breaking news
Alluri Sitarama Raju District News
-
యువతను వంచించిన సూపర్ సిక్స్
ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలు అధికారం వచ్చాక అమలుకు నోచుకోకపోవడం శోచనీయం. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడానికి ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీపై ఇప్పుడు కనీసం మాటవరుసకై నా చర్చ జరగడం లేదు. నెలకు రూ. 3 వేల చొప్పున భృతి ఇస్తామని ప్రచారంలో ఊదరగొట్టిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకు పైసా విదిల్చలేదు. కనీసం ఈ బడ్జెట్కై నా నిధులు కేటాయిస్తారని ఆశించిన నిరుద్యోగులకు మళ్లీ నిరాశే మిగిలింది. యువతను ఇలా వంచించడం సరికాదు. – సల్లంగి ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీపీ, పెదబయలు -
100 రోజుల కార్యాచరణ అమలు
జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశానుసారం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.గిరిజన విద్యార్థులకు వేకువజామున నుంచి ప్రత్యేక బోధన కార్యక్రమాలు అమలుజేస్తున్నారు, రాత్రివేళల్లో కూడా స్టడీ అవర్స్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అన్ని సబ్జెక్టులలో ప్రత్యేక బోధన అనంతరం విద్యార్థులకు రోజు వారీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాత నమునా ప్రశ్నాపత్రాలతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందని పలువురు చెబుతున్నారు. పబ్లిక్ పరీక్షలపై భయం లేకుండా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ప్రతి సబ్జెక్టుపై కార్యాచరణకు అనుగుణంగా ప్రత్యేకంగా బోధిస్తున్నారు. -
ఉత్తమ ఫలితాలే లక్ష్యం
టెన్త్ పరీక్షలకు సంబంధించి జిల్లాలో నూరుశాతం ఉత్తమ ఫలితాల లక్ష్యంగా ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. అన్ని విద్యాలయాల్లోను ప్రత్యేక బోధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్టడీ మెటిరియల్లో పొందుపరిచిన ఆంశాలపై రోజువారీ నిర్వహిస్తున్న పరీక్షలు విద్యార్థులు మేలు చేస్తున్నాయి. టెన్త్ విద్యార్థులు చదువులతో పాటు వారికి నాణ్యమైన పౌష్టికాహారం, ఆరోగ్యంపై కూడా ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాం. – ఎ.ఎస్.దినేష్కుమార్, కలెక్టర్, అల్లూరి జిల్లా -
ఈ–ఆటోలు ప్రారంభం
ఈ–ఆటోలను ప్రారంభిస్తున్న అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ సాక్షి,పాడేరు: ఇంటింటా చెత్త సేకరణకు సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా జిల్లాకు మంజూరైన నాలుగు ఈ–ఆటోల సేవలను శుక్రవారం అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ ఐటీడీఏ ఆవరణలో ప్రారంభించారు. 25 ట్రైసైకిళ్లు, ప్లాస్టిక్ డస్ట్బిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయని ఈ సందర్భంగా డీపీవో చంద్రశేఖర్ తెలిపారు. ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, స్వర్ణ గ్రామ సచివాలయాల నోడల్ అధికారి పి.ఎస్.కుమార్, డీఎల్డీవో జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెల 14న జాతీయ లోక్అదాలత్
మాట్లాడుతున్న ఇన్చార్జి జడ్జి రాము అరకులోయటౌన్: జాతీయ లోక్ అదాలత్ మార్చి 14వ తేదీన నిర్వహించనున్నట్టు అరకులోయ ప్రథమ శ్రేణి జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్చార్జి జడ్జి ఏ.రాము తెలిపారు. స్థానిక ప్రథమ శ్రేణి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఏపీపీ, పోలీస్ అధికారులు, లాయర్లతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లోక్ అదాలత్లో వీలైనంతవరకు కేసులను రాజీ కుదర్చాలని ఏపీపీ, పోలీసు అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీపీ రమేష్, సీఐ ఎల్.హిమగిరి, అరకులోయ, డుంబ్రిగుడ ఎస్ఐలు గోపాలరావు, సురేష్, న్యాయవాదులు మురళీమోహన్, సింహాచలం, రాంబాబు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అన్యాయం’
అనకాపల్లి: విద్యుత్ బస్సుల పేరిట ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం అన్యాయమని ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి పి.ఎన్.వి. పరమేశ్వరరావు అన్నారు. స్థానిక డిపో గ్యారేజీ గేటు వద్ద స్టాఫ్ అండ్ వర్కర్స్ఫెడరేషన్(ఆర్టీసీ) డిపో అధ్యక్షుడు బత్తిన అప్పారావు ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజనవిరామ సమయంలో శుక్రవారం ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.వి.శ్రీనివాస్, రుత్తల శంకరరావు మాట్లాడుతూ 100 శాతం ఆర్టీసీ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చాలని జీవో ఇచ్చిందని, ఇందులో భాగంగా నెల్లూరు–2, గుంటూరు–2, విద్యాధరపురం, మంగళగిరి డిపోలను పూర్తిగా గాజువాక, కాకినాడ, కడప, అనంతపురం, కర్నూలు డిపోల్లో సంగం గ్యారేజీ స్థలాన్ని పినాకిల్ కంపెనీకి అప్పగించే విధంగా చర్యలు చేపట్టారని చెప్పారు. ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం మానుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ మండల కన్వీనర్లు కె. తేలయ్యబాబు, ఎస్ డబ్ల్యూఎఫ్ డిపో నాయకులు ఎస్.రామ త్రిమూర్తులు, ఎస్.రమణ, జి.ఏ.రావు, తదితరులు పాల్గొన్నారు. -
పిప్పళ్ల ధర పతనం
ముంచంగిపుట్టు: గిరిజన ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్న పిప్పళ్ల పంటకు మంచిధర లేక గిరిజన రైతులు నష్టాలను చవి చూస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పిప్పళ్ల రైతులకు ప్రతి ఏడాది ధర కలిసి వచ్చింది. గత ఏడాది 320 నుంచి రూ.350 వరకు ధర పలుకుతూ ఉండేది. దీంతో రైతుల కష్టానికి తగ్గ ఫలితం ఉండేది. పిప్పళ్ల సాగు ఎంతో శ్రమతో చేయాల్సిన పంట. రకం బట్టి రెండు నుంచి మూడేళ్ల వరకు పిప్పళ్ల సాగుకు సమయం పడుతుంది. గతంలో ధర మంచిగా ఉండడంతో గిరిజన రైతులు పిప్పళ్ల సాగుపై ఆసక్తి చూపేవారు. పిప్పళ్లను శీతల దేశాల్లో సుగంధ ద్రవ్యాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మార్కెట్లో డిమాండ్ ఉంటే ప్రతి ఏడాది పిప్పళ్లకు ధర పెరిగింది. ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల మండలాల్లో జరిగే వారపు సంతల్లో ప్రతి ఏడాది అధికంగా పిప్పళ్లు అమ్మకానికి గిరిజన రైతులు తీసుకొని వచ్చేవారు. ఽఈ ఏడాది రూ.280 నుంచి రూ.300 వరకే ధర ఉండడంతో, ఆర్థికంగా నష్టపోయామని, వారపు సంతకు వచ్చిన పిప్పళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్యాపారలు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో ధర లేకపోవడానికి కారణమని చెపుతున్నారు. -
నిజాయితీ చాటుకున్న మహిళ
రూ.59 వేలతో దొరికిన బ్యాగ్ అప్పగింత గొలుగొండ: ఓ మహిళ తన నిజాయితీ చాటుకుంది. తనకు దొరికిన బ్యాగ్తోపాటు రూ.59 వేలను పోలీసులకు అప్పగించింది. అల్లూరి జిల్లా బాలారం గ్రామానికి చెందిన గొర్లి నాగమణి తన అత్తవారి ఇంటికి కోటవురట్లకు బైక్పై గురువారం వెళ్తుండగా, గొలుగొండ మండలం చోద్యంలో భారీ వంతెన వద్ద హ్యాండ్బ్యాగ్ జారి పడిపోయింది. ఈ క్రమంలో అటుగా పొలానికి వెళ్తున్న చోద్యం గ్రామానికి చెందిన ఈర్లి లక్ష్మికి ఆ బ్యాగ్ దొరికింది. దాన్ని కృష్ణదేవిపేట పోలీసులకు అప్పగించింది. బ్యాగ్లో ఉన్న కార్డులు ఆధారంగా నాగమణిదిగా పోలీసులు గుర్తించారు. అప్పటికే చాలా చోట్ల వెతుకుతున్న ఆమెను గుర్తించి లక్ష్మి సమక్షంలో శుక్రవారం అందజేశారు. నిజాయతీ చాటుకున్న లక్ష్మికి ఎస్ఐ రుషికేశ్వర్రావు, స్థానికులు అభినందనలు తెలిపారు. -
పంచదార్ల రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
ఎయిమ్ ప్రతినిధులు హెచ్చరిక రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలం పంచదార్లకు చెందిన దళితకుటుంబాలకు చెందిన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అఽధికారులు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే వారికి న్యాయం జరిగే వరకూ రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని అంబేడ్కర్ ఇండియా మిషన్(ఎయిమ్) సభ్యులు హెచ్చరించారు. పంచదార్లలో దళితులు నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని వారు శుక్రవారం సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని, ప్రాణత్యాగాలకై నా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. 50 ఏళ్ల క్రితం దళిత కుటుంబాలకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలనే ఆలోచన ఎందుకొచ్చిందని, దీని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. పరిహారం ఇవ్వకుండా ఢీ పట్టా భూములను లాగేసుకునే ఉత్తర్వులు ఇవ్వడం చాలా దా రుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిమ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కెల్లా భీమారావు, సభ్యులు గొంది అప్పారావు, మెరుగు శేఖర్, నారాయణప్పడు, గుడాల నాగరాజు, శివలంక అప్పారావు, అలమండ గణేష్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా రిజిస్ట్రార్గా నరసింహమూర్తి బాధ్యతల స్వీకరణ
జిల్లా రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన నరసింహమూర్తిని అభినందిస్తున్న ఉద్యోగులు సాక్షి,పాడేరు: జిల్లా రిజిస్ట్రార్గా సీహెచ్.నరసింహమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నక్కపల్లిలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న నరసింహమూర్తికి ప్రభుత్వం రిజిస్ట్రార్గా పదోన్నతి కల్పించి, అల్లూరి జిల్లాకు నియమించింది. బాధ్యతలు స్వీకరించిన రిజిస్ట్రార్ను వివిధ విభాగాల ఉద్యోగులు కాళ్ల రమేష్, ఉపేంద్ర, ఉమాశంకర్, ప్రసాద్తో పాటు ఈ–స్టాంప్ వెండర్లు కోటి, గోపి, రామచంద్రరావులు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. దుశ్శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
సాక్షి, పాడేరు: జి.మాడుగుల మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థి కిల్లో ఆల్బర్ట్ ఫిలిప్స్ (13) గెడ్డలో మునిగి మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం జి.మాడుగుల పోలీసు స్టేషన్ సమీపంలోని గెడ్డలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆల్బర్ట్ ఫిలిప్స్తో పాటు మరో ఇద్దరు గిరిజన విద్యార్థులు గెడ్డలో స్నానానికి దిగి ఈతకొట్టారు. ఆల్బర్ట్ ఫిలిప్స్ గెడ్డ మధ్యలోకి వెళ్లి బురదతో కూడిన ఊబిలో చిక్కుకున్నాడు. మిగిలిన విద్యార్థులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుమారుడు మృతి చెందడంతో తండ్రి కిల్లో నరసింహమూర్తి కన్నీరుమున్నీరుగా విలపించాడు. తన కుమారుడు మృతిపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సాయిరామ్ పడాల్లు మాట్లాడుతూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. కిల్లో ఆల్బర్ట్ మృతదేహం (ఇన్సెట్) ఆల్బర్ట్ (ఫైల్) -
అన్ని వర్గాలకు అన్యాయం
తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులు, ఆడ బిడ్డలతో పాటు అన్ని వర్గాలకు న్యాయం చేస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలు గుప్పించారు. ఆయన మాటలు, హామీలు నమ్మినందుకు నిరుద్యోగులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు మొండి చేయి చూపించి అన్యాయం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా పేద, మధ్య తరగతి కుటుంబాలను పట్టించుకోవడం లేదు. సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఇప్పటికై నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేయాలి. – మజ్జి చంద్రుబాబు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, పెదబయలు -
మోదమ్మ ఉత్సవాల నిర్వహణపై సమావేశం రేపు
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరులోని మోదకొండమ్మతల్లి ఉత్సవాల నిర్వహణకు ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 22 మధ్యాహ్నం 3గంటలకు మోదమ్మ ఆలయ ప్రాంగణంలో అన్ని వర్గాల పెద్దలు, భక్తులతో సమావేశం నిర్వహిస్తున్నామని, ఆలయ కమిటీ చైర్మన్,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడులు శుక్రవారం తెలిపారు. మోదకొండమ్మతల్లి ఆలయ గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాలు, పాడేరు వర్తక సంఘం నేతలు, గ్రామపెద్దలు, భక్తులంతా ఈ సమావేశానికి హాజరుకావాలని వారు కోరారు.ఈ సమావేశంలో అందరి ఆమోదం మేరకు ఈ ఏడాది నిర్వహించే మోదకొండమ్మతల్లి ఉత్సవాల తేదీలు ఖరారు చేస్తామని వారు తెలిపారు. -
పరీక్ష కాలం..
● ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు ● పకడ్బందీగా వంద రోజుల కార్యాచరణ అమలు ● రోజు వారీ పరీక్షలు సాక్షి,పాడేరు: జిల్లాలో ఈ ఏడాది టెన్త్లో నూరుశాతం ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయ వర్గాలు బోధనతో శ్రమిస్తున్నాయి. అధిక మార్కులతో సత్తా చాటాలని టెన్త్ విద్యార్థులంతా కఠోర దీక్షతో చదువుల్లో నిమగ్నమయ్యారు. నూరుశాతం ఫలితాల సాధన లక్ష్యంగా కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాల మేరకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 159 పాఠశాలలకు చెందిన 7,299మంది రెగ్యులర్ విద్యార్థులు, 505 మంది ప్రైవేట్ విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి ఉన్నత పాఠశాలల్లో చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.అన్ని సబ్జెక్ట్లలో విద్యార్థులు పూర్తి పట్టు సాధించే ప్రత్యేక బోధన కార్యక్రమాలను అమలుజేస్తున్నారు. చేతిరాతపై కూడా విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నారు. -
పీజీఆర్ఎస్లో 75 వినతుల స్వీకరణ
వినతులు స్వీకరిస్తున్న అసిస్టెంట్ కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి.పాడేరు: స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ గిరిజనుల నుంచి 75 వినతులు స్వీకరించారు. అనేక ప్రాంతాలకు చెందిన గిరిజనులు తమ వ్యక్తిగత, గ్రామాల సమస్యలను పరిష్కరించాలని అసిస్టెంట్ కలెక్టర్కు అర్జీల ద్వారా విన్నవించుకున్నారు. ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ మురళీ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పరిహారం చెల్లించకుండా ఇళ్లు కూల్చివేతా?
బుచ్చిరాజు పేటలో అడ్డుకున్న నిర్వాసితుడు నక్కపల్లి: స్టీల్ప్లాంట్ కోసం భూములు, నివాస ప్రాంతాలు త్యాగం చేసిన నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించకుండా ఇళ్లు ఎలా కూలుస్తారని కాళ్ల కృష్ణ అనే నిర్వాసితుడు ఆందోళనకు దిగాడు. శుక్రవారం బుచ్చిరాజుపేటలో తన ఇంటిని జేసీబీ సాయంతో కూల్చడాన్ని అడ్డుకుని నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇంటిని ఖాళీ జాగాను ఏపీఐఐసీ వారు స్టీల్ప్లాంట్ కోసం తీసుకున్నారన్నారు. నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ప్యాకేజీ ఇవ్వకుండా ఉన్నపళంగా ఇల్లు కూల్చి వేరొక చోటకు వెళ్లిపోవాలని అధికారులు చెబుతున్నారని వాపోయాడు. పరిహారం కోసం అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని ఆగ్రహించాడు. -
ముంచెత్తిన పొగమంచు
చింతపల్లి: అల్లూరి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులతో కొనసాగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉన్నప్పటికీ శీతలగాలులు, పొగ మంచు తీవ్రత యధావిధిగానే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అరుకులోయలో 9.2 డిగ్రీలు, చింతపల్లిలో 9.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో ముంచంగిపుట్టులో 10.9 డిగ్రీలు, పెదబయలులో 11.2 డిగ్రీలు, జి మాడుగులలో 13.0 డిగ్రీలు, కొయ్యూరులో 13.5 డిగ్రీలు,అనంతగిరిలో 17.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఏడీఆర్ తెలిపారు. -
హామీలు ఎగనామం
కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు. చంద్రబాబు పాలనలో ప్రతీ వర్గానికి అన్యాయం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 50 సంవత్సరాలకు పింఛన్లు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఊసే లేకుండా పోయింది. బడ్జెట్లో వీటికి నిధులు కేటాయింపు లేదు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి మాట ఇస్తే ఆ పథకం కచ్చితంఆ అమలయ్యేది. అందుకు భిన్నంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. – కొరుప్రోలు పాణీ శాంతారామ్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, గొలుగొండ -
మోదమ్మకు మాజీ మంత్రి అమర్నాథ్ పూజలు
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దేవత పాడేరులోని మోదకొండమ్మతల్లిని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ శుక్రవారం దర్శించుకున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుతో పాటు నేతలంతా ఆయనకు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రితో పాటు అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్, అరకు, పాడేరు నియోజకవర్గాల పరిశీలకులు ఏడువాక సత్యారావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యలు మోదమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి అమర్నాఽథ్, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజులు ప్రారంభించి, భక్తులకు వడ్డించారు. మోదకొండమ్మ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, వైస్ ఎంపీపీ కనకాలమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్గన్నదొర, మహిళా విభాగ నియోజకవర్గ అధ్యక్షురాలు ఉర్వశిరాణి, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, పంచాయతీరాజ్ విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుసారి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పాఠశాలల వివరాలు పాఠశాలలు సంఖ్య విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 12 512 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 7 337 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు 110 5459 గిరిజన సంక్షేమ గురుకులాలు 9 775 కేజీబీవీలు 11 436 ప్రైవేట్ పాఠశాలలు 10 285 మొత్తం 159 7804 -
నిరుద్యోగి భృతి ఎప్పుడిస్తారు?
నిరుద్యోగి భృతి ఇస్తానని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, కూటమి నేతలు గొప్పగా చెప్పారు. అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా ఇంతవరకు నిరుద్యోగి భృతి ఊసెత్తలేదు. ప్రస్తుతం బడ్జెట్లో పైసా విదల్చకుండా ఈ ఏడాది కూడా నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపించారు. కూటమి పాలన ఇదేవిధంగా సాగిస్తే నిరుద్యోగుల నుంచి గుణపాఠం తప్పదు. నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగులందరికీ మొత్తం బాకీ చెల్లించాలి. – సందీప్, నిరుద్యోగ యువకుడు చమ్మచింత గ్రామం, నాతవరం మండలం -
జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటిన గిరిజన విద్యార్థులు
అరకులోయటౌన్: జాతీయస్థాయి హ్యాండ్ రైటింగ్, కలరింగ్ పోటీల్లో ప్రతిభ కనబరచిన అరకులోయ గురుకులం పాఠశాల విద్యార్థినులను ఏటీడబ్ల్యూవో వెంకటరమణ తదితరులు అభినందించారు. అరకులోయ గురుకులం పాఠశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మైదాన ప్రాంత విద్యార్థులకు ఏమాత్రం తీసిపోని ప్రతిభ గిరిజన విద్యార్థుల్లో ఉందని, వారి ప్రతిభను వెలికితీస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తారనడానికి ఇదే నిదర్శనమన్నారు. మహారాష్ట్రలో ఔరంగబాద్కు చెందిన స్టూడెంట్స్ డెవలప్మెంట్ సొసైటీ గతేడాది నవంబర్ 28న ఆన్లైన్లో నిర్వహించిన నేషనల్ కలరింగ్ అండ్ హ్యాండ్ రైటింగ్–2025 పోటీల్లో 190 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ పోటీల్లో అరకులోయ గురుకులం పాఠశాల విద్యార్థినులు 8 మంది బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్టు ఏటీడబ్ల్యూవో తెలిపారు. వీరిలో నలుగురు బాలికలు నేషనల్ కలా గౌరవ్ అవార్డు సాధించగా. మరో నలుగురు బాలికలు నేషనల్ కళాభూషణ్ అవార్డు సాధించారన్నారు. విజేత విద్యార్థినులను స్పూర్తిగా తీసుకొని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆయా విద్యార్థినులకు ప్రశంసపత్రాలు ఏటీడబ్ల్యూవో వెంకటరమణ, ఎంఈవోలు వంతాల త్రినాథరావు, భారతీ రత్నం గురుకులం కో–ఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తి తదితరులు అందజేశారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా సుమలత, ఉత్తమ ప్రిన్సిపాల్గా ముమ్మన నాగరత్నం ఎంపికయ్యారు. అరకులోయ, అనంతగిరి ఏకలవ్య మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లు సీహెచ్.భాస్కర్రావు, అల్లు సన్యాసినాయుడుతోపాటు గిరిజన గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ ముమ్మన నాగరత్నం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
పోలీసు స్టేషన్కు తరలించిన కలపతో వ్యాను తాండవ, మాధవనగరం మధ్య పట్టుబడిన వ్యాన్ నాతవరం: అటవీశాఖ అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకున్నట్టు నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఇటీవల మండలంలో పలు ప్రాంతాల్లో కోళ్లు, మేకలు, గొర్రెలు చోరీకి గురైనట్టు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వాటిని నివారించే చర్యల్లో భాగంలో సిబ్బంది బృందాలుగా విడిపోయి గురువారం రాత్రి గ్రామాల్లో గస్తీ నిర్వహించినట్టు తెలిపారు. అలాగే తాండవ, మాధవనగరం, వెదురుపల్లి, ఆడాకుల రూట్లో వాహనాలు తనిఖీలు చేసినట్టు చెప్పారు. ఆ సమయంలో వచ్చిన వ్యాన్ను తనిఖీ చేసి, కలప అక్రమణంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. మూడు టన్నుల నలుపు రంగు కలిగిన తమ్మెద కర్ర మానులు లభించాయన్నారు. అటవీశాఖ అధికారులు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని చెప్పారు. వాహనంతో పాటు నిందితుడు గొలుగొండ మండలానికి చెందిన ప్రసాద్ పోలీసు స్టేషన్కు తరలించామన్నారు. అనంతరం డీఎఫ్వోకు సమాచారం అందజేసినట్టు ఆయన చెప్పారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకునేంత వరకు వాహనం, దుంగలతో పాటు నిందితుడు ప్రసాద్ పోలీసుల ఆధీనంలో ఉంటాడని ఎస్ఐ తెలిపారు. -
భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
పాత నేరస్తుడు అరెస్టు, రూ.30.39 లక్షల విలువైన 16.5 తులాల బంగారం స్వాధీనంఅనకాపల్లి: మునగపాక మండలంలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కేసు వివరాలను ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం వెల్లడించారు. ఈనెల 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మునగపాక మండలం గంతవానిపాలెంలో కరణం ఉమావతి తన ఇంటికి తాళం వేసి దేవాలయానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటిలో బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో ఆమె మునగపాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 17.5 తులాల బంగారం చోరీ అయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ పర్యవేక్షణలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అనకాపల్లి పట్టణానికి చెందిన కోన రాజేష్ దొంగతనం చేసినట్టు గుర్తించారు. నిందితుడిని ఈనెల 19న యలమంచిలి మండలం కొక్కిరాపల్లి జంక్షన్ వద్ద పట్టుకుని, 16.5 తులాల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రాజేష్ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్పీ చెప్పారు. నిందితునిపై గతంలో అనకపల్లి పట్టణపోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోరీ కేసులు నమోదైనట్టు ఆయన చెప్పారు. రివకరీ చేసిన బంగారం విలువ సుమారు రూ.30.39లక్షలు ఉంటుందన్నారు. గణనీయంగా పెరిగిన రికవరీ శాతం పోలీసు అధికారులు, సిబ్బంది తీసుకుంటున్న పటిష్ట చర్యల వల్ల దొంగతనాల కేసుల్లో రికవరీ శాతం గణనీయంగా పెరిగిందని ఎస్పీ చెప్పారు. 2024 సంవత్సరంలో 46శాతం కేసుల్లో డిటెక్షన్, 60శాతం ప్రాపర్టీ రికవరీ, 2025 సంవత్సరంలో 59శాతం కేసుల్లో డిటెక్షన్, 63శాతం ప్రాపర్టీ రికవరీ సాధించగా, 2026 సంవత్సరంలో ఇప్పటి వరకూ నమోదైన రెండు ప్రధాన కేసుల్లో నూ 100శాతం డిటెక్షన్, 100శాతం ఆస్తి రికవరీ సాధించినట్టు తెలిపారు. ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్లే సమయంలో దగ్గరలో ఉన్నపోలీసు స్టేషన్లో సమాచారం అందించినట్లుయితే లాక్డ్ హౌస్ మానటరింగ్ సిస్టమ్ ద్వారా రక్షణ కల్పిస్తామని చెప్పారు. ప్రతి వీధిలో, ఇంటి వద్ద సీసీ కెమోరాలను ఏర్పాటు చేస్తే చోరీకి పాల్పడిన వ్యక్తులను త్వరితగతిన పట్టుకోవచ్చని తెలిపారు. అనంతరం కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని నగదు బహుమతి, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి సీఐ ఎస్.ధనుంజయరావు, మునగపాక ఎస్ఐ పి.ప్రసాదరావు, సీసీఎస్ సీఐ కె.అప్పలనాయుడు, ఫింగర్ ప్రింట్ సీఐ టి.విజయ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. -
పోలేపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
● 60 ఎకరాల్లో తోటలు దగ్ధం ● అదుపులోకి రాని మంటలు ● రూ. 12 లక్షల ఆస్తినష్టం పోలేపల్లిలో కాలిపోయిన జీడితోటలుకొండ ప్రాంతంలో కాలిపోతున్న తోటలు బుచ్చెయ్యపేట: మండలంలోని పోలేపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 60 ఎకరాల్లో జీడిమామిడి, యూకలిప్టస్, ఆకేషియా తోటలు కాలిపోయాయి. ఇందులో 15 ఎకరాలు రైతుల భూమి, 45 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇంకా మంటలు అదుపులోకి రాక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి పారేసిన సిగరెట్టు పీకల వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన తుంపాల శివప్రసాద్, నాగులపల్లి చిన్నమ్మలు, సీతా పరమేశ్వరి, పునుమళ్ల శ్రీనివాసరావు తదితర రైతులకు చెందిన జీడితోటలు, యూకలిప్టస్ తోటలు కాలిపోయాయి. రూ. 12 లక్షలకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. కొండ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో ఆకేషియా, యూకలిప్టస్ తోటలు కాలిపోతుండగా, స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. అయితే కొండ ప్రాంతంలోకి వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేక వెనుదిరిగినట్లు సర్పంచ్ సీతా పైడియ్యనాయుడు తెలిపారు. ఈ ప్రమాదంలో తోటలు కాలిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. గ్రామాన్ని ఆనుకున్న కొండ ప్రాంతంలో ఇంకా మంటలు అదుపులోకి రాకపోగా, తీవ్రంగా పొగ రావడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వలయం
ఏయూ చుట్టూవివాదాలప్రధాన ఇన్గేట్లకు తాళాలు.. అవుట్గేట్ ద్వారానే రాకపోకలు శతాబ్ది వేళ పోలీసుల మోహరింపు.. క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం ఐడీ కార్డు తప్పనిసరితో విద్యార్థుల్లో ఆందోళన గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యమ హెచ్చరికలతో పరిస్థితి మరింత సంక్లిష్టంశతాబ్ది వేళ ప్రశాంతత ఎక్కడ? ప్రశాంతమైన విద్యా వాతావరణంలో బోధన, పరిశోధనలు సాగాల్సిన చోట నిత్యం ఆందోళనలు, ఆంక్షలు నెలకొనడం బాధాకరమని విద్యావేత్తలు అంటున్నారు. గేట్లకు తాళాలు వేయడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని, సమస్యల మూలాలను గుర్తించి చర్చల ద్వారా పరిష్కరించాలని సూచిస్తున్నారు. విద్యార్థులను తరగతుల వైపు మళ్లించడంతో పాటు, గెస్ట్ ఫ్యాకల్టీ, ఉద్యోగుల సమస్యలను సమగ్రంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. శతాబ్ది వేడుకల సందర్భంగా వైభవాన్ని చాటాల్సిన ఏయూం ప్రస్తుతం అనిశ్చితి ముసురులో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజూ తనిఖీలు, పరిమితుల మధ్య పనిచేయడం మానసిక ఒత్తిడికి గురిచేస్తోందని నాన్–టీచింగ్ స్టాఫ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి, యూనివర్సిటీ అభివృద్ధి, ప్రశాంతతపై పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు కోరుతున్నారు. ఏయూలో మోహరించిన పోలీసులువరుస ఘటనలతో అష్టదిగ్బంధనంలో యూనివర్సిటీ పోలీసు వలయంలో క్యాంపస్ వర్సిటీ ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. నిత్యం తనిఖీలు, గస్తీ, ఆందోళనల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. శతాబ్ది ఉత్సవాల వేళ ఖాకీల బూట్ల చప్పుళ్లు వినిపించడం పట్ల అధ్యాపకులు, మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐడీ కార్డు ఉంటేనే ప్రవేశం విద్యార్థి సంఘాల పోటాపోటీ నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో యూనివర్సిటీ పరిపాలన కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రధాన గేట్లను మూసివేసి, రిజిస్ట్రార్ కార్యాలయం వైపు ఉన్న అవుట్గేట్ ద్వారానే రాకపోకలను అనుమతిస్తున్నారు. లోపలికి ప్రవేశించాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి చేశారు. దీంతో సాధారణ విద్యార్థులు, ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ వాకింగ్కు వచ్చే ప్రజలకు కూడా ప్రవేశం నిలిపివేయడంతో క్యాంపస్ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. విశాఖ సిటీ: ఒకప్పుడు నోబెల్ బహుమతి గ్రహీతలు, మేధావులను తీర్చిదిద్దిన ప్రాంగణం.. ఇప్పుడు వివాదాలు, ఉద్రిక్తతలకు నిలయంగా మారుతోంది. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం.. ఖాకీల బూట్ల చప్పుళ్లతో మార్మోగుతోంది. శతాబ్ది ఉత్సవాల వేళ ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్సిటీ పోలీసులు అష్టదిగ్బంధనంలోకి వెళ్లిపోయింది. ఏటా వేలాది మందిని విద్యావంతులుగా, సమాజానికి దిక్సూచీలుగా తీర్చిదిద్దే ఏయూ ప్రాంగణం.. నేడు ఆంక్షల వలయంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఏయూ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఇన్గేట్కు తాళాలు వేయడం ఇప్పుడు క్యాంపస్లో చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఏయూలో జరుగుతున్న పరిణామాలకు కారణమేంటి? ఉద్రిక్త పరిస్థితుల వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయా? ఆంక్షలు పెట్టాల్సిన పరిస్థితులను ఎవరు కల్పించారు? ఇలా అనేక ప్రశ్నలు విద్యార్థి లోకంలో ఉత్పన్నమవుతున్నాయి. భద్రతా వలయం తొలగింపుతో ఇబ్బందులా? గత ప్రభుత్వ హయాంలో పరిపాలనా భవనం (సీఏఓ) చుట్టూ ఏర్పాటు చేసిన భద్రతా కంచెను ఇటీవల తొలగించడం కూడా వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంతో ఆందోళనకారులు నేరుగా పరిపాలనా విభాగాల వరకు చేరే పరిస్థితి ఏర్పడిందని కొందరు ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు. ఏయూలో జరుగుతున్న ప్రతి ఆందోళన వెనుక కొందరు వర్సిటీకి చెందిన పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విద్యార్థులు క్లాసులకు వెళ్లి పరిశోధనలు చేయకుండా, ప్లకార్డులు పట్టుకుని గేట్ల వద్ద బైఠాయించడం వెనుక ఉన్న రాజకీయ శక్తులెవరో విచారణ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమ బాటలో గెస్ట్ ఫ్యాకల్టీ కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీలు (అతిథి అధ్యాపకులు) తమ సర్వీస్ క్రమబద్ధీకరణ, పెండింగ్ వేతనాల అంశాలపై మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో, ఆందోళన కార్యక్రమాలు చేపట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది మరింత ఉద్రిక్తతకు దారితీయవచ్చని భావిస్తున్నారు. -
సాగర సంగ్రామ దీక్ష రేపు
దీక్ష వాల్పోస్టర్లను ఆవిష్కరిస్తున్న గోపీనాథ్, ఉపాధ్యాయులు నర్సీపట్నం: ఏపీసీపీఎస్ఈఏ ఈ నెల 22న తలపెట్టిన సాగర సంగ్రామ దీక్ష విజయవంతం చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్ కోరారు. దీక్ష వాల్ పోస్టర్లను ఆయన యూనియన్ నాయకులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ హామీని ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కురచా రమణ, నర్సీపట్నం మండల అధ్యక్షుడు ఎ.వరహాలనాయుడు. జిల్లా ట్రైబల్ ఎంప్లాయీస్ యూనియ న్ ప్రధాన కార్యదర్శి ధర్మరాజు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో లారీ డ్రైవర్ మృతి
మృతుడిది నేపాల్ రావికమతం: మండలంలోని గొంప గ్రామంలో శుక్రవారం సాయంత్రం సరుగుడు లోడుతో వెళ్తున్న లారీకి విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై డ్రైవర్ మృతి చెందాడు. రావికమతం ఎస్ఐ రఘవర్మ, స్థానికుల కథనం మేరకు.. నేపాల్ దేశానికి చెఽందిన పారాదీప్కు వివాహం కాలేదు. బంధువులు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. కొన్నాళ్ల కిందట పెందుర్తికి వచ్చి లారీ ఓనర్ సాలాపు సముద్రం దగ్గర క్లీనర్గా చేరాడు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ నేర్చుకుని అతడి దగ్గరే ఉంటున్నాడు. శుక్రవారం సరుగుడు కలప తీసుకెళ్లేందుకు ఓనర్తో కలిసి పెందుర్తి నుంచి లారీతో గొంప వచ్చాడు. ఇక్కడ చెట్టువాని చెరువు దగ్గర కూలీలు లారీకి సరుగుడు కలప లోడు చేశారు. లోడుకు సపోర్టుగా ఇరువైపులా సరుగుడు కర్రలు కట్టారు. ఆ కర్రలు కటింగ్ చేయాలని కూలీలు చెప్పగా, తట్టబంద వద్ద తూనిక కాటా వద్ద చేద్దామని చెప్పి లారీని చెరువులో నుంచి రోడ్డుపైకి తీసుకొచ్చే క్రమంలో అక్కడే ఉన్న విద్యుత్ తీగలు తగిలాయి. కర్రలు తొలిగించే ప్రయత్నం చేస్తున్న పారాదీప్ విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడ్టాడు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. లారీ యజమాని సముద్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
షార్ట్సర్క్యూట్తో అగ్నిప్రమాదం
రూ.10 లక్షల ఆస్తినష్టం కాలిపోయిన ఇంటి లోపలి భాగంఎస్.రాయవరం: మండలంలోని తిమ్మాపురంలో షార్ట్ సర్క్యూట్కారణంగా ఓ ఇంట్లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఫర్నిచర్, ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. అందిన సమాచారం మేరకు నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు.ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు వీఆర్వో నూకరాజు తెలిపారు.ఎస్ఐ విభీషణరావు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
గంజాయితో పట్టుబడిన నలుగురిపై కేసు
డుంబ్రిగుడ: గంజాయికి బానిసలై బహిరంగా ప్రదేశాల్లో సేవిస్తూ పట్టుబడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఎల్.సురేష్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని బోందుగుడ జంక్షన్లో నలుగురు వ్యక్తులు బుధవారం ఒక ఆటో వద్ద గంజాయి సేవిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి వారిని అదుపులో తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదుచేసినట్టు ఎస్ఐ తెలిపారు. ఆటోను సీజ్ చేసి గంజాయి మత్తు నుంచి విముక్తి పొందేలా వారికి జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మత్తు విముక్తి కేంద్రానికి తరలించామన్నారు. -
రహదారి నిర్మాణంపైస్థలం పరిశీలన
గూడెంకొత్తవీధి: మండలం దేవరాపల్లి పంచాయతీలోని ఎలుగురాతిబంద గ్రామంలో రహదారి నిర్మాణ పనులను గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ ఈఈ డేవిడ్రాజ్ గురువారం డీఈ రఘుతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం ఇటీవల ఆ గ్రామానికి రూ.2కోట్లతో రహదారిని మంజూరు చేసింది. అయితే తాము సూచించిన మార్గం ద్వారా రహదారిని నిర్మించాలని గ్రామస్తులు పట్టుబట్టారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో కలెక్టర్ అధికారులను విచారణకు ఆదేశించారు. దీంతో గురువారం ఇంజినీరింగ్ అధికారులు ఎలుగురాతి బంద గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.సర్పంచ్ సిరిబాల బుజ్జిబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు. వివరాలను కలెక్టర్కు నివేదిస్తామని అధికారులు తెలిపారు. -
రక్తదానం ప్రాణదానంతో సమానం
చింతపల్లి: మనం ఇచ్చే రక్తదానంతో ఎంతో మందికి ప్రాణదానం అందించి, వారిని ఆదుకున్న వాళ్లమవుతామని జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య అన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాల మేరకు చింతపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మెన్ గంగరాజు ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది బాధితులు ప్రమాదాలకు గురై సకాలంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితులు నివారించడానికి ఈ రక్తదాన శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ రక్తం దానం చేసి పలువురికి ప్రాణదానం చేయడానికి ముందుకు రావాలన్నారు.ఈ శిబిరానికి మండలంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొని రక్త దానం చేశారు. ఈ శిబిరంలో 24 యూనిట్లు రక్తాన్ని సేకరించారు. తహసీల్దారు శంకరరావు, ఎంఈఓ ప్రసాద్, ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీవో మూర్తి, సీనియర్ అసిస్టెంట్ ఎన్టి రామారావు, ప్రసాద్ నాయుడు, సుబ్రహ్మణ్యం, రెడ్క్రాస్ మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
పాడేరు రూరల్: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, బాల్య వివాహాలు అరికట్టాలని పాడేరు డీఎస్పీ పి.అభిషేక్ తెలిపారు. పోలీస్ శాఖ, ఐటీడీఎస్ సంయుక్తంగా స్థానిక పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద గురువారం అంగన్వాడీలు, వివిధ మహిళ సంఘాలతో మహిళల భధ్రత, హక్కులు చట్టాలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు డీఎస్పీ పి.అభిషేక్ మాట్లాడుతూ మహిళల భద్రత పటిష్టంగా అమలుకు అందరూ సహకరించాలన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు. పౌష్టికాహారం లోపంతో మరణాలు జరుగుతున్నాయన్నారు. వీటిని అరికట్టేందుకు అందరూ తమ వంతు కృషి చేయాలన్నారు. మూఢనమ్మకాలను వీడి సమాజ మార్పుకు అందరూ పనిచేయాలన్నారు. మహిళలపై వేధింపులు, దాడులు, వివిధ రకాల సైబర్ నేరాలు జరగకుండా ప్రత్యామ్నాయంగా పోలీసు శాఖ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళ హక్కులు చట్టాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అత్యవసర సమయాల్లో మహిళలు ఆత్మ రక్షణ కోసం హెల్పలైన్ 181, శక్తియాప్ 112 నంబర్లకు సంప్రదించాలన్నారు. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమలు నిర్వహిస్తు చైతన్యపరుస్తున్నమన్నారు. అందరూ సహకారంతోనే మంచి సమాజాన్ని ఏరాటు చేసుకోగలమన్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవుపలికారు. గంజాయి, డ్రగ్స్, మద్యం జోలికి వెళ్లొద్దన్నారు. మంచి చదువుతోనే బంగారు భవిషత్ ఉంటుందని చెప్పారు. ఐటీడీఎస్ పీడి ఝాన్సీ, వైద్య నిపుణులు డాక్టర్ రాజు, సీడీపీవో శారద, ఎన్ఐసిఈ ఎన్డీవో కౌన్సిలర్ శాంతి, సీఐ దీనబంధు, ఎస్ఐ పాపినాయుడు పాల్గొన్నారు.పాడేరు డీఎస్పీ అభిషేక్ -
అల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ఐఐఎంవీలో వర్క్షాప్
తగరపువలస: అల్లూరి సీతారామరాజు జిల్లా స్థిరమైన వృద్ధి ప్రణాళిక రూపకల్పనపై గురువారం గంభీరం ఐఐఎంవీలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర విజన్–2047 మార్గదర్శకాలకు అనుగుణంగా, ‘సంపూర్ణత అభియాన్’ కింద 5 ప్రధాన అంశాలు, 46 సూచికలతో జిల్లా పనితీరును మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జిల్లాలోని కాఫీ, మిరియాలు, పసుపు ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా నాణ్యత, బ్రాండింగ్ , విలువ ఆధారిత తయారీపై దృష్టి సారించాలన్నారు. నీతి ఆయోగ్ ప్రాజెక్టులో భాగంగా 627 గృహాల నుంచి సేకరించిన సమాచారం, 213 కీలక సూచికల విశ్లేషణతో రూపొందించిన నివేదికను ఐఐఎంవీ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ వర్క్షాప్లో ఐఐఎంవీ డైరెక్టర్ చంద్రశేఖర్, ప్రొఫెసర్లు మారిశెట్టి విజయ, అంబేడ్కర్ పాల్గొన్నారు. తుది నివేదికను త్వరలోనే నీతి ఆయోగ్కు సమర్పించనున్నట్లు ప్రొఫెసర్ అభినాష్ సింగ్ తెలిపారు. -
ఇఫ్తార్ సహర్
శుక్ర శని అరకు 6.07 5.09 పాడేరు 6.06 5.08పొగమంచుతోఉక్కిరిబిక్కిరి ● అరుకులోయలో 11.0 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చింతపల్లి: అల్లూరి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ పొగమంచు తీవ్రత యధావిధిగానే కొనసాగుతోంది. అరుకులోయలో 11.0 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 12.8 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి వ్యవసాయ పరిశోదన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగ నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో పెదబయలులో 13.4 డిగ్రీలు, చింతపల్లిలో 13.5 డిగ్రీలు, కొయ్యూరులో 15.3 డిగ్రీలు, జి మాడుగులలో 16.0 డిగ్రీలు, అనంతగిరిలో 17.0 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఏడీఆర్ తెలిపారు. -
చింత సెగ
మన్యంలో చింతపండు సీజన్ మొదలైంది. ఊరంతా పులుపు.. గిరిజన రైతు గుండెల్లో మాత్రం చేదు అనుభవాలు.. ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడి సగానికి పడిపోయి కుదేలవుతుంటే, అండగా నిలవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం కనీస మద్దతు ధర ఇవ్వకుండా కళ్లు మూసుకుంది. నాణ్యతలో నంబర్ వన్ అని కితాబులు ఇచ్చే పాలకులకు, ఆ చింతను సేకరించే గిరిపుత్రుల చెమట చుక్కల విలువ మాత్రం కనిపించడం లేదు. అటు దళారీల సిండికేట్, ఇటు అధికారుల ఉదాసీనత మధ్య చింతపండు రైతులు నలిగిపోతున్నారు. కిలో రూ.50కు కొనుగోలు చేయాలి చింతపండు సేకరణ నుంచి అమ్మకాలు వరకు కష్టం అధికంగానే ఉంటున్నా అమ్మకాల సమయంలో గిట్టుబాటు కావడం లేదు. వారపుసంతలు, మండల కేంద్రాల్లో కొనుగోలు ధరలు పెరగకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. జీసీసీ కిలోకు రూ.50 మద్దతు ధర ప్రకటించి న్యాయం చేయాలి. – పాంగి సత్యారావు, గిరిజన రైతు, కామయ్యపేట, హుకుంపేట మండలం కిలో రూ.36 ధరతో కొనుగోలుకు ఆదేశాలు ఉన్నతాధికారులు కిలో రూ.36 ధరకు చింతపండు కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చారు. గతేడాది కూడా ఇదే ధరకు కొనుగోలు చేశాం.అన్ని సంతల్లోను చింతపండు కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నాం. చింతపండు ధరల పెంచాలని గిరి రైతుల డిమాండ్ను తమ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తాం. – వి.కృష్ణప్రసాదరావు, డీఎం, జీసీసీ, పాడేరు సాక్షి,పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలో చింతపండు సీజన్ ప్రారంభమైనప్పటికీ, గిరిజన రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. గిరిజన వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాల్సిన గిరిజన సహకార సంస్థ, గత ఏడాది వలే ఈ ఏడాది కూడా కిలోకు కేవలం రూ. 36 ధరనే ప్రకటించింది. మరోవైపు, ప్రైవేట్ దళారీలు సిండికేట్గా మారి అంతకంటే తక్కువ ధరకే కొనుగోళ్లు చేస్తూ గిరిజనులను నష్టపరుస్తున్నారు. ధరల వ్యత్యాసం.. మైదాన ప్రాంతాల్లో కిలో చింతపండు రూ. 60 పలుకుతుండగా, ఏజెన్సీలో కనీసం రూ. 50 మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ పాలకులు, జీసీసీ అధికారులు దీనిపై స్పందించడం లేదు. తగ్గిన దిగుబడి.. ఈ ఏడాది ప్రతికూల వాతావరణం వల్ల చింత చెట్లకు కాపు తగ్గింది. గతంలో ఒక చెట్టుకు సగటున 100 కిలోల దిగుబడి రాగా, ఈసారి అది 50 నుంచి 60 కిలోలకు పడిపోయింది. దిగుబడి తగ్గినప్పుడు ధర పెరగాల్సి ఉన్నా, మార్కెట్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పెరిగిన శ్రమ.. చింత కాయలు రాల్చడం, సేకరించడం, శుభ్రం చేసి వారపు సంతలకు తరలించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇంత శ్రమ పడినా పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతలో మేటి.. మన్యంలోని చింతపండు నాణ్యతలో నంబర్ వన్గా గుర్తింపు పొందింది. దీనికి మైదాన ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఉండటంతో ఏటా సుమారు రూ. 30 కోట్ల మేర వ్యాపారం జరుగుతోంది. గత ఏడాది జీసీసీ సుమారు 100 లారీల చింతపండును సేకరించగా, ప్రైవేట్ వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాలకు తరలించారు. ఇంత ప్రాధాన్యత ఉన్న పంటకు సరైన ధర దక్కకపోవడం గిరిజన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఆందోళన బాటలో.. జీసీసీ ప్రకటించిన రూ. 36 మద్దతు ధరను నిరసిస్తూ అనంతగిరి మండలం బూరుగు గ్రామంలో గిరిజన మహిళలు చింతపండు బుట్టలతో నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కిలోకు రూ. 50 చెల్లించి కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. చింతపండుకు గిట్టుబాటు ధర కల్పించని జీసీసీ గతేడాది మాదిరిగానే కిలో రూ.36 కొనుగోలు ధర ప్రకటన ధర పెంచకపోవడంపై ఉద్యమిస్తున్న గిరి రైతులు జీసీసీ ధరను ఆసరాగా తీసుకుని మరింత తగ్గిస్తున్న వ్యాపారులు మైదాన ప్రాంతాల్లో కిలో రూ.60కు విక్రయం ఆర్థికంగా నష్టపోతున్నా స్పందించని ప్రభుత్వం, అధికార యంత్రాంగం -
బడ్జెట్లో ఉద్యోగులకు నిరాశే..
పీఆర్సీ చెల్లింపులకు బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను దగా చేసింది. పీఆర్సీ కమిషన్ గడువు ముగిసి రెండున్నరేళ్లు కావస్తున్నా నేటికీ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించకపోవడం శోఛనీయం. నాలుగు డీఏలు, ఇతర బకాయిలు చెల్లింపులపై బడ్జెట్లో ప్రస్తావన లేకపోగా మరో బడ్జెట్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూ.3.22 లక్షలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉపాధ్యాయులు, ఉద్యోగులను నిరాశకు గురిచేసింది. మధ్యంతర భృతి గురించి ప్రస్తావన లేదు. అధికారంలోకి వచ్చి మూడో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం. ఇప్పటికై నా ప్రభుత్వం పీఆర్సీ కోసం నిధులు కేటాయించాలి. – ఎం.చిట్టియ్య, యూటీఎఫ్ నర్సీపట్నం డివిజన్ నాయకులు -
యువతకు కుచ్చుటోపీ
రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం అంటూ సూపర్సిక్స్లో భాగంగా హామీ ఇచ్చారు. 20 నెలలు గడిచినా ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. అయినప్పటికీ సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేశామని సీఎం చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఈరెండేళ్ల కాలానికి ప్రతి నిరుద్యోగికీ చంద్రబాబు ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది. – కోనేటి రామకృష్ణ, మున్సిపల్ వైస్చైర్మన్, నర్సీపట్నం -
బాకై ్సట్పై ప్రభుత్వ వైఖరి ప్రకటించాలి
పాడేరు రూరల్: బాకై ్సట్ తవ్వకాలపై కూటమి ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్స హెచ్చరించారు. బుధవారం ఆదివాసీ గిరిజన సంఘ కార్యాలయంలో ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బాకై ్సట్ వ్యతిరేక ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. ఆదివాసీల చట్టాలను, హక్కులను కాలరాస్తూ గిరిజన ప్రాంతాల్లోని బాకై ్సట్ వంటి ఖనిజ సంపదను లూటీ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అప్పలనర్స ఆరోపించారు. పార్టీల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ, ఆదివాసీ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన సలహా మండలి తక్షణమే బాకై ్సట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ముఖ్యంగా ఆదివాసీలకు నూరుశాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అరకు, చింతపల్లి ప్రాంతాల్లో బాకై ్సట్ తవ్వకాలు జరిపితే ఆదివాసీలు సర్వస్వం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎండీసీ పేరుతో అక్రమంగా లీజులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. మైనింగ్ ద్వారా రూ. 1.50 లక్షల కోట్ల పెట్టుబడులు, 60 వేల ఉద్యోగాలు వస్తాయనే ప్రచారంలో వాస్తవం లేదని, ఇది కేవలం ప్రజలను భ్రమల్లో ఉంచడానికి మోదీ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. ఈ నెల 21న జిల్లా కలెక్టర్కు ఆదివాసీ ప్రతినిధుల బృందంతో వినతిపత్రం అందజేయనున్నట్లు వారు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు ధర్మన పడాల్, పోతురాజు, చిన్నారావు, మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మూలకు చేరిన అటవీశాఖ వాహనం
కొయ్యూరు: అటవీ శాఖకు చెందిన జీపు నెల రోజులుగా కొయ్యూరులో మూలకు చేరింది. దీనికి అవసరమైన మరమ్మతులు చేయడంలో జరుగుతున్న జాప్యం కారణంగా వాహనం కలప డిపోలోనే ఉండిపోయింది. సాధారణంగా అటవీ సిబ్బంది ఈ వాహనం ద్వారా రాత్రి సమయాల్లో వివిధ రహదారుల్లో నిఘా, పర్యవేక్షణ చేసేవారు. అయితే, ఇటీవల స్టీరింగ్ సమస్య తలెత్తడంతో వాహనం కదల్లేని స్థితికి చేరుకుంది. ఫలితంగా అటవీ శాఖ తనిఖీలు నిలిచిపోయాయి. దీనిపై సెక్షన్ అధికారి శ్రీరాములు మాట్లాడుతూ.. వాహనాన్ని మరమ్మతుల నిమిత్తం నర్సీపట్నం పంపిస్తున్నామని, వారం రోజుల్లో తిరిగి వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించామని, త్వరలోనే వాహనాన్ని అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు. -
పూత పూసేనా..పిందె కట్టేనా!
