ఇటీవల కాలంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులు సైతం బాలికలపై లైంగికదాడులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. పని ప్రదేశాలు, పాఠశాలల్లో మహిళలు, బాలికలకు రక్షణ లేకపోతే ఎలా ? సభలు, సమావేశాల్లో మహిళల రక్షణకు మేమున్నమంటూ గొప్పలు చెప్పిన పాలకులు ఏదైనా ఘటన జరిగినప్పుడు నోరు మెదపకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలు చైతన్యవంతం కావాలి. మనల్ని మనమే రక్షించుకోవాలి.
– సరిత ఓజా, సామాజిక్ జాగృతి వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపకురాలు, మంచిర్యాల


