మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివా రం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెయి నీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ఖాన్, డీపీఆర్వో కృష్ణమూర్తి, దేవాపూర్ సిమెంట్ కంపెనీ యూనియన్ అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్రావు, తహసీల్దార్ రఫతుల్లా, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేశ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


