బెల్లంపల్లి: రైల్వేశాఖ వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టిన స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఏళ్లుగడుస్తున్నా రెగ్యులర్కు నోచుకోవడం లేదు. కాజీపేట– బల్లార్షా, పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేమార్గాల్లో పలు స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఆ మార్గాల్లో ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తున్నా రైళ్లను రెగ్యులర్ చేయడంలో రైల్వేశాఖ తీవ్ర కాలయాపన చేస్తోంది. ఈప్రాంతం నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రులు, ఎంపీలు పట్టింపులేని ధోరణిని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ద.మ రైల్వే జోన్పరిధిలో ఏళ్ల నుంచి ప్రత్యేకంగా నడుస్తున్న వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఇటీవల రెగ్యులర్ వీక్లీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నాంపల్లి (హైదరాబాద్) నుంచి కన్యాకుమారి వయా నల్లగొండ, కాచిగూడ నుంచి తూతుకుడి వయా మహబూబ్నగర్, చర్లపల్లి, నుంచి షాలిమార్ వయా కాజీపేట వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును అమృత్ భారత్గా మార్చి వచ్చే ఏప్రిల్ మొదటివారం నుంచి నడపనున్నారు. కానీ కాజీపేట–బల్లార్షా, పెద్దపల్లి–నిజామాబాద్ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లకు మాత్రం మోక్షం లభించడం లేదు.
కాజీపేట మార్గంలో నడుస్తున్న ప్రత్యేక రైళ్లు ఇవే..
వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్
బల్లార్షా మార్గంలో ప్రతీసారి నిరాశే
రైళ్లకు సంబంధించిన ప్రతీ అంశంలోనూ కాజీపేట–బల్లార్షా మార్గంలో ప్రతిసారి రైల్వే శాఖ తీవ్ర వివక్షత చూపుతోందనే విమర్శలు ఉన్నాయి. సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టకపోవడం, ముఖ్యమైన స్టేషన్లలో పలు రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించకపోవడం, వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రెగ్యులర్ చేయకపోవడం తదితర విషయాల్లో అన్యాయం చేస్తోందనే ప్రయాణికుల నుంచి వ్యక్తమవుతోంది. తూర్పు కోస్తా రైల్వేజోన్ పరిధిలో ఇటీవల పలు వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రైల్వే శాఖ ద.మ రైల్వే జోన్ పరిధిలో ఉన్న కాజీపేట–బల్లార్షా, పెద్దపల్లి నిజామాబాద్ మార్గాలను మరోమారు విస్మరించడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికై నా ఆయా మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రెగ్యులర్ చేయడానికి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


