క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Mar 13 2026 7:37 AM | Updated on Mar 13 2026 7:37 AM

క్లుప్తంగా ● అనుమానంతో దొంగలను పట్టుకున్న స్థానికులు

ఇంట్లో చోరీ..

కడెం: మండల కేంద్రంలో పట్టపగలే ఇంట్లో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శివానందగౌడ్‌ ఇంటికి తాళం వేసి ఉంది. గురువారం మధ్యాహ్నం ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ప్లాస్టిక్‌ డబ్బాలు ఎరుకుంటూ ఆ ఇంట్లో చొరబడ్డారు. బీరువా పగులగొట్టి బంగారం, డబ్బులు ఎత్తుకెళ్తుండగా స్థానికులు అనుమానం వచ్చి అడ్డుకున్నారు. వారి వద్ద నుంచి బంగారం చైన్‌, డబ్బులు స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని దొంగలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయమై ఎస్సై సాయికిరణ్‌ను సంప్రదించగా ముగ్గురితోపాటు, మరికొందరు ఉన్నారని, వారి గురించి విచారిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement