేయూ పరిధిలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలు జిల్లాలు సంఖ్య నిర్మల్ 26 ఆదిలాబాద్ 22 మంచిర్యాల 15 కుమురంభీం 5 మొత్తం 68 (సుమారు 3 వేల మంది ఫస్టియర్ చదువుతున్నారు) -
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
భైంసాటౌన్/బాసర: భైంసాలోని అంబేద్కర్నగర్ కు చెందిన ఆగ్రే అక్షయ్ (27) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బాసర సీఐ టి.సాయికుమార్ కథనం ప్రకారం.. అక్షయ్ గురువారం సాయంత్రం బాసర వై పు నుంచి భైంసాకు వస్తుండగా టాక్లి వద్ద గు ర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న అక్షయ్కు తీవ్ర గాయాలు కాగా, గమనించిన స్థానికులు అంబులెన్స్లో భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే అక్షయ్ మృతి చెందినట్లు వై ద్యులు ధ్రువీకరించారు. అక్షయ్ మూడేళ్ల క్రి తం ప్రేమ వివాహం చేసుకోగా, పులేనగర్లో నివాసముంటున్నాడు. అతని మృతిపై కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
మాటేగాంలో చోరీ
భైంసారూరల్: మండలంలోని మాటేగాం గ్రామంలో చోరీ జరిగింది. ఎస్సై శంకర్, బాధితులు తెలిపిన వివరాలు.. వెంకట్రెడ్డి, రాజు పటేల్, శ్రావణ్రెడ్డి.. మందులు, ఫొటోస్టోడియో దుకాణాలను బుధవారం రాత్రి మూసివేసి ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం వెళ్లి చూడగా కౌంటర్ తీసి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని సీసీపుటేజీలను పరిశీలించారు. దుకాణం ఒకవైపు రేకు తొలగించి దుండగుడు లోనికి చొరబడ్డాడు. కౌంటర్లో రూ.1500 ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
చెరువులో దూకి రిటైర్డ్ కార్మికుడి ఆత్మహత్య
తాండూర్: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు పెద్దింటి ప్రభాకర్(64) గురువారం గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. ప్రభాకర్ గత కొంత కాలంగా తీవ్రంగా మద్యానికి బానిసకావడంతో కుటుంబ సభ్యులు తరచూ మందలించేవారు. గురువారం తీవ్రంగా మద్యం తాగిన ప్రభాకర్ను మందలించడంతో మనస్తాపం చెందాడు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మానసిక స్థిరత్వం.. ప్రశాంత జీవనం
మానసిక ఆరోగ్య సహాయం: టోల్ ఫ్రీ నంబర్: 14416 లేదా 1800 891 4416 నిర్మల్ఖిల్లా: శారీరక ఆరోగ్యం ఉన్నా, మానసిక ప్రశాంతత లేకపోతే జీవితం అస్థిరమవుతుంది. నేటి వేగవంతమైన జీవనశైలిలో స్వీయ నియంత్రణ లోపం, కుటుంబ విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, అహంభావం వంటి కారణాలు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రపంచ మానసిక ఆరోగ్యసంస్థ ఆధ్వర్యంలో 1994వ సంవత్సరం నుంచి ఏటా అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ సంవత్సరం 2025 థీమ్: సమాజపు మానసిక శ్రేయస్సును బాధ్యతగా సంరక్షిద్దాం’. ఈనేపథ్యంలో సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. చిన్న విభేదాలు, పెద్ద విషాదాలు ఇటీవల నిర్మల్ జిల్లా సహా పలు ప్రాంతాల్లో, చిన్న కుటుంబ విభేదాలు ప్రాణ నష్టాలకు దారితీస్తున్నాయి. భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆర్థిక ఒత్తిడి, అనుమానాలు, అహంభావం–ఇవన్నీ కలిసిమెలిసి విషాదాంతాలు సృష్టిస్తున్నాయి. తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు, సోదరీమణుల మధ్య కూడా చిన్న కారణాలు పెద్ద విభేదాలకు దారితీస్తున్నాయి. వ్యవసాయం, వ్యాపారం లేదా ఉద్యోగంలో నష్టాలు కూడా జీవితాలను ముగించే పరిస్థితులను తెస్తున్నాయి. మానసిక నియంత్రణ రక్షణ కవచం మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, చాలా సమస్యలు క్షణికావేశం వల్లే విషాదానికి దారితీస్తున్నాయి. ఒక్క క్షణం మౌనం, ఆలోచనతో కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. స్వీయ నియంత్రణతో మనస్సును స్థిరపర్చుకోవడం అత్యంత అవసరం. కుటుంబంలో తగాదా వచ్చినపుడు ప్రేమతో, అవగాహనతో పరిష్కారం కనుగొనాలి. కోపం, అహం విభేదాలను పెంచుతాయి. ఒక క్షణం ఆలోచిస్తే ప్రాణాలు మాత్రమే కాకుండా, సంబంధాలు, ప్రేమ కూడా నిలుస్తాయి. కాగా, జిల్లాలో భరోసా కేంద్రాలు, సఖీ, షీటీమ్ వంటి వ్యవస్థలు తోడ్పాటునందిస్తున్నాయి. మానసిక నిపుణులు అందుబాటులో ఉన్నారు. -
