breaking news
Alluri Sitarama Raju District News
-
గిట్టుబాటు ధరేది?
● కొనుగోలు ధర ప్రకటనలో జాప్యం ● ఉలుకుపలుకూ లేని జీసీసీ ● ఐటీడీఏ మౌనం ● అయోమయంలో గిరి రైతులు కాఫీ పండ్లను సేకరిస్తున్న గిరిజన మహిళసాక్షి, పాడేరు: జిల్లాలో పాడేరు డివిజన్ పరిధిలో 1.50లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతోంది. ఏటా సుమారు 17వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజలను గిరిజన రైతులు విక్రయిస్తారు. కాఫీ గింజల కొనుగోలు ధరల ప్రకటనలో గిరిజన సహకార సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. – కాఫీ గింజల సీజన్కు ముందే జీసీసీ అపెక్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి పాచ్మెంట్, చెర్రీ రకం కాఫీ గింజల కొనుగోలు ధరలను ప్రకటించాల్సి ఉంది.అయితే నవంబర్ నెల ప్రారంభమై,గిరిజన రైతులు కాఫీ పండ్ల సేకరణ చేపడుతున్న ఇంతవరకు జీసీసీ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. గతేడాది పాచ్మెంట్ను కిలో రూ.40, చెర్రీ రకం కిలో రూ.250 చొప్పునర 752 టన్నులను మాత్రమే కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు ధరలు ప్రకటించకపోవడంతో కొనుగోలు విషయంలో ఆ సంస్థ వైఖరి కాఫీ రైతులకు అర్థం కావడం లేదు. – పాడేరు ఐటీడీఏ కూడా కాఫీ పండ్ల ఽకొనుగోలు ధరను ప్రకటించడంలో ఆలస్యం చేస్తోంది. గతేడాది కాఫీ పంటను పండ్ల దశలోనే కిలో రూ.43 ధరతో చింతపల్లి మాక్స్ సంస్థ ద్వారా ఐటీడీఏ కొనుగోలు చేసింది. సుమారు 5వేల కిలోల వరకు కాఫీ పండ్లను ఐటీడీఏ సేకరించింది.అయితే ఈ ఏడాది సీజన్ ప్రారంభమైనా కాఫీ పండ్ల ధరను ఐటీడీఏ ప్రకటించలేదు. ప్రస్తుతం సేకరించిన పండ్లను ప్రైవేట్ వ్యాపార సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఐటీడీఏ ధర ప్రకటన కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. మన్యం కాఫీ గింజలకు గిరాకీ నాణ్యతలో నంబర్ వన్గా నిలుస్తున్న మన్యం కాఫీగింజలకు బెంగళూరు కాఫీ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. గత ఏడాది మన్యం నుంచి పంపిన కాఫీ పాచ్మెంట్ గింజలకు కిలో రూ.500ధరతో వ్యాపారం జరిగింది. ఈ ఏడాది మాత్రం ఇదే ధరతో మన్యంలో జీసీసీతో పాటు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేయాలని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీలో 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. ఎకరాకు 600కిలోల మేర పండ్లు దిగుబడి వస్తుంది. వీటిని గిరిజన రైతులు అమ్మకుండా పల్పింగ్ చేసి పాచ్మెంట్ కాఫీ గింజలుగా తయారు చేసుకుంటే సుమారు 200 కిలోల దాటే మార్కెట్ చేస్తారు. గత ఏడాది కిలో రూ.400 ధరతో అమ్ముకున్న గిరిజన రైతులు ఎకరానికి రూ.80 వేల వరకు ఆదాయం పొందారు. నాణ్యమైన కాఫీ గింజల దృష్ట్యా ఈ సీజన్లో కిలో పాచ్మెంట్ రూ.500, పండ్లు కిలో రూ.100 ధరకు కొనుగోలు చేయాలని కాఫీ రైతులు డిమాండ్ చేస్తున్నారు.త్వరలో కొనుగోలు ధర ప్రకటన ఈసీజన్లో కాఫీ పంటకు గిట్టుబాటు ధర కల్పించి గిరిజన రైతులకు న్యాయం చేస్తాం. జీసీసీ అధికారులతో మాట్లాడడం జరిగింది.అపెక్స్ కమిటీ సమావేశం ఈవారంలో నిర్వహించి జీసీసీ ద్వారా పాచ్మెంట్, చెర్రీ రకం కాఫీ గింజల కొనుగోలు ధరలు ప్రకటిస్తాం.ఐటీడీఏ పండ్ల కొనుగోలు ధరపై సమావేశం నిర్వహిస్తాం. – ఏఎస్ దినేష్కుమార్, కలెక్టర్, పాడేరు కిలో రూ.500కు కొనాలి గత ఏడాది బెంగళూరు మార్కెట్లో అధిక ధరలతో జీసీసీతో పాటు అన్ని వ్యాపార సంస్థలు కాఫీ గింజలను అమ్మి మంచి లాభాలు పొందాయి. గిరిజన రైతుల వద్ద మాత్రం ప్రారంభంలో తక్కువ ధరకు కొనుగోలు చేసి మోసం చేశాయి. ఈ ఏడాది కిలో రూ.500తో పాచ్మెంట్ను జీసీసీ కొనుగోలు చేయాలి. – పాలికి లక్కు, కాఫీ రైతుల సంక్షేమ సంఘ ప్రతినిధి, పాడేరు కాఫీ పండ్లు కిలో రూ.100కు అమ్ముతాం కాఫీ పండ్లను కూడా ఐటీడీఏ,పలు రైతు ఉత్పత్తి సంఘాలు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నాం.గత సీజన్లో ఐటీడీఏ కిలో రూ.43తో పండ్లను కొనుగోలు చేయడంతో తామంతా మోసపోయాం. ఈసీజన్లో కిలో పండ్లను రూ.100 ధరతో అమ్మాలని నిర్ణయించాం. – మర్రి జ్యోతి, కాఫీ మహిళా రైతు, గుర్రగరువు, పాడేరు మండలం -
ముగిసిన ఉద్భవ్ ఉత్సవాలు
రంపచోడవరం: మారేడుమిల్లిలో మూడు రోజులపాటు నిర్వహించిన ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలల రాష్ట్ర స్థాయి కల్చరల్ అండ్ లిటరరీ ఫెస్ట్ ఉద్భవ్ –2025 ఉత్సవాలు మంగళవారం రాత్రి ముగిశాయి. మూడు రోజులపాటు జరిగిన ఈకార్యక్రమాలను గురుకుల జాయింట్ కార్యదర్శి వైవీఎస్ ప్రసాద్ పర్యవేక్షించారు. ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 28 ఏకలవ్య మోడల్ పాఠశాలల నుంచి మారేడుమిల్లిలో జరిగిన ఫెస్ట్ ఉద్భవ్ కార్యక్రమానికి 980 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. రెండు 41 రకాల విభాగాల్లో పోటీలు జరిగాయన్నారు. రాష్ట్ర స్థాయి ఛాంపియన్గా చింతూరు ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల విద్యార్థులు నిలిచారన్నారు. 41 ఈవెంట్స్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను న్యాయ నిర్ణేతల మార్కుల ఆధారంగా అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ మధుసూదనవర్మ, ఎంజీ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి చాంపియన్గా చింతూరు ఏకలవ్య విద్యార్థులు -
మత్స్యగుండంలో పీవోతిరుమణి శ్రీపూజ పూజలు
హుకుంపేట: ప్రముఖ పుణ్యక్షేత్రం మత్స్యగుండం మత్స్యలింగేశ్వర స్వామిని కార్తిక పౌర్ణమి సందర్బంగా ఐటీడీఏ పీవో, ఇంచార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ బుధవారం దర్శించుకున్నారు. ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పీవోగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా మత్స్యలింగేశ్వరస్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతతకు నిలయంగా ఉందన్నా రు. సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ సూర్యనారాయణ, సర్పంచ్ మఠం శాంతకుమారి, ఆలయ కమిటీ ప్రతినిధులు మత్స్యకొండబాబు, పాత్రుడు పాల్గొన్నారు. -
మ్యూజియం పనులు డిసెంబర్ నాటికి పూర్తి
చింతపల్లి: తాజంగిలో నిర్మిస్తున్న స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. మండలంలో బుధవారం పర్యటించిన ఆయన పీఎం జన్మన్ నిధులు రూ.78.3 లక్షలతో చేపట్టిన బెన్నవరం నుంచి బొంకమామిడి 1.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వెనక ఏపీఐఐసీ మైక్రోస్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్ ఇండస్ట్రియల్ పార్కు, ఆధ్యాత్మిక పర్యాటకం నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం చుంచుంపూడిలో ఉన్న ఈఎంఆర్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడిన ఆయన సమస్యలు తెలుసుకున్నారు. బేస్లైన్ పరీక్షలు జరగని విషయాన్ని వారు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం -
డిఫెన్స్ మద్యంతో వ్యక్తి అరెస్ట్
నర్సీపట్నం : డిఫెన్స్ మద్యం బాటిళ్లు తరలిస్తు న్న మాకవరపా లెం మండలం, వజ్రగాడ గ్రామానికి చెందిన జాజు ల సత్తిబాబు(32) ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఎకై ్సజ్ సీఐ కె.సునీల్కుమార్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తమయ్యపాలెం నుండి వజ్రగాడ వెళ్లే దారిలో తమ సిబ్బంది సత్తిబాబును అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతని వద్ద ఉన్న బ్యాగ్లో 100 పైపర్, వ్యాట్ 69 విస్కీ, బ్లెండర్ప్రైడ్ బ్రాండ్స్ కలిగిన 3 డిఫెన్స్ మద్యం సీసాలు, 10 బడ్వైజర్ టిన్ బీర్లు ఉన్నాయి. ఇతని వద్ద నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం డిఫెన్స్ క్యాంటీన్లో కొనుగోలు చేసి నర్సీపట్నం తీసుకువచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నట్టు తమ విచారణ రుజువైందని సీఐ తెలిపారు. -
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
● ముంచంగిపుట్టులో 16.3 డిగ్రీలకనిష్ట ఉష్ణోగ్రత నమోదు సాక్షి,పాడేరు: ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పొగమంచు తీవ్రత నెలకొంది. ఉదయం 8గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో వాహన చోదకులు హెడ్లైట్ల వెలుగులో వాహనాలు నడుపుతున్నారు. తెల్లవారు సమ యంలో చలిగాలులు వీస్తున్నాయి. ముంచంగిపుట్టులో కనిష్టంగా 16.3 డిగ్రీలు, అరకులోయలో 16.6, డుంబ్రిగుడలో 16.8, హుకుంపేటలో 16.8, పాడేరు మండలం మినుములూరులో 17, పెదబయలులో 17.7, చింతపల్లిలో 19 డిగ్రీల చొప్పున బుధవారం నమోదు అయ్యాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
డుంబ్రిగుడ: మండలంలోని జైపూర్ జంక్షన్ కూడలి వద్ద బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంతో గిరిజన యువకుడు డివైడర్ను ఢీకొని గాయాలు పాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పోతంగి పంచాయతీ బిజుమరవలస గ్రామానికి చెందిన కిల్లో కోగేస్(28) ద్విచక్ర వాహనంతో అరకులోయ నుంచి స్వాగ్రామంకు వస్తున్న తరుణంలో జైపూర్ జంక్షన్ కూడలి వద్ద వచ్చేసరికి వాహనం అదుపుతప్పడంతో డివైడర్ను ఢీకొని రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో అధిక రక్తస్రావంతో జాతీయ రహదారిపై పడి ఉండడంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. హుటహుటిన 108లో అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఈ విషయమై డుంబ్రిగుడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది.రోడ్డుపై రక్తపుమడుగులో పడి ఉన్న యువకుడు, ప్రమాదంలో దెబ్బతిన్న ద్విచక్రవాహనం -
శివాలయాల వద్ద పటిష్ట భద్రత
రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్రాజవొమ్మంగి: కార్తీకమాసం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అపశ్రుతులకు తావులేకుండా అన్ని విశాలయాల వద్ద పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్టు రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. బుధవారం ఆయన రాజవొమ్మంగి కొండపై కొలువైన రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. జడ్డంగిలో గుహలో కొలువైన స్వామివారిని ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. జడ్డంగి శివాలయం వద్ద మడేరు నదిలో స్నానాలకు, జలపాతం చూసేందుకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎస్ఐలు శివకుమార్, చినబాబు పాల్గొన్నారు. -
మనస్తాపంతో బాలుడి ఆత్మహత్య
పీఎంపాలెం: తల్లి మందలించిందని మనస్తాపం చెందిన ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వివరాలను పీఎంపాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 7వ వార్డులోని చంద్రంపాలేనికి చెందిన జి.మోజేస్ (16) 10వ తరగతి ఫెయిలయ్యాడు. స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు. దీంతో అతని తల్లి మంగళవారం రాత్రి బాలుడిని మందలించింది. చెడు తిరుగుళ్లు వద్దని, మంచి మార్గంలో ఉండాలని సూచించింది. దీనిని అవమానంగా భావించిన మోజేస్.. తీవ్ర మనస్తాపంతో తమ ఇంటి డాబాపై గల షెడ్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. మృతుడి తండ్రి గేదెల వెంకటరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మాతాశిశు మరణాలు తగ్గించాలి
పాడేరు : మాతా, శిశు మరణాలు సంభవించకుండా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఇంచార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నుంచి వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సికిల్సెల్ ఎనీమియా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి వ్యాధి నిర్థారణ అయితే తగిన వైద్యం అందించాలని సూచించారు. గర్భిణులకు మెరుగైన వైద్యం కల్పించాలన్నారు. పీహెచ్సీల పోర్టల్లో గర్భిణుల రిజిస్ట్రేషన్లను పూర్తి చేసి ప్రభుత్వం కల్పించిన వైద్య సదుపాయాలు తప్పనిసరిగా అందజేయాలన్నారు. గర్భధారణ ప్రారంభంలోనే అనారోగ్య సమస్యలను గుర్తించి చికిత్స అందజేయాని సూచించారు. పిల్లలలో సంభవించే గవద బిల్లలు, రుబెల్లాను గుర్తించి ఎంఎంఆర్ టీకా ఇచ్చి ప్రాణాపాయం నుంచి కాపాడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులకు మెరుగైన పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో కిశోర బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శద్ధ తీసుకోవాలని సూచించారు. సీడీపీవోలంతా క్షేత్ర పర్యటన చేసి అంగన్వాడీ కేంద్రాల్లో టీకాలు సక్రమంగా వేసేలా చూడాలన్నారు. గర్భిణులు, రోగులను అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు తరలించేందుకు ఫీడర్, 108,104 అంబులెన్స్లను 24గంటల పాటు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు గ్రామాల్లో పంచాయతీ సిబ్బందితో నిరంతరంగా ఫాగింగ్, స్ప్రేయింగ్ చేపట్టాలన్నారు. మురుగు కాలువల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. దోమతెరలను సక్రమంగా వినియోగించేలా గిరిజనులను ప్రోత్సహించాలన్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డులతో పాటు జనన ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీపడాల్, జిల్లా మలేరియా అధికారి తులసి పాల్గొన్నారు.ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవోతిరుమణి శ్రీపూజ -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నష్టం
చింతపల్లి: కూటమి ప్రభుత్వం చేపడుతున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణను బుధవారం బుధవారం మండల కేంద్రం చింతపల్లిలో పార్టీ అధ్యక్షుడు పాంగి గణబాబు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో 17 వైద్య కళాశాలలు మంజూరు చేశారన్నారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రం పాడేరులో వైద్య కళాశాలను ప్రారంభించారన్నారు. దీంతో సుదూర ప్రాంతమైన విశాఖ కేజీహెచ్కు రోగులను తరలించే సమస్య లేకుండా చేశారన్నారు. అంతేకాకుండా పేద విద్యార్థులకు వైద్య వైద్య అభ్యసించే అవకాశాన్ని కల్పించి గిరిజనులు పాలిట దేవుడయ్యాడన్నారు. అటువంటి కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్పరం చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. వైద్య కళాశాలలు ప్రైవేట్పరం కాకుండా కాపాడుకునేందుకు కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసి పోతురాజు బాలయ్య పడాల్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత, వైస్ ఎంపీపీలు శారద, జంగలరావు, చౌడుపల్లి, తమ్మెంగులు, లంబసింగి, పెదబరడ, తాజంగి, కిటుములు బలపం సర్పంచ్లు గెమ్మెలి లలిత, సలిమితి లక్ష్మయ్య, కొర్రా శాంతి, గోపాల్, మహేశ్వరి, రమణమ్మ, రమేష్ నాయుడు, ఎంపీటీసీలు జయలక్ష్మి, నాగలక్ష్మి, లువ్వాబు మీనాకుమారి, నాగమణి, మోహనరావు, పార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బూసరి కృష్ణారావు, మాజీ ఎంపీపీ మచ్చమ్మ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కవడం ఈశ్వరరావు, జల్లి హలియారాణి, వలంటీర్ల సంఘ జిల్లా కార్యదర్శి పరమేష్, వార్డు సభ్యులు బండారు అప్పలనాయుడు,బుజ్జి, పార్టీ సీనియర్ నేతలు బెన్నిబాబు, సాగిన గంగన్న పడాల్, రఘునాథ్, నూకరాజు, కరుణానిధి, సింహాచలం,మోహన్రావు పాల్గొన్నారు. అందని ద్రాక్షలా వైద్యం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆవేదన చింతపల్లిలో కోటి సంతకాల సేకరణ స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు -
హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
● ఆర్చిడ్ స్పా సెంటర్పై పోలీసుల దాడి బీచ్రోడ్డు: వీఐపీ రోడ్డు సమీపంలోని ఆర్చిడ్ వెల్నెస్ స్పా సెంటర్లో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నాయనే పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు, 3వ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ పైడయ్య తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్పా సెంటర్ ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ అసాంఘిక కార్యకలాపాల(వ్యభిచారం)ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో ఒక గదిలో ఓ విటుడు మహిళతో ఉండగా, మరో తొమ్మిది మంది మహిళలు పక్క గదిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తేలింది. వీరందరినీ వ్యభిచార కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సెంటర్లో పనిచేస్తున్న కల్లూరు పవన్ కుమార్, జానా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సెంటర్కు కాసిరెడ్డి అరుణ్ కుమార్ పేరు మీద అనుమతులు ఉండగా, థాయ్ స్పా మసాజ్ ముసుగులో డబ్బు కోసం మహిళలను లైంగిక దోపిడీకి గురిచేస్తున్నట్లు వెల్లడైంది. స్పా సెంటర్పై కేసు నమోదు చేసి, యజమానులు ఏ1గా కాసిరెడ్డి అరుణ్ కుమార్ (పరారీలో), ఏ2గా రాహుల్ (పరారీలో), సిబ్బంది ఏ3గా కల్లూరు పవన్ కుమార్, ఏ4గా జానా శ్రీనివాస, విటుడు ఏ5గా చీలి రామచంద్ర ప్రసాద్లను పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ. 7,000 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పచ్చకామెర్లతోఉపాధ్యాయిని మృతి
అనకాపల్లి టౌన్: రపభుత్వ వేధింపులతో ఒక ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయింది. పట్టణంలోని గవరపాలెంలో నివాసముంటున్న భవాని (48) మునగపాక మండలం సిరసపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎంటీఎస్ టీచర్గా పనిచేసేవారు. ఆమెను అర్ధంతరంగా అల్లూరి జిల్లా పెదబయలు మండలంలోని ఓ మారుమూల పాఠశాలకు బదిలీ చేశారు. అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆమె పచ్చకామెర్ల వ్యాధికి గురై మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. మైదాన ప్రాంతాలకు చెందిన కొంతమంది టీచర్లను ఈ ఏడాది జూన్లో అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ చేశారు. ఇలా బదిలీ అయిన భవాని ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. టీచర్లకు సరైన సదుపాయలు కల్పించకుండా బదిలీలు చేయడం వల్లే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. -
‘సహకారం’ పక్కదారి
విశాఖ సిటీ: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)కి అవినీతి మరకలు అంటుకున్నాయి. నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఇటీవల జరిగిన పదోన్నతుల వ్యవహారం బ్యాంకులో మంట పుట్టిస్తోంది. ఈ ప్రక్రియలో రూ. కోటి వరకు మామూళ్లు వసూలు చేశారన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. బ్యాంకులో అవినీతి, అక్రమాలపై ఆప్కాబ్కు ఫిర్యాదులు అందుతున్నాయి. డీసీసీబీ నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్పైనే అదే పార్టీకి చెందిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. పదోన్నతులపై దుమారం గత నెలలో డీజీఎం నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు పదోన్నతులు నిర్వహించారు. దీని కోసం పోస్టును బట్టి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కూడా పాటించలేదని బ్యాంకు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ బంధువు ఈ వసూళ్లలో కీలక పాత్ర పోషించినట్లు జనసేనకు చెందిన నేతలే ఫిర్యాదులు చేస్తుండడం గమనార్హం. నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాంకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు చేస్తుండడం విశేషం. రూ.30 లక్షలు దుర్వినియోగం? గతంలో ఈ బ్యాంకుకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పర్సనల్ ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఆ సమయంలో ఖర్చు రూ.3 వేలు మాత్రమే. నాలుగు నెలల క్రితం నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.30 లక్షలకు పైగా బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. కారు, దాని డీజిల్ పేరుతో రూ.లక్షలు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్యాంప్ ఆఫీస్లో ఫర్నీచర్ పేరుతో రూ.3 లక్షలు, రూ.1.8 లక్షలతో యాపిల్ డెస్క్టాప్, రూ.80 వేలతో కొత్త ల్యాప్టాప్ బలవంతంగా బ్యాంకు నిధుల నుంచి కొనిపించినట్లు సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. కేవలం లబ్ధిదారులు లంచాల వాటా ఇవ్వని కారణంగా డీసీసీబీ విశాఖ బ్రాంచ్లో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ పథకాన్ని (పీఎంఈజీఎస్ )అమలు చేయడాన్ని నిలిపివేసినట్లు సమాచారం. అలాగే స్టార్ హోటల్స్ నుంచి భోజనం పార్సిల్స్ను రప్పిస్తూ బిల్లులు బ్యాంకుకు పెడుతున్నట్లు చెవులు కొరుక్కుంటున్నారు. బ్యాంకు పరిధిలోని సహకార సంఘాలు అన్నింటి నుంచి నెలకు రూ.లక్ష మామూలు ఇవ్వాలని ఒత్తిడి తీసుకువస్తుండడంతో పాటు తమ బినామీలకు రూ.కోట్లలో రుణాలు మంజూరు చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఆ పార్టీ నేతలే ఫిర్యాదులు చేస్తున్నారు. రుణం పునరుద్ధరించాలంటే ఒక శాతం తక్కువ వ్యవధి రుణాలను(షార్ట్ టర్మ్ లోన్స్) తిరిగి పునరుద్ధరించే క్రమంలో రుణం మొత్తంలో ఒక శాతం కమీషన్గా తీసి పక్కన పెట్టాలని హుకుం జారీ చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆప్కాబ్ ఎండీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. బ్యాంకులో అవినీతి ఆరోపణలు, పదోన్నతుల్లో మూమూళ్ల వసూళ్లు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్, సీబీసీఐడీలతో దర్యాప్తు జరిపించి అక్రమంగా వసూలు చేసిన నిధులను తిరిగి బ్యాంకుకు రికవరీ చేయాలని కోరారు. -
ఎట్టకేలకు బస్ సర్వీసు పునరుద్ధరణ
సీలేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి సీలేరు మీదుగా తెలంగాణ రాష్ట్రం భద్రాచలం వెళ్లే ముంపు మండలాల బస్సు సర్వీసును ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు పునరుద్ధరణ చేపట్టారు. ఈ మేరకు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాస్ ప్రకటన చేశారు. జిల్లాల విభజన తర్వాత తెలంగాణ సరిహద్దు ముంపు మండలాల ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని జిల్లా కేంద్రానికి వచ్చేందుకు వీలుగా పాడేరు నుంచి సీలేరు మీదుగా భద్రాచలానికి బస్ సర్వీసును ఏర్పాటు చేసి నడిపించారు. ఫ్రీ బస్సు పథకం ప్రారంభం పది రోజులకే ఈ బస్సును నిలిపివేశారు. అప్పటి నుంచి ఈ బస్సు సర్వీసును కొనసాగించాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. దీనిపై ‘సాక్షి’లో ఈనెల మూడో తేదీన ‘ఉచిత బస్సు ప్రయాణం దూరం’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. దీంతో ఆర్టీసీ అధికారులు స్పందించి ఈనెల ఏడో తేదీ నుంచి ఈ బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అయితే గతంలో టైమింగ్ కాకుండా పాడేరులో మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి సీలేరు రాత్రి 8 గంటలకు వచ్చి భోజనం అనంతరం భద్రాచలం రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు పాడేరు చేరుకునే విధంగా టైమింగ్ మారుస్తూ బస్సును ప్రారంభించనున్నారు. రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు సీలేరు ఏటిపి ఏజెంట్ తరుణ్ తెలిపారు. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రయాణికుల హర్షం -
విద్యార్థినికి ఘన సత్కారం
నాతవరం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆటల పోటీల్లో హైస్కూల్ చెందిన విద్యార్థిని ఎ.స్నేహ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం హర్షణీయమని ప్రధానోపాధ్యాయుడు కాశపు శివరాంప్రసాద్ అన్నారు. చమ్మచింత హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఎ.స్నేహ గత నెలలో ప్రభుత్వం నిర్వహించిన పలు పోటీలలో నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ చూపింది.ఈ విద్యార్థినిని హైస్కూల్లో బుధవారం విద్యా కమిటీ చైర్మన్, హెచ్ఎం, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. రాజ్యాంగ దినోత్సవవం సందర్భంగా ఈనెల 26వ తేదీన అమరావతి అసెంబ్లీలో స్నేహ ప్రసంగిస్తుందని తెలిపారు. -
నేడు కాఫీ కార్మికుల ఆందోళన
● విజయవతం చేయాలి ● సంఘ గౌరవ అధ్యక్షుడుసుందరరావు పిలుపు పాడేరు రూరల్: జిల్లా కేంద్రంలో ఏపీఎఫ్డీసీ డీఎం కార్యాలయం ఎదుట గురువారం నిర్వహించే కాఫీ కార్మికుల ఆందోళనను విజయవంతం చేయాలని ఆ సంఘ గౌరవ అధ్యక్షుడు లింగేరి సుందరరావు కోరారు.బుధవారం ఆయన మట్లాడుతూ కాఫీ కార్మికుల హక్కులను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో కాఫీ సంస్థను పరిరక్షించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. క్రమక్రమంగా కాఫీ కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ వస్తోందని, గతంలో ఏపీఎఫ్డీలో 350 మంది వివిధ స్థాయిలో కార్మికులు పనిచేసేవారన్నారు. దీనిలో భాగంగా ప్లాంటేషన్ కండక్టర్లు 90 మంది ఉండేవారని, ఇప్పుడు నలుగురైదుగురు మాత్రే మిగిలారన్నారు. ఉద్యోగ విరమణ పొందినవారి స్థానంలో ఖాళీలను భర్తీ చేయడం లేదన్నారు. ఉన్నవారికి ఉద్యోగ భద్రత, కనీసవేనాలు కల్పించడం లేదన్నారు. ప్లాంటేషన్ కండక్టర్లు, హెల్పర్లు 25 మందితో మూడు వేల హెక్టార్లలో క్షేత్రస్థాయి పనులు చేయించి వారి శ్రమను యాజమాన్యం దోచుకుంటోందన్నారు. న్యాయసమ్మతమైన సమస్యలు పరిష్కరించాలని కార్మికులు ఆందోళనకు దిగుతున్నారని ఆయన వివరించారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
ముమ్మరంగా రికార్డుల తనిఖీమహారాణిపేట/మధురవాడ/పెదగంట్యాడ: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అవినీతి నిరోధక శాఖ దాడుల్లో భాగంగా.. నగరంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. మహారాణిపేట, మధురవాడ, పెదగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి. ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. రికార్డుల పరిశీలన : సూపర్బజార్ ఆవరణలోని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రికార్డులను ముమ్మరంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్కు సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రేషన్లలో ఉల్లంఘనలు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ల అమ్మకాల వివరాలను, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మధురవాడలో.. : మదురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ మహేశ్వరరావు ఆధ్వర్యంలోని బృందం విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇక్కడ సబ్ రిజిస్టర్ చక్రపాణి, ఇతర సిబ్బందిని వేర్వేరుగా విచారించారు. ఈ సందర్భంగా కార్యాలయంతో ఎటువంటి సంబంధం లేని నలుగురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారిని తదుపరి విచారణ కోసం విశాఖ కార్యాలయానికి తరలించారు. అయితే, అధికారులు ఈ వివరాలను గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏసీబీ సోదాల కారణంగా, రిజిస్ట్రేషన్ల కోసం ముందుగానే స్లాట్లు బుక్ చేసుకున్న వారితో సహా, వివిధ పనుల నిమిత్తం వచ్చిన కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పనులు కాకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. డాక్యుమెంట్ రైటర్లు పరార్ పెదగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రవేశించిన ఏసీబీ అధికారులు, వెంటనే కార్యాలయంలో ఉన్న కక్షిదారులను బయటకు పంపించి, అన్ని డోర్లను మూసివేశారు. సిబ్బంది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వారిని ఒక గదిలో ఉంచి తనిఖీలు చేశారు. సబ్ రిజిస్టార్ రోహన్ కుమార్ కంచరాన చాంబర్తో పాటు, టేబుళ్లు, డెస్క్లను తెరిచి రికార్డులను, కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్లను పరిశీలించారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి అడుగుపెట్టగానే, కార్యాలయం వెలుపల ఉన్న డాప్యమెంట్ రైటర్లు తమ కార్యాలయాల షటర్లను దించేసి, తాళాలు వేసి అక్కడి నుంచి పరారయ్యారు. మూడు కార్యాలయాల్లోనూ ఏకకాలంలో జరిగిన ఈ దాడులు తీవ్ర కలకలం రేపాయి. పూర్తి స్థాయి తనిఖీల అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
పుష్కరిణీ నమోస్తుతే!
సింహాచలం: కార్తీక పౌర్ణమి సాయంసంధ్య.. పవిత్ర వరాహ పుష్కరిణి.. వేలాది దీపాల కాంతులతో, భక్తజన సంద్రంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శుభ ఘడియలలో.. పవిత్ర జలరాశికి పుణ్యనదీ హారతి(గంగా హారతి) సమర్పించే అపురూప ఘట్టానికి బుధవారం సింహగిరి క్షేత్రం సాక్ష్యంగా నిలిచింది. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన కొండదిగువ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి వెంకన్న ఉత్సవమూర్తులను శేషతల్పంపై ఆశీనులను చేశారు. మంగళ వాయిద్యాల నడుమ తిరువీధిగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ సిద్ధం చేసిన దివ్య వేదికపై స్వామి కొలువుదీరగా, ఆ ప్రాంతం భక్తుల నామస్మరణతో మార్మోగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం స్వామికి ద్వయ, నక్షత్ర, కుంభ హారతులను సమర్పించగా, ఆ కర్పూర కాంతుల్లో స్వామి దివ్య రూపం మరింత దేదీప్యమానంగా ప్రకాశించింది. అనంతరం స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, ఇతర అర్చక బృందం.. పుష్కరిణి గట్టుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికల నుంచి పుష్కరిణీ నమోస్తుతే.. అంటూ వరాహ పుష్కరిణికి దివ్య నీరాజనం సమర్పించారు. ఆ హారతి వెలుగులు పవిత్ర జలంలో ప్రతిబింబిస్తుండగా, ఆ దృశ్యాన్ని కనులారా వీక్షించిన భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. అదే సమయంలో.. పుష్కరిణి గట్టున వందలాది మంది మహిళలు వెలిగించిన కార్తీక దీపాలు వెలిగించారు. కోలాటాలు, భరతనాట్య ప్రదర్శనలు, హరినామ సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత, ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కంపించిన పుడమి... ఉలిక్కిపడిన జనం
సాక్షి,పాడేరు/జి.మాడుగుల: అప్పటి వరకూ ప్రశాంతంగా నిద్రపోతున్న జి.మాడుగుల మండల వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందో తెలియక భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటలకు భూమి స్వల్పంగా కంపించడంతో కంగారు పడ్డారు. గతంలో ఏజెన్సీలో ఎన్నడూ లేని విధంగా మొదటి సారిగా జి.మాడుగుల మండలంలో భూమి కంపించడంతో ఆందోళనకు గురయ్యారు. మండల కేంద్రం జి.మాడుగులకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగర్భ, పులుసుమామిడి, గొప్పువీధి, ఉభలగరువు, జంగాలమెట్ట గ్రామాల్లో వేకువజామున భూమి అదరడంతో గిరిజనులంతా భయంతో నిద్ర లేచారు. అప్పటికే పలువురి ఇళ్లలో వంటపాత్రలు, ఇతర సామగ్రి కిందన పడ్డాయి. జంగాలమెట్ట గ్రామంలో గుంటా కొండమ్మకు చెందిన ఇంటి గోడలు కుప్పకూలగా, కొన్ని చోట్ల బీటలు వారాయి. కొండమ్మ, ఆమె కుమార్తె త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. జి.మాడుగులలో భూ ప్రకంపనలు వచ్చాయని, భూమికి 10 కిలోమీటర్ల అడుగున కంపించిందని, తీవ్రత రిక్టార్ స్కేల్పై 3.7 నమోదైందని టీవీలు, సోషల్ మీడియాలో వార్తలు రావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలు దీనిపై చర్చించుకున్నారు. లంబసింగికి వెళ్లే దారిలో వంజరి ప్రాంతంలో కూడా భూమి కంపించిందని ఆ ప్రాంతవాసులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇదే మొదటి సారి -
రాష్ట్ర స్థాయి పోటీలకుసీకరి విద్యార్థుల ఎంపిక
పెదబయలు: అండర్ 14, 17 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సీకరి పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల విశాఖలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సీకరి గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన కిల్లో రాజు అండర్–14 డిస్కస్ త్రో, షాట్ పుట్లలో ప్రథమ స్థానంలో నిచిచాడు. అండర్–17 జావెలిన్ త్రోలో కిరసాని బాబూజీ ప్రతిభ కనబరిచి, ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ నెల 8, 9 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగే రాష్ట్ర స్థాయి అండర్ 14, 17 అథ్లెటిక్స్ పోటీలకు ఈ ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను పాఠశాల హెచ్ఎం వి.చలపతిరావు, పీడీ బాలకృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు. -
నాణ్యమైన వైద్యం పేదలకు అందని ద్రాక్షే
అరకులోయటౌన్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల నాణ్యమైన వైద్యం పేదలకు అందని ద్రాక్షగానే మిగులుతుందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండలంలోని మాడగడ పంచాయతీ ఎం.హట్టగుడలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సామాన్యులకు నాణ్యమైన వైద్యం, నిరుపేద విద్యార్థులకు వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్పరం చేసేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేస్తున్నట్టు చెప్పారు. కూటమి పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేతోపాటు పార్టీ నాయకులకు గిరి మహిళలు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, సర్పంచ్లు పాడి రమేష్, కొర్రా రాధిక, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, స్వాభి రామచందర్, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, పార్టీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు రామ్మూర్తి, పల్టాసింగ్ విజయ్కుమార్, మాడగడ పీసా కమిటీ అధ్యక్షుడు మండియకేడి బాలరాజు, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి జన్ని నరసింహ మూర్తి, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్, యువజన విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు ఎల్.బి. కిరణ్కుమార్, పార్టీ మండల కార్యదర్శి సోనియ, నాయకులు కొర్రా అర్జున్, కిల్లో జగన్, బి.బి. కామేష్, బేసు, శ్రీరాములు పాల్గొన్నారు.ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
ప్రైవేటీకరణతో పేదలకు వైద్య విద్య దూరం
● పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ● కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి అపూర్వ స్పందన జి.మాడుగుల: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్య విద్య దూరమవుతుందని, ఫీజులు భరించలేనంతగా పెరుగుతాయని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండల కేంద్రం జి.మాడుగులలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండంనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాలు సేకరణ, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న విశ్వేశ్వరరాజు.. వారపు సంతకు వచ్చిన ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. సంతకాలు చేసేందుకు జనం క్యూ కట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందుబాటులో లేకుండా పోతుందని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని, అయితే వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందన్న అక్కసుతో ఆ కాలేజీలను ప్రైవేట్పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మత్స్యకొండం నాయుడు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సురభంగి రామకృష్ణ, సర్పంచ్ కిముడు రాంబాబు, ఐసరం హనుమంతరావు, గంగరాజు, ఎంపీటీసీ మత్స్యరాస విజయకుమారి, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంజరి సీతారాంనాయుడు, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్ కుమార్, జిల్లా యువజన అధ్యక్షుడు గబ్బాడి శేఖర్, రాష్ట్ర క్రిష్టియన్ మైనార్టీ కార్యదర్శి పాంగి అంద్రయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు వంతాల కృష్ణారావు, జిల్లా ప్రచార కార్యదర్శి లంకెల కల్యాణ్, నియోజకవర్గ వలంటీర్ల సంఘం అధ్యక్షుడు మత్స్యరాస కుర్మాన్రాజు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు కురిడే వలసయ్య, మాజీ ఎంపీటీసీ బ్రహ్మాలింగం, నాయకులు ప్రకాష్, మురళి, బాబూరావు, బాలరాజు, చంద్రపతి, విజయ్, వార్డు సభ్యురాలు మంజలి మణి, సుబ్రహ్మణ్యం, కొండబాబు, బాలు పాల్గొన్నారు. -
సికిల్సెల్ ఎనీమియా పరీక్షలు తప్పనిసరి
పాడేరు : అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 40 ఏళ్లలోపు వారికి కచ్చితంగా సికిల్సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్ ఆ శాఖ ఉద్యోగులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయం నుంచి వైద్యారోగ్య శాఖ ఆరోగ్య పర్యవేక్షకులు, ఏఎన్ఎంలతో సికిల్సెల్ ఎనీమియా, వైద్యారోగ్య శాఖ సేవలపై సమీక్ష నిర్వహించారు. వ్యాధి నిర్థారణ అయితే తగిన చికిత్స అందించాలని తెలిపారు. జిల్లాలో 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటి వరకు 4,72,950 మందికి సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 13,903 మందికి సికిల్ సెల్ ట్రైట్ రాగా, మరో 1,582 మందికి వ్యాధి నిర్ధారణ అయిందన్నారు. సికిల్సెల్ ఎనీమియా రోగులకు పౌష్టికాహారం అందించేందుకు నెలకు రూ.10వేల పింఛన్ ఇస్తున్నామని చెప్పారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ సికిల్సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు జరిపి, వ్యాధి నిర్ధారణ అయితే పాడేరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్చి వైద్య సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఎంహెచ్వో డాక్టర్ టి.ప్రతాప్, జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంట్ అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, సికిల్ సెల్ ఎనీమియా జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కె. బాబ్జీ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సీహెచ్. కమల కుమారి పాల్గొన్నారు. -
కన్ను!
దేవాలయ భూములపైప్రేమ సమాజానికి గతంలో దాతలు ఇచ్చిన భూములు రుషికొండలో 47.33 ఎకరాలు కూటమివిలువైన సింహాచలం భూములు ప్రైవేటు కంపెనీల పరం నగర శివారు భూములను దేవస్థానానికి ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రేమ సమాజం భూములనూ కాజేసేందుకు యత్నాలు టూరిజం ప్రాజెక్టుల పేరిట కొట్టేసేందుకు కుట్ర ఏసీఏకు 10 ఎకరాలు ఇవ్వాలంటూ కూటమి నేతల కుయుక్తులు సింహాచలం దేవస్థానానికి చెందిన భూములు అడవివరంలో 150 ఎకరాలు మధురవాడలో 107 ఎకరాలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఇప్పటివరకు ప్రైవేటు, ప్రభుత్వ భూములపై కన్నేసి కాజేస్తున్న కూటమి ప్రభుత్వం, నేతలు.. ఇప్పుడు దేవస్థానం భూములపై పడ్డారు. సింహాచలంతోపాటు ప్రేమ సమాజానికి చెందిన విలువైన భూములను ప్రాజెక్టుల పేరిట చేజిక్కించుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. సింహాచలం దేవస్థానానికి మధురవాడ, అడవివరంలో ఉన్న విలువైన భూములను తీసుకుని.. నగరానికి వెలుపల కాలుష్య ప్రభావిత భూములను దేవస్థానానికి అప్పగించేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా సింహాచలం దేవస్థానానికి చెందిన భూముల విలువను తక్కువగా లెక్కగట్టి.. అందుకు బదులుగా నగరానికి దూరంగా ఇచ్చే భూముల విలువను మాత్రం అధికంగా లెక్కకట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా చేస్తారంటా..? వాస్తవానికి సింహాచలం దేవస్థానానికి మధురవాడలో 107 ఎకరాలు, అడవివరంలో 150 ఎకరాల భూమి ఉంది. ఇందులో మధురవాడలోని 107 ఎకరాల భూమిని గూగుల్ సంస్థకు, అడవివరంలోని 150 ఎకరాల భూమిని ఒక ప్రైవేటు హోటల్కు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు బదులుగా ఎక్కడో దూరంగా గాజువాక వద్ద ఉన్న భూములను ప్రత్యామ్నాయంగా ఇచ్చేందుకు ఇప్పటికే రెవెన్యూ వ్యవహారాలు ప్రారంభమయ్యాయి. ● మరోవైపు సేవా సంస్థ అయిన ప్రేమ సమాజానికి చెందిన భూములను కూడా వివిధ టూరిజం ప్రాజెక్టుల పేరిట చేజిక్కించుకునేందుకు కూటమి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు షురూ చేశారు. అలాగే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కు 10 ఎకరాలు కావాలంటూ కూటమి నేతలు లేఖలతో అమరావతిలో కలియతిరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా దేవస్థానం భూములను లీజుకు ఇవ్వొచ్చంటూ తాజాగా ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల నేపథ్యంలో కూటమి నేతలు తమ ప్రయత్నాలను షురూ చేశారు. ప్రేమ సమాజం భూములపై ఎప్పటి నుంచో గురి ప్రేమ సమాజానికి దాతలు ఇచ్చిన 47.33 ఎకరాల భూమి రుషికొండలో ఉంది. ఇందులో 33 ఎకరాలకుపైగా గతంలోనే టీడీపీ నేతలు లీజుకు తీసుకున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రేమ సమాజం భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకించింది. ఇందుకు అనుగుణంగా సదరు ప్రైవేటు వ్యక్తికి అప్పగించిన భూముల లీజును రద్దు చేయడంతోపాటు ప్రేమ సమాజం భూములను సంస్థకే అప్పగించింది. నగరాల్లో ఉండే దేవస్థానాలకు చెందిన భూములను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం అక్టోబరు 31న ఆదేశాలు జారీచేసింది. ఇందుకు అనుగుణంగా మరోసారి విలువైన ప్రేమ సమాజం భూములను రిసార్టు, టూరిజం పేరుతో చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఏసీఏకు 10 ఎకరాలు కావాలంటూ కూటమికే చెందిన మరో ఎమ్మెల్యే ఒక వినతిపత్రాన్ని కూడా ప్రభుత్వానికి సమర్పించినట్టు సమాచారం. మొత్తంగా రుషికొండలోని విలువైన భూములను చేజిక్కించుకునేందుకు పలు ప్రతిపాదనలతో కూటమి నేతలు కుయుక్తులు పన్నుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టూరిజం, గూగుల్ పేరుతో..! ఒకవైపు ప్రేమ సమాజం భూములను కూటమి నేతలు ప్రైవేటు వ్యక్తుల పేరుతో, టూరిజం ప్రాజెక్టుల పేరుతో చేజిక్కించుకునేందుకు యత్నిస్తుండగా.. సింహాచలానికి చెందిన అడవివరంలోని భూములను టూరిజం ప్రాజెక్టు పేరుతో ఓ హోటల్కు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. సింహాచలం దేవస్థానానికి చెందిన అడవివరంలోని 150 ఎకరాల భూమిని ఒక ప్రైవేటు హోటల్కు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దీనికి ప్రతిగా దూరంగా ఉన్న భూములను దేవస్థానానికి అప్పగించేందుకు ఫైల్స్ సిద్ధమవుతున్నాయి. మధురవాడలో విలువైన 107 ఎకరాల భూమిని గూగుల్ సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు డేటా సెంటర్ పేరుతో తర్లువాడలోని పేద దళిత భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. వీటికి తోడు దేవస్థానం భూములను కూడా అప్పగించేందుకు సిద్ధమవుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
40 మందితో డిస్ట్రిక్ట్ అకడమిక్ ఫోరం
జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావుపాడేరు : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచడంతో పాటు ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో విద్యా కార్యక్రమాలు, సంస్కరణలను సమర్థంగా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో 40మందితో డిస్ట్రిక్ట్ అకడమిక్ ఫోరం(డీఏఎఫ్)ను ఏర్పాటు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీఏఎఫ్ మొదటి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. డీఏఎఫ్ జిల్లా చైర్పర్సన్గా డీఈవో బ్రహ్మాజీరావు, వైస్ చైర్పర్సన్గా సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, మెంబర్ క న్వీనర్లుగా(ఉన్నత పాఠశాలలు) పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్, భీమిలి డైట్ కళాశాల సీనియర్ లెక్చరర్ షేక్ అల్లా ఉద్దీన్ (ప్రాథమిక పాఠశాలలు) వ్యవహరిస్తారు. సభ్యులుగా డీసీఈబీ సెక్రటరీ సువర్ణరాజు, ఎంఈవోలు కృష్ణమూర్తి, ప్రసాద్తో పాటు ఒక్కో సబ్జెక్టుకు నలుగురు చొప్పున 28 మంది సబ్జెక్టు నిపుణులు, మరో నలుగురు ప్రైమరీ లెవెల్ సబ్జెక్టు నిపుణులు ఉంటారని డీఈవో చెప్పారు. రాబోయే టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబరిచేలా, శత శాతం ఉత్తీర్ణత సాధించేలా డీఏఎఫ్ సభ్యులు ప్రతి విద్యా కార్యక్రమాన్ని సమర్థంగా పర్యవేక్షించాలన్నారు. జిల్లా స్థాయిలో పాఠశాల విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా దిశానిర్ధేశం చేయడం, విద్యార్థుల సామర్థ్యం పెంపు, పాఠశాల విద్యలో జవాబుదారీతనాన్ని నిర్ధారించడం తదతర బాధ్యతలను డీఏఎఫ్ సభ్యులు నిర్వర్తించాలని డీఈవో తెలిపారు. -
పదోన్నతుల ‘సహకారం’
విశాఖ సిటీ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పదోన్నతుల వ్యవహారం అగ్గిరాజేస్తోంది. ఈ ప్రక్రియలో రూ.కోటి వరకు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంకులో కీలక వ్యక్తి సన్నిహితుడే మామూళ్ల తతంగాన్ని నడిపించారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. పదోన్నతులకు ఒక్కొక్కరి నుంచి పోస్టును బట్టి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వరకు వసూలు చేసినట్లు సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)కి ప్రధాన కార్యాలయం కాకుండా మరో 33 బ్రాంచ్లు ఉన్నాయి. వీటిలో ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఒక డీజీఎం, నాలుగు ఏజీఎం, నాలుగు చీఫ్ మేనేజర్, ఆరు మేనేజర్, 12 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని భావించారు. ఇందుకోసం బ్యాంక్ పర్సన్ ఇన్చార్జి, సీఈవో, ఆప్కాబ్ నుంచి జనరల్ మేనేజర్, ఆప్కాబ్ నామినేట్ చేసిన సబ్జెక్ట్ నిపుణుడు ఒకరు ఉన్నారు. ఈ బోర్డు ఆధ్వర్యంలో గత నెల 23, 24 తేదీల్లో ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. పోస్టుకు రూ.3 నుంచి రూ.5 లక్షలు ఈ పదోన్నతులకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో డీజీఎం పోస్టుకు ఒకరు, నాలుగు ఏజీఎం పోస్టులకు నలుగురు, నాలుగు చీఫ్ మేనేజర్ పోస్టులకు 18 మంది, ఆరు మేనేజర్ పోస్టులకు 20, 12 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 60 మంది పాల్గొన్నారు. ఉద్యోగి సర్వీస్కు 80, పనితీరుకు 10, ఇంటర్వ్యూలో మరో 10 మార్కులు కలిపి మొత్తంగా 100 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సర్వీసు మార్కులను పక్కనపెడితే, పనితీరుకు ఉద్యోగి పై అధికారి 10 మార్కులు, ఇంటర్వ్యూలో 10 మార్కులు దక్కించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే మతలబులు జరిగినట్లు ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. 20 మార్కుల్లోనే మతలబు 20 మార్కులు బోర్డు చేతుల్లో ఉండడంతో ఇక్కడే బేరసారాలు జరిగినట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. అడిగిన మొత్తం ఇవ్వని పక్షంలో పదోన్నతికి అవకాశం లేదని పలువురికి తెగేసి చెప్పారన్న వాదనలు ఉన్నాయి. పోస్టును బట్టి రూ.3 నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం బ్యాంకులో కీలక వ్యక్తి సన్నిహితుడు రంగంలోకి దిగి తెరవెనుక తతంగాన్ని నడిపారన్న టాక్ ఉంది. చీఫ్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు భారీగా డిమాండ్ ఉండడంతో వాటి కోసం పలువురు అడిగిన మొత్తాన్ని సమర్పించుకున్నట్లు చర్చ జరుగుతోంది. వారికే పదోన్నతులు కల్పిస్తూ గత నెల 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై పలువురు ఉద్యోగులు ఆప్కాబ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మెరిట్, రోస్టర్ ప్రకారమే పదోన్నతులు చేపట్టినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. -
నిరసన ర్యాలీనివిజయవంతం చేయండి
జి.మాడుగుల: కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 11న నిర్వహించనున్న పాడేరు నియోజక వర్గ స్థాయి నిరసన ర్యాలీలో సర్పంచ్లు, ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ నాయకులు, అనుబంధ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పొల్గొని విజయవంతం చేయాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు కోరారు. జి.మాడుగులలో మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన సంతకాల పత్రాలతో ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి, అధికారులకు వినతి పత్రాన్ని అందజేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కె సత్యనారాయణ,వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మత్స్యకొండంనాయుడు, సర్పంచ్లు రాంబాబు, రామకృష్ణ, హనుమంతరావు, ఎంపీటీసీ విజయకుమారి పాల్గొన్నారు. -
అర్హులందరికీ అన్నదాత సుఖీభవ
కలెక్టర్ దినేష్కుమార్పాడేరు: అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, మండల సర్వే అధికారులు, గ్రామ రెవెన్యూ, సర్వే, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల లబ్ధిపొందడానికి సంబంధిత పత్రాలు అందజేయడంలో ఆలస్యం కాకూడదన్నారు. రీసర్వే ప్రక్రియలో గ్రామం సరిహద్దుల్లో భూములున్న సంబంధిత శాఖలకు నోటీసులు ఇవ్వాలని, గ్రామాల్లో ఉన్న అటవీ, రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఆన్లైన్లో టెక్నికల్ సమస్యలు ఉంటే కలెక్టరేట్ ఈడీఎంకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. స్మార్ట్ కార్డుల పంపిణీలో జాప్యం చేయవద్దన్నారు. జిల్లాలోని డిపోలన్నింటినీ ఆన్లైన్ చేయాలని, వృద్ధులకు ఇంటి వద్దే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు రేషన్ డిపోలు తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, డీఆర్వో పద్మాలత, రీసర్వే ఏడీ దేవేంద్రుడు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి.మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
7 నుంచి రాష్ట్ర స్థాయిఆర్చరీ పోటీలు
● కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలను నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ తెలిపారు. ఈపోటీల నమూనా, వాల్పోస్టర్లను కలెక్టరేట్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద మంగళవారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ 14,17,19 విభాగాలకు సంబంధించి ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు అల్లూరి జిల్లా అతిథ్యమివ్వడం సంతోషంగా ఉందన్నారు. పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే ఈ పోటీల్లో ఉమ్మడి 13 జిల్లాల నుంచి సుమారు 936 మంది బాలబాలికలు పాల్గొంటారని తెలిపారు. 52 మంది కోచ్ మేనేజర్లు, 50 మంది స్థానిక వ్యాయామ ఉపాధ్యాయులు ఈపోటీల నిర్వహణలో భాగస్వామ్యమవుతారని చెప్పారు. పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి పి.సూరిబాబు, మాజీ కార్యదర్శి కొండబాబు, నిర్వాహక కార్యదర్శి భూపతిరాజు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. -
పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర
ముంచంగిపుట్టు: కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జేసీఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ అరబీరు జగబంధు అన్నారు. మండలంలోని జోలాపుట్టు పంచాయతీ బొండ్రుగూడ గ్రామంలో అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, ఎంపీ తనూజరాణి, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రల ఆదేశాల మేరకు మంగళవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వ వైద్య కాలేజీల ప్రైవేటీకరణను వివరించి, సంతకాలు చేయించారు. బుంగాపుట్టు, సుజనకోట, జర్జుల, కర్రిముఖిపుట్టు, ఏనుగురాయి,జర్రెల పంచాయతీల్లోనూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జగబంధు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆదికారంలోకి వచ్చి పేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. మెడికల్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం వలన వైద్యం పేదలకు దూరం చేయడం జరుగుతుందని, వెంటనే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సర్పంచ్ నీలకంఠం, ఎంపీటీసీ సభ్యురాలు కమల, పంచాయతీ అధ్యక్షులు దశరఽథ్, వైఎస్సార్సీపీ నాయకులు ఎం.డి.సోలెమాన్, శుక్ర, దేవా, భాగత్రామ్, జగదీష్,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెదబయలు: ప్రభుత్వ వైద్య కళాశాలలప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెదకొడాపల్లి సర్పంచ్ బట్టి చిట్టిబాబు, ఎంపీటీసీ పాంగి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించి, వారి అభిప్రాయాలను తెలుసుకొని,సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిట్టిబాబు, ఎంపీటీసీ సభ్యుడు అప్పారావులు మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేదల కోసం 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే,కూటిమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. మెరుగైన వైద్యం పేదవాడికి అందించాలని జగనన్న ముందుకు వస్తే దానిని నాశనం చేసేందుకు కూటమి ప్రభుత్వం చూస్తుందన్నారు. నాయకులు కొండబాబు, వెంకటరావు, వారు సభ్యులు, నేతలు భాస్కరరావు, సత్యనారాయణ, రత్కుమార్, కామయ్య, మోహన్, ప్రసాద్, జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. రాజవొమ్మంగి: రాష్ట్రంలో పేదలకు వైద్యను దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ రాజవొమ్మంగి మండల అధ్యక్షుడు సింగిరెడ్డి రామకృష్ణ అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. రామకృష్ణ వైద్య కళాశాలల ప్రయివేటీకరణ వల్ల పేదలకు జరుగనున్న నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. నాయకులు మురళీకృష్ణ, వెంకటేష్రాజు, కుశరాజు, దుర్గాప్రసాద్, కామేష్, వీరబాబు తదతరులు పాల్గొన్నారు. -
రైల్వే భవనాలను పునరుద్ధరించండి
మహారాణిపేట: బ్రిటిష్ కాలం నాటి రైల్వే భవనాలను అమృత్ భారత్ పథ కం ద్వారా పునరుద్ధరించుకునే అవకా శం ఉందని, స్థానిక ఎంపీలను సమ న్వయం చేసుకుంటూ వాల్తేర్ డివిజన్లో పనులు వేగవంతం చేయాలని కేంద్ర విమానయా న శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖలోని నోవోటెల్ హోటల్లో మంగళవారం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు, రైల్వే అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇటీవల చేపట్టిన పనుల పురోగతి, పార్లమెంట్ సభ్యులు ఇదివరకే చెప్పిన సమస్యలు, వాటి ప్రస్తుత స్థితి గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నం రైల్వే స్టేషన్ను ఐకానిక్ స్టేషన్గా తీర్చిదిద్దాలని.. ఇప్పటికే రూ.492.69 కోట్ల కేటాయింపులు జరిగినట్లు గుర్తు చేశారు. అతి త్వరలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయనగరం రైల్వే స్టేషన్పై కూడా కనెక్టివిటీ రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం నుంచి తిరుపతికి రైలు వేయాలి శ్రీకాకుళం నుంచి చర్లపల్లికి, శ్రీకాకుళం నుంచి తిరుపతికి నూతన ట్రైన్ సర్వీసుల ఆవశ్యకత ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. అరకు రైలుకు మరిన్ని కోచ్లను అనుసంధానం చేయాలని సూచించారు. ప్రస్తుత సందర్భాల్లో శబరిమల లాంటి ప్రాంతాలకు అధికంగా ప్రత్యేక రైళ్లను నడపాలని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అసంతృప్తి అమృత్ భారత్ స్టేషన్ల్లో అభివృద్ధి పనుల ఆలస్యం పట్ల రామ్మోహన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సూచించారు. సబ్ వేల నిర్మాణంలో నాణ్యతపై పలు ఆరోపణలు వస్తున్నట్టు పేర్కొన్నారు. నీటి నిల్వలు ఉండిపోవడం, పై నుంచి వాటర్ లీకేజీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తాం: గొల్ల బాబూరావు, తనూజారాణి సీనియర్ సిటిజన్లకు, స్పోర్ట్స్ పర్సన్లకు టికెట్ చార్జీలు తగ్గింపు కోసం ఇప్పటికే అనేక వినతులు అందాయని, ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్తానని రాజ్యసభ సభ్యుడు గొల్లబాబూరావు హామీ ఇచ్చారు. తన పార్లమెంట్ పరిధిలో పలు సమస్యలను అరకు ఎంపీ తనూజరాణి ప్రస్తావించారు. అరకుకు మరిన్ని రైళ్లు నడపాలని, ప్రస్తుతం అరకుకు ఉన్న రైళ్లకు కోచ్లు అదనంగా ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, అప్పలనాయుడు, అధికారులు సప్తగిరి శంకర్ ఉలక, మహేష్ కశ్యప్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు నూరుశాతం ప్రజలకు అందాలి
అడ్డతీగల: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నూరుశాతం ప్రజలకు అందాలని అడ్డతీగల మండల ప్రత్యేకాధికారి ఎం.రుక్మాగదయ్య అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీని క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి, డ్వాక్రా సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి జాబ్కార్డు దారునికి పనికల్పించాలని తెలిపారు. ఉద్యాన వన పంటల పెంపకంలో గిరిజన రైతులు భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా గృహం ఉండాలని, విద్యా కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం అందించే అన్ని ప్రోత్సాహకాలు విద్యార్థులకు అందించాలన్నారు. సమావేశానికి గైర్హాజరైన కొంతమంది అధికారుల విషయంపై కలెక్టర్కి నివేదిక పంపిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్, వెలుగు, విద్యాశాఖ, ఉపాధిహామీ, వ్యవసాయశాఖ గృహ నిర్మాణశాఖ అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థినికి గుండె శస్త్ర చికిత్స విజయవంతం
జి.మాడుగుల: స్థానిక ఏకలవ్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఎ.లోవకుమారికి గుండె శస్త్ర చికిత్స విజయవంతమైనట్టు ప్రిన్సిపాల్ శివ్సింగ్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు.గురుకులం కార్యదర్శి ఎం.గౌతమి చోరవతో విద్యార్థిని ఆరోగ్యం, వైద్య సంరక్షణపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొనే వారమన్నారు. కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్, పాడేరు ఐటీడీఏ పీవో తురుమణి శ్రీపూజ విద్యార్థిని లోవకుమారిని ఆరోగ్య పరంగా 20రోజులు పాటు ఉండి పూర్తిగా కోలుకోవటానికి సహాయ సహకారాలతో అందించారన్నారు. విద్యార్థిని లోవకుమారికి మెరుగైన గుండె చికిత్స కోసం అక్టోబర్16న విశాఖపట్నంలో మెడికవర్ ఆస్పత్రిలో చేర్చించారు. అక్టోబర్ 27న శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్త యందన్నారు. విద్యార్థిని శస్త్ర చికిత్స అనంతరం నవంబర్ 3న మంచి ఆరోగ్యంతో డిశ్చా ర్చ్ చేశారన్నారు. స్థానిక గురుకులం, ఈఎంఆర్ విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ది పట్ల నిబద్దతను ప్రతిభింభించినట్టు ఆయన తెలిపారు. లోవకుమారి గుండె శస్త్ర చికిత్స కోసం రూ.7.67,000ఆర్థిక సహాయం అందించిన న్యూఢిల్లీలో గల ఎన్ఈఎస్టీఎస్(నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్) ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభం
చింతపల్లి: సర్టిఫికెట్ కోర్సులను విద్యార్థులు స ద్వినియోగం చేసుకోవాలని పాడేరు డిగ్రీ కళాశాలు ప్రిన్సిపాల్ వనుము చిట్టిబాబు తెలిపారు. చింతపల్లి కళాశాలలో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ కోర్సులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయ భారతితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు విజ్ఞానానికి అనుగుణంగా స్కిల్స్ను నేర్చుకోవాలన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకుని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. సర్టిఫికెట్ కోర్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అనే అంశంపై హైదరాబాద్ రిసోర్స్ పర్సన్ రుత్విక్ వివరించారు. ఈ కార్యక్రమంలో పీఎం ఉష స్కీం కో ఆర్డినేటర్ డాక్టర్ వి.రమణ, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు రవీంద్ర నాయక్, కెజియా రాణి, వరప్రసాద్, శరత్బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య భద్రతపై అవగాహన
