బెల్లంపల్లి: మార్కెట్లో అన్ని రకాల వస్తువులు, కూరగాయల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నయ్. పెరిగిన ధరలతో పేద, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి కొత్తగా గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా, తోచిన రీతిలో గ్యాస్ సిలిండర్ ధర పెంచడం వల్ల రెక్కాడితే కాని డొక్కాడని పేదలపై పెనుభారం పడుతుంది. వెంటనే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి.
– బొడ్డుపల్లి, రాధ, వితంతు, బెల్లంపల్లి


