breaking news
Mancherial District Latest News
-
ఓటర్లతో ఇదేం మర్యాద!
దండేపల్లి: ఎస్ఐఆర్ (సర్) సవరణలో భాగంగా మండలంలోని మేదరిపేట గ్రామపంచా యతీ కార్యాలయం వద్ద అధికారులు ఆదివా రం బీఎల్వోలను అందుబాటులో ఉంచారు. నోటీసుల జారీ చేయడంతోపాటు నోటీసులు అందుకున్నవారు అందించే ఆధార పత్రాలు స్వీకరించాలని ఆదేశించారు. కాగా, ఓటర్లు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలో ఓ బీఎల్వో కాళ్లు పెట్టుకోవడం, ఓటరు నిలబడి ఉండగా.. ఈ దృశ్యాన్ని స్థానికులు ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశారు. విష యం తెలుసుకున్న ఎంపీడీవో ప్రసాద్ అక్కడికి వచ్చి బీఎల్వోలను మందలించారు. ఓటర్లతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. -
ఏకదంతం.. దశాబ్దాల చరితం
శివాలయ గణపతికి 50ఏళ్ల చరిత్ర వేమనపల్లి: మండల కేంద్రంలోని అన్నపూర్ణ విశ్వేశ్వరాలయంలో 50 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో గణేశ్ నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులతోపాటు ఇతర కులాలవారు ఇక్కడ పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకొంటారు. తొమ్మిదిరోజులు విభిన్నంగా తీరొక్క నైవేద్యం వండి వినాయకుడికి సమర్పిస్తారు. సంప్రదాయ పద్ధతిలో నిత్య భజన, నిత్యాన్నదానం, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. చివరిరోజు గణపతి లడ్డూ, కలశం, దోవతి వేలం వేస్తారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. 1968లో మొదలై..మంచిర్యాలఅర్బన్: పాత మంచిర్యాలలో 1968లో మొదలైన చవితి ఉత్సవాలు ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చంద్రమౌళి పంతులు ప్రోత్సాహంతో గౌతమి గణేశ్ మండలి ఏర్పాటైంది. అప్పట్లో అవుసుల సమ్మయ్య ఎంతో భక్తిశ్రద్ధలతో తయా రు చేసి ఇచ్చిన ఫీటున్నర మట్టి విగ్రహాలను ప్రజలంతా రామాలయం, శివాలయంలో నెలకొల్పేవారు. ఆ రోజుల్లో ఉత్సవాల నిర్వహణకు గ్రామంలో రూ.1 నుంచి రూ.5వరకు చందాలు సేకరించేవారు. సాయంత్రం వేళ గణపతి వద్దకు భక్తులు అధికసంఖ్యలో వచ్చేవారు. దీంతో ఊరంతా పండుగ వాతా వరణం కనిపించేది. ఊరంతటికీ ఒకే విగ్రహాన్ని నెలకొల్పడం అనాటి ప్రత్యేకత. పదేళ్లుగా గౌతమి యూత్ సభ్యులు ఎనిమిది ఫీట్ల విగ్రహాన్ని నెలకొల్పి భక్తిశ్రద్ధలతో నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా విభిన్న రూపాల్లో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. ఆధ్యాత్మిక శోభతో ఐక్యత చాటుతూ..వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న 24గంటల అఖండ భజన కార్యక్రమం ఆధ్యాత్మిక శోభతో ఐక్యతను చాటుతూ నేటికీ కొనసాగుతోంది. నిమజ్జనానికి ఒకరోజు ముందు భజ నతో ఊరు మార్మోగుతోంది. అప్పట్లో తొమ్మిది రోజులపాటు రాత్రివేళ ఊరిని మేల్కొలిపేలా భాగవతం, భజనలు, నాటికలు ప్రదర్శించేవారు. ఈ వివరాలన్నీ అప్పటి వేడుకల నిర్వహణలో ఒకరైన తూముల వెంకటరామయ్య తెలిపారు. -
సింగరేణిలో ‘గుర్తింపు’ వార్!
శ్రీరాంపూర్: సింగరేణిలో ఎన్నికల వార్ మొదలైంది. గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితిపై కార్మి క సంఘాలు పోరుబాట పట్టాయి. ఎన్నికల కాలపరిమితి రెండేళ్లే అని ప్రతిపక్ష సంఘాలు.. కాదు నా లుగేళ్లని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ వాదిస్తోంది. ఇంతటితో ఆగకుండా టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్, సీఐటీయూ లాంటి కార్మిక సంఘాలు ఎన్నికల కాలపరిమితిపై కోర్టులో రిట్ పిటిషిన్ దాఖలు చేశా యి. సింగరేణిలో ఏడో దఫా గుర్తింపు సంఘం ఎన్ని కలు డిసెంబర్ 27, 2023న నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఐదు ఏరియాల్లో గెలిచి కంపెనీ వ్యాప్తంగా అత్యధిక ఓట్లు రావడంతో గు ర్తింపు సంఘంగా ఏఐటీయూసీ, ఆరు ఏరియాల్లో గెలిచినా తరువాత స్థానంలో ఓట్లు రావడంతో ఐఎన్టీయూసీ ప్రాతిని ధ్య సంఘంగా నిలిచింది. ఎన్నికలు జరిగిన తొమ్మి ది నెలల తర్వాత అక్టోబర్ 9, 2024న ఏఐటీయూసీకి గుర్తింపు పత్రం, ఐఎన్టీయూసీకి ఆయా ఏరి యాల్లో ప్రతినిధ్య హోదా కల్పిస్తూ కంపెనీ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో రెండేళ్ల కాలపరిమితిని పెట్టింది. దీని ప్రకారం కాలపరిమితి ముగిసినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీయూసీ మినహా సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. డిప్యూటీ సీఎల్సీ విడుదల చేసిన ఎ న్నికల షెడ్యూల్లోనూ ఈ నిబంధన ఉందని వాది స్తున్నాయి. కాగా, ఇప్పటివరకు ఏడుసార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించగా మొదటిసారి 1998లో మాత్రమే రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికలు జరిగాయి. తరువాత గెలిచిన అన్ని సంఘాలు నాలుగేళ్లు అఽధికారంలో కొనసాగాయి. ఎన్నికల స మయంలో డిప్యూటీ సీఎల్సీ, కంపెనీ నుంచి కాలపరిమితిపై స్పష్టత ఇవ్వకపోవడం, అప్పుడు అధి కారంలో ఉన్న పార్టీలు తమ అనుకూలతకు ఉన్న కార్మిక సంఘాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ రావడంతో నాలుగేళ్లు అధికారం అనుభవించాయి. 15న కోర్టులో వాదనలు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని టీబీజీకేఎస్, సీఐటీయూ, హెచ్ఎంఎస్ నాయకులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు డిప్యూటీ సీఎల్సీ, సింగరేణి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. టీబీజీకేఎస్ వేసిన పిటిషన్పై ఈ నెల 15న వాదనలు జరగనున్నాయి. కాగా, మళ్లీ ఎన్నికలు జరిగేవరకు అన్ని సంఘాలను సమానంగా గౌరవించాలని ఆయా సంఘాలు లేఖలు రాసి యాజ మాన్యంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఏడో దఫా ఎన్నికల ముందు సమాన హోదా కల్పిస్తూ కంపెనీ ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తూ డిమాండ్ చేస్తున్నాయి. దీన్ని ఏఐటీయూసీ నేతలు తోసిపుచ్చుతున్నారు. తెరపైకి లేబర్ కోడ్లు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్లు అమలు చేయాలని సీఎల్సీ నిశ్చయంతో ఉంది. ఈ మేరకు డిప్యూటీ సీ ఎల్సీ కొత్త లేబర్ కోడ్లకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిసింది. దీని ప్రకారం ఇకముందు గుర్తింపు సంఘం కాలపరిమితి మూడేళ్లు ఉంటుందని, గుర్తింపు సంఘం, యాజమాన్యం ఒకే అభిప్రాయంతో ఉంటే దీన్ని గరిష్టంగా ఐదేళ్లు కొనసాగించుకునేలా కొత్త చట్టంలో అవకాశముంది. ఈ లేబర్కోడ్ల ప్రకారం ఎన్నికలు జరిగితే 51శాతం ఓట్లు వస్తేనే గుర్తింపు హోదా దక్కుతుంది. అంతకంటే తక్కువ వస్తే, అది కూడా 20శాతం మించి ఓట్లు వస్తేనే వారికి ప్రాతినిధ్య హోదా ఇస్తారు. ఎన్ని సంఘాలకు 20శాతం మించి ఓట్లు వస్తే అన్ని సంఘాల నుంచి ప్రతినిధులను కంపెనీ కార్మికుల ప్రతినిధులుగా (నెగోసేషన్ కౌన్సిల్ మెంబర్గా)గా గుర్తిస్తుంది. ఇదే జరిగితే కార్మిక సంఘాలన్నీ నిర్వీర్యం కావడం ఖాయమని, కార్మికుల డిమాండ్లకు బలం ఉండదనే వాదన వినిపిస్తోంది. -
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
నస్పూర్: గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో విఫలమైందని పీఆర్టీ యూ టీఎస్ టీచర్స్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ఆరోపించారు. ఆదివారం సీసీసీ నస్పూర్లోని ఎంఎం గార్డెన్స్లో నిర్వహించిన పీఆర్టీ యూ జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీపీఎస్ను రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరా రు. పెండింగ్లో ఉన్న రెండు డీఏలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని మెరుగైన పిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఉద్యోగుల హెల్త్ స్కీం నిరాశపరిచిందని, ప్రభుత్వం కొత్తగా ఏ ఒక్క ప్రైవేట్ ఆస్పత్రితో ఎంఓయూ కుదుర్చుకోలేదని తెలిపారు. హెల్త్ స్కీంను ఇంప్లిమెంట్ చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాకు రెగ్యులర్ డీఈ వోను తక్షణమే నియమించాలని, 5,545 పీజీ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని కో రారు. మహిళలకు చైల్డ్ కేర్ లీవ్లు 90రోజుల నుంచి 180రోజులకు పెంచి సర్వీస్ మొత్తం ఉపయోగించుకునేలా సవరణ ఉత్తర్వులు ఇ వ్వాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు ఎంటీఎస్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్రెడ్డి, ప్రధాన కా ర్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, జిల్లా అధ్యక్షుడు కొ ట్టె శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చ మో హన్రావు, జిల్లా గౌరవాధ్యక్షుడు కొండు జనా ర్దన్, జిల్లా మహిళా అధ్యక్షురాలు జనగామ ఉ మాదేవి, ఆయా మండలాల అధ్యక్షులు, ప్రధా న కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావును కలిసిన స్పందన
మంచిర్యాలటౌన్: నస్పూరుకు చెందిన లగిశెట్టి స్పందన అమెరికాలోని చికాగో మెట్రో స్టేషన్లో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లి చికిత్స అనంతరం కోలుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావును తన తండ్రి శ్రీనివాస్తో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన స్పందన ఈ ఏడాది మే 31న ప్రమాదానికి గురి కాగా, ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నప్పుడు ఎమ్మెల్యే స్పందించారు. ఆమె తల్లిదండ్రులకు వారి కుమార్తెను చూ సేందుకు అవసరమైన పాస్పోర్టు, వీసాలను సీఎంవో అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు చేశారు. జూలై 2న స్పందన తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లగా, వారి విమాన టికెట్, ఇతర ఖర్చుల కోసం రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి వారికి అండగా ని లిచారు. పేద కుటుంబానికి చెందిన స్పందన చికి త్స అనంతరం కోలుకుని నస్పూరుకు వచ్చి ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేశ్ పాల్గొన్నారు. -
అడవి అందాలు చూస్తూ.. ఆహ్లాదం పొందుతూ..
జన్నారం: హైదరాబాద్లోని దూలపెల్లి అకాడమీకి చెందిన 57 మంది శిక్షణ రేంజ్ అధికారులు డిప్యూటీ డైరెక్టర్ మంజుల ఆధ్వర్యంలో ఆదివారం కవ్వాల్ టైగర్జోన్ పరిధిలోని జన్నారం అటవీ డివిజన్లో పర్యటించారు. జన్నారం అటవీ డివిజన్లోని బైసన్కుంట, గొండుగూడ బేస్క్యాంపు, వాచ్టవర్, తదితర ప్రాంతాల్లో కాలినడకన కలియతిరిగారు. అడవి అందాలను చూస్తూ, ఆహ్లాదం పొందారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు డివిజన్లో తీసుకుంటున్న చర్యల గురించి ఎఫ్డీవో రామ్మోహన్ వారికి వివరించారు. అడవులు, గడ్డి క్షేత్రాల అభివృద్ధి, వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన కుంటలు, గడ్డి మైదానాలు, ఆవాసాలు, కలప స్మగ్లింగ్ నిరోధానికి తీసుకుంటున్న జాగ్రత్తలు వివరించారు. డాగ్స్క్వాడ్ వల్ల ఉపయోగం, స్మగ్లర్లను పట్టుకునే విధానం గురించి డాగ్స్క్వాడ్ బీట్ అధికారి అనిల్ వివరించారు. వారి వెంట రేంజ్ అధికారి ఖాదర్వలీ, సెక్షన్ అధికారులు మమత, శంకర్, బీట్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా వారిని పలుకరించిన ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు వెల్లడించారు. వారి మాటల్లోనే..గేట్ నంబర్1 వద్ద శిక్షణ రేంజ్ అధికారులు -
రైళ్ల ఆలస్యం..ప్రయాణికుల అవస్థలు
బెల్లంపల్లి: అధికారుల నిర్ణయంతో రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది. గంటల కొద్దీ రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్నగర్ మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రత్యేక ఎక్స్ప్రెస్ (07236) రై లు రేకు షేరింగ్ చేయడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆదివా రం ఉదయం 4:35 నిమిషాలకు హైదరాబాద్ నుండి బయలుదేరాల్సిన ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు 5 గంటల 25 నిమిషాల ఆలస్యంతో ఉదయం 10 గంటలకు బయల్దేరింది. శనివారం నడిచిన ప్రత్యేక జన సాధారణ్ రైలు సిర్పూర్ కాగజ్నగర్ నుండి హైదరాబాద్ రైలుతో రేక్ షేరింగ్ చేయడం ఇందుకు కారణమనే విమర్శలున్నాయి. ఈ ప్రత్యేక జనసాధారణ్ రైలు హైదరాబాద్ రైల్వేస్టేషన్కు శనివారం రాత్రి 11:15 నిమిషాలకు చేరుకోవాల్సి ఉండగా ఆదివారం తెల్లవారుజామున 4:56 నిమిషాలకు చేరుకుంది. ఫలితంగా ఇదే రైలుతో రేక్ షేరింగ్ కలిగిన ఇంటర్ సిటీ రైలు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. -
అభాగ్యులకూ కుటుంబం
ఉమ్మడి జిల్లాలో 47 మందిబెల్లంపల్లి: అనాథగా మిగిలిపోయిన చిన్నారులకు అమ్మానాన్నల ప్రేమ లభిస్తోంది. అర్హులైన దంపతులకు పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడం ద్వారా వారికీ ఓ కుటుంబం ఏర్పడుతోంది. అనాథ పిల్లలను కుటుంబం చెంతకు చేర్చడంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముందంజలో ఉంది. దత్తత పొందిన దంపతులు చిన్నారులను అక్కున చేర్చుకుని మమతానురాగాలు పంచుతున్నారు. పేగుబంధాని కన్నా మిన్నగా అనుబంధాన్ని పెనవేసుకుంటున్నారు. దత్తత ద్వారా చిన్నారులు కొత్త కుటుంబాల్లోకి అడుగు పెడుతుండడం వారికి ఆనందాన్ని పంచుతోంది. మరో 123 మంది ఎదురుచూపుసంతానం లేని దంపతులు పిల్లల దత్తత కోసం తీవ్రంగా ఆరాట పడుతున్నారు. 2021 నుంచి 2026 ఆగస్టు 31 వరకు ఏకంగా 123 మంది దత్తత కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. తమవంతు ఎప్పుడెప్పుడా అని పడిగాపులు కాస్తున్నారు. కాగా 2000 సంవత్సరానికి ముందు దాదాపు 5 వరకు దరఖాస్తులు తిరస్కరించారు. దరఖాస్తు దారు ఆర్థిక స్థితిగతులు, గుణ గణాలు ఇతర అంశాలు ప్రతికూలంగా ఉన్నట్లు నిర్ధారించుకుని దత్తతకు నిరాకరించారు. కాగా ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులనూ ఆదరించడానికి ఎవరైనా ముందుకు రావల్సిన అవసరం ఉంది. చిన్నారులను దత్తత తీసుకోవాలనే ఆసక్తి కలిగిన దంపతులు వివరాల కోసం ఆదిలాబాద్లోని శిశుగృహ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. శిశుగృహ మేనేజర్ విజయలక్ష్మిని ఫోన్ నంబరు 70958 21533లో సంప్రదించవచ్చు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శిశుగృహ 57 మంది అనాథ చిన్నారులకు ఆశ్రయం కల్పించింది. వీరిలో ఇప్పటి వరకు 47 మంది బాలబాలికలు దత్తతకు వెళ్లగా ప్రస్తుతం ఆరుగురు మా త్రమే ఉన్నారు. ఇందులో ముగ్గురు దివ్యాంగులు ఉన్నారు. మరో నలు గురు చిన్నారులు తా త్కాలిక వసతి పొంది వెళ్లిపోయారు. దత్తత వె ళ్లిన చిన్నారుల్లో 26 మంది బాలికలు, 21 మంది బాలురు ఉన్నారు. ఇందులో 2000 సంవత్సరా నికి పూర్వం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు 32 మంది చిన్నారులను దత్తత ఇవ్వగా ఆ తర్వాత ఏడాది 2021 నుంచి 2026 ఆగస్టు 31 వరకు ద రఖాస్తు చేసుకున్న దంపతుల్లో అర్హతల ప్రాతిపదికన 15 మంది చిన్నారులను దత్తతఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి.. ఉమ్మడి జిల్లాకు చెందిన చిన్నారులను ఇతర రాష్ట్రాల తల్లిదండ్రులు దత్తత తీసుకుంటున్న మాదిరిగానే ఇతర జిల్లాలు, పరాయి రాష్ట్రాలకు చెందిన బాలబాలికలను మన ఉమ్మడి జిల్లా దంపతులు దత్తత తీసుకోవడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. 2000 నుంచి 2026 ఆగస్టు నెలాఖరు వరకు 42 మంది చిన్నారులను దత్తత తెచ్చుకున్నారు. అందరూ వంచితులే.. నవ మాసాలు మోసి జన్మనిచ్చిన తర్వాత పిల్లలు ఏదో రకంగా వంచితులు అవుతున్నారు. కారణమేదైనా కొందరు శిశువులు పసిప్రాయంలోనే అనాథలుగా మారుతున్నారు. ఆడపిల్లలు అనే వివక్షతో వదిలి వెళ్తుండగా.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పోషణ భారం తదితర అంశాలతో శిశుగృహకు చేరుతున్నారు. -
రైలు కిందపడి తండ్రి,కొడుకు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న తండ్రీకొడుకులు.. కేసు ట్రయల్కు రావడంతో తమకు ఎలాగైనా శిక్ష తప్పదని భావించారు. ఈ క్రమంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిశెలపేటకు చెందిన దొంత మల్లేశ్ (52), అతని కుమారుడు నాగరాజు (32) ఇద్దరూ కలిసి 2024లో జయశంకర్ భూపాలపల్లిలో వీఆర్వోగా పనిచేసిన గుల్లకోట గ్రామానికి చెందిన మల్లేశ్ తోడళ్లుడు రమేశ్ను హత్యచేశారు. ఈ కేసులో ఇద్దరూ భూపాలపల్లి జైలుకు వెళ్లారు. భర్త, కుమారుడు జైలుకు వెళ్లడంతో మల్లేశ్ భార్య సువర్ణ అనారోగ్యానికి గురై అదే ఏడాది మృతి చెందింది. జైలు నుంచి బయటకు వచ్చిన తండ్రీ కొడుకులను ఎవరూ ఆదరించడం లేదు. దీంతో కొద్దిరోజులుగా వారు హైదరాబాద్లోని ఓ హోటల్లో పనిచేసుకుంటున్నారు. మరోవైపు హత్యకేసు ట్రయల్కు వచ్చింది. తమకు ఎలాగైనా శిక్ష పడుతుందని భావించిన తండ్రీ కొడుకులు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో నివాసముంటున్న మల్లేశ్ సోదరుడు శ్రీనివాస్ ఇంటికి శుక్రవారం వచ్చారు. శనివారం ఇంటి నుంచి బయలుదేరిన వారు ఆదివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ సమీపంలో కేరళ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని జీఆర్పీ ఎస్సై తెలిపారు. -
● పర్యావరణ పరిరక్షణ వైపు అడుగులు ● యేటేటా పెరుగుతున్న అవగాహన
మంచిర్యాలఅర్బన్: పర్యావరణ పరిరక్షణ, జల కాలుష్య నివారణే ధ్యేయంగా మట్టి వినాయక ప్రతిమల తయారీ పెరిగింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ)తో తయారు చేసిన ప్రతిమలను చెరువులు, కుంటలు, జలాశయాల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమవుతోంది. దీన్ని నివారించేందుకు కొన్నేళ్లుగా మట్టి ప్రతిమలను వివిధ ఆకర్షణీయమైన రూపాల్లో తీర్చిదిద్దుతున్నారు. ప్రజలకు పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.మంచిర్యాలలోని ఓవర్ బ్రిడ్జి వద్ద తొమ్మిదేళ్లుగా అన్నదమ్ములు సంతోష్, రాజన్న మట్టి విగ్రహాల తయారీతో ఉపాధి పొందుతున్నారు. వివిధ రూపాలతో భక్తులను ఆకట్టుకునేలా, చూడముచ్చటగా గణపయ్యను తీర్చిదిద్దుతున్నారు. వినాయక చవితికి మూడు నెలల ముందు నుంచే గణపతుల తయారీలో నిమగ్నం అవుతారు. మూడు అడుగుల నుంచి ఎనిమిది అడుగుల ఎత్తున్న ప్రతిమలను తయారు చేశారు. మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చిన మట్టి, గడ్డి, కర్రలను ఉపయోగించి సిద్ధం చేశారు. ముందస్తు ఆర్డర్లతో మట్టి వినాయకులు తయారు చేసి ఉపాధి పొందుతున్నామని రాజన్న తెలిపారు.ప్లాస్టిక్కూ దూరమే..మంచిర్యాలటౌన్: మంచిర్యాల హైటెక్సిటీ కాలనీవాసులు ఎనిమిదేళ్లుగా హరిహర క్షేత్ర దేవాలయంలో మట్టి గణపతికి పూజలు చేస్తున్నారు. మండపంలో పూజలు జరిగే రోజుల్లో ప్లాస్టిక్ వస్తువులనూ వినియోగించరు. పేపర్లు, ఆకులతో చేసిన వాటిని ప్రసాదాలు, నీరు తాగేందుకు వినియోగిస్తారు. మండపాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని స్వచ్ఛంద సంస్థలు, కులసంఘాలు మట్టి ప్రతిమలను పంపిణీ చేస్తున్నాయి. చిట్టిచేతులతో గణనాథులు మంచిర్యాలఅర్బన్: పాఠశాలలో తరగతి గదులకే పరిమితం కాకుండా కాలుష్య నివారణకు విద్యార్థులు చిట్టిచేతులతో మట్టిగణపతులు తయారు చేసి సృజనాత్మకతను చాటారు. జిల్లా విద్యాశాఖ, నేషనల్ గ్రీన్కోర్, జిల్లా సైన్స్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం మట్టి గణపతి తయారీపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాల, బాలికల పాఠశాలకు చెందిన 122 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మట్టిగణపతులను తీర్చిదిద్దారు. బంక మట్టి తీసుకువచ్చి వినాయకులను తయారు చేయించారు. పర్యావరణ హిత వినాయకులనే పూజించాలని జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్ సూచించారు. న్యాయనిర్ణేతలు చక్కటి ప్రతిమలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మమత అధ్యక్షురాలు జ్యోత్స్న, బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సుధారెడ్డి, ఎన్ఆర్ పద్మజా, ఏ.సత్యనారాయణమూర్తి, బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చేతన, సునిత, కల్పన, గీత పాల్గొన్నారు.మూడు నుంచి ఎనిమిది అడుగులు.. స్వచ్ఛంద సంస్థల పంపిణీ -
నానయ్య పంతులు దూరదృష్టి
చెన్నూర్: చెన్నూర్ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కులస్తులు గత 62ఏళ్లుగా మట్టి గణపతిని స్వయంగా తయారు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1958లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అకినపల్లి నానయ్య తన మిత్రబృందం లక్ష్మయ్య, మల్లయ్యతో కలిసి మట్టి గణపతిని తయారు చేశారు. విశ్వకర్మ కాలనీలోనే విశ్వకర్మ గణేశ్ మండలి పేరుతో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ప్రతీ రోజు భజన చేసేవారు. నలుగురు వ్యక్తులు విగ్రహాన్ని మోసుకెళ్లి పెద్ద చెరువులో నిమజ్జనం చేసేవారు. ఆనాడు దూరదృష్టితో దివంగత నానయ్య పంతులు ప్రారంభించిన సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. నవర్రాతి ఉత్సవాలు ముగిసే వరకు మండలి వద్ద భజన మండలి ఆధ్వర్యంలో ప్రతీ రోజు భజన చేస్తారు. భజన చేసుకుంటూ వెళ్లి నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. రెండ్రోజుల్లోనే తయారీ.. నాడు విగ్రహం తయారీకి పక్షం రోజలు కష్టపడేవారు. పొలాల మట్టిని తీసుకొచ్చి నియమనిష్టలతో పక్షం రోజులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండి తయారు చేసేవాళ్లమని విశ్వబ్రాహ్మణులు తెలిపారు. ప్రస్తుతం విశ్వబ్రాహ్మణ యువకులు బెజ్జంకి వినయ్చారి, అకినపల్లి వినోద్, మణికంఠ, అభిరామ్తోపాటు మరికొందరు కలిసి రెండ్రోజుల్లో మట్టి వినాయక ప్రతిమను తయారు చేస్తున్నారు. అందరిలో మార్పు రావాలి..రోజు రోజుకు పర్యావరణం దెబ్బతింటోంది. రసాయనిక రంగులతో తయారు చేసిన విగ్రహాలు చెరువులు, కుంటల్లో కరిగిపోకుండా అందులో జీవించే జలజీవరాసులు మృత్యువాత పడుతున్నాయి. నీరు, వాతావరణం కలుషితం అవుతున్నాయి. మట్టి విగ్రహాలతో ఉత్సవాలు నిర్వహించాలన్నది ఒకరితో సరిపోదు.. అందరిలో మార్పు రావాలి. – అకినపల్లి సత్యనారాయణ, చెన్నూర్ -
ఈకేవైసీలో ఎస్హెచ్జీ ముందంజ
దండేపల్లి: స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి రుణాలు ఏటా మంజూరు చేస్తోంది. రుణం పొందిన మహిళలు వ్యాపారాలు చేస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా పయనిస్తున్నారు. ఇదే సమయంలో నిధులు పక్కదారి పట్టకుండా, ఖాతా వివరాలు పారదర్శకంగా నిర్వహించేలా సభ్యులకు ఈకేవైసీ(ఎలక్ట్రానిక్ – నో యువర్ కస్టమర్)ని తప్పనిసరి చేసింది. ఎస్హెచ్జీ సభ్యుల వివరాలు జాతీయ స్థాయిలో అందుబాటులో ఉండేలా ‘లోకోస్’ యాప్తో అనుసంధానం చేశారు. సభ్యులు అర్హులా.. అనర్హులా అని తెలుసుకునేందుకు ప్రతీ సభ్యురాలి ఈ–కేవైసీని పూర్తి చేయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వీవోఏలు ఈకేవైసీ చేయడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 50శాతానికి చేరువై రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచారు. ఇప్పటికే అన్ని ఎస్హెచ్జీల వివరాలను ‘సెర్ప్’ వెబ్సైట్లో నిక్షిప్తం చేశారు. సంఘాల వారీగా సభ్యులు తీసుకున్న రుణాలు, చెల్లించిన వాయిదాలు, పొందిన వడ్డీ రాయితీ, తీసుకున్న సీ్త్రనిధి రుణాలు, చేస్తున్న వ్యాపారం, పొందుతున్న లాభాలు వంటివాటిని సమగ్రంగా నమోదు చేశారు. ఈకేవైసీ కూడా పూర్తయితే పొదుపు నిధులు పక్కదారి పట్టించలేరు. అనర్హులకు రుణ లబ్ధి కలిగే అవకాశం లేదు. కాగా, ఆధార్ వివరాలు అప్డేట్ చేయకపోతే ఈ–కేవైసీ చేయడం సాధ్యం కావడం లేదు. ఫోన్ నంబరు కూడా ఆధార్కు అనుసంధానమై ఉండాలి. ఫొటో ఆధార్తో సరిపోలాలి. సమస్యలను పరిష్కరించి ఈకేవైసీని త్వరగా పూర్తిచేయాలని వీవోలను జిల్లా గ్రామీణాభివద్ధి శాఖ అధికారులు ఆదేశించారు. కొందరు సభ్యుల ఆధార్ అప్డేట్ కాక ఈకేవైసీ ఆలస్యమవుతోందని, నెలాఖరులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని డీపీఎం స్వర్ణలత తెలిపారు.జిల్లా వివరాలు.. సంఘాలు సభ్యులు ఈకేవైసీ పూర్తయినవారు 10,962 1,12,426 46,658 -
రాజీ మార్గమే రాజ మార్గం
మంచిర్యాలక్రైం/లక్సెట్టిపేట/మందమర్రిరూరల్/చెన్నూర్: రాజీమార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య అన్నారు. జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో శనివారం తొమ్మిది ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేసి లోక్ అదాలత్ నిర్వహించారు. మంచిర్యాల లోక్ అదాలత్లో సివిల్ దావాలు 32, క్రిమినిల్ కేసులు 4100, ఇతర కేసులు, సైబర్ క్రైం 2 కేసుల్లో రూ.17వేలు బాధితులకు ఇప్పించినట్లు తెలిపారు. 4,418 కేసులు పరిష్కరించినట్లు తెలిపా రు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తులు జీ.కవిత, ఏ.నిర్మల, సీనియర్ సివిల్ జడ్జి డీ.రామ్మోహన్రెడ్డి, బార్ అ సోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, లైజన్ ఆఫీ సర్ వెంకటేశ్వర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
వానొస్తే రాలేరు.. పోలేరు!
మంచిర్యాలటౌన్: మంచిర్యాల టూటౌన్లోని రాజీవ్నగర్ వాసులకు ప్రతియేటా వర్షాకాలంలో తిప్పలు తప్పడం లేదు. నగరానికి దూరంగా ఉండడం వల్ల హైటెక్సిటీ కాలనీ వద్ద ఉన్న రైల్వే అండర్బ్రిడ్జి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. కిలోమీటరు దూరం ప్రయాణిస్తే నేరుగా మంచిర్యాలకు చేరుకోవచ్చు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు బ్రిడ్జి కింద వరద నీరు చేరి రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. ద్విచక్రవాహనాలు వరద నీటిలో సగం వరకు మునుగుతున్నాయి. దీంతో ప్రత్యామ్నయంగా గోపాల్వాడ, హమాలీవాడ మీదుగా ఐదు కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మంచిర్యాలకు చేరుకుంటున్నారు. ఆటోలో రావాలంటే ఒక్కొక్కరికి రూ.60కి పైగా ఖర్చవుతోంది. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లలో నాలుగు వేలకు మందికి పైగా నిరుపేదలు నివాసం ఉంటున్నారు. కూలీ, ఇళ్లల్లో పనులు చేసే వారు కావడంతో ప్రయాణం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడం, చుట్టూ తిరిగి రావడం వల్ల రవాణా భారంతోపాటు సమయం వృథా అవుతోంది. లక్ష్మీ టాకీస్ నుంచి గోపాల్వాడ, హమాలీవాడ మీదుగా రైల్వే అండర్బ్రిడ్జి మంజూరైనా స్థల వివాదం కోర్టులో ఉండడంతో బ్రిడ్జి నిర్మాణానికి నోచుకోవడం లేదు. రైల్వే అండర్బ్రిడ్జి, వందఫీట్ల రోడ్డు పూర్తయితే రాజీవ్నగర్తోపాటు గోపాల్పాడ, హమాలీవాడ ప్రజలకు మంచిర్యాలకు రాకపోకల ఇబ్బందులు తప్పుతాయి. రాళ్లవాగు కాజ్వే కష్టాలు మంచిర్యాలలోని అమరవీరుల స్తూపం నుంచి ఆండాళమ్మ కాలనీ వెళ్లేందుకు రాళ్లవాగుపై నిర్మించిన కాజ్వే ప్రతియేటా వర్షాకాలం వరద నీటిలో కొట్టుకుపోయి రాకపోకలు నిలుస్తున్నాయి. తాత్కాలిక మరమ్మతులతో పునరుద్ధరిస్తున్నారు. ఈ కాజ్వేను ఆండాళమ్మ కాలనీ, రంగంపేట్, పవర్సిటీ, సన్సిటీ, పాతమంచిర్యాలకు వెళ్లేందుకు వినియోగిస్తున్నారు. వర్షాకాలంలో కాజ్వే కొంత భాగం కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీంతో ఆయా ప్రాంత ప్రజలు పాతమంచిర్యాలలోని ప్రధాన రహదారి బ్రిడ్జి నుంచి తిరిగి మంచిర్యాలకు రాకపోకలు సాగిస్తున్నారు. సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం పెరుగుతోంది. ఇటీవల కాజ్వే స్థానంలో నూతన బ్రిడ్జి పనులు ప్రారంభించినా పూర్తయ్యే వరకు రెండేళ్ల సమయం పడుతుంది. -
అంబేడ్కర్ అడుగు జాడల్లో నడవాలి
బెల్లంపల్లి: బీఆర్ అంబేడ్కర్ అడుగు జాడల్లో విద్యార్థులు నడవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ అన్నారు. శనివారం బెల్లంపల్లి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీవోఈ) పాఠశాల, కళాశాలలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సీవోఈ కళాశాల ఉత్తమ విద్యకు మారుపేరుగా నిలుస్తోందని అన్నారు. విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్లు సాధిస్తూ ప్రతిభ చాటుతున్నారని తెలిపారు. దేశంలోని అత్యున్నత విద్యాలయాల్లో చదువుతున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సీవోఈ కళాశాల ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్, వైస్ ప్రిన్సిపాల్ తన్నీరు గోపి, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ నిర్వాహకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గంజాయి సాగుచేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఇచ్చోడ: మండలంలోని గాంధీనగర్ శివారులో గల పత్తి చేనులో గంజాయి సాగు చేస్తున్న మామిడిగూడ గ్రామానికి చెందిన యెర్మ మారుతిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్ రమేశ్ తెలిపారు. సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలి పారు. వీటి విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందన్నారు. అనంతరం మారుతి వ్యవసాయ షెడ్డులో తనిఖీలు నిర్వహించగా 67 గ్రాముల ఎండిన గంజాయితో పాటు అక్కడే దాచి పెట్టిన ఎలుగుబంటి గోరు లభ్యమైనట్లు తెలిపారు. అటవీప్రాంతంలో చనిపోయిన ఎలుగుబంటిని గుర్తించి దాని గోరును నిందితుడు దాచిపెట్టాడన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ సాగుతో పాటుగా వన్యప్రాణుల చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
ఆటో డ్రైవర్ ఇంటికి రూ.30వేల విద్యుత్ బిల్లు
మంచిర్యాలఅగ్రికల్చర్: గృహజ్యోతి పథకం కింద గత కొంత కాలంగా జీరో విద్యుత్బిల్లు వస్తుండగా ఆగస్టు నెలలో వచ్చిన విద్యుత్ బిల్లు చూసి వినియోగదారుడు కంగుతిన్నాడు. మంచిర్యాల జిల్లా జన్నా రం మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ చిట్యాల రాజన్న ప్రతీ నెల 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్నాడు. దీంతో ప్రతీ నెల జీరో బిల్లు వచ్చింది. గత నెలలో రూ.30 వేల కరెంట్ బిల్లు రావడంతో ఆందోళనకు గురయ్యాడు. స్థానిక ఏఈని సంప్రదించగా మీటర్ పరిశీలించాలని తెలపడంతో శుక్రవారం మీటర్ తీసుకొని జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయానికి వచ్చాడు. అయితే సిబ్బంది అందుబాటులో లేరు. ఒక టీవీ, ఫ్యాన్, మూడు లైట్లు ఉన్న తన ఇంటికి పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు రావడం ఏంటని ప్రశ్నించాడు. దీని ని సరి చేయాలని వాపోయాడు. -
కరెంటు మీటర్ రయ్!
మంచిర్యాలఅగ్రికల్చర్: ఎల్నినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నడుస్తున్నాయి. వ్యవసాయానికి బోరుమోటార్లు నీటిని ఎత్తి పోస్తున్నాయి. విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతుండడంతో మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. జిల్లాలో వేసవి కాలాన్ని మించి విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 14నుంచి 15శాతం మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నా ఎండలు, ఉక్కపోత తీవ్రత తగ్గడం లేదు. గత మే నెలలో 3.214 మిలియన్ యూనిట్లు వినియోగం కాగా ఈ సెప్టెంబర్లో 3.409 మిలియన్ యూనిట్లకు చేరడం గమనార్హం. అన్ని కేటగిరిల్లో విద్యుత్ వినియోగం పెరగడంతో జిల్లాలో 132 కేవీ సబ్స్టేషన్లపై అధిక భారం పడుతోంది. బోర్లు ఎత్తిపోస్తున్నాయి.. జిల్లాలో 3.10 లక్షల ఎకరాల్లో పత్తి, వరి తదితర పంటల సాగు విస్తీర్ణం ఉంది. వరి సాగు ఆలస్యం కావడం, ప్రస్తుతం పంట ఎదిగే దశలో ఉండగా ఉష్ణోగ్రతలు పెరగడం, వేడిమితో నీరు ఇంకిపోతోంది. దీంతో బోరుమోటార్లు ఎత్తి పోస్తున్నాయి. పంటల సంరక్షణ కోసం రైతాంగం బోరుబావుల మోటార్లను విస్తృతంగా వినియోగిస్తుండడంతో కరెంటు డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో పోలిస్తే ఈ ఏడాది వినియోగం పెరగడం గమనార్హం. వరి పంట దిగుబడి నవంబర్ మొదటి వారం వరకు వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్లో వర్షాలు లేకుండా ఉష్ణోగ్రతలు పెరిగితే రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతుంది. డిమాండ్కు అనుగుణంగా సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు త్రీఫేజ్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వర్షాకాలం ఈదురుగాలులు, చల్లని వాతావరణం ఉండాల్సి ఉండగా.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవి ప్రతాపం నుంచి జూన్, జూలైలో కురిసిన భారీ వర్షాలకు చల్లని వాతావరణం, పచ్చిక బయలు, చెట్లు, పంట పొలాలతో ఆగస్టు నుంచి వాతావరణంలో మార్పులు ఉండాలి. కానీ వానాకాలం ముగింపు దశకు వస్తున్నా జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. గరిష్ట ఉష్ణోగ్రతలు 30నుంచి 33 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఉదయం ఎండ, ఉక్కపోత కొనసాగితే సాయంత్రం వర్షం కురుస్తుంది. మరుసటి రోజు ఎండ, ఉక్కపోత కొనసాగుతోంది. వేడెక్కుతున్న వాతావరణంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. గత ఏడాది సెప్టెంబర్ 5నుంచి 10వరకు ఈ ఏడాది ఇదే రోజుల్లో పోలిస్తే అన్ని రోజుల్లోనూ అధికంగా నమోదైంది.జిల్లాలో విద్యుత్ కనెక్షన్లుగృహ 2,75,948 వ్యవసాయ 51,284 వ్యాపార 35,361 స్ట్రీట్లైట్, వాటర్వర్క్ 6,392 జనరల్ పర్పస్ 2,454 ఇండస్ట్రీయల్ 1,496 టెంపవరీ 322 స్మాల్ ఇండస్ట్రీస్ 77 మొత్తం 3,73,334గతేడాది, ఈ ఏడాది సెప్టెంబర్లో విద్యుత్ వినియోగం(మిలియన్ యూనిట్లలో) తేదీ 2025 2026 పెరుగుదల 5 2.463 3.342 0.879 6 2.854 3.213 0.359 7 3.150 3.409 0.259 8 3.271 3.309 0.38 9 2.874 3.376 0.502 10 2.872 3.287 0.417జిల్లాలో సాగు విస్తీర్ణం(ఎకరాల్లో) పత్తి 1,72,160 వరి 1,34,901 కంది 1,559 పెసలు 353 మొక్కజొన్న 153 కూరగాయలు 843 ఆయిల్ఫామ్ 448 నువ్వులు 09 మినుములు 09 మొత్తం 3,10,435 -
గొల్లవాగు ప్రాజెక్ట్లో మృతదేహం లభ్యం
భీమారం: మండల కేంద్రం సమీపంలోని గొల్లవాగు ప్రాజెక్ట్లో చెన్నూర్కు చెందిన సంబోగుల నితిన్ (30) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్ట్ కట్ట మీదుగా వెళ్లే వారికి జలాశయంలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిబ్బందితో కలిసి ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి పరిశీలించగా ప్యాంట్, షర్ట్ లేని వ్యక్తి మృతదేహం నీళ్లపై తేలియాడుతూ కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీసి మృతుడి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా చెన్నూర్ పట్టణంలోని పద్మానగర్కు చెందిన నితిన్గా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదని, కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. -
అమ్మ ఆకాంక్ష మేరకు ఐఏఎస్
సాక్షి: మీ స్వస్థలం ఏది? విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది.? సబ్కలెక్టర్: నా స్వస్థలం జనగామ జిల్లాలోని రఘునాథపల్లి. 2021లో జేఎన్టీయూ నుంచి బీటెక్ పూర్తి చేశాను. యూపీఎస్సీ కోసం 2022లో మొదటి ప్రయత్నం చేశాను. రెండో ప్రయత్నంలో 2023లో సివిల్స్ సాధించాను. సాక్షి: మీ కుటుంబ నేపథ్యం ఏమిటి.? సబ్కలెక్టర్: మా తండ్రి ఓ ఎన్జీవోకు డైరెక్టర్గా వ్యవహరిస్తూ మహిళా సాధికారతపై పనిచేశారు. అమ్మ గృహిణి. నలుగురిలో నేను చిన్నవాడిని. సాక్షి: సివిల్స్ ఎందుకు ఎంచుకున్నారు.? సబ్కలెక్టర్: సమాజానికి ప్రత్యక్షంగా సేవ చేయాలనే అమ్మ తపనే నన్ను సివిల్స్ వైపు నడిపించింది. బీటెక్ పూర్తయిన తర్వాత తీవ్రంగా శ్రమించి 2023లో రెండో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించా. సాక్షి: ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు.? సబ్కలెక్టర్: ఖాళీ సమయం దొరికినప్పుడు నేను ప్రముఖుల బయోగ్రఫీలు (జీవిత చరిత్రలు), సీనియర్ ఐఏఎస్ అధికారుల పుస్తకాలు, అంబేడ్కర్, గాంధీ పుస్తకాలను ఎక్కువగా చదువుతాను. నాకు కబడ్డీ, ఫుట్బాల్, బ్యాట్మింటన్ క్రీడలు చాలా ఇష్టం. నా చిన్నతనం నుంచే కబడ్డీ బాగా ఆడేవాడిని. నేను ఒక కబడ్డీ ప్లేయర్ను. సాక్షి: ఏజెన్సీ ప్రాంతంలో తొలి పోస్టింగ్ చేపట్టడంపై మీ స్పందన ఏమిటి.? సబ్కలెక్టర్: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ఇది సరైన వేదిక. ఐటీడీఏ పీవో, కలెక్టర్, అధికారుల సహకారంతో పని చేస్తా. గిరిజనుల వద్దకు ప్రభుత్వ సేవలు నేరుగా, వేగవంతంగా చేరేలా నిరంతరం పర్యవేక్షిస్తా. ఏజెన్సీ ప్రాంతంలో అటవీ, భూ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించా. సమస్యలను ఒక్కొక్కటిగా సమీక్షించి, పరిష్కరించడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తా. సాక్షి: సివిల్స్కు సిద్ధమవుతున్న యువతకు, విద్యార్థులకు మీరిచ్చే సలహా ఏమిటి.? సబ్కలెక్టర్: ఓర్పు, నిలకడైన శ్రమ, స్పష్టమైన ప్రణాళిక ఉంటే సివిల్స్ సాధించడం అసాధ్యం కాదు. పరీక్షలో ఓటమి ఎదురైతే నిరాశపడకుండా, అధైర్యపడకుండా నిరంతరం ప్రయత్నించాలి. పుస్తకాలతో కాకుండా సమాజంలో జరుగుతున్న మార్పులపై నేరుగా పర్యవేక్షిస్తే పూర్తి స్థాయిలో అవగాహన కలిగే ఆస్కారం ఉంటుంది. ఓటమిని మరిచి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తే విజయం సాధ్యమవుతుంది. సాక్షి: ఉట్నూర్ ప్రజలకు ఏం చెప్తారు..? సబ్ కలెక్టర్: ఉట్నూర్ ప్రాంత, ప్రజా సమస్యల పరిష్కారానికి తోడ్పడుతాను. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పాలన పారదర్శకంగా అందిస్తా. ఏ సమస్య ఉన్న నేరుగా నన్ను సంప్రదిస్తే పరిష్కారానికి నావంతు కృషి చేస్తా. ఉట్నూర్రూరల్: ‘నేను ఐఏఎస్ కావాలన్నది అమ్మ కోరిక.. అమ్మ ఆకాంక్ష నెరవేర్చాలని కష్టపడి చదివి ఐఏఎస్ సాఽధించా’నని యువ ఐఏఎస్, ఉట్నూర్ సబ్కలెక్టర్ కొయ్యడ ప్రణయ్కుమార్ అన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ఉట్నూర్లో తొలి పోస్టింగ్ రావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనుల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేస్తానన్నారు. తన విద్య, కుటుంబ నేపథ్యంతో పాటు తదితర అంశాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. -
విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, సిబ్బందికి సూచనలు, అవగాహన కల్పించడంతోపాటు అజాగ్రత్త వహిస్తే రూ.3 వేల జరిమానా విధిస్తామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కే.వరుణ్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలో పాత మంచిర్యాల, లక్సెట్టిపేటలోని 132/33 కేవీ సబ్స్టేషన్లు, జిల్లాస్టోర్స్, మంచిర్యాల హైటెక్సిటీ ఏరియాలోని ఎస్ఈ కార్యాలయ ఆవరణలో సర్కిల్ కార్యాలయం నిర్మాణం, అమవీరుల స్తూపం స్థలాలను పరిశీలించారు. విద్యుత్ సరఫరా, ఫీడర్ల పనితీరు, లోడ్ పరిస్థితిపై ఽఅధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం, ఉష్ణోగ్రతల తీవ్రతతో జిల్లాలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్నా రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయానికి త్రీఫేజ్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు. డిసెంబర్లోగా దండేపల్లి మండలం తాళ్లపేట, జైపూర్ మండలం రసుల్పల్లి 132 కేవీ సబ్స్టేషన్లు అందుబాటులో వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ మల్లయ్య, ఎస్ఈ రాజన్న, డీఈ ఖైసర్, ట్రాన్స్కో ఎస్ఈ శ్రీహరి, ఈఈ రవికుమార్, డీఈ గులాబ్, ఏడీఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ ఒకరు మృతి
ముధోల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు ఎస్సై బిట్లా పెర్సిస్ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని మహాలక్ష్మీ గల్లీకి చెందిన బాయమొల్ల సాయిలు గురువారం సాయంత్రం నాయాబాది నుంచి ముధోల్కు ద్విచక్రవాహనంపై వస్తుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీ కొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించగా భైంసా ఏరియాసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య రాధ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి
పాతమంచిర్యాల: బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఎస్బీఐఎస్యూహెచ్సీ రీజినల్ సెక్రెటరీ కే.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ దేశ వ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం ఒక్క రోజు సమ్మె చేశారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని, సమాన పీఎల్ఐ వర్తింపజేయాలని, ఉద్యోగులపై పెరుగుతున్న భారాన్ని తగ్గించాలని అన్నారు. ఉద్యోగుల సంక్షేమం, మెరుగైన పని పరిస్థితులు, తగినంత సిబ్బంది నియామకంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఎస్యూహెచ్సీ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజినల్ సెక్రెటరీ వెంకటేష్, అసిస్టెంట్ రీజినల్ సెక్రెటరీ సతీష్, ఓబీసీ రీజినల్ సెక్రెటరీ బిల్ల సత్యనారాయణ, యూబీఐ రీజినల్ సెక్రెటరీ వసంత్కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ సెక్రెటరీలు రాము, సురేష్, ఏడీసీసీ బి.బాలరాజు, వివిధ బ్యాంకుల అధికారులు ఉద్యోగులు, -
వైద్యసేవల్లో అలసత్వం ప్రదర్శించవద్దు
తాండూర్: రోగులకు అందించే వైద్య సేవల్లో అలసత్వం ప్రదర్శించవద్దని డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, రికార్డులు పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్కు పంపించే నమూనాల వివరాలను రోజువారీగా నమోదు చేయాలని, జ్వరబాధితుల రక్తనమూనాలను సేకరించడం, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్ ద్వారా తక్షణమే పరీక్ష చేయాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ క్రమం తప్పకుండా నిర్వహించాలని, గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. పీహెచ్సీ సీహెచ్ఓ జయమణి, రాంబాయి తదితరులు పాల్గొన్నారు. -
విభిన్న రూప వినాయక
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/మంచిర్యాలఅర్బన్: తీరొక్క రూపాల్లో వినాయక విగ్రహాలు సిద్ధమయ్యాయి. 14న వినాయక చవితి పండుగ ఉండటంతో కళాకారుల చేతిలో తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. నిజామాబాద్, మహారాష్ట్ర నుంచి వచ్చిన కార్మిక కుటుంబాలు మంచిర్యాల, వేంపల్లి శివారు తదితర ప్రాంతాల్లో గత రెండు నెలలుగా ఉంటూ విగ్రహాలను తయారు చేస్తున్నాయి. ఐదు అడుగుల నుంచి 12 అడుగుల ఎత్తు వరకు ఆకర్షణీయమైన రంగుల్లో సిద్ధం చేశారు. ఎలుక, సింహం, నెమలి వాహన గణపతులతోపాటు రాధాకృష్ణ, నందీశ్వర, పార్వతీ, పరమేశ్వర, ఆంజనేయస్వామి సహిత గణపయ్య విగ్రహాలను తయారు చేశారు. విగ్రహాలను మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్నగర్, చెన్నూర్, సీసీసీ, శ్రీరాంపూర్, భీమారం, జైపూర్, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాలకు తీసుకెళ్తున్నారు. రూ.3 వేల నుంచి రూ.50 వేల వరకు ధర పలుకుతున్నాయి. 35 ఏళ్లుగా విగ్రహాలు చేస్తున్నం మంచిర్యాలలో గత 35 ఏళ్లుగా వినాయక, దుర్గాదేవి విగ్రహాలను తయారు చేస్తున్నాం. మొదట మట్టి విగ్రహాలు తయారు చేసినా పోటీ తట్టుకోలేక ప్లాస్టర్ ఆఫ్ పారీస్తో అందమైన, రంగురంగుల విగ్రహాల తయారీ ప్రారంభించాం. విగ్రహాలు హానికారకం కాకుండా మట్టి, సిమెంట్, కొబ్బరిపీచుతో తయారు చేస్తున్నాం. కుటుంబ సభ్యులమంతా కలిసి విగ్రహాల తయారీ వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. – కె.సత్తిబాబు, విగ్రహాల తయారీదారు, వేంపల్లి -
ఉపాధ్యాయుల కృషితోనే జిల్లా ముందంజ
మంచిర్యాలఅగ్రికల్చర్: ఉపాధ్యాయుల కృషి, అంకితభావంతోనే విద్యార్థుల భవిష్యత్కు బలమైన పునాది ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదులో ఉపాధ్యాయుల కృషితో ముందంజలో ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతన విద్యావిధానాలు, సాంకేతికతను నేర్చుకుంటూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. 27మంది ఉత్తమ ఉపాధ్యాయులు, జిల్లా స్థాయిలో ఉత్తమ ఎన్రోల్మెంటు సాధించిన 20 పాఠశాలల హెచ్ఎంలకు అవార్డులు అందజేశారు. అధిక సంఖ్యలో స్కాలర్షిప్లు సాధించిన ఉపాధ్యాయులు, ఎస్ఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 3పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. అనంతరం విద్యార్థులు నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, నగర మేయర్ ధర్ని మధుకర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, సంక్షేమ శాఖ అధికారులు రౌఫ్ఖా న్, రాజేశ్వరి, కార్పొరేటర్ హరికృష్ణ పాల్గొన్నారు. -
పేలిన బాయిలర్.. ఒకరికి గాయాలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం సబ్బేపల్లి శివారులోని ఓ పారాబాయిల్డ్ రైస్ మిల్లో శుక్రవారం బాయిలర్ పేలిన ఘటన చోటు చేసుకుంది. ధాన్యం బాయిల్డ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా బాయిలర్ పేలుడుకు గురి కాగా సంతోష్ అనే కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా బాయిలర్ పేలుడు జరి గిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ట్యాంకు పేలడంతో రేకు ముక్కలు, ఇతర వస్తువులు 500 మీటర్ల దూ రం వరకు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. రైస్ మిల్లుకు అతీ సమీపంలో ఉన్న ఇళ్లపై, ఇళ్ల ముందు కూడా బాయిలర్ రేకు ముక్కలు, ఇతర వస్తువులు పడటంతో ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. కాలనీ వాసులకు జరిగిన నష్టాన్ని భరిస్తామని యా జమాన్యం హామీ ఇచ్చింది. ఘటనా స్థలాన్ని మండల నాయకులు, రైస్మిల్ అసోసియేషన్ సభ్యులు, పోలీసులు సందర్శించి వివరాలు ఆరా తీశారు. -
● ఓటర్ల పరిశీలనలో తీవ్ర జాప్యం ● ఓటర్లు సకాలంలో రాక తేదీల మార్పులు ● ఉమ్మడి జిల్లాలో ‘సర్’ ప్రక్రియలో జాప్యం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రత్యేక సమగ్ర పరిశీలన(ఎస్ఐఆర్)లో అన్మ్యాపింగ్, అనామలీస్ ఓటర్ల పరిశీలనతో బీఎల్వోలు, అధికారులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ఓటర్లకు నోటీసుల జారీ నుంచి విచారణ(హియరింగ్) చేపట్టడం వరకు ప్రయాసగా మారింది. ఓటర్లకు తగిన రుజువులు లేకపోతే మరోసారి రావడం, ఓటర్లు నిర్ణీత సమయంలో బీఎల్వోల ముందు హాజరు కావడం లేదు. ఆ తేదీలు రద్దు(ల్యాప్స్) అవుతున్నాయి. బీఎల్వోలు ప్రతీ ఓటరు ఫొటో తీసుకుని యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. దీంతో చాలా చోట్ల వేలాది మంది ఓటర్ల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. ఒక్కో రోజు ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సగటున కనీసం వెయ్యికి పైనే ఓటర్ల పరిశీలన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొందరు తగిన రుజువులు తీసుకురాకపోవడంతో మళ్లీ మళ్లీ హియరింగ్ ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. వృద్ధులు, మహిళలకు చాలామంది పదో తరగతి మార్కుల మెమో, బ్యాంకు పాస్బుక్, లేదా కుల ధ్రువీకరణలు అడుగుతున్నారు. ఆధార్, పాన్, రేషన్ కార్డులు ధ్రువీకరణకు ఆమోదించకపోవడంతోనూ ఇబ్బందులు వస్తున్నాయి. గడవులోపు పూర్తయ్యేనా? ప్రస్తుతం ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం ఓటర్ల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ కొనసాగుతోంది. అదే సమయంలో ఓటర్ల తప్పులను సరి చేస్తున్నారు. చాలా వరకు చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ తప్పనిసరిగా రుజువు చూపించాలి. వేలాది ఓటర్లకు నోటీసుల జారీ, హియరింగ్, తేదీలు, బీఎల్వోలు ధ్రువపత్రాల పరిశీలన నుంచి ఆర్వోలు, ఎన్నికల సిబ్బంది, జిల్లా ఎన్నికల అధికారుల వరకు పరిశీలన చేయాలి. దీంతో గడవులోపు సర్ ప్రక్రియ పూర్తవుతుందా? అనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ తుది జాబితా ప్రచురణకు అక్టోబర్ 15నుంచి నవంబర్ 9వరకు గడువు పొడగించింది. అయితే నవంబర్ 5వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంది. ఈ క్రమంలో అనేక మంది ఓటర్లు సకాలంలో స్పందించకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. -
పట్టేస్తారు!
చూసినా షేర్ చేసినా..మంచిర్యాలక్రైం: స్మార్ట్ఫోన్ యుగంలో పోర్నోగ్రఫీ సైట్లతో అశ్లీలత చేతుల్లోకి చేరింది. మైనర్ల నుంచి మొదలుకొని నడివయస్సు వరకు చాలామంది పోర్నోగ్రఫీకి బానిసగా మారుతున్నారు. కొందరు చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తూ జైలు పాలవుతున్నారు. ఈ ఏడాది మంచిర్యాల పోలీస్స్టేషన్ పరిధిలో చైల్డ్పోర్నోగ్రఫీ వీడియోలు చూసి, ఇతరులకు షేర్ చేసినందుకు ఐదుగురిపై కేసు నమోదైంది. వీరిలో ముగ్గురు మైనర్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అశ్లీల వెబ్సైట్లపై ప్రత్యేక నిఘా.. అశ్లీల వెబ్సైట్లు, టెలిగ్రామ్, సోషల్ మీడియా ఫ్లాట్ఫాంలపై అమెరికాకు చెందిన యూనైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అనే స్వచ్ఛంద సంస్థ (ఎన్సీఎంఈసీ), నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ అనే ప్రత్యేక విభాగం ప్రత్యేక నిఘా పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులపై జరిగే అశ్లీల దాడులు, చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు, ఫొటోలు ఎవరు చూస్తున్నారు, ఎవరు షేర్ చేస్తున్నారో గుర్తించి ఆయా రాష్ట్రాల పోలీసులకు సమచారం అందిస్తోంది. స్థానిక పోలీస్స్టేషన్లకు పోర్నోగ్రఫీ వీడియోలు చూసిన, షేర్ చేసిన వారి వివరాలు అందించి కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. చట్ట ప్రకారం ప్రైవేటుగా చూడడం నేరం కాకపోయిన, చూసి ఇతరులకు షేర్ చేయడం ఐటీ యాక్ట్ 67 ప్రకారం నేరమవుతుంది. ఒకవేళ ఆ వీడియోల్లో మైనర్లు ఉంటే అది ఐటీ యాక్ట్ 67–బీ, పోక్సో చట్టం ప్రకారం ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. యువత పక్కదారి.. విద్యార్థి దశలోనే అరచేతిలో ఉన్న సెల్ఫోన్ వారిని నేరాల్లోకి నెడుతోంది. తాజాగా జిల్లా కేంద్రంలో ఆండాలమ్మ కాలనికి చెందిన ఓ మైనర్ బాలుడు ఫోర్న్ వీడియోలు చూసి మరో మైనర్ బాలికను వేధించినందుకు సదరు బాలిక దగ్గరి బంధువు బాలుడిని మందలించాడు. దీంతో బాలుడు మద్యం మత్తులో మందలించిన వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. సెల్ఫోన్లలో లైంగిక, హింసాత్మక ఆంశాలు కౌమర దశలో ఉన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీడియోలు చూస్తే ఎవరికి తెలుస్తుందిలే అన్న భ్రమలో యువత ఉంటున్నారు. కానీ పోర్నోగ్రఫీ వెబ్సైట్లు ఎవరు చూస్తున్నారు.. ఎవరికి షేర్ చేస్తున్నారు.. ఎవరు డౌన్లోడ్ చేస్తున్నారో ఎన్సీఎంఈసీ ఇట్టే పట్టేస్తోంది. తమ పిల్లలు సెల్ఫోన్లో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేయాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. పోర్న్ వెబ్సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. నిర్వాహకులు బ్లాక్ అయిన వెబ్సైట్ పేరును పోలిన లేదా దాని చివర 1, 2 లాంటి అంకెలు చేర్చి మరో వెబ్సైట్ను ప్రారంభిస్తున్నారు. ఈ తరహా వెబ్సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లు విదేశాల్లో ఉన్నవే కావడంతో వెబ్సైట్ల నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండడం లేదని ఓ పోలీస్ అధికారి చెప్పడం గమనార్హం. -
భూ రికార్డుల నవీకరణ వేగవంతం చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో భూ రికార్డుల నవీకరణ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ చాంబర్లో తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, జీపీవో, ల్యాండ్ సర్వే అధికారులతో నెన్నెల మండలం చిన్నవెంకటపూర్, పుప్పాలవానిపేట గ్రామాల్లో భూ రికార్డుల నవీకరణపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూ రికార్డుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్ పనులను సమన్వయంతో పూర్తి చేయాలని తెలిపారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ భూ రికార్డుల కచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. -
పోక్సో కేసు నిందితుడి అరెస్ట్
లక్సెట్టిపేట: మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేసినట్లు లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. లక్సెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన సతీశ్ అనే వ్యక్తి జాతకాలు చూసి ఆరోగ్యం బాగు చేస్తాడని నమ్మిన ధర్మపురికి చెందిన మహిళ తన కూతురు మైనర్ బాలికను ఈనెల 8న అతని వద్దకు తీసుకొచ్చింది. ఈక్రమంలో అతను బాలికను పూజల నిమిత్తం పూజ గది బయట వైపు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగా వేధించాడు. ఈవిషయం తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక మరుసటి రోజు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే బాలిక తల్లి లక్సెట్టిపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు గురువారం సతీశ్పై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. కాగా ప్రజలు మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దన్నారు. ఎస్సై సురేశ్, ఏఎస్సై అన్వర్, సిబ్బంది వసంత్, అన్వర్, సుధాకర్, రాజమౌళి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి పట్టివేత
చెన్నూర్: చెన్నూర్ జాతీయ రహదారిలోని అస్నాద ఎక్స్రోడ్డులో మోటర్ సైకిల్పై గంజాయి తరలి స్తున్న వారిని పట్టుకున్నట్లు సీఐ బన్సీలాల్ తెలి పారు. స్థానిక సీఐ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జి ల్లా తోడ్స గ్రామం నుంచి చెన్నూర్ మీదుగా వేములవాడకు నంబర్ ప్లేట్ లేని మోటర్ సైకిల్పై వె ళ్తున్న ఇద్దరు యువకులను ఆపి తనిఖీ చేయగా వా రి వద్ద నుంచి కిలో 20గ్రాముల గంజాయి లభ్యమై ందన్నారు. గంజాయితో పాటు సెల్ఫోన్, రూ. 2000 నగదు, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్కు తరలించామన్నారు. యువకులను విచారించగా గత ఏడాది నుంచి గంజాయికి బానిసలయ్యారని, రెండు రోజుల క్రితం రూ. 4 వేలు విలువ గల గంజాయిని తరలించి విక్రయించారన్నారు. శుక్రవారం మళ్లీ గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. దాని విలువ రూ.15 వేలు ఉంటుందన్నారు. యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై రాజశేఖర్, టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నార ు. -
గొల్లవాగు ప్రాజెక్ట్ కాలువకు గండి
భీమారం: మండల కేంద్రంలోని గొల్లవాగు ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు శుక్రవారం గండి పడింది. దీంతో నీళ్లు వాగులోకి వెళ్లాయి. కాలువకు అక్కడక్కడ చిన్న చిన్న బుంగలు ఏర్పడ్డా మరమ్మతు చేయడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. భీమారం నుంచి ఎలకేశ్వరం వరకు సిమెంట్ కాలువ నాసిరకంగా నిర్మించడంతో పగుళ్లు తేలాయి. ఎలకేశ్వరం గ్రామ సమీపంలో రెండేళ్ల క్రితం కాలువకు గండి పడగా ఇప్పటికీ మరమ్మతు చేయలేదు. కాగా, ఇసుక బస్తాలతో గండి పూడ్చే పనులు చేపట్టినట్లు గొల్లవాగు ప్రాజెక్ట్ డీఈ రామకృష్ణ తెలిపారు. -
గురుకులాల్లో ఎప్సెట్ ప్రత్యేక శిక్షణ
మంచిర్యాలఅర్బన్: కార్పొరేట్ కోచింగ్లకు దీటుగా గురుకులాల్లో పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ సొసైటీ పరిధిలో కళాశాలల్లో విద్యార్థులకు ఎప్ సెట్ ప్రత్యేక ఉచిత శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. పోటీ పరీక్షల శిక్షణ కేవలం సీఓఈ విద్యాసంస్థలకే పరిమితం కాగా ఇకపై నాన్ సీఓఈ సైన్స్ కళాశాలలకు విస్తరించారు. సబ్జెక్టు నిపుణుల ద్వారా వర్చువల్ (ఆన్లైన్) విధానంలో తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని గురుకుల విద్యార్థులకు ఎప్సెట్కు నాణ్యమైన శిక్షణ అందుబాటులోకి రావడంతో ప్రయోజనం చేకూరనుంది. సబ్జెక్టు నిపుణల బోధన సీఈవో విద్యార్థులతోపాటు సాధారణ(నాన్–సీవోఈ) గురుకుల విద్యార్థులకు కూడా అనుభవజ్ఞులైన నిపుణులతో డిజిటల్ విధానంలో పాఠాలు వినే అవకాశం లభిస్తుంది. ఎంసెట్, ఎప్సెట్ విధానం, ప్రశ్నల సరళి, టైమ్ మేనేజ్మెంట్, షార్ట్కట్ ట్రిక్స్పై స్పష్టత వస్తుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, వృత్తి విద్య కోర్సుల్లో ఉత్తమ ర్యాంకు సాధించి మంచి కళాశాలల్లో సీటు పొందే అవకాశాలు మెరుగుకానున్నాయి. సోషల్ వెల్పేర్లో.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో విద్యార్థులకు గురువారం ఆన్లైన్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఎనిమిది కళాశాలల్లో చెన్నూర్, కోటపల్లి, జైపూర్, మందమర్రి, మంచిర్యాల, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, బెల్లంపల్లి సీఈఈ కళాశాలలున్నాయి. ప్రతీ సెక్షన్లో 40 మంది చొప్పున 640 మందికి శిక్షణతో ప్రయోజనం చేకూరనుంది. -
అటవీ శాఖ అధికారులకు ఆయుధాలు ఇవ్వాలి
మంచిర్యాలక్రైం: అటవీ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆయుధాలు మంజూరు చేయాలని టీఎన్జీఓస్, తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ సెంట్రల్ ఫో రం అధ్యక్షుడు పొన్న మల్లయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్ర వ్యాప్తంగా 22మంది అటవీశాఖ అధికారులు విధి నిర్వహణలో కలప స్మగ్లర్లు, నక్సల్స్ చేతిలో అమరులయ్యారని తెలిపారు. అటవీ ప్రాంతంలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, తమ ప్రాణాలతోపాటు విలువైన అటవీ సంపదను కాపాడేందుకు ఆయుధాలు అవసరమని అన్నారు. అటవీ శాఖ అధికారులపై దాడులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు అందజేశామని తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వ స్సందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్పందించి ఆయుధాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు. -
డప్పు కొట్టి.. పాడె మోసిన మాజీ ఎమ్మెల్యేలు
మందమర్రిరూరల్: బీఆర్ఎస్ నాయకుడు జే.రవీందర్ అంతిమ యాత్రలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నల్లాల ఓదెలు డప్పుకొట్టి, పాడె మోసి కన్నీటి వీడ్కోలు పలికారు. మందమర్రి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జే.రవీందర్ బుధవారం అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. గురువారం అంత్యక్రియలు నిర్వహించగా.. బాల్క సుమన్, నల్లాల ఓదెలు పాల్గొన్నారు. అంతిమయాత్రలో డప్పు కొట్టి పాడె మోసి ఆయన పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, పార్టీలకతీతంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని వీడ్కోలు పలికారు. -
అక్టోబర్లో 30కిలోమీటర్ల పరుగు పందెం
మంచిర్యాలక్రైం: జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగానే అక్టోబర్ 11న జాతీయ స్థాయిలో 30 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించనున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. గురువారం ఆయన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గాంధారిఖిల్లా గుట్ట, ఏసీసీ క్వారీ, మరికొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి 30 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించనున్నట్లు తెలిపారు. 5, 10, 30 కిలోమీటర్లు ఒక ప్రయోగాత్మకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పాల్గొనే వారికి పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామని తెలిపారు. ఆసక్తి గలవారు www. gtrultra. com ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 15ఏళ్లు పైబడిన వారు అర్హులని తెలిపారు. ఇప్పటివరకు బెంగళూర్, పూణె, అహ్మదాబాద్, చెన్నయ్ తదితర రాష్ట్రాల నుంచి 150 రిజిస్ట్రేషన్లు వచ్చాయని తెలిపారు. పూర్తి వివరాలకు 8639337951 నంబరులో సంప్రదించాలని తెలిపారు. జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రతీ ఆరు నెలలకోసారి ఏదో ఒక కార్యక్ర మం నిర్వహిస్తామ ని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎఫ్డీఓ సర్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నేడు రక్తదానం శిబిరంఅటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు డీఎఫ్ఓ రాహుల్కిషన్ జాదవ్ తెలిపారు. -
ఎక్కడి చెత్త అక్కడే..
