breaking news
Alluri Sitarama Raju District News
-
ఎస్.నర్సాపురంలో జేసీబీ స్వాధీనం
పాయకరావుపేట: మండలంలో ఎస్.నర్సాపురం గ్రామ శివారులో చెరువు వద్ద మట్టి తవ్వుతున్న జేసీబీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ జై.పురుషోత్తం తెలిపారు. శుక్రవారం తెల్లవారుజూమున గ్రామ శివారులో చెరువు వద్దకు వెళ్లి తనిఖీ చేయగా, జేసీబీ (ఏపీ39 హెచ్ఆర్ 4923)తో మట్టి తవ్వుతున్నట్లు గుర్తించి అడ్డుకున్నామన్నారు. సదరు జేసీబీ డ్రైవరును చెరువు మట్టి తవ్వడానికి సంబంధించి ఏమైనా అనుమతులు, ఇతర అధికారక పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నించగా, ఏమీ లేవని సమాధానమిచ్చారని తెలిపారు. దీంతో జేసీబీని స్థానిక పోలీసు స్టేషన్కు తరలించామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం తహసీల్దార్కి అప్పగిస్తామని తెలిపారు. -
వెల్డింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్తో కార్మికుడి మృతి
అక్కిరెడ్డిపాలెం : ఆటోనగర్ డీ బ్లాక్ మ్యాంగ్ పార్క్ ఎదురుగా ఉన్న ప్రైజం ఆర్ఎంసీ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కంపెనీ వద్దకు చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి ప్రాంతానికి చెందిన మాటూరి చిన్నరావు (38) ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఆయన తల్లి ఇటీవల మృతి చెందడంతో కుటుంబ బాధ్యతల నిమిత్తం ఆటోనగర్లోని ప్రైజం ఆర్ఎంసీ సిమెంట్ పరిశ్రమలో వెల్డింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం విధుల్లో భాగంగా వెల్డింగ్ పనులు చేస్తుండగా పరిశ్రమలోని విద్యుత్ పరికరాల నుంచి ఒక్కసారిగా ఎర్త్ రావడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు రోజులుగా పరిశ్రమలో విద్యుత్ షాక్ వస్తున్న విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తోటి కార్మికులు ఆరోపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే చిన్నరావు మృతి చెందారని వారు తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని బంధువుల, కార్మికులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. పరిశ్రమ గేటు వద్ద ఆందోళన కొనసాగించారు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు పరిశ్రమ యాజమాన్యాన్ని విచారించారు. యాజమాన్య ప్రతినిధులు బెంగళూరు నుంచి రావాల్సి ఉందని, వారు వచ్చిన అనంతరం పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని పోలీసులకు తెలిపారు. దీంతో ఆందోళన విరమించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జూడాల సమ్మె.. రోగులపై తీవ్ర ప్రభావం
మహారాణిపేట: జూనియర్ వైద్యుల సమ్మె ప్రభావం కేజీహెచ్ రోగులపై పడుతోంది. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ వార్డుల్లో వైద్యుల కొరతతో రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సలో జాప్యం జరుగుతోంది. జూనియర్ వైద్యుల విధులను నర్సింగ్ సిబ్బంది, ఎంఎన్వోలు నిర్వహించాల్సి వస్తోంది. 11 రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు శుక్రవారం కేజీహెచ్ నుంచి ఏఎంసీ మీదుగా ర్యాలీ నిర్వహించి మానవహారంగా నిరసన తెలిపారు. రిలే దీక్షలో డాక్టర్లు విజేత, రక్షక్, కల్యాణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.తమ నిరసన కార్యక్రమం రోగులకు వ్యతిరేకం కాదని, రోగుల సంరక్షణ తమ బాధ్యత అని జూనియర్ వైద్యుల సంఘం నాయకుడు దినకర్ సాయి శ్రీనివాస్ తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీజూడీఏ) నాయకుడు డాక్టర్ శిరాజ్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సత్యజీత్, మనోహర్, దినకర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
సింహవల్లీ తాయారుకు లక్ష కుంకుమార్చన
సింహాచలం: వరలక్ష్మీ వ్రతం, శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో కొలువుదీరిన సింహవల్లీ తాయారు అమ్మవారి సన్నిధిలో లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. సింహాసనంపై సింహవల్లీ తాయారు, చతుర్భుజ తాయారు అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంజేపచేశారు. పది ఆవృతులతో లక్ష నామాలతో అమ్మవార్లకు కుంకుమపూజ జరిపారు. భక్తులకు కుంకుమ, శేషవవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. సాయంత్రం అమ్మవార్ల సన్నిధిలో సహస్రనామార్చన విశేషంగా నిర్వహించారు. అమ్మవార్లను పల్లకిలో వేంజేపచేసి ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించారు. విశేష హారతులు అందించారు. -
పరిశ్రమల భద్రతకు నెలవారీ శిక్షణ
పరవాడ: జేఎన్ ఫార్మాసిటీలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు ఉద్యోగుల్లో భద్రతపై అవగాహన పెంచేందుకు ప్రతి నెలా మూడో శుక్రవారం జేఎన్పీసీ భవనంలో భద్రతా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంఏఎస్ఆర్ఎం కార్యదర్శి జెట్టి సుబ్బారావు తెలిపారు. ఎంఏఎస్ఆర్ఎం ఆధ్వర్యంలో పరిశ్రమల భద్రతపై యాజమాన్యాలు, ఉద్యోగులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా పరిశ్రమల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యోగుల్లో భద్రతపై చైతన్యం కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది డిసెంబరు వరకు నిరంతరం కొనసాగించేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఈహెచ్ఎస్ విభాగాల సిబ్బందికి ఈ అవగాహన సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ‘జీరో హార్మ్–జీరో హజార్డ్’లక్ష్యంతో అన్ని పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించి, సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఫార్మాసిటీ పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు తమ పరిశ్రమల్లో అమలు చేస్తున్న భద్రతా విధానాలు, ప్రమాదాల నివారణ చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇతర పరిశ్రమల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలు పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
పారిశుధ్య కార్మికుల ఆకలి కేకలు పట్టవా?
అనకాపల్లి: పారిశుధ్య కార్మికుల ఆకలి కేకలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు ఆరోపించారు. గ్రామాల్లో పారిశుధ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రీన్ అంబాసిడర్లు, పారిశుధ్య కార్మికులు ఆరు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆదివారం కె.కోటపాడుకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లాలోని పంచాయతీల నుంచి వందలాది గ్రామపంచాయతీ కార్మికులను తీసుకువెళ్లి శుభ్రత కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు పూర్తి చేశారన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి నెలా ఇవ్వాల్సిన రూ.6 వేల వేతనం కూడా సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబాలు అర్ధాకలితో జీవించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’పేరుతో ప్రతి నాలుగో శనివారం ప్రచార ఆర్భాట కార్యక్రమాలు నిర్వహించేందుకు ఖర్చు చేస్తున్న నిధులను కార్మికుల జీతాలకు వినియోగిస్తే గ్రామాల పరిస్థితి మెరుగుపడుతుందని సూచించారు. గతేడాది నుంచి హెల్త్ అలవెన్స్గా నెలకు రూ.4 వేల చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. కె.కోటపాడు పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి వెంటనే బకాయి జీతాలు విడుదల చేసి, మున్సిపల్ కార్మికులతో సమానంగా వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
షిప్.. షిప్.. హుర్రే!
షిప్యార్డులో డ్రైడాక్ చేసిన ఐఎన్ఎస్ జలాశ్వ సాక్షి, విశాఖపట్నం: హిందూస్థాన్ షిప్యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) తన సుదీర్ఘ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. భారత నౌకాదళానికి చెందిన అత్యంత భారీ యుద్ధ నౌకల్లో ఒకటైన.. ఏకై క ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్ ‘ఐఎన్ఎస్ జలాశ్వ’ని షిప్యార్డు విజయవంతంగా డ్రై డాక్ (ఓడల నిర్వహణ, మరమ్మతు ప్రక్రియ)లోకి తీసుకుంది. హెచ్ఎస్ఎల్ చరిత్రలో ఇంతటి భారీ సైనిక ప్లాట్ఫామ్ను డాకింగ్ చేయడం ఇదే తొలిసారి. అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియను ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా పూర్తిచేసి, రక్షణరంగ నౌకల మరమ్మతుల్లో తన సత్తాను మరోసారి చాటుకుంది. కొత్త చరిత్ర లిఖిస్తూ.. దేశీయ నౌకల తయారీపై దృష్టి సారిస్తూ అత్యుత్తమ సేవలందించేందుకు మినీరత్న హోదా పొందిన తర్వాత హిందూస్థాన్ షిప్యార్డు వరుస లాభాలతో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. దేశీయ ఆర్డర్లతోపాటు అంతర్జాతీయ నౌకల మరమ్మతు పనులను దక్కించుకుంటూ చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎఫ్ఎస్ఎస్) నిర్మాణంతోపాటు 45 మిలియన్ టన్నుల డిస్ప్లేస్మెంట్ సామర్థ్యమున్న నౌకల్ని తయారుచేస్తోంది. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు, కార్గో షిప్స్, పోర్టు గ్రీన్ టగ్లు, కోస్ట్గార్డ్ వెసల్స్, జలాంతర్గాముల రీఫిట్, మరమ్మతు పనులను కూడా చేపడుతోంది. విదేశీ నౌకల మరమ్మతుల ద్వారా అంతర్జాతీయ వ్యాపారాన్ని ఆకర్షిస్తున్న షిప్యార్డు.. విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ వాణిజ్యం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో భారీ నౌకలను సైతం డ్రైడాక్లోకి తీసుకొస్తూ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటోంది. అత్యద్భుత సమన్వయంతో.. ఐఎన్ఎస్ జలాశ్వ సాధారణ యుద్ధనౌక కాదు. సుమారు 175 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పు ఉన్న ఈ భారీ నౌకను డ్రైడాక్లోకి తీసుకురావడం ఇంజినీరింగ్ పరంగా షిప్యార్డుకు పెద్ద సవాల్గా మారింది. దీనికోసం హెచ్ఎస్ఎల్ బృందాలు ముందుగానే సమగ్ర డాకింగ్ అనాలసిస్ నిర్వహించి.. నౌక బరువు, ఆకృతికి అనుగుణంగా కచ్చితమైన డాక్బెడ్ను సిద్ధం చేశాయి. అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో, భద్రతా ప్రమాణాల్లో ఏమాత్రం రాజీ పడకుండా నౌకను సురక్షితంగా డ్రైడాక్లోకి చేర్చారు. భారత నౌకాదళంలో బలగాలను, ట్యాంకర్లను ఒకేసారి తరలించే సామర్థ్యం ఉన్న అతిపెద్ద నౌకల్లో జలాశ్వ ఒకటి. ఇది సుమారు 1,000 మంది సైనికులతోపాటు కంబాట్ వెహికల్స్, హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు. గతంలో ‘ఆపరేషన్ సముద్ర సేతు’ తదితర విపత్తు సహాయక చర్యల్లోనూ ఈ నౌక కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు హెచ్ఎస్ఎల్ ఆధ్వర్యంలో దీనికి సమగ్ర మరమ్మతులు, ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. నౌకాదళానికి వ్యూహాత్మక లబ్ధి జలాశ్వను విజయవంతంగా డ్రైడాక్ చేయడం తూర్పు నౌకాదళానికి వ్యూహాత్మకంగా కీలక పరిణామం. ఈస్ట్రన్ నేవల్ కమాండ్కు భారీ ప్లాట్ఫామ్ల మరమ్మతుల కోసం ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. తూర్పు తీరంలోనే భారీ నౌకల మరమ్మతులకు అనువైన సదుపాయం అందుబాటులో ఉండటంతో టర్న్ అరౌండ్ సమయం తగ్గి, ఫ్లీట్ ఎప్పటికప్పుడు కార్యకలాపాలకు సిద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. తూర్పు తీరంలోని సముద్ర జలాల్లో చైనా సహా పలు దేశాల నౌకాదళ కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం నిరంతరం సన్నద్ధంగా ఉండేందుకు హెచ్ఎస్ఎల్ అందిస్తున్న సాంకేతిక సేవలు కీలకంగా మారుతున్నాయి. 80 వేల టన్నుల సామర్థ్యంతో.. విశాఖలోని హెచ్ఎస్ఎల్ డ్రైడాక్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సదుపాయాల్లో ఒకటి. ఇది 240 మీటర్ల పొడవు, 53 మీటర్ల వెడల్పు, 8.5 మీటర్ల లోతుతో నిర్మితమైంది. ఒకేసారి 70,000 నుంచి 80,000 డెడ్వెయిట్ టన్నేజ్ సామర్థ్యమున్న భారీ నౌకలకు మరమ్మతులు నిర్వహించగల సామర్థ్యం దీనికి ఉంది. గతంలో 200 మీటర్లకు పైగా పొడవున్న కమర్షియల్ పానామాక్స్ బల్క్ క్యారియర్లు, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లకు విజయవంతంగా మరమ్మతులు నిర్వహించింది. తాజాగా జలాశ్వ రాకతో భవిష్యత్లో నేవీకి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకలు లేదా అంతకంటే సంక్లిష్టమైన ప్రాజెక్టులను చేపట్టేందుకు షిప్యార్డ్ సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. -
బ్రిక్స్ సదస్సు ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, విశాఖపట్నం: బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ శుక్రవారం అధికారులతో కలిసి భీమిలి బీచ్ రోడ్డు, మంగమారిపేట, తొట్లకొండ, రుషికొండ బీచ్ ప్రాంతాలను పరిశీలించారు. ప్రతినిధులు సందర్శించే ప్రాంతాల్లో భద్రత, పారిశుద్ధ్యం, రహదారులు, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను కూడా పరిశీలించారు. ప్రతినిధుల పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తొట్లకొండలో ఆంక్షలు బ్రిక్స్ ప్రతినిధుల పర్యటన నేపథ్యంలో తొట్లకొండకు సందర్శకుల ప్రవేశంపై రెండు రోజులపాటు ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పర్యాటకులు, సందర్శకులను తొట్లకొండపైకి అనుమతించబోమని వీఎంఆర్డీఏ కార్యదర్శి మురళీకృష్ణ తెలిపారు. ఈ సమయంలో ప్రతినిధుల పర్యటనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. -
మోదకొండమ్మకు కుంకుమ పూజలు
మాడుగుల మోదకొండమ్మ పాదాలకు కుంకుమ పూజలు చేస్తున్న భక్తులు మాడుగుల: ఉత్తరాంధ్ర ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ ఆలయానికి రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వెలసిన అమ్మవారి పాదాలకు ప్రత్యేక కుంకుమ పూజలు చేశారు. ఇంటికి గుర్తుతెలియని వ్యక్తి నిప్పు నక్కపల్లి: మండలంలోని ఎస్. నర్సాపురంలో ఎస్. వరహాలు అనే మహిళ పెంకుటిల్లుకు గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టాడు. శుక్రవారం తెల్లవారుజామున నిప్పు పెట్టడంతో ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఇదే ఇంటి పక్కన ఉన్న పోతంశెట్టి త్రిమూర్తులు ఇంటిపై సోలార్ ప్యానళ్లు కూడా కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే సీఐ మురళి తన సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రానున్న ఐదు రోజుల్లోతేలికపాటి వర్షాలు
● 26 వ తేదీ వరకూ తేలిక పాటి వర్షాలు చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురి సే అవకాశం ఉందని చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం అసో సియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ మరియు వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ డి. ఆదిలక్ష్మి తెలిపారు. ఈ నెల 22 నుండి 26 వరకు అల్లూరి జిల్లా పరిధిలోని వాతావరణ వివరాలను ఆమె వెల్లడించారు. చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో 2.7 నుండి 5.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 27.9 డిగ్రీల నుండి 28.8 డిగ్రీల మధ్య, కనిష్ట ఉష్ణోగ్రతలు 22.1 డిగ్రీల నుండి 22.3 డిగ్రీల మధ్య ఉండవచ్చని తెలిపారు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 82 నుండి 84 శాతం, మధ్యాహ్న సమయాల్లో 80 నుండి 87 శాతం మధ్య ఉంటుందన్నారు. గాలి గంటకు 6 నుంచి 7 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలున్నాయని, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు పంటల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఏడీఆర్ సూచించారు.షిప్.. షిప్.. హుర్రే! హిందూస్థాన్ షిప్యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) తన సుదీర్ఘ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది.శనివారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2026ముంచంగిపుట్టు: ప్రభుత్వం కొత్త ఇళ్లు మంజూరు చేసిందన్న ఆనందంతో ఉన్న ఇళ్లను తొలగించి.. కొత్త ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పీవీటీజీ గిరిజనులకు ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. గృహ నిర్మాణం వివిధ దశల్లో ఉన్నప్పటికీ సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. నెలల తరబడి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న గిరిజన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ● జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ గిరిజనుల కోసం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం–జన్మన్) పథకం కింద 28,691 పక్కా ఇళ్లను మంజూరు చేసింది. వీటిలో ఇప్పటివరకు 6,693 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ● ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.39 లక్షలు కేటాయించింది. తొలి విడతగా పునాది స్థాయి నిర్మాణానికి రూ.70 వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఆ తర్వాత లింటల్ స్థాయి వరకు నిర్మాణం పూర్తయితే రూ.90 వేలు, పైకప్పు నిర్మాణం పూర్తయితే రూ.40 వేలు చెల్లించాల్సి ఉంది. మరో రూ.27 వేలు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుంటే అదనంగా రూ.12 వేలు మంజూరు చేయాల్సి ఉంది. మూడు నెలలుగా రూ.కోట్లలో పైగా బకాయిలు జిల్లాలో నిర్మాణంలో ఉన్న గృహాలకు గత మూడు నెలలుగా నిధులు విడుదల కాలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. సుమారు రూ.6 కోట్లకు పైగా బిల్లులు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వివిధ దశల్లో ఉన్న 21,998 గృహాలకు బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. ముఖ్యంగా ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, హుకుంపేట మండలాల్లో బిల్లుల బకాయిలు అధికంగా ఉన్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. రూఫ్ లెవల్ దశ వరకు నిర్మాణం పూర్తయిన 12,027 గృహాలకు కూడా బిల్లులు అందాల్సి ఉంది. ఆందోళన చేసినా స్పందన కరువు : గృహ నిర్మాణ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులు మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించి ఆందోళనలు చేపట్టారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొత్త ఇల్లు మంజూరైందన్న ఆనందంతో పాత ఇళ్లను కూల్చుకున్న పీవీటీజీ గిరిజనులకు ఇప్పుడు తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో గత మూడు నెలలుగా సుమారు రూ.6 కోట్లకు పైగా గృహ నిర్మాణ బకాయిలు నిలిచిపోవడంతో వేలాది ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాత్కాలిక పాకల్లో చిన్నారులతో జీవిస్తూ లబ్ధిదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. -
ఏరో ఎక్స్ప్రెస్ బస్సుల్లో 30 శాతం ఆక్యుపెన్సీ
డాబాగార్డెన్స్: ఏరో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ ప్రస్తుతం 30 శాతంగా ఉందని రవాణా, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాదరెడ్డి తెలిపారు. విశాఖపట్నం నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుస్తున్న ఏరో ఎక్స్ప్రెస్ బస్సుల నిర్వహణను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఏరో ఎక్స్ప్రెస్ బస్సులు నిర్ణీత సమయపట్టిక ప్రకారం సమయపాలనతో నడుస్తున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఏరో ఎక్స్ప్రెస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే తక్కువ చార్జీలతో రూ.50 నుంచి రూ.400 వరకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రయాణికులు వీటిని వినియోగించుకోవాలని కోరారు. ఈ పరిశీలనలో ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు, డిప్యూటీ సీటీఎం కె.పద్మావతి, డీఈఎంఈ ఎ.గంగాధర్, డిపో మేనేజర్లు ప్రసాద్, దుర్గ, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
రాంగ్ రూట్లో కారు బీభత్సం
మాకవరపాలెం: రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందగా.. జ్యూస్ షాపు ధ్వంసమైంది. ఈ ఘటన మాకవరపాలెం – విశాఖపట్నం ప్రధాన రహదారిలో శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని శెట్టిపాలెం శివారు వెంకన్నపాలెం గ్రామానికి చెందిన చీపురుపల్లి దేముడు(80) శుక్రవారం ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ జ్యూస్ దుకాణం వద్ద కూర్చున్నాడు. విశాఖ వైపు నుంచి నర్సీపట్నం వెళ్తున్న కారు ఒక్కసారిగా నిబంధనలకు విరుద్ధంగా కుడివైపున ఉన్న దుకాణంపైకి దూసుకువచ్చింది. దీంతో అక్కడే కూర్చున్న దేముడును సైతం ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనలో జ్యూస్ దుకాణం ముందు ఉన్న రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్తో సహా నలుగురు ఉన్నారని, వారంతా సురక్షితంగా బయటపడ్డారని స్థానికులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ దామోదర్నాయుడు తెలిపారు. -
వరలక్ష్మీ నమోస్తుతే.!
ప్రయాణం గోతులమయంవాహనదారులకు అడుగడుగునా అవస్థలురూ.10 లక్షల నగదుతో నూకాంబిక అలంకరణమహాలక్ష్మీగా గవరపాలెం సంతోషిమాతఅనకాపల్లి: శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా జిల్లాలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళా భక్తులు వరలక్ష్మీదేవికి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వ్రతాలు ఆచరించారు. పట్టణం, మండలాల పరిధిలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. అమ్మవారి నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. ●అనకాపల్లి మెయిన్ రోడ్డులోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. తెల్లవారుజామున నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు ఉప్పల రవిరామ్ జవహర్, కార్యదర్శి శ్రీధరాల సోమరాజు, కోశాధికారి కడిమిశెట్టి అచ్యుతరామయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంధి వీవీఎస్ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ●గవరపాలెం సంతోషిమాత ఆలయంలో అమ్మవారిని మహాలక్ష్మీ అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మారిశెట్టి భాస్కరరావు, ఈవో చైతన్య తదితరులు పాల్గొన్నారు. ●గవరపాలెం నూకాంబిక అమ్మవారు ధనలక్ష్మీ అలంకరణలో దర్శనమిచ్చారు. సుమారు రూ.10 లక్షల విలువైన నగదుతో శోభాయమానంగా అలంకరించారు. మహిళలు ఉచిత కుంకుమ పూజలో పాల్గొని తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో యాళ్ల శ్రీధర్, చైర్మన్ పీలా నాగశ్రీను తదితరులు పాల్గొన్నారు. ●గవరపాలెం శతకంపట్టు కనకదుర్గ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ శాశ్వత చైర్మన్ కాండ్రేగుల నాయుడు, ప్రధాన అర్చకులు కె.హరి నారాయణ, కె.శివకేశవ, ఉదయగిరి చంద్రశేఖర్, వ్యవస్థాపకులు పీవీ రమణ, ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరశెట్టి వరాహ నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ●అరుంధతినగర్లో నూకాంబిక అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రతినిధి పెట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. -
సీలేరులో ‘ఇరుముడి’ సందడి
సీలేరు: మాస్ మహారాజ రవితేజ హీరోగా సీలేరు పరిసర ప్రాంతాల్లో నెల రోజుల పాటు చిత్రీకరించిన ‘ఇరుముడి’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ ప్రాంత అందాలను సినిమాలో చూడాలని స్థానికులు ఎంతో కాలంగా ఎదురుచూశారు. సినిమా విడుదల కావడంతో సీలేరు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలోని ‘కట్టు కట్టు ఇరుముడి కట్టు‘ అనే పాటను సీలేరు మారెమ్మ తల్లి ఆలయంలో చిత్రీకరించారు. ఇది ప్రేక్షకాదరణ పొందడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గుంటవాడ రిజర్వాయర్, ఇంటెక్స్ డ్యామ్ వంటి ప్రాంతాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. తమ ప్రాంత అందాలు, పర్యాటక ప్రదేశాలు వెండితెరపై కనిపించడం పట్ల స్థానికులు గర్వపడుతున్నారు. షూటింగ్ సమయంలో సీలేరు ప్రాంత అందాలకు, ఇక్కడి ప్రజల సహకారానికి దర్శకుడు, హీరో రవితేజ ముగ్ధులయ్యారని, సినిమా హిట్ అయితే ఈ ప్రాంతంలో మరిన్ని షూటింగ్లు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
సింహవల్లీ తాయారుకులక్ష కుంకుమార్చన
ప్రభుత్వం కొత్త ఇళ్లు మంజూరు చేయడంతో పాత ఇళ్లను తొలగించి నిర్మాణాలు ప్రారంభించిన పలువురు పీవీటీజీ గిరిజనులకు బిల్లులు అందక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో వర్షాకాలంలో తాత్కాలికంగా పాకలు వేసుకుని జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. – ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాకల్లోకి నీరు చేరుతుండటంతో చిన్నారులతో కలిసి గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొత్త ఇల్లు ఎప్పుడు పూర్తవుతుందో.. బకాయి బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. పాత ఇళ్లు తొలగించి.. పాకల్లో జీవనం -
వరాహ నృసింహునికిఘనంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన చేశారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ బేడామండపంలో వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో స్వామికి అష్టోత్తర పూజ నిర్వహించారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ బేడామండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాల తో కల్యాణం జరిపారు. ఉభయ దాతలకు కల్యా ణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు. -
గురుకులంలో సర్కారు గందరగోళం!
మధురవాడ: పేద గిరిజన విద్యార్థుల బతుకులతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ‘ఎక్సలెన్స్’ ముసుగులో వందలాది మంది అమాయక విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. మారికవలస ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 5, 6, 7 తరగతుల తరలింపు నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుంటే.. ప్రభుత్వం మాత్రం వారి ఆక్రందనలను నిర్దాక్షిణ్యంగా తొక్కిపెట్టింది. సమస్యను పరిష్కరించాల్సింది పోయి, ఏకంగా 10వ తరగతిలోపు ఉన్న బాలురందరినీ గెంటేసి పాఠశాలకే ఎసరు పెట్టే ఆలోచన చేస్తోంది. విద్యార్థుల ఆందోళనలను కనీసం పట్టించుకోకుండా, వారిని బలవంతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లగొట్టాలని ఉన్నతాధికారుల నుంచి అప్పటికప్పుడు హుకుం జారీ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఒకరి చదువు కోసం ఇంకొకరి బతుకును బలిపీఠం ఎక్కించే ఈ కుట్రపూరిత వైఖరిపై గిరిజన వర్గాల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. జీవో 69 ముసుగులో నిర్వాకం గతంలో తెచ్చిన జీవో నంబర్ 69 ద్వారా మారికవలస బాలికల స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్(ఎస్వోఈ), తిమ్మాపురం రోడ్డులోని గురుకుల పాఠశాలలో 5, 6, 7 తరగతుల విద్యార్థులను తరలించి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా భావించారు. అయితే ఆ పరిధిని ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా విస్తరించారు. బాలుర గురుకుల పాఠశాలలో 10వ తరగతి లోపు చదువుతున్న వందలాది మంది విద్యార్థులందరినీ ఏకపక్షంగా ఖాళీ చేయించాలని నిర్ణయించారు. దీంతో పాఠశాల ఉనికితో పాటు అక్కడ చదువుతున్న పేద విద్యార్థుల విద్యా భవిష్యత్తు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. ఒకరి కోసం మరొకరు బలి? మారికవలస బాలికల ఎస్వోఈలో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ చదువుతున్న 300 మందిని, మారికవలస ఆర్ఎస్లోని మరో 300 మంది విద్యార్థులను కలిపి మొత్తం 600 మందికి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ పేరుతో ఒకే ప్రాంగణంలో నీట్, ఐఐటీ కో–ఎడ్యుకేషన్ శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం మంచిదే అయినా, అందుకోసం ఏళ్ల తరబడి ఇక్కడే చదువుకుంటున్న పాఠశాల స్థాయి చిన్నారులను బలవంతంగా వెళ్లగొట్టడం ఎంతవరకు న్యాయమని ప్రజా, విద్యార్థి, గిరిజన సంఘాలతో పాటు తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. 600 మంది ఇంటర్ విద్యార్థుల కోసం కొత్త వసతులు కల్పించకుండా, అమాయక బాలుర బతుకులను రోడ్డున పడేసేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గురుకుల విద్యార్థులకు స్థిరమైన విద్యా వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని, దాన్ని ఒక్కసారిగా మార్చే నిర్ణయాలు వారి చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సమస్యలు పరిష్కరించే వరకు శాంతియుత పోరాటం
● జూనియర్ డాక్టర్ల స్పష్టీకరణ ● పాడేరు జిల్లా ఆసుపత్రి ఎదుట నిరసన.. విధుల బహిష్కరణ పాడేరు: తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించేంత వరకు శాంతియుత పోరాటం కొనసాగిస్తామని జిల్లా జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ మహేష్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు గురువారం పాడేరు జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి, ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేష్ మాట్లాడుతూ.. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచాలని, ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్యుల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11 నుంచి నిరసనలు తెలుపుతూ, 17వ తేదీ నుంచి విధులను పూర్తిగా బహిష్కరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం చర్చలకు పిలవకపోవడం విచారకరమన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు డాక్టర్ అమన్, పృథ్వీ, భానుతో పాటు పలువురు జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. -
కై సర్లవాని చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు
రోలుగుంట: కుసుర్లపూడి గ్రామానికి చెందిన కై సర్లవాని చెరువులో మట్టి అక్రమ తవ్వకాలతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం చెరువులోకి ట్రాక్టర్లు, పొక్లెయిన్లు తరలించి కొందరు అక్రమార్కులు మట్టి తవ్వకాలు ప్రారంభించారు. గ్రామ చెరువును అందంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన యువతకు ఈ అక్రమ తవ్వకాల విషయం తెలియడంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని అడ్డుకున్నారు. మట్టి తవ్వకాలు ఆపాలంటూ అక్రమార్కులను నిలదీశారు. ఈ విషయం ‘డిపార్ట్మెంట్ అధికారులు చెప్పాలి, మీరు ఎవరు?’అంటూ అక్రమార్కులు వాదనకు దిగడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రోలుగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ విషయంపై తహసీల్దార్ నాగమ్మను ఫోన్లో సంప్రదించగా, తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, తనకు సమాచారం లేదని తెలిపారు. ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు. ఇరిగేషన్ ఏఈ డి.సూర్యనారాయణను సంప్రదించగా, సిబ్బందిని పంపించి తవ్వకాలను నిలిపివేశామని తెలిపారు. తాత్కాలికంగా పనులు ఆగిపోవడంతో గ్రామ యువత వెనుదిరిగినప్పటికీ, ఈ వ్యవహారం మరింత వివాదాలకు దారి తీస్తుందేమోనన్న ఆందోళన గ్రామస్తుల్లో వ్యక్తమవుతోంది. -
తవ్వుతాం దోచుకుంటాం!
