breaking news
Alluri Sitarama Raju District News
-
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి
● పీవో తిరుమణి శ్రీపూజను కోరిన ఎమ్మెల్యే మత్స్యలింగం ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజతో మాట్లాడుతున్న అరకు ఎమ్మెల్యే మత్య్సలింగం పాడేరు : జిల్లాలోని అరకు నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారిలో సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం కోరారు. మంగళవారం ఆయన ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావును వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. అరకు నియోజకవర్గం మీదుగా వెళ్లే 516–ఈ మార్గంలో కొత్తభల్లుగూడ నుంచి హుకుంపేట మండలం పాటిమామిడి వరకు అనేక భద్రత సమస్యలు ఉన్నాయన్నారు. సరైన అప్రోచ్ రోడ్లు, కల్వర్టులు, వీధి ధీపాలు, హెచ్చరిక బోర్డులు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎన్హెచ్–516ఈ అధికారులతో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశాల జారీ చేస్తామని ఈ సందర్భంగా పీవో హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. -
పాత బంధుత్వాలు..
కొత్త బంధాలు.. ● జోరా అంటూ ఆప్యాయంగా పలకరింపు ● ఆత్మీయతల వేదికగా తారుమారు సంత ● రూ. 2 కోట్ల వ్యాపారం.. వేల సంఖ్యలో జనం ● జి.మాడుగులలో కిక్కిరిసిన రోడ్లు జి.మాడుగుల: ‘నేస్తం జోరా.. బాగున్నావా!‘ అంటూ ఆత్మీయ పలకరింపులు.. కొత్త దుస్తుల ముచ్చట్లు.. ఇప్పసార, జీలుగు కల్లు విందులు.. వెరసి జి.మాడుగుల మండల కేంద్రం ఆదివాసీల అనుబంధాల వేదికగా మారింది. జి.మాడుగుల సమీపంలోని వెంకటరాజు ఘాట్ వద్ద మంగళవారం జరిగిన సంప్రదాయ ’తారుమారు సంత’ (పండుగ సంత) గిరిజన సంస్కృతికి అద్దం పట్టింది. రూ. 2 కోట్ల వ్యాపార లావాదేవీలు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఈ సంతను నిర్వహించారు. అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాల నుంచి భారీగా వ్యాపారులు తరలివచ్చారు. ●రాజ్మా, పసుపు, అల్లం, పిప్పలి, కొండచీపుర్లు వంటి అటవీ ఉత్పత్తులతో పాటు కోళ్లు, మేకల విక్రయాలు జోరుగా సాగాయి. ఉత్పత్తులను విక్రయించిన గిరిజనులు, ఆ సొమ్ముతో పండుగకు అవసరమైన నిత్యవసరాలు, కొత్త దుస్తులు కొనుగోలు చేశారు. ఈ ఒక్కరోజే సుమారు రూ. 2 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు అంచనా. బంధుత్వాల కలయిక ఈ సంత కేవలం వ్యాపారానికే పరిమితం కాలేదు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు, స్నేహితులు ఒకరినొకరు కలుసుకున్నారు. ముఖ్యంగా తమ పిల్లలను పరస్పరం పరిచయం చేసుకుంటూ కొత్త బంధుత్వాల గురించి చర్చించుకున్నారు. యువకులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ ఆహ్వానాలు పంపుకున్నారు. కిక్కిరిసిన రహదారులు తారుమారు సంతకు సుమారు 25 వేల నుంచి 30 వేల మంది తరలిరావడంతో జి.మాడుగుల వీధులన్నీ జనసంద్రమయ్యాయి. దేవుని గెడ్డ నుంచి నుర్మతి జంక్షన్ వరకు రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎస్ఐ సాయిరాం పడాల్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించారు. -
చిన్నశ్రీనును కలిసిన అనంతగిరి ఎంపీపీ మిథుల
చిన్నశ్రీనుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న అనంతగిరి ఎంపీపీ మిథుల, తదితరులు అనంతగిరి (అరకులోయ టౌన్): విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీనును అనంతగిరి ఎంపీపీ తడబారికి మిథుల మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల అనంతగిరి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను క్యాంప్ కార్యాలయంలో కలిసినట్టు ఆమె తెలిపారు. ఎంపీపీగా బాధ్యతలు చేపట్టడం సంతోషదాయకమని ఆయన శుభాకాంక్షలు తెలిపారని ఆమె పేర్కొన్నారు. గిరిజన ప్రజల కోసం, వైఎస్సార్సీపీ మరింత పటిష్టతకు అహర్నిశలు కృషి చేయాలని సూచించారని ఆమె తెలిపారు. ఆమె వెంట ఎంపీటీసీలు శోభ జయశ్రీ, కురిసెలా అరుణ, పార్టీ నాయకులు శోభ చిన్నారావు, తడబారికి జాన్బాబు ఉన్నారు. -
విశాఖ–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి నక్కపల్లి: జాతీయరహదారిపై ఒడ్డిమెట్ట సమీపంలో సోమవా రం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాలప్రకారం మండలంలో దేవవరం శివారు ఒడ్డిమెట్ట గ్రామానికి చెందిన పెట్ల గణపతి(52) దేవవరం నుంచి ఒడ్డిమెట్టకు నడిచి వెళ్తుండగా చినరామభద్రపురం, ఒడ్డిమెట్ట మధ్యలో నక్కపల్లినుంచి తునివైపు వెళ్తున్న వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గణపతి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం
● పీఆర్ ఏఈఈ మురళీకృష్ణ మజ్జిగూడ రహదారి పనుల్లో నాణ్యతను పరిశీలిస్తున్న పీఆర్ ఏఈఈ మురళీకృష్ణ ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాలకు నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పీఆర్ ఏఈఈ మురళీకృష్ణ అన్నారు. మండలంలోని ఏనుగురాయి పంచాయతీ మజ్జిగూడ గ్రామానికి నూతనంగా నిర్మిస్తున్న రహదారి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రహదారుల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా పనులు జరుగుతున్నాయని తెలిపారు. మజ్జిగూడ, దొమినిపుట్టు, కోడాపుట్టు గ్రామాలకు బీటీ రోడ్డు పనులు పూర్తి చేశామన్నారు. రహదారులు, వంతెనలు లేని గ్రామాలకు వాటిని నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆయన పేర్కొన్నారు. -
కోతి దాడిలో ఇద్దరు విద్యార్థినులకు గాయాలు
రావికమతం: మండల కేంద్రం రావికమతంలో కోతుల దాడులతో విద్యార్థులు వణికిపోతున్నారు. గత నెలలో ఒకసారి హాస్టల్ విద్యార్థులపై, మరో సారి ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులపై కోతులు దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం నవోదయ విద్యార్థినులపై కోతి దాడి చేయడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. మంగళవారం గెంజి వారి రామాలయా నికి సమీపంలో నవోదయ పాఠశాలలోకి కోతి ప్రవేశించి ఇద్దరు విద్యార్థినులపై దాడి చేసింది. ఈ దాడిలో రావికమతంకు చెందిన ఎస్.లోహిత, గు మ్మాళ్లపాడుకు చెందిన బుర్రకాయుల లీనా గాయపడ్టారు. వారిని పాఠశాల సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా చూడాలని నవోదయ స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ పట్నాయక్ కోరారు. -
జిల్లా పోలీస్ కార్యాలయానికి ఫార్మా కంపెనీల చేయూత
అనకాపల్లి: జిల్లాలోని మాన్కై ండ్, లుపిన్, వసుధ ఫార్మా కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధులతో జిల్లా పోలీస్ కార్యాలయానికి జనరేటర్, కంప్యూటర్ వస్తువులను కొనుగోలు చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనరేటర్ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ కార్యాలయంలోపాలనా పరమైన పనులు వేగవంతంగా, ఆటంకం లేకుండా సాగడానికి వీలుగా పరవాడలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. మాన్ కై ండ్ ఫార్మా సీఎస్ఆర్ నిధులతో భారీ జనరేటర్, లుపిన్, వసుధ ఫార్మా కంపెనీలు కంప్యూటర్లు, యూపీఎస్లు సమకూర్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, మాన్ కై ండ్ ఫార్మా ప్రతినిధులు రామలింగం, శ్రీనరేష్, లుపిన్ ఫార్మా ప్రతినిధులు గంగరాజు, వెంకట్, వసుధ ఫార్మా ప్రతినిధులు రామరాజు, హర్ష, ఎస్బీ డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, తమలంపూడి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, బాలసూర్యారావు, మల్లికార్జునరావు, రామకృష్ణారావు, మన్మథరావు, ఎస్ఐలు ప్రసాద్, రమణయ్య, సురేష్ బాబు, శిరీష, ఐటీ కోర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈ కంపెనీలకు సబ్సిడీ రుణాలు
అనకాపల్లి: ఎంఎస్ఎంఈ కంపెనీలకు ఆర్బీఐ ఆధ్వర్యంలో సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తామని ఆర్బీఐ జనరల్ మేనేజర్ రాజేష్కుమార్ మహానా తెలిపారు. స్థానిక మెయిన్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎంఎస్ఎంఈ కంపెనీ ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్బీఐ, బ్యాంకింగ్, ఆర్థిక సమావేశ పథకాలపై అవగాహన కల్పించారు. రుణ సదుపాయాలు ఎలా పొందాలో తెలియజేశారు. అనంతరం రాజేష్కుమార్ మహానాను జిల్లా లీడ్బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ జి.ఈశ్వర్, డీఐసీ అనకాపల్లి జనరల్ మేనేజర్ ఆర్.ప్రసాద్, ఏపీ గ్రామీణ బ్యాంక్ ప్రతినిధి సతీష్ చంద్ర, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. -
ఆంజనేయ వాహనంపై ఆపద్బాంధవుడు
నక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాక వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఆంజనేయవాహనం పై స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహించారు. ఉదయం మూలవిరాట్కు నిత్యార్చనలు,పూజలు పూర్తిచేశారు. కొండదిగువన ఉత్సవ మూర్తులకు విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం పూర్తిచేసిన తరువాత శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని ఆంజనేయవాహనంపై, గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఉంచి తిరువీధిసేవలు నిర్వహించారు.అనంతరం గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై 22వపాశురాన్ని విన్నపం చేశారు. తదుపరి ప్రసాద నివేదన, తీర్థగోష్టి ప్రసాదవినియోగం జరిగాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా రాత్రితిరువీధి సేవలు నిర్వహించారు.అధ్యాపక స్వామి ద్రవిడ వేద ప్రబంధ విన్నపం చేశారు. ఈ కార్యక్రమాల్లో అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్లో హైమావతి ప్రతిభ
అచ్యుతాపురం రూరల్ : అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లోలో నునపర్తి గ్రామా నికి చెందిన జూరెడ్డి హైమావతి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. బీహార్ రాష్ట్రం పాట్నాలో గత నెల 27 నుంచి 29 వరకూ బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన సౌత్ ఏషియన్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీల్లో భారతదేశం తరఫున హైమవతి పాల్గొని సత్తా చాటారు. ఈ సందర్భంగా ఆమెను విశాఖపట్నం జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి గొంప నర్సింహమూర్తి, నునపర్తి శ్రీరామ బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ చైర్మన్ ఆర్.వి.వి.నగేష్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
విద్యే వజ్రాయుధం
మధురవాడ/కొమ్మాది: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, గురుకులాల్లో గురువారం ఉదయం అందించే ఉప్మా స్థానంలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలిస్తామని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సి.హెచ్.విజయప్రతాపరెడ్డి వెల్లడించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మధురవాడ, మారికవలస, ఎండాడ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ డిపోలు, జిల్లా పరిషత్ హైస్కూల్, గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. భోజన నాణ్యత, వంటల తీరు, రకుల నిల్వలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. గురువారం ఉదయం పెట్టే ఉప్మా తినలేకపోతున్నామని మారికవలస గురుకుల విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఆయన, ఉప్మా బదులుగా విద్యార్థులకు ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టే యోచనలో ఉన్నట్లు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విద్య వజ్రాయుధం లాంటిదని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాకుండా నైపుణ్యాలు పెంచుకుంటే ప్రైవేట్ రంగంలోనూ అపార అవకాశాలు ఉంటాయన్నారు. విద్యార్థులు అవినీతి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చైర్మన్కు చిన్నారుల గ్రీటింగ్స్ ఎండాడ పాఠశాల సందర్శనలో విద్యార్థులు చైర్మన్కు ఘన స్వాగతం పలికారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఫుడ్ ఈజ్ గాడ్ అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డులను ఆయనకు అందజేశారు. వాటిని ఆయన సంతోషంగా స్వీకరించారు. ఫుడ్ కమిషన్ సభ్యుడు సూర్యకిరణ్, డీసీఎస్వో వి.భాస్కరరావు, సివిల్ సప్లై మేనేజర్ ఎం.శ్రీలత, డీఈవో ఎన్.ప్రేమకుమార్, ఐసీడీఎస్ పీడీ కేవీ రామలక్ష్మి, ఫుడ్ సేఫ్టీ అధికారి కల్యాణ్ చక్రవర్తి, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ డిప్యూటీ కంట్రోలర్ కె.టి.రవికుమార్, సోషల్ వెల్ఫేర్ డీడీ రామారావు, మధ్యాహ్న భోజనం పథకం కో–ఆర్డినేటర్ మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. మెనూ పాటించాల్సిందే.. పాఠశాలల్లో కచ్చితంగా మెనూ ప్రకారమే ఆహారం అందించాలని, పౌష్టికాహార సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదని ఫుడ్ కమిషన్ చైర్మన్ హెచ్చరించారు. ఎండాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పిల్లలు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. అలాగే రేషన్ డిపోల ద్వారా లబ్ధిదారులకు బియ్యం, పంచదార సక్రమంగా అందుతున్నాయా అని ఆరా తీశారు. సివిల్ సప్లై, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం, సోషల్ వెల్ఫేర్ వంటి విభాగాలు తమ కమిషన్ పరిధిలోకి వస్తాయని, ఎటువంటి సమస్యలున్నా తమను సంప్రదించవచ్చని తెలిపారు. -
ఎం.కె వల్లాపురంలో బంగారం, వెండి చోరీ
మాడుగుల: మండలంలో ఎం.కె. వల్లాపురంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో ప్రవేశించి ఐదు తులాలు బంగారం, 10 తులాల వెండి చోరీ చేశారు. ఎస్ఐ నారాయణరావు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు... గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మట్టా మహలక్ష్మి నాయుడు, భవన నిర్మాణపని చేస్తున్న ఆయన భార్య రాము తమ పనులపై బయటకు వెళ్లగా, ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని గమనించిన దొంగలు కిటికీలోంచి ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, 10 తులాల వెండి దొంగలించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తెలిసిన వారి అండతోనే దొంగతనం జరిగి ఉంటుందని ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
వెనిజువెలాపై అమెరికా దాడిని నిరసిస్తూ ఆందోళన
అనకాపల్లి: వెనిజువెలాపై అమెరికా దాడిని నిరసిస్తూ ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కో–ఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్(ఇస్కాఫ్) సభ్యులు ఆందోళన చేశారు. స్థానిక మెయిన్ రోడ్డులోని సీపీఐ కార్యాలయం వద్ద ఇస్కాఫ్ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించి, అనంతరం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఇస్కాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.మాధవరావు మాట్లాడుతూ అక్రమంగా అమెరికా జైలులో నిర్బంధించిన వెనిజువెలా అధ్యక్షుడు మధురోను, అతని భార్య సిలియా ఫ్లోరైస్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తూ, ఐక్యరాజ్య సమితి ప్రమేయం లేకుండా అమెరికా నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. భారత ప్రభుత్వం కూడా అమెరికా నియంతృత్వ పోకడలను ఖండించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇస్కాఫ్ నాయకులు దాడి శివరామ, బుద్ధ వీరు నాయుడు, బొడ్డేడ అప్పారావు, మొల్లి రమణబాబు, దొరబాబు, భద్రం, వెంకటేశ్వరరావు, మల్ల చక్రవర్తి, రామచంద్రరావు, బొండా సాయి, దక్షిణామూర్తి, రాజు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
వణికిస్తున్న శీతల గాలులు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్న మంచు, చలి ప్రభావం కొనసాగుతోంది. మన్యం వాసులు చలి తీవ్రతకు వణికిపోతున్నారు. మంగళవారం ముంచంగిపుట్టులో 8.0 డిగ్రీలు, పెదబయలులో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధి జి.మాడుగులలో 9.7, హుకుంపేటలో 11.1 డిగ్రీలు, పాడేరులో 11.5 డిగ్రీలు, అరకువ్యాలీలో 12.0 డిగ్రీలు, చింతపల్లిలో 13.5 డిగ్రీలు, అనంతగిరిలో 13.9 డిగ్రీలు, కొయ్యూరులో 14.1 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. ●పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధి మారేడుమిల్లిలో 11.3 డిగ్రీలు, వై.రామవరంలో 11.7 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 14.7డిగ్రీలు, అడ్డతీగలలో 15.8 డిగ్రీలు, రంపచోడవరంలో 16.4 డిగ్రీలు, చింతూరు డివిజన్చింతూరులో 15.2 డిగ్రీలు, ఎటపాకలో 16.5 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి శీతల గాలులు ప్రభావం ఎక్కువగా ఉంటోందని స్థానికులు తెలిపారు. ఉదయం 9 గంటలు దాటే వరకు భానుడు కనిపించడం లేదు. మంచు తెరలు రహదారులను కమ్మేయడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. -
యాదవుల ఐక్యతను చాటి చెబుదాం
● స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం దక్కేలా కృషి చేద్దాం ● యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడుబర్నికాన బాబూరావుదేవరాపల్లి: యాదవులకు నామినేటెడ్ పోస్టులతో పాటు త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో సైతం సముచిత స్థానం దక్కేలా ఐక్యంగా కృషి చేద్దామని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బర్నికాన బాబూరావు పిలుపునిచ్చారు. మండలంలోని రైవాడ ఎరకాలమ్మ ఆలయ ప్రాంగణంలో దేవరాపల్లి మండల యాదవ సంఘం ఆత్మీయ సమావేశం మండల అధ్యక్షుడు కోన ఈశ్వరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్యఅథితిగా హాజరైన యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బర్నికాన బాబూరావు మాట్లాడుతూ జిల్లాలోని యాదవులంతా ఐక్యంగా కలిసి పనిచేయడం ద్వారానే హక్కుల సాధన సాధ్యపడుతుందన్నారు. యాదవుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పిల్లల విద్యకు ఆర్థిక స్థోమత అవరోధమైతే సంఘం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. విద్యలో రాణించే యాదవ విద్యార్థులకు ఏటా రూ. 8 లక్షల విలువ చేసే స్కాలర్షిప్లు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. మాడుగుల నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షుడు మొల్లి సన్నిబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో 30వేలకు పైబడి యాదవ సామాజిక వర్గం ఓట్లు ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా ప్రాధన్యత దక్కలేదన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం లభించేలా యాదవుల ఐక్యతను చాటి చెబుదామని చెప్పారు. యాదవులను బీసీ–ఏలో చేర్చాలని డిమాండ్ చేశారు. త్వరలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి బాబూరావుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని తీర్మానిస్తామని పలువురు నాయకులు తెలిపారు. యాదవ సంఘం క్యాలెండర్ను జిల్లా అధ్యక్షుడు బర్నికాన బాబూరావు, నియోజకవర్గ అధ్యక్షుడు మొల్లి సన్నిబాబు తదితరుల చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కిల్లాన శ్రీనివాసరావు, కాణిపాకం వినాయక దేవస్థానం బోర్డు డైరెక్టర్ చల్లా కృష్ణవేణి నానాజీ, స్థానిక సర్పంచ్ చల్లా లక్ష్మీ నాయుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దాలిబోయిన రామగోవింద, డైరెక్టర్ బంధం అప్పలరాజు, నమ్మి బాలరాజు, కోన నాగేశ్వరరావు తదితర యాదవ సంఘం నాయుకులు పాల్గొన్నారు. -
పూర్వీకుల నుంచి సంత నిర్వహిస్తున్నాం
ప్రతీ సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పురస్కరించుకొని జి.మాడుగులలో తారుమారు సంతను మత్స్యరాస వంశీయులు అధ్వర్యంలో నిర్వహించటం అనవాయితీగా వస్తోంది. సంతకు వచ్చే వ్యాపారులు, గిరిజన ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశాం. బంధుమిత్రులతో కలిసి పండుగ ముచ్చట్లు పంచుకోవడం, సంక్రాంతికి ఒకరినొకరు ఆహ్వానించుకోవడం ఈ సంత ప్రత్యేకత. గిరిజన ఆచారాన్ని కొనసాగిస్తున్నాం. – మత్స్యరాస నాగరాజు, నిర్వహణ కమిటీ ప్రతినిధి, తారుమారు సంత, జి.మాడుగుల -
వసతి గృహంలో సమస్యల వెల్లువ
అచ్యుతాపురం రూరల్ : ఫుడ్ కమిషన్ చైర్మన్ చిట్టా విజయ్ ప్రతాప్రెడ్డి ఆకస్మిక పర్యటన అనంతరం మోసయ్యపేట బాలుర వసతి గృహంలో పలు సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులు అనే సమస్యలతో సతమతమవుతున్నారు. 3 నుంచి 10వ తరగతి వరకూ 180 మంది విద్యార్థులు ఈ హాస్టల్లో ఉంటూ స్థానిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. వారంలో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడం లేదు. హాస్టల్ చుట్టు పక్కల ఎక్కడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు. పౌష్టికాహారం అందక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఎవరైనా విద్యార్థులు హాస్టల్లో నాణ్యత లోపాలపై ప్రశ్నిస్తే వార్డెన్ కర్కశంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. హాస్టల్ వార్డెన్పై గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మరుగుదొడ్లు పరిశుభ్రం చేయడానికి ప్రత్యేకంగా వర్కర్లు లేకపోవడంతో వంట పని చేసే వారే రెండు పనులూ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం విద్యార్థి చేపల అభిషేక్ కడుపు నొప్పితో బాధపడుతూ స్కూల్ నుంచి హాస్టల్ వచ్చేశాడు. ఇలా తరచూ విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి హాస్టల్లో వసతుల మెరుగుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
104 ఉద్యోగుల కొవ్వొత్తుల ర్యాలీ
అనకాపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చెంతకే వైద్యాన్ని చేరవేస్తున్న 104 ఉద్యోగులకు భవ్య యాజమాన్యం అన్యాయం చేస్తుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నెహ్రూచౌక్ వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 104 వాహన ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని 104 నిర్వహణ చేపడుతున్న భవ్య యాజమాన్యానికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. తప్పనిసరి పరిస్థితిలో 104 ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికై నా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 104లో విధులు నిర్వహిస్తూ 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న డ్రైవర్లకు స్లాబ్ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కు రూ.18,500 వేతనం అమలు చేయాలని ఆయన కోరారు. క్యాజువల్ లీవ్లు పునరుద్ధరించాలని, ప్రభుత్వ సెలవులు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గంటా శ్రీరామ్, కాళ్ల తాళయ్యబాబు, 104 ఉద్యోగుల సంఘం కోశాధికారి జి.చంద్రుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీరంరెడ్డి భార్గవ్, ఉద్యోగులు జి.చంద్రుడు, భార్గవ్, చిరంజీవి, ఎం.మూర్తి, రమణ ఎం.ప్రశాంత్, కుమార్, ఎ.మధు, సతీష్, వై.వి.నాయుడు, ఎం.శ్రీను, ఎం.ప్రశాంత్కుమార్ పాల్గొన్నారు. -
సంక్రాంతికి 1,007 ప్రత్యేక బస్సులు
డాబాగార్డెన్స్: సంక్రాంతిని పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ విశాఖ నుంచి భారీగా ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు విశాఖలోని వివిధ డిపోల నుంచి మొత్తం 1,007 ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. విశాఖపట్నం, సింహాచలం, మద్దిలపాలెం, మధురవాడ, గాజువాక, విశాఖ స్టీల్, వాల్తేర్ డిపోల నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళానికి అత్యధికంగా 238, విజయవాడకు 215 సర్వీసులను కేటాయించారు. మిగిలిన వాటిలో పార్వతీపురానికి 101, రాజమండ్రికి 86, పలాసకు 85, పాలకొండకు 65, విజయనగరానికి 58, ఇచ్ఛాపురానికి 48, రాజాంనకు 34, సాలూరుకు 28, కాకినాడకు 18, బొబ్బిలికి 10, అమలాపురానికి 10, భీమవరానికి 5, నర్సీపట్నానికి 4, పాడేరుకు 2 చొప్పున బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. -
పరామర్శకు వెళ్తుండగా..
సీలేరు: చావు ఇంటికి వెళ్లి పరామర్శిద్దామని బయలుదేరిన పదిమంది గిరిజనుల ప్రయాణం మార్గమధ్యలోనే ప్రమాదానికి గురైంది. ఎదురెదురుగా వస్తున్న ఆటో, కారు బలంగా ఢీకొన్న సంఘటనలో ఆరుగురు గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు. దుప్పులవాడ పంచాయతీ రష్యాగూడ గ్రామానికి చెందిన కొందరు గిరిజనులు, ఒడిశా సరిహద్దులోని రాసబెడ గ్రామంలో చావు ఇంటికి మంగళవారం ఆటోలో బయలుదేరారు. అదే సమయంలో నర్సీపట్నంకు చెందిన ఒక కారు సీలేరు వైపు నుంచి వస్తోంది. ఇక్కడికి సమీపంలోని ఎర్రదెబ్బల వద్దకు వచ్చేసరికి ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పదిమందిలో కుర్ర పొదలం, బురిడీ పద్మ, బురిడి మణిమ్మ, కుర్ర సువరణి, కిలో జ్యోతి, కిలో ముల్లమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఏపీ జెన్ కో సీఎస్సార్ అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యాధికారి అఖిల్ వారికి అత్యవసర చికిత్స అందించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి మృతి
దేవరాపల్లి: చదవట్లేదని తండ్రి మందలించడాన్న కారణంతో గడ్డి మందు తాగిన ఓ డిగ్రీ విద్యార్థి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తెనుగుపూడి గ్రామానికి చెందిన సేనాపతి ఆనంద్(18) విశాఖపట్నంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. ఇటీవల చదువుపై శ్రద్ధ కనబరచకపోవడంతో తండ్రి సింహాచలం మందలించినట్లు ఎస్ఐ తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనంద్ ఈ నెల 3న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. కొంత సమయం తర్వాత ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు గమనించి వెంటనే దేవరాపల్లి పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆనంద్ మృతదేహాన్ని గ్రామంలోని యువకులంతా కాశీపురం నుంచి తెనుగుపూడి వరకు అశ్రునయనాల మధ్య తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
భూసిపుట్టు వారపు సంతలో మోసాలు
భూసిపుట్టు వారపు సంతలో అవగాహన కల్పిస్తున్న లోహితాసుడు ముంచంగిపుట్టు: భూసిపుట్టు వారపు సంతలో మోసాలకు పాల్పడటమే కాకుండా నకిలీ వస్తువుల అమ్మకాలు జరుగుతున్నాయని ఎస్సీ,ఎస్టీ జిల్లా కమిటీ సభ్యుడు చెండా లోహితాసుడు ఆరోపించారు. మంగళవారం ఆయన భూసిపుట్టు వారపు సంతలో అమ్మకాలను పరిశీలించారు. తూనికల్లో మోసాలకు పాల్పడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని వ్యాపారులను హెచ్చరించారు. గిరిజనులకు వినియోగదారుల హక్కులు, నకిలీ, కల్తీ వసువులు గుర్తించడంపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ వారపు సంతల్లో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కాలం చెల్లిన వస్తువులు, కల్తీ నూనె, కారం, సబ్బులు తదితర సరకులు విక్రయిస్తున్నారన్నారు. తూనికలు కొలతలు శాఖ అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
దేవరాపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం
దేవరాపల్లి: దేవరాపల్లిలో ఆదివారం రాత్రి పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో అటుగా వెళ్తున్న దేవరాపల్లికి చెందిన వెలమరెడ్డి చిట్టినాయుడుపై పిచ్చి కుక్క దాడి చేసి కుడి చేయి, కుడి కాలిపై తీవ్ర గాయాలు చేసింది. వెంటనే స్థానికులు గమనించి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చేతిపై గాయానికి ఐదు కుట్లు వేశారు.దేవరాపల్లిలో వీధి కుక్కల బెడదతో పాటు పిచ్చి కుక్కల స్వైర విహారంతో స్థానిక ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. పిచ్చి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిట్టినాయుడు -
చోరీ సొత్తు స్వాధీనం
ఎస్.రాయవరం : తిమ్మాపురం చర్చిలో చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు నరీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాసరావు తెలిపారు. అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయంలో సోమవారం డీఎస్పీ స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తిమ్మాపురం చర్చిలో జనవరి 1న చోరీకి పాల్పడిన దొంగను పట్టుకుని అతని వద్ద నుంచి చోరీ చేసిన వస్తువులు స్వాధీనం పరచుకున్నారు. చర్చి పాస్టర్ బి.డి. కిరణ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.రాయవరం పోలీసులు దర్యాప్తు చేసి తక్కువ సమయంలో నిందితుడిని పట్టుకున్నారన్నారు. చర్చిలో వినియోగించే పబ్లిక్ అడ్రస్ ఇన్ సిస్టం, సౌండ్ మిక్సర్, లాంగ్ పియానో సుమారు రూ.లక్షా 10 వేలు విలువ గలిగిన వస్తువులు చోరీ అయినట్టు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంట సీఐ రామకృష్ణ, ఎస్ఐ విభీషణరావు ఉన్నారు. -
స్వల్పంగా పెరిగిన కనిష్ట ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినా మంచు ప్రభావం అధికంగా ఉంది. సోమవారం జి.మాడుగుల, అరకులోయల్లో 10.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్/వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధిలో ముంచంగిపుట్టులో 11.2 డిగ్రీలు, చింతపల్లిలో 11.8, పాడేరులో 11.9, పెదబయలులో 12.5, హుకుంపేటలో 12.9, కొయ్యూరులో 14.8, అనంతగిరిలో 15.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఆయన తెలిపారు. -
అర్జీలపై నిర్లక్ష్యం వహించొద్దు
సొంతింటి కలను నెరవేర్చండి తమకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని కూడా నిబంధనల పేరుతో నాయకులు అడ్డుకుంటున్నారని చోడవరం మండలం అంబేరుపురం గ్రామానికి చెందిన పందిరి లక్ష్మణరావు భార్య పిల్లలతో కలిసి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. తన భార్య పేరుకు బదులు తన పేరు జాబితాలో రావడంతో నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు చొరవ తీసుకుని తన సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. తుమ్మపాల: అర్జీలపై నిర్లక్ష్యం వహించవద్దని, భూసమస్యలను రెవెన్యూ క్లినిక్ ద్వారా సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం 1, 2లో వేర్వేరుగా నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, ఎస్డీసీలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీల పరిష్కారం అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించే పీజీఆర్ఎస్కు సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిల్లోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే అర్జీలు రీఓపెన్ కాకుండా నివారించవచ్చన్నారు. పీజీఆర్ఎస్లో 155, రెవెన్యూ క్లినిక్లో 259 అర్జీలు కలిపి మొత్తం 414 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్.సుబ్బలక్ష్మి, మనోరమ, రమామణి, అనిత, సీపీవో జి.రామారావు, డ్వామా, మెప్మా, గృహ నిర్మాణ పథక సంచాలకులు పూర్ణిమ దేవి, కె.సరోజినీ, శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి జి.మనోహర్, జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకుడు గోపాల్రాజా పాల్గొన్నారు. -
పండగ పూట.. పప్పన్నం లేనట్టే!
సాక్షి, పాడేరు: తమది పేదల ప్రభుత్వమని చెప్పుకునే సీఎం చంద్రబాబు వాస్తవంగా వారికి అన్యాయం చేస్తున్నారు. సంక్రాంతి పండగకు కందిపప్పు పంపిణీ చేయడంలో విఫలమవడం దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రేషన్కార్డులకు ప్రతి నెలా కందిపప్పు సరఫరాలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.120 నుంచి రూ.130 వరకు ఉంది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ డిపోల ద్వారా సబ్సిడీపై కిలో రూ.70లకు అందించేవారు. కనీసం సంక్రాంతి పండగ పూట అయినా పప్నన్నం తినాలని ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబాల వారు భావిస్తారు. అయితే రేషన్ కార్డుదారులకు ఈ నెల కూడా కందిపప్పు పంపిణీ కాని పరిస్థితి ఉంది. గత ఏడాది సంక్రాంతికి కూడా కందిపప్పు పంపిణీ చేయలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి నెలా సబ్సిడీపై కందిపప్పు పంపిణీ చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చేది. ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల దగ్గరే కందిపప్పును పొందేవారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కందిపప్పు పంపిణీ చేయకపోవడంతో గిరిజనుల పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. కనీసం ఈ సంక్రాంతికై నా కందిపప్పు సరఫరా చేస్తారని పేదలంతా ఆశపడినప్పటికీ నిరాశే మిగులుతోంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలకు సంబంధించి మొత్తం 2,98,092 రేషన్కార్డుదారులున్నారు. వీరిలో 83శాతం రేషన్కార్డుదారులు గిరిజన కుటుంబాల వారే.ప్రతినెల సుమారు 290 టన్నుల వరకు కందిపప్పును పౌరసరఫరాలశాఖ సరఫరా చేయాల్సి ఉంది.పౌష్టికాహారం వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా రేషన్కార్డుపై ప్రతి నెలా ఇచ్చే కిలో కందిపప్పు విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. సంతల్లో కిలో రూ.130 వారపు సంతల్లో కిలో కందిపప్పును రూ.130 కు అమ్ముతున్నారు. పాడేరుతో పాటు అన్ని మండల కేంద్రాల్లోని దుకాణాల వద్ద కిలో రూ.120కు విక్రయిస్తున్నారు. ఇంత అధిక ధరతో పేదప్రజలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. -
పోర్ట్లో పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ
విశాఖ సిటీ : విశాఖ పోర్ట్ అథారిటీని పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుల బృందం సోమవారం సందర్శించింది. ఈ సభ్యులకు పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి వివిధ విభాగాల అధిపతులతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఈ బృందం పోర్ట్లో పర్యటించారు. పోర్ట్ సమగ్ర కార్యకలాపాలు, చేపడుతున్న వివిధ వ్యూహాత్మక కార్యక్రమాలను డిప్యూటీ చైర్పర్సన్ వివరించారు. పోర్ట్ మౌలిక సదుపాయాలు, సరుకు నిర్వహణ సామర్థ్యం, ఆధునీకరణ, యాంత్రీకరణ కార్యక్రమాలు, కవర్డ్ నిల్వ సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, పరిశ్రమల అవసరాల కోసం మురుగునీటి శుద్ధి కేంద్రం ద్వారా నీటి పునర్వినియోగం వంటి అంశాలపై కమిటీకి అవగాహన కల్పించారు. అదే విధంగా విశాఖ పోర్ట్ ద్వారా దిగుమతి–ఎగుమతి కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఉన్న పెట్టుబడి అవకాశాలు, సాధ్యమైన మార్గాలను తెలియజేశారు. పోర్ట్లో జరుగుతున్న కార్యకలాపాల పట్ల పార్లమెంటరీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. -
బెదిరించి బంగారం అపహరించిన మహిళ అరెస్టు
బంగారం, నగదు దొంగలించిన మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు పాయకరావుపేట : మండలంలో సీతారాంపురం గ్రామానికి చెందిన మహిళ సోమవారం ఆటోలో ప్రయాణిస్తుండగా స్థానిక పెట్రోల్ బంక్ సమీపాన తన 7 తులాల బంగారం, 5 వేల నగదు అపహరణకు గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాడుగుల గ్రామానికి చెందిన రావుల పోచమ్మ అను మహిళ ఫిర్యాదురాలిని బెదిరించి బంగారం, నగదు తీసుకెళ్లిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొనడంతో ఆ మేరకు గాలించి నిందితురాలిని పోలీసులు పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసి, బంగారం స్వాధీనం చేసుకుని యలమంచిలి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించినట్టు సీఐ జి.అప్పన్న తెలిపారు. -
ల్యాండ్పూలింగ్ రైతుల నిరసన
తుమ్మపాల: ల్యాండ్ పూలింగ్ ద్వారా తమ భూములను తీసుకుని తమకు కేటాయించాల్సిన ప్లాట్లను నేటికీ మంజూరు చేయడం లేదని పాపయ్యపాలెం గ్రామంలో చేపడుతున్న జగనన్న కాలనీ వద్ద బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ డీ పట్టాల ద్వారా ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను గత ప్రభుత్వంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం సేకరించి తమకు ఒక్కో ఎకరానికి 18 సెంట్ల ప్లాట్లు హామీ ఇచ్చిందని, తీసుకున్న భూముల్లో కాలనీలు నిర్మాణం పూర్తి చేస్తున్నప్పటికీ తమకు మాత్రం ప్లాట్లు ఇవ్వకుండా తాత్సరం చేస్తున్నారని, అన్నారు. ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్లు జరగకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుందని, అధికారులు సీఐడీ విచారణ పేరుతో తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. నాలుగేళ్లగా అనేక పోరాటాలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని, తమ భూముల్లో చేపడుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని కోరితే కేసులు పెడతామంటూ భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
చోరీకి గురైన ట్రాక్టర్ పట్టివేత
రావికమతం : కొత్తకోటలో దొంగిలించిన ట్రాక్టర్ను స్వాధీనం పర్చుకొని, దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్డు చేసి, రిమాండ్కు తరిలించినట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. కొత్తకోట బి.ఎన్.రోడ్డు పక్కన ఉంచిన గుర్రాల నాగలక్ష్మి చెందిన ట్రాక్టర్ను నవంబర్ 23న రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కొత్తకోట పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపారు. సోమవారం బి.ఎన్.రోడ్డులో దొండపూడి చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పందంగా సంచరిస్తున్న కాకినాడ జిల్లా జగ్గంపేట దగ్గర నెహ్రూనగర్కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా కొత్తకోటలో నాగలక్ష్మికి చెందిన ట్రాక్టర్ను దొంగిలించినట్టు వారు అంగీకరించారు. వారి చెప్పిన వివరాల మేరకు ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని కొత్తకోట స్టేషన్కు తీసుకొచ్చారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
పూర్వవిద్యార్థుల శ్రమదానం
బడికి రక్షణ కంచె ఏర్పాటు ముంచంగిపుట్టు: తాము చదువుకున్న పాఠశాలకు రక్షణ కంచె లేకపోవడంతో పాఠశాల పూర్వ విద్యార్థులు చొరవ తీసుకుని ఏర్పాటు చేశారు. మండలంలో కించాయిపుట్టు పంచాయతీ రాము లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు రక్షణ కంచె లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతుండడాన్ని గుర్తించిన పూర్వ విద్యార్థులు పల్లుల వెంకటరమణ, ముంచంగి మధు,మఠం తిరుపతి, వల్లంగి గంగమూర్తి, పల్లుల సుబ్బారావు, కిల్లో బాలకృష్ణ, సంగల సత్తిబాబు,సంగుల దేవన్న,పల్లుల ఆజాద్, పాఠశాల హెచ్ఎం లింగన్నలు కొంత సొమ్ముతో పాటు చందాలు వేసుకుని సేకరించిన నగదుతో ఇనుప కంచెను కొనుగోలు చేశారు. రెండు రోజులుగా శ్రమదానంతో గోతులు తవ్వి, కర్రలు పాతిపెట్టి,రక్షణ కంచెను ఏర్పాటుచేశారు.అనంతరం పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. దీంతో పూర్వ విద్యార్థులను ఉపాధ్యాయులు,రాముల గ్రామస్తులు అభినందించారు. -
అప్పన్నను దర్శించుకున్న మహిళా క్రికెటర్లు, రిఫరీలు
సింహాచలం: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని సోమవారం పలువురు క్రికెటర్లు, బీసీసీఐ ప్రతినిధులు దర్శించుకున్నారు. క్రికెటర్లు వి. కృతిక, నియతి లోకూర్ సహా బీసీసీఐ రిఫరీలు, అధికారులు శివశుక్లా, చేతన్ శర్మ, సుబ్రత దాస్, అభిషేక్ తోమర్, రాకేష్ కుమార్ తదితరులు స్వామివారిని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో వీరి పేరిట అర్చకులు స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. -
ఆర్టీసీ కాంప్లెక్స్లో వృద్ధుడు మృతి
యలమంచిలి రూరల్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో సోమవారం గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. బస్టాండులో వెయిటింగ్ బెంచీపై విగతజీవిగా పడివున్న వృద్ధుడ్ని గుర్తించిన కొందరు ప్రయాణికులు పట్టణ పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసులు వృద్ధుడు మృతి చెందినట్టు నిర్థారించుకుని మృతదేహాన్ని అనకాపల్లి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గాంధీనగరం వీఆర్వో పలక పృధ్వి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు. -
గంజాయికి దూరంగా ఉండాలి
అరకులోయటౌన్: గంజాయి సాగు, రవాణా, వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని ఎంపీ, భారత మాజీ క్రికెటర్ యాసఫ్ పఠాన్ తెలిపారు. సోమవారం పార్లమెంటరీ స్టాండింగ్ కామర్స్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన అరకులోయను సందర్శించారు. ఈ సందర్భంగా పాడేరు డీఎస్పీ అభిషేక్తో కలిసి సే నో టు గంజా అవగాహన పోస్టర్ను ఆవిష్కరించి, గంజాయి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గంజాయికి బానిసలై భవిష్యత్ను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయికి బదులుగా కాఫీ, మిరియాలు వంటి పంటలను ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. అనంతరం గిరిజన మ్యూజియం, కాఫీ హౌస్ను ఎంపీ సందర్శించారు. అరకు ప్రాంత అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకారం అందించేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాడేరు డీఎస్పీ అభిషేక్ , అరకు సీఐ ఎల్.హిమగిరి, ఎస్ఐ పి. గోపాలరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఎంపీ యాసఫ్ పఠాన్ -
అధిక ధరకు ఎరువుల విక్రయం
కశింకోట: మండలంలోని తాళ్లపాలెంలో లక్ష్మీ ట్రేడర్స్ ఎరువుల దుకాణం లైసెన్స్ను 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.ఆశాదేవి తెలిపారు. మండలంలోని తాళ్లపాలెంలో లక్ష్మీ ట్రేడర్స్ ప్రైవేటు ఎరువుల దుకాణాన్ని సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 1985 ఎరువుల చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఎరువులు అమ్ముతున్నట్లు గుర్తించామని ఆశాదేవి తెలిపారు. బిల్లు బుక్ను తనిఖీ చేసి, దాంట్లో ఉన్న సెల్ఫోన్ నంబర్లకు ఫోన్ చేశామన్నారు. యూరియా ఎరువు బస్తా రూ.266.50కు బదులు రూ.400 నుంచి రూ.410 వరకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. డీఏపీ ఎరువు కూడా అధిక ధరలకు అమ్ముతున్నట్లు వెల్లడైందన్నారు. కొన్ని సెల్ నెంబర్లకు కాల్ చేయగా అవి అందుబాటులో లేనట్లు, కొన్ని తప్పుగా నమోదు చేసినట్లు రుజువైందన్నారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ సహాయ సంచాలకురాలు ఎం.ఎస్.వసంత కుమారి, అనకాపల్లి సహాయ సంచాలకుడు సిహెచ్.సుబ్రహ్మణ్యం, వ్యవసాయ అధికారి ఎం.స్వప్న, జిల్లా టెక్నికల్ అధికారి ఎన్.సరోజిని పాల్గొన్నారు. -
కబ్జాదారులపై చర్యలకు వెనుకడుగు?
మాకవరపాలెం : ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వ్యక్తులపై చర్యలకు రెవెన్యూ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. అధికార టీడీపీకి చెందిన నాయకులు కావడంతోనే చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని రామన్నపాలెం శివారు చినరాచపల్లి వద్ద 737 సర్వే నంబర్ పరిధిలో ఊటగెడ్డ రిజర్వాయర్కు ఆనుకుని ఫారెస్ట్, రెవెన్యూ, ఇరిగేషన్ ఆధీనంలో భూములు ఉన్నాయి. వీటిలో సుమారు 20 ఎకరాలను గతంలో టీడీపీ నాయకులు ఆక్రమించడంతో 2018లోనే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే గత నెల 24న హెచ్చరిక బోర్డు ఉండగానే ట్రాక్టర్తో దుక్కులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న ఆర్ఐ చక్రపాణి, వీఆర్వో సాంబశివరావు ఈ భూమిని పరిశీలించి ఆక్రమణలు అడ్డుకున్నారు. అనంతరం నివేదికను తహసీల్దార్ వెంకటరమణకు అందజేశారు. దీంతో ఈ భూమి ఆక్రమణకు సంబంధించి టీడీపీ నాయకులు రామన్నపాలెం మాజీ సర్పంచ్ చుక్కా పోతురాజు, అడిగర్ల శ్రీనివాసరావులపై కేసు నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. దుక్కులు చేస్తున్న ట్రాక్టర్, ఒక బైక్ను సీజ్ చేసి పోలీసులకు అప్పగించినట్టు తహసీల్దార్ చెప్పిన విషయం పత్రికల్లో సైతం వచ్చింది. ఇదంతా జరిగి 13 రోజులు కావస్తున్నా ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాలేదు. స్పీకర్ ఆదేశాలు బేఖాతరు భూకబ్జాలకు పాల్పడేవారిపై పార్టీలతో సంబంధం లేకుండా వెంటనే కేసులు పెట్టాలని స్వయంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మూడు రోజుల క్రితం నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో జరిగిన ఓ సమావేశంలో అధికారులను ఆదేశించారు. టీడీపీ వారైనా సరే వెనుకడుగు వేయకుండా కేసులు పెట్టాలని నర్సీపట్నం ఆర్డీవో, మిగిలిన మండలాల తహసీల్దార్లకు ఆదేశాలిచ్చారు. కానీ మాకవరపాలెం మండలంలో అధికారులు కబ్జాదారులపై చర్యలకు వెనుకడుగు వేస్తుండటంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని, ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
గోవాడ రైతుల అర్ధనగ్న ప్రదర్శన
చోడవరం : ఈ ఏడాది గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించాలని, చెరకు రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతూ రైతు సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధుల అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అఖిల పక్ష రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఫ్యాక్టరీ మెయిన్ గేటు వద్ద ఏర్పాటు చేసిన నిరసన రిలే దీక్ష శిబిరం సోమవారం 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఏపీ చెరకు రైతు సంఘం, వ్యవసాయ కూలీ సంఘం, ఏపీ రైతు సంఘం, సీపీఐ, రైతు కూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ, ఫ్యాక్టరీ కార్మిక సంఘాల నాయకులు ఈ శిబిరంలో పాల్గొని అర్ధ నగ్నంగా నిరసన తెలిపారు. చెరకు రైతుల జీవితాలతో ఆడుకోవద్దని వారు హెచ్చరించారు. ఫ్యాక్టరీని కాపాడతామని, చెరకు రైతులకు అండగా నిలుస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపీ పూర్తిగా మోసం చేశారని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీకి సాయంగా తీసురాలేకపోయారని వారు ధ్వజమెత్తారు. రైతులను మోసం చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ చెరకు రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, సీపీఎం జిల్లా ప్రతినిధి శ్రీనివాసరావు, రైతు సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ ప్రతినిధి శానాపతి సత్యారావు, సుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాయి సూరిబాబు, శరగడం రామునాయుడు, జిల్లా వ్యవసాయ కూలీ సంఘం అధ్యక్షుడు కోన మోహన్రావు, సీఐటీయూ నాయకుడు ఎస్వీనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థుల క్రీడా పోటీలు ప్రారంభం
9న వైద్య కళాశాల వార్షికోత్సవంసాక్షి, పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి.వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభించి ఈనెల 9వ తేదీనాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆరోహన్ పేరిట మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి,రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న 100 మంది వైద్య విద్యార్థులకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలను వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలతాదేవి ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి వైద్య విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు క్రీడా జ్యోతితో కళాశాల ప్రాంగణంలో ఉత్సాహంగా పరుగులు తీశారు. అనంతరం వైద్య విద్యార్థులకు క్రికెట్, కబడ్డీ పోటీలను ప్రిన్సిపాల్ హేమలతాదేవితో పాటు వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ పాపారత్నం,డాక్టర్ లక్ష్మీకుమారి తదితరులు ప్రారంభించారు.ఈ నెల ఈ పోటీలు జరుగుతాయి. -
అర్జీదారులకు ఉచిత వాహన సౌకర్యం
కలెక్టరేట్ నుంచి జాతీయ రహదారికి అర్జీదారులను తీసుకెళ్తున్న ఉచిత ఆటో తుమ్మపాల : వివిధ సమస్యలపై ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చే వృద్ధులు, వికలాంగులు, మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే ఉచిత వాహన సౌకర్యం ఏర్పాటు చేశారు.పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో మండలంలో శంకరం గ్రామంలో ఉన్న కలెక్టరేట్కు చేరడానికి ఆపసోపాలు పడుతున్న అర్జీదారులకు ఉచిత వాహన సౌకర్యం కలిగిస్తూ ఏడు వారాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆటో తిరుగుతుంది. జాతీయ రహదారి నుంచి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న కలెక్టరేట్కు రావాలంటే ప్రయాణ సౌకర్యం లేదు. వాహనాలు లేని వృద్ధులు, వికలాంగులు నడవలేని పరిస్థితిలో ప్రత్యేక ఆటోకు ఖర్చు చేయలేక పేదలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రతి వారం ఉచితంగా ఆటోసేవను కొనసాగిస్తున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు. -
అటవీప్రాంతంలో సిరి గంధం చెట్ల నకిరివేత
జి.మాడుగుల: మండలంలోని కుంబిడిసింగి పంచాయతీ ఉర్లమెట్ట, గద్దరాయి గ్రామాల సమీపంలో అటవీ ప్రాంతంలో గల సిరి గంధం చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి, అపహరించుకు పోయిన విషయం ఆలస్యంగా తెలిసింది. ఈ గ్రామాలకు ఆనుకుని ఉన్న కొండలపై విలువైన సిరి గంధం చెట్లను శనివారం రాత్రి నరికి అపహరించుకుపోయినట్టు తెలుస్తోంది. గమనించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి సమాచారం అందించారు. ఫారెస్టు అధికార్లు సోమవారం అటవీ ప్రాంతానికి వెళ్లి, విచారణ జరిపారు.అటవీ సంపదను దోచుకుంటున్న వారిపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు. -
భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ వైఎస్సార్సీపీదే
అరకులోయటౌన్: భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధిలో వైఎస్సార్సీపీ పాత్ర కీలకమని, ఆ క్రెడిట్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ విమర్శలు చేశారని ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీసీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించింది విమానాశ్రయ నిర్మాణాన్ని కాదని, విమానాశ్రయానికి 15వేల ఎకరాల భూసేకరణ చేయడాన్ని మాత్రమేనని చెప్పారు. 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా సమయంలో విమానాశ్రయ నిర్మాణానికి 15వేల ఎకరాలు అవసరమన్నారని, రైతులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఐదు వేల ఎకరాలకు తగ్గించారని చెప్పారు. అది రైతుల పోరాట ఫలితమేనని చెప్పారు. నిబంధనలు పాటించకుండా నోటిఫికేషన్ విడుదల చేశారని, ఎకరానికి రూ. 12.5 లక్షల పరిహారాన్ని ప్రకటిండంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. హైకోర్టులో కేసులు పరిష్కారం కాకుండా 2019 ఫిబ్రవరి 14న విమానాశ్రమ నిర్మాణానికి కొబ్బరకాయ కొట్టారని చెప్పారు. 2019–24 మధ్య జగనన్న పాలనలో నాలుగేళ్ల పాటు అన్ని అనుమతుల కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డంకులన్నీ అధిగమించి, అవసరమైన 2,751 ఎకరాల సేకరణ పూర్తి చేశారన్నారు. రెట్టింపు పరిహారం అందించి, రూ.80 కోట్లతో ఆధునిక కాలనీలు నిర్మించారని తెలిపారు. 2023 మే 3న అన్ని అనుమతులతో భూమి పూజ చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టును ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. అభివృద్ధిని తమ పార్టీ ఎప్పుడు స్వాగతిస్తుందన్నారు. అవాస్తవ ఆరోపణలు చేయడం తప్ప వాస్తవాలను మార్చలేరని ఎమ్మెల్యే మత్స్యలింగం స్పష్టం చేశారు. -
తప్పుడు సర్వే నంబర్తో నిషేధిత భూమి రిజిస్ట్రేషన్
డీపట్టా భూమిని ఆక్రమించేందుకు తప్పుడు సర్వే నంబర్తో చేసిన రిజిస్టర్డ్ దస్తావేజును రద్దు చేసి, ఆక్రమణదారుల నుంచి భూమిని కాపాడాలంటూ అనకాపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన డీ–పట్టాదారుడు వనమాల నాగభూషణం కోరారు. నిరుపేద దళితుడినైన తన పేరున 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం సర్వే నంబర్ 75/1లో 30 సెంట్లు డీపట్టా మంజూరు చేసిందని, అప్పటి నుంచి సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించేందుకు గ్రామంలో కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తన పేరున పట్టాదారు పాసు పుస్తకం ఉన్నప్పటికి ఆన్లైన్ చేయకుండా చేసి, నా భూమికి ఆనుకుని ఉన్న మరో సర్వే నెం.75/2తో పోర్జరీ పత్రాలు సృష్టించి చేసిన రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని కోరారు. -
ప్రకృతి అందాలు అద్భుతం
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డుంబ్రిగుడ: చాపరాయి, అరకు పైనరీ వద్ద ప్రకృతి అందాలు అద్భుతంగా, ఆహ్లాదకరంగా ఉన్నాయని రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం మండలంలో అరకు పైనరీ, చాపరాయి పర్యాటక కేంద్రాలను, చేపలమ్మ తల్లి ఆలయాన్ని ఆయన కుటుంబ సమేతంగా సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాతంలో ఇంతఅందమైన ప్రదేశాలు ఉండడం గిరిజనులకు వరమని తెలిపారు. చాపరాయిని సందర్శించేందుకు ప్రతి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని, దీనిని అభివృద్ధి చేసి, సౌకర్యాలు కల్పించాలన్నారు. వైఎస్సార్సీపీ మండల కార్యదర్శి మఠం శంకర్, పోతంగి సర్పంచ్ వి.వెంకటరావు, వైఎస్సార్సీపీ పోతంగి పంచాయతీ అధ్యక్షుడు కమ్మిడి విజయదశమి, మహిళ నాయకురాలు కమ్మిడి నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
అనంతగిరి ఎంపీపీగా మిథుల
అనంతగిరి(అరకులోయటౌన్): అరకులోయ నియోజకవర్గం అనంతగిరి ఎంపీపీగా తడబారికి మిథుల ఎన్నికయ్యారు. ఇక్కడ ఎంపీపీగా పనిచేసిన శెట్టి నీలవేణిపై ప్రవేశపెట్టిన అవిశ్వా స తీర్మానానికి అనుకూలంగా ఎక్కువ మంది ఓటు వేశారు. దీంతో ఆమె పదవిని కోల్పోయా రు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమ వారం ఎన్నికల అధికారి, మండల ప్రత్యేక అధికారి స్వామినాయుడు ఎన్నిక నిర్వహించా రు. మొత్తం 14 మంది సభ్యులకుగాను ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ఎన్నికలకు గైర్హాజరయ్యారు. తొమ్మిది మంది ఎన్నికల్లో పాల్గొని మిథులను బలపరిచారు. దీంతో ఆమె ఎంపీపీగా ఎన్నికై నట్టు ప్రకటించి, నియామకపత్రా న్ని అందజేశారు. ఎంపీడీవో ప్రభాకర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
మార్చి 29న ప్రో బాక్సింగ్ పోటీలు
కంచరపాలెం: ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ) ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి 29న అంతర్జాతీయ ప్రో బాక్సింగ్ ఈవెంట్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు విశాఖ ప్రో బాక్సింగ్ ప్రమోటర్ యల్లపు రఘురామ్ తెలిపారు. కై లాసపురం బాక్సింగ్ క్లబ్లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీల్లో దేశ, విదేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర కౌన్సిల్ జనరల్ సెక్రటరీ వి.అమ్మోరు, సలహాదారులు, నేషనల్ పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గొర్లె చందు, జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.ప్రభాకర్, ఎం.సుగుణకుమార్, సతీష్, కోచ్లు బి.శ్రీను, వి.రూబెన్ తదితరులు పాల్గొన్నారు. -
‘త్రివిక్రముడి’గా అప్పన్న
సింహాచలం: సింహగిరిపై వైభవంగా జరుగుతున్న రాపత్తు ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ‘త్రివిక్రముడి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తి అయి న గోవిందరాజస్వామిని త్రివిక్రమ అవతారంలో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామివారు పల్లకిలో వేంజింపజేసి భక్తులను అనుగ్రహించారు. మరో పల్లకిలో ఆళ్వారులను ఉంచి ఆలయ మాడవీధుల్లో విశేషంగా తిరువీధి సేవ నిర్వహించారు. సాయంత్రం జరిగిన ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకుడు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
సారా బట్టీలపై పోలీసుల విస్తృత దాడులు
స్వాధీనం చేసుకున్న బెల్లం ఊట, వంట పాత్రలతో ఎస్ఐ రాజారావు, సిబ్బంది నర్సీపట్నం: అక్రమ మద్యం, నాటు సారా నిర్మూలనే లక్ష్యంగా సీఐ ఎల్.రేవతమ్మ ఆధ్వర్యంలో ఎస్ఐ రాజారావు, సిబ్బంది మండలంలో సారా బట్టీలపై ఆదివారం విసృ్ృతతంగా దాడులు నిర్వహించారు. పాత లక్ష్మీపురం, గదబపాలెం గ్రామ శివార్లలో ఆకస్మిక సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. గ్రామ శివార్లోని జీడి తోటల్లో రహస్యంగా నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 3,200 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. సారా కాచడానికి ఉపయోగిస్తున్న డ్రమ్ములు, పాత్రలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నాటు సారా తయారు చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజారావు హెచ్చరించారు. -
అరకు టూరిజంపై ఆంక్షలు చేతకానితనమే..
● టీడీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే ట్రాఫిక్ సమస్య ● అరకు రావొద్దని ఆంక్షలు విధించడం సరికాదు ● ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ధ్వజం అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకు అందాలు తిలకించేందుకు వచ్చే పర్యాటకులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించడం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుగు ప్రయాణంలో అరకు రావొద్దని ఆంక్షలు విధించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం విధించిన అంక్షల వల్ల పర్యాటకులు రానందున ఈ ప్రాంతం వెలవెలబోతోందన్నారు. దీనివల్ల పర్యాటక రంగంపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. సుంకరమెట్ట సమీపంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన ఉడెన్ బ్రిడ్జి వద్ద పార్కింగ్ స్థలం లేనందున ఇరువైపుల నుంచి రాకపోకలు సాగించే వాహనాలకు ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందన్నారు. ఈ సమస్యను గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా మూడు రోజులు ఉడెన్ బ్రిడ్జి మూసివేయడాన్ని ఆయన గుర్తు చేశారు. అటవీశాఖ అధికారులు వలంటీర్లను పెట్టి ట్రాఫిక్ నియంత్రించాలని, లేకుంటే ఉడెన్ బ్రిడ్జి మూసివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆంక్షల వల్ల టూరిజంపై ఆధారపడి బతుకుతున్న వేలాది గిరిజన కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, చిరు వ్యాపారులు, ఆదివాసీ నిరుద్యోగులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. ప్రకటనలకే పరిమితం టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం తీరు ప్రకటనలకే పరిమితం అయిందని ఎమ్మెల్సీ రవిబాబు ఆరోపించారు. టూరిజం ఆర్గనైజేషన్ ట్రావెల్స్కు ప్రభుత్వ హెచ్చరికల వల్ల మోటార్ వాహనాలపై ఆధారపడిన వేలాది కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉందన్నారు. గత వారం రోజులుగా అరకులోయలో హోటళ్లు వెలవెలబోతున్నాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పర్యాటకులను రావద్దని హెచ్చరిస్తున్నారన్నారు. ఇలాగైతే అరకు టూరిజంపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఊటీని మరపించిన అరకు రాష్ట్రంలో నంబర్ వన్ హిల్స్టేషన్ అయిన అరకులో ఈ ఏడాది 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదై ఊటీని మరిపించేలా పర్యాటకులను ఆకర్షించిందని ఎమ్మెల్సీ రవిబాబు పేర్కొన్నారు. బొర్రాగుహలు, గిరిజన సంస్కృతి, జీవన శైలిని ప్రతిబింబించే గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, రణజిల్లెడ జలపాతం, అరకు పైనరీ, చాపరాయి జలవిహారి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన కాఫీ హౌస్, గిరిజన సాంస్కృతిక థింసా నృత్యాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్న వారంతా తీవ్ర నష్టపోతారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అరకు–విశాఖ ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకొని, పర్యాటకులకు విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని రవిబాబు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు పాల్గొన్నారు. -
విశాఖ తీరాన ఎగసిన కార్మిక కెరటం
జగదాంబ: రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కార్మిక లోకంతో విశాఖ నగరం జనసంద్రమైంది. సీఐటీయూ అఖిల భారత మహాసభల సందర్భంగా నిర్వహించిన భారీ ప్రదర్శనతో నగరం ఎరుపెక్కిపోయింది. జగదాంబ సెంటర్ నుంచి ఇందిరా మున్సిపల్ స్టేడియం వరకు జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది కార్మికులు పాల్గొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తారు. కార్మిక చట్టాలను అమలు చేయాలి.. లేబర్ కోడ్లను రద్దు చేయాలి అంటూ చేసిన నినాదాలతో విశాఖ వీధులు హోరెత్తాయి. జీవీఎంసీ 39వ వార్డులోని ఇందిరా మున్సిపల్ క్రికెట్ స్టేడియంలో సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ కె. హేమలత అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య నాయకులు తపన్ సేన్, కరీం, గఫూర్, నర్సింగరావు, సాయిబాలు ప్రసంగిస్తూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. 2019లో పరాజయం పాలై, 2024లో మారతానంటూ ప్రజల కాళ్లు పట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మళ్లీ పాత పద్ధతులనే అవలంబిస్తున్నాడని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో చేతులు కలిపి కార్మికులను ఉక్కుపాదంతో తొక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 50 లక్షల మంది కార్మికులకు చట్టబద్ధమైన వేతన సవరణ జరగడం లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు, పెన్షన్, పీఎఫ్ సౌకర్యాలు లేకపోవడం శోచనీయమ న్నారు. దేశాన్ని అమ్మడమే పనిగా పెట్టుకున్న మోదీకి చంద్రబాబు మద్దతు తెలపడం కార్మికులకు చేస్తున్న అన్యాయమని, కార్మిక మంత్రులు కేవలం దిష్టిబొమ్మల్లా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. అంగన్వాడీల సమస్యలు తీరుస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోని ఎమ్మెల్యేలను, ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించిన నారా లోకేష్ను నాయకులు ప్రశ్నించారు. అలాగే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన శాఖలోని నామమాత్రపు వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల కష్టాలను ఎందుకు చూడటం లేదని నిలదీశారు. మార్పు కోసం పనిచేయాల్సిన పవన్ కల్యాణ్, సనాతన ధర్మం పేరిట కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కనీస వేతన చట్టం–2026ను వెంటనే అమలు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని సభ తీర్మానించింది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. 2025 విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, అసంఘటిత కార్మికులకు ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12న జరగబోయే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. -
అరకు అందాలు అద్భుతం
● ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం ● కుటుంబసభ్యులతో అరకులో పర్యాటక ప్రాంతాల సందర్శన అరకులోయ టౌన్: అరకులోయ అందాలు అద్భుతమని ఏపీ మాజీ స్పీకర్, వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. కటికి జలపాతం, సుంకరమెట్టలోని ఉడెన్ బ్రిడ్జి, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడలోని చాపరాయి జలవిహారిని తిలకించారు. మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్ వద్ద వారు గిరిజనుల వస్త్రధారణలో థింసా కళాకారులతో నృత్యం చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని సెలయేర్లు, కొండలు, లోయలు, సందర్శిత ప్రాంతాలు, ఇక్కడి కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు చాలా ఆకట్టుకున్నాయని అన్నారు. -
కిక్కిరిసిన చెరువులవెనం
చింతపల్లి: ఆంధ్రా–కశ్మీర్ లంబసింగి శనివారం రాత్రి నుంచి పర్యాటకులతో కిటకిటలాడింది. ఇక్కడికి సమీపంలోని చెరువులవెనం వ్యూపాయింట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. భారీగా తరలివచ్చిన సందర్శకులు ప్రకృతి అందాలను తిలకించారు. గిరిజనులతో కలిసి థింసా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తాజంగి జలాశయం వద్ద పర్యాటకులు సాహస క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన చాపరాయి, అరకు పైనరీకి ఆదివారం పర్యాటకులు తాకిడి కాస్త తగ్గింది. జాతీయ రహదారిని అనుకుని ఉన్న చాపరాయిలో ట్రాఫిక్ లేకపోవడంతో అరకు– పాడేరు ప్రయాణం సాఫీగా సాగిపోయింది. కురిడి సమీపంలోని నారింజవలస వద్ద పొద్దుతిరుగుడు తోటలో పర్యాటకులు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఒక్క ఫొటో తీసుకునేందుకు తోట యజమానికి రూ.20 నుంచి రూ.30 చెల్లించారు. అరకు పైనరీలో సందడి నెలకొంది.అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయకు పర్యాటకుల తాకిడి నెలకొంది. క్రిస్మస్నుంచి రోజురోజుకు సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం భారీగా తరలిరావడంతో గిరిజన మ్యూజియం, మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్ తదితర సందర్శిత ప్రాంతాలు కళకళలాడాయి. గిరిజన మ్యూజియంలో జిప్లైన్,, స్కై సైక్లింగ్, బోటు షికారు చేస్తూ సందడి చేశారు. -
ఆంక్షల కంచె..
అక్షర ధామంలోవీసీని కలవాలన్నా గండమే..ఏయూ గేట్లకు నో ఎంట్రీ బోర్డులుమద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మునుపెన్నడూ లేని విధంగా కఠిన నిబంధనలు, ఆంక్షలు అమల్లోకి రావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వవిద్యాలయ పాలనా యంత్రాంగం అనుసరిస్తున్న తీరు నియంతృత్వ ధోరణిని తలపిస్తోందని విద్యార్థి లోకం మండిపడుతోంది. ముఖ్యంగా వర్సిటీ పెద్ద దిక్కులైన వీసీ, రిజిస్ట్రార్లను కలిసేందుకు కూడా వీల్లేదంటూ జారీ చేసిన తాజా సర్క్యులర్ వర్సిటీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విద్యార్థులు సంక్రాంతి సెలవుల్లో ఉన్న సమయాన్ని చూసి ఇటువంటి కఠిన నిర్ణయాలు అమలు చేయడంపై సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. ఆంక్షలపై వాగ్వాదం ప్రస్తుతం ఏయూలో ఇతరుల ప్రవేశాన్ని పూర్తిగా నిరోధిస్తూ ‘నో ఎంట్రీ’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న ఈ సువిశాల ప్రాంగణంలో ఇప్పటివరకు ఉన్న రాకపోకల వెసులుబాటును రద్దు చేస్తూ ప్రధాన ద్వారాలను మూసివేశారు. ఆఖరికి కలెక్టర్ బంగ్లాకు వెళ్లే మార్గాన్ని కూడా పరిమితం చేస్తూ నిబంధనలు విధించడం గమనార్హం. కేవలం సౌత్ క్యాంపస్ ఇన్–గేట్, బీచ్ రోడ్డు అవుట్–గేట్ ద్వారా మాత్రమే రాకపోకలు సాగించాలని వీసీ ఆదేశించడంతో వర్సిటీలో కలకలం రేగుతోంది. కేవలం ఐడీ కార్డులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తుండటంతో, కార్డులు మర్చిపోయిన సిబ్బంది, విద్యార్థులు సెక్యూరిటీ గార్డులతో వాగ్వివాదానికి దిగాల్సి వస్తోంది. అనుబంధ కళాశాలల విద్యార్థుల పడిగాపులు ఈ నిబంధనల వల్ల ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు విస్తరించి ఉన్న అనుబంధ సంస్థల విద్యార్థులు తమ సర్టిఫికెట్లు, ఓడీల కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంటారు. అయితే గేటు వద్దే వారిని అడ్డుకుంటుండటంతో ఉన్నత విద్య అభ్యసించిన వారు కూడా పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు, తమను కలవడానికి వచ్చే వారికి వీసీ, రిజిస్ట్రార్లు గ్రీవెన్స్ సెల్ మార్గాన్ని సూచించడం విడ్డూరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. పాలనాధిపతులు విద్యార్థులకు అందుబాటులో ఉండకపోతే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నియంత పాలనకు శ్రీకారం వీసీని, రిజిస్ట్రార్లను ఎవరూ నేరుగా కలిసేందుకు వీలులేదని, సమస్యలుంటే గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసుకోవాలని నిబంధనలు పెట్టారు. ప్రతి ఒక్కరూ పాలనాధిపతులను కలవడం వలన వర్సిటీలో పాలనకు అంతరాయం కలుగుతుందని వీసీ జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొనడం విడ్డూరంగా ఉందంటూ వర్సిటీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. నియంతృత్వ నిబంధనలతో ఏయూను నిర్బంధించడంపై పలు విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏయూ వీసీ, రిజిస్ట్రార్ను కలవడానికి ఆంక్షలు పెట్టడమేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శతాబ్ది వేళ...అప్రతిష్ట శతాబ్ది ఉత్సవాల వేళ ఏయూ ప్రతిష్టను పెంచాల్సింది పోయి, ఇలాంటి వింత పోకడలతో ఆభాసుపాలు చేస్తున్నారని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పాలనాపరమైన ఆంక్షలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు బోధనారంగం గాడితప్పుతోంది. 14 విభాగాల్లో రెగ్యులర్ ప్రొఫెసర్లు లేక, గెస్ట్ లెక్చరర్లతో కాలం వెల్లదీస్తున్నారు. నాణ్యమైన విద్య అందక విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల వైపు చూస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సింది పోయి, కేవలం ఆంక్షలతో విశ్వవిద్యాలయాన్ని బందీ చేయడమేంటని విద్యావేత్తలు నిలదీస్తున్నారు. ఏయూలో రాకపోకల సంక్షోభం కఠిన నిబంధనలపై కలకలం.. విద్యార్థుల ఆందోళన -
పర్యాటకంపై పిడుగు
ఉపాధిపై తీవ్ర ప్రభావం ప్రతీరోజు మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్ వద్ద టీ స్టాళ్లు ద్వారా 40 మంది ఉపాధి పొందుతున్నాం. సీజన్లో ప్రతీ రోజు ఒక్కో స్టాల్లో రూ. 700 నుంచి రూ. 800 వరకు ఆదాయం వచ్చేది. కొద్దిరోజులుగా ప్రభుత్వం విధించిన ట్రాఫిక్ ఆంక్షల వల్ల సందర్శకుల సంఖ్య బాగా తగ్గింది. దీనివల్ల ఆదాయం తగ్గిపోవడమే కాకుండా ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. – బారికి డాలిమ్మ, మాడగడఆదాయం కోల్పోయాం పర్యాటకులకు అరకు రావద్దంటూ విధించిన ఆంక్షల వల్ల ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్లో పర్యాటకులకు తెల్లటి పంచె, చిలకట్టు, లాల్చీ, తలపాగ, కండువాతో అలంకరణకు ఒక్కరికి రూ. 50 నుంచి వంద తీసుకుంటాం. తద్వారా 16 మందికి ఉపాధి లభిస్తోంది. కొద్దిరోజులుగా పర్యాటకుల రాకతగ్గడంతో ఆదాయం కోల్పోయాం. – మండియకేడి మోహన్బాబు, మాడగడ ● రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ● వన్వే ట్రాఫిక్ ఆంక్షలతో కుదేలు ● పర్యాటకుల్లో భయాందోళనలు ● తగ్గిపోతున్న సందర్శకుల సంఖ్య ● దూరమవుతున్న ఉపాధి మార్గాలు ● అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం పాడేరు/అరకులోయ టౌన్: ప్రకృతి ఒడిలో సేదతీరాలని వచ్చే పర్యాటకులతో కళకళలాడాల్సిన అరకులోయ పరిసరాలు ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో వెలవెలబోతున్నాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పేరుతో ఎస్.కోట – అరకు మార్గాన్ని వన్వేగా మార్చడం, తిరుగు ప్రయాణాన్ని పాడేరు మీదుగా మళ్లించడం అరకు పర్యాటక రంగానికి గొడ్డలి పెట్టులా మారింది. భద్రత ముసుగులో తీసుకున్న ఈ నిర్ణయం, వేలాది మంది గిరిజన కుటుంబాల జీవనాధారాన్ని దెబ్బతీస్తోంది. పర్యాటకుల్లో గుబులు సాధారణంగా పర్యాటకులు వెళ్లేటప్పుడు గమ్యాన్ని చేరుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కానీ, తిరిగి వచ్చేటప్పుడే నిదానంగా స్థానిక వస్తువులను కొనుగోలు చేస్తారు. అరకు కాఫీ, మిరియాలు, అడవి తేనె, హస్తకళా రూపాలను పర్యాటకులు తిరుగు ప్రయాణంలోనే ఎక్కువగా కొంటారు. ● ఘాట్ రోడ్డు పొడవునా ఉండే వ్యూ పాయింట్లు, చిన్న చిన్న టీ కొట్లు, మొక్కజొన్న పొత్తుల వ్యాపారులు ఇప్పుడు కొనేవారు లేక ఖాళీగా కూర్చుంటున్నారు. ● అరకు ప్రత్యేకత అయిన వెదురు బొంగు చికెన్ విక్రయించే గిరిజన వ్యాపారులు, పర్యాటకులు అటువైపుగా రాకపోవడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ● తిరుగు ప్రయాణాన్ని పాడేరు మీదుగా మళ్లించడం వల్ల ప్రయాణ సమయం కనీసం రెండు నుంచి మూడు గంటలు పెరుగుతుంది.ఇంధన ధరల దృష్ట్యా ఇది పర్యాటకుల బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ● గంటల తరబడి అదనపు ప్రయాణం చేయడం వల్ల పర్యాటకులు అలసటకు గురవుతున్నారు. ఇది అరకు పర్యాటకం పట్ల ప్రతికూల భావన, భయాందోళనలను కలిగిస్తోంది. దీనివల్ల పర్యాటకుల రాక గతంలో కన్నా తగ్గిపోయింది. ● పర్యాటకం అంటే కేవలం సందర్శన మాత్రమే కాదు.. దీని వెనుక ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. రద్దీ నియంత్రణ ఆంక్షల భయంతో పర్యాటకులు తమ పర్యటనలను వాయిదా వేసుకుంటున్నారు. దీనివల్ల లాడ్జింగ్ రంగం తీవ్రంగా నష్టపోతోంది. ప్రత్యామ్నాయాలు అవసరం రద్దీని నియంత్రించడం అవసరమే, కానీ ట్రాఫిక్ అంక్షల నిర్ణయం పర్యాటక రంగ గొంతు నులిమేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అరకులోయ కేవలం ఒక విహార కేంద్రం మాత్రమే కాదు, వేలాది మంది గిరిజనుల ఉపాధి వనరు. పర్యాటకుల రద్దీ నెపంతో వారి పొట్ట కొట్టడం సరికాదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రయోజనాలను కాపాడే విధంగా ట్రాఫిక్ నిబంధనలను సవరించి, పర్యాటకుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేసిన కొత్తపల్లి జలపాత ముఖద్వారంఅరకులోయ అందాలనుఆస్వాదించాలని వచ్చే పర్యాటకుల రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న ట్రాఫిక్ నిర్ణయం వల్ల స్థానిక పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎస్.కోట నుంచి అరకుకు వెళ్లే మార్గాన్ని వన్వేగా మార్చడం, తిరుగు ప్రయాణాన్ని పాడేరు మీదుగా మళ్లించడం.. పర్యాటకులకే కాకుండా, పర్యాటకంపైఆధారపడి బతుకుతున్న వేలాది కుటుంబాలకు శాపంగా మారింది. ప్రస్తుత ఆంక్షల వల్ల తిరుగు ప్రయాణంలో పర్యాటకులు అసలు అరకులోయలోకి ప్రవేశించే అవకాశమే లేకుండా పోయింది. భద్రత పేరుతో తీసుకున్నఈ నిర్ణయంతో పర్యాటకుల్లో భయాందోళన నెలకొంది. రద్దీని క్రమబద్ధీకరించడం అవసరమే అయినా, పర్యాటక రంగాన్ని కుదేలు చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాడేరు/అరకులోయ టౌన్ : జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేషంగా అభివృద్ధి చేసింది. మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఎటువంటి ఆంక్షలు విధించకపోవడం వల్ల పర్యాటకులు భారీగా తరలివచ్చేవారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. అధికారం చేపట్టిన 18 నెలల కాలంలో మన్యం పర్యాటకాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయకపోగా ఆంక్షలు విధించి పర్యాటకులను ఇబ్బందులు పాల్జేస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతాన్ని రూ.కోటి నిధులు వెచ్చించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. చింతపల్లి మండలం చెరువులవెనం, కొయ్యూరు మండలం డౌనూరు ఘాట్లోని బోడకొండమ్మ ఆలయం వద్ద వ్యూపాయింట్లను అందుబాటులోకి తెచ్చింది. ఒకొక్కదానికి రూ.40 లక్షలు వెచ్చించింది. చింతపల్లి మండలం తాజంగి వద్ద రూ.35కోట్లతో గిరిజన స్వాతంత్య్ర సమరయోథుల మ్యూజియం నిర్మాణం చేపట్టింది. గత ప్రభుత్వంలో అప్పటి గిరిజన సంక్షేమశాఖ మంత్రి శంకుస్థాపన చేశారు. వెచ్చించిన మొత్తం నిధుల్లో రాష్ట్రవాటా రూ.25 కోట్లు ఉన్నాయి. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లోని సందర్శిత ప్రాంతాలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.6.35 కోట్లతో అభివృద్ధి చేసింది. పర్యాటకులకు సౌకర్యవంతంగా చర్యలు చేపట్టింది. గిరిజన మ్యూజియంలో గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ప్రతిమలు వెలిసిపోయినా అంతకుముందు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా రూ. 5 కోట్ల నిధులు కేటాయించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. చాపరాయి జలవిహారి వద్ద సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడేవారు. ఇక్కడ జలపాతంలో ఉన్న ఊబిలో చిక్కుకుని పర్యాటకులు ప్రమాదాలకు గురయ్యేవారు.హుద్హుద్ సమయంలో పద్మాపురం ఉద్యానవనంలో ట్రీహట్స్ శిథిలమైనా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.70 లక్షలతో చాపరాయి జలవిహారి, రూ.60 లక్షలతో పద్మాపురం ఉద్యానవనంలో కాటేజీలను నిర్మించింది. డుంబ్రిగుడ మండలంలోని అంజోడ సిల్క్ ఫారం వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.1.02 కోట్లు వెచ్చించి అరకు పైనరీని నిర్మించింది. ఇలా అన్నివిధాలుగా పర్యాటక ప్రాంతాలను గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఆంక్షల పేరుతో పర్యాటకులను ఇబ్బందులు పెడుతోంది. -
పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినా మంచు ప్రభావం కొనసాగుతోంది. చలి ప్రభావం ఎక్కువగానే ఉంది. ఆదివారం జి.మాడుగులలో 9.3 డిగ్రీలు, అరకువ్యాలీలో 9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధి చింతపల్లిలో 10.0 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 10.9 డిగ్రీలు, పాడేరులో 11.2 డిగ్రీలు, పెదబయలులో 11.5 డిగ్రీలు, హుకుంపేటలో 12.1 డిగ్రీలు, కొయ్యూరులో 13.5 డిగ్రీలు, అనంతగిరిలో 14.9 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. పోలవరం జిల్లాలో రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 12.3 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 14.3 డిగ్రీలు, మారేడుమిల్లిలో 14.5, అడ్డతీగలలో 15.5 డిగ్రీలు, రంపచోడవరంలో 16.8 డిగ్రీలు, చింతూరు డివిజన్ చింతూరులో 15.3 డిగ్రీలు, ఎటపాకలో 17.8 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన తెలిపారు. ● గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి శీతల గాలులు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, చిరువ్యాపారులు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళలో 9 గంటలు దాటే వరకూ పొగమంచు తెరలు వీడటం లేదు. డుంబ్రిగుడ: మండలంలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది.దీంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.జి.మాడుగులలో 9.3 డిగ్రీల నమోదు -
హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలి
కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు: బొత్స సత్యనారాయణబీచ్రోడ్డు: వైఎస్సార్సీపీ పురోగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం సిరిపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అరకు నియోజకవర్గ నాయకులు బొత్సను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలతో పాటు పార్టీకి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న తీరుపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని బొత్స వారికి సూచించారు. పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని, పార్టీ కోసం కష్టపడేవారికి తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. బొత్సను కలిసిన వారిలో జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జిన్ని నరసింహమూర్తి, అరకు వ్యాలీ ఎంపీటీసీ దురియ ఆనంద్ కుమారి, సీనియర్ నాయకులు భూర్జ హస్తిన కుమార్, గొల్లోరి గోపాల్ రావు, మజ్జి గురు, బోయి మోహన్ రావు, శెట్టి సోమేష్, కొర్రా బాబురావు, కొర్రా సాలమన్, భీమన్న, రామారావు తదితరులు ఉన్నారు. -
ఏజెన్సీ సంపద దోపిడీ
● ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ఎటపాక: ఏజెన్సీ ప్రాంతంలోని భూమి, నీరు అడవులు, ఖనిజ సంపద దోపిడీకు గురవుతున్నాయని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ఆరోపించారు. ఆదివారం ఆయన మండలంలోని మండలం పట్టుచీర గ్రామంలో ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. చింతూరు డివిజన్లో అమాయక గిరిజనులను గిరిజనేతరులు మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల నుంచి తక్కువ రేట్లకే భూమి కౌలుకు తీసుకొని జామాయల్ తోటలు సాగు చేస్తున్నారని విమర్శించారు. గిరిజనుల భూములను గిరిజనేతరులకు కౌలుకు ఇవ్వరాదని అన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో నల్లరాయి, తెల్లరాయి, గ్రావెల్, ఇసుక, మైనింగ్లు చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయన్నారు. వీటిపై సంబంధిత అధికారులు ముడుపులు తీసుకొని ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటపాక మండలం గుండాల క్వారీలో జరుగుతున్న అక్రమాలపై పత్రికల్లో కథనాలు వస్తున్నా అధికారులు పట్టించుకోడం లేదన్నారు. ఏజెన్సీ ప్రజలు ఈ అంశాలపై పోరాటానికి దిగాలని పిలుపు ఇచ్చారు. పాయం భాస్కర్, మడకం రాముడు, మడివి జోగయ్య, కోడి కృష్ణ, సత్యం, అంజి పాల్గొన్నారు. -
బకులూరు రంగురాళ్ల క్వారీ తవ్వకాలు అడ్డగింపు
● అనుమతులు రద్దుచేయాలని గ్రామంలో ఒక వర్గం డిమాండ్ ● వ్యతిరేకంగా ఆందోళన కొయ్యూరు: మండలంలోని బకులూరు రంగురాళ్ల క్వారీ అనుమతులు రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఆదివారం పనులను అడ్డుకున్నారు. రంగురాళ్ల క్వారీ నిర్వహణకు ఇదే పంచాయతీ అంకంపాలెంకు చెందిన పొట్టిక సత్యనారాయణ అనుమతులు పొందారు. ఈ మేరకు ఆయన ఆదివారం జేసీబీతో కొండను తవ్వేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానికుల్లో ఒక వర్గం అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ కిషోర్వర్మ, సిబ్బందితో క్వారీ ప్రాంతానికి చేరుకున్నారు. స్థానికుల్లో ఒక వర్గం క్వారీ నిర్వహణకు మద్దతు తెలపగా, మరో వర్గం వ్యతిరేకించడంపై ఎస్ఐపై స్పందించారు. క్వారీ నిర్వహణకు అభ్యంతరాలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని ఆందోళనకారులకు సూచించారు. ఇలావుండగా క్వారీ అనుమతులకు సంబంధించి గ్రామ సభ నిర్వహించి, మెజారిటీ అభిప్రాయాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్థానికులు తెలిపారు. -
కార్మిక హక్కులు, చట్టాల పరిరక్షణకు కృషి
పాడేరు రూరల్: ఎర్ర జెండాల అండతోనే అన్ని వర్గాల కార్మిక, ఉద్యోగుల హక్కులు చట్టాల పరిరక్షణ సాధ్యమని సీఐటీయూ జిల్లా సహయ కార్యదర్శి లింగేరి సుందరరావు తెలిపారు. మండలంలో మినుములూరు కాఫీ కాలనీలో ప్రధాన రహదారి కూడలిలో వివిధ రంగాల కార్మిక సంఘాల నాయకులతో కలిసి సీఐటీయూ జెండాను అవిష్కరించారు, అనంతరం ఆయన మాట్లాడుతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు అద్ధం పటే విధంగా కార్మిక హక్కులు, చట్టాలను నిర్వీర్యానికి కుట్ర పనుతున్నారన్నారు. కార్మిక చట్టాల అమలులో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండ స్కీం వర్క్ర్లు, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్, కార్మికులను నిలుపుదోపిడీ చేస్తుందన్నారు. అనంతరం విశాఖలో జరిగే సీఐటీయూ అఖీల భారత మహసభకు కార్మిక సంఘాల నాయకులు, తరలి వెళ్లారు, కార్మిక సంఘాల నాయకులు ప్రసాద్, రత్నాలమ్మ, సుజాత, కాంతమ్మ, కాసులమ్మ, రాజేశ్వరి, మణి, సూరిబాబు, సింహచలం తదితరులు పాల్గొన్నారు. -
జీవన సత్య పట్టుదల అందరికీ ఆదర్శం
● అథ్లెట్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటా ● అరకు ఎంపీ తనూజరాణి ● రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత పాడేరు: నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆదివాసీ బాలిక జీవన సత్య పట్టుదల అందరికీ ఆదర్శమని, భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ అథ్లెట్గా ఆమెను మార్చే బాధ్యత తీసుకుంటానని అరకు ఎంపీ తనూజరాణి హామీ ఇచ్చారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన 10కే మారథాన్లో రన్నరప్గా నిలిచి సంచలనం సృష్టించిన ఆమెను శనివారం పాడేరులోని తన నివాసంలో ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. అరకువ్యాలీలోని శారదానికేతన్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఆమె ప్రతిభను కొనియాడారు. ఆమెకు తక్షణ అవసరాల కోసం తన సొంత నిధులు రూ.10 వేల నగదు అందజేశారు. ఆమెను ఉత్తమ క్రీడాకారిణిగా తీర్చిదిద్దేందుకు ఒక మంచి క్రీడా అకాడమీలో చేర్పించి, నాణ్యమైన శిక్షణ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, అడ్డుమండ సర్పంచ్ గుమ్మా శ్యాం సుందర్, రూఢకోట సర్పంచ్ కాతరి సురేష్కుమార్, నేతలు ఎల్బీ కిరణ్, బాలకృష్ణ, ప్రకాశ్, విజయ్ పాల్గొన్నారు. -
నెలలు నిండకుండానే ప్రసవం
● అరకిలో బరువుతో శిశువు జననం ● మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలింపు ● చేరుకుమల్లులో ఘటన సీలేరు: నెలలు నిండకుండానే ఓ గర్భిణి ప్రసవించగా.. పుట్టిన బిడ్డ కేవలం అర కేజీ (500 గ్రాములు) మాత్రమే ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన గూడెంకొత్తవీధి మండలం, ధారకొండ పంచాయతీ పరిధిలోని చేరుకుమల్లులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అల్లంకి రవి, రత్నం దంపతులు ఉపాధి కోసం ఏడాది క్రితం హైదరాబాద్లోని ఒక రొయ్యల ఫ్యాక్టరీకి వెళ్లారు. అ క్కడ గర్భం దాల్చిన రత్నం, ఎటువంటి వైద్య పరీక్షలు చేయించుకోకుండా, మందులు వాడకుండా నిర్లక్ష్యంగా ఉంది. గత నెల 27న వారు తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఆరో నెల గర్భంతో ఉన్న రత్నానికి సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా నొప్పులు రావడంతో ఇంట్లోనే ప్రసవించింది. పుట్టిన శిశువు అత్యల్ప బరువుతో పాటు, అవయవ లోపంతో ఉండటాన్ని చూసి కుటుంబ సభ్యులు భయాందోళన కు లోనయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఆశా కార్యకర్త వెంటనే ఏఎన్ఎంకు సమాచారం అందించారు. వా రు హుటాహుటిన బాధితుల ఇంటికి చేరుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంత రం తల్లీబిడ్డను ధారకొండ ఆసు పత్రికి తరలించారు. వైద్యాధికారి డాక్టర్ బాబ్జి శిశువు పరిస్థితిని పరిశీలించారు. మెరుగైన వైద్యం అందించడం కోసం శనివారం చింతపల్లి ప్రభు త్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ వైద్యు ల పర్యవేక్షణలో ఉన్నారు. గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. -
ఆశా కార్యకర్త చొరవతో ఆస్పత్రికి రోగి తరలింపు
సీలేరు: దుప్పులవాడ పంచాయతీ వలసపల్లికి చెందిన కిముడు సోమర అనే వృద్ధుడు వారం రోజులుగా తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఆశా కార్యకర్త ఇచ్చిన మాత్రలు వాడినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో శనివారం అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే ఆశా కార్యకర్త అంబులెన్స్కు సమాచారం అందించింది. గ్రామానికి వెళ్లే మార్గం సరిగ్గా లేకపోవడంతో అతనిని గ్రామస్తులు, బంధువులు మోసుకుంటూ గెడ్డను దాటించి అంబులెన్సులో ఎక్కించారు. అక్కడి నుంచి సీలేరు పీహెచ్సీకి తీసుకువచ్చారు. సోమరకు వైద్య పరీక్షలు నిర్వహించగా మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రక్తహీనత ఎక్కువగా ఉండటం, దానికి తోడు దగ్గు, ఆయాసం తీవ్రంగా ఉండటంతో ఆయనకు టీబీ ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ఆస్పత్రికి తరలించామని వైద్యాధికారి నారాయణరావు తెలిపారు. -
క్రమశిక్షణతో మెలగాలి
● సబ్ కలెక్టర్ సాహిత్, డీఎస్పీ సాయిప్రశాంత్ రంపచోడవరం: యువత మంచి క్రమశిక్షణతో మంచి లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించేందుకు కష్టపడాలని సబ్ కలెక్టర్ సాహిత్, రంపచోడవరం సాయిప్రశాంత్ సూచించారు. అభ్యుదయం కార్యక్రమంలో భాగంగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పీఎంఆర్సీ వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఏజెన్సీలో ఎక్కడా గంజాయి లేకుండా పోలీసుశాఖ చర్యలు చేపట్టిందని, అక్కడక్కడ జరుగుతున్న రవాణాపై కూడా ప్రత్యేకదృష్టి పెట్టి అడ్డుకట్ట వేస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పాఠశాలలు, కళాశాలల్లో యువతకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాలాజీ, సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ వెంకట్రావు పాల్గొన్నారు. -
తాళపత్రాలకు నవ వైభవం
అక్షర సేద్యంలో ‘క్షీర సాగర్’ మథనం తాటాకుపై లిఖించిన గోవింద నామాలు సవాళ్లను అధిగమించి సాధించిన అమృతం క్షీర సాగరాన్ని మథిస్తే అమృతం లభించినట్లుగానే, తన మనసును మథించిన క్షీర సాగర్.. తాటాకుపై అక్షరాలను లిఖించే విధానాన్ని నేటి కాలానికి అనుగుణంగా మార్చారు. పూర్వం తాటాకుపై ఘంటంతో రాసేవారు. ఆ విద్య తెలిసిన వారు ఇప్పుడు కరువవడంతో, ఆయన ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించారు. ఢిల్లీలో జరిగిన ప్రింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక లేజర్ మిషన్ను చూసిన ఆయనకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. నేమ్ బోర్డుల తయారీకి వాడే ఆ యంత్రాన్ని తాటాకుపై అక్షరాల ముద్రణకు వీలుగా మార్పులు చేశారు. ఎన్నో ప్రయోగాల తర్వాత అత్యంత స్పష్టంగా అక్షరాలను ముద్రించడంలో విజయం సాధించారు. ప్రాచీనతకు ఆధునికత మేళవించి.... విజయనగరం జిల్లా ఎల్.కోట పరిసరాల నుంచి సేకరించిన తాటాకులను శుభ్రం చేసి, నిర్ణీత కొలతల్లో కత్తిరిస్తారు. వాటిపై లేజర్ సాయంతో ఆధ్యాత్మిక స్తోత్రాలు, శ్లోకాలు, దేవతా రూపాలను ముద్రిస్తారు. ఈ తాళపత్రాలు ఏళ్ల తరబడి పాడవకుండా పసుపు, ప్రత్యేకమైన కోటింగ్ వేస్తారు. వీటిని చూడగానే పాతకాలపు జ్ఞాపకాలు గుర్తుకు రావడమే కాకుండా, చదవడానికి ఎంతో సులువుగా ఉంటున్నాయి. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం, గాయత్రి మంత్రం వంటి వాటిని తాళపత్రాల రూపంలో సిద్ధం చేసి అపురూప బహుమతులుగా అందిస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా అవార్డు... ప్రధాని చేతుల మీదుగా ‘శ్రమ శ్రీ’ క్షీర సాగర్ ప్రతిభ కేవలం ఈ కళకే పరిమితం కాలేదు. గతంలో నేవల్ డాక్యార్డ్లో పనిచేసిన ఆయన.. వృత్తి పట్ల చూపిన అంకితభావానికి 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పాయ్ చేతుల మీదుగా ‘శ్రమ శ్రీ’ అవార్డును అందుకున్నారు. అలాగే నావికాదళ అధికారుల నుంచి అనేక ప్రశంసలు పొందారు. సాహస యాత్రలు, ట్రెక్కింగ్, సైక్లింగ్ వంటి అభిరుచులతో పాటు అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించి సామాజిక బాధ్యతను చాటు కున్నారు. తాటాకుపై ఆహ్వాన పత్రిక మార్పు తన ఇంటి నుంచే మొదలవ్వాలని భావించిన సాగర్, తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రాలను తాటాకుపైనే ముద్రించి అతిథులను ఆశ్చర్యపరిచారు. పెళ్లికి వచ్చిన వారికి మొక్కలను బహుమతిగా ఇచ్చి ప్రకృతిపై తనకు న్న ప్రేమను చాటుకున్నారు. చివరికి తన పదవీ విరమణ రోజున కూడా 500 పండ్ల మొక్కలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణలో తనవంతు పాత్ర పోషించారు. కనుమరుగవుతున్న తాళపత్ర కళను నేటి తరానికి చేరువ చేస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ ఆయన సాగిస్తున్న ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. నేటి డిజిటల్ యుగంలో అక్షరం కాగితంపై నుంచి తెరపైకి మారిపోయింది. పుస్తకం కంటే స్మార్ట్ఫోనే ప్రాణప్రదంగా మారిన ఈ కాలంలో మన పూర్వీకుల అపార జ్ఞాన నిధులైన తాళపత్రాల (తాటాకు గ్రంథాలు) గురించి నేటి తరానికి అసలు అవగాహనే లేదు. అపారమైన వారసత్వ సంపదగా విరాజిల్లిన ఈ తాళపత్ర కళ కనుమరుగవుతున్న తరుణంలో, దానికి ఆధునిక సొబగులు అద్ది పునర్జీవం పోస్తున్నారు విశాఖకు చెందిన కేశవరాజు క్షీర సాగర్. ప్రకృతిపై మమకారం, సంస్కృతిపై గౌరవం ఆయన్ని ఈ వినూత్న మార్గంలో నడిపించాయి. –ఏయూక్యాంపస్ నేటి తరానికి తెలియజేయాలని.. శతాబ్దాలుగా మన దేశంలో ఉన్న తాళపత్రాలు నేటి తరానికి తెలియజేయాలనే ప్రయత్నించా. మన సంస్కృతి, ప్రకృతితో ముడిపడిన మన జీవన విధానం నేటి యువతకు పరిచయం చేస్తున్నా.. భవిష్యత్తులో అనేక గ్రంథాలను తాళపత్రాలపై ముద్రించాలనే ఆలోచన ఉంది. మరుగున పడిపోతున్న కళను సంరక్షించడం, ఆధునికతను దానికి జోడించే చిన్న ప్రయత్నం చేస్తున్నా. ఎంతో ఓపికతో సమయం తీసుకుని వీటిని సిద్ధం చేయాల్సి ఉంటుంది. మా కుటుంబలో జరిగే అన్ని శుభకార్యాలకు తాటాకుతో చేసిన ఆహ్వానాలు అందిస్తున్నాం. వీటిని తీసుకున్నవారు కూడా ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకుంటున్నారు. –కె. క్షీర సాగర్, అక్కయ్యపాలెం -
వ్యసనాలకు దూరంగా ఉండాలి
● చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్ చింతూరు: మత్తుకు బానిసైన యువత తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని, యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్ అన్నారు. అభ్యుదయం కార్యక్రమంలో భాగంగా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ఒడిశా జంక్షన్ నుంచి చింతూరు మెయిన్రోడ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీలో గంజాయి నిర్మూలనకు పోలీసులు కృషి చేస్తున్నారని, దీనికి ప్రజల సహకారం కూడా కావాలని కోరారు. గంజాయి అక్రమ రవాణా చేసినా, విక్రయించినా కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మాదక ద్రవ్యాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయని, యువత వాటి జోలికిపోకుండా తమ భవిష్యత్తును సుగమం చేసుకోవాలని ఏఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐ రమేష్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: విద్యార్థుల ఆరోగ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరించారు. శనివారం ఆయన స్థానిక పీటీజీ బాలుర కళాశాల, బాలికల పాఠశాలను సందర్శించారు. కళాశాలలో ఆనారోగ్యంతో బాధపడుతూ రక్త పరీక్షలు చేయించుకుంటున్న విద్యార్థుల ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. నాణ్యమైన విద్య, మెనూ ప్రకారం భోజనం అందుతుందా.. లేదా అని ప్రశ్నించారు. రికార్డులు పరిశీలించిన ఎమ్మెల్యే మెనూ ప్రకారం వండి వడ్డిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. పాఠశాలలో రుచికరంగా భోజనం లేకపోవడాన్ని గుర్తించిన ఎమ్మెల్యే తగు సూచనలు చేశారు. పాఠశాలలో ప్రహరి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పాఠశాలకు ప్రహరి నిర్మించి, పాఠశాల స్థలం కబ్జాకు గురికాకుండా చూడాలని సూచించారు. టెన్త్ విద్యార్థులకు యూనిఫారం అందించారు. మహిళా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
కొనసాగుతున్న చలిగాలులు
● ముంచంగిపుట్టులో 8.1 డిగ్రీల నమోదు చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా చలిగాలులు కొనసాగుతున్నాయి. శనివారం ముంచంగిపుట్టులో 8.1 డిగ్రీలు, జి మాడుగులలో 8.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధి అరకువ్యాలీలో 9.4 డిగ్రీలు, హుకుంపేట, పెదబయలులో 10.9 డిగ్రీలు, పాడేరులో 11.7 డిగ్రీలు, చింతపల్లిలో 13.2 డిగ్రీలు, కొయ్యూరులో 14.7 డిగ్రీలు, అనంతగిరిలో 15.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు ఏడీఆర్ పేర్కొన్నారు. పోలవరరం జిల్లాలో పోలవరం జిల్లాలో రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లిలో 12.5 డిగ్రీలు, వై.రామవరంలో 13.1 డిగ్రీలు, రంపచోడవరంలో 16.0 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 16.5 డిగ్రీలు, అడ్డతీగలలో17.4 డిగ్రీలు, చింతూరు డివిజన్ పరిధి చింతూరులో 16.8 డిగ్రీలు, ఎటపాకలో 17.6 డిగ్రీలు నమోదు అయినట్లు ఏడీఆర్ వెల్లడించారు. రాజవొమ్మంగి: మండల ప్రజలు చలితీవ్రతకు వణికిపోతున్నారు. ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. జి.మాడుగుల: మండలంలో చలితీవ్రత కొనసాగుతోంది. పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి రోడ్డు, నుర్మతి, సోలభం, కుంబిడిసింగి, లువ్వాసింగి రోడ్లలో శనివారం ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు అలుముకున్నాయి. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
చింతూరు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 104 ఉద్యోగులు శనివారం చింతూరులో పోలవరం జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ సరిత, చింతూరు డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ పుల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ తమపై యాజమాన్యం వేధింపులు, షోకాజ్ నోటీసులు, సస్పెండ్ వంటి చర్యలను నిలుపుదల చేయాలన్నారు. రద్దుచేసిన 15 క్యాజువల్ సెలవులను తక్షణమే పునరుద్ధరించాలని, ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు అదనపు సిబ్బందిని నియమించాలని, తొలగించిన బఫర్ సిబ్బందిని పునరుద్ధరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు కోట్ల పవన్కుమార్, గుయ్యం నవీన్కుమార్, అల్లి మనోహర్ పాల్గొన్నారు. -
సమావేశంలో వెల్లువెత్తిన సమస్యలు
● అధికారుల గైర్హాజరుపై సభ్యుల ధ్వజం అడ్డతీగల: సమావేశాల్లో చర్చించిన అంశాలు పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపకపోవడంపై అడ్డతీగల సర్వ సభ్య సమావేశంలో సభ్యులు ధ్వజమెత్తారు. మండల సర్వసభ్య సమావేశం శనివారంఎంపీపీ బొడ్డపాటి రాఘవ అధ్యక్షతన శనివారం జరిగింది. గ్రామాల్లో ప్రజలెదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు చెబుతున్నా అధికారులు వాటిని పెడచెవిన పెడ్తున్నారన్నారు. రోడ్ల పనులకు అనుమతులు ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని డీఈ నాగరాజుని సభ్యులు నిలదీశారు. మ్యూటేషన్లు జరగక రైతులకు పథకాలు అందడం లేదన్నారు. మిట్టపాలెంలో డీఆర్ డిపో ఏర్పాటుచేయాలని, గ్రామాల్లో లోఓల్టేజీ సమస్య పరష్కరించాలని సభ్యులు సమస్యలను ప్రస్తావించారు. ఎకై ్సజ్ శాఖ తరఫున హెచ్సీ సమావేశానికి వచ్చి ఎకై ్సజ్ శాఖ కేసులను వివరించారు. ఎంపీడీవో కుమార్ మాట్లాడుతూ ప్రతి శాఖకు చెందిన అధికారులు సమావేశానికి హాజరు కావాలని సూచించారు. జెడ్పీటీసీ సభ్యుడు మద్దాల వీర్రాజు, తహసీల్దార్ దొరకయ్య, వైస్ ఎంపీపీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. గంగవరం: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్లు, ఎంపీటీసీలకు రెండేన్నరేళ్లుగా గౌరవ వేతనం మంజూరు చేయడంలేదని సభ్యులు ధ్వజమెత్తారు. జెడ్పీటీసీ బేబీ రత్నం మాట్లాడుతూ మండలం అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులకు గౌరవ వేతనాలు చెల్లించిక పోవడం అన్యాయమని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎంపీడీవో లక్ష్మణరావు సభ్యులను కోరగా సభ్యులు శాంతించారు. ఆయా శాఖల అధికారులు ప్రగతిని సమావేశంలో వివరించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన 17 మంది సర్పంచ్లను సన్మానించారు. వైస్ ఎంపీపీలు రామతులసి , గంగాదేవి, ఎంపీటీసీ సభ్యులు ఆదినారాయణ, కనకలక్ష్మి, పద్మావతి, వెంకటలక్ష్మి కోఆప్షన్ సభ్యుడు ప్రభాకర్, ఎంపీడీవో లక్ష్మణరావు, వైద్యాధికారి భావన, ఏవో విశ్వనాథ్ , ఎంఈవో మల్లేశ్వరరావు, ఏపీఓ ప్రకాష్ , ఏపీఎం అప్పలకొండ , డిప్యూటీ ఎంపిడీవోలు నరసింగరావు, గోపి, సర్పంచ్లు, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చింతూరు: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సవలం అమల అధ్యక్షతన శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చిచ్చడి మురళీ మాట్లాడుతూ గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా అధికారులు చూడాలని కోరారు. పాడైన అంగన్వాడీ భవనాలకు మరమ్మతు చేయాలని, రైతులకు సకాలంలో విత్తనాలు సరఫరా చేయాలని, ప్రొటోకాల్ పాటించి ప్రజాప్రతినిధులను గౌరవించాలని సూచించారు. వైస్ ఎంపీపీ యడమ అర్జున్, తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాసదొర, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు పాల్గొన్నారు. -
చిన్నారి మృతిపై గిరిజనుల ఆందోళన
చింతపల్లి: వైద్యం వికటించడంతోనే రెండు నెలల శిశువు మృతి చెందాడని ఆరోపించారు. దీనిలో భాగంగా శనివారం స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద బాధిత తల్లిదండ్రులతో వారు ఆందోళన నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. గత డిసెంబర్ డిసెంబర 31న మండలంలోని చౌడుపల్లి పంచాయతీ చెదలపాడు గ్రామానికి చెందిన తాంబెలి చిట్టిబాబు, రాజేశ్వరి దంపతుల రెండునెలల బాబు అస్వస్థతకు గురయ్యాడు. అతనిని తల్లిదండ్రులు అదే రోజు స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చారు. చిన్నపిల్లల వైద్యురాలు సూచనల మేరకు వైద్యసిబ్బంది చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా మారడంతో శిశవును నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే రెండునెలల బాబు మరణించాడు. ఈఘనటకు చింతపల్లి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని బాధిత చిన్నారి తల్లిదండ్రులు, పలువురు గిరిజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనకారులతో డీసీహెచ్ఎస్ నీలవేణి మాట్లాడారు. సంఘటనపై విచారణ చేపట్టి కమిషనర్కు నివేదిస్తామన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాబూరావు, మాజీ డీసీసీ అధ్యక్షుడు వంతల సుబ్బారావు, చిరంజీవి, సాగిన కృష్ణపడాల్ బాలరాజు పాల్గొన్నారు. చింతపల్లి ఏరియా ఆస్పత్రి వైద్యులనిర్లక్ష్యమేనని ఆవేదన విచారణ చేపడతామని డీసీహెచ్ఎస్ నీలవేణి హామీ శాంతించిన ఆందోళనకారులు -
పర్యాటక సౌరభం
మన్యం ప్రాంతం పర్యాటకుల సందడితో కళకళలాడుతోంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో పర్యాటకుల రాక గణనీయంగా పెరగడంతో పర్యాటక శాఖ, పాడేరు ఐటీడీఏకు భారీ ఆదాయం సమకూరింది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు సందర్శకులు పోటెత్తడంతో స్థానిక పర్యాటక కేంద్రాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ రికార్డు స్థాయి రాకతో అటు ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా, ఇటు స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి మన్యం ఆర్థికంగా పుంజుకుంటోంది. బొర్రా గుహలకు భారీగా తరలివస్తున్న సందర్శకులుకలిసొచ్చిన 2025పర్యాటకుల రద్దీ బాగున్నప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే ఆదాయంలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. 2024 ఏప్రిల్ – డిసెంబర్ మధ్య రూ. 4,86,66,977 ఆదాయం వచ్చింది. 2025లో అదే సమయానికి రూ. 4,50,15,050 వచ్చింది. అయితే గతేడాది కంటే ఈ ఏడాది రూ.36,51,920 ఆదాయం తగ్గింది. తుపాను ప్రభావం వల్ల సుమారు 52,170 మంది వరకు సందర్శకుల సంఖ్య తగ్గింది. – గౌరీశంకర్, మేనేజర్, బొర్రా గుహలు రోజుకు రూ.వెయ్యి ఆదాయం మాడగడ నుంచి సన్రైజ్ వ్యూపాయింట్ వరకు ప్రతీ రోజు ఆటోలో పర్యాటకులకు తీసుకువెళ్లి తీసుకువస్తుంటా. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పర్యాటకులను తీసుకువెళ్తుంటా. ఆయిల్ ఖర్చులు పోగా రోజుకు రూ.వెయ్యి వరకు ఆదాయం వస్తుంది. – మాదల బారికి గెన్ను, ఆటో డ్రైవర్, మాడగడ, అరకులోయఅరకులోయ టౌన్: మంచు దుప్పటి కప్పుకున్న అరకు ప్రాంత అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. 2025 ముగింపు వేళ అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లోని పర్యాటక కేంద్రాలు జనసందోహంతో కిటకిటలాడాయి. అక్టోబర్లో తుపా ను ప్రభావంతో కాస్త వెనుకబడిన పర్యాటకం, నవంబర్, డిసెంబర్ నెలల్లో పుంజుకుని పర్యాటక శాఖకు, పాడేరు ఐటీడీఏకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఒక్క నెలలోనే రూ. 2.35 కోట్లు.. గత ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి 31 వరకు సుమారు 3,76,296 మంది పర్యాటకులు మన్యంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. వీరి ద్వారా ప్రవేశ రుసుం రూపంలో రూ. 2,35,91,610 ఆదాయం సమకూరింది. ఇందులో సింహభాగం బొర్రా గుహల నుంచి రావడం విశేషం. ఆదాయ వివరాలు: బొర్రా గుహలను 1,78,571 మంది సందర్శించగా రూ. 1.25 కోట్లు సమకూరింది. గిరిజన మ్యూజియాన్ని 1,08,044 మంది సందర్శించగా రూ. 64.75 లక్షల ఆదాయం వచ్చింది. చాపరాయి జలవిహారిని 54,561 మంది సందర్శించగా రూ. 20.29 లక్షలు సమకూరింది. పద్మాపురం గార్డెన్ను 35,120 మంది సందర్శించారు. రూ. 30.86 లక్షల ఆదాయం వచ్చింది. ఉపాధికి కేరాఫ్ అడ్రస్ ‘మాడగడ’ ఈ ఏడాది అరకులోయ మండలంలోని మాడగడ సన్రైజ్ వ్యూ పాయింట్ పర్యాటకుల హాట్ స్పాట్గా మారింది. ఇక్కడ సుమారు 300 గిరిజన కుటుంబాలు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నాయి. పర్యాటకులకు గిరిజన సంప్రదాయ దుస్తులు అలంకరించడం, థింసా నృత్యాలు, స్థానిక తినుబండారాల విక్రయాల ద్వారా మహిళలు, యువత మంచి ఆదాయం గడిస్తున్నారు. అరకు పర్యాటకానికి కాసుల పంట పెరుగుతున్న తాకిడి ఒక్క డిసెంబర్ నెలలోనే 3,76,296 మంది సందర్శన రూ.2,35,91,610 ఆదాయం -
ఏజెన్సీలో రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు
జి.మాడుగుల: జిల్లాలోని గిరిజన గ్రామాలకు ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యేక నిధులు కేటాయించాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు కోరారు. మండలంలోని గెమ్మెలి పంచాయతీ చీమలపాడు గ్రామంలో రూ.1.60 కోట్లతో తారురోడ్డు నిర్మాణ పనులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాను విజయం సాధిస్తే గెమ్మెలి రోడ్డు నుంచి చీమలపాడు వరకు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం పనులు చేపట్టామన్నారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి రహదారులు కీలక ప్రాత పోషిస్తాయని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు రవాణాలో సౌలభ్యం కలుగుతుందని ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పక్కాలు రోడ్లు నోచుకోకపోవడంతో ప్రజలు రోడ్డు, రవాణా కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం, అధికారులు కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండం నాయుడు, సర్పంచ్ సీదరి కొండబాబు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంజరి సీతారాంనాయుడు, వైఎస్సార్సీపీ నేతలు సిర్మా పండన్న, బంగార్రాజు, నీలమ్మ, వలసయ్య, చిట్టిబాబు, మన్మథరావు, లక్ష్మినాయుడు, బాలయ్యపడాల్, గంగరాజు, మర్రి బాలరాజు, కోటిబాబు, బొనంగి బాలయ్య పడాల్, శంకరరావు, సత్తిబాబు, ఆశీర్వాదం, బాలు, కొండబాబు, మాజీ సర్పంచ్ పండుదొర, కూర్మారావు, పీఆర్ఏఈ మాణిక్యం, సీడీపీవో బాలచంద్రమణిదేవి, ఉపాధి హామీ పథకం ఏపీవో కొండబాబు పాల్గొన్నారు.మంజూరు చేయాలని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు విజ్ఞప్తి -
యూనియన్ బ్యాంక్లో నో క్యాష్
● రాజవొమ్మంగిలో వెనక్కి పంపేస్తున్నబ్యాంకు అధికారులు ● ఆవేదన వ్యక్తం చేస్తున్న పెన్షనర్లు రాజవొమ్మంగి: స్థానిక యూనియన్ బ్యాంక్ అధికారు ల తీరుపై రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ తీసుకోవడం కోసం శనివారం బ్యాంకుకు వెళ్లిన వృద్ధులకు నగదు లేదు అంటూ అధికారులు సమాధానం ఇచ్చి వెనక్కి పంపేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణవర్మ మాట్లాడుతూ, బ్యాంకు పరిధిలో వంద మందికి పైగా పెన్షనర్లు ఉన్నారని తెలిపారు. దాదాపు ఏడాది కాలంగా బ్యాంకు సిబ్బంది నగదు లేదనే సాకుతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బ్యాంకుకు వచ్చే వారిలో మెజారిటీ పెన్షనర్లు 80 ఏళ్లు పైబడిన వారే. లోతట్టు గ్రామాల నుండి ఎంతో శ్రమకోర్చి, ప్రయాణ ఖర్చులు భరించి బ్యాంకుకు వస్తే, నగదు లేదనడం వల్ల వారు శారీరకంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కృష్ణవర్మ పేర్కొన్నారు.పెన్షనర్ల పట్ల బ్యాంకు అధికారులు ప్రదర్శిస్తున్న ఉదాసీన వైఖరిపై రీజినల్ మేనేజర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉన్నతాధికారు లు వెంటనే స్పందించి, పెన్షనర్లకు సకాలంలో నగదు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
గిరిజనులకు అప్పన్న చిత్రపటాలు, దుస్తుల అందజేత
సింహాచలం: అల్లూరి జిల్లాలో శ్రీనృసింహ దీక్ష చేపట్టిన పలువురు భక్తులకుి సింహాచలంలోని సింహాద్రి మఠం తరఫున శనివారం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చిత్రపటాలు, దుప్పట్లు, తువ్వాళ్లు గురుస్వామి కశిరెడ్డి సురేంద్రస్వామి అందజేశారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులోని బంగారు మెట్ట దరి సరియాపల్లి, పెదబయలు మండలం గలగండ పంచాయతీ సిరసపల్లి గ్రామంలో వీటిని అందజేశారు. సింహాచలం దేవస్థానం సౌజన్యంతో పూజా విధానం పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా స్వామివారి పూజ చేసి, భక్తి గీతాలు ఆలపించారు. -
లక్ష్మీపురం వైద్యాధికారి తీరుపై ఆందోళన
● మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపణ ● ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్కు ఫిర్యాదు ● తక్షణం బదిలీ చేయాలని డిమాండ్ చింతూరు: మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న లక్ష్మీపురం పీహెచ్సీ వైద్యుడితో పాటు అతనికి సహకరిస్తున్న డీఎంహెచ్వోను ఏజెన్సీ నుంచి బదిలీ చేయాలని ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం యూనియన్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది స్థానిక ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుష్టి జోగారావు, సలహాదారుడు మడివి నెహ్రూ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్ష్మీపురం పీహెచ్సీ వైద్యుడు మురళీకృష్ణ మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపించారు. డీడీవో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన డీఎంహెచ్వో అండతో మహిళా ఉద్యోగులను అక్రమంగా బదిలీ చేస్తున్నారని, కులాన్ని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఆదివాసీ ఉద్యోగులను చులకన భావంతో చూడడంతో పాటు మహిళా ఉద్యోగులను అక్రమంగా వేధిస్తున్న వైద్యాధికారిని వెంటనే ఇక్కడి నుంచి పంపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు, వైద్యసిబ్బంది ఐటీడీఏ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు చంద్రమ్మ, కుమారి, సమ్మక్క, నాగమణి, జయ, రాంప్రసాద్, సీతమ్మ, శశికళ, సీతమ్మ, రాజేష్, ఉత్తర, సత్యన్నారాయణ, సుందర్, విజయ్ పాల్గొన్నారు. ఐటీడీఏ పీవో విచారణ: మహిళా ఉద్యోగుల ఫిర్యాదుపై స్పందించిన ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పుల్లయ్యతో కలసి వారి సమక్షంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యాధికారి మురళీకృష్ణను విచారించారు. యూనియన్ నాయకులతో పాటు మహిళా సిబ్బంది నుంచి పూర్తి వివరాలు సేకరించిన ఆయన బదిలీలు, వేధింపులపై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటానని వారికి హామీనిచ్చారు. -
ఆటో, బైక్ ఢీ– ఆరుగురికి గాయాలు
● తీవ్ర గాయాలైన నలుగురికి విశాఖ కేజీహెచ్కు తరలింపు ● స్వల్పగాయాలైన ఇద్దరికి అరకు ఏరియా ఆస్పత్రిలో చికిత్సఅరకులోయటౌన్: అరకు–విశాఖ రోడ్డులో పానిరంగిని గ్రామం వద్ద శుక్రవారం ఎదురెదురుగా వస్తున్న ఆటో–బైక్ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాద సంఘటనకు సంభందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో బస్కీ పంచాయతీ దేవరాపల్లి నుంచి అరకులోయకు వస్తున్న ఆటో, అరకులోయ నుంచి విశాఖ వైపు వెళ్తున్న బైక్ ఢీ కొన్నాయి. బైక్పై వెళ్లున్న మండలంలోని రవ్వలగుడ గ్రామానికి చెందిన బురిడి జోయో(31)కు ఎడమ చెయ్యి విరిగింది. డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీ కుసుమగుడ గ్రామానికి చెందిన కొర్రా కృష్ణ(29)కు మొహాం, కుడి చెయ్యి, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న బస్కీ పంచాయతీ దేవరాపల్లికి చెందిన బాక అనిల్ కుమార్(16)కు కుడి చెవి నుంచి రక్తస్రావమవుతుంది. దేవరాపల్లికి చెందిన కిల్లో సల్మాన్(17)కు నడుముపై బలమైన గాయమైంది. అదే ఆటోలో ప్రయాణిస్తున్న అరకులోయ మండలం మాదల గ్రామానికి చెందిన పాంగి బంగార్రాజు(25)కు కుడి భుజం, తల వెనుక భాగం, బస్కీ పంచాయతీ దుంగియాపూట్కు చెందిన పాంగి హరిత(18)కు కుడికాళ్లుల, తలపై స్వల్పగాయాలైంది. తీవ్రగా యాలైన కొర్రా కృష్ణ, బి.అనిల్ కుమార్, సల్మాన్, జోయోలకు మెరుగైన వైద్యం కొసం విశా ఖ కేజిహెచ్కు తరలించినట్లు వైద్యులు గీత, బాలాజీ తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకుఇద్దరు ఎంపిక
నర్సీపట్నం: జాతీయ స్థాయి మహిళా బాక్సింగ్ టోర్నమెంట్కు నర్సీపట్నానికి ఇద్దరు సీనియర్ మహిళలు ఎంపికయ్యారు. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు న్యూఢిల్లీ లోని గ్రేటర్ నోయిడాలో జరిగే ఈ పోటీల్లో 75 కేజీల విభాగంలో బొంతు మౌనిక, 80 కేజీల విభాగంలో యర్రా తేజస్విని పాల్గొననున్నారు. గత నెల కాకినాడ జిల్లాలో జరిగిన 9వ రాష్ట్ర స్థాయి మహిళల బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించారని కోచ్ అబ్బు తెలిపారు. నేషనల్ స్థాయిలో ఇద్దరు విజయాలు సాధించి నర్సీపట్నానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు. నింజాస్ అకాడమీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు సతాపల్లి శ్రావణి, వెలగా నారాయణరావు, వెలగా జగన్నాథ్, శ్రీకాంత్, సురేష్ అకాడమి తరుపున ట్రాక్ సూట్లు అందజేశారు. -
గిరిజన విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు
రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యాలయాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నివేదికలు సమర్పించాలని ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రహరీల మరమ్మతులు, కొత్త ప్రహరీల నిర్మాణం, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, మరుగుదొడ్లు, సిక్ రూమ్ల మరమ్మతులు, రన్నింగ్ వాటర్ సదుపాయానికి సంబంధించి నివేదికలు సమర్పించాలన్నారు. విద్యార్థుల ఐడీ, ఆధార్ కార్డుల్లో తప్పులు సరిచేయించాలన్నారు. అవసరమైన చోట్ల మొబైల్ ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు డ్రాయింగ్, క్విజ్,్ గ్రూప్ డ్యాన్సులు నిర్వహించాలన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి మండలస్థాయి, తరువాత ఐటీడీఏ స్ధాయిలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. రిప్లబిక్ డేకు ఈ పోటీల్లో ఎంపికై న విద్యార్ధులను రంపచోడవరం తీసుకురావాలన్నారు. పోటీలు ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రమే నిర్వహించాలన్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాస్ కాఫీయింగ్కు అవకాశం లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షల విధానంపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీవో డీఎన్వీ రమణ, ఏజెన్సీ డీఈవో వై మల్లేశ్వరరావు, ఏటీడబ్ల్యూవోలు బి. చిన్నిబాబు, కృష్ణమోహన్, జె శంభుడు పాల్గొన్నారు.రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
పాడేరు : గిరిజన విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సూచించారు. 2025లో నిర్వహించిన ఎన్ఐటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సీటు సాధించిన అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ శివలింగపురం గ్రామానికి చెందిన శెట్టి అఖిల్ అనే గిరిజన విద్యార్థికి శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలోని తన ఛాంబర్లో ల్యాప్టాప్ను ఆమె అందజేశారు. గిరిజన విద్యార్థి అఖిల్ ఎన్ఐటీ పరీక్షల్లో 96 శాతం మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం గొప్ప విషయమన్నారు. అసోం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిలో అత్యంత డిమాండ్ ఉన్న సీఎస్ఈ విభాగంలో సీటు దక్కించుకున్నాడని చెప్పారు. గిరిజన విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని సరైన ప్రోత్సహంతోనే అది బయటపడుతుందన్నారు. ఉన్నత చదువుల్లో మెరుగ్గా రాణించి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఆమె ఆకాక్షించారు. ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, ఏవో హేమలత పాల్గొన్నారు. ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఎన్ఐటీలో సీటు సాధించిన గిరిజన విద్యార్థికి అభినందన ల్యాప్టాప్ అందజేత -
అంబులెన్సులకుమరమ్మతులు చేపట్టాలి
● పాడేరు ఐటీడీఏ పీవోను కోరిన అరకు ఎంపీ తనూజరాణి సాక్షి,పాడేరు: ఐటీడీఏ పరిధిలో మరమ్మతులతో మూలకు చేరిన అంబులెన్స్లను వినియోగంలోకి తెచ్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజను అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి కోరారు. శుక్రవారం ఆమె, భర్త చెట్టి వినయ్ శుక్రవారం పీవోను మర్యాదపూర్వకంగా కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాడేరు ఐటీడీఏ పరిధిలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై ఎంపీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అనేక పీహెచ్సీలకు చెందిన అంబులెన్స్లు చిన్నపాటి మరమ్మతులతోను ఐటీడీఏ గ్యారేజ్లో మూలకు చేరాయన్నారు. వీటి మరమ్మతులకు ఐటీడీఏ నిధులు మంజూరు చేయాలని ఎంపీ కోరారు. -
అప్పన్నకు ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శుక్రవారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం జరిపారు. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వ క్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదిత ర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఘనంగా గరుడసేవ : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వెండి గరుడవాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంజేపచేశారు. అష్టోత్తరశతనామావళి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేష హారతులు అందించారు. -
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య
చింతూరు: మద్యం మత్తులో ఒకరు, కడుపునొప్పి తాళలేక మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు ఎస్ఐ రమేష్ కథనం మేరకు ఇలా ఉన్నాయి. మండలంలోని బొడ్రాయిగూడెంకు చెందిన శ్యామల రామయ్య(38) తీవ్రమైన కడుపునొప్పిని తాళలేక శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పిట్టల మందు తాగాడు. భార్య లక్ష్మి సాయంత్రం ఇంటికి వచ్చి అపస్మారక స్థితిలో పడివున్న భర్తను గమనించి బంధువుల సాయంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించింది. రామయ్య ఆసుపత్రిలో చికిత్సపొందుతూ రాత్రి మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. మద్యం మత్తులో.. మండలంలోని సూరకుంటకు చెందిన తోడం ముద్దరాజు (16) గతనెల 30న పూటుగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఇంట్లో ఉంచిన పురుగు మందును సేవించినట్లు ఎస్ఐ తెలిపారు. దీంతో ముద్దరాజు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన అతని నానమ్మ తోటివారి సాయంతో ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రికి తరలించింది. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం భద్రాచలం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. రామయ్య, ముద్దరాజు మృతదేహాలు -
ట్రూ అప్
అండ్ డౌన్ దోపిడీ కోసం..ట్రూ అప్ పేరుతో రూ.7,790.16 కోట్లు గుంజేందుకు ప్లాన్ ఏపీఈఆర్సీ పరిశీలన అనంతరం తేల్చిన లెక్కలు ● ట్రూఅప్ చార్జీలుగా వసూలు చేయాల్సింది – 0 ● ఇతర ఖర్చులు (బిల్లు బకాయిలు, రుణాలు, డిస్కౌంట్స్) రూ.3,887.28 కోట్లు ● క్యారియింగ్ కాస్ట్ రూ.2,113.24 కోట్లు ● రిటైల్ సప్లయ్ టారిఫ్ వ్యయంపై ట్రాన్స్మిషన్ లిమిటేషన్ రూ.6.49 కోట్లు ● మొత్తం ట్రూఅప్ నుంచి తొలగించాల్సిన ఖర్చులు రూ.6,007.01 కోట్లు ● 4వ కంట్రోల్ పీరియడ్లో వసూలు చేయాల్సిన ట్రూఅప్ చార్జీలు రూ.1,783.15 కోట్లు ● ప్రభుత్వమే భరించాలని చెప్పిన ట్రూ అప్ చార్జీలు రూ.1,783.15 కోట్లుసాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కమ్ల ద్వారా ప్రజల నుంచి భారీగా వసూళ్ల పర్వానికి చంద్రబాబు ప్రభుత్వం వేసిన పాచిక పారలేదు. ట్రూ అప్ చార్జీల పేరుతో వినియోగదారుల నెత్తిన రూ.వేల కోట్లు వడ్డించేందుకు చేసిన ప్రయత్నాలకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) బ్రేక్ వేసింది. ముఖ్యంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ వ్యవస్థ (ఏపీఈపీడీసీఎల్) కాకిలెక్కలతో జనం జేబులకు చిల్లు పెట్టాలని చూసింది. గడిచిన ఐదేళ్లకు సంబంధించిన ఖర్చుల సర్దుబాటు(ట్రూఅప్) పేరుతో వినియోగదారుల నుంచి ఏకంగా రూ.7,790.16 కోట్లు పిండుకోవాలని భావించింది. అయితే ఏపీఈఆర్సీ రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు లెక్కల బండారాన్ని బయటపెట్టింది. డిస్కమ్ల అడ్డగోలు ఖర్చులను ట్రూ అప్ పేరుతో జనంపై ఎలా రుద్దుతారని, ఇందులో రూ.6,007.01 కోట్లు అర్హతలేనివంటూ స్పష్టం చేసింది. మిగిలిన డబ్బులు కూడా ప్రభుత్వమే డిస్కమ్లకు చెల్లించాలని తెగేసి చెప్పింది. అంతా లోపభూయిష్ట లెక్కలు ఏపీఈపీడీసీఎల్ చూపిన లెక్కల్లో వసూలు కాని బాకీలు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద చూపిన మొత్తమే రూ.వేల కోట్లలో ఉంది. కేవలం ఇతర ఖర్చులు, వడ్డీల పేరుతో చూపిన రూ.3,887 కోట్లను ఏపీఈఆర్సీ నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. దీన్ని బట్టి సంస్థలో ఆర్థిక క్రమశిక్షణ ఈపీడీసీఎల్లో ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంస్థ అసమర్థత, నిర్వహణ లోపాలకు అయిన ఖర్చుల్ని ‘ట్రూ–అప్’ పేరుతో జనం జేబులోంచి లాగేయాలని అనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా అంచనాలకు, వాస్తవాలకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. కానీ ఈపీడీసీఎల్ విషయంలో ట్రూఅప్ పేరుతో అడిగిన రూ.7,790 కోట్లకు.. ఏపీఈఆర్సీ ఆమోదించిన రూ.1,783 కోట్లకు మధ్య ఏకంగా రూ. 6,007.01 కోట్ల వ్యత్యాసం ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో అనర్హమైన ఖర్చులను ట్రూ అప్ పేరుతో ఎందుకు క్లెయిమ్ చేసుకోవాలని ఈపీడీసీఎల్ భావించిందనే దానిపై ఈఆర్సీ మొట్టికాయలు వేసింది. అందులో అర్హత లేని ఖర్చులు రూ.6,007.01 కోట్లుగా గుర్తించిన ఏపీఈఆర్సీ మిగిలిన రూ.1,783.15 కోట్లు ప్రభుత్వమే చెల్లించాలని ఆదేశం ఇంతకీ ఈ తప్పుడు లెక్కల బాధ్యులెవరు? ఈపీడీసీఎల్ చూపించిన గణాంకాలు నాలుగో కంట్రోల్ పీరియడ్(సీపీ)లో ట్రూ అప్ చార్జీలు రూ.5,684.58 కోట్లు క్యారియింగ్ కాస్ట్ రూ.2113.24 కోట్లు మొత్తం రూ.7,797.82 కోట్లు గతంలో ఈఆర్సీ ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా సర్దుబాటు చేసినవి రూ.7.65 కోట్లు మొత్తంగా ట్రూఅప్ పేరుతో ప్రజల నుంచి వసూలు చేయాలనుకున్నది రూ.7,790.16 కోట్లు వాతలు కప్పిపుచ్చుకునేందుకు కొత్తనాటకం! ట్రూ అప్ పేరుతో జనం నెత్తిన భారం మోపాలని అనుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ వాతలు పెట్టింది. రూ.6,007.01 కోట్లు అర్హతలేనివని తేల్చడంతోపాటు రూ.1,783.15 కోట్లు కూడా ప్రభుత్వమే భరించాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రూ అప్ పేరుతో ఏకంగా రూ.7,790 కోట్లను ప్రజల నుంచి వసూలు చేసి సంపద సృష్టించామని చెప్పాలనుకున్నా కుదరకపోవడంతో ఈ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం కొత్త ఎత్తుగడ మొదలు పెట్టింది. ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం మొత్తం భరిస్తోందంటూ హడావుడి చేస్తోంది. దీనిపై మంత్రులు కూడా గొప్పలు చెప్పడం హాస్యాస్పదంగా మారింది. ఏపీఈఆర్సీ ఆమోదించిన రూ.1,783 కోట్ల ట్రూ అప్ చార్జీలను ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ డబ్బులు తామే చెల్లిస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. ఆ చెల్లించేది కూడా పరోక్షంగా ప్రజల పన్నుల డబ్బు నుంచే కదా అని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. -
మెరుగైన బోధన అందించాలి
ఎంఈవో కృష్ణమూర్తి ముంచంగిపుట్టు: ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని ఎంఈవో కె.కృష్ణమూర్తి అన్నారు. మండలంలోని మారుమూల చీపురుగొంది, కిముడుపుట్టు, పిట్టగెడ్డ, డెంగగూడ మండల పరిషత్, జీపీఎస్ పాఠశాలలను ఎంఈవో కృష్ణమూర్తి శుక్రవారం సందర్శించారు. వాగులు, గెడ్డలు దాటుకొని ఎంఈవో అతికష్టం మీద వెళ్లారు. విద్యార్థులతో మాట్లాడి వారి వర్క్ బుక్స్ను పరిశీలించి, తప్పలను సరిదిద్దారు.విద్యార్థులకు పాఠాలు బోధించారు. పలుప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల ఆన్లైన్ హాజరు తప్పని సరిగా నమోదు చేయాలని, ఆన్లైన్ పనులను సైతం వెంటనే పూర్తి చేయాలని, లెసన్ ప్లాన్, ఇయర్ ప్లాన్ డైరీలను ఖచ్చితంగా పాటించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని, చదువులో వెనకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, బడిబయట పిల్లలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని, మధ్యాహ్న భోజనాన్ని పక్కాగా అమలు చేస్తూ నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఎంఈవో కృష్ణమూర్తి ఉపాధ్యాయులకు సూచించారు. -
2 కేజీల గంజాయి పట్టివేత
● ముగ్గురు నిందితుల అరెస్టు గొలుగొండ: మండలంలోని ఏటిగైరంపేట గ్రామం వద్ద రెండు కిలోల గంజాయితో నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, గొలుగొండ ఎస్ఐ రామారావు తెలిపారు. ఏజెన్సీ నుంచి రెండు కిలోల గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో దాడి చేసి పట్టుకున్నామన్నారు. చింతపల్లి మండలానికి చెందిన నిందితులు దాసరి శ్రవంత్కుమార్(30), తుపాకుల హరీష్కుమార్(22), కొవ్యూరు సుమంత్(25)లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. కార్యక్రమంలో గొలుగొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఘనంగా తిరువీధి సేవ నక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాకవేంకటేశ్వర స్వామివారికి శుక్రవారం గజవాహనంపై తిరువీధిసేవలు నిర్వహించారు. కొండపై మూలవిరాట్కు పంచామృతాభిషేకం, నిత్యార్చనలు పూర్తిచేశారు. అనంతరం స్వామి వారి ఉత్సవమూర్తులకు, గోదాదేవి అమ్మవారికి, వేణుగోపాల స్వామివారికి పూజలు నిర్వహించారు. శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని గజవాహనంపై, గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఉంచి తిరువీధి సేవలకు తీసుకెళ్లారు. అనంతరం గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై 17వ పాశురాన్ని విన్నపం చేశారు. రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా వైష్ణవ స్వామి ద్రవిడ వేదపారాయణం నిర్వహించిన అనంతరం రాత్రి తిరువీధి సేవలు నిర్వహించారు. -
జూన్ నాటికి సీలేరు రోడ్డు పనులు పూర్తి
ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు పనులు రోడ్డు పనులను పరిశీలిస్తున్నఆర్అండ్బీ ఈఈ బాలసుందరబాబు సీలేరు: గూడెంకొత్తవీధి నుంచి సీలేరు మీదుగా అంతర్రాష్రాలకు వెళ్లే ధారాలమ్మ ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు జూన్ నాటికి పూర్తవుతాయని ఆర్అండ్బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జయరాజ్ తెలిపారు. అంతర్రాష్ట్ర రహదారి దుస్థితిపై ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన ‘ప్రయాణం..భయం భయం’ కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గూడెం కొత్తవీధి మండలం ఆర్వీ నగర్ నుంచి లంకపాకల గ్రామం వరకు రూ.8.70 కోట్లు, అలాగే రైన్ గేజ్ నుంచి ధారాలమ్మ ఆలయం వరకు రూ. 2.95 కోట్లు, సీలేరు నుంచి పాలగడ్డ వరకు రూ.2 కోట్ల మేర ఎస్డీఎంఎఫ్ ద్వారా నవంబర్, 2024లో నిధులు మంజూరైనట్టు పేర్కొన్నారు. అయితే ఈ రహదారిని మూడు భాగాలుగా ఒకే కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన తెలిపారు. ఆర్వీ నగర్ నుంచి లంకపాకల గ్రామాల మధ్య అక్టోబర్లోనే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయని, ఒప్పందం ప్రకారం జూన్ నెలాఖరుకు అన్ని పనులు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. -
సమస్యలు పరిష్కారం వేగవంతం
● ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ● మీకోసం పీజీఆర్ఎస్కు 79 వినతులు పాడేరు : మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో స్వీకరించిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని గడువులోగా పరిష్కారం చేయాలని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు సమస్యలపై 79 వినతులను స్వీకరించారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అధికంగా రెవెన్యూ, వైద్యారోగ్య, డీఆర్డీఏ శాఖలకు సంబంధించిన అర్జీలు అధికంగా వస్తున్నాయన్నారు. ఆయా శాఖల అధికారులు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మండల స్థాయి అధికారులు దిగువ స్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్జీదారులు 1100 మీకోసం కాల్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో అంబేడ్కర్, ఇంచార్జీ ఆర్డీవో లోకేశ్వరరావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, డీఆర్డీఏ పీడీ మురళి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నంద్, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడా విద్యార్థుల పర్యవేక్షణకు కోచ్లు, మేనేజర్ల నియామకం
పాడేరు రూరల్: జార్ఖండ్లోని రాంచీలో ఈనెల 6,7,8,9,10 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ బాలుర, బాలికల క్రీడా పోటీల్లో క్రీడా విద్యార్థుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా నలుగురు ఉపాధ్యాయులను నియమించినట్టు ఎస్జీఎఫ్ క్రీడా జిల్లా కార్యదర్శి పాంగి సూరిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ మత్య్సరాస భూపతిరాజు ఆర్చరీ అండర్ 17 బాలికల కోచ్గా, బి.లక్ష్మీపార్వతి మేనేజర్గా, కృష్ణసాయి బాలుర అండర్ 17 కోచ్గా, మల్లన్న బాలుర జట్టుకు మేనేజర్లుగా వ్యవహరిస్తారన్నారు. -
మోసం!
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా, గిరిజన ప్రాంతాల్లో గృహ నిర్మాణాలపై ఇచ్చిన కీలక హామీ అమలుకు నోచుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఇళ్లకు అదనంగా రూ. లక్ష ప్రోత్సాహకం అందిస్తామని ఆయన స్వయంగా ప్రకటించారు. అయితే, నేటికీ ఆ నిధులు విడుదల కాకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలోని వేలాది మంది గిరిజనులు ఇబ్బందుల్లో కూరుకుపోయారు. సొంత నిధులు వెచ్చించి, అప్పులు చేసి పునాదులు, గోడల వరకు నిర్మించిన లబ్ధిదారులు.. ఇప్పుడు ప్రభుత్వ సాయం అందక పైకప్పులు వేయలేక ఇళ్లను మధ్యలోనే వదిలేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో గిరిజన గూడాల్లో అసహనం వ్యక్తమవుతోంది.లక్షణమైనసాక్షి, పాడేరు: చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులను నిలువునా వంచించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన గృహ నిర్మాణాలకు అదనంగా రూ.లక్ష ప్రోత్సాహకం అందిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నెలలు గడిచినా అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసా సాయం అందకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలోని వేలాది ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అప్పుల ఊబిలో.. కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ పథకం కింద ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు, పీఎం గ్రామీణ్ కింద రూ.1.80 లక్షలు అందిస్తోంది. అయితే, ప్రస్తుతం ఉన్న ధరల దృష్ట్యా శ్లాబ్తో కూడిన పక్కా ఇళ్ల నిర్మాణానికి ఈ నిధులు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.లక్ష ఇస్తామని ప్రకటించడంతో గిరిజనులు ఉత్సాహంగా పనులు మొదలుపెట్టారు. తీరా నిర్మాణాలు కీలక దశకు చేరుకున్నాక రాష్ట్ర సాయం అందకపోవడంతో గిరిజనులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ● పీఎం జన్మన్ గృహాలు జిల్లాలో (రంపచోడవరంతో కలిపి) 36,223 మంజూరయ్యాయి. ఇవన్నీ పీవీటీజీ గిరిజనులు నిర్మించుకుంటున్నారు. వివిధ తెగల గిరిజనులకు సంబంధించి పీఎం గ్రామీణ్ పథకంలో 17,111 ఇళ్లు మంజూరయ్యాయి. నిధుల కొరత కారణంగా వీటిలో పది వేల ఇళ్లు శ్లాబ్ దశలోనే ఆగిపోయాయి. తప్పని ఎదురుచూపులు అష్టకష్టాలు పడి అప్పులు చేసి ఇళ్లు పూర్తి చేసుకున్న వారికి కూడా ప్రభుత్వం మొండిచేయి చూపింది. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సుమారు 4,891 మంది గిరిజనులు ఇళ్లు పూర్తి చేసుకుని గతేడాది నవంబర్ 12న గృహ ప్రవేశాలు కూడా చేశారు. ఆర్భాటంగా పాల్గొన్న కూటమి నేతలు, అధికారులు సాయం అందిస్తామని నమ్మబలికారు. గృహ ప్రవేశాలు ముగిసి రెండు నెలలు గడుస్తున్నా, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఖాతాల్లో జమ కాకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలకే పరిమితమైన చంద్రబాబు ప్రభుత్వం, తక్షణమే స్పందించి గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్ష ప్రోత్సాహకాన్ని విడుదల చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు.బురుగుచట్టులో పూర్తికాని పీఎం జన్మన్ఇంటి వద్ద గెమ్మెలి చిలకమ్మప్రభుత్వానికి నివేదిక పీఎం జన్మన్, పీఎం గ్రామీణ్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష సాయం వేగంగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం. లబ్ధిదారుల సమగ్ర వివరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. నిధులు విడుదల అవ్వగానే ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రోత్సాహక సాయం జమ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలి. – బి.బాబునాయక్, ఇన్చార్జి పీడీ, గృహ నిర్మాణ సంస్థ రూ.లక్ష సాయం అందలేదు పీఎం జన్మన్ పథకంలో మంజూరైన ఇల్లుకు సంబంధించి నిర్మాణాన్ని అష్టకష్టాలు పడి పూర్తి చేశా. కేంద్ర ప్రభుత్వం రూ.2.39 లక్షల బిల్లు మంజూరు చేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రూ.లక్ష సాయం అందలేదు.మా గ్రామంలో కలెక్టరే స్వయంగా వచ్చి గృహ ప్రవేశాలు జరిపారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన సాయం అందక ఇబ్బందులు పడుతున్నాం. – మర్రి లక్ష్మి, సప్పిపుట్టు, వంతాడపల్లి పంచాయతీ, పాడేరు మండలం ఇంటి పని ఆగిపోయింది గృహ నిర్మాణానికి కేంద్రం ఇచ్చే రూ.2.39 లక్షలు చాలడం లేదు. దాచుకున్న నగదుతో పాటు రెండు విడతలుగా అందిన రూ.1.60 లక్షలతో శ్లాబ్ వరకు నిర్మాణం పూర్తి చేశా. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఇస్తే ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇంటి నిర్మాణం నిలిచింది. నిర్మాణం పూర్తయితేనే పీఎం జన్మన్ పథకం ఫైనల్ బిల్లు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. – మర్రి లింగేష్, జీడిపగడ, వనుగుపల్లి పంచాయతీ, పాడేరు మండలం -
భద్రాద్రి రామయ్యకుఘనంగా రాపత్తు సేవ
ఎటపాక: ముక్కోటి వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారికి శుక్రవారం ఘనంగా రాపత్తు సేవ నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారిని భద్రాద్రి రామాలయం నుంచి పల్లకిపై కోలాటాలతో, రంగవల్లుల మధ్య ఊరేగింపుగా మండలంలోని పురుషోత్తపట్నం రామాలయానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో స్వామి వారికి రాపత్తు సేవ నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజాకార్యక్రమాల సందర్భంగా భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి, కుందూరు రామిరెడ్డి, రామచంద్రరావు, ఆకుల శ్రీనివాస్, రవితేజ, శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, ఏడుకొండలురెడ్డి, జయచంద్రరెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు. -
ఆటో బోల్తా – 9 మందికి గాయాలు
కొమ్మాది : ఎండాడ జాతీయ రహదారి నుంచి రుషికొండ వెళ్లే రహదారిలో డివైడర్ను ఢీకొని ఓ ఆటో బోల్తా పడింది. పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఆర్ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. గురువారం సాయంత్రం మధురవాడ ప్రాంతానికి చెందిన 9 మంది కుటుంబ సభ్యులు ఆటోలో రుషికొండ బీచ్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 9 మందికి స్వల్పగాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న పలువురు ప్రయాణికులు వారిని గమనించి సహాయక చర్యలు చేపట్టారు. ఆ సమయంలో రోడ్డులో వాహనాలు ఏమి లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అదే విధంగా గురువారం తెల్లవారుజామున భీమిలి నుంచి విశాఖ వైపుగా వెళ్తున్న ఓ కారు అతి వేగంగా వచ్చి అదుపు తప్పి తిమ్మాపురం సమీపంలో డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డివైడర్ మధ్యలో ఉన్న గ్రిల్స్ ధ్వంసం కాగా డివైడర్ మధ్యలో ఉన్న చెట్టు వాలిపోయింది. కారులో ఉన్న వారికి గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. -
ఉసిరి.. ఉసూరు
ధర లేక గిరి రైతులకు కష్టాలు పాడేరు: ఏజెన్సీ అడవుల్లో ప్రకృతి సిద్ధంగా లభించే ఉసిరి కాయలకు జాతీయ స్థాయిలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఆయుర్వేద మందుల తయారీ నుంచి ఫార్మా కంపెనీల వరకు అందరికీ ఇక్కడి ఉసిరి కావాలి. కానీ, ప్రాణాలకు తెగించి వీటిని సేకరించే గిరిజన రైతులకు మాత్రం కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు. అటవీ సంపదపై ఆధారపడిన గిరిజనుల ఆర్థిక పరిస్థితి దళారుల చేతుల్లో, తక్కువ మద్దతు ధరల వల్ల కుదేలవుతోంది. అడవుల్లో ఉసిరి సిరి పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, అరకులోయ, మారేడుమిల్లి వంటి దాదాపు 12 మండలాల్లో ఉసిరి చెట్లు విస్తారంగా ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం వన సంరక్షణ సమితుల ద్వారా నాటించిన మొక్కలు ఇప్పుడు ఫలసాయాన్ని ఇస్తున్నాయి. ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి వరకు గిరిజనులు ఈ కాయలను సేకరిస్తారు. వీటిని వేడినీటిలో ఉడకబెట్టి, ఎండలో ఆరబెట్టి ఉసిరిపప్పుగా తయారు చేసి మార్కెట్కు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. పెరిగిన డిమాండ్.. పెరగని ధరలు తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని ఫార్మా కంపెనీలు ఈ ఉసిరి కోసం ఎదురుచూస్తుంటాయి. జాతీయ మార్కెట్లో ఉసిరిపప్పు ధర కిలో రూ. 150 నుంచి రూ. 200 వరకు పలుకుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో గిరిజన సహకార సంస్థ, దళారీలు మాత్రం కేవలం రూ. 90 కే కొనుగోలు చేస్తున్నారు. ● గత మూడేళ్లుగా అడవుల్లో కాపు తగ్గడంతో దిగుబడి ఆశాజనకంగా లేదు. ● గిరిజన సహకార సంస్థ గత ఏడాది 10.35 టన్నుల ఉసిరి పప్పును సేకరించింది. దీంతో చిత్తూరులో ’అమ్లా కాండీ’ తయారు చేసి భారీ లాభాలు గడిస్తోంది. ● దళారి వ్యాపారులు కూడా మరో పది టన్నుల ఉసరిపప్పనుతక్కువ ధరకు కొని బయట మార్కెట్లో ఎక్కువకు అమ్ముకుంటూ వ్యాపారులు లాభపడ్డారు.గిట్టుబాటు కావడం లేదు వన్యప్రాణుల భయం ఉన్నా ప్రాణాలకు తెగించి అడవుల్లో ఉసిరి కాయలు సేకరిస్తాం. ఉడకబెట్టి, ఎండబెట్టి పప్పు చేసేందుకు ఎంతో శ్రమ పడతాం. కానీ కిలో రూ. 90 కంటే ఎక్కువ రావడం లేదు. కనీసం మా కష్టానికి తగ్గ కూలి కూడా మిగలడం లేదు. – పాంగి భీమేష్, గిరిజన రైతు, డల్లాపల్లి కొనుగోలు ధర పెంచాలి మార్కెట్లో డిమాండ్ ఉన్నా రైతులకు మాత్రం అన్యాయ మే జరుగుతోంది. గిరిజన సహకార సంస్థ వెంటనే స్పందించి కొనుగోలు ధరను పెంచాలి. ఫార్మా కంపెనీలు, దళారులు కూడా గిరిజనులను నష్టపరచకుండా మద్దతు ధర ఇవ్వాలి. – సుడిపల్లి రామానాయుడు, గిరిజన రైతు, డొంకినవలస. జాతీయ మార్కెట్లో కిలో పప్పు రూ.150 నుంచి రూ.200 స్థానికంగా చెల్లించేది మాత్రం రూ.90 అడుగడుగునా దోపిడీ గిట్టుబాటు ధర చెల్లించని గిరిజన సహకార సంస్థ -
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాతగ్గని చలి తీవ్రత
● దట్టంగా పొగమంచు ● పెదబయలులో 12.6 డిగ్రీల నమోదు చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ నుంచి పెరుగుతున్నప్పటికీ చలి, మంచు ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ శీతల గాలులు విజృంభిస్తున్నాయి. దీంతో మన్యం వాసులు వణికి పోతున్నారు. గురువారం పెదబయలులో 12.6 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 12.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధి జి.మాడుగులలో 13.0 డిగ్రీలు, అరకువ్యాలీలో 13.2 డిగ్రీలు, పాడేరులో 13.5 డిగ్రీలు, హుకుంపేటలో 14.2 డిగ్రీలు, చింతపల్లిలో 15.5 డిగ్రీలు, కొయ్యూరులో 15.7 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన తెలిపారు. చలితీవ్రత నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్నారు. మంట కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ఉదయం వేళల్లో పది గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. రహదారులను మంచు తెరలు కమ్మేయడం వల్ల వాహనచోదకులు ఇబ్బందులు పడుతూ హెడ్లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తున్నారు. పెదబయలు: మండలంలో చలి, మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. గురువారం ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు దట్టంగా కమ్మేశాయి. -
తహసీల్దార్ తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం
వై.రామవరం: పోలవరం జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక రెవెన్యూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన తమను తహసీల్దార్ వేణుగోపాల్ ఘోరంగా అవమానపరిచారని ఎంపీపీ కడబాల ఆనందరావు ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్తో పాటు ఆర్ఐ గుడ్ల వెంకటేశ్వర్లను వారు నిలదీశారు. తమకు జరిగిన అవమానానికి సమాధానం చెప్పాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంపచోడవరంలో పోలవరం జిల్లా కార్యాలయ ప్రారంభం పురస్కరించుకుని ఇక్కడి తహసీల్దార్ కార్యాలయంలో కేక్ కటింగ్ ఏర్పాటుచేశారన్నారు. దీనికి ఉదయం 11 గంటలకు రావాలని ఆహ్వానించగా తాము 10గంటలకు వచ్చామన్నారు. ఈలోపే తహసీల్ధార్ ఈ కార్యక్రమాన్ని ముగించేసి తమను ఘోరంగా అవమానించారని ఆరోపించారు. ఆయనను ప్రశ్నించగా ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారన్నారు. ఇలా ఆయన తమను అవమానించడం రెండోసారి అని ధ్వజమెత్తారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని రంపచోడవరం సబ్కలెక్టర్ను కోరామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కర్ర వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ ముర్ల జోగిరెడ్డి, ఎంపీటీసీ వీరమళ్ల సుబ్బలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు వెదుళ్ల తిరుపతిరెడ్డి, వి.వీరబాబు, ఎం.నారాయణరావు, పి.తమ్మిరెడ్డి, కె.అబ్బాయి, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించి అవమానించారని ఆవేదన రెవెన్యూ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
తాటాకిల్లు దగ్ధం
కూనవరం: తాటాకిల్లు దగ్ధం కాగా సుమారు రూ.5 లక్షలు పైగా ఆస్తినష్టం జరిగిన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని వేములపల్లి రామారావు నివాసముంటున్న తాటాకిల్లు షార్ట్సర్క్యూట్ కారణంగా గురువారం దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో సర్వం కాలిబూడిదైనట్టు బాధితుడు తెలిపారు. ప్రమాదంలో ఇంట్లో ఉన్న రూ.40వేల నగదు, బంగారపు తాడు, రిఫ్రిజరేటర్, బీరువాలు, ఫ్యాన్లు, దుస్తులు తదితర సామగ్రి మొత్తం కాలిపోయిందని బాధితుడు రామారావు వాపోయారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు రూ.3లక్షలకు పైగా నష్టం జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న జెకె ట్రస్ట్ చైర్మన్ జమాల్ఖాన్ సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాకి తక్షణ సహాయం కింద రూ.5000 నగదు అందజేశారు. ఇల్లు నిర్మించుకు నేందుకు పైపులు, రేకులు అందజేస్తామని అగ్నిబాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. -
మోదమ్మ ఆలయం కిటకిట
● పోటెత్తిన భక్తజనం ● దర్శించుకున్న ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజసాక్షి,పాడేరు: ఉత్తరాంఽఽధ్ర ప్రజల ఆరాధ్యదేవత పాడేరులోని మోదకొండమ్మతల్లి ఆలయానికి గురువారం భక్తుల పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇన్చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు సుబ్రహ్మణ్యం లోకకల్యాణార్థం కుంకుమార్చన నిర్వహించారు. నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విఽశ్వేశ్వరరాజు,ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. -
బీ1 కోచ్ లెనిన్ స్టోరేజ్ నుంచే మంటలు వ్యాప్తి
యలమంచిలి రూరల్ : యలమంచిలి రైల్వేస్టేషన్ వద్ద టాటా నగర్–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలను వెలికితీసేందుకు దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి నిర్వహిస్తున్న విచారణ గురువారం రెండోరోజూ కొనసాగింది. గత నెల 29వ తేదీ అర్ధరాత్రి 12.50 గంటల సమయంలో రైలు అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదానికి గురైంది. రైలులో బీ1, ఎం2 భోగీల్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఒకరు సజీవ దహనమైన సంగతి విదితమే. రైలు యలమంచిలి రైల్వేస్టేషన్ ఒకటో నెంబరు ప్లాట్ఫాంపై ఆగినపుడు మంటలు వ్యాపించడంతో 157 మంది ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీనిపై ఉలిక్కిపడ్డ రైల్వేశాఖ ప్రమాదానికి మూల కారణాలను తెలుసుకునేందుకు వివిధ కోణాల్లో శోధిస్తోంది. విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్(ఈటీటీసీ)లో బుధ, గురువారాల్లో సేఫ్టీ కమిషనర్ చేస్తున్న విచారణలో ప్రమాదానికి సంబంధించి పలు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా యలమంచిలి, నర్శింగబిల్లి రైల్వేస్టేషన్లలో ఆ సమయంలో పనిచేస్తున్న వివిధ హోదాల్లో పనిచేస్తున్న రైల్వే సిబ్బందిని విజయవాడకు పిలిపించారు. అందుబాటులో ఉన్న కొందరు ప్రయాణికులను కూడా ప్రశ్నించి రాతపూర్వకంగా వివరాలు రాబట్టినట్టు సమాచారం. రైలు బీ1 బోగీలో లెనిన్ స్టోరేజ్ నుంచే మంటలు వ్యాప్తి చెందినట్టు ఇప్పటికే అధికారులు నిర్థారణకు వచ్చారు. అక్కడ్నుంచి ఒక్కసారిగా మంటలు ఎలా వ్యాప్తి చెందాయన్నది అంతు చిక్కడంలేదు. మానవ తప్పిదమా? సాంకేతిక కారణం వల్ల ప్రమాదం సంభవించిందా అన్నది తేల్చేందుకు ఎం1 బోగీలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు పూర్తయితే ప్రమాద కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా రైళ్లలో సగటున ఏడాదికి 8 అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. బ్రేక్ బైండింగ్, షార్ట్ సర్క్యూట్ వంటి సాంకేతిక లోపాలతో రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరిగితే రైల్వేశాఖ నిపుణులు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. టాటా నగర్–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో ప్యానెల్ బోర్డులు సురక్షితంగా ఉన్నట్టు ఇప్పటికే రైల్వేశాఖ ప్రకటించింది. ఇక మండే స్వభావం కలిగిన ప్రమాదకర వస్తువులేవైనా రైలులో ఉన్నాయా?లేక ధూమపానం కారణంగా మంటలు చెలరేగాయా?అన్నది తెలియాల్సి ఉంది. -
వెంకన్నకు నవనీత సేవ
పెందుర్తి: స్థానిక వేంకటాద్రిపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం తిరుప్పావై సేవాకాలం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో 17వ పాశుర విన్నపం చేశారు. అనంతరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని స్వామివారికి నవనీత సేవ ఘనంగా జరిపారు. వేకువజామున తిరుప్పావై పారాయణం, సుప్రభాత సేవ చేశారు. అనంతరం 27 కిలోల వెన్నతో స్వామికి అలంకరణ చేశారు. ఆలయ ప్రధాన పురోహితుడు రామానుజాచార్యులు ఆధ్వర్యంలో విశేష అర్చనలు జరిగాయి. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు దంపతులు, మేయర్ పీలా శ్రీనివాసరావు దంపతులు, ఎన్ఆర్ఐ భక్తులు చీమలపాటి మూర్తి కుటుంబ సభ్యులు, దాదాపు 5 వేల మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఈవో నీలిమ పర్యవేక్షణలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రసాద వితరణ చేపట్టారు. కొండ దిగువ నుంచి భక్తులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 4న వేంకటాద్రిపై సుదర్శన హోమం నిర్వహించనున్నారు. -
పర్యాటక ప్రాంతాల్లో న్యూఇయర్ జోష్
పెదబయలు: న్యూఇయర్ సందర్భంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కిక్కిరిసిపోయాయి. గురువారం నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా జిల్లాలోని చాపరాయి, బొర్రా గుహలు, లంబసింగి, జామిగుడ, గిన్నెలకోట పంచాయతీల సరిహద్దు ప్రాంతాల్లోని తారాబు (పిట్టలబొర్ర) జలపాతాల వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. చలితీవ్రతను సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రకృతి ఒడిలో ఉత్సాహంగా గడిపారు. జలపాతాల వద్ద సెల్ఫీలు దిగుతూ, కేరింతలు కొడుతూ పర్యాటకులు కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. రద్దీ దృష్ట్యా పోలీసులు, పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతానికి గురువారం పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు బస్సులు, కార్లు వివిధ వాహనాల్లో భారీగా తరలిరావడంతో కోలాహలంగా మారింది. జలపాత ప్రాంతాల్లో బండరాళ్లపైనుంచి జాలువారే ప్రవాహంలో కేరింతల కొడుతూ గంటలు తరబడి స్నానాలు చేశారు. భారీగా తరలివచ్చిన సందర్శకులు -
పుణ్యకోటి వాహనంపైపరంధాముడు
నక్కపల్లి : ఉపమాకలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. ఉదయం స్వామివారి మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. తదుపరి కొండదిగువన స్వామివారి ఉత్సవ మూర్తులకు క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి, గోదాదేవి అమ్మవారిని నిత్యపూజలు అర్చనలు నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. తిరుప్పావై 16వ పాశురాన్ని విన్నపం చేశారు. అనంతరం శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పుణ్యకోటి వాహనంలోను, గోదాదేవి అమ్మవారిని పల్లకిలోను ఉంచి తిరువీధిసేవ నిర్వహించారు. భక్తులు కానుకలు, పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు.కొత్తసంవత్సరం సందర్భంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయం రద్దీగా మారింది. ముక్కోటి ఏకాదశి అనంతరం ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రాత్రిపూట కూడా స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహిస్తారు. -
సిటు మహాసభలు జయప్రదం చేయండి
పరవాడ: విశాఖపట్నంలో ఈ నెల 4న సిటు ఆధ్వర్యంలో జరిగే 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సిటు రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఛలో విశాఖ ర్యాలీని పరవాడ ఫార్మాసిటీలో గురువారం నిర్వహించారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆ రోజు జరిగే మహాసభలకు అన్ని రాష్ట్రాల నుంచి 2 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా చర్చించి భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కానున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా విధానాలను అమలు చేస్తున్నారని, ఇప్పటి వరకు ఉన్న హక్కులను కాలరాస్తున్నారని ఆక్షేపించారు. ర్యాలీలో సిటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ, కె.రమణ, ముసిలినాయుడు, శేషు, అప్పలరాజు, సత్తిబాబు పాల్గొన్నారు. -
పరుగులే..
పట్టించుకోకపోయినా కార్గోలోనూ పురోగతివిశాఖ విమానాశ్రయంలో ప్రయాణికులుసాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమైన విశాఖపట్నం ఎయిర్పోర్టు.. ప్రయాణికుల రాకపోకల్లో ఏటా గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. 2024తో పోలిస్తే, 2025లో ప్రయాణికుల రాకపోకల్లో 9శాతం వృద్ధిని సాధించింది. అంతకుముందు 2022–23తో పోల్చితే 2023–24లో ఏకంగా 22 శాతం వృద్ధి నమోదైంది. అయితే, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు అలసత్వం, ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కారణంగా వృద్ధి రేటులో కొంత తగ్గుదల కనిపించింది. విశాఖకు రావల్సిన అంతర్జాతీయ సర్వీసులు విజయవాడ, ఇతర రాష్ట్రాలకు తరలిపోయినా.. ఎయిర్పోర్టు అధికారులు, ఎయిర్ట్రావెల్స్ అసోసియేషన్ సమన్వయంతో విమానాశ్రయాన్ని ముందుకు నడిపించి మంచి ఫలితాలు సాధించారు. 2025లో గణనీయమైన ప్రగతి 2025లో విశాఖ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీ, మౌలిక వసతులు, భద్రత, సామాజిక బాధ్యత(సీఎస్సార్) వంటి రంగాల్లో మంచి ఫలితాలను రాబట్టింది. ప్రయాణికుల రద్దీలో 9 శాతం వృద్ధి నమోదైంది. నెలకు సగటున 2 లక్షల మంది వైజాగ్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించడం విశేషం. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు.. ఇండిగో సంక్షోభ సమస్యను వెంటనే పరిష్కరించి ఉంటే.. ప్రయాణికుల రాకపోకల వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉండేది. ఆ సమయంలో నాలుగైదు రోజుల పాటు పదుల సంఖ్యలో సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు ఎయిర్పోర్టు ఘనతలివీ.. ● 2025లో సుమారు 27.55 లక్షల మంది ప్రయాణించారు. 2024లో ఈ సంఖ్య 25.21 లక్షలు ● 2025 జనవరి, నవంబర్లో రద్దీ గరిష్టంగా 2.7 లక్షలకు చేరింది. ● ప్రయాణికుల కోసం ఆధునిక బేబీ కేర్ గదులు, ప్రముఖ బ్రాండ్లకు చెందిన రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేశారు. ● కస్టమర్ సంతప్తి సర్వే (సీఎస్ఐ)లో 4.92/5 స్కోరు సాధించింది. ఈ స్కోరుతో జాతీయ స్థాయిలో 9వ స్థానంలో ఎయిర్పోర్టు నిలవడంగమనార్హం. అంతర్జాతీయ సర్వీసులపై రాజకీయ నిర్లక్ష్యం? అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అన్ని అర్హతలున్నా.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వైజాగ్ ఎయిర్పోర్టుకు శాపంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. 2025 మొదట్లో దుబాయ్ విమానం వైజాగ్ రాకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకొని విజయవాడకు తరలించేసింది. తర్వాత.. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు నిర్లక్ష్యంతో వియత్నాం విమాన సర్వీసు హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయింది. డొమెస్టిక్ సర్వీసుల విషయంలోనూ అదే నిర్లిప్తంగా ఎయిర్పోర్టు వర్గాలు వ్యవహరించారు. ఆకాశా ఎయిర్లైన్స్ వైజాగ్ నుంచి సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నా, కేంద్ర మంత్రి చొరవ లేకపోవడంతో సందిగ్ధంలో పడింది. చివరకు జూన్లో అబుదాబీకి వారానికి నాలుగు రోజుల సర్వీసు ప్రారంభమైంది. చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే సింగపూర్, అబుదాబీలతో పాటు దుబాయ్, వియత్నాం సర్వీసులు కూడా నడిచేవి. ఇప్పటికై నా కేంద్ర మంత్రి, ఎయిర్పోర్టు అధికారులు స్పందించి సర్వీసుల పెంపుపై దృష్టి సారించాలని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ కోరుతోంది. 2025లో విశాఖ ఎయిర్పోర్ట్ జోరు రాజకీయ సవాళ్ల నడుమ 9 శాతం వృద్ధి విశాఖ నుంచి 27 లక్షల మంది ప్రయాణం కార్గోలోనూ రికార్డులు వైజాగ్ ఎయిర్పోర్టు కార్గో టెర్మినల్లో నవంబర్ 14న సరకు రవాణా పునఃప్రారంభమైంది. సాధారణ రోజుల్లో పౌర విమానాల్లోనూ డొమెస్టిక్ కార్గో రవాణా జరిగింది. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు మొత్తం 4,902.876 మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ జరిగింది. ఇందులో ఎగుమతులు 1955.369 మెట్రిక్ టన్నులు కాగా, దిగుమతులు 2947.507 మెట్రిక్ టన్నులుగా నమోదయ్యాయి. మార్చిలో అత్యధికంగా 593.195 మెట్రిక్ టన్నుల సరకు రవాణా జరిగింది. ప్రతి నెలా సగటున 340 మెట్రిక్ టన్నులకు పైగా సరకు హ్యాండ్లింగ్ జరిగింది. -
ఉపాధ్యాయులు రాకుంటే చదువులెలా?
ముంచంగిపుట్టు: ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోతే మా పిల్లల చదువులు ఎలా కొనసాగుతున్నాయని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ఏనుగురాయి పంచాయతీ జంగంసరియా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు బుధవారం రోజున ఉపాధ్యాయులు రాలేదు. పాఠశాలకు తాళాలు వేసి ఉండటంతో గ్రామ గిరిజనులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుల తీరుపై పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎం.మోహన్రావు, తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నా ఒక్కరు కూడా రాలేదన్నారు. దీంతో విద్యార్థులు పాఠశాలకు వచ్చి, వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. ఒకేసారి ఇద్దరు ఉపాధ్యాయులు సెలవు పెడితే పాఠశాల మూసుకోవాల్సిన దుస్థితి ఉందని, మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం పాఠశాల తెరిచేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. దీనిపై ఎంఈవోను వివరణ కోరగా పాఠశాల ఉపాధ్యాయులు సెలవులో ఉన్నందున మరొక పాఠశాల నుంంచి ఉపాధ్యాయుడిని పంపించామన్నారు. ఆయన పాఠశాలకు వెళ్లడంలో కొంత ఆలస్యం అయిందని ఆయన పేర్కొన్నారు. జంగంసరియాలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన పాఠశాల మూతపడి ఉండటంపై ధ్వజం సమస్య పరిష్కరించకుంటే ఎంఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తాం గ్రామ గిరిజనుల హెచ్చరిక -
ప్రకృతి ఒడిలో మణిహారాలు
● అభివృద్ధి, చేస్తే అద్భుత క్షేత్రాలు ● పట్టించుకోని పాలకులు కొయ్యూరు: ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసే జలపాతాలు.. మదిని దోచే కొండకోనలు.. మండలంలో పర్యాటక సంపదకు కొదవలేదు. కానీ, అధికారుల నిర్లక్ష్యం, కనీస సౌకర్యాల లేమి ఆ అందాలను ఆస్వాదించాలనుకునే వారికి శాపంగా మారుతున్నాయి. ఇక్కడి నాలుగు ప్రధాన జలపాతాలు అభివృద్ధికి నోచుకోక వెలవెలబోతున్నాయి. అందమున్నా.. అడుగులేయడం కష్టమే! చింతవానిపాలెం సమీపంలోని ఇసుకలమడుగు జలపాతం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. అంతటి అద్భుత దృశ్యాలను చూడాలంటే పర్యాటకులు సాహసమే చేయాలి. దాదాపు ఒక కిలోమీటరుకు పైగా కాలినడకన, కొండలు ఎక్కుతూ దిగుతూ వెళ్లడం వృద్ధులు, పిల్లలకు నరకంగా మారుతోంది. పర్యాటక శాఖ ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఈ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. మృత్యుఘోష వినిపిస్తున్నా.. గత 30 ఏళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తున్న గాదేగుమ్మి జలపాతం దగ్గర విషాద ఛాయలు కూడా ఎక్కువే. ఈ జలపాతం వద్ద ప్రమాదవశాత్తు జారి పడి ఇప్పటివరకు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం చూసి వెళ్లేందుకు వస్తే, తిరిగి రాని లోకాలకు వెళ్తున్న పర్యాటకుల ఉదంతాలు చూస్తుంటే.. ఇది పర్యాటక కేంద్రమా లేక మృత్యుకూపమా అన్న సందేహం కలగక మానదు. ● మృతుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చిన ఈ జలపాతం దగ్గర, పర్యాటక శాఖ కనీసం భద్ర తా చర్యలు కూడా చేపట్టకపోవడం గమనార్హం. ఇక్కడ అరకొర సౌకర్యాలు కల్పించినా, అవి ఏమాత్రం సరిపోవు. భద్రతను పర్యవేక్షిస్తూ పర్యాటకుల కోసం అదనపు భవనాలు, రక్షణ గోడలు నిర్మించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. మౌలిక వసతులకు దూరం..సాకులపాలెం బూదరాళ్ల పంచాయతీ సాకులపాలెం సమీపంలోని జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. అయితే అక్కడ అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు లేవు. కనీసం కూర్చునేందుకు నీడ, తాగడానికి నీరు వంటి ప్రాథమిక వసతులు కూడా లేనందున పర్యాటకులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. దారి లేని జలపాతం : రామరాజుపాలెం నుంచి గాంకొండ వెళ్లే మార్గంలో మరో అద్భుతమైన జలపాతం దాగి ఉంది. అయితే అక్కడికి చేరుకోవడం అంటే ఆకాశాన్ని అందుకోవడమే అన్న ట్టుంది పరిస్థితి. సరైన రహదారి లేక, కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడంతో పర్యాటకులు వెనుకంజ వేస్తున్నారు. మౌలిక వసతులు కల్పిస్తాం జలపాతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తాం. కించవానిపాలెం జలాశయాన్ని కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంది. దీనిపై పూర్తి పరిశీలన అనంతరం చేపట్టబోయే పనుల వివరాలు వెల్లడిస్తాం – తిరుమణి శ్రీపూజ, పీవో, పాడేరు ఐటీడీఏ -
పోరాటాలతోనే ఆదివాసీలకు న్యాయం
చింతూరు: పోరాటాల ఫలితంగానే ఆదివాసీ యువతకు విద్య, ఉద్యోగ రంగాల్లో సరైన న్యాయం దక్కుతుందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు అన్నారు. పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం చింతూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు రోజునే తమసంఘం ఆవిర్భావ దినోత్సవం జరగడం సంతోషంగా ఉందన్నారు. జీవో నంబర్లు 3, 267తో పాటు ఉద్యోగులకు పదోన్నతులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై నిరంతర పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆదివాసీ యువత పరిషత్ అడుగుజాడల్లో నడుస్తూ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని ఆయన కోరారు. నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లా పరిధిలోకి పోలవరం ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయిగూడెం, టి.నరసాపురం, జీలుగుమిల్లి, కన్నాపురం మండలాలను కలపాలని ఆయన డిమాండ్ చేశా రు. తద్వారా ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే ఆస్కారముటుందని ఆయన పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్ నాయకులు పూనెం చిన్నవీరభద్రం, కుంజా శ్రీను, పొడియం లక్ష్మణరావు, శంకురమ్మ, ప్రసాద్, భ్రహ్మయ్య, రమణారెడ్డి, రవి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు -
● ప్రాణాలతో చెలగాటం
గిరిజన ప్రాంతాల్లో ప్రైవేటు జీపులు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఇష్టానుసారంగా ఎక్కించుకొని ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. పరిమితికి మించి ఎక్కించడమే కాకుండా అధిక చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సొలభం, వంజరి వంటి ప్రమాదకర ఘాట్ రోడ్లలో మలుపుల వద్ద వాహనం నియంత్రణ తప్పే ప్రమాదం ఉంది. నిబంధనల ప్రకారం వైట్ బోర్డు (సొంత వాహనాలు) గల వాటిని కమర్షియల్ ప్రయోజనాలకు వినియోగించడం చట్ట విరుద్ధం. అయినప్పటికీ రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – జి.మాడుగుల -
గిరిజనుల ముంగిటకే పాలన
రంపచోడవరం: ఏజెన్సీలో ప్రజలకు వివిధ రకాలైన సేవలు అందించేందుకు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు జరిగిందని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అన్నారు. రంపచోడవరం యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో కలెక్టర్ నూతన కార్యాలయాన్ని ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి, ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి, ట్రైకార్ చైర్మన్ బి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్చార్రిజ కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ ఏజెన్సీలో వెనుకబడిన ప్రాంతంగా రంపచోడవరం నియోజకవర్గాన్ని గుర్తించి 12 మండలాలకు వివిధ రకాలైన సేవలు సకాలంలో అందించే విధంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అల్లూరి జిల్లాలోని పాడేరు రావాలంటే సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని, రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటుతో ఇబ్బందులు తొలిగాయన్నారు. వైటీసీ, పీఎంఆర్సీ నుంచి సేవలందించేలా రెండు భవనాలు ప్రస్తుతం ఉపయోగిస్తున్నామన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం యాథావిధిగా పనిచేస్తుందన్నారు. గుర్తేడు మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంత గిరిజనులకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. పీవీటీజీ గిరిజనుల అభివృద్ధికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయన్నారు. అల్లూరి జిల్లాలో 1570 సెల్ టవర్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. జులై నెలాఖరుకు పూర్తి స్ధాయిలో నెట్వర్క్ అందుతుందన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి మాట్లాడుతూ నూతన జిల్లా ఏర్పాటుతో గిరిజనులకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. జిల్లాను అభివృద్ధిపఽథంలో నడిపించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ సాయిప్రశాంత్, ఎస్డీసీ అంబేద్కర్, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, సర్పంచ్ మంగా బొజ్జయ్య, తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరం కేంద్రంగా ’పోలవరం’ జిల్లా ఆవిర్భావం కలెక్టర్ దినేష్కుమార్ యూత్ ట్రైనింగ్ సెంటర్లో కలెక్టర్ కార్యాలయ ప్రారంభం -
వణికిస్తున్న శీతల గాలులు
● ముంచంగిపుట్టులో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినప్పటికీ చలి, మంచు తీవ్రత కొనసాగుతోంది. బుధవారం ముంచంగిపుట్టు 8.4 డిగ్రీలు, జి.మాడుగులలో 8.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధి పెదబయలులో 10.0 డిగ్రీలు, అరకువ్యాలీలో 10.8 డిగ్రీలు, డుంబ్రిగుడలో 12.1 డిగ్రీలు, చింతపల్లిలో 12.5 డిగ్రీలు, హుకుంపేటలో 12.7 డిగ్రీలు, పాడేరులో 12.9 డిగ్రీలు, కొయ్యూరులో 15.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు ఏడీఆర్ పేర్కొన్నారు. గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్పంగా మార్పులు చోటుచేసుకుంటున్నా సాయంత్రం అయ్యేసరికి శీతల గాలులు కొనసాగుతున్నాయి. ఉదయం పది గంటల వరకు మంచు దట్టంగా కురిసింది. రహదారులను మంచు తెరలు కమ్మేశాయి. వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. -
నూతనోత్సాహం
నిన్నటి జ్ఞాపకాలకు వీడ్కోలు పలుకుతూ.. ఆశల పల్లకిలో 2026కు స్వాగతం పలుకుతూ.. మన్యం గుండెల్లో నూతనోత్సాహం ఉప్పొంగింది. కేక్, మిఠాయిల తీపి.. గులాబీల పరిమళం.. మెరిసే అలంకరణలు.. మురిసే చిరునవ్వులు.. వీధులన్నీ పండుగ సంబరంలో మునిగిపోయాయి. కష్టాలన్నీ కరిగిపోవాలని.. సుఖశాంతులు చేకూరాలని.. అందరి ఆకాంక్షలు ఒక్కటై.. ఆశావహ దృక్పథంతో.. గిరిజన ప్రాంతమంతా నూతన కాంతులతో విరాజిల్లింది. న్యూ ఇయర్ వేడుకలతో సందడిమత్స్యగెడ్డ ఒడ్డున న్యూఇయర్ వేడుకల్లో పర్యాటకులుసాక్షి,పాడేరు: న్యూ ఇయర్ వేడుకలతో జిల్లావ్యాప్తంగా ముందస్తు సందడి నెలకొంది. జిల్లా కేంద్రమైన పాడేరులో న్యూ ఇయర్ కేక్లు భారీగా అమ్ముడుపోయాయి. పండ్ల దుకాణాల వద్ద సందడి నెలకొంది. గులాబీలు, పూల బొక్కేల కొనుగోళ్లు భారీగా జరిగాయి. మార్కెట్లో న్యూఇయర్ జోష్ నెలకొంది. ● బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రార్థనా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. క్రైస్తవ కుటుంబాలు, యువత, రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. పాడేరులోని సెయింట్ ఆన్స్ చర్చితో పాటు అన్ని చర్చిల్లో అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రా ర్థనలు నిర్వ హించారు. దైవ సేవకు లు లోక కల్యాణం కో రుతూ యేసుక్రీస్తుకు ప్రత్యేక ఆరాధనలు చేశా రు. క్రైస్తవ కుటుంబాలు ప్రార్థనల్లో పాల్గొన్నారు.కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆకట్టుకున్న ‘ధాన్యపు’ ముగ్గు కొత్త ఏడాది వేడుకల్లో భా గంగా నివాసాలు, దుకాణాల వద్ద మ హిళలు, యువతులు రంగురంగుల ముగ్గులు వేసి సందడి చేశారు. పాత బస్టాండ్ సమీపంలోని బూరెడ్డి డిపార్ట్మెంటల్ స్టోర్ ఎదుట బూరెడ్డి గాయత్రి వివిధ రకాల పప్పు ధాన్యాలతో వేసిన ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వినూత్న ముగ్గును అటుగా వెళ్లే బాటసారులు ఆసక్తిగా తిలకించారు. ● అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, ఆమె భర్త చెట్టి వినయ్ మరియు అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కలిసి కేక్ కట్ చేసి 2026కు స్వాగతం పలికారు. సుఖ సంతోషాలు నింపాలని వారు ఆకాక్షించారు. ముంచంగిపుట్టు: మండలంలో నూతన సంవత్సర వేడుకల సందడి నెలకొంది. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు మిళితమైన ఈ వేడుకలు ప్రత్యేకంగా నిర్వహించారు. యువత చలిమంటలు, పాటలతో 2026కు ఘనంగా స్వాగతం పలికారు. థింసా నృత్యాలతో గ్రామాలు కళకళలాడాయి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడంతో పండగ వాతావరణం నెలకొంది. కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలని చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
నూతన సంవత్సర వేళ విషాదం
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకుల మృతిఅచ్యుతాపురం రూరల్ : మునగపాక మండలం పల్లవాని వీధికి చెందిన మొల్లి రాము (25) కొండకర్ల కూడలికి సమీపంలో బస్సు బైక్ డీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుదవారం ఇంటి నుండి బయలుదేరి సోలార్ పరిశ్రమకు విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా మార్గమధ్యలో కొండకర్ల కూడలి సమీపంలోకి వచ్చే సరికి కార్మికులను తీసుకువెల్తున్న లారస్ పరిశ్రమ బస్సు, బైక్ డీకొన్న దుర్ఘటనలో మొల్లి రాము అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి తల్లిదండ్రులు, ఒక తమ్ముడు ఉన్నట్లు పోలీసుల సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ చంధ్రశేఖర్ రావు, ఎస్ఐ వెంకటరావు తెలిపారు. మృతుని కుటుంబాన్ని పరిశ్రమ, బస్సు యాజమాన్యం ఆదుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రొంగలి రాము డిమాండ్ చేసారు. మునగపాకలో విషాదం మునగపాక: కుటుంబానికి అందివస్తున్నాడనుకుంటున్న కన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని తల్లితండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. నూతన సంవత్సర వేడుకలను స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి ఘనంగా జరుపుకొందామని భావించిన ఆ యువకున్ని బస్సు మింగేసింది. దీంతో మునగపాకలో విషాదం అలముకుంది. వివరాలివి. మునగపాకకు చెందిన మొల్లి నాయుడు, వెంకటి దంపతులకు ఇద్దరు కుమారులు, నాయుడు కూలి పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్నారు. నాయుడు పెద్దకుమారుడు రాము కొంతకాలంగా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేయూతగా ఉంటున్నాడు. అందరితో సఖ్యతగా ఉండే రాము బుధవారం మధ్యాహ్నం షిప్టునకు తన బైక్పై మునగపాక నుంచి బయలుదేరి వెళుతుండగా అచ్యుతాపురం మండలం కొండకర్ల సమీపంలో ప్రధాన రహదారిపై బస్సు ఢీకొని అక్కడి కక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాము తల్లితండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఉదయం అందరితో సరదాగా గడిపిన కొడుకు అర్ధంతరంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడన్న సమాచారం తెలియడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు అంతా సిద్దమవుతున్న తరుణంలో ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. కొంపల్లి వద్ద బస్సును తప్పించబోయి... దేవరాపల్లి : దేవరాపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే రోడ్డులో కుంపల్లి కూడలి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కేఎంపాలెంకు చెందిన యువకుడు చౌడువాడ దేముడునాయుడు (26) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న అదే గ్రామానికి చెందిన గంధం మహేష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. కృష్ణారాయుడుపేట జంక్షన్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న 12డి బస్సు కుంపల్లి కూడలి చేరుకునే సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు బస్సును తప్పించబోయి ప్రమాదవశాత్తూ రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న దేముడునాయుడు తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. తీవ్ర గాయాలతో బయటపడిన గంధం మహేష్ను కె.కోటపాడు సీహెచ్సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజిహెచ్కు తరలించారు. కాగా కేంపాలెంకు చెందిన సముద్రంనాయుడు, రమణమ్మ దంపతుల రెండో కుమారుడు దేముడునాయుడు ఇంటర్ పూర్తి చేసి తల్లిదండ్రులతో పాటు అన్నయ్య జగ్గారావుకు వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉండేవాడు. స్నేహితుడితో బయటకు వెళ్లి వస్తానని చెప్పి బుధవారం ఉదయం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంత సమయం తర్వాత తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న విషాద వార్త తెలియడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కె.ఎం.పాలెంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. దేముడునాయుడు మృతి పట్ల సర్పంచ్ గంధం రామకృష్ణ సంతాపం తెలిపారు. -
అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వొద్దు
● చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా గూడెంకొత్తవీధి: నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండగల నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో ఎక్కడా కోడిపందాలు, పేకాటలు వంటి అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు ఆస్కారం ఇవ్వకుండా పోలీసులు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోత్ మిశ్రా అన్నారు. గూడెంకొత్తవీధి పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సీఐ సుధాకర్, ఎస్ఐ సురేష్లు మర్యాదపూర్వకంగా పూలమొక్కలతో స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్లో నమోదైన కేసులు, భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో మంచి ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని అభినందించి రివార్డులను అందజేశారు. -
దేశ రక్షణ కోసం మరో స్వాతంత్య్ర పోరాటం అవసరం
సినీ దర్శకుడు, నటుడు, రచయిత బాబ్జీ ఏయూక్యాంపస్ : దేశాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్య్ర సమరం సాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, రచయిత బాబ్జీ పేర్కొన్నారు. ‘సిటూ’ జాతీయ మహాసభలు సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవ్ ఐదో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖ ఉక్కు సహా.. దేశంలోని అన్ని వనరులనూ ఇద్దరు గుజరాతీలు అమ్మకానికి పెట్టగా.. ఇద్దరు గుజరాతీలు కొనుక్కుంటున్నారుని అన్నారు. దేశ రక్షణకు పిలుపు ఇస్తే భగత్ సింగ్లా ఉరికంబం ఎక్కడానికై నా తాను సిద్ధమేనని.. తాను ప్రజానాట్యమండలి బిడ్డనని.. ఎర్ర సినిమా తీయాలనే.. సినీ రంగాన్ని ప్రక్షాళన చేయడానికే సినీ రంగంలోకి వెళ్లానని తెలిపారు. అత్యంత శక్తిమంతమైన మాధ్యమం సినిమా రంగాన్ని కూడా ప్రజాసంఘంగా గుర్తించాలని ఆకాక్షించారు. ప్రత్యేక అతిథి ప్రొఫెసర్ కె.ఎస్.చలం మాట్లాడుతూ అదానీ, అంబానీలు దేశీయ పెట్టుబడిదారులు మాత్రమే కాదని, వారు అంతర్జాతీయ పెట్టుబడిదారులని వివరించారు. కార్మిక ధర్మనీతి–2025 చట్టం మనుధర్మ ప్రాతిపదికన చేసినట్లు పాలకవర్గమే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. సమస్యలపై పోరాటాలు మరింత క్రియాశీలకంగా సాగాలని ఆకాంక్షించారు. సిటూ రాష్ట్ర నాయకురాలు సుబ్బరావమ్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ అభివృద్ధి సంక్షేమం, అచ్ఛేదిన్ అంటుంటాయంటూ.. సంపద అతి కొద్ది మంది వద్దే ఉండటమేనా అచ్ఛేదిన్ అని ప్రశ్నించారు. అంగన్వాడీ, ఆశ సిబ్బందిని కార్మికులుగా గుర్తించాలని అంతర్జాతీయ కార్మిక సంఘం సిఫార్సులనూ పట్టించుకోని ప్రభుత్వ తీరును ఖండించారు. తొలుత సిటు రాష్ట్ర నాయకులు కె.అజయ్కుమార్ స్వాగతం పలికారు. సభలో శ్రామిక ఉత్సవ్ కన్వీనర్ రమాప్రభ తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లతో బానిసత్వంలోకి కార్మికవర్గం
● ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెలో పాల్గొనండి ● ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ పిలుపు సీతంపేట: కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల అమలుతో భారతీయ కార్మిక వర్గం బ్రిటిష్ కాలం నాటి బానిసలుగా మారే ప్రమాదం ఉందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల చట్టబద్ధ హక్కుల రక్షణ కోసం ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ‘లేబర్ కోడ్లు– భారతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రభావం’అనే అంశంపై బుధవారం ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంలో అగ్రభాగాన నిలిచిన భారతీయ కార్మిక వర్గం, దేశానికి స్వాతంత్య్రం రాకముందే 8 గంటల పనిదినం, యూనియన్ పెట్టుకునే హక్కు, వేతన చట్టం, బోనస్ చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం వంటివి పోరాడి సాధించుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటన్నింటినీ రద్దు చేసి, లేబర్ కోడ్ల రూపంలోకి మార్చి కార్మికులను కార్పొరేట్లకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. కొత్త వేతన కోడ్ ద్వారా గతంలో ఉన్న వేతన బోర్డులకు కాలం చెల్లినట్టేనని, జీతాలు ఎగ్గొట్టే యజమానులను నిలదీసే అధికారం లేబర్ కమిషనర్కు లేకుండా చేశారని ఆమె మండిపడ్డారు. సోషల్ సెక్యూరిటీ కోడ్ వల్ల కార్మికులు సాధించుకున్న సంక్షేమ బోర్డులు రద్దయ్యాయని, 40 శాతం కార్మిక వర్గాన్ని ఈఎస్ఐ, పీఎఫ్ పథకాలకు దూరం చేశారని వివరించారు. సమ్మె చేయాలంటే 50 శాతం మంది ఆమోదం ఉండాలని, 60 రోజుల ముందే నోటీసు ఇవ్వాలని నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. దేశ సంపదను సృష్టించిన విశాఖ స్టీల్ ప్లాంట్, విమానయానం, బొగ్గు, చమురు, విద్యుత్ వంటి కీలక రంగాలన్నింటినీ అదానీ వంటి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దీని వల్ల దేశం మళ్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నాటి పరిస్థితుల్లోకి, కార్మికులు బానిసత్వంలోకి నెట్టివేయబడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వ రంగాన్ని కాపాడుకోవడానికి జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె. అచ్యుతరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్మిక సంఘం నాయకులు బి.సి.హెచ్. మసేన్, డి.ఆదినారాయణ, పడాల రమణ, మన్మథరావు, బూసి వెంకటరావు, కె.సత్యాంజనేయ, వామన మూర్తి, చంద్రశేఖర్, కాశిరెడ్డి సత్యనారాయణ, పడాల గోవింద్, షేక్ మౌలాలి పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యం
పెదబయలు: మండలంలోని సీతగుంట పంచాయతీ లకేయిపుట్టు గ్రామ సమీపంలో ఏకలవ్య రెసిడెన్సియల్ పాఠశాల సమీపంలో మత్స్యగెడ్డలో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం బుధవారం లభ్యమయ్యింది.స్థానికుల సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ అధికారుల సహాయంతో మృతదేహాన్ని పోలీసు సిబ్బంది గెడ్డ నుంచి బయటకు తీశారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ వెంకటేష్ మాట్లాడుతూ వృద్ధురాలి వయస్సు 60 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గెడ్డ నుంచి ప్రధాన రోడ్డు వరకు పెదబయలు సివిల్ కానిస్టేబుల్ వెంకట్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ మనోహర్నాయుడు, సివిల్ హెడ్ కానిస్టేబుల్ నారాయణలు సుమారు కిలోమీటర్ వరకు మోసుకొచ్చి , మానవత్వాన్ని చాటుకున్నారన్నారు. అక్కడ నుంచి అంబులెన్స్లో పెదబయలు పీహెచ్సీకి తరలించినట్టు తెలిపారు. పోలీసు సేవలను అభినందనించారు. అయితే వృద్ధురాలి మృతదేహం ఆచూకీ తెలియలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకటేష్ చెప్పారు. మృతదేహం తరలింపులో సర్పంచ్ పలాసి మాధవరావు, ఎంపీటీసీ సభ్యుడు బొంజుబాబు, రెవెన్యూ సిబ్బంది సుందర్దేవ్, తదితరులున్నారు.మృతదేహాన్ని బయటకు తీసి మోసుకొచ్చిన పోలీసులు -
విద్యార్థుల ఉజ్వల భవితకు కృషి
చింతపల్లి: నేటి తరంలో విద్యార్థుల భావి భవిష్యత్ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా అన్నారు. చింతపల్లి సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పీఆర్టీయూ డైరీ, క్యాలెండర్ను జిల్లా అధ్యక్షుడు యువి గిరితో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధనపైనే చిన్నారుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గిరి మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నాయకులు మత్స్యలింగం, సత్తిబాబు, అప్పారావు, శామ్యూల్, గిరిజారాణి, కృష్ణకుమారి, మంగకుమారి, దామోదర్ పాల్గొన్నారు. డుంబ్రిగుడ/పాడేరు రూరల్: డుంబ్రిగుడ, పాడేరు ప్రాంతాల్లో బుధవారం పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో డైరీ, క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల్లో డుంబ్రిగుడలో ఎంఈవోలు శెట్టి సుందరరావు, జి.గెన్ను, ఎంపీడీవో ప్రేమ్సాగర్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పలరాజు, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, పాడేరులో ఏపీటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు డి.బాబురావు, వివిధ ఉపాధ్యాయ సంఘం నాయకులు జగన్మోహనరావు, శ్యాంసుందరం, పోతురాజు, కై లాసం, సోమినాయుడు, ధనుంజయ్ కన్నయ్య, బాలకృష్ణ, రాజారావు తదితరులు పాల్గొన్నారు.ఏఎస్సీ నవజ్యోతి మిశ్రా -
పక్కాగా వంద రోజులప్రణాళిక అమలు
● జిల్లా విద్యాశాఖ అధికారిరామకృష్ణారావు ఆదేశం డుంబ్రిగుడ: పదో తరగతి పరీక్షల్లో లక్ష్యసాధనకు ఉపాధ్యాయులు పక్కగా వంద రోజుల ప్రణాళిక అమలుకు కృషి చేయాలని జిల్లావిద్యాశాఖాధికారి రామకృష్ణారావు ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కస్తూ ర్బా గాంధీ గురుకుల బాలికల విద్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. యాక్షన్ అమలుతీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. మండల విద్యాశాఖ అధికారులు శెట్టి సుందర్రావు, జి గెన్ను పాల్గొన్నారు. -
బెల్టు షాపులకు విచ్చలవిడిగా మద్యం సరఫరా
పాడేరు రూరల్: నూతన సంవత్సర వేడుకలో భాగంగా పాడేరు కేంద్రంగా ఉన్న వైన్ షాపుల నుంచి మద్యం బాటిళ్లను ఆటోలు, వివిధ వాహనాల్లో బుధవారం భారీగా తరలించారు. పోలీసుల ఆంక్షలతో ఇబ్బందులు వస్తాయనే నేపంతోనే ముందస్తుగా వైన్ షాపుల నిర్వాహకులు పాడేరు, సమీప గ్రామాల్లోని బెల్టుషాపులకు మద్యం తరలించినట్టు పలువురు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలతో పాటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామాల్లోని బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా జరగనున్నట్టు తెలిపారు. ఎమ్మార్పీ కంటే అదనపు ధరలకు మద్యం అమ్మకాలు సాగుతున్నాయన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో మద్యం వ్యాపారులు విచ్చలవిడిగా బెల్టు దుకాణాల ద్వారా అమ్మకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసు, ఎకై ్సజ్ ఉన్నతాధికారులు స్పందించి బెల్టు దుకాణాలపై అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. -
ఆపరేషన్ కగార్తోమావోయిస్టులు తగ్గుముఖం
కొయ్యూరు: ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయిందని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. మంగళవారం ఆయన కొయ్యూరు,మంప స్టేషన్లను తనిఖీ చేశారు. రికార్డులను పరశీలించారు. సీఐ శ్రీనివాసరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో కూడా మావోయిస్టులు కదలికలు తగ్గాయన్నారు. గంజాయి సాగు పూర్తిగా నిలిచిపోయిందన్నారు. గిరిజనులు అవగాహన పెంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టారన్నారు. ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని చాలా వరకు తగ్గించామని చెప్పారు. ఇప్పటికీ గంజాయిపై పూర్తిగా నిఘా ఉంచామని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా సహించబోమని ఆయన హెచ్చరించారు. శాంత్రి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ను పెంచుతున్నామన్నారు. దీనిలో బాగంగా గ్రామాలను సందర్శించి అక్కడ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సంక్రాంతి సందర్భంగా ఎవరు పేకాట, కోడిపందాలకు పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. ప్రజలకు సత్వరమే న్యాయం అందేలా చేస్తామన్నారు. జాతీయ రహదారి 516ఈలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, వీటి నివారణకు వీలుగా ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. పశువులను రోడ్లపై ఉంచరాదని సూచించారు. సంతలు, నిర్దేశించిన గ్రామాల్లో వాలీబాల్ పోటీలను నిర్వహించి గిరిజన యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలో కొయ్యూరులో డైవింగ్లైసెన్స్ మేళాను నిర్వహిస్తామన్నారు.ఆర్టీవోతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో కొయ్యూరు, మంప ఎస్ఐలు కిషోర్వర్మ, ఎస్. శ్రీనివాస్ పాల్గొన్నారు -
ప్రసూతి నిరీక్షణ కేంద్రాలను పూర్తి చేయండి
పెదబయలు: ప్రసూతి నిరీక్షణ (బర్త్ వెయిటింగ్) కేంద్రాల సేవలు అందుబాటులోకి తేవాలని అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి సూచించారు. మంగళవారం ఆమె మండలంలోని మారుమూల రూడకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న సేవల వివరాలను తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడారు. పీహెచ్సీలో రోజు వారీ ఓపీ వివరాలు, ఎక్కువగాఏ వ్యాధికి సంబంధించి రోగులు వస్తున్నారని ఆమె ఆరా తీశారు. క్షయ రోగులు ఎక్కువగా ఉన్నందున నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. పీహెచ్సీ పరిఽధిలో ఉన్న 120 మంది ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తే వారితో మాట్లాడి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాత అంబులెన్సు వాహనంతో ఇబ్బందులు పడుతున్నందున ఇటీవల ఎంపీ నిధులతో కొత్త వాహనం సమకూర్చామన్నారు. పీహెచ్సీలో ల్యాబ్, అన్ని గదులను ఆమె పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన బర్త్ వెయింటింగ్ హాల్, సిబ్బంది కార్టర్ల నిర్మాణం 90 శాతం పూర్తయినందున మిగతా 10శాతం పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని గిరిజన సంక్షేమ ఈఈని కోరారు. వైద్య సేవలకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తేవాలన్నారు. గత ప్రభుత్వం వైద్యానికి పెద్ద పీట వేసిందని, ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాతారి సురేష్కుమార్. ఎంపీటీసీ వంటారి సంగీత, మాజీ ఎంపీటీసీ జాంబవతి, మాజీ సర్పంచ్ సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
కూల్చివేతలు గిరిజనులకేనా?
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. గిరిజనుడికి ఒక న్యాయం, గిరిజనేతరుడికి మరో న్యాయమా అంటూ స్థానికులు విమర్శించారు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక రెవెన్యూ కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ భూమిలో గిరిజనుడి కట్టడం అక్రమం అని మంగళవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అదే వ్యక్తి గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఎల్పీసీని చూపించినప్పటికీ, అధికారులు లెక్కచేయకుండా గునపాలతో కట్టడాన్ని తొలగించడం గమనార్హం. తహసీల్దార్ భాస్కరఅప్పారావు ఆదేశాల మేరకు ఆర్ఐ భాస్కర్, వీఆర్వో రమేష్ అక్రమ కట్టడంపై చర్యలు తీసుకున్నారు. ఇదే క్రమంలో మండల కేంద్రంలో మధు అనే గిరిజనేతరుడు కూడా ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేపడుతున్నా, అధికారులు కనీసం ఒక్క ఇటుకను కూడా తొలగించలేదు. దీనివల్ల అధికారుల తీరుపై పక్షపాత ఆరోపణలు వస్తున్నాయి. గిరిజన ప్రాంతంలో అన్ని హక్కులు ఉన్న గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తూ, గిరిజన ప్రాంతంలో ఎటువంటి హక్కులు లేని గిరిజనేతరుడికి ప్రభుత్వ భూమిలో నిర్మించడంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ను వివరణ కోరగా రెవెన్యూశాఖకు చెందిన భూమిలో గిరిజనుడు అక్రమంగా నిర్మించడం వల్ల చర్యలు తీసుకున్నామన్నారు. గిరిజనేతరుడికి నోటీసులు జారీ చేసి, తగు చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి హెడింగ్ కావాలి -
ఎప్పుడు?
రంపచోడవరంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు గడువులోగా పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో ఆధునిక వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆశించిన 11 మండలాల ప్రజలను చురుగ్గా సాగకపోవడం నిరాశపరుస్తోంది. మెరుగైన వైద్యం కోసం వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలకు వెళ్లలేక, ఇటు స్థానికంగా సదుపాయాలు లేక గిరిపుత్రులు అల్లాడిపోతున్నారు. సూపర్ వైద్యంరంపచోడవరం: గిరిజనులు అత్యవసర వైద్యం కోసం రాజమహేంద్రవరం, కాకినాడ వెళ్లాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో అక్కడికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మారేడుమిల్లి మండలం చాపరాయి వచ్చినప్పుడు వైద్యసేవల సమస్యను గిరిజనుల నుంచి ఆయన నేరుగా తెలుసుకున్నారు. అధికారం చేపట్టిన వెంటనే రంపచోడవరంలో మల్టీపర్పస్ సూపర్ సెష్పాలిటీ ఆస్పత్రిని మంజూరు చేశారు. రూ.50 కోట్లతో రూ. 150 పడకల సామర్థ్యం గల దీనికి 2023లో అప్పటి ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయ్భాస్కర్ శంకుస్థాపన చేశారు. అప్పటిలో నిధుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. ఇవి వచ్చే ఏడాది మే నెలాఖరుకు పూర్తి కావాల్సి ఉంది. అయితే సుమారు ఐదు నెలలు మాత్రమే గడువు ఉంది. శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఇప్పటివరకు 50 శాతం మేర పనులు మాత్రమే జరిగాయి. మిగతా పనులు సకాలంలో పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే అత్యవసర వైద్యానికి ఇబ్బంది ఉండదని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. దీనిపై వైద్యవిధాన పరిషత్ డీసీహెచ్ఎస్ నీలవేణిని వివరణ కోరగా రంపచోడవరంలో సూపర్ సెష్పాలిటీ ఆసుపత్రి నిర్మాణం గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వంద పడకలకు స్థాయి పెంచినా.. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిని 2014–19 మధ్య అప్పటి అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వంద పడకల ఆస్పత్రిగా స్థాయి పెంచింది. అయినప్పటికీ ఎటువంటి వసతులు కల్పించలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వంద పడకల వసతులతోపాటు తల్లీపిల్లల కోసం ప్రత్యేకంగా భవనం నిర్మించింది. మారుమూల గ్రామాల గిరిజనులకు వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో పీహెచ్సీలను మంజూరు చేసింది. రంపచోడవరంలో నత్తనడకను తలపిస్తున్న మల్టీపర్పస్ సూపర్ సెష్పాలిటీ ఆస్పత్రి నిర్మాణం -
వణికిస్తున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చలి తీవ్రతకు మన్యం వాసులు వణికిపోతున్నారు. మంచు ప్రభావం ఎక్కువగానే ఉంది. మంగళవారం జి.మాడుగులలో 7.0 డిగ్రీలు, అరకువ్యాలీలో 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ●పాడేరు డివిజన్ పరిధి ముంచంగిపుట్టులో 7.8 డిగ్రీలు, డుంబ్రిగుడలో 8.2 డిగ్రీలు, చింతపల్లిలో 10.8 డిగ్రీలు, పాడేరులో 11.3 డిగ్రీలు, కొయ్యూరులో 13.0 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 11.2 డిగ్రీలు, మారేడుమిల్లిలో 14.0 డిగ్రీలు, రంపచోడవరంలో 14.0 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 14.9 డిగ్రీలు, అడ్డతీగలలో 15.7 డిగ్రీలు, చింతూరు డివిజన్ ఎటపాక, చింతూరులో 15.3 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు ఏడీఆర్ పేర్కొన్నారు. ఉష్ణోగ్రతల్లో మార్పులు స్వల్పంగా ఉన్నప్పటికీ శీతల గాలుల ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఉదయం 10 గంటల వరకు మంచు కురుస్తూనే ఉంది. మంచు తెరలు కమ్మేయడం వల్ల వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. -
నీలాకాశంలో రెండో చందమామ
రాజవొమ్మంగి: చూడగానే.. అప్పుడే పౌర్ణమి వచ్చేసిందా?.. అని ఆశ్చర్యపోక తప్పదు. నింగిలో ఆ గుండ్రటి ఆకారం, ఆ వెలుగు చూస్తే ఎవరైనా పొరబడాల్సిందే. కానీ అది నిజమైన చందమామ కాదు.. నూతన సంవత్సర వేడుకల కోసం రాజవొమ్మంగిలో ఆకాశంలో కొలువుదీరిన ’కృత్రిమ జాబిల్లి’. కొత్త ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలనుకున్న ఓ ఔత్సాహికుడు వినూత్నంగా ఆలోచించారు. సుమారు రూ. 30 వేల ఖర్చుతో భారీ హైడ్రోజన్ బెలూన్ను సిద్ధం చేశారు. మంగళవారం రాత్రి దీనిని గాలిలోకి ఎగురవేయగా, చీకటి ఆకాశంలో అది పసుపు రంగులో చందమామలా మెరుస్తూ చూపరులను కట్టిపడేసింది. గ్రామస్తులంతా ఆసక్తిగా ఈ ’హైడ్రోజన్ వెన్నెల’ను తిలకించారు. కేవలం వేడుక కోసమే కాకుండా, విభిన్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇంత ఖర్చు చేసి ఈ బెలూన్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు స్థానికంగా వైరల్ అవుతున్నాయి. -
అథ్లెటిక్స్ పోటీల్లో పీడీ ప్రతిభ
● బంగారు పతకం సాధన ఎటపాక: కరీంనగర్లో ఈనెల 27,28 తేదీల్లో జరిగిన 12 మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని నల్లకుంట గిరిజన ఆశ్రమ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగిరెడ్డి బంగారు పతకం సాధించారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 45 నుంచి 50 ఏళ్ల వయసు విభాగం షాట్పుట్ విభాగంలో ఆయన ప్రతిభ కనబరిచారు. వంద మీటర్ల పరుగు పందెం, జావెలన్ త్రోలో సిల్వర్ పతకాలు సాధించారు. వచ్చే ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు రాజస్థాన్లో జరిగే జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నా ఆయనను సహచర ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు అభినందించారు. -
రంపచోడవరం వైటీసీలో కలెక్టర్ కార్యాలయం
●కొత్త జిల్లాలో పాలనకు ఏర్పాట్లురంపచోడవరంలో కలెక్టరేట్ ఏర్పాటుచేయనున్న యూత్ ట్రైనింగ్ సెంటర్ రంపచోడవరం: రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లాలో పాలనకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్లో (వైటీసీ)లో కలెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని బుధవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి ప్రారంభించనున్నారు. అలాగే పరిపాలనలో ముఖ్యమైన ఎస్పీ, జాయింట్ కలెక్టర్ వంటి కీలకమైన పోస్టులను బుధవారం సాయంత్రంలోగా ప్రకటించే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం జనవరి ఒకటి నుంచి కొత్త జిల్లాలో పరిపాలన ప్రారంభం కానుంది. -
ఆశ్రమ విద్యార్థిని మృతిపై విచారణ
విద్యార్థులతో మాట్లాడుతున్న ఏడీఎంహెచ్వో ప్రతాప్ సీలేరు: స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలలో పాంగి నందిని మృతిపై అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ ప్రతాప్ విచారణ చేపట్టారు. మంగళవారం ఆయన పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. శుభత్ర పాటిస్తే ఎటువంటి వ్యాధులు దరిచేరవన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విద్యార్థిని మృతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఏజెన్సీలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో వైద్య సిబ్బందిని నియమించేలా సంబంధిత అధికారులు హామీ ఇచ్చారని చెప్పారు. ఇకపై ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా రక్తపరీక్షలు చేపట్టేలా సంబంధిత వైద్యులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సికిల్ సెల్ ప్రోగ్రాం ఆఫీసర్ బాబ్జి మాట్లాడుతూ రక్తహీనతను ప్రతి ఒక్కరూ మంచి ఆహారంతో దూరం చేయవచ్చన్నారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న రాగిజావ, చక్కీలు ఎంతో మేలు చేస్తాయన్నారు. వైద్యాధికారి నారాయణరావు, హెల్త్ సూపర్వైజర్ త్రినాథ్, వార్డెన్ శకుంతల పాల్గొన్నారు. -
17 నిమిషాల పోరాటం
సీలేరు: స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యాధికారులు తమ అసాధారణ ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తితో ఒక పసికందు ప్రాణాన్ని కాపాడారు. మృత్యువుతో పోరాడుతున్న శిశువుకు పునర్జన్మ ప్రసాదించి ’వైద్యో నారాయణో హరి’ అని నిరూపించారు. వివరాలిలా ఉన్నాయి. గూడెంకొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ రాళ్లగెడ్డ గ్రామానికి చెందిన కిలో రమేష్ భార్య భగవతి ప్రసవం కోసం స్థానిక పీహెచ్సీలో చేరారు. సోమవారం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ సమయంలో వైద్యాధికారులు బాబ్జి, నారాయణరావు ఇతర సిబ్బందితో కలిసి విధుల్లో ఉన్నారు. శిశువు జన్మించిన వెంటనే ఊపిరి అందకపోవడంతో పరిస్థితి విషమించింది. గుండె నుంచి ఇతర అవయవాలకు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో శిశువు శరీరం మొత్తం నలుపు రంగులోకి మారిపోయింది. పసికందు కనీసం ఏడవకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వైద్యాధికారులు బాబ్జి, నారాయణరావు ఏమాత్రం అధైర్యపడకుండా వెంటనే రంగంలోకి దిగారు. సుమారు 17 నిమిషాల పాటు నిరంతరాయంగా శిశువు కాళ్లు, వీపు, గుండైపె తడుతూ రక్త ప్రసరణ జరిగేలా శ్రమించారు. వారి నిరంతర శ్రమ ఫలించి, శిశువు ఒంటి రంగు మారి ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించింది. దీంతో అప్పటివరకు ఉత్కంఠగా ఉన్న ఆసుపత్రి వాతావరణంలో ఆనందం నెలకొంది. శిశువు కొంత ఉమ్మనీరు తాగడంతో, మెరుగైన చికిత్స కోసం పాపను చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మంగళవారం నాటికి పసికందు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారి బాబ్జి ధ్రువీకరించారు. తమ బిడ్డను ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్యులకు తల్లిదండ్రులు మరియు స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషదేవిపై ఫిర్యాదు
వై.రామవరం: తమ నాయకుడు, ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ్ భాస్కర్ (అనంత బాబు) ప్రాణాలకు ముప్పుతెచ్చే వ్యాఖ్యలు చేసిన రంపచోడవరం ఎమ్మెల్యే (టీడీపీ) మిరియాల శిరీషదేవిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఎస్ఐ పృథ్వీయాదవ్కు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 23వ తేదీన ఎమ్మెల్యే శిరీషదేవి రంపచోడవరంలో నిర్వహించిన ప్రెస్మీట్లో తమ నాయకుడు ఎమ్మెల్సీ అనంతబాబుపై ఉద్దేశపూర్వకంగా ఏకవచనంతో నానా మాటలు అన్నారన్నారు. ఒక ఎమ్మెల్సీ అనికూడా చూడకుండా అనంతబాబు ఇంటికి జనాన్ని పంపించి కొట్టిపారేయిస్తాననడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, అనంతబాబు ప్రాణాలకు ముప్పువచ్చే విధంగా ఆమె ప్రవర్తించారని వారు ఆరోపించారు. ఇలా ఈ ఒక్కసారే కాకుండా అనేక సార్లు భయభ్రాంతులను చేసేలా మాట్లాడారన్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలకు ముప్పువాటిల్లే విధంగా ఎమ్మెల్యే శిరీషదేవి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే శిరీషదేవిపై భారతీయ న్యాయ -