నాతవరం: జీడిమామిడి తోటలు పొగమంచు కారణంగా కళ్లముందే పూత మాడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో వాతావరణం బాగుండడంతో జీడి మామిడితోటలు పూత ఏపుగా రావడంతో ఈ ఏడాది దిగుబడులు బాగుంటాయన్న ఆశతో రైతులు ఉన్నారు. ప్రకృతి రైతన్నలపై మంచు రూపంలో కన్నెర్ర చేయడంతో పిందె వచ్చేటప్పుడు పూత అంతా మాడిపోతుంది. నెల రోజులుగా ప్రతి రోజు దట్టంగా మంచు కురవడంతో జీడిమామిడి తోటలు పూత నల్లగా మాడిపోవడంతో రైతులు బెంగ పెట్టుకుంటున్నారు. జిల్లాలో వరి తర్వాత జీడిమామిడి, పామాయిల్, సరుగుడు తోటల సాగుపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. నాతవరం, మాకవరపాలెం, నర్సీపట్నం, గొలుగొండ, కశింకోట, రోలుగుంట, నక్కపల్లి, పాయకరావుపేట, కె.కోటపాడు, చోడవరం, బుచ్చెయ్యపేట, రాంబిల్లి, ఎస్.రాయవరం, చీడికాడ మండలాల్లో అధికంగా జీడిమామిడి తోటలను రైతులు సాగు చేస్తున్నారు. ఉద్యావనశాఖాధికారుల రికార్డుల అధారంగా జిల్లాలో జీడిమామిడితోటలు 28 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సాగు విస్తీర్ణంపై పరిశ్రమల ప్రభావం ఇటీవల కాలంలో నక్కపల్లి, ఎస్.రాయవరం, రాంబిల్లి మండలాల్లో పలు పరిశ్రమలు ఏర్పాటుకు రైతుల నుంచి భూసేకరణ చేయడంతో ఆయా మండలాల్లో చాలా వరకు జీడిమామిడి తోటలు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. మిగతా మండలాల్లో జీడి మామిడి తోటలు పూత ఆశాజనకంగా ఉండటంతో మంచు కారణంగా నాశనమౌవుతుంది, ఇటీవల కాలంలో ఉదయం 8 గంటల వరకు రోడ్డు కన్పించని విధంగా వర్షం కురిసేలా మంచు కురియడంతో వాహనదారులు సైతం లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి సాగుచేస్తున్న జీడిమామిడి తోటలు పంట చేతికందివచ్చే సమయంలో ఈ విధంగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మంచు రూపంలో కొంత, తెగుళ్ల రూపంలో కొంత జీడి మామిడికి తీవ్ర సష్టం జరుగుతోంది. అరకొరగా కాస్తున్న జీడిమామిడి తోటలు పంటలను కోతులు కొంత నష్టం కలిగిస్తున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. మంచు కురియక ముందు పూత బాగా కన్పించేది. ప్రస్తుతం పిందె వచ్చే సమయంలో పూత మాడిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో తెగుళ్ల నిరవారణకు క్రిమిసంహరిక మందులు పిచికారి చేస్తున్నారు. తెగుళ్లు పీడిస్తున్నా రైతులకు సలహాలు సూచనలు ఇచ్చే అధికారులు మచ్చుకై నా గ్రామాల్లో కానరాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. జీడిమామిడి తోటలు తెగుళ్లు పూత మామిడిపోతున్న విషయంపై జిల్లా ఉద్యవనశాఖాధికారి రాజశేఖర్ని సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. ప్రభుత్వమే అదుకోవాలి జీడి మామిడి తోటలు సాగు చేసే రైతులను ప్రభుత్వమే అదుకోవాలి. మంచు రూపంలో తెగుళ్లు రూపంలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. పెట్టుబడులు, క్రిమిసంహరిక మందుల రేట్లు గతంతో పోల్చుకుంటే దారుణంగా పెరిగిపోయాయి. పంట చేతికందే సమయంలో పూత మాడిపోవడం చూస్తే చాలా బాధేస్తుంది. – కర్రి వెంకటరమణ, ఎ.శరభవరం గ్రామం జీడిమామిడికి మంచుదెబ్బ జిల్లా వ్యాప్తంగా 28 వేల ఎకరాల్లో జీడిమామిడి సాగు నక్కపల్లి, కశింకోట, ఎస్.రాయవరం మండలాల్లో తగ్గిన సాగు -
పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అనకాపల్లి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. పీఏసీఎస్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల16 నుంచి నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా బుధవారం ఆందోళన చేశారు. స్థానిక నెహ్రూచౌక్ జంక్షన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా గల జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించి, బ్యాంక్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకుండా పోయిందన్నారు. 2019 తర్వాత జాయిన్ అయిన పీఏసీఎస్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, గ్రాడ్యుటీ రూ.ఐదు లక్షలకు పెంచాలని, డ్యూటీ పద్దులను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో సమ్మె చేస్తున్నట్టు చెప్పారు. రెండు నెలలుగా నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో సమ్మె చేయవలసి వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.రమణ, సీఐటీయూ జిల్లా నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, గంటా శ్రీరామ్, యూనియన్ జిల్లా నాయకులు వై.లక్ష్మణరావు, లోవరాజు, జగన్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.9.95 కోట్లతో వరాహ నది గట్టు పటిష్టత
కోతకు గురైన వరాహ నది గట్టును పరిశీలిస్తున్న ఇరిగేషన్ అధికారులు ఎస్.రాయవరం: వరాహ నది గట్టు పటిష్టతో పాటు గ్రోయిన్ దిగువన కాలువలకు నీరు ప్రవహించేలా నిర్మాణాలు పూర్తి చేయాలని ఇరిగేషన్ ఎస్ఈ పి.అప్పలనాయుడు సూచించారు. సోమిదేవపల్లి గ్రోయిన్ వద్ద గడిచిన 15 ఏళ్లుగా కోతకు గురైన వరాహ నది గట్టు నిర్మాణానికి రూ.9.95 కోట్లు విడుదల కావడంతో బుధవారం ఆయన పరిశీలించారు. వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ పరిశీలనలో ఈఈ వి.బాలసూర్యం, డీఈఈ ఎం.వి.సురేష్కుమార్, ఏఈ అమీనాభాను, తదితరులు పాల్గొన్నారు. -
రూ.1.17 కోట్లతో అంగన్వాడీ భవనాలు
ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడుతున్న ఉమ్మడి విశాఖ జెడ్పీచైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర సాక్షి,పాడేరు: జెడ్పీ నిధులు రూ.1.17 కోట్లతో పాడేరు డివిజన్లోని అంగన్వాడీ కేంద్రాలకు భవన నిర్మాణాలు చేపడుతున్నామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర తెలిపారు. బుధవారం ఆమె జిల్లా కేంద్రం పాడేరులో నిర్మిస్తున్న ఐసీడీఎస్ కేంద్ర కార్యాలయం,శిశు గృహ భవన నిర్మాణాలను పరిశీలించారు. ఐసీడీఎస్ పీడీ కార్యాలయాన్ని సందర్శించారు. పీడీ ఝన్సీరామ్పడాల్తో అంగన్వాడీ భవన నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అల్లూరి సీతారామరాజు పేరిట ఏర్పడిన జిల్లాలో కొత్త భవనాల నిర్మాణాలకు తనవంతుగా కృషి చేస్తున్నానన్నారు.ఎన్నడూలేని విధంగా జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి భవనాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చామన్నారు.జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్ పీడీ కార్యాలయానికి రూ.25లక్షలు, శిశు విహార్ భవనానికి రూ.5లక్షలు కేటాయించామన్నారు. గూడెంకొత్తవీధి, జి.మాడుగుల, పాడేరు, అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు మండలాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన 17 అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు రూ.87లక్షలు కేటాయించామన్నారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. -
బకులూరు మైనింగ్ క్వారీపై విచారణ
కొయ్యూరు: బకులూరు మైనింగ్ క్వారీపై వచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాల మేరకు పాడేరు ఆర్డీవో లోకేశ్వరరావు బుధవారం బకులూరులో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇరు వర్గాలతో విడివిడిగా చర్చలు జరిపారు. రంగురాళ్ల తవ్వకాలకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, స్థానికులు తనను అడ్డుకుంటున్నారని పి. సత్యనారాయణ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అలాగే, కొండపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అనధికారికంగా తవ్వకాలు జరుపుతున్నారని, వారిని నిరోధించాలని ఆర్డీవోను కోరారు. అనధికారిక తవ్వకాలను అడ్డుకోవాలని ఆర్డీవో పోలీసులను ఆదేశించారు. చట్టవిరుద్ధంగా ఎవరు తవ్వకాలు జరిపినా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామానికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడం లేదని స్థానికులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సత్యనారాయణ, మైనింగ్ పనులు ప్రారంభమైన తర్వాత గ్రామంలో అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. మైనింగ్ జరగబోయే ప్రాంతం రెవెన్యూ భూమి అని, దీనిని ఎవరూ ఆక్రమించకూడదని ఆర్డీవో స్పష్టం చేశారు. ప్రస్తుతం మైనింగ్ అధికారులతో కలిసి కొండపై సర్వే నిర్వహిస్తున్నామని, అది పూర్తయిన తర్వాత పూర్తి వివరాలతో కూడిన నివేదికను కలెక్టర్కు సమర్పిస్తామని ఆర్డీవో తెలిపారు. ఈ విచారణలో తహసీల్దారు మురళీబాబు, సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ కిషోర్వర్మ, ఆర్ఐ దొర తదితరులు పాల్గొన్నారు. -
మెనూ అమలు చేయకపోవడంపై విచారణ
చింతపల్లి: స్థానిక బీసీ వసతి గృహంలో విద్యార్థులకు మెనూ ప్రకారం సక్రమంగా భోజనం అందించడం లేదని ఎస్ఎఫ్ఐ నాయకుడు జీవన్, ఎంఈవో ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఈ వసతి గృహంలో ఉంటూ స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సమస్యలపై బుధవారం ఎంఈవో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. వసతి గృహంలోని వంట మనుషులు పార్వతి, సత్యవతి వార్డెన్ సూచించిన మెనూను సక్రమంగా అమలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై తాము ప్రశ్నిస్తే వారు తమను తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని ఎంఈవో దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంఈవో ప్రసాద్ వసతి గృహం వార్డెన్, వంట మనుషులను విచారించారు. విద్యార్థుల పట్ల ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వార్డెన్ శకుంతలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గిడ్డి వరలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
చాపరాయి వద్ద ఏర్పాటు చేస్తున్న రోడ్డు భద్రతపై హెచ్చరిక బోర్డు డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి వద్ద, అలాగే జైపూర్ జంక్షన్ వద్ద బుధవారం పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టారు. ఎస్పీ అమిత్బర్దర్ ఆదేశాల మేరకు, ఎస్ఐ ఎల్.సురేష్ ఆధ్వర్యంలో పలుచోట్ల హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ.. పర్యాటక ప్రాంతాలకు వచ్చే వాహనదారులు అతివేగంగా బైక్లు, ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాహనదారులలో అవగాహన కల్పించేందుకు, ప్రమాద హెచ్చరికలు ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు ఈ బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు వేగ నియంత్రణ పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
జి.మాడుగుల: క్రీడలు మాసికి ఉల్లాసానికి ఎంతో దోహదపడాతాయని, గిరిజన యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని క్రీడల్లో ఉన్నత స్థానాలకు రాణించాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఏఎస్సార్ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. మండలంలో సొలభం పంచాయతీ గొందిపాడు గ్రామంలో శ్రీవేములమ్మ తల్లి జాతర మహోత్సవాలు సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను బుధవారం ఆయన ప్రారంభించారు. మొదటి మ్యాచ్ను టాస్ వేసి ప్రారంభించిన ఆయన ఇరుజట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని ఉత్సాహ పరిచారు. గిరిజన ప్రాంతాల్లో జరిగే జాతరల్లో నిర్వహకులు క్రీడా పోటీలు ఏర్పాటుచేసిన యువతను క్రీడల్లో ప్రొత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఐసరం హనుమంతరావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండంనాయుడు, ఎస్టీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కిల్లో కోటిబాబు, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు బోనంగి అనిల్కుమార్ పాల్గొన్నారు. -
చదరంగంలో రాణించాలి ● కలెక్టర్ దినేష్కుమార్
● ప్రతిభావంతులకు సర్టిఫికెట్ల పంపిణీ చెస్ క్రీడాకారులతో కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు రూరల్: చదరంగం క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలని కలెక్టర్ దినేష్కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి చదరంగం పోటీల్లో ప్రతిభ కనబరిచిన సుమారు వంద మంది విద్యార్థులకు (బాలబాలికలు) బుధవారం కలెక్టర్ తన కార్యాలయంలో సర్టిఫికేట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని, ముఖ్యంగా క్రీడల్లో నైపుణ్యం కలిగి ఉండాలని ఆకాంక్షించారు. ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతి వేదికగా నిర్వహించనున్న ’శాప్ లీగ్’ చదరంగం పోటీల్లో పాల్గొని, జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని క్రీడాకారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జగన్మోహన్రావు, ఎస్జీఎఫ్ సెక్రటరీ సూరిబాబు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మహిళలకు చంద్రబాబు మళ్లీ మోసం
చంద్రబాబు ప్రభుత్వం మహిళలను మళ్లీ మోసం చేసింది. సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు. కానీ ఆ హామీ నెరవేర్చలేదు. గ్యాస్ సబ్సిడీ కూడా సక్రమంగా బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదు. పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మూడో బడ్జెట్ ప్రవేశపెట్టినా పలు పథకాల ఊసెత్తడం లేదు. అంతా గ్యాస్ క బుర్లు తప్పా చిత్తశుద్ధి కనిపించడం లేదు. అమలు చేయలేని హామీలు, వాగ్దానాలు చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచి మోసం చేసిన చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అన్ని విధాలుగా ప్రజలను మోసం చేశారు. వీటిపై చంద్రబాబు ప్రజలకు జవాబు చెప్పాలి. – షేక్ ఉన్నీషా బేగం, కోఆప్షన్ మెంబరు, మాడుగుల -
తీరాన త్రివర్ణ తేజం
ఏయూ క్యాంపస్: కఠోర శిక్షణకు ధైర్యం జతకలిసి, సమన్వయం తోడై సాహస గాథగా మారిన రోజు అది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్–2026 నేపథ్యంలో బీచ్రోడ్డులో బుధవారం నిర్వహించిన సిటీ పరేడ్ ఫుల్డ్రెస్ రిహార్సల్స్ విశాఖ వాసుల గుండెల్లో దేశభక్తి జ్వాలలను రగిలించాయి. వందేమాతరంతో ప్రారంభమైన వేడుకలో చేతక్ హెలికాప్టర్లు త్రివర్ణ పతాకాన్ని ఆకాశంలో ఎగురవేయగా, కమోవ్–28 హెలికాప్టర్లు, డార్నియర్ విమానాలు గగనతలాన్ని చీల్చాయి. ర్యాపిడ్ రెస్పాన్స్ బోట్లు సముద్రంపై వేగాన్ని చాటగా, ఫైటర్ జెట్లు గర్జనలు వినిపించాయి. తీరాన్ని తాకిన బిఎంపి యుద్ధ ట్యాంకులు, మైరెన్ కమాండోల తాడుసాహసం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇండియన్ నేవీ సత్తాను ప్రతి విన్యాసం ప్రతిధ్వనింపజేసింది. తరువాత జరిగిన కవాతులో ఎన్సీసీ విద్యార్థులు దేశాల పతాకాలతో ముందంజ వేయగా, నేవీ బ్యాండ్, కోస్ట్ గార్డ్, మాజీ సైనికులు క్రమశిక్షణకు అద్దం పట్టారు. విదేశీ నౌకాదళ సిబ్బంది పాల్గొనడంతో కార్యక్రమం అంతర్జాతీయ వాతావరణాన్ని సంతరించుకుంది. జానపద నృత్యాలు, కోలాటం, గరగలతో సాగరతీరంలో సాంస్కృతిక శోభ పరచుకుంది. శిక్షణ, ధైర్యం, దేశభక్తి కలిసిన ఈ రిహార్సల్ విశాఖకు మరపురాని క్షణాల్ని అందించింది. లేజర్షో.. బాణసంచా వెలుగులు సిటీ పరేడ్ రిహార్సల్స్లో భాగంగా నౌకల పైనుంచి చేసిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే విధంగా బాణసంచా వెలుగులు జిగేల్ మన్నాయి. -
50 ఏళ్లకే పింఛన్ ఎప్పుడిస్తారు.?
బీసీ మహిళలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు గొప్పగా చెప్పారు. ఆయన మాటలు విని ప్రజలు ఓట్లు వేస్తే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లలో కనీస కేటాయింపు లేవు. పాత పింఛన్లను నిబంధనలు పేరుతో తగ్గించేసేశారు. కొత్త పింఛన్లు రెండేళ్లుగా ఇవ్వలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుండడంతో 50 ఏళ్లు దాటిన బీసీ మహిళలు ఎంతో ఆశతో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అమలు కాని హామీ ఇచ్చిన చంద్రబాబు మోసాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్పా ప్రజలకు చేసింది శూన్యం. – కరక అప్పలరాజు, జిల్లా వైఎస్సార్సీపీ కమిటీ సభ్యుడు -
పకడ్బందీగా టెన్త్ పరీక్షల నిర్వహణ
మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్కుమార్, పక్కన ఎస్పీ అమిత్బర్దర్, డీఈవో రామకృష్ణారావు సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు జిల్లాలకు కలిపి మొత్తం 72 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 47 కేంద్రాల్లో 7,299 మంది రెగ్యులర్, 505 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు ఆయన వెల్లడించారు. పోలవరం జిల్లాలో 35 కేంద్రాల్లో 4,158 మంది రెగ్యులర్, 26 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. ఓపెన్ స్కూల్కు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10 కేంద్రాల్లో 1,003 మంది, పోలవరం జిల్లాలో ఐదు కేంద్రాల్లో 414 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని ఆయన తెలిపారు. ఇంటర్కు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3 కేంద్రాల్లో 582 మంది, పోలవరం జిల్లాలో 3 కేంద్రాల్లో 603 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో చేరుకునేలా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పరీక్షా సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యాత్మక, ప్రైవేట్ కేంద్రాలలో మాస్ కాపీయింగ్కు తావు లేకుండా సీసీ కెమెరాలు, అదనపు భద్రతా సిబ్బందిని కేటాయిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రశ్నాపత్రాల తరలింపు సమయంలో తనిఖీ బృందాలకు ఎస్కార్ట్ పోలీసులు అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ అమిత్ బర్దర్, డీఈవో రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
గగన గర్జనలతో సాగర సంబరం
యుద్ధ విమానాల విన్యాసాలుఏయూ క్యాంపస్: ఆకాశం గర్జించింది..ం సముద్రం సాక్షిగా నిలిచిందిం.. భారత నావికాదళ శౌర్యం మరొకసారి విశాఖ గగనతలాన్ని కంపింపజేసింది. లోహ విహంగాలు రెప్పపాటు వేగంతో దూసుకెళ్లి చేసిన సమన్వయ విన్యాసాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశాయి. క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తించిన ఈ ప్రదర్శనలు దేశభక్తి జ్వాలను రగిలించాయి. అయిల్ బంకర్లను లక్ష్యంగా చేసుకుని చేసిన సాహస విన్యాసాలు యుద్ధ సన్నివేశాన్ని తలపించాయి. చేతక్ హెలికాప్టర్ నుంచి మైరెన్ కమాండోలు సముద్రంలోకి దూకిన క్షణం ప్రేక్షకుల గుండెల్లో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. అలల్ని చీల్చుకుంటూ తీరానికి చేరుకుని లక్ష్యాలను ఛేదించిన తీరు నావికాదళ దిట్టతను చాటిచెప్పింది. గగనతలంలో యుద్ధ సిద్ధతను సూచిస్తూ సుఖోయ్ విమానాలు యుద్ధవిమానాలు గర్జించగా, సముద్ర గస్తీ సామర్థ్యానికి ప్రతీకలైన డోర్నియర్ విమానాలు సమన్వయంతో విహరించాయి. నేలపై యుద్ధ టాంకులపై సైనికులు ప్రదర్శించిన ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు వారి త్యాగస్ఫూర్తిని, దేశనిబద్ధతను ప్రతిబింబించాయి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ కార్యక్రమాల భాగంగా ఈ నెల 19న జరగనున్న అంతర్జాతీయ సిటీ పరేడ్కు ముందస్తు సన్నాహకంగా మంగళవారం నిర్వహించిన ఈ ప్రదర్శనలు నగరాన్ని ఉత్సాహోత్సాహాలతో నింపాయి. విదేశీ అతిథులు, నావికాదళ ప్రతినిధులు మన సైనిక శక్తిని ఆసక్తిగా తిలకిస్తూ ప్రతి క్షణాన్ని తమ కెమెరాల్లో బంధించారు. సముద్రంలో వరుసగా నిలిచిన యుద్ధ నౌకలపై వెలిగిన విద్యుత్ కాంతులు, చివరగా నిర్వహించిన ఫైర్వర్క్స్ కార్యక్రమానికి ముగింపు పలుకుతూ విశాఖ రాత్రిని వేడుకగా మార్చాయి. రాత్రి నౌకలపై నుంచి ప్రదర్శించిన లేజర్ షో ఎంతగానో ఆకట్టుకుంది. మెరిసిన రాష్ట్ర జానపద సంపద ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు సాగిన ఈ పరేడ్ సాంస్కృతిక వైభవం, సైనిక క్రమశిక్షణ, గగన విన్యాసాలతో అబ్బురపరిచింది. ఆంధ్రప్రదేశ్ జానపద సంపద వేదికపై మెరిసింది. ఆదివాసీ సంప్రదాయ నృత్యం థింసా నుంచి కోలాటం, డప్పు వాద్యం, కొమ్ము నృత్యం, కూచిపూడి, తప్పెటగుళ్లు, పులివేషం, బుట్టబొమ్మలు వరకూ ప్రతి ప్రదర్శన ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. సంప్రదాయ వేషధారణలో కళాకారులు లయబద్ధంగా చేసిన నృత్యాలు కనులవిందుగా నిలిచాయి. -
చింతపండుకు గిట్టుబాటు ధర
● గిరి మహిళలు డిమాండ్ ● తట్టలు నెత్తిన పెట్టుకుని వినూత్నంగా నిరసన అనంతగిరి (అరకులోయ టౌన్): గిరిజనులు సేకరించిన చింతపండుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రొంపెల్లి పంచాయతీలో గిరిజన మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. మంగళవారం చింతపండు తట్టలను నెత్తిన మోస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు.ఈ సందర్భంగా రొంపెల్లి వార్డు సభ్యుడు సోమల అప్పలరాజు, గ్రామస్తులు బూరుగ పెంటమ్మ, పోలమ్మ గిరిజన సహకార సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో కిలో చింతపండు ధర రూ. 60 పలుకుతుంటే, జీసీసీ కేవలం రూ. 36 ధర చెల్లించనుండటం గిరిజనుల శ్రమను అవమానించడమేనని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు ధరను రూ. 50కు పెంచాలని వారు డిమాండ్ చేశారు. వారపు సంతల్లో దళారుల ఆగడాలను అరికట్టాలి. తూకాల్లో మోసాలు (బెట్టు కాటాలు) జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న గిరిజన రైతులకు అండగా నిలిచి, వారు పండించిన పంటలకు సరైన మద్దతు ధర కల్పించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నిరుద్యోగ భృతి ఎప్పుడు చెల్లిస్తారు?
ఎన్నికల ముందు చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీలు గుప్పించారు. తీరా టీడీపీ ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండేళ్లు గడుసున్నా వాటిని అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడో బడ్జెట్లో నిరుద్యోగులకు ఎటువంటి నిధులు కేటాయించకపోవడం దారుణం. నిరుద్యోగ యువతకు ఎప్పటి నుంచి నిరుద్యోగ భృతి చెల్లిస్తారు? – పొట్టంగి వెంకటరావు, నిరుద్యోగి, వర్రా బుడియవలస, శిరగాం పంచాయతీ, అరకులోయ మండలం -
ఉపాధి హామీ నిధుల గోల్మాల్
చింతపల్లి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చింతపల్లి మండలంలో భారీగా అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. సుమారు రూ. 46 లక్షల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయని అధికారులు గుర్తించారు. మంగళవారం చింతపల్లి మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక (సోషల్ ఆడిట్) నిర్వహించారు. మండలంలోని 17 పంచాయితీలకు సంబంధించిన పనుల వివరాలను ఈ సమావేశంలో వెల్లడించారు. 13 పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనుల పేరిట రూ. 1.28 కోట్లు ఖర్చు చేసినట్లు చూపగా, అందులో రూ. 46 లక్షల మేర అవకతవకలు జరిగినట్లు తనిఖీల్లో తేలింది. పనులు చేయకుండానే చేసినట్లు నమోదు చేయడం, నేమ్ బోర్డులు ఏర్పాటు చేయకుండానే నిధులు డ్రా చేయడం వంటివి వెలుగుచూశాయి. పలు పంచాయతీల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, గ్రావెల్ రోడ్ల నిర్మాణ పనులు పూర్తికాకపోయినా, రికార్డుల్లో మాత్రం పనులు ముగిసినట్లు చూపారు. తాజంగి పంచాయతీలో రూ.6 లక్షలు, బలపంలో రూ.5 లక్ష లు, గొందిపాకుల, ఎర్రబొమ్మలు: ఒక్కో పంచాయతీలో రూ. 3 లక్షల చొప్పున అవినీతి జరిగినట్లు గుర్తించారు. మిగిలిన పంచాయితీల్లోనూ నిర్వహణ నిధుల వినియోగంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఎవరినీ ఉపేక్షించం: పీడీ విద్యాసాగర్ ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ హెచ్చరించారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుండి పైస్థాయి అధికారుల వరకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కఠిన నిర్ణయాలు అవసరం: ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టవద్దని ఎంపీపీ అనూషదేవి, జెడ్పీటీసీ బాలయ్య కోరారు. ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా అరికట్టవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ శంకరరావు, ఎస్ఆర్పీ అచ్యుత్, ఏపీడీ సీతయ్య, ఎంపీడీవో సీతామహాలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సామాజిక తనిఖీలో బయటపడ్డ రూ. 46 లక్షల అవినీతి -
వ్యవసాయ రంగానికి అరకొర కేటాయింపులు
అన్నదాతను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది. ఇటీవల ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అరకొర కేటాయింపులు చేసింది. గత ప్రభుత్వంలో రైతులకు వర్తింపజేసిన ఉచిత పంటల బీమా పథకం అటకెక్కించింది. దీనివల్ల ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ పెట్టుబడులు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించినా సరే సున్నావడ్డీ రాయితీ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ 3 శాతం మాత్రమే జమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 4 శాతం వడ్డీ రాయితీ ఎగనామం పెట్టింది. – శానాపతి కొండలరావు, ఏఎంసీ మాజీ చైర్మన్, ఎం. కోటపాడు, మాడుగుల మండలం -
రోడ్డు ప్రమాదంలో మృతి
మహాశివరాత్రి పర్వదినం.. ఆ కొండకోనల్లో శివనామస్మరణ మారుమోగుతున్న వేళ, ముగ్గురు గిరిజన యువకులు భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. మరో కొద్దిసేపట్లో ఇళ్లకు చేరి కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారనగా.. కాలం కాటు వేసింది. బైక్ ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబళించింది. పది రోజుల క్రితమే తండ్రి అయిన రమేష్, తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకై న సూర్యప్రకాష్, ఉన్నత చదువుల ఆశలతో ఉన్న పౌలు.. ఇలా ముగ్గురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆ పసికందు ఏడుపు, తల్లిదండ్రుల రోదనలు చూస్తుంటే విధి ఎంత బలీయమైనదో అర్థమవుతోంది. సంఘటన స్థలంలో తీవ్రంగా గాయపడి పడి ఉన్న యువకులుసాక్షి, పాడేరు: మహాశివరాత్రి పర్వదినం వేళ మత్స్యగుండం పుణ్యక్షేత్రంలో భక్తిశ్రద్ధలతో గడిపిన ఆ యువకులు.. మరో కొద్దిసేపట్లో ఇళ్లకు చేరుకుంటారనగా విధి వంచించింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర బైక్ ప్రమాదంలో ముగ్గురు గిరిజన యువకులు ప్రాణాలు కోల్పోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.ప్రమాదం జరిగిందిలా..మత్స్యగుండం నుంచి పాడేరు వెళ్లే ప్రధాన రహదారిపై గుత్తులపుట్టు సంతబయలు ప్రాంతంలోని ఓ ప్రమాదకర మలుపు వద్ద వీరి బైక్ వేగంగా వెళ్లి ప్రహరీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న గెమ్మెలి రమేష్ (25), వెనుక కూర్చున్న రేగం సూర్యప్రకాష్ (28), సీదరి పౌలు (20) తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సూర్యప్రకాష్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గెమ్మెలి రమేష్ 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. సీదరి పౌలు జిల్లా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు.నెల రోజుల క్రితమేతండ్రి అయ్యాడు..వంతరపాడు గ్రామానికి చెందిన గెమ్మెలి రమేష్ మృతి ఆ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ. అతనికి ఏడాది క్రితం వివాహమైంది.నెలరోజుల క్రితం భార్య జ్యోతి మగశిశువుకు జన్మనిచ్చింది. పసికందుతో ఉన్న భార్య, తన భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు అక్కడి వారిని కలచివేసింది.ఉన్నత చదువుల ఆశలు ఆవిరి!గొందిరాపకు చెందిన సూర్యప్రకాష్ తల్లిదండ్రులకు తనే సర్వస్వం. మోదమాంబ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అతను, బాగా చదువుకుని తమ కష్టాలు తీరుస్తాడని ఆశపడిన తల్లిదండ్రులు రేగం పొట్టన్న, పెద్దమ్మలు ఇప్పుడు పుత్రశోకంతో కుమిలిపోతున్నారు.ఇంటర్లోనే అనంతలోకాలకు..మదర్ థెరిసా జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సీదరి పౌలు అకాల మరణం ముల్లుమెట్ట గ్రామాన్ని శోకసంద్రంలో ముంచింది. దైవ సేవకుడైన తండ్రి సీదరి రాజారావు తన కుమారుడి మృతదేహం వద్ద రోదించడం చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు.మంగళవారం సాయంత్రం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించారు. బంధువుల ఆర్తనాదాల మధ్య గిరిజన సంప్రదాయ ప్రకారం ముగ్గురు యువకులకు అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందడం స్థానికంగా అందరినీ కలచివేసింది.యువకుల మృతదేహాలు -
పీహెచ్సీని సందర్శించిన డీఎంహెచ్వో
వాడచీపురుపల్లి పీహెచ్సీలో డీఎంహెచ్వో హైమావతి పరవాడ: మండలంలోని వాడచీపురుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్వో) హైమావతి మంగళవారం సందర్శించారు. జిల్లాలో అమలవుతున్న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని శత శాతం పూర్తిచేసేలా కృషి చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. సిబ్బంది బయోమెట్రిక్ విధానాన్ని విధిగా పాటించాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఈహెచ్ఆర్ విధానాన్ని క్రమం తప్పకుండా పాటించాలని సూచించారు. ఆమె వెంట వైద్యాధికారులు రంజిత్, కనకఅప్పారావు, ఫాతిమా బేగమ్, ఎంపీహెచ్ఈవో గణేష్ ఉన్నారు. -
పోతన్న.. పోటీ పరీక్షల్లో మిన్న
కె.కోటపాడు: డిప్యూటీ డీఈవో పరీక్ష ఫలితాల్లోనూ మండలంలోని మర్రివలస గ్రామానికి చెందిన కన్నూరి పోతన్న సత్తా చాటారు. సోమవారం రాత్రి వెలువడిన ఫలితాల్లో డిప్యూటీ డీఈవో పోస్టుకు ఎంపికయ్యారు. 2023 నవంబర్లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం డిప్యూటీ డీఈవోల పోస్టులకు ప్రత్యేక పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎంఏ, బీఈడీతోపాటు పాఠశాలల్లో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న వారు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రావికమతం మండలం మేడివాడ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పోతన్న ప్రస్తుతం డిప్యూటీ డీఈవోగా ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రూపు–2 ఫలితాల్లోనూ సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు అర్హత సాధించడం విశేషం. హాస్టల్ చదువులు సాగించి... పోతన్న తల్లిదండ్రులు కృష్ణ, అక్కయ్యమ్మ వ్యవసాయం చేస్తుండేవారు. వీరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో కుమారుడిని హాస్టల్లో చేర్పించి చదివించారు. అతను కె.కోటపాడులో బీసీ వసతి గృహంలో ఉంటూ పదో తరగతి వరకు, పెందుర్తి జూనియర్ కళాశాలలో ఇంటర్, ఏవీఎన్ కళాశాలలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ, బీఈడీ చదివారు. 2008 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయుడిగా బుచ్చెయ్యపేట మండలం రాజుపాలెం, పెందుర్తి మండలం రెల్లికాలనీ పాఠశాలల్లో పనిచేశారు. వేసవి సెలవుల్లో విజయవాడ, విజయనగరం, నంద్యాల ప్రాంతాల్లో గ్రూపు–1, 2 పోస్టులకు కోచింగ్ తీసుకున్నట్టు పోతన్న తెలిపారు. -
పెంచిన పాల ధరలను తక్షణమే తగ్గించాలి
అనకాపల్లి: విశాఖ డెయిరీ పాల ధరను పెంచడం అన్యాయమని, తక్షణమే తగ్గించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.మాణిక్యం డిమాండ్ చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఐద్వా ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. పాల ధర పెంపుతో డెయిరీ యాజమాన్యాలు లాభాలు పొందుతున్నాయన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి డి.డి. వరలక్ష్మి, సహాయ కార్యదర్శులు మంగతాయారు, ఆర్.లక్ష్మి, జగదీశ్వరి, దేవుళ్లమ్మ, చిట్టమ్మ పాల్గొన్నారు. దేవరాపల్లి: విశాఖ డెయిరీ యాజమాన్యం పెంచిన పాల ధరలను తక్షణమే తగ్గించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడారు. లీటరకు రూ.2 ధర పెంచి ప్రజలపై భారం మోపిందని, తక్షణమే ఉపసంహరించుకోవా లని కోరారు. లేబర్ ఖర్చులు పెరిగాయని యాజ మాన్యం కుంటుసాకులు చెబుతోందన్నారు. రైతుల నుంచి పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తున్న విశాఖ డెయిరీ యాజమాన్యానికి లాభాల దాహం ఇంకా తీరలేదని ఎద్దేవా చేశారు. డెయిరీ కార్మికులకు కార్మిక చట్టం ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని, 400 మందిని అన్యాయంగా తొలగించారని విమర్శించారు.ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ధర్నా చేస్తున్న ఐద్వా నాయకులు -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కోటవురట్ల: రోడ్డు ప్రమాదంలో కొడవటిపూడి గ్రామానికి చెందిన పెదపాటి సత్యవతి(55) మృతి చెందింది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మాకవరపాలెంలోని తన కుమారుడు పెదపాటి బ్రహ్మాజీ ఇంటికి సోమవారం వెళ్లింది. తిరిగి కుమారుడితో కలిసి స్కూటీపై మంగళవారం స్వగ్రామానికి బయలుదేరింది. ఈ క్రమంలో కె.వెంకటాపురం దాటాక జీడిపిక్కల ఫ్యాక్టరీ సమీపంలో స్కూటీ సడన్ బ్రేక్ వేయడంతో ఆమె అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న సత్యవతి తలకు తీవ్ర గాయం కావడంతో హుటాహుటిన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతురాలికి భర్త నారాయణరావు, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త నారాయణరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కేఆర్ మార్టు భస్మీపటలం
అగ్ని ప్రమాదానికి గురైన కేఆర్ మార్ట్కష్టాన్నే నమ్ముకుని కూడబెట్టిన సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న ‘కేఆర్ మార్టు’ భస్మీపటలమైంది. ఇది కళ్ల ముందే కాలిపోతుంటే మార్టు యాజమాని నిశ్చేష్టుడిపోయాడు. మంటలార్పడం వీలుగాక ఆర్తనాదాలు చేశాడు. తన కలల ప్రపంచం ఒక్కసారిగా అగ్నికి ఆహుతై బుగ్గి పాలవడంతో కన్నీరుమున్నీరయ్యాడు. పూడిమడక రోడ్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించింది. అచ్యుతాపురం రూరల్: పూడిమడక రహదారిలో కేఆర్ మార్ట్లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు గానీ ప్రాణనష్టం గానీ జరగలేదు. ఫ్లేంబుల్ సామగ్రి ఉండటంతో ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించినా వీలులేకుండా పోయింది. యలమంచిలి, అనకాపల్లి, ఏపీఐఐసీ, ఏషియన్ పెయింట్స్, లారస్ పరిశ్రమల నుంచి అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించాయి. అప్పటికే అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతూ ఒక్కసారిగా మార్టు మొత్తం చుట్టేయడంతో కాలి బూడిదైపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు యలమంచిలి ఫైర్ సేఫ్టీ అధికారి డి.రాంబాబు, బంగార్రాజు నిర్ధారించారు. పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్, అచ్యుతాపురం సీఐ చంద్రశేఖర్రావు, ఎస్ఐ సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. కలల ప్రపంచం బుగ్గి పాలవడంతో కన్నీరుమున్నీరు.. కేఆర్ మార్ట్ ప్రొప్రైటర్ కోన వెంకటరావు చిన్నప్పటి నుంచి కష్టాన్నే నమ్ముకున్నారు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ సంపాదించి సొమ్ముతో ఆరేళ్ల క్రితం పెట్టుకున్న మార్ట్లో హౌస్ కీపింగ్, గ్రోసరీ, కిరాణా, ప్లాస్టిక్, స్టేషనరీ, తదిదతర సామగ్రి హోల్సేల్గా విక్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అగ్నికి ఆహుతి అయిపోవడంతో గుండెలవిసేలా విలపించాడు. కుటుంబీకుల ఆర్తనాదాలు వర్ణనాతీతంగా మారాయి. సొంత సొమ్ముతోపాటు అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి అంతా అగ్గి పాలైందని ఆవేదన చెందారు. రెండు నెలల్లో మూడో ప్రమాదం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. రెండు నెలల్లో అదే ప్రాంతంలో కిలో మీటరు పరిసరాల్లో ఇది మూడో అగ్ని ప్రమాదం కావడం గమనార్హం. షార్ట్ సర్క్యూట్లే ప్రధాన కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. రూ.లక్షలు, రూ.కోట్లలో వ్యాపారాలు చేసుకునే వ్యాపారులు ఎంత మేరకు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో ఇప్పటికీ శేష ప్రశ్నగానే మిగిలింది. షార్ట్ సర్క్యూట్లు జరగడానికి ఎలక్ట్రికల్ వైరింగ్ సరిలేకపోవడం ప్రధాన కారణం. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ఫ్లేంబుల్ మెటీరియల్ దగ్గర దగ్గరగా ఉంచడం వల్ల తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు విద్యుత్ విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లా స్థాయి చెస్ పోటీలను ప్రారంభిస్తున్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిణి పూజారి శైలజ అనకాపల్లి: స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానంలో జిల్లా స్థాయి శాప్ లీగ్ చెస్ టోర్నమెంట్ పోటీలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అదికారిణి పూజారి శైలజ మంగళవారం ప్రారంభించారు. అండర్ – 13, 15, 17, 19 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో బాలబాలికలు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ఆరుగురు చెస్ క్రీడాకారులు గెలుపొందారు. వీరు ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 24న శాప్ లీగ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సైకిల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తామన్నారు. అండర్ –18 విభాగంలో బాలబాలికలకు పట్టణంలో సుంకరమెట్ట జంక్షన్ నుంచి సబ్బవరం మండలం దేవీపురం వరకూ సైకిలింగ్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శులు కె.ఎం.ఎల్.నాయుడు, మోటూరి నాగేశ్వరరావు, చెస్ ఆర్బిటరీ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీ విద్యార్థులకు డార్మిటరీ సదుపాయం
విద్యార్థినులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అచ్యుతాపురం రూరల్ : యోకోహమా పరిశ్రమ సీఎస్ఆర్ నిధులతో స్థానిక కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు రెండు డార్మిటరీలు నిర్మించి వారు నిద్రించేందుకు 120 బంకర్ బెడ్లను జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యోకోహమా పరిశ్రమ హెచ్ఆర్ రెడ్డి, డీఈఓ జి.అప్పారావు నాయుడు, ఎంఈఓ సీహెచ్. దేవరాయల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్.ఉమాదేవి, విద్యార్థినులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో ప్రతిభ
ప్రతిభ చూపిన విద్యార్థులతో కరస్పాండెంట్ రాంప్రసాద్ మాకవరపాలెం: రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో స్థానిక మోంటిస్సోరి పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ నెల 14న విజయవాడలో విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. వీటిలో జూనియర్ విభాగంలో విజువలైజేషన్ కేటగిరీలో రుత్తల వెంకటగంగాకామేష్ జీనియస్, సీనియర్ విభాగంలో బి.యోగఅమృత రైజింగ్ స్టార్ స్థానాలను కై వసం చేసుకున్నారని పాఠశాల కరస్పాండెంట్ కె.రాంప్రసాద్ మంగళవారం తెలిపారు. వీరిని ఉపాధ్యాయులు అభినందించారు. -
గర్భంలోనే శిశువు మృతి
● వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బాధితుల కన్నీటి పర్యంతం ● బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ గూడెంకొత్తవీధి: పండంటి బిడ్డ ను తమ చేతికి అందిస్తారన్న ఆశతో ఆసు పత్రికి వెళ్తే, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మృత శిశువును తీసుకోవాల్సి వచ్చిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చింతపల్లి ఏరియా ఆసుపత్రి సిబ్బంది వైఖరిపై రింతాత పంచాయతీ, కడుగుల గ్రామానికి చెందిన సాగిన పూర్ణసత్యనారాయణ భార్య కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రసవం కోసం కళ్యాణిని ఈ నెల 5వ తేదీన చింతపల్లి ఆసుపత్రిలోని బర్త్ వెయిటింగ్ హాల్లో చేర్పించారు. ఈ నెల 15న (ఆదివారం) ఆమెకు పురిటినొప్పులు రావడంతో అక్కడి వైద్యులు పర్యవేక్షించారు. అయితే, సోమవారం వరకు ఆమెను అక్కడే ఉంచి, పరిస్థితి విషమించాక ‘బిడ్డ ఉమ్మనీరు తాగింది’ అని చెబుతూ హుటాహుటిన నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీరా నర్సీపట్నం వెళ్లాక, అప్పటికే గర్భంలోనే శిశువు మరణించిందని అక్కడి వైద్యులు ధ్రువీకరించారని వారు తెలిపారు. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది సమయానుకూలంగా స్పందించి ఉంటే తమ బిడ్డ బతికేదని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దుస్థితి మరెవరికీ రాకూడదని వారు డిమాండ్ చేశారు. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థి ప్రతిభ
దేవరాపల్లి: మండలంలోని తెనుగుపూడి డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ గురుకులం విద్యార్థి కణితి కామరాజు జేఈఈ మెయిన్స్–2026లో ప్రతిభ చాటాడు. తెనుగుపూడి గురుకులం సెకండియర్ ఎంపీసీ విద్యార్థి కామరాజు ఈ ఫలితాల్లో 63 పర్సంటైల్ స్కోర్ సాధించాడు. ఉత్తరాంధ్ర గురుకుల విద్యాలయాలకు చెందిన 27 మంది విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాపురంలో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ పొందిన 27 మందిలో కేవలం కామరాజు మాత్రమే త్వరలో జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించాడు. ఈ మేరకు ప్రిన్సిపాల్ ఎస్.విక్టర్పాల్ మంగళవారం విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. చోడవరం మండలం తిమ్మన్నపాలెంలో నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి తండ్రి తన నాలుగేళ్ల ప్రాయంలోనే మరణించగా, తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. -
తూనికల్లో తేడాలపై కేసులు నమోదు
చేపల దుకాణంలో తూనికలను తనిఖీ చేస్తున్న అనురాధ మాకవరపాలెం: తూకాల్లో తేడాలున్న తొమ్మిది వ్యాపారులపై లీగల్ మెట్రాలజీ అధికారులు కేసులు నమోదు చేశారు. మాకవరపాలెంలో ప్రతి మంగళవారం జరిగే వారపు సంతలో చేపలు, మాంసం దుకాణాల్లో తూకంలో తేడాల కారణంగా వినియోగదారులు మోసపోతున్నారని ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో స్థానిక వారపు సంతలో చేపలు, మాంసం దుకాణాల్లో మంగళవారం లీగల్ మెట్రాలజీ అధికారి అనురాధ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎల్ మోడ్ కాలాల్లో ఉన్న తేడాలను గుర్తించారు. వినియోగదారులను మోసగిస్తున్న తొమ్మిది మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ఇకపై తూకాల్లో తేడాలుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులు కూడా తూనికల్లో తేడాలపై తమకు ఫిర్యాదులు చేయాలన్నారు. -
నిరుద్యోగ భృతి ఏదీ?
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా సరే నిరుద్యోగ భృతి ఊసెత్తలేదు. ప్రతి నెలా నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందిస్తామని, జాబ్ కేలండర్ విడుదల చేస్తామని గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఊదరగొట్టారు. ఈ సారి బడ్జెట్లో ఒక్క పైసా కూడా నిరుద్యోగులకు కేటాయించకుండా నమ్మక ద్రోహం చేశారు. విజయవాడ, హైదరాబాద్ వెళ్లి అక్కడ కోచింగ్ ఫీజులు చెల్లించలేకపోతున్నారు. దీంతో కోచింగ్ మధ్యలో వదిలేసి నిరుద్యోగులు తిరిగి వెనక్కి వస్తున్నారు. –ఎడ్ల హేమంత్ కుమార్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు, మాడుగుల -
సూపర్ సిక్స్కు ఎగనామం
గత ఎన్నికల సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. మహిళలకు ఆడబిడ్డ నిఽధి కింద నెలకు రూ.1500 ఇస్తామని హామీ రెండేళ్లు కావస్తున్నా అమలుచేయలేదు. ఈ రెండేళ్లకు ఒకొక్క మహిళకు రూ.30 వేలు చెల్లించాల్సి ఉంది. వీటిని అమలు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. నమ్మిన ప్రజలను ఇలా మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే. – కూడ బొంజుబాబు, జెడ్పీటీసీ, పెదబయలు మండలం -
విదేశీ సిరులు
మంచు దుప్పటి కప్పుకునే లంబసింగి అందాలు పర్యాటకులను మురిపిస్తుంటే, అక్కడి నేలల్లో పండుతున్న విదేశీ పంటలు అన్నదాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మైదాన ప్రాంతం నుంచి వచ్చిన యువ కౌలు రైతులు, ఇక్కడి శీతల వాతావరణాన్ని అవకాశంగా మలుచుకుని వినూత్న రీతిలో వ్యవసాయం చేస్తున్నారు. కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా.. స్ట్రాబెర్రీ, అవకాడో వంటి విదేశీ పండ్లు, రంగురంగుల పూల సాగుతో లంబసింగిని ఒక ఉద్యానవనంగా తీర్చిదిద్దారు. పర్యాటక సీజన్లో నేరుగా క్షేత్రం వద్దే విక్రయాలు సాగిస్తూ, మార్కెటింగ్ కష్టాలను అధిగమించి ఆదర్శంగా నిలుస్తున్నారు.ఆంధ్రా కశ్మీర్లోచింతపల్లి: ఆంధ్రా కశ్మీర్గా గుర్తింపుపొందిన లంబసింగిలో యువ కౌలు రైతులు వినూత్న పద్ధతుల్లో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మైదాన ప్రాంతానికి చెందిన వీరు, ఇక్కడి గిరిజన రైతులకు చెందిన పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని, కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా విదేశీ రకాల పండ్లు, కూరగాయలు, పూల సాగు చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా.. సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉండి, అతిశీతల వాతావరణం కలిగిన లంబసింగికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక్కడి వాతావరణం విదేశీ పంటలకు అనుకూలంగా ఉండటంతో, రైతులు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండ్ల జాతికి చెందిన స్ట్రాబెర్రీ, అవకాడో, లిచీ, డ్రాగన్ ఫ్రూట్, కూరగాయల జాతికి చెందిన బ్రకోలి, జుకిని, బఠాణి సాగు చేస్తున్నారు. వీటితోపాటు బంతి, చేమంతి, గులాబి, దాలియా, పొద్దుతిరుగుడు వంటి 15 దేశవాళీ రకాలతో పాటు.. జెర్బరా, ఆంథూరియం తదితర 13 రకాల విదేశీ పూల రకాలను సాగు చేస్తున్నారు. క్షేత్రం వద్దే మార్కెటింగ్ ఏడాదికేడాది లంబసింగిని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. పర్యాటక సీజన్ ప్రారంభం కాగానే రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. సేంద్రీయ పద్ధతిలో పండించిన తాజా పండ్లు, పూలను కొనుగోలు చేయడానికి వారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. తప్పిన ఇబ్బందులు పర్యాటకులు నేరుగా పొలాలకే వచ్చి కొనుగోలు చేస్తుండటంతో, రైతులకు మార్కెటింగ్ ఇబ్బందులు తప్పాయి. స్థానికంగానే అమ్మకాలు జరుగుతుండటంతో రవాణా ఖర్చులు తగ్గి మంచి ధరలు లభిస్తున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు: స్ట్రాబెర్రీ: 200 గ్రాముల బాక్స్ రూ.100 నుంచి రూ.120 స్ట్రాబెర్రీ: 100 నుంచి 200 గ్రాముల బాక్స్ రూ.150 నుంచి రూ.200 బ్రకోలి, జుకిని: కిలో రూ.60 నుంచి రూ.80 పూలు: రకాన్ని బట్టి కిలో రూ.150 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. ఏడాది పొడవునా ఆదాయం గిరిజన రైతుల వద్ద కౌలుకు తీసు ుని సాగు చేస్తున్నాం. విదేశీ రకాల పూలు, పండ్ల వల్ల ఏడాది పొడవునా ఆదాయం లభిస్తోంది. ఖర్చులు పోను మంచి లాభాలు వస్తున్నాయి. పర్యాటక ప్రాంతం కావడంతో అమ్మకాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. – కసిరెడ్డి కృష్ణ, కౌలు రైతు, లంబసింగి -
జేఈఈ మెయిన్స్లో సత్తా చాటిన గౌతమ్
గౌతమ్ను అభినందిస్తున్న తల్లిదండ్రులు కొండలరావు, జయసంతోషి మాడుగుల రూరల్ : జేఈఈ మెయిన్స్ పరీక్షలో మండలంలో ఎం.కె.వల్లాపురం గ్రామానికి చెందిన అద్దిపల్లి గౌతమ్ 97.16 శాతం మార్కులు సాధించి తన ప్రతిభను కనపరిచారు. జేఈఈ మెయిన్స్ ఫలితాలు సోమవారం విడుదల చేశారు. గౌతమ్ విశాఖపట్నం, ఆనంతపురం, కె.కె.ఆర్.గౌతమ్ పాఠశాలల్లో 6 వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివాడు. అతని తండ్రి కొండలరావు విలేఖరిగా గతంలో పనిచేశారు. తల్లి జయసంతోషి. కాగా జేఈఈ మెయిన్స్లో సత్తా చాటిన గౌతమ్ను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. -
వైభవంగా గంగమ్మతల్లి ఉత్సవాలు
ముంచంగిపుట్టు: మండలంలోని పాత,కొత్త సుజనకోట గ్రామాల్లో గంగమ్మతల్లి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రి అఽధిక సంఖ్యల్లో భక్తులు శతకం పట్టు నుంచి అమ్మవారి ఆలయం వరకు ఘటాలను మోసుకొని వెళ్లి సమర్పించారు. రాత్రి గిరిజన ఆచార సంప్రదాయ ప్రకారం బుడియాలు సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారు జాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాలకు చంఎదిన భక్తులు పోటెత్తారు. మొక్కులు సమర్పించుకున్నారు. ఉత్సవ కమిటీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది. సీఆర్పీఎఫ్ పోలీసులు గస్తీ నిర్వహిస్తూ, నిరంతరం పర్యవేక్షించారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పాత, కొత్త సుజనకోటలో గంగమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
నాచు కల్టివేషన్తో ఎంతో మేలు
సముద్రంలో వేసిన నాచు సీడ్ను పరిశీలిస్తున్న అధికారులు అచ్యుతాపురం రూరల్ : సముద్రంలో వేసిన నాచు సీడ్ను మంగళవారం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శచీదేవి, ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ విజయ పరిశీలించారు. మహిళలకు మెరుగైన జీవనోపాధి, పిల్లలకు పెద్దలకు పోషకాహారాలు కలిగించే నాచు కల్టివేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సముద్రంలో వేసిన నాచు సీడ్ ఏ విధంగా ఉందన్న విషయమై అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఎం ఎస్.శ్రీనివాసరావు, గ్రామ నాయకులు వంక కృష్ణారావు, ఫిషరీస్ అసిస్టెంట్ శ్రావణి, దేముడు, వీఓఏ శ్రీను పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్లో రామలక్ష్మణదొరకు పతకాలు
రోలుగుంట: జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో రోలుగుంట మండలం కంచుగుమల పంచాయతీకి చెందిన పరవాడ రామలక్ష్మణదొర(68) సత్తా చాటాడు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈ నెల 14న నిర్వహించిన 45వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్లో పలు దేశాల నుంచి పాల్గొన్న క్రీడాకారులతో పోటీ పడిన ఆయన రన్నింగ్, హైజంప్లో విజేతగా నిలిచాడు. నిర్వాహకుల నుంచి పతకాలు, ధ్రువపత్రాలను అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో బ్యాంకు ఉద్యోగం చేస్తున్నప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించానన్నారు. రిటైర్డ్ అయ్యాక తనకు ఆటపై మరింత మక్కువ పెరిగిందని, భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధిస్తానన్నారు. -
నమ్మించి మోసం చేశారు..
ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని చంద్రబాబు, కూటమి నాయకులు హామీ ఇచ్చారు. దీంతో మహిళలందరూ కూటమి పార్టీలకు ఓట్లు వేసి గెలిపించారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా ‘ఆడబిడ్డ నిధి’ ఊసే లేదు. ఇప్పటికే ఒక్కో మహిళ రూ.30 వేల వరకు నష్టపోయింది. ఈ బడ్జెట్లో కూడా ఈ పథకానికి నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే మహిళలను నమ్మించి మోసం చేశారని అర్థమవుతోంది. ఓట్ల కోసం ఆశలు కల్పించి, గెలిచిన తర్వాత ఇలా మొండిచేయి చూపడం తగదు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. –బురిడి సుమిత్ర, గిరిమహిళ, పెద గంగగుడ్డి గ్రామం, అరకులోయ మండలం -
జేఈఈ మెయిన్స్లో కుసుర్లపూడి విద్యార్థి ఘనత
రోలుగుంట : సోమవారం విడుదలైన జెఈఈ మెయిన్స్ ఫలితాల్లో మండలంలోని కుసుర్లపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థి మేడపురెడ్డి ఽశ్యామ్ కృష్ణకు 99.59 పర్సంటైల్ సాధించాడు. దీనిపై కుసుర్లపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం శెట్టి మోహన్రావు, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది హర్షం ప్రకటించారు. శ్యామ్కృష్ణ జానకీరాంపురం గ్రామం రైతు కుటుంబానికి చెందిన మేడపురెడ్డి ముసలినాయుడు, లక్ష్మి దంపతుల కుమారుడు. వీరు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుమారుడిని చదివించారు. జానకీరాంపురం ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ కుసుర్లపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివి పది పరీక్షల్లో 560 మార్కులు సాధించి పాఠశాల టాపర్గా నిలిచాడు. జేఈఈ పోటీ పరీక్షలు రాసి మెయిన్స్లో 99.59 పర్సంటేజి తెచ్చుకున్నాడు. ఎన్ఐటీ వరంగల్లో సీఎస్ఈ బ్రాంచి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
మంటల్లో చిక్కుకుని మహిళ మృతి
అనకాపల్లి: స్థానిక గూడ్స్ రోడ్డు రైల్వే స్టేషన్ ప్రహరీ వద్ద రేకులషెడ్లో నిద్రిస్తున్న లింగాల తలుపులమ్మ(45) మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. ఆదివారం రాత్రి ఆమె జెట్కాయిల్ వెలిగించుకుని మంచం కింద పెట్టుకుని పడుకుంది. చిన్నపాటి మంట రేకులషెడ్కు అంటుకుని వ్యాపించడంతో అటుగా వెళ్తున్న వారు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. అప్పటికే తలుపులమ్మ మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. ఆమె కుమార్తె లక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని బోరుమంది. పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఏఎస్ఐ పి.డి.సుందమ్మ చెప్పారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మానవత్వం చాటుకున్న జాజుల రమేష్... వైఎస్సార్సీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, 83వ వార్డు ఇన్చార్జి జాజుల రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. అంత్యక్రియలకు సహాయం అందించారు. -
గంటవానిపాలెంలో చోరీ
మునగపాక: మండలంలోని గంటవానిపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఇంటిలోని బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయినట్టు గుర్తించిన బాధితులు మునగపాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పి.ప్రసాదరావు విలేకరులకు తెలిపిన వివరాలివి. గంటవానిపాలెం గ్రామంలో కరణం శ్రీనివాసరావు, ఉమాపతి దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదివారం ఆమావాస్య కావడంతో పక్కనే ఉన్న కశింకోట మండలం పేరంటాలపాలెంలో జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శన తిలకించేందుకు వారు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చే సరికి దొంగలు ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలు అపహరించినట్టు గుర్తించి మునగపాక పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో యలమంచిలి సీఐ ధనుంజయరావు, మునగపాక ఎస్ఐ పి.ప్రసాదరావు క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. కేసు విచారణలో ఉందని నష్టం ఎంతమేర అన్నది తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ధనుంజయరావు మాట్లాడుతూ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. -
దారి తప్పిన భద్రత
పాడేరు ఘాట్ రోడ్డులో నిత్యం ఏదో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎత్తయిన కొండలు, లోయలు, ప్రమాదకర మూల మలుపులతో ఇరుగ్గా ఉండే ఈ రోడ్డులో ప్రయా ణమంటేనే జిల్లా వాసులు హడలిపోతున్నారు. అధికారులు సరైన భద్రతా చర్యలు తీసు కోకపోవడంతో ప్రయాణికులు భయం భయంగా రాకపోకలు సాగించవలసి వస్తోంది. సాక్షి,పాడేరు: జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు ఏటా లక్షల్లో సందర్శకులు వస్తారు.పాడేరు జిల్లా కేంద్రంగా మారడంతో ఈ మార్గంలో రాకపోకలు పెరిగాయి. వందల సంఖ్యలో వచ్చిపోయే వాహనాల్లో ఏ ఒక్కటి మొరాయించినా ట్రాఫిక్ నిలిచిపోతుంది. పెరుగుతున్న రద్దీకి తగ్గట్టుగా ఘాట్రోడ్డులో భద్రత కొరవడుతోంది. చాలా చోట్ల రక్షణ గోడలు లేవు. దెబ్బతిన్నవాటిని పట్టించుకున్న నాథుడే కరయ్యాడు. జింగిల్ క్లియరెన్స్ జరగడం లేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి రక్షణ గోడల నిర్మాణంలో నిర్లక్ష్యం 25 కిలోమీటర్ల పాడేరు ఘాట్రోడ్డులో ప్రమాదకర మలుపులు వద్ద రక్షణ గోడలు కరువయ్యాయి. పలు చోట్ల రక్షణ గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.వ్యూపాయింట్ సమీపంలో రెండేళ్ల క్రితం ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకుపోయిన ప్రాంతంలో రక్షణ గోడ పూర్తిగా ధ్వంసమైంది. ఇక్కడ రక్షణ గోడను నిర్మించపోవడంతో వాహన చోదకులు భయపడుతున్నారు. ఏమాత్రం అదుపుతప్పినా వాహనాలు లోయలోకి దూసుకుపోవడం ఖాయం. నాలుగు నెలల క్రితం కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలోను రక్షణ గోడ పూర్తిగా ధ్వంసమైంది.అక్కడ కూడా కొత్త గోడ నిర్మించకపోవడంతో ప్రమాదాలను ఆహ్వానిస్తోంది. ఘాట్రోడ్డులో చాలా చోట్ల మలుపుల వద్ద రక్షణ గోడల పరిస్థితి దయనీయంగా ఉంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వాహన చోదకులు, ప్రయాణికులు, పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుప్పలు,డొంకల తొలగింపులోనూ .. పాడేరు ఘాట్రోడ్డులో ఏసుప్రభువు విగ్రహం ఉన్న మలుపు నుంచి ఘాట్ రోడ్డు పూర్తయ్యే వరకు జంగిల్ క్లియరెన్స్ పనుల్లోను తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది.రోడ్డుకు ఇరువైపులా తుప్పలు.డొంకలు బాగా పెరగడంతో మలుపుల వద్ద వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఉంది. దీంతో చోదకుల భయపడుతునే వాహనాలను నడుపుతున్నారు. గోతుల మయం.. ఘాట్రోడ్డులో పలుచోట్ల గోతులు ఏర్పడ్డాయి.మోదకొండమ్మతల్లి పాదాలు గుడి నుంచి ఓనురు జంక్షన్ వరకు రోడ్డు పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. పలుసార్లు క్రసర్ బుగ్గితో తాత్కాలికంగా గోతులను పూడ్చినప్పటికీ మళ్లీ రోడ్డు అధ్వానంగా మారింది.పూర్తిస్థాయిలో గోతుల పూడ్చివేతకు ఆర్అండ్బీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై వాహన చోదకులు,ప్రయాణికులు మండిపడుతున్నారు. ఘాట్రోడ్డులో ప్రయాణం భయం...భయం -
నిరుద్యోగ భృతి ఏదీ ?
అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులు వాగ్దానాలతో ఊదరగొట్టారు. ఉద్యోగాలు వచ్చేవరకూ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, యువత ఓట్లతో గెలుపొందారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఉద్యోగ కల్పన లేదు.. నిరుద్యోగ భృతి లేదు. గిరిజన ప్రాంతాల్లోను సుమారు రెండు లక్షలకు పైగా అర్హులైన గిరిజన నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం యువతను మోసగించినట్టే. –పి.బాలదేవ్, గిరిజన సంఘం నేత. అరకులోయ -
బాకై ్సట్ ఊసెత్తితే బాణాలతో తరిమికొడతాం
సాక్షి,పాడేరు: గిరిజన ప్రాంతాల్లో బాకై ్సట్ తవ్వకాల ఊసెత్తితే గిరిజనులతో కలిసి సంప్రదాయ బాణాలతో తరిమికొడతామని వైఎస్సార్సీపీజిల్లా అధ్యక్షుడు,పా డేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు హెచ్చరించా రు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం బాకై ్సట్ సంపదను దోచుకునేందుకు కుట్రపన్నిందని, సీఎం చంద్రబాబు బాక్సైట్ న దోచుకోవడమే లక్ష్యంగా జీవోనంబర్ 97ను జారీ చేసి, గిరిజనులకు అన్యాయం చేసే చర్యలకు పాల్పడ్డారని చెప్పారు. ఆసమయంలో ప్రతిపక్ష నేత హోదా లో తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాకై ్సట్ వ్యతిరేక పోరాటానికి మద్దతునిచ్చి, చింతపల్లిలో గిరిజనులతో కలిసి ఉద్యమం చేశారని తెలిపారు. 2019ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి, అధికారంలోకి రాగానే గిరిజనులకు ఇచ్చిన మాట మేరకు సీఎం హోదాలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాకై ్సట్ అనుకూల జీవో 97ను రద్దు చేసి గిరిజనుల సంపదకు రక్షకుడిగా మారారని ఆయన గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు బాకై ్సట్ను తవ్వుకునే కుట్రలకు పాల్పడడం అన్యాయమన్నారు. అనంతగిరి, అరకులోయ, చింతపల్లి, జీకే వీఽధి, గుర్తెడు ప్రాంతాల్లోని నిక్షిప్తమైన 615 మిలియన్ టన్నుల బాకై ్సట్ సంపదను దోచుకోవడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాకై ్సట్ తవ్వకాలకు అడ్డువస్తున్నారనే ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులను అణిచి వేస్తున్నారని, అయితే ఆదివాసీలను మాత్రం అంతం చేయలేరన్నా రు. గిరిజన సంపదను దోచుకోడానికి యత్నిస్తే ఆదివాసీలంతా అల్లూరి సీతారామారాజు వలే మహోన్నత పోరాటం చేస్తారని చెప్పారు. కూటమి నేతలకు ఓటుతోనే గిరిజనులమంతా తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. గిరిజన వ్యతిరేక విధానాల వల్లే చంద్రబాబును గిరిజనులు నమ్మడం లేదని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గిరిజనులంతా వైఎస్సార్సీపీకే పట్టం కడుతున్నారన్నారని తెలిపారు. జిల్లాలోఖనిజాల తవ్వకాలకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
మత్స్యగుండం.. భక్త జనసంద్రం
భారీగా తరలివచ్చిన భక్తులు● చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు ● ఘనంగా ముగిసిన శివరాత్రి ఉత్సవాలు సాక్షి,పాడేరు: ఆధ్మాత్మిక,పర్యాటక కేంద్రం హుకుంపేట మండలంలోని మత్స్యగుండం క్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు సోమవారం రాత్రితో ఘనంగా ముగిసాయి. చివరిరోజు భక్తులు పోటెత్తారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలిరావడంతో ఈ ప్రాంతం రద్దీగా మారింది. స్థానికులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు మత్స్యగుండానికి చేరుకుని మత్స్యలింగేశ్వరస్వామితో పాటు మత్స్యగుండంలోని మత్స్యదేవతలను దర్శించుకున్నారు. అన్ని దుకాణాలు రద్దీగా మారాయి. భక్తుల కోసం ఆర్టీసీ 20 ప్రత్యేక బస్సులను నడిపింది. -
ఖనిజాల జోలికొస్తే ఖబడ్డార్
అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయటౌన్: పాడేరు ఏజెన్సీలోని ఖనిజ సంపదను బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ కుట్రలు పన్నుతోందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఖనిజ సంపదను బడా కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తే గిరిజనులు, ప్రజా సంఘాలు ఉద్యమించాయని, దీంతో వెనక్కి తగ్గిన చంద్రబాబు మళ్లీ బాకై ్సట్, ఇతర ఖనిజ సంపదను బడా కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బాకై ్సట్ తవ్వకాలకోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. అయితే మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. చింతపల్లి, జర్రెల, అరకు ప్రాంతంలోని బాకై ్సట్ ఖనిజ సంపదను బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని, ఆ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. గిరిజన ప్రాంతాల్లో పలు గ్రామాలకు రహదారి సౌకర్యం లేదని, పాఠశాలలకు భవనాలు లేవని, రోగులను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్లు లేక డోలీ మోతలే దిక్కవుతున్నాయని, వాటిని ప్రభుత్వం విస్మరించి గిరిజన ప్రాంత ఖనిజ సంపదను దోచుకునేందుకు కుట్రపన్నడం తగదన్నారు. కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఇతర నేతలు బాకై ్సట్ జోలికి వస్తే ప్రతిఘటన తప్పదన్నారు. అనంతగిరి మండలంలోని ఐదవ నాన్షెడ్యూల్ ఏరియా గ్రామపంచాయతీ ల్లో వేలాది ఎకరాల గిరిజనుల భూములు బడాబాబుల కబంధహస్తల్లోకి వెళ్లిపోయాయని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు నిలువనీడ లేకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందన్నారు. గిరిజన చట్టాలు, ఖనిజ సంపదను ప్రభుత్వాలు కాపాడాలని ఎమ్మెల్యే మత్స్యలింగం డిమాండ్ చేశారు. -
‘బాకై ్సట్’ వ్యతిరేక పోరాటానికి సిద్ధం కావాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్సపాడేరు రూరల్: బాకై ్సట్ తవ్వకాలకు వ్యతి రేకంగా పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స పిలుపునిచ్చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం చాపకింద నీరులా వ్యవహరిస్తూ బాకై ్సట్ తవ్వకాలకు సిద్ధమవుతోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఉద్య మించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎన్నికల హామీలు గాలికి వదిలి కార్పొరేట్ శక్తులను పెంచిపోషించేందుకే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని చెప్పారు. ప్రధానంగా అరకు, పాడేరు, చింతపల్లి పరిసరాల ప్రాంతాల్లో నిక్షిప్త్తమైన ఉన్న బాకై ్సట్, ఇతర ఖనిజాలను తవ్వేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సిద్ధమవుతున్నట్టు తెలు స్తోందని తెలిపారు. బాకై ్సట్ తవ్వకాలు జరిపితే ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. అరకు, చింతపల్లి అటవీ ప్రాంతాల్లో ఆరు బ్లాకుల్లో చింతపల్లి సపర్ల, అనంతగిరి, గుర్తేడు, గూడెం, కాటంరాజ్ కొండల్లో సుమారు 615 మిలియన్ టన్నుల బాకై ్సట్ నిల్వలు ఉన్నాయని చెప్పా రు. ఏపీఎండీసీ పేరిట లీజులకు ఇచ్చి తవ్వకాలకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు. తక్షణం రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాకై ్సట్పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు దాస్,నాయకులు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించాలి
వాలాబులో గిరిజన రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న వెంకన్న, బి.టి. దొర దేవరాపల్లి: జీడిపిక్కలకు కేజీకి రూ. 200 చొప్పున మద్దతు ధర ప్రకటించి, రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న, మండల కార్యదర్శి బి.టి. దొర డిమాండ్ చేశారు. మండలంలోని వాలాబు పంచాయతీలో సోమవారం జీడి రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకన్న, దొర మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జీడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. జీడి పంటకు మద్దతు ధర లేకపోవడంతో వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారన్నారు. దీంతో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న వారికి చివరకు నష్టమే మిగులుతుందన్నారు. జిల్లాలో 90 వేల ఎకరాలలో నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాల్లో జీడిని ప్రధాన పంటగా పండిస్తూ గిరిజనులు జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఏటా 25 వేల మెట్రిక్ టన్నులు జీడి పిక్కలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. జీడి పంటను ఈ క్రాప్లో నమోదు చేయడంతోపాటు జీడి రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని కోరారు. జీడికి మద్దతు ధర కల్పించకుంటా నిర్లక్ష్యం చేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సూకురి రామకృష్ణ, మామిడి రవికుమార్, తామర్ల కొండబాబు, సూకురి నూకరాజు, ఎస్. సింహాచలం, తామర్ల బుజ్జిబాబు, ఇరత దేముడు పాల్గొన్నారు. -
రూ.కోటి గంజాయి పట్టివేత
కొయ్యూరు: మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో కొయ్యూరు,మంప పోలీసులు సుమారు రూ.కోటి విలువైన 185 కిలోల గంజాయిని సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ముందుగా వచ్చిన సమాచారం మేరకు కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు, ఎసఐ కిషోర్వర్మ చీడిపాలెం జంక్షన్లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో వచ్చిన మినీ వ్యాన్లో ఇద్దరు.. పోలీసులను చూసి పరారవుతుండగా పట్టుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేసి, ప్రత్యేకంగా చేయించిన అరలో పెట్టి రవాణా చేస్తున్న 83 ప్యాకెట్లలోని 182.99 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో సరకుమంద నుంచి ధారకొండ,గూడెం,పెదవలస బూదరాళ్ల మీదుగా తమిళనాడుకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఒడిశాలో సరకు బందకు చెందిన వంతల ప్రసాద్,చైన్నెకు చెందిన శంకర్లపై ఎన్డీపీసీ చట్టం కింద కేసులు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు బూదరాళ్లలో 2.2 కిలోలు స్వాధీనం ముందుగా వచ్చిన సమాచారం మేరకు సోమవారం బూదరాళ్లలో మంప ఎస్ఐ సీదరి శ్రీనివాస్ వాహనా ల తనిఖీ చేపట్టారు. ధారకొండ నుంచి స్కూటీపై వస్తున్న ఇద్దరు.. పోలీసులను చూడగానే పారిపోయేందుకు ప్రయత్నించారు వారిని పట్టుకుని, స్కూ టీలో తరలిస్తున్న రెండు కిలోల 215 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, అనపర్తికి చెందిన జగరపు సాయి కుమార్, పులిగా విజయరాజ్లను అరెస్ట్ చేశారు.వారిపై గతంలో అనపర్తి స్టేషన్లో గంజాయి కేసులు నమోదై ఉన్నాయి. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు సీఐ చెప్పారు. -
ముమ్మాటికీ మోసమే...
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆడబిడ్డ నిధికి బడ్జెట్లో ఈ సారి కూడా నిధులను కేటాయించకుండా అక్కచెల్లెమ్మలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఈ పథకం ద్వారా ఆడబిడ్డలకు నెలకు రూ. 1500 చొప్పున ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండేళ్లు కావస్తున్నా ఈ పథకం ఊసెత్తలేదు. గత ఏడాది మొండి చేయి చూపగా ఈ ఏడాదైనా ఖాతాల్లో నగదు జమ చేస్తారని రాష్ట్రంలోని మహిళలంతా ఆశతో ఎదురు చూశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఈ పథకం ప్రస్తావనే లేక పోవడంతో మహిళలంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇది ముమ్మాటికీ మహిళలను మోసగించడమే. – గొర్రుపోటు సుధారాణి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం కన్వీనర్, మాడుగుల నియోజకవర్గం -
దళిత రైతుల భూముల రక్షణ కోసం పోరాడుతాం
రాంబిల్లి(అచ్యుతాపురం): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సురేష్రాజు తెలిపారు. రాంబిల్లి మండలం పంచదార్లలో దళితుల దీక్షా శిబిరాన్ని సోమవారం ఆయన ఎస్సీ సెల్ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత కుటుంబాలకు 1978లో ఇచ్చిన డీ పట్టా భూముల్ని స్థానిక టీడీపీ నేత కుట్ర పన్ని ఎటువంటి పరిహారం ఇవ్వకుండా లాక్కోవడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఐడీ బాబు మాట్లాడుతూ దళిత భూముల పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ ఎంతవరకై నా పోరాడుతుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు సుజాత, ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ప్రకాష్, రేబాక రాము, అప్పారావు, రాజు, నాగప్పారావు, ఈశ్వరరావు, దేవుడు నాయుడు, జయలక్ష్మి, ప్రనన్న తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సురేష్రాజు -
నిరుద్యోగులకు దగా...
కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మరోసారి మోసం చేసింది. నిరుద్యోగులకు ఏడాదికి రూ. 3వేలు హామీని అటకెక్కించారు. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సైతం నిరుద్యోగ భృతి పథకం అమలకు నిధులు కేటాయించకుండా నిలువునా ముంచింది. యువతకు ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల సమయంలో ఊరు వాడా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక యువతను పట్టించుకోక పోవడం అత్యంత దారుణం. భృతి నగదు జమ చేస్తే కొంత మేర ఆర్థిక ఆసరా కలుగుతుందని ఆశగా ఎదురు చూసిన నిరుద్యోగ యువతకు చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది. –కర్రి సూరినాయుడు, మామిడిపల్లి, వైఎస్సార్సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు -
గంజాయి కేసులో పరారైన నిందితుడి అరెస్ట్
యలమంచిలి రూరల్: గంజాయి అక్రమ రవాణా కేసులో ఏడాది కాలంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని యలమంచిలి రూరల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడ్ని విశాఖపట్నం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. వివరాలివి..యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 266/23 మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడు చేపల కార్తీక్ను పోలీసులు అప్పట్లో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడు కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో నిందితుడిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు యలమంచిలి రూరల్ పీఎస్ సిబ్బంది నిందితుడి కోసం నిఘా పెట్టారు. ఒడిశా రాష్ట్రం కటక్లో కార్తీక్ నివాసముంటున్నట్టు తెలుసుకున్న పోలీసులు ముగ్గురు కానిస్టేబుళ్లతో కూడిన బృందాన్ని ఒడిశాకు పంపించారు. వారు నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడ్ని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన యలమంచిలి రూరల్ పీఎస్ సిబ్బంది శ్రీనివాస్(హెచ్సీ), కానిస్టేబుళ్లు డీఎంఎస్ రెడ్డి,హోంగార్డు రాజేష్లతో పాటు ఎస్ఐ ఎం.ఉపేంద్రలను ఎస్పీ తుహిన్సిన్హా, పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్ అభినందించారు. ఆటో, బైకు ఢీ..యువకుడికి తీవ్ర గాయాలు -
బైక్ అదుపుతప్పిన ప్రమాదంలో యువకుడి మృతి
కె.కోటపాడు: మండలంలో సూర్రెడ్డిపాలెం కూడలి సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వేపాడ మండలం నీలకంఠరాజుపురం గ్రామానికి చెందిన బండారు దేముడునాయుడు (30) మృతి చెందాడు. సబ్బవరంలో స్వీట్ పాపులో పని చేస్తున్న దేముడునాయుడు షాపునకు వెళ్లేందుకు తన ద్విచక్ర వాహనంపై సోమవారం తెల్లవారుజామున బయలుదేరాడు. బైక్పై సూర్రెడ్డిపాలెం గ్రామం దాటుతుండగా బైక్ అదుపు తప్పి పడిపోవడంతో దేముడునాయుడు తలకు తీవ్రగాయమై సంఘటనా స్థలంలోనే మరణించాడు. దుర్ఘటన విషయం తెలిసి తల్లిదండ్రులు భవానీ, రాము సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో వీరు గుండెలు విలసెలా రోధించడం స్థానికులను కంటతడి పెట్టించింది. కుమారుడు మృతిపై తల్లి భవానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎ.కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కె.కోటపాడు సీహెచ్సీలో దేముడునాయుడు మృతదేహనికి పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. -
గంగమ్మతల్లి జాతరకు పటిష్ట భద్రత
జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు ముంచంగిపుట్టు: సుజనకోట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు తెలిపారు.మండలంలోని కొత్త,పాత సుజనకోట గ్రామాల్లో సోమవారం రాత్రి జరిగే గంగమ్మతల్లి జాతర ఏర్పాట్లను మండల స్థాయి అధికారులతో కలిసి సీఐ పరిశీలించారు.ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడి పలు సూచనాలు చేశారు.ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని,ముఖ్యంగా రాత్రిపూట జాతరలో డ్రోన్ కెమెరాతో పర్యవేక్షిస్తామని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు,పార్కింగ్,మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాస్కరఅప్పారావు,సర్పంచ్ రమేష్,ఎస్ఐ నాని,ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
సముద్ర తీరాన శౌర్య సింహనాదం
ఏయూక్యాంపస్ : సముద్ర తీరాన సాయంత్రపు సువర్ణ కాంతుల్లో ధైర్యం, శౌర్యం, సంప్రదాయం ఒకే వేదికపై సాక్షాత్కరించాయి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ నేపథ్యంలో బీచ్రోడ్డులో నిర్వహించిన ముందస్తు సన్నాహక కార్యక్రమం నగరాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్లిన యుద్ధవిమానాల ఘోష, సముద్రపు అలలపై ప్రతిధ్వనించిన దేశభక్తి స్వరాలు అక్కడికి చేరుకున్న ప్రతి హృదయాన్ని కదిలించాయి. భారత నావికాదళం, కోస్ట్గార్డుకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు సమన్వయంతో చేసిన విన్యాసాలు వేగం, క్రమశిక్షణ, కచ్చితత్వానికి ప్రతీకలుగా నిలిచాయి. చేతక్ హెలికాప్టర్ నుంచి మైరెన్ కమాండోలు సముద్రంలోకి దిగిన తీరు, అక్కడి నుంచి మెరుపువేగంతో నేలమీదకు చేరిన యుద్ధ విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. డోర్నియర్ విమానాలు, మిగ్–29 యుద్ధవిమానాలు, కమోవ్ కెఏ–31 హెలికాప్టర్లు, సుఖోయ్ యుద్ధవిమానాల గర్జనలు ఆకాశాన్ని తాకుతూ సైనిక శౌర్యాన్ని ప్రతిధ్వనింపజేశాయి. ఆకట్టుకున్న కవాతు సాధన ఈ నెల 19న బీచ్రోడ్డుపై జరగనున్న సిటీ పరేడ్కు సోమవారం నిర్వహించిన రిహార్సల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ దేశాలకు చెందిన నావికాదళ సిబ్బంది సమన్వయంతో కవాతు చేస్తూ అంతర్జాతీయ సౌహార్దాన్ని చాటారు. విదేశీ మహిళా నావికాదళ సిబ్బంది సైతం పాల్గొనడం విశేషం. నేవీ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థుల వాయిద్య గానం, ఎన్సీసీ క్యాడెట్ల కవాతు, భారతీయ శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు సముద్రతీరాన్ని సాంస్కృతిక వేదికగా మలిచాయి. వివిధ దేవతా రూపాలను ప్రతిబింబించిన నృత్యాలు భారతీయ సంప్రదాయ మహిమను విదేశీ అతిథులకు పరిచయం చేశాయి.ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, నేవీ కవాతు -
పంచాయతీ ఆదాయానికి గండి
ఎస్.రాయవరం: మండల కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వల్ల గ్రామ పంచాయతీ ఆదాయానికి తీవ్ర గండి ఏర్పడుతోందని సర్పంచ్ భూపతి అప్పారావు సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.గ్రామానికి ఆర్టీసీ బస్సులు వస్తాయంటే 2002 సంవత్సరంలో పంచాయితీ పెద్దలు ఆర్టీసీకి స్థలం కేటాయించారన్నారు. అయితే అప్పట్లో చెల్లించాల్సిన స్థలం నగదు 24 సంవత్సరాలు గడుస్తున్నా రూ.26 లక్షలు చెల్లించలేదన్నారు. పైగా ఆర్టీసీ భవనం ప్రాంగణంలోకి బస్సులు రాకపోగా , ఆర్టీసీ అధికారులు భవనంలో గదులు అద్దెలకు ఇచ్చుకుని లబ్ధి పొందుతున్నారన్నారు. పంచాయతీకి చెల్లించాల్సిన నగదు చెల్లించకపోవడం వల్ల పంచాయతీ ఆదాయానికి గండి పడుతోందన్నారు. పంచాయతీలో కీలక ప్రదేశంలో ఈ స్థలం ఉండడం పలు సామాజక కార్యక్రమాలకు అద్దె నివాసులతో ఆటంకం కూడా ఏర్పడుతోందన్నారు. ఆర్టీసీకి అవసరం లేకుండా ఉన్న స్థలాన్ని యథావిధిగా పంచాయతీకి కేటాయించి ఇన్ని రోజులు తద్వారా వచ్చిన ఆదాయాన్ని పంచాయతీకి కేటాయించాలని కోరారు. -
అంబులెన్స్కు ఎదురెళ్లి.. వైద్యం అందించి
సీలేరు: మారుమూల గిరిజన గ్రామాల్లో గర్భిణులు సకాలంలో సమీప ఆస్పత్రికి వచ్చి పురుడు పోసుకోవాలని వైద్య సిబ్బంది ఎన్నిసార్లు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రసవ సమయానికి వారం రోజుల ముందే ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నప్పటికీ పురిటి నొప్పులు వచ్చే వరకూ ఇంటి గడప దాటడం లేదు. దీంతో గర్భిణులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తీవ్రమైన పురిటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణికి సత్వర చికిత్స అందజేసి స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి సుఖ ప్రసవం చేశారు. జెన్కో అధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తం అవడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వైద్యాధికారి నిఖిల్ తెలిపిన వివరాలు ప్రకారం..దుప్పులువాడ పంచాయ తీ వలసగెడ్డ గ్రామానికి చెందిన గర్భిణి కొరార శాంతికి ఆదివారం అర్ధరాత్రి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆశా కార్యకర్త ద్వారా సమాచారం అందుకున్న ఏపీ జెన్ కో ఏఈ సీహెచ్ సురేష్ సీఎస్ఆర్ అంబులెన్్స్ సిబ్బందిని అప్రమత్తం చేసి వలసగెడ్డ గ్రామానికి పంపించారు. శాంతిని వలసగెడ్డ నుంచి సీలేరు పీహెచ్సీ తరలిస్తుండగా మార్గం మధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ అడంతో బాటు అప్పటికే బిడ్డ తల బయటకు వచ్చేసింది. దీంతో ఈ సమాచారాన్ని వైద్యాధికారి నిఖిల్కు తెలియజేశారు. అప్రమత్తమైన ఆయన అర్ధరాత్రి సమయంలో అంబులెన్స్కు ఎదురుగా వెళ్లి, మార్గ మధ్యలోనే ప్రసవం చేసి, తల్లీబిడ్డను కాపాడారు. శాంతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందజేసి, స్వ గ్రామానికి పంపారు. సకాలంలో ప్రసవం చేసి, తల్లీబిడ్డను కాపాడిన జెన్కో, వైద్య సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు. -
సరుగుడు జలపాతం వద్ద భక్తుల సందడి