● ఏడీఎంహెచ్వో సరిత రాజవొమ్మంగి: మండలంలోని రాజవొమ్మంగి, జడ్డంగి పీహెచ్సీలను ఏడీఎంహెచ్వో మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో సిబ్బందికి పలు సూచనలిచ్చారు. పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలన్నారు. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యభద్రతపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రాజవొమ్మంగి, జడ్డంగి పీహెచ్సీల్లో తనిఖీలు చేశారు. మందుల స్టాకును పరిశీలించారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. పీహెచ్సీ ఆవరణలోని బర్త్ వెయిటింగ్ రూం చూశారు. ఓపీ రిజిస్టర్, రోగుల వార్డు పరిశీలించారు. అనంతరం రాజవొమ్మంగి శివారు విద్యానగర్ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. బాలసురక్ష కార్యక్రమంలో భాగంగా గర్భిణులు, బాలింతలు, శిశువుల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. మాతా శిశుమరణాలను అరికట్టడం అందరి బాధ్యత అని, వీరికి పౌష్టికాహారం అందించంలో శ్రద్ధతో పనిచేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. డాక్టర్ సుష్మ, డాక్టర్ సతీష్చంద్ర ఆమె వెంట పాల్గొన్నారు. -
పాఠశాల అభివృద్ధికి కలెక్టర్ సాయం
సాక్షి,పాడేరు: పెదబయలు మండలంలోని గోమంగి పంచాయతీ వన్నడ గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆర్థికసాయం అందించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం మరమ్మతులకు గురవ్వడంతో గిరిజనులే ఇంటింటికి చందాలు వేసుకుని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పాఠశాల హెచ్ఎం పలాసి నవీన్, మాతృభాష వలంటీర్ కొర్రా రాంబాబు సోమవారం కలెక్టర్ను కలిసి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. గిరిజనులంతా పాఠశాల అభివృద్ధికి సొంతంగా నగదు పోగు చేయడంపై కలెక్టర్ అభినందించారు. తన వంతు సాయంగా కొంత నగదును వారికి అందజేశారు. -
కూటమి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
చింతపల్లి: కూటమి ప్రభుత్వం చేపడుతున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని కొనసాగించాలని చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్లు పిలుపునిచ్చారు. మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి గణబాబు అద్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వైద్య విద్య పట్ల విప్లవం తీసుకువచ్చి రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో 17 వైద్య కళాశాలలను మంజూరు చేశారన్నారు. ఇందులో భాగంగా గిరిజన ప్రాంతమైన అల్లూరి జిల్లా కేంద్రంలోను మెరుగైన వైద్యసేవలకై ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేసి ప్రారంభించడం జరింగిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆయా కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు యోచిస్తుందని, దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కుట్ర రాజకీయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలో గుణపాఠం చెబుతారన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, నాయకులు బూసరి కృష్ణారావు, సాగిన గంగన్న పడాల్, బాబూరావు, పాల్గొన్నారు. ముంచంగిపుట్టు: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలో గల జర్జుల పంచాయతీ అంబపడా, పెద్దతమ్మింగుల, బొదిలిగూడ , ఏనుగురాయి పంచాయితీ జంగంసరియా గ్రామాల్లో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు ఆధ్వర్యంలో కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమం సోమవారం జరిగింది. ఎంపీటీసీ మజ్జి సుబ్బలక్ష్మీ, పీసా కమిటీ ఉపాధ్యక్షుడు కృష్ణరావు, నాయకులు రామకృష్ణ, లోకనాథ్, చంద్రరరావు పాల్గొన్నారు. పెదబయలు: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మజ్జి చంద్రుబాబు ఆధ్వర్యంలో మండలంలోని అడుగులపుట్టు పంచాయతీలోని పలు గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. అరకు అసెంబ్లీ గ్రీవెన్స్ అధ్యక్షుడు సందడి కొండబాబు, నాయకులు పోయిబా కృష్ణరావు, అన్నపూర్ణ, ధనలక్ష్మీ, నాగేశ్వరరావు, ధనుంజయ్, సత్యారావు, బురింగ్ తదితరులు పాల్గొన్నారు. జి.మాడుగుల: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని కుంబిడిసింగి పంచాయతీ వెన్నెల గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు కోరాబు కొండబాబు ఆధ్వర్యంలో కోటి సంతకాలు కార్యక్రమం జరిగింది. నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎటపాక: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నల్లకుంట పంచాయతీలోని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఆకుల వెంకటరామారావు ఆధ్వర్యంలో సోమవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ తెల్లం రాములమ్మ, ఉప సర్పంచ్ గుండి కోటేశ్వరరావు, నాయకులు తెల్లం నవీన్, చిననారాయణ, రామకృష్ణ, రాకేష్, చలపతి, నరసింహారావు, దుర్గారావు, రామయ్య, శ్రీరాములు, ప్రసాద్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని కన్నాయిగూడెం, టి.పి.వీడు గ్రామాల్లో గ్రామ కమిటీల ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, అప్పలరెడ్డి, మణి, వీరయ్య పాల్గొన్నారు.కన్నాయిగూడెంలో సంతకాలను సేకరిస్తున్న నాయకులునల్లకొంటలో సంతకాలను సేకరిస్తున్న నాయకులుఅడుగులపుట్టులో సంతకాలు సేకరిస్తున్న వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మజ్జి చంద్రుబాబు, నేతలు -
జన్మన్ బిల్లు బకాయిలు చెల్లించాలి
ముంచంగిపుట్టు: పీఎం జన్మన్ పథకంలో నిర్మించిన గృహాల బిల్లు బకాయిలు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని గిరిజన సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.ధర్మానపడాల్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం ముంచంగిపుట్టు,పెదబయలు మండలాల గిరిజన సంఘం నేతలతో హౌసింగ్ బకాయిలు, లబ్ధిదారుల ఇబ్బందులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం జన్మన్ గృహాలు నిర్మించుకుని బిల్లులు అందక లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. గిరిజనులు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారిన, హౌసింగ్ బిల్లులు రెండు నెలలుగా విడుదల కాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి బకాయిలు విడుదల చేయాలని, లేకుంటే ఈ నెల 10వ తేదీన తహసీల్దార్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులతో ధర్నా చేస్తామని హెచ్చరించారు. గిరిజన సంఘ మండల అధ్యక్షుడు ఎంఎం.శ్రీను, కార్యదర్శులు నర్సయ్య, గంగాధరం, లక్ష్మీపురం సర్పంచ్ త్రినాథ్, గిరిజన సంఘ నాయకులు రాందాసు, దొంబరు, జీనబంధు, నీలకంఠం, బుజ్జిబాబు, దేవన్న, కొండయ్య,సిద్ధేశ్వరరావు, గోపాల్, గణపతి పాల్గొన్నారు. గిరిజన సంఘ జిల్లా అధ్యక్షుడుధర్మానపడాల్ డిమాండ్ -
వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
సాక్షి,పాడేరు: పవిత్ర కార్తీకమాసం రెండవ సోమవారంతో జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాల్లోను భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగాలకు ప్రత్యేక అభిషేకాలు జరుపుకున్నారు.ఉత్తరవాహని పుణ్యక్షేత్రం మత్స్య గుండంలో మత్స్యలింగేశ్వరస్వామి దర్శనంకు భక్తులు బారులు తీరారు. బొర్రాగుహలు, కాశీపట్నం,అరకులోయలోని భ్రమరాంభిక సమేత మల్లికార్జునస్వామి, పాడేరులోని ఉమానీలకంఠేశ్వరుడు, గౌరి నీలకంఠేశ్వరుడు,సోమనాధస్వామి, త్రిలింగేశ్వరుడును భక్తులు దర్శించుకున్నారు. లగిశపల్లి, వంతాడపల్లి, వంజంగి, తామరాపల్లి, గెడ్డంపుట్టు, తురాయిమెట్ట, తుమ్మరిమెట్ట శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం అన్ని శివాలయాల్లోను మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు.అయ్యప్ప ఆలయ ప్రాంగాణంలో కొలువుదీరిన సోమనాథస్వామికి పూజలు అనంతరం సాయంత్రం కుండీలో కార్తీక జ్యోతులను వదిలారు. భక్తిశ్రద్ధలతో కార్తీక మాసం పూజలు -
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు : జిల్లా వ్యాప్తంగా సేంద్రియా రైతు సంఘాలు ఏర్పాటు చేసి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ దినేష్కుమార్ సూచించారు. ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకంపై అగ్రికల్చర్, హార్టికల్చర్, పశుసంవర్ధక శాఖ, డీఆర్డీఏ, కోఆపరేటివ్, మార్కెటింగ్ శాఖలతో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, లీడ్ బ్యాంకు మేనేజర్ మాతునాయుడు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కర్ణ పాల్గొన్నారు. ఇలావుండగా వన్ధన్ వికాస్ కేంద్రాలను బలోపేతం చేసి, పంట ఉత్పత్తుల అమ్మకాల్లో దళారుల ప్రమేయం తగ్గించాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. బిర్సాముండా 150వ జయంతోత్సవాల సందర్భంగా స్థానిక కాఫీ హౌస్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, డీఆర్డీఏ పీడీ మురళీ, ఏపీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవోలు, వీడీవీకే సభ్యులు పాల్గొన్నారు. హెల్మెట్ ఉంటేనే అనుమతించండి ద్విచక్ర వాహనచోదకులు హెల్మెట్ ధరించి ఉంటేనే జిల్లాలోకి అనుమతించాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్పరెన్స్ హాల్లో రహదారుల భద్రతపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా సరిహద్దులు ఉన్న చోట చెక్పోస్ట్ల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి మద్యం సేవించి ఉన్న, హెల్మెట్ లేకున్నా అనుమతించవద్దన్నారు. రద్దీగా ఉన్న స్థలాల్లో జీపులు, ఆటోలు పార్కింగ్ చేయవద్దన్నారు.ఎస్పీ అమిత్బర్ధర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, డీఎస్పీ సహబాజ్ అహ్మద్, జిల్లా రవాణా అధికారి ప్రకాశరావు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
రంపచోడవరం: ఏజెన్సీలో గిరిజనులు అభివృద్ధి చెందాలంటే అనేక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రదర్శన నిర్వహించారు. స్ధానిక ఏఐకెఎంఎస్ భవనం నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. పలు డిమాండ్లుతో కూడిన వినతిపత్రాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్కు అందజేశారు. ఏజెన్సీలో ఆదివాసీలు సాగులో ఉన్న అన్ని రకాల భూములకు శాశ్వత పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రంపచోడవరం ప్రత్యేక ఆదివాసీ జిల్లా చేయాలని, ఏజెన్సీలో బ్రాందీ, బెల్టు షాపులు, సారా తయారీ వంటి మత్తు పానీయలపై ఉక్కుపాదం మోపాలన్నారు. 1/70 చట్టం , అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం అమలు చేయాలన్నారు. ఏజెన్సీలో ప్రత్యేక జీవో తీసుకువచ్చి నూరుశాతం ఉద్యోగాలు గిరిజనులకు కల్పించాలన్నారు. రంపచోడవరం డివిజన్ కేంధ్రంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలన్నారు. 2016–17 మధ్య నిర్మించిన ఇళ్లకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, జీడిమామిడి రైతులకు బీమా గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. పాపికొండలు అభయరణ్యం రద్దు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. నాయకులు లచ్చిరెడ్డి, దూలయ్య, బాలురెడ్డి, అశోక్, అక్కిసా తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో పారిశుధ్య పనులు తప్పనిసరి
రంపచోడవరం: ఏజెన్సీలోని అన్ని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, నిర్లక్ష్యం చేయవద్దని రంపచోడవరం ఐటీడీఏ పీవో బి స్మరణ్రాజ్ అన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలు నుంచి సోమవారం డీడీ రుక్మాండయ్య, ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు, ఏడీఎంహెచ్ఓ సరితతో కలిసి వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. పీవో స్మరణ్రాజ్ మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం ద్వారా దోమలను నివారించాలన్నారు. పాఠశాలల ప్రాంగణంలో ఫాగింగ్ చేయించాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్దాల నాణ్యతను పరిశీలించి నివేదికలు సమర్పించాలని అధికారులను అదేశించారు. అలాగే విద్యార్థులు తాగే నీటిని పరీక్ష చేయించి నివేదికలు ఇవ్వాలని సూచించారు. ఎంపీడీఓలు పాఠశాలలను సందర్శించి అక్కడ పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగిలో విలీనమైన పాఠశాలలకు గ్రామసభకు నిర్వహించి నివేదికలు సమర్పించాలన్నారు. మండలాల వారీగా దత్తత తీసుకున్న పాఠశాలల వివరాలపై ఆరా తీశారు. సమావేశంలో ఎంపీడీఓ శెట్టి రాజు, సాల్మన్రాజు,కుమార్ ,యాదగిరి, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీలో మొదటిసారిగా కళా ఉత్సవ్
గిరిజన విద్యార్థుల కోసం 28 ఏకలవ్య మోడల్ స్కూళ్లు ఏర్పాటు గొప్ప విషయమన్నారు. గిరిజన విద్యార్థులు పేదరికం నుంచి బయటకు రావాలంటే విద్య ఒక్కటే మార్గమన్నారు. నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఉత్సవాలు మంచి వేదిక అవుతాయన్నారు. గిరిజన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మారుమూల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య మోడల్ సూళ్లు ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో 725 మోడల్ స్కూళ్ల మంజూరుకు ప్రతిపాధించగా ముందుగా 473 కేంద్రం మంజూరు చేసిందన్నారు. దేశంలో విద్యనందించడంతో ఈఆర్ఎంఎస్లు మూడోస్థానంలో ఉన్నాయన్నారు. టాటా మోటారు సంస్థలో ఉద్యోగాలు వచ్చే విధంగా ఈఆర్ఎంఎస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శిక్షణ ఉంటుందన్నారు. దీనిలో భాగంగా పస్త్రుతం 1200 మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్, డాక్టర్లు చదువులకోసం చింతపల్లిలో 40 మందికి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. మొదటి రోజు 28 ఏకలవ్య పాఠశాలలకు చెందిన విద్యార్ధులు వివిధ రకాల ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీడీ రుక్మాండయ్య తదితరులు పాల్గొన్నారు. -
స్తంభించిన బీఎస్ఎన్ఎల్ సేవలు
● సిగ్నల్ పనిచేయక అవస్థలు ● వినియోగదారులకు తప్పని ఇక్కట్లు ● పట్టించుకోని అధికారులు సీలేరు: గూడెం కొత్త వీధి మండలంలోని బీఎస్ఎన్ఎల్ సెల్ సిగ్నల్ టవర్స్ సక్రమంగా పనిచేయకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన ఏడాదిగా బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ సమస్యలు ఉన్నాయని సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నా పట్టించుకోవడం లేదని మండల పలు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మండలంలో 16 పంచాయతీల్లో 80కు పైగా బీఎస్ఎన్ఎల్ టవర్ల నిర్మాణం జరిగింది. ఇందులో 2జీ. 4జీ టవర్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ సాంకేతిక సమస్యల వల్ల సక్రమంగా ఫోన్లు పనిచేయక, నెట్ పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు చెబుతున్నారు. గాలికొండ పంచాయతీలోని సప్పర్ల గ్రామంలో నిర్మించిన బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ నుంచి సిగ్నల్స్ రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సప్పర్లతో పాటు చట్రాపల్లి, కొత్తూరు, సువ్వపల్లి, పనసబంద, ధర్మపురం, నూతి బంధ తదితర గ్రామాల్లో వినియోగదారులు కూడా ఈ టవర్ సిగ్నల్పైనే ఆధారపడి ఉన్నారు. సిగ్నల్ సక్రమంగా అందకపోవడంతో ఆ ప్రాంతంలోని సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర సంబంధాలు నిలిచిపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి, సప్పర్లలోని బీఎస్ఎన్ఎల్ టవర్కు మరమ్మతులు చేపట్టి సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరించాలంటూ స్థానికులు గెమ్మెలి రవి, ప్రసాద్, పద్మనాభంతో పాటు లంకపాకల పీసా కార్యదర్శి. జీకే వీధి వైఎస్సార్సీపీ క్రిస్టియన్ సెల్ నాయకుడు కొర్ర రాంబాబు తదితరులు కోరుతున్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
గుంటసీమలో సంతకాలు సేకరిస్తున్న ఎమ్మెల్యే మత్స్యలింగం, ఎంపీ తనూజరాణి గిడుగు, నాగలితో అరకు ఎంపీ తనూజరాణి, ఎమ్మెల్యే మత్స్యలింగం డుంబ్రిగుడ: కూటమి ప్రభుత్వ తలపెట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరించారు. మండలంలోని గుంటసీమలో సర్పంచ్ గుమ్మా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణలో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజరాణి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పార్టీ జెండాలతో రచ్చబండ వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంప్రదాయ నాగలి, గిడుగు, విల్లంబులను గిరిజనులు, సర్పంచ్లు ఎమ్మెల్యే, ఎంపీలకు అందజేశారు. అనంతరం ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ 17 వైద్య కళాశాలల ప్రైవేటీకరణను పూర్తి వ్యతిరేకిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వైద్య కళాశాలలను ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్ చేశారు. అనంతరం సుభద్ర, భాగ్యలక్షి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి 17 వైద్య కళాశాలలను తీసుకువచ్చారని, ఆయనకు పేరువస్తుందన్న భయంతోనే కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేందుకు కుట్రకు తెరలేపిందన్నారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతి రేకిస్తూ సంతకాలను సేకరించారు. ఎంపీపీ బాకా ఈశ్వరి, డుంబ్రిగుడ, అరకులోయ జెడ్పీటీసీలు చట్టారి జానకమ్మ, శెట్టి రోషిణి, మండల పార్టీ అధ్యక్షులు పాంగి పరశురామ్, వైస్ఎంపీపీలు శెట్టి ఆనందరావు, పి. లలిత, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కె.హరి, పోతంగి సర్పంచ్ వి.వెంకటరావు, మండల మహిళ అధ్యక్షురాలు బి.శాంతి, మండల కార్యదర్శులు బి.లీలారాణి, మఠం శంకర్, హెచ్బీ రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరిక కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న అరకు ఎంపీ తనూజరాణి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి -
రోగులకు మెరుగైన వైద్యం అందించండి
● డీసీహెచ్ఎస్ డాక్టర్ నీలవేణి సూచన ● వై.రామవరం సీహెచ్సీ తనిఖీ వై.రామవరం: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించి మంచి పేరు తీసుకురావాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ నీలవేణి సూచించారు. ఆమె సోమవారం స్థానిక సీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చైతన్య కుమార్నుంచి తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరుకున్న సిబ్బంది క్వార్టర్లతోపాటు ఆస్పత్రిలో మందుల నిల్వలను పరిశీలించారు. చిన్నపిల్లల విభాగాన్ని తనిఖీ చేసిన ఆమె ఇన్పేషెంట్లతో మాట్లాడారు. -
వృద్ధురాలు గోరకుఎట్టకేలకు పింఛను
● భర్త పింఛను బదిలీ చేసిన ఎంపీడీవో సీలేరు: స్థానిక దుర్గా వీధిలో నివాసముంటున్న వృద్ధురాలి కురార గోరకు ఎట్టకేలకు పింఛను మంజూరైంది. ఈమె భర్త కురార గాసి ఏడాదిన్నర క్రితం మృతి చెందాడు. అప్పటినుంచి భర్త వృద్ధాప్య పింఛను తనకు బదిలీ చేయాలని గ్రామసచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. దీనిపై ‘పింఛను బదిలీకాక దయనీయం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఎంపీడీవో రమణబాబు స్పందించారు. ఆమెకు భర్త పింఛను బదిలీ చేయడంతో సమస్య పరిష్కారమైంది. ఈ మేరకు సోమవారం ఎంపీటీసీ సాంబమూర్తి, ఉప సర్పంచ్ కార్య శ్రీనివాస్, వెల్ఫేర్ అసిస్టెంట్ లోవకుమారి తదితరులు గోర ఇంటికి వెళ్లి పింఛను సొమ్ము అందజేశారు. -
సమ్మె సైరన్
ఏపీఎఫ్డీసీలో పనిచేస్తున్న కాఫీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. కనీస వేతనం అమలుచేయకపోవడంతో దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. యాజమాన్యం తీరుతో విసిగిపోయిన వారు ఈనెల 6వ తేదీలోగా న్యాయసమ్మతమైన తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని నోటీసులు ఇచ్చారు.కాఫీ కార్మికులసాక్షి,పాడేరు/చింతపల్లి: ప్రభుత్వం ఆధీనంలోని ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్డీసీ)లో పనిచేస్తున్న కాఫీ కార్మికులు వెట్టిచాకిరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు కాఫీతోటల్లో కష్టపడుతున్నా కనీస వేతనాలు అమలుకావడం లేదని వారు ధ్వజమెత్తుతున్నారు. రోజుకు రూ.320 కూలి అమలుజేస్తుండడంతో కష్టానికి తగ్గ ఫలితం లేదని వారు వాపోతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి రోజు వారి కూలి రూ.400కు పెంచుతామని అప్పట్లో ఏపీఎఫ్డీసీ అధికారులు హమీ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయిందని వారు విమర్శిస్తున్నారు. ● ఏజెన్సీలోని పాడేరు మండలం మినుములూరు. అనంతగిరి,పెదబయలు మండలం చుట్టుమెట్ట,చింతపల్లి మండలం వంగసార, గూడెంకొత్తవీధి మండలం ఆర్వీనగర్, లంకపాకలు, పెద్దగెడ్డ తదితర ప్రాంతాల్లో ఏపీఎఫ్డీసీకి చెందిన రూ.10వేల ఎకరాల్లో కాఫీతోటలు ఉన్నాయి. వీటిలో సుమారు రెండు వేల మంది కార్మికులు రోజువారీ కూలిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీఇరికి కనీస వేతన చట్టం అమలు చేయకపోగా 2024 అక్టోబర్లో కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీఎఫ్డీసీ పెంచిన రోజు వారి కూలి రూ.400 కూడా ఇవ్వకపోవడంతో వారు ఉసూరుమంటున్నారు. ● ఏపీఎఫ్డీసీ కాఫీ కార్మికుల నివాస గృహాల్లో కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. మినుములూరుతో పాటు అన్ని ప్రాంతాల్లో పూర్వం నిర్మించిన పెంకు, రేకుల నివాస గృహాలు శిథిలావస్థకు చేరాయి. వీటిలో బిక్కుబిక్కుమంటూ దుర్భర జీవనం సాగిస్తున్నారు. ● కాఫీ కార్మికులంతా సీఐటీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏపీఎఫ్డీసీ అధికారులకు గత 20 రోజుల నుంచి సమ్మె నోటీసులు ఇస్తున్నారు. పాడేరు, చింతపల్లి డీఎంలను కార్మికులంతా కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు, సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం, అధికారుల దృష్టికి తమ న్యాయ సమ్మతమైన సమస్యలను పరిష్కరించాలని తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కాఫీ కార్మికులు అగ్రహంతో ఉన్నారు. డిమాండ్లు ఇవే.. కాఫీ కార్మికులకు వేజ్ రేటు ప్రకారం కూలి, పండ్ల సేకరణ ధరలు పెంచాలి. నెలకు 26రోజుల పనిదినాలు కల్పించాచడమే కాకుండా హెల్పర్లకు పదోన్నతులు కల్పించి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి, ప్లాంటేషన్ కండక్టర్లను నియమించి, హెల్పర్లందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. టీఏ,డీఏలతో పాటు వారాంతపు చెల్లింపులు జరపాలి. నివాస గృహాలకు మరమ్మతులు చేపట్టాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడమే కాకుండా తోటల్లో ప్రమాదాలు జరిగితే వైద్య ఖర్చులు సంస్థ భరించాలి. కూలి పనులు చేసే వారందరికి పండగ దినాల్లో ప్రీమస్తర్లు అమలుజేయాలి. కనీస వేతనం అమలు చేయకుండా వెట్టి చాకిరీ యాజమాన్యాన్ని పలు దఫాలు ఆశ్రయించినా ఫలితం శూన్యం ఈనెల 6వతేదీలోగా పరిష్కరించకుంటే విధులకు దూరం ఏపీఎఫ్డీసీకి స్పష్టీకరణ కాఫీ పండ్ల సేకరణ పనులపై చూపనున్న ప్రభావం -
ఇచ్చిన హామీ నెరవేర్చాలి
పాడేరు : ఎన్నికల సమయంలో గ్రామ వలంటీర్లకు ఇచ్చిన హమీలను కూటమి ప్రభుత్వం అమలు చేసి న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. వలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆద్వర్యంలో ఐటీడీఏ ఎదుట రణభేరి రిలే నిరహర దీక్షలను ఆయన ప్రారంభించారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే రూ.10వేలు వేతనం ఇచ్చి విధుల్లోకి తీసుకుంటామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయన్నారు. అధికారంలోకి వచ్చాక వలంటీర్లను పూర్తిగా విస్మరించి విధులు అప్పగించకుండా మోసం చేసిందన్నారు. రణభేరి దీక్షలను ఈనెల 7వరకు నిర్వహిస్తామన్నారు. అదేరోజు జిల్లా కేంద్రమైన పాడేరులో వేలాది మంది గ్రామ వలంటీర్లతో భారీ ప్రదర్శన చేపడుతామన్నారు. అప్పటికి సమస్యపై స్పష్టమైన హామీ రాకపోతే రాజధాని కేంద్రంలో భారీ ఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు. గ్రామ వలంటీర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్. సుంద్రావు, గిరిజన సంఘం మండల కార్యదర్శి చిట్టిబాబు పాల్గొన్నారు. -
అధ్వానంగా వన్ధన్ వికాస కేంద్రాల నిర్వహణ
● ఆగ్రహానికి గురైన కలెక్టర్ దినేష్కుమార్ ● వెలుగు సిబ్బందిపై మండిపాటు డుంబ్రిగుడ: వన్ధన్ వికాస కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై కలెక్టర్ దినేష్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఆయన సాగర పంచాయితీలో పర్యటించారు. ఈసందర్భంగా వన్ధన్ వికాస్ కేంద్రాలను సందర్శించారు. నిర్వహణ లోపంపై ఆగ్రహించారు. వీడీవీకే సభ్యులకు సరైన అవగాహన లేకపోవడాన్ని గుర్తించిన ఆయన కేంద్రాల్లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, బ్యాంక్ నిర్వహణ సమచారాన్ని తెలుసుకున్నారు. రూ.లక్షల్లో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని వెలుగు సిబ్బంది తీరుపై మండిపడ్డారు. తయారు చేస్తున్న బిస్కెట్లను పరిశీలించారు. సాగర పంచాయితీ కుసుమగుడలో నిర్వహిస్తున్న వన్ధన్ వికాస్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు వంతాల దేవదాసు, అరకు సర్పంచ్ జి.శారద, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పరిష్కరించకుంటే విధులకు దూరం
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్ చింతపల్లి: ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్డీసీ) కాఫీ తోటల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేకుంటే కార్మికులంతా ఈ నెల 6నుంచి సమ్మెకు దిగుతారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ హెచ్చ రించారు. సోమవారం కొత్తపాలెం పంచాయతీ పరిధి కిన్నెర్లలో కాఫీ కార్మికులతో మాట్లాడారు. సుమారు 20ఏళ్లకు పైగా కాఫీ తోటల్లో కార్మికులుగా పనిచేస్తున్నా వారి బాగోగులను సంస్థ యాజమాన్యం కనీసం పట్టించుకోలేదన్నారు. కూలి రేట్లు పెంచకపోగా కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు ఉద్యోగ భద్రతపై పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఏపీఎఫ్డీసీ డివిజన్ మేనేజర్లకు సమ్మె నోటీసులు ఇచ్చి 20 రోజులు గడుస్తున్నా సంస్థ యాజమాన్యం కాఫీ కార్మికులు సమస్యలు పరిష్కారంపై స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాఫీ తోటలు ఏటా అంతరించిపోతున్నా వాటి సంరక్షణకు చర్యలు చేపట్టక పోవడం సంస్థ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. కార్మికులంతా సమస్యలు పరిష్కారానికి విధులు బహిష్కరించి సమ్మెకు సిద్దం కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హెల్పర్ బాలకృష్ణ, కాఫీ కార్మికులు రాములమ్మ, లక్ష్మి, సుబ్బమ్మ, రోహిణి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గూడెంకొత్తవీధి: సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మె తప్పదని ఏపీఎఫ్డీసీ ఆర్వీనగర్ కాఫీ కార్మిక సంఘాల నాయకులు కొర్రా రాజారావు, రామనాథం, పడాల్ హెచ్చరించారు. సోమవా రం నిర్వహించిన కార్యక్రమంలో దేవరాపల్లి, సిరిబాల, గూడెంకొత్తవీధి పరిధిలోని కాఫీతోటల్లో పనిచేస్తున్న కార్మికులు పాల్గొన్నారు. -
అన్నవరం బ్రిడ్జి నిర్మించాలని ధర్నా
వీఆర్పురం: కొట్టుకుపోయిన అన్నవరం బిడ్జిని తక్షణం నిర్మించాలని డిమాండ్ వైఎస్సార్సీపీ, సీపీఎం, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. భార్షీ వర్షాలకు కొట్టుకుపోవడంతో ఐదు నెలలుగా సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ, సీపీఎం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానికులు సోమవారం బిడ్జి వద్ద ధర్నా చేపట్టారు. నిర్మాణం చేపట్టేవరకు విరమించేది లేదని వారు భీష్మించారు. దీంతో అక్కడికి చేరుకున్న తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీవో ఇమ్మానుయేల్, ఎస్ఐ సంతోష్కుమార్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్, కలెక్టర్ దినేష్కుమార్తో వారు ఫోన్లో మాట్లాడారు. ఈనెల 10వ తేదీనాటికి బ్రిడ్జి నిర్మాణం చేపడతామని, అప్పటివరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీకి చెందిన సర్పంచ్ పిట్టా రామారావు ఎంపీటీసీ బంధం విజయలక్ష్మి, బంధం రాజు, మడకం కన్నారావు, మొట్టం రమేష్, గుజ్జ రాజేశ్వరి, సీపీఎం నేతలు, ఎంపీపీ కారం లక్ష్మి, సర్పంచ్ పులి సంతోష్, పూనెం సరోజిని, కారం బుచ్చమ్మ, సవలం మారయ్య పాల్గొన్నారు. ఉన్నతాధికారుల హామీతో విరమణ -
ఏజెన్సీలో మొదటిసారిగా కళా ఉత్సవ్
రంపచోడవరం: ఏజెన్సీలో మొదటిసారిగా రాష్ట్రస్థాయి ఉద్భవ్ –2025 కల్చరల్ అండ్ లిటరరీ ఫెస్ట్ కళా ఉత్సవ్ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని గురుకుల జాయింట్ కార్యదర్శి వైవీఎస్ ప్రసాద్ అన్నారు. మారేడుమిల్లిలో ఏకలవ్యలో మూడు రోజులపాటు నిర్వహించే కళా ఉత్సవ్ కార్యక్రమాన్ని సోమవారం ఎంపీపీ సార్ల లలిత కుమారి, డీఎస్పీ సాయిప్రశాంత్, గురుకులం డిప్యూటీ సెక్రటరీ ముధుసూదన్వర్మ, కిషోర్బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 28 ఏకలవ్య మెడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయన్నారు. ఈ ఉత్సవాలకు బాలురు 346 మంది, బాలికలు 634 మంది కలిపి 980 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. డీఎస్పీ సాయిప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ఉత్సవాలు జరగడం ఇక్కడ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఒకే పాఠశాలలో ఐదు నుంచి ఇంటర్ వరకు గురుకుల విద్యను ఏకలవ్య పాఠశాలలు అందిస్తున్నాయని, విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. డిప్యూటీ సెక్రటరీ మధుసూదన్వర్మ మాట్లాడుతూ నిర్వహించడం ఎంతో సంతోషం గురుకులాల జాయింట్ కార్యదర్శి వైవీఎస్ ప్రసాద్ రాష్ట్ర వ్యాప్తంగా 28 ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు హాజరు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు -
భక్తిశ్రద్ధలతో క్షీరాబ్ది ద్వాదశి
నక్కపల్లి: క్షీరాబ్దిద్వాదశిని మహిళలు ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీకమాసంలో శుద్ధ ద్వాదశిని క్షీరాబ్దిద్వాదశి, చిలుక ద్వాదశిగా పిలుస్తారు. ఏకాదశి ఉపవాసం ఉన్న వారంతా మరుసటిరోజు ఆదివారం ద్వాదఽశినాడు సాయంత్రం తులసి మొక్కదగ్గర తులసి వ్రతం, లక్ష్మీకల్యాణం నిర్వహించారు. క్షీరసాగర మథనంలో జన్మించిన లక్ష్మీదేవిని మహావిష్ణువు దేవ దానవుల సమక్షంలో వివాహం చేసుకుంటాడు. మహావిష్ణువు తనకు అత్యంత ప్రీతికరమైన ద్వాదశినాడు తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి. సూర్యాస్తమయం అనంతరం మహిళలు తులసి కోటలో శ్రీమహావిష్ణువు ప్రతిమను ఉంచి తులసి వ్రతం ఆచరించారు. ఉసిరి దీపాలను వెలిగించారు. దీప దర్శనం వల్ల శివసాన్నిధ్యం లభిస్తుందని నమ్మకం. ఉపమాకలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో , భువనేశ్వరి సమేత లక్ష్మణేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభాల వద్ద ప్రత్యేక పూజలు జరిపి, దీపారాధన నిర్వహించారు. -
భవనం ప్రారంభమెన్నడో?
● పూర్తయిన గురుకుల పాఠశాల ● పరిశీలించని అధికారులు ● విద్యార్థులకు తప్పని వసతి సమస్య సీలేరు: గూడెం కొత్తవీధి మండలంలోని సీలేరులో గురుకుల పాఠశాల భవనం పూర్తయినా అధికారుల నిర్లక్ష్యంతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో విద్యార్థులు వసతి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. భవనం నిర్మాణం పూర్తయి అయిదు నెలలు కావస్తున్నా ప్రారంభించలేదని పలువురు చెబుతున్నారు. నెలలు గడుస్తున్నా భవనం నాణ్యత ప్రమాణాల పరిశీలన మంజూరు తదితర అంశాలు పరిశీలనలో అధికారులు తాత్సారం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గురుకుల పాఠశాలలో 405 మంది విద్యార్థులున్నారని, ప్రస్తుతం ఆయా విద్యార్థులు సమీపంలోని ఉన్న భవనంలో ఉంటున్నారని, వసతి సమస్యతో సతమతమవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పూర్తయిన గురుకుల పాఠశాల భవనాన్ని త్వరితగతిన అందుబాటులో తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
కూటమి వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
డుంబ్రిగుడ: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ యోచనను కూటమి ప్రభుత్వం విరమించుకునేంత వరకు పోరాటం చేస్తామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం స్పష్టం చేశారు. మండలంలోని పోతంగి పంచాయతీ బిల్లాపుట్టు గ్రామంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మత్స్యలింగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన, కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గిరిజనులంతా కలిపి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి సంతకాలను సేకరించారు. దీనిపై స్థానికులు విశేషంగా స్పందించి సంతకాలు చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో తమ గ్రామానికి బస్టాప్ ఉండేదని, అయితే హైవే నిర్మాణంలో భాగంగా బస్టాప్ను అధికారులు తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎండైనా.. వానైనా ఆరుబయటే బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం స్పందించారు. సంబంధిత సమస్యను హైవే ఉన్నతాధికారులు, సబ్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. త్వరలో బస్టాప్ ఏర్పాటు జరుగుతుందని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో తాగునీటి సమస్యను విన్నవించారు. దీనిపై ఆయన స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, పోతంగి, కితలంగి సర్పంచ్లు వంతల వెంకటరావు, వి.సుబ్బారావు, గుంటసీమ ఎంపీటీసీ సభ్యుడు కూడా పాపారావు, మండల కార్యదర్శి మఠం శంకర్, నాయకులు సింహాచలం, నరసింగరావు, దశమి, రవి తదితరులు పాల్గొన్నారు. ముంచంగిపుట్టు: మండలంలోని సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రైవేటీకరణ చేస్తే పేదలకు వైద్య సేవలు దూరమవుతాయన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన వైద్య కళాశాలలను నేడు కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయంతో ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిలిచిపోయేంతవరకు వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తామన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు మజ్జి సుబ్బలక్ష్మీ, నాయకులు గంగారావు, రాజారావు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెదబయలు: మండలంలోని జామిగూడ పంచాయతీలో పలు గ్రామాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆదివారం కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మజ్జి చంద్రుబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలేసి, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేసే పనిలో ఉందన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ వలన పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రామస్తులకు వివరించారు. అరకు అసెంబ్లీ గ్రీవెన్స్ అధ్యక్షుడు సందడి కొండబాబు, సర్పంచ్ వెంకటరావు, నాయకులు అప్పన్న, బాలన్న, దేవిప్రసాద్, బాలయ్యదొర, రామన్నపడాల్, సతీష్, రామలింగస్వామి, సతీ, రాము పాల్గొన్నారు. ఎటపాక: మెడికల్ కాలేజీలను ప్రవేటికరణ చేయాలనే ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఆకుల వెంకటరామారావు,జడ్పీటీసీ ఉబ్బా సుస్మిత అన్నారు. మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం ఎటపాక పంచాయతీలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేశారు. అనంతరం పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. నాయకులు కురినాల వెంకట్, ఉప సర్పంచ్ శీలం లక్ష్మి, శీలం నాగేశ్వరరావు, రాంప్రసాద్, వెంకటేశ్వర్లు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ యోచనను ప్రభుత్వం విరమించుకోవాలి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ తరలివచ్చిన పార్టీ శ్రేణులు గిరిజనుల అనూహ్య స్పందన -
ఉద్యోగుల ఐడీ కార్డులతో స్టీల్ప్లాంట్లోకి చొరబాటు
90 కిలోల ఇత్తడి, స్క్రాప్తో ఇద్దరు పట్టివేత ఉక్కునగరం: స్టీల్ప్లాంట్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆ ఇద్దరు దొంగలు ఉద్యోగుల గుర్తింపు కార్డులతో లోపలికి ప్రవేశించడం గమనార్హం. సీఐఎస్ఎఫ్ సిబ్బంది అందించిన వివరాల ప్రకారం.. పెదగంట్యాడకు చెందిన తారకేశ్వరరావు, గోపి సాహూ అనే వ్యక్తులు ప్లాంట్లోని వివిధ విభాగాల నుంచి సుమారు 50 కిలోల ఇత్తడి వస్తువులు, 40 కిలోల ఇనుప స్క్రీప్టు దొంగిలించి, బీసీ గేటు సమీపంలోని టవర్–3 వద్ద బయటకు విసిరేశారు. వారు దొంగిలిస్తున్న పనిని అటుగా గస్తీ కాస్తున్న సీఐఎస్ఎఫ్ క్రైం బృందం గుర్తించింది. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఛేజింగ్ జరిగింది. ఎట్టకేలకు వారిని పట్టుకుని దొంగిలించిన సాత్తును స్వాధీనం చేసుకున్నారు. వారిని సోదా చేయగా.. వారి వద్ద నుంచి ఆర్ఎంహెచ్పీ, ఎస్ఎంఎస్–2 విభాగాలకు చెందిన ఉద్యోగుల అసలు గుర్తింపు కార్డులు బయటపడటంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరినీ స్టీల్ ప్లాంట్ క్రైం పోలీసులకు అప్పగించారు. క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి వ్యాపారాన్ని ఉగ్రవాదంగా భావిస్తాం
మధురవాడ: గంజాయి వ్యాపారాన్ని ఉగ్రవాదంగా భావిస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. విశాఖ సమీపంలోని కాపులుప్పాడ జీవీఎంసీ డంపింగ్ యార్డులో సుమారు రూ 5.21 కోట్లు విలువచేసే పదివేల కిలోల గంజాయి, 19 లీటర్ల హాసిస్ ఆయిల్ను దహనం చేసే కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. గంజాయిని అరికట్టడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. గంజాయి కేసుల్లో అరెస్టయినవారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నామని తెలిపారు. సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. గంజాయి కేసుల్లో 1,435 మందిని అరెస్ట్ చేశామని అందులో విశాఖకు చెందివారు 712 మంది కాగా 332 మంది పలు జిల్లాలకు చెందిన వారున్నారు. మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందినవారని తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు ఎనిమిది చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 14వేల వరకు సీపీ కెమెరాలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయిపై 1972 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈగల్ ఐజీ రవికృష్ణ, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు. -
సింహగిరిపై ఘనంగా చిలుకు ద్వాదశి
స్వామి సేవలో ఆడారి వంశీయులు సింహాచలం: సింహగిరిపై ఆదివారం చిలుకు ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) ఉత్సవం వైభవంగా జరిగింది. అనకాపల్లికి చెందిన ఆడారి నూకయ్య వంశీయులు తరలివచ్చి, తమ చేతుల మీదుగా శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి ఈ ఉత్సవాన్ని జరిపించారు. ఏటా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఆలయంలో చిలుకు ద్వాదశి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశాన్ని తరతరాలుగా అనకాపల్లిలోని గవర సామాజికవర్గానికి చెందిన ఆడారి నూకయ్య వంశీయులకు దేవస్థానం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఆడారి నూకయ్య వంశీయులు కుటుంబ సమేతంగా వచ్చి చిలుకు ద్వాదశి ఉత్సవానికి సంబంధించిన పూజా ద్రవ్యాలన్నింటినీ తీసుకొచ్చారు. సాయంత్రం ఆలయ ఆస్థాన మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలతో పాటు శయన పెరుమాళ్లు, ఆళ్వార్లకు విశేషంగా పూల అలంకరణ చేసి మండపంలో అధిష్టింపజేశారు. అనంతరం విష్వ క్సేన పూజ, పుణ్యాహవాచనం, షోడశోపచార పూజ లు నిర్వహించారు. స్వామి చెంతన నువ్వులు, బెల్లం, పాలను రోట్లో వేసి చెరకు గెడలతో శాస్త్రోక్తంగా దంచారు. తయారైన చిమ్మిడిని స్వామికి నైవేద్యంగా ఆరగింపు చేశారు. తదుపరి శయన పెరుమాళ్లకు బేడా తిరువీధిని కనులపండువగా నిర్వహించారు. మంగళాశాసనాన్ని విశేషంగా అందించారు. భక్తులకు చిమ్మిడి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు పవన్కుమార్ తదితరులు పూజలు నిర్వహించారు. -
స్టీల్ప్లాంట్లో ‘ఫ్లాగ్ ఆఫ్ ప్రైడ్’ ప్రారంభం
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగుల్లో పోటీతత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఆదివారం నుంచి ‘ఫ్లాగ్ ఆఫ్ ప్రైడ్’ అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఉత్పత్తి విభాగాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విధానంలో భాగంగా ప్లాంట్లోని ఈడీ (వర్క్స్) బిల్డింగ్ ముందు తొమ్మిది జెండా స్తంభాలను ఏర్పాటు చేశారు. వీటిపై ప్రధాన విభాగాలుగా పరిగణించే ఆర్ఎంహెచ్పీ, కోక్ ఓవెన్స్, సింటర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నేస్, స్టీల్ మెల్ట్ షాప్–1, స్టీల్ మెల్ట్ షాప్–2, సీఆర్ఎంపీ, మిల్స్, ధర్మల్ పవర్ ప్లాంట్ పేరిట తొమ్మిది రంగుల పతాకాలను అమర్చారు. ప్రతీ రోజు యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకున్న విభాగం పతాకం ఎత్తులో ఎగురుతుంది. లక్ష్య శాతం ఆధారంగా ఆ పతాకం ఎత్తు స్థాయిని నిర్ణయిస్తారు. అంటే లక్ష్యాన్ని ఎంత శాతం చేరుకుంటే, పతాకం అంత ఎత్తులో ఎగురుతుంది. శనివారం ఆయా విభాగాలు సాధించిన ఉత్పత్తి సాధన ఆధారంగా ఆదివారం తొలి రోజు పతాకాలను ఏర్పాటు చేశారు. యాజమాన్యం తీసుకున్న ఈ కొత్త నిర్ణయంపై ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఉద్యోగులు ఈ కొత్త పద్ధతి వల్ల విభాగాల మధ్య పోటీ కంటే, అనవసరమైన పరస్పర విమర్శలు పెరిగి, అది మొదటికే మోసం తీసుకువస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
పరవాడ: మండలంలో ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో సరదాగా ఈతకు దిగి గల్లంతైన విద్యార్థి భానుప్రసాద్ మృతదేహం ఆదివారం తెల్లవారుజామున తీరానికి కొట్టుకొచ్చింది. తానాం వసతి గృహంలో ఉంటూ అక్కడ జెడ్పీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు శనివారం ముత్యాలమ్మపాలెం తీరంలో ఈతకు దిగారు. కొంతసేపటికి విద్యార్థుల్లో ఒకరైన భానుప్రసాద్ను బలమైన కెరటాలు లోపలికి లాక్కొనిపోయాయి. తోటి విద్యార్థులు సురక్షితంగా బయటపడగా.. భానుప్రసాద్ను రక్షించడానికి వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రావికమతం మండలం తోటకూరపాలేనికి చెందిన భానుప్రసాద్ మృతదేహం ఆదివారం ముత్యాలమ్మపాలెం తీరానికే చేరింది. మృతదేహానికి పోస్ట్మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. -
ఏపీటీయూ గౌరవాధ్యక్షుడిగా ఎంపీ గొల్ల బాబూరావు
ఆరిలోవ: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ యూనియన్(ఏపీటీయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఏపీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వై.దేముడు ఆధ్వర్యంలో ఆదివారం అక్కయ్యపాలెంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ని యూనియన్ కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. పాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గౌరవాధ్యక్షుడిగా అంగీకరించిన ఎంపీని యూనియన్ ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.దత్తాత్రేయ శర్మ తదితరులు పాల్గొన్నారు. సీతంపేట: విద్యారంగం, సమాజం, ఉపాధ్యాయ సమస్యలపై పరిపూర్ణమైన అవగాహన ఉన్న గొల్ల బాబూరావు యూనియన్ గౌరవాధ్యక్షుడిగా నాయకత్వం వహించేందుకు అంగీకారం తెలపడం పట్ల కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర నాయకులు కె.బ్రహ్మారెడ్డి, కె.జె.కృపానందం, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
యువ దంపతుల ఆత్మహత్య
తాటిచెట్లపాలెం: నగరంలోని అక్కయ్యపాలెంలో యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫోర్త్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భార్య అనిత, తల్లితో కలిసి సూరిశెట్టి వాసు అక్కయ్యపాలెం, దాలిరాజు సూపర్మార్కెట్ సమీపంలో ఉంటున్నారు. ఏడాది క్రితం వీరికి పెళ్లయింది. ప్రస్తుతం అనిత ఏడో నెల గర్భిణి. ఏం జరిగిందో తెలీదుగానీ ఆదివారం వీరిద్దరూ విగతజీవులయ్యారు. వాసు ఫ్యాన్ హుక్కు ఉరేసుకుని చనిపోగా, అనిత మంచం మీద చనిపోయి ఉంది. ఉదయం వాసు తల్లి ఫంక్షన్ నిమిత్తం బయటకెళ్లి సాయంత్రం తిరిగొచ్చింది. తలుపు ఎంతసేపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి, కిటీకిలో నుంచి చూసి నిర్ఘాంతపోయింది. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ మరణించి కనిపించడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. స్థానికంగా వాసు, అనితల ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. మరోవైపు.. అనిత గర్భంలో ఉన్న బిడ్డను బతికించేందకు పోలీసులు మృతురాలిని ఆస్పత్రికి తరలించారు. ఫోర్త్టౌన్ సీఐ ఉమాకాంత్ వివరాలు సేకరిస్తున్నారు. -
కళా ఉత్సవ్ ఏర్పాట్లపరిశీలన
రంపచోడవరం: మారేడుమిల్లిలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఏకలవ్య పాఠశాలల రాష్ట్ర స్థాయి కళాఉత్సవ్ ఏర్పాట్లను రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరణ్రాజ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించి కళా ఉత్సవ్–2025 ఈ ఏడాది మారేడుమిల్లి ఏకలవ్యలో జరుగుతున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి 5వ తేదీ వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. గురుకుల జాయింట్ సెక్రటరీ ప్రసాద్, డీడీ రుక్మాండయ్య, ప్రిన్సిపాల్ శంకర్, తహసీల్దార్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత బస్సు ప్రయాణం ‘దూరం’
సీలేరు: జిల్లాలోని గిరిజన ప్రాంతాలను కలుపుకొని ముంపు మండలాలకు వెళ్లే మార్గంలో బస్సు సర్వీసులు లేక ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలు నోచుకోవడం లేదు. రాష్ట్రంలో జిల్లాల విభజన సమయంలో ముంపు మండలాలను కలుపుకొని భద్రాచలం సరిహద్దు వరకు అల్లూరి సీతారామరాజు జిల్లాను ప్రకటించారు. ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం పాడేరు నుంచి సీలేరు మీదుగా భద్రాచలానికి బస్సు సర్వీసును జిల్లా అధికారులు ప్రారంభించారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి దీనిని నిలిపివేశారు. ఈ ప్రాంత ప్రజలతోపాటు విలీన మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. పథకం ప్రకటించక ముందు తిప్పిన బస్సు సర్వీసును తరువాత ఎందుకు నడపడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసుల కింద ఆల్ట్రా డీలక్స్ బస్సులు నడపడంతో వీటికి ఉచిత బస్సు ప్రయాణం వర్తించక మహిళలు రాయితీకి దూరమవుతున్నారు. విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా రోజుకు మూడు ఆల్ట్రా డీలక్స్ సర్వీసులు తిరుగుతున్నాయి. నర్సీపట్నం నుంచి సీలేరుకు రెండు, పాడేరు నుంచి డొంకరాయి ఒకటి, రాజమండ్రి నుంచి సీలేరుకు ఒక సర్వీసు తిరుగుతున్నాయి. వీటికి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తోంది. కండీషన్లో ఉన్న బస్సులతోపాటు అదనపు బస్సు సర్వీసులు నడకపోవడం వల్ల మహిళలతో పాటు ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి విశాఖపట్నం, పాడేరు ప్రధాన డిపోల నుంచి ఘాట్ రోడ్డు మీదుగా వివిధ ప్రాంతాలకు కండీషన్లో ఉన్న బస్సులతోపాటు ఉచిత ప్రయాణం వర్తించేలా సర్వీసులు నడపాలని సీలేరు ఎంపీటీసీ పిల్ల సాంబమూర్తి కోరారు. సర్వీసులు లేక సౌకర్యం కోల్పోతున్న మహిళలు -
ప్రకృతి సాగు ప్రోత్సాహానికి చర్యలు
● ఏపీ రైతు సాధికారిత సంస్థ ఈడీ బాబురావునాయుడు గూడెంకొత్తవీధి: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ రైతు సాధికారిత సంస్థ ఈడీ టి. బాబురావునాయుడు తెలిపారు. ఆదివారం ఆయన గిరిజన వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రావణాపల్లి, పెదవలస, దేవరాపల్లి పంచాయతీల్లో ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం భూమికి మేలు చేస్తుందన్నారు. పర్యావరణాన్ని కాపాడుతుందని తెలిపారు. రైతులు ఈ విధానంలో సాగు చేపట్టాలని కోరారు. ప్రకృతి విధానంలో సాగు చేసిన పంట ఉత్పత్తులకు స్థిరమైన ధరలు కల్పిస్తామన్నారు. పెదవలస పంచాయతీ టెంట్ల వీధిలో రైజ్బెడ్ విధానంలో సాగు చేస్తున్న పసుపు పంటను ఆయన పరిశీలించారు. డీసీఎం భాస్కరరావు, గిరిజన వికాస్ సంస్థ కార్యదర్శి ఎన్. సత్యనారాయణ, కోఆర్డినేటర్లు యమున, రమ్య పాల్గొన్నారు. -
భూ తగాదాలో వ్యక్తి హత్య
● కర్రతో దాడి.. సంఘటన స్థలంలోనే మృతి ● పరారీలో నిందితుడు ● కేసు నమోదు చేసిన పోలీసులు జి.మాడుగుల: భూమి కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఒకరు హత్య గురయ్యాడు. మండలంలోని గడుతూరు పంచాయతీ బొబ్బంగిపాడులో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గెమ్మెలి సత్తిబాబు(59), భార్య నీలమ్మ నివాసముంటున్న ఇంటికి ఎగువ వీధిలో పాంగి రాంప్రసాద్ అనే వ్యక్తి ఉంటున్నాడు. సత్తిబాబు ఇంటిపక్కన ఉన్న స్థలంలో భార్య నీలమ్మ పేరుమీద ప్రధానమంత్రి జన్మన్ పథకంలో ఇల్లు మంజూరైంది. అయితే పశువులు కట్టుకునేందుకు ఈ స్థలాన్ని రాంప్రసాద్ చాలా కాలం నుంచి సత్తిబాబును అడుగుతున్నాడు. దీనిపై గొడవ కూడా జరుగుతోంది. స్థలం ఇచ్చేందుకు భార్యాభర్తలు అంగీకరించలేదు.ఆ స్థలంలో ప్రభుత్వం మంజూరు చేసిన పథకం ఇంటి నిర్మాణం చేపట్టారు. దీనిని సహించలేని రాంప్రసాద్ ఆదివారం సత్తిబాబు ఇంటికి వచ్చి కర్రతో దాడి చేశాడు. అడ్డుకున్న భార్య నీలమ్మపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సత్తిబాబు సంఘటన స్థలంలో మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. తీవ్రంగా గాయపడిన నీలమ్మను పాడేరు జిల్లా ఆస్పత్రికి అంబులెన్సులో తరలించినట్టు ఆయన తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన సీఐ,ఎస్ఐలు హత్యకు దారితీసిన కారణాలను తెలుసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు వారు తెలిపారు. మృతుడి కుమారుడు గెమ్మెలి సుమంత్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణం
కొయ్యూరు: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మండలంలోని చిట్టింపాడులో ఏర్పాటు చేసిన దివంగత జెడ్పీటీసీ వారా నూకరాజు సంతాపసభకు విచ్చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడారు. బడి, గుడికి వెళ్లిన వారితోపాటు బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి ప్రాణాలతో ఉంటామన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలకు భద్రత కరువవుతోందని విమర్శించారు. ఇందుకు జెడ్పీటీసీ నూకరాజు హత్యే నిదర్శనమన్నారు. ఆయన కుటుంబాన్ని త్వరలో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి వద్దకు తీసుకువెళ్తామన్నారు. నూకరాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుదని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున రూ.ఐదు లక్షల చెక్కును అరకు ఎంపీ తనూజరాణి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు, మత్స్యలింగం ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు అమర్నాథ్ అందజేశారు. ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ నూకరాజు తనను కూతురిలా చూసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడంతో తట్టుకోలేకపోతున్నామన్నారు. కొయ్యూరు మండలానికి కేటాయించే నిధులు నూకరాజు పేరిట ఇస్తామని తెలిపారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ చిట్టింపాడులో నూకరాజు జ్ఞాపకార్థం పార్కు నిర్మిస్తామన్నారు.దీనిపై జెడ్పీటీసీలతో సమావేశం ఏర్పాటుచేస్తామని తెలిపారు. ప్రజలు కోరితే అతని జ్ఞాపకార్థం కళా మందిరం ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ నూకరాజు లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధ కలిగించిందన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ నూకరాజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నూకరాజు లేని లోటు పార్టీకి తీరనిదన్నారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, వైఎస్సార్సీపీ నేత బొడ్డేడ ప్రసాద్, జెడ్పీటీసీ సంఘ జిల్లా నేత దొండా రాంబాబు, ఎంపీపీలు బడుగు రమేష్, అనూషదేవి, బోయిన కుమారి, సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గాడి సత్యనారాయణ, బి.అప్పారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ జె.రాజులమ్మ, జల్లి బాబులు, సుధాకర్, అంబటి నూకాలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడుగుడివాడ అమర్నాథ్ కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు సంతాప సభలో ఆవేదన పార్టీ తరఫున కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కు అందజేత -
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ ఘటన
పాడేరు : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ ఘటన చోటుచేసుకుందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. కాశీబుగ్గ ఘటనలో మృతులకు సంతాపంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం పాడేరు పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందువులకు ప్రత్యేకమైన దినాల్లో ఆలయాల్లో తీవ్ర రద్దీ ఉంటుందని తెలిసి కూడా సరైన భద్రత ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదన్నారు. ఫలితంగా భక్తుల రద్దీ అధికమై తొక్కిసలాట జరిగిన ఏకంగా తొమ్మిది మంది భక్తులు మృతి చెందారని, పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారన్నారు. జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తుందన్నారు. జరిగిన ఉదంతాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలనే ఉద్దేశంతోనే డైవర్షన్ పాలిటిక్స్కు కూటమి నేతలు పూనుకుంటున్నారన్నారు. కల్తీ మద్యం కేసులో ఏ మాత్రం సంబంధం లేని వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ను ఉన్నట్టుండి అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. ప్రజల దృష్టికి మరల్చేందుకే కూట మి ప్రభుత్వం అరెస్ట్ల డ్రామా ఆడుతోందన్నారు. కల్తీ మద్యం ఘటనతో ఏ మాత్రం సంబంధం లేని జోగి రమేష్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో బడికి, గుడికి వెళ్లిన వారికి ఏమాత్రం రక్షణ లేదనడానికి గత 17 నెలల్లో సంఘటనలే నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడ శేఖర్, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు కూడా సుబ్రమణ్యం, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు పాంగి నాగరాజు, కన్నాపాత్రుడు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వనుగు బసవన్నదొర, ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి, పార్టీ సీనియర్ నాయకులు వంతాల నరేష్, బూరా మహేష్, కిల్లు కోటిబాబు నాయుడు, మోదా బాబురావు, రాజేష్ పాల్గొన్నారు. కాశీబుగ్గ ఘటన బాధాకరం: ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: కాశీబుగ్గ చిన తిరుపతి స్వామి వారి ఆలయంలో భక్తుల తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి చెందడం, 37మంది గాయాలు పాలు కావడం చాలా బాధాకరమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆదివారం అరకులోయ వైఎస్సార్ జంక్షన్ వద్ద ఆయన ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల తొక్కిసలాట రుద్ర భూమిని తలపించిందన్నారు. కార్తీక ఏకదశి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివస్తే కనీసం సెక్యూరిటీ కల్పించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఆలయం, పరిసరాలు, రోడ్లు కిక్కిరిసిపోతే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. చనిపోయిన వారి కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ పాడి రమేష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గెడ్డం నర్సింగరావు, పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, మండల పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు స్వాభి రామూర్తి, పల్టాసింగి విజయ్ కుమార్, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, మాడగడ పీసా కమిటీ అధ్యక్షుడు ఎం. బాలరాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు బంగురు శాంతి, పంచాయతీ అధ్యక్షుడు కొర్రా అర్జున్, గుంజిడి ప్రసాద్, బీబీ కామేష్, ఎల్బీ కిరణ్ కుమార్, శేఖర్ పాల్గొన్నారు. భక్తుల రద్దీ ఉన్న ఆలయాల వద్ద కానరాని భద్రత ఏర్పాట్లు తప్పిదాన్ని కప్పి పుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు అన్యాయం పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజం తొక్కిసలాటలో మృతులకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన -
అదృశ్యమైన విద్యార్థినుల ఆచూకీ లభ్యం
పట్టుకుని వార్డెన్కు అప్పగించిన గూడెంకొత్తవీధి పోలీసులు గూడెంకొత్తవీఽధి: పాఠశాల నుంచి అదృశ్యమైన ముగ్గురు విద్యార్థినులను పోలీసులు పట్టుకుని వార్డెన్కు అప్పగించారు. స్థానిక ఎస్ఐ సురేష్ శనివారం తెలిపిన వివరాలిలాఉన్నాయి. రింతాడ బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు గతనెల 30వ తేదీన ఉదయం ఏడు గంటల సమయంలో గేటు వద్దకు వచ్చారు. వారి వద్ద ఉన్న ఆధార్ కార్డులతో ఆర్టీసీ బస్సు ఎక్కారు. ముగ్గురు విద్యార్థినులు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ప్రత్యేక దృష్టి సారించారు. అదృశ్యమైన ముగ్గురు విద్యార్థినుల ఆచూకీకోసం ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చేపట్టారు. ము గ్గురు విద్యార్థినులు శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో విశాఖ ఆర్టీసీ కాంప్లెక్సులో ఉన్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఈ విషయాన్ని ఏఎస్పీ దృష్టికి ఎస్ఐ తీసుకువెళ్లారు. విశాఖ నుంచి తీసుకువచ్చి, పాఠశాల వార్డెన్కు అప్పగించినట్టు ఎస్ఐ తెలిపారు. -
శాస్త్రోక్తంగా మార్గశిరరాట మహోత్సవం
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర కల్పవల్లి, విశా ఖ వాసుల ఆరాధ్యదైవం కనకమహాలక్ష్మి అమ్మ వారి మార్గశిర మాసోత్సవాల రా ట పూజా కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది. ఏటా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున రాట వేసి మార్గశిర మాసోత్సవాలకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయం ప్రకారం శనివారం ఉదయం 10.53 గంటలకు నాదస్వర సుస్వారాలు, వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులకు అమ్మవారి జాకెట్టు ముక్క, తాంబూలం, గాజులు, ప్రసాదం అందజేశారు. ఇప్పటి నుంచి కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలకు విస్త్రత ఏర్పాట్లు చేయనున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఆలయ ఈవో కె.శోభారాణి, ఏఈవో కె.రాజేంద్రకుమార్, కార్పొరేటర్లు, భక్తులు పాల్గొన్నారు. -
ఆలయాల్లో ఆగని మృత్యుఘోష
సాక్షి, విశాఖపట్నం: గుడికి వెళ్లి దండం పెట్టుకునేలోపే.. కొందరు దేవుడి దగ్గరికే వెళ్లి పోతున్నారు. భగవంతుడి దర్శనం, దీపదర్శనం చేసుకున్న రోజే.. వారి ఇంట చితి మంటలు వెలిగే రోజుగా మారుతోంది. దైవనామ స్మరణ వినిపించాల్సిన ఆలయాల్లో.. ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపిస్తున్నాయి. భక్తుల రద్దీతో కళకళలాడాల్సిన ఆలయాలు.. తొక్కిసలాటలు, గోడ కూలిన ఘటనలతో భయాందోళన కలిగిస్తున్నాయి. మొన్న పవిత్ర తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం సమయంలో జరిగిన తొక్కిసలాట, నిన్న సింహాచలం చందనోత్సవ ఘటనలు కళ్లముందే మెదులుతుండగా.. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనతో భక్తజనం ఉలిక్కిపడుతోంది. సింహగిరిపై గోడ కూలి ఏడుగురు మృతి ఈ ఏడాది ఏప్రిల్ 30న సింహాచలం చందనోత్సవం వేళ.. నృసింహుని నామస్మరణతో మారుమోగాల్సిన సింహగిరిపై హాహాకారాలు మిన్నంటాయి. సింహాచలేశుని దర్శించుకుని తరించాలనుకున్న భక్తులు.. స్వామి నిజరూప దర్శనం కాకమునుపే ఆలయ ప్రహరీ కూలిన ఘటనలో ఏడుగురు నిర్జీవులుగా మారారు. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని విషాదంలో నెట్టింది. భవిష్యత్తులో ఏ ఆలయంలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావంటూ అప్పుడు ప్రభు త్వం హామీ ఇచ్చింది. కానీ, ఆ మాట చెప్పి ఏడు నెలలైనా గడవక ముందే.. మరో ఆలయం మృత్యు ద్వారాలు తెరిచింది. పవిత్రమైన కార్తీక ఏకాదశి రోజున శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని కలియుగ వేంకటేశ్వరుని దర్శించుకోవాలని వచ్చిన భక్తులు.. తొక్కిసలాటలో చిక్కుకుని మృత్యుఒడికి చేరుకున్నా రు. ఈ ఘోర దుర్ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యేక రోజుల్లో భక్తుల భద్రత పట్టదా? ఇలా శుభ దినాల్లో స్వామిని దర్శించుకునేందుకు ఆలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడాల్సిన దుస్థితి దాపురించింది. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం సమయంలో తొక్కిసలాట జరిగినప్పుడే ప్రభుత్వం మేల్కొని.. రాష్ట్రంలోని చిన్నా పెద్దా అన్ని ఆలయాల వద్ద ముఖ్యమైన పండగలు, శుభదినాల సమయంలో రద్దీని అంచనా వేసి, దానికి తగ్గట్టు ఏర్పాట్లు, భద్రతపై దృష్టిసారించాల్సింది. కానీ.. ఘటన జరిగిన కొద్ది రోజులకే కూటమి ప్రభుత్వం అంతా మరిచిపోయింది. ఆ తర్వాత కొద్ది కాలానికే ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి బయటపడి. సింహాచలం చందనోత్సవంలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఆ ఘటన జరిగిన వారం రోజుల వరకు ఆలయాల్లో హడావిడి చేసిన యంత్రాంగం.. ఆ తర్వాత అంతా గాలికి వదిలేసింది. ఇప్పుడు మరోసారి అమాయక భక్తులు బలయ్యారు. ముందస్తు చర్యలు శూన్యం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కాశీబుగ్గ ఘటన మూడో పెద్ద దుర్ఘటన. ముఖ్యమైన రోజుల్లో ఆలయాలకు భక్తులు ఊహించని రీతిలో వస్తుంటారు. దాని ప్రకారం ముందస్తు అంచనాలు వేసి, ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కొన్ని ప్రైవేట్ ఆలయాలకూ భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా పోలీసు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ.. ఇవేమీ పట్టనట్లుగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా.. తరచూ విషాద ఘటనలకు ఆలయాలు కేంద్రాలుగా మారుతున్నాయి. దీంతో ఆలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి.. కార్తీక మాసం, మార్గశిర మాసాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఆలయంలోనూ భద్రత, ఏర్పాట్లపై సమీక్ష చేయాలని భక్తులు కోరుతున్నారు. -
బిర్సా ముండా పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
● రంపచోడవరం పీవో స్మరణ్రాజ్ ● ఘనంగా బిర్సాముండా జయంతి రంపచోడవరం: గిరిజన హక్కుల కోసం భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తిని గిరిజనులు ఎప్పటికీ మరువరాదని రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ అన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆయన జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. పీవో స్మరణ్రాజ్, ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి, డీఎస్పీ సాయిప్రశాంత్, మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరావు, చిన్నం బాబు రమేష్, కోసూరి సత్యనారాయణరెడ్డి, ఎస్టీ కమిషన్ డైరెక్టర్ గొర్లె సునీత బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఐటీడీఏ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, సర్పంచ్ మంగా బొజ్జయ్య తదితరులు పాల్గొన్నారు. చింతూరు: స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శనివారం బిర్సాముండా జయంతిని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ ముందుగా బిర్సాముండాతో పాటు ఇతర స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన సమరయోధుల త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా వి.ఆర్.పురానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామల వెంకటరామయ్యను ఆయన సత్కరించారు. అనంతరం స్థానిక గురుకుల పాఠశాల ఆవరణలో అధికారులు, విద్యార్థులతో కలిసి పీవో మొక్కలను నాటారు. డీఎఫ్వో రవీంద్రనాథ్రెడ్డి, ఏపీవో రామతులసి, ఏవో రాజ్కుమార్, ఏఎస్డీఎస్ సంస్థ డైరెక్టర్ గాంధీబాబు పాల్గొన్నారు. -
నిలిచిన సేవలు... తప్పని అవస్థలు
● గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ సేవలకు ఆటంకం ● స్తంభించిన సెల్ సిగ్నల్, నెటవర్క్ వ్యవస్థ జి.మాడుగుల: మండలంలో వంతా పంచాయతీ కేంద్రంలో గల బీఎస్ఎన్ఎల్ సేవలు గడిచిన మూడు నెలలుగా నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వంతాల గ్రామంలో శనివారం గిరిజనులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ టవర్ నుంచి సిగ్నిల్స్ వ్యవస్థ సక్రమంగా లేక సచివాలయంలో నెట్ పనిచేయకపోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. గిరిజన ప్రజలు ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెప్పారు. సమాచార వ్యవస్థ పనిచేయక ఇబ్బందులు తప్పడం లేదన్నారు. తరచూ బీఎస్ఎన్ఎల్ సేవలు నిలిచిపోతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదని వారు చెప్పారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరారు. తాగునీటి సమస్య పరిష్కరించండి వంతాల పంచాయతీలో బండారువీధిలో గత కొన్నాళ్లుగా తీవ్ర త్రాగునీటి సమస్య ఎదుర్కోంటున్నామని గ్రామస్తులు తెలిపారు.గతంలో వేసిన కుళాయి పైపులు శిధిలావస్థకు చేరుకొని నీరంతా వృధా పోతుందని వీధిలోని నీరు రావటం లేదని వారు తెలిపారు.ధీంతో వీధిలో గల మహిళలు కాలినడకపోయి మంచినీటి కోసం ఊటగెడ్డలను ఆశ్రయించాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరారు. -
హత్య చేసి.. స్వామి అవతారమెత్తి..