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2026డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం పాడేరు: జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలోని మిడ్ డే మిల్స్ విభాగంలో ఖాళీగా ఉన్న ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టును ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి భానుమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏదేని ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. వీటితో పాటు ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానంతో పాటు తెలుగు, ఇంగ్లీష్ టైపింగ్లో మంచి ప్రవేశం/నైపుణ్యం ఉండాలని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు పాడేరులోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నేరుగా తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు.మరింతసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రకృతి సంపదను కొల్లగొట్టేందుకు కూటమి నేతలు మరో అడుగు ముందుకేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డేటా సెంటర్లు, టూరిజం ప్రాజెక్టులు, మైనింగ్ పేరుతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కొండలను తొలిచేస్తున్న పరిస్థితుల్లో.. ఇప్పుడు లేటరైట్ పేరుతో సరుగుడు ప్రాంతంలో తవ్వకాలను మరింత భారీగా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి లక్ష్యాన్ని రెట్టింపు చేసి ఏడాదికి 22 లక్షల టన్నుల లేటరైట్ తవ్వేందుకు అనుమతులు పొందేందుకు కసరత్తు సాగుతోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు 9న సుందరకోట గ్రామంలోని కొత్త సిరిపురం రామాలయం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ప్రకటించింది. జర్తా లక్ష్మణరావు పేరుతో కొనసాగుతున్న మైనింగ్ ప్రాజెక్టులో 121 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న 10 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 22 లక్షల టన్నులకు పెంచాలని ప్రతిపాదించారు. మరో 36 హెక్టార్లలో కొత్తగా మైనింగ్కు అనుమతులు పొందేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రెట్టింపు తవ్వకాలు ! నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలో ఇప్పటికే 130.5 హెక్టార్లలోని రెండు ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల నుంచి ఏడాదికి సుమారు 20 లక్షల టన్నుల లేటరైట్ను తరలిస్తున్నారు. దీనికి అదనంగా మరో 20 లక్షల టన్నులను వెలికితీసేలా అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మొత్తం ఏడాదికి 40 లక్షల టన్నుల లేటరైట్ తవ్వి తరలించే స్థాయికి మైనింగ్ను విస్తరించేందుకు పావులు కదుపుతున్నారన్నమాట. ఇప్పటికే సరుగుడు పంచాయతీలోని నాగులకొండపై జరుగుతున్న తవ్వకాలపైనా ఆరోపణలు ఉన్నాయి. సుమారు 60 అడుగుల మేర తవ్వకాలకు అనుమతి ఉండగా.. 100 అడుగుల లోతు వరకు తవ్వకాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో భూగర్భ జలాల మట్టం పడిపోవడం, తాగునీటి ఇబ్బందులు తలెత్తడంతోపాటు వంట చెరకుకూ కొరత ఏర్పడుతోందని చుట్టుపక్కల ఉన్న పది గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండలు తరిగిపోతున్నా.. అధికారుల పర్యవేక్షణ మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైగ్రేడ్ లేటరైట్కు డిమాండ్ సరుగుడు ప్రాంతంలో లభిస్తున్న హైగ్రేడ్ లేటరైట్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని సమాచారం. టన్నుకు సుమారు రూ.5 వేల వరకు ధర పలుకుతున్న ఈ ఖనిజాన్ని ఒడిశాలోని ఓ ప్రైవేటు స్టీల్ ప్లాంట్కు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. రోజుకు వందలాది ట్రిప్పుల్లో ఖనిజాన్ని తరలించేందుకు అటవీ ప్రాంతం మీదుగా ప్రత్యేక రహదారిని నిర్మించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రహదారి నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఉన్నాయా? అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. అటవీ భూమిలో రహదారి నిర్మాణం జరిగినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఏటా 22 లక్షల టన్నుల లేటరైట్ తవ్వకానికి ప్లాన్ అనకాపల్లి జిల్లా సరుగుడులో మరింత ప్రకృతి విధ్వంసం సుందరకోటలో సెప్టెంబరు 9న ప్రజాభిప్రాయ సేకరణ చినబాబుకు, ఇద్దరు ఎంపీలకు భారీగా ముడుపులుచినబాబుకు రూ. 200 కోట్లు! ఈ మైనింగ్ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన కీలక నేతలకు భారీగా వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడి నుంచి తరలించే ప్రతి టన్ను లేటరైట్కు ‘చినబాబు’ పేరుతో రూ.500, మరో ఇద్దరు ఎంపీలకు చెరో రూ.250 చొప్పున వాటా వెళ్తోందని ప్రచారం జరుగుతోంది. ఏడాదికి 40 లక్షల టన్నుల లేటరైట్ తరలింపు లక్ష్యాన్ని చేరుకుంటే.. టన్నుకు రూ.500 చొప్పున లెక్కించినా ‘చినబాబు’కు ఏడాదికి రూ.200 కోట్ల వాటా అందుతుందనే ప్రచారం సాగుతోంది. మరో ఇద్దరు ఎంపీలకు చెరో రూ.100 కోట్ల చొప్పున.. ఇద్దరికీ కలిపి మరో రూ.200 కోట్లు దక్కుతాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవి కేవలం ప్రతిపాదిత ఉత్పత్తి లక్ష్యాల ఆధారంగా వేసిన లెక్కలేనని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అధికారిక లెక్కలకు మించి ఖనిజాన్ని తరలిస్తే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందనే ఆరోపణలూ ఉన్నాయి. గిరిజనుల పేరుతో మైనింగ్ సరుగుడు పంచాయతీ పరిధి గిరిజన ప్రాంతం కావడంతో ఇక్కడ 1/70 చట్టం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో గిరిజనుల పేర్లను ముందుపెట్టి మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజనుల పేర్లపై అనుమతులు తీసుకుంటున్నప్పటికీ.. వాస్తవంగా తవ్వకాలు, ఖనిజ రవాణా వ్యవహారాలను ఎవరు నియంత్రిస్తున్నారు? అసలు లబ్ధిదారులు ఎవరు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారంలో స్థానికంగా కీలక నేత కుమారుడు ‘చినబాబు’ తరఫున కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం ఉంది. తాజాగా చినబాబుకు సన్నిహితంగా ఉండే మరో ఎంపీకి కూడా ఈ మైనింగ్ వ్యవహారంలో వాటా అందుతోందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే తవ్వకాలతో సరుగుడు కొండలు రూపురేఖలు కోల్పోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతుండగా.. ఉత్పత్తిని రెట్టింపు చేసి ఏటా 22 లక్షల టన్నుల లేటరైట్ వెలికితీసేందుకు అనుమతిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. -
‘ఎన్జీరంగా’ పాలిటెక్నిక్లో స్పాట్ ప్రవేశాలు
చింతపల్లి: స్థానిక ఆచార్య ఎన్జీరంగా సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 26న జోనల్ స్థాయిలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ డి. ఆదిలక్ష్మి తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గుంటూరు ’లాం’ వద్ద నిర్వహించిన కౌన్సెలింగ్లో చింతపల్లి సేంద్రీయ పాలిటెక్నిక్లోని మొత్తం 25 సీట్లకు గానూ 12 సీట్లు భర్తీ అయ్యాయని, మిగిలిన 13 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకే చింతపల్లిలోనే నేరుగా స్పాట్ కౌన్సిలింగ్ చేపడుతున్నట్లు వెల్లడించారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారితో పాటు ఇంటర్మీడియట్ పాస్ లేదా ఫెయిల్ అయిన అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్కు హాజరుకావచ్చని సూచించారు. ఇతర వివరాలు, సందేహాల కోసం 9014637080 నంబరులో సంప్రదించాలని కోరారు. -
మాతా, శిశు మరణాల నివారణే లక్ష్యం
పాడేరు: గిరిజన ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించి మాతా, శిశు మరణాలను సంపూర్ణంగా నివారించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంతి స్పష్టం చేశారు. అలాగే టీనేజ్ గర్భధారణలు, బాల్య వివాహాలను అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో అడుగులు వేస్తోందన్నారు. పాడేరు శంకరన్ ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ’ఏఎస్ఆర్ – షాతి’ కార్యక్రమాన్ని గురువారం జిల్లా కలెక్టర్ నిశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏఎస్ఆర్ జిల్లాలోనే ఈ ‘షాతి’ కార్యక్రమాన్ని రూపొందించి ప్రారంభించామని తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రతి గర్భిణికి సురక్షితమైన ప్రసూతి పూర్వ వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గర్భధారణ ప్రారంభ సమయం నుండి ప్రసవం వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఏ తల్లి కూడా బిడ్డను కోల్పోయే పరిస్థితి రాకూడదని ఆకాంక్షించారు. గ్రామ స్థాయిలో ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేస్తున్న ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రమాదకర గర్భధారణలను (హై–రిస్క్ ప్రెగ్నెన్సీ) ముందుగానే గుర్తించి తగిన వైద్య చికిత్సలు అందించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా తీవ్ర నేరమని, ఎవరైనా బాల్య వివాహాలు జరిపించినా లేదా ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరామ్, డీఎంహెచ్వో డాక్టర్ రియాజ్, ప్రభుత్వ మెడికల్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, డాక్టర్ ప్రతాప్, డాక్టర్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, ఐసీడీఎస్, వైద్యారోగ్య శాఖల సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ నిశాంతి -
మాడుగుల ఎమ్మెల్యే హామీలపై సీఎంకు విన్నవిస్తాం
దేవరాపల్లి: మాడుగుల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హామీలు ఇచ్చి అమలు చేయడం మరిచిపోయారని, ఈ విషయంపై ఈ నెల 22న కె.కోటపాడులో పర్యటించనున్న సీఎం చంద్రబాబుకు వినతి పత్రాన్ని అందజేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీనబాడు – దేవరాపల్లి రోడ్డు నుంచి వయా వాలాబు మీదుగా కోనాంకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 6 కోట్లు మంజూరు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా నేటికి అతీగతీ లేదన్నారు. చింతలపూడి పంచాయతీ శివారు వీరభద్రపేటకు కోటి రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి పల్లె పండుగ పేరిట అట్టహాసం చేసి అసంపూర్తిగా నిలిపివేశారన్నారు. బోడిగరువు, నేరెళ్లపూడి, ఎం.అలమండ– మామిడిపల్లి రోడ్లు రెండేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయాయన్నారు. రైవాడ జలాశయం రూపురేఖలు మారుస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే హామీని గాలికి వదిలేశారన్నారు. దేవరాపల్లిలో హోల్సేల్ కాయగూరల మార్కెట్లో కోల్డ్ స్టోరేజీ, దేవరాపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తదితర హామీలను నెరవేర్చలేదన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నెరవేర్చని ఇతరత్రా హామీలన్నింటిని వెంటనే అమలు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేస్తామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న -
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్కు కూటమి తూట్లు
నర్సీపట్నం: షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అభివృద్ధికి తోడ్పాటును అందించేందుకు తీసుకువచ్చిన సబ్ ప్లాన్కు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడించిందని డీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శివప్రకాష్ విమర్శించారు. మున్సిపాలిటీలో గురువారం ఆయన మాట్లాడుతూ చట్ట ప్రకారం జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించి ఎస్సీ, ఎస్టీ పథకాలకు మాత్రమే ఖర్చు చేయాలన్నారు. ఇతర పథకాలకు నిధులను మళ్లించడం సరికాదన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 24న కలెక్టరేట్ వద్ద ధర్నా తలపెట్టామన్నారు. కొన్ని సందర్భాల్లో నిధులు ఖర్చు కాక మురిగిపోతున్నాయన్నారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వంద శాతం ఖర్చు చేయడంలేదన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సబ్ ప్లాన్ పథకానికి బడ్జెట్లో రూ.18,497.68 కోట్లు కేటాయించిస్తే, రూ.13,571.50 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. 2025–26లో సబ్ ప్లాన్కు రూ.20,281.20 కోట్లు కేటాయించి రూ.15,616.45 కోట్లు ఖర్చు చేశారన్నారు. దీని వల్ల ఎస్సీ వర్గాలు నష్టపోతున్నాయని వాపోయారు. ఎస్సీ వర్గాలకు తీవ్ర ద్రోహం జరుగుతుందన్నారు. సమావేశంలో డీహెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు యర్రంశెట్టి పాపారావు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో లారీ డ్రైవర్ ఆత్మహత్య
సబ్బవరం: అప్పుల బాధ తాళలేక ఓ లారీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పైడివాడ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసకపల్లి శివారు ఎరుకునాయుడుపాలెం గ్రామానికి చెందిన గౌర నీలకంఠేశ్వరరావు(35) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం పైడివాడకు చెందిన జ్యోతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. భార్యాభర్తలు పైడివాడ బీసీ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. జ్యోతి నాన్నమ్మ అనారోగ్యంతో ఉండటంతో రెండు రోజుల క్రితం ఆమెను చూసేందుకు జ్యోతి మరో వీధిలోని నాన్నమ్మ ఇంటికి వెళ్లింది. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన ఆమె, భర్త ఆచూకీ కోసం ఇంటి పక్కనే నివసిస్తున్న మహిళను అడగగా.. తెల్లవారుజామున నీలకంఠేశ్వరరావు తన తాతకు చెందిన మామిడి తోట వైపు వెళ్లినట్లు ఆమె తెలిపింది. దీంతో జ్యోతి తోటకు వెళ్లి చూడగా.. నీలకంఠేశ్వరరావు మామిడి చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. అప్పుల బాధతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు జ్యోతి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సబ్బవరం సీఐ జి.రామచంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతగిరి ఎంఈవో–1పై ఫిర్యాదు
● అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలి ● ఉద్యోగ సంఘాల ప్రతినిధుల డిమాండ్ పాడేరు రూరల్: అనంతగిరి మండల విద్యాశాఖ అధికారి–1 బాలాజీ తీవ్ర అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు గురువారం పాడేరులో డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాసాడ ఈశ్వర్రావు, డీటీఎఫ్, ఏపీటీఎఫ్, పీఆర్టీయూ, బీటీఏ సంఘాల నేతలు సన్యాసిరావు, గురుదొర, రామకృష్ణ, దేముడు తదితరులు మాట్లాడారు. 2023 నుంచి ఇప్పటివరకు ఎంఈఓ పాఠశాలలకు సంబంధించిన సామగ్రి, మధ్యాహ్న భోజన నిధులను స్వాహా చేశారని ఆరోపించారు.జీనబాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి, భవన నిర్మాణ పనులు ఏమాత్రం జరగకుండానే రూ. 11,98,000 నిధులను డ్రా చేసుకున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్ వేస్తూ ఒక్కో ఉపాధ్యాయుడి వద్ద నుంచి రూ. 30 వేల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారన్నారు. మండలంలోని 175 పాఠశాలల ఫేషియల్ హాజరులో జోక్యం చేసుకోవడమే కాకుండా, మధ్యాహ్న భోజన బిల్లుల మంజూరుకు రూ. 500 చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు.బదిలీపై వెళ్లే ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ ప్రక్రియ కోసం రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు లంచం తీసుకుంటున్నారు. ఎంఈవో బాలాజీ అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. -
సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు
కె.కోటపాడు: మండలంలోని ఎ.కోడూరులో ఈ నెల 22న సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ప్రాథమిక పాఠశాల సమీపంలో సీఎం హెలిప్యాడ్ నిర్మాణ పనులను ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హెలిప్యాడ్ నుంచి ప్రజావేదిక ప్రాంతానికి చేరుకునే మార్గాన్ని శుభ్రం చేయిస్తున్నారు. ఇక్కడ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారుల వాహనాల పార్కింగ్ కోసం గ్రామ సమీపంలో ఖాళీ ప్రదేశాలను ప్రజా వేదిక కోసం హైస్కూల్ ప్రాంగణాన్ని జేసీబీలతో సిద్ధం చేస్తున్నారు. ఈ పనులను కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్పటేల్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గురువారం పరిశీలించారు. -
న్యాయవాదుల సమస్యలపై సానుకూల స్పందన
విశాఖ లీగల్: విశాఖ న్యాయవాదుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూలంగా స్పందిస్తామని ఉమ్మడి విశాఖ జిల్లా పోర్ట్ఫోలియో న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బి.వి.ఆర్.మూర్తి, డి.మంజులత, ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, కె.రామజోగేశ్వరరావులు నేలపాడులోని హైకోర్టు ఆవరణలో జస్టిస్ దేవానంద్ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశాఖ న్యాయవాదుల పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. వినతిపత్రంలోని అంశాలను పరిశీలించి తగిన విధంగా స్పందిస్తామని జస్టిస్ దేవానంద్ హామీ ఇచ్చారు. విశాఖతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. ఎందరో మహనీయులతో ప్రత్యేక గుర్తింపు పొందిన విశాఖ బార్ అసోసియేషన్ సమస్యలపై అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ సభ్యులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సోలాపూర్–అనకాపల్లి ఎక్స్ప్రెస్ ఇక రెగ్యులర్
తాటిచెట్లపాలెం: సోలాపూర్–అనకాపల్లి–సోలాపూర్ మధ్య నడుస్తున్న వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ నెల 21 నుంచి రెగ్యులర్ రైలుగా నడవనుంది. సోలాపూర్–అనకాపల్లి (11313) రైలు శుక్రవారం ఉదయం 9.20 గంటలకు సోలాపూర్లో బయల్దేరి శనివారం మధ్యాహ్నం 2.40 గంటలకు అనకాపల్లి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అనకాపల్లి–సోలాపూర్ (11314) రైలు ఈ నెల 22 నుంచి రెగ్యులర్గా నడుస్తుంది. శనివారం సాయంత్రం 5.35 గంటలకు అనకాపల్లిలో బయల్దేరి ఆదివారం రాత్రి 11.50 గంటలకు సోలాపూర్ చేరుకుంటుంది. ఈ రైళ్లు గుంతకల్, అనంతపురం, ధర్మవరం, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి తదితర స్టేషన్లలో ఆగుతాయి. చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్ (07037) వీక్లీ స్పెషల్ ఈ నెల 25న రాత్రి 8.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (07038) రైలు ఈ నెల 26న మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చర్లపల్లి చేరుతుంది. -
ఎయిరో ఎక్స్ప్రెస్ ఆలస్యం.. ప్రయాణికులకు చుక్కలు
అల్లిపురం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు ఏర్పాటు చేసిన ఏపీఎస్ఆర్టీసీ ఎయిరో ఎక్స్ప్రెస్ బస్సుల సమయపాలనపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సులు నిర్ణీత సమయానికి రాకపోవడంతో విమానాశ్రయానికి సమయానికి చేరుకోలేమనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం గురుద్వారా జంక్షన్లో సైమన్ అబీబ్ అనే ప్రయాణికుడు ఉదయం 8 గంటల నుంచే ఎయిరో ఎక్స్ప్రెస్ కోసం వేచి ఉన్నారు. ఉదయం 8.30 గంటలకు రావాల్సిన బస్సు 8.45 గంటలైనా రాకపోవడంతో అక్కడి ఎంకై ్వరీ సిబ్బందిని ప్రశ్నించగా..‘బస్సు రావాల్సి ఉంది.. ఇంకా రాలేదు’ అనే సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం ఫోన్ ద్వారా ఎంకై ్వరీని సంప్రదించినా స్పష్టమైన సమాచారం అందలేదని, దీంతో సమయానికి విమానాశ్రయానికి చేరుకోలేక విమానం మిస్సయ్యే పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ కారణంగా స్వల్ప ఆలస్యం: ఆర్ఎం ఈ అంశంపై ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు స్పందిస్తూ, ట్రాఫిక్ రద్దీ తదితర కారణాలతో ఎయిరో ఎక్స్ప్రెస్ బస్సులు అప్పుడప్పుడు 5 నుంచి 10 నిమిషాలు ఆలస్యమవు తున్నాయని తెలిపారు. అయినప్పటికీ మొత్తం మీద బస్సులు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రతి బస్టాప్ వద్ద బస్సుల రాకపోకల సమయాలను సూచించే బోర్డులు ఏర్పాటు చేశామని, సమయపాలనపై సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని ధర్నా
ఎస్.రాయవరం: నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో అనారోగ్యంతో ఉన్న రైతుపై రెవెన్యూ అధికారులు దౌర్జాన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు అడ్డురోడ్డులోని ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. సంబంధిత అధికారులను, ముఖ్యంగా తహసీల్దార్ను వెంటనే సస్పెండ్ చేసి, బాధిత రైతుకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధిత రైతు గోసల దేముడు భార్య రామయ్యమ్మ, ఆయన అల్లుడు, ఎస్.రాయవరం మండలం వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పన్న, రైతు సంఘ నాయకుడు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ రాజయ్యపేట గ్రామంలోని సర్వే నంబర్లు 231/3బీలో ఎకరా 11 సెంట్లు, 231/5లో ఎకరా 45 సెంట్లు, 235/5లో 80 సెంట్లు కలిపి మొత్తం 3 ఎకరాలు 37 సెంట్ల భూమిని 2023లో ఏపీఐఐసీ భూసేకరణ సమయంలో మినహాయింపుగా గుర్తించినట్లు తెలిపారు. అయితే అదే భూమిలోకి బుధవారం నక్కపల్లి తహసీల్దార్ అక్రమంగా ప్రవేశించి, మొక్కలకు నీరు పోస్తున్న రైతు గోసల దేముడితో వాగ్వాదానికి దిగారని ఆరోపించారు. పెద్దగా అరుస్తూ భయాందోళనలకు గురి చేయడంతో అప్పటికే అనారోగ్యంతో ఉన్న దేముడు స్పృహ తప్పి కుప్పకూలిపోయారని తెలిపారు. అనంతరం అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది పొలంలో ఉన్న వస్తువులను తొలగించారని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్లు 12, 20లను, న్యాయస్థానాల తీర్పులను పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు వ్యవహరించారని విమర్శించారు. బాధిత రైతుకు తక్షణమే మెరుగైన వైద్యం అందించడంతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో రామలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఘటనపై స్పందించిన ఆర్డీవో.. విషయం జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎం.మహేష్బాబు, జె.అప్పలరాజు, సిహెచ్.రాజు, గోపాలకృష్ణ, ఎం.రమణ, జి.కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
విశాఖను అదాని‘పట్నం’గా మార్చొద్దు
ఎంవీపీకాలనీ: విచక్షణారహితంగా భూ కేటాయింపులు చేస్తూ విశాఖను ధ్వంసం చేసి, దానిని ‘అదానిపట్నం’గా మార్చవద్దని చంద్రబాబు ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు. విశాఖ పర్యటనలో భాగంగా గురువారం ఆయన పార్టీ నాయకులతో కలిసి ముడసర్లోవ జలాశయం, అక్కడి డేటా సెంటర్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మూడేళ్ల క్రితమే మధురవాడలో అదానికి కేటాయించిన 300 ఎకరాల భూమి ఇంకా వినియోగంలోకి రాకుండానే, తాజాగా ముడసర్లోవలో సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాలను ప్రభుత్వం కేటాయించడాన్ని తప్పుపట్టారు. ఈ కేటాయింపుల వల్ల విశాఖ ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. 40 ఏళ్లుగా పరిష్కారం కాని సింహాచలం పంచగ్రామాల సమస్యను పక్కనపెట్టి, అదానికి భూములు ధారాదత్తం చేస్తున్న తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీలో అదాని అబద్ధాలను నమ్మి మంత్రి లోకేష్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రాజెక్టుపై ఎలాంటి నిపుణుల నివేదిక, లాభనష్టాల విశ్లేషణ లేకుండానే మాట్లాడటం సరికాదని అన్నారు. హిందుత్వ పరిరక్షణ పేరుతో ప్రచారం చేసుకునే బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీలు అప్పన్న దేవస్థాన భూములు అదానికి వెళ్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నాయని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో రుషికొండ అంశంపై గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఇప్పుడు విశాఖలో మూడు కొండలను బోడిగుండ్లుగా మారుస్తున్నారని, ఆ ప్రాంతాలకు ఎవరినీ వెళ్లనివ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ముడసర్లోవలో డేటా సెంటర్ ఏర్పాటు వల్ల విశాఖ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి యం.జగ్గునాయుడు, కార్యదర్శివర్గ సభ్యుడు డాక్టర్ బి.గంగారావు, ఆర్కేఎస్వీ కుమార్, పి.మణి, వి.కృష్ణారావు, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
డుంబ్రిగుడలో టీడీపీకి బిగ్ షాక్
అరకులోయ టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన నచ్చకే ఇతర పార్టీల శ్రేణులు వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్ ఆధ్వర్యంలో గురువారం కొర్రాయి పంచాయతీ పరిధిలోని జాముగుడ, జాంకరవలస, అంజోడ, బోందుగుడ గ్రామాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయి. పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ.. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అందించిన సంక్షేమ పథకాలను, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిఒక్కరికీ వివరించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టంతో రాబోయే స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కొర్రాయి పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు లైచోన్ ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడం అభినందనీయమని మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పల్లాసింగ్ విజయ్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి నర్సింగరావు, నియోజకవర్గం బూత్ కమిటీ ఇన్చార్జ్ పాంగి విజయ్, మాజీ వైస్ ఎంపీపీ ధర్మనాయుడు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు బీబీ కామేశ్వరరావు, సందడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరినవంద కుటుంబాలు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాలన నచ్చకే చేరినట్టు వెల్లడి -
గిరిజనుల సమస్యలు పట్టవా?
● 16 నెలలుగా ఏర్పాటుచేయనిఐటీడీఏ పాలకవర్గ సమావేశం ● తక్షణ నిర్వహించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ అరకులోయ టౌన్: కూటమి ప్రభుత్వానికి పాడేరు ఏజెన్సీ ప్రాంత సమస్యలపై శ్రద్ధ లేదని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆరోపించారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించలేదని, తక్షణమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు బదిలీలపై వెళ్తున్నారు తప్ప, గిరిజనుల సమస్యలను పరిష్కరించేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని 11 మండలాల గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడం వల్ల చెత్తాచెదారం నిండి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. మారుమూల గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యాలు లేక నేటికీ డోలి మోతలు తప్పడం లేదన్నారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాలు, సీసీ రోడ్డు నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. గిరిజన ప్రాంత సమస్యలపై చర్చించేందుకు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదో రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానం చెప్పాలని నిలదీశారు. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన తర్వాత గ్రామ పంచాయతీల్లో నియమించిన ప్రత్యేక అధికారులు కనీసం గ్రామాల్లో పర్యటించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ నిశాంతి, ఐటీడీఏ పీవో అభిషేక్ స్పందించి ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యే మత్స్యలింగం డిమాండ్ చేశారు. -
22 కిలోల గంజాయి పట్టివేత
ముంచంగిపుట్టు: మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు జంక్షన్ వద్ద బుధవారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న 22 కిలోల 100 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు సీఐ లక్ష్మణరావు తెలిపారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు లబ్బూరు జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒడిశా వైపు నుంచి బైక్లపై వస్తున్న వ్యక్తులు పోలీసులను చూసి వాహనాలను వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి బైక్లపై ఉన్న బస్తాలను తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో తూకం వేయగా 22 కిలోల 100 గ్రాముల గంజాయి ఉన్నట్లు తేలిందని, దీని విలువ సుమారు రూ. 11 లక్షల 5 వేలు ఉంటుందని సీఐ వెల్లడించారు. పట్టుబడిన స్మగ్లర్లు ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా లమతాపుట్ బ్లాక్కు చెందిన బలరామ్, నీలు, గణపతిగా గుర్తించి అరెస్టు చేశామన్నారు. వారి నుంచి గంజాయితో పాటు రెండు బైక్లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. పదేపదే నేరాలకు పాల్పడే స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సీఐ లక్ష్మణరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాని, స్థానిక పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం
చింతపల్లి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో వైఎస్సార్సీపీ జెండా ఎగరాలని ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. చింతపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పాంగి గణబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. కావున గ్రామ కమిటీ సభ్యులు ప్రతి గడపకూ వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను ప్రజలకు వివరించి వారి మద్దతును కూడగట్టాలని సూచించారు. గత ఎన్నికల్లో ఏ విధంగానైతే విజయాలు సాధించుకున్నామో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కార్యకర్తలు మరింత కష్టపడి ప్రతి పంచాయతీని కై వసం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని, కేవలం గెలుపే లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ కోరభు అనూషదేవి, జడ్పీటీసీ పోతురాజు బాలయ్య, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జల్లి సుధాకర్, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి భూసారి కృష్ణరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుబ్బడి శేఖర్, వైస్ ఎంపీపీలు గోపీనాయక శారద, సాగిన వెంగళరావు, సీనియర్ నాయకులు సాగిన గంగన్న పడాల్, మోరీ రవి, జిల్లా యువజన కార్యదర్శి వేములపూడి పరమేష్తో పాటు వివిధ పంచాయతీల ఎంపీటీసీలు, సర్పంచ్లు, అనుబంధ విభాగాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీజిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు -
గర్భిణి మృతిపై విచారణ
రోలుగుంట: బుచ్చింపేట పీహెచ్సీ పరిధిలో గల లోసింగి గ్రామానికి చెందిన గర్భిణి పాంగి రాజేశ్వరి (24) తన ఇంటి వద్దనే మృతి చెందింది. ఈ సమాచారంతో బుధవారం డీఎంహెచ్వో ఆర్. అచ్యుతాకుమారి, డిప్యుటీ డీఎంహెచ్వో చంద్రశేఖర్ వచ్చి విచారణ చేపట్టారు. ఆరు నెలల గర్భవతి రాజేశ్వరి మంగళవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లినపుడు తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో కుటుంబీకులు బుచ్చింపేట పీహెచ్సీకి తరలించగా వైద్యాధికారి శివప్రసాద్ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా అసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే వారు ఆమెను గ్రామానికి తీసుకెళ్లారు. అవసరమైనవి సమకూర్చుకొని తిరిగి ఏరియా ఆసుపత్రికి తరలించే సమయానికి ఆమె గ్రామంలోనే మృతి చెందింది. దీనిపై సమాచారంతో డీఎంఅండ్హెచ్వో వచ్చి మృతురాలి కుటుంబీకులను ఓదార్చారు. జరిగిన విషయాలపై ఆరా తీశారు. గ్రామానికి ఆశా కార్యకర్త లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఈ రోడ్డు మార్గంలో కొండపై నుంచి దిగువకు పీహెచ్సీకి తీసుకురావడానికి ఎన్నో ఇక్కట్లు పడ్డామని తెలిపారు. కాగా ఈ సందర్భంగా బుచ్చింపేట పీహెచ్సీని డీఎంహెచ్వో అచ్యుతాకుమారి, డిప్యూటీ డీఎంహెచ్వో చంద్రశేఖర్ బుధవారం విడివిడిగా అకస్మికంగా తనిఖీ చేశారు. డెలివరీలు ఎలా జరగుతున్నాయి..నెలకెన్ని జరుగుతున్నాయో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మాతృ మరణాలు జరగకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు జారీ చేశారు. -
అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థికి ఆర్థిక సాయం
కశింకోట: డ్యూషెన్ మస్క్యూలర్ డిస్ట్రోఫీ సమస్య (కాల క్రమేణా కండరాలు బలహీనపడి క్షిణించిపోయే జన్యుపరమైన వ్యాధుల సమూహం)తో బాధపడుతున్న విద్యార్థికి కశింకోటలోని సెయింట్ జాన్స్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది సంయుక్తంగా రూ.3.49 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇదే స్కూల్లో 2వ తరగతి చదువుతున్న పొన్నగంటి ప్రణయ్ సూర్య వైద్య చికిత్సకు మానవతా దృక్ఫథంతో ఆర్థిక సహాయం సమకూర్చి బుధవారం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు అందించారు. తన స్కూల్లో చదివినంత కాలం ప్రణయ సూర్యకు ఉచిత విద్య అందిస్తామని పాఠశాల యాజ మాన్యం ప్రకటించింది. -
స్థానిక ఎన్నికలకు కసరత్తు
● వీడియో కాన్ఫరెన్సులో సూచనలిచ్చిన కలెక్టర్ నిశాంతి ● ఇప్పటినుంచి ఏర్పాట్లు చేయాలని ఆదేశం పాడేరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో, అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే చేపట్టాల్సిన పనులపై ఇప్పటి నుంచి కసరత్తు మొదలైంది. జిల్లా కలెక్టర్ స్థాయిలో అధికారులతో ఇప్పటికే సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. తాజాగా బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు.. కలెక్టర్ టి. నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. అర్బన్ లోకల్ బాడీస్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయని అధికారులు తెలిపారు. అర్బన్ లోకల్ బాడీస్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత 15 రోజుల్లో పోలింగ్ నిర్వహించి, 18వ రోజున ఫలితాలు ప్రకటిస్తారని కలెక్టర్ వెల్లడించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ తర్వాత 16వ రోజున పోలింగ్ జరిపి, 19వ రోజున ఫలితాలను వెల్లడిస్తారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన 14వ రోజున పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు పూర్తి చేసేలా షెడ్యూల్ ఉంటుందని వివరించారు. ఏర్పాట్లు – ఓటర్ల వర్గీకరణ పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం, ఎన్నికల సామాగ్రి సిద్ధం చేయడం, కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఓటర్ల వర్గీకరణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని 11 మండలాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాల ఓటర్లను విభజించి, కచ్చితమైన జాబితాలను సిద్ధం చేస్తున్నారు. వెబ్సైట్ మాడ్యూల్ వినియోగం ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం, ప్రతి దశకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన అధికారిక వెబ్సైట్ మాడ్యూల్లో నిర్ణీత సమయంలోగా అప్లోడ్ చేయాలని అధికారులు ఆదేశించారు. పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్ నిశాంతి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. ప్రీ–పోలింగ్ ప్రక్రియ, ఓటర్ల విభజన, కౌంటింగ్ వంటి అంశాలపై ఎన్నికల సంఘం అందించిన సూచనలను అమలు చేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎటువంటి లోపాలు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. -
చింతాలమ్మ ఘాట్లో భారీ ప్రమాదం
● లారీ బ్రేక్ ఫెయిల్ ● అప్రమత్తమైన డ్రైవర్ ● కొండను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు ● కాసేపటికే ప్రాణాలు వదిలిన వైనం కొయ్యూరు : పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి నుంచి నర్సీపట్నం ఎరువుల లోడుతో వస్తున్న లారీ చింతాలమ్మ ఘాట్ రోడ్డులో బ్రేకులు ఫెయిలై అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో లారీ పక్కనే ఉన్న కొండను బలంగా ఢీకొట్టింది. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన డ్రైవర్ నలపు కృష్ణ (51) తీవ్రంగా గాయపడి, కొద్దిసేపటికి మృతి చెందారు. చింతాలమ్మ ఘాట్ ఎక్కిన తర్వాత డౌన్లో లారీకి బ్రేకులు పనిచేయలేదు. అయినప్పటికీ డ్రైవర్ కొంత దూరం వరకు లారీని ఎంతో ధైర్యంగా అణచి ఉంచారు. చివరకు నాలుగో మలుపు వద్ద లారీని కొండ వైపుగా మళ్లించి బలంగా ఢీకొట్టారు. ఒకవేళ డ్రైవర్ ఆ సమయంలో కొండను ఢీకొట్టకపోతే, ఎదురుగా వస్తున్న కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు, ఎంపీపీ బడుగు రమేష్ వాహనాలను ఢీకొని ఉండేదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. రక్షించండి అంటూ ఆర్తనాదాలు.. కొండను లారీ ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ కృష్ణ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. లారీ కొండలో కూరుకుపోవడంతో నన్ను రక్షించండి, ప్రాణాలు కాపాడండి.. అంటూ ఆయన ఆర్తనాదాలు చేశారు. పక్కనే ఉన్న సీఐ వెంటనే స్పందించి డ్రైవర్కు ధైర్యం చెప్పారు. ఏం కాదంటూ చాలాసేపు ఆయనతో మాట్లాడారు. వెంటనే జేసీబీని రప్పించి క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీశారు. రాజేంద్రపాలెం నుంచి వైద్యుడు జగదీష్నాయక్ వచ్చేసరికి డ్రైవర్ కృష్ణ మృతి చెందారు. కాగా, విజయనగరం జిల్లా రాజాం ప్రాంతంలోని వస్త్రపుర కాలనీ కొట్టువలసకు చెందిన క్లీనర్ షేక్ అసీర్ను వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
చింతామణి గణపతి దత్త క్షేత్రంలో సస్య గణపతి
అనకాపల్లి: పర్యావరణ పరిక్షణను కాపాడుతూ ఈ ఏడాది గణపతి నవరాత్ర ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చింతామణి గణపతి దత్త క్షేత్రం స్థలదాత సి.వి.రమారావు అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన సిరసపల్లి చింతామణి గణపతి దత్తక్షేత్రంలో గణపతి నవరాత్రులను పురస్కరించుకుని దేవి శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ సహకారంతో సజీవ మొక్కలతో రూపొందించిన 20 అడుగుల ‘సస్య గణపతి’ బ్రోచర్ను, సస్య గణపతి నమూనాను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమారావు, దత్త క్షేత్రం నిర్వాహకులు ఆంజనేయరాజు విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 14 నుంచి గణపతి నవరాత్రులను పురస్కరించుకుని సస్య గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుందని, గణపతి తయారీకి 2 టన్నుల ఇనుమును ఉపయోగించడం జరిగిందని తెలిపారు. సుమారుగా 16 నుంచి 80 వేల మొక్కలతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూపొందిస్తున్నామని, దీనికి రూ.50 లక్షల వరకూ ఖర్చు అవుతుందన్నారు. సస్య గణపతిని దత్త క్షేత్ర ఆవరణలో 21 రోజులు భక్తుల దర్శనార్ధం ఉంచడం జరుగుతుందన్నారు. గణపతికి ఉపయోగించే మొక్కలను పూణే నుంచి దత్త క్షేత్రానికి తీసుకురావడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 13న భక్తులకు (వినాయక చవితి పురస్కరించుకుని) ఉచితంగా 21 రకాల పత్రులు, గణపతి విగ్రహం, వ్రతకల్పం పుస్తకం అందజేస్తామని, దీనికి ముందుగా ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. దేవి శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు సుధాకర్, విజయకుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14న ఒడిశా గవర్నర్ హరిబాబు విచ్చేస్తారని తెలిపారు. జలధారలు, ప్రకృతి సోయగాలు, దివ్యకాంతుల నడుమ వెలసిన సస్య హరిత గణపతిని దర్శించుకోవడం పర్యావరణ ప్రేమికులకు మంచి అనుభూతి ఇస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సన్యాసిరావు, టీడీపీ నాయకుడు నీలబాబు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
డుంబ్రిగుడ: అరకు గ్రామంలో ఈనెల 12న జరిగిన చోరీ కేసును స్థానిక పోలీసులు విజయవంతంగా ఛేదించారు. స్థానిక అరకులోయ సీఐ కోటేశ్వరరావు విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. షావుకారి బాలకృష్ణ అనారోగ్యంతో మృతి చెందడంతో, కుటుంబ యాజమాని లేకపోవడంతో బాధిత కుటుంబీకులు అత్తింటి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రాత్రి గుర్తుతెలియని దుండగులు కిటికీలు పగులగొట్టి గదిలోకి చొరబడి, బీరువాలోని వస్తువులను చిందరవందర చేసి పక్కనే ఉన్న లాకర్ను ఎత్తుకెళ్లారు. బాధితుడి తండ్రి షావుకారి దాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ సురేష్ నేతృత్వంలో క్లూస్ టీమ్తో పాటు డాగ్ స్క్వాడ్ను రప్పించి ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముద్దాయిల ఆనవాళ్లను సేకరించారు. చుట్టుపక్కల ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలతో పాటు కాల్ డేటాను విశ్లేషించి ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల గాలింపు చర్యల్లో భాగంగా ఈనెల 18న బొందుగుడ జంక్షన్లో సాయంత్రం ఆరు గంటల సమయంలో అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి వెళ్లగా.. పోలీసులను చూసి పారిపోతున్న అరకు గ్రామానికి చెందిన అడకట్ల శరత్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా దొంగతనం చేసినట్లు రుజువైందని సీఐ తెలిపారు. అతని నుంచి 8.25 తులాల బంగారం, 919 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ చోరీ సొత్తు విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ఉమాశంకర్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుని లాకర్తో పాటు మిగతా నగదును కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. గిరిజనులు, పర్యాటకులు ఎవరైనా సరే చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. ఈ సమావేశంలో డుంబ్రిగుడ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడి అరెస్టు 8.25 తులాల బంగారం,919 గ్రాముల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించినఅరకు సీఐ కోటేశ్వరరావు -
నిత్య సాధనతోనే గాయకులుగా రాణింపు
సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజ ముగిసిన శ్రీప్రకాష్ వ్యవస్థాపక వేడుకలు పాయకరావుపేట: నిత్య సాధనతోనే భవిష్యత్లో మంచి గాయకులుగా ఎవరైనా రాణించగలరని ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజ అన్నారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థలు 49 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన 50వ వ్యవస్థాపక వేడుకలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో భాగంగా రెండు రోజుల పాటు తుని, పాయకరావుపేట, అన్నవరం, పెద్దాపురం, కాకినాడ, రాజమహేంద్రపురం తదితర ప్రాంతాల శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల విద్యార్థుల మధ్య ‘గాతా రహే మేరా దిల్’పేరుతో పాటల పోటీలు నిర్వహించారు. ఆరో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు జూనియర్, సీనియర్ విభాగాలుగా ఈ పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ శైలజ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. నిరంతర సాధనతో విద్యార్థులు భవిష్యత్తులో మంచి గాయకులుగా ఎదగగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె తన పాటలతో ఆహూతులను అలరించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె.నరసింహారావు మాట్లాడుతూ స్వయం ఉపాధి ద్వారా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం శైలజను జ్ఞాపికతో సత్కరించారు. పోటీల్లో విజేతలకు శైలజతో పాటు విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్.విజయ్ ప్రకాష్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు డా.నరేంద్రబాబు, కోశాధికారిణి సిహెచ్.రామసీత, సభ్యులు సబ్బవరపు సూర్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
22న సీఎం చంద్రబాబు పర్యటన
● ఏర్పాట్లపై సమీక్షించిన జేసీ తిరుమణి శ్రీపూజ పాడేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22న జిల్లాలో పర్యటించనున్నారని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు. ఈనెల 22న అరకువేలీ మండలం గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) ఆయన సందర్శించి, సంజీవని పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి, ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించే ఉద్దేశంతోనే ఈ సంజీవని ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు జేసీ తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించి నిర్దేశిత ప్రొటోకాల్ ప్రకారం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గన్నెల పీహెచ్సీని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని, సంబంధిత శాఖల అధికారులు అక్కడికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. -
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గిరిజన గ్రామాల అభివృద్ధిని విస్మరిస్తోందని పలు గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా మౌలిక సదుపాయాల కల్పనలో మొదటి స్థానంలో ఉందని, నీతి ఆయోగ్ ర్యాంకింగుల్లో దేశంలోనే ప్రథమ స్థానం దక్కిందని
సాహస ప్రయాణంసీలేరు: గూడెంకొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ పరిధిలోని బత్తునూరు గ్రామం వద్ద వాగు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగును దాటి గూడెంకొత్తవీధి మండల సరిహద్దు అటవీ ప్రాంతం మీదుగా కొయ్యూరు మండలానికి వెళ్లే పదుల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి. వర్షాకాలంలో అత్యవసర సమయాల్లో ఈ మార్గంలో ప్రయాణించడానికి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడివిడి వద్ద అసంపూర్తిగా.. మండలంలోని దారకొండ పంచాయతీ నడివిడి గ్రామం మధ్యలో పెద్ద వాగు ఉంది. వర్షాకాలంలో గర్భిణులు, అనారోగ్యంతో ఉన్న రోగులు ఈ వాగు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు రావలసి వస్తోంది. ఈ వంతెన నిర్మాణం ఏడాదిగా టెండర్ దశలోనే నిలిచిపోయిందని ఆ ప్రాంత గిరిజనులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. పిల్లి గెడ్డ వంతెన సమస్య తెలంగాణ రాష్ట్రం నుంచి సీలేరు మీదుగా ఒడిశా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న పిల్లి గెడ్డ వంతెన నిర్మాణం రెండేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ వంతెనపై రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మించినప్పటికీ, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి 50 లక్షల రూపాయలు అవసరమని సంబంధిత అధికారులు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి నివేదికలు పంపినా స్పందన కరవైంది. కొట్టుకుపోయిన చిన్న గంగవరం వంతెన దారకొండ నుంచి ఒడిశా వెళ్లే మార్గంలో ఉన్న చిన్న గంగవరం వంతెన ఏడాదిన్నర కిందట వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ వంతెనను నిర్మించాలని ఆ ప్రాంత గిరిజనులు అనేకసార్లు ధర్నాలు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా వర్షాకాలంలో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి.ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తక్షణమే నిధులు మంజూరు చేసి, గిరిజనులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.మాదిగ మల్లువంతెన దుస్థితి మాదిగ మల్లువంతెన దుస్థితి పొంగుతున్న వాగులు.. వంతెనలు లేక అవస్థలు ఏడాదిగా నిలిచిన నడివిడి బ్రిడ్జి నిర్మాణం బురదమయంగా అప్రోచ్ రోడ్లు కలెక్టర్ ప్రకటనకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు నీతి ఆయోగ్ ర్యాక్సింగ్లో ప్రథమస్థానం అని చెబుతున్నా కరువైన మౌలిక వసతులు దారకొండ పంచాయతీ నుంచి అడవి మార్గం ద్వారా పోలవరం జిల్లాకు వెళ్లే దారిలో ఉన్న మాదిగ మల్లు వంతెన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వర్షాల కారణంగా వంతెనకు రెండువైపులా రోడ్డు వేసినా, దానిపై తారు రోడ్డు వేయకపోవడంతో పూర్తిగా గోతులు పడి బురదగా మారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. -
ఎట్టకేలకు కోడాపల్లికి ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్
దేవరాపల్లి: మండలంలోని వాలాబు పంచాయతీ శివారు కోడాపల్లికి ఎట్టకేలకు అధికారులు ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ను మంజూరు చేశారు. నెల నెలా రేషన్ కష్టాలకు విముక్తి కల్పించాలని కోరుతూ ఇటీవల కోడాపల్లి, రామన్నపాలెం, పూలగరువు, ఇప్పగరువు, బుచ్చెంపాలెం గ్రామాల గిరిజనులు ప్లకార్డులు చేతపట్టి నిరసనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో తమ గ్రామాలలో ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రక్రియను నిలిపివేశారని ఆందోళనకు దిగారు. ఐదు గ్రామాల గిరిజనులు నాలుగు నుంచి ఆరు కిమీ మేర కాలిన నడకన వెళ్లి రోజంతా పనులు మానుకొని రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనతో అధికారులు దిగి వచ్చారు. శివారు ఐదు గ్రామాలకు కలిపి కోడాపల్లిలో రేషన్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తూ బుధవారం ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానిక గిరిజనులు మంజూరు పత్రాన్ని పట్టుకొని హర్షం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి స్టాక్ పాయింట్ ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నట్టు మంజూరు పత్రంలో పేర్కొన్నారు. అధికారులు స్పందించి రేషన్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడం పట్ల స్థానిక గిరిజనులు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి.దొర కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తామర్ల శంకరరావు, సిహెచ్బి.లక్ష్మి, సిహెచ్. లక్ష్మణ, సిహెచ్.చినదేముడు, కె.రామస్వామి, సిహెచ్.ఎరకయ్య మహిళలు పాల్గొన్నారు. -
శివారు ఆయకట్టుకు నీరందదేం?