నాతవరం: మహాశివరాత్రి సందర్భంగా సరుగుడు జలపాతంలో స్నానాలు చేసేందుకు భక్తులతో పాటు సందర్శకులు పోటీపడ్డారు. ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నలుమూలల నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో ఈప్రాంతమంతా ఆదివారం సందడి నెలకొంది. సరుగుడు, సుందరకోట పంచాయతీల శివారు 16 గ్రామాల గిరిజనులు శివరాత్రి పండగను ఘనంగా జరుపుకొంటారు. వారంతా సరుగుడు జలపాతంలో స్నానమాచరించి సమీపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో నాతవరం, సరుగుడు మధ్య ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సందర్శకులు సరుగుడు జలపాతాన్ని సందర్శించిన అనంతరం తాండవ రిజర్వాయర్ను చూసేందుకు రావడంతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ట్రాఫిక్ అంతరాయం లేకుండా నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు తగిన చర్యలు తీసుకున్నారు. -
ధారమఠం.. భక్తజన సందోహం
గొలుగొండ: ప్రముఖ శైవక్షేత్రం ధారమఠం శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం శివనామస్మరణతో మారుమ్రోగింది. వేలాదిగా భక్తులతో కిటకిటలాడింది. సత్యసాయి ట్రస్టు సభ్యులు భక్తులకు అల్పాహారం, మజ్జిగ అందజేశారు. చోద్యం యూత్ సభ్యులు ప్రత్యేకంగా 500 లీటర్ల పెరుగుతో మజ్జిగ పంపిణీ చేశారు. కృష్ణదేవిపేట గ్రామంలో నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. చీడిగుమ్మల కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయాన్ని కూడా భక్తులు పెద్ద ఎత్తున సందర్శించారు. భారమఠంలో సోమవారం రాత్రి మహా రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, గొలుగొండ ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. -
పశువుల అక్రమ రవాణా పై ప్రభుత్వం స్పందించాలి
నక్కపల్లి: కూటమి పెద్దల ప్రమేయంతోనే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి పశువుల అక్రమ రవాణా జరుగుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆరోపించారు. ఆదివారం ఆయన నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడారు. పాడి రైతులను, కూలీలను అడ్డం పెట్టుకుని కొంతమంది ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల నుంచి పశువులు కొనుగోలు చేసి హైదరాబాద్, కేరళ తదితర ప్రాంతాల్లో ఉన్న గోవధ శాలలకు తరలిస్తున్నారన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన శేఖర్, రాజమండ్రి కత్తిపూడి ప్రాంతానికి చెందిన శ్రీను తదితరులు నక్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పాడి రైతులు, కూలీల ఆధార్ కార్డులు సేకరించి పశువులు కొని వారి పేరుతో అక్రమంగా అనుమతులు పొంది కబేళాలకు తరలిస్తూ కోట్లు గడించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పెద్ద నాయకులు, ప్రజా ప్రతినిధులు అండతోనే వీరు పశువులను తరలిస్తున్నారన్నారు. శేఖర్ అనే వ్యక్తి ప్రజా ప్రతినిధులు అధికారులను తన చెప్పు చేతల్లో ఉంచుకుని ఈ దందాలు చేస్తున్నాడని తెలిపారు. పోలీసులు ఇతనికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ముఠా పై చర్యలు తీసుకోవాలనికోరారు. పశు అక్రమ రవాణా పై బీజేపీ, జనసేన పార్టీలు నోరు మెదపకపోవడం సిగ్గు చేటన్నారు. ఈ సమావేశంలో పాడి రైతులు దండు బాలరామ రాజు, వేగేసిన చంటి రాజు, సకిరెడ్డి రమణ, సఖిరెడ్డి వెంకటరావు, రైతుకూలీలు రామ్ ప్రసాద్,దేవర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మండలంలో పలు గ్రామాలకు చెందిన పాడి రైతులు, కూలీలు వీసం రామకృష్ణ ని కలిసి పశు మాఫియా వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించి, తమకు అండగా నిలవాలని కోరారు. -
అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేయాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు అనకాపల్లి: జిల్లాలో అక్రమమైనింగ్్కు అధికారులు అడ్డుకట్టవేయడంతో పాటు అక్రమంగా ఏర్పాటు చేసిన మైనింగ్ చెక్పోస్టులను ఎత్తివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారి పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఒక్క అనకాపల్లి మండలంలోనే రోజుకు 500 పైగా లారీలతో రాంబిల్లి మండలంలో పోర్టుకు (ఎన్వోబి), ఇతర ప్రాంతాలకు పిక్కతోపాటు ఇతర మెటీరియల్ సప్లై జరుగుతోందని చెప్పారు. దీనిపై మైనింగ్, విజిలెన్స్, రవాణాశాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం పక్కతోవ పడుతోందని చెప్పారు. మండలంలో మార్టూరు జంక్షన్ వద్ద ఎ.ఎం.ఆర్ సంస్థ అక్రమంగా చేక్ పోస్టు పెట్టడంతో ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ప్రాణాలు పోతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఏఎంఆర్ సంస్థ ద్వారా స్థానిక ఎంపీ సీఎం రమేష్ అనుచరులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, మైనింగ్శాఖకు సంబంధించిన బోర్డులు పెట్టి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో దశలువారీగా జిల్లా వ్యాప్తంగా స్థానిక ప్రజలు సహాకారంతో ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రుత్తల శంకరరావు, గంటా శ్రీరామ్, అల్లు రాజు, కాళ్ళ తేలయ్యబాబు తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణపులోవ జాతరకు పోటెత్తిన భక్తులు
రావికమతం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కళ్యాణపులోవలో వెలసియున్న పోతురాజుబాబును ఆదివారం సభాపతి సిహెచ్.అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎన్ రాజు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్యబాబు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ , అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తదితరులు దర్శించుకున్నారు. వారికి దేవదాయ ధర్మదాయశాఖ ఈవో సత్యనారాయణ మూర్తి ఆహ్వానం పలికారు. మహాశివరాత్రి సందర్బంగా కళ్యాణపులోవ పోతురాజుబాబు, పెద్దింటమ్మ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా మెదటి రోజు భక్తులు భారీగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి పోతురాజుబాబును దర్శించుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్సిన్హా , డీఎస్పీ శ్రావణి పర్వవేక్షణలో కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టి నిరంతర సీసీ కెమెరాలలో నిఘా ఏర్పాటు చేశారు. చోడవరం ఎమ్మెల్యే రాజు ఆధ్వర్యంలో ఆలయ వద్ద భక్తులకు అన్న సమారాధన జరిపారు. -
హామీలకు, ఆచరణకు పొంతన లేదు
ఎన్నికల ముందు రైతుల కోసం చెప్పిన దానికి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేస్తున్న దానికి పొంతన లేదు. రైతులకు బడ్జెట్లో కేటాయింపు చూస్తే చాలా దారుణంగా ఉంది. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకంలో పెట్టుబడి సాయం అందించి రైతులకు భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం కొత్త నిబంధనల పేరుతో కొందరు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అందించలేదు. వ్యవసాయ రైతులకు చేసిన దానికి కంటే ఈ ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటం అధికంగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. – బొబ్బర ప్రకాశరావు, వీబీ అగ్రహారం (నాతవరం) -
టీచర్ల చలో విజయవాడ రేపు
యూటీఎఫ్ కార్యాలయంలో మాట్లాడుతున్న ప్రధాన కార్యదర్శి అంబేడ్కర్ ఆరిలోవ: పీఆర్సీ సాధన కోసం ఈ నెల 17న జరగనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(యూటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఆర్.అంబేడ్కర్ పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న అంబేడ్కర్ మాట్లాడుతూ 12వ పీఆర్సీ 2023 నుంచి అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు కమిషన్ను నియమించలేదన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. 29 శాతం ఫిట్మెంట్ ప్రకటన, సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏల చెల్లింపు తదితర డిమాండ్ల సాధనకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.అప్పారావు, జిల్లా గౌరవాధ్యక్షుడు అనకాపల్లి పైడిరాజు, సహాధ్యక్షుడు ముత్యాలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తరవాహినిలో శివనామస్మరణ
నర్సీపట్నం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బలిఘట్టం ఉత్తరవాహిని నది ఒడ్డున త్రిశూల పర్వతంపై వేంచేసియున్న బ్రహ్మలింగేశ్వరస్వామి పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున సందర్శించారు. ఉత్తర వాహిని నదిలో పుణ్యస్నానాలు ఆచరించి బ్రహ్మలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. స్వామికి లింగోద్భవ కాలమహోన్యాసపూర్వక రుద్రాభిషేకం, కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు దేవరజంగాలతో పితృదేవతలను పోగిడించుకున్నారు. పాకలపాడు గురుదేవుల ఆశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ మనస్సులో కోరికను గురుదేవుల చెవిలో చెబితే నెరవేరుతాయని భక్తులు విశ్వాసం. గురుదేవుల రథోత్సవాన్ని పట్టణంలో భక్తులు ఊరేగించారు. శ్రీసత్యనారాయణస్వామి వారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు సదుపాయాలు ఏర్పాటు చేశారు. నాయుడు జ్యూయలర్స్ వారు మజ్జిగ, రోటరీ, శ్రీసత్యసాయి సేవా సంఘం వారు ప్రసాదం పంపిణీ చేశారు. టౌన్ సీఐ గపూర్ ట్రాఫిక్ను నియంత్రించారు. స్నానాలు ఆచరించే ప్రాంతంలో చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించేలా మున్సిపల్ కమిషనర్ సురేంద్ర చర్యలు చేపట్టారు. -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 నుంచి స్వర్ణపుష్పార్చనని ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణ మండపంలోని వేదికపై అధిష్టింపజేసి 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. ఆలయ కల్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను అధిష్టింపజేసి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దాతలకు కల్యాణం అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణ మండపంలో వెండి గరుడ వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవింద రాజస్వామిని అధిష్టింపజేసి అష్టోత్తర శతనామావళి పూజని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేషంగా హారతులు అందజేశారు. -
రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట(విశాఖ): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఐఎన్ఎస్ డేగాలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఇంటెలిజెన్స్ డీఐజీ అరిఫ్ హఫీజ్లతో కలసి అధికారులతో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం వాయు మార్గం ద్వారా ఐఎన్ఎస్ డేగాకు చేరుకునే రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్లు స్వాగతం పలుకుతారని తెలిపారు. అనంతరం రాష్ట్రపతి ఐఎన్ఎస్ చోళాకు చేరుకుని, విందులో పాల్గొంటారని పేర్కొన్నారు. 18న ఉదయం ఐఎఫ్ఆర్లో పాల్గొంటారని, అదే రోజు సాయంత్రం వాయు మార్గం ద్వారా ఢిల్లీకి బయల్దేరతారని వెల్లడించారు. సీఎం చంద్రబాబు 18న ఐఎఫ్ఆర్కు హాజరవుతారని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఐఎన్ఎస్ చోళా, జట్టీ వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కాన్వాయ్ సెక్యూరిటీ ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, డీసీపీ మేరీ ప్రశాంతి, నేవల్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
నిరాశపరిచిన బడ్జెట్
చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్ కూడా అన్ని వర్గాలనూ నిరాశపరిచింది. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు యాభై ఏళ్లకే పింఛన్ అన్నారు.ఎన్నికల ప్రచార సభల్లోనూ పదే పదే చెప్పారు.దీంతో చాలా మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు ఓట్లు వేశారు.కానీ ఇప్పుడు ఆ ఊసే లేదు.నాడు,నేడు పనులతో పాటు వేతన సవరణ,నిరుద్యోగ భృతి,ఆడబిడ్డ నిధి వంటి హామీలకు ఒక్క రూపాయి కేటాయించలేదు. అమరావతి రాజధాని నిర్మాణం కోసమే అన్నట్టుగా బడ్జెట్ కేటాయింపులున్నాయి.రాష్ట్రంలో మిగతా ప్రాంతాల అభివృద్ధి విస్మరించారు. – అర్రెపు గుప్తా, మున్సిపల్ వైస్ చైర్మన్,యలమంచిలి -
జిల్లా స్థాయి ఎడ్ల బళ్ల పోటీల విజేత కేజే పురం
దేవరాపల్లి: మండలంలోని తారువలో శ్రీభక్తాంజనేయ స్వామి తీర్థమహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్ల బళ్ల పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీలను మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. రసవత్తరంగా సాగిన ఈ పోటీల్లో కేజే పురం కొయిలాడ మోహన్ ఎడ్లు ప్రథమ స్థానంలోను, వల్లంపూడి సిద్ధివినాయక ఎడ్లు ద్వితీయ స్థానంలోను, కూండ్రం మరిడిమాంబ ఎడ్లు తృతీయ స్థానంలోను నిలిచాయి. దేవరాపల్లి వేతమ్స్ నాయుడు ఎడ్లు నాల్గవ, కేజే పురం కొయిలాడ మోహన్ ఎడ్లు ఐదవ, దేవరాపల్లి వీరాంజనేయ ఎడ్లు ఆరవ స్థానంలోను నిలిచాయి. విజేతలకు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చేతుల మీదుగా వరుసగా రూ. 25వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.8వేలు, రూ. 6వేలు, రూ.4వేల చొప్పున నగదు బహుమతులను అందజేశారు. తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి స్వామి వారికి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, స్థానిక జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు తదితరులు దర్శించుకున్నారు. సాయంత్రం మహిళల కోలాట ప్రదర్శన, రాత్రి పలు సాసంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. -
‘రెడ్ రోప్’ విద్యార్థులకు కేథరిన్ ఆశ్రయం
తగరపువలస: డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, హెచ్ఐవీ, మానసిక వికాసంపై విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు సైకిల్ యాత్ర చేస్తున్న రెడ్ రోప్ ఆర్గనైజేషన్ విద్యార్థులు 15 మందికి భీమిలి కేథరిన్ విద్యాసంస్థల యాజమాన్యం ఆదివారం ఆశ్రయం కల్పించింది. ఈ నెల 9న విజయవాడ నుంచి బయలు దేరిన బృందం 5 జిల్లాల్లో 600 కి.మీ. దూరం ప్రయాణించనుంది. ఇందులో భాగంగా వీరికి కేథరిన్ విద్యార్థులు స్వాగతం పలికారు. బృంద సభ్యులు మాట్లాడు తూ ప్రేమాభిమానాలు పెంచుకుని, కోపం తగ్గించుకోవాలన్నారు. వ్యసనాలకు బానిసలైతే అమూ ల్యమైన జీవితం కోల్పోతామన్నారు. ఈ సందర్భంగా కేథరిన్ విద్యాసంస్థల అధినేత ఆలీవర్ ఆర్ రాయి, డైరెక్టర్ ఇవాంజలిన్ రాయి, డీన్ హెప్సీబాలు సైకిల్ యాత్ర బృందాన్ని అభినందించారు. -
మత్స్యలింగేశ్వరునికి నీరాజనం
సాక్షి, పాడేరు/హుకుంపేట: గిరిజన ప్రాంతంలో అత్యంత మహిమాన్విత పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న హుకుంపేట మండలంలోని మత్స్యగుండం, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తజన సంద్రమైంది. ఆదివారం జాతర రెండో రోజు కావడంతో దండకారణ్య పరివాహక రాష్ట్రాల గిరిజనులతో పాటు, మైదాన ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. అటు ఆధ్యాత్మిక కేంద్రంగా, ఇటు పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రం ’హరహర మహాదేవ’ శంభో శంకర’ నామస్మరణతో మారుమోగింది. భక్తుల పరవశం : వేకువజాము నుంచే భక్తులు ప విత్ర స్నానాలు ఆచరించి, గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి మత్స్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సజీవ దైవాలుగా మత్స్యదేవతలు ఈ క్షేత్రంలోని ప్రధాన ఆకర్షణ, ఆధ్యాత్మిక విశిష్టత ఇక్కడి మత్స్యదేవతలు (చేపలు). స్వామివారి దర్శనం అనంతరం భక్తులంతా దిగువన ఉన్న మత్స్యగెడ్డ సెలయేరు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ మత్స్యగుండంలో సంచరించే చేపలను దేవతా స్వరూపాలుగా భావించి, క్యూలైన్లలో వెళ్లి వాటిని దర్శించుకుని పులకించిపోయారు.భక్తుల సౌకర్యార్థం పాడేరు ఆర్టీసీ డిపో ప్రత్యేకంగా 20 బస్సులను నడపడం పట్ల యాత్రికులు హర్షం వ్యక్తం చేశారు. జాతరలో వెలిసిన దుకాణాలు, వినోద కార్యక్రమాల వద్ద రద్దీ కొనసాగింది. ఇన్చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, పాడేరు డీఎస్పీ అభిషేక్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మత్స్యదేవతల చెంతకు భక్తజన ప్రవాహం మత్స్యగుండంలో మారుమోగిన శివనామస్మరణ ఘనంగా శివరాత్రి ఉత్సవాలు -
సీలేరులో ఒడిశాఎంపీ, ఎమ్మెల్యే
● ఉమామహేశ్వర ఆలయం సందర్శన సీలేరు : మహాశివరాత్రి సందర్భంగా ఒడిశాకు చెందిన నవరంగ్పూర్ ఎంపీ బలభద్ర మాజ్జి, మల్కనగిరి ఎమ్మెల్యే నరసింహ మడకామి సీలేరును సందర్శించారు. సరిహద్దులోని పప్పులూరు గ్రామంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తూ, మార్గమధ్యలో సీలేరులోని ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారికి ఘనస్వాగతం పలికి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించింది. సీలేరు ప్రకృతి సౌందర్యం, గుంటవాడ జలాశయం చాలా బాగున్నాయని ఎంపీ ప్రశంసించారు.ఎప్పుడూ వార్తల్లో వినే సీలేరును స్వయంగా చూడటం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సాగును అరికట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని వారిని ఎస్ఐ యాసిన్ కోరారు. ఒడిశా నుంచి వస్తున్న గంజాయి వల్ల ఈ ప్రాంతంలో కేసులు పెరుగుతున్నాయని వివరించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందిస్తూ, తమ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
భక్తి.. ముక్తి.. శివరాత్రి
హామీలు నమ్మి మోసపోయాం గత ఎన్నికల సమయంలో చంద్రబాబు కూటమి ఇచ్చిన రంగుల హామీలను నమ్మి ఓటు వేసినందుకు, ఇప్పుడు కటిక నిరుద్యోగంతో కాలం వెళ్లదీస్తున్నాం. ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.వేల భృతి ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదు. లెక్కగడితే ప్రభుత్వం ఒక్కో నిరుద్యోగికి రూ.60 వేలు బకాయిపడింది. ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తారని ఆశించినప్పటికీ నిరాశే మిగిలింది. ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గ్రామంలో వ్యవసాయ, కూలిపనులు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. – కవడం నాగమురళి, నిరుద్యోగి, అంతర్ల, చింతపల్లి మండలం -
సింహగిరిపై మల్టీలెవల్ కారు పార్కింగ్కు స్థల పరిశీలన
సింహాచలం: సింహాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల పార్కింగ్ ఇబ్బందులను తొలగించేందుకు దేవస్థానం కీలక అడుగు వేసింది. కొండపైకి వచ్చే కార్ల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో, అత్యాధునిక ‘మల్టీ లెవల్ కార్ పార్కింగ్’ ఏర్పాటుకు సంకల్పించింది. ఈ మేరకు ఆదివారం దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సింహగిరిపై పాదాలమ్మ, బంగారమ్మ ఆలయాల ప్రాంగణంలో స్థల పరిశీలన చేశారు. ఈ ప్రాంగణంలో గరిష్టంగా ఎన్ని కార్లను పార్క్ చేయవచ్చనే అంశంపై సాంకేతిక నిపుణులతో చర్చించారు. కార్యక్రమంలో దేవస్థానం డీఈ హరి, ఏఈ రవిరాజు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమే..
కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ఉత్తుత్తి ప్రేమనే చూపింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.605 కోట్లు చూపుతున్నారు. అసలైన ప్రాజెక్టు పనులకు రూ.200 కోట్లను కూడా కేటాయించలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపేశారు. తాండవ ప్రాజెక్టు వద్ద రూ.470 కోట్లకుపైగా వ్యయంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టు పనులను ఈ ప్రభుత్వం నిలిపివేసింది. కేవలం తాండవ, ఏలేరు ప్రాజెక్టుల నిర్వహణ కోసం తూతూ మంత్రంగా రూ.8.13 కోట్లను కేటాయించి చేతులు దులిపేసుకుంది. విశాఖ అభివృద్ధిపైనా అదే నిర్లక్ష్యం. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి -
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం
ఏపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న విమర్శ దేవరాపల్లి: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని తరగతుల ప్రజలను మోసం చేసేదిగా ఉందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న విమర్శించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు ఎటువంటి భరోసా, కేటాయింపులు చేయకపోవడం దారుణమన్నారు. నిరుద్యోగులకు ప్రతీ నెలా రూ. 3వేల నిరుద్యోగ భృతి, ప్రతీ ఆడ పడుచుకు ఏడాదికి నెలకు రూ. 1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం ప్రజలను మోసగించడమేనన్నారు. విశాఖ ఉక్కు అభివృద్ధి, కడప ఉక్కు నిర్మాణం మాటే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేస్తామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి, నిర్వాసితులకు కేవలం రూ. 6105 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఈ నిధులు గేట్లు పెట్టేందుకు సైతం సరిపోవని ఎద్దేవా చేశారు. ఇలాంటి బడ్జెట్ కేటాయింపులు చేస్తే మరో 20 ఏళ్లు అయిన పోలవరం పూర్తయ్యే పరిస్థితి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకొర కేటాయింపులతో ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, నగదు బదిలీ ప్రవేశ పెట్టేందుకు పూనుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. హక్కుగా రావాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీ తరగతుల సబ్ ప్లాన్ నిధుల ఊసెత్తకుండా అంకెల గారడి చేసి ప్రజలను మభ్య పెట్టారని వెంకన్న మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారని, కార్పోరేట్ రంగాన్ని, టూరిజాన్ని మాత్రమే పెంచే దిశగా బడ్జెట్ ఉందని, ఈ బడ్జెట్తో 2047 కాదు, మరో 100 ఏళ్లు అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, హరితాంధ్రగా తీర్చిదిద్దడం సాధ్యం కాదన్నారు. -
దివ్యాంగ పింఛనుకు నోచుకోని అభాగ్యులు
పెదబయలు: ఆ చిన్నారులు పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. తమ బిడ్డలు పెరిగి పెద్దయ్యాక తమకు చేదోడు వాదోడుగా ఉంటారని ఆశపడ్డారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ పసి ప్రాణాలు పుట్టుకతోనే వైకల్యంతో పోరాడుతున్నాయి. పెరిగే కొద్దీ ఆరోగ్యం కుదుటపడుతుందని ఆశగా ఎదురుచూస్తున్న ఆ గిరిజన కుటుంబాలకు ఇప్పుడు మిగిలింది కేవలం కన్నీళ్లే. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. వారి బాధ పాలక యంత్రాంగానికి వినిపించడం లేదు. సాయం శూన్యం పెదబయలు మండలం పర్రెడ పంచాయతీ నందిమెట్ట గ్రామానికి చెందిన నేరోడి రామారావు, వరలక్ష్మి దంపతుల కుమారుడు నేరోడి ఆకాష్ (8). ఆకాష్ లోకోమోటర్ ఆర్థోపెడిక్ వైకల్యంతో బాధపడుతున్నాడు. ఎముకలు, కండరాలు సహకరించక, నాడీ వ్యవస్థ బలహీనపడటంతో కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. 2023లో సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, వైద్యులు 90 శాతం వైకల్యం ఉందని నిర్ధారించారు. కానీ, ఆ 90 శాతం వైకల్యం సాక్షిగా రెండేళ్లుగా గ్రామ సచివాలయం చుట్టూ తిరుగుతున్నా, ఆకాష్కు వికలాంగ పింఛన్ మాత్రం మంజూరు కాలేదు. వస్తే చెబుతాం.. అనే సిబ్బంది సమాధానం ఆ తల్లిదండ్రుల గుండెలను పిండేస్తోంది. కన్నీరు మున్నీరవుతున్న మరో కుటుంబం అదే గ్రామానికి చెందిన నేరోడి రంజిత్ కుమార్, భవాని దంపతుల కుమారుడు అభిమన్యు (7) పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అభిమన్యు కూడా పుట్టుకతోనే అదే వ్యాధితో మంచానికే పరిమితమయ్యాడు. ఆశతో విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. బాబుకు రక్తం తక్కువగా ఉందని, ఆపరేషన్ చేయడం వీలుపడదని వైద్యులు డిశ్చార్జ్ చేసేశారు. ప్రభుత్వం నుంచి పింఛన్ రాక, సొంతంగా వైద్యం చేయించే స్థోమత లేక ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది. వినబడని ఆర్తనాదం ఈ రెండు గిరిజన కుటుంబాల పరిస్థితి అత్యంత దీనంగా ఉంది. ఒకవైపు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు వారిని కుంగదీస్తున్నాయి. 90 శాతం వైకల్యం ఉన్నా పింఛన్ రాకపోవడం వ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. మెరుగైన వైద్యం అందిస్తే తమ బిడ్డలు కోలుకుంటారని ఆ తల్లిదండ్రులు నమ్ముతున్నారు, కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోవడం లేదని, కనీసం మానవత్వం ఉన్న దాతలైనా ముందుకు వచ్చి తమ బిడ్డల ప్రాణాలు నిలబెట్టాలని వారు వేడుకుంటున్నారు. పర్రెడ పంచాయతీలోని ఈ రెండు కుటుంబాల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఆ ఇద్దరు చిన్నారులకు తక్షణమే పింఛన్ మంజూరు చేయడమే కాకుండా, వారికి మెరుగైన కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆ గిరిజన గ్రామం కోరుతోంది. అడుగు పడని సాయం మా పిల్లలు నడవలేరు, కదలలేరు. సచివాలయానికి వెళ్తే రేపు మాపు అంటున్నారు. ప్రభుత్వం కరుణిస్తుందని, ఎవరైనా దాతలు మా బిడ్డలకు వైద్యం చేయిస్తారన్న ఆశ మాత్రమే మిగిలి ఉంది. – బాధిత తల్లిదండ్రుల ఆవేదన కాళ్లరిగేలా తిరుగుతున్నా.. కుమారుడి పింఛను కోసం తల్లి పాట్లు సీలేరు: గూడెం కొత్తవీధి మండలం, సీలేరు పంచాయతీ పార్వతీనగర్కు చెందిన కుర్ర కుమారి అనే గిరిజన మహిళ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇటీవలే ఆమె భర్త అసురు అనారోగ్యంతో మృతి చెందడంతో, ముగ్గురు పిల్లల పోషణ ఆ తల్లికి భారమైంది. కుమారి పెద్ద కుమారుడు అజయ్ (12) పోలియో కారణంగా రెండు కాళ్లు పడిపోయి నడవలేని స్థితిలో ఉన్నాడు. తన కుమారుడికి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని గత రెండేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులు చేస్తూ, అడవి నుంచి కట్టెలు తెచ్చి అమ్ముకుంటూ పిల్లలను పోషిస్తున్నారు. ‘పెన్షన్ అందితేనే నా పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టగలను‘ అని ఆదివారం విలేకరుల వద్ద ఆమె కన్నీరుమున్నీరయ్యా రు. ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, చిన్నారి అజయ్కు పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు
క్షతగాత్రులు గోవింద్, వంతాల విజయశాంతికి వైద్యం అందిస్తున్న సిబ్బందిపెదబయలు: మండలంలోని సీకరి పంచాయతీ పన్నెడ గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఆటో బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని, లక్ష్మీపేట పంచాయతీ కుడాసింగి, ముంచంగిపుట్టు గ్రామాలకు చెందిన భక్తులు మత్స్యగుండం ఆలయాన్ని సందర్శించుకున్నారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా, పన్నెడ సమీపంలో నిర్మాణంలో ఉన్న రహదారి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో కుడాసింగి గ్రామానికి చెందిన పలువురు గాయపడ్డారు. వంతాల విజయశాంతికి ఎడమ చేయి, కాలుకు గాయాలయ్యాయి.లకే సూరిబాబు తలకు తీవ్ర గాయమైంది. తమడ్ల రంజిత్కు నడుము భాగంలో దెబ్బ తగిలింది. పేటమాలిపుట్టుకు చెందిన వంతాల గోవింద్ ఎడమ కాలికి గాయమైంది. వీరితో పాటు ఆటోలో మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో చిన్న పిల్లలు, చంటిబిడ్డలతో కలిపి సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ పిల్లలెవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్లో క్షతగాత్రులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స అందించారు.ఇలావుండగా ఇటీవల ఆర్అండ్బీ రోడ్డు పనుల వల్ల రహదారిపై మెటల్ తేలి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటో నెమ్మదిగానే వెళ్తున్నప్పటికీ, రోడ్డు సరిగా లేకపోవడంతోనే అదుపు తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పులబాధలు తాళలేక వ్యక్తి ఆత్మహత్య
అచ్యుతాపురం రూరల్ : అప్పులబాధ తాళలేక స్క్రాప్ షాపు యజమాని రాగల ఆదినారాయణ (45) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. భీమవరానికి చెందిన ఆదినారాయణ అచ్యుతాపురం మండలం వెదురువాడ అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఉంటూ అక్కడే స్క్రాప్ షాపు నడుపుతున్నాడు. అప్పు తీసుకుని ఇనుప సామగ్రి కొనుగోలుకు వ్యాపారపరంగా గాజువాకకు చెందిన ఓ వ్యక్తికి రూ.4లక్షలు ఇచ్చాడు. అయితే ఆ వ్యక్తి ఆ సొమ్మును తిరిగి ఇవ్వకపోవడం వల్ల, అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఆదినారాయణ ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని పోలీసులు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ రావు తెలిపారు. -
60 కిలోల గంజాయి స్వాధీనం
మాకవరపాలెం: ఏజెన్సీ ప్రాంతం నుంచి వ్యాన్లో తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు స్థానిక పోలీస్ స్టేషన్లో అందించిన వివరాలిలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన రహీమ్ షరీఫ్(29) తన మినీ వ్యాన్తో అరకు మీదుగా ఒడిశాలోని పాడువ గ్రామానికి వెళ్లాడు. అక్కడ శ్రీను అనే వ్యక్తి నుంచి కిలో రూ.6,000 చొప్పున 60 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. దీనిని వ్యాన్పై తరలిస్తుండగా మండలంలోని రాచపల్లి జంక్షన్లో శనివారం పట్టుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ గంజాయిని బయట విక్రయిస్తే రూ. 30 లక్షలు వస్తుందని చెప్పారు. గంజాయితోపాటు వ్యాన్ను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. రహీమ్ షరీఫ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని, ఈ కేసుకు సంబంధించి బెంగళూరుకు చెందిన మరో వ్యక్తి సయ్యద్ తన్వీర్, పాడువకు చెందిన శ్రీను పరారీలో ఉన్నారన్నారు. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, స్థానిక ఎస్ఐ దామోదర్నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
నగర అభివృద్ధిపై శ్రద్ధ ఏదీ?