అల్లిపురం: ఒక హత్య కేసులో నిందితుడు.. చట్టం కళ్లుగప్పి నాలుగేళ్లుగా పరారీలో ఉన్నాడు. పోలీసులకు దొరకకుండా ఏకంగా హిమాలయాలకు వెళ్లి.. భైరవ స్వామిగా అవతారమెత్తాడు. కాశీ, కేదార్నాథ్లో నాగసాధువులతో కలిసి తిరుగుతూ.. తన గతాన్ని పూర్తిగా చెరిపేశాననుకున్నాడు. కానీ విశాఖ టూటౌన్ పోలీసులు పక్కా వ్యూహంతో, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. ఈ దొంగ స్వామి గుట్టును రట్టు చేశారు. శనివారం నగరంలో అడుగుపెట్టిన అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి ఈ ఆపరేషన్ వివరాలను వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తిని చాకుతో హత్య చేసి.. నగరంలోని కల్లుపాకలో నివసిస్తున్న ఇసుకతోటకు చెందిన పిచ్చేటి యుగంధర్ (39) అలియాస్ రాఘవపై 2021లో ఒక హత్య కేసు నమోదైంది. గుర్తు తెలియని వ్యక్తిని చాకుతో యుగంధర్ హత్య చేశాడు. ఈ కేసులో అరెస్టయిన అతను కొన్నాళ్లకు బెయిలపై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతనిపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది. నగరంలో రెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ అతనిపై నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో.. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఈ కేసుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆపరేషన్ భైరవ డీసీపీ మేరీ ప్రశాంతి పర్యవేక్షణలో, ఏసీపీ లక్ష్మణమూర్తి, టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు, ఎస్ఐలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా చేసుకుని యుగంధర్ ఆచూకీ కోసం గాలించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. యుగంధర్ తన రూపురేఖలు మార్చుకుని.. ఏకంగా హిమాలయాలకు మకాం మార్చినట్లు తేలింది. కాశీ, కేదార్ నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాల్లో ‘భైరవ స్వామి’పేరుతో నాగసాధువులతో కలిసి తిరుగుతున్నట్లు నిర్ధారించుకున్నారు. తరచూ తన నివాసాన్ని మారుస్తూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నాడు. పక్కా స్కెచ్తో అరెస్ట్ అయినా పోలీసులు తమ నిఘాను మరింత పటిష్టం చేశారు. యుగంధర్ సన్నిహితుల కదలికలపై సాంకేతిక నిఘా కొనసాగించారు. ఈ క్రమంలో యుగంధర్ శనివారం నగరానికి వస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన స్పెషల్ టీమ్.. రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే క్వార్టర్స్ వద్ద మాటు వేసింది. భైరవ స్వామి అవతారంలో, మారువేషంలో సంచరిస్తున్న యుగంధర్ను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నాలుగేళ్లుగా చట్టానికి దొరక్కుండా.. స్వామీజీ వేషంలో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న టూటౌన్ సీఐ ఎర్రంనాయుడు, అతని సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. భైరవ స్వామిఅవతారంలోనిందితుడు యుగంధర్ యుగంధర్అసలు రూపం -
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
రాజవొమ్మంగి: మండలంలోని కిండ్ర జంక్షన్ మలుపు వద్ద నేషనల్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు శనివారం అదుపుతప్పి వరి పొలాల్లోకి దూసుకుపోయింది. స్థానిక రైతులు గమనించి వెంటనే కారు వద్దకు వెళ్లి అద్దాలు పగుల గొట్టి లోపల ఉన్నవారిని బయటకు తీశారు. ఈ సంఘటనపై స్థానిక రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరం నుంచి కృష్ణాదేవిపేటకు వెళ్తున్న రాజమణి, కరుణాకర్ దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు కారులో ప్రయాణిస్తున్నారు. కిండ్ర జంక్షన్ మలుపు వద్ద వాహనం అదుపుతప్పి ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టిందన్నారు. ప్రమాదాన్ని గమనించి అక్కడే ఉన్న రైతులు హుటాహుటిన అక్కడికి వెళ్లి కారు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న వారిని చాకచక్యంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారంతా సురక్షింతగా ఉన్నారని, ఇద్దరిక స్వల్పగాయాలవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. స్థానికులు బాధిత కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు యంత్రాల సహాయంతో కార్ను పొలాల్లోంచి తిరిగి రోడ్పైకి తెచ్చారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.త్రుటిలో తప్పిన ప్రమాదం -
ఘనంగా అంబలం పూజ
అంబలం పూజభారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప మాలధారులుసాక్షి,పాడేరు: స్థానిక అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి అంబలం పూజను అత్యంత ఘనంగా నిర్వహించారు. వర్తక సంఘ నేత బూరెడ్డి చిట్టిబాబు స్వామి ఆధ్వర్యంలో సుమారు రూ.7లక్షల వ్యయంతో ఈ పూజను ఏర్పాటుచేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు కాకినాడ జిల్లా నుంచి అయ్యప్పమాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయ్యప్ప భక్తి గీతాలతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పూజ అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సుబ్బారావు, ఉప సర్పంచ్ బూరెడ్డి రాము తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో పదవులు
● విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నాగభూషణం ● రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగాకృష్ణారావు సాక్షి,పాడేరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జీవీవీ నాగభూషణం(అరకులోయ), రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా బూసారి కృష్ణారావు(పాడేరు) నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది.కృష్ణారావు నాగభూషణం -
పాఠశాల గేటుకు తాళం
చింతూరు: స్వీపరు పోస్టు కోసం జరిగిన వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి పాఠశాల గేటుకు తాళం వేసిన ఘటన మండలంలోని పెదశీతనపల్లిలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మడకం సుబ్బారావు తాత బుచ్చయ్య గతంలో పాఠశాలకు స్థలాన్ని దానం చేశాడు. ఈ స్థలాన్ని దానం చేసిన తమ కుటుంబానికి కాకుండా వేరే మహిళకు స్వీపర్ పోస్టు ఇవ్వడంపై సుబ్బారావు అభ్యంతరం వ్యక్తంచేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆగ్రహించిన అతను శనివారం పాఠశాల గేటుకు తాళం వేశాడు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులను సమీపంలోని రచ్చబండపై కూర్చోబెట్టారు. సుమారు గంటన్నర అనంతరం ఎస్ఐ రమేష్ గ్రామానికి చేరుకుని గేటు తాళాలు తీయించి విద్యార్థులను పాఠశాలలోకి పంపారు. అనంతరం ఆయన సుబ్బరావుతో పాటు ప్రస్తుతం స్వీపర్గా పనిచేస్తున్న శైలజ అనే మహిళకు చెందిన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎస్ఎంసీ తీర్మాన ప్రకారం నాలుగేళ్ల నుంచి శైలజ స్వీపర్గా చేస్తోందని ఇప్పుడు ఎలా తొలగిస్తారంటూ ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. దీనిపై ఇరు వర్గాలతో చర్చించిన ఎస్ఐ మాట్లాడుతూ ఘర్షణ పడకుండా పాఠశాల నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఎంఈవో–2 గుండి వెంకటేశ్వర్లు కూడా పాఠశాలకు వెళ్లి జరిగిన ఘటనపై ఉపాధ్యాయులు, గ్రామస్తులనుంచి వివరాలు తెలుసుకున్నారు.రచ్చకెక్కిన స్వీపర్ పోస్టు వివాదం తెరిపించిన ఎస్ఐ రమేష్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఇరువర్గాలకు సూచన -
చేపల వేటలో వినూత్నం
బొత్త పద్ధతిలో ఎరచింతూరు: ఏజన్సీ ప్రాంతంలో గిరిజనులు చేపలవేట సాగించే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మండలంలోని పెదశీతనపల్లికి చెందిన శ్యామల చిన్నరాజులు సోకిలేరు వాగులో వినూత్నంగా బొత్త పద్ధతిలో చేపలవేట కోసం ఏర్పాటుచేసిన ప్రక్రియ అబ్బుర పరుస్తోంది. వాగు ఒడ్డున తాటాకులు, వెదురు బొంగులతో చిన్నపాటి చెరువులా గొయ్యని ఏర్పాటుచేసి అందులోకి చేపలు వచ్చేలా ఓ మార్గం ఏర్పాటుచేసాడు. ఆ నీటిలో తాటాకులు, పచ్చి కొమ్మలు, వేశాడు. అనంతరం దానిలో రెండు, మూడ్రోజుల పాటు ప్రతిరోజూ వరిపొట్టు, అన్నం, నూకలు వేస్తున్నట్లు చిన్నరాజులు తెలిపాడు. ఆహారాన్ని తినేందుకు వచ్చిన చేపలు పచ్చిరొట్టలో ఇరుక్కుని ఉంటాయని, చేపలు ఇరుక్కున విషయాన్ని గమనించి అవి తిరిగి బయటకు వెళ్లకుండా ద్వారం మూసేస్తానని తెలిపాడు. అనంతరం పచ్చిరొట్టలో ఇరుక్కుపోయిన చేపలను సేకరిస్తానని తెలిపారు. -
కాకిలెక్కలు
పంట నష్టం అంచనాల్లోసాక్షి,పాడేరు: జిల్లాలో జరిగిన పంట నష్టానికి సంబంధించి అధికారులు చెబుతున్నదానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చెబుతున్న లెక్కలు వేర్వేరుగా ఉండటంతో సర్వే తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో వరితోపాటు రాగులు,ఇతర చిరుధాన్యాల పంటలకు సంబంధించి గురువారం నాటికి 1501 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు కలెక్టరేట్ నుంచి ప్రకటన విడుదల అయింది. పూర్తిస్థాయి సర్వే అనంతరం నష్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ దినేష్కుమార్ పేర్కొన్నారు. అయితే శనివారం సాయంత్రానికి పంట నష్టం లెక్కలు మారిపోయాయి. అనంతగిరి, అరకులోయ, హుకుంపేట, పాడేరు, కొయ్యూరు, దేవీపట్నం మండలాల్లో కేవలం అన్ని పంటలు కలిపి 38.36 హెక్టార్లలో మాత్రమే నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయాధికారి ఎస్బీఎస్ నందు ‘సాక్షి’కి చెప్పడం గమనార్హం. జిల్లాలో పంట నష్టం సర్వే ఏవిధంగా జరిగిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని గిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం పెరుగుతుందని అంతా భావించిన తరుణంలో తగ్గడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ● జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.వరితో పాటు రాగులు,సామలు,కొర్రలు తదితర పంటలు ముంపునకు గురయ్యాయి.పైరు పలు చోట్ల నేలవాలింది. నష్టం గుర్తించడంలో సర్వే పారదర్శకంగా జరగలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ● హుకుంపేట మండలంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మాసాడ ప్రాంతంలో ఎకరా విస్తీర్ణంలో కోసిన వరి పనలు తుపానుకు తడిచిపోయాయి. వీటిని ఆరబెట్టేందుకు శనివారం బయటకు తీయగా మొలకలు రావడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ మూడు రోజుల్లో పంట నష్టం సర్వేకు అధికారులు, సిబ్బంది ఎవరూ రాలేదని వారు వాపోతున్నారు. పారదర్శకంగా సర్వేలు జరగని ఇలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడేరు నియోజకవర్గంలో పాడేరు, జి.మాడుగుల, కొయ్యూరు, చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల పరిధిలో వరిపైరుకు 100 ఎకరాల్లో నష్టం వాటిల్లగా బాధిత రైతులు 200మంది వరకు ఉంటారని అంచనా. వరిపంట ముంపునకు గురవ్వడం, నేలవాలడంతో సుమారు రూ.10లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.అలాగే సుమారు 120 ఎకరాల్లో రాగులు, చిరుధాన్యాల పంటలు దెబ్బతినగా సుమారు రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. అరకులోయ టౌన్: తుపాను ప్రభావానికి అరకు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వరి, చోడి(రాగులు) పంటలకు నష్టం వాటిల్లింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంట నష్టశాతం చూడకుండా పరిహారం ఇచ్చారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 33 శాతం పైబడి నష్టం వాటిల్లిన రైతులకు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో 33 శాతం లోపు పంట నష్టపోయిన వందలాది మంది గిరిరైతులు ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని అరకులోయ, అనంతగిరి, హుకుంపేట మండలాల్లో మాత్రమే 33 శాతం పంట నష్టం జరిగిన రైతుల జాబితాను ప్రభుత్వానికి నివేదిస్తామని అరకులోయ వ్యవసాయశాఖ ఏడీ వంగవీటి మోహన్రావు తెలిపారు. డుంబ్రిగుడ, పెదబయలు, మంచంగిపుట్టు మండలాల్లో 33శాతానికి పైబడి ఎటువంటి పంట నష్టం వాటిల్లలేదని ఆయన పేర్కొన్నారు. ● నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 33శాతం లోపు నష్టపోయిన రైతులు సుమారు 500 మంది వరకు ఉన్నారు. వంద ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. వరి సుమారు 65 ఎకరాలు, చోడి సుమారు 35 ఎకరాల్లో దెబ్బతింది. సుమారు రూ.15 లక్షలమేర పంట నష్టం వాటిల్లింది. అయితే 33శాతానికి మించి నష్ట పోయిన వారిలో అరకులోయ, అనంతగిరి, హుకుంపేట మండలాల్లో 102 మంది రైతులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. 36.07 ఎకరాల్లో రూ.4,59,347 మేర నష్టం జరిగిందని వారు తెలిపారు. వరి 25.77, చోడి 10.30 ఎకరాల్లో దెబ్బతిన్నట్టుగా వారు పేర్కొన్నారు. దేవీపట్నం / రాజవొమ్మంగి: మోంథా తుపానుకు తీవ్రంగా పంటలు నష్టపోయామని, ప్రభుత్వం పారదర్శకంగా నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో 16 మందికి చెందిన 21.66 ఎకరాల్లో వరి పంట నష్టం కలిగిందని వారు వాపోతున్నారు. దీనిపై ఇప్పటికి అధికారులు ఓ అంచనాకు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో ఆరుగురు రైతులకు చెందిన ఆరు ఎకరాల్లో పక్వానికి వచ్చిన మినుము పంట తుపాను వర్షాలకు పూర్తిగా దెబ్బతిందని వారు తెలిపారు. రాజవొమ్మంగి మండలంలో పత్తి, బర్లీ, మిరప పంటలపై ప్రభావం చూపింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి పత్తిపైరు నేలవాలింది. కొండపోడులో సాగు చేస్తున్న బర్లీ పొగాకుకు నష్టం జరిగిందని రైతులు తెలిపారు. అక్కడక్కడ సాగు చేపట్టిన మిరప పైరు దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు. పంట నష్టం 38.36 హెక్టార్లు తుపాను వర్షాలకు జిల్లాలోని ఆరు మండలాల్లో 38.36 హెక్టార్లలోనే వరితో పాటు అన్ని పంటలకు నష్టం ఏర్పడింది. పంట నష్టాలపై సమాచారం ఉన్నచోట సర్వే జరిపాం. మొదట్లో పంట నష్టం ఎక్కువగా ఉంటుందని భావించాం. వర్షాలు తగ్గిన తరువాత పంట నష్టాలపై సర్వే జరపగా తక్కువగా కనిపించింది. – ఎస్బీఎస్ నందు, జిల్లా వ్యవసాయాధికారి, పాడేరు చాలా చోట్ల సర్వేకు రాలేందటున్నబాధిత రైతులు 1501 హెక్టార్లలో నష్టం జరిగిందనితొలుత కలెక్టరేట్ ప్రకటన ఇప్పుడు 38.36 హెక్టార్లలో మాత్రమే నష్టం జరిగిందంటున్నజిల్లావ్యవసాయాధికారి నందు పొంతన లేని పంట నష్టం వివరాలు పారదర్శకంగా చేపట్టలేదనిగిరి రైతుల ఆవేదనమోంథా తుపానుకు జరిగిన పంట నష్టానికి సంబంధించిన అంచనాలురోజుకోరకంగా ఉంటున్నాయి. మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహించాయి. పంట భూములను ముంచెత్తాయి. దీంతో వరి, రాగులు, చిరుధాన్యాల పంటలు దెబ్బతినడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నష్టం ఎక్కువగా జరిగినప్పటికీ అధికారులు చేపట్టిన సర్వే కాకిలెక్కలను తలపిస్తోందని గిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సరుకులు తెచ్చుకోవాలంటే వాగులు దాటాల్సిందే
● వంతెనలు లేక ఎర్నాపల్లి గిరిజనుల అవస్థలు చింతపల్లి: మండలంలో ఎర్నాపల్లి గ్రామ గిరిజనులు నిత్యావసరాలు తెచ్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఎర్రబొమ్మలు పంచాయతీ పరిధిలో గల ఈ గ్రామం నుంచి బయటకు రావాలంటే రెండు వాగులు దాటాల్సిందే. మోంథీ తుపాను ప్రభావం తగ్గినప్పటికీ వీటి ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో నిత్యావసరాలు తెచ్చుకునేందుకు వారు శనివారం ఈ రెండు వాగులను దాటాల్సి వచ్చింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణంపై వాగులపై వంతెనలు నిర్మించాలని వారు కోరుతున్నారు. -
కన్నులపండువగా శ్రీనివాసుని కల్యాణం
● తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహణ ● వేలాదిగా తరలివచ్చిన భక్తజనం చింతపల్లి: కలియుగ దైవం శ్రీనివాసుని కల్యాణం కన్నులపండువగా జరిగింది.ఈ కార్యక్రమాన్ని చిట్రాలగొప్పు సమీప నూకాంబిక ఆలయ ప్రాంగణంలో శనివారం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సూపరింటెండెంట్ క్రాంతికుమార్ పర్యవేక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు జరిపించారు. ఉదయం 11 గంటలకు టీటీడీ ప్రధాన అర్చకుడు శ్రీ సాయిస్వామి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం జరిగింది. చింతపల్లి, గూడెంకొత్తవీధి, జి.మాడుగుల, కొయ్యూరు తదితర మండలాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. గొందిపాకుల వలంటీర్ల బృందం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రోగులకు వైద్యపరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారీగా అన్నసమారాధన ఏర్పాటుచేశారు. ఇందుకు గొందిపాకల గ్రామస్తులు విరాళాలు అందించి సహకరించారు. ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసి పోతురాజు బాలయ్య పడాల్, గొందిపాకల, ఎర్రబొమ్మలు సర్పంచ్లు సాగిన వరలక్ష్మి, లోతా పండన్న, ఎంపీటీసీలు మోహన్రావు, సత్తిబాబు, హిందూ ధర్మప్రచార పరిషత్, కల్యాణ ప్రాజెక్టు ఆర్గనైజర్లు హరికృష్ణ, చెంగలరావు, ప్రోగ్రాం అసిస్టెంట్లు చల్లా సత్యనారాయణ, కె.మహేశ్వరరెడ్డి, కార్యనిర్వాహకులు గెమ్మిలి అబ్బాయినాయుడు, బౌడు గంగరాజు, కుశలవుడు,సింహాచలం, యశ్వంత్, వెంకటేష్, రామ్మూర్తి పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్షల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు
● డీఈవో బ్రహ్మాజీరావు పాడేరు : రాబోయే టెన్త్ పరీక్ష కేంద్రాల్లో హజరయ్యే విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు సమకూర్చుతామని డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. కలెక్టర్ దినేష్కుమార్, ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు శ్రీనివాసులరెడ్డి ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సెయింటాన్స్ ఉన్నత పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో కాంపౌండ్ వాల్, బెంచీలు, లైట్లు, ఫ్యాన్లు, టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలు, ఫర్నిచర్, ఇతర అన్ని సౌకర్యాలను పరిశీలించారు. సౌకర్యాలు లేకపోతే అన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని హెచ్ఎంలకు ఆదేశించారు. ఆయన వెంట ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఆర్. శశికుమార్, విద్యశాఖాధికారులు మోరీ జాన్, సరస్వతిదేవి పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న సాంస్కృతికనృత్యోత్సవాలు
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మతల్లి పేరుతో తొలిసారిగా మోద అవార్డ్స్–2025 గిరి శీతల సాంస్కృతిక నృత్యోత్సవాలను స్థానిక ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే భరతనాట్యం, కూచిపూడి పోటీలకు అనేక ప్రాంతాలకు చెందిన బాలికలు తరలివచ్చారు. పోటాపోటిగా చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తొలిరోజు పోటీల్లో పాల్గొన్న బాలికలకు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, గిడ్డి ఈశ్వరి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో నృత్యాంజలి డ్యాన్స్ అకాడమి గురువు చైతన్యప్రభు, గిరి కై లాస క్షేత్రమండలి సభ్యురాలు కొట్టగుళ్లి రమాదేవి, ఇతర ప్రతినిధులు కొండపల్లి సత్యవతి, నిర్మల, వెంకటరావు పాల్గొన్నారు. -
సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఘన నివాళి
రంపచోడవరం: రంపచోడవరం ఐటీడీఏలో సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పీవో స్మరణ్రాజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యత, సమగ్రత కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఏపీవో డీఎన్వీ రమణ, మేనేజర్ రాజు పాల్గొన్నారు. చింతూరు: సర్దార్ వల్లభాయ్పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక ఐటీడీఏలో ఏక్తాదివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ తదితరులు పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీవో మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ఏక్తా, సమగ్రత, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఏపీవో రామతులసి, ఏవో రాజ్కుమార్, ఎస్డీసీలు చంద్రశేఖర్, బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
కాఫీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పాడేరు రూరల్: కాఫీ కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో కార్మికులు ఏపీఎఫ్డీసీ డివిజనల్ మేనేజర్ కృష్ణబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుందరరావు మాట్లాడుతూ 2024లో కాఫీ కార్మికులతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందినప్పటికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదన్నారు, ఏటా అక్టోబర్లో పెంచాల్సిన రోజువారీ కూలి ధరలు ఈ ఏడాది పెంచలేదన్నారు. వివిధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాల్సిన ఉన్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదన్నారు. దీనివల్ల ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోందన్నారు. హెల్పర్లకు ప్లాంటేషన్ కండక్టర్గా పదోన్నతి కల్పించాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్మికులు చిన్నలమ్మ, అప్పలమ్మ, లక్ష్మి, కాంతామణి పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందరరావు డిమాండ్ -
గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
సీలేరు: మోంథా తుపాను ధాటికి ఏపీ జెన్ కో సీలేరు నుంచి డొంకరాయి వెళ్తున్న 33 కెవి విద్యుత్తు వైర్లపై రెండు భారీ వృక్షాలు కూలిపోవడంతో మంగంపాడు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గూడెం కొత్తవీధి మండల సబ్ స్టేషన్ నుంచి దుప్పులువాడ స్టేషన్ వచ్చే 33 విద్యుత్ వైర్లపై సంపంగి గొంది అటవీ ప్రాంతం వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు భారీ చెట్టు కూలిపోయింది. దీంతో దుప్పుల వాడ. దారకొండ. గుమ్మురేవుల. అమ్మవారి దారకొండ వంటి పంచాయతీ వందల గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. -
అవినీతి నిర్మూలనకు సహకరించండి
సీలేరు: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏపీ జెన్ కో సెక్యూరిటీ విజిలెన్న్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఇన్చార్జి ఈఈ జయపాల్ మాట్లాడుతూ అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సెక్యూరిటీ విజిలెన్స్ ఇన్చార్జి కోటేశ్వరరావు, ఏవో సత్యనారాయణ, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. మోతుగూడెం: విజిలెన్స్ అవేర్నెస్ వీక్లో భాగంగా శుక్రవారం ఏపీ జెన్కో సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం డీఏవీ స్కూల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. చీఫ్ ఇంజనీర్ రాజారావు, ఎస్ఈ చినకామేశ్వరరావు, డీఈ బాలకృష్ణ, సెక్యూరిటీ ఇన్చార్జి ప్రసాద్బాబు తదితరులు పాల్గొన్నారు. -
అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమబోర్డు
● ఏర్పాటుకు ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ అమర్ డిమాండ్ పాడేరు రూరల్: అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ అమర్ డి మాండ్ చేశారు. జిల్లా కేంద్రం పాడేరులోని అంబేద్కర్ కూడలిలో శుక్రవారం ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా అవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 105 సంవత్సరాల చరిత్ర గల పోరాట కార్మిక సంఘం ఏఐటీయూసీ అన్నారు. పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఉందన్నారు. కార్మికుల చట్టాలు, హక్కులను నిర్వీర్యానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు రమేష్, అప్పలరాజు, శ్రీను, అశోక్ పాల్గొన్నారు. -
గ్రామాల్లో రన్ ఫర్ యూనిటీ
రంపచోడవరం/ముంచంగిపుట్టు/జి.మాడుగుల/కొయ్యూరు/సీలేరు/అడ్డతీగల/రాజవొమ్మంగి: పోలీసు అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు యూనిటీ రన్ను శుక్రవారం నిర్వహించారు. జాతీయ జెండాలతో పురవీధుల్లో పోలీసులతో కలిసి విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. పోలీసుల త్యాగాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రంపచోడవరంలో డీఎస్పీ సాయి ప్రశాంత్, సీఐలు, ఎస్ఐల, సీఆర్పీఎఫ్ కమాండెంట్లు తదితరులు మాట్లాడారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగులు మరువలేనివన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసుశాఖ పని చేస్తుందన్నారు. దేశరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో ఎందరో పోలీసులు సంఘ విద్రోహుల చేతుల్లో అశువులు బాశారన్నారు. ప్రతీ పౌరుడు దేశ సమగ్రతను కాపాడే బాధ్యతను తీసుకోవాలని వారు తెలిపారు.ప్రజాస్వామ్యం, సమాజ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగనిరతికి జోహర్లు అర్పించారు. రంపచోడవరంలో డీఎస్పీ సాయిప్రశాంత్ ఆధ్వర్యంలో సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ముంచంగిపుట్టులో ఎస్ఐ రామకృష్ణ, జి.మాడుగులలో సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ షణ్ముఖరావు, సీఆర్పీఎఫ్ 198బిఎన్ అసిస్టెంట్ కమాండెంట్ వినయ్గన్ తదితరులు పాల్గొన్నారు. కొయ్యూరులో సీఐ శ్రీనివాసరావు, కొయ్యూరు, మంప ఎస్ఐలు కిషోర్వర్మ, శంకర్రావు , ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్, అధ్యాపకులు పాల్గొన్నారు. సీలేరులో ఎస్ఐ యాసీన్, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. అడ్డతీగలలో సీఐ బి.నరసింహమూర్తి, ఎస్ఐ వినోద్ తదితరులు పాల్గొన్నారు. రాజవొమ్మంగిలో సీఐ గౌరీ శంకర్, ఎస్ఐ చినబాబు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. చింతూరులో సీఐ గోపాలకృష్ణ ,ఎస్ఐ రమేష్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ తదితరులు పాల్గొన్నారు. మోతుగూడెంలో ఎస్ఐ ఎస్కె సాధిక్ , సీఆర్పీఎఫ్ డీఎస్పీ లలిత్కుమార్, జెన్కో సెక్యూరిటీ ఇన్చార్జి ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
సేవలను సద్వినియోగం చేసుకోవాలి
● ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ కూనవరం: గిరిజన ప్రాంతాల్లో ఏఎస్డీఎస్ సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమలు అభినందనీయమని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ అన్నారు. మండల పరిధిలోని బొజ్రాయిగూడెం, తాళ్లగూడెం, కొడేరు, రావిగూడెం గ్రామాల్లో 287 గిరిజన కుటుంబాలకు ఏఎస్డీఎస్ సంస్థ సమకూర్చిన నిత్యావసర కిట్లను ఆయన శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీవో శుభం నొఖ్వాల్ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిరిజన గ్రామాల్లో సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. గ్రామస్తులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తహసీల్దార్ కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాథరావు, నాగిరెడ్డి, రాము, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. -
70 కిలోల గంజాయి స్వాధీనం
కశింకోట: స్థానిక పోలీసులు శుక్రవారం 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆరుగుర్ని అరెస్టు చేశారు. ఏడు సెల్ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాలు... ముందగా అందిన సమాచారం మేరకు స్థానిక విల్లా ప్రాంతంలో జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో వచ్చిన ఆటోను పరిశీలించగా గంజాయి బయటపడింది. 35 ప్యాకెట్లలో 70 కిలోల గంజాయి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కుమార్, కొర్రా సత్తిబాబు, పాంగి ధర్మరాజు, కొర్రా బొంజిబాబు, సిందేరి జక్రయ్య, సేనాపలి మాణిక్యంలను అరెస్టు చేసినట్టు సీఐ చెప్పా రు. వారి నుంచి ఏడు సెల్ ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ తనిఖీల్లో హెచ్సీ జి.మధుబాబు, పీసీలు ఎల్.రాజశేఖర్, డి.గోపి, బి.ఉమామహేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, వై.లక్ష్మణ్, బి. మహేశ్వరరావు, కె.బ్రహ్మాజీ, జె. కృష్ణ, పాల్గొన్నారు. -
దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్కుమార్ తెలిపారు. సంబల్పూర్–బెంగళూరు కంటోన్మెంట్ (08335) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈనెల 20వ తేదీ ఉదయం 6.30 గంటలకు సంబల్పూర్లో బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 3.28 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 11.15 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు కంటోన్మెంట్–సంబల్పూర్ (08336) స్పెషల్ రైలు ఈనెల 24వ తేదీల్లో ఉదయం 5.30 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్లో బయల్దేరి, మరుసటిరోజు తెల్లవారు 2 గంటలకు దువ్వాడకు, అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు సంబల్పూర్ చేరుకుంటుంది. కటక్–బెంగళూరు కంటోన్మెంట్ (08445) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈనెల 21వ తేదీ ఉదయం 5 గంటలకు కటక్లో బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 3.28 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు మధ్యాహ్నం 10.45 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు కంటోన్మెంట్–కటక్(08446) స్పెషల్ రైలు ఈనెల 25వ తేదీ ఉదయం 5.30 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్లో బయల్దేరి, మరుసటిరోజు తెల్లవారు 2 గంటలకు దువ్వాడకు, అదేరోజు ఉదయం 11.30 గంటలకు కటక్ చేరుకుంటుంది. -
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
● కలెక్టర్ దినేష్కుమార్ ● 135 అర్జీల స్వీకరణపాడేరు : సమస్యలు పరిష్కారంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని కలెక్టర్ దినేషకుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇతర అధికారులతో కలిసి ఆయన 135 వినతులను స్వీకరించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కారమయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100ను వినియోగించుకోవాలని సూచించారు. అర్జీల పరిష్కార సమాచారం తెలుసుకునేందుకు కాల్ సెంటర్ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మలత, ఇంచార్జీ ఆర్డీవో లోకేశ్వరరావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బీఎస్ నందు, డీపీవో చంద్రశేఖర్, జిల్లా పరిశ్రమల అధికారి రమణారావు, జిల్లా ప్లానింగ్ అధికారి ప్రసాద్ పాల్గొన్నారు. ఘనంగా వల్లభాయ్ పటేల్ జయంతి స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ దినేష్కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. -