నాతవరం: వరుణు దేవుడు కరుణించక తాండవ రిజర్వాయరు నుంచి నీటిని విడుదల చేసి వారం రోజులు గడిచినా శివారు ఆయకట్టుకు నీరు ప్రవహించలేదు. తాండవ రిజర్వాయరు పరిధిలో అధిక శాతం రైతులు వరినారును కాపాడుకునే పరిస్ధితిలో ఉన్నారు. గతంలో తాండవ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన వారం రోజుల వ్యవధిలో శివారు ఆయకట్టుకు నీరు ప్రవహించేది. ఈ ఏడాది వరుణుదేవుడు కన్నెర్ర చేయడంతో ఖరీఫ్ సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాండవ రిజర్వాయరు నీరు అధారంగా ప్రతి ఏటా ఖరీఫ్లో కాకినాడ, అనకాపల్లి జిల్లాల పరిధిలో 52 వేల ఎకరాలు వరి పంట సాగు చేస్తుంటారు. ఈనెల 11న తాండవ నుంచి కాలువలోకి నీరు విడుదల చేశారు. అయితే వారం దాటుతున్నా శివారు ఆయకట్టు భూములకు చుక్కనీరు కూడా అందలేదు. కాలువ ద్వారా రోజుకు 750 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నా కోటవురట్ల, నర్సీపటం, కోటనందూరు, రవతలపూడి మండలాల పరిధిలో నేటికీ శివారు ఆయకట్టుకు నీరు ప్రవహించలేదు. ఈ ప్రాంతంలో రైతులు వ్యవసాయ బోర్లు లేదా గెడ్డలో మోటార్ల సాయంలో వరినారు ఎండిపోకుండా బతికించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకూ 300 హెక్టార్లలోనే... నాతవరం మండలంలో ఖరీఫ్ సాగు లక్ష్యం 6,297 హెక్టార్లు కాగా మంగళవారం సాయంత్రానికి కేవలం 300 హెక్టార్లు మాత్రమే రైతులు వరినారులు వేనినట్లుగా వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోనే ఖరీఫ్ సీజన్లో వరి పంట నాతవరం మండలంలోనే అధికంగా సాగు చేస్తుంటారు. ఈ ఏడాది ఖరీఫ్ సమయం సమీపిస్తున్న వరినాట్లు మందకొడిగా వేస్తున్నారు. గతంలో ఈ సమయానికి తాండవ ఆయకట్టు పరిధిలో వరినాట్లతో పచ్చగా కన్పించే పంట పొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. తాండవ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసినా ఎండ తీవ్రత కారణంగా నీరు ప్రవహించక రైతుల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ ఏడాది ఖరీ్్ఫ్లో వరి పంట సాగుపై సందిగ్ధత నెలకొంది. నేటికి కేవలం 300 హెక్టార్లలో మాత్రమే వరినాట్లు పడడం పట్ల వ్యవసాయశాఖాధికారి సుగుణ ఆందోళన వ్యక్తం చేశారు. కాలువలు నిండుగా నీరు విడుదల చేస్తున్నందున తాండవ ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా తగ్టిపోతుందని ప్రాజెక్టు డీఈఈ అనురాద తెలిపారు. అయితే కాలువ కింద ఇంకా శివారు ఆయకట్టుకు నీరు అందలేదు. -
దారాలమ్మ సన్నిధిలో ‘దీరధాత్రి’
సినిమాకు ముహూర్తపు షాట్సీలేరు: ప్రాచీన ప్రాముఖ్యత కలిగిన దారకొండలో కొలువైన శ్రీ దారాలమ్మ తల్లి సన్నిధిలో నూతన తెలుగు చిత్రం ‘ధీరధాత్రి’ ముహూర్తపు తొలి షాట్ను బుధవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, వేద మంత్రోచ్ఛారణల నడుమ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చిత్రబృందం అమ్మవారి దివ్య ఆశీస్సులు అందుకుంది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ కంభంపాటి మాట్లాడుతూ... దారాలమ్మ తల్లి సన్నిధిలో ‘ధీరధాత్రి’ చిత్రాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి గూడెంకొత్తవీధి, చింతపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి రమణీయ ప్రదేశాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, శరవేగంగా కొనసాగిస్తామని తెలిపారు. కథాబలంతో పాటు నటీనటుల ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ ఈ చిత్రాన్ని వినూత్న శైలిలో తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. పవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వంశీ కథానాయకుడిగా, మామిత కథానాయికగా నటిస్తున్నారు. మన్యం అందాలను, కథలోని కీలక సన్నివేశాలను అద్భుతమైన దృశ్యాలతో ఆవిష్కరించేందుకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కిరణ్ పనిచేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం, మన్యం నేపథ్యం, నటీనటుల ప్రతిభ, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల సహకారంతో ‘ధీరధాత్రి’ చిత్రాన్ని ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నామని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. -
స్పేసెస్ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం
పాయకరావుపేట: శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలు 49 వసంతాలు పూర్తి చేసుకుని 50 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంలో 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో పాయకరావుపేట, తుని, అన్నవరం బ్రాంచిల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్.విజయ్ ప్రకాష్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేలా సేవా దృక్ఫథం కలిగి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. 2004 నుంచి ఇప్పటివరకు సుమారు 3000 యూనిట్ల రక్తాన్ని ఇచ్చి తమ విద్యార్థులు, సిబ్బంది తమ సేవా నిరతిని చాటుకున్నారన్నారు. ఈ శిబిరంలో సుమారు 400 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా 40 సార్లు కంటే ఎక్కువసార్లు రక్తదానం చేసిన పలువురిని జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ బ్లడ్ బ్యాంక్, డా. పి.కామరాజు, రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకు డా.పరాసర్, మదర్ బ్లడ్ బ్యాంకు డా.సత్యనారాయణ, వీనస్ బ్లడ్ బ్యాంకు డా.సాల్మన్రాజు, స్పేసెస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.రామకృష్ణారెడ్డి, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
లక్ష్యసాధనకు నిరంతర కృషి
● చింతపల్లి డీఎస్పీ తిరుపతిరావు గూడెంకొత్తవీధి: విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, దానిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని చింతపల్లి డీఎస్పీ సీహెచ్ తిరుపతిరావు సూచించారు. జీవితంలో పైకి రావాలంటే విధిగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గూడెం ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చదువుతోనే సమాజంలో మార్పు వస్తుందని, ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరేందుకు సరైన ప్రణాళికను తయారు చేసుకుని దాని కోసం శ్రమించాలన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తుకు అలవాటు పడితే జీవితాలు నాశనమై, భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని హెచ్చరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారిస్తే ఉజ్వల భవిషత్ ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికీ కూడా ఓటీపీలు చెప్పకూడదని తెలిపారు. అలాగే పోక్సో చట్టంపై అవగాహన కల్పించిన ఆయన, మహిళలను ఎప్పుడూ గౌరవించాలని కోరారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ సుధాకర్, ఎస్ఐ సురేష్, ఏకలవ్య పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
భార్యతో వివాదం..భర్త ఆత్మహత్య
కోటవురట్ల: భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్థాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం గ్రామానికి చెందిన పొలుమూరి ఈశ్వరరావు(36) కార్పెంటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని భార్య నూకరత్నం బ్రాండిక్స్ కంపెనీలో పనిచేస్తుండగా ఆమైపె అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకోవడంతో నాలుగు రోజుల క్రితం భార్య అలిగి తన పుట్టింటికి ఎస్.రాయవరం మండలం ధర్మవరం వెళ్లిపోయింది. భార్యను తిరిగి ఇంటికి రమ్మని ఈశ్వరరావు పదే పదే ఫోన్ చేసినప్పటికీ రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు అతని భార్యకు ఫోన్ చేసి చెప్పగా రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసేసరికి ఈశ్వరరావు విగతజీవిగా కనిపించాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడు ఈశ్వరరావు -
రాజేశ్వరి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
రోలుగుంట: లోసింగిలో గర్భిణి పాంగి రాజేశ్వరి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని గిరిజనులు సీపీఎం జిల్లా కార్యవర్గం సభ్యుడు గోవింద ఆధ్వర్యంలో బుధవారం లోసింగిలో ధర్నా చేశారు. కలెక్టర్ విజయకృష్ణన్. ఎమ్మెల్యే గతంలో ఇచ్చిన హమీలు నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. ఆశా కార్యకర్తను ఏర్పాటు చేయాలని, 320 మంది జనాభా ఉన్న ఈ గ్రామాలకు అంగన్వాడీ పోస్టు మంజూరు చేయాలని, అద్వానంగా ఉన్న రహదారి సమస్య మెరుగుపరచాలని కోరుతూ పలు దఫాలు ధర్నా చేయడం జరిగందన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్, చోడవరం ఎమ్మెల్యే రాజు కొండ ఎగువన ఉన్న ఈ గ్రామాలను సందర్శించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే సమస్యలు అలాగే ఉన్నాయని, మాతృ, శిశు మరణాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. -
మునగపాకలో డీఎస్పీ విచారణ
మునగపాక: మేజర్ పంచాయతీ మునగపాకలో బుధవారం పరవాడ డీఎస్పీ మోహనరావు పర్యటించారు. రెండు రోజుల క్రితం స్థానిక పల్లపు వీఽధికి చెందిన పొలిమేర దేవకీ నాగప్పారావు హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా హతుడి కుటుంబ సభ్యుల నుంచి ఆయన వివరాలు సేకరించారు. నిందితులకు సంబంధించిన సమాచారం సేకరించారు. సాక్షుల విచారణ జరుగుతుందని ఇందుకు సహకరించాలన్నారు. హత్యకు పాల్పడిన వ్యక్తులు అరెస్టు అయ్యారన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆయన వెంట ఎస్ఐ పి.ప్రసాదరావు పాల్గొన్నారు. కొట్లాట కేసులో విచారణ.. ఇటీవల మునగపాక బైపాస్ రోడ్డులో కుంచవానిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిపై జరిగిన దాడికి సంబంధించి సాక్షిని డీఎస్పీ మోహనరావు విచారణ చేశారు. కొట్లాటలో ఎవరెవరు పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీన సాయంత్రం ఏం జరిగిందన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
నూరు శాతం రిజర్వేషన్పై బిల్లు పెట్టాలి
డుంబ్రిగుడ: ఆదివాసీలకు నూరు శాతం రిజర్వేషన్ కల్పించేలా అసెంబ్లీలో బిల్లు పెట్టాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి. సూర్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలదేవ్ మాట్లాడుతూ.. 1/70 చట్టం పరిరక్షణతో పాటు, జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో జారీ చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీని అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేసి బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. జీవో నంబర్ 3 రద్దు కావడం వల్ల గత మెగా డీఎస్సీలో గిరిజన యువత ఉద్యోగాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి రెండు వేల మంది గిరిజనులకు ఉద్యోగాలు వచ్చినట్లు అసెంబ్లీ మీడియా పాయింట్లో ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. దమ్ముంటే ఆ రెండు వేల మంది ఎస్టీ టీచర్ల వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని సవాలు విసిరారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం మండల నాయకులు సత్యనారాయణ, సురేశ్కుమార్, లైకాన్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు
పాడేరు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రాథమిక ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని లెక్టర్ టి. నిశాంతి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం కలెక్టరేట్లో డీపీఓ, డీఎల్పీవో, ఆర్డీవో, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలతో ఆమె సమీక్షా నిర్వహించారు. జిల్లాలోని 244 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పన, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు తదితర అంశాలపై ఆమె మాట్లాడారు. ప్రతి మండలంలోనూ ఎంపీడీవోలు పోలింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్ వంటి కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభించాలని సూచించారు. ఈనెల 25న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ. అనంతరం అభ్యర్థనలు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం గ్రామసభల్లో ఆమోదించాలని సూచించారు. వచ్చేనెల 7న అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో డీపీవో చంద్రశేఖర్, డీఎల్పీవో కుమార్, ఇన్చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
రైతులకు కొండంత అండ
● ధారకొండ దిగువన నాట్లు ● తీవ్ర వర్షాభావంలోనూ సాగుకు నీళ్లు గొలుగొండ : ధారకొండ అండ అంటే ఈ ప్రాంత రైతులకు కొండంత అండ. ఏనాడు నాట్లు వేయలేని దుస్ధితి ఉండదు., తీవ్ర వర్షాభావ పరిస్ధితులు వచ్చినా ఏనాడా రైతులు నాట్లు వేయకుండా ఉండరు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్ధితులు ఏర్పడినప్పుటికి నాట్లు వేయడం కాస్త ఆలస్యం కావచ్చు కానీ ఈ ప్రాంతంలో నాట్లు వేయకుండా ఉండలేరు. ధారమఠం శివాలయం ఆనుకొని ఉన్న ధారకొండ నుంచి వచ్చే సాగునీరు ఈ ప్రాంతంలో రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ధారకొండ నుంచి ధారగా... మహాపర్వతం ధారకొండ నుంచి వచ్చి సాగునీరు గొలుగొండ మండలంలో కొత్తపాలెం, ధారగెడ్డ, పాతమల్లంపేట, పరిసర ప్రాంతాల్లో ఉన్నత 700 ఎకరాల సాగు భూములకు ఎంతో అండగా నిలుస్తోంది. ఈ కొండపై వర్షం కురిస్తే సాలు ఈ ప్రాంతం అంతా సస్య శ్యామలమే. కానీ ఈ ఏడాది కనీవిని ఎరగని రీతిలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ, ఇక్కడి కొండపై ఏ మాత్రం వర్షం కురిసినా ధారగెడ్డ పొంగి ప్రవహించడం జరుగుతుంది. వర్షం లేకపోయినా ఈ ప్రాంతం నుంచి ప్రవహిస్తున్న సాగునీరు ఆధారంగా సుమారుగా ఇప్పటికే 400 ఎకరాల్లో నాట్లు వేయడం జరిగింది. చాలా ప్రాంతాల్లో సాగునీరు సరిపోలేదని రైతులు సరుగుడు, ఇతర వ్యవసాయాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఉన్న నీటిని రైతులు సద్వినియోగం చేసుకొని వరి సాగు చేయడం జరుగుతుంది. తాండవ జలాశయానికి కష్టమే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతిపెద్ద జలాశయంగా పేరున్న తాండవ జలాశయానికి ఈ ఏడాడి సాగు నీరు అందడం కష్టమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో రైతులు నాట్లు వేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. తాండవ జలాశయానికి ప్రదాన ఆధారం గొలుగొండ మండలంలో ఉన్న ధారగెడ్డ, బోరింగ్గెడ్డ, బొడ్డేరు గెడ్డలు ఉన్నాయి. కానీ ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ఈ గెడ్డల నుండి చుక్కనీరు ప్రవహించడం లేదు. ఇప్పటికే తాండవ జలాశయం నీటిని విడుదల చేయడం జరిగింది. తాండవ జలాశయానికి ఆధారమైన పై గెడ్డల నుంచి చుక్క నీరు తాండవకు చేరడం లేదు. వర్షాలు కురిస్తే తప్ప తాండవ జలాశయానికి నీరు చేరదు. దారకొండ దిగువన ఉన్న ప్రాంతంలో ఉన్న పంట భూములకు మాత్రం ప్రస్తుతం ప్రవహిస్తున్న సాగునీరు వల్ల నాట్లు జరుగుతున్నాయి. ఈ కొండే తమకు అండ అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
భూ నిర్వాసితులకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలి
పరవాడ: జేఎన్ ఫార్మాసిటీలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు పరిశ్రమల్లో తగురీతిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్రెడ్డిలు డిమాండ్ చేశారు. వారు ఫార్మాసిటీలోని అరాజెన్ పరిశ్రమను మంగళవారం సందర్శించి యాజమాన్యంతో చర్చలు జరిపారు. నిర్వాసితుల ఉపాధిపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటులో సర్వస్వం కోల్పోయిన లంకెలపాలెం దరి లేమర్తి భూ నిర్వాసితులకు పరిశ్రమల్లో ఉపాది అవకాశాలు దక్కలేదని ఆరోపించారు. 2005లో ఫార్మాసిటీ పరిశ్రమల ఏర్పాటు సమయంలో నిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఇచ్చిన హామీ అమలు కాకపోవడం విచారకరమన్నారు. అనేక పరిశ్రమల యాజమాన్యాలు కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించకపోవడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం అన్యాయమన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా పర్మినెంట్ చేయకపోవడంతో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ నిర్వాసితులకు సరైన రీతిలో న్యాయం చేసేలా యాజమాన్యాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాతపాటి ఆర్ఎస్వీ ప్రసాద్రాజు, అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు, పరవాడ జెడ్పీటీసీ పైల సన్యాసిరాజు, పరవాడ మండల పార్టీ అధ్యక్షుడు కోన రామారావు, మండల వైస్ ఎంపీపీ బందం నాగేశ్వరరావు, పార్టీ నాయకులు నక్కా రమణబాబు, పూర్ణానందశర్మ, బోరా సోమునాయుడు, ఇళ్లపు వాసు, జీలకర్ర నాగేంద్ర, గొందేసి శ్రీనివాస్ రెడ్డి, గొడబా మనోజ్, పైడిరాజు, ఎర్ని రమణ, బిమ్మిటి శ్రీనివాస్, చొప్ప వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
చాపరాయి అందానికి బ్లాస్టింగ్ బీటలు
డుంబ్రిగుడ: సినిమా తెరపై అందాలను పంచిన ఆ చాపరాయి రాయి.. ఇప్పుడు బ్లాస్టింగ్ శబ్దాలతో దద్దరిల్లుతోంది! ఎన్నో దశాబ్దాలుగా సినీ చిత్రీకరణలకు వేదికగా నిలిచిన చాపరాయి జలపాతం వద్ద వంతెన నిర్మాణం కోసం రాళ్లను బ్లాస్టింగ్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. గిరిజనుల రాకపోకల సౌకర్యం కోసం వంతెన అవసరమే అయినా.. అదే సమయంలో చాపరాయి సహజసౌందర్యానికి ఎలాంటి నష్టం కలగకూడదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. హీరోల అడుగులతో.. చరిత్ర మండలంలోని చాపరాయి జలపాతం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి తరం సినీ హీరోల వరకు పలువురు అగ్ర నటుల చిత్రాలకు ఈ ప్రాంతం వేదికై ంది. చిరంజీవి నటించిన యముడికి మొగుడు చిత్రంలోని ఫైట్ సన్నివేశాలతో పాటు చాలెంజ్’, హీరో కృష్ణ నటించిన తెలుగు వీర లేవరా.. తదితర చిత్రాల చిత్రీకరణ ఇక్కడ జరిగింది. బాలకృష్ణ పట్టాభిషేకం, లారీ డ్రైవర్, వెంకటేష్ నటించిన చిత్రాలు, మోహన్బాబు మేజర్ చంద్రకాంత్, డిటెక్టివ్ నారద.. రాజేంద్రప్రసాద్ అలీబాబా అరడజను దొంగలు, ఆ ఒక్కటీ అడక్కు, గంగోత్రి తదితర సినిమాలు కూడా చాపరాయి అందాలను తెరపై ఆవిష్కరించాయి. కృష్ణంరాజు, శోభన్బాబు, చంద్రమోహన్, సుమన్, హరీష్ తదితర నటుల సినిమాలకూ ఈ ప్రాంతం వేదికగా నిలిచింది. రాళ్ల మధ్య జాలువారే జలపాతం చాపరాయి ప్రత్యేకత కేవలం సినిమా షూటింగులకే పరిమితం కాదు. సహజసిద్ధమైన రాళ్ల మధ్య నుంచి జాలువారే నీరు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జలపాతంలో జలకాలాడేందుకు వచ్చే సందర్శకులతో ఈ ప్రాంతం సందడిగా ఉంటుంది. వంతెన కోసం.. బ్లాస్టింగ్ ఇలాంటి ప్రాంతంలో ప్రస్తుతం వంతెన నిర్మాణం కోసం రాళ్లను బ్లాస్టింగ్ చేస్తున్నారు. దీంతో సహజసిద్ధమైన చాపరాయి రూపురేఖలకు నష్టం వాటిల్లుతుందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ● 2025 ఏప్రిల్ 7న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో పెద్దపాడు, కోసంగి తదితర గ్రామాల గిరిజనులు వంతెన నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. గిరిజనుల ఇబ్బందులను గుర్తించిన ఆయన వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. అక్కడ కాదు.. ప్రమాదకర ప్రాంతంలో’.. చాపరాయి అందాలకు ఇబ్బంది కలగకుండా.. జలపాతం వద్ద కాకుండా పైభాగంలోని ప్రమాదకర ప్రాంతంలో వంతెన నిర్మించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా పర్యాటకులు చాపరాయి అందాలను వీక్షించేలా వేలాడే వంతెన ఏర్పాటు చేస్తే మరింత ఆకర్షణగా ఉంటుందని సూచించినట్లు పేర్కొంటున్నారు. మారిన ప్రదేశం.. మొదలైన బ్లాస్టింగ్ అయితే ఏడాదిన్నర తర్వాత వంతెన నిర్మాణానికి నిధులు మంజూరవడంతో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బ్లాస్టింగ్ జరుగుతున్న ప్రాంతం సమతలంగా ఉండటంతో నిర్మాణ సంస్థకు పనిభారం తగ్గుతుందన్న కారణంతో అక్కడి రాళ్లను తొలగిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వంతెన వస్తే.. పర్యాటకానికి వరమా? శాపమా? వంతెన నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామాల రాకపోకలకు ఎంతో ఉపయోగకరమే. అయితే వంతెనపై నుంచి పర్యాటకులు చాపరాయి ప్రాంతాన్ని వీక్షించే అవకాశం ఉండటంతో సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో నియంత్రణ లేకపోతే మద్యం సేవించడం, ప్లాస్టిక్ సీసాలు, ఇతర వ్యర్థాలు పడేయడం వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు, పర్యాటక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి అవసరమే.. కానీ చాపరాయి సహజసౌందర్యం మూల్యం చెల్లించేలా మాత్రం ఉండకూడదు. గిరిజనులకు రాకపోకల సౌకర్యం కల్పిస్తూనే.. జలపాతం సహజత్వాన్ని కాపాడేలా వంతెన నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వంతెన కాస్త ముందు నిర్మిస్తే మేలు మా గ్రామాలకు వంతెన రావడం ఎంతో సంతోషం. అయితే వంతెన నిర్మాణాన్ని చాపరాయిలో కాకుండా, కొద్దిగా ముందున్న ప్రమాదకరమైన ప్రదేశంలో చేపట్టాలి. ఆ ప్రాంతంలో వంతెన నిర్మిస్తే ప్రమాదాలు తగ్గడంతో పాటు చాపరాయికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ విషయాన్ని అధికారులు దృష్టిలో పెట్టుకుని వంతెన నిర్మాణం చేపట్టాలి. – మఠం శంకర్రావు, వైఎస్సార్సీపీ మండల కార్యదర్శి, కోసంగి, డుంబ్రిగుడ మండలం -
హిందూ ధర్మ రక్షణకు కృషి
● విశ్వహిందూ మహాసంఘ జిల్లా సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షుడు చెల్లయ్యనాయుడు మునగపాక : మండలంలోని మూలపేటకు చెందిన బొడ్డేడ చెల్లయ్యనాయుడు విశ్వహిందూ మహాసంఘ భారత్ జిల్లా సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు. ఈ మేరకు విశ్వహిందూ మహా సంఘ భారత్ అధ్యక్షుడు శ్రీ లంకా గణేష్ నుంచి ఉత్తర్వులు అందాయి. చెల్లయ్యనాయుడు మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర గోసంరక్షణ అధ్యక్షుడు యాసపు శ్రీనుతో పాటు ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడతానని పేర్కొన్నారు. -
బస్సులో మర్చిపోయిన బ్యాగ్ అందజేత
అనకాపల్లి : విశాఖ నుంచి అనకాపల్లి వస్తున్న 500 మెట్రో ఎక్స్ప్రెస్లో ఓ ప్రయాణికుడు ఈనెల 16న బ్యాగ్ను మర్చిపోయి దిగిపోవడం జరిగిందని డిపో మేనేజర్ రాజేశ్వరి అన్నారు. పట్టణానికి చెందిన వెంకటరాజు ఈనెల 16న 500 బస్లో రాత్రి సమయంలో బ్యాగ్ను మర్చిపోయి వెళ్లడంతో బస్ కండక్టర్ కె.బి.ఆర్.లక్ష్మి బ్యాగ్ను డిపోలో సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించింది. విషయం తెలుసుకున్న ప్రయాణికుడు వెంకటరాజు ఈనెల 18న డిపో మేనేజర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో సెక్యూరిటీలో వద్ద భద్రపర్చిన బ్యాగ్ను చూపించగా వెంకటరాజు తమ బ్యాగ్గా గుర్తించడంతో డిపో మేనేజర్ రాజేశ్వరి అతనికి బ్యాగ్ను అందజేశారు. -
ఫార్మసిస్టు అదృశ్యంపై ఫిర్యాదు
దేవరాపల్లి : మండలంలోని రైవాడ గ్రా మానికి చెందిన సారిపల్లి ఎరుకునాయుడు (31) అదృశ్యమైనట్టు అతని భార్య కృష్ణ కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అదృశ్యమైన ఎరుకునాయుడు అల్లూరి జిల్లా హుకుంపేటని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్టుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగ రీత్యా నెల రోజుల క్రితం నుంచి పాడేరులోని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారన్నారు. ఈ నెల 2న తన సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించుకోవాలని భార్యతో కలిసి స్వగ్రామం రైవాడ వచ్చాడన్నారు. అయితే ఈ నెల 3న ఉదయం 11 నుంచి ఒంటి గంట ప్రాంతంలో ఇంటి నుంచి అదృశ్యమయ్యాడని, అప్పటి నుంచి పరిసర గ్రామాలతో పాటు బంధువులు ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదని అతని భార్య ఈ నెల 10న ఫిర్యాదు చేసిందన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ వ్యక్తి ఆచూకీ లభిస్తే వెంటనే పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. -
హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
మునగపాక : మునగపాకలో జరిగిన హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు యలమంచిలి సీఐ ఎస్.ధనుంజయరావు తెలిపారు. కేసు వివరాలను ఆయన స్థానిక ఎస్ఐ ప్రసాదరావుతో కలిసి విలేకరులకు తెలిపారు. రెండు కుటుంబాల మధ్య గతంలో జరిగిన మాటల వివాదం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిపై దాడి చేయడంతో మృత్యువాతకు గురయ్యాడన్నారు. మునగపాకలోని పల్లపు వీధికి చెందిన పొలిమేర దేవకీ నాగప్పారావు సెంట్రింగ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన దాడి భాస్కరరావు అతని సోదరుడు జగదీష్లతో దేవకికి రెండు రోజుల క్రితం వివాదం చోటు చేసుకుంది. వారి మధ్య మాటల వివాదం చినికి చినికి గాలివానగా మారింది. సోమవారం రాత్రి దేవకి నాగప్పారావు తన మేడపై నిద్రిస్తున్న సమయంలో భాస్కరరావు, జగదీష్లు కలిసి దాడి చేశారు. ఈ సంఘటనలో దేవకీ నాగప్పారావు తీవ్రంగా గాయపడడంతో అతనిని అనకాపల్లి వంద పడకల ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. మునగపాకలో విషాద ఛాయలుఎంతో ప్రశాంతంగా ఉండే మునగపాక నాగప్పారావు హత్యతో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. అందరితో సరదాగా మెలిగే దేవకీ నాగప్పారావు మృత్యువాతకు గురయ్యారన్న సమాచారంతో మునగపాకలో విషాదం నెలకొంది. మృతదేహానికి అనకాపల్లి వందపడకల ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం జరిగిన అంత్యక్రియలకు మునగపాక గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కాగా హత్య జరిగిన ప్రాంతాన్ని మంగళవారం ఉదయం యలమంచిలి సీఐ ధనుంజయరావు,ఎస్ఐ ప్రసాదరావుతో పాటు క్లూస్ టీమ్ పరిశీలించి పలు వివరాలు సేకరించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రిమాండ్కు తరలింపు -
అవయవదానంతో అమరుడైన శ్రీదత్తు
తుమ్మపాల : పేద కుటుంబంలో జన్మించి నిరంతరం శ్రమిస్తూ కుటుంబానికి అండగా నిలిచిన ఓ యువకుడు అనూహ్యంగా మృత్యువాత పడిన బాధను దిగమింగుతూనే తల్లిదండ్రులు తీసుకున్న గొప్ప నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. తమ కుమారుడి అవయవాలను దానం చేసి, మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకు రావడం, బౌతికంగా కుమారడు లేకపోయినా అవయవాలతో మరోకరికి జీవితాన్నిచ్చేలా వేసిన అడుగు అందరికి ఆదర్శంగా నిలిచింది. ఆ పేద కుటుంబం సమాజం పట్ల తీసుకున్న నిర్ణయంతో శ్రీదత్తు అంతిమయాత్రకు విశేష పలువురి ప్రశంసలు అందుకుంది.వివరాలివి. అనకాపల్లి గవరపాలేనికి చెందిన పెంటకోట శివ సూర్యనారాయణ, మాణిక్యంలకు ద్వితీయ కుమారుడు పెంటకోట శ్రీదత్తు (యువకుడు) టైల్స్ మేస్త్రిగా పనిచేస్తూ ఈ నెల 13న పరవాడకు వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అక్కడ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కిమ్స్కు తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అధిక రక్తపోటు కారణంగా మెదడులోని ఎడమ భాగంలోని రక్తనాళాలు దెబ్బతిన్నాయని, పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు. రెండు రోజులపాటు వైద్యులు తీవ్రంగా చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న మధ్యాహ్నం 2 గంటలకు శ్రీదత్తు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషాదంలోనూ గొప్ప నిర్ణయం... కుమారుడు లేడని వార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అవయవదానంపై అవగాహనతో తీవ్ర బాధలోనూ మరొకరికై న తమ కుమారుడి ద్వారా జీవం అందించాలనే గొప్ప ఆలోచన చేశారు. అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు పెంటకోట మాణిక్యం, శివ సూర్యనారాయణ, అన్నయ్య భాస్కర్ కుమార్ అనుమతించడంతో ఈ నెల 16న వైద్యుల సమక్షంలో అవయవదానం ప్రక్రియ మొదలుపెట్టి అధికారుల ధ్రువీకరణతో అవయవాల సేకరణ పూర్తి చేసి మంగళవారం ఉదయం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. కన్నీటి వీడ్కోలు శ్రీదత్తు భౌతికకాయాన్ని స్వస్ధలమైన అనకాపల్లి గవరపాలేనికి మొదటిగా తీసుకొచ్చారు. బంధువులు, కుటుంబ సభ్యుల సందర్శన నిమిత్తం భారీగా తరలివచ్చిన జనంతో సుంకరమెట్ట కూడళి నుంచి నుంచి దాసరి గెడ్డ రోడ్డు, పార్క్ సెంటర్, శతకంపట్టు, శ్రీసంతోషిమాత ఆలయం మీదుగా బాలకృష్ణ బస్స్టాప్, శంకరం, రేబాక, గొలగాంలోని ప్రస్తుత నివాసముంటున్న చోట వరకు ఊరేగింపుగా తీసుకెళ్లడంతో కుటుంబసభ్యులు రోధనలు మిన్నంటాయి. అక్కడ నుంచి శ్మశానవాటికకు తీసుకెళ్లి అంతిమ సంస్కారం పూర్తి చేశారు. శ్మశానవాటిక వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు, స్నేహితులు, స్థానికులు శ్రీదత్తు మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారం రోజులుగా హైబీపీ.. శ్రీదత్తు అందరితో ఆప్యాయంగా, సరదాగా ఉండే వ్యక్తిగా కుటుంబ సభ్యులు, స్నేహితులు గుర్తు చేసుకున్నారు. నిరంతరం కష్టపడి పనిచేసే శ్రమజీవి. అయితే మరణానికి ముందు వారం రోజులుగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నప్పటికీ పని ముఖ్యమంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరకు అదే తీవ్ర పరిణామాలకు దారితీసి ప్రాణాలను బలిగొంది. యువతకు ఓ హెచ్చరిక.... ఇటీవలి కాలంలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించకపోయినా యువతలో ఆకస్మిక మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీదత్తు ఘటన కూడా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఎంతటి విషాదానికి దారితీస్తుందో తెలియజేస్తోంది. యువత పని, సంపాదన అని కాకుండా తమ ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు. అధిక రక్తపోటు, ఛాతీ నొప్పి, తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆకస్మిక మరణం..అవయవదానంతో మరో జన్మ కొడుకును కోల్పోయిన విషాదంలోనూ అవయవదానానికి కుటుంబం నిర్ణయం భారీ బైక్ ర్యాలీతో అంతిమయాత్ర -
ప్రమాదవశాత్తూనదిలో పడి యువతి మృతి
పాయకరావుపేట : మండలంలో కుమార పురం గ్రామానికి చెందిన చాపల నందిని (19) గ్రామ సమీపాన గల పంపానదిలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్టు ఎస్ఐ జె.పురుషోత్తం తెలిపారు. మృతురాలు చాపల నందిని ఈ నెల 14 వ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లి మరలా ఇంటికి తిరిగి రాలేదు. 15 వ తేదీన తన కుమార్తె కనిపించలేదని తల్లి చేపల బంగారు లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే తన కుమార్తె గ్రామ శివారు పంపానదిలో చనిపోయి ఉందని, మూడు నెలల నుండి టైఫా యిడ్ జ్వరంతో బాధపడుతుందని, పాయకరావుపేటలో చికిత్స పొందేదని, మానసిక అనారోగ్యంతో ఉండేదని, 14న నందిని బహిర్భూమికి వెళ్లి కాలుజారి నదిలో పడిపోయి మృతి చెందిందని ఆమె తల్లి మరలా ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ జె.పురుషోత్తం తెలిపారు. మృతదేహాన్ని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించడం జరిగిందని తెలిపారు. -
ఒకే పోలింగ్ బూత్లో కుటుంబ సభ్యుల ఓట్లు
సీపీఎం నాయకుల వినతితుమ్మపాల: ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరు పోలింగ్ బూత్ల్లో ఉండడం వల్ల ఓటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సర్ ప్రక్రియలో భాగంగా ఒకే పోలింగ్ బూత్లో నమోదు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వి.వి.శ్రీనివాసరావు, అల్లు రాజు కోరారు. మంగళవారం కలెక్టరేట్లో డీఆర్వో వై. సత్యనారాయణరావును కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లలు ఒకే చిరునామాలో నివసిస్తున్నప్పటికీ వేర్వేరు బూత్లకు ఓట్లు కేటాయించడం సరికాదన్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్లి ఒకే పోలింగ్ బూత్లో ఓటు వేసుకునేలా అవకాశం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగానే తుది జాబితా ప్రచురించేలోపే ఓటర్ల జాబితాలను పరిశీలించి, ఒకే ఇంటి చిరునామాలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల ఓట్లను ఎన్నికల నిబంధనలు, పోలింగ్ కేంద్రాల పరిధికి లోబడి ఒకే పోలింగ్ బూత్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన సవరణలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. -
రూ.1.47 లక్షల బిల్లు
అనకాపల్లి జిల్లా మునగపాక మండలం సిరసపల్లి (టి) గ్రామానికి చెందిన రైతు మద్దల వెంకటరావు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ (సర్వీసు నంబర్ 1172682212000366) ఇందుకు ఉదాహరణ. 2023 సెప్టెంబరులో ఆయన 300 యూనిట్ల విద్యుత్ వినియోగించారు. అప్పట్లో వచ్చిన బిల్లు సున్నా. అంటే వ్యవసాయ విద్యుత్ పూర్తిగా ఉచితంగా అందిందన్నమాట. అదే సర్వీసుకు 2026 ఆగస్టులో ఈపీడీసీఎల్ జారీ చేసిన బిల్లులో మాత్రం రూ.1,47,361 బకాయి ఉన్నట్లు పేర్కొంది. సెప్టెంబరు 2లోగా బకాయి చెల్లించాలని, లేకపోతే సెప్టెంబరు 3న విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని నోటీసులో స్పష్టం చేసింది. ఒకప్పుడు సున్నా బిల్లు వచ్చిన అదే వ్యవసాయ కనెక్షన్కు ఇప్పుడు లక్షన్నర రూపాయలకు చేరువలో బకాయి చూపించడంపై రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పట్టపగలే ఇల్లు గుల్ల
● మునగపాకలో భారీ చోరీ ● 10 తులాల బంగారు నగలు, రూ.20వేల నగదు అపహరణమునగపాక : మండల కేంద్రంలో పట్టపగలు చోరీ సంఘటన చోటు చేసుకుంది. నిత్యం జన సంచారం ఉన్న ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి చొరబడి బంగారు ఆభరణాలతో పాటు నగదును అపహరించుకుపోయారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. మునగపాకలోని సాంబశివుని ఆలయ సమీపంలో అనకాపల్లి భీమ, లక్ష్మి దంపతులు అద్దెకు నివాసం ఉంటున్నారు. భీమ పరవాడ ఫార్మాసిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. లక్ష్మి అచ్యుతాపురంలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. దంపతులిద్దరూ మంగళవారం ఉదయం ఏ షిప్టుకు బయలుదేరి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు తీసి ఉండడాన్ని గుర్తించి లోపలికి వెళ్లే సరికి బీరువా తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్టు నిర్ధారించుకున్నారు. బీరువాలోని 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.20వేల నగదు చోరీకి గురైందని తెలుసుకొని మునగపాక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు చోరీ జరిగిన ప్రాంతానికి చేరుకొని బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
కోటా కత్తి!
