రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
తాండూర్: రాష్ట్రస్థాయి బాలికల సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు మండలంలోని అచ్చలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.అమూల్య ఎంపికై ంది. ఈ నెల 1న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో నిర్వహించిన పోటీల్లో అమూల్య అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 5 నుంచి 8 వరకు నిజామాబాద్ జిల్లా కుమ్మరపల్లి మండలంలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీల్లో పాల్గొననుంది. సదరు విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమాదేవి, ఫిజికల్ డైరెక్టర్ సాంబమూర్తి, ఉపాధ్యాయులు అభినందించారు.