రాష్ట్రానికి విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ప్రభుత్వం పదే పదే వల్లె వేస్తోంది. కానీ, నిధుల కేటాయింపు విషయానికి వచ్చే సరికి మాత్రం ఎక్కడా ప్రాధాన్యత లేకుండా జాగ్రత్తపడుతోంది. తాజాగా విజయవాడ, విశాఖ మెట్రోలకు కలిపి బడ్జెట్లో కేవలం రూ.15.50 కోట్లు మాత్రమే కేటాయించారు. వాస్తవానికి విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇంకా ఆమోదం కూడా లభించలేదు. కానీ, ఇప్పటికే డీపీఆర్ ఆమోదం పొందిన విశాఖ మెట్రోకు ప్రత్యేక కేటాయింపులు జరపకుండా.. అనుమతులు లేని విజయవాడ మెట్రోతో కలిపి అరకొర నిధులు విదిల్చడం విశాఖపై చంద్రబాబు ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతోంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కేదాకా విశాఖ మెట్రో పనుల్లో కదలిక ఉండదనే సంకేతాలు ప్రభుత్వం ఇస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక విశాఖ నగర అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపులోనూ ప్రభుత్వం అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. సిటీస్ ప్రాజెక్టు కింద ఒక కోటి రూపాయలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద మరో కోటి రూపాయలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. నగర అభివృద్ధి కోసం ఇలా కేవలం రూ.2 కోట్లు విదిల్చిన ప్రభుత్వం.. మరో చేత్తో ఏకంగా రూ. 22 కోట్లకు పైగా నిధులను కాజేస్తోంది. విశాఖ–చైన్నె పారిశ్రామిక కారిడార్లో పలు అభివృద్ధి పనుల కోసం జీవీఎంసీ నిధులపై ప్రభుత్వం కన్నేసింది. ఈ పనుల కోసం ఏకంగా రూ. 22.28 కోట్లు జీవీఎంసీ ఖజానా నుంచే ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా కంటే జీవీఎంసీపై పడుతున్న అదనపు భారమే ఎక్కువగా ఉండటం గమనార్హం. -
రూ.2కోట్లే!
రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్లో కేటాయింపులు నామమాత్రం ● విశాఖ మెట్రోకు విజయవాడ లింక్.. పనులపై నీలినీడలు ● ఏయూ, సాగునీటి ప్రాజెక్టులపైనా చిన్నచూపు ● తాండవ ఎత్తిపోతలకు చెక్.. నిర్వహణకే పరిమితం ● విశాఖ–చైన్నె కారిడార్ భారం జీవీఎంసీపైనే ● అరకు కాఫీపై అదే పాత పాట సామాజిక న్యాయం ఎక్కడ? రాష్ట్ర బడ్జెట్లో ఆదివాసీల సంక్షేమానికి ఒరిగిందేమీ లేదు. మహిళలకు నెలకు రూ. 1,500 (ఏడాదికి రూ. 18 వేలు), నిరుద్యోగ భృతి రూ. 3వేలు, రైతులకు రూ. 20 వేలు, పాఠశాలకు వెళ్లే పిల్లలకు రూ. 15వేలు ఇస్తామన్న హామీలను ప్రభుత్వం విస్మరించింది. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా సాగుతున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనను భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలు ఎదిరించాలి. – అప్పలనర్స, జిల్లా కార్యదర్శి, సీపీఎం, పాడేరువిశాఖకు విదిల్చింది.. బడ్జెట్లో మరోసారి మోసం నిరుద్యోగులందరికీ ఉద్యోగాలిస్తామని, అప్పటివరకూ ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ నేటికి హామీ అమలు చేయలేదు. రాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగ భృతి కోసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించకపోవడం దారుణం. ఏటా జవనరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినా ఆ ఊసే లేదు.ఉదోగావకాశాలు కల్పించకుంటే కనీసం ప్రతినెలా రూ.3వేల నిరుద్యోగ భృతి అయినా చెల్లించాలి. – తాంగుల ధనలక్ష్మి, నిరుద్యోగ యువతి, డింగూడ, ముంచంగిపుట్టు మండలం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారీ బడ్జెట్ లెక్కలతో చంద్రబాబు ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27) కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశాఖ నగర అభివృద్ధికి విదిల్చిన నిధులు ఎంతో తెలుసా? కేవలం రూ. 2 కోట్లు. అంటే మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో విశాఖ నగరానికి దక్కింది 0.000006 శాతం మాత్రమే. నగర అభివృద్ధికి నిధులు కేటాయించకపోగా.. మరోవైపు విశాఖ–చైన్నె పారిశ్రామిక కారిడార్ పనుల భారాన్ని జీవీఎంసీపై మోపింది. ఇందుకోసం జీవీఎంసీ ఖజానా నుంచి రూ.22.28 కోట్లు ఖర్చు చేయాలని ఆదేశించింది. ఇక ఇప్పటికే డీపీఆర్ ఆమోదం పొందిన విశాఖ మెట్రోకు.. ఇంకా ఆమోదం లభించని విజయవాడ మెట్రోతో కలిపి అరకొర నిధులను కేటాయించింది. దీనిని బట్టి విజయవాడ మెట్రో పనులు మొదలయ్యేదాకా విశాఖలో పనులు మొదలుపెట్టే ఆలోచన లేదని ప్రభుత్వం పరోక్షంగా తేల్చిచెప్పినట్లయింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఉత్తరాంధ్రపై వివక్ష కొనసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన తాండవ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసిన కూటమి ప్రభుత్వం.. కేవలం ప్రాజెక్టు నిర్వహణ కోసం మాత్రమే తూతూమంత్రంగా నిధులను కేటాయించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ. 605 కోట్ల కేటాయింపులు కనిపిస్తున్నా.. ఆచరణలో ఈ నిధుల్లో అత్యధిక భాగం కేవలం పునరావాసం, జీత భత్యాలకే సరిపోనున్నాయి. మరోవైపు ఏజెన్సీపై అదే వివక్షను కొనసాగించింది. గత ఏడాది చెప్పినట్టుగానే ఈ సారి కూడా 25 వేల ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ కోసం రూ.16 కోట్ల మేర నిధులను కేటాయించినట్టు బడ్జెట్ పత్రాల్లో చూపారు. ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమ ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఉత్తుత్తి ప్రేమను ప్రదర్శిస్తోంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు బడ్జెట్లో రూ.605కోట్లు కేటాయించినట్లు చూపారు. అయితే, వాస్తవానికి ఇందులో సింహభాగం నిధులు పునరావాసం, జీతభత్యాలకే సరిపోనున్నాయి. ఈ రెండు పద్దులకే రూ. 400 కోట్లకు పైగా ఖర్చయ్యే పరిస్థితి ఉంది. అంటే, అసలైన ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం కనీసం రూ.200 కోట్లు కూడా మిగలవని స్పష్టమవుతోంది. మరోవైపు, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో రూ.470 కోట్లతో ప్రారంభించిన తాండవ ప్రాజెక్టు పనులను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది. తాండవ, ఏలేరు ప్రాజెక్టుల నిర్వహణ కోసం తూతూమంత్రంగా కేవలం రూ.8.13 కోట్లను మాత్రమే కేటాయించింది. ఇదిలా ఉండగా.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కాంట్రాక్టర్లు పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ‘సూపర్ సిక్స్’జాడేది? ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ హోరెత్తించిన ప్రభుత్వం, బడ్జెట్ కేటాయింపుల విషయానికి వచ్చేసరికి మాత్రం దాగుడుమూతలు ఆడుతోంది. యువతకు నెలకు రూ. 3వేల చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్లో ఎక్కడా నిధులు కేటాయించలేదు. ఇక ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున అందించే పథకానికి సంబంధించిన ప్రస్తావనే లేదు. మరోవైపు గ్యాస్ రాయితీ కింద ఇవ్వాల్సిన మొత్తానికి కూడా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు. ఇక అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ. 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం... కేంద్రం ఇచ్చే నిధులను కూడా కలిపి బడ్జెట్లో చూపించడం గమనార్హం. మొత్తంగా సూపర్ సిక్స్ హామీలకు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపడం ద్వారా, పథకాల అమలుపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొన్ని అరకొర కేటాయింపులివే... ● విశాఖ, తిరుపతి జూ పార్కులకు కలిపి బడ్జెట్లో కేవలం రూ. 3.30కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ లెక్కన విశాఖ జూ పార్కు వాటా రూ.1.65 కోట్లకు పరిమితమైనట్లేనని స్పష్టమవుతోంది. ● విశాఖపట్నం, కడప జిల్లాలోని ఉన్న మానసిక ఆసుపత్రులకు రూ.13 కోట్లను కేటాయింపులు జరిగాయి. ఇందులో విశాఖ మానసిక ఆసుపత్రికి సగటున రూ. 6.5 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా వచ్చే నిధులు కావడం గమనార్హం. ● తొట్లకొండ వద్ద నిర్మాణంలో ఉన్న గ్రేహౌండ్స్ భవనాలకు రూ. 3 కోట్లు, విశాఖలోని గ్రేహౌండ్స్ రీజనల్ శిక్షణ కేంద్రానికి మరో రూ. 3 కోట్లు కేటాయించారు. పీఎంపాలెంలో ఆక్టోపస్ బేస్ క్యాంపు నిర్మాణానికి రూ. 3.5 కోట్లు కేటాయించారు. ● విచిత్రమేమిటంటే... విశాఖ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనంతో పాటు... ఆరిలోవ ఏసీపీ కార్యాలయం, మహారాణిపేట పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల నూతన భవనాల నిర్మాణానికి మాత్రం కేవలం రూ.1.5 కోట్లు విదిల్చారు. మొత్తంగా నగరాభివృద్ధితో పాటు ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ అరకొర కేటాయింపులే నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదివాసీలకు తీవ్ర అన్యాయంరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదివాసీలకు ఎన్నడూలేనివిధంగా తీవ్ర అన్యాయం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఈ బడ్జెట్ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలు, వసతి గృహాల (హాస్టళ్ల) అభివృద్ధికి నిధుల కేటాయింపుపై బడ్జెట్లో స్పష్టత లేదు. పీవీటీజీ గిరిజనులకు పీఎం జన్మన్ పథకం కింద కేంద్రం ఇచ్చే నిధులు కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఎప్పుడు విడుదల చేస్తుందో చెప్పడం లేదు. ఆదివాసీల హక్కులు, సంక్షేమం కోసం తమ సంఘం నిరంతరం పోరాడుతుంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, ఆదివాసీల అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయి నిధులు కేటాయించాల్సి అవసరం ఉంది. ఇందుకుకోసం పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. – పొద్దు బాలదేవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆదివాసీ గిరిజన సంఘంనిరుద్యోగ భృతి మాటేది? రాష్ట్ర బడ్జెట్లో ఎలాంటి రాయితీలు, మేలు చేసే అంశాలు ఉంటాయోనని నాలాంటి యువత ఎదురు చూశారు. కానీ మా ఆశల మీద ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఎన్నికల హామీల్లో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ బడ్జెట్లో దాని ఊసే లేదు. దీని కోసం నిధులు కేటాయిస్తారని అంతా అనుకున్నాం. ఇక ఈ ఏడాది భృతి లేనట్టే. పాలకులకు మళ్లీ ఎన్నికల సమయంలోనే ఇది గుర్తుకువస్తుందేమో. బడ్జెట్ అంతా కల్లబొల్లి కబుర్లే అన్నట్టుగా ఉంది. –వాండ్రాసి శివశంకర్, గ్రాడ్యుయేట్, నగరంపాలెం -
పథకాల పేరుతో మహిళలకు మోసం
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరిట సీఎం చంద్రబాబు మహిళలకు ఎన్నో హామీలిచ్చారు. ఉచిత బస్ ప్రయాణం పథకం కింద రాష్ట్రంలో ఏ పుణ్యక్షేత్రానికై నా ఉచితంగా వెళ్లవచ్చని చెప్పారు. కానీ, వాస్తవానికి జిల్లా పరిధిలోని 16 సర్వీసులకు గాను.. కేవలం ఐదారు సర్వీసుల్లోనే ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అలాగే ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. కానీ తొలి ఏడాది ఆ సొమ్ము ఇవ్వకుండా మోసం చేశారు. తాజాగా రెండో ఏడాది బడ్జెట్లోనూ ఆ పథకానికి నిధులు కేటాయించకుండా మరోసారి దగా చేశారు. – సూరిశెట్టి నూకరత్నం, పెందుర్తి -
ఏపీ పీఆర్ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ ఎన్నిక
మహారాణిపేట(విశాఖ): ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా కార్యవర్గ ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా జరిగాయని ఎన్నికల అధికారి జి.రత్నకుమార్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఓమ్మి చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శిగా పి.నరేష్బాబు, అసోసియేట్ ప్రెసిడెంట్గా బి.రవి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా టి.చంద్రశేఖర్, జి.చాందిని, ఎ.శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పి.రాధాలక్ష్మి, వై.విజయకుమారి, ఎం.నాగభూషణం నాయుడు, డి.కవిత ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా డి.సింహాచలం, బి.ఈశ్వర్, వి.కిరణ్, ఎం.వి.ఎస్.కౌశిక్, కోశాధికారిగా కె.జె.ఎస్.చక్రి, కోఆప్టెడ్ సభ్యురాలిగా పి.నిర్మల ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకుడిగా ఎస్.రాజేష్ ప్రభుకుమార్ వ్యవహరించారు. విజయం సాధించిన నాయకులను ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎస్.సత్తిబాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎస్.త్రినాథ్, కె.గంగాధర్లు అభినందించారు. -
ఏయూపై అదే వివక్ష
ఆంధ్రా యూనివర్సిటీపై ప్రభుత్వం తన వివక్షను కొనసాగిస్తోంది. ఇప్పటికే వర్సిటీ నిర్వహణలో రోజుకో కొత్త నిబంధనలతో ఆంక్షలు విధిస్తుండగా.. తాజాగా బడ్జెట్ కేటాయింపుల్లోనూ తన వైఖరిని మరోసారి తేటతెల్లం చేసింది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో(2024–25) ఏయూకి రూ.417 కోట్లు కేటాయించారు. అయితే 2025–26 నాటికి ఆ మొత్తాన్ని రూ.389 కోట్లకు తగ్గించారు. సవరించిన అంచనాల సమయానికి ఈ నిధులను మరింత కుదిస్తూ రూ.379 కోట్లకు పరిమితం చేశారు. చివరకు వాస్తవ లెక్కల నాటికి ఇది రూ.300 కోట్లకు పడిపోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. 2026–27 ఆర్థిక సంవత్సరానికి కూడా కేవలం రూ.389 కోట్లే కేటాయించారు. దీన్ని బట్టి ఏయూకి బడ్జెట్ కేటాయింపులు తగ్గించడమే కాకుండా, నిధుల విడుదల సమయంలోనూ భారీ కోతలు విధిస్తున్నారని స్పష్టమవుతోంది. -
లిక్విడ్ గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్టు
దేవరాపల్లి: లిక్విడ్ గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు కె.కోటపాడు సీఐ కె.కృష్ణ శనివారం తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి దేవరాపల్లి వైపు గంజాయి తరలిస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో శ్రీరాంపురం చెక్ పోస్టు వద్ద స్థానిక ఎస్ఐ వి. సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టినట్టు చెప్పారు. జీనబాడు వైపు నుంచి బైక్పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకుని, బ్యాగ్ను తనిఖీ చేయగా అందులో రెండు ప్యాకెట్లలో ఉన్న రెండు కిలోల లిక్వడ్ గంజాయి బయటపడింది. నిందితుల నుంచి లిక్విడ్ గంజాయితో పాటు బైక్, రూ. 3వేలు నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. పట్టుబడిన లిక్విడ్ గంజాయి విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని, లిక్విడ్ గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేసి విశాఖపట్నం మీదుగా మహారాష్ట్ర తరలించేందుకు యత్నించినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన రంజాన్ జాకీర్ మన్సూరి, డుంబ్రిగుడ మండలానికి చెందిన గోల్లోరి దానేష్, పాంగి దేవదాస్ ఉన్నారు. వీరిని చోడవరం కోర్టుకు తరలించనున్నట్లు సీఐ కె.కృష్ణ, ఎస్ఐ వి. సత్యనారాయణ వెల్లడించారు. -
ఆధునిక హంగులతో జెడ్పీ అతిథి గృహం
● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ● రూ.25 లక్షలతో నిర్మాణానికి శంకుస్థాపన ముంచంగిపుట్టు: ఆధునిక హంగులతో జెడ్పీ అతిథి గృహం నిర్మిస్తామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండల కేంద్రంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న జెడ్పీ అతిథి గృహానికి శనివారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం జిల్లా పరిషత్ నుంచి నిధులు కేటాయిస్తున్నామన్నారు. ముంచంగిపుట్టులో జెడ్పీ అతిథి గృహం నిర్మించి ఎన్నో ఏళ్ల గడిచిపోవడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందన్నారు. దీనివల్ల వసతి లేక మండల కేంద్రానికి వచ్చే అతిథులు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనివల్ల భవన నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైస్ ఎంపీపీ భాగ్యవతి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పద్మారావు, సర్పంచులు రమేష్, సుభాష్చంద్ర, నరసింగరావు, భాగ్యవతి, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, పార్టీ నేతలు సన్యాసిరావు, జయదేవ్, రాజారావు, అర్జున్, అప్పారావు, దేవ, రాంప్రసాద్, జేవీవీఎన్మూర్తి పాల్గొన్నారు. బొండాపల్లిలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన పెదబయలు: బొండాపల్లి పంచాయతీ పరిఽధిలోని బొండాపల్లికి రూ.10 లక్షల జెడ్పీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. జేవీఎస్మూర్తి, సర్పంచ్ బి.మత్స్యరాజు, బొండా బాస్కర్రావు, కార్యకర్తలు, ఫీల్డ్ అసిస్టెంట్ చింతా కొండలరావు పాల్గొన్నారు. -
విశాఖ అభివృద్ధిపై అదే నిర్లక్ష్యం
చంద్రబాబు ప్రభు త్వం ఈ బడ్జెట్లోనూ విశాఖ అభివృద్ధిపై అదే నిర్లక్ష్యం చూపించింది. అరకొర నిధులు, కంటి తుడుపు చర్యలు తప్ప విశాఖకు ప్రత్యేకంగా కేటాయించిందేమీ లేదు. విశాఖ మెట్రో విషయంలోనూ.. ఇంకా ఆమోదం పొందని విజయవాడ మెట్రోతో ముడిపెట్టారు. విశాఖ నగరాన్ని వాడుకుని, అమరావతిని అభివృద్ధి చేసుకోవాలన్న చంద్రబాబు వైఖరి ఈ బడ్జెట్తో పూర్తిగా అర్థమైంది. మొత్తంగా ఈ బడ్జెట్తో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగింది. సాగునీటి ప్రాజెక్టులకు ఎటువంటి కేటాయింపులూ లేవు. నమ్మి ఓట్లు వేసినందుకు.. ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదు. – కేకే రాజు, వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు -
మైనింగ్ చెక్పోస్టు వల్లే ఆర్మీ ఉద్యోగి మృతి
అనకాపల్లి: మండలంలో మార్టూరు జంక్షన్లో అక్రమ మైనింగ్ చెక్పోస్టు వద్ద లారీలు నిలుపుదల చేయడంతో బవులవాడకు చెందిన ఆర్మీ ఉద్యోగి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం తెలిపారు. అక్రమ మైనింగ్ చెక్పోస్టులను తక్షణమే తొలగించాలని కోరుతూ మండలంలో మార్టూరు జంక్షన్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో నాయకులు శనివారం ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గెలిచిన తర్వాత జిల్లాలో మైనింగ్ మాఫియా పెరిగిపోయిందన్నారు. యజమానులు రెండు నుంచి ఐదెకరాలకు పర్మిషన్ తీసుకుని పది, పదిహేను హెక్టార్ల వరకు అక్రమంగా మైనింగ్్ చేస్తున్నారన్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ దందా సాగుతుందన్నారు. కొండలను బ్లాస్టింగ్ చేయడం వల్ల చుట్టుపక్కల ఇళ్లు, పొలాల్లో పంటలు దెబ్బతింటున్నాయని వాపోయారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో రోజుకు రెండు వేల భారీ వాహనాల ద్వారా అక్రమంగా మైనింగ్ తరలిస్తున్నారన్నారు. వీటికి ప్రభుత్వ పే బిల్లులు ఉండటం లేదని, కోట్లాది రూపాయల గ్రామీణ సంపదను రాజకీయ నాయకులు దోచుకోవడం అన్యాయమన్నారు. మండలంలో 115 క్వారీల్లో చాలా వాటికి అనుమతులు లేవన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గంటా శ్రీరామ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రుత్తల శంకరరావు, గనిశెట్టి సత్యనారాయణ, కాళ్ల తలయ్యబాబు, అల్లు రాజు, కె. ఈశ్వరరావు, చలపతి, నాగిరెడ్డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీలో మా గళం వినిపించండి
రెండో రోజుకు చేరిన ఏయూ అతిథి అధ్యాపకుల ఆందోళన మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులు చేపట్టిన నిరసన దీక్షలు శనివారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట వారు ఆందోళన చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించిన ప్రొఫెసర్ సూరప్పడు వారికి సంఘీభావం తెలిపారు. నెలవారీ వేతనాల కోసం అతిథి అధ్యాపకులు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని, వారి పట్టుదల అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతిథి అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.సురేష్ మీనన్ మాట్లాడుతూ.. ఏయూ పూర్వ విద్యార్థులైన ఎమ్మెల్యేలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు. ప్రస్తుతం ఏయూలో కేవలం 165 మంది మాత్రమే పర్మనెంట్ ఆచార్యులు, 91 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారని, కానీ సుమారు 300 మంది అతిథి అధ్యాపకులే భారాన్ని మోస్తున్నారని సురేష్ మీనన్ వివరించారు. ఏయూకు నాక్ ఏ–ప్లస్ ప్లస్ గ్రేడ్ రావడంలో తమ కృషి ఎంతో ఉందన్నారు. ఇంత చేస్తున్నా తమకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని, దీని వల్ల నాణ్యమైన విద్యను అందించడంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఏయూ అధికారులు స్పందించి తమ కష్టాన్ని గుర్తించి, వెంటనే నెలవారీ వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతిథి అధ్యాపకులు శేషు, ఫణి, మురళి, పీతాని ప్రసాద్, దుర్గ ప్రసాద్, వీరేంద్ర, విక్రమ్, దేవానంద్, సునీల్, అంబేడ్కర్ సుమంత్, దివ్య, అమృత తదితరులు పాల్గొన్నారు. -
చోడవరం సబ్ రిజిస్ట్రార్కు పతకాల పంట
● జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో సత్తా పతకాలు అందుకుంటున్న గీతాలక్ష్మి చోడవరం: జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో చోడవరం సబ్ రిజిస్ట్రార్ బి.గీతాలక్ష్మి పతకాలు సాధించారు. ఇటీవల మధ్యప్రదేశ్లో 45వ జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రాష్ట్రం నుంచి పాల్గొన్న ఆమె డిస్క్ త్రో విభాగంలో బంగారు, ట్రిపుల్ జంప్లో వెండి, లాంగ్ జంప్, 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాలు సాధించారు. గతంలోనూ గీతాలక్ష్మి అనేక పోటీల్లో పతకాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ పోటీల్లో సత్తా చాటడంతో అందరూ ఆమెకు అభినందనలు తెలిపారు. -
సాగరం సాక్షిగా సాహస విన్యాసం
ఏయూ క్యాంపస్: సాగరం సాక్షిగా సాహస విన్యాసాలు అబ్బురపరిచాయి. కదన రంగాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించారు. భారత నావికాదళ సమన్వయం, సమర్ధతకు ఈ ప్రదర్శన వేదికగా నిలిచింది. బీచ్ రోడ్డులోని రామకృష్ణ బీచ్ ప్రాంగణం వద్ద శనివారం సాయంత్రం భారత నావికా దళానికి చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు నగరవాసులను, పర్యాటకులను సంభ్రమాశ్చర్యానికి గురి చేశాయి, ఆకాశంలో రివ్వున ఎగురుతూ యుద్ధానికి సిద్ధం అన్న విధంగా దూసుకు వెళుతున్న లోహ విహంగాలు, నేలపైన సమరానికి సయ్యంటూ పరుగులు తీసిన యుద్ధ ట్యాంకులు ప్రతి క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను రేపే విధంగా నమూనా విన్యాసాలు సాగాయి. భారత నావికాదళ అమ్ముల పొదలో ఉన్న అనేక యుద్ధ విమానాలు హెలికాప్టర్లు చేసిన సింక్రనైజ్డ్ విన్యాసాలు దేనికదే సమయపాలన, సమన్వయాలకు ప్రతీకలుగా నిలిచాయి. విశాఖ వేదికగా జరుగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ లో భాగంగా శనివారం సాయంత్రం జరిగిన నావికాదళ విన్యాసాలు పర్యాటకులను నగరవాసులను అమితంగా ఆకట్టుకున్నాయి భారతదేశ నావికాదళ బలాన్ని, దేశభద్రతలో చేస్తున్న సేవను ప్రతిబింబించే విధంగా ఈ సన్నాహక కార్యక్రమాలు జరిగాయి. ఐఎఫ్ఆర్కు సమయం దగ్గరవుతున్న నేపధ్యంలో ప్రధాన వేదికతో సహా ఇతర ఏర్పాట్లు వేగం పుంచుకున్నాయి. సిటీ పెరేడ్ జరిగే సాగర తీరం అంతా పోలీసులు కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. దీనిలో భాగంగా తీరాన్ని జల్లెడపడుతున్నారు. పోలీసు జాగిలాలలో అణువణువు తనిఖీ చేస్తున్నారు. -
రక్తపు మడుగుల్లో వృద్ధురాలి ఆర్తనాదం
డాబాగార్డెన్స్: జనంతో కిక్కిరిసిన పూర్ణామార్కెట్ ప్రాంతం కొనుగోళ్ల సందడి మధ్య ఒక్కసారిగా విషాద దృశ్యం ఆవిష్కృతమైంది. రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన 70 ఏళ్ల వృద్ధురాలు క్షణాల్లోనే రక్తపు మడుగులో పడిపోయింది. ఆరిలోవకు చెందిన ఆమె శనివారం సాయంత్రం మార్కెట్కు వచ్చింది. జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్టాఫీస్ వైపు వెళ్తున్న 52డి నంబరు గల ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టింది. కాలు నుజ్జునుజ్జయింది. రక్తస్రావంతో ఆమె రోడ్డుపై పడిపోయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. చివరకు కేజీహెచ్కు తరలించారు. -
ఘనంగా శివరాత్రి ఉత్సవాలు
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాల్లోను శివరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తుల శివనామస్మరణతో హోరెత్తాయి.పవిత్ర పుణ్యక్షేత్రమైన మత్స్యగుండం మత్స్యలింగేశ్వరస్వామి ఆలయంతో పాటు జిల్లాలోని అన్ని శివాలయాల్లోను వేకువజామునుంచి భక్తుల తాకిడి నెలకొంది. మత్స్యలింగేశ్వరస్వామితోపాటు మత్స్యదేవతలను దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావుతో పాటు అన్నిశాఖల అధికారులు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పార్వతీపరమేశ్వరుల విగ్రహాల ఉరేగింపు పాడేరు పట్టణంలోని గిరికై లాస క్షేత్రంలోని ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయంలోను శివరాత్రి ఉత్సవాలు రెండోరోజు ఘనంగా జరిగాయి. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పట్టణ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. దేవతామూర్తులు, శక్తి వేషాలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, అన్ని వర్గాల భక్తులు, వర్తక సంఘాల నేతలు ఉరేగింపులో పాల్గొన్నారు. ఆదివారం ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయంలో అన్నసమారాధన ఏర్పాటుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. పాత పాడేరు, ఐటీడీఏ పీవో బంగ్లా, లగిశపల్లి, వంజంగి, గెడ్డంపుట్టు, తామారపల్లి, కరకపుట్టు, తురాయిమెట్ట శివాలయాలతో పాటు పోలుపుట్టు, తుమ్మరమెట్ట నాగదేవత మందిరాల్లోను శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.జిల్లావ్యాప్తంగా ప్రారంభం -
17న చలో విజయవాడ
అనకాపల్లి: వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ), బకాయిపడ్డ కరువు భత్యం (డీఏ) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టినట్టు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సంపతి కిషోర్కుమార్ తెలిపారు. శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత పీఆర్సీ గడువు రెండేళ్ల 8 నెలలు పూర్తయిందని, ఈ జాప్యం ఉద్యోగుల, ఉపాధ్యాయుల జీతభత్యాలపై ఎంతో నష్టాన్ని చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు విడతల కరువు భత్యాన్ని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.30 వేల కోట్ల ఆర్థిక బకాయిలు చెల్లించవలసి ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండు సంవత్సరాలు కావస్తున్న ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. ఇప్పటికై నా ఎన్నికల హామీ మేరకు మెరుగైన వేతన సవరణ చేయాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బాయ్, సహాధ్యక్షులు రొంగలి అక్కునాయుడు, రొంగలి ఉమాదేవి, జిల్లా కార్యదర్శులు రమేష్ రావు, గుత్తుల సూర్యప్రకాష్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్.ఎస్. నాగమణి, ఎల్లయ్యబాబు, ఎం.వి అప్పారావు పాల్గొన్నారు. -
యువకుడు ఆత్మహత్య
యలమంచిలి రూరల్: చిన్నతనం నుంచి తనను పెంచిన పెద్దమ్మ,మేనమామ మృతి చెందడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తన తనను పెంచి పెద్ద చేసిన పెద్దమ్మ, మేనమామ ఇద్దరూ లేకపోవడమే ఆత్మహత్యకు కారణంగా తన డైరీలో రాసుకున్నాడు.ఈ ఘటన యలమంచిలి పట్టణం ద్వారకానగర్ పాత ఎస్బీఐ కాలనీలో చోటుచేసుకుంది.పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపిన వివరాలు... పాత ఎస్బీఐ కాలనీలో నివాసముంటున్న అలుగోలు వీరవెంకట శివనాగేశ్వరరావు శుక్రవారం ఉదయం తను నివాసముంటున్న ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు.మృతుని తల్లిదండ్రులు తగరపువలసలో ఉంటున్నారు. అలుగోలు వీరవెంకట శివనాగేశ్వరరావు తండ్రి తగరపువలసలో కార్పెంటర్గా పనిచేస్తున్నాడు.శుక్రవారం ఉదయం తమ కుమారుడికి పలుమార్లు ఫోన్ చేసినపుడు కాల్స్కు సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి స్థానికంగా తమకు తెలిసిన ఒక యువకుడ్ని శివనాగేశ్వరరావు వద్దకు వెళ్లాలని కోరారు.ఈ మేరకు ఆ యువకుడు అక్కడకు వెళ్లగా తలుపు వేసి ఉండడం చూశాడు.కిటికీలోంచి చూడగా శివనాగేశ్వరరావు ఉరి వేసుకుని మృతి చెందినట్టు గుర్తించి, తల్లిదండ్రులకు తెలిపాడు.ఒంటరి అయ్యాననే భావన,తనను పెంచి పెద్ద చేసిన పెద్దమ్మ,మేనమామ కొన్నేళ్ల క్రితం చనిపోవడంతోనే బలన్మరణానికి పాల్పడినట్టు తన డైరీలో రాసుకున్నాడు.ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు ప్రైవేటుగా పనులు చేసుకుంటూ బతుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.శవపంచనామా,పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ఉపాధ్యాయుల ధర్నా
తుమ్మపాల: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఐ.వి.రామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సీపీఎస్ రద్దు చేసి, ఆర్థిక బకాయిలు చెల్లించాలని, పీఆర్సీ కమిషన్ నియామకం చేపట్టాలని, మధ్యంతర భృతి తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలతో పాటు పాఠశాల సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.పరదేశి, రాష్ట్ర కౌన్సిలర్ పి.గంగాధర్, ఉపాధ్యక్షుడు ఉదయ భాస్కర్,మహిళా అధ్యక్షురాలు సునీత, అసోసియేట్ అఽధ్యక్షుడు భాస్కర్, ఎలమంచిలి బాధ్యులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
3,480 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్
అనకాపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,480 పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను తక్షణమే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.బాబ్జి, జి.ఫణీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రింగ్రోడ్డు జంక్షన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీజీ విద్యార్థుల విద్యా హక్కులను దెబ్బతీస్తూ, ఉన్నత విద్యా వ్యవస్థను బలహీనపరుస్తున్న జీవోలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,480 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల పీజీ విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందలేకపోతున్నారు. పరిశోధన కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని వాపోయారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో అవినీతి, అధిక ఫీజుల వసూళ్లు, అక్రమ ప్రవేశాలు వంటి అంశాలను ప్రభుత్వం కఠినంగా అరికట్టాలన్నారు. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిని నిరోధించకపోతే సామాన్య, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మణికంఠ, అజయ్, దేవీ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
శివపూజకు వేళాయె..
గొలుగొండ/నర్సీపట్నం: మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనది. హరిహరులిద్దరికీ ప్రీతికరమైనది. మహా శివరాత్రి పర్వదినాల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు ఎంతో నిష్టతో పుణ్యస్నానాలు ఆచరించి మహా శివుడ్ని దర్శించుకోనున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన ధారమఠం, ఉత్తరవాహిని శివరాత్రి స్నానాలు ఆచరించే భక్తులతో సందడిగా మారనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ధారమఠం శివాలయానికి తరలి రానున్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా. ఆలయం ప్రాంగణమంతా ఇప్పటికే భారీగా ముస్తాబు చేశారు. 15న రాత్రి మహా రుద్రాభిషేకం, జాగారం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతంలో జలజలపారే జలపాతాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకోవడం కోసం ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే పనులు పూర్తి చేశారు. నర్సీపట్నం నుంచి 30 ప్రత్యేక బస్సులు గొలుగొండ నుంచి ధారమఠం శివాలయానికి వెళ్లడానికి నర్సీపట్నం నుంచి 30 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నారు. గొలుగొండ వద్ద భారీ చెక్పోస్టు ద్వారా ఇతర వాహనాలకు అనుమతి ఇచ్చారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ పర్యవేక్షణలో గొలుగొండ, నర్సీపట్నం రూరల్, టౌన్, కృష్ణదేవిపేట, నాతవరం ఎస్ఐల ఆధ్వర్యంలో వంద మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక కేంద్రంగా గురుదేవుల ఆశ్రమం.... బలిఘట్టం ఉత్తర వాహినిని ఆనుకున్న పాకలపాడు గురుదేవుల ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. నిత్యం భక్తుల రాకపోకలతో గురుదేవుల ఆశ్రమం సందడిగా ఉంటోంది. ప్రతి పౌర్ణమికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆశ్రమంలో నిత్యాన్నదానం కొనసాగుతోంది. మహాశివరాత్రి పర్వదినాల్లో బ్రహ్మలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు గురుదేవుల ఆశ్రమాన్ని సందర్శించి గురుదేవుల ఆశీస్సులు పొందుతారు. ఉత్తరవాహిని ఒడ్డున శ్రీరామ సమేత సత్యనారాయణస్వామి ఆలయం ఉంది. స్వామి వారికి నిత్య పూజలు జరిపిస్తున్నారు. ఉత్తర వాహినికి శివరాత్రి శోభ సువిశాలమైన వాతావరణం... నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సందడిగా ఉండే ఉత్తర వాహిని మహా శివరాత్రి మహోత్సవాలకు సిద్ధమైంది. బలిఘట్టం త్రిశూల పర్వతంపై ప్రసిద్ధి చెందిన బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉండి, సమీపంలో నది ఉత్తర ముఖంగా ప్రవహించడంతో దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడ బ్రహ్మలింగేశ్వరస్వామిని దర్శించుకుని పునీతులవుతారు. బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు స్తంభాలు, గోపురం సైతం రాతితోనే నిర్మించడం విశేషం. శివరాత్రి రోజు నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. -
కల్యాణపులోవ జాతరకు పటిష్ట ఏర్పాట్లు
రావికమతం: మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మండలంలోని చీమలపాడు పంచాయతీ కల్యాణపులోవలో జరిగే పోతురాజుబాబు, పెద్దింటమ్మ జాతర ఏర్పాట్లను కలెక్టర్ విజయ్కృష్ణన్, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ఇక్కడ జరిగే ఉత్సవాల సందర్భంగా అధికారులతో ఆమె సమీక్షించారు. ఉత్తరాంధ్రలో అన్ని జిల్లాల నుంచి మూడు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయం వద్ద తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక క్యూలెన్లు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలకు స్నాన ఘాట్ల వద్ద ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తుల కోసం 70 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. దొండపూడి చెక్పోస్టు నుంచి ఆలయం వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణపులోవ రిజర్వాయర్లో స్నానాల ఘాట్లను సిద్ధం చేశామని, బారికేడ్లు, గజ ఈతగాళ్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు, ఫైర్ సిబ్బందిని ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రిజర్వాయర్, ఆలయం వద్ద సీసీకెమెరాలుతో నిరంతర నిఘాతోపాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. చోడవరం ఎమ్యెల్యే రాజు సహాయ సహకారాలతో ఆలయం వద్ద మూడు రోజులపాటు 28 కౌంటర్ల ద్వారా ఉచిత అన్నసమారాధన ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అంబేడ్కర్, ఎంపీడీవో మహేష్, కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండనాయుడు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
క్షతగాత్రుడికి ప్రతి నెలా రూ.2 వేల సాయం
● విశ్రాంత ఎంఈవో అమృత్కుమార్ భరోసా మంచానికే పరిమితమైన రాముకు సాయం చేస్తున్న విశ్రాంత ఎంఈవో అమృత్కుమార్ నాతవరం: కష్టాల్లో ఉన్న పేదలను మావవతా దృక్పథంతో ఆదుకోవడమే తన ధ్యేయమని ఏకే వెల్ఫేర్ సేవా సంఘం అధ్యక్షుడు, విశ్రాంత ఎంఈవో తాడి అమృత్కుమార్ తెలిపారు. మండలంలోని మర్రిపాలెం గ్రామానికి చెందిన బొత్స రాము కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. అతడి భార్య(బాలింత), ఇద్దరు చిన్నారులతో జీవనం సాగించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రాము కుటుంబానికి విశ్రాంత ఎంఈవో శుక్రవారం రూ.2 వేలు అందజేశారు. రాము పూర్తిగా కోలుకుని ఏదైనా ఉపాధి చేసుకునే వరకు ప్రతి నెలా రూ.2 వేల చొప్పున అందజేస్తానని భరోసా కల్పించారు. తన పెన్షన్లో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు అందజేస్తున్నట్టు తెలిపారు. -
ఆయుష్మాన్ కేంద్రాన్ని సందర్శించిన టాస్క్ఫోర్స్
మాట్లాడుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు అచ్యుతాపురం రూరల్: మండలంలోని చోడపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు శుక్రవారం సందర్శించారు. రికార్డుల్లో నమోదు చేసిన వివరాల ఆధారంగా గర్భిణులు, బాలింతలు, కౌమారదశ బాలికలకు వైద్య పరీక్షలు, తదితర వివరాలు పరిశీలించారు. జిల్లా ఎన్హెచ్ఎం అధికారి డాక్టర్ ప్రశాంతి, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎ.రామచంద్రరావు, డీపీవో కె.జగదీష్, అధికారులు పాల్గొన్నారు. -
అందుబాటులో ఆధార్ సేవలు
● కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: జిల్లాలోని ప్రతి గ్రామ సచివాలయాలు, పోస్టాపీసుల్లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలలో అర్హులైన ప్రజలందరికి ఆధార్ సేవలు కల్పించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు.తన కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ జిల్లాస్థాయి ఆధార్ మానటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆధార్ కేంద్రం వద్ద సర్వీస్ చార్జీల వివరాల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.అంగన్వాడీ కేంద్రాలు, విద్యాలయాల్లో బయోమెట్రిక్ నవీకరణ శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా సేవలు అందించాలన్నారు. వందేళ్లు పైబడిన వృద్ధులకు కూడా ఆధార్ నవీకరణ చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఎల్పీవో కుమార్,పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ కార్మికుడు గణేష్ మృతిపై ఆందోళన
సీలేరు: ఏపీ జెన్కో సీలేరు జలవిద్యుత్ కేంద్రం స్విచ్ యార్డ్లో మరమ్మతులు చేస్తూ, ప్రమాదవశాత్తు కింద పడి గంగిరి గణేష్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ మృతుని బంధువులు, గిరిజన సంఘాలు, ప్రజాప్రతినిధులు జెన్కో డివిజనల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ముమ్మాటికి జెన్కో అధికారుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని మృతి తల్లి, సోదరి ఆరోపించారు. ఎటువంటి అవగాహన లేని అన్–స్కిల్డ్ కార్మికుడితో 220 కేవీ విద్యుత్ లైన్ల వద్ద ప్రమాదకర పనులు చేయించడం వల్లే గణేష్ ప్రాణాలు కోల్పోయాడన్నారు. ప్రమాదం జరిగి రెండు రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడం, పోస్టుమార్టం నిర్వహించడంలో జాప్యం చేయడంపై కుటుంబ సభ్యులు మండిపడ్డారు. కార్మికులకు కనీస ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించలేదని నాయకులు నిలదీశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో జెన్కో అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం, అంత్యక్రియలకు తక్షణమే రూ.50 వేలు ఇస్తామన్నారు. మృతుని తల్లికి నెలకు రూ. పది వేల చొప్పున ఈఎస్ఐ పింఛను అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రక్రియను నెలరోజుల్లో పూర్తిచేస్తామని వెల్లడించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్ఐ యాసిన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బంధువులకు అప్పగించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, అన్–స్కిల్డ్ కార్మికులతో ప్రమాదకర పనులు చేయించవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంకి చిన్నయ్య పడాల్, గడుతూరి సత్యనారాయణ, సీఐటీయూ నేతలు సుభాన్, విష్ణు, లక్ష్మణ్, ఎంపీటీసీ సాంబమూర్తి,ఉప సర్పంచ్ మళ్లీ ప్రసాద్. మాజీ సర్పంచ్ కారే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏపీ జెన్కో అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆవేదన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి, సోదరి డిమాండ్ పోస్టుమార్టం నిర్వహించడంలో జాప్యంపై మండిపాటు -
పీజేఆర్ఎస్కు వినతుల వెల్లువ
● 109 అర్జీలు స్వీకరణ సాక్షి,పాడేరు: స్థానిక ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థకు వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని అనేక ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ వ్యక్తిగత,గ్రామాల సమస్యలపై 109 అర్జీలను కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్కు అందజేశారు.ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నిశాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అలాగే జిల్లా ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో 1100 కాల్సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇన్చార్జి డీఆర్వో అంబేద్కర్, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను నిర్మూలిద్దాం
సాక్షి,పాడేరు: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. ఐసీడీఎస్, సీడ్ సంస్థలు సమకూర్చిన బాల్య వివాహాల విముక్తి ప్రచార రథంను ఆయన ఐటీడీఏ ప్రాంగణంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు జరిపినా, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడ బాల్య వివాహాలు జరిగినా 100, 112, 1098, 18001027222 నంబర్లకు ప్రజలు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇన్చార్జి డీఆర్వో అంబేద్కర్, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యదర్శి గైర్హాజరుపై నిరసన
పెదబయలు: మండలంలోని అడుగులపుట్టు పంచాయతీ కార్యదర్శి వి. తులసి రెండు వారాలుగా విధులకు హాజరుకాలేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామ సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. కొత్తాపుట్టు గ్రామానికి చెందిన వంతాల త్రినాథరావు మూడు నెలల క్రితం మృతి చెందగా, ఆయన భార్య గున్నమ్మ మరణ ధ్రువీకరణ పత్రం కోసం కార్యదర్శి చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే గ్రామానికి చెందిన మరికొందరు లబ్ధిదారులు కూడా మరణ ధ్రువపత్రాలు అందక ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ తీర్మానాలు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయని గ్రామస్తులు ఆరోపించారు.కార్యదర్శికి ఫోన్ చేస్తే ఆమె భర్త ఫోన్ ఎత్తి దురుసుగా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మండల కేంద్రానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నా అధికారులు స్పందించకపోవడం దారుణమని మాజీ ఎంపీటీసీ పి. కృష్ణారావు, స్థానిక నేతలు విమర్శించారు. సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై కార్యదర్శి తులసిని వివరణ కోరగా.. అనారోగ్య కారణాలతో మెడికల్ లీవ్ కోరానని, ఎంపీడీవో సస్పెన్షన్లో ఉండటంతో సెలవు మంజూరులో జాప్యం జరిగిందని తెలిపారు. కాగా, ఇన్చార్జ్ ఎంపీడీవో సత్యప్రసాద్ స్పందిస్తూ.. తులసి ఈ నెల 9 నుంచి 22 వరకు ఆన్లైన్లో సెలవు కోరారని, ఫిబ్రవరి 13న బొంగరం కార్యదర్శి ప్రసాద్కు అదనపు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ఇకపై ప్రజలకు సేవల్లో జాప్యం ఉండదని ఆయన హామీ ఇచ్చారు. -
జాతరకు ప్రత్యేక బస్సులు
భక్తుల సౌకర్యార్థం పాడేరు డిపో మేనేజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 20 ప్రత్యేక బస్సులు కేటాయించారు. ఈ నెల 14 నుంచి పాడేరు పాత బస్టాండ్ నుంచి రెండు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈనె 15 వ తేదీ నుంచి పాడేరుతో పాటు అరకులోయ, చింతపల్లి, ముంచంగిపుట్టు రూట్లలో అన్ని బస్సులు మత్స్యగుండం క్షేత్రానికి సర్వీసులు అందిస్తాయి. ● పాడేరు పట్టణంలోని సుండ్రుపుట్టు సాయిబాబా గుడి, మెయిన్ రోడ్డు, పాత బస్టాండ్, సినిమా హాల్ సెంటర్ మరియు ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతాల నుంచి బస్సులు నడుస్తాయి. ● మూడు రోజుల పాటు భక్తులు మత్స్యదేవతలను (చేపలను) సందర్శించుకునేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
శతశాతం ఉత్తీర్ణత తప్పనిసరి
పెదబయలు: టెన్త్, ఇంటర్లో గురుకుల విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల సంస్థ సహాయ కార్యదర్శి (అకాడమిక్) డాక్టర్ ఎన్జీ కిశోర్ బాబు సూచించారు. శుక్రవారం ఆయన స్థానిక గురుకుల కళాశాల, ఏకలవ్య మోడల్ పాఠశాలను సందర్శించారు. ఇంటర్ విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్న తీరును పరిశీలించి, విద్యా ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. గత ఏడాది అల్లూరి జిల్లాలో టెన్త్ ఫలితాలు తగ్గడంతో, ఈసారి రాష్ట్రస్థాయి అధికారుల నేరుగా పర్యవేక్షణలో విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రెండేళ్ల క్రితం ఒక విద్యార్థి మృతి చెందిన ఘటనలో నాటి ప్రిన్సిపాల్ విఠల్ మూర్తి సస్పెన్షన్ గురించి సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు కేశవరావు, శంకర్ రావు పాల్గొన్నారు.గురుకుల సంస్థ సహాయ కార్యదర్శి కిశోర్ బాబు -
పుణ్యధామం
గిరిజన సంస్కృతికి నిలయం, ప్రకృతి మాత ఒడిలో పరవళ్లు తొక్కే జలపాతాల హృదయం.. జిల్లాలోని పావన పుణ్యక్షేత్రం మత్స్యగుండం. ఉత్తర వాహినిగా ప్రవహించే మత్స్యగెడ్డ తీరాన, శివనామ స్మరణతో కొండకోనలు ప్రతిధ్వనించే వేళ వచ్చేసింది. సాక్షాత్తు మత్స్యరూపంలో ఉన్న దేవతలు భక్తులకు దర్శనమిచ్చే ఈ అద్భుత క్షేత్రం, మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అటు ఆధ్యాత్మికత, ఇటు ప్రకృతి రమణీయత కలగలిసిన ఈ పుణ్యధామంలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రకృతి ఒడిలోసాక్షి, పాడేరు: ప్రకృతి ఒడిలో పులకించే జలపాతాలు, గలగల పారే సెలయేళ్లు.. వీటన్నింటి మధ్య కొలువుదీరిన ఆధ్యాత్మిక క్షేత్రం మత్స్యగుండం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని భక్తుల పాలిట ఆరాధ్య దైవమైన మత్స్యలింగేశ్వర స్వామి క్షేత్రం, మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పురాణ వైభవం.. హుకుంపేట మండలంలోని ఈ పుణ్యక్షేత్రానికి వందేళ్ల పైబడిన ఘన చరిత్ర ఉంది. జి.మాడుగుల మండలం గెమ్మెలి ప్రాంతంలో చిన్న ధారగా మొదలయ్యే మత్స్యగెడ్డ, మత్స్యగుండం మీదుగా జోలాపుట్టు రిజర్వాయర్ వరకు ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రవహించే నీరు ఉత్తర వాహినిగా ప్రసిద్ధి చెందింది. కిముడుపల్లి నుంచి వచ్చే గేదెగెడ్డ ఇక్కడ కలవడం వల్ల ఈ సంగమ స్నానం అత్యంత పవిత్రమైనదని, ఇక్కడ స్నానం ఆచరిస్తే పాపాలు తొలగి శుభం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చేపలే ఇక్కడ దేవతలు.. మత్స్య దేవతలు ఇక్కడ ప్రత్యేకత. బండరాళ్ల మధ్య కొలువుదీరిన ఈ చేపలను గిరిజనులు సాక్షాత్తు దైవ స్వరూపాలుగా ఆరాధిస్తారు. భక్తులు భక్తితో మురిలు, అటుకులు, కొబ్బరి ముక్కలను సమర్పిస్తే, వేల సంఖ్యలో చేపలు కనువిందు చేస్తూ పైకి వస్తాయి. ● మత్స్యగుండం ఎగువన కొలువుదీరిన మత్స్యలింగేశ్వర స్వామి, సమీపంలోని నాగదేవత పుట్ట భక్తులకు మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తాయి. మూడు రోజుల సంబరం ఈ నెల 14వ తేదీ (శనివారం) నుంచి 16వ తేదీ (సోమవారం) వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. వీటిని ఘనంగా నిర్వహించేందుకు స్థానిక గిరిజనులతో హుకుంపేట మండలం మఠం పంచాయతీ సర్పంచ్ మఠం శాంతకుమారి అధ్యక్షతన ఇటీవల ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. భక్తుల విరాళాలతో మత్స్యలింగేశ్వర స్వామి ఆలయానికి సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపపట్టాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జాతర షెడ్యూల్శనివారం ఉదయం 5 గంటల నుంచి మత్స్యలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. జాతరలో ఇది అత్యంత ముఖ్యమైన రెండవ రోజు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మఠం పంచాయతీలో శివపార్వతుల విగ్రహాల ఊరేగింపు ఉంటుంది. రాత్రికి మత్స్యలింగేశ్వర స్వామి వారి కల్యాణం జరుగుతుంది. కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షణలో అన్ని శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఉత్సవాలు చివరి రోజు సోమవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. రాత్రితో జాతర ముగుస్తుంది. -
అరకు వారపు సంతపైడ్రోన్ నిఘా
డుంబ్రిగుడ: అరకులో శుక్రవారం జరిగిన జిల్లాలోనే అతిపెద్ద వారపు సంతపై పోలీసులు డ్రోన్ సహాయంతో నిఘా పెట్టారు. ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు ఎస్ఐ సురేష్ తన సిబ్బందితో కలిసి సంత ప్రాంతాన్ని పర్యవేక్షించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు.ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు భారీగా వస్తుండటంతో, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిఘా పెంచారు.గంజాయి, నాటుసారా వంటి మత్తు పదార్థాల రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.