ఉచిత విద్యుత్కురైతులపై లక్షల్లో బిల్లుల భారంకోటా మించితే ప్రతి యూనిట్కు రూ.7.75 వసూలు ఏడాదిన్నర బకాయిలను ఒకేసారి చూపుతూ భారీగా బిల్లులు ఒక్కో రైతుపై రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగా భారం బకాయిలు చెల్లించకపోతే కనెక్షన్ తొలగిస్తామంటూ నోటీసులు 2024 వరకు సున్నా బిల్లులు.. 2025 నుంచి చార్జీల బాదుడుసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రైతులకు ఉచితంగా అందుతున్న వ్యవసాయ విద్యుత్కు చంద్రబాబు ప్రభుత్వం కోటా కొర్రీలు పెడుతోంది. 9 గంటల ఉచిత విద్యుత్ పథకం కింద ఏడాదికి 6,000 యూనిట్ల వరకు మాత్రమే ఉచితంగా సరఫరా చేస్తామని, అంతకుమించి వినియోగిస్తే ప్రతి యూనిట్కు రూ.7.75 చొప్పున చార్జీలు వసూలు చేస్తామని చెబుతోంది. తాజాగా ఏడాదిన్నర బకాయిలను ఒకేసారి చూపిస్తూ భారీ మొత్తాలతో బిల్లులు జారీ చేస్తోంది. ఒక్కో రైతుకు రూ.50 వేల నుంచి లక్షకుపైగా బకాయి ఉన్నట్లు చూపిస్తోంది. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని నోటీసుల్లో హెచ్చరిస్తుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. 2025 నుంచే మారిన లెక్కలు 2024 చివరి వరకు రైతులు ఎంత విద్యుత్ వినియోగించినా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ చార్జీలు విధించలేదు. అయితే 2025 నుంచి కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది. తొలుత నేరుగా విద్యుత్ బిల్లులు జారీ చేయకుండా నెలకు రూ.30 చొప్పున కస్టమర్ చార్జీలు వసూలు చేసింది. ఆ మొత్తాన్ని ఆరు నెలలకు ఒకసారి రూ.180 చొప్పున రైతులు చెల్లిస్తూ వచ్చారు. ఇప్పుడు మాత్రం 6,000 యూనిట్ల పరిమితిని తెరపైకి తీసుకొచ్చి, దానికి మించి వినియోగించిన విద్యుత్కు చార్జీలు విధిస్తోంది. ఏడాదికి 6,000 యూనిట్లు అంటే నెలకు సగటున 500 యూనిట్లకు పరిమితి విధించినట్లవుతోంది. అంతకు మించి వినియోగించిన ప్రతి యూనిట్కు రూ.7.75 చొప్పున బిల్లు వేస్తోంది. ఫలితంగా ఏడాదిన్నరగా పేరుకుపోయిన మొత్తాన్ని ఇప్పుడు ఒకేసారి రైతులపై మోపుతోంది. కోటా పేరిట కోతలు వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని అమలు చేశారు. అనంతరం 2009 ఎన్నికల్లో 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతూ వచ్చింది. రైతులు 9 గంటల పాటు ఎంత విద్యుత్ వినియోగించినా ఉచిత విద్యుత్ పథకం వర్తించేది. ఇప్పుడు మాత్రం వినియోగానికి యూనిట్ల పరిమితి విధించడం ద్వారా పథకానికే కోతలు పెట్టే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 5 హెచ్పీ మోటార్లు వినియోగించే రైతులకు ఏడాదికి 6,000 యూనిట్ల పరిమితిని వర్తింపజేస్తూ, అదనపు వినియోగానికి చార్జీలు విధిస్తున్నారు. యూనిట్కు రూ.7.75 చొప్పున వసూలు రైతులకు 9 గంటల విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నామని చెబుతూనే వినియోగించే విద్యుత్కు యూనిట్ల పరిమితి విధించడం విరుద్ధంగా ఉందని రైతులు అంటున్నారు. 9 గంటల సరఫరా సమయంలో రైతు తన అవసరానికి అనుగుణంగా మోటారు నడుపుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఏడాదికి 6,000 యూనిట్లకు మించి వినియోగిస్తే ప్రతి యూనిట్కు రూ.7.75 చొప్పున చార్జీ విధిస్తున్నారు. ఇలా అదనపు వినియోగంపై విధిస్తున్న రేటు వాణిజ్య కేటగిరీ తరహాలో ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన కొద్దికాలానికే ఉచిత కోటా పూర్తయిందంటూ చార్జీలు విధించడం వల్ల వ్యవసాయ విద్యుత్ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బకాయిలు చెల్లించకపోతే కనెక్షన్ కట్ తాజాగా జారీ చేస్తున్న బిల్లుల్లో నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని ఈపీడీసీఎల్ హెచ్చరిస్తోంది. ఆరు నెలలకు ఒకసారి రూ.180 మాత్రమే చెల్లిస్తున్న తమకు ఇప్పుడు రూ.50 వేల నుంచి లక్షల రూపాయల వరకు బకాయిలు చూపించడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత విద్యుత్కు యూనిట్ల పరిమితి విధించి, అదనపు వినియోగానికి చార్జీలు వసూలు చేయడంతోపాటు, పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి వసూలు చేయడం ద్వారా ప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్ను క్రమంగా కుదించే దిశగా అడుగులు వేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచీ వ్యతిరేకతే..! వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విషయంలో చంద్రబాబు వైఖరిపై మొదటి నుంచీ విమర్శలు ఉన్నాయి. రైతులు విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఉద్యమించిన సమయంలో హైదరాబాద్లోని బషీర్బాగ్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు రైతులు మృతి చెందారు. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు దానిపై విమర్శలు చేశారు. వైఎస్ హయాంలో అమలులోకి వచ్చిన ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం తర్వాతి ప్రభుత్వాల్లోనూ కొనసాగింది. ఇప్పుడు వినియోగ పరిమితి విధించడం, అదనపు వినియోగానికి చార్జీలు వసూలు చేయడం, భారీ బకాయిలను రైతులపై మోపడం వంటి పరిణామాలతో ఉచిత విద్యుత్ పథకంపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. -
ఒంటి నిండా ‘హష్’
నాగోలు: పోలీసుల కళ్లుగప్పి.. హష్ ఆయిల్(గంజాయి నుంచి తయారు చేసిన డ్రగ్) ప్యాకెట్లను శరీరానికి కట్టుకుని బస్సులో తరలిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాకుచెందిన ఆరుగురిని ఎస్వోటీ ఎల్బీనగర్, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. సుమారు రూ.1.5 కోట్ల విలువైన 12 కిలోల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఎల్బీ నగర్లోని సీపీ క్యాంపు ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి వివరాలు వెల్లడించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి హష్ ఆయిల్ సేకరించి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఎల్బీ నగర్ చింతల్కుంట వద్ద మాటువేసి నిందితులను అడ్డుకున్నామని సీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం గెమ్మెల్లి గ్రామానికి చెందిన గెమ్మెలి శ్రీను, అతని భార్య నిబియాతో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీను, నిబియా, చిక్కుడు శరణ్, పంగి జగదీష్తో పాటు ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు. మైనర్లను జువైనల్ హోమ్కు తరలించారు. కాళ్లకు..కడుపునకు కిలో చొప్పున పోలీసుల కళ్లు గప్పేందుకు క్యారియర్లు వినూత్న పద్ధతిని అనుసరించారు. రెండు కాళ్లకు కిలో చొప్పున, కడుపునకు మరో కిలో..చొప్పున ఒక్కొక్కరూ 3 కిలోల హష్ ఆయిల్ ప్యాకెట్లను బ్రౌన్ టేపుతో శరీరానికి కట్టుకున్నారు. నలుగురు కలిపి 12 కిలోలు తరలిస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, రూ.5 వేల నగదు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా హష్ ఆయిల్ బెంగళూరుకు తరలించేందుకు వీరు అక్కడి రిసీవర్ సిజోతో రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు గెమ్మెలి శ్రీను, అతని భార్య నిబియా బెంగళూరు నుంచి దందా నడిపిస్తున్నట్టు సీపీ తెలిపారు. గెమ్మెలి శ్రీనుపై గతంలోనే నర్సీపట్నం, అడవి అన్నవరం పోలీస్స్టేషన్ల పరిధిలో డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని, జైలుకు వెళ్లాడని సీపీ తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ డ్రగ్స్ రవాణా ప్రారంభించినట్లు వెల్లడించారు. హష్ ఆయిల్ సరఫరా చేసిన కృష్ణ, బెంగళూరులోని ప్రధాన రిసీవర్ సిజో ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, ఎస్ఓటీ డీసీపీ మనోహర్, ఎల్బీనగర్ ఎస్ఓటీ డీసీపీ షాకీర్ హుస్సేన్, వనస్ధలిపురం ఏసీపీ కాశిరెడ్డి, సీఐ రవిబాబు, ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ప్రతాప్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
శత శాతం ఉద్యోగ రిజర్వేషన్ కోసం పోరాడుతాం
పాడేరు: ఆదివాసీలకు శతశాతం ఉద్యోగ రిజర్వేషన్పై టీఏసీ తీర్మానం చేసి, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని, స్పెషల్ డీఎస్సీపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణతో పాటు పలువురు డిమాండ్ చేశారు. ఎన్ని కుట్రలు జరిగినా ఇందుకోసం పోరాడతామని స్పష్టం చేశారు. పట్టణంలోని ఏపీటీఎఫ్ భవనంలో సోమవారం ఆదివాసీ ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన చట్టాలు, హక్కులను అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయంగా జీవో తెస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదని చెప్పారు. హామీలు అమలు చేయకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఆదివాసీల కోసం ఖాళీగా ఉన్న రెండు వేల ఉపాధ్యాయ పోస్టులకు స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల చట్టాలు, హక్కుల అమలు, పరిరక్షణతో పాటు శతశాతం ఉద్యోగ రిజర్వేషన్ల కోసం ఆదివాసీ సమాజం శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు, అణిచివేసే ప్రయత్నాలు చేసినా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంతాల నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కార్తీక్ శ్రీను, జీవన్ కృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ, ఇసాక్, నిరుద్యోగుల సంఘం నాయకులు భాను, సీహెచ్ రావు, కొండలరావు, ఆదివాసీ సంఘాల నాయకులు సోమెల బాలరాజు, బి. లచ్చన్న, కిల్లో రాజారావు, చంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు. -
శతశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా బోధన
● రాష్ట్ర బాలికా అభివృద్ధి అధికారి జయలక్ష్మి వంటల నాణ్యత పరిశీలిస్తున్న విజయలక్ష్మి మాకవరపాలెం: ఇంటర్, పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా బోధన సాగించాలని రాష్ట్ర బాలికా అభివృద్ధి అధికారి పి.జయలక్ష్మి ఆదేశించారు. స్థానిక కేజీబీవీని సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వంట చేసే ప్రాంతం, పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. పది, ఇంటర్ విద్యార్థినులతో మాట్లాడారు. మెనూ అమలు, తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల సిబ్బందితో సమీక్షించారు. వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థినులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలికా అభివృద్ధి అధికారి జెమీమా పాల్గొన్నారు. -
మెట్రో మాయాజాలం!
పట్టాలెక్కక ముందే.. సాక్షి, విశాఖపట్నం: విశాఖ మెట్రో ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కకముందే.. అంచనాల అంకెలు పరుగులు పెడుతున్నాయి. 46.23 కిలోమీటర్ల తొలి దశకు ప్రభుత్వం గతంలో రూ.6,250 కోట్లతో టెండర్లు పిలవగా.. అదే ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు రూ.11,498 కోట్లకు చేరింది. అంటే టెండర్ అంచనాతో పోలిస్తే ఏకంగా రూ.5,248 కోట్లు పెరగడం గమనార్హం. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో 76 కిలోమీటర్ల తొలి దశకు రూ.9,669 కోట్లుగా అంచనా వేసిన నేపథ్యంలో.. ఇప్పుడు దూరం తగ్గినా వ్యయం పెరగడంపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక మదింపు తర్వాత సాధారణంగా వ్యయం తగ్గాల్సి ఉండగా.. విశాఖ మెట్రో విషయంలో మాత్రం అంచనాలు అమాంతం పెరగడం వెనుక కారణాలేమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 140.13 కిలోమీటర్లను మూడు దశల్లో నిర్మించేలా రూ.14,309 కోట్లతో డీపీఆర్ రూపొందించి కేంద్రానికి పంపించారు. ఇందులో తొలి దశగా 76 కిలోమీటర్లకు రూ.9,669 కోట్ల అంచనా వ్యయం నిర్ధారించారు. కేంద్రం ఆమోదించే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. చంద్రబాబు గద్దెనెక్కాక.. మళ్లీ డీపీఆర్లో మార్పులంటూ ఆలస్యం చేశారు. డబుల్ డెక్కర్ అంటూ కొత్త ప్రతిపాదనని పంపించారు. విశాఖలో డబుల్డెక్కర్ వయబుల్ కాదంటూ కేంద్రం అక్షింతలు వేసింది. దీంతో.. ఎంతో కొంత మేర డబుల్డెక్కర్ ఫ్లైఓవర్ ఉండాలని చంద్రబాబు పట్టుబట్టడంతో.. ప్రాజెక్టు ముందుకు కదలలేదు. దూరం తగ్గినా.. వ్యయం పెరిగింది! గత ప్రభుత్వంలో 76 కిలోమీటర్ల తొలి దశకు రూ.9,669 కోట్లుగా అంచనా వేయగా.. ప్రస్తుత ప్రతిపాదనలో దూరాన్ని 46.23 కిలోమీటర్లకు కుదించి వ్యయాన్ని మాత్రం రూ.11,498 కోట్లకు పెంచారు. తక్కువ దూరానికి ఎక్కువ వ్యయం ఎలా వచ్చిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సవరించిన డీపీఆర్లో అంచనాలు ఇంత భారీగా పెరగడానికి కారణాలు, టెండర్ డాక్యుమెంట్లలో లేని కొత్త పనుల వివరాలు, ప్రతి విభాగానికి సంబంధించిన వ్యయ బ్రేకప్ గోప్యంగా ఉంచుతుండటం గమనార్హం. రూ.6,250 కోట్ల నుంచి రూ.11,498 కోట్లకు.. 46.23 కిలోమీటర్ల తొలి దశ నిర్మాణానికి గతేడాది జూలైలో రూ.6,250 కోట్లతో (జీఎస్టీ అదనం) ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచారు. అయితే సింగిల్గా కాకుండా ప్యాకేజీలుగా విభజించడం వంటి నిబంధనల కారణంగా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇదిలా ఉండగా.. కేంద్ర ఆర్థిక మదింపు కోసం పంపిన సవరించిన డీపీఆర్లో అదే 46.23 కిలోమీటర్లకు రూ.11,498 కోట్లుగా అంచనా వేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. టెండర్ అంచనాతో పోలిస్తే రూ.5,248 కోట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. భూసేకరణ, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు, కోచ్ల కొనుగోలు తదితర వ్యయాలను కలిపినా ఇంత భారీగా పెరిగే అవకాశం లేదని, ఇందులో ఏదో పెద్ద మాయాజాలమే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. -
క్షేత్రస్థాయిలో అర్జీలపై పరిశీలన జరపండి
తుమ్మపాల : పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు వచ్చే అర్జీలపై అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు డీఆర్ఓ వై.సత్యనారాయణరావు, జిల్లా పంచాయతీ అధికారి వి.సందీప్ అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్కు మొత్తం 301 వినతులు నమోదు కాగా రెవిన్యూ క్లినిక్– 143, పీజీఆర్ఎస్–158 ఉన్నాయి. బీఎంఎస్ ఆధ్వర్యంలో నిరసనలు అంగన్వాడీ, ఏఎస్ఐఐఏ, మధ్యాహ్న భోజన పథకం, ఎన్ఐఐఎం, ఇతర పథకాల కార్యకర్తల వేతనం పెంపు, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ల తక్షణ పరిష్కారం కోరుతూ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఆయా పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం రూ.30 వేలు అందించాలని, కనీస పింఛను నెలకు రూ.21 వేలు నుంచి రూ.27,500 పెంచడం, వీడీఏ, ఆయుష్మాన్ భారత్ యోజనతో అనుసంధానం చేయడం ఈపీసీ–95 కింద కనీస పింఛనును నెలకు రూ.21000 నుంచి 27,500కు పెంచాలని అన్నారు. ఈపీఎఫ్, ఈఎస్ఐసి బోనస్ లెక్కింపుల కింద కవరేజ్ గరిష్ట పరిమితులను రెట్టింపు చేయడం, పాత పింఛను పథకం పునరుద్ధరణ, గ్రాట్యూటీ లెక్కింపును 15 రోజుల వేతనం నుంచి 30 రోజుల వేతనానికి ఎటువంటి గరిష్ట పరిమితి లేకుండా సవరించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులతో సహా ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. జీవన వ్యయం పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనాల పెంపు, అన్ని రకాల పథకాల కార్యకర్తలకు (ఆంగన్వాడీ, ఏఎస్ఐఐఏ, మధ్యాహ్న భోజన పథకం, ఎన్ఐఐఎం ఇతర పథకాల కార్యకర్తలు గౌరవ వేతనం పెంచాలని, బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయడం, కార్మిక చట్టాలలోని కార్మిక వ్యతిరేక నిబంధనలను తొలగించేలా సవరించాలన్నారు. ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగ భద్రత, తొలగింపు, సింహాద్రి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. నీటి వనరులను కాపాడాలి కాగిత గ్రామంలో గెడ్డ భూములు చెరువులకు వర్షపునీరు అందించే ఇతర కాలువలను ప్రైవేట్, ప్రభుత్వ అవసరాలకు బదిలీచేసే ప్రతిపాదనను తక్షణమే రద్దుచేయాలని, నీటివనరులను కాపాడాలంటూ గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన చేశారు. నక్కపల్లి మండలం కాగిత గ్రామ సర్వే నంబర్.128, 195, 164, 176, 177, 162 (గ్రామకంఠం), 187 గెడ్డలుగా స్పష్టమైన రెవెన్యూ రికార్డులు ఉంటూ గ్రామ పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు ప్రధాన నీటివనరుగా ఉన్నాయి. వర్షపు నీరు ప్రవహించడానికి భూగర్భజలాలు రీచార్జ్ అవ్వడానికి ఎంతో కీలకంగా ఉన్నాయి. భూములను రైల్వే స్లైడింగ్ ప్రాజెక్ట్ (ఎఎంఎన్ఎస్) కోసం కేటాయించి నిర్మాణాలు చేపడితే నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోతుంది. దీనివల్ల చుట్టుపక్కల వందలాది ఎకరాల పంట భూములు ఎండిపోవడమే కాకుండా గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి రైతులు రైతు కూలీలు వారి జీవనోపాధి కోల్పోతారని, రైతులు, పశుపోషకులు సాధారణ ప్రజలు కూడా నీటి వనరులను పారిశ్రామిక అవసరాలకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం, గ్రామసభ ఆమోదం లేకుండా సహజ వనరులను బదిలీ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ పీజీఆర్ఎస్లో వినతి అందించారు. -
వృద్ధుడు అదృశ్యంపై ఫిర్యాదు
దేవరాపల్లి : దేవరాపల్లిలోని తమ బంధువుల పెళ్లి వేడుకులకు వచ్చిన విశాఖపట్నం తాటిచెట్లపాలేనికి చెందిన పొన్నాడ లక్ష్మణరావు (61) అదృశ్యమయ్యాడని అతని బంధువులు స్థానిక పోలీస్స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం దేవరాపల్లిలో ఈ నెల 16న జరిగిన పెళ్లికి లక్ష్మణరావు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. మధ్యాహ్నం వరకు అందరితో ఉన్న అతడు సాయంత్రానికి కనిపించలేదు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం అతని బంధువులు పలు ప్రాంతాల్లో వెతికినా ఎక్కడా కనిపించలేదు. వృద్ధుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతని ఆచూకీ తెలిసిన వారు సెల్ నెంబర్ 9010622874, 9573268376కు ఫోన్ చేయాలని ఆయన కోరారు. కాగా లక్ష్మణరావు చిన్న కుమారుడుకి వచ్చే నెలలో వివాహం నిశ్చయం కావడంతో అతని బంధువులు ఆందోళన చెందుతున్నారు. -
భార్యను హతమార్చిన భర్త అరెస్టు
డుంబ్రిగుడ: మండలంలోని కొర్ర పంచాయతీ శెట్టిబంద గ్రామంలో శనివారం రాత్రి మద్యం మత్తులో భార్యను హత్య చేసిన గెమ్మెలి కామయ్యను సోమ వారం అరెస్టు చేసినట్టు అరకులోయ సీఐ కోటేశ్వరరా వు, ఎస్ఐ ఎల్.సురేష్ తెలిపారు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్య గెమ్మెలి కోమలితో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. దీంతో విచక్షణ కోల్పోయి భార్య మెడ, శరీరంపై కర్రతో బలంగా కొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు కామయ్య ను అరెస్టు చేసి, వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్కు తరలించారు. -
ఎస్పీ కార్యాలయానికి 64 అర్జీలు
అర్జీదారు సమస్యలను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 64 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల సమస్యలు తెలుసుకుంటూ దరఖాస్తులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు, ఆస్తి గొడవలు, ఆర్థిక మోసాలు, భార్యాభర్తల వేధింపులు, గృహ కలహాలు, శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై 64 అర్జీలు వచ్చాయన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తొంగకుండా కేవలం నిజాల ఆధారంగా పారదర్శకంగా దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. స్టేషన్లో కేసులు ఏ దశలో ఉన్నాయో బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిలో నమ్మకం నింపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, ఎస్బీ సీఐ ఎస్.బాలసూర్యారావు, ఎస్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గరిశింగిలో 12 అడుగుల గిరినాగు హల్చల్
గరిశింగిలో భారీ గిరినాగును పట్టుకుంటున్న వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులు దేవరాపల్లి: మండలంలోని గరిశింగిలో సోమవారం ఉదయం భారీ గిరినాగు జనావాసాల మధ్యకు ప్రవేశించి గ్రామస్తులను హడలెత్తించింది. గ్రామంలోని రెండు ఇళ్ల మధ్య సందులో సుమారు 12 అడుగుల మేర పొడువున్న గిరినాగు చేరింది. ఇటుకలు తీసేందుకు వెళ్లగ ఒక్కసారిగా గిరినాగు పడగ విప్పి బుసలు కొట్టడంతో స్థానిక ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. వెంటనే స్థానికులు చోడవరం అటవీశాఖ అధికార్లు ద్వారా తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులకు సమాచారం అందించారు. ప్రసాద్, కృష్ణ, ఇషాక్ తదితర సమితి సభ్యులు అక్కడికి చేరుకొని సుమారు గంట పాటు శ్రమించి అతి కష్టం మీద భారీ గిరినాగును సురక్షితంగా పట్టుకున్నారు. చీడికాడ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం
పాడేరు: క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలతో నిరంతరం శ్రమిస్తే పోటీ పరీక్షల్లో విజయం తథ్యమని కలెక్టర్ నిశాంతి తెలిపారు. డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులకు పట్టణ శివారు కుమ్మరిపుట్టు శంకరన్ ఆడిటోరియంలో ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీఎస్సీకి సిద్ధమయ్యే ప్రతి అభ్యర్థి అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న పూర్తి సిలబస్పై సమగ్రంగా అవగాహన చేసుకోవాలన్నారు. సిలబస్ను చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని టైం టేబుల్ ప్రకారం చదువుకోవాలన్నారు. మాక్ టెస్టులు, గత ప్రశ్న పత్రాల పరిశీలన తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలోని 11 మండలాల్లోని గ్రంథాలయాల్లో డీఎస్సీ అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం డీఎస్సీకే పరిమితం కాకుండా ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, అగ్నివీర్ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధం కాలన్నారు. ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు, జాబ్మేళాలు, ప్రభుత్వ సబ్సిడీలు ఉన్న స్టార్టప్లు, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గతంలో డీఎస్సీలో విజయం సాధించి, ఉపాధ్యాయులుగా ఎంపికై న పలువురితో అవగాహన కల్పించారు. సదస్సుకు హాజరైన అభ్యర్థులకు ఉచితంగా నోట్ప్యాడ్లు, స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి రెవెన్యూ శాఖ అధికారి ఎం.వి.ఎస్ లోకేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. భానుమూర్తి, టీడబ్ల్యూ డీడీ పరిమళ, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, గురుకులం ఓఎస్డీ మూర్తి, డీపీఆర్వో అన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ అభ్యర్థుల అవగాహన సదస్సులో కలెక్టర్ నిశాంతి -
పీఎం జన్మన్ హౌసింగ్ బిల్లులు చెల్లించాలి
ముంచంగిపుట్టు: పీఎం జన్మన్ హౌసింగ్ బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎం.శ్రీను, కె.నర్సయ్య డిమాండ్ చేశారు. స్థానిక కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గృహాలు మంజూరు చేసి రెండు సంవత్సరాలు అవుతున్నా నిర్మాణం పూర్తి కాలేదని చెప్పారు. సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయి, మొండిగోడలతో దర్శనం ఇస్తున్నాయన్నారు. నిర్మాణ సామగ్రి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నందున రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రూ.లక్ష వెంటనే చెల్లించాలని కోరారు. జనరల్ కేటగిరీ కింద గృహాలు ఇస్తామని చెప్పి, సర్వే చేసి సంవత్సరం పూర్తవుతున్నా ఒక్క ఇల్లు కూడా మంజూరుచేయక పోవడం అన్యాయమన్నారు. హౌసింగ్ లబ్ధిదారులకు పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.10 లక్షలు చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం మండల నేతలు లైకోన్, నారాయణ, జీనబందు, శ్రీను, డోంబురు తదితరులు పాల్గొన్నారు. -
వంతెన కోసం ఆందోళన
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం ఎ.దారకొండ పంచాయతీ నడివిడి గ్రామం మధ్య ఉన్న వాగుపై తక్షణమే వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆ పంచాయతీ ప్రజలు సోమవారం వాగులోకి దిగి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి, ఎంపీటీసీ బుజ్జిబాబు మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయి చాలాకాలమైనా ఇంత వరకు పనులు చేపట్టలేదన్నారు. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోయి పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వంతెన లేకపోవడంతో నిత్యావసర సరకులు కూడా తీసుకురాలేని దుస్థితి నెలకొందని తెలిపారు. అత్యవసరమై వాగు దాటేందుకు ప్రయత్నిస్తున్న వారు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని చెప్పారు. వెంటనే వంతెన నిర్మాణపనులు ప్రారంభించాలని, లేకపోతే ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రజలతో కలిసి ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. -
డుడుమ సోయగం అదరహో
పొగ మంచుతో కనువిందు చేస్తున్న డుడుమ జలపాతం ప్రాంతంముంచంగిపుట్టు: ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న డుడుమ జలపాతం సోయగాలు అదరహో అనిపిస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పొగమంచు కొండలను తాకుతూ వెళుతున్న దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. డుడుమ అందాలను తిలకించేందుకు ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాలతో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. కొత్తపల్లి జలపాతం వద్ద.. జి.మాడుగుల: వాతావరణంలో మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో సోమవారం పొగమంచు దట్టంగా కురిసింది. మండు వేసవిలో శీతాకాలాన్ని తలపించేలా పొగమంచు అలుముకుంది. జి.మాడుగుల, పాడేరు, చింతపల్లిలలో కురిసింది. కొత్తపల్లి జలపాతం వద్ద పొగమంచు అలుముకోవడంతో పర్యాటకులు ఎంజాయ్ చేశారు. -
మాదకద్రవ్యాలతో భవిష్యత్తు అంధకారం
చింతపల్లి డీఎస్పీ తిరుపతిరావుకొయ్యూరు: మాదకద్రవ్యాలకు బానిసలైతే భవిష్యత్తు అంధకారమవుతుందని చింతపల్లి డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. కాకరపాడు గురుకుల జూనియర్ బాలుర కళాశాలలో కేరీర్ గైడెన్స్పై సీఐ శ్రీనివాసరావుతో కలిసి ఆయన సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ యువత గంజాయికి దూరంగా ఉండాలన్నారు. ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మ ద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ర్యాగింగ్కు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంప ఎస్ఐ ఎస్.శ్రీనివాస్, ప్రిన్సి పాల్ సత్యనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు పోలీసుస్టేషన్ల తనిఖీ కొయ్యూరు, మంప స్టేషన్లను డీఎస్పీ తిరుపతిరావు తనిఖీ చేశారు.రికార్డులను పరిశీలించి, సి బ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలతో సంబంధాలు మెరుగుపరచుకోవాలని తెలిపారు. -
సమీక్షలు లేవు..సమస్యలు తీరవు
● పాడేరు ఐటీడీఏలో..ఐటీడీఏలో 16 నెలలుగా జరగని పాలకమండలి సమావేశాలు గిరిజనుల సమస్యలు పట్టని కూటమి ప్రభుత్వం సమావేశాలను మరచిన గిరిజన మంత్రి 3 నెలలకోసారి నిర్వహించే నిబంధనలకు తూట్లు సాక్షి, పాడేరు: గిరిజనాభివృద్ధిలో ఐటీడీఏ వ్యవస్థ కీలకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఐటీడీఏకు ఏటా రూ.వేల కోట్లలో నిధులు వస్తాయి. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేటర్గా విశేష అధికారాలు ఉన్నాయి. గిరిజనులకు సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఐటీడీఏ ద్వారానే జరుగుతాయి. రూ.కోట్ల నిధులను గిరిజనుల సంక్షేమం కోసం ఖర్చుపెడతారు. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, చేసిన పనులపై సమీక్షించేందుకు ఐటీడీఏ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ, ఎంపీపీలు, జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్, జేసీ, జెడ్పీ చైర్మన్, ఐటీడీఏ పీవో, సబ్కలెక్టర్తో పాలకవర్గ సమావేశాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలి. ఐటీడీఏకు కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం నుంచి గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించాలి. ఇంత కీలకమైన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల నిర్వహణపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. గిరిజన మంత్రికి తీరిక లేదా? ఏడాదిలో నాలుగు సార్లు ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ 16 నెలల వ్యవధిలో పాడేరులో అనేకసార్లు పర్యటించినప్పటికీ ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహణకు తీరికలేకుండా పోయింది. దీంతో ఐటీడీఏ పరిధిలో ఏయే పనులు జరుగుతున్నాయి, ఎంత ఖర్చు చేస్తున్నారు అనే అంశాలపై పారదర్శకత లేకుండా పోయిందని స్థానిక ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. జిల్లాలో తాగునీరు, రహదారులు, విద్య, వైద్యపరంగా అనేక సమస్యలు నెలకొన్నాయి. తాగునీరు లేక పలు గ్రామాల్లో గిరిజనుల గొంతెండుతోంది. ఈ సమస్య పరిష్కారానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో ని 11 మండలాలతో పాటు నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజవర్గాల పరిధిలోని గిరిజన గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఐటీడీఏ ద్వారా జరగాలి. విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీరు ఉపా ధి, రోడ్లు, రవాణా, కాఫీ తోటల విస్తరణ, మిరియాల సాగు తదితర 63 విభాగాల పనులను ఐటీడీఏ పర్యవేక్షిస్తుంది. పాలకవర్గం సమావేశం జరగకపోవడంతో ఈకార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ప్రజలకు తెలియడం లేదు. ఐటీడీఏ పాలకవర్గంలో మంత్రి సంధ్యారాణి మినహా, మిగిలిన ప్రజాప్రతినిధులంతా వైఎస్సార్సీపీకి చెందిన వారే ఉన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో పాటు తొమ్మిది మంది ఎంపీపీలు, తొమ్మిది మంది జెడ్పీ టీసీలు వైఎస్సార్సీపీకి చెందిన వారు కాగా, అనంతగిరి జెడ్పీటీసీ సీపీఎంలో ఉన్నారు. వారంతా గిరిజన సమస్యలు, సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన నూరుశాతం ఉద్యోగాల జీవోపై నిలదీస్తారనే భయంతోనే కూటమి ప్రభుత్వం 16 నెలలుగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు నిర్వహించలేకపోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు నిలదీస్తాయనే... వెంటాడుతున్న సమస్యలుఐటీడీఏ పాలకవర్గ సమావేశాలపై నిర్లక్ష్యం గిరిజన సంక్షేమానికి కీలకమైన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఐటీడీఏలో చర్చించాల్సిన గిరిజన సమస్యలను తాను జిల్లా పరిషత్ సమావేశాల దృష్టికి తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. గిరిజనుల సమస్యలతో పాటు నిధుల కేటాయింపులు, ఖర్చుల వివరాలను ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో చర్చించే వీలులేకుండా పోవడం బాధాకరం. –జల్లిపల్లి సుభద్ర, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ -
సర్వేను పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు
మాకవరపాలెం: మండలంలోని రాచపల్లి రెవెన్యూలో సర్వేను ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. రాచపల్లి రెవెన్యూలోని సర్వే నంబర్ 737లో 1600 ఎకరాల భూమిలో ఇప్పటికే 406 ఎకరాలను ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు సేకరించిన సంగతి తెలిసిందే. తాజాగా మూడు రోజుల నుంచి మిగిలి ఉన్న భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. ఈ భూమికి సంబంధించి రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య సరిహద్దుల నిర్ధారణపై వివాదం ఉంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ చేపట్టిన సర్వే ఫారెస్ట్కు చెందిన భూముల్లో ఉందా? లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు సోమవారం కోటవురట్ల ఫారెస్ట్ సెక్షన్ అధికారి వివేకానంద తన సిబ్బందితో కలసి పరిశీలించారు. ప్రస్తుత సర్వే అనకాపల్లి రేంజ్ పరిధిలో జరుగుతుందని నిర్ధారించుకున్నారు. నర్సీపట్నం రేంజ్ పరిధి కాకపోవడంతో ఫారెస్ట్ అధికారులు వెనుదిరిగారు. ఇదిలా ఉండగా 30 ఏళ్లకుపైగా ఈ భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని రైతులు చెబుతున్నారు. పరిశ్రమలకు తమ సాగు భూమిని సేకరిస్తే ప్రభుత్వం, అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
డిజిటల్ అరెస్ట్.. రూ.1.46 కోట్లు స్వాహా!
