‘కమ్యూనిస్టులే అసలైన ప్రజా సేవకులు’
శ్రీరాంపూర్: కమ్యూనిస్టులే అసలైన ప్రజా సేవకులని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన కార్పొరేషన్ పరిదిలోని 6వ వార్డులో సీపీఐ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో తిరుగుతూ సీపీఐని గెలిపించాలని కోరారు. సింగరేణిపై గడ్డపై ఎర్ర జెండాకు ఒక ప్రత్యేక ప్రస్థానం ఉందన్నారు. కార్మిక వర్గానికి, ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర సీపీఐకి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్, మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి బాజీసైదా, నాయకులు బొడ్డు లక్ష్మణ్, రాజ్కుమార్, మిర్యాల రాజేశ్వర్రావు పాల్గొన్నారు.