రాత్రి వేళల్లో డ్రోన్ల సంచారంపై ఫిర్యాదు
● ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ ● బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ అరకులోయ టౌన్: జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మించే పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో డ్రోన్లు ఎగురుతుండటంపై పాడేరు డీఎస్పీకి ఫిర్యాదు చేశామని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ తెలిపారు. శుక్రవారం ఆయన గిరిజన సంఘ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాత్రివేళ డ్రోన్లు ఎగురుతుండటంపై పరిసర గ్రామాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారన్నారు. హైడ్రోపవర్ ప్రాజెక్టు కోసం అరకులోయ మండలంలోని తోరడంవలస, లండిగుడ, అనంతగిరి మండలం వేంగడ, మెట్టుపాడు, గాఫ్యవలస, గోమంగి పాడు, దాళిమ్మపుట్టు, కొత్తవలస, వాలసీ, హుకుంపేట మండలం మజ్జివలస, కుసుమవలస, పట్టాం పరిసరాల్లో బుధవారం, గురువారం రాత్రి వేళల్లో డ్రోన్లు ఎగరడాన్ని స్థానిక గిరిజనులు గుర్తించారన్నారు. నవయుగ కంపెనీకి చెందిన వ్యక్తులే ఇందుకు కారణం కావచ్చని అనుమానిస్తున్నామన్నారు. సర్వేలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అనుమానితులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్, ఎస్పీ ప్రకటించారని, ఇప్పుడు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సంఘ మండల కార్యదర్శి జి. బుజ్జిబాబు, రాము, కిల్లో బుజ్జిబాబు, వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ బురిడి దశరథ్, జిల్లా కో కన్వీనర్లు జగన్నాథం, మగ్గన్న పాల్గొన్నారు. -
పక్కాగా వారాంతపు ప్రణాళిక అమలు
పాడేరు : పీహెచ్సీల వారీగా గ్రామ స్థాయిలో నిర్వహించాల్సిన వైద్య సేవలపై రూపొందించిన వారంతపు ప్రణాళికను పక్కాగా అమలు చేసి శతశాతం పూర్తి చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ డి. కృష్ణమూర్తి నాయక్ ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి జిల్లాలోని 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మలేరియా సబ్ యూనిట్ అధికారులు, హెల్త్ సూపర్వైజర్లతో జూమ్ ద్వారా వారంతపు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయూష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో 12 రకాల వైద్య సేవలను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రోజుకు 25 మందికి రోగ నిర్ధారణ పరీక్షలు జరిపి చికిత్స అందించాలన్నారు. మాతా, శిశువులకు నిర్దేశించిన సమయానికి టీకా వేయాలన్నారు. కీటక జనిత వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను ఆయన తెలుసుకున్నారు. రాఫిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసి ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్, హెల్త్ సూపర్వైజర్ల సాయంతో గుర్తించిన మలేరియా కేసులకు సత్వర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూల్ హెల్త్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రోగ నిర్థారణ అయితే వైద్యం అందించాలని సూచించారు. క్షయ రోగులకు నెలకు పౌష్టికాహార నిమిత్తం అందించే రూ.వెయ్యి సకాలంలో అందేలా చూసి వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వైద్యారోగ్య శాఖపై సమీక్షలు నిర్వహించినప్పుడు పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆయన ఆదేశించారు. పచోడవరం డివిజన్ మారేడుమిల్లి పీహెచ్సీ, తాడేపల్లి ఆయూష్మాన్ ఆరోగ్య మందిర్లో సీహెచ్వోగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన డి. చైతన్య ప్రియ కుటుంబానికి యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.3 లక్షల చెక్కును డీఎంహెచ్వో అందజేశారు. ఈ క్రమంలో ఏడీఎంహెచ్వో డాక్టర్ టి. ప్రతాప్, డాక్టర్ పుల్లయ్య, డాక్టర్ సరిత, జిల్లా కుష్టువారణ అధికారి డాక్టర్ కిరణ్కుమార్, జిల్లా మలేరియా అధికారి తులసి, జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ కమలకుమారి,యాక్సిస్ బ్యాంకు నోడల్ అధికారి పి. శ్యాంబాబు, జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ఏవో సత్యనారాయణ పాల్గొన్నారు.డీఎంహెచ్వో కృష్ణమూర్తి నాయక్ -
పాడేరు ఐటీడీఏకు ఆది కర్మయోగి పురస్కారం
పాడేరు : ఆదికర్మయోగి అభియాన్ ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే కాకుండా గ్రామాల్లో మౌలిక వసతులు, కెరియర్ ప్లాన్ నిర్మించేలా తయారుచేసిన విలేజ్ యాక్షన్ ప్లాన్కు గుర్తింపు లభించిందని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తెలిపారు. ఈ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పాడే రు ఐటీడీఏకు ఆది కర్మయోగి పురస్కారం అందజేసినట్టు ఆమె పేర్కొ న్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఐటీడీఏలోని తన చాంబర్లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ యాక్షన్ ప్లాన్ ద్వారా రాబోయే ఐదేళ్లలో గిరిజన ప్రాంతాలను సమూలంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. బిర్సాముండా జయంతి పురస్కరించుకుని జన జాతీయ గౌరవ దివస్ మహోత్సవాలను శనివారం నుంచి ఈనెల 15 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా శనివారం ఉదయం ఐటీడీఏ నుంచి స్థానిక కాఫీ హౌస్ వరకు కార్నివాల్ నిర్వహిస్తామన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిచేలా వివిధ ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కాఫీ హౌస్లో మొక్కలు నాటుతామన్నారు. బిర్సా ముండా, గిరిజన స్వతంత్య్ర సమరయోధుల చిత్రపటాలలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తామన్నారు. ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్తో కలిసి గిరిజన సంస్కృతి, కళలు, వేషధారణ తదితర అంశాలపై డాక్యుమెంటరీ చేస్తామన్నారు. వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న గిరిజనులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆమె పిలపునిచ్చారు. విలేజ్ యాక్షన్ ప్లాన్కు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు నేటి నుంచి 15 వరకు జన జాతీయ గౌరవ దివస్ మహోత్సవాలు పీవో తిరుమణి శ్రీపూజ -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు గిరిజన విద్యార్థి ఎంపిక
ముంచంగిపుట్టు: రాష్ట్రస్థాయి అండర్ 17 కబడ్డీ పోటీలకు మండలంలోని పెదగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో టెన్త్ చదువుతున్న వంతాల పాపారావు ఎంపికయ్యాడు. ఇటీవల పాడేరులోని తలరిసింగ్ క్రీడా మైదానంలో జరిగిన అండర్ 17 కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెలలో విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాడు. మండలంలోని రంగబయలు పంచాయితీ జర్రెలపొదర్ గ్రామానికి చెందిన పాపారావు ఎంపికపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెదగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో హెచ్ఎం కె.నారాయణ, పీడీ విశ్వనాథం,ఉపాధ్యాయులు గజేంద్ర, గుండుపడాల్, జగన్నాథం, ప్రసాద్ తదితరులు అతనిని అభినందించారు. -
మారేడుమిల్లి ఏకలవ్యలో కళా ఉత్సవ్
● ఈనెల 3నుంచి 5వ తేదీ వరకు నిర్వహణ ● ఏర్పాట్లను పరిశీలించిన పీవో స్మరణ్రాజ్ రంపచోడవరం: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో కళా ఉత్సవ్–2025ను ఘనంగా నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ ఆదేశించారు. శుకవ్రారం ఆయన మారేడుమిల్లి ఏకలవ్య పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు కళా ఉత్సవ్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన గ్రూప్ డ్యాన్సులు, పాటలు, గిరిజన తెగల వాయిద్యాలు ప్రదర్శిస్తారని తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రిన్సిపాల్ శంకర్ప్రసాద్, ఏడీఎంఅండ్హెచ్వో సరిత, ఎంపీడీవో బాపన్నదొర, ఎంఈవో ముత్యాలరావు, తహసీల్దార్ బాలాజీ, ఆర్ఐ ఏసుబాబు పాల్గొన్నారు. -
అన్నవరం పోలీసుస్టేషన్ తనిఖీ
చింతపల్లి: మండలంలోని అన్నవరం పోలీసుస్టేషన్ను ఎస్పీ అమిత్బర్దర్ శుక్రవారం తనిఖీ చేశారు.చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రాతో కలసి పోలీస్స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించి కేసుల వివరాలు తెలుసుకున్నారు.అనంతరం రికార్డులను పరిశీలించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రహిత జిల్లాగా గుర్తింపు తెచ్చేందుకు పోలీసులు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలన్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి గంజాయి రవాణా కాకుండా ఎప్పటికప్పుడు పోలీసు గస్తీ చేపట్టాలన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా రవాణా అవుతున్న దృష్ట్యా వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు.కార్యక్రమంలో సీఐ వినోద్బాబు, ఎస్ఐ వీరబాబు పాల్గొన్నారు. -
‘హైడ్రోపవర్’ పోరాటంపై కలెక్టర్ వ్యాఖ్యలు సరికాదు
చింతపల్లి: హైడ్రోపవర్ ప్రాజెక్ట్, పంప్డ్ స్టోరేజ్ బాధిత గిరిజనుల తరఫున పోరాటం చేస్తున్న నాయకులపై క్రిమినల్ కేసులు పెడతామని వ్యాఖ్యలను కలెక్టర్ దినేష్ కుమార్ వెనక్కి తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా గౌరవ అధ్యక్షుడు, ఎర్రవరం హైడ్రోపవర్ బాధిత గిరిజన సంఘ కన్వీనర్ బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎర్నాపల్లిలో హైడ్రోపవర్ ప్రాజెక్టు బాధిత గిరిజనులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న జిల్లా కేంద్రంలో హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిపుణుల కమిటీతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో హైడ్రోపవర్ ప్రాజెక్టుల పేరుతో పోరాటాలు చేయడాన్ని కలెక్టర్ తప్పుపట్టారన్నారు. పోరాటాల్లో పాల్గొన్న నాయకులపై క్రిమినల్ కేసులు పెడతామని ఎస్పీ సమక్షంలో ఆయన హెచ్చరించడం సరికాదన్నారు. గిరిజన ప్రాంతంలో భూబదలాయింపు చట్టాలు ఉన్నప్పటికీ భూభాగాన్ని ఖనిజాలు, ప్రాజెక్టుల పేరుతో కళ్లముందే ఆదివాసీలు కోల్పోతున్నప్పుడు రక్షించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.ఆదివాసీ భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అధికారం ఉందని అదాని, నవయుగ, షిరిడిసాయి వంటి ప్రైవేట్ సంస్థలకు జీవోలు ఇచ్చి రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్నారని మండి పడ్డారు. ప్రాజెక్టుల్లో గిరిజనులకు ఉపాధి కల్పిస్తామని కలక్టర్ ప్రకటించారని, గిరిజన ప్రాంతంలో తమ ఉద్యోగాలే తమకు లేవని.. అలాంటిది ఉద్యోగాలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. అనంతగిరి, అరకు, హుకుంపేట, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు గిరిజన చట్టాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాయని ధ్వజమెత్తారు. గిరిజన చట్టాలను కాపాడాల్సిన కలక్టర్ పోరాటాలు చేస్తున్న గిరిజన నాయకులపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించడం ఎంతవరకూ సమంజస మన్నారు. ప్రాజెక్టులు పేరుతో ఆదివాసీలను గిరిజన భూబాగం నుండి గెంటివేసే కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా గిరిజనులంతా ఒకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎర్రబొమ్మలు సర్పంచ్ లోతా పండయ్య, ఉప సర్పంచ్ సెగ్గే సోమరాజు, గిరిజన సంఘం జిల్లా ఉపాద్యక్షులు పాంగి దనుంజయ్, కోకన్వీనర్ వెంకటేశ్వర్లు ,తాంబేలు బాబూరావు, పాంగి కామరాజు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా గౌరవఅధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం
అరకులోయటౌన్: రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం దిగివచ్చి నిలుపుదచేసే వరకు పోరాడుదామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపు నిచ్చారు.మండలంలోని కొత్తభల్లుగుడ పంచాయతీ కొర్రాగుడ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు పార్టీ నాయకులకు గ్రామ మహిళలు గిరిజన సంప్రదాయంగా తిలకం దిద్ది, పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలు, పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 ప్రైవేట్ వైద్య కళాశాలలకు శ్రీకారం చుడితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వాటిని నిర్మించకపోగా, ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందన్నారు. దీంతో పేదలు, పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీఅధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వాడవాడలాల కోటి సంతకాలు సేకరణ, రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలన, కుట్ర రాజకీయాలను గిరిజనులను వివరిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం దిగివచ్చి వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, ఎంపీటీసీలు శత్రుఘ్న, దురియా ఆనంద్ కుమార్, స్వాభి రామచందర్, సర్పంచ్లు కొర్రా రాధిక, పాడి రమేష్, పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, పార్టీ మండల అధ్యక్ష, ఉపాద్యాక్షులు స్వాభి రామ్మూర్తి, పల్టాసింగ్ విజయ్ కుమార్, పంచాయతీ అధ్యక్షుడు కొర్రా అర్జున్, నాయకులు కమిడి అశోక్, సుందర్రావు, కామేష్, నగేష్, ఏలేష్, ధర్మనాయుడు పాల్గొన్నారు. అనంతగిరి(అరకులోయటౌన్): మండలంలోని కోనపురం పంచాయతీ కితలంగి, బొండ్యగుడ గ్రామంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ జరుపుతున్నామన్నారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలన్నారు. అనంతరం బొండ్యగుడ గ్రామంలో తుపానుధాటికి కూలిన ఇళ్లను పరిశీలించారు. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సర్పంచ్లు గుబాయి రఘునాథ్, సెంబి సన్యాసిరావు, స్వాభి అప్పలరాజు, నాయకులు సత్యనారాయణ, మిటుకు, రఘునాథ్, రామచందర్, సుందర్రావు, సుందర్రావు పాల్గొన్నారు. ముంచంగిపుట్టు: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలో గల కర్రిముఖిపుట్టు పంచాయతీ దూళిపుట్టు, గొర్రెలమెట్ట, సరసంగి, వెచ్చంగి గ్రామాల్లో వైఎస్సార్సీపీ మండల ప్రధాన కార్యదర్శి ముఖి రాంప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాలు వివరించడంతో స్వచ్ఛంధంగా సంతకాలు చేసి గిరిజనులు మద్దతూ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలనే సదుద్దేశ్యంతో వైఎస్సార్సీపీ చేసే మంచి కార్యక్రమానికి ప్రజల మద్దతూ తెలపాలని ఆయన కోరారు. నాయకులు అర్జున్, చలపతి, జోగారావు, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడుదాం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ -
పోలీసుల సాయంతో గర్భిణి ఆస్పత్రికి తరలింపు
కొయ్యూరు: ఆస్పత్రికి వచ్చేందుకు నిరాకరించిన గర్భిణిని ఎట్టకేలకు పోలీసుల సాయంతో వైద్య సిబ్బంది తరలించారు. వివరాలిలా ఉన్నాయి. బూదరాళ్ల పంచాయతి లోయలపాలెంకు చెందిన డిప్పల సంధ్య ప్రసవానికి అక్టోబర్ 22 గడువు ఇచ్చారు. ఇది దాటి పదిరోజులైన ప్రసవం కాలేదు. దీంతో ఆందోళన చెందిన వైద్యసిబ్బంది ఆమెను రాజేంద్రపాలెం పీహెచ్సీకి తరలించేందుకు కుటుంబ సభ్యులను బతిమలాడారు. అయినప్పటికీ గర్భిణి నిరాకరించింది. దీంతో వైద్యసిబ్బంది మంప పోలీసులను ఆశ్రయించారు. వారు లోయలపాలెంలోని గర్భిణి వద్దకు వచ్చి నచ్చజెప్పారు. అనంతరం 108 వాహనంలో శుక్రవారం రాజేంద్రపాలెం పీహెచ్సీకి తీసుకువచ్చారు. ఆమెను పరిశీలించిన వైద్యులు శనివారం నరీపట్నం ఆస్పత్రికి తరలించనున్నారు. -
కాటుక బంతి కన్నీరు
సాక్షి,పాడేరు: మార్కెట్లో డిమాండ్ ఉన్న సీతమ్మ కాటుక రకం బంతి సాగు చేపట్టిన రైతులకు మోంథా తుపాను నష్టం మిగిల్చింది. పూత సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మూడురోజులపాటు కురిసిన వర్షాలకు బంతితోటలు నేలవాలగా పూలు కుళ్లిపోయాయి. మొగ్గలు వాడిపోయాయి. పంట చేతికందే సమయంలో మోంథా తుపాను తీరని నష్టం మిగిల్చిందని గిరి రైతులు ఆవేదన చెందుతున్నారు. ● పాడేరు మండలంలో డి.గొందూరు, బరిసింగి, డోకులూరు, ఇరడాపల్లి, గుత్తులపుట్టు, గబ్బంగి, చింతలవీధి, జి.ముంచంగిపుట్టు, వంజంగి, వనుగుపల్లి, హుకుంపేట మండలంలోని సూకురు, మట్టుజోరు, గూడ, హుకుంపేట, తాడిపుట్టు, మఠం, తడిగిరి, శోభకోట, పెదబయలు మండలంలో పెదకోడాపల్లి, గంపరాయి, జి.మాడుగుల మండలంలో కోడాపల్లి పంచాయతీల పరిధిలోని ప్రాంతాల్లో 200 ఎకరాల్లో సాగు చేపట్టారు. ● మోంథీ తుపాను వర్షాలకు సుమారు 100 ఎకరాల్లో బంతి తోటలకు నష్టం వాటిల్లింది. మెట్ట, కొండపోడు భూముల్లో సాగు చేపట్టిన ఈ తోటల ద్వారా ఎకరాకు రూ.20 వేల వరకు ఆదాయం వస్తుంది.ఇప్పుడిప్పడే పూత ప్రారంభమైంది.ఈ సమయంలో వర్షాలకు తోటలకు పూర్తిగా నష్టం ఏర్పడింది. ఈ ఏడాది పూత ఆశాజనకంగా ఉంది. మార్కెట్లో పరిస్థితులు కలిసివస్తే ఆదాయం కూడా బాగుంటుందని గిరి రైతులు ఆశించారు. ప్రకృతి తుపాను రూపంలో వారిని కోలుకోలేని దెబ్బతీసింది. ● ఏజెన్సీలో బంతిపూలకు మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులు బుట్ట పూలను రూ.100 నుంచి రూ.200 ధర మధ్య కొనుగోలు చేసి మైదాన ప్రాంతాలకు తరలిస్తారు. రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. వచ్చే జనవరి నెల వరకు మన్యంలో బంతిపూల అమ్మకాలు భారీగా జరిగేవి. ఈ ఏడాది నెలకొన్న పరిస్థితి అమ్మకాలను బట్టి ఏజెన్సీలో సంతల్లో బంతిపూల అమ్మకాలు లేనట్టేనని వ్యాపారులు అంటున్నారు. గిరి రైతులను నష్ట పరిచిన మోంథా తుపాను వర్షాలకు నేలవాలిన తోటలు కుళ్లిపోయిన పూలు వాడిపోయిన మొగ్గలు పెట్టుబడులు దక్కని పరిస్థితి పంట చేతికందే సమయంలో కోలుకోలేని దెబ్బ కోలుకోలేని దెబ్బ తుపాను వర్షాలు బంతిపంటను నాశనం చేశాయి. ఎకరా విస్తీర్ణంలో వేసిన కాటుక రకం బంతి తోట పూర్తి పాడైంది. వేళ్లు నానిపోవడంతో వాడిపోతున్నాయి. తోటంతా నేలవాలింది. రూ.20వేల ఆదాయం రావాల్సిన బంతి తోట ఎందుకు పనికిరాకుండా పోయింది. – గొరపల్లి ప్రసాద్, బంతి రైతు, బరిసింగి, పాడేరు మండలం -
రక్షణలేనిప్రయాణం
మన్యం పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ఎత్తయిన కొండలు.. పచ్చని చెట్లు.. ఆహ్లాదం కలిగించే ఘాట్రోడ్డు ప్రయాణం.. నేటి పరిస్థితి ఇందుకు భిన్నం. జిల్లాలో పాడేరు, అనంతగిరి, మారేడుమిల్లి, రంపుల ఘాట్మార్గాల్లో ప్రయాణం ప్రమాద కరంగా మారింది. పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఎప్పుడు ఏప్రమాదం సంభవిస్తోందని ప్రయాణి కులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పాడేరు ఘాట్రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో ఘాట్ మార్గంలో అధ్వాన పరిస్థితులు మళ్లీ తెరమీదకు వచ్చాయి. వర్షం పడితే చెరువే! ప్రమాదాల నివారణకు చర్యలు పాడేరుతో పాటు అన్ని ఘాట్రోడ్లలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.కొండచరియలు విరిగిపడుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఐదు మీటర్ల మేర వెడల్పు చేసేందుకు అంచనాలు రూపొందించాం.అటవీశాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. – బాలసుందరబాబు, ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్, ఆర్అండ్బీ, పాడేరు జారిపడుతున్న కొండచరియలు, బండరాళ్లు అంతర్రాష్ట్ర రహదారి అధ్వానం సీలేరు: అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. ఈ మార్గంలో గూడెంకొత్తవీధి నుంచి ధారాలమ్మ తల్లి గుడి వరకు, సీలేరు నుంచి పాలగెడ్డ వరకు 40 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా గోతులమయంగా మారింది. అటవీప్రాంతాల్లో నీరు రోడ్డుపైకి వచ్చేయడంతో కోతకు గురైంది. వర్షం కురిసినప్పుడల్లా గోతులు చెరువులను తలపిస్తున్నాయి. గతేడాది వీటిని పూడ్చేందుకు కూటమి ప్రభుత్వం రూ.23 కోట్లు విడుదల చేసింది. గత సంక్రాంతి నాటికి పూర్తికావాల్సిన పనులు ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్లో సంభవించిన భారీ తుపానుకు గూడెంకొత్తవీధి నుంచి సీలేరు వరకు కొండచరియలు విరిగిపడటంతో సుమారు 20 చోట్ల రోడ్డు దెబ్బతింది. అప్పటిలో వాటిని తాత్కాలికంగా తొలగించినా ప్రమాదకర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సాక్షి, పాడేరు: వర్షాలు కురిసినప్పుడల్లా జిల్లాలో ఘాట్రోడ్లలో ప్రయాణం భయంభయంగా మారుతోంది. ప్రధాన రోడ్లపై కొండచరియలు, బండరాళ్లు జారిపడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదకర మలుపులు వద్ద రోడ్డును ఆనుకుని కొండలు ఉన్నందున వర్షం పడినప్పుడల్లా బండరాళ్లు, కొండచరియలు జారిపడుతున్నాయి. ● మినుములూరు నుంచి గరికబంద వరకు సుమారు 25 కిలోమీటర్ల ఘాట్రోడ్డులో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందోనని వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. పాడేరు నుంచి విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ప్రధాన రోడ్డు మార్గం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వర్షం కురినప్పుడల్లా నీరు పోయేలే డ్రైనేజీలు లేకపోవడం వల్ల రోడ్డు, రక్షణగోడలు దెబ్బతింటున్నాయి. ● వంట్లమామిడి మలుపు వద్ద రక్షణగోడలు శిథిలమయ్యాయి. సుమారు 20 మీటర్ల పొడవునా దెబ్బతినడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ● ఏనుగురాయి దిగువ ప్రాంతంలో పలు మలుపులు వద్ద రక్షణగోడల పరిస్థితి దారుణంగా ఉంది. ● వంట్లమామిడి గ్రామం దాటిన తరువాత, కోమాలమ్మ పణుకు దిగువన పలు మలుపుల్లో రక్షణగోడలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాన్నాళ్ల నుంచి ఈ పరిస్థితి నెలకొని ఉన్నా అధికారవర్గాల్లో స్పందన కరువైంది. ● వర్షం పడినప్పుడల్లా రాజాపురం వద్ద రోడ్డుపైకి వాగుల నీరు వచ్చేస్తోంది. దీనివల్ల రోడ్డు దెబ్బతింటోంది. ● ఘాట్ మార్గంలో రోడ్డుకు ఒకవైపున ఫైబర్ కేబుల్ ఏర్పాటు నిమిత్తం తీసిన గోతులను పూర్తిస్థాయిలో పూడ్చలేదు. దీనివల్ల రోడ్డుదిగినప్పుడల్లా వాహనాలు దిగిపోయే పరిస్థితి నెలకొంది. ● వంజంగి కాంతమ్మ వ్యూపాయింట్కు సమీపంలో ఇప్పటివరకు సుమారు నాలుగుసార్లు కొండచరియలు జారిపడ్డాయి. ఈ పరిస్థితులు నెలకొన్నప్పుడల్లా రోడ్డు అధ్వానంగా మారుతోంది. రాకపోకలు నిలిచిపోతున్నాయి. అయినప్పటికీ ఆర్అండ్బీ అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ● రాజాపురం డౌన్లోని మర్రిచెట్టు సమీపంలో బండరాళ్లు దొర్లిపడిన సందర్భాలు లేకపోలేదు.వర్షాలు కురిసినప్పుడల్లా ఘాట్ మార్గాల్లోప్రమాదకర పరిస్థితులు నిలిచిపోతున్న రాకపోకలు సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టని పాలకులు అనంతగిరి (అరకులోయ టౌన్): మండలంలోని శివలింగపురం నుంచి సుంకరమెట్ట వరకు సుమారు 40 కిలోమీటర్ల పొడవునా ఘాట్లో రక్షణ గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మలుపు వద్ద రక్షణగా ఏర్పాటుచేసిన ఐరన్ వాల్ వాహనాలు ఢీకొనడంతో ధ్వంసమయ్యాయి. ఈ మార్గంలో ఎనిమిది ఎయిర్పిన్ బెండ్లు ఉన్నాయి. వీటిలో3, 5, 6, ఎయిర్పిన్ బెండ్ల వద్ద పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. వర్షం పడినప్పుడల్లా భీసుపురం వద్ద కొండలపైనుంచి రోడ్డుపైకి భారీగా వరదనీరు వచ్చేస్తుంది. ఇక్కడ సుమారు 4 అడుగుల లోతున నీరు నిలిచిపోవడంతో వాహనాలు గంటలతరబడి నిలిచిపోతున్నాయి. అనంతగిరి పీహెచ్సీ సమీపంలో రోడ్డును ఆనుకుని ఊటగెడ్డ ప్రవహించడంతో కోతకు గురైంది. -
తూర్పుగోదావరి జిల్లాలో కలిపితే ఉద్యమం
జేఏసీ డివిజన్ ఛైర్మన్ జల్లి నరేష్ హెచ్చరికచింతూరు: గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గాన్ని మైదాన ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లాలో కలిపితే ఉద్యమం తప్పదని ఆదివాసీ జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ హెచ్చరించారు. గురువారం చింతూరులో జరిగిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కారం తమ్మన్నదొర పేరుతో ప్రత్యేకంగా రంపచోడవరం జిల్లాను ఏర్పాటు చేయాలని లేదంటే అల్లూరి జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేసారు. ఆదివాసీలు కోరుకుంటున్న విధంగా రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను కలిపి రంపచోడవరం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని ఆయన కోరారు. -
వంతెన నిర్మించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
డుంబ్రిగుడ: చాపరాయి గెడ్డపై వంతెన నిర్మించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సుమారు 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని చాపరాయి గెడ్డ ఉధృతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోంథా తుపాను వర్షాలు కారణంగా మూడు రోజులుగా పోతంగి పంచాయతీ పెద్దపాడు, కోసంగి, చంపపాట్టి, ఊయాలగుడ, శీలంగొంది, జాకరవలస గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయన్నారు. నిత్యావసర వస్తువులు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెద్దపాడుకు గెడ్డ అవతల నుంచి సుమారు రూ.2 కోట్లతో అడవితల్లి బాట పేరుతో తూతు మంత్రంగా నాణ్యత లేకుండా రోడ్డు నిర్మించారన్నారు. రోడ్డు నిర్మిస్తే సరిపోదని, వంతెన కూడా నిర్మించాలని సూచించారు. ఈ రోడ్డుకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గెడ్డను దాటి వెళ్లినప్పుడు వంతెన గురించి ఆలోచిస్తే బాగుండేదన్నారు. తుపాను సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. చంపాపట్టి వద్ద కాజ్వేను పరిశీలించారు. ఈ గ్రామంలో పాఠశాల భవనం దెబ్బతినడంపై గెడ్డ అవతల ఉన్న గిరిజనులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. వెంటనే భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎంఈవోలు సుందరరావు, గెన్నును ఫోన్లో ఆదేశించారు. పంట, గృహ నష్టాలపై ప్రభుత్వానికి నివేదించి బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ త్రివేణిని ఫోన్లో ఆదేశించారు. చాపరాయి, చంపాపట్టి వద్ద వంతెనలు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. అరకు, డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షులు రామూర్తి, పి పరశురామ్, నియోజకవర్గం యువ నాయకుడు రేగం చాణక్య, ఉమ్మడి జిల్లాల ఎస్టీసెల్ మాజీ అధ్యక్షుడు కమ్మిడి ఆశోక్, సర్పంచ్, ఉప సర్పంచ్లు వంతల వెంకటరావు, శెట్టి జగ్గునాయుడు, ఎంపీటీసీ రామారావు, పార్టీ గ్రామ అధ్యక్షుడు కె.దశమి పాల్గొన్నారు. -
కమనీయం శ్రీవారి కల్యాణం
సాక్షి,పాడేరు: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శ్రీవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్,ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ,అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, గూడెంకొత్తవీధి జెడ్పీటీసీ శివరత్నం, పూజాసామగ్రి, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏజెన్సీలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. లడ్డూ ప్రసాదాలను భక్తులకు టీటీడీ అధికారులు అందజేశారు. పాడేరులోని పలుశాఖల అధికారులు, ఉద్యోగులు ,వర్తకుల ఆర్థికసాయంతో భారీ స్థాయిలో అన్నసమారాధన ఏర్పాటుచేశారు. ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, రమాదేవి దంపతులు, మోదకొండమ్మ తల్లి ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, గృహనిర్మాణ సంస్థ డీఈఈ వంతెన్భ రాజబాబు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఉప్పల వెంకటరత్నం, ముకుందు, కారం దేముడు, కొణతాల సతీష్, వర్తక సంఘం ప్రతినిధులు, మహిళా భక్తులు కల్యాణోత్సవ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. టీటీడీ అర్చకులకు ఘన సన్మానం పట్టణంలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా జరిపిన తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, టీటీడీ అధికారులు ఉమానీలకంఠేశ్వరస్వామిని గురువారం దర్శించుకున్నారు. అనంతరం రాజరాజేశ్వరి దేవికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకుడు ఉప్పల రామం, ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, రమాదేవి, కమిటీ ప్రతినిధులు ఉప్పల వెంకటరత్నం, వంతెన్బ రాజబాబు దంపతులు ఘనంగా సన్మానించి, ఉమానీలకంఠేశ్వరస్వామి చిత్రపటాలను అందజేశారు. -
నేటి నుంచి రేడియోలజిస్టుల సదస్సు
హాజరుకానున్న 600 మంది రేడియాలజిస్టులు మహారాణిపేట : రాష్ట్ర రేడియోలజిస్టుల వార్షిక సదస్సు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నగరంలో నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్ ఆఫ్ ఇండియన్ రేడియోలజీకల్ ఇమేజింగ్ అసోసియేషన్(ఏపీఐఆర్ఐఏ) రాష్ట్ర అధ్యక్షుడు, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వి.సురేష్ తెలిపారు. గురువారం జగదాంబ జంక్షన్లో ఉన్న డాల్ఫిన్ డయాగ్నిస్టిక్ సెంటర్లో బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 600 మంది రేడియాలజిస్టులు, వైద్య అధ్యాపకులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు సదస్సులో పాల్గొంటారని చెప్పారు. తొలిరోజు గీతం మెడికల్ కాలేజీలో ఫీటల్ రేడియాలజీపై ప్రత్యేక వర్క్షాపు నిర్వహించనున్నామన్నారు. రెండో, మూడో రోజుల్లో వైద్య ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, శాసీ్త్రయ పత్రాల ప్రదర్శనలు జరగనున్నాయన్నారు. ఈ సారి రికార్డు స్థాయిలో 160 రేడియోలజీ పరిశోధనా పత్రాలు సమర్పిస్తున్నామన్నారు. సదస్సులో రాష్ట్ర స్థాయి రేడియాలజీ క్విజ్ నిర్వహించనున్నామన్నారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీకి చెందిన ఆచార్య డాక్టర్ రాజు శర్మ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన కాకర్ల సుబ్బారావు ఉపన్యాసం ఇవ్వనున్నారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ ఉమా మహేశ్వరరెడ్డి, డాక్టర్ బుచ్చిబాబు, డాక్టర్ వర్మ, డాక్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఆర్ఏ పునరుద్ధరణ ఎప్పుడు?
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ ఉద్యోగులు కోల్పోయిన ఇంటి అద్దె భత్యం(హెచ్ఆర్ఏ) పునరుద్ధరణ కోసం నిరీక్షిస్తున్నారు. ప్రతి నెలా కనీసం రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ కీలక అంశానికి సంబంధించి యాజమాన్యంపై ఉక్కు అధికారుల సంఘం, కార్మిక సంఘాలు గట్టిగా ఒత్తిడి తీసుకురాకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది స్టీల్ప్లాంట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినప్పుడు.. యాజమాన్యం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కొన్ని ఆర్థిక ప్రయోజనాలకు కోత విధించింది. మొదట్లో 50 శాతం జీతం మాత్రమే చెల్లించడం ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా 65 శాతం, ఒక్కోసారి 75 శాతం జీతం చెల్లిస్తూ.. మిగిలిన మొత్తాన్ని బకాయిలుగా చూపించారు. ఆ సమయంలో కార్మికులకు బేసిక్, డీఏ తర్వాత అతిపెద్ద కాంపొనెంట్గా ఉన్న హెచ్ఆర్ఏను పూర్తిగా నిలిపివేశారు. దాని ఫలితంగా, సగటు కార్మికుడు నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేలు చొప్పున, వెరసి సంవత్సరానికి సుమారు రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు నష్టపోయారు. ఆ సమయంలో కార్మిక సంఘాలు అనేక ఆందోళనలు నిర్వహించాయి. ఈ క్రమంలో రీజినల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సీ) సమక్షంలో జరిగిన చర్చల్లో, ప్లాంట్ పరిస్థితి మెరుగుపడినప్పుడు హెచ్ఆర్ఏను పునరుద్ధరిస్తామని, బకాయిలు కూడా చెల్లిస్తామని యాజమాన్యం అంగీకరించింది. లాభాల బాట పట్టినా... స్టీల్ప్లాంట్ ఉద్యోగుల కష్ట ఫలితంగా, మూడు బ్లాస్ట్ఫర్నేస్లు ప్రారంభమై ప్రస్తుతం 90 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో ముందుకు సాగుతున్నాయి. రెండు ఫర్నేస్లు ప్రారంభించిన నాటి నుంచి వెనుదిరిగి చూడకుండా కొన్ని నెలలు లాభాలు కూడా వచ్చాయి. మూడవ ఫర్నేస్ కూడా విజయవంతంగా కొనసాగుతుండటంతో, ఈ నెల నుంచి మరింత లాభాలు సాధించగలమని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఉద్యోగుల ఆర్థిక సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి. 13 నెలల తర్వాత ఉద్యోగులు నూరు శాతం జీతం అందుకున్నప్పటికీ.. వారి వేతన బకాయిలు మాత్రం 355 శాతానికి చేరుకున్నాయి. ఇదిలా ఉండగా ప్లాంట్ పరిస్థితి మెరుగుపడితే హెచ్ఆర్ఏను పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని యాజమాన్యం నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సెయిల్తో సమానంగా 2017 నుంచి జరగాల్సిన వేతన ఒప్పందం జరగకపోవడంతో ఇప్పటికే వేల రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్న కార్మికులు.. ఇప్పుడు హెచ్ఆర్ఏను కూడా పొందలేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘాల వైఫల్యంపై ఉద్యోగుల ఆగ్రహం ఈ ముఖ్యమైన విషయంలో యాజమాన్యంతో నిరంతరం చర్చించి ఒప్పించాల్సిన అధికారుల అసోసియేషన్, కార్మిక సంఘాలు విఫలమయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా గుర్తింపు సంఘం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. గుర్తింపు సంఘం ఇతర కార్మిక సంఘాలను కలుపుకుని యాజమాన్యంతో చర్చించి, తక్షణమే హెచ్ఆర్ఏ పునరుద్ధరణకు కృషి చేయాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
విధి నిర్వహణలో అలసత్వం వద్దు
డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్ పాడేరు: వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం వద్దని ప్రతి ఒక్కరి సమయపాలన పాటించాలని డీఎంహెచ్వో డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్ ఆదేశించారు. స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలో గురువారం వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న అన్ని క్యాడర్ల ఉద్యోగులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్య శాఖను ప్రగతిపథంలో నడిపించేందుకు సరైన ప్రణాళికపరంగా పని చేయాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా ఎవరికి కేటాయించిన విధులు వారు నిర్వర్తించాలన్నారు. రోజు వారీ విధులను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. జిల్లా పరిధిలోని ప్రజలు వైద్యారోగ్య సమస్యలపై ప్రతిరోజు కార్యాలయ పని దినాల్లో సాయంత్రం 3గంంటల నుంచి 6గంటలకు నేరుగా వచ్చి కలవాలని, లేకుంటే 7671868055 నంబర్కు ఫోన్ చేసి సమస్య తెలియజేయాలని సూచించారు. -
దెబ్బతిన్న వరిపైరు పరిశీలన
జి.మాడుగుల: మోంథా తుపానుకు దెబ్బతిన్న పంటలను గురువారం చింతపల్లి ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ అప్పలస్వామి, శాస్తవేత్తలు జోగా రావు, బాలహుస్సేన్రెడ్డి, ఏవో వరప్రసాద్ పరిశీలించారు. దీనిలో భాగంగా వారు సింగర్భ, నిట్టాపుట్టు, గొడ్డుబూసులు గ్రామాల్లో పర్యటించారు. ఈదురుగాలులకు నేలవాలిన వరిపైరును గుర్తించారు. ఇటువంటి పైరును కట్టలుగా కట్టి నిలబెట్టాలని రైతులకు సూచించారు. పొలాల్లో వరద నీరు నిల్వ లేకుండా అంతర్గత కాలువలు ఏర్పాటుచేసి బయటకు పంపాలని తెలిపారు. గింజ రంగు మారితే ఒక మిల్లీమీటరు ప్రొపికొనజోల్ను లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారి చేయాలని ఏడీఆర్ సూచించారు. -
తాండవకు పెరుగుతున్న వరద నీరు
నాతవరం: తాండవ రిజర్వాయరులోకి ఇన్ఫ్లో నీరు పెరగడంతో రాత్రికి ఏ సమయంలోనైనా స్పిల్ వే గేట్ల ద్వారా నదిలోకి నీటిని విడుదలను పెంచే అవకాశం ఉందని ప్రాజెక్ట్ డీఈ ఆనురాధ అన్నారు. ఆమె గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ మోంథా తుఫాన్ ప్రారంభం నుంచి తాండవ రిజర్వాయర్ ప్రమాద స్థాయి నీటి మట్టాన్ని నివారించేందుకు నాలుగు రోజులుగా స్పిల్ వే గేట్ల ద్వారా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నామన్నారు. తాండవ ప్రాజెక్టు ప్రమాద స్థాయిని బట్టి 350 క్యూసెక్కులు, తర్వాత రోజు 2400 క్యూసెక్కులు, రెండు రోజులుగా 1230 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం 377.4 అడుగులు దాటలేదన్నారు. గురువారం ఉదయం నుంచి ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో 2900 క్యూసెక్కులు అధికంగా నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందన్నారు. దీంతో ప్రాజెక్ట్లో నీటిమట్టం గురువారం సాయంత్రానికి 378 అడుగులకు పెరిగిందన్నారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే ఇన్ ఫ్లో నీటిని బట్టి ప్రాజెక్టు ప్రమాదం దృష్టిలో పెట్టుకుని స్పిల్వే గేట్ల ద్వారా నదిలోకి మరింత నీటిని రాత్రికి విడుదల చేసే అవకాశముందన్నారు. తాండవ ప్రాజెక్ట్ ప్రమాద స్థాయి నీటి మట్టం 380 అడుగులు అన్నారు. తాండవ నదిలోకి రాత్రి వేళల్లో దిగరాదని నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలకు దండోరా ద్వారా తెలియజేశామన్నారు. తగ్గుముఖం పట్టిన పెద్దేరు నీటిమట్టం మాడుగుల : మండలంలో పెద్దేరు జలాశయం నీటిమట్టం గురువారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. ఇన్ ఫ్లో 800 క్యూసెక్కులకు తగ్గింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 135 మీటర్లకు తగ్గిందని జలాశయం జేఈ సుధాకర్రెడ్డి తెలిపారు. -
వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలి
ముంచంగిపుట్టు: మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే నిర్వహించాలని వైఎస్సార్సీపీ మండల ప్రధాన కార్యదర్శులు పాపారావు, సన్యాసిరావులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కించాయిపుట్టు పంచాయతీలోని పలు గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో యువతీయువకులు స్వచ్ఛందంగా సంతకాలు చేసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పాపారావు, సన్యాసిరావులు మాట్లాడుతూ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి పేదలకు వైద్యం దూరం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నామన్నారు. కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ ఎంప్లాయిస్,పెన్షనర్ల యూనియన్ అధ్యక్షుడు మోదకొండ, వైఎస్సార్సీపీ మండల నేత కొండలరావు, పంచాయతీ బూత్ కన్వీనర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎటపాక: వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఆకుల వెంకటరామారావు ఆధ్యర్యంలో ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. అనంతరం కన్నాయిగూడెం, గుండాలలో పార్టీ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కురినాల వెంకటేశ్వర్లు, శీలం నాగేశ్వరావు, గుండాల ఉప సర్పంచ్ తోట శశి కుమార్, గుండి రాము, యర్రగొల్ల నరసింహరావు, దార రమేష్, చల్లా మణి, కాకని సురేష్, కల్పన, ముత్తిబోయిన రాము, ముక్కా శ్రీను, రాఖి సతీష్, యడ్ల బాలజీ, గుండి రామారావు, నడిపింటి దుర్గాప్రసాద్, కొత్తపల్లి సాత్విక్, మమిడి నవీన్ తదితరులు పాల్గొన్నారు -
అదుపు తప్పితే లోయలోకి..
గూడెంకొత్తవీధి: జాతీయ రహదారి 516–ఈ ప్రమాదభరితంగా మారింది. కొయ్యూరు మండలం కాకరపాడు నుంచి గూడెంకొత్తవీధి మండలం చాపరాతిపాలెం మీదుగా చింతపల్లి మండలం లంబసింగి వరకూ ప్రస్తుతం జాతీయ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరగుతున్నాయి. రహదారి నిర్మాణంలో భాగంగా రంపుల ఘాట్రోడ్లో కొండను తవ్వి దారిగా మలిచారు. మలుపుల్లో తవ్విన కొండ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జారి ప్రమాదకరంగా మారుతోంది. బండరాళ్లు, కొడచరియలు, మట్టి పెళ్లలు రహదారిపై విరిగిపడుతున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. అధికారులు రహదారిపై హెచ్చరిక బోర్డులు, ప్రమాద సూచికలు ఏర్పాటుచేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చింతూరు: మారేడుమిల్లి, చింతూరు ఘాట్రోడ్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ప్రమాదకరమైన మలుపులు వద్ద రక్షణగోడలు లేకపోవడంతో వాహనాలు అదుపుతప్పి లోయలోకి పడిపోతున్నాయి. ఇటీవల కాలంలో మలుపుల వద్ద ఏర్పాటుచేసిన ఇనుపకంచె వాహనాలకు రక్షణగా నిలవలేకపోతోంది. ● ప్రధానంగా మారేడుమిల్లి మండలం పాములేరు సమీపంలో సీతారాముల విగ్రహాలకు పైనున్న మలుపు అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఈ ప్రాంతంలో రహదారి కోతకు గురైంది. పల్లానికి దిగుతున్న భారీ వాహనాలు మలుపు తిరగలేక అదుపుతప్పి కిందనున్న రహదారిపై పడిపోతున్నాయి. గతంలో కర్నాటకకు చెందిన భక్తుల వాహనం ఇదే ప్రాంతంలో ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. కాకినాడ ప్రాంతానికి చెందిన కొంతమంది చింతూరు వచ్చి తిరిగివెళుతున్న క్రమంలో ఇదే ఘాట్రోడ్లో గోపీ టర్నింగ్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. రంపుల ఘాట్లో భయం భయం -
గంజాయి రవాణా నియంత్రణకు శాశ్వత చర్యలు
కలెక్టర్ దినేష్కుమార్పాడేరు: జిల్లాలో గంజాయి రవాణాను శాశ్వతంగా అరికట్టడానికి పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోలీస్, వ్యవసాయ శాఖ, ఉద్యాన, అటవీ, వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్, డీఆర్డీఏ, ట్రైబల్ వెల్ఫేర్, ఎకై ్సజ్, బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సమావేశంలో తీసుకున్న కార్యచరణ అమలుపై ఆరా తీశారు. జిల్లాలో ఏ ప్రాంతం నుంచి ఎక్కువ మొత్తంలో గంజాయి రవాణా అవుతున్న వివరాలను తెలుసుకున్నారు. ప్రతి నెలా నిర్వహించే సమీక్ష సమావేశానికి పూర్తి సమాచారంతో అధికారులు రావాలన్నారు. గంజాయికి ప్రత్యామ్నాయంగా సాగు చేస్తున్న పంటల వివరాలు తెలుసుకున్నారు. గంజాయి వల్ల కలిగే అనర్థాలపై పాఠశాల, కళాశాలల్లో వారానికి ఒకటి రెండు క్లాసులు తీసుకోవాలన్నారు. ఆదివాసీ సేవా కేంద్రాల సిబ్బందికి గంజాయి సాగు, రవాణా గుర్తించేలా శిక్షణ ఇప్పించాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఎస్పీ అమిత్బర్దర్ మాట్లాడుతూ గంజాయి రవాణా, సాగు చేసిన వారితో పాటు వారి కుటుంబ సభ్యుల స్థిరాస్తులు, ఆస్తులను జప్తు చేస్తామన్నారు. గంజాయి స్మగ్లర్లకు ఆశ్రయం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, లీడ్ బ్యాంకు మేనేజర్ మాతు నాయుడు, డీఈవో బ్రహ్మాజీరావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, జిల్లా ఉద్యాన అధికారి కర్ణ తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయ ఉద్యోగుల విశేష సేవలు
పాడేరు: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన గ్రామ సచివాలయ ఉద్యోగులు మోంథా తుపానులో విశేష సేవలు అందించారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. తుపాను నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులపై గురువారం పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సమావేశానికి స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి ఆయన హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 770 హెక్టార్లలో వరి, వంద ఎకరాల్లో చోడి, 300 హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే వివరించారు. జిల్లాలో సుమారు 278 ఇళ్లలో కొన్ని పాక్షికంగా, మరికొన్ని పూర్తిగా ధ్వంసం అయినట్టు పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. చాలా చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయని, కొండచరియలు విరిగిపడి జనజీవనానికి ఇబ్బందులు ఎదురైనట్టు ఆయన తెలిపారు. పార్టీ శ్రేణులు బాధితులకు అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని పార్టీ అధినేత సూచించారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఉద్యమం మరింత ఉదృతం చేయాలని, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరం చేయాలని సూచించినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశించారని ఎమ్మెల్యే తెలిపారు. -
ఘాట్రోడ్డు పునరుద్ధరణ పనుల పరిశీలన
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సూచన సాక్షి, పాడేరు: పాడేరు ఘాట్లో కొండచరియలు జారిపడి ధ్వంసమైన రోడ్డు ప్రాంతాన్ని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు పరిశీలించారు. ఈ ప్రమాద ఘటనను తెలుసుకున్న ఆయన గురువారం ఉదయం అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బండరాళ్లు తొలగింపు, రోడ్డు పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండచరియలు విరిగిపడిన ప్రమాద సంఘటన దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. మైదాన ప్రాంతాలకు వెళ్లే వాహన చోదకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఘాట్లో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అటవీ, ఆర్అండ్బీ పోలీసుశాఖలను ఎమ్మెల్యే కోరారు. -
క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
విశాఖ సిటీ : క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీగా లాభాలు వస్తాయని చెప్పి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు. ఇటీవలే వరుసగా రెండు కేసుల్లో ఆరుగురు బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎక్స్చేంజ్ 666, బ్లాక్ డైమండ్ 9.కామ్ అనే అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్, వెబ్సైట్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఆ వెబ్సైట్ డబ్బు పెడితే అధిక లాభాలు వస్తాయని అమాయకులకు ఆశచూపిస్తూ బెట్టింగ్ రొంపిలోకి దించుతున్నట్లు గుర్తించారు. బెట్టింగ్ ఆడడంతో పాటు ఇతరులకు వారి సొంత ఐడీలు ఇస్తూ దాని ద్వారా అనేక మందిని బెట్టింగ్లో పాల్గొనేలా చేస్తున్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన పెయ్యిల త్రినాథ్ (23), కాశీరెడ్డి బాలసంజీవరావు(39)లను అరెస్టు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఏడు రోజుల జుడీషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు వీరి ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీల సమాచారాన్ని తెలుసుకున్నారు. వారిపై నిఘా పెట్టారు. -
పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
అనంతగిరి (అరకులోయ టౌన్): మోంథా తుపాను వర్షాలకు మండలంలోని రహదారులు శిథిలాస్థకు చేరాయి. అనంతగిరి –ఎస్.కోట ఘాట్ రోడ్డులో ఒకటో నంబర్ ఎయిర్ పిన్ బెండ్ వద్ద రక్షణగోడ కూలిపోయింది.అరకు సీఐ హిమగిరి, ఎస్ఐలు శ్రీనివాసరావు, గోపాలరావులు జేసీబీని రప్పించి పరిస్థితిని మెరుగుపరిచారు. తాడిగుడ జలపాతం సమీపంలోని కాజ్వే, వేంగడ డొంకాపూట్ కాజ్వేలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయా ప్రాంత ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంగవరం/దేవీపట్నం: తుపాను నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నెల్లిపూడి బురద కాలువ, పెద్దకాలువల్లో ఉధృతి నెలకొంది. తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకటేష్, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నెల్లిపూడి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గోకవరం–అడ్డతీగల ప్రధాన రహదారిలో రాకపోకలకు అంతరాయం కలిగింది. నెల్లిపూడి వాగు వద్ద బ్రిడ్జిపై నుంచి మూడు అడుగుల ఎత్తులో వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు సాగించకుండా పోలీసులు,రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అడ్డతీగల సీఐ నరసింహమూర్తి, నెల్లిపూడి వద్ద పరిస్థితిని సమీక్షించారు. సూరంపాలెం రిజర్వాయరుకు భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట– గోకవరం మార్గంలో ఫజుల్లాబాద్ సమీపంలో కాజ్వేపై వరద నీరు ఉధృతిగా ప్రవహించింది. సాయంత్రం నాలుగు గంటలకు కూడా ప్రవాహం తగ్గలేదు. దీంతో గోకవరం నుంచి ఇందుకూరుపేట వెళ్లే ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈనుకొండ వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇందుకూరుపేట–ఎం.రావిలంక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాజ్వేల ధ్వంసంతో అవస్థలు -
ఆశ్రమ పాఠశాల సందర్శన
రంపచోడవరం: మండలంలోని ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాలను సర్పంచ్ కోసు రమేష్బాబుదొర, ఎంపీటీసీ వంశీ కుంజం గురువారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, లేదా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. పాఠశాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబరు సత్యనారాయణ, బొబ్బా శేఖర్, వేల్ఫేర్ అసిస్టెంట్ బాపన్నమ్మ, ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు.అల్లం తోడుతో లారీ బోల్తాతగరపువలస : డ్రైవర్ నిద్రమత్తు కారణంగా గురువారం ఉదయం ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ నీళ్లకుండీల వద్ద జాతీయ రహదారి మీద నుంచి సర్వీస్ రోడ్డులోకి లారీ బోల్తా పడింది. బెంగుళూరు నుంచి అల్లం లోడుతో కోల్కత్తా వెళ్తున్న లారీ జాతీయ రహదారిలో రెయిలింగ్ను దూసుకుని సర్వీస్ రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదం నుంచి లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయట పడ్డారు. 5న పుణ్యనదీ హారతి సింహాచలం: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వచ్చే నెల 5న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన కొండ దిగువ వరాహ పుష్కరిణి(కోనేరు)కి పుణ్యనదీ హారతి నిర్వహించనున్నట్లు సింహాచలం దేవస్థానం ఇన్చార్జ్ ఈవో ఎన్.సుజాత గురువారం తెలిపారు. ఆరోజు కొండదిగువ ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఉత్సవమూర్తులను తిరువీధిగా కోనేరు వద్దకు తీసుకెళ్లి, అక్కడ ద్వయ హారతి, నక్షత్ర హారతి, కుంభ హారతి కార్యక్రమాలు జరుపుతామన్నారు. భక్తులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరారు. అలాగే కోనేరు గట్టుపై దీపారాధన కార్యక్రమంలో పాల్గొని, తరించాల్సిందిగా పిలుపునిచ్చారు. -
నేడు ఈఎన్సీ చీఫ్ పదవీ విరమణ
సాక్షి, విశాఖపట్నం : ఈస్ట్రన్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. 2023 ఆగస్ట్ 1న తూర్పు నౌకాదళాధిపతిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 1987లో భారత నౌకాదళంలో ప్రవేశించిన ఆయన యాంటీ సబ్మైరెన్ వార్ఫేర్ స్పెషలిస్ట్గా తక్కువ కాలంలోనే పేరు సంపాదించారు. పలు యుద్ధ నౌకల కెప్టెన్గా విధులు నిర్వర్తించి.. మహారాష్ట్ర నేవల్ ఏరియా ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్గా పదోన్నతి పొందారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడెమీ ఇన్స్ట్రక్టర్గా వ్యవహరించారు. కమాండర్ హోదాలో స్టాఫ్ రిక్రూట్మెంట్ డైరెక్టర్గానూ, నెట్సెంట్రిక్ ఆపరేషన్స్లో ప్రిన్సిపల్ కమాండర్గా, నేవల్ డైరెక్టరేట్(పర్సనల్)లో ప్రిన్సిపల్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు. 2016లో రియర్ అడ్మిరల్ హోదాలో డిఫెన్స్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీలో అసిస్టెంట్ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ నౌకాదళం చీఫ్ స్టాఫ్ ఆఫీసర్గా, ఫ్లాగ్ ఆఫీసర్గా, ఇండియన్ కోస్ట్గార్డ్, నేవీలో సీ ట్రైనింగ్ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఈఎన్సీ చీఫ్గా రాకముందు.. నేవల్ హెడ్క్వార్టర్స్లో డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్స్(డీజీఎన్వో)గా బాధ్యతలు చేపట్టారు. మిలాన్–2024తో పాటు మలబార్, టైగర్ ట్రయాంఫ్.. ఇలా ఎన్నో కీలక నౌకాదళ విన్యాసాలు వైస్ అడ్మిరల్ పెంధార్కర్ సారథ్యంలో విశాఖలో విజయవంతంగా నిర్వహించారు. పెంధార్కర్కు వీడ్కోలు కార్యక్రమం శుక్రవారం నిర్వహించేందుకు తూర్పు నౌకాదళంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తదుపరి ఈఎన్సీ చీఫ్ని రెండు రోజుల్లో రక్షణ మంత్రిత్వ శాఖ నియమించే అవకాశం ఉంది. -
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
గంగవరం : తుపాను కారణంగా భారీగా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం అడిషనల్ డీఎంహెచ్వో పిల్లి సరిత వైద్య సిబ్బందిని సూచించారు. గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె బుధవారం సందర్శించారు. పీహెచ్సీలోని రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫార్మసీ విభాగంంలోని మందుల స్టాకు, వ్యాక్సిన్లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. బర్త్ వెయిటింగ్ హాల్లో ఉన్న గర్భిణులతో మాట్లాడి ఆరోగ్య భద్రతపై సూచనలిచ్చారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. సకాలంలో రక్త పరీక్షలు పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. కొత్తగా నిర్మాణంలో ఉన్న బర్త్ వెయిటింగ్ భవనాన్ని ఆమె సందర్శించి అన్ని వివరాలు తెలుసుకున్నారు. అంబులెన్సు సర్వీసులపై ఆరా తీశారు, సమస్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ భావన, డాక్టర్ శ్వేత, వైద్య సిబ్బంది తదితరులున్నారు.అడిషనల్ డీఎంహెచ్వో సరిత -
జలాశయాలకు వరద తాకిడి
దేవరాపల్లి: మోంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పలు జలాశయాల్లోకి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. రైవాడ జలాశయానికి భారీగా నీరు రావడంతో నాలుగు గేట్లు తెరిచి 12వేల క్యూసెక్కులను శారదానదిలో బుధవారం విడుదల చేశారు. బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో 10వేల క్యూసెక్కుల ఉన్న ఇన్ఫ్లో, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 11వేల క్యూసెక్కులు, ఒంటి గంట సమయానికి 12 క్యూసెక్కులుగా ఇన్ప్లో పెరుగుతూ వచ్చింది. అప్రమత్తమైన జలాశయం పర్యవేక్షణ డీఈ జి. సత్యంనాయుడు తదితర ఇంజనీరింగ్ అధికార్లు ఇన్ఫ్లో ఆధారంగా స్పిల్వే గేట్లు ద్వారా శారదానదిలోకి వరదనీటిని విడుదల చేస్తున్నారు. ఒక్కసారిగా 12వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండటంతో శారదానది ఉగ్రరూపం దాల్చింది. జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 112.97 మీటర్లకు చేరుకుంది. పెద్దేరుకు పోట్టెత్తిన వరద మాడుగుల: మండలంలో పెద్దేరు జలాశయంలోకి 1600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో అంతే నీటిని రెండు ప్రధాన గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దేరు పొంగి ప్రవహిస్తుండడంతో ఎల్.పొన్నవోలు, జేడీ పేట, సత్యవరం, జంపెన, వీరనారాయణం వీరవల్లి తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెద్దేరు జలాశయం గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 136.80 మీటర్లకు చేరుకుంది. జత్యవరం, జంపెన, గొటివాడ అగ్రహారం గ్రామాల వద్ద పెద్దేరుపై గల వంతెనల వద్ద సచివాయ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రమాదస్థాయిలో కోనాం చీడికాడ: మండలంలోని కోనాం జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరువైనట్టు ఇన్చార్జి ఏఈ సత్యనారాయణదొర తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా బుధవారం సాయంత్రానికి 99.10 మీటర్లకు చేరుకుంది. ఇన్ఫ్లో ఒక్కసారిగా 800 క్యూసెక్కులు పెరగడంతో సాయంత్రం నుంచి ప్రధాన గేట్ల ద్వారా దిగువకు700 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇన్ఫ్లోను బట్టి నీటి విడుదలను పెంచే అవకాశం ఉందన్నారు. -
విశాఖ–బొబ్బిలి సెక్షన్లో భద్రతా ఆడిట్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పరిధిలోని విశాఖపట్నం–బొబ్బిలి రైల్వే సెక్షన్లో బుధవారం సేఫ్టీ ఆడిట్ జరిగింది. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకు చెందిన భద్రతా ఆడిట్ బృందం ఈ తనిఖీలను చేపట్టింది. ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ ఉత్తమ్ ప్రకాష్ నేతృత్వంలో ఈ బృందం సెక్షన్ పరిధిలోని పలు స్టేషన్లలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించింది. పెందుర్తి–కొత్తవలస మధ్య గల మలుపులు, కొత్తవలస స్టేషన్లో పాయింట్లు, యార్డులు, క్రాసింగ్లు, అలమండ–కోరుకొండ మధ్య నిర్మించిన ప్రధాన బ్రిడ్జిలు, బొబ్బిలి స్టేషన్లోని రిలేరూం, కోమటిపల్లి యార్డ్, ట్రాక్షన్ సబ్స్టేషన్, లెవెల్ క్రాసింగ్ గేట్, కోచింగ్ క్రూ లాబీ, విశాఖపట్నం యార్డులో యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ వ్యాన్, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, న్యూ కోచింగ్ కాంప్లెక్స్, రన్నింగ్ రూంలు, రూట్ రిలే ఇంటర్లాకింగ్ కేబిన్లను పరిశీలించింది. సీనియర్ రైల్వే అధికారుల పర్యవేక్షణలో వివిధ రైల్వే జోన్ల మధ్య ఇటువంటి ఇంటర్ జోన్ సేఫ్టీ ఆడిట్లు తరచూ జరుగుతుంటాయని వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఆడిట్ ప్రారంభానికి ముందు డీఆర్ఎం లలిత్ బోహ్రా డివిజన్ భద్రతా అంశాలను ఆడిట్ బృందానికి వివరించారు. తనిఖీల్లో వాల్తేర్ డివిజన్ ఏడీఆర్ఎం(ఆపరేషన్స్) కె.రామారావు, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ ఆనంద్కుమార్ ముటట్కర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.రైల్వే సేఫ్టీ ప్రమాణాలను పరిశీలించిననార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే బృందం -
బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
● ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాల్సిందే ● ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ ● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ అరకులోయ టౌన్: మోంథా తుపానుకు పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ. 50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తుపాను బాధితులు అధైర్యపడొద్దని, నష్టపోయిన అన్నివర్గాలకు తమ పార్టీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నష్టపరిహారం సకాలంలో అందించేందుకు పోరాడుతుందన్నారు. అరకులోయ నియోజకవర్గ పరిధిలో వరి, చోడి, తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. పంటలు నీట మునిగి రెండు రోజులు గడుస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం, వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచన వేయకపోవడం చాలా దారుణం అన్నారు. ఇప్పటికై నా నష్టపోయిన గిరి రైతులకు నేరుగా రూ. 50వేలు పరిహారం చెల్లించాలన్నారు. భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోయిన బాధితుల వివరాలు సేకరించి, మానవత దృక్పథంతో ఆలోచించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
సీలేరు: కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గూడెం కొత్తవీధి వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరిప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచ్ పాంగి దుర్జొ అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్, ఎంపీపీ బోయిన కుమారి తదితరులు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సాగిస్తున్న అరాచక పాలన, కుట్ర రాజకీయాలను వివరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద విద్యార్థులు కూడా వైద్య విద్య అభ్యసించాలని, సర్కారు వైద్య సేవలు మరింతగా అందరికీ అందేలా ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటుచేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయా వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసి, బడా కంపెనీలకు వాటి నిర్వహణ అప్పగించేందుకు చూస్తోందన్నారు. దీంతో పేద విద్యార్థులకు వైద్య విద్య, సామాన్యులకు ప్రభుత్వ వైద్యం అందే పరిస్థితి ఉండదన్నారు. దీంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం సీలేరు పంచాయతీ వైఎస్సార్సీపీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. పంచాయతీ పార్టీ అధ్యక్షుడిగా పేలూరి సత్యనారాయణ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా గణేష్, నూకరాజు, బాబులాల్. వెంకట్రావు. కార్యదర్శులుగా కిముడు విశ్వనాథ్, వంతల మారి బాబు, శ్రీకాకుళపు నూకరాజు, కొర్ర రాజేంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహిళా విభాగ సీలేరు పంచాయతీ అధ్యక్షురాలుగా కంకిపాటి రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శులుగా కిల్లో నాగమణి, వంతల ధోన, కార్యదర్శులు వంతల రజిని, కుప్ప కుమారిలను ఎన్నుకున్నారు. ఎంపీటీసీ సభ్యులు సాంబమూర్తి. మొట్టడం సత్యనారాయణ , పాడేరు ఎస్సీ సెల్ అధ్యక్షురాలు స్వర్ణ లత, మండల ప్రధాన కార్యదర్శులు వంతల చంటి బాబు,కొర్ర బలరాం తదితరులు పాల్గొన్నారు. -
అప్పన్నకు నిత్యకల్యాణం
నిత్యకల్యాణంలో స్వామికి యజ్ఞోపవీతధారణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ బేడామండపంలో వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు.కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.48.07 లక్షలు డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి దేవస్థానంలో బుధవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. గత ఆగస్టు 20 నుంచి ఈ నెల 29 వరకు హుండీల ద్వారా రూ.48,07,930 నగదు లభించింది. 61.510 గ్రాముల బంగారం, 941 గ్రాముల వెండి వచ్చింది. అలాగే 33 అమెరికా డాలర్లు, 2 సింగపూర్ డాలర్లు, యూఏఈకి చెందిన 10 ధీరమ్స్, సౌదీ అరేబియన్కు చెందిన 5 రియల్, ఒమన్కు చెందిన 1/2 రియల్, జర్మనీకి చెందిన 25 యూరోలతో పాటు పలు విదేశీ కరెన్సీ లభించింది. ఈ లెక్కింపులో ఈవో కె.శోభారాణి, జగన్నాథస్వామి ఈవో టి.రాజగోపాల్రెడ్డి, ఎస్బీఐ మేనేజర్ జె.నరసింహారావు, వన్టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, గోపాలపట్నం శ్రీహరిసేవ సభ్యులు పాల్గొన్నారు. -
తుపాను బాధితులకు తక్షణం పరిహారం అందించాలి
సాక్షి, విశాఖపట్నం: మోంథా తుపాను ప్రభావంతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి విధ్వంసం సృష్టించాయని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. పంట నష్టపోయి, ఇళ్లు ధ్వంసమై కష్టాల్లో ఉన్న బాధితులకు ప్రభుత్వం తక్షణం నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బుధవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్రెడ్డితో పాటు పలువురు ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోంథా తుపాను వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి, పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. తుపాను బాధితులను పరామర్శించి, సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలందరినీ అభినందించారు. ప్రజలు ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని మరోసారి నిరూపించారంటూ ప్రశంసించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ కె.సతీష్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, ఎస్ఈసీ సభ్యులు ఐహెచ్ ఫరూఖీ, సతీష్ వర్మ, పీలా వెంకటలక్ష్మి, రాష్ట్ర, జోనల్ అనుబంధ విభాగాల అధ్యక్షులు పేర్ల విజయ్ చందర్, ద్రోణంరాజు శ్రీవత్సవ్, చెన్న జానకిరామ్, కార్పొరేటర్లు బర్కత్ అలీ, శశికళ, మహమ్మద్ ఇమ్రాన్, బిపిన్ కుమార్, జోనల్ యువజన జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, జిల్లా పార్టీ కమిటీ అధికార ప్రతినిధులు ఆల్ఫా కృష్ణ, పల్లా దుర్గ, మంచ నాగమల్లేశ్వరి, హరి కిరణ్ రెడ్డి, జిల్లా అనుబంధ కమిటీ అధ్యక్షులు బోని శివ రామ కృష్ణ, నీలి రవి, సనపల రవీందర్ భరత్, శ్రీదేవి వర్మ, శంకర్ బత్తుల ప్రసాద్, మార్కండేయులు, బొండా ఉమామహేశ్వరరావు, సకలబత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో జెడ్పీ నిధులతో మౌలిక వసతులు
● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ● సరియాపల్లి, గుమ్మసిరగంపుట్టులో సీసీ రోడ్లకు శంకుస్థాపన ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో జెడ్పీ నిధులతో మౌలిక వసతులు కల్పిస్తామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండలంలోని కించాయిపుట్టు పంచాయతీ సరియాపుట్టులో జెడ్పీ నిధులు రూ.10లక్షలతో 200 మీటర్ల సీసీరోడ్డుకు, గుమ్మాసిరగంపుట్టు గ్రామ సమీపంలో బరడ వెళ్లే మార్గంలో జెడ్పీ నిధులు రూ.5లక్షలతో 100 మీటర్ల సీసీరోడ్డు పనులకు బుధవారం ఆమె సర్పంచులు,ఎంపీటీసీలు,నేతల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. దశాలవారీగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో తాగునీటి బోర్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. జగనన్న స్ఫూర్తితో జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నడూ లేనివిధంగా జెడ్పీ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎంపీపీ సీతమ్మ, వైస్ఎంపీపీ భాగ్యవతి, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, సర్పంచులు సుభాష్చంద్ర, నరసింగరావు, గంగాధర్, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, నబ్బో, గణపతి పాల్గొన్నారు. -
రైతులకు సూచనలు
చింతపల్లి: మోంథా తుపాను నేపథ్యంలో బుధవారం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ శాఖాధికారులు చిన్నగెడ్డ, చింతబారు, లోతుగెడ్డ, జంక్షన్, సంకాడ గ్రామాల్లో బుధవారం పర్యటించారు. గ్రామాల్లో వరి, రాజ్మా ,చిక్కుళ్ల పంటలను పరిశీలించారు. పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా బయటకు పంపాలని, ఎక్కువగా నీరు నిలిస్తే పెద్దకాలువలు చేసి మోటార్ల ద్వారా నీటిని తరలించాలని, గింజలు రంగుమారితే 200మిల్లీ లీటర్ల ప్రోపికోన్జోల్ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. నీట మునిగిన వరి పనలను ఐదు శాతం ఉప్పు ద్రావణం కలిపి పిచికారీ చేయాలన్నారు. ఆర్ఏఆర్ఎస్ చింతపల్లి ఏడీఆర్ అప్పలస్వామి, చింతపల్లి ఏడీఏ తిరుమలరావు, శాస్త్రవేత్త జోగారావు, ఏవోలు మదుసూధన్రావు, గిరిబాబు పాల్గొన్నారు. రాజవొమ్మంగి: మండలంలో పత్తి, పొగాకు, వరి సాగు చేస్తున్న రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఏఓ చక్రధర్ సూచనలు చేశారు. ఆయన పలు గ్రామాల్లో బుధవారం పర్యటించి, పొలాల్లోకి చేరిన వరద నీటిని గండ్లు కొట్టి దిగువకు వదిలిపెట్టేయాలని సూచించారు. పంటలకు తెగుళ్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. -
వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం
● సిబ్బందికి డీఎంహెచ్వో కృష్ణమూర్తి నాయక్ ఆదేశం ● ఈదులపాలెం పీహెచ్సీ తనిఖీ పాడేరు రూరల్: తుపాను వల్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో కృష్ణమూర్తి నాయక్ ఆదేశించారు. ఈదులపాలెం పీహెచ్సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుపట్టిక, రిజిస్టర్లను పరిశీలించారు. ల్యాబ్ టెక్నీషియన్ విధుల్లో లేకపోవడంతో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆరోగ్య పర్యవేక్షకురాలు డిప్యుటేషన్ను రద్దు చేసి తిరిగి రప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. విధులు పట్ల ఎవరు నిర్లక్ష్యం చేసినా ఉపేక్షించేది లేదన్నారు. గర్భిణులతో మాట్లాడారు. అందుతున్న వైద్యసేవల వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు సకాలంలో నిర్వహించి అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. మలేరియా, డయేరియా,టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కుష్టు, ఎయిడ్స్నియంత్రణ అధికారి కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
శ్రీవారి పుష్పయాగానికి పువ్వుల తరలింపు
ఎంవీపీ కాలనీ: శ్రీ వేంకటేశ్వరస్వామి పుష్పయాగానికి విశాఖ నుంచి పువ్వులు తరలివెళ్లాయి. అధ్యాత్మికవేత్త హిమాన్షు ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన పూలను యాగానికి పంపించారు. బుధవారం ఉదయం ఎంవీపీ కాలనీలోని టీటీడీ ఈ–దర్శనం కౌంటర్ వద్దనున్న హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత టీటీడీ స్థానిక సలహా కమిటీ చైర్మన్ పట్టాభిరామ్ దంపతులు, మహిళా భక్తులు పూలకు సంకల్పం చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా పుష్పయాగం కోసం తిరుమలకు తరలించారు. వీటిలో 3 వేల కలువలు, 2 వేల తామరలతోపాటు వివిధ రకాల పూలు ఉన్నట్లు హిమాన్షు ప్రసాద్ తెలిపారు. -
మోంథా.. ముంచెత్తింది
మోంథా తుపాను ముంచెత్తింది. బుధవారం కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పాడేరు ఘాట్తో పాటు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.పాడేరుకు సమీపంలోని జేసీ బంగ్లా రోడ్డు, లంబసింగి ఘాట్, అనంతగిరి మండలం నిమ్మలపాడు రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. అరకులోయ–అనంతగిరి ఘాట్లో వరద ప్రవాహంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పంట పొలాలు చాలా చోట్ల నీటమునిగాయి. సమాచారమిచ్చినా రాలేదు తుపానుకు జీలుగుచెట్టు పడటంతో ఇల్లుపై పడటంతో ఒకపక్క పూర్తిగా ధ్వంసమైంది. మాకు వేరే ఇల్లు లేదు. వైఎస్సార్సీపీ నేతలు పాంగి నరసింగరావు, పి.రాంప్రసాద్ సహకారంతో మండల అధికారులకు సమాచారం అందించాం. ప్రస్తుతానికి ఒక్క అధికారి కూడా మాగ్రామాన్ని సందర్శించలేదు. – వంతల గోపినాథ్, సాగిరివలస, సొవ్వ పంచాయతీ●ఎటువంటి సాయం చేయలేదు తుపాను వర్షాలకు మా పెంకుటిల్లు కూలిపోయింది. గ్రామానికి వచ్చిన అధికారులు జరిగిన నష్టాన్ని చూశారు. అయితే నష్టపోయిన మాకు ఎటువంటి సాయం చేయలేదు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. అధికారులు తక్షణం స్పందించి యుద్ధప్రాతిపదికన సాయం చేయాలి. – సాగర గుర్మిసింగ్, డుంబ్రిగుడ సాక్షి,పాడేరు: జిల్లాలోని 163 గ్రామాలపై తుపాను ప్ర భావం చూపింది. పునరావాస కేంద్రాల్లో పూర్తిస్థాయి లో వసతులు లేక బాధితులు ఇబ్బందులు పడ్డారు. ● మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో జి.మాడుగుల, పాడేరు, పెదబయలు, హుకుంపేట, ముంచంగిపుట్టు మండలాల్లోని అవతలి గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ● పాడేరు–పెదబయలు మండలాల సరిహద్దులోని పరదానిపుట్టు కాజ్వే మీదుగా మత్స్యగెడ్డ ప్రవహిస్తుండడంతో రెండు రోజులుగా సుమారు 100 మారుమూల గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. రాళ్లగెడ్డ, బొయితిలిగెడ్డ, చాపరాయిగెడ్డ, దిగుడుపుట్టు, సంతారి గెడ్డల్లో వరద ఉధృతి నెలకొంది. 500 ఎకరాల్లో పంటకు నష్టం భారీ వర్షాలతో లోతట్టు వ్యవసాయ భూముల్లో ఖరీఫ్ పంటలకు నష్టం ఏర్పడింది. పాడేరు మండలం వంజంగి కొత్తవలస ప్రాంతంలో కొండవాగుల ఉధృతికి పంట భూముల మీదుగా వరద ప్రవాహం నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతదశలో ఉన్న వరి, రాగులు, చిరుధాన్యాల పంటలు వరదనీటి ముంపునకు గురయ్యా యి. చాలాచోట్ల వరిపంట నేలవాలింది. సుమారు 500 ఎకరాల్లో వరి, చిరుధాన్యాల పంటలకు నష్టం ఏర్పడిందని అధికారులు అంచనా వేస్తున్నారు. 278 గుడిసెలు, మట్టి ఇళ్లకు నష్టం: కలెక్టర్ దినేష్కుమార్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు 278 గుడిసెలు,మట్టి ఇళ్లకు నష్టం వాటిల్లిందని కలెక్టర్ దినేష్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. వీటిలో 12 గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రూ.18.08 లక్షల వాటిల్లినట్టు ఆయన వివరించారు. అంతేకాకుండా నాలుగు పశువులు, 8 గొర్రెలు, మేకలు మృతి చెందగా రూ.3 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణ నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 13 పునరావాస కేంద్రాల్లో 774 మందిని తరలించి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించామని ఆయన వెల్లడించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారికి రూ.వెయ్యి నుంచి గరిష్టంగా రూ.3వేలు ఇస్తామని తెలిపారు. పొంగిన వాగులు.. గాలులకు కూలిన చెట్లు రాజవొమ్మంగి: రెండో రోజు బుధవారం రాజవొమ్మంగిలో రోజంతా ఈదురు గాలులతో వర్షం కురిసింది. కట్టెల పొయ్యిలపై ఆధారపడిన పేద గిరిజన కుటుంబాలు వంట చెరకు, నిత్యావసరాలకోసం ఇబ్బంది పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంది. వాగుల వరదనీరు వటిగెడ్డ రిజర్వాయర్లో చేరడంతో పొంగి ప్రవహించింది. ఈదురుగాలులకు దూసరపాము లబ్బర్తి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై భారీ చెట్టు కూలిపోవడంతో మధ్యాహ్నం వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దుర్గానగర్ సమీపంలో ఆర్అండ్బీ రహదారిపై పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. భూపతిపాలెం, ముసురుమిల్లికి జలకళ రంపచోడవరం: మోంథా తుపానుకు కురిసిన వర్షాలు సాగునీటి ప్రాజెక్ట్లకు మేలు చేశాయి. భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలతో కళకళలాడుతున్నాయి. ముసురుమిల్లి ప్రాజెక్ట్కు గేట్లు ఏర్పాటుచేయకపోవడంతో నీరు దిగువకు పోతోంది. రోడ్డుపై జారిపడిన కొండచరియలు జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతం పొంగి ప్రవహిస్తోంది. ఉరుము గ్రామ సమీపంలో రెండు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. పెదలంక, వైబీ గొందూరు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు ఇంటిపై కూలాయి. సొలభం వెళ్లే మార్గంలో కామెటమ్మ ఘాట్రోడ్డులో చెట్టు కూలిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో రహదారి దెబ్బతింది. వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాళ్లుపుట్టు–గొడ్డ మధ్యలో బ్రిడ్జి వద్ద, కుంబడిసింగి, రాళ్లగెడ్డ ఉధృతిగా ప్రవహించడంతో ఈమార్గంలో రాకపోకలు నిలిపివేశారు. కంఠవరం సమీపంలో వరద నీటికి వరి పంట నీటమునిగింది. కొయ్యూరు: తుపాను వల్ల కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. మంగళవారం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. విద్యుత్ సరఫరాకు మంగళవారం అర్ధరాత్రి నుంచి అంతరాయం ఏర్పడింది. బుధవారం సాయంత్రానికి కూడా రాలేదు. డౌనూరు–చింతపల్లి రహదారిలో తులబాలగెడ్డ ఉధృతంగా ప్రవహించింది. దీంతో పోలీసులు నర్సీపట్నం– చింతపల్లి మార్గంలో వాహన రాకపోకలను నిలిపివేశారు. చింతాలమ్మ ఘాట్రోడ్డులో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వరుసగా రెండు రోజుల పాటు కొయ్యూరుకు నర్సీపట్నం డిపో నుంచి బస్సులు రాలేదు. దీంతో అత్యవసరమైన వారు మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. 12 ఇళ్లకు నష్టం వర్షాలకు మండలంలో 11 ఇళ్లు పాక్షికంగా ఒక ఇళ్లు పూర్తిగా దెబ్బతిందని ఇన్చార్జి తహసీల్దార్ కుమారస్వామి బుధవారం రాత్రి తెలిపారు. నష్టానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. నిలిచిన రాకపోకలు హుకుంపేట: మండలంలో చీడిపుట్టు, లివిటి వంతెనలపైనుంచి గెడ్డలు పొంగి ప్రవహించడంతో అడ్డుమండ, జేకేమండ, రాప, ఉప్ప, మత్స్యపురం పంచాయతీలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 28 గ్రామాలకు రాకపోకలు బంద్ డుంబ్రిగుడ: కితలంగి పంచాయతీకి వెళ్లే మార్గంలో కాజ్వేపై నుంచి వరద నీరు ప్రవహించడంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చంపపట్టి వద్ద కాజ్వేపై నుంచి గెడ్డ పొంగి ప్రవహించడంతో సుమారు 8 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. చాపరాయి వద్ద ఉన్న పెద్దపాడు, కోసంగి గ్రామాల వారధిపై భారీగా వరద నీరు ప్రవహించడంతో వాటితోపాటు అరకులోయ మండలంలోని పలు గ్రామాలకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఆయా ప్రాంతాల గిరిజనులు నిత్యావసర సరకులకు ఇబ్బందులు పడ్డారు. చాపరాయి గెడ్డ వరదనీటితో పోటెత్తింది. వరద బీభత్సం నుంచి తేరుకోని మన్యం బుధవారం ఈదురుగాలులతో భారీ వర్షం వరద ఉధృతి తగ్గని గెడ్డలు, వాగులు కూలిన చెట్లు వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్ పరిహారంకోసం బాధితుల ఎదురుచూపులు ప్రభుత్వం చెప్పేదానికి భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నష్టం
ముంచంగిపుట్టు: ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణతో పేదలు వైద్యం కొనుక్కునే పరిస్థితి దాపరిస్తుందని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని కించాయిపుట్టు పంచాయతీ సరియాపుట్టులో బుధవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆమె ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని విరమించాలని స్థానికులు నినాదాలు చేశారు. అనంతరం గడప గడపకు వెళ్లి వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న కేంద్రంతో పోరాడి 17 వైద్య కళాశాలలు తీసుకువస్తే, కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. జగనన్నకు మంచి పేరు వస్తుందని భయంతో పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసేందుకు తెగబడుతుందని, మెరుగైన వైద్యం పేదవాడికి అందించాలని జగనన్న ముందుకు వస్తే దానిని నాశనం చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆమె ఆరోపించారు. ఎంపీపీ సీతమ్మ, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, వైస్ఎంపీపీ భాగ్యవతి, సర్పంచులు నరసింగరావు, గంగాధర్, సుభాష్, నొబినా, వసంత, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల,నోబ్బో, గణపతి, వైఎస్సార్సీపీ మండల నేతలు పాల్గొన్నారు. వైద్యం కొనుక్కోవాల్సిన దుస్థితి ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆవేదన ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సరియాపుట్టులో కోటి సంతకాల సేకరణ -
జిల్లా ఆస్పత్రిలోవైద్యసేవలపై ఆరా
పాడేరు : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను సకాలంలో స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత ఆదేశించారు. స్థానిక జిల్లా ఆస్పత్రిని బుధవారం ఆమె సందర్శించారు. వార్డుల్లోకి వెళ్లి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రసూతి వార్డులో గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. రోగులకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. నాణ్యమైన ఆహారం వడ్డించాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆస్పత్రిలో నీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. రోగుల పట్ల మర్యాదగా మెలగాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట జిల్లా ఆస్పత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి. వెంకట్, ప్రసూతి విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సృజన పాల్గొన్నారు. -
శిథిల భవనాలను కూల్చివేయండి
డుంబ్రిగుడ: తుపానుకు నేలకూలిన పాఠశాల భవనాన్ని పూర్తిగా తొలగించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. మంగళవారం రాత్రి భారీ వర్షానికి నేలకూలిన వంతర్డ పాఠశాల భవనాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. భవన శిథిలాలను వెంటనే తొలగించేలా ఎంపీడీవోకు ఆదేశాలు ఇచ్చారు. మండలంలో ఇలాంటి భవనాలను ముందుగానే గుర్తించి కూల్చివేయాలన్నారు. కొత్త భవనాల నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఎంఈవోలు సుందరరావు, గెన్నును ఆదేశించారు. పాకలో పాఠశాల నిర్వహిస్తున్న ఆయన అక్కడి వెళ్లారు. పశువుల పాకలా ఉన్న దీనిలో విద్యార్థులకు పాఠాలు ఎలా బోధిస్తారని అధికారులను ప్రశ్నించారు. వంతర్డ గ్రామంలో సమస్యలు తెలుసుకున్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అంతకుముందు డుంబ్రిగుడలో గృహాలను పరిశీలించారు. లివిటిపుట్టులో పాఠశాల భవన నిర్మాణం పూర్తికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఈవోలను ఆదేశించారు. ఎంఈవోలకు కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం -
వైఎస్సార్సీపీ నేత చొరవతో..
పాడేరు రూరల్: భారీ వర్షాలకు మండలంలోని వంట్లమామిడి పంచాయతీ 12వ మైలురాయి గ్రామ సమిపంలో ఈదులపాలెం ప్రధాన రహదారి మార్గంలో బుధవారం భారీ వృక్షం విరిగి పడింది. స్థానికులు పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. దీంతో వైఎస్సార్సీపీకి చెందిన వార్డు సభ్యుడు పాతను సింహాచలం ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, గిరిజనులు చెట్టు కొమ్మలను తొలగించారు. మొదలు భాగాన్ని జేసీబీ సాయంతో తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ముంచంగిపుట్టు: మండలంలోని జర్రెల పంచాయతీ కొత్తూరు గ్రామంలో బుధవారం కొర్ర సోనాయి అనే గిరిజన మహిళ ఇంటి గోడ కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మండల వైఎస్సార్సీపీ నేత సురేష్, వార్డు సభ్యుడు పరశురాం, పీసా కమిటీ కార్యదర్శి జీనబంధు అక్కడికి వెళ్లి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. గోడ కూలిన విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారిని కోరారు. -
పంట నష్టానికి పరిహారం చెల్లించండి
● మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ డిమాండ్ హుకుంపేట: మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటనష్టం వాటిల్లిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించిఆదుకోవాలని మాజీ ఎమెల్యే చెట్టి పాల్గుణ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని తాడిపుట్టు పంచాయతీలోని గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతికందాల్సిన వరి పంట వరద పాలైందన్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి బాధిత రైతులకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు. -
రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా
● ఏర్పాటు చేయాలి ● ఆదివాసీ జేఏసీ డివిజన్ ఛైర్మన్ జల్లి నరేష్ డిమాండ్ చింతూరు: రంపచోడవరం, చింతూరు డివిజన్లతో పాటు పోలవరం ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఆదివాసీ జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ డిమాండ్ చేశారు. మంగళవారం చింతూరులో జరిగిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రంపచోడవరం జిల్లా ఏర్పాటు వల్ల పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుందన్నారు. పాడేరు దూరాభారం కావడంతో ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కారం సాయిబాబు, పొడియం రామకృష్ణ, కాక సీతారామయ్య, మడివి రాజు, తిరపతిరావు, ముత్తయ్య, రామయ్య, సుబ్బయ్య, నాగయ్య, రాజమ్మ పాల్గొన్నారు. -
తుపాను ప్రభావిత కుటుంబాలను ఆదుకోండి
అనంతగిరి (అరకులోయ టౌన్): మెంథా తుపాను ప్రభావిత గిరిజనులకు కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుని అన్ని సౌకర్యాలు కల్పించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కోనాపురం పంచాయతీ చప్పాడి, వంట్లమామిడి గ్రామాల్లో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజతో కలిసి పర్యటించారు. వంట్లమామిగి గ్రామానికి చెందిన 15 కుటుంబాలు, చప్పడి గ్రామానికి చెందిన 45 కుటుంబాలను బొర్రా ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు తరలించి పునరావాసం కల్పించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండచరియలు జారిపడుతున్న విషయాన్ని ఆయన పీవో దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న వారు ప్రభావిత ప్రాంతాల గిరిజనులను బొర్రా ప్రభుత్వ ఆశ్రమపాఠశాలకు తరలించారు. బొర్రా నుంచి కోనపురం వరకు రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని పీవోను గ్రామస్తులు కోరారు. త్వరలో సమస్య పరిష్కరిస్తామని వారికి పీవో హామీ ఇచ్చారు. ఎంపీటీసీ నవీన్, సర్పంచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ -
వరి రైతులూ.. అప్రమత్తత అవసరం
చింతపల్లి ఏడీఆర్ అప్పలస్వామి చింతపల్లి: మోంథా తుపానుకు కురుస్తున్న వర్షాల పట్ల వరి రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ ఆళ్ల అప్పలస్వామి సూచించారు. మంగళవారం చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో వ్యవసాయశాఖ ఏడీ తిరుమలరావు, వ్యవసాయాధికారులతో కలిపి పర్యటించారు. దీనిలో భాగంగా చౌడుపల్లి, గాడిదలమెట్ట, చెరువూరు, రింతాడ, అసరాడ, ఏబులం గ్రామాల్లో వరి పైరును పరిశీలించారు. రైతులకు పలు సూచనలు చేశారు. వర్షాలకు పైరు నేలకొరిగిన సందర్భంలో అంతర్గత కాలువల ద్వారా పొలంలో వర్షం నీటిని తొలగించాలని సూచించారు. గింజలు రంగుమారడం, మాగుడు, మావిపండు తెగుళ్ల వ్యాప్తి నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటికి 200 ఎంఎల్ ప్రొపికొనజోల్ మందును నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు. గింజ గట్టిపడే దశలో పైరు అధిక వర్షాలకు గురైనా, నేలకొరిగిన కంకిలో మొలకలు కనపడినా 5శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాముల స్పటిక ఉప్పు లీటరు నీటికి) పిచికారి చేయాలని ఏడీఆర్ సూచించారు. మండల వ్యవసాయాధికారులు టి.మధుసూదనరావు, కె.గిరిబాబు, వీఏఏలు పాల్గొన్నారు. -
వర్ష బీభత్సం
మోంథా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలు జిల్లాలో బీభత్సం సృష్టించాయి. వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలవిద్యుత్ కేంద్రాలకు నీరందించే ప్రాజెక్ట్ల నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఘాట్రోడ్లు ప్రమాదకరంగా మారడంతో రాత్రిపూట ప్రయాణాన్ని అధికారులు నిలిపివేశారు. కొత్తవలస–కిరండూల్ రైల్వేలైన్లో కొండచరియలు జారిపడ్డాయి. అనంతగిరి ఘాట్ రోడ్డులో కొండ వాగుల ప్రవాహం రోడ్డుపైకి వచ్చేయడంతో అధికారులు వాహన రాకపోకలు నిలిపివేశారు. సాక్షి,పాడేరు: మోంథా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. జనజీనవం స్తంభించింది. ప్రధాన గెడ్డలు, వాగుల్లో వరద ఉధృతి నెలకొంది. పాడేరు, హుకుంపేట మండలాల్లో విస్తరించిన రాళ్లగెడ్డ ఉధృతికి చీడిపుట్టు కాజ్వే మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. లో వరద ప్రవాహం అఽధికంగా ఉండడంతో చీడిపుట్టు కాజ్వే మీదుగా వరదనీరు జి.మాడుగుల, పాడేరు, పెదబయలు, హుకుంపేట, ముంచంగిపుట్టు మండలాల్లో విస్తరించిన మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. అరకులోయ మండలంలోని మారుమూల మాదల పంచాయతీలో వేగవతి గెడ్డ పొంగి ప్రవహిస్తోంది. దీంతో సరిహద్దు ఒడిశా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురుగాలులకు పాడేరు మండలం నందిగరువులో చెట్టు నేలకూలింది. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో సుత్తిగుడ వద్ద భారీ వృక్షం నేలకూలింది. జి.మాడుగుల మండలం కొక్కిరాపల్లి ఘాట్లో కూలిన చెట్లను అధికారులు వెంటనే తొలగించారు. రాజవొమ్మంగి మండలంలోని వణకరాయి, దూసరపాము జాతీయ రహదారిపై చెట్లు కూలిపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. ఇదే మండలంలో అనంతగిరి వెళ్లే మార్గంలో చెట్టు కూలిన ఘటనలో పాకలో మేక అక్కడికక్కడే మృతి చెందింది. వరద పరిస్థితులను జిల్లా కేంద్రంలో కలెక్టర్ దినేష్కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, ఇన్చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కొత్తవలస– కిరండూల్ రైల్వే లైన్లో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్ వద్ద కొండచరియలు ట్రాక్పై జారి పడ్డాయి.సుమారు గంట పాటు కొండ నుంచి వరదనీరు ట్రాక్పై పొంగి ప్రవహించింది. బండరాళ్లు,మట్టి పేరుకుపోవడంతో వాటిని తొలగించే పనుల్లో రైల్వే అధికారులు నిమగ్నమయ్యారు. ఈమార్గంలో సోమవారం రాత్రి నుంచి అన్ని రైళ్ల రాకపోకలను ముందస్తుగా నిలిపివేతతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతగిరి ఘాట్రోడ్డుపైకి వరద ప్రవాహం అరకులోయ–అనంతగిరి ఘాట్లో సుంకరమెట్ట, బీసుపురం సమీప ప్రాంతాల్లో రోడ్డుపై వరదనీరు పొంగి ప్రవహించింది. భారీ వర్షాలకు కొండల నుంచి వరదనీరు రోడ్డుపైకి వచ్చేయడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ఈ మార్గంలో మంగళవారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. జిల్లాలో 534.6 ఎంఎం వర్షపాతం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం 534.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.అత్యధికంగా అనంతగిరిలో 78.8, ముంచంగిపుట్టులో 45.8, అరకులోయలో 41.2, డుంబ్రిగుడలో 35.6, హుకుంపేటలో 34.6, పాడేరులో 34.2, కొయ్యూరులో 30.2, జి.మాడుగులలో 29, అడ్డతీగలలో 22.2, పెదబయలులో 21.6, దేవీపట్నంలో 19.8, రంపచోడవరంలో 19.6, చింతపల్లిలో 17.8, వై.రామవరంలో 17.6, రాజవొమ్మంగిలో 16.6, మారేడుమిల్లిలో 13.8, గూడెంకొత్తవీధిలో 13.4, గంగవరంలో 10.8, చింతూరులో 10.2, కూనవరంలో 7.6. వీఆర్పురంలో 7.4, ఎటపాక మండలంలో 6.8 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. పొంగిన చాపరాయి గెడ్డ డుంబ్రిగుడ: తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు చాపరాయి గెడ్డ పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో పెద్దపాడు, కోసంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటసీమ రోడ్డు మార్గంలో డోమంగి వద్ద వంతెనపై నుంచి పొంగి ప్రవహిస్తుండటంతో ఈ మార్గంలో కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొయ్యూరు: మండలంలో మంగళవారం వీచిన బలమైన ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కొయ్యూరు కాలువ ఉధృతంగా ప్రవహించింది. జి.మాడుగుల: మండలంలో మోంథా తుపాను వర్షాలకు మంగళవారం గెమ్మెలి పంచాయతీ జి కొత్తూరులో బొంగరం వెంకటరావుకు చెందిన ఇంటిగోడ కూలిపోయింది. సొలభం పంచాయతీ వయ్యారిగరువులో పాంగి బాలరాజు ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. పొంగిన గెడ్డలు, వాగులు వంతెనలపై నుంచి వరద నీటి ప్రవాహం ఈదురు గాలులకు కూలిన చెట్లు ప్రమాదకరంగా ఘాట్రోడ్లు ముందు జాగ్రత్తగా రాకపోకలు నిలిపివేసిన అధికారులు రైల్వేలైన్పై జారిపడిన కొండచరియలు ముందురోజే రాకపోకలు నిలిపివేతతో తప్పిన భారీ ప్రమాదం అత్యధికంగా అనంతగిరిలో 78.8 ఎంఎం వర్షపాతం నమోదు ప్రమాదస్థాయికి బలిమెల నీటిమట్టం ఉధృతంగా మత్స్యగెడ్డరైల్వే ట్రాక్పై కొండచరియలు జారిపడటంతో దెబ్బతిన్న ప్రాంతంమూతపడిన పర్యాటక ప్రాంతాలు డుంబ్రిగుడ: మోంథా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చాపరాయి జలవిహారి, అరకు పైనరీ, కొల్లాపుట్టు కాటేజీలు మూతపడ్డాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం వరకు మూసివేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మోతుగూడెం: కొండ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈనీటికి పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నీరు తోడవడంతో సీలేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బలిమెల ప్రాజెక్ట్కు వరద తాకిడి నెలకొంది. ఈ ప్రాంతం నుంచి గుంటవాడ జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రంపచోడవరం/చింతూరు: తుపాను నేపథ్యంలో మారేడుమిల్లి–చింతూరు ఘాట్రోడ్డులో రాత్రి పూట ప్రయాణాలను నిలిపివేసినట్టు మారేడుమిల్లి సీఐ గోపినరేంద్రప్రసాద్, చింతూరు ఎస్ఐ రమేష్ తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వారు సూచించారు. -
బస్సులకు డిమాండ్
● ప్రశాంతి ఎక్స్ప్రెస్ రద్దు డాబాగార్డెన్స్: తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ద్వారకా బస్ స్టేషన్కు క్యూ కట్టారు. కొంతమేర ఆర్టీసీ బస్సుల వద్ద (ఇచ్ఛాపురం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం వరకు వెళ్లేందుకు) రద్దీగా ఉండగా.. ఓఎస్ఆర్టీసీ బస్సులకు పెద్ద సంఖ్యలో ప్రయాణికుల తాకిడి కనిపించింది. ద్వారకా బస్ స్టేషన్లో నిత్యం ఖాళీగా కనిపించే ఓఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్ కౌంటర్ రైళ్ల రద్దు కారణంగా మంగళవారం కిటకిటలాడింది. తుఫాన్ కారణంగా చాలా మంది ప్రయాణికులు రద్దు చేసుకోవడంతో నిత్యం రద్దీగా కనిపించే ఆర్టీసీ బుకింగ్ కౌంటర్లు మంగళవారం ఖాళీగా దర్శనమిచ్చాయి. -
ధారాలమ్మ ఘాట్ మూసివేత
సీలేరు: తుపాను నేపథ్యంలో ధారాలమ్మ ఘాట్ మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. ఏపీ జెన్కో చెక్ పోస్ట్ వద్ద మూసివేశారు. వాహన రాకపోకలు జరగకుండా ఎస్ఐ యాసిన్ చర్యలు చేపట్టారు. సీలేరు నుంచి గూడెం కొత్తవీధి వరకు ఉన్న సుమారు 50 కిలోమీటర్ల రహదారి ప్రస్తుతం ప్రమాదకరంగా ఉందని ఎస్ఐ తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటమే కాకుండా చెట్లు కూలిపడే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘాట్ మార్గంలో రాకపోకలు నిలిపివేశామన్నారు. అత్యవసర వైద్యం అవసరమైన వారిని తమ సిబ్బంది సహకారంతో మైదాన ప్రాంతాలకు పంపిస్తామని ఎస్ఐ తెలిపారు. ప్రమాదస్థాయికి బలిమెల ఆంధ్రా ఒడిశా సరిహద్దు బలిమెల జలాశయ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో ఇరు రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. మొంథా తుపాను నేపథ్యంలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1516 అడుగులు కాగా ప్రస్తుతం 1507.21 అడుగుల మేర ఉంది. 104.3066 టీఎంసీల నిల్వల ఉన్నట్టు జెన్కో అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇన్ఫ్లో 3219 క్యూసెక్కులు ఉండగా దిగువకు 1617.8 క్యూసెక్కులు వెళ్తోంది. ఏక్షణాన్నైనా బలిమెల డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ పర్యవేక్షణ అధికారులు తెలిపారు. గుంటవాడ జలాశయ నీటిమట్టం 1342.8 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 1525 క్యూసెక్కులు కాగా విద్యుత్ ఉత్పత్తికి 1276 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీజెన్కో అధికారులు అప్రమత్తమయ్యారు. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలోకి నీరు చేరే ప్రమాదం ఉన్నందున ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి, ఏడీ జైపాల్, క్యాంప్ ఏఈ సురేష్ ప్రత్యేక సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. డీవాటరింగ్ నిమిత్తం రెండేసి మోటార్లను ఏర్పాటుచేశారు. గుంటవాడ ప్రాజెక్ట్ వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. మెయిన్, రెగ్యులేటరీ డ్యామ్ల వద్ద డీజిల్, సైరన్ను సిద్ధం చేశారు. -
అనకాపల్లి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా పూజారి శైలజ
అనకాపల్లి: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా ప్రముఖ వెయిట్ లిఫ్టర్ పూజారి శైలజ బాధ్యతలు స్వీకరించారు. విశాఖలో వెయిట్ లిఫ్టింగ్ కోచ్గా విధులు నిర్వహిస్తున్న ఆమెను సాధారణ బదిలీల్లో భాగంగా అనకాపల్లి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడాకారులను ఉన్నత స్థాయి స్థితికి తీసుకువెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో గ్రామీణ స్థాయిలో ఔత్సాహికులను గుర్తించి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దుతానన్నారు. పూజారి శైలజ కామన్వెల్త్ సహా పలు అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందిస్తుందని, అర్హులైన క్రీడాకారులు నవంబర్ 4వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి పూజారి శైలజ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడాకారులు httpr//rportr.ap.gov.in, refirteration/payerrefirtration వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. -
ముంపు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
● మట్టి గృహాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు ● కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాలు సాక్షి,పాడేరు: మోంథా తుపానుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముంపు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సహాయక చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అఽధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని, మట్టి ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రహదారులపై చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించాలని,రాత్రి సమయంలో రహదారి ప్రమాదాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలన్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. ప్రతి రెండు గంటలకు ఓ సారి సమాచారం అందజేయాలన్నారు. జనరేటర్లు, డీజిల్, విద్యుత్ స్తంభాలు, ఇసుక బస్తాలను అవసరమైన ప్రాంతాలకు తరలించాలన్నారు. నిత్యావసర సరుకులు పంపిణీకి చర్యలు తీసుకోవాలని, ట్యాంకులలో తాగునీటిని నింపి ఉంచాలని ఆదేశించారు.అన్ని ఆశ్రమ పాఠశాలలు,వసతి గృహాల్లో విద్యార్థులు బయటకు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.ఎస్పీ అమిత్బర్దర్ మాట్లాడుతూ మహిళా పోలీసులంతా సచివాలయాల్లో అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున విద్యార్థుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్ తనిఖీ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన తుపాను కంట్రోల్ రూమ్ను కలెక్టర్ దినేష్కుమార్ తనిఖీ చేశారు.జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై సమీక్షించారు.కంట్రోల్ రూమ్లో అధికారులు, సిబ్బంది 24గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పుకార్లు నమ్మవద్దని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు,డీఆర్వో పద్మలత తదిత రులు పాల్గొన్నారు. -
అప్పన్న భక్తుల రక్షణకు చర్యలు
సింహాచలం: తుఫాన్ నేపథ్యంలో ిసింహాచలం దేవస్థానంలోని అన్ని విభాగాలను ఈవో ఎన్.సుజాత అప్రమత్తం చేశారు. కొండపైన, కొండ దిగువ ఉన్న విభాగాలను సందర్శించి, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలపై పర్యవేక్షించాలని, వర్షం నీరు నిల్వ ఉండకుండా వెంటనే తొలగించాలని ఆదేశించారు. తాగునీటి ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. తుఫాన్ ప్రభావం తగ్గేవరకు ఉద్యోగులంతా అధికారుల మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే దేవస్థానం హెల్ప్లైన్ నంబర్ల(93987 34612, 0891–2954944)ను సంప్రదించాలన్నారు. ఆమె వెంట ఏఈవో తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