అల్లిపురం: డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగిన సైబర్ మోసం కేసులో మ్యూల్ అకౌంట్గా బ్యాంక్ ఖాతాను అందించిన నిందితుడిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన 76 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, ఆయన భార్యను టెలికాం, పోలీస్, ఈడీ, సీబీఐ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. అక్రమంగా డబ్బులు సంపాదించారని, అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఆర్బీఐ ఫండ్ వెరిఫికేషన్ పేరుతో వారి జీవితకాల పొదుపు సొమ్ము నుంచి రూ.1,46,50,220ను వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. అనంతరం మోసపోయినట్లు గ్రహించిన బాధితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానిప్రసాద్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాపుపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న బాధితుడి ఖాతా నుంచి రూ.29.20 లక్షలు బదిలీ అయిన ఖాతాను పోలీసులు పరిశీలించారు. కేవైసీ వివరాల ప్రకారం పీఎం షబీర్, అబూతాహీర్ జాయింట్ అకౌంట్ హోల్డర్లుగా ఉన్నారు. మొబైల్ నంబర్, ఇతర సాంకేతిక ఆధారాలతో షబీర్ను గుర్తించారు. విచారణలో తన బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు, సిమ్ కార్డును ఇతరులకు ఇచ్చినట్లు షబీర్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతని ఖాతా ద్వారా సుమారు రూ.92 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. ఈ మోసంతో సంబంధం ఉన్న మరికొందరు నిందితులు, వారి పాత్రపై కీలక సమాచారం లభించిందని, వారిని గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. -
హర హర మహాదేవ
కొండకోనల్లో మార్మోగిన శివనామ స్మరణసీలేరు: హర హర మహాదేవ.. శంభో శంకర అంటూ శివనామస్మరణతో కొండకోనలు మార్మోగాయి. ఒడిశా రాష్ట్రం గుప్తేశ్వరంలో కొలువైన మహాదేవుని భక్తులు కాలినడకన సోమవారం సీలేరు చేరుకుని స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కావిళ్లతో నీరు మోసుకుంటూ, శివనామస్మరణ చేస్తూ వందల కిలోమీటర్లు కాలినడకన ఇక్కడికి చేరుకున్నారు. ఒడిశాలోని చిత్రకొండ తాలూకా ఐదు పంచాయతీలకు చెందిన సుమారు 120 మంది భక్తులు ఆషాఢమాసం ప్రారంభంలో శివమాలలు వేశారు. వీరు నెలరోజుల పాటు దీక్ష చేస్తారు. గురుపౌర్ణమికి మాలవేసి రాఖీపౌర్ణమి నాడు మాల తీస్తారు. దీనిని బోల్ భం దీక్ష అంటారు. శివమాలలు ధరించిన భక్తులు సోమవారం ఉదయం సీలేరుకు చేరుకుని, స్థానిక జలాశయంలో స్నానాలు ఆచరించి, శివాలయంలో అభిషేకం నిర్వహించారు. కాలినడకన వెళ్లి గుప్తేశ్వరంలో శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి దీక్ష విరమిస్తామని గురుస్వామి తెలిపారు. సీలేరు వచ్చిన బోల్ భం దీక్షాపరులకు స్థానిక పెద్దలు స్వాగతం పలికారు. -
‘డయల్ యువర్ సీఎండీ’కి 41 ఫిర్యాదులు
మహారాణిపేట(విశాఖ): విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి 41 వినతులు అందాయి. విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినియోగదారులు వివిధ సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా లో–వోల్టేజ్, విద్యుత్ బిల్లులు, లైన్ షిఫ్టింగ్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, రూఫ్టాప్ సోలార్, కొత్త విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వినతులను సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వితేజ్ పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయడం, 9493681912 వాట్సాప్ నంబర్కు చాట్ చేయడం ద్వారా కూడా తమ విద్యుత్ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవచ్చని సంస్థ సూచించింది. కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) టీవీ సూర్యప్రకాష్, సీజీఎం పి.సోల్మన్రాజు, జనరల్ మేనేజర్లు ఎం.ఝాన్సీ, వి.వి.ఎస్.ఎన్.వి.ప్రసాద్, వి.వి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి ప్రకోపానికి భయపడ్డా..
నా ప్రయాణం అంత తేలికగా సాగలేదు. నేనెన్నో మెరుపులు చూశాను.. కొన్ని చేదు మరకలనూ ఎదుర్కొన్నాను. 2005లో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిపోయాను. దాదాపు 10 రోజుల పాటు నా రన్వే నీటిలో మునిగిపోయి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక నా పనైపోయిందని అందరూ అన్నారు. ఇక 2014లో నా జీవితంలోనే అత్యంత దారుణమైన ఘటన జరిగింది. 2014 అక్టోబరు 12న గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన హుద్ హుద్ తుపాన్ గాలులు.. నా టెర్మినల్ కప్పును ఎగరగొట్టాయి. అద్దాలన్నీ పగిలిపోయి, నా సర్వస్వం ఛిన్నాభిన్నమైంది. అదే నా చివరి రోజు అని అనుకున్నాను. కానీ, నేవీ అధికారుల అహోరాత్రులు శ్రమించడంతో.. కేవలం పదంటే పది రోజుల్లోనే కోలుకుని మళ్లీ విమానాలకు స్వాగతం పలికాను. ఇందులో మీ సహకారం కూడా ఎంతో ఉందని నాకు తెలుసు. -
షాట్పుట్లో ఏకలవ్యవిద్యార్థికి రజత పతకం
గూడెంకొత్తవీధి: స్థానిక ఏకలవ్య జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి చంద్రశేఖర్ నాయుడు అండర్–16 జూనియర్ అథ్లెటిక్స్ విభాగంలోని షాట్పుట్లో రజత పతకం సాధించాడు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరచిన విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.వి. రమణారావు, అధ్యాపక సిబ్బంది అభినందించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ నెల 11 నుంచి 13 వరకు నిర్వహించిన పోటీల్లో చంద్రశేఖర్ నాయుడు రజత పతకం కై వసం చేసుకున్నాడు. ఈ ప్రతిభ ఆధారంగా వచ్చే నెలలో జరిగే 37వ దక్షిణ భారత దేశ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీలకు ఆయన ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. -
● వాణిజ్య పంటల వైపు గిరిజన రైతుల చూపు ● అల్లం,మొక్కజొన్న,వేరుశనగ సాగు ● వందల ఎకరాల్లో వాణిజ్య పంటలు ● మార్కెట్ ధరలపై రైతుల ఆశలు ● పర్యాటక సీజన్ నాటికి మంచి ఆదాయం
విస్తారంగా సాగవుతున్న వేరుశనగ పంటమొక్కజొన్న పైరురైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నఉద్యానవనశాఖ అధికారి శిరీషడుంబ్రిగుడ: గిరిజన రైతులు సంప్రదాయ వ్యవసాయ పంటలతో పాటు వాణిజ్య పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలో అల్లం సాగు విస్తరిస్తోంది. అరమ, తూటంగి, లైగండ, సొవ్వా, సాగర, కురిడి, పోతంగి, కండ్రుమ్ తదితర పంచాయతీల్లో సుమారు 600 ఎకరాల్లో రైతులు అల్లం సాగు చేస్తున్నారు. దీంతో పాటు 302 ఎకరాల్లో నాటు మొక్కజొన్న, 80 ఎకరాల్లో స్వీట్కార్న్, 950 ఎకరాల్లో వేరుశనగ పంట సాగవుతోంది. ఉద్యానవనశాఖ అధికారులు పంచాయతీల్లో పర్యటిస్తూ పంటల సాగు, తెగుళ్ల నివారణ, దిగుబడి పెంపుపై రైతులకు సూచనలు చేస్తున్నారని రైతులు తెలిపారు. గతేడాది గసభ, సొవ్వా, అరమ, పోతంగి, కురిడి, కండ్రుమ్ పంచాయతీల్లో గుర్తించిన రైతులకు ప్రోత్సాహకంగా హెక్టారుకు రూ.12 వేల చొప్పున అందించినట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు ప్రోత్సాహక నగదు అందలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అల్లం మొదటి రకం కిలో రూ.90 నుంచి రూ.120, రెండో రకం రూ.60 నుంచి రూ.90 వరకు ధర పలుకుతోందని రైతులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో కొంత అల్లం కుళ్లిపోతుండటంతో ఆందోళన చెందుతున్నా.. అధికారులు సూచనలు అందిస్తున్నారని తెలిపారు. ధరలు మరింత పెరిగితే మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి అల్లం తవ్వకాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరోవైపు పర్యాటక సీజన్ నేపథ్యంలో స్వీట్కార్న్, నాటు మొక్కజొన్న కంకులకు కూడా డిమాండ్ పెరిగింది. వ్యాపారులు రైతుల తోటల వద్దే ఒక్క కంకిని సుమారు రూ.15కు కొనుగోలు చేసి పర్యాటకులకు రూ.30 వరకు విక్రయిస్తున్నారని రైతులు తెలిపారు. దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పంట విక్రయించడంతో రైతులకు ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. లాభాలు వచ్చే అవకాశం ఈ ఏడాది సుమారు ఎకరాలో 20 బస్తాల అల్లం వేశా. ఉద్యానవనశాఖ అధికారుల సూచనలతో వచ్చే నెలలో పంట తీస్తే మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నా. పాత అల్లం కావడంతో వర్షాలకు కుళ్లిపోతుందేమోనని మొదట భయపడ్డా. అయితే ప్రస్తుతం అల్లం దుంపలు బాగానే ఉన్నాయి. పాత అల్లాన్ని తీసి విక్రయించిన తర్వాత.. రెండోసారి వచ్చే అల్లంతో మరింత లాభం పొందుతామని ఆశిస్తున్నాం. – పాంగి లోకినాథ్, రైతు, రంగినిగుడ, పోతంగి పంచాయతీ, డుంబ్రిగుడ బోదెల పద్ధతిలో నాటుకోవాలి ఆరోగ్యంగా, తెగుళ్లు లేని మంచి నాణ్యత కలిగిన అల్లం దుంపలను విత్తనంగా ఎంపిక చేసుకోవాలి. ఒక్కో విత్తన ముక్క 20 నుంచి 25 గ్రాముల బరువు ఉండి, ఒకటి లేదా రెండు మొగ్గలు ఉండటం మంచిది. ఎకరానికి సాధారణంగా 600 నుంచి 800 కిలోల విత్తన దుంపలు అవసరమవుతాయి. నాటే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. ట్రైకోడెర్మా విరిడీ 5 గ్రాములను లీటరు నీటిలో కలిపి, అల్లం దుంపలను శుద్ధి చేసిబోదెల పద్ధతిలో నాటుకోవాలి. – కె. శిరీష, ఉద్యానవనశాఖ అధికారి, డుంబ్రిగుడ -
వరాహ నారసింహునికి ఆర్జిత సేవల వైభోగం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు సహస్రనామార్చన ఘనంగా జరిపారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ బేడామండపంలో వేదికపై వేంజేపచేశారు. 1001 నామాలతో సహస్రనామార్చన జరిపారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందజేశారు. ఘనంగా గరుడసేవ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ బేడామండపంలో స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వెండి గరుడ వాహనంపై వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళిపూజ నిర్వహించారు. భక్తులను గరుడ వాహనం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. విశేష హారతులు అందించారు. -
తల్లిని గాయపరిచిన కుమార్తె
కలెక్టరేట్లో ఘనంగా జెండా పండగ మాడుగుల రూరల్: కన్న కూతురే తల్లిని సన్నికాలురాయితో తలమీద, ఛాతీభాగంలో కొట్టి గాయపరిచిన సంఘటన గాదిరాయి లో జరిగింది. స్థానిక ఎస్ఐ జి.నారాయణరా వు శనివారం అందించిన వివరాలు ఇలా ఉన్నా యి. మండలంలో గాదిరాయి గ్రామానికి చెందిన పెచ్చేట్టి చిలుకమ్మ అనే మహిహిళ తన కుమారై సిరిసొల్ల దేవి, అల్లుడు వెంకటరమణతో కలిసి నివాసం ఉంటోంది. చిలుకమ్మ ఎడమకాలుకు రెండు సంవత్సరాలు క్రితం ఆపరే షన్ జరిగింది. విశాఖపట్నంలో డాక్టర్ వద్దకు వెళ్లేందుకు గతంలో డాక్టరు రాసిన మందుల చీటి, ట్రిట్మెంట్కు సంబంధించిన ఫైల్ ఇవ్వాలని కుమార్తె దేవిని శుక్రవారం రాత్రి కోరింది. ఆమె ఇవ్వకపోగా, తీవ్రంగా దూషించింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో చిలుకమమ్మ నిద్రిస్తుండగా తన ఇంట్లో ఉన్న సన్నికాలురాయితో తలపైన, ఛాతీభాగంలో బలంగా దేవి కొట్టి గాయపరిచింది. దీంతో చిలకమ్మకు తీవ్రంగా రక్తస్రావమైంది. వెంటనే కుటుంబ సభ్యులు మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్ఐ నారాయణరావు తెలిపారు. తుమ్మపాల: కలెక్టర్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో కలెక్టర్ విజయ కృష్ణన్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్తో కలిసి వందనం సమర్పించారు. కలెక్టరేట్ అధికారులకు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణ రావు, సీపీవో రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో... అనకాపల్లి: స్థానిక ఎస్పీ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ తుహిన్ సిన్హా, ఎస్పీ సతీమణి, 3వ అదనపు సివిల్ న్యాయమూర్తి, 13వ అదనపు జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ నిఖితా సెంగర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనకు లభించిన స్వేచ్ఛ ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితమన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, డీఎస్పీలు ఇ.శ్రీనివాసరావు, కె.రవికుమార్, జి.ఆర్.ఆర్.మోహన్, బి.మోహన్రావు, సీఐలు టి.లక్ష్మి, శ్రీనివాసరావు, ఎం.వెంకటనారాయణ, జి.ప్రేమ్కుమార్, అశోక్కుమార్, రమేష్, రమణయ్య రామకృష్ణారావు, మన్మధరావు, తదితరులు పాల్గొన్నారు. -
మతిస్థిమితం లేని మహిళ కుటుంబ సభ్యులకు అప్పగింత
మతిస్థిమితం లేని మహిళను అప్పగిస్తున్న రూరల్ ఎస్ఐ రాజారావు నర్సీపట్నం: మతిస్థిమితం లేక గబ్బాడ శివారులో తిరుగుతున్న 27 ఏళ్ల మహిళకు రూరల్ ఎస్ఐ రాజారావు చికిత్స అందించడంతో పాటు కుటుంబ సభ్యులకు అప్పగించి మానవత్వం చాటుకున్నారు. ఓ మహిళ అనారోగ్యంతో, మతిస్థిమితం లేక సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఎస్ఐ రాజారావు, సిబ్బందితో వెళ్లి ఆమెను పోలీసు స్టేషన్కు తీసుకువచ్చి, పేరు, చిరునామా వివరాలను రాబట్టేందుకు ప్రయత్నించారు. తన పేరు భార్గవి అని, స్వస్థలం కదిరి సత్యసాయి జిల్లా అని మాత్రమే ఆమె చెప్పింది. ఆమెను ఏరియా ఆస్పుత్రిలో చేర్పించారు. అతి కష్టం మీద కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని, వారికి సమాచారం అందించారు. అనంతరం తల్లిదండ్రులు చింతలపల్లి లక్ష్మి, నారాయణస్వామికి ఆమెను అప్పగించారు. -
ఘనంగా ముగిసిన గ్రామీణ యువజన మందిరం వార్షికోత్సవం
మునగపాక: గ్రామీణ యువజన మందిరం వార్షికోత్సవం శనివారం రాత్రితో ఘనంగా ముగిసింది. ఇందులో భాగంగా నందీశ్వర ప్రాంగణం తులసీ కళావేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువజన మందిరం ద్వారా ఒకవైపు క్రీడా పోటీలు, మరోవైపు నాటక రంగ కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్లో మరిన్ని సేవా కార్యక్రమాలతోపాటు క్రీడలు, నాటక పరిషత్లు నిర్వహించి రాష్ట్రంలో మరింత గుర్తింపువచ్చేలా కృషి చేయాలన్నారు. ఐ కిడ్స్ అకాడమి వారిచే కూచిపూడి, భరతనాట్యం, బాల రామాయణం వంటి ప్రదర్శనలు నిర్వహించారు. అయిదు రోజులుగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మందిర అధ్యక్షుడు ఆడారి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్రీడా విభాగం మండల కన్వీనర్ పెంటకోట విజయ్, పీఏసీఎస్ అధ్యక్షుడు విల్లూరి నరసింగరావు, మాజీ అధ్యక్షుడు దాడి ముసిలినాయుడు, విద్యావేత్త పెంటకోట వెంకటరావు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు, మందిర ఉపాధ్యక్షులు మళ్ల సంజీవరావు, మళ్ల రామజగన్నాథం, ఆడారి లక్ష్మణరావు, మందిర మాజీ అధ్యక్షులు ఆడారి గంగమహేష్, ఆడారి సూర్యచంద్రరావు, ఆడారి రమణబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
మహారాణిపేట: జిల్లాకు కొత్తగా వచ్చిన రెండు ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ శ్రీభరత్ శనివారం పోలీస్ బ్యారెక్స్ వద్ద ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి మొత్తం 20 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గాజువాక నుంచి, విమానాశ్రయం నుంచి గంటకో బస్సు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రూ.300, గాజువాక నుంచి రూ.400 చార్జీగా నిర్ణయించారు. అనంతరం మంత్రి, ఎంపీతోపాటు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చి తదితరులు బస్సులో ఆర్కే బీచ్ వరకు ప్రయాణించారు. -
రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు
పోలీసులు స్వాధీనం చేసుకున్న పొక్లెయిన్ నాతవరం: రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన తారురోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు స్థానిక ఎస్ఐ వై.తారకేశ్వరరావు తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ నాతవరం నుంచి తాండవ వరకు రూ.3.50 కోట్లతో ఇటీవల అఽర్అండ్బీ శాఖ తారురోడ్డు నిర్మించింది. పంట పొల్లాల్లోకి వాహనాలు వెళ్లడానికి, తాండవ నీరు తరలించేందుకు రోడ్డు మార్జిన్ చమ్మచింత పంచాయతీ పరిధిలో సింహాలు రైస్మిల్లు వద్ద ఇదే గ్రామానికి చెందిన దొరబాబు పొక్లెయిన్తో తవ్వేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పొక్లెయిన్ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. తారురోడ్డుపై ఐరన్ చక్రాలతో దమ్ము చేసే ట్రాక్టర్లు తిరిగితే కేసు పెడతామన్నారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా దమ్ము చేసే ట్రాక్టర్ల యజమానులకు నోటీసులు పంపినట్టు ఎస్ఐ చెప్పారు. -
ఓ
తండ్రిని చిన్నతనంలోనే కోల్పోయి.. పుట్టుకతో వచ్చిన వినికిడి, మాటల సమస్యతోనూ పోరాడుతున్నా గంగోత్రి తన కలను వదులుకోలేదు. పేదరికం, చదువు మధ్యలో ఆగిపోవడం వంటి ఎన్నో కష్టాలను అధిగమించి బ్యాడ్మింటన్ రాకెట్ను తన ఆయుధంగా మార్చుకుంది. తల్లి అండతో గ్రామీణ వేదిక నుంచి జాతీయ స్థాయి పోటీల వరకు ఎదిగిన ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. డెఫ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గంగోత్రి విజయ ప్రస్థానం● కష్టాల మధ్య.. కలల పరుగు ● అమ్మ అండతో.. ఊహించని స్థాయికి తల్లి కష్టం..కూతురి పట్టుదలపాడేరు రూరల్: ఓ వైపు పుట్టుకతోనే వినికిడి, మాట్లాడే సమస్య.. మరోవైపు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన బాధ.. ఇంటి పరిస్థితులు చూస్తే చదువు కూడా మధ్యలోనే ఆగిపోయింది. అయినా ఆమె అడుగులు ఆగలేదు. చేతిలో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకుని.. తన కలల వెంట పరుగులు తీసింది. ఆమెనే పాడేరు మండలం కిండంగి పంచాయతీ సేరుబయలు గ్రామానికి చెందిన డెఫ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి రాజాన గంగోత్రి (23). గ్రామంలోని చిన్న వేదిక నుంచి మొదలైన ఆమె ప్రయాణం.. ఇప్పుడు జాతీయ స్థాయి పోటీల వరకు చేరింది. ● తండ్రి లేకపోయినా తల్లి ధైర్యం చెప్పింది. యలమంచిలి సమీపంలోని బీసీటీ పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన గంగోత్రి.. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చదువును కొనసాగించలేకపోయింది. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లి.. తన బిడ్డ కలకు మాత్రం అడ్డుకాలేదు. డబ్బు లేకున్నా క్రీడపై ఉన్న మక్కువను గంగోత్రి వదులుకోలేదు. రాకెట్ పట్టిన చేతికి.. పతకాలు.. 2022లో మొదలైన బ్యాడ్మింటన్ ప్రయాణం.. తొలుత గ్రామ, మండల స్థాయిలో సాగింది. బీసీటీ పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాడేరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో శిక్షణ పొందింది. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ.. డెఫ్ ఫౌండేషన్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని పోటీల్లో తన ప్రతిభను చాటుకుంది. ● ఇప్పటి వరకు మండల స్థాయిలో రెండుసార్లు, డివిజన్ స్థాయిలో రెండుసార్లు, జిల్లా స్థాయిలో మూడుసార్లు, రాష్ట్ర స్థాయిలో నాలుగుసార్లు, జాతీయ స్థాయిలో ఒకసారి పోటీల్లో పాల్గొంది. తొమ్మిది ప్రశంసాపత్రాలు, ఒక గోల్డ్ మెడల్, నాలుగు షీల్డులు అందుకుంది. ప్రతి పతకం వెనుక తల్లి చేసిన కష్టం.. ప్రతి విజయం వెనుక గంగోత్రి పట్టుదల ఉంది. అండగా నిలిచిన మంచి మనసులు పోటీలకు వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు.. క్రీడా సామగ్రి.. శిక్షణకు అయ్యే వ్యయం.. ఇలా ప్రతి అడుగులోనూ ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా కొన్ని మంచి మనసులు ఆమెకు అండగా నిలిచాయి. గత ఏడాది జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు స్థానిక వైఎస్సార్సీపీ నేత సూర్యనారాయణతో పాటు పలువురు నేతలు ఆర్థిక సహాయం చేసినట్లు గంగోత్రి తెలిపింది. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీపూజను ఆశ్రయించిన సందర్భాల్లోనూ సహకారం అందిందని పేర్కొంది. ● కూతురు క్రీడల్లో ముందుకు వెళ్లేందుకు తల్లి ఇప్పటికీ కూలీ పనులు చేస్తూనే అండగా నిలుస్తోంది. తల్లి పనులకు చేతనైన సాయం చేస్తూనే.. సమయం దొరికినప్పుడల్లా గంగోత్రి బ్యాడ్మింటన్ సాధన చేస్తోంది. జాతీయ స్థాయికి చేరుకున్న ఈ ప్రతిభకు మరింత శిక్షణ, క్రీడా సామగ్రి, ఆర్థిక సహకారం అందితే మరింత ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉందని గ్రామ పెద్దలు కోరుతున్నారు. ● తండ్రి లేని ఇంట్లో.. తల్లి కష్టాన్ని చూస్తూ పెరిగిన ఆ అమ్మాయి.. ఇప్పుడు జాతీయ స్థాయి కోర్టులో తన ప్రతిభను చాటుతోంది. మాటలు వినిపించకపోయినా.. ఆమె రాకెట్ చేసే శబ్దం మాత్రం విజయానికి సంకేతంగా మారుతోంది. గంగోత్రి గెలవాల్సింది ఒక్క మ్యాచ్ కాదు.. తనలాంటి ఎంతోమంది పిల్లలకు ‘కలలు కనొచ్చు’ అనే నమ్మకాన్ని ఇవ్వాలి. చదువు ఆగిపోయినా.. నా ఆట ఆగదు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చదువును మధ్యలోనే ఆపేశాను. కానీ ప్రాణంగా ఇష్టపడే బ్యాడ్మింటన్లో మాత్రం రాణించాలనుంది. దాతలు, ప్రభుత్వం ప్రోత్సహిస్తే మా ప్రాంతానికి మంచి పేరు తీసుకువస్తాను. మరిన్ని విజయాలు సాధించి నా తల్లి కష్టానికి ఫలితం ఇవ్వాలనుంది.. అని డెఫ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఆర్.గంగోత్రి తెలిపింది. -
జాతీయ జెండా సాక్షిగాచిందులు
● అవమానకరంగా ఏపీఎఫ్డీసీఅధికారుల తీరు ● యూనిఫాంలో ఫోక్ సాంగ్స్కు డ్యాన్స్లు వేయడంపై విమర్శలు సాక్షి,పాడేరు: గూడెంకొత్తవీధి మండలంలోని ఆర్వీ నగర్లో ఏపీఎఫ్డీసీ (ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ) అధికారుల బృందం 80వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జాతీయ జెండా సాక్షిగా జానపద పాటలు (ఫోక్) నృత్యాలు చేయడం వివాదాస్పదమైంది. శనివారం ఆర్వీ నగర్ ఏపీఎఫ్డీసీ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత దేశభక్తి గీతాలకు బదులుగా ’రాను నేను బొంబాయికి రాను’ అనే జానపద పాటకు అధికారులు, సిబ్బంది అందరూ కలిసి డ్యాన్సులు చేశారు. యూనిఫామ్ ధరించిన సిబ్బంది జాతీయ జెండాకు ఎదురుగానే అసభ్యకరరీతిలో నృత్యాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశభక్తిని చాటాల్సిన బాధ్యతాయుతమైన అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు ఇలాంటి పాటలకు డాన్సులు వేయడంపై స్థానిక గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ జెండాను అవమానించేలా ప్రవర్తించిన ఈ అధికార బృందంపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
చారిత్రాత్మకం
సమరయోధుల త్యాగాలుపాడేరు తలారిసింగి మైదానంలో జాతీయజెండాను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ నిశాంతిసాక్షి, పాడేరు: దేశ స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాలు చారిత్రాత్మకమని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి పేర్కొన్నారు. శనివారం పాడేరులోని తలారిసింగి క్రీడా మైదానంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఓపెన్ టాప్ జీపుపై నుంచి పోలీసుల కవాతు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మార్చ్పాస్ట్ నిర్వహించిన విద్యార్థులు, అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. పాండ్రంగి గ్రామానికి చెందిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 18 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించి, గిరిజనుల తరఫున బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటం చేశారని, 1924 మే 7న ఆయనను కొయ్యూరులో కాల్చి చంపారని తెలిపారు. అల్లూరితో పాటు గమ్ గంటందొర, గమ్ మల్లుదొర, మర్రి కామయ్య, పండు పడాల్, పనసల పెద్దిపడాల్, తగ్గి వీరయ్య వంటి ఎందరో సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధికి..: స్వర్ణాంధ్ర–2047 లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో పీ–4 విధానాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు. లక్షా 310 కుటుంబాలకు గాను, ఇప్పటివరకు 48,721 కుటుంబాలను 6,105 మంది మార్గదర్శకులు దత్తత తీసుకుని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. 225 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.28.22 కోట్లు, 12 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి రూ.34.50 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పీఎం జన్మన్ కింద 146 రోడ్లకు రూ.393.42 కోట్లు, 107 అంగన్వాడీ భవనాలు మంజూరు కాగా, 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రూ.686 కోట్ల వ్యయంతో 28,691 ఆదివాసీ కుటుంబాలకు పక్కాగృహాలు మంజూరైనట్టు కలెక్టర్ వివరించారు.’జలశక్తి అభియాన్ 2.0’లో సుమారు 10.5 లక్షల పనులు చేపట్టి జాతీయ స్థాయిలోనూ, ’జలధార–జలహారతి’లో 9,284 పనులు చేపట్టి రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఆమె వివరించారు. ఈ ఏడాది 145 డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ.1.72 కోట్ల రుణాలు అందించడంతో పాటు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దీపం, సీ్త్రశక్తి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక ప్రదర్శనలు పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. థింసా నృత్యాలు, నాటక పదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనల్లో పెదగరువు బాలికల ఆశ్రమ పాఠశాల బాలికలు ప్రథమ స్థానం, లోచలిపుట్టు బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానం, తలారిసింగి గిరిజన సంక్షేమశాఖ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానం, పాడేరు, చింతపల్లి బాలసదనం చిన్నారులు నాలుగో స్థానం, గౌతమి ప్రైవేట్ పాఠశాల విద్యార్ధులు ఐదవ స్థానం సాధించారు. వీరిని కలెక్టర్ నిశాంతి బహుమతులు అందజేశారు. ● జిల్లా అభివృద్ధి, సంస్కృతికి సంబంధించి ప్రభుత్వశాఖలు పోటీగా శకటాలను ప్రదర్శించాయి. వీటిలో వైద్య ఆరోగ్యశాఖ శకటం ప్రథమ, వ్యవసాయశాఖ ద్వితీయ, అటవీశాఖ తృతీయ, నాలుగో స్థానంలో గృహనిర్మాణశాఖ, ఐదవ స్థానంలో విద్యుత్శాఖ శకటాలు నిలిచాయి. వీటికి సంబంధించిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాళ్లను కలెక్టర్ నిశాంతి,జేసీ తిరుమణి శ్రీపూజ,ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మ తిలకించారు. డ్రోన్తో మారుమూల ప్రాంతాల్లో వైద్యానికి మందులు సరఫరా ప్రదర్శన ఆకట్టుకుంది. స్వాతంత్య్ర సమరయోధులు గాం గంటందొర వారసులతో పాటు పలు కుటుంబాలకు కలెక్టర్ నిశాంతి,జేసీ తిరుమణి శ్రీపూజ,ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ సత్కరించారు. మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం : జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ సాక్షి,పాడేరు: భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అన్నారు. కలెక్టరేట్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆమె జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భుజంగరావు, ఇన్చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, కలెక్టరేట్లోని విభాగాల అధికారులు పాల్గొన్నారు. పాడేరు : స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఆదిత్యవర్మ, ఐటీడీఏ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలోని అల్లూరి సీతారామరాజు, గాం మల్లుదొర, గాం గంటం దొర, బిర్సాముండా కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పీవో జెండాను ఎగురవేసి గౌరవవందనం సమర్పించారు. ఏపీవో వెంకటేశ్వరరావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ పాల్గొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి,పేదరిక నిర్మూలన లక్ష్యం కలెక్టర్ నిశాంతి ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్తమ అధికారులకు అవార్డులు సెల్యూట్ చేసిన స్నిఫర్ డాగ్ పోలీసులు ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకోగా, అందులో ఒక ప్రత్యేక ఘట్టం అందరి దృష్టినీ ఆకర్షించింది. పోలీసు జాగిలం అద్భుతమైన క్రమశిక్షణను ప్రదర్శిస్తూ, నేరుగా కలెక్టర్ టి. నిశాంతి వద్దకు వచ్చింది. చాలా సౌమ్యంగా తన నోటితో ఒక అందమైన పుష్పగుచ్ఛాన్ని కలెక్టర్ గారికి అందించింది. కలెక్టర్ గారు ఎంతో ఆప్యాయంగా ఆ పుష్పగుచ్ఛాన్ని స్వీకరించి, ఆ శునకాన్ని మెచ్చుకున్నారు. అనంతరం ఆ జాగిలం వెనక్కి తగ్గి, కలెక్టర్ గారికి ఎదురుగా నిలబడి తన రెండు ముందు కాళ్లను పైకి లేపి ప్రత్యేకమైన రీతిలో సెల్యూట్ చేసింది. జంతువులకు కూడా ఇంతటి క్రమశిక్షణ ఉంటుందని నిరూపించిన ఈ ఘట్టం వేడుకలకే హైలైట్గా నిలిచింది. -
వీరుల త్యాగాలు మరువలేనివి
● పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు పాడేరు : దేశ స్వాతంత్య్రంలో వీరుల త్యాగాలు ఎన్నటికి మరువలేనివని సమాజంలో ప్రతి పౌరుడు వారి అడుగుజాడల్లో నడిచి నవభారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అద్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్కుమార్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, ఐటీ విబాగం జిల్లా అద్యక్షుడు కూడా సుబ్రమణ్యం, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యానారాయణ, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు ఊర్వశిరాణి, మాజీ సర్పంచ్లు పాంగి నాగరాజు, మినుముల కన్నాపాత్రుడు, మాజీ పీఏసీఎస్ అద్యక్షురాలు రామసత్యవతి, పార్టీ నాయకులు బూర మహేష్, దుడ్డు లక్ష్మోజి, కిల్లు శంకర్, మోదమాంబ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
అల్లూరి సీతారామరాజు జిల్లా
Iశనివారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2026గాంధీ మహాత్ముడు ఆశించిన గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ పల్లె పాలనలో మార్పులకు నాంది పలికింది. గతంలో చిన్నచిన్న ప్రభుత్వ సేవల కోసం మండల కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈనేపథ్యంలో ఏర్పాటైన సచివాలయ వ్యవస్థతో అన్ని సేవలు గ్రామస్థాయిలోనే అందుబాటులోకి వచ్చాయి.ముంచంగిపుట్టు: గ్రామ సచివాలయ వ్యవస్థతో రేషన్, ధ్రువపత్రాలు, సంక్షేమ పథకాలు తదితర సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గింది. గ్రామంలోనే వివిధ శాఖల సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అయ్యాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేయడంలో సచివాలయాలు కీలకంగా మారాయి.కొండలు, గుట్టలు దాటి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రాలకు వెళ్లడం గిరిజనులకు గతంలో పెద్ద సవాలుగా ఉండేది. జిల్లాలో 11 మండలాల్లో 212 గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ప్రభుత్వ పాలన పంచాయతీ స్థాయిలోనే అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం–ప్రజల మధ్య దూరాన్ని తగ్గిస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థ పల్లె పాలనలో కీలక పాత్ర పోషించిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ముంచంగిపుట్టు సచివాలయంలో ప్రభుత్వ సేవలు పొందుతున్న గిరిజనులుఎండీయూ వ్యవస్థను పునరుద్ధరించాలి నాపేరు కల్యాణం. మాది అత్యంత మారుమూల ప్రాంతమైన రంగబయలు పంచాయతీ జర్రెలపొదర్ గ్రామం. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో గతంలో అటవీ, కొండల మార్గంలో కాలినడకన ప్రయాణించి రహదారి మార్గానికి చేరుకోవాల్సి వచ్చేది. అక్కడి నుంచి సుమారు 10 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వనుగుమ్మ పంచాయతీ కేంద్రంలోని డిపోకు చేరుకుని రేషన్ సరుకులు తీసుకునేవాళ్లం. అనంతరం 30 కిలోల బియ్యం బస్తాను మోసుకుంటూ మరో 10 కిలోమీటర్లు నడిచి గ్రామానికి చేరుకునేవాళ్లం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనం ద్వారా గ్రామ సమీపానికే రేషన్ సరుకులు అందేవి. దీంతో రేషన్ కోసం వెళ్లే దూరం సుమారు 7 కిలోమీటర్లు తగ్గింది. కేవలం మూడు కిలోమీటర్లు నడిస్తేనే గ్రామానికి చేరుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఎండీయూ వాహనాలను తొలగించడంతో మళ్లీ పాత రేషన్ కష్టాలు మొదలయ్యాయి. మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు దృష్టిలో ఉంచుకుని ఎండీయూ వాహనాల సేవలను పునరుద్ధరించాలి.వెంటనే ధ్రువపత్రాల మంజూరు నా పేరు ఎం.నారాయణ. మాది కుమడ పంచాయితీ ముఖిపుట్టు గ్రామం.సచివాలయ వ్యవస్థ రావడం గిరిజన గ్రామాల్లో గిరిజనులకు అన్ని విధాలుగా మేలు జరిగింది. గతంలో కుల,ఆదాయ ధ్రువపత్రాల కోసం 14 కిలో మీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. వారం రోజులు రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగితేనే పని జరిగేది. సచివాలయ వ్యవస్థ వచ్చిన తరువాత కేవలం ఒక రోజులోనే ధ్రువపత్రాలు మంజూరు అవుతున్నాయి. రేషన్ ఇబ్బందులు మొదలు నా పేరు కిరసాని సాధు. మాది మారుమూల వనుగుమ్మ పంచాయితీ పనస గ్రామం.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ సరకులు ఎండీయూ వాహనాల ద్వారా అందించే వారు అందువల్ల ఇబ్బందులు తొలగాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవస్థను తొలగించడం వల్ల మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పనస నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగడ డిపోకు వెళ్లితెచ్చుకోవాల్సి వస్తోంది. నిరీక్షణ, మోతకష్టాలు మొదలయ్యాయి. డిపోకు ఉదయం వెళ్తే ఇంటికి సాయంత్రం వస్తున్నాం. గ్రామస్థాయిలో సేవలు నా పేరు బోడ్నాయిక్ సిద్ధేశ్, మాది వనగుమ్మ. గత ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ వల్ల వేగంగా పారదర్శకంగా ప్రభుత్వ సేవలు, పథకాలు అందుతున్నాయి. అన్ని శాఖల అధికారులు ఒకేచోట అందుబాటులో ఉంటున్నారు. కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పెన్షన్లు సులభంగా లభిస్తున్నాయి. పంచాయితీ కార్యదర్శి, అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, డిజిటల్ అసిస్టెంట్ల ద్వారా జవాబుదారీతనం లభిస్తోంది. గ్రామసచివాలయ వ్యవస్థ వల్ల ఇబ్బందులు తొలగిపోయాయి. -
విద్యుత్ వెలుగుల్లో అల్లూరి..
