ఇద్దరి బైండోవర్
జన్నారం: అక్రమంగా టేకు చెట్లు నరికిన కేసులో ఇద్దరిని బైండోవర్ చేసినట్లు తాళ్లపేట రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. ఎఫ్డీవో రా మ్మోహన్రావు ఆదేశాల మేరకు జన్నారం అ టవీ డివిజన్ తాళ్లపేట రేంజ్ పరిధిలోని మహ్మదాబాద్ గ్రామానికి చెందిన కునారపు నరేష్, రోటిగూడ గ్రామానికి చెందిన సందె శ్రీనును సోమవారం జన్నారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే జైలుశిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించడం జరుగుతుందని రేంజ్ అధికారి పేర్కొన్నారు.