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి చిప్పకుర్తి జగదీష్ 57–60 కిలోల విభాగంలో అండర్–17లో బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్మల్లో జరిగిన జోనల్ స్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. ఈనెల 10న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాడు. హెచ్ఎం బండి రమేశ్, పీడీ రాజయ్య గురువారం జగదీశ్ను అభినందించారు. సెల్ఫోన్ చోరీకి యత్నించిన యువకుడి రిమాండ్ఆదిలాబాద్టౌన్: సెల్ఫోన్ చోరీకి యత్నించిన బీహార్కు చెందిన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తె లిపారు. పట్టణంలోని ఖానాపూర్కు చెందిన స య్యద్ సాదిక్ అలీ బుధవారం సాయంత్రం రైతుబజార్లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వె ళ్లాడు. ఆ సమయంలో షేక్ అజ్మీర్.. సయ్యద్ సాది క్ అలీ జేబులోని సెల్ఫోన్ చోరీకి ప్రయత్నించాడు. గమనించిన సాదిక్ అలీ అతన్ని పట్టుకుని పో లీసుస్టేషన్లో అప్పగించారు. ఆయన ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఎలకి్ట్రక్ వాహనం బ్యాటరీల చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని భుక్తాపూర్లో షా హిద్ అహ్మద్ తవక్కల్ ఇంటి ముందున్న ఎలకి్ట్రక్ వాహనం నుంచి బ్యాటరీలు, రెండు ఛార్జర్లు, ఆటోలో అమర్చిన రెండు బ్యాటరీలను బుధవారం రాత్రి చోరీకి గురయ్యాయి. బాధితుడి షాహిద్ అహ్మద్ ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా వడ్డెర కాలనీకి చెందిన మంజుల ఈశ్వర్ను గుర్తించి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అతని నుంచి బ్యాటరీలు, ఛార్జర్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. జిల్లాస్థాయి టెబుల్ టెన్నీస్ పోటీల్లో ప్రతిభమంచిర్యాలరూరల్(హాజీపూర్): ముల్కల్ల జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్–17, 14 బాల, బాలికల జిల్లాస్థాయి టెబుల్ టెన్నీస్ పోటీలను జిల్లా ప్రధాన కార్యదర్శి యాకూబ్ గురువారం ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి దాదాపు 60 మంది వి ద్యార్థులు పాల్గొన్నారు. అండర్–14 బాలుర విభా గంలో ప్రథమ స్థానంలో సుప్రతిక్వర్మ(అల్ఫోర్ మంచిర్యాల), ద్వితీయ స్థానంలో సాయిశృత్విక్(ముల్కల్ల జెడ్పీ పాఠశాల), బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో సాద్వి(ఓరియంట్ దేవాపూర్ పాఠశాల), ద్వితీయ స్థానంలో సాన్విశ్రీ, శ్రావణి(కార్మల్ పాఠశాల–మంచిర్యాల)లు నిలిచారు. అండర్–17 బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో సాయివివేక్(ఎంజేపీ–లక్సెట్టిపేట), ద్వితీయ స్థాన ంలో ధనుష్(ఎంజేపీ–లక్సెట్టిపేట), బాలికల విభా గంలో ప్రథమ స్థానంలో సత్యచతుర్వేది(కార్మల్ పాఠశాల–మంచిర్యాల), ద్వితీయ స్థానంలో నక్షత్ర(ఓరియంట్ దేవాపూర్ పాఠశాల) నిలిచారు. వీరు త్వరలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరగబోయే జోనల్ స్థాయి టేబుల్ టెన్నీస్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. హెచ్ఎం రాజేశం పాల్గొన్నారు. -
కేసుల దర్యాప్తులో అలసత్వం వహించొద్దు