సాక్షి, పాడేరు: విప్లవ వీరుడు, మన్యం ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు విగ్రహం విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతోంది. 80వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పాడేరు కేంద్రం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు పేరుతో పాడేరును గిరిజన జిల్లాగా అవతరింపజేసిన విషయం తెలిసిందే. పాడేరు కలెక్టరేట్ ప్రారంభోత్సవం నాడు.. అప్పటి తొలి కలెక్టర్ సుమిత్ కుమార్, గౌరవ ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో ఆవిష్కరించిన అల్లూరి నిలువెత్తు విగ్రహం నేడు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. మన్యం వీరుడి త్యాగాలను స్మరిస్తూ.. కలెక్టర్ టి. నిశాంతి ప్రత్యేక చొరవతో ఆ విగ్రహం, ప్రాంగణాన్ని సర్వాంగసుందరంగా అలంకరించి, వేడుకలకు సిద్ధం చేశారు. -
అడుగులు!
అల్లూరి వెంటే అల్లూరి వెంట అడుగులు.. బ్రిటీష్పై తిరుగుబాటు.. అజ్ఞాత జీవితం.. అండమాన్ జైలు.. చివరకు స్వాతంత్య్రం వచ్చినా స్వదేశానికి తిరిగి రాని ఓ మన్యం వీరుడి గాథ ఇది. ఆయనే బోనంగి పండుపడాల్. నాటి పోరాటంలో ప్రాణాలను పణంగా పెట్టిన ఆయన కుటుంబ బంధం మాత్రం నేటికీ మన్యంతో కొనసాగుతోంది. చింతపల్లి: అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటానికి ఊపిరిలూదిన మన్యం వీరుల్లో బోనంగి పండుపడాల్ ఒకరు. జిమాడుగుల మండలం భీరం గ్రామంలో జన్మించిన పండుపడాల్ అక్క జనకాని రాములమ్మ వద్దకు చేరి, ఆమె పెంచిన జనకాని లింగమ్మను వివాహం చేసుకున్నారు. అప్పటికే బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా అల్లూరి సాగిస్తున్న పోరాటానికి ఆకర్షితుడై ఆయన వెంట నడిచారు. ●అల్లూరితో కలిసి చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం పోలీస్స్టేషన్లపై జరిగిన దాడుల్లో పండుపడాల్ కీలక పాత్ర పోషించారు. అప్పటిలో కృష్ణదేవిపేటలో బ్రిటీష్ అధికారులు ఇద్దరిని అంతమొందించిన ఘటనలోనూ ఆయన ప్రధాన పాత్ర పోషించినట్లు చరిత్ర చెబుతోంది. దీంతో బ్రిటీష్ పాలకుల హిట్లిస్ట్లో చేరిన పండుపడాల్ అజ్ఞాత జీవితం గడపాల్సి వచ్చింది. ●పండుపడాల్ను పట్టుకునేందుకు బ్రిటీష్ సైన్యం ఆయన కుటుంబ సభ్యులను వేధించడంతో పరిస్థితులు విషమించాయి. చివరకు అక్క రాములమ్మ ఇంటికి విందుకు ఆహ్వానించడంతో అక్కడికి వెళ్లిన పండుపడాల్ను బ్రిటీష్ సైన్యం అరెస్టు చేసింది. 1925 మేలో ఆయనకు మరణశిక్ష విధించారు. అనంతరం 1926లో అండమాన్ జైలుకు తరలించారు. స్వాతంత్య్రం అనంతరం విడుదలైన పండుపడాల్ స్వదేశానికి తిరిగి రాకుండా అండమాన్లోనే వివాహం చేసుకుని స్థిరపడ్డారు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. 1974 ఫిబ్రవరి 17న ఆయన మృతి చెందారు. ●ఏళ్లకు ఏళ్లు గడిచినా పండుపడాల్ కుటుంబానికి మన్యంతో ఉన్న అనుబంధం మాత్రం తెగిపోలేదు. ప్రభుత్వం నియమించిన కమిటీ ద్వారా ఆయన వారసులు గొందిపాకలు గ్రామంలో ఉన్నట్లు గుర్తించి 2010లో కుటుంబ సభ్యులను కలిశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది పండుపడాల్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కుటుంబ సభ్యులు రాకపోకలు సాగిస్తున్నారు. గొందిపాకలు గ్రామానికి చెందిన ఆయన మనుమలు జనకాని రామారావు, జనకాని కనకారావు కుటుంబ సభ్యులు సైతం అండమాన్లోని పండుపడాల్ కుటుంబాన్ని కలవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. -
పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం
సాక్షి, పాడేరు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు. జిల్లా కేంద్రం పాడేరులోని తలారిసింగి క్రీడా మైదానంలో శనివారం నిర్వహించే ఈ వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆమె శుక్రవారం పరిశీలించారు. గిరిజన సంక్షేమశాఖ డీడీ పరిమళతో పాటు అన్ని శాఖల అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు. విద్యార్థుల మార్చ్పాస్ట్ ప్రాక్టీస్ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ఉదయం 9 గంటలకు కలెక్టర్ టి. నిశాంతి జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరిస్తారని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, పోలీసుల కవాతు, విద్యార్థుల మార్చ్పాస్ట్, అన్ని విద్యాలయాలకు సంబంధించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాల ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. అలాగే అన్ని శాఖల అధికారులు వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, తాగునీరు, ఇతర సౌకర్యాలతో పాటు నిరంతర విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, తలారిసింగి పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, పీడీలు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడిని తట్టుకునే పంటలే మేలు
గొందిపాకలలో రైతులకు సూచలలిస్తున్న శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ చింతపల్లి: గిరిజన రైతాంగం నీటి ఎద్దడిని తట్టుకునే ఉద్యానవన పంటలపై ఎక్కువగా దృష్టి సారించాలని ఉద్యానవన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పి. రాజశేఖర్ అన్నారు. శుక్రవారం మండలంలో ఎల్నినో ప్రభావంతో ఉద్యాన పంటలపై ప్రభావం, ఉద్యాన పంటల సమగ్ర యాజమాన్య పద్ధతులపై చేపడుతున్న ప్రత్యేక ప్రచార వారోత్సవాల సందర్భంగా గొందిపాకలు, పెదబరడ గ్రామాలలో గిరిజనులు సాగుచేస్తున్న ఉద్యాన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం వల్ల తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు గిరిజన రైతాంగం ప్రత్యామ్నాయ పంటలను సాగుపట్టాలన్నారు. ముఖ్యంగా రైతులు ఫారంపాండ్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, మల్చింగ్ పద్ధతులను పాటించాలని సూచించారు. సమగ్రంగా పురుగు, తెగుళ్ల యాజమాన్య పద్ధతులను పాటించడంతో పాటు, భూసారాన్ని బట్టి ఎరువులను వినియోగించాలన్నారు. తక్కువ కాలపరిమితి గల ఉద్యానవన పంటల సాగును చేపట్టి ఆర్థికంగా లబ్ధి పొందాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మి, వి.హెచ్.ఎ. గంగాభవాని, రామలక్ష్మి, ఆదర్శ రైతులు కుశలవుడు, కనకారావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
పాడేరు రూరల్: ఈ నెల 20, 21 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న మోటర్, ట్రాన్స్పోర్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అమర్ పిలుపునిచ్చారు. శుక్రవారం పాడేరు జిల్లా కేంద్రంలో మోటర్ యూనియన్ నాయకులతో కలిసి మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మోటర్ కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఆటో, మోటర్ ట్రాన్స్పోర్టు కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. ’వాహన మిత్ర’ సాయం ఇస్తామని చెప్పి నేటికీ రెండో విడత ఇవ్వలేదని, భారీగా జరిమానాలు విధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్, జీఎస్టీ పన్నులు రద్దు చేయాలని, డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి పెన్షన్ సౌకర్యంతో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ’సీ్త్ర శక్తి’ (ఉచిత ప్రయాణ) పథకం వల్ల ఆటో, ఇతర రవాణా వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. డ్రైవర్లకు సహజ మరణానికి రూ. 5 లక్షలు, ప్రమాదంలో మరణిస్తే రూ. 10 లక్షల బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోటర్ యూనియన్ నాయకులు కొండబాబు, వెంకటరమణ, సన్యాసీరావు, సింహచలం, రామారావు, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణకు ‘నేను ఒక మొక్క’
మొక్కలు నాటిస్తున్న రేంజర్ అప్పారావు,హెచ్ఎం వరలక్ష్మి చింతపల్లి: పర్యావరణాన్ని పెంపొందించేందుకు ’నేను ఒక మొక్క’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు స్థానిక రేంజ్ అధికారి బి. అప్పారావు అన్నారు. శుక్రవారం డివిజనల్ ఫారెస్టు అధికారి వై. నరసింహిరావు ఆదేశాల మేరకు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గిడ్డి వరలక్ష్మి, అటవీ సిబ్బంది జ్యోతి, సుమిత్ర, దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
విశాఖలో నాగచైతన్య
కొమ్మాది: సినీ తారల రాకతో విశాఖలో శుక్రవారం సందడి నెలకొంది. నగరంలో శనివారం జరగనున్న సినిమా షూటింగ్ల కోసం సినీ హీరో అక్కినేని నాగచైతన్య, ఆయన భార్య శోభిత శుక్రవారం విశాఖకు వచ్చారు. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న వారు అనంతరం నగరంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం కై లాసగిరి, యారాడ బీచ్ ప్రాంతాల్లో జరగనున్న షూటింగ్లో నాగచైతన్య పాల్గొననున్నారు. మీనాక్షి చౌదరి రాక ప్రముఖ నటి మీనాక్షి చౌదరి కూడా షూటింగ్ నిమిత్తం శుక్రవారం నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా బీచ్ రోడ్డులోని నోవోటెల్ హోటల్కు వెళ్లి అక్కడ బస చేశారు. అలాగే దర్శకుడు తేజ కూడా తన నూతన సినిమా షూటింగ్ నిమిత్తం నగరానికి వచ్చారు. -
తాగునీటి సమస్య పరిష్కరించండి
కుళాయి వద్ద మంచినీటి కోసం అవస్థలు పడుతున్న గిరిజనులు జి.మాడుగుల: మండల కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ టవర్ కాలనీ ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు తీవ్ర మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంత పరిసరాల్లో 10 కుటుంబాలకు చెందిన సుమారు 40 మంది గిరిజన ప్రజలు జీవిస్తున్నారు. ఆ వీధిలో కేవలం ఒక్కటే నీటి కుళాయి ఉండటంతో, తాగునీటి కోసం స్థానికులు ఖాళీ బిందెలతో క్యూ కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రజావసరాలకు తగినట్లుగా నీటి కుళాయిలు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర తాగునీటి ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోనే ఇంతటి తీవ్ర నీటి సమస్య ఉంటే సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికై నా బీఎస్ఎన్ఎల్ టవర్ వీధిలో అదనపు మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేసి, తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని వారు కోరుతున్నారు. -
వాడవాడలా హర్ ఘర్ తిరంగా
గూడెంకొత్తవీధి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడెంలో శుక్రవారం సీఆర్పీఎఫ్ జీ/23 బెటాలియన్ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై కొంతదూరం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రాధాన్యాన్ని వివరిస్తూ, దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. పెదబయలు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఎగురవేయాలని పెదబయలు 198 బెటాలియన్ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్స్టేషన్ నుంచి అంబేడ్కర్ కూడలి మీదుగా స్టేట్ బ్యాంకు వరకు విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలను చేతబూని ర్యాలీ చేపట్టారు. ఇళ్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. విద్యార్థి దశ నుంచే దేశభక్తి భావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, సెంటాన్స్ ఇంగ్లిష్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ముంచంగిపుట్టులో హార్ ఘర్ తిరంగా ర్యాలీ.. ముంచంగిపుట్టు : మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక 198 బెటాలియన్ సీఆర్పీఎఫ్ బలగాలు హార్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించాయి. అసిస్టెంట్ కమాండెంట్ ముఖేష్కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో సిఆర్పిఎఫ్ జవాన్లు, పోలీసులు, స్థానికులు పోలీసు స్టేషన్ నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదగా జెడ్పీ అతిథి గృహం వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్ఫీఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేష్కుమార్, ఎస్ఐ నాని, సీఆర్పీఎఫ్ ఎస్ఐ వీవీ దొర, పోలీసులు పాల్గొన్నారు. సీలేరు: స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసి దేశ గౌరవాన్ని కాపాడాలని సీలేరు సీఆర్పీఎఫ్ ఎఫ్/42 బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ టి. అశోక్ అన్నారు. కులమతాలకు అతీతంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం పోలీస్స్టేషన్ ఆవరణలో బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో వందే మాతరం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇన్స్పెక్టర్ కృష్ణన్, ఏఎస్ఐ కె.వి. శివయ్య, ఎస్ఐ ఎం.డి. యాసీన్తో పాటు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
డ్రగ్స్తో భవిష్యత్తు నాశనం
అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఐలు లక్ష్మణరావు, విజయ్కుమార్ ముంచంగిపుట్టు : డ్రగ్స్తో భవిష్యత్తు నాశనం అవుతుందని జి.మాడుగుల సీఐ ఎస్.లక్ష్మణరావు అన్నారు.మండల కేంద్రంలో శుక్రవారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారిపై అందరూ వ్యతిరేక పోరాటాలు చేయాలని, యూనివర్సిటీ నుంచి కాలేజీ వరకు ప్రాకిన డ్రగ్స్ వాడకం నేడు స్కూల్ స్థాయి వరకు రావడం దారుణమని అన్నారు. తల్లిదండ్రులు ప్రతి రోజు పిల్లల నడవడికపై దృష్టి పెట్టాలని,మంచి చేడు మధ్య భేదాలను తెలియజేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాని.పోలీసులు,స్థానికులు పాల్గోన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి హుకుంపేట: యువత గంజాయి, మద్యపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ విజయ్కుమార్ సూచించారు. శుక్రవారం మండలంలోని సూకురు ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలను ఆయన సందర్శించారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో యువత చెడు అలవాట్లకు బానిసై ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎస్ఐ దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఈ క్రాప్ నమోదు తప్పనిసరి
● ఏవో మధుసూదనరావురైతులకు సూచనలిస్తున్న ఏవో మధుసూదనరావు చింతపల్లి: గిరిజన రైతాంగం విధిగా ఈ–క్రాప్ నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి టి. మధుసూదనరావు అన్నారు. శుక్రవారం చౌడుపల్లి పంచాయతీ పరిధిలోని బైలుకించంగి గ్రామంలో రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఈ–క్రాప్ నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వం నుంచి అందే రాయితీలను పొందే అవకాశం ఉంటుందన్నారు. శనివారంతో గడువు ముగుస్తుందని, రైతులు ఈ ఒక్కరోజులోగా ఈ–క్రాప్ నమోదు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వి.హెచ్.ఎ. పరమేష్, రైతులు పాల్గొన్నారు. -
50 కిలోల గంజాయి స్వాధీనం
జి.మాడుగుల: మైదాన ప్రాంతాలకు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి, రెండు స్కూటర్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయిరాం పడాల్ శుక్రవారం అందించిన వివరాల ప్రకారం..తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 9 మంది కలిసి స్కూటర్లు, ఆటోపై 50 కిలోల ఎండు గంజాయిని తరలిస్తుండగా, పోలీసులు వారిలో 7 గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 50 కిలోల గంజాయి, రెండు స్కూటర్లు, ఒక ఆటో, 6 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన నిందితుల్లో రాష్ట్రానికి చెందిన 5 గురు, తమిళనాడుకు చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఒకరు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సీఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయిరాం పడాల్ తెలిపారు. -
ఏయూకి ఎన్బీఏ షాక్!
విశాఖ విద్య: శతాబ్ద ఘన చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్టను పాలకులే మంటగలుపుతున్నారు. విద్యా ప్రమాణాలను గాలికొదిలేసి.. బాధ్యతారాహిత్యంగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఏయూ పరువును బజారుకీడిస్తున్నారు. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను, సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) లోగోను వాడుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఏయూ వ్యవహారశైలిపై చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మోసపూరిత వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తక్షణమే ఆ తప్పుడు ప్రచారాన్ని తొలగించాలంటూ ఏయూ పాలకులకు ఎన్బీఏ యాజమాన్యం.. గట్టి మొట్టికాయలు వేసింది. ఫిర్యాదుతో వెలుగులోకి.. ఆంధ్రా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో ఎన్బీఏ అక్రిడిటేషన్కు సంబంధించి తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ గతనెల 17వ తేదీన ఎన్బీఏ మెంబర్ సెక్రటరీకి లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. దీనిపై తక్షణమే స్పందించిన బోర్డు అధికారులు, వర్సిటీ అధికారిక వెబ్సైట్ను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించారు. నాడు కమిటీలకు ‘నజరానాలు’? నాణ్యతా ప్రమాణాలు, మౌలిక వసతులు, ఫ్యాకల్టీ కొరతను మెరుగుపరచడం ద్వారా అధికారిక గుర్తింపులు సాధించాల్సిన ఏయూ పాలకవర్గం అడ్డదారులు తొక్కడం కొత్తేమీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విశ్వవిద్యాలయానికి తనిఖీల నిమిత్తం వచ్చిన అధికారిక కమిటీ ప్రతినిధులకు గిఫ్ట్ ప్యాకెట్లు ఆఫర్ చేసిన వ్యవహారం తీవ్ర దుమారం రేగింది. ఆ వివాదం విద్యా వర్గాల్లో యూనివర్సిటీ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా దేశవ్యాప్తంగా ఏయూ పరువును తీసింది. ఆ చేదు అనుభవాల నుంచి ఏమాత్రం పాఠాలు నేర్వని పాలకులు, ఇప్పుడు సరికొత్త మోసపూరిత ప్రచారానికి తెరలేపారు. లోగోను తక్షణమే తొలగించాలని ఆదేశం ఈ తీవ్ర నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్బీఏ యాజమాన్యం.. వర్సిటీ అధికారిక వెబ్సైట్తో పాటు ప్రకటనలు, లెటర్హెడ్లు, బిల్బోర్డులు, ఇతర ప్రచార సామగ్రి నుంచి ఎన్బీఏ లోగోను, అసంపూర్తిగా ఉంటూ తప్పుదోవ పట్టించేలా ఉన్న సమాచారాన్ని తక్షణమే తొలగించాలని ఆంధ్రా యూనివర్సిటీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకప్పుడు పరిశోధనలు, విద్యా ప్రమాణాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిన విశ్వవిద్యాలయం.. ఇలాంటి చీప్ ట్రిక్స్తో, గిఫ్టుల వివాదాలతో జాతీయ స్థాయి నియంత్రణ మండళ్ల నుంచి చీవాట్లు తినడం వర్సిటీ పూర్వ విద్యార్థులు, అధ్యాపక వర్గాలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. అనుమతి లేని లోగో ఏయూ వెబ్సైట్లో ఎన్బీఏ లోగోను ప్రదర్శిస్తున్నప్పటికీ, అసలు ఏ ప్రోగ్రామ్ లేదా కోర్సుకు గుర్తింపు లభించింది? దాని స్థాయి ఏమిటి? ఆ గుర్తింపు ఏ కాలపరిమితి వరకు అమల్లో ఉంది? అనే కనీస వివరాలను ఎక్కడా పేర్కొనలేదని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, ఎన్బీఏ నిబంధనావళి ప్రకారం ఏ విద్యాసంస్థ కూడా బోర్డు అధికారిక లోగోను తమ వెబ్సైట్లు, లెటర్హెడ్లు, అధికారిక ప్రకటనలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు లేదా ప్రచార సామగ్రిపై ముద్రించడానికి ఎలాంటి అనుమతి లేదని తేల్చిచెప్పింది. -
చదువుకోసం వెళ్లి.. కానరాని లోకాలకు..
