వైభవంగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తలమడుగు: మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమం, యజ్ఞం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో ప్రత్యేకపూజలు, సంకీర్తనలు నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. రెండురో జులు ఉత్సవాలు కొనసాగనున్నట్లు వేదపండితుడు కళ్యాణ్ తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ చంటి, నాయకులు వసంత్రెడ్డి, సంజీవ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, పద్మాకర్రెడ్డి, అశోక్, అ భిరామ్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వైభవంగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు


