breaking news
Alluri Sitarama Raju District News
-
పల్స్ పోలియోకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు
రంపచోడవరం: ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేందుకు అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు స్థానిక ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్రాజ్ తెలిపారు. ఐటీడీఏ సమావేశపు హాలులో రంపచోడవరం, చింతూరు డివిజన్ల వైద్యాధికారులు, సీహెచ్వోలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు 0–5 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో 11 మండలాల్లో 29 పీహెచ్సీల పరిధిలో 18,164 మంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు 32,560 డోసుల 1,525 వైల్స్ సిద్ధం చేసినట్టు చెప్పారు. 591 బూత్లు, 75 రూట్లు, 28 మొబైల్ టీములు , 8 పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, బస్స్టాండ్లు, జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేసి, విజయవంతం చేసే విధంగా అధికారులు , సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశంచారు. 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కులు వేసిందీ లేనిది నిర్థారణ చేసుకొని నూరుశాతం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో ఏడీఎంహెచ్వో డాక్టర్ సరిత, డాక్టర్ జాన్సన్,ప్రసన్న, దత్త తదితరులు పాల్గొన్నారు. -
కస్టమ్స్ కత్తెర!
ఎగుమతులకునిపుణుల బృందం లేక ఎగుమతిదారుల ఇక్కట్లు నాణ్యత ధ్రువీకరణకు పరికరాలు, నైపుణ్యం కొరత సౌకర్యాల లేమితో సరుకు రవాణాకు అంతరాయం చైన్నె, ముంబయి వైపు మళ్లుతున్న ఎగుమతులు ధ్రువీకరించే బృందాలు లేక.. విశాఖ మందులు హైదరాబాద్కు తరలింపుసాక్షి, విశాఖపట్నం: నగరంలోని ప్రధాన ఫర్నిచర్ షోరూమ్లలో విక్రయించే ఫర్నిచర్ అధిక భాగం చైనా నుంచి దిగుమతి అవుతుంటుంది. ఇక్కడ కంటైనర్ టెర్మినల్, పోర్టులు ఉన్నప్పటికీ వ్యాపారులు చైనా నుంచి సరుకును నేరుగా విశాఖకు రప్పించడం లేదు. కోల్కతా లేదా చైన్నె పోర్టులకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విశాఖకు తీసుకురావాల్సిన పరిస్థితి దాపురించింది. ఎందుకంటే.. పదేళ్ల కిందట ఓ వ్యాపారి చైనా నుంచి నేరుగా ఇక్కడికి ఫర్నిచర్ తీసుకురాగా.. దాని ధ్రువీకరించి క్లియరెన్స్ ఇచ్చేందుకు కస్టమ్స్ వారికి ఏడాది సమయం పట్టింది. ఆ అనుభవంతో అప్పటి నుంచి ఏ వ్యాపారీ ఫర్నిచర్ను నేరుగా విశాఖకు తీసుకురాకూడదని నిర్ణయించుకున్నారు. కేవలం ఫర్నిచర్ మాత్రమే కాదు.. అనేక ఉత్పత్తుల విషయంలో విశాఖ కస్టమ్స్ నుంచే ప్రధాన అవరోధాలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అన్నీ ఉన్నా.. అవే లేవు ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా ఉంది విశాఖపట్నం కార్గో ఎగుమతి, దిగుమతుల పరిస్థితి. సామర్థ్యానికి తగ్గట్లుగా సరుకు నిర్వహణలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో, ఏళ్ల తరబడి ఇక్కడ వృద్ధి స్తంభించిపోయింది. విశాఖ పరిధిలో తయారవుతున్న ఉత్పత్తులు కూడా హైదరాబాద్ మీదుగా ముంబయి వెళ్తున్నాయి. సర్టిఫైడ్ ఏజెన్సీల కొరత ఓవైపు వేధిస్తుండగా, ఎగుమతులకు ‘కస్టమ్స్’ తీరు ప్రధాన అవరోధంగా మారింది. వచ్చే కార్గో నాణ్యతను పరీక్షించి, ధ్రువీకరించేందుకు అవసరమైన నిపుణుల బృందాలు విశాఖ కస్టమ్స్ వ్యవస్థలో లేకపోవడం వల్లే ఈ అంతరాయాలు ఏర్పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 200 ఉత్పత్తులకే పరిమితం! విశాఖ కస్టమ్స్ హౌస్లో నాణ్యత పరిశీలన నిపుణులు లేరనే వాదన బలంగా ఉంది. సరుకు రవాణా అభివృద్ధికి ఇదే ప్రధాన ఆటంకమని వాణిజ్య ప్రతినిధులు చెబుతున్నారు. ముంబయిలో 2000కి పైగా, చైన్నెలో 1500 వరకు కార్గో ఉత్పత్తులను కస్టమ్స్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. వచ్చే ప్రతి సరుకు ఏ గ్రేడ్లో ఉంది? ఎంత నాణ్యమైనది? దానికి ఎంత పన్ను వేయాలి? అనే విషయాలను అక్కడి నిపుణులు క్షణాల్లో చెప్పగలరు. తక్కువ వ్యవధిలోనే ధ్రువీకరించి క్లియరెన్స్ ఇస్తారు. కానీ, విశాఖలో ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకు పసుపు కొమ్ముల ఎగుమతి కోసం వ్యాపారులు విశాఖకు వస్తే, వాటి నాణ్యత పరిశీలనకే రోజుల సమయం తీసుకుంటున్నారు. ఫలితంగా సరుకు ఇక్కడే పాడైపోతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే చాలావరకు ఉత్పత్తులను చైన్నె లేదా ముంబయికి తరలిస్తున్నారు. ఇక విశాఖలో తయారయ్యే మందుల నాణ్యతను ధ్రువీకరించి, క్లియరెన్స్ ఇచ్చే నిపుణులు ఇక్కడ లేరు. వీటి కోసం ప్రత్యేక ఏజెన్సీలు ఉన్నా, అవి విశాఖలో అందుబాటులో లేకపోవడంతో సరుకును హైదరాబాద్కు తరలించి, అక్కడ సర్టిఫికెట్లు తీసుకొని ముంబయి ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా విశాఖలో కార్గో హ్యాండ్లింగ్ కేవలం 200 ఉత్పత్తులకే పరిమితమైపోయింది. ముంబయితో పోలిస్తే 20 శాతం, చైన్నెతో పోలిస్తే 25 శాతం ఉత్పత్తులు మాత్రమే విశాఖ నుంచి ఎగుమతి, దిగుమతులవుతున్నాయి. కొత్త ఉత్పత్తులకు అవకాశం లేదా? కస్టమ్స్ మదింపు కోసం ప్రత్యేక శిక్షణ ఉంటుంది. వైజాగ్ కస్టమ్స్ హౌస్కు వచ్చే అప్రైజర్లు కేవలం ఈ ప్రాంతంలో రవాణా అయ్యే పరిమిత సరుకులపైనే పట్టు సాధిస్తున్నారు. కొత్తగా ఏదైనా సరుకు వస్తే, దాని నాణ్యతను పరిశీలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఉత్పత్తులకు తగ్గట్టుగా కస్టమ్స్ హౌస్ తమ బృందాలను సిద్ధం చేయలేకపోతోంది. ఏవో కొర్రీలు వేసి వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. తాము సిద్ధంగా ఉన్నామని స్టేక్హోల్డర్స్ చెబుతున్నా, కస్టమ్స్ నుంచి స్పందన లేకపోవడంతో పరిమిత కార్గోను మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతున్నారు. కొన్ని ఉత్పత్తులను ఉత్తరాది నుంచి విశాఖ తీసుకొచ్చి, నేరుగా సింగపూర్, ఈశాన్య ఆఫ్రికా దేశాలకు పంపించేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నా.. ఇక్కడ సరైన పరిశీలన బృందాలు లేక వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా.. కార్గో ఎగుమతులు ముందుకు కదలక.. కొత్త ఉత్పత్తుల హ్యాండ్లింగ్కు అవకాశం లేకుండా పోతోందని వాపోతున్నారు. కస్టమ్స్ విభాగంలో మార్పులు వస్తేనే విశాఖలో ఎగుమతులు ఊపందుకుంటాయని వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
హోం మంత్రి, స్పీకర్ అండతోనే రంగురాళ్ల తవ్వకాలు
చింతపల్లి: రాష్ట్ర హోం మంత్రి, స్పీకర్ అండదండలతోనే జిల్లాలో రంగురాళ్ల మాఫియా రెచ్చిపోతోందని చింతపల్లి జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య ఆరోపించారు. చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో ఇటీవల రంగురాళ్ల అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని ఆయన చెప్పారు. మంగళవారం ఆయన చింతపల్లిలో విలేకరులతో మాట్లాడారు. సిగనాపల్లి రంగురాళ్ల క్వారీ వద్ద కాపలాగా ఉన్న అటవీ సిబ్బందిని ప్రలోభపెట్టి, భయాందోళనలకు గురిచేసి రంగురాళ్ల తవ్వకాలకు కొందరు వ్యాపారులు ప్రయత్నాల చేస్తున్నారని చెప్పారు. దీనివెనుక పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. తమ వెనుక హోంమంత్రి, స్పీకర్ ఉన్నారని, తమను ఎవరూ ఏమీ చేయలేరని కొందరు వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారని తెలిపారు. అమాయక ఆదివాసీ గిరిజనులకు మద్యం, కొంత నగదును ఎరగా వేసి వారిని పావులుగా వాడుకుంటున్నారన్నారు. క్వారీలో ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోయేది అమాయక గిరిజనులేనని చెప్పారు. అధికారులు రంగురాళ్ల వ్యాపారులపై నామమాత్రపు కేసులను పెట్టి ఊరుకోకుండా, పీడీ యాక్ట్ ప్రయోగించాలన్నారు అవసరమైతే వారి ఆస్తులను జప్తుచేయాలని బాలయ్య డిమాండ్ చేశారు. -
పోస్టల్ బ్రాంచిలో రూ.7 లక్షల గోల్మాల్!
● ఖాతాదారుల సొమ్ము సొంతానికి వాడుకున్న పోస్టుమాస్టర్ ● లబోదిబోమంటున్న బాధితులు ● సస్పెన్షన్తో సరిపెట్టిన అధికారులు నర్సీపట్నం : ఖాతాదారులు డబ్బులు చెల్లించారు..తమ దగ్గర ఉన్న పాస్ బుక్ల్లో జమైంది, కానీ అధికారిక ఖాతాలో జమ కాలేదు..అధికారులు గోల్మాల్ సొమ్ముకు సంబంధం లేదంటున్నారు...మరి తమ సొమ్ముకు సమాధానం చెప్పేది ఎవరని ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. తన ఖాతా నుంచి రూ.15 వేలు డ్రా చేస్తే రూ.5 వేలు ఇచ్చి, మిగిలిన రూ.10 వేలు ఇవ్వలేదని మన్యపురట్ల గ్రామానికి చెందిన నర్సే లక్ష్మి తెలిపింది. రూ.10 వేలు డ్రా చేస్తే రూ.2500 ఇవ్వలేదని అదే గ్రామానికి చెందిన నర్సే నాగేశ్వరరావు తెలిపారు. రూ.10 వేలు విత్డ్రా చేస్తే రూ.7 వేలు ఇచ్చి, మిగిలిన రూ.3 వేలు ఇవ్వలేదని తోట శివ అనే ఖాతాదారు తెలిపారు. ఇలా పోస్టుమాస్టర్ చేతిలో మోసపోయి వెలుగులోకి రానివారు ఇంకా ఎంతో మంది ఉన్నారు. నాతవరం మండలం, మన్యపురట్ల పోస్టల్ బ్రాంచిలో రూ.7 లక్షల వరకు నిధులు గోల్మాల్ జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఖాతాదారులు చెల్లించిన నగదును పోస్టల్ అకౌంట్లో జమ చేయలేదు. ఈ విషయం అధికారుల విచారణలో రుజువు కావడంతో పోస్టుమాస్టర్ రావాడ సోమరాజును అక్టోబర్ 16న సస్పెండ్ చేశారు. బాధితులు రూ.7 లక్షలు అంటున్నారు.. కానీ అధికారులు సస్పెండ్ చేసిన నాటికి రూ.2 లక్షలు జమ కాలేదని చెబుతున్నారు. దీనికి సంబంధించి రూ.50 వేలు రికవరీ చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. బ్రాంచి పరిధిలో లింగంపేట, రాజుపేట అగ్రహారం, మన్యపురట్ల, గుర్రంపేట గ్రామాలు ఉన్నాయి. ఆర్డీ, ఎస్హెచ్ఏ, సేవింగ్ అకౌంట్స్, ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి సుమారు 300 మంది ఖాతాదారులు ఉన్నారు. ఖాతాదారుల నుంచి కట్టిన నగదు ఏ రోజుకు ఆరోజు మెయిన్ బ్రాంచిలో జమ చేయాల్సి ఉంది. రోజుకు రూ.15 వేలకు మించి నగదు పోస్టుమాస్టర్ దగ్గర ఉండకూడదు. కానీ ఆయన రూ.లక్షలకు లక్షలు తన దగ్గర ఉంచుకుని సొంత అవసరాలకు వాడుకునేవారు. సస్పెన్షన్కు ముందు పోస్టల్ ఇన్స్పెక్టర్ తనిఖీల్లో నగదు సొంత అవసరాలకు వాడుకున్నట్టు రెండు పర్యాయాలు గుర్తించారు. అప్పట్లో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. అనకాపల్లి పోస్టల్ సూపరింటెండెంట్ తనిఖీలో నగదు వాడుకున్నట్టు మూడోసారి రుజువు కావడంతో సస్పెండ్ చేశారు. ఖాతాదారులను పిలిచి అధికారులు విచారించలేదు. పాస్బుక్, ఒరిజనల్ ఖాతాలో నగదుకు తేడా ఉండడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై అనకాపల్లి డివిజన్ పోస్టల్ సూపరిండెంటెంట్ శ్రీనివాసరావును వివరణ కోరగా తమ ప్రాథమిక విచారణలో రూ.2 లక్షల వరకు వాడుకున్నట్లు గుర్తించామని తెలిపారు. ఖాతాదారులకు నష్టం జరగకుండా చూస్తామని, అన్ని కోణాల్లో ఇన్స్పెక్టర్ రమేష్ విచారణ చేస్తున్నారని తెలిపారు. విచారణ నివేదిక వచ్చిన తరువాత ఖాతాదారులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
భర్త ఆచూకీ కోసం వేడుకోలు
భర్త ప్రసాద్ ఆచూకీ తెలపాలని కోరుతున్న భార్య డాలమ్మ, కుటుంబ సభ్యులు ముంచంగిపుట్టు: తన భర్త కుర్తాడి ప్రసాద్(45) కనిపించడం లేదని, ఆచూకీ తెలియజేయాలని మండలంలో బంగారుమెట్ట పంచాయతీ కించాయిపుట్టు గ్రామానికి డాలమ్మ, కుటుంబ సభ్యులు వేడుకొంటున్నారు. అతని భార్య డాలమ్మ స్థానిక విలేకరులకు మంగళవారం వివరాలు తెలియజేసింది. పదేళ్లుగా విశాఖపట్నం షీలానగర్లో భర్త ప్రసాద్, ఇద్దరు పిల్లలతో నివాసముంటూ భవననిర్మాణ పనులు చేస్తూ జీవిస్తున్నామని తెలిపింది. గత నెల 28న బయటకు వెళ్లిన ప్రసాద్ తిరిగి ఇంటికి రాలేదని, దీంతో పనిచేసే ప్రదేశాలలో, బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోయిందని చెప్పింది. ఈ నెల 4వ తేదీన దువ్వాడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఆమె చెప్పింది. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేయలేదని, లేనిపోని కారణాలు చెబుతూ తనను పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పించారని వాపోయింది. దీంతో తన స్వగ్రామం కించాయిపుట్టు వచ్చి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్లో తెలియజేసినా ఫలితం లేకపోయిందని తెలిపింది. సంఘటన జరిగిన ప్రాంతం దువ్వాడ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని తెలిపారని ఆమె చెప్పింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆమె రోదించింది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, ప్రసాద్ ఆచూకీ కనుగొనేలా ఆదేశాలు జారీ చేయాలని డాలమ్మ, ఆమె కుటుంబ సభ్యులు, కించాయిపుట్టు గ్రామస్తులు వేడుకుంటున్నారు. -
సింహగిరిపై మోగిన నెలగంట
సింహాచలం: ధనుర్మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని సింహగిరిపై నెలగంట ఉత్సవాన్ని మంగళవారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు. నెలరోజులపాటు జరిగే ధనుర్మాస పూజలను పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని, ఆళ్వారులను ఆస్థాన మండపంలో వేదికపై వేంజేపచేశారు. ధనుర్మాస ప్రారంభ నివేదనం, తిరుప్పావై సేవాకాలం, ధనుసంక్రమణ ప్రవేశ పూజలు నిర్వహించారు. అనంతరం గోదాదేవి అమ్మవారిని పల్లకీలో వేంజేపచేసి ఆలయ బేడామండపంలో తిరువీధి జరిపారు. గోదాదేవి సన్నిధిలో తొలి పాశుర విన్నపాన్ని పఠించారు. తదుపరి ఆలయ రాజగోపురంలో మధ్యాహ్నం 1.01 గంటలకు నెలగంటను మోగించారు. ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు చిన్నా తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
డుంబ్రిగుడ: మండలంలలోని పంతలచింత సమీపంలో జాతీయ రహదారి మలుపు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. హుకుంపేట మండల రంగశీల పంచాయతీ ఇరుకువలస గ్రామానికి చెందిన కొర్ర మధు స్వగ్రామం నుంచి అరకులోయ వైపు బైక్పై స్నేహితుడితో కలిసి వస్తుండగా పంతలచింత జాతీయ రహదారి మలుపులో గుర్తు తెలియని కారు బలంగా ఢీకొంది. దీంతో మధు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది వాహనంలో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. -
ఈ కమీషన్తో బతకలేం..
● వడ్డాది రేషన్ డీలర్ రాజీనామా బుచ్చెయ్యపేట : మండలంలోని మేజర్ పంచాయతీ వడ్డాది రేషన్ డిపో నంబర్ 10 డీలర్ దొండా వెంకట రామ అన్నయ్యదొర రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన బుచ్చెయ్యపేటలో తహసీల్దార్ లక్ష్మికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. 32 ఏళ్లకు పైగా రేషన్ డీలర్గా చేసిన తాను ఇప్పుడున్న పరిస్థితిలో రేషన్ డీలర్గా కొనసాగలేనని రాజీనామా పత్రంలో అన్నయ్యదొర పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు రావాల్సిన నెలవారీ కమీషన్ కూడా ఇవ్వలేకపోతోందని, నెలంతా కష్టపడిన అరకొర కమీషన్తో జీవించలేక పోతున్నామని వాపోయారు. ప్రభుత్వం గత మూడు నెలలుగా కమీషన్ కూడా అందించకపోగా, ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యం అందించమని అధికారుల వేధింపులకు విసుగు చెంది తన డీలర్ షిప్నకు రాజీనామా చేసినట్లు తెలిసింది. -
అమర జవాన్లకు ఘన నివాళి
ఏయూక్యాంపస్: 1971 యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ సాధించిన అద్భుత విజయానికి గుర్తుగా మంగళవారం నగరంలో ‘విజయ్ దివస్’ వేడుక లు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీచ్ రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద అమర జవాన్లకు ఘన నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన డైరెక్టర్ జనరల్ నేవల్ ప్రాజెక్ట్స్, వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్.. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
న్యాయ సహాయకుల పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం
విశాఖ లీగల్: నగరంలోని న్యాయ సేవా ప్రాధికార సంస్థలో న్యాయ సహాయకులుగా పనిచేయడానికి అర్హులైన న్యాయవాదుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవా ప్రాధికార సంస్థ చైర్మన్ చిన్నంశెట్టి రాజు తెలిపారు. డిఫెన్స్ కౌన్సిల్గా సేవలందించడానికి మూడు కేటగిరిలో న్యాయవాదులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ప్రధాన, ఉప న్యాయ సహాయకులు, లీగల్ అసిస్టెంట్ల పోస్టులకు ఈ నెల 31వ తేదీలోగా న్యాయ సేవా ప్రాధికార సంస్థలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు జిల్లా కోర్టు వెబ్సైట్ను సందర్శించవచ్చని తెలిపారు. -
డిజిటల్ ట్విన్స్తో రియల్ టైమ్ పర్యవేక్షణ
ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ మురళీనగర్ : డిజిటల్ ట్విన్స్ ద్వారా రియల్ టైమ్ పర్యవేక్షణ చేయవచ్చని ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ తెలిపారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్లో నిర్వహిస్తున్న అటల్ వాణి జాతీయ సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా వాహనాలు, యంత్రాల వర్చువల్ నమూనాలు రూపొందించవ్చన్నారు. వాటి పనితీరును నియంత్రించడం, పర్యవేక్షించడంలో కచ్చితత్వం సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్ సాంకేతిక రంగంలో క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థ నిర్ణయాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఆటోమోటివ్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు, స్వయంచాలక వాహనాల తయారీ, లాజిస్టిక్ రంగాల్లో క్యాంటం కంప్యూటింగ్ నూతన తరం ఆప్టిమైజేషన్, సిమ్యులేషన్ సాధనంగా అవతరిస్తోందని వివరించారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శశిభూషణ్ మాట్లాడుతూ హై స్పెక్ట్రల్ ఇమేజింగ్ సాంకేతికత ద్వారా అత్యంత స్పష్టతతో మట్టి లక్షణాలు, వివిధ పదార్థాల పరీక్షలు నిర్వహించవచ్చన్నారు. బబుల్ కర్టెన్, బబుల్ షీల్డింగ్ టెక్నాలజీ ఉపయోగించి సబ్మెరీన్ వేగాన్ని పెంచవచ్చని చెప్పారు. అనంతరం సదస్సు సావనీర్ ఆవిష్కరించారు. 60 పరిశోధనా పత్రాలకు ఆమోదం సదస్సులో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన 60 సాంకేతిక పరిశోధన పత్రాలను ఆమోదించారు. మొదటి రోజు యాంత్రిక, విద్యుత్, ఎలక్ట్రానిక్, సివిల్, కమికల్ ఇంజినీరింగు, ఫార్మసీ, ఇంగ్లిష్, గణిత విభాగాల నుంచి 30 పరిశోధనా పత్రాలు ప్రదర్శించారు. సదస్సు కోఆర్డినేటర్ సమన్వయకర్త డాక్టర్ కె.నారాయణరావు, ఎన్ఎస్టీఎల్ మాజీ అదనపు డైరెక్టర్ డాక్టర్ పీవీఎస్ గణేష్ కుమార్, స్టీల్ప్లాంట్ మాజీ జనరల్ మేనేజర్ ఓ.రామ్మోహనరావు, హైడల్ విద్యుత్ సౌధ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లెక్కల నానాబాబు, ఎన్ఎస్టీఎల్ అదనపు డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ ఉపన్యసించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె.ఫణికృష్ణ, కో–కోర్డినేటర్లు డాక్టర్ రాజు చిట్ల, భరణి మారోజు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మంచు, చలి తీవ్రతకు మన్యంవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం జి. మాడుగులలో 3.8 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 6.4 డిగీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధి అరకువ్యాలీలో 7.2 డిగ్రీలు, పెదబయలులో 8.8 డిగ్రీలు, హుకుంపేటలో 9.0 డిగ్రీలు, పాడేరులో 9.6 డిగ్రీలు, చింతపల్లిలో 1.8 డిగ్రీలు, కొయ్యూరులో 12.8 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. ●రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 10.8 డిగ్రీలు, మారేడుమిల్లిలో 11.3 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 13.5 డిగ్రీలు, అడ్డతీగలలో 15.1 డిగ్రీలు, రంపచోడవరంలో 15.8 డిగ్రీలు, చింతూరు డివివిజన్ చింతూరులో 13.9 డిగ్రీలు, ఎటపాకలో 14.2 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఉదయం 9గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. జి.మాడుగుల: చలి తీవ్రతకు మండల ప్రజలు వణికిపోతున్నారు. పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి రోడ్డు, నుర్మతి, సొలభం, గెమ్మెలి మార్గాల్లో పొగమంచు తెరలు కమ్మేశాయి. దీంతో రహదారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించారు. -
కాఫీ రైతులకు అందని ప్రోత్సాహక నిధులు
అరకులోయ టౌన్: కాఫీ రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సాహక నిధులు కాఫీ రైతుల ఖాతాలో జమచేయాలని కాఫీ రైతు సంఘ ప్రతినిధి గెమ్మెలి చినబాబు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన స్థానిక గిరిజన సంఘ కార్యాలయంలో మాట్లాడారు. సేంద్రియ విధానంలో పండించే కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ పండించే రైతులకు కాఫీ బోర్డు ప్రోత్సాహకాలు అందించడం లేదన్నారు. 2023లో 10వేల ఎకరాల్లో కొత్తగా కాఫీ నాటిన 10వేల మంది రైతులకు, 2024లో 12వేల ఎకరాల్లో కన్సలిడేషన్ కింద కాఫీ నాటిన 12వేల మంది రైతులకు, 2025లో 8వేల ఎకరాల్లో కన్సలిడేషన్ పనులు చేసిన రైతులకు ఎకరాకి రూ.9 వేల చొప్పున నేటికీ వారి ఖాతాల్లో జమచేయలేదన్నారు. మూడేళ్లకు సంబంధించి ప్రోత్సాహక నిధులు రూ.కోట్లలో చెల్లించాల్సి ఉందన్నారు. పాత బకాయిలు రూ.67 కోట్లు కూడా చెల్లించాలని కాఫీ రైతులు పాడేరు ఐటీడీఏ ఎదుట ఆందోళన చేపట్టినప్పుడు వెంటనే జమ చేస్తామని చెప్పిన అధికారులు ఆ తరువాత విస్మరించారని ఆవేదన వ్యక్తంచేశారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని అన్ని శాఖల అధికారులకు బదిలీలు జరుగుతున్నాయన్నారు. కాఫీ బోర్డులో గత కొన్నేళ్లుగా సుదీర్ఘంగా పనిచేస్తున్న ఉన్నతాధికారులకు బదిలీలు లేనందున వారు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికై నా ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, కాఫీ అధికారులు స్పందించి కాఫీ రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే జమ చేయాలని చినబాబు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాఫీ సంఘం జిల్లా నాయకులు పి. లక్కు తదితరులు పాల్గొన్నారు. -
దళారులకే రాజ్మా!
పాడేరు మండలం గుత్తులపుట్టులో కోతకు సిద్ధంగా రాజ్మా పైరుసాక్షి,పాడేరు: మన్యంలో రాజ్మాను సాగు చేసే రైతులకు కష్టాలు తప్పడం లేదు. వీటిని కొనుగోలు చేసే దళారులు, రిటైల్ వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారు. పండించే రైతులకు గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్టపోతున్నారు. పోడు, మెట్ట భూముల్లో ఈ పంటను సేంద్రియ విధానంలో పండించడం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కిలో ఎరుపు రకం రూ.200, తెలుపు రూ.250 ధరతో మార్కెట్లో వ్యాపారం జరుగుతోంది. క్రిస్మస్, సంక్రాంతి పండగల ఆర్థిక అవసరాలు తీర్చే ఆదాయ పంటగా పేరొందినా.. రెండేళ్లుగా పరిస్థితులు కలిసిరావడం లేదని గిరిజన రైతులు వాపోతున్నారు. ●పాడేరు డివిజన్ 11 మండలాల్లో 12వేల హెక్టార్లలో రాజ్మాను సాగుచేస్తున్నారు.వ్యవసాయఽశాఖ కూడా ఈ ఏడాది 10వేల హెక్టార్లలో సాగుకు సరిపడేలా 4,900 క్వింటాళ్ల విత్తనాలను గిరిజన రైతులకు పంపిణీ చేసింది. మిగిలిన వ్యవసాయ భూముల్లో ఎరుపు,తెలుపు రాజ్మా పంటల సాగుకు గిరిజన రైతులు తమ సొంత విత్తనాలను వినియోగించారు. ప్రస్తుతం పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి.సేకరించిన పంటను ఎండబెట్టి గ్రేడింగ్ చేసే పనుల్లో గిరిజన రైతులు నిమగ్నమయ్యారు. ఎకరాకు 350 నుంచి 400 కిలోల వరకు దిగుబడి రావచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా ఎకరా పంట ద్వారా రూ.30వేల నుంచి రూ.40వేల మధ్య ఆదాయం పొందుతున్నారు. పెట్టుబడికి, వచ్చిన ఆదాయం ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ●రాజ్మా పంటకు జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉంది. అయినప్పటికీ గిరిజన ప్రాంతాల్లో మాత్రం కొనుగోలు ధరలు పెరగడం లేదు. గత ఏడాది రాజ్మా దిగుబడులు భారీగా తగ్గాయి. అధిక వర్షాలతో పంటకు నష్టం ఏర్పడింది.అయినప్పటికీ వ్యాపారులు ఎరుపు రంగు రాజ్మాను కిలో రూ.100,తెలుపు రకం రూ.110లోపు ధరకు మాత్రమే కొనుగోలు చేశారు. ●గిరిజన రైతులు సాగు చేసే వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన జీసీసీ కూడా వ్యాపార సంస్థగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్నప్పటికి గత సీజన్ చివరిలో ఽఽజీసీసీ కిలో రూ.90 ధర ప్రకటించింది. అప్పటికే దళారులు ఎరుపు రంగు రాజ్మాను కిలో రూ.100తో కొనుగోలు చేశారు. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు ధర ప్రకటించకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎరుపు రాజ్మా గింజలను కిలో రూ.150 ధరకు జీసీసీ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ●దళారుల దోపిడీ నుంచి విముక్తి కలగాలంటే, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు. ప్రభుత్వమే నేరుగా మన్యం గ్రామాల్లో రాజ్మా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. గిరిజన సహకార సంస్థ గిట్టుబాటు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. సంఘాల ద్వారా పట్టణాల్లో ’మన్యం రాజ్మా’ పేరుతో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి, దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని గిరి రైతులు విన్నవిస్తున్నారు. -
21న చింతూరులో అమరవీరుల సంస్మరణ సభ
మాట్లాడుతున్న కిరణ్ ఎటపాక: చింతూరులో ఈనెల 21న జరిగే అమరవీరుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ కోరారు. మంగళవారం రామగోపాలపురంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయనతో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు మాట్లాడారు. పీడిత ప్రజలకు అండగా పోరాడుతూ అమరులైన వారిని స్మరించుకుని వారి త్యాగాలను, రాటాలను గుర్తుచేసుకోవాలన్నారు. సంస్మరణ సభకు పార్టీ పొలిట్ రో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి కాక అర్జున్, రాము, భద్రయ్య, హుస్సేన్, శ్రీను, బాబు, ముత్తులు పాల్గొన్నారు. -
గొర్రెలు, మేకలకు భలే డిమాండ్
జి.మాడుగుల: వారపుసంతల్లో మేకలు, గొర్రెలు, నాటుకోళ్లకు మంచి డిమాండ్ నెలకొంది. దీంతో ధరలు గణనీయంగా పెరిగాయి. మండలంలోని మంగళవారం సంతబయలు గ్రామంలో జరిగిన వారపుసంతలో కొనుగోలు చేసేందుకు మైదాన ప్రాంత వ్యాపారులు పోటీ పడ్డారు. 10కిలోల మేక, గొర్రెను రూ.12 వేల నుంచి రూ.13వేలకు అమ్మారు. కిలో నుంచి కిలోన్నర బరువు గల నాటుకోడికి రూ.1500, రెండు నుంచి మూడు కిలోల బరువు గల కోడిపుంజు రూ.3 వేల నుంచి రూ.4 వేల ధర లభించింది. దసరా పండగ నుంచి ధరలు ఆశాజనకంగా ఉన్నందున మంచి ఆదాయం వస్తోందని పెంపకందారులు తెలిపారు. -
గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం
పాడేరు : గంజాయి తదితర మత్తు పదార్థాల్లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ పిలుపునిచ్చారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో అభ్యుదయం సైకిల్ యాత్రను మంగళవారం పాత బస్టాండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆయనతో కలిసి ఎస్పీ అమిత్బర్దర్ జెండా ఊపి ప్రారంభించారు. మత్తు పదార్ధాలకు వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ అవగాహన ర్యాలీ తలార్సింగి వరకు నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్, ఎస్పీ, పోలీస్ అధికారులు ైసెకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు వద్దు–గంజాయి అక్రమ రవాణను నిరోదిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాల జోలికి వెళ్లి విలువైన జీవితాలను ఛిద్రం చేసుకోవద్దని సూచించారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పాటుచేసుకుని వాటిని -
అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు విస్తృతం
అడ్డతీగల: గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో కొనుగోళ్లు విస్తృతం చేస్తామని ఆ సంస్థ మార్కెటింగ్ విభాగం జీఎం ఎస్.త్రినాథరావు తెలిపారు. మంగళవారం ఆయన జీసీసీ స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలోని అటవీ ఉత్పత్తులు, కొనుగోళ్ల వివరాలను సిబ్బంది నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజనులు పండించిన, సేకరించిన అటవీ ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోలుకు సంకల్పించామన్నారు. ఈ మేరకు సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులపై దళారుల ప్రభావం లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడతామన్నారు. గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో కొనుగోలు చేసే ఉత్పత్తులు, నిర్ణయించిన ధర, మార్కెటింగ్ తదితర అంశాలపై కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తామన్నారు. రాజవొమ్మంగి, అడ్డతీగల బ్రాంచీల సిబ్బందికి ఇప్పటికే సూచనలు ఇచ్చామన్నారు. ఆయన వెంట రంపచోడవరం డీఎం విజయలక్ష్మి ఉన్నారు. -
రంగురాళ్ల తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు
గూడెంకొత్తవీధి: రక్షిత అటవీ ప్రాంతాల్లో అక్రమంగా చొరబడి రంగురాళ్ల తవ్వకాలకు పాల్పడేవారితోపాటు, తవ్వకాలను ప్రోత్సహించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుధాకర్ హెచ్చరించారు. దావనాపల్లి సమీపంలోని సిగనాపల్లి కొండపై ఆదివారం రాత్రి రంగురాళ్ల తవ్వకాలు జరిగినట్టు వచ్చిన సమాచారంపై ఆయన విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా చింతపల్లి ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులతోపాటు క్వారీ పరిసర గ్రామాలకు చెందిన గిరిజనులను మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్కు రప్పించారు. వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. రక్షిత అటవీ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా సంచరించడం, రంగురాళ్ల తవ్వకాల పేరుతో అలజడి సృష్టించడం, శాంతి భద్రతలకు విఘాతం కల్గించడం చట్టరీత్యా నేరమని వారికి సీఐ సూచించారు. ప్రాథమిక విచారణలో గుర్తించిన 16మందిపై బైండోవర్ నమోదు చేస్తున్నామన్నారు. ఎస్ఐ సురేష్తో కలిసి మంగళవారం సిగనాపల్లి క్వారీని పరిశీలించారు. అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు అందించాలని సీఐ సూచించారు. -
ఎస్ఐలకు బదిలీ
పాడేరు : జిల్లాలో ఎస్ఐలు పలువురిని బదిలీ చేస్తూ ఎస్పీ అమిత్బర్దర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాడేరు ఎస్ఐ ఎల్.సురేష్ను డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్కు, అర్కడి ఎస్ఐ కె. పాపినాయుడును పాడేరు పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న కె. దుర్గాప్రసాద్ను హుకుంపేట, పులకనందం నానిని ముంచంగిపుట్టు, బోనంగి సాయిరాం పడాల్ను జి.మాడుగుల, సీదరి శ్రీనివాస్ను మంప, టి. వెంకటేష్ను పెదబయలు పోలీసుస్టేషన్కు బదిలీ చేశారు. మంప ఎస్ఐ కె. శంకరరావును అనంతగిరి, ఎ. అన్నవరం ఎస్ఐ జి.వీరబాబును చింతపల్లి స్టేషన్కు, హుకుంపేట ఎస్ఐ ఎ. సూర్యనారాయణను జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచికు బదిలీ చేశారు. వీరంతా తక్షణమే విధుల్లోకి చేరాలని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వెన్నులో వణుకు పుట్టిస్తున్నా..
ముంచంగిపుట్టు: మంచు తెరలు వారి కంటిచూపును అడ్డుకున్నా గిరిజనుల నిత్య కృత్యాలను మాత్రం ఆపలేవు. ప్రకృతి సృష్టించిన కఠినమైన చలిని కూడా వారు లెక్కచేయకుడా తమ దైనందన కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. మత్స్యగెడ్డను మంచు కమ్మేయడంతో ఇబ్బందులు పడుతూ పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. మంచు, చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఇబ్బందులు పడుతూనే మంట నూర్పిడి పనుల్లో గిరి రైతులు పాల్గొంటున్నారు. చలి మంటలను ఆశ్రయిస్తూ ఉపశమనం పొందుతున్నారు. మంచు తెరలు కమ్మేయడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. హెడ్లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తున్నారు. -
ఓజుబంద క్వారీని మూసివేయాలి
ఐటీడీఏ ఎదుట గిరిజనుల నిరసన రంపచోడవరం: ఓజుబందలోని నల్లరాయి క్వారీని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్కు వినతిపత్రం అందజేశారు. గంగవరం మండలం ఓజుబంద నల్లరాయి క్వారీని తక్షణమే మూసివేయాని కోరారు. దిరిసినపల్లి గ్రామానికి చెందిన బల్లెం గంగాభవానీ కుటుంబాన్ని వెలివేసిన సంఘటనపై ఇప్పటికే పలుమార్లు అర్జీలు అందజేసినప్పటికీ విచారణ జరపకుండా అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కుంజా శ్రీను ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చోడి ప్రదీప్కుమార్దొర, ప్రసాద్ కంగాల అబ్బాయిదొర పాల్గొన్నారు. -
రాయ్పూర్ విజయం
విశాఖ స్పోర్ట్స్ : రైల్వే గ్రౌండ్స్లో సోమవారం రాత్రి ఫ్లడ్లైట్ల వెలుతురులో జరిగిన డీఆర్ఎం కప్ ఆహ్వాన ఫుట్బాల్ టోర్నీ మ్యాచ్లో రాయ్పూర్ (ఎస్ఈసీఆర్) జట్టు సంబల్పూర్ రైల్వే జట్టుపై విజయం సాధించింది. ఏ పూల్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్లు రెండేసి గోల్స్ చేసి సమానంగా నిలిచాయి. దీంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేకర్ను నిర్వహించగా, రాయ్పూర్ జట్టు విజయాన్ని అందుకుంది. ఈ ఆహ్వాన ఫుట్బాల్ టోర్నీలో మొత్తం 14 జట్లు రెండు పూల్స్లో పోటీపడుతున్నాయి. -
వైఎస్సార్ సీపీలోకి ఆర్.కొత్తూరు ఉప సర్పంచ్
కొయ్యూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంతో టీడీపీపై వ్యతిరేకత పెరుగుతోందని పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు అన్నారు. టీడీపీ నేత, ఆర్.కొత్తూరు ఉప సర్పంచ్ అంకంరెడ్డి అప్పలనాయుడు టీడీపీని వీడి ఎమ్మెల్యే సమక్షంలో సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. అప్పలనాయుడుకు పార్టీ కండువా వేసి, ఆహ్వానించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అనంతరం అప్పలనాయుడు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కార్యకలాపాలు, ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాలు నచ్చి పార్టీలో చేరినట్టు చెప్పారు. -
పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం
సాక్షి, పాడేరు: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్, ఎస్పీ అమిత్బర్దర్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరజీవి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అమరావతి ప్రాంతంలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహం,స్మృతివనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడం గర్వంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో అంబేడ్కర్,ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు,కలెక్టరేట్ ఏవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ నిధులతో సామూహిక మరుగుదొడ్లు
ముంచంగిపుట్టు: జెడ్పీ నిధులతో సామూహిక మరుగుదొడ్లను నిర్మించనున్నట్టు జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర తెలిపారు. స్థానిక అంబేడ్కర్ పార్కులో రూ.5లక్షలు, గిరిజన భవన్ వద్ద రూ.5లక్షల వ్యయంతో చేపట్టిన సామూహిక మరుగుదొడ్లు నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో జెడ్పీ నిధులతో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు అధికంగా నిధులు ఖర్చు చేసినట్టు తెలిపారు. ముంచంగిపుట్టులోని అంబేడ్కర్ పార్కును తీర్చిదిద్దేందుకు, గిరిజన భవన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుభాష్చంద్ర, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, జేసీఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ జగబంధు, వైఎస్సార్సీపీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఎంప్లాయిస్, పెన్షనర్ల విభాగ అధ్యక్షుడు మోదకొండ, వైఎస్సార్సీపీ మండల ప్రధాన కార్యదర్శి సన్యాసిరావు, వైఎస్సార్సీపీ జిల్లా, మండల నేతలు మూర్తి, రాజారావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర -
ఎన్కౌంటర్లపై విచారణకు వెళ్లకుండా అడ్డుకున్నారు
హైకోర్టు న్యాయవాది సురేష్కుమార్ రంపచోడవరం: మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లపై నిర్వహించిన మేజిస్ట్రీరియల్ విచారణకు వెళ్లకుండా పోలీసులు తుపాకులతో అడ్డుకున్నారని హైకోర్టు అడ్వకేట్ సురేష్కుమార్ ఆరోపించారు. హిడ్మాతో పాటు మిగిలిన మావోయిస్టులు, పోలీసులు మధ్య జరిగిన ఎదురుకాల్పులపై రంపచోడవరం సబ్కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్ సోమవారం విచారణ జరిపారు. విచారణలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన తనను లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని సురేష్కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయం బయట ఆయన విలేకరులతో మాట్లాడారు. లాయర్ల సంఘం తరఫున విచారణకు హాజరయ్యేందుకు తాను వచ్చినట్టు తెలిపారు. లోపల మీటింగ్ జరుగుతోందని, సీఐ ఎవరినీ పంపవద్దన్నారని పోలీసుల తెలిపారన్నారు. గట్టిగా ప్రశ్నిస్తే సబ్కలెక్టర్ లోపలికి పిలిపించారని చెప్పారు. సంఘటనా స్థలానికి వెళ్లేందుకు తమకు అనుమతించడంలేదని, హైదరాబాద్ నుంచి విద్యార్థి సంఘాల నాయకులు వస్తే వారిని అడ్డుకున్నారని సబ్కలెక్టర్కు చెప్పినట్టు ఆయన తెలిపారు. ప్రజా సంఘాల తరఫున కుంజా దూలయ్య సంఘటన స్థలానికి వెళ్లి వస్తే ఆయనపై కేసు పెట్టారన్నారు. ఏ నిజాన్ని ఆపడం కోసం అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. విచారణ సమయంలో పోలీసుల వద్ద తుపాకులు ఉండకూడదన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో విచారణ జరిగితే ఎవరైనా వచ్చి తమకు తెలిసింది చెప్పగలుగుతారని తెలిపారు. తూతూ మంత్రంగా విచారణ జరిగిందన్నారు. తమ వాదన విన్న సబ్ కలెక్టర్ పది రోజుల తరువాత మళ్లీ విచారణ జరుగుతుందని చెప్పారన్నారు. అనంతరం వాయిదా వేసినట్లు తెలిపారు. సబ్కలెక్టర్పై నమ్మకంతో ఉన్నామన్నారు.మీడియాకు ప్రవేశం లేకుండా విచారణ చేయడం దారుణమని తెలిపారు. విచారణ హాల్లో వంద మంది వరకు ఉన్నారని, అనుకూలంగా ఉన్న వారికి ముందుగా పోలీసులు ట్రైనింగ్ ఇచ్చారని ఆరోపించారు. ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలో వివరించి, విచారణకు పంపించారన్నారు. వారికి అనుకూలంగా ఉన్న స్టేట్మెంట్లను మాత్రమే రికార్డు చేసుకుంటున్నారని తెలిపారు. -
కరాటేలో గిరిజన యువకుల ప్రతిభ
ముంచంగిపుట్టు: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈ నెల 14న జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ జాతీయ స్థాయి కరాటే చాంపియన్షిప్లో గిరిజన యువకులు ప్రతిభ కనబరిచారు. బ్లాక్ బెల్ట్ కరాటే మాస్టర్ కె.సురేష్ ఆధ్వర్యంలో గిరిజన యువకులు పాల్గొని ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ముంచంగిపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టు గ్రామానికి చెందిన రుంజుల సూర్యప్రకాశ్ బ్లాక్ బెల్ట్ సీనియర్ 55 కేజీల విభాగంలో కట అండ్ స్పారింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. పెదబయలు మండలం జామిగూడ గ్రామానికి చెందిన కిల్లో సతీష్కుమార్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల–2లో ఆరో తరగతి చదువుతున్నాడు. 35 కేజీల జూనియర్ విభాగంలో కటలోని స్విలర్ మెడల్, స్పారింగ్లో గోల్డ్ మెడల్ సాధించాడు. పాడేరు మండల కేంద్రానికి చెందిన సల్లంగి వెంకటప్రసాద్ 55 కేజీల సీనియర్ బ్రౌన్ బెల్ట్ విభాగంలో కట భాగంలో గోల్డ్ మెడల్తో పాటు స్పారింగ్లో అత్యున్నత ప్రతిభను కనబరిచి గోల్డ్ మెడల్ సాధించాడు. -
అఖిలభారత మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
చింతపల్లి: అఖిల భారత మహాసభల వాల్పోస్టర్లను కార్మికులతో కలిసి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుళ జాతి సంస్థలకు కొమ్ము కాసే ప్రభుత్వాలతో కార్మికులు పోరాటం చేస్తున్నారన్నారు. దేశ ప్రజల ఆస్తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేస్తున్నాయని మండిపడ్డారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఆయిల్ కంపెనీలు, ఉక్కు ఫ్యాక్టరీలను పెట్టుబడుదారులకు ప్రధాని మోదీ అప్పచెబుతున్నారన్నారు. అంబాని, అదాని, టాటాలకు లక్షల కోట్లు విలువ చేసే ప్రజల ఆస్తులను తక్కువ ధరకు కట్టబెడుతున్నారని తెలిపారు. ప్రజల డబ్బులతో నిర్మితమైన రైల్వే, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, పోర్టులను కార్పొరేట్ శక్తుల గుప్పెట్లో పెడుతున్నారన్నారు. ఇటువంటి తరుణంలో జరుగుతున్న మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
శ్రమదానంతో బి.సింగవరానికి రోడ్డు
కొయ్యూరు: బూదరాళ్ల పంచాయతీ బి.సింగవరం గ్రామస్తులు శ్రమదానంతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. బూదరాళ్లకు మూడు కిలోమీటర్ల దూరంలో కొండపై సింగవరం గ్రామం ఉంది. దీనికి అసలు రహదారి సౌకర్యం లేదు. రహదారి వేయాలని ఇది వరకు అనేకసార్లు అధికారులకు వినతులు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో గ్రామానికి చెందిన మహిళలు, పురుషులు సోమవారం గుణపం, పారా పట్టుకున్నారు. కొండను తవ్వి రహదారి నిర్మాణం చేపట్టారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పక్కా రహదారి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరారు. -
విద్యుత్ పొదుపుపై విస్తృతంగా ప్రచారం
కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి, పాడేరు: విద్యుత్ పొదుపుపై గిరిజన గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులను ఆదేశించారు. ఇంధన పొదుపు వారోత్సవాల ప్రచార పోస్టర్లను కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ ఆవిష్కరించి, ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా విద్యుత్ పొదుపుపై అవగాహన ఏర్పర్చుకోవాలని తెలిపారు.అనంతరం కలెక్టరేట్ నుంచి పాతబస్టాండ్ అంబేడ్కర్ సెంటర్ వరకు ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎస్పీ అమిత్బర్దర్, విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్ఈ జి.ఎస్.ప్రసాద్, ఈఈ ఎల్.సి.హెచ్.పాత్రుడు, పాడేరు డీఈఈ వేణుగోపాల్, ఏవో శ్యామలరావు, పీవో కిరణ్కుమార్, కమర్షియల్ ఏడీ భాస్కరరావు, పాడేరు, చింతపల్లి, అరకులోయ ఆపరేషన్ ఏడీఈలు ప్రసాద్, రాంబాబు, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. భవితరాల కోసం విద్యుత్ ఆదా చేయాలి రంపచోడవరం: భావితరాల వారికి భరోసానిచ్చే విధంగా ప్రతి ఇంట్లో విద్యుత్ ఆదా చేయాలని స్థానిక ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్రాజ్ అన్నారు. స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలో సోమవారం ఇంధన పరిరక్షణ ర్యాలీని పీవో, సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ‘నేటి సంకల్పం రేపటి వెలుగుల సాకారం’ అనే కార్యక్రమం ద్వారా మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. ప్రతి ఇంట్లో అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలని చెప్పారు. విద్యుత్ను ఆదా చేసే ఎలక్ట్రికల్ సామగ్రిని వినియోగించాలని సూచించారు. ఈ నెల 14నుంచి 20వ తేదీ వరకు ఏడు రోజులపాటు ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 18న రంపచోడవరం అంబేడ్కర్ సెంటర్లో కళాజాత నిర్వహించనున్నట్టు చెప్పారు. విద్యార్థులకు విద్యుత్ ఆదాపై అవగాహన క ల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డి.ఎన్.వి. రమణ, డీడీ రుక్మాండయ్య, డీడీవో కె.కోటేశ్వరరావు, ఏపీవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
356 ఎకరాలకు పట్టాలు మంజూరు చేయండి
రంపచోడవరం: రంపచోడవరం మండలం కాకవాడ–ఆకూరు గ్రామం వరకు సమారు 13 కిలోమీటర్లు రహదారికి అటవీ అభ్యంతరాలు తొలగించి రోడ్డు నిర్మాణం చేయాలని కత్తుల రామకృష్ణారెడ్డి, చుండ్రు అబ్బాయిరెడ్డి, చిన్నారావు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. ఐటీడీఏ సమావేశపు హాలులో పీవో బచ్చు స్మరణ్రాజ్, సబ్ కలెక్టర్లు శుభమ్ నొఖ్వాల్, సాహిత్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ వారం 86 అర్జీలు వచ్చినట్లు పీవో తెలిపారు. వేములకొండ గ్రామంలోని రెవెన్యూ భూముల్లో శతాబ్దాల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్న 112 మంది గిరిజనులకు సుమారు 356 ఎకరాలకు పట్టాలు మంజూరు చేయాలని అరగాటి రామకృష్ణారెడ్డి కోరారు. వెలమలకోట గ్రామంలో మహిళా సంఘాలకు సంబంధించి మధ్యలో నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని గిరిజన మహిళాలు కోరారు. రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామం నుంచి కొత్తపాకలు గ్రామం వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. కొత్తపాలెం గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాల భవనం లేక ఇబ్బందులు మారేడుమిల్లి మండలం ధారవాడ గ్రామంలో 11 ఏళ్లుగా పాఠశాలకు భవనం లేదని గిరిజనులు రంపచోడవరం ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని పిల్లల తల్లులు ఐటీడీఏకు వచ్చి తమ నిరసన తెలిపారు. గ్రామ పెద్ద పల్లాల ధర్మారెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు భవనం నిర్మించాలని అనేక సార్లు అధికారులను కోరామన్నారు. గతేడాది నాడు–నేడులో పాఠశాల భవనం మంజూరు చేసి, పునాది వరకు నిర్మాణం చేపట్టారన్నారు. దీనిపై విద్యార్థుల తల్లులతో కలిసి పీవోకు అర్జీ అందజేశామన్నారు.వారంలో సమస్య పరిష్కరిస్తామని పీవో హామీ ఇచ్చినట్టు ధర్మారెడ్డి తెలిపారు. దేవీపట్నం మండలం వెలగపల్లి గ్రామం వద్ద వాగుపై వంతెన నిర్మించాలని గిరిజనులు కోరారు. కాలువ పొంగి ప్రవహించినప్పుడు గుంపెన పల్లి నుంచి వెలగపల్లిలోని పాఠశాలకు విద్యార్థులు వెళ్లలేకపోతున్నారని అర్జీలో పేర్కొన్నారు. ఐటీడీఏ పీవోకు అర్జీ అందజేసిన గిరిజనులు -
ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాల పంపిణీ
రంపచోడవరం: ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలు అందించేలా చర్యలు చేపడతామని రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్రాజ్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పలువురు ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఏజెన్సీలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు చెవిటి మిషన్లు, వీల్ చైర్లు, త్రీ వీలర్ సైకిళ్లు అందజేస్తామన్నారు. ఏజెన్సీ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎంత మంది ఉన్నారో జాబితా తయారు చేసి సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఆర్ఎల్ శ్రీనివాసరావు, ఏఎంవో భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు. కోల్డ్ స్టోరేజ్ కోసం పరిశీలన పెదగెద్దాడ పీహెచ్సీలో పోలియో చుక్కల కోల్డ్ స్టోరేజీ పాయింట్ ఏర్పాటు కోసం సోమవారం పీవో స్మరణ్రాజ్ పరిశీలించారు. పీవో మాట్లాడుతూ ఏజెన్సీలో త్వరలో పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం చేపడతామన్నారు. ఏడీఎంఅండ్హెచ్వో డాక్టర్ సరిత, డాక్టర్ వినోద్, తదితరులు పాల్గొన్నారు. -
మాడగడ పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ
అరకులోయటౌన్: మండలంలోని మాడగడ పీహెచ్సీని అరకులోయ జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాయంత్రం 4 గంటలకు పీహెచ్సీని తనిఖీ చేసిన సమయంలో మేల్ నర్సింగ్ ఆర్డర్ కొర్రా భీమా మాత్రమే విధుల్లో ఉన్నారు. పీహెచ్సీలోని డాక్టర్ గది, మందుల గదులు, వార్డులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్సీలో సిబ్బంది ఎవ్వరూ లేకపోవడంతో జెడ్పీటీసీ విస్తుపోయారు. మేల్ నర్సింగ్ ఆర్డర్తో మాట్లాడి డాక్టర్తో పాటు సిబ్బంది విధులకు హాజరు, సమయపాలనపై ఆరా తీశారు. తాను మధ్యాహ్నం 2 గంటలకు పీహెచ్సీకి వచ్చినప్పటికి డాక్టర్ వసంత విధుల్లో లేరని, మిగతా స్టాఫ్ కూడా 4 గంటలకు ముందే వెళ్లిపోయారని భీమా తెలిపారు. దీంతో జెడ్పీటీసీ సభ్యురాలు రోషిణి పాడేరు డీఎం అండ్ హెచ్వో కృష్ణమూర్తి నాయక్తో ఫోన్లో మాట్లాడారు. మాడగడ పీహెచ్సీ డాక్టర్ వసంత విధులకు సకాలంలో వెళ్లడం లేదని, సాయంత్రం వరకు ఆస్పత్రిలో ఉండడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు పీహెచ్సీ తనిఖీని చేశానని, డాక్టర్ మధ్యాహ్నం 2 గంటలకే వెళ్లినట్లు సిబ్బంది చెబుతున్నారన్నారు. దీనికి స్పందించిన డీఎంహెచ్వో.. డాక్టర్ వసంతపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని, ఇటీవల తాను మాడగడ పీహెచ్సీ తనిఖీకి వెళ్లిన స మయంలో ఆమె విధుల్లో లేరని చెప్పా రు. దీంతో డా క్టర్ వసంతపై శాఖా పరమై న చర్యలు తీ సుకోవాలని జెడ్పీటీసీ డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు స్వాభి రామమూర్తి, పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్
విశాఖ సిటీ: నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న మోసగాళ్లకు మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హెచ్బీ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి వాట్సాప్ ద్వారా ‘ఆరాధ్య మిశ్రా’ అనే మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. తాను స్టాండర్డ్ చార్టర్డ్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పిన ఆ మహిళ.. 700 శాతం లాభాలు పొందవచ్చని ఆశ చూపింది. ఆమె పంపిన లింక్ ద్వారా ఫిర్యాదుదారుడు ‘ఎస్ఎల్ ఎలైట్’ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని, ఐపీవోలు, షేర్లు, ఇండెక్స్ ట్రేడింగ్లో మొత్తం రూ. 32 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. అయితే తరువాత నగదు విత్డ్రా చేయాలనుకున్నప్పుడు, అదనపు సర్వీస్ ట్యాక్స్, ప్రాసెసింగ్ చార్జీలు చెల్లించాలని రావడంతో తాను మోసపోయినట్లు గ్రహించి, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంక్ లావాదేవీలను పరిశీలించగా, మ్యూల్ బ్యాంకు అకౌంట్లను సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన విజయవాడకు చెందిన అడుసుమిల్లి శివరాంప్రసాద్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇతడి ద్వారా మరి కొంతమంది నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న వారికి బ్యాంకు అకౌంట్లు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు సమాచారం రాబట్టారు. ప్రస్తుతం వారిపై నిఘా పెట్టారు. -
ఆస్పత్రికి వెళ్లేందుకు మాకు మేమే తోడు
ముంచంగిపుట్టు: స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–1లో విద్యార్థినులు అనారోగ్యానికి గురైతే పడరాని పాట్లు పడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్థినులను తోటి విద్యార్థినులే స్థానిక సీహెచ్సీకు తీసుకువెళ్లాల్సి వస్తోంది. ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్లు లేకపోవడంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సోమవారం ఉదయం కొంత మంది విద్యార్థినులు జ్వరం,దగ్గు,జల్బులతో బాధపడుతూ ఉండడంతో తోటి విద్యార్థినుల సాయంతో ఆస్పత్రికి తరలించారు.జ్వరంతో బాధపడుతున్న 5వ తరగతి విద్యార్థిని సబితా నడవడానికి ఇబ్బంది పడుతుండడంతో తోటి విద్యార్థినులు రెండు వైపులా పట్టుకుని అతికష్టం మీద ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వర్కర్లు లేకపోవడంతో విద్యార్థులకు అనారోగ్యానికి గురైతే వార్డెన్లు, ఉపాధ్యాయులపైనే భారం పడుతోంది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులే అనారోగ్యానికి గురైన వారి బాగోగులు చూసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం స్పందించి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్లను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు,గిరిజన సంఘాల నేతలు కోరుతున్నారు. -
వ్యవసాయ వృద్ధి రేటు 17.5 శాతం పెంపునకు కృషి
సహాయ సంచాలకుడు తిరుమలరావు చింతపల్లి: రాబోయే మూడు సీజన్ల్లో వ్యవసాయ వృద్ధిరేటును 17.5 శాతానికి పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు వ్యవసాయ సహాయ సంచాలకుడు తిరుమలరావు తెలిపారు. స్థానిక వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద సోమవారం వ్యవసాయ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకే పొలంలో వివిధ పంటల సాగు, పంట మార్పిడి విధానంలో అధిక ఆదాయం ఇచ్చే పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది రబీలో సుమారు వంద ఎకరాల్లో అదనంగా వేరుశెనగ సాగు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో లు టి.మధు, గిరి, బీహెచ్ఈఎల్లు పాల్గొన్నారు. -
జిల్లా సైక్లింగ్ అంబాసిడర్గా అజయ్
సాక్షి, పాడేరు: చలి ఉత్సవాల్లో నిర్వహించిన 36 కిలోమీటర్ల సైక్లింగ్ పోటీల్లో ద్వితీయ స్థానం పొందిన గిరిజన విద్యార్థి పి.అజయ్ను జిల్లా సైక్లింగ్ అంబాసిడర్గా ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ తెలిపారు. గుమ్మకోట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న అజయ్,అతని తండ్రి లైభన్ను సోమవారం కలెక్టర్ అభినందించారు.మౌంటెన్ ట్రయల్ బైక్ కొనుగోలుకు కలెక్టర్ ఆర్థిక సాయం అందజేశారు.జిల్లాలోని కొత్త ట్రైల్ రూట్స్,ట్రాక్స్ను బయట ప్రపంచానికి తెలియజేయాలని,పర్యాటకాన్ని ప్రమోట్ చేయాలని అజయ్కు కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో అడ్వెంచర్ ఔత్సాహిక విద్యార్థి బాటం తేజేశ్వరరావు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ ఆర్ధిక సాయం అందజేత -
విశాఖలో ‘గుర్రం పాపిరెడ్డి’
బీచ్ రోడ్డు : డార్క్ కామెడీ, నవ్వులు, ట్విస్టులతో రాబోతున్న ‘గుర్రం పాపిరెడ్డి’ చిత్రబృందం నగరంలో సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా హీరో నరేష్ అగస్త్య, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, ఇతర నటీనటులు విశాఖకు వచ్చారు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నరేష్, హీరోయిన్ ఫరియా మాట్లాడుతూ ఒక శవాన్ని దొంగిలించడానికి శ్రీశైలం అడవిలోకి వెళ్లిన నలుగురు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో జరిగే గందరగోళం, అనూహ్య మలుపులు, హాస్యాన్ని మేళవించి సినిమాను రూపొందించినట్లు చెప్పారు. లెజెండరీ నటుడు బ్రహ్మానందం న్యాయమూర్తి పాత్రలో, అలాగే తమిళ నటుడు యోగిబాబు కీలక పాత్ర పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందన్నారు. ఈ చిత్రానికి మురళి మనోహర్ దర్శకత్వం వహించగా, వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ సంయుక్తంగా నిర్మించారన్నారు. -
సిగినాపల్లి క్వారీలో గుట్టుగా రంగురాళ్ల తవ్వకాలు?
గూడెంకొత్తవీధి: పెదవలస అటవీ రేంజ్ పరిధిలోని సిగనాపల్లి రంగురాళ్ల క్వారీలో ఆదివారం అర్ధరాత్రి గుట్టుగా రంగురాళ్ల తవ్వకాలు జరిగినట్టు తెలిసింది. ఈవిషయాన్ని క్వారీ పరిసర గ్రామాలకు చెందిన గిరిజనులే గుర్తించారు. క్వారీలో బేస్క్యాంపులో కాపలాగా ఉన్న అటవీ సిబ్బంది సహకారంతోనే ఈ అక్రమ తవ్వకాలు జరిగినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో రూ.కోటి వ్యాపారం జరిగినట్టు సమాచారం.కొందరు గ్రామస్తులు ఆదివారం రాత్రి క్వారీ ప్రదేశానికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ క్వారీలో తవ్వకాలు జరిగినట్టు ఆనవాళ్లు ఉండడంతో కాపలాగా ఉన్న అటవీ సిబ్బందిని గ్రామస్తులు నిలదీశారు. సిగినాపల్లి క్వారీలో విలువైనఅలెక్స్ రకానికి చెందిన రంగురాళ్లు లభిస్తున్నాయన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఈనేపథ్యంలోనే అప్పుడప్పుడు ఈక్వారీలో రంగురాళ్లకోసం అన్వేషణ సాగుతోంది. చింతపల్లి, నర్సీపట్నానికి చెందిన రంగురాళ్ల వ్యాపారులు కొందరు గిరిజనులకు కాసుల ఎర చూపించి తవ్వకాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలోనే ఇటీవల అదే క్వారీలో తవ్వకాలు జరిగాయి. దీంతో పోలీసులు, అటవీ సిబ్బంది అక్కడ క్వారీని తాత్కాలికంగా మూసివేశారు. క్వారీలో నిరంతరం కాపలా కాసేందుకు సిబ్బందిని ఉంచుతున్నారు. వీరు విడతలవారీగా క్వారీలో కాపలాగా ఉంటున్నారు. ఆదివారం రాత్రి క్వారీలో కాపలాగా కేవలం ఇద్దరు సిబ్బందే ఉన్నారు. ఈవిషయాన్ని గుర్తించిన వ్యాపారులు అటవీ సిబ్బందిని ప్రలోభపెట్టి కొందరు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన గిరిజనులతో క్వారీలో తవ్వకాలకు పాల్పడినట్టు అక్కడ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయంపై స్థానిక యువత అక్కడ అటవీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. రంగురాళ్ల క్వారీకి కాపలాగా ఉండి అటవీ సంపదను కాపాడాల్సిన సిబ్బందే వ్యాపారులతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈవిషయం గూడెంకొత్తవీధి పోలీసులకు చేరింది. దీంతో క్వారీలో కాపలాగా ఉంటున్న అటవీ సిబ్బందితోపాటు నిలదీసిన గిరిజనులను స్టేషన్కు పిలిపించి సమగ్రంగా విచారిస్తున్నట్టు ఎస్ఐ సురేష్ తెలిపారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. -
ప్రజాగ్రహం
పాడేరు: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అంచనాలకు మించి సూపర్ సక్సెస్ అయింది. సంతకాల ప్రతులను విజయవాడకు తరలించేందుకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో పాడేరులో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సినిమాహాల్ సెంటర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, పాత బస్టాండ్, మెయిన్ బజారు మీదుగా పట్టణ శివారు వీఆర్ ఫంక్షన్ హాల్ వరకు సుమారు రెండు కిలో మీటర్లు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో వైఎస్సార్సీపీ శ్రేణు లు, గిరిజనులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు సర్కార్ తీరును ఎండగట్టా రు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులతో జిల్లా కేంద్రం కిక్కిరిసిపోయింది. చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ చేపట్టిన ర్యాలీ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరాను పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారు. వాహనాన్ని ప్రారంభించిన నాయకులు సేకరించిన కోటి సంతకాల ప్రతులను విజయవాడకు తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఉద్యమాలు చేపడతాం జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు పెట్టి తమ నిర్ణయాన్ని ప్రకటించారన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోబోదని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామన్నారు. జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతమైందన్నారు. పేదల పక్షాన వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నిత్యం పేదల పక్షాన ఉంటూ వారి సంక్షేమం కోసమే పని చేస్తుందన్నారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమంతో పాటు ప్రజారోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజలంతా తగిన సమయంలో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకుపాల్పడుతున్న సర్కార్ అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య అధికమైందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులపై అక్రమ కేసులను బనాయిస్తూ భయపెడుతోందని చెప్పారు. వైఎస్సార్సీపీ నిత్యం ప్రజల పక్షానే ఉంటూ ఉద్యమాలు చేస్తుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలు చేసిన మేలు ఏమి లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే.. ప్రైవేటుపరం చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తిరిగి ప్రజలకు అప్పగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, పార్టీ శ్రేణులు స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రైవేటీకరణఅరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన సంతకాలను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి ఈనెల 18న రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్నట్టు చెప్పారు. ప్రజా తిరుగుబాటు తప్పదు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సొత్తయిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే హక్కు చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. ప్రైవేటీకరణపై ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే జీర్ణించుకోలేని చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేట్పరం చేయటానికి పూనుకోవడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పోటెత్తిన జనం వైద్య సేవలు కష్టతరమే వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందడం కష్టతరంగా ఉంటుంది. పీపీపీ విధానాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమాలకు మా మద్దతు ఉంటుంది. భవిషత్లో కూటమికి చెంపదెబ్బ తప్పదు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ తీరును వ్యతిరేకించాలి. –మాదల మోహన్రావు, జి.ముంచంగిపుట్టు పంచాయతీ, పాడేరు మండలం.పేదలకు తీరని ద్రోహం పేద ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోంది. పేద ప్రజల కోసం జగనన్న ప్రభుత్వ వైద్యకళాశాలలను ఏర్పాటు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు యత్నిస్తోంది. పేద,బడుగు, బలహీన వర్గాల ప్రజలకు వైద్య కళాశాలలను దూరం చేస్తే తగిన బుద్ధిచెబుతాం. – నీలపు సూరిబాబు, ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శి, కొయ్యూరు మండలం మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపుతో కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన సంతకాల ప్రతులతో పాడేరులో భారీ ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న వేలాదిమంది గిరిజనులు -
చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
ప్రభుత్వం నిర్వహించాల్సిన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని చంద్రబాబు ప్రభుత్వం విరమించుకోవాలి. ప్రజల సొమ్మును వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకునే ప్రయత్నం విరమించుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. వైఎస్సార్ సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల ప్రజల నుంచి స్పందన లభించింది. –కంకిపాటి గిరి ప్రసాద్, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు, జీకే వీధి మండలం -
స్కేటింగ్ మారథాన్ విజేతలు ఆనంద్, విశ్వనాథ
విశాఖ స్పోర్ట్స్ : ముడసర్లోవ గోల్ఫ్ క్లబ్ సమీపంలోని రోడ్డుపై జరిగిన జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ చివరిదైన 42 కిలోమీటర్ల మారథాన్ పరుగు పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. మాస్టర్స్, జూనియర్స్, సీనియర్స్ మెన్, ఉమెన్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. మెన్ మారథాన్లో స్కేటింగ్ ప్రపంచ చాంపియన్గా ఇప్పటికే పేరుగాంచిన ఆనందకుమార్ వేల్కుమార్ (తమిళనాడు) 1:14:00 గంటల్లో రేసు పూర్తి చేసి జాతీయ విజేతగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన జీవన్రాజ్ ద్వితీయ స్థానంలో, విష్ణు ప్రసాద్ (పుదుచ్చేరి) తృతీయ స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో తమన్నా సైనీ (జమ్మూ కాశ్మీర్) 1:40:09 గంటల్లో పూర్తిచేసి విజేతగా నిలవగా, వర్షిణి అపర్ణ (కర్ణాటక) ద్వితీయ స్థానంలో, అనుష్కా మెహతా (గుజరాత్) తృతీయ స్థానంలో నిలిచారు. 35+ మాస్టర్స్ విభాగంలో రాఘవేంద్ర విశ్వనాథ (కర్ణాటక) విజేతగా, అర్జున్ నిచానీ (మహారాష్ట్ర) ద్వితీయ స్థానంలో, శ్రావణ్ కుమార్ (తెలంగాణ) తృతీయ స్థానంలో నిలిచారు. పోటీల ముగింపు సందర్భంగా రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, కార్యదర్శి పి.థామస్, సమాఖ్య ప్రతినిధి భగీరథ్ సహా నిర్వాహక ప్రతినిధులు లక్ష్మణ్, రవి.. పోటీలను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముగిసిన జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ -
ముగిసిన ఉపాధ్యాయుల క్రీడా పోటీలు
రంపచోడవరం: రంపచోడవరం సమీపంలోని ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాలలో మూడు రోజుల పాటు జరిగిన ఉపాధ్యాయుల క్రీడా పోటీలు ముగిశాయి. క్రికెట్ పోటీలో చింతూరు మండలం విజేతగా నిలిచింది. రంపచోడవరం మండలం రన్నరప్గా నిలిచింది. మహిళ ఉపాధ్యాయుల త్రో బాల్ పోటీల్లో చింతూరు మండలం విజేతగా నిలవగా రన్నరప్గా దేవీపట్నం మండలం నిలిచింది. గెలుపొందిన జట్లకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. గెలుపొందిన జట్లు ఈ నెల 28, 29 తేదీల్లో జిల్లా స్థాయిలో పాడేరులో జరిగి పోటీల్లో పాల్గొంటారని ఏఎంవో కొమ్మ భాస్కరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఆర్ఎల్ శ్రీనివాసరావు, హెచ్ఎం బాలరాజు, రాంబాబు, ఎస్జీఎఫ్ఐ జిల్లా సెక్రటరీ కె భవానీ, కోఆర్డినేటర్ రవి, టెక్నికల్ అఫీషియల్స్ బి.సుదర్శన్, ధర్మరాజు, కృష్ణారావు, బాపన్నదొర, తదితరులు పాల్గొన్నారు. -
సండే..రన్డే
సాగరతీరంలో ఉత్సాహంగా నేవీ మారథాన్ తరలివచ్చిన వేలాది మంది ఔత్సాహికులు, క్రీడాకారులురన్లో పాల్గొన్న ఔత్సాహికులువిశాఖ స్పోర్ట్స్ : విశాఖ సాగర తీరం పరుగు వీరులతో కిక్కిరిసిపోయింది. భారత నావికాదళం ఆధ్వర్యంలో పదోసారి నిర్వహించిన వైజాగ్ నేవీ మారథాన్కు వయోబేధం లేకుండా ఔత్సాహికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లేలేత సూర్య కిరణాలు శరీరానికి వేడితో పాటు ఉత్తేజాన్నిస్తుండగా, దాదాపు పదిహేడు వేల మంది ఈ పరుగులో భాగస్వామ్యం అయ్యారు. ఈ మారథాన్లో కొందరు విదేశీ అథ్లెట్లు సైతం పాల్గొని పతకాలను సొంతం చేసుకున్నారు.నేవీ డే వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ఈ పరుగును ఫిట్నెస్, సముద్ర ఆహ్లాద వాతావరణంపై అవగాహనతో పాటు నేవీ డే స్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహించారు. విదేశీ అథ్లెట్లు పాల్గొన్న ఈ పోటీల్లో ముఖ్యంగా ఇథియోపియాకు చెందిన పరుగు వీరులు విజేతలుగా నిలిచారు. విశాఖలోని ఐకానిక్ ఆర్కే బీచ్ వెంబడి ఉన్న విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి నాలుగు ప్రధాన కేటగిరీల్లో పరుగు సాగింది. రన్లో పాల్గొన్నవారికి రిఫ్రెషింగ్, 12 హైడ్రేషన్ పాయింట్లతో పాటు వైద్యసౌకర్యాలు కల్పించారు. ఆరేకే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై విజేతలకు పతకాలతో పాటు నగదు ప్రోత్సాహాకాల్ని అందించారు. ఉదయం నుంచి యువతీయుకులు డ్యాన్స్లు చేస్తూ ఉర్రూతలూగించారు. 42 కిలోమీటర్ల రన్ను తూర్పు నౌకాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ప్రారంభించగా..21 కిలోమీటర్ల రన్ను నౌకాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా సతీమణి ప్రియభల్లా ప్రారంభించారు..నేవీ అధికారులు, వారి కుటుంబసభ్యులతో పాటు కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు. పరుగు సాగిందిలా... 42కిలోమీటర్ల ఎయిర్క్రాఫ్ట్ కారియర్ మారథాన్ ఉదయం 4.15 గంటలకే ప్రారంభమైంది. ఇది ఐఎన్ఎస్ కళింగ వద్ద యూ టర్న్ తీసుకుని తిరిగి ప్రారంభ వేదిక వద్దకు చేరుకోవడంతో ముగిసింది. 21 కిలోమీటర్ల సబ్మైరెన్ హాఫ్ మారథాన్ ఉదయం 4.30 గంటలకు మొదలై, గాయత్రి కళాశాల వద్ద యూటర్న్ తీసుకుంది. 10 కిలోమీటర్ల ఎయిర్క్రాఫ్ట్ రన్ ఉదయం 5.30 గంటలకు ప్రారంభమై, తెన్నేటి పార్క్ వద్ద యూటర్న్ తీసుకుంది. 5 కిలోమీటర్ల ఫ్రిగేట్ పరుగు (సరదా పరుగు) ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. చిన్నారులు సైతం హుషారుగా పాల్గొన్నారు. ఇది కురుసురా సబ్మైరెన్ మ్యూజియం మీదుగా వైఎస్సార్ విగ్రహం చెంత యూటర్న్ తీసుకుని ముగిసింది. -
ముగిసిన రోలర్ స్కేటింగ్ హాకీ సమరం
విశాఖ స్పోర్ట్స్: నగరంలో జరుగుతున్న జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో భాగంగా సీనియర్ పురుషుల ఇన్లైన్ హాకీ ఫైనల్లో చండీగఢ్ 6–2 గోల్స్ తేడాతో పంజాబ్పై విజయం సాధించింది. జూనియర్ బాలుర ఇన్లైన్ హాకీ ఫైనల్స్లో తమిళనాడు 6–5 గోల్స్ తేడాతో చండీగఢ్పై గెలుపొందింది. వీఎంఆర్డీఏ పార్కులో జరిగిన రోలర్ హాకీ సీనియర్ పురుషుల ఫైనల్లో హర్యానా జట్టు 4–2 గోల్స్తో హిమాచల్ప్రదేశ్పై విజయం సాధించింది. జూనియర్ బాలుర విభాగంలో చండీగఢ్ 2–0తో హర్యానాపై గెలిచి టైటిల్ను కై వసం చేసుకుంది. -
కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు డాబాగార్డెన్స్: సీఐటీయూ 28వ ఆలిండియా మహాసభలు ఈ నెల 31 నుంచి జనవరి 4 వరకు తొలిసారిగా విశాఖలో జరగనున్నాయి. ఈ సందర్భంగా జనవరి 4న ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నిర్వహించే మహా ప్రదర్శనకు కార్మిక కుటుంబాలను పెద్ద సంఖ్యలో తరలించాలని సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసభల విజయవంతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. జిల్లాలో ఇప్పటికే ‘శ్రామిక ఉత్సవాల’ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. సోమవారం వాడవాడలా జెండాలు ఎగురవేసి, ఫ్యాక్టరీల వద్ద, కార్మికుల కాలనీల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని ఆయన సూచించారు. స్టీల్ప్లాంట్తో సహా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ఉద్యమాలను, లేబర్ కోడ్స్ వల్ల కలిగే ప్రమాదాన్ని కార్మికులకు వివరించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు కె.లోకనాథం, ఎం.జగ్గునాయుడు, ఆర్కేఎస్వీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన సంఘాల నాయకులు కూడా హాజరై మహాసభల ఏర్పాట్ల గురించి వివరించారు. -
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణ పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం జరిపారు. 108 స్వర్ణ సంపెంగలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. వైభవంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. శాస్త్రోక్తంగా గరుడసేవ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడసేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వెండి గరుడవాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. గరుడవాహనం చుట్టూ భక్తులను ప్రదక్షిణ చేయించారు. అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనం కోసం ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో సింహాచలం తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో దర్శన క్యూలు, కేశఖండనశాల, ప్రసాద విక్రయశాల, అన్నప్రసాద భవనం అన్నీ కిటకిటలాడాయి. దేవస్థానానికి సుమారు రూ.32 లక్షల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. -
విజేతలు వీరే...
● 42 కిలోమీటర్ల మారథాన్ పురుషుల విభాగంలో కెబేడ గుమెస్సా 2.29గంటల 39 సెకన్లలో పరుగు పూర్తి చేసి విజేతగా నిలిచారు. ఆ తర్వాత పి. రామ్వెట్టి 2.29గంటల 47 సెకన్లలో, స్టీఫెన్ 2.37గంటల 20 సెకన్లలో పూర్తి చేసి రన్నరప్లుగా నిలిచారు. ● 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ (సబ్మైరెన్ హాఫ్ మారథాన్) మహిళల ఓపెన్ విభాగంలో సంగమిత్ర మెహతా 1.27 గంటల 41 సెకన్లలో పరుగు పూర్తి చేసి విజేతగా నిలిచారు. ఎం. ఉమ, జ్యోతిదుర్గ రన్నరప్ స్థానాలను దక్కించుకున్నారు. 35–50 ఏళ్ల వారి విభాగంలో హర్మీత్, 50+ విభాగంలో అమర్జీత్ విజేతలుగా నిలిచారు. ● 10 కిలోమీటర్ల పరుగు (ఎయిర్క్రాఫ్ట్ రన్) మహిళల విభాగంలో విశాఖకు చెందిన అథ్లెట్ ఎల్. మెర్సీగ్రేస్ 43.10 సెకన్లలో పరుగును పూర్తి చేసి విజేతగా నిలిచారు. ఆమె రూ.25,000 ప్రోత్సాహకాన్ని అందుకున్నారు. టి. వాణి, సౌమ్య రన్నరప్ స్థానాలను దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో ప్రశాంత్ 32 నిమిషాల 54 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలవగా, ఎం. హరీష్, సూర్యజిత్ రన్నరప్లుగా నిలిచారు. -
విశేష స్పందన
సాక్షి ‘స్పెల్ బీ’ సెమీ ఫైనల్స్కుసీతంపేట: ‘సాక్షి’మీడియా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘స్పెల్ బీ 2025–26’ సెమీఫైనల్ పోటీలకు విశేష స్పందన లభించింది. సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్లోని శ్రీవిశ్వ స్కూల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నాలుగు కేటగిరీల్లో ఈ పోటీలు జరిగాయి. రీజనల్ లెవెల్లో జరిగిన ఈ పోటీల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి పలు పాఠశాలలకు చెందిన 120 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు నాలుగు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. 40 నిమిషాల వ్యవధితో, 40 మార్కులకు ఈ పరీక్ష జరిగింది. ఇందులో గెలుపొందిన విజేతలు హైదరాబాద్లో జరగనున్న ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలకు ‘డ్యూక్స్ వేఫీ’ప్రధాన స్పాన్సర్గా, ‘ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్(రాజమండ్రి)’అసోసియేట్ స్పాన్సర్గా వ్యవహరించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా ‘సాక్షి’స్పెల్ బీ పోటీలు దోహదపడుతుండటంతో.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్వయంగా పిల్లలను పరీక్ష కేంద్రాలకు తీసుకువచ్చారు. దీంతో శ్రీవిశ్వ స్కూల్ ఆవరణ సందడిగా మారింది. ఈ పోటీలను ‘సాక్షి’ విశాఖ బ్రాంచి మేనేజర్ వి.వి.ఎస్.చంద్రరావు పర్యవేక్షించగా, శ్రీ విశ్వ విద్యాసంస్థల చైర్మన్ కె.ధర్మరాజు, డైరెక్టర్ పి.సూర్యనారాయణ పాల్గొన్నారు.క్రమం తప్పకుండా పోటీలు విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించేలా ‘సాక్షి’మీడియా ఏటా స్పెల్బీ, మ్యాథ్స్బీ పోటీలు నిర్వహిస్తోంది. ఈసారి సెమీఫైనల్ పోటీలకు మా పాఠశాల వేదిక కావడం సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటువంటి పోటీల వల్ల ఇంగ్లిష్, మ్యాథ్స్లో వారు మరింత పట్టు సాధించగలరు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటువంటి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. – ఎ.ఆర్.కె.శివాజీ, డైరెక్టర్, శ్రీవిశ్వ స్కూల్స్ భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి ‘సాక్షి’స్పెల్ బీ పోటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా ఒకసారి హాజరయ్యాను. స్పెల్ బీ వల్ల ఉచ్చారణ, భాషాజ్ఞానం పెరుగుతాయి. కొత్త పదాలు తెలుస్తాయి. ప్రతి విద్యార్థి ఇందులో పాల్గొనడం వల్ల, ముఖ్యంగా తెలుగు మాధ్యమం విద్యార్థులు తమ ఇంగ్లిష్ స్పెల్లింగ్ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు. – పి.జీవన్ కుషాల్, వేపగుంట ఇంగ్లిష్పై పట్టు సాధించవచ్చు ‘సాక్షి’పేపర్లో ప్రకటన చూసి, మా స్కూల్ టీచర్లు చెప్పడంతో పలాస నుంచి స్పెల్ బీ సెమీఫైనల్ పోటీలకు హాజరయ్యాను. ఇంగ్లిష్ పదాల ఉచ్చారణ, కొత్త పదాలు నేర్చుకున్నాను. ఇంగ్లిష్ వకాబులరీ, ఫోనిక్స్, సౌండ్స్పై అవగాహన పెంచుకుని భాషపై పట్టు సాధించడానికి ‘సాక్షి’నిర్వహించిన ఈ పోటీలు ఎంతగానో సహాయపడతాయి. – దాసరి తేజేశ్వరరావు, 8వ తరగతి, పలాస పదాల పోటీలో ప్రతిభ చాటిన విద్యార్థులు ఫైనల్స్కు వెళ్తానన్న నమ్మకం ఉంది నేను శ్రీకాకుళంలో 8వ తరగతి చదువుతున్నాను. ఇప్పటి వరకు నిర్వహించిన రౌండ్లలో గెలుపొంది, ఇప్పుడు సెమీ ఫైనల్ పోటీకి చేరుకోవడం ఆనందంగా ఉంది. ఇంగ్లిష్ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి స్పెల్ బీ ఎంతో ఉపయోగపడుతుంది. – రౌతు చైతన్య, 8వ తరగతి, శ్రీకాకుళం -
సంరంభానికి సిద్ధం
యుద్ధ నౌకల యుద్ధ నౌకల విన్యాసాలుసాక్షి, విశాఖపట్నం : మహాసముద్రాల మధ్య స్నేహపూర్వక బంధాల్ని బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయ సమన్వయం, సహకారంతో నావికాదళ పరాక్రమాన్ని చాటిచెప్పేందుకు విశాఖపట్నం నగరం సిద్ధమవుతోంది. తూర్పు నౌకాదళ కేంద్రంగా అభివృద్ధి చెందిన విశాఖ తీరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అతిపెద్ద యుద్ధ నౌకల సంరంభానికి ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు పది రోజుల పాటు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)తో పాటు మినీ ఐఎఫ్ఆర్గా పిలిచే మిలాన్–2026, ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం (ఐఓఎన్ఎస్)లను ఏకకాలంలో ఇక్కడ నిర్వహించనున్నారు. ఈ మహోత్సవం కోసం తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు ముగిశాయి. ఆరు నెలల క్రితం నుంచి ఐదుసార్లకు పైగా సమీక్షలు నిర్వహించగా.. తాజాగా శనివారం తుది ప్రణాళిక సమావేశం జరిగింది. ఈఎన్సీ హెడ్క్వార్టర్స్ ఆపరేషన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ మనోజ్ ఝా ఆధ్వర్యంలో జరిగిన ఈ తుది సమావేశానికి 60 దేశాలకు చెందిన నౌకాదళ ప్రతినిధులు ప్రత్యక్షంగా, వర్చువల్గా హాజరయ్యారు. స్నేహభావం, సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. 145 దేశాలకు ఆహ్వానం.. 2001లో భారత్లో తొలిసారి ముంబైలో ఐఎఫ్ఆర్ నిర్వహించిన సమయంలో 25 దేశాలు హాజరయ్యాయి. 2016లో విశాఖలో నిర్వహించినప్పుడు 51 దేశాలు హాజరయ్యాయి. 2025లో ఇండోనేషియాలోని బాలి సముద్ర తీరంలో ఐఎఫ్ఆర్లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో ఐఎఫ్ఆర్, మిలాన్–2026 కోసం ఇప్పటివరకూ 137 దేశాలకు ఆహ్వానం పంపించింది. ఇప్పటి వరకూ 61 దేశాలు నమోదు చేసుకున్నాయి. 61 దేశాలకు సంబంధించి 23 యుద్ధ నౌకలు రాబోతున్నా యి. మిగిలిన దేశాలు త్వరలోనే సమ్మతిని వెల్లడించే అవకాశం ఉంది. ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన సర్ఫేస్ యుద్దనౌకలు, జలాంతర్గాములతోపాటు నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, విశాఖ క్లాస్, శివాలిక్ క్లాస్, బ్రహ్మపుత్ర క్లాస్, నీలగిరి మొదలైన తరగతులకు చెందిన యుద్ధ నౌకలతో పాటు జలాంతర్గాములు, యుద్ధనౌకలకు అన్నివిధాల సహకారాన్ని అందించే ఫ్లీట్ టాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్, గ్రీన్టగ్స్ సత్తా చాటనున్నాయి. అలాగే కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన నౌకలు ఈ ఫ్లీట్ రివ్యూలో భాగస్వామ్యం కానున్నాయి. అత్యాధునిక సర్ఫేస్ యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఈ విన్యాసాల్లో భారత నావికాదళానికి చెందిన అత్యాధునిక సర్ఫేస్ యుద్ధనౌకలు, జలాంతర్గాములు, నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొననున్నాయి. ఇందులో ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, విశాఖ క్లాస్, శివాలిక్ క్లాస్, బ్రహ్మపుత్ర క్లాస్, నీలగిరి వంటి వివిధ తరగతులకు చెందిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో పాటు సహాయకారి నౌకలైన ఫ్లీట్ ట్యాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్ వంటివి తమ సత్తా చాటనున్నాయి. వీటితో పాటు కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి సముద్ర సంస్థలకు చెందిన నౌకలు కూడా ఈ సమీక్షలో భాగస్వామ్యం కానున్నాయి. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ సహకారంతో 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ను, 2024 ఫిబ్రవరిలో మరోసారి మిలాన్ విన్యాసాలను విశాఖ విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు ఐఎఫ్ఆర్కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనల కేంద్రంగా విశాఖ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుంది. ఎప్పుడు... ఎలా.. ఎవరెవరు.? ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్–2026, ఐఓఎన్ఎస్ కాంక్లేవ్ ఆఫ్ చీఫ్స్(సీవోసీ) కార్యక్రమాలు ఫిబ్రవరి 15 నుంచి 25 వరకూ విశాఖ వేదికగా వరుసగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్) ప్రారంభం కానుంది. డాక్టేరియన్, జాయింట్ ఆపరేషన్లపై ఐఎఫ్ఆర్లో మిత్రదేశాలతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 15 నుంచి వివిధ దేశాల నుంచి యుద్ధ నౌకలు, నౌకాదళ ప్రతినిధులు విశాఖకు రానున్నారు. 18న ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఫ్లీట్ని భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సమీక్షించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ విన్యాసాలు, సదస్సు కార్యక్రమాల్లో 19వ తేదీ కీలకమైనది. ఫిబ్రవరి 19న సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పరేడ్ని బీచ్రోడ్డులో నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. అదేవిధంగా మిలాన్–2026 కూడా 19న ప్రారంభం కానుంది. దీంతో పాటు రక్షణ దళం, నౌకాదళంలో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే అంశాలపై చర్చించేందుకు ఇండియన్ ఓషన్ నేషనల్కాంక్లేవ్(ఐఓఎన్ఎస్) సదస్సుని మహాసాగర్ పేరుతో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 25 సభ్యదేశాల చీఫ్లతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన అతిథులు రాబోతున్నారు. ఐఎఫ్ఆర్, మిలాన్లో 19 నుంచి 20 వరకూ హార్బర్ ఫేజ్ విన్యాసాలు జరుగుతాయి. 21 నుంచి 25 వరకూ సీ ఫేజ్ విన్యాసాలు నిర్వహిస్తారు. ముగిసిన నౌకాదళ సన్నాహక సమావేశాలు విశాఖలో ఐ.ఎఫ్.ఆర్, మిలాన్, ఐఓఎన్ఎస్ నిర్వహణ ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు విశాఖ తీరంలో యుద్ధ వాతావరణం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ముగిసిన మూడు దఫాల సమీక్షలు సమీక్షలకు హాజరైన 60 దేశాలకు చెందిన నౌకాదళ ప్రతినిధులు -
సీపీఆర్తో ప్రాణదానం
చింతూరు: గుండెపోటు వచ్చిన సమయంలో సీపీఆర్ చేయడం ద్వారా అత్యవసర సమయంలో రోగికి ప్రాణదానం లభించే అవకాశముంటుందని ఆరోగ్యభారతి రాష్ట్ర అధ్యక్షుడు, జీఎస్ఎల్ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఆరోగ్యభారతి ఆధ్వర్యంలో స్థానిక కేజీబీవీ విద్యార్థినులకు సీపీఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు అత్యవసర సమయాల్లో ప్రథమచికిత్స ఎంతో అవసరమని, ప్రతిఒక్కరూ ఆరోగ్య జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యభారతి కార్యదర్శి డాక్టర్ నారాయణ, స్థానిక సేవాభారతి వైద్యుడు గంగాధరప్రసాద్ పాల్గొన్నారు. -
18న సహస్ర ఘటాభిషేకం
డాబాగార్డెన్స్ (విశాఖ): సిరులతల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 18న నాలుగో గురువారం సందర్భంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 11.30 నుంచి 12 గంటల వరకు అమ్మవారికి మహానివేదన(రాజభోగం), 12 నుంచి 3 గంటల వరకు సర్వదర్శనం అనంతరం దర్శనాలు నిలిపివేయనున్నారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సహస్ర ఘటాభిషేకం నిర్వహించిన అనంతరం 7 నుంచి అమ్మవారి దర్శనాలకు అనుమతి కల్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 20 వేల మంది భక్తులకు మహాన్నదాన కార్యక్రమం టౌన్ కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయ మెయిన్రోడ్డులో నిర్వహించనున్నారు. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 16 సాయంత్రం 6.30 గంటల నుంచి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో దేవస్థానం, ఇతర దేవాలయాలకు చెందిన నాదస్వరం, డోలు విద్వాన్లచే నాదస్వర కచేరీ నిర్వహించనున్నారు. -
మురిసిన పర్యాటకం
సందర్శన ప్రాంతాలు కిటకిట భారీగా తరలివచ్చిన సందర్శకులు అటవీశాఖ, ఐటీడీఏలకు భారీగా ఆదాయం పాడేరు: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి మేఘాల కొండపై ఆదివారం పర్యాటకులు పోటెత్తడంతో అటవీశాఖకు భారీగా ఆదాయం సమకూరింది. రికార్డు స్థాయిలో 3,500 మంది సందర్శించగా రూ.2,24,550 ఆదాయం వచ్చింది.ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీగా పర్యాటకుల రాకతో శనివారం సాయంత్రం నుంచి పాడేరు, వంజంగి కొండ దిగువ ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. ఈ మార్గం వాహనాలతో కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేందరం ఆంధ్రా ఊటీ అరకులోయకు ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్కు తెల్లవారుజాము నాలుగు గంటలకు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ప్రకృతి అందాలను తిలకించారు. గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేస్తూ సందడి చేశారు. గిరిజనుల వస్త్రధారణలో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.పద్మాపురం ఉద్యానవనం, గిరిజన మ్యూజయం పర్యాటకులతో కిటకిటలాడాయి. ముంచంగిపుట్టు: ఆంద్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం డుడుమ జలపాతానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు.పెద్ద సంఖ్యలో కుటుంబాలతో విచ్చేశారు. డుడుమ జలపాతం, జోలాపుట్టు జలాశయం, మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం, దేసిమా మ్యూజియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. చింతపల్లి: మండలంలోని పర్యాటక కేంద్రాలు కళకళలాడాయి. లంబసింగి, చెరువులవేనం, తాజంగి ప్రాంతాలకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. మంచు అందాలను తిలకించారు. డుంబ్రిగుడ: మండలంలోని చాపరాయి జలవిహారి, అరకు పైనరీకి ఆదివారం భారీగా సందర్శకులు తరలివచ్చారు. జలవిహారి వద్ద స్నానాలు చేస్తూ సందడి చేశారు. చాపరాయిని గత శనివారం రూ.1,13,010, ఆదివారం రూ.1,73,040 చొప్పున మొత్తం రూ.1,73,040, ఈ శని, ఆదివారాల్లో రూ.2,74,320లు టికెట్ రూపంలో పాడేరు ఐటీడీఏకు ఆదాయం సమకూరింది. అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరకు పైనరీకి శని, ఆదివారాల్లో రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. హుకుంపేట: ఉత్తరాంధ్రలో ఎత్తయిన శిఖరంగా గుర్తింపు పొందిన పర్యాటక ప్రాంతం సీతమ్మతల్లి జెండాకొండ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. సూర్యోదయం అందాలను తిలకించారు. డుడుమ జలపాతం సందర్శనకు తరలివచ్చిన -
ఇస్కాన్లో మార్మోగిన హరి నామస్మరణ
● విశాఖలో శ్రీలీల విశాఖ నగరంలో ఆదివారం శ్రీలీల సందడి చేసింది. సింహాచలంలో అప్పన్న స్వామిని ద ర్శించుకుంది. అనంతరం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించింది. ఆమెను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.కొమ్మాది (విశాఖ): హరే కృష్ణ, హరేరామ నామస్మరణతో సాగర్నగర్ ఇస్కాన్ మందిరం ఆదివారం మార్మోగింది. వారాంతపు పూజల సందర్భంగా ఇస్కాన్ అధ్యక్షుడు సాంబదాస్ ప్రభూజీ, మాతాజీ నితా యి సేవిని భగ వద్గీత శ్లోకాలను ఆలపించి, ప్రవచనాలు ఇచ్చారు. రాధాకృష్ణులు, సుభద్ర, బలభద్ర జగన్నాథుడు, సీతారాములు, ఆంజనేయ, నరసింహస్వామి విగ్రహాలను వివిధ వర్ణాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. -
మాచ్ఖండ్ జిగేల్
అవాంతరాలను అధిగమించి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పాదన మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం అవాంతరాలను అధిగమించింది. పూర్తిస్థాయి ఉత్పాదనతో దూసుకుపోతూ వెలుగులు విరజిమ్ముతోంది. ఈ ప్రాజెక్ట్ అత్యంత పురాతనమైనది కావడంతో ఆరు యూనిట్లు పూర్తిస్థాయిలో పనిచేసిన సందర్భాలు తక్కువే. సాంకేతిక సమస్యలతో పనిచేయని రెండు, నాలుగు నంబర్ల జనరేటర్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి అధికారులు, సిబ్బంది వినియోగంలోకి తెచ్చారు. ఇప్పుడు నిరాటంకంగా ఆరింటి ద్వారా 120 మెగావాట్ల్ల ఉత్పాదన జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా డుడుమ, జోలాపుట్టు ప్రాజెక్ట్ల్లో పూర్తిస్థాయిలో నీటినిల్వలు ఉన్నాయి. ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన గాడిలో పడింది. కొంత కాలంగా తరచూ జనరేటర్లు మొరాయిస్తుండడంతో ప్రాజెక్టు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. దీనికితోడు జలాశయాల్లో నీటి సమస్యతో విద్యుత్ ఉత్పత్తికి నిత్యం ఆటంకం కలిగేది. ఈ ఏడాది ఆంధ్రా ఒడిశా సరిహద్దులో విస్తరంగా వర్షాలు పడటంతో జలాశయాల నీటి మట్టాలు ఎన్నడూ లేని విధంగా పూర్తిస్థాయితో కళకళలాడుతున్నాయి. ● మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ప్రాజెక్టు అధికారులు తీవ్రంగా శ్రమించి శతశాతం విద్యుత్ ఉత్పాదన కృషి చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఆరు జనరేటర్ల సాయంతో 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. గత కొన్నేళ్లుగా తరచూ జనరేటర్లు మరమ్మతులకు గురవుతూ వచ్చాయి. దీంతో ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది శ్రమిస్తూ ఉత్పాదనను మెరుగు పరుస్తూ వచ్చారు. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రాజెక్టులో శతశాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. జలాశయాలు కళకళ మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరు అందించే డుడుమ,జోలాపుట్టు జలాశయాల్లో నీటిమట్టాలు పూర్తిస్థాయిలో ఉన్నాయి. ● డుడుమ జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 2590 అడుగులు. శనివారం నాటికి 2581,60 అడుగులుగా నమోదు అయింది. ● జోలాపుట్టు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2750 అడుగులు. ప్రస్తుతం 2746.20 అడుగులుగా నమోదు అయింది. గత ఏడాది ఇదే రోజుకు 2745.75 అడుగులుగా నమోదు అయింది. గత ఏడాదితో పోలిస్తే ఒక అడుగు మేర నీటి నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ● మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో శతశాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. తరచూ మరమ్మతులతో ఉండిపోయే 2,4వ నంబర్ల జనరేటర్లను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రాజెక్టు, జెన్కో అధికారుల కృషి ఫలించింది. తొలుత 4వ నెంబరు జనరేటర్కు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తెచ్చారు. అనంతరం 2వ నంబరు జనరేటర్కు చెందిన ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో దీని మరమ్మత్తుల నిమిత్తం జెన్కో అధికారులు రూ. 40లక్షలు కేటాయించారు. వెంటనే రేయింబళ్లు శ్రమించి ఈ జనరేటర్ను వినియోగంలోకి తీసుకువచ్చారు. దీంతో ప్రస్తుతం 1,2,3,4,5,6 నంబర్ల జనరేటర్లతో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. కార్యరూపం దాల్చని ఆధునికీకరణ గత కొన్నేళ్లుఆ మాచ్ఖండ్ ప్రాజెక్టు ఆధునికీకరణకు ఇరు రాష్ట్రాలు ప్రకటనలు చేస్తూ వస్తున్నాయి. పనులు మాత్రం మొదలు కావడంలేదు. అత్యంత పురాతన జలవిద్యుత్ కేంద్రం కావడంతో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సందర్భాలు తక్కువగా ఉంటున్నాయి. ఆధునికీకరణకు పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేసి, పనులు పూర్తి చేస్తే విద్యుత్ ఉత్పత్తి 150 మొగావాట్ల వరకు పెరిగే ఆస్కారం ఉంది. ఆదిశగా ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులు చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పలువురు సూచిస్తున్నారు. డుడుమ, జోలాపుట్టులో పూర్తిస్థాయి నీటిమట్టాలు వినియోగంలోకి అన్ని జనరేటర్లు ఆరు యూనిట్లతో 120 మెగావాట్ల ఉత్పత్తి ఫలించిన సిబ్బంది, అధికారుల కృషిఅందరి కృషి అభినందనీయం డుడుమ,జోలాపుట్టు జలాశయాల్లో ప్రస్తుతం ఏడాదికి అవసరమైన నీటి నిల్వలు ఉండడం విద్యుత్ ఉత్పత్తికి నీటి సమస్య లేదు. రెండో నంబరు జనరేటర్కు రూ.40లక్షలతో మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకువచ్చాం. ప్రసుత్తం ప్రాజెక్టులో అన్ని జనరేటర్లు పని చేస్తున్నాయి.120 మొగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. శతశాతం విద్యుత్ ఉత్పాదనకు ప్రాజెక్టు ఉద్యోగులు, సిబ్బంది కృషి అభినందనీయం. – ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఎస్ఈ,మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం -
ఖైదీలకు భగవద్గీత పారాయణం
ఆరిలోవ (విశాఖ): విశాఖ కేంద్ర కారాగారంలో ఆదివారం ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ఖైదీల కోసం భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖైదీలకు ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీతలోని సారాంశాన్ని, ముఖ్య సందేశాన్ని వివరించారు. మానవ జీవితంలో సత్యం, ధర్మం పాటించడం ఎంత అవసరమో భగవద్గీత బోధనలు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో వారు ఖైదీలకు సూచించారు. కారాగారంలో ఉన్నవారు తమ జీవితంలో పరివర్తన చెందడానికి, మంచి మార్గంలో నడవడానికి గీత స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఖైదీలకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ ప్రతినిధులతో పాటు జైలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓజుబంద క్వారీతో అనారోగ్యం
గంగవరం/రంపచోడవరం: గంగవరం మండలం ఓజుబంద గ్రామానికి సమీపంలో ఉన్న నల్లరాయి క్వారీని మూసివేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో ఆందోళన నిర్వహించారు. ఓజుబంద క్వారీలో నిర్వహిస్తున్న బాంబ్ పేలుళ్లుతో నివాస గృహాలు, టీవీలు పగిలిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తంచేశారు. బ్లాస్టింగ్, క్రషర్ వల్ల వచ్చే దుమ్ముతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే మూడు క్వారీలు నిర్వహణలో ఉండగా మరొక కొత్త క్వారీ మొదలు పెడుతున్నారని దీనిపై గ్రామసభలో అందరూ వ్యతిరేకించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. మూడు క్వారీలు మూసివేయాలని, కొత్త క్వారీ నిర్వహణకు అనుమతులు ఇవ్వవద్దని వారు డిమాండ్ చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ ఏజెన్సీ చట్టాలకు వ్యతిరేకంగా నడుస్తున్న క్వారీలు ఎవరి ప్రయోజనాలు కోసమని ప్రశ్నించారు. గిరిజనులు ఇబ్బందులు పడుతున్న మైనింగ్ లీజులు ఎలా ఇస్తారని ఆరోపించారు.అక్రమ మైనింగ్ వ్యవహారాలపై ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గిరిజనులు ఐక్యంగా వీటిని ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుంజం లక్ష్మణరావు, చోడి ప్రదీప్కుమార్దొర, పీఠా ప్రసాద్, చోడి ఏడుకొండలరావు, కంగాల అబ్బాయిదొర, పోతురాజు, రాధాకృష్ణదొర తదితరులు పాల్గొన్నారు. -
అదుపు తప్పితే లోయలోకి..
సాక్షి,పాడేరు: ఘాట్ రోడ్లలో పూర్వం నిర్మించిన రక్షణ గోడలు శిథిలమవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే సుమారు 25 కిలోమీటర్ల పాడేరు ఘాట్రోడ్డులో ఎక్కడకక్కడ రక్షణ గోడలు ధ్వంసమయ్యాయి. పర్యాటకులు వివిధ ప్రాంతాలనుంచి పర్యాటకులు ఈ మార్గంలో మన్యం సందర్శనకు వస్తుంటారు. వాహనాలు ఏమాత్రం అదుపుతప్పినా లోయలోకి బోల్తా కొట్టే పరిస్థితి నెలకొన్నాయి. దీంతో భయభయంగా వాహనాలు నడపాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల శిథిలమైన రక్షణగోడలు వద్ద పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో వాహనచోదకులకు అంచనా తెలియడం లేదు. గత నెలలో కొన్ని ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ను ఆర్అండ్బీశాఖ చేపట్టినప్పటికీ వంట్లమామిడి దాటిన తరువాత యేసుప్రభువు విగ్రహం మలుపు నుంచి గరికిబంద వరకు పనులు జరగలేదు. సుమారు రెండు కిలోమీటర్ల పొడవున పలు చోట్ల రోడ్డుకు ఇరువైపులా తుప్పలు, డొంకలు పెరగడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ గోడల నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదిక పాడేరు ఘాట్లో ధ్వంసమైన రక్షణ గోడల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం. నిధులు మంజూరు అవ్వగానే ఘాట్ మార్గంలో రక్షణ గోడల నిర్మాణం చేపడతాం. – విజయ్కుమార్,ఆర్అండ్బీ ఈఈ, పాడేరు -
రక్తపు ధారలు
● దారుణంగా మారేడుమిల్లి– చింతూరు ఘాట్రోడ్డు ● అజాగ్రత్తగా నడిపితే అగాధంలోకి.. ● రక్షణ చర్యలు పట్టని ఆర్అండ్బీ అధికారులు ● ప్రభుత్వం నుంచి స్పందన కరువు ● నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్న భారీ వాహనాలుజిల్లాలో అధ్వానంగా మారిన ఘాట్రోడ్లు ప్రయాణికుల పాలిట యమపాశంగా మారాయి. ఆర్అండ్బీ అధికారుల నిర్వహణ లోపమే ఇందుకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మార్గాల్లో సరియైన రక్షణ చర్యలు లేనందున వాహనం అదుపుతప్పితే లోయలోకి పడిపోయే పరిస్థితి నెలకొంది. అయినా ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మారేడుమిల్లి–చింతూరు ఘాట్రోడ్డులో లోయలోకి బస్సు బోల్తా ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఘాట్ మార్గాల్లో ప్రయాణానికి భద్రత ఏమేర అనే ప్రశ్న తలెత్తుతోంది. మారేడుమిల్లి– చింతూరు ఘాట్లో రోడ్డు అధ్వానంగా మారిన ప్రాంతాలుమారేడుమిల్లి ఘాట్రోడ్డులో మొరాయించిన భారీ వాహనంఅడవి బాటలో.. రంపచోడవరం/చింతూరు/మోతుగూడెం: మారేడుమిల్లి– చింతూరు ఘాట్ మార్గంలో భారీ వాహనాలు వెళ్లేందుకు అనుమతి లేదు. అయినా ప్రయాణించడంతో కొన్ని సార్లు ఘాట్ రోడ్డు మధ్యలో మొరాయిస్తున్నాయి. దీంతో గంటలు తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రయాణికులు, వాహనదారులు, పిల్లలు తెల్లవార్లు ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. ● మారేడుమిల్లి–చింతూరు ఘాట్ రోడ్డు పాములేరు నుంచి ప్రారంభమై సోకులేరు వ్యూపాయింట్ వద్ద ముగుస్తుంది. ఘాట్ రోడ్డు 28 కిలోమీటర్లు మేర ఉంటుంది. ఈ మధ్యలో సుమారు 10 వరకు అత్యంత ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఆంధ్రా, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కలిపే మార్గం కావడంతో ఈ రోడ్డుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇటువంటి ఘాట్ రోడ్డులో ఆర్అండ్బీ అధికారులు నిర్వహణ పనులు, రక్షణ చర్యలు పటిష్టంగా చేపట్టిన సందర్భాలు లేవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● ఘాట్ రోడ్డులో శుక్రవారం చోటు చేసుకున్న ప్రమాదంలో బస్సును మలుపు తిప్పే క్రమంలో వెనుక భాగం జారి కిందికి పడిపోయింది. ఈ ఘటనతో బస్సు వెనుక భాగంలో కూర్చున్న తొమ్మిది మంది మృతి చెందారు. సుమారు 22 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మార్గంలో ప్రమాదకర మలుపులు, లోయలు ఉన్న చోట రక్షణ చర్యలు (ఐరన్ గడ్డర్లతో కంచె ) ఏర్పాటు చేసి ఉంటే ప్రమాద తీవ్రత చాలా వరకు తగ్గేదని పలువురు పేర్కొంటున్నారు. దుర్ఘటనలిలా. ● అరకు నుంచి గురువారం రాత్రి భద్రాచలం బయలుదేరిన యాత్రికుల బస్సు శుక్రవారం తెల్లవారుజామున లోయలోకి బోల్తా పడి ప్రమాదానికి గురైంది. ● 2019 అక్టోబరు 15న కర్ణాటకకు చెందిన యాత్రికులు భద్రాచలంలో బయలు దేరి అన్నవరం వెళ్తుండగా సీతారాములు బొమ్మ వద్ద పైరోడ్డు నుంచి దిగువ రోడ్డులో వాహనం పడిపోయింది. ఈ ఘటనలో వాహనం వెనుక భాగంలో కూర్చున ఏడుగురు మృతి చెందారు. అప్పటిలో కొన్నిచోట్ల మొక్కుబడిగా రక్షణ చర్యలు చేపట్టిన రోడ్లు భవనాల శాఖ ఆతరువాత గాలికొదిలేసింది. ప్రయాణం సాహసమే.. : మారేడుమిల్లి–చింతూరు ఘాట్ రోడ్డులో ప్రయాణం వాహనదారులకు సాహసంగా మారింది. ఏ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు అధ్వానంగా ఉండడంతో పాటు నిత్యం భారీ వాహనాలు నిలిచిపోతున్నాయి. పాములేరు నుంచి సోకులేరు వ్యూపాయింట్ వరకు 28 కిలోమీటర్లు ఉండగా ఇందులో పది కిలోమీటర్లు రోడ్డు మాత్రమే నిర్మించారు. మిగిలిన చోట్ల రోడ్లు గోతులమయంగా మారి అధ్వానంగా ఉంది. అవగాహన కల్పించాలి ఘాట్రోడ్లో డ్రైవింగ్పై వాహ నదారులకు అధికారులు అవగాహన కల్పించాలి. పల్లానికి సెకండ్ లేదా థర్డ్ గేరులో దిగాల్సి ఉండగా ఆయిల్ మిగు లుతుందనే కక్కుర్తితో న్యూట్రల్ గేరులో దిగుతున్నారు. – ఎం.శివరామకృష్ణ, మోతుగూడెం భారీ వాహనాలు నిషేధించాలి ఘాట్రోడ్లో భారీ వాహనాల రాకపోకల కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి. కంటైనర్లు, ఊక లారీలు తరచూ ఘాట్రోడ్లో నిలిచిపోయి గంటల తరబడి ట్రాఫిక్ జాం అవుతోంది. – వేగి రాజా, మోతుగూడెం రక్షణ గోడలు నిర్మించాలి ఘాట్రోడ్లో తరచూ ప్రమా దాలు జరుగుతున్నందున తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. మలుపుల వద్ద వాహనా లు ప్రమాదాల బారిన పడుతున్నందున పటిష్టమైన రక్షణ గోడలు నిర్మించాలి. – సవలం అమల, ఎంపీపీ, చింతూరు ప్రమాదకరంగా ఘాట్ రోడ్లపై ప్రయాణం.. అనుక్షణం భయంభయం -
జంతు గణన ప్రారంభం
● ఈనెల 15 నాటికి ఆన్లైన్లోపూర్తి సమాచారం ● చింతపల్లి డీఎఫ్వో వైవీ నర్సింగరావు సీలేరు: జిల్లాలోని అటవీ ప్రాంతంలో పులుల జాడ తెలుసుకునేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలో సర్వే ప్రారంభమైంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఆల్–ఇండియా టైగర్ ఎస్టిమేషన్ నిర్వహిస్తారు. దీనిలో భాగంగానే సాంకేతిక నిపుణుల బృందం ఈనెల ఒకటి నుంచి సర్వే చేపట్టింది. స్టేజ్ వన్ ప్రక్రియలో భాగంగా మూడు రోజులపాటు మాంసాహారం మరో మూడు రోజులపాటు శాకాహారం జంతువుల గణన చేపడుతున్నారు. ట్రయిల్ పాత్, ట్రాంజాక్ట్ పద్ధతుల్లో వన్యప్రాణుల గణన ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని చింతపల్లి, పాడేరు, అరకు, రంపచోడవరం అటవీ డివిజన్లలో జరుగుతోంది. అటవీ సంరక్షణ బాగుండటంతో ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్గఢ్, తూర్పు కనుమల సరిహద్దులో గతంలో కంటే ప్రస్తుతం పులుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అటవీశాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. సీలేరు రేంజి పరిధి అటవీప్రాంతంలో గతంలో రోడ్డు దాటుతుండగా కనిపించిన చిరుత సురక్షితంగానే ఉన్నట్టు సర్వేలో తేలిందని తెలిపాయి. ఈ సందర్భంగా చింతపల్లి వైవీ నర్సింగరావు మాట్లాడుతూ సర్వే అనంతరం ఈనెల 15కల్లా పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తామన్నారు. ప్రతి అటవీ డివిజన్లో ఏఏ జంతువులు ఉన్నాయి.. ఎక్కడ ఉన్నాయి.. ఆరోగ్యంగా ఉన్నాయా.. అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. -
పోర్టును గాలికొదిలేశారు..!
సాక్షి, విశాఖపట్నం : మేజర్ పోర్టులతో పోటీపడుతూ.. సరకు రవాణాలో దూకుడుగా వెళ్తున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)కి కేంద్ర ప్రభుత్వం బ్రేకులు వేసేసింది. ఒకేసారి ఉన్నతాధికారులను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్తవారిని నియమించకుండా.. పోర్టు కార్యకలాపాలను గాలికొదిలేసింది. ఇదే అదనుగా ఓ మహిళా అధికారి పోర్టులో పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్చార్జ్ చైర్మన్ కూడా పట్టించుకోకపోవడంతో ఆయా విభాగాధికారులు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ముందుకు కదలని ఫైళ్లు విశాఖ పోర్టు అనాథగా మారిపోయింది. అధికారులంతా బదిలీ అవ్వడంతో కార్యకలాపాలు, ఇతర వ్యవహారాలు అస్తవ్యస్తమైపోయాయి. పోర్టు చైర్మన్ డా.అంగముత్తుని ముంబై పోర్టు చైర్మన్గా బదిలీ చేయడంతో పాటు వీపీఏ ఇన్చార్జ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. అయినా.. చైర్మన్ మాత్రం ముంబైకే పరిమితమయ్యారు. నెలలో ఒకట్రెండు సార్లు మాత్రమే పోర్టుకు వస్తూ.. తూతూ మంత్రంగా సమీక్షలు నిర్వహించి వదిలేస్తున్నారు. దీంతో పాలన గాడితప్పింది. ఇక డిప్యూటీ చైర్మన్గా దుర్గేష్ కుమార్ దూబే పదవీ కాలం ఇంకో రెండు నెలలు ఉన్నా.. ఇటీవలే బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. పోర్టు చరిత్రకు భిన్నంగా డిప్యూటీ చైర్మన్ పదవీకాలం ఉన్నప్పటికీ బదిలీ చేసేశారు. రిలీవ్ అయ్యేందుకు ఈ నెల 19వ తేదీ వరకూ సమయం ఉన్నా బదిలీ విషయంలో జరిగిన అన్యాయంతో పోర్టు వ్యవహారాల్ని పట్టించుకోవడం మానేశారు. అదేవిధంగా ఏళ్ల తరబడి సెక్రటరీగా వ్యవహరించిన వేణుగోపాల్ని పారాదీప్ పోర్టుకు డిప్యూటీ చైర్మన్గా బదిలీ చేశారు. పరిపాలన వ్యవహారాల ఫైళ్లు ముందుకు కదిపే ఉన్నతాధికారులు లేకపోవడంతో పోర్టులో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిపోయింది. అంతా ఆమె కనుసన్నల్లోనే..! ట్రాఫిక్ విభాగంలో ఉన్నతాధికారి అనారోగ్యం కారణంగా అంతంత మాత్రంగానే విధుల నిర్వహణలో భాగస్వామ్యమవుతున్నారు. దీంతో ఈ విభాగంలో కార్యకలాపాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కేవలం షిప్స్ బెర్తింగ్, లోడింగ్, అన్లోడింగ్ వ్యవహారాలు కిందిస్థాయి సిబ్బంది ద్వారా మేనేజ్ చేస్తున్నారు. ఇలా పోర్టులో ప్రతి విభాగాన్ని నడిపించే నాయకత్వం లేకపోవడంతో వ్యవహారాలు సరిగా జరడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారులెవ్వరూ లేకపోవడంతో ఓ మహిళా అధికారి.. అంతా తానై పోర్టులో చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమైపె గతంలో సీబీఐ దాడులు జరిగాయి. తర్వాత విధుల్లో చేరిన సదరు మహిళా అధికారి ఇప్పుడు పోర్టులో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారంటూ విమర్శలొస్తున్నాయి. పోర్టులో అన్ని విభాగాల్లోనూ ఆమె తలదూర్చి.. ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ పోర్టు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీలైనంత త్వరగా విభాగాధిపతులను నియమించి పోర్టును తిరిగి గాడిలో పెట్టాలంటూ ఉద్యోగులు కోరుతున్నారు. -
మెగా లోక్ అదాలత్లో51 కేసులు పరిష్కారం
● రూ.2,28,669లు జరిమానా విధింపు అరకులోయ టౌన్: స్థానిక ప్రథమ శ్రేణి జ్యుడీ షియల్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో 51 కేసులను ఇన్చార్జీ జడ్జి రాము పరిష్కరించారు. వీటిలో ఎకై ్సజ్కు సంబంధించి 19 కేసుల్లో రూ.97,499 జరిమానా విధించారు. భార్యాభర్తల తగదా కేసులో భార్యకు మెయింటినెన్స్ కింద రూ.లక్ష, నిర్లక్ష్య డ్రైవింగ్కు సంబంధించి 6 కేసుల్లో రూ.17,450, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారికి సంబంధించి 13 కేసుల్లో రూ.6,500 జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో అరకు సీఐ ఎల్.హిమగిరి, అరకు, డుంబ్రిగుడ ఎస్ఐలు గోపాలరావు, పాపారావు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఏయూ తెలుగు విభాగం అరుదైన ఘనత
బీచ్రోడ్డు (విశాఖ): ఏయూ తెలుగు విభాగం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ–2025లో ఈ విభాగానికి చెందిన 52 మంది విద్యార్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వీరిని తెలుగు విభాగం శాఖాధిపతి ఆచార్య జెర్రా అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథి ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎ.నరసింహారావు మాట్లాడుతూ వందేళ్ల పండగ జరుపుకుంటున్న ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులంతా ధన్యజీవులన్నారు. ఉపాధ్యాయ కొలువులు పొందిన వారిని అభినందిచారు. ఆచార్య జెర్రా అప్పారావు మాట్లాడుతూ తన హయాంలో ఒకే డీఎస్సీలో 52 మంది విద్యార్థులు టీచర్ ఉద్యోగాలు సాధించడం మధుర ఘట్టంగా నిలిస్తుందన్నారు. ఏయూ పరిశోధక విద్యార్థి, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు సమన్వయకర్తగా వ్యవహరించిన గౌరవ ఆచార్యుడు పర్వతనేని సుబ్బారావు, బహు గ్రంథకర్త, లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత, గౌరవాచార్యుడు వెలమల సిమ్మన్న పాల్గొన్నారు. -
లోక్ అదాలత్తో సత్వర న్యాయం
విశాఖ లీగల్ : రాజీమార్గమే రాజమార్గమని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ మెగా లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కక్షిదారులకు సత్వర న్యాయం లోక్ అదాలత్ ద్వారా లభిస్తుందన్నారు. శాశ్వతమైన పరిష్కారం, ఫలాలను అందించే రాజీమార్గాన్ని కక్షిదారులు ఎంచుకోవాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా లోక్దాలత్కు విశేష స్పందన లభించిందన్నారు. మూడు జిల్లాల పరిధిలో 43 ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేశామని, న్యాయస్థానంలో రాజీకి అనుగుణంగా 25 వేల పైచిలుకు కేసులను గుర్తించామన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు, సిబ్బంది, అధికారులు, బ్యాంకులు, బీమా కంపెనీలు అందించిన సేవలకు న్యాయమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు మాట్లాడుతూ లోక్ అదాలత్తో తొలిసారిగా రెండు కేసుల్లో రూ.2 కోట్లు అందించినట్లు వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్, ద న్యూ ఇండియా ఎస్యురెన్స్ కంపెనీల ద్వారా రూ.1.9 కోట్లు బాధితులకు అందజేశారు. ఏడో అదనపు జిల్లా కోర్టులో రూ.40 లక్షలు, 12వ అదనపు జిల్లా కోర్టులో రూ.1.5 కోట్లు పరిహారంగా అందజేశారు. తొలిసారిగా భారీ మొత్తంలో పరిహారాన్ని వినియోగదారులకు అందించి న్యాయస్థానాలకు సహకరించిన బీమా కంపెనీలకు కార్యదర్శి సన్యాసినాయుడు అభినందించారు. కేసుల వివరాలు 160 మోటారు ప్రమాద కేసులను పరిష్కరించి నష్టపరిహారం కింద రూ.12,55,19,761 అందజేశారు. సివిల్ 430 కేసులు, క్రిమినల్ 13,722 కేసులు, సీ్త్ర లిటిగేషన్ 157 కేసులు రాజీ చేయడంలో ఉమ్మడి విశాఖ జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కోర్టులో ఉన్న సివిల్ మార్టిగేజ్ సూట్ కేసులో రూ.50 లక్షలు కేసు రాజీ కుదరింది. పీఎల్సీలో రూ.70 లక్షలు విచారణకు ముందే (కరూర్ వైశ్య బ్యాంకు) రాజీ ప్రయత్నాల ద్వారా సెటిల్మెంటు పూర్తయింది. అయిదు కేసులకు సంబంధించిన భార్యభర్తలు తిరిగి కలిసి జీవించడానికి అంగీకారం కుదిరింది. అంతిమ తీర్పు అనకాపల్లి టౌన్: లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పని, సులువుగా తగవులు పరిష్కరించుకోవాలని పదో అదనపు జిల్లా న్యాయమూర్తి వి నరేష్ అన్నారు. స్ధానిక కోర్టు సముదాయంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఏడు బెంచ్లు నిర్వహించారు. మొత్త్తం 2053 కేసులు పరిష్కారమయ్యాయి. న్యాయమూర్తులు పి.నాగేశ్వరావు, జి.రామకృష్ణ, జి.ధర్మారావు, ఎ.రమేష్, బి.వి.విజయలక్ష్మి, నికితా సెంగర్ తదితరులు పాల్గొన్నారు. -
పూర్వ విద్యార్థుల సహకారం..వర్సిటీకి వరం
తాళపత్రాల జ్ఞానాన్ని వినియోగంలోకి తేవాలి ● ‘వేవ్స్ 2025’లో రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి మద్దిలపాలెం: ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం వార్షిక సమ్మేళనం ‘వేవ్స్ 2025’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆమె ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం కార్యాలయాన్ని సందర్శించి, సంఘం వ్యవస్థాపక చైర్మన్ జి.ఎం.రావుతో కలిసి కమిటీ సభ్యులతో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ఏయూ అభివృద్ధికి పూర్వవిద్యార్థులు సహకరించాల్సిన విధానంపై ఆమె పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఏయూలో ఉన్న తాళపత్రాల జ్ఞానాన్ని నిపుణులతో అధ్యయనం చేయించి, వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. బలమైన పూర్వవిద్యార్థుల బంధాన్ని ఏర్పరచడం, బోధనను పటిష్టం చేయడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆమె ఏయూ పరిపాలనా భవనం నుంచి బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ రతన్ టాటా ఆవిష్కరించిన ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం పైలాన్ను సందర్శించారు. ప్రధాన వేదికపై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి, వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వీసీ రాజశేఖర్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ కుమార్రాజా, జనరల్ సెక్రటరీ ఆకుల చంద్రశేఖర్, ఇతర ఈసీ సభ్యులు, పూర్వ చైర్మన్ పాల్గొన్నారు. -
వణుకుతున్న అరకు
● రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు ● 3.3 డిగ్రీల నమోదుతో పెరిగిన చలి ● దట్టంగా మంచు చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. కొద్దిరోజులుగా అరకువ్యాలీ ప్రాంతంలో మరింత దిగజారుతున్నాయి. దీంతో చలి, మంచు తీవ్రతకు స్థానికులు తాళలేకపోతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలను ఆశ్రయిస్తున్నారు. శనివారం అరకువ్యాలీలో 3.3 డిగ్రీలు, డుంబ్రిగుడలో 4.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ ముంచంగిపుట్టులో 4.4 డిగ్రీలు, జి.మాడుగులలో 4.8, చింతపల్లిలో 5.5, పాడేరులో 6.2, హుకుంపేటలో 6.7, పెదబయలులో 7.6, కొయ్యూరులో 11 డిగ్రీలు నమోదు అయ్యాయి. రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 9.1, మారేడుమిల్లిలో 9.4, రాజవొమ్మంగిలో 11.7, అడ్డతీగలలో 12.9, రంపచోడవరంలో 14.4, గంగవరంలో 15.9 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. చింతూరు డివిజన్ చింతూరులో 12.4, ఎటపాకలో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఏడీఆర్ తెలిపారు. ముంచంగిపుట్టు: మండలంలో మంచు, చలితీవ్రత కొనసాగుతోంది. ఉదయం 8 గంటల తరువాత మాత్రమే బయటకు వస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఇళ్లకు పరిమితం అవుతున్నారు. మంట కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. రాజవొమ్మంగి: మండలంలో ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. శనివారం ఈ ప్రాంతంలో 11.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. చలితీవ్రతకు ప్రజలు వణికిపోతున్నారు. కర్రలు పేర్చి నెగళ్లు ఏర్పాటుచేసుకుని ఉపశమనం పొందుతున్నారు. రహదారులను మంచు తెరలు కమ్మేయడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతన్నారు. మరోపక్క ఈ ప్రాంతానికి వస్తున్న సందర్శకులు మంచు అందాలను మనసారా ఆస్వాదిస్తున్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పాడేరు రూరల్: స్థానిక ప్రభుత్వ పొలిటెక్నిక్ కళాశాల 1984– 2022 బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. వివిధ హోదాల్లో స్థిరపడిన వారంతా ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. క్షేమ సమాచారం తెలుసుకున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది.ఇక నుంచి ఏటా ఇదే మాదిరిగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి కళాశాలకు సహాయ సహకారాలు అందించాలని వారు నిర్ణయించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీహరిబాబు, అధ్యాపక సిబ్బందిని వారు ఘనంగా సత్కరించారు. -
జాతీయస్థాయి విలువిద్య పోటీల్లో ప్రతిభ
● బంగారు పతకాలు సాధన పాడేరు : హైదరాబాద్ కేంద్రంగా ఈనెల 10నుంచి జరుగుతున్న జాతీయ స్థాయి 32వ సీనియర్ జాతీయ స్థాయి విలువిద్య పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. సీనియర్స్ విభాగంలో సొలగం సాంబశివతో పాటు పాడేరు మోదమాంబ హైస్కూల్ విద్యార్థి సీహెచ్ మోహిత్సాయి, సోడే దేశయ్య టీమ్ విభాగంలో ప్రతిభ చూపి బంగారు పతకాలు సాధించారు. పోటీల్లో పాల్గొనేందుకు వీరికి కలెక్టర్ దినేష్కుమార్ ఆర్ధిక సహాయం చేశారు. జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించడంపై జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి జగన్మోహన్రావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టాబ్బాయ్, ఆర్చరీ అకాడమి ఫౌండర్, కోచ్ అడపా సుధాకర్ నాయుడు అభినంధనలు తెలిపారు. -
కనులపండువగా..కనకమహాలక్ష్మి రథయాత్ర
డాబాగార్డెన్స్ (విశాఖ): కనకమహాలక్ష్మి అమ్మవారి రథయాత్ర శనివారం వైభవంగా సాగింది. అమ్మవారి మాలధారణ చేసిన భక్తులు పూర్ణ కలశాలతో యాత్రలో పాల్గొన్నారు. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన యాత్రను సాయంత్రం 4 గంటలకు జగదాంబ జంక్షన్ మహారాణిపేటలో ఉన్న అమ్మవారి దత్తత దేవాలయం అంబికాబాగ్ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి ప్రారంభించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఆలయ ఈవో కె. శోభారాణి, పలువురు ప్రముఖులు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. జగదాంబ జంక్షన్, టర్నర్చౌల్ట్రీ, పూర్ణామార్కెట్, ఏవీఎన్ కాలేజీ డౌన్, టౌన్ కొత్తరోడ్డు, రీడింగ్రూమ్ మీదుగా అమ్మవారి దేవస్థానం వరకు యాత్ర సాగింది. రథయాత్రలో విజయనగరం మహారాజ కళాశాల కళాకారుల పులివేషాలు, చెక్కభజన, కోలాటం, తప్పిటగుళ్లు, నవదుర్గలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేదపండితులు, అర్చకులు, మాలధారణ చేసిన మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కనకమహాలక్ష్మికి విశేష పూజలు.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమ్మవారికి విశేషంగా పూజలు చేశారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు అమ్మవారికి క్షీరాభిషేకం, పసుపు కుంకుమ నీళ్లతో అభిషేకం జరిపారు. పలువురు ఉభయదాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సహస్ర తులసీదళార్చన పూజలో పలువురు ఉభయ దాతలు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 3 వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
బీమా సొమ్ము కోసం మామ హతం
కశింకోట: బీమా సొమ్ము కోసం సొంత మామనే హతమార్చాడు.. ఎల్ఐసీ ఏజెంటుతో కలిసి ఆరు నెలలుగా పథకం వేశాడు.. హత్య చేసి, రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టుగా మాయ చేయబోయాడు. పోలీసుల దర్యాప్తులో అనుమానాలు రేకెత్తడం, ఇది ప్రమాద మరణం కాదని పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించడంతో దొరికిపోయాడు. కశింకోట మండలం కొత్తపల్లి గ్రామం వద్ద జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీసు స్టేషన్లో సీఐ అల్లు స్వామినాయుడుతో కలిసి అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి శనివారం విలేకరులకు వివరించారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కుర్రు నారాయణమూర్తి (54) బయ్యవరంలోని సిమెంట్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నారు. విధులు నిర్వహించుకొని ఈనెల 8న రాత్రి తమ గ్రామానికి బైక్పై వెళుతుండగా అదే గ్రామానికి చెందిన సొంత అల్లుడు, మేనల్లుడు సుంకరి అన్నవరం, అతని కుమారుడు సుంకరి జ్యోతి ప్రసాద్, సహాయకునిగా పనిచేసే అగ్రహారపు తాతాజీ ఆపి పక్కన పొలంలోకి తీసుకెళ్లి నారాయణమూర్తితో మద్యం తాగించారు. మత్తులోకి వెళ్లాక ఇంటి పనిలో వినియోగించే గజం బద్దతో తలపై కొట్టి గాయపరిచారు. వారి దెబ్బలతో తీవ్రంగా గాయపడిన నారాయణమూర్తి ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని చెప్పి విశాఖ కేజీహెచ్కు తరలించారు. మార్గమధ్యంలో మృతి చెందినట్టు చెప్పారు. ఈ నెల 9న కేజీహెచ్ నుంచి పోలీసులకు ఎంఎల్సీ సమాచారం అందింది. బీమా పరిహారం కోసమే.... హత్యకు ప్రధాన ప్రేరకుడైన అల్లుడు అన్నవరం అప్పుల్లో కూరుకుపోయాడు. వీటి నుంచి బయటపడటానికి మామను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఆయన పేరిట ఉన్న రూ.కోటి 8 లక్షల విలువైన ఏడు రకాల పాలసీల ద్వారా వచ్చే పరిహార సొమ్మును కాజేయాలని ఆశించాడు. ఎల్ఐసీ ఏజెంటు నానాజీ సహాయంతో ఆరు నెలల క్రితం హత్యకు వ్యూహ రచన చేసి ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు. చివరికి సాక్ష్యాలతో సహా దొరికిపోవడంతో ప్రధాన నిందితుడు అన్నవరం, అతని కుమారుడు జ్యోతి ప్రసాద్, సహాయకుడు తాతాజీ, ప్రోత్సాహకుడు ఎల్ఐసీ ఏజెంటు నానాజీలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హత్య కేసును ఛేదించి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐతోపాటు ఎస్ఐలు, కానిస్టేబుళ్లను డీఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. రోడ్డు ప్రమాదమని ఫిర్యాదు గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోవడంతో నారాయణమూర్తి మృతి చెందినట్లు నమ్మించి అన్నవరం అత్త సూర్యలక్ష్మితో పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ అల్లు స్వామినాయుడు, ఎస్ఐ లక్ష్మణరావు, మనోజ్కుమార్లకు రోడ్డు ప్రమాదం జరిగిన దాఖలాలు కానరాలేదు. అతని బైక్ నిక్షేపంలా ఉంది. దీంతో పోలీసులు అనుమానించారు. విచారణకు వెళ్లినప్పుడు అల్లుడు అన్నవరం సహకరించకపోవడంతో.. అతని కుమారుడు జ్యోతి ప్రసాద్ను తీసుకు వచ్చి స్టేషన్లో విచారించగా అతను తడబడడంతో వారి సందేహాలు మరింత బలపడ్డాయి. ఇంతలో ఇది ప్రమాదం కాదని, కొట్టిన గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. అల్లుని సెల్ఫోన్ కాల్ డేటా పరిశీలించగా అచ్యుతాపురం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంటు భీముని నానాజీకి సుమారు వందసార్లు ఫోన్ చేసినట్టు వెల్లడైంది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అన్నవరం నేరం అంగీకరించాడు. -
క్రేన్ సాయంతో బస్సు తొలగింపు
● లోయలోంచి బయటకు తీసిన పోలీసులు చింతూరు: మారేడుమిల్లి, చింతూరు ఘాట్రోడ్లో శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన బస్సును పోలీసులు శనివారం క్రేన్సాయంతో బయటకు తీయించారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్డు పక్కన ఉంచారు. ఇలావుండగా ఈ ప్రమాదంలో మృతిచెందిన తెనాలికి చెందిన శైలారాణి(64) మృతదేహాన్ని శనివారం బంధువులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందగా శుక్రవారం ఎనిమిది మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించి స్వస్థలాలకు పంపడం తెలిసిందే. శైలారాణి మృతదేహానికి శనివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని ఆమె మేనల్లుడు తిరుపతికి చెందిన వినయ్కుమార్కు అప్పగించారు. కుటుంబ సభ్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని ఆమె మేనల్లుడు చింతూరులోనే ఖననం చేయించారు. తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాస్దొర ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
ప్రశాంతంగా నవోదయ రాత పరీక్ష
పాడేరు : జవహర్ నవోదయలో ప్రవేశాలకు శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కొమ్మాది, విశాఖపట్నం, ఎటపాక జవహర్ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశం కోసం జిల్లా వ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో పాడేరు డివిజన్లో ఆరు, రంపచోడవరంలో నాలుగు, చింతూరు డివిజన్లో మూడు పరీక్ష కేంద్రాల్లో 2589 మంది విద్యార్థులకు గాను 1517 మంది హాజరయ్యారు. పాడేరు పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాల, సీఏహెచ్ పాఠశాల పరీక్ష కేంద్రాలను జిల్లా ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తనిఖీ చేశారు. కొమ్మాది (విశాఖ): జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగినట్లు ప్రిన్సిపాల్ వైఎస్ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 37 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 8,276 మంది దరఖాస్తు చేసుకోగా 5,619 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 2,657 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. -
కోటి సంతకాల ర్యాలీని విజయవంతం చేయండి
సాక్షి,పాడేరు: రాష్ట్రంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రతులను తరలించే కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహించనున్న ర్యాలీని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన కోటిి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందన్నారు. అరకులో 53వేలు, పాడేరులో 50 వేలు,రంపచోడవరంలో 40వేల సంతకాలను సేకరించామన్నారు. జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణలో పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎంతో శ్రమించారన్నారు. పాడేరు, అరకులోయ పరిధిలోని సంతకాల ప్రతులను ఇక్కడి జిల్లా పార్టీ కార్యాలయంలో భద్రపరిచామని తెలిపారు. ,రంపచోడవరం పరిధిలోని ప్రతులు కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నాయన్నారు. పాడేరు, అరకులోయ నియోజకవర్గాల పరిధిలో సేకరించిన సంతకాల ప్రతులను ప్రత్యేక బాక్స్లలో భద్రపరిచి వాటితో ఈనెల 15వతేదీన జిల్లా కేంద్రంలో ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. సుమారు ఐదు వేల మంది పార్టీ నేతలు,కార్యకర్తలతో పాడేరు పురవీధుల్లో ర్యాలీ జరుగుతుందన్నారు. అనంతరం స్థానిక వీఆర్పంక్షన్ హాల్ వద్ద ప్రతుల బాక్సులను విజయవాడకు ప్రత్యేక వాహనంలో తరలింపు కార్యక్రమం చేపడతామన్నారు. అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి,అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, అనంత ఉదయ్భాస్కర్,మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి (ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు), నాగులపల్లి ధనలక్ష్మి, చెట్టి పాల్గుణ(సీఈసీ సభ్యుడు),అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్.అరకు,పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జి యేరువాక సత్యారావు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు అనుబంధ విభాగాల ప్రతిధులు, పార్టీ శ్రేణులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపు -
ఘాట్ ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం
రంపచోడవరం: మారేడుమిల్లి– చింతూరు మధ్య ఉన్న ఘాట్ రోడ్డు ప్రయాణమంటే గుండె దడదడలాడుతుంది. ఎత్తయిన పర్వతాలపై అనేక మలుపులతో ఉన్న ఘాట్ రోడ్డుపై అనుభవం ఉన్న డ్రైవర్లులు సైతం వాహనాన్ని నడపడానికి తడబడతారు. శీతాకాలం పగటి ఉష్టోగ్రత సైతం అత్యల్పంగా ఉండే ఇక్కడ అటవీ ప్రాంతంలో రాత్రివేళ మంచు దట్టంగా కమ్ముకుంటుంది. పగటి వేళ సైతం ఎదురుగా వస్తున్న వాహనాలు వంద మీటర్లు దూరంలో ఉన్నప్పటికి కంటి చూపుకు కనిపించని పరిస్దితి ఉంటుంది. ● దట్టమైన పొగమంచు కురిసే రాత్రి వేళ ఇక్కడ ఘాట్ పై ప్రయాణం అంటే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే. కనీసం ఎదురెదురుగా వచ్చే వాహనాలు తప్పుకుని వెళ్లే పరిస్దితి కూడా ఇక్కడ రహదారిపై లేదు. అత్యంత ఇరుకుగా ఉండే ఈ రహదారి పక్కనే ప్రమాదకరమైన లోయలు ఉన్నాయి. ఈ రహదారిపై రక్షణ గోడలు లేవు, అలాగే కనీసం మలుపులను సూచించే బోర్డులు లేకపోవడం ప్రమాదాలకు తావిస్తోంది. రోడ్లు భవనాల శాఖ ఈ రహదారి వైపు కన్నెత్తి చూడకపోవడం ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. తూతూమంత్రంగా చర్యలు ఇక్కడ సురక్షిత ప్రయాణానికి అనేక రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ తూతూ మంత్రంగా రెండు రోజులు హడావుడి చేసి ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారు. దీంతో మారేడుమిల్లి –చింతూరు ఘాట్ రోడ్డు ప్రయాణికుల పాలిట మృత్యు రహదారిగా మారింది. ● మారేడుమిల్లి ప్రాంతం సముద్రమట్టానికి 300 అడుగులు ఎత్తులో ఉండడంతో సాధారణ రోజుల్లో కూడా వాతావరణం చల్లగా ఉంటుంది. శుక్రవారం ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో బస్సు డ్రైవర్కు పొగమంచులో రోడ్డు పక్కన సరిగా అంచనా వేయకపోవడం కూడా ప్రమాదానికి ఒక కారణంగా చెబుతున్నారు. సింగిల్ రోడ్డుతో ఇబ్బందులే....: మారేడుమిల్లి–చింతూరు ఘాట్ 28 కిలోమీటర్లు ఉంటుంది. ఘాట్ రోడ్డులో కొంత భాగం ఎదురుగా వచ్చే వాహనం తప్పుకునే అవకాశం లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు చేస్తే కొంత వరకు ఇబ్బందులు తప్పుతాయని పలువురు సూచిస్తున్నారు. ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ఈ ఘాట్ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేకపోయిందని వారు ఆరోపిస్తున్నారు. -
దేవుడి దయతో బయటపడ్డాం
చిత్తూరులోని బంధువులు తీర్థయాత్రలకు వెళుతు న్నాం మీరు కూడా రమ్మ ని చెబితే బెంగళూరు నుంచి 12 మంది వచ్చాం. బస్సు ప్రమాదంలో మా బృందంలోని కృష్ణకుమారిని కోల్పోయాం. దేవుడి దయతో మిగతావాళ్లం సురక్షితంగా బయటపడ్డాం. – పాపరి జవహరి, బెంగళూరు ముగ్గురిని కోల్పోయా బస్సు ప్రమాదంలో నా కూతురు సునంద, అల్లు డు శివశంకర్రెడ్డి, భర్త మేనకోడలు శ్రీకళను కోల్పోయా. నా చేతికి కూడా తీవ్రగాయమైంది. టీచర్గా చేసిన నేను రిటైర్డ్ అయ్యాను. తీర్థయాత్రల కోసం వచ్చి కుటుంబంలో ముగ్గురిని కోల్పోవాల్సి వచ్చింది. – వరిగపల్లి కుమారి, చిత్తూరు సీట్ల మధ్య ఇరుక్కుపోయా వీధిలోని స్నేహితుల కోరిక మేరకు ఆంధ్రా ప్రాంతం చూసేందుకు వచ్చి బస్సు ప్రమాదానికి గురయ్యాం. ప్రమాద సమయంలో బస్సులో సీట్ల మధ్య ఇరుక్కుపోయాం. చీకటిలో ఏమీ కానరాక అయోమయానికి గురయ్యాం. వెలుగు వచ్చాక ఎవరో మమ్మల్ని బయటకు తీశారు. – షేక్ అష్రఫ్, చిత్తూరు ఇలా జరుగుతుందనిఅనుకోలేదు గత 25 ఏళ్లుగా వజ్రమణి టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో తీర్థయాత్రలకు ఆర్గనైజర్గా పనిచేస్తున్నా. గతంతో ఎన్నడూ ఇలా జరగలేదు. బస్సు కూడా కండీషన్లోనే ఉంది. అందరూ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. – వజ్రమణి, టూర్ ఆర్గనైజర్, చిత్తూరు -
చలి గుప్పిట్లో ముంచంగిపుట్టు
● 3.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు ● డుంబ్రిగుడలో తగ్గుముఖం ● వణికిస్తున్న శీతల గాలులు ● ఇబ్బందులు పడుతున్న మన్యం వాసులు చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడు రోజులుగా మరింత దిగజారుతున్నాయి.దీంతో చలి,మంచు తీవ్రతకు స్థానికులు తాళలేకపోతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలను ఆశ్రయిస్తున్నారు. శుక్రవారం ముంచంగిపుట్టులో 3.1 డిగ్రీలు, డుంబ్రిగుడలో 3.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధి పెదబయలులో 4.4 డిగ్రీలు, హుకుంపేటలో 5.1 డిగ్రీలు, చింతపల్లిలో 5.2 డిగ్రీలు, పాడేరులో 5.4 డిగ్రీలు, జి.మాడుగులలో 6.5 డిగ్రీలు, కొయ్యూరులో 10.1 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 7.8 డిగ్రీలు, మారేడుమిల్లిలో 8.8 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 11.1 డిగ్రీలు, అడ్డతీగలలో 12.3 డిగ్రీలు నమోదు అయ్యాయి. ● రంపచోడవరంలో 13.8 డిగ్రీలు, చింతూరు డివిజన్ చింతూరులో 12.0 డిగ్రీలు, ఎటపాకలో 12.2 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం అయ్యేసరికి శీతల గాలులు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. వాహన చోదకులు ఇబ్బందులు పడుతూ ఫ్లడ్ లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తున్నారు. -
రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
● మాజీ ఎమ్మెల్యే నాగుపల్లి ధనలక్ష్మి డిమాండ్ ● బాధిత కుటుంబాలు, క్షతగాత్రులకు పరామర్శ చింతూరు: బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించాలని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ నియోజవర్గ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఘాట్రోడ్లో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను శుక్రవారం ఆమె చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ క్షతగాత్రులకు వా రు కోరుకున్న చోట మెరుగైన వైద్యం అందించాలని,ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె తెలిపారు. జెడ్పీటీసీ చిచ్చడి మురళి, ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీ మేడేపల్లి సుధాకర్, మండల కన్వీనర్ రామలింగారెడ్డి కో ఆప్షన్ సభ్యుడు జిక్రియా, సర్పంచ్లు కారం కన్నారావు, సవలం సత్తిబాబు, మోహన్, రాజు పాల్గొన్నారు. -
సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం
● మూడో నంబర్ యూనిట్లో నిలిచిన ఉత్పాదన సీలేరు: ఏపీజెన్కో స్థానిక జలవిద్యుత్ కేంద్రంలోని మూడో యూనిట్లో గురువారం సాయంత్రం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ యూనిట్లో ఉత్పాదనను అధికారులు నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న జెన్కో డీఈ రాజేంద్రప్రసాద్ మూడో యూనిట్ను పరిశీలించారు. తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ఇంజినీర్లు, సిబ్బంది ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. యూనిట్కు చెందిన గవర్నర్లో మెకానికల్ సమస్యను గుర్తించిన అధికారులు మరమ్మతులు చేపట్టేందుకు ఆర్థో ఇంజినీరింగ్ కంపెనీని సంప్రదించారు. వారు వచ్చిన వెంటనే మరమ్మతులు చేపడతారని జెన్కో ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు. -
అరణ్యంలో ఆర్తనాదాలు
● అయ్యో రామచంద్రా..దైవ దర్శనం కోసం భద్రాద్రికి బయలుదేరిన ఆ యాత్రికులకు ఘాట్రోడ్డులో పొంచి ఉన్న మృత్యువు రూపంలో విధి ఎదురొచ్చింది. మరో రెండు గంటల్లో రాముడి సన్నిధికి చేరుకోవాల్సిన తరుణంలో..శుక్రవారం తెల్లవారుజామున చింతూరు–మారేడుమిల్లి ఘాట్రోడ్డులోని రాజుగారిమెట్ట వద్ద వారి ప్రయాణం విషాదంగా ముగిసింది. కారు చీకట్లు, దట్టమైన మంచు తెరలు, ప్రమాదకరమైన మలుపులతో నిండిన ఆ మార్గంలో యాత్రీకుల బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లోయలో పడిపోయి గాయపడిన ప్రయాణికులు దారి తెలియక, బస్సులో చిక్కుకున్న వారు బయటకు రాలేక నరకయాతన పడ్డారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు చూసి అడవితల్లి సైతం కన్నీరుగార్చింది. దైవ దర్శనం కోసం బయలుదేరిన కుటుంబాలకు ఈ ఘోరం తీరని శోకాన్ని మిగిల్చింది. ఘాట్రోడ్డులో ఎగువ ప్రాంతం నుంచి దిగువరోడ్డులోకి బోల్తాకొట్టిన ట్రావెల్ బస్సులోని మృతదేహాలను అంబులెన్సులోకి ఎక్కిస్తున్న 108 సిబ్బందిచింతూరు/మోతుగూడెం: మారేడుమిల్లి, చింతూరు ఘాట్రోడ్లో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదం హృదయ విదారకంగా మారింది. గాఢనిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఘటనతో బస్సులో ఉన్న వారంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. బస్సు నుంచి బయట పడేందుకు వారు తీవ్ర ప్రయత్నాలు చేసినా చీకటి కారణంగా ఏ వైపున ద్వారాలు ఉన్నాయో తెలియక, బయటకు రాలేక నానా నరకయాతన పడినట్లు క్షతగాత్రులు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ● సంఘటన స్థలంలో మృత్యువాత పడిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. క్షతగాత్రులు గాయాలతో ఆస్పత్రిలో విలవిల్లాడారు. తీవ్రచలి కారణంగా గాయాలైన వారు నొప్పులకు తాళలేక బోరున విలపించారు. ● అరకు నుంచి భద్రాచలం బయలుదేరిన యాత్రీకుల బస్సు మరో రెండు గంటల్లో గమ్యానికి చేరుకునేలోపు ప్రమాదానికి గురైంది. ఘటనా స్థలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో చింతూరు మండలం తులసిపాక, 35 కిలోమీటర్ల దూరంలో చింతూరు ఉంది. ఘటనా స్థలంనుంచి వంద కిలోమీటర్ల దూరంలో భద్రాచలం ఉంది. మరో రెండు గంటలు సజావుగా ప్రయాణం సాగిఉంటే ఉదయం ఆరు గంటలకు వారు భద్రాచలం చేరుకుని సీతారాములను దర్శించుకునే వారు. మృతదేహాలు తీసేందుకు ఇబ్బందులు బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు, 108 సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బస్సు యూ పిన్ టర్నింగ్ వద్ద పైరహదారి, కింద రహదారి నడుమ కొండపై వెల్లకిలా ఇరుక్కుపోయింది. దీంతో మృతదేహాలు సీట్ల నడుమ ఇరుక్కు పోవడంతో వాటిని చాలాసేపు శ్రమించి బయటకు తీశారు. బస్సు మట్టిదిబ్బను ఢీకొని ఎగిరి పడడంతో బస్సులోని యాత్రీకుల సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచార వ్యవస్థలేక ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎలాంటి నెట్వర్క్ లేకపోవడంతో తమకు జరిగిన ప్రమాద వివరాలను కుటుంబ సభ్యులకు తెలిపేందుకు యాత్రీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరి ఫోన్లు బస్సులోనే ఉండిపోవడం, మరికొందరి ఫోన్లు కింద పడిపోయాయి. దీంతో ఎవరి వద్దనైనా ఫోను ఉంటే ఇవ్వండి, నా భర్త చనిపోయారు, నా కూతురు, అల్లుడు చనిపోయిన సమాచారం కుటుంబ సభ్యులకు తెలపాలంటూ సాయం కోసం వచ్చిన వారిని అభ్యర్థించడం అందరినీ కలచివేసింది. ఈ ప్రాంతంలో సిగ్నల్స్ రావని చింతూరు వెళ్లాక సమాచారం తెలపవచ్చంటూ పోలీసులు వారిని సముదాయించారు. అధికారులు అప్రమత్తం: సంఘటన విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసేలా ఆదేశించారు. ముందుగా చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్, ఓఎస్డీ పంకజ్కుమార్ మీనా, ఏఎస్పీ బొడ్డు హేమంత్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాస్దొర మృతులు, క్షతగాత్రుల వివరాలు సేకరించారు. సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐలు రమేష్, సాధిక్, సంతోష్ మృతదేహాలతో పాటు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ పుల్లయ్య, సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డితో పాట వైద్యులు హుటాహుటిన క్షతగాత్రులకు వైద్యసేవలు అందించారు. ఆసుపత్రి సిబ్బంది క్షతగాత్రులకు పాలు, భోజనాలు సమకూర్చారు. అరకు నుంచి బయలుదేరి.. : సింహాచలంలో దర్శనం ముగించుకుని మధ్యాహ్నానికి అరకు చేరుకున్న యాత్రికులు అక్కడ అరకు అందాలను ఆస్వాదించారు. సాయంత్రం ఐదు గంటలకు అరకులో బయలుదేరిన బస్సును ప్రసాద్ డ్రైవింగ్ చేస్తున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో నర్శీపట్నం దాటాక టిఫిన్ చేసేందుకు బస్సు నిలిపారు. టిఫిన్ వండుకుని అందరూ తిన్న అనంతరం తిరిగి పది గంటల ప్రాంతంలో బయలుదేరారు. హైవే మీదుగా ఒంటిగంట సమయంలో జగ్గంపేట చేరుకున్న అనంతరం డ్రైవర్ ప్రసాద్ తాను రెస్ట్ తీసుకుంటానని చెప్పి మరో డ్రైవర్ మధుకు డ్రైవింగ్ బాధ్యతలు అప్పగించాడు. మధు జగ్గంపేట నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్న క్రమంలో నాలుగు గంటల సమయంలో ఘాట్రోడ్లో బస్సు ప్రమాదానికి గురైంది. ● పొగమంచు, అతివేగమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు చెబుతున్నారు. పొగమంచు వల్ల రోడ్డు కనిపించకపోయినా వేగంగా మలుపు తిప్పిన సమయంలో తులసిపాక వద్ద.. మరో మలుపును డ్రైవర్ గుర్తించలేకపోయాడని వారు తెలిపారు. ప్రయాణికులు నిద్ర నుంచి తేరుకునేలోపే బస్సు లోయలో పడిపోయింది. ● చింతూరు–మారేడుమిల్లి ఘాట్రోడ్డులో తదుపరి ఆదేశాల వరకు ప్రతిరోజు రాత్రి10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్టు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ తెలిపారు. ఘాట్ రోడ్లలో భారీ వాహనాలపై నిషేధం రాత్రి ప్రయాణంపై ఆంక్షలు ఎస్పీ అమిత్ బర్దర్ సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురుస్తుండడం, ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ఘాట్ రోడ్లలో భారీ వాహనాల రాత్రి ప్రయాణాలను నిషేధిస్తున్నామని ఎస్పీ అమిత్బర్దర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజాము 5గంటల వరకు అన్ని రకాల భారీ వాహనాలను అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పొగమంచు తీవ్రత తగ్గే వరకు ఘాట్ రోడ్లలో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం అమలులో ఉంటుందన్నారు. పోలీసుశాఖ హెచ్చరికలను ఉల్లంఘిస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత అధికంగా ఉండడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితులపై వాహన చోదకులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్న వాహనాల చోదకులు కూడా తమ వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. మరిన్ని వివరాలకు ప్రయాణికులు,వాహన చోదకులంతా సమీప పోలీసుస్టేషన్లను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. మారేడుమిల్లి ఘాట్రోడ్డులో ఘోర ప్రమాదం తులసిపాక వద్ద అదుపుతప్పి ట్రావెల్ బస్సు లోయలోకి బోల్తా తొమ్మిదిమంది మృతి,22 మందికి తీవ్ర గాయాలు మరో రెండు గంటల్లో భద్రాచలంచేరుకుంటామనగా ఘటన పొగమంచు వల్ల కనిపించని రోడ్డు మలుపులో బస్సు వేగాన్నిఅదుపుచేయలేకపోయిన డ్రైవర్ -
కదం తొక్కిన అంగన్వాడీ కార్యకర్తలు
● పాడేరులో భారీ ర్యాలీ.. కలెక్టరేట్ ఎదుట ధర్నా ● వేతనాలు పెంచాలని డిమాండ్ సాక్షి, పాడేరు: కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా వేతనాలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం జిల్లా కేంద్రం పాడేరులో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి సినిమాహాల్ సెంటర్, ఐటీడీఏ, తలారిసింగి జంక్షన్ల మీదుగా కలెక్టరేట్ వరకు అంగన్వాడీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేరేట్ వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. వేతనాలు పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కలెక్టరేట్ హోరెత్తింది. అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.నాగమ్మ, కె.భాగ్యలక్ష్మి, సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. గతంలో 42 రోజులు అంగన్వాడీ కార్యకర్తల సమ్మె సమయంలో అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, దీని ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు వేతనాలు వెంటనే పెంచాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం కలెక్టరేట్లోని అధికారులకు వారంతా వినతిపత్రం అందజేశారు. -
సోలార్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి
సాక్షి, విశాఖపట్నం : ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ కార్యక్రమం ప్రారంభానికి, వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు చేపట్టబోయే శంకుస్థాపన కార్యక్రమాలకు ఈ నెలాఖరులోగా ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాలు సిద్ధం కావాలని చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. సాగర్నగర్లోని సీఓఈఈటీ భవనంలో పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకం, ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీ రూఫ్ టాప్ సోలార్, పీఎం ఈ డ్రైవ్ పథకాలతో పాటు ఎంఎన్ఆర్ఈ, ఆర్డీఎస్ఎస్ ప్రాజెక్టులపై ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, నెడ్ క్యాప్ ఎండీ ఎం.కమలాకరబాబు, కలెక్టర్లు, ఈపీడీసీఎల్ అధికారులతో కలిసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈపీడీసీఎల్ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని సీఎండీ పృథ్వీతేజ్ వివరించారు. నెలకు 10 మెగావాట్ల చొప్పున జరుగుతున్న ఇన్స్టాలేషన్లను రోజుకు ఒక మెగావాట్ సామర్థ్యానికి పెంచేలా పీఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. చీఫ్ సెక్రటరీ విజయానంద్ మాట్లాడుతూ ఈపీడీసీఎల్ పరిధిలో 2 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి వచ్చే ఏడాది మార్చిలోగా సమ్మతి తీసుకొని వారి ఇళ్లపై రెండు కిలోవాట్ల చొప్పున మొత్తం 400 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ పనులను పూర్తి చేయాలన్నారు. పీఎం కుసుమ్ పథకం కింద ఫీడర్ సోలరైజేషన్లో సంస్థ పరిధిలోని 8 జిల్లాల్లో 220 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా వెహికల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. సమావేశంలో అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్లు విజయ కె.ఎస్.రామసుందర రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎన్.ప్రభాకర రెడ్డి, ఈపీడీసీఎల్ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీజీఎంలు ఎల్.దైవప్రసాద్, వి.విజయలలిత, బి.అశోక్ కుమార్, పి.శ్రీనివాస్, ఎస్ఈలు, ఈఈలు పాల్గొన్నారు. రేపటి నుంచి ఇంధన పరిరక్షణ వారోత్సవాలు ఇంధన పరిరక్షణ వారోత్సవాల పోస్టర్ను చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ ఆవిష్కరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 14 నుంచి 20 వరకు ఇంధన పరిరక్షణ వారోత్సవాలను నిర్వహించి ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన పెంపొందించాలని సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలను నిర్వహించాలన్నారు.ఈపీడీసీఎల్ అధికారులతోచీఫ్ సెక్రటరీ విజయానంద్ -
మెరుగైన వైద్యం అందించాలి
● జిల్లా టీబీ పర్యవేక్షణాధికారి డాక్టర్ కిరణ్కుమార్ ● వైద్య సిబ్బందికి సూచనలురాజవొమ్మంగి: మండల కేంద్రంలోని పీహెచ్సీని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ పర్యవేక్షణ అధికారి డాక్టర్ కిరణ్కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతివార్డులో గల సదుపాయాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో పరిశుభ్రతపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ల్యాబ్ను పరిశీలించారు. క్షయ రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు పరీక్షలు చేసి ఆయా వివరాలను వెబ్పోర్టర్లో అప్లోడ్ చేయాలని సిబ్బందికి సూచించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం మండలంలోని శరభవరం గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఎంఎల్హెచ్పీ, కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్లు అన్ని వేళల్లో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. కొయ్యూరు: క్షయ పరీక్షల సంఖ్యను పెంచాలని జిల్లా కుష్టు, ఎయిడ్స్, క్షయ నియంత్రణ అధికారి(డీపీఎంవో, డిలాట్) డాక్టర్ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. మండలంలోని రాజేంద్రపాలెం ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం బర్త్ వెయింటింగ్ హాలును సందర్శించి గర్భిణులకు పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలిచ్చారు. కుష్టు సర్వే నిర్వహించి, రోగుల వివరాలను సంబంధిత వెబ్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. వైద్యుడు నాయక్తో మాట్లాడారు. గర్భిణులను ప్రసవానికి వారం ముందగా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. సిబ్బంది నాగేశ్వరరావు, రెహమాన్, రామరాజు పాల్గొన్నారు. -
హైరిస్క్ గర్భిణులకుసాధారణ ప్రసవం
ముంచంగిపుట్టు: మండల కేంద్రం ముంచంగిపుట్టు సీహెచ్సీలో హైరి స్క్ హైపరటెన్సన్ కలిగిన ఇద్దరు గర్భి ణులకు వైద్యులు, సిబ్బంది సాధారణ ప్రసవం చేశారు. గురువారం రాత్రి వనుగుపుట్టు, బొండ్రుగూడ గ్రామా లకు చెందిన గర్భిణులు అంజలి, మనిషా ప్రసవం నిమి త్తం ఆస్పత్రిలో చేరారు. డాక్టర్ ఆదిత్య వారిని పరీక్షించగా.. ఇద్దరు కూడా హైరిస్క్ హైపరటెన్షన్తో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించారు. దీంతో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ సిబ్బంది సహకారంతో ఇద్దరు గర్భిణులకు సాధారణ ప్రసవం చేశారు. వైద్యుడు ఆదిత్య, సిబ్బంది రాంబాబు, శ్యామ్, నూకాలమ్మ, సుబ్బలక్ష్మీలకు గర్భిణులకు చెందిన కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
నాటి అడుగులు.. నేడు బాటలు
విశాఖ సిటీ: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు విద్యార్థులకు వరంగా మారాయి. యూనివర్సిటీ విద్యా విధానంలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఏయూలో సరికొత్త కేంద్రం ఏర్పాటుకు అడుగులు పెడుతున్నాయి. అలాగే ఏయూలో బీటెక్ రెండేళ్లు పూర్తి చేసి ప్రతిభ చూపించిన విద్యార్థులకు వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో ప్రవేశం పొందే అవకాశం కలగనుంది. ఇందుకు సంబంధించి గత ఒప్పందాలకు కొనసాగింపుగా మరో ఎంవోయూపై వెస్ట్రన్ యూనివర్సిటీ వీసీ అమిత్ చక్మా, ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ సంతకాలు చేశారు. 2023లోనే ఆస్ట్రేలియన్ కార్నర్కు ఒప్పందం ఏయూలో ఆస్ట్రేలియన్ కార్నర్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో ఏయూ అధికారులు నిర్ణయించారు. దీని కోసం 2022లో వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అమిత్ చక్మా ఏయూను సందర్శించారు. అనంతరం సీఎంవో ఆఫీస్ సూచనల మేరకు వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం, అప్పటి రాష్ట్ర ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ కార్యదర్శి సౌరభ్గౌర్ ఏయూను సందర్శించారు. ఏయూలో అమెరికన్ కార్నర్ పక్కనే ఆస్ట్రేలియన్ కార్నర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్నర్ను 2023 డిసెంబర్లోనే ప్రారంభించారు. అదే ఏడాది బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్విన్నింగ్ ప్రోగ్రామ్లను ప్రారంభించాలని భావించారు. అలాగే ఇంకుబేషన్ కార్యక్రమాలకు మెంటరింగ్ అందించడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం, వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం మధ్య ఆన్లైన్ ద్వారా ఎంవోయూ కూడా జరిగింది. ఇప్పుడు అదే ఒప్పందానికి మళ్లీ.. గతంలో జరిగిన ఒప్పందాలకు కొనసాగింపుగా తాజాగా మరో ఒప్పందానికి ఏయూ అధికారులు శ్రీకారం చుట్టారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ వీసీ చక్మా శుక్రవారం ఏయూను సందర్శించారు. గతంలో చేసుకున్న ఒప్పందాలు, ప్రారంభించిన ఆస్ట్రేలియన్ కార్నర్ కేంద్రాన్ని పరిశీలించారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీకి భారత్లో ముంబై, చైన్నె నగరాల్లో క్యాంప్లు ఉన్నాయి. ఏయూలో వెయ్యి మందికి పైగా విదేశీ విద్యార్థులు ఉన్నట్లు వీసీ చక్మా గుర్తించారు. దీంతో ఏయూ విద్యార్థులకు వెస్ట్రన్ యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. దీని కోసం శుక్రవారం ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ వీసీ చక్మా, ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏయూలో రెండేళ్లు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే వారి ప్రతిభ ఆధారంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో ప్రవేశం కల్పించనున్నారు. ఈ రెండేళ్లు విద్యార్థులు ఆస్ట్రేలియా వెళ్లి బీటెక్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ బీటెక్ కోర్సు కోసం ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కార్యక్రమం ఎంవోయూలో భాగంగా ఉంది. దీని ప్రకారం అక్కడి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఏయూకు వచ్చి విద్యా బోధన చేయనున్నారు. అలాగే ఏయూ ప్రొఫెసర్లు సైతం ఆస్ట్రేలియా యూనివర్సిటీలో బోధించే అవకాశం కలగనుంది. 2023లో ఏయూలో ఆస్ట్రేలియన్ కార్నర్ ఏర్పాటుకు ఒప్పందం ఇప్పుడు వెస్ట్రర్న్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో బీటెక్ విద్యకు అవకాశం ఏయూలో బీటెక్ సీఎస్ఈలో రెండేళ్లు పూర్తి చేసి ప్రతిభ చూపించిన వారికి చాన్స్ మిగిలిన రెండేళ్లు వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో ప్రవేశం వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ వీసీ అమిత్ చక్మా ఏయూ సందర్శన గత ఒప్పందం కొనసాగింపుగా శుక్రవారం మరో ఎంవోయూ -
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం
అడ్డతీగల: విద్యార్థు లకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని రాష్ట్ర పుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు అన్నారు. విద్యాశాఖ, జిసీసీ అధికారులతో కలిసి శుక్రవారం అడ్డతీగల మండలంలోని పలు పాఠశాలలను ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణను పరిశీలించారు. ఆహార పదార్థాల రుచిని చూశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఎల్లవరంలోని డీఆర్ డిపోను పరిశీలించారు. రేషన్కార్డుదారులకు సరకుల పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. సకాలంలో సక్రమంగా రేషన్ను పంపిణీ చేయాలన్నారు. -
వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే ఉద్యమం ఉధృతం
పాడేరు రూరల్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించి కార్పొరేట్ శక్తులకు కట్టబెడితే ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీపీఐ జాతీయ సమితి నాయకుడు జేవీ సత్యనారాయణమూర్తి హెచ్చరించారు. శుక్రవారం ఆయన పాడేరు పర్యటనలో భాగంగా మోదకొండమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా సమితి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందకుండా దూరం చేయడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్తులను విక్రయించే పనిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపించారు. ఆదివాసీల హక్కుల చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కతాటిపై నడుస్తున్నాయని విమర్శించారు. అనవసరమైన వ్యవహారాలను పార్లమెంట్లో చర్చకు తీసుకువచ్చి సమయం వృథా చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మావోయిస్టు అగ్రనేత ిహిడ్మాను పట్టుకుని కాల్చి చంపారని ఆరోపించారు. మన్యంలో ఉన్న అటవీ సంపదను అంబానీ, అదానీ వంటి బడాబాబులకు కట్టబెటడం కోసమే ఉద్యమ నేతలను కాల్చి చంపుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, రాష్ట్ర సమితి నాయకులు వెంకటరమణ, కుంజ రామ్మోహన్రావు, రాధాకృష్ణ, కుమార్, సింహాచలం, జల్లి రాజుబాబుఅమర్, తదితరులు పాల్గొన్నారు.సీపీఐ జాతీయ సమితి నాయకుడు జేవీ సత్యనారాయణమూర్తి -
కిక్కిరిసిన బస్సులు.. విద్యార్థుల అగచాట్లు
రాజవొమ్మంగి: మండలకేంద్రంలో పాఠశాలలు విడిచిపెట్టే సమయానికి బస్సులు రాకపోవడంతో పాటు వచ్చినా నిలపకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం రాజవొమ్మంగి బస్టాప్ వద్ద బస్సులు నిలపకపోవడంతో పాఠశాల విద్యార్థులు అవాక్యయ్యారు. తరువాత ప్రయాణికులతో కిక్కిరిసిన ఒక బస్సు రావడంతో ఎక్కేందుకు విద్యార్థులు పరుగులు పెట్టారు. కొంతమంది బస్సులో, మరికొందరు ప్రైవేట్ వాహనాల్లో ఇళ్లకు చేరారు. ఇదిలా ఉండగా రాజవొమ్మంగి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు గురువారం సాయంత్రం కొయ్యూరు మండలం రేవళ్ల గ్రామానికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. పాసులు లేని విద్యార్థుల బస్సు నుంచి దిగిపోవాలని కండక్టర్ ఒత్తిడి తీసుకొని రావడంతో పలువురు చిన్నారులు మార్గమధ్యలోనే బస్సు దిగిపోయారు. చీకటిపడిన వేళ గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాలు, ఆటోల్లో ఇళ్లకు చేరారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్టీసీ కండక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు సమయానుకూలంగా సర్వీసులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరారు. -
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
హత్యకోణంలో పోలీసుల దర్యాప్తుకూర్మన్నపాలెం: అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వెములపూడి విజయకుమార్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన 86వ వార్డు భరత్నగర్లోని ఓ ఇంట్లో శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. దువ్వాడ పోలీసులు అందించిన వివరాల మేరకు ఈ సంఘటన జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం సుంకర పంచాయతీ, పెదజాడుమూరుకు చెందిన విజయకుమార్ సుమారు నెల రోజుల క్రితం కూర్మన్నపాలెంకు వచ్చి శాతవాహననగర్ జాతీయ రహదారిపై ఉన్న కార్ల వాషింగ్ సెంటర్లో పనికి కుదిరాడు. ఆ సెంటర్ యజమాని ఇచ్చిన గదిలో ఉంటున్నాడు. ఐదు రోజుల క్రితం విజయకుమార్ తన సొంత గ్రామానికి సమీపంలోని గ్రామానికి చెందిన ఒక మహిళా పరిచయస్తురాలిని కూర్మన్నపాలెం రావాలని ఫోన్లో కోరాడు. పని దొరికిందని, ఇద్దరం కలిసి బతుకుదామని ఆమెకు చెప్పాడు. దీంతో ఆ మహిళ తనతో పాటు మరో ఇద్దరు మహిళలను తీసుకొనివచ్చింది. వీరందరూ మూడు రోజుల పాటు సర్వీసింగ్ సెంటర్ యజమాని ఇచ్చిన గదిలోనే ఉన్నారు. యజమాని గది ఖాళీ చేయాలని చెప్పడంతో.. వారు భరత్నగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడికి మకాం మార్చారు. నలుగురు అక్కడే ఉన్నప్పటికీ శుక్రవారం విజయకుమార్ ప్రియురాలితో పాటు మిగిలిన ఇద్దరు మహిళలు వెళ్లిపోయారు. అయితే సాయంత్రం వేళ విజయకుమార్ సొంత ఊరు నుంచి బంధువులు పోలీసులకు ఫోన్ చేసి, విజయకుమార్ తన గదిలో చనిపోయి ఉన్నాడని సమాచారం అందించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మృతదేహాన్ని పరిశీలించగా.. విజయకుమార్ మెడపై తాడుతో కోసిన మచ్చలు ఉన్నట్లు గుర్తించారు. మృతికి గల కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదు. విజయకుమార్తో పాటు గదిలో ఉన్నవారికి ఫోన్ చేయగా, వారి ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. దీంతో పోలీసులు విజయకుమార్ హత్యకు గురైనట్టు అనుమానం వ్యక్తం చేశారు. అదే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పుడు ఆరోపణలు తగవు
గంగవరం: మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ నాయకుల సమావేశం గురువారం జరిగింది.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు, రంపచోడవరం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాశరావు విలేకరులతో మాట్లాడారు. పిడతమామిడి గ్రామంలో బుధవారం జరిగిన సంఘటన గురించి పూర్తిగా తెలుసుకోకుండా ప్రజలకు పక్క దారి పట్టించే విధంగా ఎమ్మెల్యే శిరిషా దేవి మాట్లాడం సరికాదని వారన్నారు. వైఎస్సార్సీపీ, నాయకులపై ఎమ్మెల్యే గాని, టీడీపీ నాయకులు గాని ఇకపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాశరావు, ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీలు రామతులసి, గంగాదేవి, కో–ఆప్షన్ సభ్యుడు కె.ఎస్.ప్రభాకర్, జిల్లా కార్యదర్శి ఏడుకొండలు, కొత్తాడ, పిడతమామిడి, మొల్లేరు సర్పంచ్లు కామరాజుదొర, నేషం మరిడమ్మ, కుంజం లక్ష్మి, నెల్లిపూడి సొసైటీ మాజీ అధ్యక్షులు సంకుమళ్ల ఏసు, దాసరి వెంకటేశ్వరరావు, యూత్ కమిటీ సభ్యులు సతీష్, రామకృష్ణ, మేడిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు -
అప్పన్నకు ఆర్జిత సేవలు
సింహాచలం (విశాఖ): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం జరిపారు. 108 స్వర్ణ సంపెంగలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. వైభవంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. -
చెదలు
● నవ్వి పోదురు గాక.. మాకేంటి సిగ్గుఏయూ దూర విద్యకుచేతి రాతతో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ హిందీ క్వశ్చన్ పేపర్ తయారీ స్టడీ సెంటర్లకు పేపర్ను మెయిల్ చేస్తుండడంపై విస్మయం వాటిని ప్రింట్లు తీసి విద్యార్థులకు పంపిణీ చేస్తున్న నిర్వాహకులు విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్యకు చెదలు పట్టింది. ఈ విభాగం అధికారుల తీరు విమర్శలకు దారి తీస్తోంది. వీరి నిర్లక్ష్యంతో వందేళ్ల వర్సిటీ పరువు మంటగలుస్తోంది. దూర విద్య పరీక్షల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఏటా వేలాది మందికి నిర్వహించే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షలకు ప్రింటెడ్ ప్రశ్నా పత్రాలు ఇవ్వకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. నవ్విపోదురు గాక.. మాకేంటి సిగ్గు అన్నట్లు ప్రైవేటు స్కూళ్లు కూడా ఇవ్వని విధంగా చేతి రాతతో ప్రశ్నా పత్రాన్ని తయారు చేసి దాన్ని స్కాన్ చేసి స్టడీ సెంటర్లకు పంపిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మెయిల్కు వచ్చిన క్వశ్చన్ పేపర్ను స్టడీ సెంటర్ల నిర్వాహకులు ప్రింట్లు తీసుకుని విద్యార్థులకు పంపిణీ చేస్తుండడం గమనార్హం. చేతి రాతతో హిందీ ప్రశ్నా పత్రం ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్య డిగ్రీ థర్డ్ సెమిస్టర్ పరీక్షల ప్రశ్నా పత్రాలను చూసిన విద్యార్థులు షాక్కు గురయ్యారు. హిందీ ప్రశ్నా పత్రాన్ని చూసిన వారంతా ఇది ఒరిజినల్ పేపరా? కాదా? అన్న సందేహ స్థితిలో ఉండిపోయారు. చిన్న చిన్న వీధి బడుల్లో కూడా లేని విధంగా చేతి రాతతో ఉన్న క్వశ్చన్ పేపర్ ఇవ్వడంపై స్టడీ సెంటర్ల నిర్వాహకులే కాకుండా విద్యార్థులు సైతం కంగుతిన్నారు. శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న ప్రతిష్టాత్మక ఏయూ పరీక్షల నిర్వహణ మరీ ఇంత అధ్వానంగా ఉంటుందా? అని నవ్వుకుంటున్నారు. సాధారణంగా ఇతర యూనివర్సిటీలు ప్రింటెడ్ ప్రశ్నా పత్రాలను పరీక్షలకు ముందు రోజే స్టడీ సెంటర్లకు, కాలేజీలకు పంపిస్తుంటాయి. కానీ ఏయూ దూరవిద్య అధికారులు మాత్రం చేతితో క్వశ్చన్ పేపర్ రాసి దాన్ని స్కాన్ చేసి స్టడీ సెంటర్లు, కాలేజీలకు మెయిల్లో పంపిస్తుండడం విశేషం. ఆ పేపర్ను నిర్వాహకులు జెరాక్సులు తీసి పరీక్షలకు వచ్చే విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ఏయూ పరువు తీసిన అధికారులు ఏయూ డిస్టెన్స్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు గుర్తింపు లేని స్టడీ సెంటర్లలో పరీక్షల నిర్వహణపై ఆరోపణలు వినిపిస్తుండగా.. మరోవైపు పరీక్షల నిర్వహణను గాలికి వదిలేస్తున్నారు. ఏయూ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఈ రోజుల్లో గుర్తింపు లేని పాఠశాలల్లో కూడా చేతి రాత ప్రశ్నా పత్రాలు ఇవ్వడం లేదు. కానీ ఏయూ డిస్టెన్స్ అధికారులు మాత్రం ఇందుకు విరుద్ధంగా సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఏయూకు ఏటా రూ.50 నుంచి రూ.60 కోట్లు ఆదాయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి వస్తోంది. అయినప్పటికీ.. పరీక్షా ప్రశ్నా పత్రాలను టైప్ చేసి సెంటర్లకు పంపించకుండా చేతి రాతతో రాసి మెయిల్ చేస్తుండడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
గంగవరం : మండలంలోని పాతరామవరం గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపై ధాన్యం ఆరబోయడంతో బైక్ అదుపు తప్పి కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పారావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్తపల్లికి చెందిన అప్పారావు బైక్పై కొత్తపల్లి వైపు వెళ్తుడంగా రోడ్డుపై వేసిన ధాన్యం కారణంగా బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైయ్యాడు. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టడాన్ని నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు. గాయపడిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రోడ్డుపై ధాన్యం రాసులు వేసే రైతులకు ఎస్ఐ వెంకటేష్ కౌన్సెలింగ్ ఇచ్చారు. -
జాతీయ మారథాన్ పోటీలకు గిరిజనుడు ఎంపిక
ముంచంగిపుట్టు: మారథాన్ రన్ జాతీయస్థాయి పోటీలకు మండలంలోని పెదగూడ పంచాయతీ జర్రిపడ గ్రామానికి చెందిన గిరిజనుడు కుర్తాడి ప్రసాద్ ఎంపికయ్యారు. విశాఖలోని కొమ్మదిలో ఈనెల 10న ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రీడా మైదానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంద్రప్రదేశ్ ఆధ్వర్యంలో పీసా రాష్ట్రస్థాయి పోటీల్లో 10 కిలోమీటర్ల మారథాన్ నిర్వహించారు.ఈ పోటీల్లో పాల్గొన్న ప్రసాద్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో ఈ నెల 22 నుంచి 24 వరకు విశాఖలో జరిగే జాతీయ స్థాయి మారథాన్ రన్ పోటీలకు ప్రసాద్ ఎంపికై య్యారు. గిరిజనుడు ప్రసాద్ అనకాపల్లి జిల్లా నర్సింగరావుపేట లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, జర్రిపడ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలియజేశారు. -
పెండింగ్ కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు చేయాలి
జి.మాడుగుల: పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని పాడేరు సబ్ డివిజనల్ పోలీసు అధికారి(డిఎస్పీ)షహబాజ్ అహ్మద్ ఆదేశించారు. మండల కేంద్రంలో గల పోలీస స్టేషన్, సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని, వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఆయన సందర్శించారు. పోలీస్ స్టేషన్లలో వివిధ విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్లో నమోదైన వివిధ కేసులను దర్యాప్తు పురోగతిపై ఆయన ఆరా తీసి పెండింగ్లో ఉన్న కేసులు దర్యాప్తు పూర్తి చేయాలని తెలిపారు. స్టేషన్లలో రికార్డులను సమగ్రంగా పరిశీలించారు.స్టేషన్ ఇన్చార్జీ, పోలీస్ సిబ్బందితో విస్తృతంగా చర్చించి ప్రజలకు వెంటనే న్యాయం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. పోలీస్ సిబ్బంది పనితీరును మరింత మెరుగుపర్చడానికి అవసరమైన మార్గదర్శకాలను తెలియజేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ షణ్ముఖరావు, స్టేషన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం
అరకులోయటౌన్: మండలంలోని గురుకులం బాలికల కళాశాల, బాలికల పాఠశాల, కేజీబీవీ పాఠశాలలను అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గురువారం సాయంత్రం అకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులం బాలికల పాఠశాలలోని తరగతి గదులు, స్టాక్రూమ్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మత్స్యలింగం విద్యార్థినులతో మాట్లాడారు. ప్రతీ రోజు మెనూ ప్రకారంగా భోజనాలు పెడుతున్నారా లేదా అని విద్యార్థినులకు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారంగా నాణ్యమైన భోజనాలు వండి వడ్డించాలని, కాచిచల్లార్చిన నీటిని అందించాలని వసతి గృహాం నిర్వహాకులకు సూచించారు. విద్యార్ధులకు వండి వడ్డిస్తున్న భోజనాలను రుచి చూసారు. గురుకులం పాఠశాల ప్రహారి శిధిలమైన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి విద్యార్థులు, సిబ్బంది తీసుకురావడంతో పాడేరు ఐటిడీఏ పీఓ తిరుమణి శ్రీపూజతో ఫోన్లో మాట్లాడి బాలికల వసతి గృహంలో ప్రహరీ లేక సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలియజేయగా, త్వరలోనే ప్రహరీ నిర్మిస్తామని హామి ఇచ్చారన్నారు. కళాశాల, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.అరకులోయ ఎమ్మెల్యే మత్స్యలింగం -
ఉత్తమ మహిళా రైతుగా అడపా లక్ష్మి
గూడెంకొత్తవీధి: గూడెంకొత్తవీధి మండలం జర్రెల పంచాయతీ నిట్టమామిడిపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహిళా రైతు అడపా లక్ష్మికి అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీ కేంద్రంగా అగ్రికల్చర్ టుడే మేగజైన్ జాతీయ వ్యవసాయ పత్రిక 2025 ఏడాదికి సంబంధించి ఉత్తమ మహిళా రైతుగా ఎంపిక చేస్తూ అవార్డుకు ఎంపిక చేసింది. అడపా లక్ష్మి ఎం.ఏ బీఈడీ చేశారు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఈమె కొంతకాలంగా సేంద్రియ వ్యవసాయాన్ని చేపడుతున్నారు. కాఫీతోపాటు అంతర పంటలుగా మిరియాలు కమలా, అరటి తోటలు, కాయగూరలు వంటివి పండిస్తున్నారు. ఉన్నత చదువులు అభ్యసించి వ్యవసాయంలో రాణిస్తున్న ఈమెను జాతీయ వ్యవసాయ పత్రిక గుర్తించి అవార్డుకు ఎంపిక చేసింది. -
దారులన్నీ అమ్మ సన్నిధికే..
డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మార్గశిర మాసం మూడో గురువారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా, రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. బుధవారం అర్ధరాత్రి నుంచే క్యూల్లో బారులు తీరారు. భక్తి ప్రపత్తులతో జరిగిన పూజల నడుమ.. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల హడావుడి, ఆలయ నిర్వహణలో పోలీసుల పెత్తనం సామాన్య భక్తులను, ఆలయ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయడం గమనార్హం. విశేషంగా పూజలు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.05 గంటల నుంచి 1.30 గంటల వరకు స్వర్ణాభరణాలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. అంతకుముందు గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణ, వేద పారాయణాలు, శ్రీచక్రార్చన, లక్ష్మీ హోమం జరిపారు. భక్తులు సమర్పించిన పసుపు కుంకుమ నీళ్లతో జలాభిషేకం, భారీ ఎత్తున క్షీరాభిషేకం నిర్వహించి అమ్మవారికి పసుపు పూశారు. అనంతరం వెండి కవచాలు తొడిగి, దర్శనాలు కల్పించారు. ఎమ్మెల్యే హవా.. ఓవైపు భక్తులు గంటల తరబడి క్యూల్లో వేచి ఉండగా, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ హవా ఆలయంలో స్పష్టంగా కనిపించింది. గురువారం జరిగిన తొలిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే, తన వెంట సుమారు 200 మంది అనుచరులను తీసుకురావడంతో ఉత్సవాల్లో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు, ఉత్సవ కమిటీ సభ్యుల అనుచరులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఎటు చూసినా ఎమ్మెల్యే మనుషులే కనిపించడంతో.. సామాన్య భక్తులతో పాటు విధుల్లో ఉన్న ఆలయ సిబ్బంది కూడా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వన్టౌన్ సీఐనే అడగండి.. ఆలయ ఈవో పాత్ర నామమాత్రంగా మారిందనే విమర్శలు వినిపించాయి. అమ్మవారి దర్శన ఏర్పాట్ల గురించి ఎవరైనా ఈవో కె.శోభారాణిని ఫోన్లో సంప్రదిస్తే.. ‘నాకు సంబంధం లేదు, అంతా వన్టౌన్ సీఐనే అడగండి’అని బదులివ్వడం చర్చనీయాంశమైంది. ఆలయ నిర్వహణలో ఈవోకు ప్రాధాన్యత తగ్గిందా? లేక పోలీసుల పెత్తనం పెరిగిందా? అన్న అనుమానాలకు ఈ ఘటన తావిచ్చింది. ట్రాఫిక్ అవస్థలు భక్తులకు దేవస్థానం తరపున వాటర్ ప్యాకెట్లు అందజేశారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదానం ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, వృద్ధులు, వికలాంగులకు సీతారామస్వామి ఆలయం వైపు నుంచి దర్శనం కల్పించారు. నగరం నుంచి పాతపోస్టాఫీస్ వైపు వెళ్లే వాహనాలను టౌన్ కొత్తరోడ్డు జంక్షన్ వద్ద మళ్లించారు. సీబీఎం హైస్కూల్, పద్మానగర్ మీదుగా వన్టౌన్ రాణిబొమ్మ వైపు ట్రాఫిక్ మళ్లించడంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయి.. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఘనంగా మార్గశిర మూడో గురువారం పూజలు కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు ఆలయంలో ఎమ్మెల్యే అనుచరుల హడావుడి -
16న సింహగిరిపై నెలగంట
ఆయా పర్వదినాల్లో దర్శనాల వేళల్లో మార్పులు, ఆర్జిత సేవలు నిలుపుదలసింహాచలం: సింహగిరిపై ఈనెల 16న నెలగంట ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆరోజు నుంచి నెలరోజులపాటు ధనుర్మాసం పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి జనవరి 19వరకు సుప్రభాత సేవ, ఉదయం ఆరాధన టికెట్లు, ఈనెల 30 నుంచి జనవరి 19 వరకు సహస్రనామార్చన టికెట్లు రద్దు చేసినట్టు తెలిపారు. 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం ధనుర్మాస ఉత్సవాలు ఈనెల 16న ప్రారంభమవుతాయని, ఆరోజు మధ్యాహ్నం 1.01 గంటకు సింహగిరిపై రాజగోపురంలో నెలగంట మోగిస్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి, గోదాదేవికి విశేష పూజలు, తిరువీధి నిర్వహిస్తారు. తొలి పాశుర విన్నప పారాయణాన్ని నిర్వహిస్తారు. నెలగంట సందర్భంగా ఆరోజు ఉదయం 11.30 నుంచి మద్యాహ్నం 2.30 గంటల వరకు స్వామివారి దర్శనాలు లభించవు. 20 నుంచి పగల్పత్తు ఉత్సవాలు : ఈనెల 20 నుంచి 29 తేదీ వరకు పగల్పత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ ఉదయం తిరువీధి ఉత్సవం(అయ్యవారి సేవ) నిర్వహిస్తారు. ఆ రోజుల్లో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. 30 నుంచి రాపత్తు ఉత్సవాలు ఈనెల 30 నుంచి జనవరి 9వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ సాయంత్రం 5 గంటలకు స్వామికి ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో తిరువీధి నిర్వహిస్తారు. ఆయా రోజుల్లో రాత్రి 7 గంటల తర్వాత దర్శనాలు లభించవు. జనవరి 11న కూడారై ఉత్సవం జనవరి 11న ఆలయంలో కూడారై ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు దర్శనాలు లభించవు. 14న గోదా రంగనాథుల కల్యాణోత్సవం జనవరి 14న భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు గోదా రంగనాథుల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆరోజు నిత్యకల్యాణం ఉదయం లేకపోవడంతో సాయంత్రం ఉభయదాతలకు అవకాశం కల్పిస్తారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
రంపచోడవరం ఐటీడీఏ పీఓ స్మరణ్ రాజ్రంపచోడవరం/ మారేడుమిల్లి : ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూ అమలు చేయాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మారేడుమిల్లి మండలం కోడూరు బొడ్లంక గ్రామాలు, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని ధారగడ్డ గుర్తేడు తదిత గ్రామాల్లో పీవో గురువారం పర్యటించారు. మారేడుమిల్లి మండలం కోడూరు గ్రామంలో పీఎం జన్మన్ పథకం ద్వారా మంజూరైన గృహాలను, నీటి కుంటలను పీవో పరిశీలించారు. బొడ్లంక గ్రామంలో పసుపు ప్రోసింగ్ చేసే పరికరం మరమ్మతులు చేయించాలని మహిళా సంఘాలు పీవో దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పీఓ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గుర్తేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పీఓ పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. గుర్తేడు, ధారగడ్డ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజు మెనూ అమలు చేసి విద్యార్థులకు ఎప్పటికప్పుడు తయారుచేసిన ఆహార పదార్థాలు అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తంగేడు కోట నుండి రోడ్డు ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు తయారుచేసి నివేదికల సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్ అధికారి వెంట ఎంపీడీవో ఎం.బాపన్న దొర, డిప్యూటీ ఇంజనీర్ చైతన్య, దుర్గాప్రసాద్, రామరాజు తదితరులు పాల్గొన్నారు. -
సీలేరు ఎస్ఈలుగాబాధ్యతల స్వీకరణ
జాకీర్ హుస్సేన్ను సత్కరిస్తున్న అధికారులుహనుమను కలిసిన జెన్కో అధికారులుసీలేరు: ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్ ఎస్ఈ (సివిల్)గా షేక్ జాకీర్ హుస్సేన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ కేంద్రం లో పనిచేస్తున్న ఈయనకు ఎస్ఈగా పదోన్నతి కల్పిస్తూ ఉన్నతాధికారులు నియమించారు. సీలేరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఎస్ఈగా హనుమ బాధ్యతలు స్వీకరించారు. ఈయన పోలవరం ప్రాజెక్టులో ఈఈ విధులు నిర్వహిస్తున్న ఈయనను పదోన్నతిపై నియమించారు. వీరిని జెన్ఈ ఈఈలు జైపాల్, భాస్కరరావు, ఏడీ అప్పలనాయుడు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. -
విహార యాత్రలో విషాదం
హుకుంపేట: విహార యాత్రకు వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థుల బృందంలో ఒకరు మృతితో విషాదం నెలకొంది. వీరు ప్రయాణిస్తున్న కారు వంతెన గోడలను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రముఖ పర్యాటక ప్రాంతం వంజంగి హిల్స్ను గురువారం వేకువజామున సందర్శించారు. తిరుగు ప్రయాణంలో భాగంగా అరకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మండలంలోని జాతీయరహదారిలో రాళ్లగెడ్డ వద్ద వంతెనను ఢీకొట్టింది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఇంజనీరింగ్ విద్యార్థి గుడివాడ రుద్రసాయి(19)కి తీవ్ర గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మరో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు నారికంట్ల శ్రీయన్ నిహర్(19), శ్రీవాత్సవ(19)కు కూడా తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యసేవలు అనంతరం హుటాహుటిన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వీరి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మృతుడు రుద్రసాయి విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందినవారు. అతని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి శవ పరీక్షల గదిలో భద్రపరిచారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న అతని తండ్రి రామ్మూర్తినాయుడు, కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు. పొగమంచు అధికంగా ఉండడంతో రోడ్డు కనిపించక ఈ ప్రమాదం జరిగినట్టుగా ఎస్ఐ సూర్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాళ్లగెడ్డ వద్ద వంతెనను ఢీకొట్టిన కారు గీతం ఇంజినీరింగ్ విద్యార్థి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం ప్రథమ చికిత్స అనంతరం విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు పొగమంచు వల్లే మార్గం కనిపించక ప్రమాదం వెల్లడించిన పోలీసులు -
కొత్త పంచాయతీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ
● ఇంటి పన్నుల వసూలులో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం ● జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ కొయ్యూరు: పంచాయతీల విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తులను సంబంధిత ప్రాంతాల నుంచి స్వీకరిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ వెల్లడించారు. గురువారం ఆయన కొయ్యూరులో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గ్రామాలు, జనాభా, విస్తీర్ణం ఆధారంగా కొత్త పంచాయతీలకు అవకాశం ఉంటుందన్నారు. తమకు అందిన వినతులను కలెక్టర్ ద్వారా పంచాయతీ రాజ్ కమిషనర్కు పంపిస్తామని తెలిపారు. పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వీలుగా గ్రామాల్లో సేవా పన్ను వసూలు చేస్తున్నామన్నారు. ఇంటి పన్ను వసూలులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మొత్తం రూ.13.56 కోట్లు వసూలు కావలసి ఉండగా రూ.3.71 కోట్లు (27.2శాతం) వసూలు చేసినట్టు చెప్పారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలను చెత్త తరలింపునకు సంబంధించి సమాచారం ఇస్తున్నారన్నారు. చెల్లింపులు డిజిటల్ కావడంతో అంతా పారదర్శకంగా ఉందన్నారు. పర్యావరణ హితంగా పంచాయతీలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీటికి కలెక్టర్ రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అదనపు నిధులు ఇస్తారన్నారు. చెత్త తరలించేందుకు వీలుగా జిల్లాకు 400 వాహనాలు త్వరలో వస్తాయన్నారు. పంచాయతీల్లో వనరులను గుర్తించి ఆదాయం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతీ వెయ్యి గృహాలకు ఒక గ్రీన్ అంబాసిడార్గా ఉన్న మహిళలు చెత్తను తరలిస్తారని తెలిపారు. -
మన్యంలో చలి తీవ్ర రూపం దాలుస్తోంది. గురువారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శీతలగాలులు విజృంభించడంతో గిరిజనులు తాళలేకపోయారు. ఇంటి నుంచి బయట అడుగుపెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. జి.మాడుగుల, పాడేరు ప్రాంతాల్లో మంచు గడ్డకట్టి కశ్మీరు వాతావరణాన్ని తలపిం
సాక్షి,పాడేరు: మన్యం వాసులు చలితీవ్రతకు వణికిపోతున్నారు. గురువారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జి.మాడుగుల, డుంబ్రిగుడ, అరకువ్యాలీ, ముంచంగిపుట్టు, హుకుంపేట, పాడేరు, పెదబయలు, వై.రామవరం, మారేడుమిల్లి ప్రాంతాల ప్రజలు చలికి తాళలేక ఇబ్బందులు పడ్డారు. జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీలోని గ్రామాలతోపాటు, పాడేరు మండలం సంగోడి ప్రాంతంలో మంచు గడ్డ కట్టి కశ్మీరు వాతావరణాన్ని తలపించింది. పొలాల్లో కప్పిన టార్పాలిన్లపై మంచు బిందువులు గడ్డకట్టాయి. ఈ దృశ్యాలను స్థానికులు సెల్ఫోన్లతో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గతేడాది పాడేరు పరిసర ప్రాంతాల్లో వరి గడ్డి, కార్ల అద్దాలపై పలుచగా గడ్డ కట్టిందని, ఈ ఏడాది మంచు ఐసు గడ్డలను తలపించిందని స్థానికులు తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి మంచు దట్టంగా కురుస్తోంది. చలికి తాళలేక మంటలను ఆశ్రయిస్తూ ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రతకు ఇబ్బందులు చింతపల్లి: జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం జిల్లావ్యాప్తంగా వీటి ప్రభావం కనిపించింది. జి.మాడుగులలో 3.2, డుంబ్రిగుడలో 3.6, అరకులోయలో 3.9, ముంచంగిపుట్టులో 4.4, హుకుంపేటలో 5.4, పాడేరులో 6.7, పెదబయలులో 7.1, వై.రామవరంలో 8.7, మారేడుమిల్లిలో 9.4 డిగ్రీల కనిష్టఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. దీంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జి.మాడుగుల: మండలంలో గురువారం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంలో చలితీవ్రతకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు చలి వణికించిందని వారు తెలిపారు. స్వెర్టర్లు, మంకీ క్యాప్లు ధరించి, రగ్గులు కప్పుకున్నా చలికి తాళలేకపోయామని వారు పేర్కొన్నారు. దీంతో ఇళ్ల వద్దనే కట్టెలతో మంటలు వేసుకుని, చలి నుంచి కొంతమేర ఉపశమనం పొందామని వారు తెలిపారు. ఈ ప్రాంతంలో 3.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉదయం 9 గంటల వరకు సూర్యోదయం కాలేదు. మంచు గడ్డల సొలభం సొలభం పంచాయతీలోని సొలభం, ఎస్.కొత్తూరు, భీమలోయ, తాసరిబయలు, వనభరంగిపాడు, వంజంగిపాడు తదితర గ్రామాల్లో మంచు వర్షం కురిసింది. మంచు బిందువులో గడ్డకట్టాయి. వరి కుప్పలపై కప్పిన పాలిథిన్ కవర్లపై మంచు గడ్డ రూపంలో పేరుకుపోయింది. మంచు దట్టంగా కురవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. వాహనాల హెడ్ లైట్ల వెలుగులో రాకపోకలు సాగించారు. -
ప్రమాదాలకు నిలయంగా హైవే
● మలుపుల్లో ఏర్పాటు చేయని హెచ్చరిక బోర్డులు ● ముందు జాగ్రత్తలు చేపట్టని జాతీయ రహదారి నిర్మాణ అధికారులు ● వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆవేదన పాడేరు రూరల్: ఏజెన్సీ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని వైఎస్సార్ సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ విజయనగరం నుంచి అనంతగిరి, అరకులోయ, హుకుంపేట, పాడేరు మీదుగా రాజమహేంద్రవరం వరకు జరుగుతున్న హైవే పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. ఈ మార్గంలో పాడేరు–హుకుంపేట మధ్యలో ఏడాది వ్యవధిలో సుమారు 50కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. వీటిలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రమాదాలు జరగకుండా హైవే అధికారులు మందు జాగ్రత్తలు చేపట్టకపోవడమే కారణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో జాతీయ రహదారిని ఆనుకుని మందుబాబుల ఆగడాలు పెరిగినప్పటికీ పోలీసు అధికారులు పెట్రోలింగ్ నిర్వహించడం లేదని ఆరోపించారు. పాడేరు నుంచి జిమాడుగుల, చింతపల్లి మీదుగా హైవే నిర్మాణ పనులు నత్తనడకను తలపిస్తున్నాయన్నారు. దుమ్ము, ధూళితో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారన్నారు. ఎక్కడ పడితే అక్కడ తవ్వి వదిలేయడం ప్రమాదాలకు ఆస్కారమిస్తోందన్నారు. ఇప్పటికై నా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని, హైవే పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. -
టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
చింతూరు: సూపర్ సిక్స్ హామీలంటూ అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చకుండా మోసంచేసిన టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం చింతూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. సూపర్ సిక్స్ హమీల్లో ప్రధానమైన నిరుద్యోగభృతి, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ 1,500 హామీని చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ముంపు మండలాల్లో వరదలు సంభవిస్తే ప్రభుత్వ పరంగా అన్నివిధాలా ఆదుకుందని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే వరదల సమయంలో బాధితులను పట్టించుకోలేదని, ప్రభుత్వం నుంచి సరైన సాయం అందేలా చూడలేదని ఆమె విమర్శించారు. 2022 వరదలను దృష్టిలో వుంచుకుని అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చింతూరుతో సహా 32 గ్రామాలను ప్రాధాన్యత క్రమంలో చేర్చి పరిహారం అందేలా చర్యలు చేపట్టిందని ఆమె పేర్కొన్నారు. అప్పటి తమ ప్రభుత్వం కృషి ఫలితంగా ప్రస్తుతం నిర్వాసితుల ఖాతాల్లో సొమ్ములు జమవుతుంటే అదేదో తామే చేసినట్లుగా కూటమి నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని ఆమె కోరారు. ఇందుకోసం గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటుచేసి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పాటు పడాలని ఆమె సూచించారు. కార్యకర్తలు ఎవ్వరూ భయపడవద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె భరోసా కల్పించారు. జెడ్పీటీసీ చిచ్చడి మురళి, ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీలు యడమ అర్జున్, మేడేపల్లి సుధాకర్, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జిక్రియా, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ యగుమంటి రామలింగారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి -
జిల్లా విద్యాశాఖాధికారిగా రామకృష్ణారావు
● బాధ్యతల స్వీకరణ ● బ్రహ్మాజీరావుకు పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ సాక్షి,పాడేరు: జిల్లా విద్యాశాఖాధికారిగా రామకృష్ణారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం డైట్ కళాశాలలలో సీనియర్ లెక్చరర్గా పనిచేస్తున్న ఆయనకు ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ డీఈవోగా నియమించింది. అలాగే ఇక్కడ డీఈవోగా పనిచేస్తున్న పి.బ్రహ్మజీరావును పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారిగా ప్రభుత్వం బదిలీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావును పాడేరు ఎంఈవో సరస్వతి, ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి, పలు మండలాల ఎంఈవోలు,హెచ్ఎంలు,ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. -
ఇల్లు లేని వారితో దరఖాస్తు చేయించండి
అరకులోయ టౌన్: ఇల్లు లేని వారిని గుర్తించి వారితో దరఖాస్తు చేయించాలని హౌసింగ్ పీడీ బాబునాయక్ను స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశించారు. గురువారం ఆయన ఎమ్మెల్యేన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో మంజూరైన గృహాలు పరిస్థితిని ఎమ్మెల్యే తెలుసుకున్నారు. అరకు నియోజకవర్గానికి పీఎంఏవై పథకంలో సుమారు 33వేల ఇళ్లు మంజూరైనట్లు పీడీ వివరించారు. ఆయన వెంట హౌసింగ్ డీఈఈ రాజుబాబు ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు అరకుఅసెంబ్లీ నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణకు సహకరించిన ప్రతీ ఒక్కరికి స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధినేత జగన్మోహాన్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జిల్లా, మండల, పంచాయతీ స్థాయి నేతలు, పార్టీ శ్రేణులకు రుణపడి ఉంటానన్నారు. నియోజకవర్గంలో 53వేల సంతకాల సేకరించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే అన్నారు.హౌసింగ్ పీడీకి ఎమ్మెల్యే మత్స్యలింగం ఆదేశం -
రోడ్డు ప్రమాదంలోయువకుడు మృతి
ఎస్.రాయవరం : పెనుగొల్లు సమీపంలో గుర్తు తెలియని వాహ నం ఢీకొని యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మేరకు ఎస్ఐ విభీషణరావు బుధవారం అందించిన వివరాలిలా ఉన్నాయి. లింగరాజుపాలెం గ్రామానికి చెందిన ఏడిద దిలీప్కుమార్ స్నేహితులు నలమాటి జగన్, ఎస్.రాయవరానికి చెందిన జితేంద్ర మగళవారం అర్ధరాత్రి పెనుగొల్లు సమీపంలో భోజనం చేసేందుకు హోటల్కి వెళ్లారు. అర్థరాత్రి కావడం హోటల్ మూసి వేయడంతో పెనుగొల్లు జాతీయ రహదారిపై యూ టర్న్ తీసుకుంటుండగా అనకాపల్లి నుంచి తుని వైపు వెళుతున్న వాహనం ఢీకొట్టడంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనం సహాయం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దిలీప్కుమార్(20) మృతి చెందాడు. గాయపడ్డ జగన్, జితేంద్రలను మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కి తరలించినట్టు చెప్పారు. -
పోస్టల్ బీమాతో ఆర్థిక భరోసా
ముంచంగిపుట్టు: తక్కువ ప్రీమియంతో అధిక బోనస్ వచ్చే పోస్టల్ బీమాలు చేసుకొని కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని అరకు సబ్ డివిజన్ పోస్టల్ ఐపీవో లక్ష్మీకిషోర్ అన్నారు. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల పోస్టల్ బీపీఎంలు, ఏబీపీఎంలతో బుధవారం ఐపీవో సమావేశం నిర్వహించారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరిగే పోస్టల్ జీవిత బీమాలపై గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని పోస్టల్ ఉద్యోగులకు సూచించారు. ఐపీపీబీ గ్యాగ్ పాలసీలు చేయడంతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురుకు సర్టిఫికెట్లు అందించి, అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఐపీవో లక్ష్మీకిషోర్ మాట్లాడుతూ పోస్టల్ బీమాల ప్రయోజనాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఆర్పీఎల్ఐ, పీఎల్ఐలపై తెలియజేసి, అధిక బీమాలు తెరిచి, అరకు సబ్ డివిజన్కు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఎంవో శ్రీను, ఎస్పీఎం రాజు, బీపీఎంలు, ఏబీపీఎంలు పాల్గొన్నారు. -
నూతన పద్ధతుల సాగుపై అవగాహన
రంపచోడవరం: ఏజెన్సీలోని గిరిజన రైతులు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ బి.గోవిందరాజుల అన్నారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన రైతులతో మాట్లాడారు. కెవీకె ద్వారా రైతులకు అనేక రకాలైన సేవలు అందుతున్నాయని, ఎటువంటి సమస్యలు, సాగు విధానాలపై శాస్త్రవేత్తలను కలిసి అవగాహన పెంచుకోవాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే దిశగా రైతులు ముందడుగు వేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా 50 మంది గిరిజన రైతులకు ఉచితంగా బరకాలు, కొబ్బరి మొక్కలను అందజేశారు. కెవీకె కోఆర్డినేటర్ డా. రాజేంద్రప్రసాద్, శాస్త్రవేత్తలు వీరాంజనేయులు, పుష్ఫవతి, ప్రవీణ్బాబు తదితరులు పాల్గొన్నారు. రాజ్మా సాగు విస్తీర్ణాన్ని పెంచాలి గూడెంకొత్తవీధి: గిరిజన ప్రాంతానికే ప్రత్యేకమైన రాజ్మా పంట విస్తీర్ణాన్ని రైతులు పెంచాలని గూడెంకొత్తవీధి మండల వ్యవసాయాధికారి గిరిబాబు అన్నారు. జాతీయ ఆహారభద్రతా పథకంలో భాగంగా బుధవారం మండలంలోని అసరాడ గ్రామంలో రాజ్మా క్లస్టర్లను ఏర్పాటు చేశారు. రైతులు సాగు విస్తీర్ణం పెంపుతోపాటు ఆచరించాల్సిన విధానాలను వివరించారు. 90 శాతం రాయితీపై వేపనూనెను రైతులకు పంపిణీ చేశారు. సర్పంచ్ లక్ష్మి, మార్కెట్కమిటీ డైరెక్టర్ శరభన్నపడాల్ నాయకులు రంగారావు, వీఏఏ సౌందర్య తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భ జలవనరుల పరిరక్షణ అందరి బాధ్యత
పాడేరు : పూర్వీకులు ఆచరించిన ఆధ్మాత్మిక ధోరణిలో ప్రకృతిని పూజించి భూగర్భ జల వనరును పెంపొందించి పరిరక్షించడం అందరి బాధ్యత అని కలెక్టర్ దినేష్కుమార్ సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో భారత ప్రభుత్వ కేంద్రీయ భూగర్భ జలమండలి దక్షిణ క్షేత్రం(హైదరాబాద్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగ కార్యాలయం(విశాఖపట్నం) సంయుక్తంగా రైతులు, ప్రజలతో చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్షపాతం నమోదు, భూగర్భ జలాలను వినియోగించడంలో వెనుకబడుతున్నామన్నారు. దీనిని అధిగమించి జిల్లాలోని గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందేంచే విధంగా జిల్లా భూగర్భ జల వనరుల శాఖ, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా శాఖల సమన్వయంతో పని చేస్తోందన్నారు. తూర్పు కనుమల ద్వారా ఉత్తరాంధ్రలో లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లాలో 22 మండలాల్లో వర్షపాతంలో లోటు లేకున్నా భవిష్యత్లో నీటి నిల్వ, నీటి నాణ్యతలను ఎలా కాపాడుకోవాలనే దానిపై జిల్లా యంత్రాంగం ప్రణాళికలను రూపొందిస్తుందన్నారు. జిల్లాలోని భూగర్భంలో నైట్రేట్, ఫ్లోరైడ్ నియంత్రణలోనే ఉందన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా నీటి నిల్వల కోసం 254 చెక్డ్యాంలను నిర్మించడం జరిగిందన్నారు. ఇవే కాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నీటి కుంటలు, పంట కుంటలు, నీటి ఊటలు తవ్వించడం జరిగిందని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గ్రామ సభల తీర్మానాల ద్వారా నీటి వనరులను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ ఎం. జ్యోతికుమార్, అమెరికా ప్రతినిధి గోపాల్, సీజీడబ్ల్యూబీ శాస్త్రవేత్త లక్ష్మీనారాయణ దామోదర్, ఎస్ఎంఐ డీఈఈ ఆర్ నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
కట్టమంచి దార్శనికతతోనే ఏయూకు బహుముఖ ప్రగతి
మద్దిలపాలెం (విశాఖ): రాష్ట్ర విద్యావ్యవస్థలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరపరచుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు జరుపుకోవడం ముదావహమని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి జయంతి వేడుకలను బుధవారం ఏయూలో ఘనంగా నిర్వహించారు. వీసీ రాజశేఖర్ ప్రధాన పరిపాలన భవనం, స్నాతకోత్సవ మందిరం, టి.ఎల్.ఎన్ సభా హాల్ వద్దనున్న కట్టమంచి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శతాబ్దం కిందటే దార్శనికతతో ఇటువంటి మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీని స్థాపించి, అభివృద్ధి చేసిన కట్టమంచి కృషి నిరుపమానమని కొనియాడారు. ఏయూను స్థాపించిన తొలినాళ్లలోనే ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారని గుర్తుచేశారు. కట్టమంచి ఆశయ సాధనకు అనుగుణంగా విశ్వవిద్యాలయం ఖ్యాతిని మరింతగా పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వీసీ పిలుపునిచ్చారు. రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాల్స్, డీన్లు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక చర్యలు
ఎటపాక: గోదావరి నుంచి రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు స్పందించారు. రాత్రి సమయాల్లో ఇసుక అక్రమ రవాణాపై నిశీది వేళ నిర్భయంగా అనే కథనం బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన తహసీల్దార్ శ్రీనివాసరావు ఆదేశాలతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సందీప్, వీఆర్వో రామ్మూర్తి ఎటపాక వద్ద గోదావరి తీరం ఇసుక అక్రమ రవాణాకు ఏర్పాటు చేసిన ర్యాంపులను పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు ట్రాక్టర్లు వెళ్లకుండా పొక్లెయన్లు, ఇతర వాహనాలు వెళ్లకుండా రహదారికి అడ్డంగా కందకాలు తవ్వించారు. రెవెన్యూ అధికారుల స్పందనపై వైఎస్సార్సీపీ నాయకులు కురినాల వెంకట్, విజయ్కుమార్ ,నరేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
500 కిలోల రేషన్ బియ్యం పట్టివేత
రోలుగుంట : కె.నాయుడుపాలెం గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో తహసీల్దార్ సిహెచ్.నాగమ్మ సిబ్బందితో కలసి బుధవారం దాడి చేశారు. కె.నాయుడుపాలెం వైఎస్సార్ విగ్రహం కూడలిలో రేషన్ బియ్యంతో నింపి ఉన్న పది బస్తాలలో 500 కిలోల బియ్యం తరలించడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ దాడి సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడం, కొంత సేపు వేచి ఉన్నా ఎవరూ రాకపోవడంతో తహసీల్దార్ బస్తాలలో ఉన్న బియ్యం పరిశీలించి రేషన్ బియ్యంగా గుర్తించి వాటిని పౌర సరఫరా సరకులు గోదాములకు ఆర్ఐ రామ్మూర్తితో చేరవేసి తాను తన కార్యాలయానికి తహసీల్దార్ వెనుదిరిగారు. సాయంత్రం ఇదే మండలం రత్నంపేట గ్రామానికి చెందిన పెనుగొండ జగన్నాథం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి బియ్యం తనవేనని, ఇప్పించాలని కోరాడు. దీనిపై తహసీల్దార్ అతనిని విచారించి సరైన సమాధానం లేకపొవడంతో ఎస్ఐకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై రామకృష్ణారావు కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
కొయ్యూరు: పెదమాకవరం పంచాయతీ రామరాజుపాలెం వంతెన వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కంపరేగులకు చెందిన పనసలరాజు, సత్తిబాబు, రామరాజుపాలెనికి చెందిన లోతా రాజుబాబు బైక్పై నడింపాలెం వెళ్తున్నారు. ఆ సమయంలో రామరాజుపాలెం వంతెన వద్ద వాహనం అదుపుతప్పడంతో డివైడర్ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు కు బలమైన గాయాలయ్యా యి. అతడిని కొయ్యూరు ఎస్ ఐ కిశోర్వర్మ 108లో కృష్ణదేవిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సత్తిబాబు, రాజుబాబుకు స్వల్పగాయాలయ్యాయి. వారిని కృష్ణాదేవిపేట ఆస్పత్రి లో వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కిశోర్వర్మ తెలిపారు. -
జాతీయ స్థాయి పోటీలకు గిరిజన క్రీడాకారులు
పాడేరు రూరల్: జాతీయ స్థాయి పీసా క్రీడా పోటీలకు అరకు, పాడేరుకు చెందిన విద్యార్థులు ఎంపిక అవడం అభినందనీయమని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జగన్మోహన్రావు బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీల్లో ఆయా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభకనబర్చి జాతీయ పోటీలకు ఎంపికై నట్టు చెప్పారు. ఇందులో భాగంగా మారథాన్ విభాగంలో అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పి.శివాజీ, పాడేరు డిగ్రీ కళాశాల నుంచి డి.ఆనందరాజు, అరకులోయ మహిళ డిగ్రీ కళాశాల నుంచి పి.నీలవేణి, ఎస్.మంజుల, ఎల్.జ్యోతి, బాలుర కబడ్డీ టీమ్కు ఎం.కార్తిక్, జి.లోకనాథ్, పి.హేజెకియా, యు.అనీల్, కె.గణేష్, కె.చంద్రుబాబు, పి.మల్లికార్జున్, బాలికల కబడ్డీ టీమ్కు పాడేరు, అరకులోయ మహిళ డిగ్రీ కళాశాలలకు చెందిన ఎస్.మంజుల, కె.అనిత, పి.నీలవేణి, పి.జ్యోతి, కె.ఝాన్సీ ఎంపికయ్యారు. ఆయా క్రీడాకారులను బుధవారం పలువురు అభినందించారు. విశాఖలో ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించిన జాతీయ స్థాయి పీసా క్రీడా పోటీల్లో వారు పాల్గొననున్నారు. -
అరకులో చలి పంజా
● 4.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు ● డుంబ్రిగుడలో తగ్గుముఖం ● చింతపల్లి ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ అప్పలస్వామి వెల్లడి చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజులుగా మరింత దిగజారుతున్నాయి. మంచు, చలి తీవ్రతకు మన్యం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం అరకువ్యాలీలో 4.4 డిగ్రీలు, డుంబ్రిగుడలో 4.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధి జి.మాడుగులలో 4.8, ముంచంగిపుట్టులో 5.0, పాడేరులో 5.2,హ హుకుంపేటలో 9.6, చింతపల్లిలో 6.2, పెదబయలులో 6.7, కొయ్యూరులో 11.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 9.4, మారేడుమిల్లిలో 9.9, రాజవొమ్మంగిలో 11.7 ,అడ్డతీగలలో 13.0, రంపచోడవరంలో 13.6,గంగవరంలో 16.7, చింతూరు డివిజన్ చింతూరులో 13.3, ఎటపాకలో 13.9 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. చలిని ఉపశమనం పొందేందుకు మన్యం వాసులు మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. సాక్షి,పాడేరు: జిల్లాలో చలితీవ్రత పెరుగుతోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రజలు చలికి తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉదయం 9గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉన్ని దుస్తుల వినియోగం పెరిగింది. పర్యాటకులకు ప్రాణసంకటంగా.. ఎటపాక: పాపికొండలు సందర్శకులకు పొగమంచు, చలి ప్రాణసంకటంగా మారింది. వీఆర్ పురం మండలంలోని పోచవరం లాంచీల రేవుకు భద్రాచలం నుంచి వచ్చే వారు ఎటపాక మండలం మీదుగా కూనవరం నుంచి వీఆర్పురం మండలంలోని పోచవరం రేవుకు వాహనాల్లో వెళ్తుంటారు. వీరంతా భద్రాచలంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో బయలుదేరుతారు. ఒక పక్క చలి, మరోపక్క మంచు తెరలు కమ్ముకోవడంతో రేవుకు వెళ్లేవారు సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. -
నిరసన సంతకం
గంగవరంలో కోటి సంతకాల ప్రతుల తరలింపు ర్యాలీని ప్రారంభిస్తున్న రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతున్న పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, ఎమ్మెల్యే మత్స్యలింగం, చైర్పర్సన్ సుభద్ర, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అసెంబ్లీ పరిశీలకుడు సత్యారావుకోటి సంతకాల ప్రతులను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు అందజేస్తున్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంకోటి సంతకాల ప్రతులు తరలించే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న అరకు పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, తదితరులుర్యాలీకి తరలిరావాలిపాడేరు : రాష్ట్రంలో ప్రజల సొత్తు అయిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీపరం చేసే హక్కు టీడీపీ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని.. ప్రైవేటీకరణపై ప్రజా తిరుగుబాటు తప్పదని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు హెచ్చరించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సేకరించిన సంతకాలను బుధవారం పాడేరులో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు 15ఏళ్ల సీఎం చరిత్రలో రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ఏర్పాటు చేయలేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రాత్మకంగా ఏకంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తే జీర్ణించుకోలేని చంద్రబాబు, వాటిని ప్రైవేట్పరం చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాటిపై ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన సేకరించిన సంతకాల ప్రతులతో ఈనెల 15న జిల్లా కేంద్రమైన పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించి విజయవాడ తరలించి పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డితో కలిసి ఈనెల 17న రాష్ట్ర గవర్నర్కు అందజేస్తామని ఆయన తెలిపారు. ప్రజలకు నష్టం జరిగితే ఊరుకోం: బొడ్డేడ ప్రసాద్ హెచ్చరిక కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఉవ్వెత్తున ముందుకు వచ్చి సంతకాలు చేసి మద్దతు తెలిపారని వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. ప్రజలకు నష్టం జరిగితే తమ పార్టీ తరఫున చూస్తూ ఊరుకోమని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రజారోగ్యాన్ని విస్మరించిన టీడీపీ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వైఎస్సార్సీపీ నిత్యం పేదల పక్షాన ఉంటూ వారి సంక్షేమం కోసమే పని చేస్తుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళి భాగ్యలక్ష్మి అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 17 వైద్య కళాశాలలను నెలకొల్పి ఉన్నత వైద్యాన్ని ప్రజల ముంగిటకు తెచ్చిందన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమంతో పాటు ప్రజారోగ్యాన్ని పూర్తిగా నీరు గార్చిందన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ మండల అధ్యక్షలు, అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ● అరకు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సేకరించిన 53వేల సంతకాల ప్రతులను జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజుకు బుధవారం సాయంత్రం పాడేరు పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అందజేశారు. పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి(పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప పరిశీలకులు) ఏడువాక సత్యారావు సమక్షంలో ఆయన స్వీకరించారు. విజయవంతంగా ప్రజా ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గంగవరం : ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాల్లో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమం విజయవంతంగా సాగిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. నియోజకవర్గంలో గ్రామస్థాయిలో ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను బుధవారం కాకినాడ జిల్లా కేంద్రానికి తరలించే సందర్భంగా నిర్వహించిన కార్లు, బైక్ ర్యాలీని గంగవరం సెంటర్లో ఆమె ప్రారంభించారు. వివిధ మండలాల నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ కుట్రలో భాగంగా ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తమ పార్టీ ఎప్పుటికప్పుడు ఎండగడుతుందన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో తాను, ఎమ్మెల్సీ అనంతబాబు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొని కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేశారన్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగవరం, రంపచోడవరం, అడ్డతీగల, వై.రామవరం, రాజవొమ్మంగి, దేవీపట్నం మండలాలకు చెందిన ఎంపీపీలు పల్లాల కృష్ణారెడ్డి, రాఘవ, బంధం శ్రీదేవి, మురళి, జెడ్పీటీసీలు బేబిరత్నం, పండా వెంకటలక్ష్మి, జి. వెంకటలక్ష్మి, సత్యవేణి, మద్దాలవీర్రాజు, వైస్ఎంపీపీలు రామతులసి, గంగాదేవి, గారపాటి మురళి, కొమ్మిశెట్టి బాలకృష్ణ, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు యెజ్జు వెంకటేశ్వరరావు, రామన్నదొర, రామకృష్ణ, మురళీ, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాశరావు, బూత్కమిటీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రఘునాథ్, జిల్లా కార్యదర్శి ఏడుకొండలు, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేసి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణకు విశేష స్పందన స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజలు ‘అరకు’ ప్రతులను పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజుకు అందజేసిన ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సేకరించిన సంతకాల ప్రతులను పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రదర్శన ప్రజల సొత్తు ప్రైవేట్ పరం చేసే హక్కు టీడీపీ ప్రభుత్వానికి లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు స్పష్టీకరణ ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరికకోటి సంతకాల సేకరణ ప్రతులతో పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, అరకు అసెంబ్లీ పరిశీలకుడు సత్యారావు -
విభిన్న ప్రతిభావంతులపై చిన్నచూపు తగదు
పాడేరు : విభిన్న ప్రతిభావంతుల పట్ల చిన్నచూపు తగదని, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని కలెక్టర్ దినేష్కుమార్ కోరారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని బుధవారం పట్టణంలోని కాఫీ హౌస్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు నిర్ధేశించిన ఉద్యోగాలను అన్ని శాఖల నుంచి వెరిఫికేషన్ కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి పంపి అనుమతులు పొందామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల వారీగా నోటిఫికేషన్ విడుదలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేస్తామన్నారు. పెన్షన్ తీసుకుంటున్న వారి సమాచారంతో పాటు జిల్లాలో మొత్తం దివ్యాంగుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు, దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జిల్లా ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. కవిత, రెడ్క్రాస్ ప్రతినిధులు జయ, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
ఒక్కో సంస్థ ఒక్కో ధర.. రైతుకు టోకరా
సాక్షి,పాడేరు: మన్యంలో కాఫీ పండ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఎంతో కష్టపడి పండించిన రైతులకు మార్కెట్ పరిస్థితులు నిరాశ కలిగిస్తున్నాయి. సంస్థలు కొనుగోలు ధరల్లో వ్యత్యాసం ఉన్నందున తాము నష్టపోవాల్సి వస్తోందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. జిల్లాలోని 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతోంది. ఎకరాకు కనీనం 1000 కిలోల వరకు ఫలసాయం వస్తుంది. ఈ ఏడాది దిగుబడి ఆశాజనకంగా ఉన్నా సంస్థలు నిర్ణయించిన కొనుగోలు ధరలు వారిని నిరాశ పరుస్తున్నాయి. ● పాడేరు ఐటీడీఏ ఆధీనంలోని చింతపల్లి మాక్స్ సంస్థ కాఫీ పండ్లు గ్రేడ్–1ను కిలో రూ.70, గ్రేడ్–2 కిలో రూ.65 ధరకు కొనుగోలు చేస్తోంది. ఐటీడీఏ కాఫీ విభాగ అధికార యంత్రాంగమంతా గ్రామాలకు నేరుగా గిరిజనుల కాఫీ తోటల వద్దకు వెళ్లి ఫలసాయం కొనుగోలు చేస్తోంది. ఈ సంస్థకే కాఫీ పండ్లు విక్రయించాలని అధికారుల నుంచి ఒత్తిడి తేవడం రైతులకు ఇబ్బందిగా మారింది. కాఫీ మార్కెటింగ్ తరువాత లాభాలను బోనస్ రూపంలో పంపిణీ చేస్తామని కాఫీ విభాగం అధికారులు గిరిజనులకు హమీ ఇస్తున్నారు. తక్కువ ధరకు చింతపల్లి మాక్స్ కొనుగోలు చేయడంతో కాఫీ రైతులు ఉసూరుమంటున్నారు. రికార్డు ధరకు నాంధి కొనుగోలు అరకులోయ కేంద్రంగా పనిచేస్తున్న నాంధి స్వచ్ఛం సంస్థ కాఫీ పండ్లు కిలో రూ.100 ధరకు కొనుగోలు చేస్తోంది. పూర్తిగా పండిన పండ్లు కిలో రూ.100, నాణ్యత తక్కువగా ఉంటే కిలో రూ.80నుంచి రూ.90కు కొనుగోలు చేస్తోంది. అయితే నాంధి సంస్థ అధిక ధరతో పోటాపోటీగా గ్రామాల్లో తిరుగుతున్నప్పటికీ రైతులు పూర్తిస్థాయిలో అమ్ముకోలేకపోతున్నారు. చింతపల్లి మాక్స్కే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నందున కిలోకు రూ.30 చొప్పున నష్టపోవాల్సి వస్తుందని కాఫీ రైతులు వాపోతున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా కిలో కాఫీ పండ్లను రూ.70 ధరకు కొనుగోలు చేస్తున్నాయి.కలెక్టర్, ఐటీడీఏ స్పందించాలి లాభాలు, బోనస్ను పక్కనబెట్టి పాడేరు ఐటీడీఏ కిలో కాఫీ పండ్లకు 100 చెల్లించాలి. నాంధి సంస్థ మాదిరిగా కొనుగోలు చేయకుంటే నష్టపోవాల్సి ఉంటుంది. కలెక్టర్, ఐటీడీఏ అఽధికారులు స్పందించి మాక్స్ సంస్థ ధర పెంచేలా చర్యలు తీసుకోవాలి. – రేగం చిట్టన్న, కాఫీ రైతు, వనుగుపల్లి పంచాయతీ కాఫీ కొనుగోళ్లలో ఇష్టానుసారం ప్రభుత్వ రంగ మాక్స్ కిలో రూ.70కు కొనుగోలు ఈ సంస్థకే అమ్మాలని కాఫీ విభాగం అధికారుల ఒత్తిడి ప్రైవేట్ సంస్థ నాంథి రూ.100 చెల్లింపు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రూ.70కు సేకరణ ధరల వ్యత్యాసంతో నష్టపోతున్న కాఫీ రైతులు -
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: కోటి సంతకాల సేకరణ ప్రతులను ఈనెల 15న జిల్లా కేంద్రం నుంచి విజయవాడ తరలించే సందర్భంగా నిర్వహించే ర్యాలీకి నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో వైఎస్సార్సీపీ శ్రేణులు హాజరు కావాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. బుధవారం అరకులోయ నుంచి కోటి సంతకాల ప్రతులను జిల్లా కేంద్రమైన పాడేరు తరలింపును ఆయన ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా 60 వేల మందితో సంతకాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అనివార్య కారణాల వల్ల 53 వేల సంతకాలు సేకరించామన్నారు. వీటిని ఈ రోజు జిల్లా కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు విశ్వేశ్వరరాజుకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ పేదకు వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. గతంలో అరకు, పాడేరు ప్రాంతానికి చెందిన వారు అనారోగ్యానికి గురైతే విశాఖ కేజీహెచ్కు తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందేవారని గుర్తుచేశారు. పేదలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించాలన్న సంకల్పంతో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి కొత్త 17 వైద్య కళాశాలను నిర్మించారన్నారు.వీటిలో ఏడు వైద్య కళాశాలలతోపాటు 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేట్ పరం చేసిందన్నారు. గడిచిన ఎన్నికల్లో టీడీసీ అభ్యర్థులకు నిధులు సమకూర్చిన వారికి ప్రజా ధనంతో నిర్మించిన వైద్య కళాశాలలను అప్పజెప్పారన్నారు. టీడీపీ నేతల మాయమాటలు నమ్మి మైదాన ప్రాంత ప్రజలు వారికి ఓటేస్తే, గిరిజన బిడ్డలు జగనన్నకు నమ్ముకొని ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, దేశమంతా అరకు వైపు చూసేలా మరింత అభివృద్ధి చేస్తారన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలన్న సంకల్పంతోనే కోటి సంతకాల సేకరణ బాధ్యతను జగనన్న అప్పగించారన్నారు. నియోజకవర్గంలో మిగిలిన 7వేల సంతకాలు కూడా పూర్తి చేస్తామన్నారు. కోటి సంతకాల సేకరణ చేసిన పత్రాలను పాడేరు జిల్లా కేంద్రానికి తరలించే వాహనాన్ని బొడ్డేటి ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు.అక్కడి నుంచి పాడేరు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సెల్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు అసెంబ్లీ పరిశీలకుడు సత్యారావు, జెడ్పీటీసీ శెట్టి రోషిణి, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, యువజన నాయకుడు రేగం చాణక్య, ఎంపీపీ శెట్టి నీలవేణి, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, ఎంపీటీసీలు దురియా ఆనంద్కుమార్, రామచందర్, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, పార్టీ మండల అధ్యక్షులు రామూర్తి, పరశురాం అనిల్, సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు పల్టాసింగ్ విజయ్కుమార్,ప్రకాష్, సర్పంచ్లు నాగేశ్వరరావు, రమేష్, సుశ్మిత, రాధిక, కిముడు హరి, నాయకులు సింహాచలం, కృష్ణారావు, చందు పాల్గొన్నారు. -
బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
● వేసవిలో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు లేకుండా సమష్టిగా చర్యలు ● నిర్ణయించిన ఇరు రాష్ట్రాల అధికారులు సీలేరు : ఆంధ్రా ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగం, నిర్వహణపై ఇరు రాష్ట్రాల అధికారులు బుధవారం ఒడిశాలోని చిత్రకొండలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2025– 26 నీటి సంవత్సరంలో 2025 జూలై నుంచి నవంబరు 30 వరకు ఇరు రాష్ట్రాల వినియోగించుకున్న నీటిపై లెక్కలు కట్టారు. దీని ప్రకారం ఆంధ్రా ఇప్పటి వరకు 20,3513 టీఎంసీలు, ఒడిశా 48.8470 టీఎంసీలు వాడుకున్నట్టుగా వారు వెల్లడించారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో 78.4000 టీఎంసీలు, జోలాపుట్టులో 28.5451 టీఎంసీలు కలిసి మొత్తంగా 106,9451 టీఎంసీల నిల్వలు ఉన్నట్టు తెలిపారు. ఈ నెలఖరు నాటికి పరివాహక ప్రాంతాల నుంచి బలిమెల జలాశయానికి 3.5000 టీఎంసీలు, జోలాపుట్టుకు 25000 టీఎంసీలు అదనపు నీరు చేరే అవకాశం ఉన్నందున రెండింటిలో మొత్తం112.9451 టీఎంసీలు నిల్వలు ఉండనున్నట్టు అంచనాతో లెక్కలు కట్టారు. ఇందులో ఆంధ్రాకు 69.0803, ఒడిశాకు 43.8648 టీఎంసీలుగా పంపకాలు జరిపారు. ప్రస్తుతం గ్రిడ్ డిమాండ్, ఇరిగేషన్ అవసరాల నిమిత్తం ఆంధ్రాకు రెండు వేల క్యూసెక్కులు, ఒడిశా మూడు వేల క్యూసెక్కులు వాడుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికార్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో ఒడిశా తరఫున పోట్టేరు ఇరిగేషన్ చీఫ్ కనస్ట్రక్చన్ ఇంజనీర్ కృష్ణకుమారి పాత్రో, చిత్రకొండ ఎర్త్ డ్యాం డివిజన్ ఎస్ఈ రమాకాంత్, పొట్టేరు కెనాల్ డివిజన్ ఎస్ఈ సనోజ్, బలిమెల ఓహెచ్సీ మేనేజర్ బిమల టర్కీ, డిప్యూటీ మేనేజర్ క్లుణిష చంద్రబెహరా, అసిస్టెంట్ మేనేజర్ సుదీప్, ఆంధ్రా తరఫున సీలేరు కాంప్లెక్సు సివిల్ ఎస్ఈ చిన్న కామేశ్వరరావు, ఈఈ ఎస్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు. -
హైవే పనుల్లో నిర్లక్ష్యం.. బాలికకు గాయాలు
జి.మాడుగుల: జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టురుల నిర్లక్ష్యం వలన పనులు అసంపూర్తిగా వదిలిపెట్టడంతో అనేక మంది గిరిజన ప్రజలు గాయపడుతున్నారు. రోడ్డు మార్గంలో నిర్మాణాల పేరుతో రోడ్డు తవ్వటం వదిలి పెట్టటం, డ్రైనేజీ పనులు నిమిత్తం పెద్దపెద్ద గోతులు తవ్వటం పూర్తి చేయకపోవటం, సిమెంట్ డ్రైనేజీలపై పైకప్పులు వేయకపోవటం వంటి కారణాల వలన అనేక మంది గాయాలపాలవుతున్నారు. మండలంలో గాంధీనగరం గ్రామంలో హైవే కాంట్రాక్టర్ డ్రైనేజీపై పైకప్పు వేయకపోవడంతో అదే గ్రామానికి చెందిన గిరిజన బాలిక గోతిలో పడిపోయి కుడికాలుకు తీవ్రగాయమైనట్టు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల బందవీధి గ్రామంలో గిరిజన యువకుడు కాలువలో పడడంతో కాలు విరిగిపోయిందని వారు తెలిపారు. హైవే అధికారుల పర్యవేక్షణ లోపం, పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తక్షణమే పనులు పూర్తి చేయాలని సమరసతా సేవా ఫౌండేషన్ జిల్లా ప్రముఖ్ మత్స్యరాస మత్స్యరాజు డిమాండ్ చేశారు. హైవే పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కలెక్టర్ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు జాప్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ప్రమాదాలకు కారమణమవుతున్న అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లుపై కేసులు పెడతామని హెచ్చరించారు. -
మాచ్ఖండ్లో శతశాతం ఉత్పాదన
ముంచంగిపుట్టు: ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన శాతశాతం జరుగుతోంది. గత ఏడాది ఆగస్టులో రెండు రోజులు మాత్రమే శాతశాతం విద్యుత్ ఉత్పాదన జరిగిన అనంతరం రెండో నంబరు జనరేటర్ మరమ్మతులకు గురవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రెండవ నంబరుకు చెందిన ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినట్లు ప్రాజెక్టు అధికారులు గుర్తించారు. తరచూ జనరేటర్లు మరమ్మతులు గురవుతూ వస్తున్నాయి. ప్రాజెక్టు అధికారులు శ్రమిస్తున్నా అత్యంత పురాతన జలవిద్యుత్ కేంద్రం కావడంతో మరమ్మతులు చేపట్టి కొద్దిరోజులు మాత్రమే పని చేస్తున్నాయి. సమస్యను జెన్కో ఉన్నతాధికారుల దృష్టికి ప్రాజెక్టు అధికారులు తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన జెన్కో అధికారులు రూ.40 లక్షలు కేటాయించారు.దీంతో ప్రాజెక్టు అధికారులు,సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఈ నెల 8వ తేదీన 2వ నెంబరు జనరేటర్కు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఆరు జనరేటర్ల సాయంతో రోజుకు 2.8 మిలియన్ యూనిట్ల ఉత్పాదన జరుగుతోంది. శతశాతం విద్యుత్ ఉత్పత్తికి కృషి చేసిన ప్రాజెక్టు ఎస్ఈ ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఇంజినీర్లు, సిబ్బందికి బుధవారం ఏపీజెన్కో హైడల్ డైరెక్టర్ సుజయ్కుమార్ ఫోన్లో అభినందించారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొనిచుక్కల జింక మృతి
ఆరిలోవ (విశాఖ) : జాతీ య రహదారిపై బుధవా రం జరిగిన రో డ్డు ప్రమాదంలో ఓ చుక్కల జింక మృతి చెందింది. అటవీశాఖ సిబ్బంది తెలిపిన వివరాలివి. కంబాలకొండ అభయారణ్యం నుంచి ఓ చుక్కల జింక జూపార్క్ దాటిన తర్వాత జాతీయ రహదారిపైకి వచ్చింది. అదే సమయంలో నగరం నుంచి మధురవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆ జింకను ఢీకొట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావమై జింక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, జింక కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం జూ ఆసుపత్రికి తరలించారు. అనంతరం దహనం చేశారు. -
గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
గర్భిణులకు అవగాహన కల్పిస్తున్న డీసీహెచ్ఎస్ డాక్టర్ నీలవేణి చింతపల్లి: గర్భిణులు ప్రసవ సమయం వరకు వేచి చూడకుండా ముందుగానే ఆసుపత్రుల్లో చేరాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణి సూచించారు. మంగళవారం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భిణులకు పీఎం ఎస్ఎస్ఏ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం
అవగాహన కల్పిస్తున్న అధికారులు పాడేరు రూరల్: ప్రతిఒక్కరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఆ శాఖ జిల్లా అధికారి ఎంవీ రామకృష్ణంరాజు సూచించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించాలని సూచించారు. పౌరసమాచార అధికారి సంతోష్, వివిధ శాఖల అధికారులు మరిడయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
జి.మాడుగుల: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్ హెచ్చరించారు. మంగళవారం ఆయన స్థానిక పీహెచ్సీని తనిఖీ చేశారు. అటెండెన్స్, మూమెంట్ రిజస్టర్లను ఆయన పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. కాన్పునకు సిద్ధంగా ఉన్న గర్భిణులను వారం రోజుల ముందుగా స్థానిక బర్త్ వెయిటింట్ హోమ్కు తరిలించి సుఖప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారిని ఆదేశించారు. ఇళ్ల వద్ద కాన్పులు జరిగితే సంబంధిత క్షేత్రస్థాయి, పర్యవేక్షిక సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రిలో అన్ని వార్డులు, ప్రసూతి గదిని ఆయన పరిశీలించారు. శీతాకాలంలో న్యుమోనియా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెంచే అవకాశం ఉందన్నారు. అందువల్ల పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులు, వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నందున వారిలో వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. గ్రామాలు, పాఠశాలల్లో జ్వరాలు, వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు అదుపునకు వైద్యాధికారులు,సిబ్బంది కలసి వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. సమయపాలన పాటించాలని ఆదేశించారు. -
ప్రపంచ శాంతి కోరుతూ సాధువు యాత్ర
నిలువు దండాలతో యాత్ర చేస్తున్న సాధువు ఉపేంద్రదాస్ చింతూరు: ప్రపంచ శాంతిని కోరుతూ ఓ సాధువు గంగోత్రి నుంచి రామేశ్వరానికి చేపట్టిన నిలువు దండాల యాత్ర మంగళవారం మండలంలోని చట్టికి చేరుకుంది. ఉత్తరాఖండ్లోని గంగోత్రి నుంచి తమిళనాడులోని రామేశ్వరం వరకు 3,300 కిలోమీటర్ల మేర ఈ యాత్ర చేపట్టినట్లు సాధువు ఉపేంద్రదాస్ తెలిపారు. గత 29 రోజుల క్రితం యాత్ర చేపట్టానని, రామేశ్వరం చేరుకుని పరమశివుని దర్శనంతో తనయాత్ర ముగించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలో కరువు కష్టాలు రాకుండా ప్రతిఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి పౌరుడు దేశభక్తి చాటాలని కోరుతూ యాత్ర కొనసాగిస్తున్నట్లు ఉపేంద్రదాస్ తెలిపారు. -
డౌన్హిల్ స్కేటింగ్లో తమిళనాడు సత్తా
విశాఖ స్పోర్ట్స్ : జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో భాగంగా మంగళవారం తొట్లకొండలో జరిగిన డౌన్హిల్ స్కేటింగ్ పోటీల్లో తమిళనాడు జట్టు సత్తా చాటింది. మెన్లో కిషోర్కృష్ణ విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా హర్షిత్ ద్వితీయ స్థానంతో (వీరిద్దరూ తమిళనాడు) రజతాన్ని అందుకున్నాడు. సాయంత్(కేరళ) తృతీయ స్థానంలో నిలిచి కాంస్యాన్నందుకున్నాడు. వుమెన్లో వర్షిణి విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా అమిజిధాని(వీరిద్దరూ తమిళనాడు) ద్వితీయ స్థానంలో నిలిచి రజతాన్ని అందుకుంది. ఆర్.వి.రమ్యశ్రీ(ఆంధ్రప్రదేశ్) తృతీయ స్థానంలో నిలిచి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. 15–18 ఏళ్ల బాలుర విభాగంలో గురుహర్షన్(తమిళనాడు), వష్ణావ్ లీమిన్(కేరళ), ఆరవ్ శ్రీజిత్(తమిళనాడు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలవగా.. బాలిక విభాగంలో శృతి(తమిళనాడు), అక్షర(తమిళనాడు), ఎం.ఐశ్వర్య(ఆంధ్రప్రదేశ్) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. లాంఛనంగా స్కేటింగ్ పోటీలు ప్రారంభం జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ను మంగళవారం వీఎంఆర్డీఏ పార్క్లో లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ హారేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, శాప్ చైర్మన్ రవినాయుడు, ప్రభుత్వ విప్ పివిజిఆర్ నాయుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్కేటింగ్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్కేటర్ ఆనంద్కుమార్ను సత్కరించి నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. -
విద్యుత్ మోటార్ల వైర్లు చోరీ
● పోలీసులకు రైతుల ఫిర్యాదుఎటపాక: రైతుల వ్యవసాయ విద్యుత్ మోటార్ల వైర్లు చోరీకి గురయ్యాయి. సోమవారం రాత్రి గౌరిదేవిపేట నుంచి తోటపల్లి వరకు గోదావరి పరీవాహకంలోని పది హెచ్పీ వ్యవసాయ విద్యుత్ మోటార్ల త్రీకోర్ కాపర్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించి పట్టుకుపోయారు. రాత్రి సమయంలో గోదావరి నది తీరం వెంబడి ఉన్న మోటార్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారం రోజుల క్రితం నెల్లిపాక వద్ద ఏడు, చోడవరం వద్ద 3 వ్యవసాయ విద్యుత్ మోటార్ల త్రీకోర్ వైరు చోరీకి గురవడంతో బాదిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు, తాజాగా గౌరిదేవిపేట,గన్నవరం గ్రామాల మధ్య గోదావరి నదీ తీరం వెంబడి ఉన్న సుమారు 20 విద్యుత్ మోటార్ల కాపర్ వైర్లను దొంగలించారు. దీంతో రైతులు పొలాలకు సాగునీరు అందించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. త్రీకోర్ వైరు మీటరు ధర రూ. 150 ఉంది. దీనిని కొనుగోలు చేయడం రైతులకు భారంగా మారింది. దీంతో ఆందోళనకు గురవుతున్న రైతులు తమ మోటార్లను కూడా పట్టుకుపోతే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిఘా ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
రీసర్వే, మ్యుటేషన్ ప్రక్రియ వేగవంతం
వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు : రీ సర్వే, మ్యుటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ సూచించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్నుంచి ఆర్డీవోలు, అన్ని మండలాల సర్వే అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు, తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు సూచనలు చేశారు. డీ పట్టా భూమి, ఆర్వోఎఫ్ఆర్ , జిరాయితి భూమిలో సాగు చేసే ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందేలా చూడాలని ఆదేశించారు. రీ సర్వే సమయంలో ప్రభుత్వ, డి పట్టా భూములను పూర్తిగా పరిశీలించాలన్నారు. వెబ్ల్యాండ్ సబ్ డివిజన్ చేయాలని వాటిపై తిరిగి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. ఒకటి రెండు సార్లు పరిశీలించిన తరువాత మాత్రమే పట్టాలు జారీ చేయాలన్నారు. పీజీఆర్ఎస్కు వచ్చిన వినతులను త్వరితిగతిన పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ ఉత్తరు్ువ్ల ఈఆఫీస్ ద్వారా డాక్యుమెంట్ అప్లోడ్ డిజిటల్ ప్రక్రియను వేగవంతం చేసి ఆప్లికేషన్లను క్లియర్ చేయాలన్నారు. నాలా పన్నులు వసూలు (వాటర్ టాక్స్) ప్రక్రియ కూడా వేగవంతం చేయాలన్నారు. తహసీల్దార్లు పనుల వసూళ్లను వెంటనే ప్రారంభించాలన్నారు. ఓటర్ల జాబితా మ్యాపింగ్ కానీ నియోజకవర్గాల్లో బీఎల్వోలు, సూపర్వైజర్లు త్వరగా పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే అందుకు తగిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు స్మరణ్రాజ్, శుభం నొఖ్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇంచార్జీ డీఆర్వో అంబేడ్కర్, ఇంచార్జీ ఆర్డీవో లోకేశ్వరరావు పాల్గొన్నారు. -
14న నేవీ మారథాన్
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ హరేందిర ప్రసాద్, చిత్రంలో నేవీ అధికారులు మహారాణిపేట: నేవీ డే వేడుకల్లో భాగంగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన 10వ ఎడిషన్ వైజాగ్ నేవీ మారథాన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారథాన్లో 17 దేశాల నుంచి 17,500 మంది ఔత్సాహికులు భాగస్వామ్యం కానున్నారని, ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. వెయ్యి మంది సిబ్బంది, రెండు వేల మంది వాలంటీర్లు సేవల్లో నిమగ్నమవుతారన్నారు. 42 కి.మీ, 21 కి.మీ, 10 కి.మీ, 5 కి.మీ విభాగాల్లో పోటీలు జరగనున్నాయని తెలిపారు. జిల్లా, నేవీ అధికారులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో కెప్టెన్లు టీఆర్ఎస్ కుమార్, వినోత్ తివారీ, కమాండర్ కిశోర్, లెఫ్టినెంట్ కమాండర్లు పి.మెహంత్ నాయుడు, నరేశ్, ఏడీసీ రమణమూర్తి, ఈపీడీసీఎల్ ఎస్ఈ శ్యాంబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నిర్వాసితుల డేటా తయారు చేయండి
కూనవరం: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముంపు నిర్వాసితులకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెం గ్రామంలో పునరావాసం కోరుకున్న నిర్వాసితుల డేటాను తయారు చేయాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ ఆదేశించారు. స్థానిక పోలీస్స్టేషన్ గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన ఆర్అండ్ఆర్ గ్రామసభలో ఆయన మాట్లాడారు. కూనవరంలో 798 మంది నిర్వాసితులు తాడ్వాయిలో పునరావాసం కోరుకున్నారని తెలిపారు. వీరికి స్థలసేకరణలో ఎలాంటి అభ్యంతరాలు లేనందున వారి నుంచి గృహ నిర్మాణానికి సంబంధించిన డేటా సిద్ధం చేయాలని తహసీల్దార్ ధర్మేంద్రను ఆదేశించారు. ఆప్షన్లు వారీగా నిర్వాసితుల జాబితా తయారు చేయాలని సూచించారు. టేకులబోరు ఎస్సీ కాలనీకి చెందిన కొందరు తాడ్వాయిలో స్థలం లేదు వేరోచోట కావాలని కోరడంతో వారికి 5,6 నంబర్లతో ఎల్లో బ్లాక్లో స్థలసేకరణ జరిగిందన్నారు. అయినా మరోమారు ఆస్థలం చూసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. ఆస్థలంపై అభిప్రాయం తెలియజేయాలన్నారు. తాడ్వాయిలో స్థలాల ఎంపిక, వాటికి సంబంధించిన డేటా ప్రక్రియ అంతా పూర్తి చేసిన తరువాత మిగిలిన నిర్వాసితుల విషయంపై దృష్టి సారించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంవీఎస్ఎస్ జగన్నాథరావు, ఎస్ఐ లతశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన సేవలు అందించాలి
రంపచోడవరం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులకు సత్వర వైద్య సేవలు అందించి, ఉచితంగా మందులు అందజేయాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్రాజ్ ఆదేశించారు. మారేడుమిల్లి మండలం బోదులూరు పీహెచ్సీని మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీలో వైద్యులు ,సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి పంపించాలన్నారు. బోదులూరు పీహెచ్సీలో పరిధిలో గర్భిణులు, బాలింతల వివరాలు తెలుసుకున్నారు. మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం మద్దులూరు గ్రామంలోని వెదురు ప్లాంటేషన్ను పీవో పరిశీలించారు. ప్లాంటేషన్కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. -
డిజిటల్ గ్రంథాలయాలకు ప్రతిపాదనలు
● ఉమ్మడి విశాఖ గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్రాజు డుంబ్రిగుడ గ్రంథాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న కార్యదర్శి కుమార్రాజు డుంబ్రిగుడ: స్థానిక శాఖ గ్రంథాలయాన్ని మంగళవారం ఉమ్మడి విశాఖ గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్రాజు సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పూర్తిస్థాయిలో భవనాలు ఉన్న గ్రంథాలయాలను డిజిటల్ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు అందించామన్నారు. గిరిజన యువత గ్రంథాలయాలను సద్వినియోగంజ చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయన కోరారు. గ్రంథాలయ అసోసియేషన్ యూనియన్ ప్రతినిధులు ఆనందరావు, రమణ, గ్రంథాలయాధికారి సునీత, సిబ్బంది కె. సుబ్బారావు పాల్గొన్నారు. -
పచ్చ నేతల కన్ను
గలగల పారే సెలయేటి సవ్వడులతో చల్లని ఆహ్లాదకరమైన నదీ పరీవాహక ప్రాంత గ్రామం అది. ఒకపక్క పచ్చని పొలాలతో కళకళలాడుతూ.. మరోపక్క సుద్ద కొండ ఒడిలో ఒదిగి ఉన్న అందమైన గ్రామం. పెద్దలంతా వ్యవసాయం చేస్తూ చెరకు, వరి, ఇతర ఆహారధాన్యాలు పండిస్తూ ప్రజలకు తిండిగింజలు అందిస్తుంటే.. ఇక్కడ యువత దేశ రక్షణ విభాగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ వంటి త్రివిధ దళాల్లో ఉద్యోగం చేస్తూ దేశరక్షణలో సైనికులుగా పనిచేస్తున్నారు. అలాంటి పచ్చని బెన్నవోలు గ్రామంపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. ఈ గ్రామాన్ని ఆనుకొని విలువైన సుద్దకొండ ఉండడమే ఇందుకు కారణం. పచ్చని పల్లైపెబెన్నవోలు సుద్దకొండకాలుష్యం కబళిస్తోంది సుద్ద కొండను క్వారీ చేసి తవ్వుకొని పోయేందుకు ప్రభుత్వం లీజు ఉత్తర్వులు ఇవ్వడాన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. దీని వల్ల గ్రామంలో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయి. తవ్విన కొండమట్టి అంతా మా ఊరుపైకి, పొలాల్లోకి వచ్చి మేటలు వేస్తుంది. పంటలు నాశనమై కరువు నెలకొంటుంది. – కంచిపాటి రమేష్, రైతు, బెన్నవోలు చోడవరం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నదులు, కొండలు, ఇసుక, రాయి, చెట్టు చేమ ఏదీ వదలకుండా యథేచ్ఛగా దోపిడీ జరుగుతోంది. తాజాగా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి ఆనుకొని ఉన్న సుద్దకొండపై గ్రానైట్ మాఫియా కన్ను పడింది. దీనికి స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సిరామిక్స్ తయారీ (ఫ్లోరింగ్ టైల్స్)లో ప్రధాన ముడిసరుకుగా వాడే సుద్ద గనుల కొండ ఇక్కడ ఉంది. ఇక్కడి సుద్దకొండను తవ్వేసుకొని లక్షలాది టన్నులు తరలించుకుపోయేందుకు స్కెచ్ వేశారు. ఈ సుద్దను తవ్వుకొని, అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించాలనే వారి ఆలోచన బెన్నవోలు గ్రామానికి ముప్పు తెచ్చేలా మారింది. వ్యవసాయంతో పచ్చని పొలాల మధ్య పెద్దేరు నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం ఇప్పుడు కొండమట్టి, బుగ్గిలో కాలుష్యం కోరల్లో మగ్గిపోయేలా ఉంది. ఈ గ్రామంలో సుమారు 20 కుటుంబాలు ఈ సుద్దకొండలో బండను చేత్తో తవ్వుకొని దానిని ముగ్గుపిండిగా తయారు చేసి గ్రామాల్లో తిరిగి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనేక శతాబ్దాలుగా ఇదే వారికి జీవనాధారం. ఇప్పుడు ఈ సుద్దకొండను గ్రానైట్ మాఫియా యంత్రాలతో తవ్వుకుపోతే ఈ కుటుంబాలకు పూర్తిగా జీవనాధారం పోయి వారంతా రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. దీంతో గ్రామమంతా ఇప్పుడు ఈ సుద్ద తవ్వకాలకు అనుమతులు ఇవ్వవద్దంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. అడ్డగోలుగా అనుమతులు బెన్నవోలు సుద్దకొండను ప్రస్తుతానికి 17 హెక్టార్ల మేర తవ్వకాలు జరిపేందుకు అనుమతి ఇస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష్మీనర్సింహ మెటల్స్, శాండ్ ఇండస్ట్రీ ప్రైవేటు లిమిటెడ్ అనే గ్రానైట్ సంస్థకు ఈ సుద్ద కొండను తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. సుద్దకొండ పై భాగాన ఉన్న గ్రావెల్ మట్టిని 4 లక్షల 60 వేల మెట్రిక్ టన్నులు తొలగించి, దాని కింద ఉన్న తెల్ల సుద్దను 3 లక్షల 60 లక్షల మెట్రిక్ తవ్వుకోవడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పైన తవ్విన గ్రావెల్ మట్టిని ఊరికి ఆనుకొని ఉన్న అదే కొండ భాగాన వేసేందుకు నిర్ణయించారు. ఈ విధంగా తవ్వకాలు చేస్తే గ్రావెల్ మట్టి భారీ వర్షాలకు కొట్టుకు వచ్చి ఊరిలో ఇళ్లపైకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మిషనరీతో తొలగించిన తెల్లసుద్ద వేస్ట్ అంతా కొండ గెడ్డల ద్వారా దిగువన ఉన్న పంట పొలాల్లోకి వెళ్లి మేటలు వేస్తే పూర్తిగా పంటభూములు పాడయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ తవ్వకాల వల్ల పచ్చని వాతావరణంతో ఉన్న ఈ గ్రామమంతా దుమ్ము ధూళితో కాలుష్యమైపోయి ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. గ్రామానికి ఆనుకొని ఈ కొండ ఉండటం వల్ల గాలి, నీరు కూడా కలుషితమైపోతుందంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలో ప్రజలు ముక్తకంఠంతో చెప్పారు. అయినా సుద్దకొండ తవ్వకాలు జరిపేందుకు మాత్రం చాపకింద నీరులా అధికారిక పనులన్నీ జరిగిపోతున్నట్టు తెలిసింది. అధికార పార్టీ పెద్ద నాయకుల అండదండలతో టెండరు దక్కించుకున్న క్వారీ సంస్థ రాజకీయ బలంతో ఈ సుద్దకొండను తవ్వి పట్టుకుపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుపోతోంది. ఇదే గాని జరిగితే బెన్నవోలు గ్రామంలో ప్రజలు తిరుగుబాటు చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు. అందమైన కొండను తవ్వేసి ...ప్రజల నెత్తిన బుగ్గి పోసే యత్నం బెన్నవోలు సుద్దకొండకు తూట్లు పొడిచేందుకు పన్నాగం అధికార పార్టీ నాయకుల అండతో తవ్వకాలకు టెండర్ తమ బతుకులు బుగ్గిపాలు చేయవద్దంటున్న బెన్నవోలు గ్రామస్తులు ప్రజాభిప్రాయాన్ని పక్కనపెట్టి గ్రీన్సిగ్నల్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం -
ఆధునిక యాజమాన్య పద్ధతులతో మేలైన దిగుబడులు
సబ్బవరం: రైతులు ఆధునిక వ్యవసాయ యాజమాన్య పద్ధతులను ఆచరించడం ద్వారా ఆశించినంత దిగుబడులను సాధించవచ్చని అనకాపల్లి జిల్లా వ్యవసాయ అఽధికారి ఎం.ఆశాదేవి తెలిపారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మండలంలోని అమృతపురం గ్రామంలో మంగళవారం పంట పొలాలను సందర్శించి, రైతులతో చర్చించారు. ఈ రబీ సీజన్లో అవసరమయ్యే విత్తనాలను రైతు సేవా కేంద్రాల ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి రైతు నుంచి ధాన్యం సేకరిస్తామన్నారు. సంబంధిత రైతులకు రావాల్సిన సొమ్మును 24 గంటల్లో చెల్లించనున్నట్లు వెల్లడించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సంబంధించిన ఫిర్యాదులుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌరి, ఎంపీటీసీ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ, గ్రామ పెద్దలు బైలపూడి రామారావు, ఏఈవో బాలరాజు, వీహెచ్ఏ భావన, వీఏఏలు రేణుక, అలేఖ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. -
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు
సహస్రనామార్చన నిర్వహిస్తున్న అర్చకుడు సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం సహస్రనామార్చన జరిపారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 1001 నామాలను పఠిస్తూ స్వామికి తులసితో అర్చన చేశారు. విశేష హారతులు అందించారు. వైభవంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. -
13న ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశం
మద్దిలపాలెం(విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాల యం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం(వేవ్స్ 2025) ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు సంఘం చైర్మన్ కె.వి.వి రావు తెలిపారు. మంగళవారం ఏయూ అలుమ్ని జీఎంఆర్ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహిళా సాధికారత థీంతో వేవ్స్ 2025 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపీ, మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్ సుధామూర్తి హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుందని, అలుమ్ని వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జీఎంఆర్ కూడా పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్తో కలిసి వేవ్స్ పోస్టర్ను ఆవిష్కరించారు. సంఘ ఉపాధ్యక్షుడు డాక్టర్ కె.కుమార్ రాజ, జనరల్ సెక్రటరీ ఆకుల చంద్రశేఖర్, ఈసీ సభ్యులు పాల్గొన్నారు. -
ఖర్చు చెప్పడం లేదు
పర్యాటకం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని నిబంధనల ప్రకారం పంచాయతీలోని గ్రామాల అభివృద్ధికి కేటాయించాలి. రోడ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి. వచ్చిన ఆదాయానికి జవాబుదారీతనం లేదు. అటవీ అధికారులు ఇష్టరాజ్యంగా వాటిని ఖర్చు చేస్తున్నారు. గుడిసెకు వెళ్లే పర్యాటకుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. వచ్చిన ఆదాయంపై అడిట్ జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏ వేదికపైనగాని, సమావేశాల్లోగాని, ప్రజాప్రతినిధులకు గాని వచ్చిన ఆదాయం, ఖర్చు చెప్పకపోవడంపై అనుమానాలు ఉన్నాయి. – గొర్లె బాలాజీబాబు, జెడ్పీటీసీ, మారేడుమిల్లి ఆరోపణలు అవాస్తవం గుడిసె పర్యాటకంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. గుడిసె,గుంపెన గండి గ్రామాలకు ఇప్పటికే టెంట్ సామాన్ల కిట్లు పంపిణీ చేశాం. ఆయా గ్రామాలకు చెందిన పది మంది గిరిజన యువకులకు కమ్యూనిటి బేస్డ్ ఎకో టూరిజంలో భాగంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాం. నూతనంగా పాములేరు సమీపన పార్క్ను ఏర్పాటు చేస్తున్నాం. ఏటా అడిట్లు సక్రమంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు జిల్లా అధికారులు వద్ద తీసుకోవాలి. –అజాద్, అటవీ శాఖ రేంజ్ అధికారి, మారేడుమిల్లి -
ఎకో ఆదాయం.. ఇష్టారాజ్యం
రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లి ఏజెన్సీలో పర్యాటకంగా అటవీశాఖకు భారీగా ఆదాయం సమకూరుతున్నా తమ గ్రామాలకు ఎటువంటి మేలు జరగడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. పర్యాటకుల నుంచి వచ్చిన ఆదాయంలో నిబంధనల ప్రకారం కొంత గిరిజన గ్రామాల అభివృద్ధికి ఖర్చుచేస్తామని అటవీశాఖ చెప్పినప్పటికీ అందులో వాస్తవం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తూ కాకిలెక్కలు చెబుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రంపచోడవరం: అటవీశాఖ మారేడుమిల్లి కేంద్రంగా కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం (సీబీఈటీ) నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా మారేడుమిల్లి, వాలమూరులో కాటేజీలు నిర్వహిస్తోంది. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ఆన్లైన్లో వీటిని బుక్ చేసుకోవచ్చు. వీటి నిర్వహణ బాధ్యతలను సీబీఈటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ●గుడిసె టూరిజంను అటవీశాఖ నిర్వహిస్తోంది. ఆకుమామిడి కోట వద్ద పుల్లంగి రోడ్డులో చెక్పోస్టు ఏర్పాటుచేసి గుడిసెకు వెళ్లే పర్యాటకుల వాహనాల నుంచి టికెట్ రూపంలో వసూలు చేస్తోంది. ఈ మొత్తంలో కొంత భాగం గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఈ నిధులు పథకం ప్రకారం అటవీశాఖ అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ●అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుడిసె పర్యాటకాన్ని మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీ పరిధిలోని పాములమామిడి, గుడిసె, చెలకవీధి గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు పీసా గ్రామసభలో ఎంపీటీసీ సభ్యురాలు బున్నమ్మ, అందాల మంగిరెడ్డి, సాదల సోమిరెడ్డి, మాజీ సర్పంచ్లు పీసా కమిటీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు రవీంద్రరెడ్డి, లింగారెడ్డి,రత్నారెడ్డి, సాదల కొమ్మిరెడ్డి, సీబీటీ సభ్యుడు కోండ్ల చిన్నారెడ్డి, గిరిజనులు ఏకగ్రీవంగా తీర్మానించారు. గుడిసె పర్యాటక ప్రాంతం పేరు చెప్పి రూ.లక్షలు అటవీశాఖ దండుకుంటోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. అధికారుల ఒప్పందం ప్రకారం వాటర్ ట్యాంకు, రోడ్లు, గ్రామాల అభివృద్ధి పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఐటీడీఏ కూడా గ్రామంలో పాఠశాల భవనం ఏర్పాటు చేయలేకపోయిందని విమర్శించారు. ●అటవీశాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ఏర్పాటు చేసి సుమారు 17 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి సీబీఈటీకి వచ్చిన ఆదాయానికి సంబంధించి ఎటువంటి అడిట్ నిర్వహించలేదన్న విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఏటా అడిట్ నిర్వహించి వచ్చిన ఆదాయంలో సీబీఈటీ సభ్యులకు ఇచ్చిన మొత్తం, జలతరంగణి, అమృతధార, కాటేజీల నిర్వహణకు ఖర్చు చేసిన వివరాలు వెల్లడించాల్సి ఉంది. కానీ ఏళ్ల తరబడి ఆడిట్ జరగలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని వారు ఆరోపిస్తున్నారు. ●గుడిసె పర్యాటక ప్రాంతానికి ఏటా వేల సంఖ్యలో పర్యాటకుల వస్తున్నారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన చెక్ పోస్టు ద్వారా ఒకరికి రూ.100, ద్విచక్ర వాహనానికి రూ. 100, నాలుగు చక్రాల వాహనానికి రూ. 300 వసూలు చేస్తున్నారు. ఈ మాదిరిగానే జలతరంగని, అమృతధార సందర్శనకు వచ్చే పర్యాటకుల నుంచి టికెట్ రూపంలో వసూలు చేస్తున్నారు. వీటితోపాటు అలాగే కాటేజీల ద్వారా ఆదాయం వస్తోంది. ఇందుకు సంబంధించి అటవీ అధికారులు అడిట్ నిర్వహించక పోవడం, వచ్చిన ఆదాయంతో కొంత భాగాన్ని గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. -
టీబీ రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలి
ముంచంగిపుట్టు: టీబీ రోగులను గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి జిల్లా కుష్టు, ఎయిడ్స్,టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ కిరణ్కుమార్ ఆదేశించారు. స్థానిక సీహెచ్సీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. టీబీ ల్యాబ్ రికార్డులను, కఫం పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో పరిశీలించారు. అనంతరం లబ్బూరు పీహెచ్సీని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నమోదవుతున్న కేసులు,అందిస్తున్న వైద్యం వివరాలు తెలుసుకున్నారు. వైద్యాధికారి ప్రసాద్తో మాట్లాడి మందుల వివరాలు, ప్రసవాల గురించి తెలుసుకున్నారు. టీబీ రోగులను మెరుగైన వైద్య సేవలు అందించాలని, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. అనంతరం వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి గ్రామస్థాయిలో టీబీ రోగులను గుర్తించడం, వైద్య అందించడం, మందుల వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పలు గ్రామాల్లో టీబీ రోగుల ఇళ్లకు వెళ్లి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి సంజీవ్పాత్రుడు,హెల్త్ విజిటర్ కాసులమ్మ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉద్యోగులు రామచందర్, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలల తనిఖీ
బందపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి రంపచోడవరం: మండలంలోని వివిధ ఆశ్రమ పాఠశాలలను ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రంపచోడవరంలోని కస్తూరిభాగాంధీ విద్యాలయం, గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, బందపల్లి బాలుర పాఠశాలను ఆయన మంగళవారం పరిశీలించారు. దీనిలో భాగంగా బాలిక వసతి గృహంలో మరుగుదొడ్లు పరిశుభ్రత, నీటి సమస్యను గమనించారు. తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చేపట్టేలా గిరిజన సంక్షేమశాఖ కమిషనర్కు సూచనలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. -
నిశీధి వేళ..నిర్భయంగా..
గోదావరి నదిలోకి ఎటపాక సమీపంలో ఏర్పాటుచేసిన రహదారి గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు జరిపిన ప్రాంతం ఎటపాక: గోదావరి నదిలో అర్ధరాత్రి వేళ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఎటపాక ప్రాంతం నుంచి భారీగా తరలిపోతున్నా అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు కానరావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా రెవెన్యూ, పోలీసుశాఖలు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని ఎటపాక, చింతలగూడెం, గుండాల, గోగుబాక గ్రామాల సమీపంలోని గోదావరి నుంచి ఇసుక తరలించేందుకు అక్రమార్కులు మార్గాలు ఏర్పాటుచేశారు. చీకటిపడిన వెంటనే తవ్వకాలు మొదలు పెడుతున్నారు. ఈ తతంగం తెల్లవార్లు జరుగుతోంది. గోదావరిలో నీరు తగ్గడంతో ఇసుక తవ్వకాలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడికి సమీపంలోని తెలంగాణకు చెందిన భద్రాచలం పట్టణంలో ఇసుక కొరత అక్రమార్కులు కాసులు కురిపిస్తోంది. గోదావరి నుంచి తీసుకువెళ్తున్న ఇసుకను సరిహద్దులో నిల్వచేస్తున్నారు. అక్కడి నుంచి భద్రాచలం తరలిస్తున్నారు. లోడు రూ.4 వేలకు అమ్ముతున్నారు. చింతలగూడెం, కన్నాయిగూడెం, ఎటపాక, రాజుపేట, పురుషోత్తపట్నం, గుండాల, గోగుబాక గ్రామాల్లోని కొన్ని ట్రాక్టర్లను ఇందుకు వినియోగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై తహసీల్దార్ శ్రీనివాసరావును వివరణ కోరగా గోదావరి నది ఇసుక తరలిస్తున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. చలి కారణంగా రాత్రివేళల్లో అక్కడికి వెళ్లలేకపోతున్నారన్నారు. తవ్వకాలపై పరిశీలించిన తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వివరణ ఇచ్చారు. -
కొత్తగా లక్ష ఎకరాల్లో కాఫీ సాగు
చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదేళ్లలో కొత్తగా లక్ష ఎకరాల్లో రూ.222 కోట్ల వ్యయంతో కాఫీ తోటల విస్తరణకు భారీ ప్రణాళిక అమలు చేయనున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ఎం.ఎం.నాయక్ తెలిపారు. మంగళవారం ఆయన మండలంలో పర్యటించారు. ముందుగా తాజంగిలో నిర్మాణ దశలో ఉన్న గిరిజన స్వాతంత్ర సమరయోథుల మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించారు. బిర్సాముండా జయంతి నాటికే మ్యూజియం పనులు పూర్తిచేయాలని భావించామన్నారు. వివిధ కారణాల వల్ల నిర్మాణాల్లో జాప్యం జరిగిందన్నారు. జనవరి 15 నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చింతపల్లి వచ్చిన ఆయన ఐటీడీఏ ఆధ్వర్యంలో మాక్స్ నిర్వహిస్తున్న కాఫీ పల్పింగ్ యూనిట్ను పరిశీలించారు. ఈఏడాది 1,600 మెట్రిక్ టన్నుల కాఫీ పండ్ల సేకరణ లక్ష్యం పూర్తిచేయాలని భావిస్తున్నట్టు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ వివరించారు.ఈ ఏడాది కిలో కాఫీ పండ్ల ధర మేలు రకం కిలో రూ.70 రెండో రకం రూ.60గా ఐటీడీఏ పెంచినట్టు పీవో తెలిపారు.ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రారంభించి అసంపూర్తిగా ఆగిపోయిన జి.మాడుగుల, గూడెంకొత్తవీధి పల్పింగ్కేంద్రాల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమెను నాయక్ ఆదేశించారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ వసంత, టీసీఆర్, టీఎం ఈడీ మందరాణి, గిరిజన సంక్షేమశాఖ ఏపీఓ వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ బొంజుబాబు, ఈఈ డేవిడ్రాజు, డీఈఈ రఘునంథనరావునాయుడు, జేఈ యాదకిశోర్ మ్యాక్స్ అధ్యక్షుడు సింహాచలం, కోశాధికారి గోవిందు, ఏఈవో ధర్మారాయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమ స్ఫూర్తితో కోటి సంతకాల సేకరణ
అరకులోయ టౌన్: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మంగళవారం తన క్యాంప్ కార్యలయంలో నియోజకవర్గంలోని పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదలకు మెరుగైన వైద్యం పేద విద్యార్థులకు వైద్య విధ్య అందించాలన్న సంకల్పంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటిని ప్రయివేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారన్నారు. గడిచిన నెల రోజులపాటు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు రచ్చబండ నిర్వహించి కోటి సంతకాల సేకరణను దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు. వీటిని ఈనెల 10వ తేదీ బుధవారం భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కేంద్రానికి తరలించి పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్యరాస విశ్వేశ్వరరాజుకు అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కూటమి ప్రభుత్వ అనాలోచిత కారణాల వల్ల పేదలకు మెరుగైన వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు. ప్రభుత్వమే వైద్య కళాశాలలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య కళాశాలలు పూర్తయి, తరగతులు నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందని చంద్రబాబు అండ్కో కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు. జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, యువజన నాయకుడు రేగం చాణక్య, ఉమ్మడి విశాఖ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, ఎంపీటీసీలు దురియా ఆనంద్కుమార్, స్వాభి రామచందర్, కూడ పాపారావు, ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరశింహా మూర్తి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిముడు హరి, సర్పంచ్లు పెట్టెలి సుస్మిత, మాదల బుటికి, పార్టీ మండల అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి అనిల్, ఉపాద్యాక్షులు పల్టాసింగ్ విజయ్ కుమార్, ప్రకాష్రావు, బూత్ కమిటీ ఇన్చార్జి పాంగి విజయ్కుమార్, వార్డు సభ్యుడు శివ, పార్టీ నాయకులు కొర్రా అర్జున్, కిరణ్కుమార్, నాగేశ్వరరావు, శంకర్, మోహన్, ప్రసాద్ పాల్గొన్నారు. -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
అరకులోయటౌన్: మండలంలోని చినలబుడు పంచాయతీ గొందివలస గ్రామంలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం ద్వారా అర్థసూత్ర సంబాద్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాంది ఫౌండేషన్ ప్రతినిధి ఆర్.వెంకటరావు మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో ఆర్థిక సాధికారతకు దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఆర్బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా బ్యాంకింగ్ సౌకర్యాలు తక్కువగా ఉన్న మారుమూల గ్రామాల్లో ఆర్ధిక చేరువను పెంపొందించడమే లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ఆర్థిక మోసాలపై అవగాహన పెంచి, డబ్బు నిర్వహణలో మంచి పద్ధతుల గురించి ప్రజలకు మార్గనిర్ధేశం చేస్తున్నామన్నారు. డిప్యూటి తహసీల్దార్ పంచాడి గోవింద్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన లేకపోవడంతో మోసాలబారిన పడే అవకాశాలుంటాయన్నారు. పొదుపు, బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ ఉపేంద్ర, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలలో తనిఖీలు
అడ్డతీగల: అడ్డతీగలలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ఎంపీడీవో ఎ.వి.వి.కుమార్ సోమవారం సందర్శించారు. 420 మంది విద్యార్థినులున్న పాఠశాలలో స్టాక్ రిజిష్టర్ పరిశీలించగా 6,185 కిలోల బియ్యం నిల్వ ఉన్నాయన్నారు. స్టాక్ రిజిష్టర్ ప్రకారం కందిపప్పు 32 కిలోల 500 గ్రాములు ఉండాలన్నారు.కానీ 30 కిలోల 180 గ్రాములు ఉందన్నారు. ఆయిల్ 40 ప్యాకెట్లకుగాను 36 ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయన్నారు.చింతపండు, బెల్లం నిల్వలు లేవన్నారు. పాలుకు సంబంధించి ఈనెల 1 నుంచి సోమవారం వరకూ నమోదు చేయలేదన్నారు.46 మరుగుదొడ్లు ఉండగా కేవలం 10 మరుగుదొడ్లు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు.స్నానాల గదులు 34 మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ఏడుగురు వర్క ర్లకు ఐదు మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు.పరిశీలనలో గమనించిన అంశాలను నివేధిక రూపంలో ఉన్నతాధికారులకు పంపించామన్నారు.


