● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్రత్యేకతను చాటుకుంటున్న బెల్లంపల్లి ఓటరు | - | Sakshi
Sakshi News home page

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్రత్యేకతను చాటుకుంటున్న బెల్లంపల్లి ఓటరు

Jan 29 2026 6:39 AM | Updated on Jan 29 2026 6:39 AM

● ప్ర

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్ర

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్రత్యేకతను చాటుకుంటున్న బెల్లంపల్లి ఓటరు ● 1992లో జరిగిన ఎన్నికల్లో ఫిట్టర్‌ అమురాజుల రాజేశ్వర్‌ చైర్మన్‌ అయ్యారు. సింగరేణి సంక్షేమాధికారిగా పదోన్నతి రావడంతో ఆయన రాజీనామా చేయగా.. 1995లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో షాట్‌ఫైరర్‌ జంగం కేశవులు ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో తలపడగా.. ఓటర్లు పట్టంకట్టి చైర్మన్‌ సీటులో కూర్చోబెట్టారు. ● 2001లో జరిగిన ఎన్నికల్లో ల్యాంప్‌ రూం క్లర్క్‌ మత్తమారి సూరిబాబు తన భార్య సరస్వతీని చైర్‌పర్సన్‌గా గెలిపించుకున్నారు. 2005 ఎన్నికల్లో పుర ఓటర్లు వరుసగా రెండోసారీ అదే కుటుంబానికి చైర్‌పర్సన్‌ గిరి అప్పగించడం విశేషం. మత్తమారి సూరిబాబు చైర్మన్‌ అయ్యారు. ● 2014లో సింగరేణి అధికారి పసుల మహేష్‌ భార్య సునీతారాణి పోటీ చేసి చైర్‌ పర్సన్‌ అయ్యారు. నాలుగేళ్ల పదవీ కాలం పూర్తయ్యాక సభ్యులు అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి దింపారు. మరో కార్మిక కుటుంబానికి చెందిన మునిమంద స్వరూపను చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. ఆమె పది నెలలపాటు పాలన సాగించారు. ● 2020లో కార్మిక కుటుంబానికి కోడలిగా వచ్చిన జక్కుల శ్వేత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

బెల్లంపల్లి: బెల్లంపల్లి బల్దియా ఓటర్లు ప్రతీసారి మున్సిపల్‌ ఎన్నికల్లో ఒకే రకమైన తీర్పునిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కార్మిక కుటుంబాలను ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. ఇప్పటివరకు ఏడుసార్లు ఎన్నికలు జరుగగా.. అదే ఆనవాయితీ కొనసాగించారు. చైర్‌పర్సన్‌ స్థానం ఏ సామాజిక వర్గానికి రిజర్వు చేసినా కార్మిక వర్గాన్నే అందలం ఎక్కించారు. మున్సిపాల్టీ ఏర్పడి 39ఏళ్లు అవుతుండగా.. ప్రస్తుతం ఎని మిదోసారి ఎన్నికల పర్వం మొదలైంది. ఈసారి చైర్‌పర్సన్‌ స్థానం మహిళా జనరల్‌కు రిజర్వు చేయడంతో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందోననే ఉత్కంఠ నెలకొంది.

చైర్‌పర్సన్లు వీరే..

బొగ్గు గనుల క్షేత్రం బెల్లంపల్లి 1987లో ద్వితీయ శ్రేణి మున్సిపాల్టీగా అవతరించింది. అదే యేటా తొలిసారి జరిగిన ఎన్నికల్లో సింగరేణిలో మైనింగ్‌ సర్దార్‌ ఇడిగిరాల చంద్రశేఖర్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

అందరి దృష్టి పీఠం పైనే..

ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టి చైర్‌పర్సన్‌ సీటుపైనే కేంద్రీకృతమైంది. ఓటర్లు ఎవరిని ఆదరించి చైర్‌పర్సన్‌ సీట్లో కూర్చోబెడతారోననే చర్చ జరుగుతోంది. గత చరిత్రను పునరావృతం చేస్తారా లేక కొత్త సంప్రదాయానికి తెర తీస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

తీర్పు.. ఒకేరకం

సూరిబాబు

సరస్వతి

జంగం కేశవులు

రాజేశ్వర్‌

సునీతారాణి

చంద్రశేఖర్‌

జక్కుల శ్వేత

స్వరూప

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్ర1
1/7

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్ర

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్ర2
2/7

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్ర

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్ర3
3/7

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్ర

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్ర4
4/7

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్ర

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్ర5
5/7

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్ర

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్ర6
6/7

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్ర

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్ర7
7/7

● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్‌ పీఠం ● ప్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement