‘చేయి’ కలిపి ‘కారు’లో సీపీఐ
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో కామ్రేడ్ల పొత్తు
మంచిర్యాలలో కాంగ్రెస్తో కలిసి ముందుకు..
క్యాతనపల్లిలో బీఆర్ఎస్తో ఖరారు
బెల్లంపల్లిలో తుది ప్రయత్నాలు
బెల్లంపల్లి: జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలతో వేర్వేరుగా జత కలిసి పోటీ చేయడానికి సీపీఐ సిద్ధమైంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, బెల్లంపల్లి, క్యాతనపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట మున్సిపాల్టీల్లో ఒక్కోచోట ఒక్కో పార్టీతో పొత్తుకు సానుకూల పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయనుండగా.. క్యాతనపల్లిలో కారెక్కడం ఖాయమైంది. బెల్లంపల్లిలో పొత్తుకు తుది ప్రయత్నాల్లో ఉన్నారు. చెన్నూర్, లక్సెట్టిపేటలో ఒంటరిగా పోటీకి సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్నేహపూర్వకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ మంచిర్యాలలో తప్ప చెన్నూర్, బెల్లంపల్లి బల్దియాల్లో కమ్యూనిస్టులతో చెలిమికి నిరాకరించడంతో పొత్తుకు తలుపులు మూసుకుపోయినట్లు తెలుస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు స్నేహహస్తం అందించి పొత్తుకు ముందుకు రాగా, క్యాతనపల్లి, బెల్లంపల్లిలో స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతోపాటు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మొండిచేయి చూపినట్లు సీపీఐ శ్రేణులు చెబుతున్నారు. ఇ దే అదునుగా కామ్రేడ్లతో పొత్తుకు బీఆర్ఎస్ ముందుకు రావడంతో పొత్తులు ఒక్కసారిగా మలుపులు తిరిగాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని సీపీఐ, బీఆర్ఎస్ పొత్తుకు సిద్ధపడినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సీట్ల ఒప్పందం ఇలా..
‘చేయి’ కలిపి ‘కారు’లో సీపీఐ
‘చేయి’ కలిపి ‘కారు’లో సీపీఐ