కోటపల్లి: కేసుల దర్యాప్తులో అధికారులు అలసత్వం వహించొద్దని, ప్రజాఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. గురువారం ఆయన కోటపల్లి పోలీసుస్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల వివరాలు, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. డయల్ 100 కాల్స్కు తక్షణమే స్పందిస్తూ సంఘటన స్థలానికి చేరుకోవాలని తెలిపారు. అనంతరం కోటపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించి ఆధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో సీఐ బన్సిలాల్, ఎస్సై రాజేందర్ పాల్గొన్నారు. గొప్ప లక్ష్యాలు ఎంచుకోవాలి చెన్నూర్రూరల్: విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో రాణించేందుకు గొప్ప లక్ష్యాలను ఎంచుకోవాలని డీసీపీ భాస్కర్ అన్నారు. మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు కేరియర్ గైడ్లెన్స్ అనే అంశంపై గురువారం జీకే పరీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీసీపీ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ పట్టణ సీఐ దేవేందర్రావు, ఎంపీడీవో మోహన్, కళాశాల ప్రిన్సిపాల్ ఎంవి.పట్వర్దన్, వైస్ ప్రిన్సిపాల్ కిశోర్, అధ్యాపకులు పాల్గొన్నారు. కాగా, డీసీపీ భాస్కర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజ్మత్ అలీ ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల ప్రాంతానికి చెందిన మంతెన శ్రీనివాస్(49) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్ కథనం ప్రకారం.. ముల్కల్లకు చెందిన శ్రీనివాస్ అనే పాల వ్యాపారి బుధవారం రాత్రి జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో లక్సెట్టిపేట వైపు వెళ్తున్న బైక్ వేగంగా ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్ ఎగిరిపడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంచించారు. చికిత్సపొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య కవిత, కుమారుడు హర్షిత్, కుమార్తె హరిణీ ఉన్నారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు..కడెం: మండలంలోని కొండుకూర్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిపెల్లి మ ల్లవ్వ (75) మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మల్లవ్వ.. మండల కేంద్రంలోని మార్కెట్లో బుధవారం కారం, పసుపు విక్రయించి రాత్రి ఆటోలో గ్రామానికి చేరుకుంది. ఆటో దిగి రోడ్డు దాటేక్రమంలో గుర్తుతెలియని బైక్ ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లవ్వకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఇంటికి వచ్చింది. గురువారం తెల్లవారుజామున మల్లవ్వ మృతిచెందింది. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కుంటలో పడి యువకుడి..నిర్మల్రూరల్: మండలంలోని ముజిగి–చిట్యాల గ్రామాల మధ్య రహదారి వెంబడి ఓ చెట్టును ఢీకొని పక్కనే ఉన్న నీటికుంటలో పడి యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్సై లింబాద్రి కథనం ప్రకారం.. దిలావర్పూర్ మండలం కాలువతండా గ్రామానికి చెందిన మెగావత్ శ్రీనివాస్ (25) రెండురోజుల క్రితం బైక్పై నిర్మల్ మండలంలోని ముజిగి గ్రామానికి బయల్దేరి వెళ్లాడు. ఈ క్రమంలో గ్రామ సరిహద్దు వద్ద అదుపు తప్పి ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొని పక్కనే ఉన్న నీటికుంటలో పడి ఊపిరాడక చనిపోయాడు. గురువారం ఉదయం స్థానికులు గమనించి రూరల్ పోలీసులకు సమాచారమిచ్చారు. రూరల్ ఎస్సై లింబాద్రి అక్కడికి చేరుకుని బైక్ నంబర్ ఆధారంగా మృతుడి వివరాలు తెలుసుకున్నాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. పేకాట ఆడుతున్న ఆరుగురి అరెస్ట్ఆదిలాబాద్టౌన్: పేకాట ఆడుతున్న ఆరుగురిని అ రెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. పట్టణంలోని ఖుర్షీద్నగర్లో భగత్ కై లాస్ ఇంట్లో గురువారం పేకాడుతుండగా దాడిచేసి పట్టుకున్న ట్లు పేర్కొన్నారు. వారి నుంచి రూ.1,680 నగదు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.