సీలేరు: కొడుకు అండగా నిలుస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీలేరుకు చెందిన ఇంటర్ విద్యార్థి దమ్ము జీవన్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన దమ్ము సురేష్, ధనలక్ష్మి దంపతుల కుమారుడు జీవన్ పదో తరగతి పూర్తిచేసిన అనంతరం ఇంటర్ చదువుల కోసం విశాఖపట్నంలోని బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. గురువారం పెందుర్తిలో బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జీవన్ను విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. దమ్ము సురేష్ సీలేరులో కార్పెంటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలన్న తపనతో కుమారుడు జీవన్ను విశాఖపట్నంలో ఇంటర్ చదివిస్తున్నారు. ఈ క్రమంలో కుమారుడు అకాల మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. -
మల్బరీ సాగుతో ఆర్థికాభివృద్ధి
చింతపల్లి: గిరిజన రైతాంగం పట్టుపరిశ్రమ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా పట్టుపరిశ్రమ శాఖ అధికారి రవీంద్ర ప్రసాద్ సూచించారు. గురువారం మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో మల్బరి సాగు చేస్తున్న రైతులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన రైతులు మల్బరి సాగు చేపట్టేందుకు అవసరమైన వివిధ పథకాలను ప్రభుత్వం 90 శాతం రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. రూ.45 వేల విలువైన నారు మొక్కలు, రూ.3.25 లక్షల విలువైన షెడ్ల నిర్మాణం, రూ.50 వేల విలువైన పరికరాలు, రూ.5 వేల విలువైన పట్టుపురుగులు, రోగనిరోధక మందులు, రూ.లక్ష విలువైన పవర్ టిల్లర్, వీడర్, బ్రష్ కట్టర్, స్ప్రేయర్, కత్తెరలు తదితరాలను 90 శాతం రాయితీపై గిరిజన రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో పట్టుగూళ్లకు కిలోకు రూ.400 నుంచి రూ.500 వరకు ధర లభిస్తోందని తెలిపారు. మంచి గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని గిరిజన రైతులు మల్బరి సాగు విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు. ప్రతి రైతు మల్బరి సాగుపై దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర పట్టుపరిశ్రమల బోర్డు శాస్త్రవేత్త డాక్టర్ నీలకంఠ రాజ్రుషి మల్బరి సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, పంట సంరక్షణ, వ్యాధుల నివారణ తదితర అంశాలపై రైతు లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్వోలు సన్యాసిరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మేడూరులో రైతులతో మాట్లాడుతున్న జిల్లా పట్టుపరిశ్రమశాఖ అధికారి రవీంద్ర ప్రసాద్ మల్బరి సాగుపై సూచనలు ఇస్తున్న జిల్లా అధికారి రవీంద్ర ప్రసాద్, శాస్త్రవేత్త రాజ్రుషి -
మత్స్యపురం టీచర్ సత్యారావుకు అరుదైన అవకాశం
● ఫిన్లాండ్లో ఎఫ్ఎల్ఎన్ శిక్షణకు ఎంపిక ● పలువురి అభినందన హుకుంపేట: మారుమూల ప్రాంతంలోని మత్స్యపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న మోస్య సత్యారావుకు అరుదైన అవకాశం దక్కింది. ఫిన్లాండ్లో జరిగే విద్యా శిక్షణ కార్యక్రమానికి ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు ఫిన్లాండ్లోని తుర్కు యూనివర్సిటీలో నిర్వహించనున్న ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమంలో సత్యారావు పాల్గొననున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల్లో 29 మందిని ఈ శిక్షణకు ఎంపిక చేయగా.. వారిలో సత్యారావు అవకాశం దక్కింది. గతేడాది సెప్టెంబర్ 5న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సత్యారావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. జిల్లాలో మారుమూల ప్రాంతం నుంచి అంతర్జాతీయ విద్యా అధ్యయన పర్యటనకు ఎంపిక కావడంపై జిల్లా విద్యాశాఖ అధికారి భానుమూర్తిరాజు, ఉప విద్యాశాఖ అధికారి సోమేలి చెల్లయ్య, స్థానిక ఎంఈవో ఈశ్వరరావు ఆయనను అభినందించారు. -
గురుకుల విద్యార్థులను వెనక్కి పంపొద్దు
పాడేరు: విశాఖపట్నం జిల్లా మారిలవలస గిరిజన గురుకుల విద్యా సంస్థలో 5, 6, 7 తరగతులు చదువుతున్న విద్యార్థులను వెనక్కి పంపాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకుని, విద్యార్థులను యథావిధిగా అక్కడే కొనసాగించాలని ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కుడా రాధాకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక ఐటీడీఏ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు చేపడుతున్న రిలే దీక్షలు గురువారం మూడో రోజుకు చేరుకున్నాయి. మూడో రోజు రాధాకృష్ణ దీక్షల్లో కూర్చొని తల్లిదండ్రులకు మద్దతు తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు పేరుతో పాఠశాలలో 5, 6, 7 తరగతులు చదువుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన సుమారు 270 మంది విద్యార్థులను అర్ధాంతరంగా వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించడం సరికాదన్నారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు గత కొన్నిరోజులుగా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓలను కలిసి వినతిపత్రాలు అందజేసి సమస్యను వివరించినా ఇప్పటివరకు స్పందన లేకపోవడం విచారకరమన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని గిరిజన కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్తు కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే అధికారులు స్పందించి విద్యార్థులను అక్కడే యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని రాధాకృష్ణ హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగుల సంఘం జిల్లా నాయకులు భాను, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పాడేరులో ఘనంగా తిరంగా ర్యాలీ
జాతీయ పతాకంతో హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు (ఇన్సెట్) పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, అడిషనల్ ఏస్పీ శృతి, ఇతర అధికారులు పాడేరు: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంట్లో, ప్రతి కార్యాలయంలో, ప్రతి విద్యాసంస్థలో, వాడవాడలా జాతీయ జెండా రెపరెపలాడాలని జిల్లా కలెక్టర్ నిశాంతి పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం పాడేరు పట్టణంలో ’‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమాహాల్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్, అంబేడ్కర్ ద్కర్ సెంటర్ వరకు అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు జాతీయ పతాకాలతో హర్ ఘర్ తిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై, ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా.. అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు. పాత బస్టాండ్ వద్ద వారంతా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ దేశాభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదన్నారు. ప్రతి పౌరుడి భాగస్వామ్యం, సమష్ట్టి కృషి ఎంతో అవసరమన్నారు. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతగా వ్యవహరించాలని ఆమె పిలుపు నిచ్చారు. దేశ సమగ్రత, ఐక్యత, అభివృద్ధి పట్ల ప్రజల్లో స్ఫూర్తిని పెంపొందించేందుకు తిరంగ ర్యాలీ ఎంతో దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వై. శృతి, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
డెఫ్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గంగోత్రి ప్రతిభ
● జాయింట్ కలెక్టర్ అభినందనపాడేరు రూరల్: నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ (డెఫ్)లో తెలుగు క్రీడాకారులు ఘన విజయం సాధించడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ అన్నారు. విజయవాడలో ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించిన డెఫ్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మూడో స్థానం సాధించిన క్రీడాకారిణి రాజాన గంగోత్రిని గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పోటీల్లో మూడో స్థానం సాధించడం సాధారణ విషయం కాదన్నారు. గంగోత్రి భవిష్యత్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. క్రీడలపై ఆసక్తితో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచే వారికి అన్ని విధాలా ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. -
వెలుగు తురాయి
సీలేరు సిగలో మరో ● అత్యాధునిక టెక్నాలజీతో భారీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ● 2029 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం ● ఏటా 3,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ గ్రిడ్కు! ● స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ● దివంగత వైఎస్ హయాంలోనే ప్రాజెక్ట్కు బీజం ● త్వరలో ప్రాజెక్ట్ ప్రారంభానికి ఏర్పాట్లు ● చీఫ్ ఇంజినీర్ కేవీ రాజారావు వెల్లడి సీలేరు: దేశంలోనే మరోసారి సీలేరుకు ప్రత్యేక గుర్తింపు రానుంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో తక్కువ వ్యయంతో జలవిద్యుత్ కేంద్రాలను నిర్మించి రూ.కోట్లలో ఆదాయాన్ని అందిస్తున్న సీలేరు ప్రాంతంలో తాజాగా 1,350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. సుమారు రూ.13 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు లభించాయి. ● సీలేరు సమీపంలోని పార్వతీనగర్ వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. సుమారు ఐదేళ్లుగా నిర్వహించిన సర్వేల అనంతరం శ్రీశైలం తరహాలో పంప్డ్ స్టోరేజ్కు ఈ ప్రాంతం అనుకూలమని నిపుణులు తేల్చారు. తాజాగా అటవీ అనుమతులు రావడంతో ప్రభుత్వం జీవో నంబర్ 29 ద్వారా 128.61 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించింది. దీంతో ప్రాజెక్టు పనులకు మార్గం సుగమమైంది. వృథా నీటికి.. విద్యుత్ రూపం బలిమెల జలాశయంలో ఏపీ వాటాగా ఉన్న నీటిని సీలేరు, డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ కేంద్రాల్లో వినియోగించిన అనంతరం శబరి మీదుగా గోదావరిలోకి చేరుతోంది. ఇలా ప్రతి ఏటా సముద్రంలో కలిసిపోతున్న నీటిని సద్వినియోగం చేసేందుకు గుంటవాడ జలాశయం నుంచి సొరంగ మార్గంలో పార్వతీనగర్కు తరలించి, అక్కడ 9 యూనిట్ల ద్వారా 1,350 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. అనంతరం నీటిని దిగువకు విడుదల చేసి, అవసరమైనప్పుడు రివర్స్ పంపింగ్ ద్వారా తిరిగి గుండవాడ జలాశయానికి తరలిస్తారు. యూనిట్ విద్యుత్ రూ.4కే! రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే యూనిట్ విద్యుత్ సుమారు రూ.4కే ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సీలేరు కాంప్లెక్స్లో మరింత ఉత్పత్తి ప్రస్తుతం సీలేరులో 240 మెగావాట్లు, డొంకరాయిలో 25 మెగావాట్లు, మోతుగూడెంలో 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మోతుగూడెంలో నిర్మాణంలో ఉన్న మరో రెండు యూనిట్లు పూర్తయితే అదనంగా 230 మెగావాట్ల ఉత్పత్తి అందుబాటులోకి రానుంది. దీనికి తోడు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ద్వారా మరో 1,350 మెగావాట్లు జత కానున్నాయి. ప్రారంభానికి సన్నాహాలు 2004లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేశారు. తాజాగా అన్ని అనుమతులు రావడంతో నిర్మాణ సంస్థ ఏర్పాట్లు ప్రారంభించింది. త్వరలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రాజెక్టు ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్ కేవీ రాజారావు తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టు డిజైనింగ్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనున్నారు. కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా.. విద్యుత్ గ్రిడ్లో డిమాండ్–సరఫరాను సమతుల్యం చేయడంలో కీలకంగా ఉపయోగపడేలా దీనిని రూపొందిస్తున్నారు. పూర్తిగా స్వదేశీ సాంకేతిక సహకారంతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అతిపెద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవనుంది. ● ప్రాజెక్టులో ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొమ్మిది వర్టికల్ ఫ్రాన్సిస్ రివర్సిబుల్ పంప్ టర్బైన్లు, సింక్రనైజ్డ్ మోటార్–జనరేటర్ సెట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా మొత్తం 1,350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రానుంది. దేశానికే గుర్తింపు దేశంలోనే ప్రత్యేకంగా నిలిచే విధంగా ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. 2029 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి అంకితం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేస్తాం. సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లో ఇంతటి భారీ ప్రాజెక్టు నిర్మాణం ఈ ప్రాంతానికి తలమానికంగా నిలుస్తుంది. ప్రాజెక్టు పూర్తయితే స్థానికంగా నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. – సుజయ్కుమార్, హైడల్ డైరెక్టర్ -
ఆకలి కేకలు
గిరిజన విద్యార్థులకు బోధన అందిస్తూ.. విద్యాభివృద్ధికి శ్రమిస్తున్న సీఆర్టీల కుటుంబాల్లో మాత్రం ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. నెలనెలా రావాల్సిన వేతనాలు ఆరు నెలలుగా అందకపోవడంతో రోజువారీ ఖర్చులకూ ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. వేతన బకాయిలు చెల్లించాలి ఆరు నెలలుగా ప్రభుత్వం సీఆర్టీలకు బకాయి వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సీఆర్టీల సమస్యలను ప్రభుత్వం, గిరిజన సంక్షేమశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయి వేతనాలను చెల్లించాలి. – దళపతి మోహన్, జిల్లా అధ్యక్షుడు, సీఆర్టీల సంఘం సాక్షి, పాడేరు: రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న 1,284 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు (సీఆర్టీ) వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ నుంచి సీఆర్టీల వేతనాల కోసం నిధులు విడుదల కాకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాకు సంబంధించి 284 మంది సీఆర్టీల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ● గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు రూ.44,460, ఎస్జీటీలు రూ.32,670 వేతనంతో సీఆర్టీలుగా విధులు నిర్వహిస్తున్నారు. గిరిజన విద్యాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ ప్రభుత్వం ప్రతి నెలా సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలలుగా వేతనాలు బకాయి పడటంతో కుటుంబ పోషణ భారంగా మారిందని చెబుతున్నారు. రోజువారీ ఖర్చులకూ ఇబ్బందులే ఈ ఏడాది మార్చి నుంచి వేతనాలు అందకపోవడంతో ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, నిత్యావసరాల ఖర్చులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఆర్టీలు చెబుతున్నారు. పాత అప్పులు తీర్చలేకపోగా.. కొత్త అప్పులు పుట్టని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. గత రెండు నెలలుగా పాఠశాలలు, కళాశాలల్లో తమ పిల్లల అడ్మిషన్ల ఫీజుల కోసం వడ్డీకి అప్పులు తెచ్చుకున్నామని, వాటిని తిరిగి చెల్లించేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నామని సీఆర్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం తమ వ్యక్తిగత జీవితంతో పాటు పాఠశాలల్లో విధులపైనా పడుతోందని చెబుతున్నారు. ఎస్టీ కమిషన్కు విన్నవించినా.. ఆరు నెలలుగా వేతనాలు అందని సమస్యపై సీఆర్టీ యూనియన్ నాయకులు రెండుసార్లు ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. బకాయి వేతనాలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని సీఆర్టీలు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతన బకాయిలు చెల్లించాలని వారు కోరుతున్నారు.అప్పులు పుట్టని పరిస్థితి వేతనాలు అందక సీఆర్టీ కుటుంబాలు జీవనం సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రోజువారీ నిత్యావసర ఖర్చులకు కూడా అవస్థలు తప్పడం లేదు. అప్పులు కూడా పుట్టని పరిస్థితి నెలకొంది. బకాయి వేతనాల కోసం అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోతోంది. – బాలకృష్ణ, కార్యదర్శి, సీఆర్టీ ఉపాధ్యాయ సంఘం, పాడేరు సీఆర్టీల ఆరు నెలలుగా అందని వేతనాలు భారంగా కుటుంబ పోషణ జీతాల కోసం ఎదురుచూపులు అప్పులు చేసి నెట్టుకొస్తున్న కుటుంబాలు ఇంటి అద్దెలు.. పిల్లల చదువుల ఫీజులకూ తప్పని ఆర్థిక కష్టాలు రెండుసార్లు ఎస్టీ కమిషన్కు విన్నవించినా.. పరిష్కారం కాని సమస్య 1,284 మంది సీఆర్టీలకు తప్పని వేతన వెతలు పట్టించుకోని ప్రభుత్వం -
‘పోస్టాఫీస్’ చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
సాక్షి, పాడేరు: స్థానికంగా సంచలనం సృష్టించిన తపాలా శాఖలో జరిగిన చోరీ కేసును పాడేరు పోలీసులు 24 గంటలు గడవకముందే ఛేదించారు. ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి పాడేరు తపాలా శాఖ ప్రధాన కార్యాలయంలో రూ.1.70 లక్షల నగదు చోరీకి గురైంది. 11వ తేదీ ఉదయం ఉద్యోగులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పాడేరు సీఐ రామారావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు. తపాలా శాఖ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీంతో దర్యాప్తు చేసి, నిందితుడిని గుర్తించారు. హుకుంపేటకు చెందిన పాత నేరస్తుడు కిల్లో సిద్ధు(22)ను బుధవారం అరెస్టు చేసి, రూ.1,46,560 నగదు రికవరీ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ రామారావు విలేకరులకు తెలిపారు. సిద్ధుకు గతంలో 17 కేసుల్లో ప్రమేయముందని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పాడేరు ఎస్ఐ పాపినాయుడు, క్రైమ్ సిబ్బంది, ఇతర పోలీసులను సీఐ రామారావు అభినందించారు.రూ.1.46 లక్షల రికవరీ -
తుప్పు పడుతున్న స్కూటీలు
● పట్టించుకోని దివ్యాంగుల సంక్షేమ శాఖ సాక్షి,పాడేరు: జిల్లాలోని దివ్యాంగులకు పంపిణీ చేయాల్సిన మూడు చక్రాల స్కూటీలు పాడేరు జూనియర్ కళాశాల ఆవరణలో తుప్పుపడుతున్నాయి. రెండు నెలలుగా 20 స్కూటీలు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతుండడంతో పాడవుతున్నాయి. కొన్ని భాగాలకు తుప్పు పట్టడంతో దివ్యాంగులకు పంపిణీ చేయకుండానే పాడయ్యే పరిస్థితి నెలకొంది.సురక్షిత ప్రాంతాల్లో స్కూటీలను భద్రపరచాల్సిన దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారులు కళాశాల ఆవరణలో ఆరు బయట ఉంచడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు తెలిపారు. లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఏటీఎం మోసగాడు అరెస్ట్
అనకాపల్లి టౌన్: ఏటీఎంలో సహాయం చేస్తానంటూ వృద్ధుడిని నమ్మించి ఏటీఎం కార్డు, పిన్ విరాలు సేకరించి రూ.10 వేలు కాజేసిన అంతర్ జిల్లా నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పట్టణ క్రైం ఎస్ఐ అల్లు వెంకటేశ్వరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 4న మెయిన్రోడ్ మాణిక్య లాడ్జి కింద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో 76 ఏళ్ల ఆకెళ్ల సూర్యనారాయణమూర్తి లావాదేవీ నిర్వహిస్తుండగా నిందితుడు ప్రత్తి రాజేష్ సహాయం చేస్తానని నమ్మించి, ఆయన ఏటీఎం, పిన్ వివరాలను తెలుసుకొని బాధితుడికి తెలియకుండా ఖాతా నుంచి రూ.10 వేలు విత్డ్రా చేసి పరారయ్యాడు. ఈ మేరకు బాఽధితుడు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి, గూడ్స్ రోడ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ నిందితుడిపై ఉమ్మడి విశాఖ, కాకినాడ జిల్లాలలో 12 దొంగతనం, చీటింగ్ కేసులు ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. -
ఏదీ ఎత్తిపోతల?
నాతవరం: తాండవ రిజర్వాయరు ఏలేరు కాలువ అనుసంధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో పోలవరం కాలువ నుంచి తాండవకు ఎత్తిపోతల పథకం తెస్తానంటూ అయ్యన్న పాత్రుడు హామీచ్చారు. దానికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో అయ్యన్న హామీ రైతులను మభ్యపెట్టే విధంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి తాండవ కాలువలు రూ. 65కోట్లతో సిమెంట్ లైనింగ్ పనలు చేసి రైతులకు దన్నుగా నిలిచారు. ఆయన తనయుడు వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను తలపించేలా చేసేందుకు ఏలేరు కాలువ తాండవ ప్రాజెక్టు అనుసంధానం చేసేందుకు రూ. 470 కోట్లు 5లక్షలు మంజూరు చేసి ఆయనే స్వయంగా 2022లో డిసెంబరులో నర్సీపట్నంలో అనుసంధానం పనులకు శంకుస్థాపన చేశారు. అనుసంధానానికి నిధులు మంజూరు చేయడంతో రూ.10 కోట్ల మేర పనులకు ఖర్చు చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రాజక్టు నుంచి అదనపు నీటిని ఏలేరు కాలువ ద్వారా తరలించేందుకు అదనపు భూమి సేకరించారు. మండలంలో అనుసంధానం పనులకు సంబంధించి ఏలేరు తాండవ కాలువలను రాష్ట్ర ఇరిగేషన్శాఖ ఈఎన్సీ నార్త్కోస్ట్ సీఈతో పాటు ఇతర ఇంజినీరింగ్ అధికారులు స్వయంగా పరిశీలన చేశారు. అనుసంధానం పనులకు టీడీపీకి చెందిన మాజీ ఎంపీ కె.ఎం.కె కంపెనీ సంస్థ కాంట్రాక్టరు దక్కించుకున్నారు. ఈ పనులు సకాలంలో పూర్తి చేస్తే రెండు జిల్లాల్లో వైఎస్సార్సీపీకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో పనుల్లో జాప్యం చేయడంతో సార్వత్రిక ఎన్నికలు వచ్చేసాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాండవ ఏలేరు అసునంధానం పనులు 25 శాతం కూడా పూర్తి చేయలేదంటూ రద్దు చేసింది. ఈ పనులు రద్దు పై రెండు జిల్లాల్లో రైతుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అన్న భయంతో స్పీకరు అయ్యన్నపాత్రుడు పోలవరం కాలువ నుంచి తాండవకు నీరు తెస్తానంటూ 2024 అక్టోబరులో మండల పర్యటనకు వచ్చినపుడు సభలో హామీ ఇచ్చారు. ఎత్తిపోతల పథకం నా జీవిత ఆశయమని..గొప్పగా చేప్పేశారు. పోలవరం కాలువ నీటిని తుని మండలం రేఖవానిపాలెం గ్రామం నుంచి తాండవకు తీసుకురావాలని దీనికి రూ.2400 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. నేటికీ పోలవరం తాండవ ఎత్తిపోతల పధకం ప్రతిపాదనలే ఇరిగేషన్ శాఖలో లేకపోవడం గమనార్హం. క్యాబినెట్లో ప్రస్తావన ఏదీ... రాష్ట్ర క్యాబినెట్లో రాష్ట్రంలో పలు ప్రాజెక్టులపై చర్చించి కొన్ని ప్రాంతాలకు కొత్తవి మంజూరు చేశారు. పోలవరం తాండవ ఎత్తిపోతల పథకంపై కనీసం చర్చకు రాకపోవడం విశేషం. ఖరీఫ్ సాగుకు మంగళవారం తాండవ రిజర్వాయరు నుంచి ఆయకట్టుకు గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. ఏలేరు తాండవ అనుసంధానం పనులు రద్దు చేయకుండా కొనసాగిేస్తే పనులు పూర్తి అయ్యేవని రెండు జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలు సస్యశ్యామలం అయ్యేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా పూడిక తీత పనులు ఆయకట్టుకు నీరు ప్రవహించే కాలువలో పూర్తి స్థాయిలో పూడిక తీత పనులు చేయలేదు. గత నెలలో మన్యపురట్ల తాండవ నీటి సంఘం అధ్యక్షుడు అప్పన దివాణం నిమ్మకట్టు ఆనకట్ట ప్రధాన కాలువలో ఉన్న పూడికను స్వయంగా అధికారులను తీసుకెళ్లి చూపించారు. పూడిక తీశాకే నీరు విడుదల చేస్తే నీరు ప్రవహిస్తుందని తెలిపారు. అయితే ఆ కాలువలో పూడిక నేటికీ తీయలేదు. తాండవ ప్రధానగేట్లకు రూ.లక్షలు వ్యయంతో మరమ్మతులు చేసినా లీకేజీ అరికట్టలేదు. 2024లో పోలవరం–తాండవ ఎత్తిపోతల పథకం తెస్తానంటూ సభలో హామీ ఇస్తున్న స్పీకర్ అయ్యన్న (ఫైల్) హామీ నెరవేర్చాలి.. స్పీకరు అయ్యన్నపాత్రుడు పోలవరం తాండవ ఎత్తిపోతల పథకం కోసం బహిరంగ సభలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి. మా ప్రభుత్వం హయంలో మంజూరు చేసిన ఏలేరు తాండవ అనుసంధానం పనులు రాజకీయ కక్షతో రద్దు చేశారు. అనుసంధానం పనులు సకాలంలో పూర్తి అయి ఉంటే రెండు జిల్లాల్లో వేలాది ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు ప్రవహించేది. రైతులు పడే సాగునీటి కష్టాలు తీరేవి. కూటమి ప్రభుత్వం చేస్తున్న గిమ్మిక్కులు ప్రజలు గమిస్తున్నారు. –పెట్ల ఉమా శంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే ప్రతిపాదన లేదు పోలవరం తాండవ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనలు లేదు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం తాండవ ప్రాజెక్టు పరిధిలో కాలువలో పూడికతీత మరమ్మతు పనులు చేస్తున్నాం. గతంతో పోలిస్తే ఈఏడాది బాగా చేశాం. –ఆనురాధ, డీఈ తాండవ ప్రాజెక్టు -
డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతతోనే గ్రామీణాభివృద్ధి
కలెక్టర్ నిశాంతిసాక్షి, పాడేరు: డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. కిండంగి పంచాయతీ కార్యాలయం ఆవరణలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా బుధవారం మహిళలకు డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్,డిజిటల్ చెల్లింపులు,బీమా,పెన్షన్లు తదితర ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతా కలిగి ఉండి, డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లాలో 29 బ్యాంకుల శాఖలు, 21 ఏటీఎంలున్నాయని, 2,643 మంది బిజినెస్ కరస్పాండెంట్లు పనిచేస్తున్నారని చెప్పారు. మారుమూల ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయన్నారు. జిల్లాలో 13వేల మంది రైతులకు వ్యవసాయ రుణాలు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కిండంగి,అడ్డుమండ,సంగోడి గ్రామాలు 100 శాతం డిజిటల్,ఆర్థిక సంతృప్తి గ్రామాలుగా ప్రకటన చేయడం సంతోషంగా ఉందన్నారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ ఎస్.రత్నకుమారి, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ మాధురి,ఎల్డీఎం మాతునాయుడు,అదనపు ఎంపీడీవో రమేష్,తహసీల్దార్ శ్రీనివాసరావు,సీఎఫ్ఐ కో ఆర్డినేటర్ బాలకృష్ణ,పలుశాఖల యూబీఐ మేనేజర్లు భానుశేఖర్,నారాయణరావు,మాజీ ఎంపీపీ బి.విజయరాణి పాల్గొన్నారు. ఎయిడ్స్పై అవగాహన కల్పించాలి సాక్షి,పాడేరు: రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో అవగాహన, ప్రచార కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.నిశాంతి సూచించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ టి.నిశాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఐవీ/ఎయిడ్స్ అవగాహన ప్రచార పోస్టర్లను జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మ, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. డీఆర్వో లోకేశ్వరరావు,ఆర్డీవో భుజంగరావు,వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభం తొలివిడతలో జిల్లాకు కేటాయించిన 13 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కలెక్టర్ టి.నిశాంతి బుధవారం ప్రారంభించారు.రెండవ దశలో మరో 10 వాహనాలు జిల్లాకు వస్తాయని కలెక్టర్ తెలిపారు. -
ఆటోప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
ఎస్.రాయవరం: అడ్డురోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆటోకి తగిలి గాయపడిన వ్యక్తి మృతి చెందినట్టు ఏఎస్ఐ వెంకటేశ్వరావు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి కోనవానిపాలెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కోన రాజు(38) మంగళవారం అడ్డురోడ్డు సమీపంలో ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి సడన్బ్రేక్ వేయడంతో తన ఆటోకి ముందు భాగం తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు డ్రైవర్ రాజుని నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి ఆపై కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బుధవారం కాకినాడలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్పారు. వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ చెప్పారు. -
హైపవర్ కమిటీలో ఉద్యోగులను నియమించవద్దు
సాక్షి,పాడేరు: జీవో నంబర్3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవో ప్రకటన, 1/70 చట్టం పరిరక్షణకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న హైపవర్ కమిటీలో ప్రభుత్వ ఉద్యోగులను నియమించవద్దని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, నూరుశాతం ఉద్యోగాల సాధన కమిటీ నేతలు హెచ్చరించారు. హైపవర్ కమిటీలో ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనాలు పొందుతున్న వారిని నియమిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కలెక్టరేట్లో వారు నిరసన వ్యక్తం చేశారు. సమావేశాన్ని బహిష్కరించి, కూటమి ప్రభుత్వ కుట్రలు, అధికారుల తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. అనంతరం గిరిజన సంఘం కార్యాలయంలో నూరుశాతం ఉద్యోగాల సాధన కమిటీ రాష్ట్ర సమన్వయకర్త కూడా రాధాకృష్ణ మాట్లాడుతూ జీవో నంబర్ 3 సాధన ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఆదివాసీలకు ద్రోహం చేసే చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని, ఆదివాసీ జేఏసీ నాయకులు,ఉద్యోగ సంఘాలు ప్రలోభాల వలలో పడవద్దన్నారు. ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులను హైపవర్ కమిటీలో నియమించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. జీవో నంబర్ 3 పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు కాంగు శుభ, హై మావతి, వంతాల నాగేశ్వరరావు, సత్యారావు,కిల్లో రాజారావు, వై.కుమార్, భాను, కార్తీక్ శ్రీను, పాంగి చిన్నారావు పాల్గొన్నారు.అనుకూల వ్యక్తుల నియామకంపై గిరిజన సంఘాల నిరసన -
గ్రావెల్ మాఫియా నుంచి కొండల్ని కాపాడండి
నక్కపల్లి: మండలంలో గ్రావల్ మాఫియానుంచి కొండలను కాపాడాలని వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టర్ విజయ్కృష్ణన్ను కోరారు. బుధవారం నక్కపల్లి మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేసారు. ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ వేంపాడులో పాలకొండను కొల్లగొట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు నక్కపల్లితో పాటు, చుట్టుపక్కల గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న అనధికార లేఅవుట్లకు ఈ గ్రావల్ తవ్వి తరలించేందుకు సిద్దపడుతున్నారన్నారు. పాలకొండను మరో పంచదార్ల కొండలా చేయొద్దని కోరారు. ఉద్దండపురం, బోదిగల్లంలో ఉన్న కొండలను కూడా కొల్లగొడుతున్నారన్నారు. నిత్యం వేలాది క్యూబిక్ మీటర్ల గ్రావల్ను ట్రిప్పర్లలో తరలించుకుపోతున్నారని, కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. తునికి చెందిన ఒక టీడీపీ నాయకుడికి వేంపాడు పాలకొండలో గ్రావల్ తవ్వి లేఅవుట్లోకి తరలించేందుకు ఒప్పందం కుదిరిందని వివరించారు. ఇప్పటికే కమీషన్ల పేరుతో లక్షలాది రూపాయలు చేతులు మారాయన్నారు. పాలకొండలో గ్రావల్ తవ్వకాలకు అనుమతిస్తే వైఎస్సార్సీసీ ఉమ్మడి విశాఖ జిల్లా నేతలంతా కలిసి ఉద్యమ బాటపట్టాల్సి వస్తుందన్నారు. ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో ఉన్న కొండల్లో గ్రావల్ను కూడా నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తవ్వి తరలిస్తున్నారన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీఽ అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, తళ్ల భార్గవ్ పాల్గొన్నారు. సాగునీటి వనరులు స్టీల్ప్లాంట్కు కేటాయించొద్దు మండలంలో కాగితలో చెరువులు, గెడ్డలు, వాగులను స్టీల్ప్లాంట్కు కేటాయించొద్దని గ్రామానికి చెదందిన పలువురు రైతులు కలెక్టర్ను కోరారు. వైఎస్సార్సిపి నేత వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో రైతులు బుధవారం కలెక్టర్ విజయ్కృష్ణను కలిసారు. గ్రామంలో సుమారు 17 ఎకరాల వీస్తీర్ణంలో ఉన్న ఊర చెరువు, గొల్ల చెరువు, గెడ్డలను స్టీల్ప్లాంట్కు కేటాయించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఈ చెరువుల కింద సుమారు 150 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ప్రధాన సాగునీటి వనరులను స్టీల్ప్లాంట్కు కేటాయిస్తే ఆయకట్టు భూములపై ఆధారపడ్డ వందలాది మంది రైతులు జీవనోపాధి కోల్పోతారన్నారు. భూములు సాగునీరు అందక బీడు వారతాయన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో రైతులు దేవవరపు శివ,పోతంశెట్టి బాబ్జి, గుమ్మిళ్ల గోవిందరావు,పోతంశెట్టి వీరబాబు, దేవవరపు గోవిందరావు,పోతంశెట్టి గణేష్, సకుర్తి సత్తిబాబు,గంగేశ్వరరావు ఉన్నారు.కలెక్టర్కు వైఎస్సార్సీపీ నేతల వినతి -
మా రైలు ఎప్పుడొచ్చేనో!
సమయపాలనలో గాడితప్పిన విశాఖపట్నం రైల్వే డివిజన్ 63.21 శాతంతో 62వ స్థానానికి పతనం గతంలో 80–85 శాతంతో మెరుగైన పనితీరు ప్రతి పది రైళ్లలో నాలుగు ఆలస్యమే టెర్మినల్ స్టేషన్ కావడంతో లోకో రివర్సల్తో ఇబ్బందులు గూడ్స్ రైళ్లకు ప్రాధాన్యంతో ప్రయాణికులకు తిప్పలుమాదకద్రవ్యాలకుదూరంగా ఉండాలి గూడెంకొత్తవీధి: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని చింతపల్లి డీఎస్పీ తిరుమలరావు సూచించారు. గూడెంకాలనీలో గల గురుకుల బాలికల జూనియర్ కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని చెప్పారు. సైబర్ క్రైమ్పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద మెసేజ్లను క్లిక్ చేయరాదన్నారు. బాలికలు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు. అనంతరం వాలీబాల్ కిట్ను అందజేశారు. మొదటిసారిగా మండలానికి వచ్చిన డీఎస్పీ ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లో రికార్డులను తనిఖీ చేశారు. సీఐ సుధాకర్, ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు.సాక్షి, విశాఖపట్నం: ‘ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ప్లాట్ఫారమ్పైకి రావాల్సిన రైలు నిర్ణీత సమయం కంటే కొన్ని గంటలు ఆలస్యంగా నడుస్తోంది. గమనించగలరు..’ రైల్వే స్టేషన్లలో అప్పుడప్పుడూ వినిపించే ఈ ప్రకటనలు ఇప్పుడు విశాఖపట్నం డివిజన్లో సర్వసాధారణమయ్యాయి. ఒకప్పుడు సమయపాలనలో ‘సూపర్ఫాస్ట్’గా దూసుకెళ్లిన డివిజన్.. ఇప్పుడు ‘ప్యాసింజర్’ రైలు కంటే నెమ్మదించింది. తాజాగా రైల్వే బోర్డు విడుదల చేసిన దేశవ్యాప్త రైళ్ల సమయపాలన ర్యాంకింగ్స్లో టాప్–70 డివిజన్లలో విశాఖ 62వ స్థానానికి పడిపోయింది. కేవలం 63.21 శాతం పంక్చువాలిటీ నమోదైంది. ప్రతిరోజూ రైళ్ల రాకపోకలను పర్యవేక్షించే నేషనల్ ట్రైన్ ఎంక్వయిరీ సిస్టమ్ (ఎన్టీఈఎస్) ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ను రూపొందించారు. సాధారణంగా 80–85 శాతానికి పైగా పంక్చువాలిటీతో ఉండే విశాఖ.. ఇంత తక్కువ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంటే ప్రతి పది రైళ్లలో దాదాపు నాలుగు నిర్ణీత సమయానికి చేరడం లేదన్నమాట. కళ్లు చెదిరే ఆదాయం ఆర్జించే డివిజన్.. ప్రయాణికులను సకాలంలో గమ్యానికి చేర్చడంలో ఎందుకు విఫలమవుతోంది? గూడ్స్ రైళ్లకు ఉన్న ప్రాధాన్యం ప్రయాణికుల రైళ్లకు దక్కడం లేదా? టెర్మినల్ స్టేషన్ కావడం కూడా ఇందుకు కారణమా? పొరుగు డివిజన్ల స్పీడ్.. మనకెందుకు లేదు? రాష్ట్రంలోని ఇతర డివిజన్ల పనితీరుతో పోలిస్తే విశాఖ పరిస్థితి మరింత స్పష్టమవుతుంది. గుంతకల్లు 99.33 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో ఉండగా.. గుంటూరు 94.03 శాతంతో 17, విజయవాడ 88.30 శాతంతో 26వ స్థానంలో ఉన్నాయి. విశాఖ మాత్రం 63.21 శాతంతో 62వ స్థానంలో నిలిచింది. ట్రాక్ల ఆధునీకరణ, బైపాస్ లైన్లు, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో ఇతర డివిజన్లు ముందుకు సాగుతుండగా.. విశాఖలో కీలక పనులు నత్తనడకన సాగుతుండటం వ్యత్యాసానికి ఓ కారణంగా కనిపిస్తోంది. టెర్మినల్ స్టేషన్తో తిప్పలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ టెర్మినల్ కావడంతో ఇక్కడికి వచ్చే ప్రతి రైలుకు ఇంజిన్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ లోకో రివర్సల్కు 20–30 నిమిషాల సమయం పడుతుంది. దీనికితోడు ప్లాట్ఫారమ్ల కొరత ఉంది. ఒక రైలు లోపలికి రావాలంటే మరోటి దువ్వాడ, సింహాచలం, గోపాలపట్నం ఔటర్ల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఒక్క రైలు ఆలస్యం ప్రభావం మిగిలిన సర్వీసులపైనా పడుతోంది. గూడ్స్కే పెద్దపీట? దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో సరకు రవాణా కీలక ఆదాయ వనరు. విశాఖపట్నం, గంగవరం పోర్టుల నుంచి నిత్యం భారీ సంఖ్యలో గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. పోర్టు సరకు రవాణాకు మార్గం కల్పించే క్రమంలో కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల రైళ్లను లూప్ లైన్లలో నిలిపివేయాల్సి వస్తోందనే అభిప్రాయాలున్నాయి. ప్రీమియం రైళ్లకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇక వందేభారత్ వంటి ప్రీమియం రైళ్లను నిర్ణీత సమయానికి నడిపించేందుకు ప్రాధాన్యం ఇస్తుండటంతో.. రెగ్యులర్ ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లపై ప్రభావం పడుతోందనే విమర్శలున్నాయి. వేగవంతమైన రైళ్లకు మార్గం కల్పించేందుకు ఇతర సర్వీసులను నిలిపివేయాల్సి వస్తుండటంతో ఆలస్యాల పరంపర కొనసాగుతోంది. అభివృద్ధి పనుల్లో జాప్యం రైళ్ల రద్దీకి తగ్గట్టుగా స్టేషన్ సామర్థ్యాన్ని పెంచే పనుల్లో జాప్యం కూడా సమస్యను తీవ్రం చేస్తోంది. విశాఖపట్నం స్టేషన్ రీడెవలప్మెంట్, ప్లాట్ఫారమ్ల విస్తరణ, మర్రిపాలెం, గోపాలపట్నం, సింహాచలం స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగంగా పూర్తికాకపోవడంపై విమర్శలు ఉన్నాయి. ఫలితంగా రోజుకు 5–6 రైళ్లను రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అప్పుడే పట్టాలెక్కేనా? విశాఖ డివిజన్ పనితీరు మెరుగుపడాలంటే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు థర్డ్, ఫోర్త్ లైన్ పనులను వేగవంతం చేయాలి. దువ్వాడ బైపాస్ లైన్లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. లోకో రివర్సల్తో పడుతున్న సమయభారాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించాలి. ట్రాక్లపై రద్దీని సమర్థంగా నిర్వహించగలిగితేనే.. ఒకప్పుడు సమయపాలనలో ముందున్న విశాఖ డివిజన్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందుకోగలదు. త్వరితగతిన రీసర్వే ● సర్వేశాఖ ఆర్జేడీ కుమార్ సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సర్వేశాఖ ఆర్జేడీ వి.ఎస్.ఎన్.కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు విడతలుగా సుమారు 1400 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మొదటి విడతలోని 493 గ్రామాల్లో సర్వే ప్రారంభించామని, ఇప్పటి వరకు 96 గ్రామాల్లో 24,640 ఎకరాలలో రీసర్వే పూర్తి చేశామన్నారు. రెండవ విడతలో 454, మూడవ విడతలో 450 గ్రామాల్లో రీసర్వే జరుగుతుందన్నారు. రెవెన్యూ,సర్వేయర్ల బృందాలు భూముల రీసర్వేను పారదర్శకంగా చేపట్టాలని ఆయన ఆదేశించారు.ఈ సమావేశంలో సర్వే డీడీ హరికృష్ణ.జిల్లా సర్వే అఽధికారి ఈశ్వరదొర, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.ఇన్చార్జి డీఎంహెచ్వోగా రియాజ్బైగ్ సాక్షి,పాడేరు: ఇన్చార్జి జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిగా డాక్టర్ రియాజ్ బైగ్ ను నియమిస్తూ వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డాక్టర్ కె.పద్మావతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లాలోని ఎన్పీసీబీ అండ్ వీఐ విభాగంలో డీపీఎంగా పనిచేస్తున్న ఆయనను పూర్తి అదనపు బాధ్యతలపై నియమించారు.గతంలో ఇక్కడ డీఎంహెచ్వోగా పనిచేసిన కృష్ణమూర్తినాయక్ అవినీతి ఆరోపణలపై సస్పెండయ్యారు. ఆయన స్థానంలో మొదటిగా విశాఖపట్నం ఏఎంసీలో పనిచేస్తున్న రామారెడ్డిని ఇన్చార్జి డీఎంహెచ్వోగా నియమించారు. ఆయన బాధ్యతలు స్వీకరించకుండా సెలవులో వెళ్లారు. దీంతో డాక్టర్ రియాజ్బైగ్ను నియమించారు. -