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. నగరంలో ప్రతీ రోజు వెలువడే చెత్త తరలించేందుకు సరిపడా కార్మికులు ఉన్నా తరలింపులో జాప్యం జరుగుతోంది. నగరంలో నిత్యం 90మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది. జనాభాకు అనుగుణంగా 545మంది కార్మికులు ఉన్నారు. ఇందులో 400 మంది పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు గాను మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో మరో 70 మందిని అదనంగా తీసుకున్నారు. ఉన్నవారితో స మస్య తీరడం లేదని అదనంగా కార్మికులను తీసుకున్నా నగర పరిశుభ్రతలో మార్పు రాలేదు. అదనంగా తీసుకున్న కార్మికులు డివిజన్లలో పనులు చే స్తున్నట్లు కనిపించడం లేదని కార్పొరేటర్లు చెబుతున్నారు. కార్మికులు ఉన్నా నగరంలో చెత్త పేరుకుపోతుండడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకా లం కావడంతో చెత్త పేరుకుపోయి దుర్వాసన, దో మల వృద్ధితో జ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. నగరంలో సేకరించిన చెత్తను ఆండాళమ్మ కాలనీలోని డంపింగ్ యార్డుకు తరలిస్తుండగా పూర్తిగా నిండిపోయింది. దీంతో కొన్ని డివిజన్లలో రోజుల తరబడి చెత్త తీయకుండా అలాగే ఉంచుతున్నారనే ఆరోపణలున్నాయి. చెత్తకుప్పల నిల్వలతో వ్యాధులు ప్రబలే అకాశం ఉంది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. తరలించేలా చూస్తాం నగరంలో పారిశుద్ధ్యం మెరు గు పర్చేందుకు అదనంగా కా ర్మికులను తీసుకుని పనులు చేయిస్తున్నాం. అన్ని డివిజన్లలో చెత్త సేకరణ ప్రతీరోజు ఉండేలా చూస్తున్నాం. అదనంగా ఉన్న కార్మికులతో చెత్తను ఎప్పటికప్పుడు తరలించి, ప్రతీ డివిజ న్ను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటాం. – జి.అన్వేష్, మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్మంచిర్యాల జెడ్పీ బాలికల పాఠశాల సమీపంలో రోడ్డు మధ్యలో కూరగాయల చెత్తమంచిర్యాల ఎల్ఐసీ కాలనీలో రోడ్డు పక్కన పడేసిన చెత్త -
మంచిర్యాల
7ఘనంగా ‘పొలాల’ పండుగ పొలాల అమావాస్యను జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఎడ్లకు పూజలు చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. గ్రామాల్లోని వీధుల్లో ఎడ్లతో ఊరేగింపు నిర్వహించారు. మధ్యాహ్న సమయంలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు బలంగా వీస్తాయి. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.క్రీడా నిధులతో ‘ఆట’లు! మైదానాలు లేని ప్రభుత్వ పాఠశాలలు, కళా శాలలకు క్రీడా నిధుల్లో కోత విధించారు. ఆట స్థలాలు లేని పాఠశాలలు, కళాశాలలను వర్గీకరించి నిధులు కేటాయించారు. 8లోu -
అంబులెన్స్ నిర్వాహకుల ఆగడాలపై చర్యలు తీసుకోవాలి
మంచిర్యాలటౌన్: అంబులెన్స్ మాఫియా, దోపిడీ పాయింట్ సిస్టంపై ఉక్కుపాదం మోపాలని, ఆగడాలపై కఠిన చర్యలు తీసుకో వాలని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్ అసోసియేషన్(హెచ్ఆర్డీఏ) ఆధ్వర్యంలో మంచి ర్యాల డీసీపీ భాస్కర్కు గురువారం వినతిపత్రం అందజేశారు. సిండికేట్ కింద ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు అత్యవసర రవా ణాను గుత్తాధిపత్యం చేసి అత్యంత ప్రమాదకరమైన, నిస్సహాయ వైద్య, పేద కుటుంబా ల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. రోగులను వేధించే, అధిక చార్జీలు వసూలు చేసే అంబులెన్సు నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని కోరారు. ప్రభుత్వ అంబులెన్సు సేవలను బలోపేతం చేసి పేదలకు ఉచిత, సత్వర రవాణా అందించేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎంసీ సభ్యుడు ఎగ్గన శ్రీనివాస్, టీజీఎంసీ కోఆప్షన్ సభ్యుడు డాక్టర్ అనిల్కుమార్ ముత్తినేని, హెచ్ఆర్డీఏ జిల్లా అధ్యక్షు డు డాక్టర్ సంతోష్చందూరి, సెక్రెటరీ డాక్టర్ శ్రీధర్, ట్రెజరర్ డాక్టర్ ప్రవీణ్కుమార్ బుద్దె, వైద్యులు రాకేశ్ చెన్న, అభినవ్, ప్రసాద్, కుమార్ పాల్గొన్నారు. -
తెల్లకల్లు బట్టీల్లో ఈగల్ టీమ్ తనిఖీలు
మంచిర్యాలక్రైం: రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్ ఎ లైట్ యాంటీ–నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ ఎన్ఫో ర్స్మెంట్(ఈగల్) గురువారం జిల్లా కేంద్రంలో తెల్లకల్లు బట్టీలు, దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించింది. హైదరాబాద్కు చెందిన ఈగల్ టీమ్ ఏసీపీ ఉపేందర్, 10 మంది అధికారులు స్థానిక ఏసీపీ ప్రకాష్, స్పెషల్ ఫో ర్స్ సిబ్బంది 50 మందితో మంచిర్యాలలోని ఏడు తెల్లకల్లు దుకాణాల్లో తనిఖీ చేశారు. మూడు గంటలపాటు సాగిన తనిఖీల్లో కల్లు తయారీ, ఎక్కడి నుంచి సరుకు వస్తుందని, మత్తు రసాయనాలు ఏమైనా కలుపుతున్నారా అని ప్రశ్నించారు. దుకాణాల్లోని కల్లు నమూనాలు సేకరించారు. దుకాణాల నిర్వాహకుల ను స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. బట్టీ నిర్వాహకుడు లచ్చిరెడ్డితోపాటు ఏడు కల్లు దుకాణాల నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోద్రావు తెలిపారు. -
‘పేదల భూములను దోచేందుకే 22ఏ’
మంచిర్యాలటౌన్: పేదల భూములు దోచుకునేందుకు 22ఏ నిషేధిత భూముల జాబితాను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. 22ఏ నిషేధిత జాబితా బాధితుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను గురువారం కలెక్టర్ కుమార్ దీపక్కు అందజేశారు. పట్టా ఉన్న నివాస, వ్యవసాయ భూములు జాబితా నుంచి తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపతి రాజయ్య, గడ్డం స్వామిరెడ్డి, నాగిరెడ్డి, హేమంత్రెడ్డి, సుగుణ, సంజీవ్, సురేష్, వెంకటేశ్, సంతోష్, సురేందర్, బత్తుల శేఖర్, ముత్తె అనిల్ పాల్గొన్నారు. -
రైస్మిల్లులు బంద్?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రైస్మిల్లర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, పలు జిల్లాల్లో సీఎంఆర్(కస్టం మిల్లింగ్ రైస్) మిల్లింగ్ బంద్ చేశా రు. జిల్లాలో తక్కువ మిల్లులు ఉండడం, మిగతా జిల్లాలతో పోలిస్తే ధాన్యం నిల్వల సమస్య తక్కువగా ఉండడంతో సమ్మెకు వెనకాముందు అవుతున్నా రు. విజిలెన్స్ అధికారుల తనిఖీలు, షార్టేజ్పై రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సమ్మెలో పాల్గొంటామని మిల్లర్లు చెబుతున్నారు. రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ఇక్కడ కూడా బంద్లో పాల్గొంటామని అంటున్నారు. జిల్లాలో రా, బాయిల్డ్ రైస్మిల్లులు క్రియాశీలకంగా ఉన్నవి 28మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 22మంది మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. కొందరిపై పీడీ యాక్టు కూడా నమోదైంది. ఆర్ఆర్(రెవెన్యూ రికవరీ) యాక్టుతో పాటు క్రిమినల్ కేసులు ఉన్నాయి. కొందరు హైకోర్టులో కేసులు వేయగా, స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో మిల్లర్ల సమ్మె ప్రభావం జిల్లాలో తక్కువగా ఉండనుంది. నిల్వలపై గుబులుప్రస్తుతం మిల్లర్ల వద్ద రైతుల నుంచి సేకరించిన గత రెండు సీజన్ల వడ్లు ఉన్నాయి. గత ఖరీఫ్, రబీ పంటల ధాన్యం మిల్లుల్లోనే ఉంది. ఖరీఫ్ 49వేల మెట్రిక్ టన్నుల బియ్యం, రబీ 41వేల మెట్రిక్ టన్నుల బియ్యం పౌరసరఫరాల శాఖకు అందించా ల్సి ఉంది. వీటిలో ఖరీఫ్ 70శాతం వరకు, రబీ 25శాతం వరకు ఇంకా బియ్యం అందించాల్సి ఉంది. ప్రతీ మిల్లులో ధాన్యంలో కచ్చితంగా షార్టేజ్(తక్కువ)గా నిల్వలు ఉంటాయని మిల్లర్లే చెబుతున్నారు. కనీసం 15నుంచి 20శాతం అన్ని చోట్ల తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం బకాయిలు ఉన్న మిల్లర్లతోపాటు ధాన్యం నిల్వలపైన కఠినంగా ఉండడంతో పీవీ(ఫిజికల్ వెరిఫికేషన్) చేయాలంటూ ఆదేశాలు వచ్చాయి. గతంలో అదనపు కలెక్టర్, డీసీఎస్వో, డీఎం, డీటీ, స్థానిక అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా పరిశీలనలు చేసేవారు. ఇప్పుడు ఆకస్మికంగా ఎప్పుడైనా, ఏ అధికారైనా మిల్లుల్లో తనిఖీలు చేయొచ్చు. ఒక అధికారి ఇచ్చిన తనిఖీ నివేదికపై మరో అధికారి మరోసారి తనిఖీలు చేసేలా సూపర్ చెకింగ్ తరహా లో తనిఖీలు చేయనున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ తరహా తనిఖీలు చేయగా, తక్కువ(షార్టేజ్) నిల్వలు ఉన్న మిల్లులకు జరిమానాలు వేస్తున్నారు. దొడ్డు, సన్న రకానికి కార్పొరేషన్ సూచించిన రేటు ప్రకారమే ఆ ధాన్యానికి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ తమను ఒత్తిడి చేయొద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మిల్లర్లను మరింత ఒత్తిడి తేస్తే సీఎంఆర్ బకాయిలు పెరగడంతోపాటు రేషన్ బియ్యం సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో ఆచితూచీ అడుగు వేస్తున్నట్లు సమాచారం.మద్దతు ఇస్తాం తనిఖీల పేరుతో 15నుంచి 20శాతం షార్టేజ్ను కూడా లెక్కలోకి తీసుకుని జరిమానాలు వేస్తే మిల్లర్లు తీవ్రంగా నష్టపోతారు. రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్ల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోనూ మిల్లులు బంద్ చేసి మద్దతు ఇస్తాం. – చిలువేరు వైకుంఠం, అధ్యక్షుడు, జిల్లా మిల్లర్ల సంఘం సమ్మెకు కారణాలివే..సీఎంఆర్ సకాలంలో అందిస్తున్న మిల్లులకు సకాలంలో మిల్లింగ్ చార్జీలు అందడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లులు చెల్లించడం లేదని మిల్లర్లు చెబుతున్నారు. ప్రస్తుతం రెండేళ్ల మిల్లింగ్ చార్జీలు జిల్లాలో రూ.కోట్లలో చెల్లించాల్సి ఉంది. ప్రతీ మిల్లులకు పెద్ద మొత్తంలో ఇవ్వాల్సిన ధాన్యం రవాణా చార్జీలు, డ్రైయేజ్(తేమ ఆరబోత) చార్జీలు చెల్లించాలి. బ్లాక్ లిస్టులో ఉన్న డీఫాల్ట్ మిల్లర్లకు బకాయి బియ్యంపై కార్పొరేషన్ విధించిన 25శాతం జరిమానా, 12శాతం వడ్డీ ఎత్తివేయాలి. టెండర్ వేసిన ధాన్యం విలువకు సైతం జరిమానా, వడ్డీ తొలగించాలి. అవుట్ టర్న్ రాని కారణంగా ప్రతీ క్వింటాల్ ధాన్యానికి పౌరసరఫరాల కార్పొరేషన్కు రా రైస్ 67కిలోలు, బాయిల్డ్ రైస్ 68కిలోలు ఇవ్వాలి. ఈ క్రమంలో ధాన్యం నిల్వలకు సరిపడా స్థలం లేక నష్టపోయామని వాదిస్తున్నారు. -
బృహత్ వికృతి వనం
బెల్లంపల్లి: బెల్లంపల్లి ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీలో బృహత్ పట్టణ ప్రకృతి వనం నిర్వహణ లేక వికృతంగా తయారైంది. పర్యవేక్షణ కొరవడి పనికిరాకుండా పోతోంది. ప్రకృతి వనం నిర్మాణానికి వెచ్చించిన ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైంది. తుమ్మ ఇతర రకాల పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి అధ్వానంగా మారింది. గోల్ బంగ్లా బస్తీ శివారులో ఐదెకరాల విస్తీర్ణంలో బృహత్ ప్రకృతి వనం ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం అన్ని విధాల అభివృద్ధి చేయాల్సి ఉన్నా బల్దియా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బెంచ్లు మందుబాబులు, ఆకతాయిలకు అడ్డాగా మారాయి. రేయింబవళ్లు మందుబాబులు, గంజాయి రాయుళ్లు బెంచ్లు, చెట్ల నీడపట్టున దర్జాగా గంటల తరబడి కూర్చోని మత్తులో జోగుతున్నారు. చీకటి పడితే చాలు వనంలో అసాంఘిక కార్యకలాపాలు నిత్యకృత్యంగా మారాయని సమీప ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రకృతి వనంలో మొక్కలు నీటితడులు అందించడానికి ప్రత్యేకంగా బోరు ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించారు. కరెంటు సరఫరాకు ఆటంకం కలుగకుండా ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ వినియోగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. బృహత్ వనం నిర్వహణకు ఏటా నిధులు కేటాయించాల్సి ఉన్నా పట్టింపు కరువైంది. 10శాతం గ్రీన్ బడ్జెట్ సమకూర్చాల్సి ఉన్నా నిర్లక్ష్యం చేస్తూ బృహత్వనాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు బృహత్ ప్రకృతి వనం అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం బృహత్ ప్రకృతి వనం నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. సిబ్బంది సమస్య వల్ల నిర్వహణ చేపట్టడం లేదు. ఇకపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బృహత్ వనాన్ని అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తాం. వాచ్మెన్ను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నాం. – తన్నీరు రమేష్, మున్సిపల్ కమిషనర్, బెల్లంపల్లి -
అక్కడ ప్రారంభం.. ఇక్కడ బంద్!
చెన్నూర్: చెన్నూర్ పట్టణంలో వంద పడకల ఆస్పత్రి ప్రారంభానికి సన్నద్ధమవుతోంది. చె న్నూర్, కోటపల్లి, వేమనపల్లి, భీమారం మండలాల ప్రజలకు మెరుగైన వైద్యం అందనుంది. ఫలితంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. మరోవైపు ఏరియా ఆస్పత్రి మూత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చె న్నూర్ ఏరియా ఆస్పత్రిలో 18మంది వైద్యులతోపాటు సూపరింటెండెంట్, సరిపడా సిబ్బంది ఉన్నారు. వీరంతా వంద పడకల ఆస్పత్రి జీవో ప్రకారం చెన్నూర్ ఏరియా ఆస్పత్రిలో వి ధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలో వంద పడకల ఆస్పత్రి ప్రారంభమైతే వైద్యులు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏరియా ఆస్పత్రి మూతపడే అవకాశం ఉంది. అయితే మాతాశిశు ఆస్పత్రి(ఎంసీహెచ్)గా మారిస్తే పిల్లలు, గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారు. వంద పడకల ఆస్పత్రి ప్రారంభంలోగా ఎంసీహెచ్ ఏర్పాటు కోసం జీవో విడుదలైతే ఆస్పత్రిలో యధావిధిగా మాతాశిశువులకు వైద్యసేవలందే అవకాశం ఉంది. నేషనల్ హెల్త్ స్కీం ద్వారా ప్రత్యేక జాబ్ ప్యాటర్న్ ఉంటుంది. ఎంసీహెచ్కు కావాల్సిన వైద్యులు, సిబ్బందిని సమకూరుస్తారు. ప్రతిపాదనలు పంపించాం.. వంద పడకల ఆసుపత్రి జాబ్ ప్యాటర్న్ అక్కడికి వెళ్లిపోతుంది. ఎంసీహెచ్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించాం. మంత్రి వివేక్ కృషి చేస్తున్నారు. జీవో వచ్చే అవకాశం ఉంది. జీవో వస్తే ఎంసీహెచ్లో యాధావిధిగా సేవలందుతాయి. జీవో అలస్యం అయితే ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తాం. – సత్యనారాయణ, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, చెన్నూర్ మంత్రి వివేక్ ప్రయత్నాలుఏరియా ఆస్పత్రిని మాతాశిశు ఆస్పత్రిగా ఏర్పాటు చేసేందుకు జీవో కోసం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామి కృషి చేస్తున్నట్లు తెలిసింది. వంద పడకల ఆస్పత్రి ప్రారంభానికి ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ హాజరు కానున్నట్లు ఇటీవల మంత్రి ప్రకటించారు. వైద్యారోగ్య శాఖ మంత్రితో మాట్లాడి జీవో జారీ చేయించే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. -
వీరనారి చాకలి ఐలమ్మ
మంచిర్యాలఅగ్రికల్చర్: సామాజిక అన్యాయాలు, దోపిడీ, అణచివేతను ఎదురించి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, డీఆర్వో మోతీరామ్, కుల సంఘాల ప్రతినిధులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. వాల్పోస్టర్ల ఆవిష్కరణకాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణేశ విగ్రహాల వినియోగంపై వాల్పోస్టర్లను కలెక్టర్ కుమార్ దీపక్ ఆవిష్కరించారు. మట్టి విగ్రహాల ద్వారా జలవనరుల కాలుష్యాన్ని నివారించవచ్చని తెలిపారు. -
చెరువులో పడి ఒకరు మృతి
లోకేశ్వరం: మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన ఈరవాడ్ సాయినాథ్(43) గ్రామ సమీపంలోని దేవుని చెరువులో ప్రమాదవాశాత్తు పడి మరణించారు. ఏఎస్సై భారతి తెలిపిన వివరాల ప్రకా రం.. సాయినాథ్ చిరువ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంత కాలంగా మూర్చవ్యాధితో బాధపడుతున్నాడు. మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం గ్రామ సమీపంలోని దేవుని చెరువులో శవమై కనిపించాడు. చేపల వేటకు వెళ్లి ముర్చావ్యాధితో ప్రమాదవాశత్తు నీటమునిగి మరణించారని ఏఎస్సై పేర్కొన్నారు. సాయినాథ్కు భార్య లక్ష్మి, ముగ్గురు కుమారైలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. బావిలో పడి మతిస్థిమితం లేని వృద్ధుడు..సిరికొండ: మండలంలోని సోన్పెల్లి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని వృద్ధుడు పంచకలే విశ్వనాథ్ (70) వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం మతిస్థితమితం కోల్పోయిన విశ్వనాథ్ ఇంటివద్దే ఉంటున్నాడు. ఈ నెల 8న ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం గ్రామానికి చెందిన గాయక్వడ్ శివాజీ పంటచేనుకు వెళ్లి తన వ్యవసాయ బావిలో విశ్వనాథ్ మృతదేహాన్ని గుర్తించాడు. మతిస్థిమితం లేని విశ్వనాథ్ ఇంటినుంచి బయటకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అంగన్వాడీ టీచర్ మాయాజాలం
కోటపల్లి: అంగన్వాడీ కేంద్రంలో సరుకులు పక్కదారి పట్టించేందుకు టీచర్ తప్పుడు రికార్డులు నమోదు చేసింది. బాలికలకు పెళ్లయినట్లు, గర్భిణీ, తల్లిగా నమోదు చేయడం విచారణలో వెల్లడి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మండలంలోని నక్కలపల్లి–1 అంగన్వాడీ కేంద్రంలో టీచర్ వీ.సరోజ అవకతవకలకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్య గురువారం అంగన్వాడీ కేంద్రంలో విచారణ చేపట్టగా అక్రమాలు వెలుగు చూశాయి. కేంద్రంలో ఆరేళ్లలోపు పిల్ల లు 19మంది, ఇద్దరు బాలింతలు, నలుగురు గర్భిణులు ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. వీరిలో ఇద్దరు బాలికలకు పెళ్లయినట్లు, బాలింతలుగా నమోదు చేసి సరుకులు పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. రికార్డుల్లో నమోదైన వారిని పిలిచి విచారణ చేసి లిఖిత పూర్వకంగా సేకరించారు. లబ్ధిదారుల పేర్లపై సరుకులు తీసుకున్నట్లు చూపించి పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, మండలంలోని బద్దదంపల్లి అంగన్వాడీ కేంద్రం రికార్డుల్లోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీటెక్ విద్యార్థిని పెళ్లయినట్లు నమోదు చేసినట్లు తెలిసింది. వీరు చెన్నూర్లో ఉంటుండడం గమనార్హం. ఈ విషయం అధికారులకు తెలిసి నిలదీయడంతో ఇటీవల తొలగించినట్లు సమాచారం. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు
లోకేశ్వరం: స్నేహితుడిని ఎయిర్పోర్టులో దింపేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామానికి చెందిన పైడిపల్లి భోజన్న(47) నిర్మల్ పట్టణంలోని మంజూరపూర్లో నివాసం ఉంటున్నాడు. దిలావర్పూర్ మండలంలోని కంజర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మంజూలపూర్కు చెందిన మిత్రుడు రాజేశ్వర్ను దుబాయ్ వెళ్లేందుకు గురుపల్లి గంగాధర్, మనోజ్ స్నేహితులతో కలిసి రాజేశ్వర్ దుబాయి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. దీంతో అతడిని ఎయిర్పోర్టులో దింపేందుకు రాజేశ్వర్ బంధువులకు చెందిన కారులో భోజన్న, గంగాధర్, మనోజ్ బుధవారం రాత్రి వెళ్లారు. హైదారాబద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో దింపిన తర్వాత గురువారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. 44వ జాతీయ రహదారి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్దకు ఉదయం 11 గంటల చేరుకున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగిఉన్న ఆయిల్ ట్యాంకర్ను వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదం జరగడంతో కారు నుజ్జునుజ్జయింది. ముందు సీట్లో భోజన్న, డ్రైవర్ సీట్లో గంగాధర్, వెనక సీట్లో మనోజ్ ఉన్నారు. ఈ సంఘటనలో పైడిపల్లి భోజన్న అక్కడిక్కడే మృతి చెందాడు. గంగాధర్, మనోజ్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరతించారు. భోజన్నకు భార్య సంగీత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. హెచ్ఎం మరణంతో విషాదం దిలావర్పూర్: కంజర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం భోజన్న మృతితో పాఠశాలలో విషాదం నెలకొంది. విద్యార్థుల ఉన్నతికి కృషి చేసిన భోజన్న మరణంతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. సర్పంచ్ చందు మాట్లాడుతూ భోజన్న మృతి వార్త తమను కలిచివేసిందన్నారు. ఆయన మృతికి పంచాయతీ ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. -
కూలిన ఇంటిని పరిశీలించిన సింగరేణి అధికారులు
కాసిపేట: కల్యాణిఖని ఓపెన్కాస్ట్ పేలుళ్లతో బెల్లంపల్లి మండలం సోమగూడంలో కూలిపోయిన ఇంటిని ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు అధికారి రాంబాబు గురువారం పరిశీలించారు. కూలీన గోడలు, దెబ్బతిన్న నిర్మాణాలను స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు చూపించి పరిస్థితిని వివరించారు. బాధిత కుటుంబానికి సింగరేణి ఆధ్వర్యంలో తిరిగి నిర్మాణం చేపట్టా లని కోరారు. స్పందించిన పీఓ జేసీబీతో కా లువలో పడిపోయిన బండరాళ్లు, ఇటుకలు, మట్టిని తీయించారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి కాలువను వినియోగంలోకి తీసుకు వ చ్చేందుకు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మౌనిక, నాయకులు ముత్తె భూమయ్య, మహేష్, కనకరాజు, శ్రీనివాస్, సురేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుదారుడిపై దాడి
దస్తురాబాద్: ఆర్టీఐ ఆధారంగా అక్రమంగా పింఛన్లు తీసుకుంటున్న వారిపై ఫిర్యాదు చేసిన వ్యక్తిపై దాడిచేసిన ఘటన మండలంలోని పెర్కపల్లెలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన కొట్టే శేఖర్ తన ప్వూర్వీకుల భూమి విషయంలో గ్రామానికే చెందిన కొత్తపల్లె కాలనీకి చెందిన వారితో వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో శేఖర్ ప్రజవాణిలో అక్రమ ఫించన్లపై ఫిర్యాదు చేశాడు. అధికారులు అరకొర సమాధానం ఇవ్వడంతో ఆర్టీఐ ద్వారా వివరాలు కోరాడు. ఆ వివరాలతో ప్రజవాణిలో అక్రమంగా ఫించన్లు పొందుతున్నవారిపై ఫిర్యాదు చేశాడు. అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. దీంతో కోపోద్రిక్తులైన కొత్తపల్లెకు చెందిన కొందరు శేఖర్పై దాడి చేశారు. ఎస్సై సాయికుమార్ గ్రామానికి చేరుకుని బాధితుడిని ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
బాసర ఆలయ పునర్నిర్మాణ పనులపై సమీక్ష
బాసర: బాసర శ్రీజ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతం చేసేదిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సలహా దారు శ్రీనివాసరాజు గురువారం బాసరకు వచ్చా రు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి అధి కారులతో సమీక్ష నిర్వహించారు. పునర్నిర్మాణ దా త సూరపనేని సునంద్ కూడా ఆయన వెంట ఉన్నా రు. బాలాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్ర త్యేక పూజలు చేశారు. ఈవో కార్యాలయంలో ఆర్అండ్బీ, దేవాదాయ శాఖ అధికారులతో శ్రీనివాసరాజు సమీక్ష నిర్వహించారు. పనుల్లో జాప్యం లేకుండా సమన్వయంతో ముందుకు సాగాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. -
క్రీడా నిధులతో ఆటలు..!
మంచిర్యాలఅర్బన్: ఉమ్మడి జిల్లాలో ఆట మైదానాలు లేని పాఠశాలలు, కళాశాలలకు క్రీడా నిధుల్లో కోత విధించారు. క్రీడా మైదానాలు లేక ప్రభుత్వం విడుదల చేసే క్రీడా నిధులు సద్వినియోగం కావడం లేదని భావించిన అధికారులు తగ్గించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో క్రీడలు, శారీరక విద్యను ప్రోత్సహించడానికి 2026–27 విద్యాసంవత్సరం క్రీడా నిధులను సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆటస్థలం ఉన్న, లేని పాఠశాలలు, కళాశాలలను వర్గీకరిస్తూ నిధులు కేటాయించారు. వర్గీకరణ ఇలా.. ఉమ్మడి జిల్లాలో 2895 పాఠశాలలు, 47 కళాశాలలు ఉన్నాయి. వీటిలో 2,466 పాఠశాలలు, 43 కళాశాలల్లో ఆటస్థలాలు ఉన్నట్లు వర్గీకరించారు. 429 పాఠశాలలు, 4జూనియర్ కళాశాలల్లో క్రీడామైదానాలు లేనట్లు లెక్క తేల్చారు. ఆటస్థలం ఉన్న ప్రాథమిక పాఠశాలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.10వేలు, జూనియర్ కళాశాలకు రూ.25వేలు, ఆటస్థలం లేని ప్రాథమిక పాఠశాలకు రూ.4వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.7వేలు, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలకు రూ.15వేల చొప్పున కేటాయించారు. వినియోగం ఇలా.. క్రీడా నిధులను ఆట స్థలాల నిర్వహణ, ఆట వస్తువుల కొనుగోలుకు ఉపయోగించాల్సి ఉంటుంది. పాఠశాల స్థాయికి తగినట్లుగా క్యారమ్, చెస్బోర్డులు, ఫుట్బాల్స్, వాలీబాల్స్, క్రికెట్ కిట్లు, తాడు, బ్యాడ్మింటన్ తదితర ఆట పరికరాలు కొనుగోలు చేయనున్నారు. పాఠశాల ఆవరణలో ఆటస్థలాన్ని శుభ్రం, సమం చేయడం, సురక్షితంగా సిద్ధం చేయ డం, క్రీడాపోటీల నిర్వహణ, రిజిష్టర్ నిర్వహణకు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఆటస్థలాలు లేనివి.. మంచిర్యాలలో 642 పాఠశాలల్లో ఒక్కటంటే ఒకే ఉన్నత పాఠశాలలో ఆటస్థలం లేనట్లు గుర్తించడం చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్లో 198 పాఠశాలలు, కళాశాలల్లో ఆటస్థలాలు లేనట్లు నిర్ధారించారు. ప్రైమరీలో 163, అప్పర్ ప్రైమరీలో 16, హైస్కూల్లో 18, జూని యర్ కళాశాలల్లో 1, నిర్మల్లో 78 బడుల్లో క్రీడా మై దానాలు లేకుండా పోయా యి. ప్రైమరీలో 64, అప్ప ర్ ప్రైమరీలో 5, ఉన్నత పాఠశాలల్లో 7, జూనియర్ కళాశాలల్లో 2, ఆసిఫాబాద్లో 156 పాఠశాలల్లో ఆటస్థలాలు లేకుండా పోయాయి. ఇందుల్లో ప్రైమరీ పాఠశాలల్లో 133, అప్పర్ ప్రైమరీలో 12, ఉన్నత పాఠశాలల్లో 10, జూనియర్ కళాశాల 1లో క్రీడా మైదానాలు లేవని గుర్తించారు. -
ఆదివాసీ సంస్కృతి గొప్పది
ఉట్నూర్రూరల్: ఆదివాసీ సంస్కృతి ఎంతో గొప్పదని ఐటీడీఏ ఇన్చార్జి పీవో రాజేశ్వర్రావు పేర్కొన్నారు. గురువారం పొలాల అమావాస్య సందర్భంగా ఐటీడీఏ ప్రాంగణంలో సాంస్కృతిక గిరి ఆధ్వర్యంలో నిర్వహించిన మరగొళ్ల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. పొలాల అమావాస్య పండుగకు నెల ముందుగానే ఆదివాసీ గ్రామాల్లో మరగొళ్లతో ఆడుతూ, పాడుతూ సందడి చేసే సంప్రదాయం కొనసాగుతోందని చెప్పారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసీ భాష, సంస్కృతి పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న వెంకటేశ్, లాల్శావ్, కొముర విఠల్ను అభినందించారు. సాంస్కృతిక గిరి సిబ్బంది, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, ఏపీవో పీవీటీజీ ఆత్రం భాస్కర్, ఈఈ తానాజీ, డిప్యూటీ డీఈవో చందన్, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, అధికారులు, సిబ్బంది, ఆదివాసీ కళాకారులు పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీలో హోప్ అండ్ వెల్నెస్ వీక్
బాసర: బాసర ఆర్జీయూకేటీలోని సైకలాజికల్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 11 వరకు ‘హోప్ అండ్ వెల్నెస్ వీక్ 2026’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో మానసిక ఆరో గ్యం, భావోద్వేగ సమతుల్యత, ఆత్మవిశ్వాసం, ఆ శావాదాన్ని పెంపొందించడమే లక్ష్యంగా వివిధ కా ర్యక్రమాలు చేపట్టారు. వాల్ ఆఫ్ పాజిటివిటీ, ఎ ల్లో రిబ్బన్ క్యాంపెయిన్, ‘ఆర్ యూ ఓకే?’ కార్యక్రమాలతోపాటు యోగా, స్ట్రెస్ మేనేజ్మెంట్, డిజి టల్ డిటాక్స్ చాలెంజ్, చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా గురువా రం న్యూరోసైకియాట్రిస్ట్ డాక్టర్ అల్లాడి సురేశ్ వి ద్యార్థులకు మానసిక ఆరోగ్యం, కౌన్సెలింగ్ ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. పీయూసీ–1, పీ యూసీ–2 విద్యార్థులు అవగాహన వాక్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. శుక్రవారం ఎస్ఏసీ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలతో వారోత్సవాలు ముగియనున్నాయి. ‘యూ ఆర్ నాట్ అలోన్ – టాక్, కనెక్ట్, సీక్ సపోర్ట్ అండ్ చూజ్ హోప్’ అనే సందేశాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లడమే కార్యక్రమా ల ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఏఓ మురళీధర్, డీన్ డాక్టర్ విఠల్, స్టూడెంట్ వెల్ఫేర్ జి. నాగరాజు, అడిషనల్ ఎస్డబ్ల్యూవో ప్రకాశ్, అడిషనల్ చీఫ్ వార్డెన్ డాక్టర్ శ్రీనివాస్, చీఫ్ వార్డెన్ టి.మధుసూదన్రెడ్డి, కౌన్సిలర్లు, కోఆర్డినేటర్లు, సైకలాజికల్ వెల్నెస్ సెంటర్ బృందం పాల్గొన్నారు. -
మొక్కే కదా అని నిర్లక్ష్యం..!
మంచిర్యాలక్రైం: అటవీ సంపద, పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం మూడో విడత వన మహోత్సవం నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 75శాతం లక్ష్యం పూర్తయింది. ఈసారి వర్షాల కారణంగా మొక్కలు నాటడం ఆలస్యంగా ప్రారంభమైంది. జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో ఈ ఏడాది 41.11లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం విధించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 306 గ్రామ పంచాయతీల్లో, అటవీశాఖ ఆధ్వర్యంలో 10 నర్సరీల్లో ఉపాధి హామీ పథకం కింద మొక్కలు పెంచారు. వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతీ నర్సరీలో బోర్లు ఏర్పాటు చేసి విత్తనం నాటిన నుంచి మొలకెత్తి మొక్కగా నాటేందుకు అనువుగా పెరిగేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎండ వేడి తగలకుండా పందిళ్లు, గ్రీన్మ్యాట్ ఏర్పాటు చేశారు. 24గంటలు నీరందించేలా ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలను నియమించారు. సంరక్షణపై అశ్రద్ధ 2025 ఆర్థిక సంవత్సరంలో వన మహోత్సవం పేరిట జిల్లాలో 49.04లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం విధించగా.. 46,02,180 మొక్కలు నాటినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 40శాతం మొక్కలు ఇళ్లలో నాటేందుకు ప్రతీ ఇంటికి ఆరు చొప్పున పంపిణీ చేసినట్లు లెక్కలున్నాయి. మరికొన్ని రహదారుల పక్కన, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఖాళీ స్థలాల్లో, మున్సిపల్ పార్కులు, కాలువ గట్ల వెంట, రోడ్లకు ఇరువైపుల, పాఠశాలల్లో మొక్కలు నాటినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతీ ఇంటికి పంపిణీ చేసిన మొక్కలు నాటారో లేదో అధికారులు పట్టించుకోలేదు. రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్ స్థలాల్లో నాటిన మొక్కలు ఎక్కడా ఆనవాళ్లు కనిపించడం లేదు. ఈసారి కూడా ప్రతీ ఇంటికి ఐదారు మొక్కల పంపిణీకి ఆయా శాఖల క్షేత్రస్థాయి సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నీడనిచ్చే, పండ్లు, పూలమొక్కలు అందజేతకు చర్యలు తీసుకుంటున్నట్లు ఓ అధికారి తెలిపారు. కానీ ఇప్పటివరకు మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టలేదు. మొక్కలు నాటడంలో చూపించే హంగామా వాటి సంరక్షణలో చూపడం లేదన్న విమర్శలున్నాయి.జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో మూడేళ్ల క్రితం హరితహారంలో భాగంగా కార్యాలయ ముఖద్వారం ఎడమ పక్కన అప్పటి జిల్లా అటవీ శాఖ అధికారి శివానిడోగ్ర ఆధ్వర్యంలో సుమారు 50 మొక్కలు నాటారు. అందులో ఒక్కటీ బతకకపోవడం గమనార్హం. జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో మొక్కలనే సంరక్షించని అధికారులు బయట చెట్లు, మొక్కలను ఎలా సంరక్షిస్తారనే విమర్శలు వస్తున్నాయి.2022 జూలైలో మంచిర్యాల ఏసీసీ సమీపంలో మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వెళ్లే రహదారి పక్కన మున్సిపాల్టీ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా సుమారు 150 మొక్కలు అవెన్యూ ప్లాంటేషన్ పేరిట నాటారు. వాటి సంరక్షణకు చుట్టూ ప్లాస్టిక్ గార్డులు ఏర్పాటు చేశారు. అందులో ఒక్క మొక్క దక్కలేదనడానికి ఈ చిత్రమే నిదర్శనం. ఈ ప్రాంతంలో రెండుసార్లు మొక్కలు నాటినట్లు స్థానికులు చెబుతున్నారు. -
● వలస వెళ్లిన ఓటర్ల విచారణలో జాప్యం ● సరైన ధ్రువపత్రాలు లేకపోతే తిరస్కరణ ● బీఎల్వోల ముందు హాజరైతేనే ఓటు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రత్యేక సమగ్ర పరిశీలనలో అనామలీస్ ఓటర్లకు నోటీసుల జారీ, పరిశీలనలో తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో 1,36,985 మంది ఓటర్ల వివరాలు సరిగా లేవు. ఇందుకోసం ఆన్లైన్లో అప్లోడ్ చేసే క్రమంలో యాప్ తీసుకోవడం లేదు. దీంతో నోటీసులు అందుకున్న ఓటర్లందరూ తప్పనిసరిగా స్పందించాల్సి ఉంది. చాలామంది ఓటర్లు తమకు వీలుపడక స్పందించడం లేదు. జిల్లా నుంచి విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర కారణాలతో వేర్వేరు చోట్లకు వలస వెళ్లారు. అయినా చాలామంది ఓటు హక్కు స్థానికంగానే కొనసాగుతోంది. ఓటరు పరిశీలనలో వేలాది మందికి నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. మ్యాపింగ్ సమయంలో పేరు, తల్లిదండ్రుల పేర్లు, అడ్రస్, వయస్సు, లింగం తదితర తప్పిదాలు దొర్లాయి. వీరందరికీ మరోసారి పరిశీలన చేసి సరైన రుజువు చూపిస్తే తుది జాబితాలో చోటు దక్కనుంది. చాలామంది ఓటర్లకు నోటీసులు అందుతున్నా బీఎల్వోలు, అధికారుల ముందు హియరింగ్ కోసం నిర్ణీత సమయంలో రావడం లేదు. దీంతో జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ తుది జాబితా ప్రచురణకు అక్టోబర్ 15నుంచి నవంబర్ 9వరకు గడువు పొడగించింది. నవంబర్ 5వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంది. ఈ క్రమంలో జిల్లాలో వేలాది మంది ఓటర్ల జాబితా పరిశీలనలో బీఎల్వోల నుంచి రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు నిమగ్నమయ్యారు. ఓటర్లకు నోటీసులు అందే వారి వివరాలను సైతం ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) తెలంగాణ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచింది.నోటీసులు.. పరిశీలనలు09ఎంసీఎల్01, నోటీసులకు ఓటర్లు జత చేసిన ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న ఎన్నికల సిబ్బంది -
సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ
ఈసారి మొక్కలు నాటడంతోపాటు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈసారి ఎండలు తీవ్రంగా ఉండడంతో వన మహోత్సవం ఆలస్యంగా ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే 36 లక్షల మొక్కలు నాటడం జరిగింది. గాంధారి వనం, అటవీ పరిధిలో ఖాళీ ప్రదేశాన్ని చదును చేసి మొక్కలు నాటడం జరుగుతోంది. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంటుంది. – రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా అటవీ శాఖ అధికారి, మంచిర్యాల(08ఎంసీఎల్30) -
‘పట్టు’ సాధించారు..
చెన్నూర్: దసలి పట్టు సాగుపై గిరిజన రైతులకు ఎట్టకేలకు ‘పట్టు’ దక్కింది. అటవీ ప్రాంతంలో సాగుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జిల్లా పరిధిలోని దసలి పట్టు పరిశ్రమ ఆధ్వర్యంలో సుమారు 80ఏళ్లుగా గిరిజన ఆదివాసీ కుటుంబాలు పట్టు కాయలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. గత రెండేళ్లుగా జిల్లాతోపాటు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో దసలి పట్టు సాగు చేయొద్దంటూ అటవీశాఖ అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో వందలాది మందికి ఉపాధి కరువైంది. దసలి పంట లేకపోతే దశాబ్దాల చరిత్ర కనుమరుగయ్యే అవకాశం ఉండడంతో అధికారులు ముమ్మర ప్రయత్నం చేశారు. దీంతో ఈ నెల 5న ప్రభుత్వం జీవో 83 విడుదల చేసింది. అటవీ ప్రాంతంలో గతంలో మాదిరిగా గిరిజనులు దసలి పంట సాగు చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో అటవీ ప్రాంతంలో టసార్ సాగుకు స్పష్టమైన ప్రభుత్వ అనుమతి, కార్యాచరణ విధానం ఏర్పడింది. అటవీ ప్రాంతాలపై ఆధారపడి జీవించే గిరిజన కుటుంబాలకు టసార్ పరిశ్రమ ద్వారా స్థిరమైన జీవనోపాధి, అదనపు ఆదాయం పొందేందుకు అవకాశం ఏర్పడింది. మంచిర్యాల–చెన్నూర్ ప్రాంతంలో టసార్ విస్తరణకు ఈ జీవో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే సంబంధిత డీఎఫ్వో అనుమతి, నిర్ధేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. జీవో జారీతో గిరిజన రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జీవోలోని అంశాలు సంతోషంగా ఉంది..దసలి పట్టు సాగు కోసం ప్రభుత్వం జీవో విడుదల చేయడం సంతోషంగా ఉంది. రెండేళ్లుగా పంట లేక ఉపాధి కోల్పోయిన రైతులకు ఈ జీవో మేలు చేస్తుంది. వచ్చే నెలలో దసలి పట్టు కాయలను పండించేందుకు రెండో పంటకు రైతులు సిద్ధంగా ఉన్నారు. రెండో పంట సాగు చేస్తే చెన్నూర్ పట్టు పరిశ్రమ పరిధిలో 60, 70 లక్షల పట్టు కాయ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. – పార్వతి రాథోడ్, సెరికల్చర్ ఏడీ -
మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు
దండేపల్లి: మండలంలోని నెల్కివెంకటాపూర్లో మంగళవారం రాత్రి జరిగిన మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రకాశ్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన సింగతి రమేశ్, అతని తల్లి రాంబాయి కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. రమేష్కు వరుసకు వదిన అయిన సింగతి లక్ష్మి మంత్రాలు చేయడంతోనే తమకు ఇలా జరుగుతుందని భావించిన తల్లీ కొడుకులు ఆమెను చంపేందుకు పథకం వేశారు. మంగళవారం రాత్రి లక్ష్మి భర్త లచ్చన్న ఇంట్లోలేని సమయంలో గొడ్డలితో దాడిచేసి పరారయ్యారు. బుధవారం గూడెం వద్ద నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. మృతురాలి భర్త లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నామన్నారు. -
ఒక్క క్షణం.. ఆలోచించండి..!
మంచిర్యాలక్రైం: సృష్టిలో వెలకట్టలేనిది ప్రాణం.. కానీ కొందరు క్షణికావేశంలో దానిని తృణప్రాయంగా వదిలేస్తున్నారు. చిన్నచిన్న కారణాలకే మనోధైర్యం కోల్పోయి అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. తమవారితో పెనవేసుకున్న బంధాలను బలవంతంగా తెంచేసుకుంటూ.. కన్నవారికి, కట్టుకున్నవారికి ఆప్తులకు తీరని విషాదం మిగిల్చి వెళ్తున్నారు.. ఈ మధ్య కాలంలో జిల్లాలో అత్మహత్యల తీరు ఆందోళన కలిగిస్తోంది. అప్పులు, ఉద్యోగం రావడం లేదని, దంపతుల మధ్య గొడవలు, ప్రేమలో విఫలమయ్యామని.. ఇలాంటి చిన్నచిన్న కారణాలకే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. సమస్యలు తమకే ఉన్నాయని, వాటిని అధిగమించలేమోనని ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు జిల్లాలో 150 మందికి పైగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆలోచిస్తే ఆనందమయం.. అర్ధంతరంగా చావు కొని తెచ్చుకునే సందర్భంలో ఒక్క క్షణం ఆలోచిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఇలా బతుకును జయించిన వారు ఉన్నారని, సానుకుల దృక్పథంతోనే జీవితానికి సార్ధకత అందుతుందని అంటున్నారు. మానసికంగా బలహీనమైన క్షణాల్లో తీసుకునే నిర్ణయమే జీవితానికి అటు.. ఇటుగా మారుతోందని, ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఆనందమయ జీవితాన్ని అందుకోవచ్చని, ఆత్మహత్యల వల్ల సాధించేది ఏమీలేదని, సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మస్థైర్యం కూడగట్టుకుని ముందుకు సాగాలని పోలీస్ అధికారులు, చెబుతున్నారు. -
భారీ విగ్రహాలు తరలిస్తున్నారా.. జాగ్రత్త!
మంచిర్యాలఅర్బన్: వినాయక చవితి పర్వదినానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. ఇప్పటికే మండపాల ఏర్పాటు, భారీ గణపతి విగ్రహాల తరలింపు పనులు మొదలయ్యాయి. హైదరాబాద్లోని ధూల్పేట్, కోరుట్ల నుంచి భారీ విగ్రహాల తరలింపు కొనసాగుతోంది. విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు భారీ విగ్రహాల తరలింపులో దారిలో విద్యుత్ వైర్లు, ఫ్లైఓవర్లు, అడ్డంకులు లేకుండా ముందే రూట్ ప్లాన్ చేసుకోవాలి. ప్రధాన రహదారులపై రద్దీ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో, తెల్లవారుజామున విగ్రహాలను తరలించాలి. వాహనానికి ముందు, వెనుక హెచ్చరిక బోర్డులు, రెడ్ లైట్లు అమర్చాలి. విద్యుత్ వైర్లు అడ్డంగా ఉన్న చోట విద్యుత్శాఖ సిబ్బందిని వెంట ఉంచుకోవటం సురక్షితం. దారిలో వర్షం కురిస్తే రంగులు వెలిసిపోకుండా వాటర్ప్రూప్ కవర్లతో విగ్రహాన్ని కప్పి ఉంచాలి. దారిలో విద్యుత్ తీగలు తాకకుండా చూసుకోవాలి. వాహనానికి వెనుకభాగంలో కూర్చోవడం అత్యంత ప్రమాదకరం. -
బాలుడు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: చదువుకొమ్మన్ని మందలించినందుకు బా లు డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్ తెలిపిన వివరాల మేరకు ఎక్బల్హైమద్ నగర్కు చెందిన మహ్మద్ అబ్బాస్–నూరి దంపతులకు ట్విన్స్ కుమారులు ఎండీ అమేర్, ఎండీ అమీర్(17). అమేర్ లారీ మీద పనికి వెళ్తుంటాడు. ఇంటర్ చదువుతున్న అమీర్ చదువు మానే సి అన్నతోనే వెళ్తానని కాలేజీకి డుమ్మా కొట్టేవాడు. కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈ నెల 6న ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ స భ్యులు స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్తితి విషమించి బుధవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతితాండూర్: రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టు కార్మి కుడు మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్రావు తెలి పారు. గోలేటీ సీహెచ్పీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న బోయపల్లికి చెందిన మేకార్తి రాజేశం (32) రోజువారీ విధుల్లో భాగంగా బుధవారం స్కూటీపై గోలేటికి వెళ్తుండగా బెల్లంపల్లి నుంచి గోలేటి వైపు వెళ్తున్న ఎర్టిగా వేగంగా స్కూటీని ఢీకొ ని రోడ్డు పక్కన బోల్తా పడింది. ఘటనలో రాజేశం తలకు తీవ్ర గాయాలు కావడంతో ముందుగా బెల్లంపల్లి ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
బసవన్నల పండుగ చేద్దాం!
కెరమెరి/బోథ్: పండుగలన్నీ మానవజాతికి చెందినవే. కానీ పొలాల అమావాస్య మాత్రం ఎద్దులకు చెందిన ప్రత్యేక పండుగ. శ్రావణమాసంలో వచ్చే చివరి పండుగ పొలాల అమావాస్యను గ్రామీణ ప్రాంత ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. గురువారం పండుగ నేపథ్యంలో బుధవారమే ఎడ్లను శుభ్రంగా కడిగి ఇళ్లకు తీసుకెళ్లారు. నేడు గురువారం ఎద్దుల కొమ్ములకు రకరకాల రంగులు వేస్తారు. వీపుపై జూలు, మెడలో గంటలతో పాటు బహుసుందరంగా వాటిని అలంకరిస్తారు. సాయంత్రం ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్లి ఐదుసార్లు ప్రదక్షణ చేయిస్తారు. అనంతరం గ్రామ పటేల్ తోరణం తెంపిన తర్వాత ఎడ్లను ఇళ్లకు తీసుకెళ్తారు. నైవేద్యంగా... ఆలయాల్లో ప్రదక్షణ అనంతరం ఎడ్లను ఇళ్లకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆ రోజు చేసిన వంటకాలు నైవేద్యంగా తినిపిస్తారు. ఎడ్లు తిన్న వాటిని కుటుంబ సభ్యులు ఆరగిస్తారు. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారమని పెద్దలు చెబుతున్నారు. ఎడ్లు లేని రైతులు కూడా తమ బంధువుల ఎడ్లను తీసుకవచ్చి పూజలు నిర్వహస్తారు. శుక్రవారం బడుగ.. పొలాల అమావాస్య మరుసటి రోజు బడుగ పండుగ జరుపుకుంటారు. శ్రావణమాసంలో నెల రోజులు మాంసాహారం ముట్టకుండా నియమ నిష్టలు పాటించి శుక్రవారం రోజు మాంసాహారం స్వీకరిస్తారు. ‘ఈగలు, దోమలు, రోగాలు, తీసుకపోరా బడుగ’ అంటూ ఇంటి నుంచి కేకలు వేస్తూ రాత్రి చేసిన పిండివంటల నైవేద్యాన్ని తీసుకొని గ్రామ పొలిమేర వరకు వెళ్తారు. అక్కడ జమ్మిచెట్టుకు పూజలు చేసి కలిసికట్టుగా నైవేద్యం ఆరగిస్తారు. ఆ రోజు నుంచి ఈగలు, దోమలు, వ్యాధులు పారిపోతాయని గ్రామీణ ప్రజల నమ్మకం. -
‘కాకతీయ’.. ఇదేం మాయ..!?
నిర్మల్: కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని కలలను చిదిమేసింది. చేయని తప్పుకు పెద్దశిక్ష వేసింది. బీకాం కంప్యూటర్స్ ఆరో సెమిస్టర్ ఇంగ్లిష్ ఆన్సర్షీట్లో రెండు పేజీలు లేవంటూ రిజల్ట్ మెమోలో అన్ని సబ్జెక్టులకూ ‘మాల్ ప్రాక్టీస్’గా పేర్కొంది. ‘సార్.. నేనే తప్పూ చేయలేదు. నాకెందుకు ఈ శిక్ష..’ అంటూ కాలేజీలు, వర్సిటీల చుట్టూ తిరిగింది. ఎక్కడా న్యాయం జరగలేదు. నియమాలు, నిబంధనలు అంటూ వర్సిటీ చెబుతోంది. చేసేది లేక.. తండ్రి తన బిడ్డతో కలిసి ఇటీవల ‘మీరైనా న్యాయం చేయండి..’ అంటూ లోకాయుక్తాను ఆశ్రయించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కంజర్ గ్రామానికి చెందిన బర్కుంట గంగాభవాని నిర్మల్లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదివింది. ఏప్రిల్లో ఆరో సెమిస్టర్ పరీక్షలు రాసింది. నెల తర్వాత వచ్చిన ఫలితం ఒక్కసారిగా ఆమెను షాక్కు గురిచేసింది. అన్ని సబ్జెక్ట్ల గ్రేడ్ స్థానంలో ‘ఎంపీ’(మాల్ ప్రాక్టీస్) అని వచ్చింది. వర్సిటీ వరకు వెళ్లి ఆరా తీస్తే.. ఇంగ్లిష్ పరీక్ష జవాబు పత్రాలు పూర్తిగా లేవన్నారు. డిగ్రీ విద్యలో విలువైన ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయింది. ‘లోకాయుక్తా’... న్యాయం చేసేనా..!? తనకు న్యాయం చేయాలని కాకతీయ యూనివర్సిటీ చుట్టూ పలుమార్లు తిరిగినా న్యాయం జరగకపోవడంతో గంగాభవాని, తండ్రి గంగారాం ఇటీవల లోకాయుక్తాను ఆశ్రయించారు. మాల్ప్రాక్టీస్ ఆరోపణలు తొలగించి, విద్యాసంవత్సరం నష్టపోకుండా న్యాయం చేయాలని వేడుకున్నారు. పిల్లల భవిష్యత్తో ముడిపడిన ఇలాంటి వ్యవహారాల్లో యూనివర్సిటీ బాధ్యతాయుతంగా ఉండాలని, ఇలా మమ్మల్ని బాధపెట్టొద్దని తండ్రి గంగారాం వాపోతున్నాడు. -
ఢిల్లీలో తెలంగాణ స్టాల్ ఆకర్షణీయం
కాసిపేట: ఢిల్లీలోని బాలభవన్లో జరిగిన ఉల్లాస ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర స్టాల్ ఆకర్షణీయంగా నిలిచింది. స్టాల్లో తెలంగాణ రాష్ట్రం వాచకాలను టీఎల్ఎంను ప్రదర్శించినట్లు డీఆర్పీ బండ శాంకారి తెలిపారు. బుధవారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో బోనాలు, అక్షర బతుకమ్మ, బంజార నృత్యం ప్రదర్శించినట్లు తెలిపారు. వేదికపై భువనమ్మ కొండల్లో కోయిలపాటలు పాడా లి అనే అక్షరజ్ఞానం పాటలు పాడి అందరి మనన్నలు పొందినట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో అధికారులు పురుషోత్తంనాయక్, మహ్మద్ నుమాన్, రంగారెడ్డి డెప్యూటీ డైరెక్టర్ అనిత, రాష్ట్ర కోఆర్డినేటర్ శైలజ , వాలంటీర్లు రాజేశ్వరి, రజిత, కవిత, పాల్గొన్నారు. -
అడవిపంది మాంసం పట్టివేత
బెల్లంపల్లి: అటవీశాఖ అధికారులు బుధవా రం అడవిపంది మాంసం పట్టుకున్నట్లు బెల్ల ంపల్లి రేంజ్ అధికారి సీహెచ్ పూర్ణచందర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేర కు రేంజ్ పరిధిలోని ధర్మారావుపేట బీట్లో బుగ్గగూడ సమీపంలోని పత్తి చేనులో గాలింపు చర్యలు చేపట్టగా సంకుర్తల శ్రీకాంత్ ప ట్టుబడ్డాడు. అతన్ని విచారించగా అడవిపందిని వేటాడి చంపినట్లు అంగీకరించాడు. అతనితో పాటు మాంసం కొనుగోలు చేసేందుకు వచ్చిన శ్రీనివాస్, రంజిత్పై కేసు నమోదు చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. కిరాణా దుకాణంలో చోరీకౌటాల(బెజ్జూర్): బెజ్జూర్ మండల కేంద్రంలోని రాచకొండ చంద్రశేఖర్ కిరాణా దుకాణంలో చోరీ జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి దుకాణం మూసి ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం దుకాణం తెరిచి కౌంటర్లో చూడగా రూ. 60 వేల నగదు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. బెజ్జూర్ ఎస్సై సర్తాజ్పాషా సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగ తన ముఖానికి కవర్ వేసుకోవడంతో పాటు తన వేలి ముద్రలు పడిన చోటును బట్టతో క్లిన్ చేసినట్లు రికార్డయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అడవి పందుల బీభత్సంసిరికొండ: మండలంలోని కొండాపూర్ శివారులో మంగళవారం రాత్రి రైతు సాయిని రాయమల్లు మూడెకరాల మొక్కజొన్న చేనుపై అడవిపందులు దాడిచేసి ధ్వంసం చేశాయి. చేతికి అందివచ్చిన పంటలపై అడవి పందులు దాడులు చేస్తుండడంతో రైతులు రాత్రివేళ కాపలాగా వెళ్తున్నారు. -
కుప్టి బ్రిడ్జికి మరమ్మతులు షురూ
ఇచ్చోడ: ‘కుప్టి పాతబ్రిడ్జికి బుంగ’ శీర్షికన ఈనెల 8న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎట్టకేలకు బుధవారం మరమ్మతు పనులు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన 12 మంది సభ్యులు బ్రిడ్జి పై బుంగ పడిన ప్రదేశంలో మరమ్మతు చేస్తున్నారు. బ్రిడ్జికి ఉన్న 13 జాయింట్ల వద్ద పాత స్టీల్ రాడ్లు, కంకరను తొలగించి వాటిస్థానంలో కొత్త రాడ్లు బిగించి సిమెంట్, కంకరతో జాయింట్లను పూ డ్చాల్సి ఉంటుందని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. దాదాపుగా నెల రోజులపాటు పనులు కొనసాగనున్నట్లు ‘సాక్షి’కి వివరించారు. కుప్టి పాత బ్రిడ్జిని ఆర్అండ్బీ శాఖ అధికారులు నిర్మించారు. నేషనల్ హైవే అఽథారిటీ అధికారు లే మరమ్మతులు చేపట్టాలి. కానీ వారు పనులు ప్రా రంభించకుండా నిర్లక్ష్యం చేశారు. చివరి సమయంలో చేతులెత్తేసి మరమ్మతు పనులను కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వారికి అప్పగించి చేతులు దులుపుకున్నారు. -
మద్యానికి బానిసై ఆత్మహత్య
సాత్నాల: భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన బొజ్జ రాజు (27) మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు కూలీ పని చేసేవాడు. మద్యానికి బానిసై గతంలో రెండు, మూడుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి బయటి నుంచి ఇంటికి వచ్చిన రాజు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కేకలు విన్న తల్లిదండ్రులు మంటలార్పారు. వెంటనే 108 అంబులెన్స్లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే 80శాతం కాలి తీవ్రంగా గాయపడ్డాడు. రెండ్రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స అందించినా ఎలాంటి ఉపయోగం లేదని వైద్యులు వెల్లడించగా కుటుంబ సభ్యులు రాజును ఇంటికి తీసుకెళ్లారు. నాలుగు రోజులపాటు ప్రాణాలతో పోరాడిన రాజు మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి వివాహమైనా మద్యానికి బానిసగా మారడనే కారణంతో అతడి భార్య మూడేళ్ల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. -
జోరుగా ఇసుక అక్రమ రవాణా
బెల్లంపల్లి: ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నెన్నెల మండలం మైలారం గ్రామ శివారులోని వాగులో నుంచి ఇసుక తరలిపోతోంది. కొందరు ట్రాక్టర్ల నిర్వాహకులు రాత్రికి రాత్రే వాగులో నుంచి గొల్లపల్లి, జోగాపూర్, చిత్తాపూర్, ఆవుడం గ్రామాల మీదుగా మందమర్రికి, నెన్నెల మండలంలోని పలు గ్రామాలకు రవాణా చేస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక్కో ట్రిప్పు ఇసుకకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. అక్రమ రవాణా నియంత్రణకు నెన్నెల టీ రోడ్డు వద్ద రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో చెక్పోస్టు ఏర్పాటుతో అక్రమార్కులు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. గొల్లపల్లి, జోగాపూర్ మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. రాత్రివేళ దందా సాగుతుండడంతో రెవెన్యూ, పోలీసు శాఖలు అడ్డుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అక్రమార్కులకు ఓ శాఖ సిబ్బంది లోపాయికారిగా సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారుల రాకను దందా నిర్వాహకులకు చేరవేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో అక్రమార్కులు ఇసుక రవాణాకు విరామం ఇస్తున్నారు. కాగా, రెండ్రోజుల క్రితం ఓ ఇసుక ట్రాక్టర్ను అధికారులు చాకచక్యంగా పట్టుకున్నట్లు సమాచారం. చర్యలు తీసుకుంటాం ఇసుక దందాను నిరోధానికి చర్యలు తీసుకుంటున్నాం. ఏ ప్రాంతం నుంచి రవాణా అవుతున్నా సమాచారం అందగానే ట్రాక్టర్లను పట్టుకుంటున్నాం. తాజాగా జన్కాపూర్ వద్ద రెండు ట్రాక్టర్లు పట్టుకున్నాం. నెన్నెల మండలంలో ఇసుక దందా నివారణకు రెవెన్యూ, పోలీసు శాఖల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం. – జగన్మోహన్, మైనింగ్ ఏడీ, మంచిర్యాల -
విధులు బహిష్కరించి కార్మికుల ఆందోళన
కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట–2 గనిపై అధికారుల తీరును నిరసిస్తూ మంగళవారం కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ.. పేలుడు పదార్థం నాణ్యత లోపించడంతోనే సోమవారం ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రాణాలు పోయేదాకా అధికారులు పట్టించుకోరా? అని ప్రశ్నించారు. పేలుడు పదార్థం నాణ్యతగా లేదని చెబితే కంపెనీ మార్చకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. గని ప్రమాదంలో నలుగురు గాయపడటానికి పేలుడు పదార్థం, వినియోగించే తీరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న కేకే గ్రూపు ఏజెంట్ ఖాదిర్ కార్మికులకు నచ్చజెప్పారు. పేలుడు పదార్థాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రయోగాత్మకంగా పలు కంపెనీలు, పద్ధతులను అవలంబిస్తున్నట్లు తెలిపారు. సోమవారం గనిలో జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకోనున్నట్లు హామీ ఇచ్చారు. సంఘటనలో కార్మికుల తప్పిదం లేదని, మెటీరియల్ తదితర అంశాలన్నింటిపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. గని మేనేజర్తో ఇబ్బందులు రాకుండా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏజెంట్ హామీతో ఆందోళన విరమించిన కార్మికులు.. మరోసారి ఇలా జరిగితే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సపోర్ట్మెన్, కోల్కట్టర్, అన్ని వర్గాల కార్మికులు పాల్గొన్నారు. -
పెరిగిన ఆవాస కాలం
బోథ్: మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ వైపు సాగే పెద్దపులుల వలసలకు బోథ్, సొనాల అటవీ శ్రేణులు అత్యంత కీలక అంతర్రాష్ట్ర ప్రధాన మైలురాయిగా మారాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి పెన్గంగ నదిని దాటుకుంటూ ఇక్కడి అడవుల్లోకి ప్రవేశిస్తున్న పెద్దపులులు గతంలోలాగా వెళ్లిపోవడం లేదు. ఇక్కడి అటవీ పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉండటంతో ఏకంగా 20నుంచి 30రోజుల వరకు మకాం వేస్తున్నాయి. లోతట్టు అడవుల్లోని చెరువులు, సహజసిద్ధమైన వాగుల రూపంలో పుష్కలంగా దొరుకుతున్న నీటి వనరులు, శాకాహార జంతువుల రూపంలో లభిస్తున్న ఆహారం పెద్దపులులను ఇక్కడే తిష్టవేసేలా చేస్తున్నాయి. ఈ కీలక పరిణామాలను గుర్తించిన అటవీశాఖ సొనాల మండలంలోని చింతల్బోరి, వజ్జర్, ఘన్పూర్తోపాటు బోథ్ మండలంలోని పలు అటవీ ప్రాంతాలను అధికారికంగా ‘క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్’ (క్లిష్టమైన పులుల ఆవాసం), ‘హై కాన్ఫ్లిక్ట్ వైల్డ్లైఫ్ కారిడార్’గా గుర్తించింది. తిప్పేశ్వర్ నుంచి కవ్వాల్కు వయా.. బోథ్, సొనాల మండలాల పరిధిలోని దట్టమైన అడవులను పెద్దపులులు తమ సహజ వలస దారిగా మార్చుకున్నాయి. గతంలో అసలే పులుల జాడలేని ఈ ప్రాంతాల్లో నాలుగేళ్ల నుంచి రాకపోకలు మొదలయ్యాయి. మూడేళ్లుగా తిప్పేశ్వర్ నుంచి కవ్వాల్ టైగర్ జోన్కు వెళ్లే పెద్దపులులు పక్కా మార్గాన్ని ఏర్పరుచుకున్నాయి. మహారాష్ట్ర సరిహ ద్దు నుంచి ఘన్పూర్, చింతలబోరి, చింతగూడ, నేరేడుపల్లె, కంటేగాం, నిగిని, మర్లపెల్లి అటవీ ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తూ, అక్కడి నుంచి పిప్పల్ధరి, నారాయణపూర్, రఘునాథ్పూర్, నాగాపూర్ గ్రామాల పరిధిలోని అడవులను దాటుకుని నిర్మల్ ఘాట్ ద్వారా కవ్వాల్ టైగర్ జోన్లోకి ప్రవేశిస్తున్నాయి. వలస దారే ఆవాసంగా.. గతంలో తిప్పేశ్వర్ నుంచి బయలుదేరిన పులులు ఈ మార్గంలో రెండు లేదా మూడు రోజులే ఉండి కవ్వాల్ వైపు వెళ్లిపోయేవి. కానీ, రెండేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పులులు ఏకంగా 30 రో జుల పాటు ఇక్కడే గడుపుతున్నాయి. ముఖ్యంగా ఘన్పూర్, చింతలబోరి, వజ్జర్, పెద్దగూడ, కంటేగాం పరిసరాల్లో నెలపాటు స్థిరంగా సంచరిస్తున్న ట్లు అటవీ రికార్డులు వెల్లడిస్తున్నాయి. లోతట్టు అడవుల్లోని చింతలబోరి చెరువు, వాగులు వేసవిలోనూ ఎండిపోకుండా నీటిని అందిస్తుండటం, దట్టమైన కొండగుట్టలు విశ్రాంతికి, వేటకు పూర్తి అనుకూలంగా ఉండటంతో పులులు ఈ ప్రాంతాన్ని తమ శాశ్వ త స్థావరంగా మార్చుకుంటున్నాయి. పెద్దగూడ వద్ద టైగర్ క్రాసింగ్ జోన్లు పులులు తమ ఆవాసాల నుంచి కదిలే క్రమంలో వ్యవసాయ క్షేత్రాలు, గ్రామీణ రహదారులను దాటాల్సి వస్తోంది. దీంతో మనుషులు–వన్యప్రాణుల మధ్య ఘర్షణ (మ్యాన్–యానిమల్ కాన్ఫ్లిక్ట్) ముప్పు తీవ్రస్థాయిలో పొంచి ఉంది. రహదారులు దాటే సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అటవీశాఖ పెద్దగూడ, వజ్జర్ ప్రాంతాల్లోని ప్రధాన రోడ్లపై అధికారికంగా ‘టైగర్ క్రాసింగ్ జోన్లు’ ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు అమర్చింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు రాత్రి, వేకువజాము వేళల్లో వేగాన్ని నియంత్రించుకోవాలని, పొలాల వద్ద రైతులు ఒంటరిగా తిరగొద్దని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో నిఘా ముమ్మరం చేశారు. -
చైన్నె వరదలతోనే సివిల్స్ వైపు..
సాక్షి: సివిల్స్ వైపు రావడానికి ఇనిస్పిరేషన్ ఎవరు? సబ్ కలెక్టర్: 2015లో నేను చైన్నెలో చదువుకుంటున్న సమయంలో వరదలొచ్చాయి. ఆ వరదల్లోంచి బయపడిన వారిలో నేనూ ఒకడిని. ఆ సమయంలో అక్కడ స్థానికంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధి కారులు అందించిన సేవలు నన్ను ప్రభావితం చేశా యి. అధికారులు ప్రాణాలకు తెగించి ప్రజలను కా పాడిన తీరు నా మనసులో చెరగని ముద్రవేసింది. ఆ తర్వాత నేను సివిల్ సర్వీస్లో చేరాలనే తపన మినహా రెండో ఆలోచనే రాలేదు. నేను శ్రీరామ్ కా లేజ్ ఆఫ్ కామర్స్ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశాను. తోటి స్నేహితులు, బ్యాచ్మెట్స్ అందరితో పాటు కార్పొరేట్ కెరీర్ గురించి ఆలోచించలేదు. సాక్షి: మీ కుటుంబ నేపథ్యం? సబ్ కలెక్టర్: నేను రాజస్థాన్ రాష్ట్రం జోద్పూర్లోని సంగనీర్లో జన్మించాను. మాది సాధారణ వ్యవసా య కుటుంబం. తమ్ముడు, నేను కవలలం. తమ్ము డు కార్పొరేట్ సంస్థలో చార్టెడ్ ఎకౌంటెంట్గా చేస్తున్నాడు. నా విద్యాభ్యాసం చైన్నెలో జరిగింది. దేశంలోనే ఒకటైన ఢిల్లీ శ్రీరామ్కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్ఆర్సీసీ)లో చదివినప్పటికీ రూ.లక్షల్లో జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగం వైపు వెళ్లకుండా ప్రజాసే వకే అంకితం కావాలని నిర్ణయించుకున్నాను. సాక్షి: సివిల్స్ లక్ష్యంలో ఎదురైన అవాంతరాలు? సబ్ కలెక్టర్: సివిల్స్ ప్రయాణమంతా సులభంగా సాగలేదు. ఇది ఓర్పునకు పరీక్ష. చాలాసార్లు ఫెయి ల్ అవుతామేమో అనే భయం ఉంటుంది. నిద్రలేని రాత్రులు గడపాల్పి వచ్చేది. స్నేహితులు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను. పట్టుదలతో యూ పీఎస్సీ 2023టాపర్గా నిలిచాను. తెలంగాణ 2024 బ్యాచ్లో ట్రైనింగ్ పూర్తి చేశాను. 2025లో వికారా బాద్లో అసిస్టెట్ కలెక్టర్గా చేరాను. ప్రస్తుతం కాగజ్నగర్ సబ్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను. సాక్షి: మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా..? సబ్ కలెక్టర్: అమ్మానాన్న ఇప్పటికీ ఒక్కటే చెబుతా రు. అధికారం అనేది సేవ చేయడానికి వచ్చిన అవకాశం. పేదల కష్టాన్ని అర్థం చేసుకుని వారి గొంతుకగా ఉండాలని సూచిస్తుంటారు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే వారి త్యాగమే కారణం. సాక్షి: కాగజ్నగర్ డివిజన్లోని గిరిజన ప్రాంతంపై మీ మార్క్.. భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? సబ్ కలెక్టర్: పోడు భూములు 22ఏ, విద్య, వైద్యం, గ్రామాలాభివృద్ధి, వలసలు, మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాను. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా. యూనిఫాంలు, పుస్తకాలు పంపిణీ చేసి విద్యార్థులు రెగ్యులర్గా పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకుంటాను. సాక్షి: యువతకు మీరిచ్చే సందేశం? సబ్ కలెక్టర్: యువత లక్ష్యాలను ఎంచుకోవాలి. రో జూ ఉదయాన్నే లేచి వ్యాయామం, యోగా చేసి మ నస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలి. తల్లిదండ్రులు ఒత్తిడి లేకుండా పిల్లలను ప్రోత్సహించాలి. సివిల్ సర్వీస్లోకి రావడానికి తనకు ఒక విషాద అనుభవమే ప్రేరణ అని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి తెలిపారు. సివిల్స్ సాధనకు నిద్రలేని రాత్రులు గడిపానని పేర్కొన్నారు. కాగజ్నగర్ డివిజన్లోని వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియను గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్దేషించుకుని పట్టుదలతో శ్రమించి విజయం సాధించాలని యువతకు పిలుపున్చిచారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. – కాగజ్నగర్టౌన్సాక్షి: ఫిర్యాదులపై ఎలా స్పందిస్తారు? సబ్ కలెక్టర్: డివిజన్ పరిధిలోని సమస్యలు నా దృష్టికి వచ్చిన వెంటనే వాటిని పరిశీలిస్తాను. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలు పరిశీలించి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను. కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించేలా చూస్తాను. రెవెన్యూ సమస్యలు పారదర్శకంగా పరిష్కరించడానికి కృషి చేస్తాను. ఫిర్యాదుదారులు నేరుగా నన్ను కలిసి ఫిర్యాదు చేయవచ్చు.సాక్షి: ఎస్ఐఆర్లో హియరింగ్కు వచ్చేవారు ఇబ్బందులకు గురవుతున్నారు? సబ్ కలెక్టర్: భారత ఎన్నికల సంఘం అర్హులైన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చి అనర్హులు జా బితాలో లేకుండా చూసేందుకు ఎస్ఐఆర్ జూన్ 25 నుంచి చేపట్టింది. అర్హులైన ఓటరు టు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకుంటున్నాం. నోటీసులు వచ్చిన ఓటర్లు 11రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి తీసుకువచ్చి బీఎల్వోలకు అందజేయాలి. ఇప్పటివరకు ఎస్ఐఆర్ ప్రక్రియ 45శాతం పూర్తి చేశాం. అధికారులు, ప్రజల సహకారంతో ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు 100శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. నూతన ఓటర్లు ఫారం–6, చ నిపోయిన, డూప్లికేట్ ఓటర్లు అభ్యంతరాలు తెలి యజేసేందుకు ఫారం–7, మొబైల్ నంబర్ అప్డే ట్, చిరునామా మార్పులు, ఓటరు గుర్తింపు కార్డులో వివరాల సవరణలకు ఫారం–8 అందజేయాలి. -
నీట్లో మెరిసిన విద్యార్థినులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన వారు తమ ఎదుగుదల, ఉన్నతిని బహుమానంగా ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని గోసేవా మండల్లో నివాసముంటున్న గుజ్జేటి నగేశ్ బస్టాండ్ సమీపంలో మిర్చీ, జ్యూస్ బండి నడుపుతూ జీవనం సాగిస్తుండగా భార్య సుజాత టైలరింగ్ పని చేస్తూ భర్తకు తోడుగా నిలుస్తోంది. వీరికి అభిలాశ్, శ్రీనిధి సంతానం. వీరిద్దరూ మంచిర్యాలలో పదోతరగతి వరకు చదవగా ఇంటర్ హైదరాబాద్లో పూర్తి చేశారు. ఇద్దరూ బైపీసీ పూర్తి చేసి నీట్ పరీక్షలో అర్హత సాధించి వైద్య విద్యార్థులయ్యారు. కాగా, అభిలాశ్ వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రస్తుతం ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం పూర్తి చేశాడు. శ్రీనిధి సూర్యపేట జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొంది మొదటి సంవత్సరం చదవడానికి సిద్ధమవుతోంది. ఇద్దరూ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు సాధించి తమకు గుర్తింపు ఇవ్వడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంజేశారు. ఆటో డ్రైవర్ కూతురికి ఉత్తమ ర్యాంక్నేరడిగొండ: తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూనే కూతురి చదువుకు ఎలాంటి లోటు రానివ్వలేదు. తండ్రి కష్టానికి తన పట్టుదల, ప్రతిభను జోడించిన మండలంలోని బొందిడి గ్రామానికి చెందిన ఆడే వైష్ణవి నీట్లో మంచి ర్యాంక్తో ఎంబీబీఎస్ సీటు సాధించింది. బొందిడి గ్రామానికి చెందిన జైపాల్ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా వైష్ణవిని ఉన్నత చదువులు చదివించారు. దీంతో వైష్ణవి కష్టపడి చదివి నీట్ ఫలితాల్లో 1,90,000 ర్యాంక్, ఎస్టీ కేటగిరీలో 334వ ర్యాంక్ సాధించింది. నిర్మల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకుంది. మారుమూల గ్రామీణ ప్రాంతానికి చెందిన వైష్ణవి పరిమిత వనరులతో వైద్య విద్యలో సీటు సాధించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా సీతారామయ్య
పాతమంచిర్యాల: ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వా సిరెడ్డి సీతారామయ్య, కార్యధర్శి గా మేకల దాసు ఏకగ్రీవంగా ఎ న్నికయ్యారు. కరీంనగర్లో నిర్వహించిన ఏఐటీయూసీ తెలంగా ణ రాష్ట్ర నాలుగో మహాసభల్లో వీరిని ఎన్నుకున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలిపారు. కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్నందుకు వీరి సేవలను గుర్తించి పదవుల కు ఎంపిక చేసినట్లు పేర్కొన్నా రు. కార్మిక వర్గ ఐక్యతను బలోపే తం చేస్తూ హక్కుల పరిరక్షణ కు వీరు నిరంతరం పోరాటాలు ని ర్వహించడంలో కీలక పాత్ర పోషి స్తున్నారని తెలిపారు. రాష్ట్ర నాయకత్వానికి సీతామరామయ్య, దాసు కృతజ్ఞతలు తెలిపారు. -
కార్మికుడికి పరామర్శ
కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట–2 గనిలో ఈ నెల 7న మిస్ఫైర్ జరిగి గాయపడిన కోల్కట్టర్ కార్మికుడు గోగుల రమేశ్ను మంగళవారం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పరామర్శించా రు. కరీంనగర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడిని కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వై ద్యులకు సూచించారు. ఏఐటీయూసీ అండగా ఉంటుందని రమేశ్కు భరోసా ఇచ్చా రు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి, కార్యదర్శి ఎండీ అక్బర్అలీ, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేశ్, నాయకులు సుదర్శన్, లింగయ్య, రాజేశ్వర్రావులున్నారు. లేడీస్ టైలర్ దగ్ధంనెన్నెల: మండల కేంద్రంలోని కుశ్నపల్లి చౌరస్తాలోగల ఓ లేడీస్ టైలర్ మంగళవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ఎస్సై జగదీశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున బ్లూకోల్ట్స్ విధులు నిర్వర్తిస్తున్న ప్రసాద్ లేడిస్ టైలర్ షాపులో మంటలు రావడాన్ని గమనించి ఎస్సైకి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న ఇద్దరు మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎంబ్రాయిడర్, మగ్గం మిషన్లు, జుక్కి కుట్టు మిషన్, కస్టమర్ల దుస్తులు, కౌంటర్లు కాలిపోయాయి. సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు బద్ది కృష్ణవేణి తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. డంప్యార్డులో మోటార్ల చోరీరామకృష్ణాపూర్: స్థానిక ఆర్కే–1 గని సమీపంలోని డంప్యార్డులో క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన రెండు 5 హెచ్పీ ష్రెడింగ్ మోటార్లు అపహరణకు గురయ్యాయి. డంప్యార్డులో మోటార్లను అపహరించినట్లు మంగళవారం ఉదయం గుర్తించిన మున్సిపల్ సిబ్బంది విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోటార్ల విలువ దాదాపు రూ.లక్షన్నర వరకు ఉంటుందని పేర్కొన్నారు. డంప్యార్డులోకి ఎవరు వచ్చారు? ఏ రూట్లో వచ్చారు? అనేది సీసీ కెమెరాల ద్వారా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. -
ప్రసవ వేదన..!
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రసవాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. వంద పడకల ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉండాల్సి ఉండగా ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో రోజువారీగా 10వరకు ప్రసవాలు జరగాల్సి ఉండగా.. ఒకటే ప్రసవంతో సరిపెట్టాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. గైనకాలజిస్టు, మత్తు డాక్టర్లు, సిబ్బంది కొరత కారణంగా నెలకు అతికష్టంగా 30 నుంచి 35 వరకు ప్రసవాలు చేస్తున్నారు. గర్భిణులు, ఎమర్జెన్సీ కేసులు అత్యధికంగా మంచిర్యాల మాతాశిశు ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. కొందరు గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గర్భిణుల సంఖ్యకు అనుగుణంగా ప్రసవాల సంఖ్య పెంచడానికి మరో ముగ్గురు గైనకాలజిస్టులతోపాటు మత్తు డాక్టర్లు ముగ్గురు, 20మంది వరకు సపోర్టింగ్ సిబ్బందిని నియమించాల్సి ఉన్నా తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. ఆసుపత్రి స్థాయికి అనుగుణంగా డెప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు 10 భర్తీ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఖాళీలు, డిప్యూటేషన్లతో సతమతం తాండూర్: తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీలు, సిబ్బంది డిప్యూటేషన్తో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. సీజనల్ వ్యాధులు ప్ర బలుతుండగా మెరుగైన సేవలు అందడం లేదు. ముగ్గురు వైద్యుల పోస్టులు భర్తీ కాగా ఇద్దరు డిప్యూటేషన్పై వేరే ఆస్పత్రుల్లో పని చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్, పీహెచ్ఎన్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆపీస్ సబార్డినేట్లు ఇద్దరు డిప్యూటేషన్పై వేరే చోట పని చేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్, పీహెచ్ఎన్ పోస్టులు, 5 ఏఎన్ఎం పోస్టులు, రెండు హెల్త్ అసిస్టెంట్, మూడు హెల్త్ సూపర్వైజర్, హెచ్ఈఓ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి. ఆసుపత్రికి నిత్యం వందమంది వరకు రోగులు వస్తున్నారు. బీపీ గోలీలైన టెల్మిసార్టన్ 20ఎంజీ, 40 ఎంజీ గోలీలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. ఆర్థరైటిస్కు సంబంధించిన గోలీలు లేవు. ప్రతీ నెల ఇండెంట్ పంపిస్తున్నా కొంతమేర తగ్గించి సరఫరా అవుతున్నాయి. మందుల కొరత.. కాసిపేట: కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మాసిస్ట్ లేక మందుల కొరత ఏర్పడుతోంది. వైద్యాధికారి డెప్యూటేషన్పై పని చేస్తుండగా, మొదటి ఏఎన్ఏంలు 3, సివిల్ అసిస్టెంట్ సర్జన్(మెడికల్ ఆఫీసర్స్) 2, నర్సింగ్ ఆఫీసర్ 1, ఫా ర్మాసిస్ట్ 1 చొప్పున ఖాళీ ఉన్నాయి. బీపీ ట్యాబ్లె ట్లు టెల్మిసార్టన్ 40 ఎంజీ అందుబాటులో లేవు. పార్మాసిస్ట్ లేక ఇండెంట్ పంపినా సక్రమంగా అందుబాటులో లేవనే విమర్శలు ఉన్నాయి. రో జు వారీగా ఓపీ 90నుంచి 120వరకు ఉంటోంది. సిబ్బంది కొరతే సమస్య.. నెన్నెల: నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన సిబ్బంది లేకపోవడంతో సేవలకు ఆటంకం కలుగుతోంది. ఉన్న ఉద్యోగులపై అదనపు పని భారం పడుతోంది. ప్రతీరోజు గ్రామాల నుంచి రోగులు వైద్యం కోసం వస్తుంటారు. మెడికల్ ఆఫీసర్, ఒక స్టాఫ్నర్సు, హెచ్ఈఓ, సూపర్వైజర్, రెండు ఎంఎల్హెచ్పీ, మూడు ఏఎన్ఎం పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భీమిని పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ వైద్యుడు లేరువేమనపల్లి: వేమనపల్లి పీహెచ్సీకి డిప్యూటేషన్ వైద్యుడే దిక్కయ్యారు. వైద్యాధికారి, సిబ్బంది ఆలస్యంగా విధులకు హాజరై మూడు గంటల వరకు వెళ్లిపోతున్నారు. మంగళవారం 45మంది రోగులు వచ్చారు. ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు స్టాఫ్నర్స్లకు ఒక్కరే ఉన్నారు. ఐదు సబ్ సెంటర్లు ఉండగా రెండు ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరత, సమయపాలన పాటించకపోవడంతో ప్రజలకు నమ్మకం పోతోంది. తీవ్ర జ్వరాలతో ఉన్న చాలామంది ప్రైవేట్ వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రసవాలు కూడా చాలా తగ్గుతున్నాయి. చెన్నూర్ సీహెచ్సీకి రెఫర్ చేస్తున్నారు. మూడు గంటలు దాటితే ఉండరు వేమనపల్లి దవఖానకు మూడు గంటల తర్వాత పోతే ఎవలు ఉంటలేరు. నాకు కాళ్లు, చేతులు గుంజుతానై, జ్వరం అత్తాందని ఆసుపత్రికి పోయిన గోలీలు ఇచ్చేటోళ్లు సుత లేరు అని అంటే వాపసు వెళ్లొచ్చిన. చేన్లల్లకు పనులకు పోయి అచ్చేటోళ్లం మాపటేళ్లకు దవాఖానలో సిబ్బంది ఉంటే మాకు కొంచెం వైద్యం అందుతది. – తలండి బానయ్య, మంగనపల్లి -
‘చలో హైదరాబాద్’కు అనుమతి ఇవ్వండి
మంచిర్యాలటౌన్: ఈ నెల 10న తలపెట్టిన ‘చలో హైదరాబాద్’కు అనుమతి ఇవ్వాలని టీజీఈజేఏసీ నాయకులు మంగళవారం కలెక్టర్ కుమార్దీపక్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రయ్యను కలిసి ఉద్యోగుల సమస్యల కోసం చేస్తున్న పోరాటానికి సంబంధించిన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి వనజారెడ్డి, జిల్లా కో చైర్మన్లు ఎస్.కిషన్, శ్రీనివాస్ దేశ్పాండే, దుర్గాప్రసాద్, పొన్న మల్లయ్య, రౌఫ్ఖాన్, సురేఖ, శ్రీపతి బాపురావు, అత్తె సుధాకర్, బొడ్డు శ్రావణ్ కుమార్, సునీత పాల్గొన్నారు. -
సర్కార్.. వైద్యుల్లేరు!
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో వైద్యులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో రోగులకు పూర్తి స్థా యిలో వైద్యసేవలు అందని పరిస్థితులు నెలకొ న్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్న ఆస్పత్రిలో 13మంది ప్రొఫెస ర్లు, 36మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 49మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 20మంది ట్యూటర్లు అవసరం ఉంది. ఇందులో రేడియాలజీ వైద్యులు 6, ఫిజియాలజీ 6, బయోకెమిస్ట్రి 2, ఫోరెన్సిక్ 5, మైక్రో బయాలజీ 3, పీడియాట్రిక్స్ 6, జనరల్ సర్జరీ 11, అనస్థీషియా 9, ఈఎన్టీ 2, గైనకాలజీ 9, పాథాలజీ 2, సైకియాట్రీ 2, మైక్రో బయాలజీ 3 ఇలా పలు కీలకమైన విభాగాల్లోనే ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. కార్డియాలజిస్టు వైద్యులు లేక గుండె సంబంధిత 2డీ ఎకో స్కానింగ్తోపా టు గుండె జబ్బులకు చికిత్స అందడం లేదు. వైద్యులు, సిబ్బంది పోస్టుల ఖాళీతో ఆయా విభాగాల వైద్య సేవలపై ప్రభావం చూపిస్తోంది. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్రకు చెందిన రోగులు వైద్యం కోసం ఆస్పత్రికి వస్తుంటారు. పలు విభాగాల్లో వైద్య సేవలు అందక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవే టు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. రేడియాలజిస్టులు లేకపోవడంతో జీజీహెచ్, మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు, గర్భిణులకు స్కానింగ్ ఇబ్బందిగా మారుతోంది. రేడియాలజిస్టు ప్రొఫెసర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒకరు ఉండగా, తాత్కాలికంగా ఆ వైద్యురాలితోనే స్కానింగ్ సేవలు కొనసాగిస్తున్నారు. ఎక్స్రే చేసేందుకు సైతం టెక్నీషియన్ మీదే ఆధారపడడంతో ఆయా సేవలకు రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. జీజీహెచ్ భవనం శిథిలావస్థకు చేరడంతో ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఆర్థో శస్త్రచికిత్సలు మాత్రమే చేస్తున్నారు. పంటి వైద్యం, కంటి శస్త్రచికిత్సలు, ఇతరత్రా శస్త్రచికిత్సలు చేయడం లేదు. నస్పూర్లో..నస్పూర్: నస్పూర్ పీహెచ్సీకి ప్రతీరోజు 75 నుంచి 90 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తారు. సి బ్బంది లేక చికిత్సలో జాప్యం జరుగుతోంది. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. ఫార్మసిస్టు, డాటా ఎంట్రీ ఆపరేటర్ లేకపోవడం ఇబ్బందులకు గురి చేస్తోంది. పీహెచ్సీ పరిధిలో 11 సబ్ సెంటర్లు ఉండగా అందులో ఏడింటిలో మాత్రమే ఎంఎల్హెచ్పీ వైద్యులు సేవలు అందిస్తున్నారు. 22 మంది ఏఎన్ఎంలు ఉండాల్సి ఉండగా 16 మంది మాత్రమే ఉన్నారు. బీపీ 20ఎంజీ మాత్రలు అందుబాటులో లేక ఇబ్బందిగా మారుతోంది. లక్సెట్టిపేటలో..లక్సెట్టిపేట: పట్టణంలోని ఆసుపత్రిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రతీ రోజు 300 మంది ఓపీకి వస్తుండగా, వైద్యులు పూర్తి స్థాయిలో లేక ఇబ్బందులు పడుతున్నారు. 11 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా ఇద్దరే విధులు నిర్వహిస్తున్నారు. గైనకాలజిస్టు, పిడియాట్రిషియన్, సర్జన్, జనరల్ సర్జన్, నలుగురు డ్యూటీ డాక్టర్లు, పల్మనాలజిస్టు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కిక్కిరిసిన ఆస్పత్రులుచెన్నూర్/జైపూర్: చెన్నూర్ ఏరియా ఆస్పత్రిలో మంగళవారం ఉదయం 11గంటల కు ఓపీ వద్ద రోగులు కిక్కిరి సి ఉన్నారు. జ్వరాలు, తలనొప్పి, జలుబు, గొంతునొ ప్పితో బాధపడే రోగులే అధికంగా ఉన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఎక్కడ చూసినా రోగులు, వారి సహాయకులే కనిపించారు. వైద్యులు ప్రతాప్గౌడ్, అశోక్ రోగులను పరీక్షించి మందులు రాసిచ్చారు. జనరల్ వార్డుల్లో జ్వర బాధితులు చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నామని, సైలెన్ బాటిళ్లు ఎక్కిస్తున్నారని, ఆస్పత్రిలోనే మందులు ఇచ్చారని కొండంపేట గ్రామానికి చెందిన మల్లయ్య తెలిపాడు. ఆస్పత్రిలో 18మంది వైద్యులు ఉన్నారని, అన్ని రకాల మందుగోలీలు, పరికరాలు అందుబాటులో ఉన్నాయని, రోగులకు మెరుగైన సేవలందిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. మందమర్రిరూరల్: మందమర్రిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మధుమేహా వ్యాధిగ్రస్తుల ఇన్సూలిన్, ఇంజక్షన్లు అసలే లేవు. వైద్య సిబ్బందిని అడిగితే జిల్లా ఆసుపత్రికి ఇండెంట్ పంపించినా సరఫరా కాలేదని సమాధానం చెబుతున్నారు. దీంతో రోగులు డబ్బులు వెచ్చించి బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రమాదాలు, డెలివరి కేసులను జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. నిధుల ఊసేలేదు..మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ది కమిటీ లేక మూడేళ్లకు పైగా నిధుల మంజూరు లేదు. ఈ ఏడాది కాయకల్ప పథకం కింద జిల్లాలోని పలు మండల, అర్బన్ పీహెచ్సీలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు విడుదల కాగా హాజీపూర్కు మంజూరు కాలేదు. ఆస్పత్రి భవనం పాతది కావడంతో వైరింగ్, ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు తరచూ కాలిపోతున్నాయి. ఆపరేషన్ థియేటర్ విద్యుత్ వైరింగ్ కాలిపోగా ఏసీ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఆస్పత్రి ఓటీ గది స్టోర్ రూమ్గా మారింది. ఏడాదికిపైగా ఫార్మసిస్ట్ కొరతతో పారామెడికల్ సిబ్బంది మందులు అందిస్తున్నారు. ఇండెంట్ ప్రకారం మందుల సరఫరా లేకపోగా బీపీ మాత్రల కొరత ఆరు నెలలుగా ఉంది. దండేపల్లిలో..దండేపల్లి: దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు సుమారు 50 నుంచి వంద మంది వరకు రోగులు వస్తుంటారు. రెగ్యులర్ డాక్టర్లు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇద్దరు వైద్యులకు గాను ఒకరిని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిన నియమించారు. మరో డాక్టర్ పోస్టు ఖాళీగానే ఉంది. రెండు అటెండర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. -
బియ్యం త్వరగా అందించాలి
భీమారం: రైస్మిల్లర్లు తమకు నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బియ్యాన్ని త్వరగా అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని అంకూసాపూర్ గ్రామంలో సమత రైస్మిల్ను ఆకస్మికంగా సందర్శించారు. రైస్మిల్లు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మద్దికల్లో వరి సాగు చేయడాన్ని గమనించిన కలెక్టర్ కొందరు రైతులతో మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. బోర్లు, చెరువులు ఉండడంతో వరిసాగు చేస్తున్నామని రైతులు కలెక్టర్కు వివరించారు. మద్దికల్లో రీసర్వేను పరిశీలించి నిర్ధేశిత విధానాలను పాటించాలని ఆదేశించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు రాగా వారితో కలెక్టర్ మాట్లాడారు. నోటీసులకు సరైన పత్రాలను చూపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో వీణ, అధికారులు పాల్గొన్నారు. -
విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం
పాతమంచిర్యాల: విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దత్తత తీసుకున్న సినిమావాడలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో అక్షరాస్యత దినోత్స వ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ మాట్లాడుతూ నిరక్షరాస్య త నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల ని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యార్థం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోంద ని, అర్హత కలిగిన ఉపాధ్యాయ బృందం పని చేస్తోందని అన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షు డు పీ.వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం చైర్పర్సన్ డీ.వేణుగోపాల్, పాఠశాల హెచ్ఎం ప్రతిభావతి పాల్గొన్నారు. -
వినాయక మండపాలకు అనుమతి తీసుకోవాలి
మంచిర్యాలక్రైం: వినాయక విగ్రహాల మండపాలకు పోలీసుల అనుమతి తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. రామగుండం కమిషనరేట్లోని సమవేశం మందిరంలో మంగళవారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీ స్ అధికారులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అందరూ మతాలకతీతంగా సమన్వయంతో ఉత్సవా లు నిర్వహించాలని తెలిపారు. గణేష్ నవరాత్రుల ఉత్సవాలు, నిమజ్జనానికి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండపాల నిర్వహణ, విగ్రహాల ఏర్పాటు, రవాణా, భక్తుల రద్దీ నియంత్రణ, శోభాయాత్ర, నిమజ్జనం వరకు ప్రతీ దశలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అ న్నారు. ప్రతీ మండపాన్ని జియో ట్యాగింగ్ ద్వారా సంబంధిత ఎస్హెచ్ఓలు ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుంటుందని తెలిపారు. ఏదైనా సమ స్య తలెత్తితే వెంటనే 112 నంబర్కు సమాచారం అందించాలని తెలపారు. ఈ సమావేశంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు శ్రీనివాస్, ప్రవీణ్కుమార్, వెంకటేశ్వర్లు, సీఐలు కృష్ణకుమార్, భీమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కుప్టి పాత బ్రిడ్జికి బుంగ..
ఇచ్చోడ: నేషనల్ హైవే అఽథారిటీ అధికారుల తప్పిదం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. 44వ జాతీయ రహదారి కుప్టి పాత బ్రిడ్జికి బుంగ పడటంతో వాహనాల రాకపోకాలను పూర్తిగా నిలిపివేశారు. పాత బ్రిడ్జికి రెండు వందల మీటర్ల దూరంలో డ్రైవర్షన్ ఏర్పాటు చేసి వాహనాలను నూతన బ్రిడ్జి వైపు మళ్లిస్తుండడంతో ఒక్కో వాహనం అక్కడి నుంచి పాస్ కావడానికి కనీసం గంట సమయం పడుతోంది. పూర్తిగా డౌన్ ఉన్న చోట డైవర్షన్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా రాత్రి వేళల్లో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్లే వాహనాలు డైవర్షన్ నుంచి వన్వేలోకి వెళ్లడానికి చాలా సమయం పడుతోంది. దీంతో జాతీయ రహదారిపై మూడు, నాలుగు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోతుండడంతో ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. ప్రారంభంకాని మరమ్మతులు..నెల రోజుల క్రితం కుప్టి పాత బ్రిడ్జి మధ్యలో బుంగ ఏర్పడింది. అధికారులు గుర్తించినప్పటికీ ఇప్పటి వరకూ మరమ్మతులు చేయకపోవడంతో నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. అంతేకాకుండా బ్రిడ్జిపై 320 మీటర్ల పొడవున 12 జాయింట్ల వద్ద మరమ్మతులు చేపట్టాల్సి ఉందని స్థానిక ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో రెండు వైపులా రక్షణగా రెయిలింగ్ నిర్మించారు. అది అక్కడక్కడ కూలిపోవడంతో దాని స్థానంలో రక్షణ గోడ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంతో కూడా బ్రిడ్జిపై భారం పడినట్లు, రక్షణ గోడ నిర్మించే సమయంలో బ్రిడ్జిపై నెల రోజుల నుంచి వన్వే చేయడంతో ఒకే వైపు నుంచి వాహనాలు రాకపోకలు సాగించడం కూడా బ్రిడ్జిపై బుంగ పడేందుకు కారణం కావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల క్రితమే నిపుణుల నివేదిక..బ్రిడ్జి నాణ్యత ప్రమాణాలపై మూడేళ్ల క్రితమే నిపుణులు నేషనల్ హైవే అథారిటీ అధికారులకు నివేదిక అందజేశారు. పాత బ్రిడ్జి పక్కన నూతనంగా బ్రిడ్జి నిర్మించాలని నివేదికలో పేర్కొనట్లు సమాచారం. నేషనల్ హైవే అఽథారిటీ అధికారులు మాత్రం నివేదికను బుట్టదాఖలు చేసి నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం చర్యలు తీసుకోక పోవడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కుప్టి బ్రిడ్జి విషయమై నేషనల్ హైవే అథారిటీ పీడీ వివరణ కోసం సాక్షి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
గంజాయి కేసులో యువకుడి అరెస్టు
బెల్లంపల్లి: గంజాయి కేసులో యువకుడిని అరెస్టు చేసినట్లు వన్టౌన్ ఎస్హెచ్వో కె.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్సై రామకృష్ణ ఆదివారం జాతీయ రహదా రి పక్కన వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్ పై వస్తున్న ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సల్గుపల్లికి చెందిన గోమాస ప్రకాష్ వద్ద 200 గ్రాముల గంజాయి లభించింది. మహా రాష్ట్రలోని బల్లార్షాలో తక్కువ ధరకు కొనుగో లు చేసి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి బైక్, గంజాయి, ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
హక్కుల కోసం ఢిల్లీలో గర్జించిన గిరిజనులు
ఆదిలాబాద్టౌన్: ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీలో వేలాది మంది గిరిజనులు గళమెత్తారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని సాయి పార్క్లో సోమవారం ధర్నా, ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. దేశంలోని 21 రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐదు, ఆరో షెడ్యూళ్లను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అటవీ హక్కుల చట్టం, పెసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఏజీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ అటవీ సంరక్షణ చట్టం–2023తో ఆదివాసీ గ్రామసభల హక్కులకు భంగం కలిగే పరి స్థితి ఏర్పడిందన్నారు. మైనింగ్ పేరుతో ఆదివాసీ లను భూముల నుంచి తరలించడం నిలిపివేయాలని, అడవులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించరాదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ చైర్మన్ జితిన్ చౌదరి, జాతీయ కన్వీనర్, మాజీ ఎంపీ ఫు లీన్ బిహారి బస్కే, జాతీయ ఉపాధ్యక్షురాలు బృందాకర్, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు, వ్యకాస జాతీయ కార్యదర్శి బి.వెంకట్, టీజేజీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, ఉపాధ్యక్షులు సక్కు, పెందూర్ గోవింద్, తదితరులు పాల్గొన్నారు. -
నిషేధిత గడ్డి మందు స్వాధీనం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్2లో అక్రమంగా తరలిస్తు న్న నిషేధిత గడ్డిమందును సోమవారం పట్టుకున్నట్లు ఆర్పీఎఫ్ సీఐ శ్రీరామ్మీనా తెలిపా రు. తమకు అందిన సమాచారం మేరకు బల్లార్షా నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న రామగిరి ఎక్స్ప్రెస్ రైలులో సోదాలు నిర్వహించగా 81 గడ్డి మందు ప్యాకెట్లు, 5 లీటర్ల 5 క్యాన్లు, 5 లీటర్ క్యాన్లు పట్టుకున్నట్లు పే ర్కొన్నారు. గడ్డి మందును కాగజ్నగర్ మండల వ్యవసాయాధికారి రామకృష్ణకు అప్పగించినట్లు తెలిపారు. తనిఖీల్లో ఆర్పీఎఫ్ ఎస్సై ప్రాచీదేవి, ఏఎస్సై ఆర్.దాసు, సిబ్బంది కమలేశ్కుమార్ సింగ్, ప్రేమానంద్ పాల్గొన్నారు. -
సమన్వయంతో పులుల సంరక్షణ
నిర్మల్టౌన్: పులుల సంరక్షణ, అటవీ పరిరక్షణకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయం కీలకమని ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, బాసర సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పణ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత భవనంలో సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో ‘ఫారెస్ట్ ప్రొటెక్షనన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ టైగర్ ల్యాండ్స్కేప్’ అంశంపై అంతర్ జిల్లా సమన్వయ వర్క్షాప్ నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబ్డే అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పులుల సంచారానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ప్రస్తుతం తిప్పేశ్వర్, తడోబా టైగర్ రిజర్వ్ల నుంచి పులులు ఈ ప్రాంతంలోకి వస్తున్నాయన్నారు. పులుల సంరక్షణతో పాటు వాటి ఆవాస ప్రాంతాలను కాపాడడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓలు ప్రశాంత్ పాటిల్ (నిజామాబాద్), రాహుల్ జాదవ్ (మంచిర్యాల), నీరజ్ టెబ్రివాల్ (కామారెడ్డి), రవిప్రసాద్ (జగిత్యాల), డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
‘అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం’
రామకృష్ణాపూర్: మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన రాజకీయ అసహనానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ అన్నారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. బాల్క సుమన్ ఎంపీగా, ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? ఎంతమంది యువతకు ఉద్యోగాలు కల్పించారు? సింగరేణి కార్మికుల కోసం ఏం సాధించారో వెల్లడించాలని ప్రశ్నించారు. ఏటీసీలు, టామ్కామ్, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు శిక్షణ అందించి ఉద్యోగావకాశాల కల్పనకు మంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. సమావేశంలో నాయకులు చందనగిరి శ్రీనివాస్, ఎర్రబెల్లి రాజేష్, శ్రీనివాస్, సతీష్ పాల్గొన్నారు. -
కాసిపేట–2 గనిలో పేలుడు
కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట–2 గనిలో సోమవారం రెండో షిప్ట్లో మిస్ఫై ర్ జరిగి నలుగురు కా ర్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం... గనిలోని నార్త్ డిస్ట్రిక్ 22 లెవల్ 18 ఎక్స్ డీప్లో విధులు నిర్వహిస్తుండగా మ్యాన్హోల్ చేసే క్రమంలో డిటోనేటర్ పేలి సపోర్ట్మెన్ కార్మికులు క్రాంతికుమార్, పుప్పాల శ్రీనివాస్, కోల్ కట్టర్ కార్మికులు రమేశ్, రాజ్కుమార్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ముందుగా మందమర్రి డిస్పెన్సరీకి అక్కడి నుంచి రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో అమర్చిన డిటోనేటర్ 1 పేలకుండా ఉండటంతో కార్మికులు దగ్గరకు వెళ్లి పరిశీలిస్తున్న క్రమంలో పేలినట్లు తెలిసింది.చికిత్స పొందుతున్న రమేశ్ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రాంతికుమార్ -
● ఈ నెలలో ఎండలు పెరిగితే కష్టాలే.. ● ఇప్పటికే పలు మండలాల్లో లోటు ● పొదుపుగా వాడితేనే జల సంరక్షణ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎల్నినో ప్రభావంతో జిల్లాలో ఈసారి సమృద్ధిగా వర్షాలు కురువలేదు. జూన్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 7వరకు మొత్తం 817మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 756మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. కొన్ని చోట్ల సాధారణం కంటే తక్కువగా వానలు పడ్డాయి. దీంతో ఆయా మండలాల్లో భూగర్భజలాలు లోతులో ఉన్నాయి. ఆగస్టు నెల వరకు జిల్లాలో భూగర్భ జలాల సగటు లభ్యత 4.57 మీటర్లు ఉండగా, గతేడాది ఇదే నెలలో జిల్లా సగటు చూస్తే 6.45మీటర్లుగా ఉంది. ఇప్పటికీ జిల్లాలో గోదావరి తీర ప్రాంతాల్లోనూ నీటి లభ్యత తక్కువగానే ఉంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కీలకమైన నైరుతి రుతుపవన కాలంలోనే వర్షాలు కురిస్తేనే చెరువులు, కుంటలు, సాగునీటి ప్రాజెక్టులు, గోదావరి, ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద చేరేది. ఈసారి రెండు సార్లు మినహా భారీగా వరదలు రాలేదు. దీంతో భూమిలోకి నీరు ఇంకకపోవడంతో లభ్యత తగ్గుతోంది. ఎండలు పెరిగితే.. వానాకాలంలోనూ ఎండల తీవ్రత పెరుగుతోంది. గత రెండు రోజులుగా ఉక్కపోత, వేడిమి పెరుగుతోంది. దీంతో పంటలకు నీటి అవసరం ఎక్కువ అవుతుంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరిగితే నీటి వాడకం పెరుగుతుంది. దీంతో భూగర్భజలాల వాడకంగా ఉన్న బావులు, బోర్ల నుంచి ఎక్కువ మొత్తంలో నీటిని తోడాల్సి వస్తుంది. వేసవి తరహాలోనే వానాకాలంలోనూ బోర్లు, బావులపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వేగంగా భూగర్భ జలాలు పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే జైపూర్, దండేపల్లి, హాజీపూర్ మండలాల పరిధిలో నీటి లభ్యత లోతుకు చేరుతోంది. ఈ నెలలో వర్షాలు ఆశించిన మేర పడకపోతే నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో పంటలు కాపాడుకోవడానికి నీటిని అధికంగా వినియోగించాల్సి ఉంది. మరోవైపు గృహా, వాణిజ్య, పరిశ్రమల కోసం పట్టణాలు, జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా బోర్లు వాడుతున్నారు. దీంతో వేగంగా నీటి లభ్యత తగ్గుతోంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని భూగర్భ జల సంరక్షణ అధికారులు కోరుతున్నారు.పొదుపుగా నీటిని వాడాలిఎల్నినో ప్రభావంతో ఈ నెలలో తగినంత కురియకపోతే క్రమంగా భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికై తే జిల్లాలో సాధారణ స్థితిలోనే ఉన్నాయి. భూగర్భ జలాలను అందరూ అవసరం మేరకు పొదుపుగా వాడాల్సి ఉంది. – వి.సురేశ్, జిల్లా భూగర్భజల శాఖ అధికారిజిల్లాలో ఆగస్టు నెలలో భూగర్భ జలాలు(మీటర్లలో)మండలం గ్రామం గతేడు ఈఏడాది బెల్లంపల్లి బెల్లంపల్లి 15.98 12.15 భీమిని రాంపూర్ 2.08 0.31 చెన్నూరు చెన్నూరు 8.01 7.02 చెన్నూరు కొమ్మెర 2.62 0.94 దండేపల్లి మ్యాదరిపేట 4.48 1.50 హాజీపూర్ హాజీపూర్ 5.12 1.57 జైపూర్ జైపూర్ 2.92 6.31 జైపూర్ కుందారం 8.58 10.55 జన్నారం ఇందన్పల్లి 3.44 1.46 కన్నెపల్లి జన్కాపూర్ 0.01 0.01 కాసిపేట కొండాపూర్ 3.75 1.43 కోటపల్లి కోటపల్లి 17.52 17.03 లక్షెట్టిపేట లక్షెట్టిపేట 0.98 0.52 మందమర్రి మందమర్రి 4.50 3.67 మందమర్రి పొన్నారం 16.66 8.86 నెన్నెల నెన్నెల 6.76 2.30 తాండూరు తాండూరు 15.54 11.11 వేమనపల్లి నీల్వాయి 0.59 0.41 జన్నారం జన్నారం 5.85 2.55 జన్నారం తపాలాపూర్ 3.09 1.76 భీమారం భీమారం 8.11 7.35 మంచిర్యాల మంచిర్యాల 6.39 1.01 నస్పూర్ నస్పూర్ 6.70 7.80 వేమనపల్లి లక్ష్మీపూర్ 4.25 2.36 కన్నెపల్లి నాయకిన్పేట 7.44 4.20 జిల్లా సగటు 6.45 4.57 -
విద్యకు మరింత ఊతం
నిర్మల్ఖిల్లా: ప్రభుత్వ విద్యారంగం బలోపేతం, గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు మెరుగై న విద్య అందించేందుకు ప్రభుత్వం తెలంగాణ ప బ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) ఏర్పాటుకు ప్రాధాన్యమి స్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 73 ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎని మిది పాఠశాలలను ఎంపిక చేసింది. ఈ మేరకు నిఽ దులు కేటాయిస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు రూ.83.19 కోట్లు కేటాయించారు. ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల అభ్యసన ఫలి తాలను మెరుగుపరిచేలా నాణ్యమైన, సమగ్ర విద్యా వాతావరణాన్ని కల్పించేలా అభివృద్ధి చేస్తా రు. ప్రస్తుతం ఉన్న జెడ్పీహెచ్ఎస్లు, మోడల్ స్కూళ్లను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేశారు. ప్రభుత్వ విద్యకు కొత్త రూపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల ను మరింత మెరుగుపర్చడంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం, ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచడం ఈ పాఠశాలల ప్రధాన ఉద్దేశం. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికలు వంటి సదుపాయాలు కల్పించనున్నారు. విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, సురక్షితమైన పాఠశాల వాతావరణం అందించడంపై దృష్టి సారించనున్నారు. విద్యార్థుల సమగ్ర వికాసంపాఠ్యపుస్తకాల బోధనకే పరి మితం కాకుండా విద్యార్థుల మేధో, శారీరక, మానసిక, సా మాజిక, సాంస్కృతిక వికాసానికి వేదికగా నిలువనున్నా యి. క్రీడలు, కళలు, సైన్స్, సాంకేతికత, తదితర రంగా ల్లో విద్యార్థుల ప్రతిభ ను వెలి కితీసేలా అవకాశాలు కల్పించనున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్లు ప్ర త్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది. నాణ్యమై న విద్యతో పాటు ఆధునిక సదుపాయాలు ప్రభు త్వ పాఠశాలల్లోనే అందుబాటులోకి వస్తే తల్లిదండ్రులపై విద్యా ఖర్చుల భారం తగ్గనుంది.జిల్లా పాఠశాల నిధులు (రూ.కోట్లలో) కుమురంభీం ఆసిఫాబాద్ జెడ్పీహెచ్ఎస్ 8.40 కాగజ్నగర్ జెడ్పీహెచ్ఎస్ 10.09 మందమర్రి మోడల్ స్కూల్ 10.70 మంచిర్యాల కాసిపేట మోడల్ స్కూల్ 10.30 సీతారాంపల్లి జెడ్పీహెచ్ఎస్ 12 నిర్మల్ కుంటాల మోడల్ స్కూల్ 9 నర్సాపూర్(జీ) జెడ్పీహెచ్ఎస్ 12.50 ఆదిలాబాద్ యాపల్గూడ జెడ్పీహెచ్ఎస్ 10.20 ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలు, కేటాయించిన నిధులు -
పత్తి పంటను ఆశిస్తున్న ‘పిండినల్లి’
చెన్నూర్రూరల్: పత్తి పంటను ఆశించి రసం పీల్చే వాటిలో పిండినల్లి పురుగులు ప్రధానమైనవి. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఈ పురుగులు పత్తి పంటను ఆశిస్తాయి. ఇవి చిన్నవిగా, మెత్తగా, లేత గులాబీరంగులో ఉంటాయి. కొమ్మలు, కాండం, మొగ్గలు, కాయల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఫలితంగా మొక్కల్లో సాధారణంగా జరిగే ఆవశ్యక మూలకాలు, పదార్థాల సరఫరాలో అంతరాయం ఏర్పడి గిడసబారి పోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గి మొక్క గుబురుగా చిన్నదిగా కనిపిస్తుంది. దీని నివారణకు చర్యలు చేపట్టాలని చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసాద్ సూచించారు. నివారణచర్యలుపురుగు ఆశించిన మొక్కలను పీకి కాల్చి వేయాలి. ఇలా చేయడం ద్వారా దాని విస్తరణను అదుపులో ఉంచవచ్చు. పొలం గట్లపైన ఉండే కలుపు మొక్కలు మఖ్యంగా వయ్యారిభామ, తుత్తురబెండ, గడ్డిచామంతి, వంటి కలుపు మొక్కలను పీకి కాల్చి వేయాలి. జైగోగ్రామ బైకోలరేట్ మిత్ర పురుగులను హెక్టారుకు 500 నుంచి 1000 వరకు విడుదల చేయాలి. తద్వారా వయ్యారిభామ, కలుపు మొక్కలను నివారించవచ్చు. దీని ద్వారా పిండినల్లి ఉధృతి తగ్గించవచ్చు. పత్తి ఏరిన తర్వాత ఎండు కర్రలను పీకి కాల్చి వేయాలి. వేసవి దుక్కుల ద్వారా నేలలో దాగి ఉండే పిల్ల పురుగులను నియంత్రించవచ్చు. అంతర పంటగా అలసంద, బబ్బెర, సోయాబీన్, మినుము వంటి పంటలను సాగు చేయడం ద్వారా మిత్ర పురుగుల సంఖ్యను వృద్ధి చేయవచ్చు. కంచె పంటగా లేదా రక్షక పంటగా రెండు వరుసల సజ్జ లేదా కందులను దట్టంగా పెంచాలి. దీని ద్వారా ప్రధాన పంట అయిన పత్తిలో పిండినల్లి ఉధృతి తగ్గించుకోవచ్చు. మొక్కలను పురుగు ఆశిస్తే లీటరు నీటిలో 10 మిల్లీలీటర్ల వేపనూనెతో పాటు ఒక గ్రాము సబ్బు పొడిని కలిపి 10 నుంచి 12 రోజుల తేడాతో మొక్కలపై పిచికారీ చేయాలి. దీంతో చీడ, పీడలు తగ్గుతాయి, తద్వారా మంచి దిగుబడులు పొందవచ్చు. ఏవిధంగా ఆశిస్తుందిపిండినల్లి పురుగులు ముఖ్యంగా పొలంగట్లపై, పనికి రాని భూముల్లో పెరిగే కలుపు మొక్కల ద్వారా వ్యాపిస్తాయి. బెండ, టమాటా, వంగ, క్యాబేజీ, బొప్పాయి, నిమ్మ, జామ, మందార, గోగు, చామంతి, గడ్డి చామంతి, రామబాణం, వయ్యారిభామ, తుత్తర బెండ, సీతాఫలం, సుబాబుల్, గ్లైరిసిడియా వంటివి పిండినల్లికి అతిథి మొక్కలు. పురుగుపై తెల్లని మైనపు పొర ఉండటం చేత, అది పురుగు మందుల ప్రభావం నుంచి ఇతర సహజ మరణం నుంచి రక్షణ పొందుతుంది. ఈ పురుగు సాధారణంగా సంవత్సర కాలంలో 15 తరాలకు అభివృద్ధి చెందగలదు. అలాగే ఆడ పురుగు పెట్టే ఒక గుడ్ల సంచిలో దాదాపు 600 వరకు గుడ్లు ఉంటాయి. పంట పొలంలో సహజంగా పెరిగే మిత్ర పురుగులు అంతరించి పోవడం వలన పురుగు విసర్జించే తేనె వంటి ద్రవం కొరకు వచ్చే చీమల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు పిండినల్లి వ్యాపిస్తుంది. అంతే కాకుండా పురుగు సహజంగా పంట ఉత్పత్తుల ద్వారా, పత్తి కర్రల ద్వారా గాలి, నీటి కాలువలు, వర్షం, పక్షులు, పశువుల ద్వారా వ్యాపిస్తుంది. మనుషులు ఈ పురుగులు ఆశించిన ప్రాంతం నుంచి ఆశించని ప్రాంతానికి తిరగడం ద్వారా కూడా వ్యాపిస్తుంది. -
మందు గోలీలు కొనుక్కోవాల్సిందే..!
