ఆదిలాబాద్: ఆర్టీసీ ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్గా డి.విజయభాను గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఆర్ఎంగా బాధ్యతలు నిర్వర్తించిన ఎస్.భవానీప్రసాద్ వరంగల్కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన విజయభానుకు ఇప్పటివరకు ఆర్ఎంగా విధులు నిర్వర్తించిన భవానీప్రసాద్, డిప్యూటీ ఆర్ఎంలు రామయ్య, శ్రీహర్ష పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం విజయభాను కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. డిపో మే నేజర్ జి.ప్రతిమారెడ్డి పాల్గొన్నారు.