పాముకాటుకు గురైన మహిళ మృతి
చీడికాడ: పాముకాటుకు గురైన వివాహిత విశాఖ కేజిహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు మండలంలోని వరాహపురం తాజామాజీ సర్పంచ్ గొల్లవిల్లి చిన్నమ్మలు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆమె అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బాలిబోయిన ఘాఠీలు(29)ఈ నెల 8వ తేదీ రాత్రి ఇంటి బయట ఉన్న సమయంలో విష సర్పం కాటు వేసింది. ఈ విషయాన్ని ఇంట్లో నిద్రిస్తున్న భర్త అర్జునకు ఘాఠీలు చెప్పడంతో హుటాహుటినా చోడవరం సీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు అక్కడ నుంచి విశాఖ కేజిహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బుధవారం ఉదయం ఘాఠీలు ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందిదన్నారు. ఘాఠీలకు పార్ధు(12),షణ్ముకం(9),దీక్షిత(6) వయస్సు గల ముగ్గురు పిల్లలున్నారు. భర్త అర్జున ఫిర్యాదు మేరకు చీడికాడ ఎస్ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కూలి పనులు చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా నిలిచిన ఘాఠీలు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
ఓపీలకు బ్రేక్.. రోగులకు నిరీక్షణ
మహారాణిపేట: జూనియర్ వైద్యుల సమ్మెతో కేజీహెచ్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. సమ్మెలో భాగంగా బుధవారం రెండో రోజు కూడా జూనియర్ వైద్యులు ఓపీలను బహిష్కరించి, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దీంతో కేజీహెచ్లోని 26 ఓపీల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చిన రోగులు గంటల తరబడి ఓపీల వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. పీజీ వైద్యులు, జూనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పలు శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. వార్డుల్లో రోగులకు వైద్య సేవలు అందించడంలోనూ ఇబ్బందులు తలెత్తాయి. బుధ వారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ప్రారంభమైన జూనియర్ వైద్యుల నిరసన ప్రదర్శన ఆంధ్ర మెడికల్ కాలేజీ, క్యాజువాలిటీ మీదుగా తిరిగి సూపరింటెండెంట్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మహిళా జూనియర్ వైద్యులు కూడా దీక్షకు సంఘీభావం తెలిపారు. విశాఖలోని కేజీహెచ్, ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, రాణి చంద్రమణి దేవి ఆస్పత్రి, ఈఎన్టీ ఆస్పత్రి, టీబీ ఆస్పత్రుల్లోనూ సమ్మె ప్రభావం కనిపించింది. ఓపీ సేవలతోపాటు శస్త్రచికిత్సలకు కూడా అంతరాయం ఏర్పడింది. కేజీహెచ్లో రోజూ సుమారు వెయ్యి మంది పీజీ వైద్యులు, 500 మంది జూనియర్ వైద్యులు ఓపీ సేవలు అందిస్తుంటారు. వీరు సమ్మెలో ఉండటంతో బుధవారం రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆంధ్ర మెడికల్ కాలేజీ అధ్యక్షుడు దినకర్ సాయి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కె.రవీందర్, విశాఖ యూనియన్ నాయకుడు డాక్టర్ శిరాజ్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. -
గిరిజనాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
కొమ్మాది: గిరిజన విద్య, సంస్కృతి, ఉత్పత్తుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ ఆర్.బాలసుబ్రహ్మణ్యం సూచించారు. రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా మిషన్ (టీసీఆర్టీఎం) కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. సంస్థ చేపడుతున్న అభివృద్ధి, పరిశోధనా కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గిరిజన భాషల ప్రైమర్లు, చిత్రకోశాలను ఆశ్రమ పాఠశాలల లైబ్రరీల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఉపాధ్యాయులకు గిరిజన సంస్కృతిపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఏఎస్ఆర్ జిల్లాలో గిరిజన ఉత్పత్తుల బ్రాండింగ్, విలువ పెంపు కోసం ఐఐఎం విశాఖపట్నంతో కలిసి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సమిధా సింగ్, టీసీఆర్టీఎం డైరెక్టర్ రాణి మందా తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక దాడి కేసులో బాలిక తల్లి, సచివాలయ ఉద్యోగి అరెస్టు
అనకాపల్లి టౌన్: పట్టణ ప్రాంతానికి చెందిన ఓ బాలికపై లైంగిక దాడి కేసులో బాలిక తల్లితో పాటు సచివాలయ ఉద్యోగిని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ జి. ప్రేమ్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన అందించిన వివరాలివి. పట్టణంలోని ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకొని ఒక ప్రైవేట్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నట్టు అందిన సమాచారం మేరకు విచారణ జరపగా లైంగిక దాడి విషయం వెలుగు చూసిందన్నారు. కుటుంబ కలహాల కారణంగా భర్తతో విడిపోయిన ఒక మహిళకు శారదానగర్కు చెందిన ఓ సచివాలయ ఉద్యోగితో పరిచయం ఏర్పడిందన్నారు. సదరు ఉద్యోగి కూడా తన భార్యకు దూరంగా ఉంటూ బాలిక తల్లితో సహజీవనం చేస్తున్నాడని తెలిపారు. ఈ క్రమంలో డబ్బు ఆశతో బాలిక తల్లి బాలికను కూడా సచివాలయ ఉద్యోగితో బలవంతంగా లైంగిక దాడి జరిపించినట్టు దర్యాప్తు తేలిందన్నారు. ఈ మేరకు బాలిక తల్లితో పాటు సచివాలయ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని నాయస్థానం ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. ప్రస్తుతం బాధిత బాలికను వన్స్టాప్ సెంటర్కు తరలించినట్టు సీఐ తెలిపారు. -
మాచ్ఖండ్లో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు
చీఫ్ ఇంజినీర్ కేవీ రాజారావు సీలేరు: ఆంధ్ర–ఒడిశా ఉమ్మడి నిర్వహణలోని మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో సెప్టెంబర్ నాటికి అన్ని యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరిగేలా చర్యలు చేపడుతున్నామని ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్ కె.వి.రాజారావు తెలిపారు. మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం మంగళవారం సీలేరు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అగ్నిప్రమాదానికి గురైన మాచ్ఖండ్ కేంద్రంలో యూనిట్ల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 8న రెండు యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చి విద్యుదుత్పత్తి ప్రారంభించామని చెప్పారు. మూడో యూనిట్ మరమ్మతులు ఈ నెలాఖరుకు పూర్తిచేసి సెప్టెంబర్ మొదటి వారంలో, ఐదో యూనిట్ను రెండో వారంలో, నాలుగో యూనిట్ను సెప్టెంబర్ చివరి వారంలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అనంతరం ఆరో యూనిట్ పునరుద్ధరణపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రస్తుతం గ్రిడ్ డిమాండ్కు అనుగుణంగా అందుబాటులో ఉన్న నీటి వనరులతో రెండు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నామని చెప్పారు. సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి రెండు దశల్లో అనుమతులు వచ్చాయని, మిగిలిన అనుమతులు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని సీఈ తెలిపారు. ప్రాజెక్టు నిర్వాసితులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే వరకు మెగా ఇంజినీరింగ్ కంపెనీలో, అనంతరం జలవిద్యుత్ కేంద్రంలో ఒప్పంద కార్మికులుగా ఉపాధి కల్పిస్తామన్నారు. నిర్వాసితుల ఉపాధి బాధ్యతను ప్రభుత్వం, ఏపీ జెన్కో తీసుకుంటాయని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశాల మేరకు సీలేరు జలవిద్యుత్ కేంద్రం పరిసరాలను గ్రీన్బెల్ట్గా అభివృద్ధి చేసేందుకు 10 ఎకరాల్లో మొక్కలు నాటుతున్నామని తెలిపారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణంలో తొలగించే చెట్ల కొమ్మలతో మొక్కలకు రక్షణ ఏర్పాటు చేసి, వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సీఈ వెంట ఎస్సీ జాకీర్ హుస్సేన్, ఈఈ అప్పలనాయుడు, ఏడీ జైపాల్, ఏఈఈ సురేష్ ఉన్నారు. -
పోస్టాఫీసులో దొంగల బీభత్సం
సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీసుస్టేషన్కు సుమారు 150 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన పోస్టాఫీస్లో సోమవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. పాతబస్టాండ్ అంబేడ్కర్ సెంటర్లో ఉన్న పోస్టాఫీస్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు నగదు నిల్వ చేసే బాక్సులను సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటనలో రూ.1.70 లక్షల నగదు చోరీకి గురైనట్లు పోస్టల్ అధికారి సింహాచలం తెలిపారు. మంగళవారం ఉదయం పోస్టాఫీస్ తెరిచేందుకు అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకోగా తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పాడేరు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో పోలీసులు, క్లూస్టీం సిబ్బంది పోస్టాఫీసుకు చేరుకుని పరిశీలించారు. చోరీ జరిగిన నగదు బాక్సులతో పాటు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను క్లూస్టీం పరిశీలించింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ రామారావు తెలిపారు. పోలీసుస్టేషన్కు అత్యంత సమీపంలోనే పోస్టాఫీస్లో చోరీ జరగడంతో పాడేరు వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి..లోపలికి ప్రవేశించిన దొంగలు నగదు బాక్సులు ధ్వంసం..రూ.1.70 లక్షల చోరీ ఉదయం పోస్టాఫీస్ తెరిచేందుకు రాగా వెలుగులోకి ఘటన రంగంలోకి క్లూస్టీం..సీసీ కెమెరా దృశ్యాల పరిశీలన పోలీసుస్టేషన్కు సమీపంలోనే చోరీతో అవాకై ్కన పాడేరు వాసులు నిందితులను త్వరలోనే పట్టుకుంటాం: సీఐ రామారావు -
రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత
నలుగురు అరెస్టు, ఒకరు పరార్కశింకోట: కశింకోటలో పోలీసులు సుమారు రూ.30 లక్షలు విలువైన అక్రమంగా తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పట్టుకొని నలుగుర్ని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. సీఐ అల్లు స్వామినాయుడుతో కలిపి అనకాపల్లి ఇన్ఛార్జి డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ స్థానిక పోలీస్స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఇందుకు సంబంధించిన వివరాలు వివరించారు. అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు ఆటోలో ఇద్దరు బైక్ల ఎస్కార్ట్తో వెళుతుండగా అనుమానించి కశింకోట వద్ద తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. గోనె సంచుల్లో 30 ప్యాకెట్ల గంజాయిని నింపి ఆటో వెనుక ఉంచి తరలిస్తుండగా పట్టుకున్నారు. దీంతోపాటు గంజాయి తరలిస్తున్న కాకినాడకు చెందినగాడి సత్యంరాజు (28), రాజమండ్రికి చెందిన చైతన్య (34), ఒడిశాలోని కోరాపుట్కు చెందిన గుంత హిమాన్సు శేఖర్(27), కారా కేసరి(32) పోలీసులను చూసి పరార్ అవుతుండగా పట్టుకొని అరెస్టు చేశారు. మరో నిందితుడు మర్రి ఘాషి అలియాస్ రవి కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆటోతో పాటు రెండు బైకులు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలించామన్నారు. గంజాయి పట్టుకోవడంలో ఎస్ఐ లక్ష్మణరావు, చాకచక్యం ప్రదర్శించిన ఏఎస్ఐ శ్యామ్ సుందర్, హోంగార్డు డి.ఎస్ బాబుల పీసీలకు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా అభినందిస్తూ ప్రత్యేక నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందించారు. కేసులో ఎస్ఐ సతీష్, పోలీసు సిబ్బంది సహకారం అందించారు. -
మారికవలస గురుకులంలో తరగతులు కొనసాగించాలి
పాడేరు: విశాఖపట్నం జిల్లా మారికవలస గిరిజన గురుకుల పాఠశాలలో 5, 6, 7 తరగతులను యథావిధిగా కొనసాగించాలని, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులను వెనక్కి పంపే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స డిమాండ్ చేశారు. ఐటీడీఏ కార్యాలయం ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు చేపడుతున్న రిలే దీక్షలను మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేస్తున్నామనే కారణంతో పాఠశాలలో చదువుతున్న 5, 6, 7 తరగతుల విద్యార్థులను అర్ధంతరంగా వెనక్కి వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు. గిరిజన విద్యార్థులను ప్రాథమిక విద్యకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మారికవలసలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు అవసరమైన భవనాలు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులను వెళ్లిపోవాలని చెప్పడం సమంజసం కాదన్నారు. గిరిజన విద్యార్థుల విద్యా హక్కును జిల్లా ఉన్నతాధికారులు కాపాడాలని కోరారు. విద్యార్థులను వేరే ప్రాంతానికి తరలించాలని జారీ చేసిన జీఓ నంబర్ 69ను తక్షణమే ఉపసంహరించుకుని, వారిని అదే పాఠశాలలో యథావిధిగా కొనసాగిస్తూ మెరుగైన విద్య అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మూల్ నివాస్ సంఘం రాష్ట్ర నాయకులు కేవై కుమార్, విద్యా కమిటీ చైర్మన్ రాజేష్, నాయకులు రాజేష్, భారతీ, త్రినాథ్, వి.రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స -
కొత్త సాఫ్ట్వేర్తో అదనపు భారం
విద్యుత్ వినియోగదారుల ఆందోళననర్సీపట్నం: విద్యుత్ మీటర్ల రీడింగ్ నమోదుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జియో ఫెన్సింగ్ విధానం వినియోగదారులకు గుదిబండగా మారింది. సకాలంలో మీటర్ల రీడింగ్ నమోదు ప్రక్రియ పూర్తికాకపోవడంతో స్లాబ్ రేట్ పెరిగి వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈపీడీసీఎల్ అధికారులు సరైన సాంకేతిక అవగాహన, పర్యవేక్షణ లేకుండా రీడింగ్ నమోదు చేసే మిషన్లలో జియో ఫెన్సింగ్(జీపీఆర్ఎస్) సాఫ్ట్వేర్ను అప్లోడ్ చేశారు. రీడింగ్ సిబ్బంది స్వయంగా విద్యుత్ మీటర్ వద్దకు వెళ్తేనే తప్ప రీడింగ్ రాదు. మీటర్ల రీడింగ్ నమోదులో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా జియోఫెన్సింగ్ సాఫ్ట్వేర్ను తీసుకొచ్చారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాలకు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడంతో సాఫ్ట్వేర్ సక్రమంగా పని చేయటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నెలా 12వ తేదీలోపు మీటర్ రీడింగులు నమోదు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. కొత్త సాఫ్ట్వేర్ సక్రమంగా పని చేయకపోవటం వల్ల 50 శాతం కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది. సిబ్బంది మీటర్ వద్దకు వెళ్లినప్పటికీ రీడింగ్ నమోదు కాకపోవడంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. సకాలంలో మీటర్ల రీడింగ్ నమోదు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో స్లాబ్ రేట్ పెరిగి అదనపు ఆర్థిక భారం పడుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఎలక్ట్రికల్ ఏఈఈ త్రినాథరావును వివరణ కోరగా, కొత్త సాఫ్ట్వేర్ వల్ల మొదటిలో సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటాయి. సకాలంలో రీడింగ్ నమోదు కానందున వినియోగదారులపై భారం పడకుండా వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. -
14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత విద్య
మాకవరపాలెం: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టంపై మంగళవారం స్థానిక కేజీబీవీలో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎం.రమేష్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25 శాతం సీట్లు ఇవ్వాలని, 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత విద్య, మౌలిక సదుపాయాలు కల్పించే అంశాలపై వివరించారు. రక్షణ అధికారి మనోహర్ మాట్లాడుతూ పిల్లల హక్కులకు భంగం కలిగితే 1098, 181 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. ఉపాధ్యాయులు, చైల్డ్ లైన్ కేస్ వర్కర్ శారదాదేవి, రూప పాల్గొన్నారు. -
గజ రాజసం
పొద్దున లేస్తే పావు టన్ను ఆహారం.. 150 లీటర్ల మంచి నీళ్లు! ఒక్కో గజరాజు ఏటా తిని, తాగేందుకే ఏకంగా రూ.4.30 లక్షల ఖర్చవుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు. అయినా సరే.. ఆ లెక్కలను పక్కనపెట్టి ప్రేమానురాగాలతో వాటి పొట్ట నింపుతున్నారు విశాఖ జూ అధికారులు, దాతలు. ఒకప్పుడు అడవుల్లో రాజసంగా తిరిగిన ఏనుగుల అడుగుల చప్పుడు.. కాలంతో పాటు క్రమంగా తగ్గుతోంది. ఆక్రమణల నడుమ గజరాజుల మనుగడే ప్రశ్నార్థకమవుతున్న వేళ, విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ నాలుగు ఏనుగులకు సురక్షిత అభయారణ్యంగా మారింది. నేడు ‘ప్రపంచ ఏనుగుల సంరక్షణ దినోత్సవం’ వేళ విశాఖ ‘గజ’నేస్తాల ముచ్చట ఇదీ.. ఆరిలోవ: అరణ్యాల్లో ఏనుగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. వాటి సంరక్షణ కూడా సవాలుగా మారింది. దేశంలో పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఉన్న గజరాజులు.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాటి సంఖ్య 250 లోపే ఉండటం గమనార్హం. ఇవి ఎక్కువగా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, చిత్తూ రు జిల్లాల అడవులలో సంచరిస్తున్నాయి. ఒక్కోసారి ఆహారం కోసం ఇవి గుంపులుగా పంట పొలాల్లోకి చొరబడి భయపెడుతున్నాయి. కానీ విశాఖవాసులకు మాత్రం ఈ గజరాజులు నేస్తాలుగా మారిపోయాయి. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో నాలుగు ఏనుగులు సందర్శకులను అలరిస్తున్నాయి. విశాఖ జూలో ప్రత్యేక సంరక్షణ విశాఖ జూ పార్కులో లక్ష్మి, సరస్వతి అనే రెండు ఆడ ఏనుగులు, కృష్ణ, రాజు అనే రెండు మగ ఏనుగులు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఇద్దరు మావటీలు, ఇద్దరు యానిమల్ కీపర్లు అందుబాటులో ఉన్నారు. మావటీలు మాట్లాడే భాషను ఏనుగులు గుర్తుపట్టి, వారు చెప్పినట్లు వింటాయి. వీటి కోసం జూలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక ‘మోట్’ ఉంది. అందులో రాత్రి వేళల్లో నిద్రించడానికి ‘నైట్ క్రాళ్లు’ నిర్మించారు. ఆరేళ్ల క్రితం వీటి స్నానం కోసం ప్రత్యేకంగా ఒక కొలనును కూడా అందుబాటులోకి తెచ్చారు. ఏదైనా అనారోగ్యం వస్తే జూ వెటర్నరీ వైద్యులు మావటీల సమక్షంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. నలుగురిలో ప్రత్యేకంగా ‘కృష్ణ’ ● జూలో ఉన్న ఏనుగులలో 48 ఏళ్ల వయసు గల ‘కృష్ణ’ సుమారు 39 ఏళ్లుగా ఇక్కడే పెరుగుతోంది. అయితే ఇది ఒక్కోసారి మతిస్థిమితం కోల్పోయి మావటీల మాట కూడా వినదు. అందుబాటులో ఉన్న రాళ్లను తొండంతో తీసి విసురుతుంటుంది. అందుకే దీనిని సందర్శకులకు దూరంగా నైట్ క్రాల్కే పరిమితం చేసి సంరక్షిస్తున్నారు. ● 26 ఏళ్ల ‘రాజు’ అనే మగ ఏనుగును 2015 మే నెలలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, మక్కువ అడవుల నుంచి పట్టుకుని జూకి తరలించారు. ● 61 ఏళ్ల సరస్వతి, దాని పిల్ల 25 ఏళ్ల లక్ష్మిలను చిత్తూరులోని కుప్పం ఏనుగుల క్యాంప్ నుంచి తీసుకొచ్చారు. ఇవి సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి. రోజుకి 265 కిలోల ‘ఆహార’ విందు! జూలో ఒక్కో ఏనుగుకు రోజుకి సుమారు 265 కిలోల వివిధ రకాల ఆహార పదార్థాలను ఇస్తారు. అలాగే రోజుకు కనీసం 150 లీటర్ల నీరు తాగుతాయి. ఒక్కో ఏనుగు రోజువారీ మెనూ.. అరటి దవ్వ 125 కిలోలు పచ్చి గడ్డి 75 కిలోలు చెరకు 40 కిలోలు పుచ్చకాయ 10 కిలోలు రాగి తోప 6 కిలోలు క్యాటిల్ ఫీడ్ 4 కిలోలు అరటి పండ్లు 6 కిలోలు ఆకుకూరలు 4 కిలోలు కొబ్బరికాయలు 2 బెల్లం పావు కిలో (తవుడు, ఇతర పదార్థాలతో కలిపి) ఉదయం నుంచి సాయంత్రం వరకు విడతల వారీగా ఈ ఆహారాన్ని అందిస్తారు. జూలో అన్ని జంతువుల కంటే ఏనుగుల పోషణకే అత్యధికంగా ఖర్చవుతుంది. ఒక్కో ఏనుగు ఆహారం, పోషణ నిమిత్తం ఏడాదికి రూ.4.30 లక్షలు ఖర్చవుతోంది. ఇది పెద్ద మొత్తం కావడంతో దాతలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఏనుగులను బాధ్యతగా సంరక్షిస్తున్నాం విశాఖ జూ పార్కులో ప్రతి ఏటా ఆగస్టు 12న ఏనుగుల సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించాం. ఇక్కడున్న నాలుగు ఏనుగులకు పూర్తిస్థాయి రక్షణ, వైద్య సేవలు అందిస్తున్నాం. వాటి ఆహారానికి ఎక్కువ ఖర్చవుతున్న నేపథ్యంలో దాతలు ముందుకు రావడం అభినందనీయం. మరికొందరు కూడా ఈ సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. – డాక్టర్ జి.మంగమ్మ, జూ క్యూరేటర్, విశాఖపట్నం -
‘మలేరియా’కు మందుల కొరత
మహారాణిపేట (విశాఖ): గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా మారడం, దోమలు విజృంభించడంతో గ్రామీణ, మన్యం ప్రాంతాల్లో మలేరియా కేసులు పెరుగుతున్నాయని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర ఆందోళన వ్యక్తం చేశారు. మలేరియా బాధితులకు ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని, వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన పలు సాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు గిరిబాబు, సత్యం, రమణమ్మ, ఉమాదేవి మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారిందని, ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయిందని తెలిపారు. వర్షాలు కురుస్తుండటంతో దోమలు విజృంభిస్తున్నాయని, దీంతో మలేరియా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మలేరియా బాధితులకు అవసరమైన మందులు కొన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ముందుగా గ్రామాల్లో చెత్తాచెదారం తొలగించి పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని వైద్యారోగ్య శాఖ అధికారులను కోరారు. నాణ్యమైన ఆహారం అందించాలి కేజీబీవీ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించాలని జెడ్పీటీసీ సభ్యులు ఉమాదేవి, గిరిబాబు, సత్యం కోరారు. పెదబయలు, ఇతర ప్రాంతాల్లో కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. బాధ్యులైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు. పాఠశాలల అప్గ్రేడేషన్, క్రీడా మైదానాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో ఉద్యోగులు ఆక్రమించుకున్న బీసీ హాస్టల్ భవనాలను తక్షణమే ఖాళీ చేయించి విద్యార్థుల వసతికి కేటాయించాలని అధికారులను కోరారు. అభివృద్ధి పనులపై చర్చ జల్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతున్న తాగునీటి సరఫరా పథకాలు, పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులపై సభ్యులు ప్రస్తావించిన అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సీఈవో నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్సుభద్ర ఆవేదన జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలుతీసుకోవాలని సూచన ఆమె అధ్యక్షతన పలు సాయీ సంఘాల సమావేశాలు -
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం
చింతపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ అలుపెరగని పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం స్థానిక గిరిజన భవన్లో మండల పార్టీ కార్యదర్శి పెట్ట పోతురాజు అధ్యక్షతన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, పరీక్షా వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. వీటి వల్ల ఎంతో మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానాలను అనుసరిస్తూ ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు పాల్పడి నిరుద్యోగులకు అన్యాయం చేసిందని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో జీవో నంబర్ 3పై కూటమి ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో చట్టాలను పకడ్బందీగా అమలు చేసే విధంగా బాకై ్సట్ తవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన జీవోలను వెంటనే రద్దు చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ ఆది నుంచి అలుపెరగని పోరాటం చేస్తోందని, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ రెండు వారాలుగా గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహిస్తూ గిరిజనులను చైతన్యవంతులను చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వచ్చేనెల 1న ఢిల్లీలో చేపట్టనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ.విమల, జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉల్లి సత్యనారాయణ, కూడ రాధాకృష్ణ, సూరిబాబు, సింహాచలం, రాజుబాబు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి -
వెలుగులు పంచే కార్మికులకే భద్రత కరువు!
విద్యుత్ వెలుగులు పంచుతున్న ఆ కార్మికుల జీవితాల్లో మాత్రం చీకట్లు అలుముకుంటున్నాయి. కష్టపడి పనిచేస్తే కుటుంబం గడుస్తుందన్న ఆశతో ఏళ్ల తరబడి ప్రమాదకర పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారీ పరిహారం అందించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీలేరు: రాష్ట్రానికి నిరంతరం విద్యుత్ వెలుగులు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా సంబంధిత అధికారులు నష్టపరిహారం అందించి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు కార్మిక సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటూ దశాబ్దాలుగా విద్యుత్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది, సహాయకులుగా విధుల్లో చేరిన వారితో ప్రమాదకరమైన విద్యుత్ పనులు చేయించడంతో, తగిన భద్రతా చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. మోతుగూడెంలో కార్మికుడి మృతి.. తరచూ ప్రమాదాలు.. ప్రశ్నార్థకంగా భద్రత సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని మోతుగూడెంలో మంగళవారం ముత్తయ్య అనే కాంట్రాక్ట్ కార్మికుడు ప్రమాదానికి గురై మృతి చెందాడు. 33 కేవీ విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా రావడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తోటి కార్మికులు తెలిపారు. ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని వారు ఆరోపించారు. మోతుగూడెంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో మృతుడికి రూ. 27లక్షల నష్టపరిహారం. అలాగే కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు అధికారులు హామీ ఇచ్చారు. ఆరు నెలల క్రితం గణేష్ మృతి సీలేరు జలవిద్యుత్ కేంద్రంలోని స్విచ్యార్డులో 220 కేవీ ఫీడర్, రెండో యూనిట్కు సంబంధించి సాంకేతిక మరమ్మతులు జరుగుతున్న సమయంలో గణేష్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుత్ షాక్కు గురై సుమారు 15 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయన మృతి చెందినట్లు కార్మికులు తెలిపారు. మరో కార్మికుడికి తీవ్ర గాయాలు సుమారు ఎనిమిది నెలల క్రితం మోతుగూడెంలో ఓ పనిలో భాగంగా నిచ్చెన పట్టుకుని వెళ్తున్న సమయంలో రవి అనే కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. సుమారు ఆరు నెలలపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రాణాలతో బయటపడ్డాడని కార్మికులు తెలిపారు. తుప్పలు తొలగించే క్రమంలో నిచ్చెన తగిలి సంఘటనలో కాంట్రాక్టర్ కార్మికుడు రవి తోపాటు... పలక నానాజీ.. ఎస్ రామచంద్ర మరో ఇద్దరూ కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అప్పుడు జెన్ కో సంస్థ ఎటువంటి పరిహారం ఇవ్వకపోవడంతో సంబంధిత అధికారులే డబ్బులు ఇచ్చి వైద్యం అందించారు 15 ఏళ్ల క్రితం మరో ప్రమాదం సుమారు 15 ఏళ్ల క్రితం ఇదే సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో ఓ కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుత్ స్తంభంపై నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. నడుముకు గాయమై సుమారు ఏడాది పాటు మంచానికే పరిమితమైనట్లు కార్మికులు తెలిపారు. కుటుంబానికి జీవనాధారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా.. సీలేరు డిస్ట్రిబ్యూషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సాయి అనే కాంట్రాక్ట్ కార్మికుడు ఓ ఇంట్లో విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా రేకులపై నుంచి కిందపడిపోయి నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రాణాలతో బయటపడ్డాడని కార్మికులు తెలిపారు. మాచ్ఖండ్లో.. 2019లో మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలోనూ ఇదే తరహాలో కుర్ర బాణమల్లి అనే గిరిజన కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకున్నట్లు కార్మికులు గుర్తుచేశారు. ● తగిన శిక్షణ, భద్రతా ప్రమాణాలు లేకుండా విద్యుత్ పనులు చేయించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాదకర పనులను అర్హత, శిక్షణ ఉన్న సిబ్బందితోనే చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రాణానికి రూ.10 లక్షల పరిహారమేనా? సీలేరు కాంప్లెక్స్లో ప్రమాదాల్లో మృతి చెందిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం అందించడం కంటే అసలు ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ● తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయిస్తూ కార్మికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని, వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే అనేక కుటుంబాలు జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లో కాంట్రాక్ట్ కార్మికుల భద్రతపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.విద్యుత్ వెలుగుల వెనుకచీకటి బతుకులు తగ్గిపోతున్న పర్మినెంట్ ఉద్యోగులు గతంలో జెన్కోలో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉండేది. అయితే కాలక్రమేణా ఉద్యోగుల పదవీ విరమణ, విధుల్లో ఉండగానే మరణించడం, గత 15 ఏళ్లుగా కొత్తగా నియామకాలు చేపట్టకపోవడం వంటి కారణాలతో సిబ్బంది సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని మూడు ప్రాజెక్టుల్లో సుమారు 250 మంది పర్మినెంట్ ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మరోవైపు కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, పర్మినెంట్ ఉద్యోగులు నిర్వహించాల్సిన కొన్ని పనులను కూడా కాంట్రాక్ట్ కార్మికులతో చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తగిన శిక్షణ, భద్రతా ప్రమాణాలు లేకుండా ప్రమాదకర పనులు అప్పగించడమే తరచూ ప్రమాదాలకు కారణమవుతోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంఘటనపై విచారణ చేపడతాం మోతుగూడెం లో కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోవడం బాధాకరం. కరెంట్ షాక్ తగిలి చనిపోయిన ఘటనపై రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తాం అని మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కాంటాక్ట్ కార్మికులకు భరోసా ఇచ్చినట్లు చీఫ్ ఇంజనీర్ ఏవీ రాజారావు తెలిపారు అన్స్కిల్డ్ కార్మికులతో ప్రమాదకర పనులు? ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలో సుమారు 400 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. వీరిలో పలువురు దశాబ్దాలుగా తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. తొలుత అన్స్కిల్డ్ కేటగిరీలో విధుల్లో చేరిన వారితో ప్రస్తుతం పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడంతో స్కిల్డ్ కేటగిరీకి సంబంధించిన ప్రమాదకర పనులు కూడా చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల వివరాలు మోతుగూడెం : 210 డొంకరాయి : 60 సీలేరు : 41 వేతనం : రూ.21 వేలు ప్రమాదకర పనులు.. తరచూ ప్రమాదాలు! ప్రాణాలు పోతున్నా.. పరిహారంతోనే సరి? చాలీచాలని జీతాలు..ప్రాణాలకు మాత్రం విలువ ఎంత? దశాబ్దాలుగా పనిచేస్తున్నా..భద్రతపై నిర్లక్ష్యమేనా? 400 మంది కాంట్రాక్ట్ కార్మికుల భద్రత ప్రశ్నార్థకం! ప్రమాదం జరిగినప్పుడే పరిహారం.. నివారణ చర్యలు ఎక్కడ? కుటుంబాలను రోడ్డున పడేస్తున్నవరుస ప్రమాదాలు! -
రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు ఎంపిక
నర్సీపట్నం: నర్సీపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠ శాల విద్యార్థిని సింధు జిల్లా స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ 800 మీటర్స్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ద్వితీయస్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆ విద్యార్థినిని పాఠశాల హెచ్ఎం, ఎంఈవో సిహెచ్.తలుపులు, పీడీ, ఇన్ఛార్జి హెచ్ఎం నూకరాజు, ఉపాధ్యాయు లు బద్రీనారాయణ, లక్షణరావు, ధర్మరాజు అభినందించారు. నర్సీపట్నం: రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పెదబొడ్డేపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. వీరందరినీ ప్రిన్సిపాల్ వి.వి.రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. జిల్లాస్థాయి అమరావతి చాంఫియన్షిప్ పోటీల్లో కబడ్డీ కె.ఆశోక్, ఎ.లోకేష్, వాలీబాల్ పి.ప్రసాద్, వెయిట్ లిప్టింగ్ ఎ.రోహిత్, లాంగ్జంప్ టి.జశ్వంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అద్భుతంగా రాణించిన విద్యార్థులు, తర్ఫీదు ఇచ్చిన పీడీ వినోద్ను ప్రిన్సిపాల్ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు 9 మంది ఎంపిక మాకవరపాలెం: అమరావతి ఛాంపియన్ షిప్ పోటీ ల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపీడీవో చాయిసుధ, ఎంఈవోలు మూర్తి, ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో మేరీజోన్స్ అభినందించారు. ఇటీవల అనకాపల్లిలో జరిగిన అమరావతి ఛాంపియన్ షిప్ లో కబ డ్డీ, వాలీబాల్, ఖోఖో, చెస్, రన్నింగ్ పోటీల్లో మాక వరపాలెం, బూరుగుపాలెం ఉన్నత పాఠశాలల నుంచి తొమ్మిది మంది విద్యార్థులు జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఎంఈవో మూర్తి మంగళవారం తెలిపారు. వీరిని ఆయనతోపాటు ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో అభినందించారు. మాకవరపాలెం: రాష్ట్రస్థాయి ఆటల పోటీలకు 32 మంది అవంతి కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ మోహనరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 8 నుంచి 10 వరకు అనకాపల్లిలో నిర్వహించిన జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారన్నారు. అయితే బాక్సింగ ఖోఖో, యోగా, బాడ్మింటన్, కబడ్డీ, వాటీబాల్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను చూపి 32 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. తిరుపతిలో జరగనున్న పోటీల్లో పాల్గొంటారని, అక్కడ కూడా ఉత్తమ ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. -
ఆశ్రమ పాఠశాలలోవిద్యార్థిపై కత్తితో దాడి
● దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షి, పాడేరు: గూడెంకొత్తవీధి మండలం మారుమూల జర్రెల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి పాంగి దుర్గపై పదో తరగతి విద్యార్థి కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. దుర్గా మెడపై తీవ్ర గాయమైంది. గాయపడిన దుర్గాను ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాల ఎదురుగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు పాఠశాలకు చేరుకున్నారు. మెడపై గాయం తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం దుర్గాను నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిపై కత్తితో దాడి ఘటనపై స్పందించిన ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి జర్రెల ఆశ్రమ పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై ఉపాధ్యాయులు గూడెంకొత్తవీధి పోలీసులకు సమాచారం అందించారు. సమగ్రంగా విచారణ చేస్తున్నామని ఎస్ఐ సురేష్ తెలిపారు. -
పలు కేసుల్లో మాజీ ఎమ్మెల్యే గణేష్కు ఊరట
నర్సీపట్నం: పలు కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ నాయకులకు ఊరట లభించింది. విశాఖ ఎయిర్పోర్టులో మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై జరిగిన కోడి కత్తితో హత్యాయత్నం ఘటనపై ఆందోళన చేయడంపై 2018లో మాజీ ఎమ్మెల్యే గణేష్, మరికొంత మందిపై నర్సీపట్నం టౌన్ పోలీసు అక్రమ కేసు పెట్టారు. అదే సంవత్సరంలో ఓటరు లిస్ట్లో ఓటర్లను తొలగించడంపై ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే అక్రమ కేసు బనాయించారు. తన వాదనలు విన్న కోర్టు ఈ రెండు కేసులను కొట్టేస్తూ తీర్పు ఇవ్వడం జరిగిందని లాయర్ మాకిరెడ్డి బుల్లిదొర తెలిపారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివ, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, పట్టణ యూత్ అధ్యక్షుడు అల్లంపల్లి ఈశ్వరరావు, సీనియర్ నాయకులు ఏకా రాజుబాబుకు ఊరట లభించింది. -
‘నీత్ ఆయోగ్’ క్షేత్ర పరిశీలన
సాక్షి, పాడేరు: నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఆర్.సుబ్రమణ్యమ్ మంగళవారం ఏజెన్సీలో పర్యటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతగిరి కాఫీ హబ్, పీహెచ్సీని సందర్శించి వైద్య సేవలు, కాఫీ అభివృద్ధి కార్యక్రమాలపై గిరిజనులతో మాట్లాడారు. అరకులోయ మండలం చొంపిలో హోంస్టేలను పరిశీలించారు. అక్కడ గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేసి, గిరిజనుల ఆచార, సంప్రదాయాలను తెలుసుకున్నారు. హుకుంపేట మండలం జామిగూడలో పీఎం జన్మన్ పథకంలో నిర్మిస్తున్న ఇళ్లను, పాడేరు మండలం గుత్తులపుట్టులో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. పాడేరు ఐటీడీఏలో ఏఐ, విలువిద్య శిక్షణ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా విల్లు ఎక్కుపెట్టి ఉత్సాహంగా గడిపారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి నీతి ఆయోగ్ కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ సమిధాసింగ్ ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఏపీవో వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై సమీక్ష కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆకాంక్షాత్మక జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఆర్. సుబ్రమణ్యమ్ కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో సాధించిన ప్రగతికి సంబంధించిన నివేదికను కలెక్టర్ నిశాంతి ఆయనకు అందజేశారు. సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వివరాలు తెలుసుకున్న సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్యమ్ -
‘పాత పెన్షన్’ కోసం 1న చలో విజయవాడ
అనకాపల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 1న నిర్వహించనున్న ‘చలో విజయవాడ’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ సీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో వాల్పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం అమలు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై.శ్రీనివాస్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్, ఫ్యాప్టో జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జి.కృష్ణ, ఏపీపీటీఏ జిల్లా అధ్యక్షుడు చల్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