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాలలోని ఆర్టీసీ ఆస్పత్రిలో మందుగోలీల కొరత నెలకొంది. దీంతో మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని వందలాది మంది ఆర్టీసీ ఉద్యోగులతోపాటు విశ్రాంత సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తోంది. షుగర్, ఇతరత్రా జబ్బుల బారిన పడిన కార్మికులు, వారి కుటుంబాలు మందులు లేకపోవడంతో బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రతీ నెల 8నుంచి 12వ తేదీ మధ్య మందుల కోసం ఇండెంట్ పంపిస్తున్నా అవసరమైన మేరకు రాకపోవడంతో తిప్పలు తప్పడం లేదు. రెండు జిల్లాలకు చెందిన 820మంది ఉద్యోగులతోపాటు రిటైర్డు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలు పొందుతుంటారు. ఏ చిన్న అనారోగ్యమైనా ఇక్కడికి వచ్చి చికిత్స పొంది మందులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆర్టీసీ డిస్పెన్సరీలో శాశ్వత వైద్యుడిని నియమించాల్సి ఉన్నా కాంట్రాక్టు పద్ధతిన వైద్యుడు, ఔట్సోర్సింగ్ స్టాఫ్నర్స్, ఫార్మాసిస్టు, ల్యాబ్, వార్డుబాయ్లు సేవలందిస్తున్నారు. దీంతో ఆస్పత్రి కాస్త కాంట్రాక్టు మయంగా మారింది. నాలుగు నెలలుగా నిరాశే.. అనారోగ్యం పాలైన కార్మికులు మందుల కోసం వస్తే లేవనే సమాధానం నిరాశకు గురి చేస్తోంది. ముఖ్యమైన మందులు, రోగులు నిత్యం వాడే షుగర్ గోలీలు నాలుగు నెలలుగా అందుబాటులో లేవు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు శారీరక నొప్పులు సహజం. నొప్పి నివారణ మాత్రల కొరత ఏర్పడుతోంది. కీళ్లు, శరీర నొప్పుల కోసం వాడే గోలీలు రెండు నెలలుగా సరఫరా కావడం లేదు. జ్వరం గోలీలూ లేవు. ప్రతీ నెల 10నుంచి 20వ తేదీ వరకు వంద మందికి పైగా మందులు తీసుకెళ్తుంటారు. మిగతా రోజుల్లో 20 నుంచి 30మంది వస్తుండగా.. మందులు లేక సోమవారం ఒకరిద్దరు కూడా కనిపించలేదు. నెలకోసారి మందుల ఇండెంట్ పంపినా సరిపడా రావడం లేదని తెలుస్తోంది. కడుపులో మంట, ఎసిడిటీ నివారణ మాత్రలు స్వల్ప మొత్తంలోనే సరఫరా అవుతున్నాయని తెలిసింది. షుగర్, బీపీ గోలీలు రిటైర్డు కార్మికులకు రెండు నెలలు, ఆర్టీసీ ఉద్యోగులకు నెలకు సరిపడా ఇవ్వాల్సి ఉన్నా కొసరి కొసరి ఇస్తుండడంపై పెదవి విరుస్తున్నారు. నిరంతరం ప్రజారవాణాకు శ్రమించే ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది వైద్యం కోసం ప్రైవేట్ మందుల దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు అత్యవసరమైన మందులు సరఫరా చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిలో మందుల విషయమై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని, ప్రస్తుతం ఇండెంట్లో సరఫరాయ్యే మందులను రోగులకు ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తామని ఆర్టీసీ వైద్యుడు తెలిపారు. -
● కలెక్టరేట్ ప్రజావాణిలో బారులు ● మండలాల్లో ఉన్నా ఇక్కడికే..
సమస్య తీరదు.. రాక తప్పదు!మంచిర్యాలఅగ్రికల్చర్: మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నా కలెక్టరేట్కు వచ్చేవారి సంఖ్య తగ్గడం లేదు. కలెక్టర్కు చెప్పుకుంటేనైనా సమస్యకు పరిష్కారం లభిస్తుందని వస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వందలాది రూపాయలు చార్జీలు పెట్టుకుని వస్తూ ఫిర్యాదు చేస్తున్నారు. అయినా పరిష్కారం లభించకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. భూ సమస్యలు, పింఛన్లు, పరిహారం, సర్టిఫికెట్లు, రోడ్డు, విద్యుత్ తదితర సమస్యలపై ప్రతీ వారం 60నుంచి 70 ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో 30శాతం కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో పదే పదే ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తూ గోడు వెల్లబోసుకుంటున్నారు. పరిష్కారం లభిస్తుందనే భరోసా కూడా లభించకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రజావాణి అర్జీలపై మూడు నెలలకోసారైనా జిల్లా అధికారులు సమీక్షించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి అర్జీదారుకు ఐడీతోపాటు రశీదు ఇస్తున్నారు. నెలల తరబడి తిరుగుతున్నా పరిష్కారం లభించడం లేదు. ప్రతీ సోమవారం ప్రజావాణికి వస్తున్న అర్జీలు, పరిష్కారాలపై వివరాల కోసం సంబంధిత సూపరింటెండెంట్ను సంప్రదించగా స్పందించలేదు. సత్వరమే పరిష్కరించాలి మండల, జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో అందిన అర్జీలు పూర్తి స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, డీఆర్డీవో మోతీరాంతో కలిసి అర్జీలు స్వీకరించారు. -
‘సర్’ పకడ్బందీగా పూర్తి చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు యోగితారాణా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీతో కలిసి ఏఈఆర్వోలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 1.70 లక్షల మ్యాపింగ్ కాని, అనామలీస్ ఓటర్లకు నోటీసులు రూపొందించామని, 1.10లక్షల మందికి పంపిణీ చేశామని, మిగతా 60 వేల నోటీసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన 11 ధ్రువీకరణ పత్రాల్లో నుంచి మాత్రమే సమర్పించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల సందర్శన నస్పూర్: నస్పూర్లోని రేడియంట్ పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను యోగితా రాణా సోమవారం సందర్శించారు. -
సైబర్ నేరాల కట్టడిలో వారియర్స్ కీలక పాత్ర
మంచిర్యాలక్రైం: సైబర్ నేరాల కట్టడిలో సైబర్ వారియర్స్ కీలక పాత్ర పోషిస్తారని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం కమిషనరేట్ పరిధిలోని సైబర్ వారియర్స్తో సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి డబ్బు కోల్పోయిన వారి డబ్బులను తిరిగి ఇప్పించడమే లక్ష్యంగా సైబర్ వారియర్స్ పని చేస్తున్నారని అన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రతీ గణేష్ మండపంలో సైబర్ నేరాల అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీసీఎస్బీ ఎస్పీ సాయిశ్రీ, సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణరెడ్డి, సైబర్ క్రైం సీఐలు రాణప్రతాప్, శ్రీనివాస్, మారుతి, క్రాంతి, ఎస్సైలు పాల్గొన్నారు. తక్షణ పరిష్కారం కోసమే గ్రీవెన్స్.. సమస్యల తక్షణ పరిష్కారం కోసమే గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. సోమవారం కమిషనరేట్లో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్స్టేషన్ అధికారితో మాట్లాడి చట్టపరిదిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
భూమి 22ఏ నుంచి తొలగించాలి
జైపూర్ మండలం పౌనూర్ శివారులో సర్వే నంబరు 172/1లోని ఐదు ఏకరాల భూమి 1978–79 నుంచి 2000–01 సంవత్సరం వరకు మా నాన్న పేరిట పట్టా ఉంది. మా అన్న పేరిట సర్వే నంబరు 172లో రెండున్నర ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూమిని 22ఏ యాక్టు కింద నిషేధిత జాబితాలో నమోదు చేశారు. ఈ జాబితా నుంచి తొలగించాలి. – జాడి సీతయ్య, పౌనూర్, జైపూర్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదునా అల్లుడు సంతోష్ 2021లో చనిపోయాడు. అప్పటికే నా కూతురికి బాబు ఉన్నాడు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం లక్సెట్టిపేట తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించి గత జూలై 16న మీసేవలో దరఖాస్తు చేశాం. 45రోజలు గడిచినా ఇవ్వడం లేదు. మహారాష్ట్రలో చనిపోయాడని, అక్కడే ఇస్తారని చెబుతున్నారు. నా కూతురికి వితంతు పింఛన్, మనవడికి మిషన్ వాత్సల్య కింద రూ.4వేలు అన్నీ ఇక్కడే వస్తున్నాయి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీకి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. – మేడారం అంజయ్య, గోదావరిరోడ్, లక్సెట్టిపేట -
నేషనల్ హైవే–63 బాధిత రైతుల ఆందోళన
పాతమంచిర్యాల: నేషనల్ హైవే–63 బాధిత రైతులు సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రహదారి నిర్మాణంపై కేసు కోర్టు విచారణలో ఉండగానే రైతులకు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నోటీస్ ప్రతులను దహనం చేసి ఆర్డీఓ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. బాధిత రైతులు, బీజేపీ సీనియర్ నాయకుడు తులా మధుసూదన్ మాట్లాడుతూ 2023లో నేషనల్ హైవే అధికారులు పాత రోడ్డు ప్రకారంగా రాయపట్నం నుంచి మంచిర్యాల వరకు అలైన్మెంట్ ఇచ్చి గెజిట్ పాస్ చేశారని తెలిపారు. రాష్ట్ర మంత్రి వివేక్ రోడ్డుపై కుట్రలు చేసి బ్రౌన్ఫీల్డ్ అలైన్మెంట్ను గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్గా మార్పించారని విమర్శించారు. హాజీపూర్, లక్షెటిపేట మండలాల రైతుల కుటుంబాలు బజారున పడనున్నాయని తెలిపారు. గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్ను బ్రౌన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్గా మార్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మున్నారాజా సిసోడియా, కాసెట్టి నాగేశ్వర్రావు, బోయిని హరికృష్ణ, మేడిపల్లి సత్యం, లగిశెట్టి రాజమౌళి, ఉస్మాన్పాషా, ఎన్హెచ్–63 బాధిత రైతులు పాల్గొన్నారు. -
ఆటలకు సిద్ధం
చెన్నూర్: జిల్లాలో మంగళవారం నుంచి ఎస్జీఎఫ్ పోటీలు నిర్వహించనున్నారు. గత ఏడాది జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో 13 పతకాలు సాధించారు. జిల్లాలోని 18 మండలాల్లో ప్రతియేటా పాఠశాలకు రూ.25వేలు, పీఎంశ్రీ పాఠశాలలకు రూ.50వేల క్రీడా సామగ్రి అందజేస్తున్నారు. దీంతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో పతకాల సాధనలో ముందుంటున్నారు. గత ఏడాది జిల్లాకు చెందిన 22మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ఐదు బంగారు, ఐదు వెండి, మూడు కాంస్య పతకాలు సాధించగా.. తొమ్మిది మంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో చెన్నూర్కు చెందిన క్రీడాకారులే ఎక్కువగా ఉండడం గమనార్హం. జాతీయ స్థాయి పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటున్నా అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం లేదు. 8, 9, 10వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఈసారి అంతర్జాతీయ స్థాయి పోటీలు లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించినట్లు పీడీలు తెలిపారు. జాతీయ స్థాయిలో పతకాల సాధనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పీఈటీలు శిక్షణ ఇస్తున్నారని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండీ.యాకుబ్ తెలిపారు.జాతీయ స్థాయిలో పతకమే లక్ష్యంగత ఏడాది రాష్ట్ర స్థాయి పోటీల్లో ఐదో స్థానంలో నిలిచిపోయా. ఈ ఏడాది జాతీయ స్థాయిలో పతకం సాధించడమే నా ముందున్న లక్ష్యం. ఇందుకోసం నిరంతరం సాధన చేస్తున్న. మైదానాల కొరత కారణంగా సాధనకు కష్టం అవుతుంది. – అకాశ్, ఎంజేపీ పాఠశాల, చెన్నూర్లాంగ్జంప్లో..ఎస్జీఎఫ్తోపాటు పలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించాను. ఈసారి ఎస్జీఎఫ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తా. నీల్వాయి జిల్లా పరిషత్ పాఠశాలలో చిన్న మైదానం ఉన్నా పీడీ సార్ శిక్షణ ఇస్తున్నారు. – మల్లేశ్వరి, హైస్కూల్, నీల్వాయి -
సోమగూడంను ముంపు గ్రామంగా ప్రకటించాలి
కాసిపేట: కేకే ఓపెన్కాస్ట్ గని బ్లాస్టింగ్తో గత కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పూర్తి స్థాయి ముంపు గ్రామంగా ప్రకటించాలని సోమగూడం(కె) గ్రామస్తులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనులు అడ్డుకున్నారు. అధికారులు వారితో మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని, రెండ్రోజులు గడువు కావాలని కోరారు. దీంతో రెండ్రోజుల్లో గ్రామాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బ్లాస్టింగ్తో ఇళ్లు దెబ్బతినడం, గోడలు కూలిపోవడం, దుమ్ము, ధూళి సమస్యతో ప్రజల జీవనం దుర్భరంగా మారాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో లంబాడితండా(కె) సర్పంచ్ బలరాం, మాజీ సర్పంచ్ సపాటు శంకర్, ఉపసర్పంచ్ మల్యాల స్రవంతి, వార్డు సభ్యులు ప్రశాంత్, తిరుపతి, భుక్య పద్మ, రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కాసిపేటకు ఢిల్లీ స్థాయిలో గుర్తింపు
కాసిపేట: అక్షరాస్యతలో ముందున్న కాసిపేట మండలానికి ఢిల్లీ స్థాయిలో గుర్తింపు లభించింది. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వయోజన అక్షరాస్యత కార్యక్రమం అందుకు కారణమైంది. 2025లో తొలిసారిగా జిల్లాలోని కాసిపేట మండలంలో 100 రోజుల్లో వంద శాతం అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. 22 గ్రామ పంచాయతీల పరిధిలో 15ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి అక్షరాలు నేర్పించారు. మండలంలో 3,462 మంది నిరక్షరాస్యులకు విద్య అందించేందుకు 233 మంది వాలంటరీలను నియమించారు. వీరితోపాటు 9, 10వ తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమానికి వాలంటీర్లు రాజేశ్వరి, రజిత, కవిత, అక్షరాస్యత సాధించిన భూమక్క, జ్యోతి, బోనమ్మ ఎంపికయ్యారు. వీరందరూ ఢిల్లీకి తరలివెళ్లారు. -
సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర కీలకం
మంచిర్యాలఅర్బన్: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. ఆదివారం ఓ ప్రైవేట్ కన్వెన్షన్లో మంచిర్యాల ట్రస్మా ఆధ్వర్యంలో ఆచార్యదేవోభవ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన 140 మంది కరస్పాండెంట్లు, 140 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శేఖర్రావు, జిల్లా అధ్యక్షుడు విష్ణువర్థన్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదారి చంద్రమోహన్గౌడ్, కోశాధికారి శ్రీధన్, ఢిల్లీ డిఫెన్స్ ఆకాడమీ చైర్పర్సన్ సతీష్రెడ్డి, రాష్ట్ర నాయకులు పద్మచరణ్, సిద్దయ్య, శరత్, సత్తయ్య, వేణు, ఉస్మాన్ పాషా, బాలాజీ, విక్రమ్రావు, తదితరులు పాల్గొన్నారు. లక్సెట్టిపేట: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దండేపల్లి, లక్సెట్టిపేట మండలా ల్లోని 312 మంది లబ్ధిదారులకు సుమారు రూ.90 లక్షల చెక్కులు అందజేశామన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి, వైస్ చైర్మన్ రాజేశ్వరి, ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వర్లు, నాయకులు గడ్డం త్రిమూర్తి, నలిమెల రాజు, రమేశ్, షాహిద్అ లీ, ఆరీఫ్, శ్రీనివాస్, నర్సయ్య, పూర్ణచందర్రావు, సురేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. మతాలకు అతీతంగా ఉత్సవాలు జరుపుకోవాలి మంచిర్యాల క్రైం: వినాయక నవరాత్రి ఉత్సవాలు మతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కన్వెన్షన్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు అనుమతులకోసం ఈ నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పరిశీలన తర్వాత అధికారులు నిర్ధేశించిన స్థలంలోనే విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నవరాత్రుల్లో మద్యం అమ్మకాలపై ఎక్సెజ్ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ మండపాల వద్ద కనీసం రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే హెల్ప్లైన్ 112కు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కమిషనర్ అన్వేష్, సీఐలు ప్రమోద్రావు, రమణమూర్తి, రవీందర్, తదితరులు పాల్గొన్నారు. -
అటవీశాఖ కార్యాలయ సామగ్రి అప్పగింత
జన్నారం: అటవీశాకలో పనిచేస్తున్న ఇద్దరు ది నసరి ఉద్యోగుల వేతనాల చెల్లింపులో జాప్యం చేసినందుకు గోదావరిఖని లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు జప్తు చేసిన అటవీశాఖ డివిజన్ కార్యాలయం, తాళ్లపేట రేంజ్ కార్యాలయ సామగ్రిని హైకోర్టు ఆదేశాల మేరకు తిరిగి అప్పగించినట్లు ఎఫ్డీవో ఎం.రామ్మోహన్ తెలి పారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ 2025 జూన్ 10న ప్రభు త్వ చరాస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. కార్మిక న్యాయస్థానం ఆదేశాలను సవాల్ చేస్తూ కార్యాలయ సామగ్రి విడుదల కోసం అటవీ శాఖ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇవ్వడంతో జప్తు చేసిన ప్రభుత్వ వాహనం, కంప్యూటర్లు, బ్యాటరీలు, కుర్చీలు, ఇతర సామగ్రిని అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. -
బీఆర్ఎస్ మంజూరు చేసిన పనులు ఆపుతున్నారు
రామకృష్ణాపూర్: చెన్నూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కావాలని ఆపుతున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజాప్రతినిధులు మారినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాల్సిన అవసరముందన్నారు. క్యాతనపల్లిలోని తన నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయించినప్పటికీ పనులు నిలిపివేశారని, చెన్నూర్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, మరో రెండు కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించిన జీవోలు తీసుకువచ్చినా వాటిని పక్కన పెట్టారన్నారు. పనులు కొనసాగిస్తే గత ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఉద్దేశంతో అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో మంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి, మూల రాజిరెడ్డి, సుదర్శన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి అద్దె నుంచి 164 మందికి ఊరట
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ‘బెటాలియన్ క్వార్టర్లు శిథిలం’ శీర్షికన ఈనెల 4న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు చేయడంతో 164 మందికి ఇంటి అద్దె నుంచి ఉపశమనం లభించింది. గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లో 426 క్వార్టర్లు ఉండగా ఇందులో 300ల క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఆర్నెల్లుగా బెటాలియన్ సిబ్బంది ఇతర ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు. క్వార్టర్లకు మరమ్మతు చేయించకుండా ఇంటి అద్దె కటింగ్ చేయడంతో బెటాలియన్ సిబ్బంది ఇటీవల హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే పోలీస్ హౌజింగ్ బోర్డు, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ నాగభూషణం ఆధ్వర్యంలోని కమిటీ పూర్తి విచారణ నేపథ్యంలో ఇటీవల వీరు చేసిన సిఫారసు ఆధారంగా 164 మంది కానిస్టేబుళ్లకు క్వార్టర్లు ఖాళీ చేయడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అద్దె అలవెన్స్లను తిరిగి చెల్లించడం జరుగుతుందని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. -
● పోర్టబుల్ ఎక్స్రేతో వ్యాధిగ్రస్తుల గుర్తింపు ● 2030 నాటికి వ్యాధిరహిత జిల్లా..
మంచిర్యాలటౌన్: జిల్లాలో క్షయ అంతమే లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలను ముమ్మరం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన లక్ష్యం 2030 కాగా, ఆలోపు జిల్లాలో క్షయను పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. 2025 డిసెంబర్లో క్షయను నిర్ధారించేందుకు మూడు ఆల్ట్రా పోర్టెబుల్ హ్యాండిల్ ఎక్స్రే యంత్రాలు జిల్లాకు కేటాయించగా, ప్రస్తుతం రెండు యంత్రాలతో క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నారు. అనుమానితులను గతంలో జిల్లా ఆసుపత్రికి తరలించి పరీక్షించేవారు. కానీ ఇప్పుడు నేరుగా ఎక్స్రే మిషన్ను వెంట తీసుకెళ్లి అక్కడే పరీక్షిస్తున్నారు. ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ పేరుతో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షల్లో వందల సంఖ్యలో వ్యాధ్రిగస్తులను గుర్తిస్తూనే, వారికి వెనువెంటనే వైద్య పరీక్షలు ప్రారంభిస్తున్నారు. ఆరు నెలల కోర్సుతో క్షయ వ్యాధి నుంచి విముక్తి లభించనుండగా, మందులను సకాలంలో వాడేలా వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. 694 మంది గుర్తింపు గతంలో కేవలం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి లో మాత్రమే అందుబాటులో ఉండేది. క్షయ వ్యాధి అనుమానితులను ఆసుపత్రికి పంపించడం, వారికి పరీక్షలు నిర్వహించి వ్యాధిని గుర్తించడం ఇబ్బందిగా ఉండేది. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు ఈ విధంగానే 1,062 మందిని గుర్తించారు. 2025 డిసెంబర్లో హ్యాండ్హెల్డ్ ఎక్స్రే మిషన్ అందుబాటులోకి రావడంతో, నేరుగా అనుమానితుల వద్దకే వెళ్లి పరీక్షించారు. హ్యాండ్హెల్డ్ ఎక్స్రే మిషన్ ద్వారా గతేడాది డిసెంబర్ నుంచి ఆగస్టు వరకు 42,386 మందిని పరీక్షించగా 694 మందిని గుర్తించారు. చికిత్స పొందిన వారిలో కొందరికి వ్యాధి నయం కాగా, ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చికిత్స పొందుతున్న వారు 571 మంది ఉన్నారు. వీరికి ఆరు నెలల కోర్సుతో చికిత్సను అందిస్తున్నారు. పౌష్టికాహారం అవసరమే.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉండటం, నెలల వ్యవధిలోనే బరువు తగ్గడం వంటివి జరిగినప్పుడు క్షయ (టీబీ)గా గుర్తించి ఎక్స్రే మిషన్ ద్వారా పరీక్షిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన బీపీ, షుగర్, క్యాన్సర్ వంటివి ఉన్నవారికి క్షయ వ్యాధి త్వరగా సోకుతుండడంతో, వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వ్యాధిని సకాలంలో గుర్తించి, చికిత్సతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకుంటేనే త్వరగా బయట పడేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో 571 మంది వ్యాధిగ్రస్తులు ఉండగా, వీరికి ప్రభుత్వం నెలకు రూ.వెయ్యి చొప్పున ఆరు నెలల పాటు ఇస్తుండగా, పౌష్టికాహారం ఇచ్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. జిల్లాలో 80 మందికి పౌష్టికాహార కిట్లను (కేజీ పల్లీలు, అరకిలో చొప్పున పెసరు, శనగ, కంది పప్పు, కిలో నూనె, మూడు కిలోల సన్నబియ్యం) లయన్స్ క్లబ్ ఇస్తుంది. వాటిని సక్రమంగా తీసుకుని, వైద్యులు సూచించిన మందులను తప్పనిసరిగా వాడితే క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు అవకాశం ఉంటుంది.జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తుల వివరాలు2025 జనవరి నుంచి నవంబర్ వరకు గుర్తించింది 1,062హ్యాండ్హెల్డ్ ఎక్స్రే మిషన్ ద్వారా గతేడాది డిసెంబర్ నుంచి ఆగస్టు వరకు పరీక్షించింది 42,386గుర్తించిన వారు 694ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 571 -
ఉత్తమ సేవలకు అవార్డులు
పాతమంచిర్యాల: 2025–26 సంవత్సరంలో ఉత్త మ సేవలందించినందుకుగానూ లయన్స్ ఇంటర్నేషనల్ 320 జీ మంచిర్యాల శాఖ 14 అవార్డులు సాఽ దించినట్లు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు వీ.మధుసూధన్రెడ్డి తెలిపారు. ఆదివారం రామగుండంలోని ఆర్ఆర్ గార్డెన్లో ‘సేవా అభినందన’ అవా ర్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్క్లబ్ మంచిర్యాల శాఖ అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి, కార్యదర్శి సుధాకర్రెడ్డి, కోశాధికారి రామస్వామి, సురేందర్, బాలాజీ, మధుసూధన్రెడ్డి, ఇరుకుళ్ల ఆనంద్, హన్మంతరావు, రామాంజనేయులు, వినయ్కుమార్, శ్యాంసుందర్రావు, సుగుణాకర్రెడ్డి, కాసిపేట మండలంలోని దేవా పూర్కు చెందిన గొంది వెంకట రమణకు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు సింహరాజు కోదండరాం, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు ఎన్.వెంకటేశ్వర్రావు, దీప క్ భట్టాచార్య, ప్రస్తుత గవర్నర్లు మోర బద్రేశం, చంద్రప్రకాష్, అవార్డులు ప్రదానం చేశారు. -
పుష్కరాల నాటికి బాసర ముస్తాబు
భైంసా/బాసర: తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా వచ్చే ఏడాది జూన్ 27 నుంచి నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఏడాది ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా బాసరలో శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ధికి రూ.354 కోట్లు, పుష్కర ఘాట్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతులు, అభివృద్ధి పనులకు రూ.20 కోట్లతో చేపట్టనున్న పనులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం గోదావరి నదీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. బాసరను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు భవిష్యత్తులో పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. భక్తులకు మెరుగైన వసతులు పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకా శం ఉన్నందున ఘాట్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మా ణం, మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహిళల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూంలు, మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన పుష్కర ప్రాంతా ల్లో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపులు, అంబులెన్స్లు, అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పా ర్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయాలని, అవసరమై న చోట ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, వైద్య, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,000 కోట్లతో పనులు గోదావరి పుష్కరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.1,000 కోట్లతో వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల పనులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. బాసరతోపాటు గోదావరి నదీ తీర జిల్లాల్లోని 12 ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రజాభవన్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యత, పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బాసర పుష్కర ఘాట్ల అభివృద్ధి, ఆలయ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన మ్యాపులు, ప్రతిపాదనలు, పనుల పురోగతిని మంత్రికి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ఆలయ ఈవో అంజనాదేవి, తహసీల్దార్ పవన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
పట్టు రైతులకు అవగాహన
చెన్నూర్రూరల్: మండలంలోని లంబడిపల్లిలో టసర్ పట్టు రైతులకు కకూన్ ఉత్పత్తి అనంతరం చేపట్టబోయే పోస్ట్ కకూన్ సాంకేతికతలు, విలువ ఆధారం, ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలపై సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం శాస్త్రవేత్త డాక్టర్ కె.పి కిరణ్కుమార్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సుమారు 204 మంది టసర్ పట్టు రైతులు హజరయ్యారు. ఇందులో 140 మంది మహిళ రైతులు పాల్గొనడం విశేషం. రీలింగ్ మిషన్ ద్వారా లైవ్ప్రాక్టికల్ డెమోను నిర్వహించారు. ఇందులో కకూన్లను ఉడికించే ప్రక్రియను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ పార్వతి, సర్పంచ్ నగావత్ మహేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
సామర్థ్యాలు పెంచేలా..
మంచిర్యాలఅర్బన్: జిల్లా పరిధిలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ప్రాథమిక అభ్యసన సామర్థ్యాలు (ఎఫ్ఎల్ఎన్) అంచనా వేసేందుకు నిర్వహించిన పరీక్షకు 15,092 మందికి గానూ 14,262 మంది హాజరయ్యారు. బెస్లైన్ నివేదిక ప్రకారం రెండో తరగతిలో 3.7శాతం, మూడో తరగతిలో 6.8 శాతం, నాలుగో తరగతిలో 7.2 శాతం, ఐదో తరగతిలో 11.5 శాతం విద్యార్థులు మాత్రమే పూర్తి సామర్థ్యం సాధించినట్లు బెస్లైన్ అసెస్మెంట్ రిపోర్టు ఆందోళనకరంగా ఉందని స్పష్టమవుతోంది. 2 నుంచి ఐదో తరగతి విద్యార్థులకు మాతృభాష తెలుగు, ఇంగ్లిష్, గణితం, ఉర్ధూ భాషల్లో లోపాలు ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. మాతృభాష తెలుగులోనే విద్యార్థుల సామర్థ్యాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాథమిక స్థాయిలోనే బలోపేతానికి.. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులు చదవడం, రాయడం వంటి ప్రాథమిక అంశాల్లో వెనుకబడి పోవడం భవిష్యత్ విద్యపై త్రీవ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రాథమిక పఠనం, సంఖ్యాశాస్త్ర పునాదులను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, పర్యవేక్షించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పాఠశాలల సందర్శనల ద్వారా ఉపాధ్యాయులకు బోధనా పద్ధతుల్లో సహాయం చేయడం.. మార్గదర్శకత్వాలు అందించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల్లో మెరుగైన బోధన పద్ధతులను అందుబాటులోకి తెచ్చి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచనున్నారు. విద్యా విషయక సమాచారాన్ని విశ్లేషించి జిల్లా స్థాయి నివేదికలు సిద్ధం చేయనున్నారు. ఎఫ్ఎల్ఎన్ సెల్ ఏర్పాటు ఇలా.. పాఠశాలల్లో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు, పర్యవేక్షణకు జిల్లా స్థాయి సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి చంద్రయ్య ప్రకటించారు. అర్హత, ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అకడమిక్ మెంటరింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండి ఎఫ్ఎల్ఎన్ అమలు, ఉపాధ్యాయ శిక్షణలో అనుభవం ఉ న్నవారి ప్రాధాన్యత, మార్గదర్శకాలు వెల్లడించారు.దరఖాస్తులు, ఎంపిక విధానం..అర్హత కలిగిన ఉపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు అవసరమైన వివరాలు ధృవీకరణ పత్రాలను ఈ నెల 9న సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నేరుగా సమర్పించాలి. అర్హత ఆధారంగా 1:2 నిష్పత్తిలో షార్ట్లిస్ట్ చేస్తారు. కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారులు , క్వాలిటీ కోఆర్డినేటర్లతో కూడిన ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేయనున్నారు. ఖాళీలు, అర్హతలు..ఎఫ్ఎల్ఎన్ సెల్ ఏర్పాటులో నాలుగు పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టు నిపుణులు 3, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడు 1 పోస్టు భర్తీ చేయనున్నారు. ఎల్ఎఫ్ఎల్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే హెచ్ఎంలు 56 సంవత్సరాల వయస్సు మించకుండా ఎఫ్ఎల్ఎల్ హెచ్ఎంగా కనీసం 2 సంవత్సరాల పరిపాలనా అనుభవం ఉండాలని సూచించారు. సర్వీసు అనుభవం కనీసం 10 సంవత్సరాలు ఉండాలన్నారు. ఉపాధ్యాయుల పోస్టులు 56 సంవత్సరాలు మించకుండా 5 సంవత్సరాల బోధనా అనుభవం ఉండాలని పేర్కొన్నారు. క్లస్టర్, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో రిసోర్సు పర్సన్, ట్రైనర్గా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎఫ్ఎల్ఎన్ బోధనా విధానాలపై అవగాహనతో పాటు ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం తప్పనిసరి చేశారు. పాఠశాల సందర్శించి మార్గదర్శకత్వం అందించే సామర్థ్యం (అకడమిక్ ప్యానెల్లో సభ్యుడిగా ఉండరాదు) ఉండాలి. -
కాంగ్రెస్ కార్యకర్తలకు షోకాజ్ నోటీసులు
దండేపల్లి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దండేపల్లి మండల పర్యటనలో ఫ్లెక్సీలు చించివేయడం, ఆయన కాన్వాయ్ను అడ్డుకున్న ఘటనపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆదివారం కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 10 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కోరారు. జూలై 18న ఎంపీ వంశీకృష్ణ దండేపల్లి మండలం గూడెం ప్రభు త్వ పాఠశాలలో విశాఖ చారిటబుల్ ట్రస్టు ఆ ధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసేందుకు వచ్చారు. ఎంపీ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలను, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు అనుచరులు చించివేయడంతో పాటు, ఎంపీ కాన్వాయ్ను అడ్డుకున్నారు. నోటీసులు అందుకున్న వారిలో గడ్డం త్రిమూర్తి, అక్కల వెంకటేశ్వర్లు, అంకతి శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్, లక్కాకుల సృజన్, ఆకుల దుర్గాప్రసాద్ ఉన్నారు. -
కొలవార్ తెగ సమస్యలు పరిష్కరించాలి
కోటపల్లి: కొలవార్ తెగ కులస్తుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూర్స పోచయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో కొలవార్ కులస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం మనకు అనేక హక్కులు కల్పించిందన్నారు. కొందరు చేస్తున్న దుష్ప్రచారం కారణంగా గిరిజన సంక్షేమశాఖ అధికారులు కొలవార్ తెగ విద్యార్థులు, ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకున్న కులం సర్టిఫికెట్స్ నిలిపివేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ అధ్యక్షుడు సుంకే కిష్టయ్య, కార్యదర్శి ఇగాం మారయ్య పాల్గొన్నారు. -
● 22ఏ జాబితాపై బీఆర్ఎస్, బీజేపీ నిరసనలు ● నిషేఽధిత జాబితాలో భూములను తొలగించాలని డిమాండ్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నిషేధ భూములపై రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నిరసనలతో హోరెత్తిస్తున్నా యి. ఇటీవల ప్రభుత్వ, సీలింగ్, అసైన్డ్, భూదాన్, ఇనాం, సింగరేణి, సాగునీటి, దేవాదాయ, వక్ఫ్, తదితర భూముల్ని 1908 రిజిస్ట్రేషన్ చట్టం 22ఏ సెక్షన్ కింద వేలాది ఎకరాలు నిషేధిత జాబితాలో చేరాయి. దీంతో సింగరేణి పరిధిలో ఉన్న భూముల్లో ఉన్న నివాసాలు, అసైన్డ్, లావునీ భూములు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు సైతం నిషేధిత జాబితాలో ఉన్నాయి. దీంతో వేలాది ఇళ్ల స్థలాలు, ప్లాట్లు ఈ జాబితాలో ఉండడంతో ఏళ్లుగా నివాసం ఉంటున్న వారంతా హైరానా పడుతున్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మంచిర్యాల, గర్మిళ్ళ, నస్పూర్, శ్రీరాంపూర్ శివార్లలోనే పది వేల ఇళ్లు ఉన్నాయి. బెల్లంపల్లి, రామక్రిష్ణాపూర్ తదితర పట్టణాల్లోనూ ఉన్నాయి. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మందికి గతంలో పట్టాలు ఉన్నవి సైతం నిషేధిత జాబితాలో చేరడంపై రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విమర్శలు తిప్పికొడుతున్న ఎమ్మెల్యేలు 22ఏ జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలు, ఆరోపణలను స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రి వివేక్ తిప్పికొడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ధరణి సమయంలో భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చారని సమాధానమిస్తున్నారు. పేదల భూములు, ప్రైవేటు ఆస్తులను చేర్చబోమని చెబుతున్నారు. వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ సర్కారు పనితీరుపై ప్రజల్లోకి పథకాలు తీసుకెళ్తుంటే మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న కార్యక్రమాలతో హోరెత్తుతున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాలు 22ఏపై జిల్లాలో దుమారం రేపుతోంది. -
ప్రత్యేక ప్రచారంపై అవగాహన ఏది?
మంచిర్యాలటౌన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు అందుబాటులో ఉండాలి. కానీ దీనిపై ఎలాంటి ప్రచారం కల్పించక పోవడంతో మొదటిరోజు శనివారం అంతంత మాత్రంగానే కార్యక్రమాన్ని కొనసాగించారు. సర్లో నమోదు చేసుకున్న ఓ టర్లకు వివిధ కారణాలతో నోటీసులు జారీ కావడం, వాటికి సరైన ధృవీకరణ పత్రాలను జోడించి, తిరిగి బీఎల్వోలకు అందించే కార్యక్రమం సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన నాలుగురోజుల కార్యక్రమం తూతూ మంత్రంగానే సాగనుంది. రెండుదశల్లో చేపట్టే ఈ కార్యక్రమాల్లో మొదటి దశలో ఒకరోజు వృధా అయ్యింది. -
దేశ భవిష్యత్ నిర్మించేది ఉపాధ్యాయులే
● మేయర్ ధర్ని మధుకర్ నస్పూర్: దేశ భవిష్యత్ను నిర్మించేది ఉపాధ్యాయులేనని నగర మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ట్రస్మా ఆధ్వర్యంలో సీసీసీలోని ఎంఎం గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యను అందించడ మే కాకుండా వారు ఉన్నత శిఖరాలు అధిరో హించేలా చూస్తారన్నారు. ఇంజనీర్, డాక్టర్లు గా తయారు చేస్తారన్నారు. మెడిలైఫ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల సంక్షేమాన్ని కోరుతూ వైద్య చికిత్సలో రాయితీ కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీ జ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు బత్తిని దేవన్న, మండల అధ్యక్షుడు మైదం రామకృష్ణ, కార్పొరేటర్ కోండ్ర రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. -
పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
జైపూర్: పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన సందర్భంగా శనివారం డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డితో కలిసి మండలంలోని ఇందారం నుంచి జైపూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశామన్నారు. జోడు నాగులకు ప్రత్యేక పూజలు ఇందారంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఇటీవల నూతనంగా ప్రతిష్టించిన జోడు నాగుల విగ్రహాలకు మంత్రి వివేక్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని సన్మానించారు. -
భవ్య క్షేత్రంగా బాసర
భైంసా: గోదావరి తీరాన కొలువైన జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రం ఇక కొత్తరూపు సంతరించుకోనుంది. దేశంలోనే ప్రఖ్యాతగాంచిన బాసరను భవ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఆలయానికి రూ. 354 కోట్లు, పుష్కరఘాట్లకు రూ.20 కోట్లు మొత్తం రూ.374 కోట్ల నిధులు కేటాయించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలికవసతుల కల్పన, సుందరీకరణ తదితర ప నులు చేపట్టనున్నారు. పుష్కరఘాట్ల అభివృద్ధి, పు నరుద్ధరణతో పాటు పారిశుద్ధ్యం, భద్రత, విద్యుత్ తదితర వంటివి మెరుగుపర్చనున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఉద యం 10.50 గంటలకు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. భక్తులకు మరింత సేవలుసరస్వతీ అమ్మవారి దర్శనం కోసం రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అక్షరాభ్యాసం కోసం చిన్నారులతో వచ్చే కుటుంబాలతో క్షేత్రం నిత్యం సందడిగా ఉంటుంది. రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులతో భక్తులకు మెరుగైన వసతులు అందుబా టులోకి రానున్నాయి. ఆలయ అభివృద్ధితోపాటు సుందరీకరణ జరిగితే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. స్థానికంగా వాణిజ్యం, రవాణా రంగాలకు కూడా పర్యాటకానికి ఊతం లభించనుంది. ఆలయ నమూనా చిత్రంబాసర సరస్వతీ అమ్మవారు మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆది వారం బాసర పర్యటన నేపథ్యంలో పకడ్బందీ గా ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ భవేశ్మిశ్రా అధికారులను ఆదేశించారు. బాసరలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం కలెక్టర్ పరిశీలించా రు. పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, అధికారులు, తహసీల్దార్లు, ఆలయ ఈవో అంజనాదేవి ఉన్నారు. -
పురస్కారం అందుకున్న కలెక్టర్
మంచిర్యాలఅర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విద్యాపరిపాలనలో విశిష్ట ప్రతిభా పురస్కారం–2026 అందుకున్నారు. శనివారం కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్స వ వేడుకల్లో ప్రదానం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక సంఖ్యలో విద్యార్థుల నమో దు పెంచడంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపినందుకు అవార్డు ఫర్ ఎక్స్లెన్సీ ఇన్ ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ అందజేశారు. అవార్డు అందుకున్న రాజన్నజన్నారం: మండలంలోని కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండ రాజన్న ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. కొడంగల్లో నిర్వహించిన అవా ర్డుల ప్రదానోత్సవాల్లో ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా అవార్డు అందజేశారు. రాష్ట్రస్థా యి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, మరింత ఉత్సాహంతో పాఠశాల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని రాజన్న తెలిపారు. -
● సొంత భవనం మరిచిన అధికారులు ● మార్కెట్యార్డుకు గోదాంలు కరువు
సివిల్ సప్లయ్ గోదాం శిథిలంలక్సెట్టిపేట: మండల కేంద్రంలోని పౌరసరఫరాల సముదాయ గిడ్డంగి(సివిల్ సప్లయ్ గోదాం) శిథిలావస్థకు చేరింది. 1996లో అప్పటి నిల్వలకు అనుగుణంగా రూ.7లక్షల వ్యయంతో పోలీసుస్టేషన్ సమీపంలో గోదాం భవనాన్ని నిర్మించినా వినియోగంలో లేకుండా పోయింది. భవనం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి మరుగునపడింది. ప్రస్తుతం మార్కెట్యార్డుకు చెందిన నాలుగు గోదాములను సివిల్ సప్లయ్ శాఖ అద్దెకు తీసుకుంది. వెయ్యి మెట్రిక్ టన్నుల గోదాంకు రూ.41వేలు, 600 మెట్రిక్ టన్నుల గోదాంకు రూ.21వేలు, 480 మెట్రిక్ టన్నుల గోదాములు రెండింటికి రూ.12,200 చొప్పున మొత్తంగా నెలకు రూ.74,200 అద్దె చెల్లిస్తోంది. ఈ గోదాముల్లో రేషన్ బియ్యం నిల్వ చేస్తూ ప్రతీ నెల లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాలకు సరఫరా చేస్తుంటారు. సివిల్ సప్లయ్ గోదాం కొంత స్థలంలో అమృత్ 2.0 వాటర్ ట్యాంకు నిర్మిస్తున్నారు. మరికొంత స్థలం గతంలో పట్టణ ప్రకృతి వనానికి కేటాయించారు. నిల్వలకు ఇబ్బందులు మార్కెట్యార్డుకు సంబంధించిన గోదాములు అద్దెకు ఇవ్వడంతో ధాన్యం నిల్వలకు గోదాములు కరువయ్యాయి. దీంతో ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం నిల్వలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి పాత భవనాన్ని వినియోగంలోకి తేవాలని, నూతన గోదాముల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కెట్ యార్డు గోదాములకు అద్దెకు ఇచ్చారని, సీజన్ సమయంలో ధాన్యం నిల్వలకు కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి సృజన్ తెలిపారు. -
విద్యుత్ షాక్తో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి
జన్నారం: విద్యుత్ షాక్తో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. ఈ ఘటన జన్నారంలో చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం గ్రామానికి చెందిన మహ్మద్ వలియోద్దీన్ (45) ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం కాలనీలోని ఓ ఇంట్లో కరెంట్ మోటారుకు వైరు బిగిస్తున్నాడు. ఈక్రమంలో విద్యుత్ సరఫరా కావడంతో షాక్ గురై ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు సీపీఆర్ చేసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబీకులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఉదయ్కిరణ్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట ఆసుపత్రికి తరలించారు. రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి గుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44పై మన్నూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం..మన్నూర్ గ్రామానికి చెందిన కేంద్రే విజయ్ (23) శనివారం రాత్రి దాబాలో భోజనం చేసి బైక్పై తిరిగివస్తున్నాడు. మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్సులో రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
సర్దుబాటుకు గ్రహపాటు
మంచిర్యాలఅర్బన్: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా విద్యాశాఖ సర్ప్లస్ (అదనపు) ఉపాధ్యాయులను గుర్తించి టీచర్లు అవసరం ఉన్న బడులకు వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఆదేశాలు జారీ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. పాత పాఠశాలల్లో పనిభారం తక్కువగా ఉండటంతో ఉపాధ్యాయులు తమ అనుకూల వాతావారణం (కంపోర్ట్జోన్) దాటి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. కొత్త ప్రాంతాలకు, దూరప్రాంత పాఠశాలలకు వెళ్లకుండా రకరకాల సాకులు చెబుతూ విధుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థుల అవసరాలను బట్టి సర్ధుబాటు చేస్తూ ఆర్డర్లు జారీ చేసినా ఉపాధ్యాయులు పాతబడులు వీడకపోవటం చర్చానీయాంశంగా మారింది. పాత చోటే తిష్ట.. విద్యాశాఖ చేపట్టిన సర్దుబాటు ఉపాధ్యాయుల వైఖరితో విఫలమవుతోంది. జిల్లాలో 113 మందిని బదిలీ చేయగా తమ కంపోర్జ్ జోన్ వదిలి కేటాయించిన కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరింది దాదాపు 72 మంది టీచర్లు మాత్రమే. మందమర్రిలో ఎంఈవో తప్పిదం.. చెన్నూర్లో జూనియర్, సీనియర్ వివాదంతో రిలీవ్ పెండింగ్లో ఉంచారు. మిగిలిన టీచర్లు కొత్త ప్రాంతాలకు వెళ్లకుండా రకరకాల వంకలు చెబుతూ పాతబడుల్లోనే కాలయాపన చేస్తున్నారు. విద్యాశాఖ ఆర్డర్ల ప్రకారం కారణం ఏదైనా ఒకటి రెండు రోజుల్లోనే పాత బడుల్లో రిలీవ్ అయి కొత్త బడుల్లో చేరిన తర్వాత మళ్లీ పాత బడుల్లోకి రావటానికి అవకాశం ఉంటుందనేది టీచర్లకు తెలియంది కాదు. రోజులు గడుస్తున్నా విధుల్లో చేరని టీచర్లపై ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తుందా..? చర్యలు తీసుకుంటుందా? అనేది తెలియాల్సి ఉంది.జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో సర్దుబాటు చేసే రోజుకు 55 మంది విద్యార్థులున్నారు. అదే మండలంలోని యూపీఎస్లో 103 మంది విద్యార్థులు ఉండగా మరో టీచరు అవసరంతో కొత్త పాఠశాలకు బదిలీ చేశారు. ఆ టీచర్ను వెనువెంటనే కాంప్లెక్స్ హెచ్ఎం రిలీవ్ చేయగా ఎంఈవో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కొత్త బడిలో చేరాల్సిన టీచర్ కంఫర్ట్గా లేదనుకుందో.. పాత బడుల్లో అడ్మిషన్లు పెరిగాయనో.. ఏదో ఒక సాకు చూపి పాత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ విద్యాశాఖ ఆదేశాలు బుట్టదాఖలు చేశారు. -
ఇన్స్టాంట్ ప్రచారం!
సాక్షి, మంచిర్యాలడెస్క్: జెన్జీ.. జెన్ ఆల్ఫా ఎవరైనా కావొచ్చు.. అందరి చేతుల్లోనూ సెల్ఫోన్ ఆరో వేలుగా మారింది. యువత సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ తమ అభిప్రాయాలు, సలహాలనూ పంచుకుంటోంది. ఇటీవల కాలంలో ఇన్స్ట్రాగాం వినియోగం విపరీతంగా పెరిగింది. అందుకే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత ఖాతాల ద్వారా నియోజకవర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇన్స్ట్రాగాంను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని కలిసినా క్షణాల్లో తమ ఖాతాల్లో పోస్టు చేయిస్తున్నారు. ప్రత్యేక సిబ్బందిఇన్స్ట్రాగాంతోపాటు ఇతర సామాజిక మాధ్యమాల నిర్వహణకు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తదితర పార్టీల నాయకులూ భారీసంఖ్యలోనే ఉ న్నారు. అందరూ సోషల్మీడియా ఖాతాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరిలో చాలామంది సోషల్ మీడియాపై అవగాహన ఉన్నవారితో ఖా తాలు నిర్వహిస్తున్నారు. పర్యటనల్లో రాజకీయ కా ర్యక్రమాలు చిత్రీకరణకు ఫొటో, వీడియోగ్రాఫర్లు వెంటే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఆయా కార్యక్రమాలు, ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు. వ్యాపారంలోనూ..వ్యాపారం ఏదైనా సరే విభిన్నమైన ప్రచారం చేస్తే ఆకట్టుకోవచ్చు. అందుకే చాలామంది వ్యాపారులు తమ వస్తువులకు సంబంధించిన వివరాలతో వీడియోలు చేస్తూ ఇన్స్ట్రాగామ్లో అప్లోడ్ చేస్తున్నారు. పలు సందర్భాల్లో ఆఫర్లు ప్రకటిస్తూ వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.పదివేలలోపు..ఇన్స్ట్రాగాంలో ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులను ప్రజలు భారీ సంఖ్యలోనే అనుసరిస్తున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావును 10వేలలోపు మంది ఫాలో అవుతున్నారు. ఇన్స్ట్రాగాంలో ఫాలోవర్లతో టాప్ 10లో ఉన్నవారు పేరు ఫాలోవర్లు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ 86,000 ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ 56,500 ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, నిర్మల్ 46,500 మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి 39,600 ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బోథ్ 32,900 పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ 25,400 మాజీ మంత్రి జోగు రామన్న 22,400 ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు, మంచిర్యాల 21,400 ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ 19,400 ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఖానాపూర్ 11,700ఇది జెన్జీ యుగం. సాంకేతిక పరిజ్ఞానా న్ని ఒడిసిపట్టుకుని వినియోగించుకోకపోతే కా లం చెల్లినవారవుతారు(అవుట్డేట్). ఇప్పుడు యువత ఇన్స్ట్రాగాంలో హల్చల్ చేస్తోంది. మనం కూడా ఆ బాట పట్టాలి. ఇన్స్ట్రాగాం ఖాతాలు తెరిచి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయాలి. – ఇదీ ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం -
విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలి
మంచిర్యాలటౌన్: జిల్లా మంత్రి వివేక్కు దమ్ముంటే విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, యూత్ డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు, విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా నుంచి వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు స్కూటీలు ఇప్పించాలని, మెగా డీఎస్సీ వేయించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు బెంజ్ కారు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు, ప్రజాప్రతినిధులు, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. -
భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
నెన్నెల: కట్టుకున్న భార్యను హత్యచేసిన భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శనివారం బెల్లంపల్లిలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ కేసు వివరాలు వెల్లడించారు. నెన్నెలలోని కాపువాడకు చెందిన తోట సబిత, తోట మల్లేశ్ భార్యాభర్తలు. భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతూ వేధించేవాడు. ఈ క్రమంలో ఈనెల 2న సబితను హత్య చేసి పరారయ్యాడు. గతంలో రెండుసార్లు హత్యకు యత్నించినట్లు విచారణలో వెల్లడైంది. ఘటన అనంతరం దుస్తులు మార్చుకుని పరారైన మల్లేశ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పక్కా సమాచారంతో శనివారం సాయంత్రం తాళ్లగురిజాల వై జంక్షన్ వద్ద అదుపులో తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. నెన్నెల ఎస్సై జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు. తల్లి కాటికి.. తండి జైలుకు..తల్లి కాటికి.. తండ్రి జైలుకు వెళ్లడంతో పిల్లలు ఒంటరి వారయ్యారు. తాతయ్య, అమ్మమ్మ సంరక్షణ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పెద్ద మనుషులకే ఒకరు సాయం చేసే స్థితిలో ఉండగా ఈ పిల్లల భారం వారిపై పడింది. అమ్మప్రేమకు దూర మై నాన్న జైలు పాలు కావడంతో తమను ఎవరు చూసుకుంటారో తెలియని అయోమయంలో పిల్ల ల బాల్యం మిగిలిపోయింది. వారి చదువుపై తల్లికి ఎంతో శ్రద్ధ ఉండేదని అమ్మమ్మ, తాతయ్య తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చిన పిల్లలను బాగా చదివించాలనేది ఆమె కోరిక నెరవేరకుండానే కన్నుమూసిందని పేర్కొన్నారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
బాసర: కుటుంబ సమస్యలతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను నిర్మల్ జిల్లా బాసర పోలీసులు కాపాడి కుటుంబ సభ్యుల కు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. సికింద్రాబాద్లోని అల్వాల్కు చెందిన షేన్ సవిత(30) కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహ త్య చేసుకోవాలని శనివారం మధ్యాహ్నం 3.30గంటలకు బాసర గోదావరి నదిలో దూకింది. నీటిలో తు అక్కడ తక్కువ ఉండగా.. అక్కడే విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది గుర్తించి రక్షించారు. బాసర పోలీ సుస్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించి ఆమె సోదరుడు దాడెల్ల రాజేశ్కు అప్పగించినట్లు ఎస్హెచ్వో దీపక్ తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో సిగరెట్ షాప్లో చోరీకి పాల్పడిన రాజస్థాన్కు చెందిన నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో శనివారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్లోని పాలి జిల్లా కై తారానికి చెందిన కుమావత్ గుందారం, కుమావత్ ఘన్శ్యామ్, కుమావత్ మాణిక్చంద్, కుమావత్ లక్ష్మణ్, హైదరాబాద్లోని పటాన్చెరు బండ్లగూడకు చెందిన తేజ్పాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఆదిలాబాద్లోని అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో సిగరెట్ షాప్ వద్ద రెక్కీ నిర్వహించారు. ఇటీవల రాత్రి సమయంలో గడ్డపారతో షాప్ తాళాలు పగులగొట్టి లోపల వివిధ రకాల సిగరెట్ బాక్సులతోపాటు కౌంటర్లోని నగదు చోరీ చేశారు. హైదరాబాద్లోని పఠాన్చెరులో వారికి పరిచయమైన వ్యక్తికి విక్రయించేందుకు ప్రయత్నించారు. వీటి విలువ సుమారు రూ.5.35 లక్షలు ఉంటుంది. కొంత మొత్తానికి సిగరెట్ బాక్సులు విక్రయించి, వచ్చిన నగదును నలుగురు పంచుకున్నారు. మిగిలినవి విక్రయించేందుకు, ఆదిలాబాద్లో మరో చోరీకి పాల్పడే ఉద్దేశంతో తిరిగివచ్చారు. వాటిని విక్రయిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకుంటుండగా పారిపోవడానికి ప్రయత్నించారు. వెంబడించి అదుపులో తీసుకుని విచారించగా, చోరీ చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి 27 అమెరికన్ సిగరేట్ బాక్స్లు, 10 కింగ్ సైజ్, లైట్ 11, స్మాల్ గోల్డ్ 14, బ్రిస్టల్14, ఒకటి క్లాసిక్ రెడ్, ఓల్డ్ అడిషన్ 21, రెండు ఐస్ బస్ట్, కనెక్ట్ సిగరేట్ ఒక బాక్స్తో పాటు రూ.60వేల నగదు, చోరీకి వినియోగించిన మారుతీ కారుతోపాటు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, వన్టౌన్ సీఐ సునీల్కుమార్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి విక్రేత అరెస్ట్
వాంకిడి: మహారాష్ట్రకు చెందిన గంజాయి విక్రేతను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వేణుగోపాల్ తెలిపారు. శనివారం పోలీ సుస్టేషన్ ఎస్సై మహేందర్తో కలిసి వివరా లు వెల్లడించారు. మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారని సమాచారంతో శనివారం పోలీసులు తనిఖీ చేపట్టారు. గోయెగాంలో ఇండియన్ దాబా సమీపంలో పోలీసులను చూసి మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా బల్లార్పూర్కు చెందిన అజిత్ భయ్యాలాల్ పారిపోయేందుకు యత్నించారు. వారు వెంబడించి అదుపులో తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా సుమారు రూ.60 వేలు విలువ గల 2.4 కిలోల ఎండు గంజాయి లభించింది. విచారణలో నిందితుడితో పాటు అతని కుమారుడు వికాస్ పూరి గత రెండేళ్ల నుంచి బల్లార్షాకు చెందిన షేర్ఖాన్, జావిద్, మాజిద్ నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రతోపాటు వాంకిడి, ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
యువతను గంజాయికి బానిస చేస్తే ఊరుకోం
మంచిర్యాలటౌన్: మంచిర్యాలలో గంజాయి బ్యాచ్లు యువతను గంజాయి, మందుకు బానిసగా చేస్తున్నారని, అలాంటి వారికి మద్దతు ఇచ్చేవారు వారి ఆలోచనను మార్చుకోవాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు హితవు పలికారు. యువతకు గంజాయి, మందు తాగించి పిల్లల జీవితాలను నాశనం చేసే వారిని క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన చేపట్టి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా శనివారం మంచిర్యాలలోని ఆయన నివాసం నుంచి ఐబీ చౌరస్తా వరకు మోటార్సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూండాయిజం, రౌడీయిజంతో రాజకీయాలు చేయలేరని, అలాంటి వారికి మద్దుతు ఇచ్చేవారు ఆలోచన చేసుకోవాలని అన్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన తాను ఈ ప్రాంత రుణం తీర్చుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఐదారుగురు పోయినంత మాత్రాన తనకు ఒరిగేదేమీ లేదని, ఉమ్మడి జిల్లాను కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మార్చానని తెలిపారు. దండేపల్లి మండలం తాళ్లపేట్ నుంచి నస్పూర్లోని అరుణక్కనగర్ వరకు 22ఏపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మంచిర్యాల నియోజకవర్గంలో ఒక్క ఇళ్లు, ఒక్క ప్లాటు, గజం భూమి పోకుండా చూసే బాధ్యత తనదని, అవసరమైతే రాజీనామాకూ వెనుకాడనని తెలిపారు. వెయ్యి రోజుల పాలనలో గుడిపేటకు ఇంటర్నేషనల్ ఫిష్పాండ్, లక్సెట్టిపేట స్కూల్, కాలేజీ, ఆసుపత్రి నిర్మించి, లక్సెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల రాష్ట్రంలోనే నంబర్వన్గా నిలిచేలా చేశామని అన్నారు. అనంతరం సీసీసీ నస్పూరులోని రాజీవ్గాంధీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేశ్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. -
జామిడిలో మద్యనిషేధం
తాంసి: మండలంలోని జామిడి గ్రామంలో గ్రామస్తులు శనివారం మద్యనిషేధం కోసం నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ అశోక్ అధ్యక్షతన గ్రామస్తులు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మద్యంతో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతాయని, యువ త చెడుదారి పట్టకుండా మద్యనిషేధం సోమవారం నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైన నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామస్తులు, మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. మద్య నిషేధం తీర్మానం చేస్తున్న గ్రామస్తులు -
గుడిసె లేని నియోజకవర్గమే లక్ష్యం
చెన్నూర్: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ లకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, గుడిసె లేని నియోజకవర్గంగా మార్చడమే నా ముందు న్న లక్ష్యమని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గత ప్రభుత్వం సింగరేణిని గనులను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి జీవో విడుదలయ్యే విధంగా కృషి చేశామన్నారు. రామకృష్ణాపూర్లోని ఓసీపీకి ఫారెస్ట్ క్లియరెన్స్ మంజూరు చేయించి 5 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. 1200 మెగా ప వర్ ప్లాంట్ తీసుకురావడంతో యువతకు మరో 5 వేల ఉద్యోగ అవకాశాలు లభించా యన్నారు. టామ్కామ్లో ఉద్యోగాలు కల్పించేందుకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, సాంకేతిక శిక్షణ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత 50 వేల ఉద్యోగాల కల్పనే మిగిలి ఉందన్నారు. వెయ్యి రోజుల పాలన సందర్భంగా శనివారం మంత్రి ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సాక్షి: ఎన్నికల సమయంలో మీరిచ్చిన హామీలు? నెరవేర్చినవి?మంత్రి: కాళేశ్వరం ముంపు బాధితులకు భరోసా, తాగునీరు, వైద్యం, రోడ్ల నిర్మాణాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చాం. ఎన్నికల్లో గెలిచిన మూడు నెలల్లోనే కాళేశ్వరం ముంపు బాధితులకు రూ.32 కోట్ల పరిహారం ఇప్పించాం. రూ.100 కోట్ల నిధులతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాం. చెన్నూర్ మండలంలోని సోమనపల్లిలో రూ.200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, నియోజకవర్గంలో రూ.100 కోట్లతో ట్యాంక్ల నిర్మాణం చేపడుతున్నాం. వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. అంబేడ్కర్ చౌరస్తా నుంచి పెద్ద చెరువు రావిచెట్టు వరకు రూ.6 కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ చేపడుతున్నాం. ఇంక నెరవేర్చాల్సినవి..మంత్రి: చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నాం. యువత జపాన్ భాషాలో ప్రావీణ్యం పొందేలా శిక్షణ ఇస్తున్నాం. చెన్నూర్లో ఏటీసీ భవన నిర్మాణం చేపడుతున్నాం. యువత పోలీసు ఉద్యోగాలు సాధించేందుకు కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నూర్లో శిక్షణ ఇప్పిస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుమంత్రి: అర్హులైన ప్రతీ నిరుపేదకు మధ్యవర్తిత్వం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. నియోజకవర్గంలో మొదటి విడతలో 2,500, రెండో విడతలో 2,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించాం. మైనార్టీ మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి మిషన్లు పంపిణీ చేశాం. రాబోయే పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపడుతున్నాం. ఆగస్త్యా గుండాన్ని టూరిస్ట్ స్పాట్గా ఏర్పాటు చేసేందుకు రూ.17 కోట్లు నిధులు కేటాయించాం. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. ప్రజలకు మీరిచ్చే భరోసామంత్రి: ప్రజలకు నిష్పక్షపాతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. చెన్నూర్ నియోజకవర్గంలో నిరుపేదలు వైద్య, విద్య, రవాణా సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ మూడింటిపై ప్రత్యేక దృష్టి సారించాం. పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి రూ.3.50 కోట్ల నిధులు మంజూరు చేయించాం. చెన్నూర్, కోటపల్లి, భీమారం మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం వంద పడకల ఆస్పత్రి త్వరలోనే అందుబాటులోకి తేస్తాం. ‘సమస్య మీది, పరిష్కారం నాది’ అనే విధంగా ప్రతీ వ్యక్తి సమస్య తెలుసుకుని పరిష్కరించేందుకు ఓపెన్ బాక్స్ ఏర్పాటు చేశా. ప్రజలు అందులో ఫిర్యాదులు వేస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తా. -
చోరీలకు పాల్పడిన నిందితుడి అరెస్టు
నిర్మల్టౌన్: చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బాగులవాడకు చెందిన మారేపెద్ది రాజశేఖర్, గడ్చంద రాజేశ్వర్, నిర్మల్రూరల్ మండలం చిట్యాలకు చెందిన కల్గద్దవార్ శ్రీకాంత్, హైదరాబాద్లోని హల్దియాబాద్కు చెందిన సారా సాయికిరణ్ పరస్పరం పరిచయంతో ఒక్కటయ్యారు. స్నేహం కాస్తా చోరీలకు దారితీసింది. కలిసి ఇళ్లు, దుకాణాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. వరుస చోరీలపై టైగర్స్ టాస్క్ఫోర్స్ ప్రత్యేక దృష్టిపెట్టింది. సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలను గుర్తించింది. మారేపెద్ది రాజశేఖర్, గడ్చంద రాజేశ్వర్, కల్గద్దవార్ శ్రీకాంత్ను గతనెల 17న పట్టుకుంది. పరారీలో ఉన్న సాయికిరణ్ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విచారించగా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, గన్నవరం పోలీస్స్టేషన్న్పరిధిలో చోరీలు చేసినట్లు అంగీకరించారు. జిల్లాలో నమోదైన 25 చోరీ కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు తేలింది. 16 కేసులకు సంబంధించిన చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. 12 కిలోల వెండి ఆభరణాలు, రూ.67 వేల నగదు, నిస్సాన్మాగ్నైట్ కారు, మెల్టింగ్ మెషిన్న్, గ్యాస్ పైప్ మెషిన్న్ స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు కృష్ణ, సమ్మయ్య, ఎస్సైలు లింబాద్రి, గణేశ్, శ్రీకాంత్, అశోక్, ఎస్.కె.గఫార్, హెడ్కానిస్టేబుల్ జగన్సింగ్, పీసీలు తిరుపతి, సతీశ్ తదితరులను ఎస్పీ అభినందించారు. ఆలయాలే టార్గెట్..పట్టణంలోని దివ్యనగర్, బంగల్పేట్, శాస్త్రినగర్, సారంగాపూర్ మండలం వంజర, ఆలూర్, నిర్మల్ రూరల్ మండలం కౌట్ల–కె, లోకేశ్వరం మండలం కిష్టాపూర్, మామడ మండలం, లక్ష్మణచాంద మండలం వడ్యాల్లోని ఆలయాల్లో జరిగిన చోరీలో నిందితుల ప్రమేయం ఉంది. వీటితోపాటు ఇందిరానగర్, ప్రియదర్శినినగర్, శాస్త్రినగర్, ఏఎన్న్రెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో జరిగిన హౌస్ బ్రేకింగ్ కేసుల్లోనూ వీరి పాత్ర ఉన్నట్లు తేలింది. -
విద్యాప్రమాణాలు పెంచాలి
ఉట్నూర్రూరల్: ఉపాధ్యాయులు స్వీయప్రేరణతో విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంచాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఉట్నూర్లోని కేబీ కాంప్లెక్స్ పీఎంఆర్సీ భవనంలో శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో 133 ఆశ్రమ పాఠశాలలు, 900 పైచిలుకు ప్రాథమిక పాఠశాలలు, గురుకులా లు, ఈఎంఆర్ఎస్లో తొలిసారిగా ఎఫ్ఎల్ఎన్ అ మలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు సులభపద్ధతిలో పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు. ఏపీవో భాస్కర్, డిప్యూటీ డీఈవో చందన్, గిరిజన క్రీడా అధికారి పార్థసారథి, డీటీడీవోలు, హెచ్ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రవేశాలు పెంచి.. ఉత్తముడుగా నిలిచి..
జన్నారం: ఉపాధ్యాయుల సమష్టి కృషి, ఉత్తమ ఫలితాలు, అత్యధిక విద్యార్థుల చేరిక వీటి ఫలితంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుని గా ఎంపికయ్యారు. పట్టుదల, సాధించాలనే తపన, ఉపాధ్యాయుల సమష్టి కృషి ఫలితంగా ఆ బడికి రాష్ట్రస్థాయిలో పేరు వచ్చింది. జన్నారం మండలం కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్న త పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండ రాజన్న రాష్ట్ర గెజిటెట్ ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా ఎంపికై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్నారు. కిష్టాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 2023లో ప్రధానోపాధ్యాయునిగా చేరిన రాజన్న విద్యార్థులను చదువులో ప్రోత్సహించడంతో మూడేళ్లుగా పదోతరగతి ఫలితాల్లో జిల్లా స్థాయిలో మొదటిస్థానం సాధించారు. జాతీయ ఉపకార వేతనాల సాధనలోనూ ఈ పా ఠశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ విద్యాసంవత్సరం అత్యధికగా 200మంది విద్యార్థులకు పాఠశాలలో ప్రవేశాలు కల్పించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు సాధించింది. కి ష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫలితాల ఆధారంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రధానోధ్యాయునిగా రాజన్నను ఎంపిక చేశారు. ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని, విద్యాభివృద్ధికి మరింత కృషి చేస్తానని రాజన్న తెలిపారు. ఆకట్టుకునేలా పాఠం.. అవార్డు సొంతంమందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూ ల్లో సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న నూగూరి అనుపమ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, విద్యార్థులను ఆకట్టుకునే బోధన తదితర అంశాల్లో అనుపమ ప్రత్యేక గుర్తింపు పొందారు. నేడు కొడంగల్లో నిర్వహించనున్న కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోనున్నారు. సింగరేణి హైస్కూల్లో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు అనుపమ ఉత్తమ టీచర్గా ఎంపిక కావడంపై ఏరియా జీఎం రాధాకృష్ణ, డీసీఎం (పర్సనల్) అశోక్, హైస్కూల్ హెచ్ఎం పురుషోత్తం, పాఠశాల ఉపాధ్యాయయులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. -
ఆధ్యాత్మిక కారిడార్
ఆచూకీ లేని భైంసా: చదువుల తల్లి కొలువైన బాసర.. ప్రకృతి అందాల సహస్రకుండ్.. రేణుకామాత, దత్తాత్రేయ క్షేత్రాలతో ప్రసిద్ధి చెందిన మాహోర్.. ఈ మూడు ప్రాంతాలను కలుపుతూ ఆధ్యాత్మిక– పర్యాటక కారిడార్ చేపట్టాలని డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. తెలంగాణలోని బాసర నుంచి మహారాష్ట్రలోని మాహోర్ వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బాసర నుంచి సహస్రకుండ్ జలపాతం వరకు సుమారు 76 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి మాహోర్ వరకు 97 కిలోమీటర్లు ఉండగా మొత్తంగా సుమారు 173 కిలోమీటర్ల మార్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తే తెలంగాణ –మహారాష్ట్ర మధ్య కీలకమైన ఆధ్యాత్మిక –పర్యాటక మార్గంగా ఈ రహదారి మారే అవకాశం ఉంది. ప్రమాదాల మార్గం..ప్రస్తుతం ఈ మూడు ప్రాంతాల్లోని ఘాట్ రహదారులు, మలుపులు, రోడ్డు పరిస్థితులు ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతున్నాయి. సోమవారం మాహోర్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న కుభీర్ మండలం పార్డీ (బి) గ్రామానికి చెందిన నలుగురు జీపు ప్రమాదంలో మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది. గతంలో భైంసా మండలం సుంక్లి గ్రామానికి చెందిన ముగ్గురు మాహోర్ నుంచి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈక్రమంలో ఆధ్యాత్మిక –పర్యాటక కారిడార్ నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బాసర –సహస్రకుండ్ –మాహోర్ను ఒకే పర్యాటక సర్క్యూట్గా అభివృద్ధి చేస్తే మూడు ప్రాంతాలకూ ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటికే బాసర నుంచి భైంసా వరకు జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. ఇక భైంసా నుంచి మహారాష్ట్ర వైపు రహదారి అనుసంధానాన్ని కొనసాగిస్తూ మాహోర్ దిశగా నిర్మాణం చేపడితే ఈ ప్రాంలాల ముఖచిత్రం మారిపోతుంది. ప్రస్తుతం ఉన్న రహదారులను విస్తరించడం, అవసరమైన చోట కొత్త మార్గాలు నిర్మించడం, ఘాట్ ప్రాంతాల్లో రక్షణ గోడలు, క్రాష్ బ్యారియర్లు, హెచ్చరిక బోర్డులు, పార్కింగ్, అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ప్రయాణం సురక్షితంగా మారుతుంది. భక్తులకు ఉపయోగకరం..నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి తీరాన కొలువైన శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం విద్యారంభం, అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలోని మాహోర్ రేణుకాదేవి ఆలయం, దత్తాత్రేయ క్షేత్రంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగి ఉంది. రేణుకాదేవి ఆలయాన్ని ప్రముఖ శక్తి పీఠాల్లో ఒకటిగా మహారాష్ట్ర పర్యాటక శాఖ పేర్కొంటోంది. వీటి మధ్యలోని సహస్రకుండ్ జలపాతం వర్షాకాలంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మిస్తే భక్తులు ఒకే ప్రయాణంలో ప్రకృతి అందాలు– ఆధ్యాత్మిక అనుభూతి పొందుతారని పలువురు పేర్కొంటున్నారు. కేంద్ర మంత్రి దృష్టికి..బాసర–భైంసా జాతీయ రహదారిని మహా రాష్ట్ర వైపు విస్తరించి మాహోర్తో అనుసంధా నం చేయాలనే అంశాన్ని ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ పలుమార్లు కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు అందజేశారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కేంద్రానికి సమగ్ర ప్రతిపాదన పంపి తే ఈ మార్గం రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఈ రహదారి నిర్మాణం కేవలం ప్రయాణ సౌకర్యం కోసం చేపట్టే ప్రాజెక్టుగా కాకుండా, రెండు రాష్ట్రాల మధ్య భక్తి, పర్యాటకం, వ్యా పారం, సాంస్కృతిక సంబంధాలను బలోపే తం చేసే మార్గంగా మారుతుంది. -
గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్
రెబ్బెన: మహారాష్ట్రలోని బల్లార్షాలో గంజాయి కొనుగోలు చేసి రెబ్బెనలో విక్రయించేందుకు తీసుకొస్తు న్న వ్యక్తులను గురువారం పట్టుకుని రిమాండ్కు తరలించారు. మండల కేంద్రంలోని సీఐ కార్యాలయంలో శుక్రవారం సీఐ సంజయ్ వివరాలు వెల్ల డించారు. ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రెబ్బెన బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు పో లీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద తనిఖీ చేయగా 130 గ్రాముల గంజాయి లభ్యమైంది. నిందితులు రెబ్బెన మండలం జక్కులపెల్లికి చెందిన దాగం సందీప్, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు చెందిన కొండగుర్ల రాజేంద్రప్రసాద్గా గుర్తించారు. నింది తులు జక్కులపెల్లికి చెందిన దుర్గం అభినేష్ అలి యాస్ చింటూతో కలిసి గురువారం మహారాష్ట్రకు వెళ్లి అక్కడ అజిత్ వికాస్ వద్ద 130 గ్రాముల గంజాయిని రూ.7వేలకు కొనుగోలు చేశారు. దాన్ని గంజాయి సేవించే అలవాటు ఉన్న రెబ్బెన మండలం జక్కులపల్లికి చెందిన పబ్బతి అనిల్, మేడి అంజయ్యతో పాటు మరికొంత మందికి విక్రయించేందుకు తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై వెంకటకృష్ణ, సిబ్బంది రవికుమార్, పీసీ నౌషద్లు ఉన్నారు. -
పశువులు తరలిస్తున్న వాహనాలు పట్టివేత
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని టోల్ప్లాజా వద్ద టాస్క్ఫోర్స్ ఏసీ పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు వాహనాలను సీజ్ చేశారు. ఆ వాహనాల్లో 13 ఆవులు, 17 దూడలు ఉండడంతో వాహనాలు నడుపుతున్న నక్క రాజ్కుమార్, షేక్ అహ్మద్, సుకే కుమార్, సహాయకులు షేక్ షఫి, షేక్ షాహీద్, ఓరగంటి రాజ్కుమార్, తాండ్ర శ్రీనివాస్లను అదుపులోకి తీసుకొని మొబైల్ ఫోన్లు స్వాధీ నం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ పశువులను ఆసిఫాబాద్ జిల్లా కౌటాల నుంచి జగి త్యాల జిల్లా రాజారాంపల్లె మార్కెట్కు అక్రమంగా తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు ఫుల్
మంచిర్యాలఅర్బన్: విద్యారంగంలో విశేష సేవలందించిన కలెక్టర్తోపాటు జిల్లాకు చెందిన మరో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు వరించాయి. కలెక్టర్ కుమార్ దీపక్ను విద్యాపరిపాలనలో ప్రతిభా పురస్కారం (అవార్డు ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్)కు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అలాగే, జ న్నారం మండలం కిష్టాపూర్ ప్రభు త్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండ రాజన్న రాష్ట్ర గె జిటెట్ ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా, మందమర్రి సింగరేణి పాఠశాలలో బోధిస్తున్న నూ గూరి అనుపమ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యా రు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ శాతాన్ని అత్యధికంగా పెంచడానికి విశే ష కృషి చేసినందుకు కలెక్టర్కు ఈ అవార్డు వరించింది. ఈ నెల 5న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో వీరంతా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు. విద్యార్థుల నమోదుకు కలెక్టర్ కృషి విద్యార్థుల ఎన్రోల్మెంట్లో జిల్లా రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. యూడైస్ 2026–27 గణాంకాల ప్రకారం జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో అత్యధికంగా నమోదు పూర్తి చేసింది. జిల్లాలో 2026–27 విద్యాసంవత్సరానికి 47,379 మంది విద్యార్థుల నమోదు లక్ష్యానికి గాను 45,598 మందిని నమోదు చేసుకుని ముందువరుసలో నిలి చింది. ఇంకా 1,781 మందిని (3,76శాతం) మాత్రమే నమోదు చేయాల్సి ఉంది. 2025–26 విద్యావిద్యాసంవత్సరంతో పోలిస్తే అదనంగా 10శాతం నమోదును సాధించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించగా 96.33శాతం నమోదు సాధించి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2025–26 విద్యాసంవత్సరంతో పోలిస్తే 2026–27లో 2,554 మంది అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, బోధన, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్ తదితర వసతులు కల్పించడంతో ఈ విద్యాసంవత్సరంలో 4,346 మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి సర్కారు బడుల్లో చేరారు. జిల్లాలో 282 ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యాసంవత్సరంతో పోలిస్తే 10శాతానికి పైగా అదనపు విద్యార్థుల నమోదు సాధించారు. కలెక్టర్ కుమార్దీపక్కు విద్యాపరిపాలన విశిష్ట పురస్కారం లభించటం జిల్లా ప్రజలు, విద్యాశాఖకు విద్యారంగలో ఉన్న ప్రతీ ఒక్కరికి గర్వకారణమని జిల్లా విద్యాశాఖ పేర్కొంది. కలెక్టర్ దూరదృష్టి సమర్థవంతమైన నాయకత్వం, జిల్లా విద్యాశాఖాధికారి సమన్వయం, విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఐఎస్ సీసీవో, సీఆర్పీల సమష్టి కృషికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలిపింది.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఇలా..విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య 2024–25 41,349 2025–26 43,072 2026–27 45,626 -
పట్టుచీరపై తెలుగు వైభవం
బాసర: తెలుగు భాష గొప్పతనాన్ని చేనేత కళతో మేళవిస్తూ సిరిసిల్లకు చెందిన ఓ కళాకారుడు అద్భుతమైన పట్టుచీర నేశాడు. తెలుగు భాషకు మూలమైన 56 అక్షరాలను పట్టుచీరపై అందంగా పొందుపరిచాడు. శుక్రవారం మేళతాళాల మధ్య పద్మశాలీ సంఘం సభ్యులు ఈ చీరను ఆలయానికి తీసుకొచ్చి ఈవో అంజనాదేవి, ఆలయ స్థానాచా ర్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీ పూజారి, వేద పండితుల సమక్షంలో అమ్మవారికి సమర్పించారు. 35ఏళ్ల అనుభవం..నల్ల జగదీష్ గత 35 ఏళ్లుగా చేనేత వృత్తిలో కొనసాగుతున్నారు. తన అనుభవంతో ఎన్నో వినూత్న వస్త్రాలు తయారు చేసిన ఆయన తెలుగు భాషకు సంబంధించిన 56 అక్షరాలను చేనేత చీరపై నేసి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి నల్ల పరంధాములు కూడా చేనేత రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని, ఆయన ఆశీర్వాదంతోనే తాను ఈ కళాఖండాన్ని రూపొందించినట్లు జగదీష్ తెలిపారు. తన తండ్రి కలలో సూచించినట్లుగా ఈ చీరను అమ్మవారికి సమర్పించాలనే సం కల్పంతో కుల, సత్రం ప్రతినిధుల సహకారంతో బాసర అమ్మవారికి సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ కా ర్యక్రమంలో సత్రం అధ్యక్షుడు రాపోల్ సుధాకర్, కార్యనిర్వహక అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, ప్రధా న కార్యదర్శులు రమణ విశ్వం, జెంటిల్ శ్యామ్, స్థానిక సర్పంచ్ తీగల వెంకటేశ్గౌడ్, కొక్కుల గంగాధర్, మోరే సాయిలు, ఎలగందుల శ్రీనివాస్, ఓని స్వామి, రువ్విపోశెట్టి, మేకల అశోక్, అంకం రమేశ్ తదితర గ్రామ పద్మశాలీ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. 15 రోజులు నిష్ఠతో..సిరిసిల్ల వాస్తవ్యుడు నల్ల పరంధాములు కుమారుడు నల్ల జగదీశ్ నేత తన తండ్రి ఆశయాలు, ఆశీర్వాదంతో ఈ వినూత్న చీరను తయారు చేశారు. పొడవు ఆరు మీటర్ల 30 సెంటీమీటర్లు, వెడల్పు ఒక మీటరు 25 సెంటీమీటర్లు, 650 గ్రాముల బరువున్న చీరను చేనేత మగ్గంపై 15 రోజులపాటు నిష్ఠతో నేశారు. చీర మొత్తం తెలుగు అక్షరమాలతో కళాత్మకంగా తీర్చిదిద్దడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
అర్థమయ్యేలా బోధించి.. విద్యార్థుల సంఖ్య పెంచి..
భీమారం: మండలంలోని ఆర్కెపల్లి ప్రభుత్వ పాథమిక పాఠశాలకు సర్కారు గుర్తింపు వచ్చేందుకు ప్రధానోపాధ్యాయురాలు దరిపెల్లి స్పరూప చేస్తున్న కృషి అంతా.. ఇంతా కాదు. 2024లో ఈ పాఠశాలకు స్వరూప బదిలీపై రాగా అప్పుడు బడిలో నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం వారి సంఖ్య 57కి పెరిగిందంటే స్వరూప కృషే కారణం. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా బోధిస్తుండగా తల్లిదండ్రులు పిల్లలను చేర్పించేందుకు ముందుకువస్తున్నారు. రొటీన్ పద్ధతిలో కాకుండా పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తూ కనీ స సామర్థ్యాలను పెంచేందుకు కృషి చేస్తున్నా రు. దాతల సహకారంతో పాఠశాలలో అవసరమైన సదుపాయాలు కల్పించారు. బాలల కథలు, ఆర్కెపల్లి అనే పుస్తకాన్ని ప్రచురించా రు. స్వరూప కృషిని గుర్తించి ప్రభుత్వం 2025లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది. దీంతో ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా స్వరూప పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడు తూ.. విద్యార్థులను తన సొంత పిల్లల్లాగా భా వించి బోధిస్తున్నానని తెలిపారు. భవిష్యత్లో ఆర్కెపల్లి ప్రభుత్వ పాఠశాలను జిల్లాలోనే ఆద ర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. స్పరూప ముద్రించిన బాలల కథలు పుస్తకం -
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
ఆదిలాబాద్: జి ల్లాకి చెందిన యు వ క్రీడాకారుడు అట్టం జశ్వంత్ అథ్లెటిక్స్లో ప్రతి భ చాటుతూ జా తీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. పుదుచ్చేరిలో నిర్వహించనున్న 37వ నేషనల్ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇటీవల హన్మకొండ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్ –20 బాలుర రేస్వాక్ విభాగంలో అట్టం జశ్వంత్ బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డిబోజా రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.రాజేశ్, శిక్షకులు వీజీఎస్ రాకేశ్, జ్యోతి స్వరణ్ క్రీడాకారుడిని అభినందించారు. -
సీహెచ్పీలో టిప్పర్ బోల్తా
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని సీహెచ్పీలో ప్రమాదవశాత్తు టిప్పర్ బోల్తా పడింది. శుక్రవారం ఉదయం 20 టన్నుల సామర్థ్యం ఉన్న టిప్పర్ అన్లోడింగ్ కోసం ర్యాంపు ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా టిప్పర్ బ్రేక్లు పని చేయకపోవడంతో బోల్తా పడింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఐలయ్య కిందకు దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బంకర్ వద్ద సరైన రక్షణ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య పేర్కొన్నారు. సీహెచ్పీలో డీజీఎం స్థానం భర్తీ చేయకుండా ఇన్చార్జీలతోనే వెళ్లదీస్తున్నారని, దీంతో రక్షణపై పర్యవేక్షణ లోపించి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కాలువలో పడి యువకుడి దుర్మరణం ముత్తారం: మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సాయిరాం(21) ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలో పడి శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై కథనం ప్రకారం.. సాయిరాం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలోని తమ బంధువు ఇంటికి చుట్టపుచూపుగా వచ్చాడు. పనిమీద ఖమ్మంపల్లి నుంచి హరిపురం వచ్చి మళ్లీ ఖమ్మంపల్లికి తిరిగి వెళ్తున్న క్రమంలో కేశనపల్లిలోని ఎస్సారెస్పీ కాలువ వద్ద బైక్ అదుపుతప్పి కాలువలో పడి దుర్మరణం చెందాడు. మృతుడి బంధువు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ వివరించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు.. నిర్మల్టౌన్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన జిల్లా కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చింతకుంటవాడ కాలనీకి చెందిన పోలకొండ లక్ష్మీనారాయణ వర్మ (50) శాంతినగర్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి బైక్పై తిరిగి వస్తుండగా జయశంకర్ కూడలి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే లక్ష్మీనారాయణ వర్మను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య ఉండగా, సంతానం లేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చెరువులో పడి బాలుడు.. కుభీర్: ఎల్లమ్మ చెరువులో గత నెల 10వ తేదీన ఇద్దరు చిన్నారులు ఈతకు వెళ్లి మృతిచెందిన విషయం మరవక ముందే శుక్రవారం మరో బాలుడు చెరువులో పడి మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవిదాస్ (16) శుక్రవారం ఉదయం గొర్రెలను మేపేందుకు ఎల్లమ్మ చెరువు కట్ట వద్దకు ఇతరులతో కలిసి వెళ్లాడు. మధ్యాహ్నం చెరువులో గొర్రెలు నీరు తాగుతుండగా ఒక గొర్రెపిల్ల నీటిలోకి వెళ్లింది. దానికి బయటకు తీసేందుకు నీటిలోకి వెళ్లి గుంతలో పడిపోయాడు. గమనించిన కాపరులు వెంటనే బయటకు తీయగా అప్పటికే బాలుడు మృతిచెందాడు. దేవిదాస్కు తల్లి, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తల్లి గోదావరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. కడుపు నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య బజార్హత్నూర్: కడుపునొప్పి భరించలేక యువతి కోలపురి స్రవంతి(18) ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మోర్కండి గ్రామానికి చెందిన కోలపురి గంగన్న –అడెల్లబాయిల కూతురు స్రవంతి గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. గురువారం తల్లితండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు గమనించి వెంటనే స్రవంతిని ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందింది. తండ్రి గంగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. స్రవంతి ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. -
క్రీడాకారులు కోలిండియా స్థాయిలో రాణించాలి
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా క్రీడాకారులు కో లిండియా స్థాయిలో రాణించాలని శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ప్రగతి మైదానంలో ఏరియా స్థాయి డబ్ల్యూపీఎస్, జీఏ వా ర్షిక క్రీడలు మొదలయ్యాయి. మొదటిరోజు వాలీ బాల్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఏరియా క్రీ డాకారులు గత సంవత్సరం సాధించిన పతకాల కంటే రెట్టింపు పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈసారి క్రీడా సామగ్రి కొనుగోలు కోసం ఏరి యాకు రూ.4.5 లక్షలు మంజూరు చేశామన్నారు. విన్నర్గా ఆర్కే5 గ్రూప్..వాలీబాల్ పోటీల్లో విన్నర్గా ఆర్కే 5 గ్రూప్, రన్నర్గా ఆర్కే7 గ్రూపు నిలిచిందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే.వీరభద్రయ్య, ఏరియా ఎస్ఓటు జీఎం కృష్ణప్రసాద్, డీజీఎం(పర్సనల్) ఎస్.అనిల్కుమార్, క్రీడల గౌరవ కార్యదర్శి పాల్ సృజన్, స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్, కోఆర్డినేటర్ తోట సురేశ్, కెప్టెన్లు చిన్నయ్య, ఎం.శ్రీనివాస్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ పాలనలో అంతా అవినీతే..
మంచిర్యాలక్రైం: పదేళ్ల కేసీఆర్ పాలనలో అంతా అవినీతేనని రాష్ట్ర భూగర్భ గనులశాఖ మంత్రి గ డ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. జపాన్ ప ర్యటన ముగించుకుని శుక్రవారం జిల్లాకు వచ్చిన మంత్రికి కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలి కారు. అనంతరం మంత్రి జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులోగల మంతెన జగన్మోహన్రావు నివా సంలో విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు కృషి చేయాలని సూచించారు. రూ.20వేల కోట్ల తో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేసే అవకాశమున్నా కాళేశ్వరం రీడిజైన్ పేరిట కేసీఆర్ రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన అవినీతిని కేంద్రంలోని సీబీఐ ఎంకై ్వరీతో చేయించి చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన అప్పుల్లో రెండేళ్లలో రూ.3లక్షల కోట్లు చెల్లించినట్లు తెలిపా రు. కేటీఆర్ అసమర్ధతతోనే పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైందని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే టామ్ కామ్ లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ ర్యాలీ
దండేపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ దండేపల్లి పద్మశాలీ భవన్ నుంచి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగడి బజారులో నిర్వహించిన రైతు సదస్సులో పార్టీ నాయకుడు విజిత్రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారం చేపట్టి వెయ్యి రోజులైనా ఎన్నికలకు ముందు ప్రజలు, రైతులకు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులు, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ లింగన్న, మాజీ వైస్ ఎంపీపీ అనిల్, బీఆర్ఎస్ మండలాధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, సంతోష్, మాజీ ఉపసర్పంచ్ భూమన్న తదితరులు పాల్గొన్నారు. జన్నారం: మండల కేంద్రంలోని ధర్మారం చౌరస్తా నుంచి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ‘బాకీ కార్డులు’ పంపిణీ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తోందని విమర్శించారు. హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొమిరే ఈశ్వర్బాయి, ఉట్నూర్ మాజీ జెడ్పీటీసీ చారులత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్, నాయకులు వినయ్కుమార్, ప్రసాద్నేత, ఫజల్ఖాన్, సంతోష్కుమార్, భరత్కుమార్, సత్యం, మున్వర్అలీఖాన్ తదితరులున్నారు. -
‘ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం’
రామకృష్ణాపూర్: కాంగ్రెస్ది దగా పాలన అని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనకు వెయ్యి రోజులు పూర్తయినా ఇచ్చిన హామీల్లో అనేకం అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. రామకృష్ణాపూర్లోని ఆర్కేసీవోఏ క్లబ్లో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నియోజకవర్గంలో హామీల అమలుపై మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి, నాయకులు సుదర్శన్గౌడ్, మేడిపెల్లి సంపత్, జాడి శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సిందే..
మంచిర్యాలక్రైం: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన 10వేల ఇళ్లను తొలగించేదాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో శుక్రవారం 22ఏ సమస్యపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 50ఏళ్ల క్రితం అన్ని అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్నారని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సింగరేణిలో ఉన్నవారికి 6,220 ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేయగా వాటిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ నెల 7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో 22ఏపై ప్రజల పక్షాన బీఆర్ఎస్ గళం విప్పుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం రెడ్డి కాలనీ, సింగరేణి, మార్కెట్ ఏరియా ప్రజలు 22ఏ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హరీశ్రావుకు తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల (ఆశ) సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, బాల్క సుమన్, చిన్నయ్య, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, విజిత్రావు, పుష్కర్ రామ్మోహన్, కార్పొరేటర్లు సత్తార్, పెట్టం స్వరూప లక్ష్మణ్, నాయకులు గాదె సత్యం, పల్లె భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కమీషన్ల పాలన బెల్లంపల్లి: రాష్ట్రంలో కమీషన్ల పాలన సాగుతోందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి 13వ వార్డులో కాంగ్రెస్ వె య్యిరోజుల పాలనపై బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మే రకు వంటావార్పు నిర్వహించగా హరీశ్రావు ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్రె డ్డి వెయ్యిరోజుల పాలన అస్తవ్యస్తంగా ఉందని వి మర్శించారు. కొత్తగా ఒక్కరికీ ఫింఛన్ మంజూరు చే యలేదని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ను వంచనకు గురిచేశారని ఆరోపించారు. మూడున్నర లక్షల మంది పింఛన్లు తొలగించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, సెటిల్మెంట్లు పెరిగిపోయాయని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏవీ సరిగా అమలు కావడం లేదని పే ర్కొన్నారు. కమీషన్లు వచ్చే పనులు మినహా మరే ప నులు జరగడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ శ్రే ణులు ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరా టాలు సాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం రోడ్డుపై వంటావార్పు చేపట్టి సహఫంక్తి భోజనాలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ స త్యనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల సత్తా
మంచిర్యాలక్రైం: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న అండర్–16 రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో మంచిర్యాల నుంచి పాల్గొన్న మాదవ త్రిశూల్, మహ్మద్ అద్నాన్ సత్తా చాటారు. శుక్రవారం జరిగిన మ్యాచ్లో రుషిరాజ్ టీమ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన హెచ్సీఏ డిస్ట్రిక్ట్–1 టీమ్ 160 పరుగులు చేయగా.. ఈ టీమ్ నుంచి ఆడిన త్రిశూల్, అద్నాన్ కీలమైన ఆటగాళ్లుగా సహకారం అందించారు. అద్నాన్ 33 బంతుల్లో 34 పరుగులు చేశాడు. బౌలింగ్లో త్రిశూల్ ఆరు ఓవర్లలో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. రుషిరాజ్ బ్యాటింగ్లో త్రిశూల్ బౌలింగ్ లైనప్ను కుదిపేశాడు. మంచిర్యాలకు చెందిన ఈ కుర్రాళ్లు సత్తా చాటుకున్నారు. ఈ సందర్భంగా వీరిని ఉమ్మడి జిల్లా క్రికెట్ కార్యదర్శి కోదాటి ప్రదీప్, కోచ్ కోరండ్ల ప్రదీప్ తదితరులు అభినందించారు. -
పశువులను తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
నేరడిగొండ: రోల్మామడ టోల్ప్లాజా వద్ద విధుల్లో ఉన్న సిబ్బందిపైకి వాహనాలు ఎక్కించి హత్యాయత్నానికి పాల్పడటంతో పాటు, అక్రమంగా గోవులను తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నేరడిగొండ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీస్స్టేషన్లో ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేశ్ వివరాలు వెల్ల డించారు. ఈనెల 1న నేరడిగొండ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న మహీంద్రా బొలెరో టోల్గేట్లను ఢీ కొడుతూ వేగంగా దూసుకెళ్లింది. టోల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారిని చంపాలనే ఉద్దేశంతో వాహనాన్ని వారిపైకి తీసుకెళ్లారు. వెనుక వస్తున్న కంటైనర్ లారీ కూడా డివైడర్లను ఢీకొట్టి వేగంగా పరారైంది. టోల్ప్లాజా సూపర్వైజర్ ఎంపల్లి రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా 3వ తేదీ తెల్లవారుజామున కుంటాల గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆదిలాబాద్లో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆదిలాబాద్ తాటిగూడకు చెందిన ఎండీ షఫీ ముదస్సిర్, గోపాల్ సింగ్ షెకావత్, మహారాష్ట్ర నాగ్పూర్కు చెందిన లారీ డ్రైవర్ ఫిర్దోస్ బేగ్, మహమ్మద్ హైదర్అలీ, క్షితిజ్ భీమ్రావు సేవట్కర్, యవత్మాల్కు చెందిన సందీప్ విఠల్ ముప్పిడివార్లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మహమ్మద్ మజార్, రాజు, రవి జగదీశ్ బాగ్డేల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ ప్రాంతంలో దొంగిలించిన పశువులను లారీలో నిజామాబాద్ జిల్లా సతాపూర్ వైపునకు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి 24 ఎద్దులు, 23 ఆవులు మొత్తం 47 పశువులు స్వాధీనం చేసుకున్నారు. ఊపిరాడక మూడు పశువులు మృతిచెందగా, మిగిలిన 44 పశువులను సురక్షితంగా గోశాలకు తరలించారు. వీటితో పాటు బొలెరో, కంటైనర్ లారీ, 4 గ్రాముల గంజాయి, ఐఫోన్ 16 సహా పలు సెల్ఫోన్లు, రూ.6,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి బోథ్ జ్యూడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఇచ్చోడ సీఐ రమేశ్ -
‘ఏఐటీయూసీ పోరాట ఫలితమే ప్రయోజనాలు’
కాసిపేట: ఏఐటీయూసీ పోరాట ఫలితంగా సింగరేణి కార్మికులకు పలు కీలక ప్రయోజనాలు అందాయని ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు, శాశ్వత వేజ్బోర్డు సభ్యుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శుక్రవారం మందమర్రి ఏరియా కాసిపేట –2 గనిపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్ఎల్సీ సమక్షంలో 24 డిమాండ్లపై ఒప్పందం ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే సాధించినట్లు తెలిపారు. అపరిష్కృత కార్మిక సమస్యలపై జూన్ 8న 31 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇవ్వడంతో యాజమాన్యం గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో పలు ఒ ప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. పలు ప్రధాన అంశాలపై కార్మికుల ఐక్య పోరాటాలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఏఐటీయూసీ గని ఫిట్ సెక్రెటరీ గొల్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి, సెంట్రల్ సెక్రెటరీ అక్బర్ఆలీ, బెల్లంపల్లి బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్, బ్రాంచి అసిస్టెంట్ సెక్రెటరీ తిరుపతి, బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ బియ్యాల వెంకటస్వామి, బ్రాంచి ఇన్చార్జి చిప్ప నర్సయ్య, నాయకులు మినుగు లక్ష్మీనారాయణ, నాగేశ్వర్రావు, మంతెన రమేశ్, నర్సయ్య, వెంకటే శ్, సాగర్, అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘కొండా’ బర్తరఫ్ నిర్ణయం సరికాదు
పాతమంచిర్యాల: కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం సరికాదని, సీఎం రేవంత్రెడ్డి వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సురేఖను బర్తరఫ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సమితి నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బీసీ మహిళా మంత్రికి ఒక న్యాయం, రెడ్డి నాయకులకు మరొక న్యా యమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే కొండా సురేఖ బర్తరఫ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మంచర్ల సదానందం, బీసీ సమా జ్ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్, బీసీ సమాజ్ పట్టణ నాయకుడు వెన్నంపల్లి మురళి పాల్గొన్నారు.