ఇబ్బందులను తొలగించాలి
మారుమూల గ్రామాల గిరిజనులకు అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ దిశగా చర్యలు చేపట్టి వైద్యసేవల పరంగా ఇబ్బందులను తొలగించాలి. అన్ని రకాల వైద్యసేవలను గిరిజనులకు చేరువ చేయాలి. –బందం శ్రీదేవి, ఎంపీపీ, రంపచోడవరం గడువులోగా పూర్తి చేయాలి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బలోపేతం అయ్యాయి. దీనిలో భాగంగానే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టింది. పనులు గడువులోగా పూర్తి చేస్తే గిరిజనులకు ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. –పండా రామకృష్ణదొర, వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు, రంపచోడవరం -
పెండింగ్ మ్యుటేషన్లు పూర్తి చేయండి
పాడేరు : జిల్లాలో పెండింగ్లో ఉన్న మ్యుటేషన్లు, రీసర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. ఐటీడీఏలోని తన చాంబర్ నుంచి మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారులు, మండల రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న భూ సంబందిత సర్వేలపై ప్రతి రోజు సమీక్ష నిర్వహిస్తామన్నారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న మ్యుటేషన్లు, రీసర్వే సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తేవాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలన్నారు. స్మార్ట్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, తొలగింపు సమగ్ర సమాచారంతో చేపట్టాలన్నారు. పీఎం జన్మన్ పథకంలో నిర్మిస్తున్న గృహాల పనులు వేగవంతం చేయాలన్నారు. జీవో నంబరు 23ప్రకారం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు గుర్తించాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. -
బ్లైండ్ క్రికెటర్ కరుణకుమారికి ఘన సత్కారం
మంచు కొండల్లో వేడివేడి విందు ●హరితా రిసార్ట్లో ప్రత్యేక వంటకాలు చింతపల్లి: ప్రముఖ పర్యాటక కేంద్రం లంబసింగిలోని పర్యాటకశాఖ హరితా రిసార్ట్లో నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని ప్రత్యేక వంటకాలను ఏర్పాటు చేస్తున్నట్లు రిసార్ట్ మేనేజర్ ఎస్. అప్పలనాయుడు తెలిపారు. ఇక్కడి వచ్చే పర్యాటకులకు ఈ ఏడాది ప్రత్యేకంగా కోడికూర, రాగి సంగటి, కుండ బిర్యాని (వెజ్, నాన్వెజ్) తయారు చేస్తున్నట్లు తెలిపారు. నిప్పుల కుంపటి తెచ్చిన ముప్పు గూడెంకొత్తవీధి: చలి నుంచి ఉపశమనం కోసం వారు వేసుకున్న నిప్పుల కుంపటి, ఆ దంపతుల ప్రాణాల మీదకు తెచ్చింది. తలుపులు మూసి నిద్రించడంతో విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైన ఘటన సోమవారం రాత్రి నక్కలమెట్ట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నక్కలమెట్ట గ్రామానికి చెందిన కొర్రా రాంబాబు (50), కొర్రా లక్ష్మి (45) దంపతులు సోమవారం రాత్రి చలి ఎక్కువగా ఉండటంతో ఇంట్లో నిప్పుల కుంపటి పెట్టుకున్నారు. గది చిన్నది కావడంతో పాటు, చలి గాలి రాకుండా తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేసి నిద్రపోయారు. మంట నుంచి వెలువడిన బొగ్గు పులుసు వాయువు గది నిండా వ్యాపించడంతో, ఆక్సిజన్ అందక వారు నిద్రలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా, ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే వీరిని స్థానిక పీహెచ్సీకి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ప్రొటోకాల్పై గరంగరం
మహారాణిపేట(విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రొటోకాల్ అమలుపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం వేడీవేడిగా సాగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరు కావడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్.హరేందిర ప్రసాద్(విశాఖ), విజయ కృష్ణన్(అనకాపల్లి), దినేష్ కుమార్(ఏఎస్ఆర్ జిల్లా), సీఈవో నారాయణమూర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు గౌరవం లేదా? మండలాల పరిధిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్థానిక ప్రజాప్రతినిధులను పిలవడం లేదని, వారిని గౌరవించాల్సిన అవసరం లేదా అని పలువురు సభ్యులు సూరిబాబు(ఎంపీపీ, అనకాపల్లి), ఈర్లె అనురాధ(జెడ్పీటీసీ), సన్యాసిరాజు, నాగమణి, ఉమాదేవి, కర్రి సత్యం, దొండా రాంబాబు తదితరులు ప్రశ్నించారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రొటోకాల్ పక్కాగా ఉండేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అనకాపల్లి జిల్లా కొత్తూరులో వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదని అనకాపల్లి ఎంపీపీ సూరిబాబు ఆరోపించారు. ఈ విషయంపై అధికారులను అడిగినా సరైన సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. కె.కోటపాడు జెడ్పీటీసీ ఈర్లె అనురాధ మాట్లాడుతూ ఇటీవల తన మండలంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆహ్వానించలేదన్నారు. ప్రశ్నిస్తే గంట ముందుగా ఫోన్ చేసి రావాలని పిలుస్తున్నారని, ఇదెక్కడి ప్రొటోకాల్ అమలు చేయడమో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఒకసారి ప్రశ్నిస్తే, రెండోసారి పొరపాటు చేయకూడదని, కానీ ఇక్కడ అధికారులు పదేపదే తప్పులు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర ఆదేశించారు. ప్రొటోకాల్ పాటించని ఎంపీడీవోలకు నోటీసులు జారీ చేస్తామని సీఈవో నారాయణమూర్తి తెలిపారు. పింఛన్ల ఏరివేత ఆపండి ఉమ్మడి విశాఖ జిల్లాలో పింఛన్ల ఏరివేత ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని, ఈ ఏరివేతలో అర్హులకు అన్యాయం జరుగుతోందని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తున్నారని గొలుగొండ ఎంపీపీ నాగమణి ఆరోపించారు. బుచ్చయ్యపేట జెడ్పీటీసీ దొండపూడి రాంబాబు మాట్లాడుతూ అనర్హులకు పింఛన్లు ఇస్తున్నారని, అర్హులకు తొలగిస్తున్నారని మండిపడ్డారు. పింఛన్ల విషయంలో దివ్యాంగులను ఇబ్బంది పెట్టడం తగదని జెడ్పీటీసీ ఈర్లె అనురాధా కోరారు. పల్లె రోడ్ల దుస్థితిపై సర్వత్రా గగ్గోలు ఉమ్మడి జిల్లాలో పలు గ్రామాల్లో రోడ్ల దుస్థితిపై ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డాది, చోడవరం, రోలుగుంట, నర్సీపట్నం, గొలుగొండ, తదితర మండలాల్లోని గ్రామాల్లో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని మాడుగుల ఎంపీపీ తాళ్లపూడి వెంకట రాజారామ్ వివరించారు. ఈ మార్గాల్లో ప్రయాణించడం గగనంగా మారిందని వాపోయారు. రోడ్ల పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని రాజారామ్ అధికారులను ప్రశ్నించారు. దేవరాపల్లి మండలంలో కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని జెడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం అన్నారు. కోటవురట్ల మండలంలో కూడా రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయని జెడ్పీటీసీ సభ్యురాలు ఉమాదేవి తెలిపారు. సీపీఎం నాయకుడు అప్పలరాజును విడుదల చేయాలి సీపీఎం నాయకుడు అప్పలరాజుపై పెట్టిన పీడీ కేసును ఎత్తి వేయాలని పలువురు సభ్యులు కోరారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అప్పలరాజుపై పీడీ యాక్టు నమోదు చేయడం దారుణమని అనంతగిరి జెడ్పీటీసీ డి.గంగరాజు అన్నారు. ఆయనకు మద్దతుగా పలువురు వైఎస్సార్సీపీ సభ్యులు, నక్కపల్లి జెడ్పీటీసీ గోసల కుశలమ్మ, పైలా సన్యాసిరాజు, సోము సత్యనారాయణ, లాలం రాంబాబు తదితరులు మాట్లాడారు. బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలుష్యంపై ఆందోళన పరవాడలో వివిధ పరిశ్రమల కారణంగా కాలుష్యం సమస్య అధికంగా ఉందని జెడ్పీటీసీ పైలా సన్యాసిరాజు అన్నారు. పలు లారీలు ఓవర్ లోడుతో వెళ్తుండడంతో రోడ్లు ఛిద్రమయ్యాయని చెప్పారు. అయినా కాలుష్య నివారణ అధికారులు, ఆర్టీవో, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అచ్యుతాపురంలో కూడా కాలుష్య సమస్య అధికంగా ఉందన్నారు. లంకెలపాలెం జంక్షన్లో కాలుష్యం కారణంగా కనీసం 10 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రజాప్రతినిధుల బినామీలే లారీల కాంట్రాక్టులను దక్కించుకోవడంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని సన్యాసిరాజు ఆరోపించారు. పలు ప్రాంతాల నుంచి మట్టి అక్రమ తరలింపుపై గనుల శాఖ అధికారులు సమాధానం చెప్పాలని మాడుగుల ఎంపీపీ తాళ్లపూడి వెంకట రాజారామ్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మూడు జిల్లాల అధికారులు, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి, కె.రాజ్కుమార్, పరిపాలనాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.మౌనం పాటిస్తున్న జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, చిత్రంలో కలెక్టర్లు హరేందిర ప్రసాద్, విజయ కృష్ణన్, దినేష్కుమార్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కొయ్యూరు జెడ్పీటీసీ సభ్యుడు వి.నూకరాజు మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు మాట్లాడుతూ నూకరాజు సేవలను కొనియాడారు. ప్రొటోకాల్ అమలుపై జెడ్పీ చైర్పర్సన్ సుభ్రద, కలెక్టర్ల ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు మండలాల్లో అభివృద్ధి పనులకు ఆహ్వానం లేకపోవడంపై జెడ్పీటీసీల ఆగ్రహం బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా నినాదాలు వాడీవేడిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరుపై గుసగుసలు -
మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్లో అత్యాధునిక టోమోథెరపీ సేవలు
ఎంవీపీకాలనీ: క్యాన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం హాస్పటల్లో జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ హాస్పటల్ ఎండీ డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించే విధంగా మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ ఏపీలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు క్యాన్సర్ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. హాస్పటల్ ఎండీ మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్లు విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ దేశంలో లెవల్ 3 కేటగిరి హాస్పటల్స్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ ట్యూమర్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు.కార్యక్రమంలో పలువురు హాస్పటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వించ్ ప్రయాణం అమోఘం
ముంచంగిపుట్టు: మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి వెళ్లే వించ్ ప్రయాణం అమోఘమని ఒడిశా జలవిద్యుత్శాఖ ఆర్థిక సంచాలకుడు ప్రణబ్కుమార్ అన్నారు. ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. వించ్లో ప్రాజెక్ట్కు చేరుకున్నారు. మధురానుభూతి పొందారు. వించ్ వివరాలను ప్రాజెక్టు అధికారుల నుంచి తెలుసుకున్నారు. విద్యుత్ కేంద్రంలో జనరేటర్ల పనితీరు, విద్యుత్ ఉత్పత్తి వివరాలపై ఆరా తీశారు. శతశాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండడంపై ఆయన ప్రాజెక్టు అధికారులను,సిబ్బందిని అభినందించారు. పలు రికార్డులను పరిశీలించారు. స్థానిక ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు,సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ గోవిందరాజులు, ఓహెచ్పీసీ జీఎం నిర్మల్కుమార్ ,మాచ్ఖండ్ ఈఈ సివిల్ కురేషిప్రధాన్, డిప్యూటీ ఈఈలు చంద్ర ఓబుల్రెడ్డి, వెంకటమధు,చిరంజీవి పాల్గొన్నారు. -
విద్యార్థుల మరణాలు ప్రభుత్వానికి పట్టవా?
సీలేరు: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సంభవిస్తున్న విద్యార్థుల వరుస మరణాలు ప్రభుత్వానికి పట్టవా? అని డీఎల్వో రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర మార్క్ రాజ్. జిల్లా ముఖ్య కార్యదర్శి మనోజ్ కుమార్ ప్రశ్నించారు. తరచూ విద్యార్థులు మరణిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. మంగళవారం వారు మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి చెందిందని ఆరోపించారు. ఆశ్రమ పాఠశాలల్లో పర్యవేక్షణ అధికారులు లేకపోవడం దారుణమన్నారు. సీలేరు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎక్కడికి వెళ్లిపోయారో ఐటీడీఏ పీవో సమాధానం చెప్పాలి డిమాండ్ చేశారు. 270 మంది ఉన్న పాఠశాలలో కేవలం ఒకే ఒక్క వంట మనిషి ఉండటం, ఒక వైద్య సిబ్బంది కూడా లేకపోవడం దారుణమన్నారు. పర్యవేక్షణ లేకే అవాంఛనీయ ఘటనలు గూడెంకొత్తవీధి: సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ సంక్షేమ ఆశ్రమాల్లో అనేక అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని గూడెంకొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ ఎంపీటీసీ అంపురంగి బుజ్జిబాబు అన్నారు . మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గూడెంకొత్తవీధి మండలంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల్లో వేలాది మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారన్నారు. వీరి బాగోగులు, ఇబ్బందులపై సరైన పర్యవేక్షణ ఉండటం లేదన్నారు. ఇటీవల కాలంలో గూడెంకొత్తవీధి మండలంలోని పలు పాఠశాలల్లో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. గతంలో మండలానికి సహాయ గిరిజన సంక్షేమాధికారి ఉండేవారని, ఆ పోస్టును ప్రభుత్వం రద్దుచేసిందని చెప్పారు. చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాలను ఒకే అఽధికారి పర్యవేక్షించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. తక్షణమే గూడెంకొత్తవీధి మండలానికి ఏటీడబ్ల్యూవోను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. -
కమనీయం.. ఉత్తరద్వార దర్శనం
● హరినామస్మరణతో మార్మోగిన ఆలయాలు ● భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి పూజలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా హరి నామస్మరణతో వైష్ణవాలయాలు మార్మోగాయి. ఉత్తరద్వారం గుండా ఆ వైకుంఠనాథుని దర్శించుకునేందకు మంగళవారం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే జిల్లాలో పలు ఆయాలకు భక్తులు పోటెత్తారు. స్వామిని దర్శించుకుని తరంచారు. అలౌకికానందంతో తన్మయుల్యారు . సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులోని గిరి కై లాస క్షేత్రంలోని వైభవ వేంకటేశ్వరస్వామితో పాటు సుండ్రుపుట్టులోని వేంకటేశ్వరస్వామి, వెంకటగిరి మెట్టపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి,అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు అనంతరం మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,డాక్టర్ నరసింగరావుతో పాటు ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు కొట్టగుళ్లి రమాదేవి, కాత్యాయని, వెంకటరత్నం, వైదేహి తదితరులు భగవద్గీత పుస్తకాలు, ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. వెంకటగిరి మెట్టపై భారీ అన్నసమరాధనను నిర్వహించారు.అరకులోయలోని పురాతన వేంకటేశ్వరస్వామి ఆలయంలోను ముక్కోటి ఏకాదశని ఘనంగా నిర్వహించారు. రంపచోడవరంలోరంపచోడవరం : ఐ.పోలవరం గోవిందగిరిపై తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఐటీడీఏ పీవో స్మరణ్ రాజ్, ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి సతీసమేతంగా పాల్గొని పూజలు జరిపారు. ఆలయ అర్చకులు పార్థుస్వామి, మణికంఠస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం, గోకవరం తదితర సదూర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో వైకుంఠద్వారంనుంచి స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవకులు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ అధికారులు రూపు సాయి, గోవింద గిరి శ్రీవారి సేవా బృందం సమన్వయ కర్త నల్లమిల్లి వేంకటరామారెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. చింతపల్లి: మండలంలోని పలు ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించా రు. అంతర్ల అనాదీశ్వర ఆలయంలో శివానంద మాతాజీ, అర్చకులు వినోద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బౌడ, వంగసార, శివాలయాలతో పాటు గొందిపాకలు,తాజంగి,చింతపల్లి రామాలయాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అంతర్ల శివాలయంలో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు 24 గంటల పాటు ప్రత్యేక భజన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ భజన కార్యక్రమంలో మండలంలో గల 10 భజన బృందాలు పాల్గొన్నాయి.ఆలయంలో పూజలు నిర్వహించిన భక్తులకు అన్నసమారాధన జరిపి, ప్రసాదాలను పంపిణీ చేశారు. అడ్డతీగల: ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. అడ్డతీగలలోని పవనగిరి క్షేత్రంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. పాత రామాలయంలో ఏకాహం అడ్డతీగలలోని పాత రామాలయంలో కొలువైన సీతారామచంద్రస్వామి వార్లను వివిధ రకాల పుష్పాలు,తులసి మాలలతో అలంకరించి పూజాధికాలు నిర్వహించారు.అనంతరం సీతారామాలయంలో ఉదయం 6 గంటల నుంచి ఏకాహం ప్రారంభించారు. జి.మాడుగుల: సింగర్భ పంచాయతీ గొడ్డుబూసులు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుడు ఐసరంగి రామకృష్ణ,దేవుళ్ళునాయుడు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్థానిక రామాలయం, గాంధీనగరం గ్రామంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, మత్స్య మాడుగులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రముఖ్ రీమెలి అప్పలరాజు, ధర్మ రక్ష దివస్ స్వామి సచ్చానంద లక్ష్మణ్ స్వామిజీ తదితరులు పాల్గొన్నారు. సీలేరు: ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని సీలేరు, దారకొండలలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీలేరులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు.స్థానిక రామాలయం ఆలయంలో ఆకాశదీప పూజలను నిర్వహించి కుంకుమ పూజలు కోలాటం. దారకొండలో స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. రాజవొమ్మంగి: స్థానిక కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులకు ఉత్తరద్వార దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం లక్ష తులసి పూజ, ప్రసాదవితరణ జరిపారు. -
ఉత్తర ద్వార దర్శనానికి వేళాయె
సింహాచలం: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఉత్తర రాజగోపురంలో మంగళవారం ఉదయం 5.30 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వైకుంఠనారాయణుడిగా శ్రీదేవి, భూదేవి సమేతుడై దర్శనమివ్వనున్నాడు. సుమారు 50 వేల మంది భక్తులు ఈసారి స్వామి దర్శనానికి వస్తారని అంచనా వేశారు. ఉచిత దర్శనం క్యూతోపాటు రూ.100, రూ..300 దర్శన క్యూలు, రూ.500 ప్రత్యేక దర్శన క్యూ, ప్రోటోకాల్ వీఐపీల క్యూలు ఏర్పాటు చేశారు. ఉత్తరరాజగోపురం ఎదురుగా భక్తులు క్యూల్లో నడుస్తూనే 15 నిమిషాలపాటు స్వామిని దర్శించుకునే ఏర్పాటు చేశారు. అలాగే ఉత్తరద్వారం దర్శనం కాగానే నేరుగా ఆలయంలోకి వెళ్లి నీలాద్రిగుమ్మం నుంచి మూలవిరాట్ దర్శనం చేసుకునేలా క్యూలు రూపొందించారు. ఆలయ రాజగోపురం, ఉత్తర రాజగోపురం, ఆలయ ప్రాంగణాలకు విద్యుద్దీపకాంతులు చేకూర్చారు. భారీ ఎత్తున పుష్పాలంకరణ చేశారు. ఉదయం 4 గంటల నుంచి సింహగిరికి ఆర్టీసీ, దేవస్థానం బస్సులు ప్రారంభమవుతాయి. సుమారు లక్ష లడ్డూల ప్రసాదాన్ని విక్రయానికి సిద్ధం చేశారు. సింహగిరిపైన, కొండదిగువ కలిపి మొత్తం ఆరుచోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 190 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు విధులు నిర్వర్తిస్తారని గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్.నాయుడు తెలిపారు. నేటి నుంచి రాత్రి 7 గంటల వరకే దర్శనాలు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు మంగళవారం నుంచి జనవరి 9వ తేదీ వరకు రాత్రి 7 గంటల వరకు మాత్రమే లభిస్తాయని అధికారులు తెలిపారు. ఆలయంలో జరిగే రాపత్తు ఉత్సవాల సందర్భంగా ఈ మార్పు చేసినట్టు పేర్కొన్నారు. దర్శన వివరాలు ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు ఉత్తరద్వార దర్శనాలు ముగిసినా.. మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు మూలవిరాట్ దర్శనాలు ఉంటాయి. -
సమస్యలపై వెల్లువెత్తిన వినతులు
రంపచోడవరం: రంపచోడవరం మండలం సీమగండి నుంచి వేములకొండ గ్రామం వరకు సుమారు 20 కిలోమీటర్లు మేర రోడ్డు ఆధ్వానంగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. కొంత మేర ఘాట్రోడ్డు ఉండడం ఎటువంటి రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నామని కుర్ల అబ్బాయిరెడ్డి, కొండ్ల శ్రీదేవి, కుర్ల మోహర్వాణిలు తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో పీవో స్మరణ్రాజ్, సబ్ కలెక్టర్ సాహిత్లతో కలిసి పీజీఆర్ఎస్లో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ వారం 78 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. మారేడుమిల్లి మండలం కుట్రవాడ నుంచి పాములేరు వరకు ఐదు కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మించాలని పాములేరు సర్పంచ్ రమాదేవి, సార్ల మంగిరెడ్డి, పల్లాల పండురెడ్డి తదితరులు అర్జీ అందజేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన పెదబీంపల్లి –2 ఆర్అండ్ఆర్ కాలనీలైన మడపల్లి, పెనికిలపాడు, మంటూరు గ్రామాలకు ఒక పంచాయతీగా ఏర్పాటు చేయాలని సర్పంచ్ తోకల నాగరత్నం, ముర్ల సూర్యకుమారి కోరారు. దేవీపట్నం మండలం వెలగపల్లి నుండి దోనలంక మీదుగా పీహెచ్ గంగవరం,పెద్దనూతులు గ్రామాలకు లింకు రోడ్డు ఏర్పాటు చేయాలని సర్పంచ్ కె.శివారెడ్డి కోరారు. చింతలపూడి పంచాయతీ పెరికవలస రోడ్డు ఫారెస్టు క్లియరెన్స్ మంజూరు చేసి రోడ్డు నిర్మించాలని, వేటుకూరు–చింతలపూడి వరకు 15 కిలోమీటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. సిడిమెట్ల వరకు 8 కిలోమీటర్లు రోడ్డు, బొడ్డగుంట, చింతకొయ్య గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం చేయాలని గిరిజనులు కోరారు. ఏపీవో డీఎన్వీ రమణ, తదితరులు పాల్గొన్నారు. -
సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలి
చింతపల్లిలో ప్రచారం చేస్తున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్ చింతపల్లి: విశాఖనగరంలో ఈనెల 31 నుంచి జనవరి 4వరకూ జరిగే సీఐటీయూ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్ కోరారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం చింతపల్లిలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాసభలకు దేశం నలుమూలలు నుంచి కార్మిక సంఘాల నాయకులు, ప్రముఖ సినీ నటులు, రచయితలు, కళాకారులు హాజరుకానున్నారన్నారు. ఇప్పటికే మహాసభలు ప్రాంగణంలో శ్రామిక ఉత్సవ పేరుతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వెంకటగిరి, ధనుంజయ్, చిరంజీవి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
● ఎమ్మెల్యే శిరీషపై పోలీసులకు వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు ● రాజవొమ్మంగిలో ఫిర్యాదు స్వీకరించని పోలీసులు ఎటపాక , వి.ఆర్.పురం, కూనవరం పోలీసుస్టేషన్లలో ఫిర్యాదుచేస్తున్న వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఎటపాక/కూనవరం/వి.ఆర్.పురం/గంగవరం/రాజవొమ్మంగి: ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి చేసిన అనుచిత వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ అనంతబాబుపై తప్పుడు ఆరోపణులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యే శీరిషాపై ఎటపాక, వి.ఆర్.పురం, కూనవరం, గంగవరం, రాజవొమ్మంగి తదితర మండలాల్లోని పోలీసు స్టేషన్లలో వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నియోజక ప్రజలకు అండగా నిలిచి, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్సీపై అసత్య ప్రచారాలు మానుకుని ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని హితవు పలికారు. ఇకపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎటపాకలో పార్టీ మండల అధ్యక్షుడు ఆకుల వెంకటరామారావు,రాష్ట్ర కార్యదర్శి కురినాల వెంకట్,ఎంపీటీసీలు వెంకట్రామిరెడ్డి,అంజలి,నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు దామెర్ల రేవతి,మండల అధ్యక్షురాలు నాగలక్ష్మి, అవులూరి సత్యనారాయణ, తోట శశికుమార్, దయాకర్, నవీన్బాబు, కోటి, సర్పంచ్ నాగమణి, కన్నా, రాజశేఖర్, మణి, స్వరూప తదితరులున్నారు. వి.ఆర్.పురంలోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్సీపీ నాయకులు, ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు బోడ్డు సత్యనారాయణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చిక్కాల బాలకృష్ణ, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చీమల కాంతారావు, ఆర్టీఐ ప్రతినిధి జయరాజు, నరేష్, రమేష్ సత్య తదితరులున్నారు. కూనవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆలూరి కోటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యురాలు గుజ్జా విజయ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆవుల మరియాదాస్, ఎస్టీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు గుజ్జాబాబు, మాజీ డైరెక్టర్ దీకొండ గంగాధర్, నియోజవర్గ రైతు సంఘం అధ్యక్షుడు నోముల కొండలరావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అరవా దివాకర్, మహిళా ఉపాధ్యక్షురాలు కొమ్మాని సునీత, ఇంటి పూర్ణానందం, సర్పంచ్లు నూపా వెంకన్నబాబు, నిరోషా, మడకం పూర్ణ, నోముల సత్యనారాయణ, సత్తిపండు, మధు, లక్ష్మణ్, వీర్రాజు తదితరులున్నారు. గంగవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేసిన వారిలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు , మండల ఇన్చార్జి సీహెచ్.రఘునాఽథ్, ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కె.రామతులసి, కె.గంగాదేవి , ఎంపీటీసీ సభ్యులు కనకలక్ష్మి, వెంకటలక్ష్మి, సర్పంచ్లు కామరాజుదొర, మరిడమ్మ, వెంకటేశ్వర్లుదొర, నాయకులు శివ , బాబి, రామకృష్ణ, జగదీష్, సతీష్, శ్రీను తదితరులున్నారు. రాజవొమ్మంగిలో వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదును స్థానిక పోలీసులు స్వీకరించలేదని మండల పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి రామకృష్ణ, పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి కొంగర మురళి కృష్ణ చెప్పారు. -
అందని సేవలు.. తప్పని తిప్పలు
● సంత రోజున వైద్య సేవలు కరువు ● రోగులకు అవస్థలుపెదబయలు: మండలం కేంద్రంలోని 24 గంటల ప్రభుత్వ ఆస్పత్రిలో సంత రోజు ఓపీ చూడడానికి వైద్యులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. పెదబయలు పీహెచ్సీలో రోజూ ఓపి 100 మందిలోపు ఉంటుంది. అయితే ఇక్కడ సంత సోమవారం కావడంతో స్థానికులతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు వైద్య సేవల కోసం ఆస్పత్రికి వస్తుంటారు. ఈ కారణంగా సోమవారం ఓపీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ రోజు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సుదూరం నుంచి వచ్చిన రోగులు నానా అవస్థలు పడుతున్నారు. సోమవారం ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు ఉన్నా డాక్టర్ సత్యశ్రీ సెలవు పెట్టడం, మరో వైద్యుడు డాక్టర్ నిఖిల్ కిలగాడ పీహెచ్సీకి వెళ్లడంతో ఆస్పత్రిలో ఓపిని కిందస్థాయి సిబ్బంది చూశారు. అలాగే డెలీవరికి సంబంధించి కూడా గర్భిణులు ఆస్పత్రిలో చేరారు. తప్పనిసరిగా ఒక వైద్యులు సెలవు పెడితే ఓపీ చూడడానికి మరో వైద్యులను ఉన్నతాధికారులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా దృష్టి సారించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిస్థాయిలో ఇద్దరు వైద్యులు ఒకరూ ఆస్పత్రిలో సేవలందిస్తుంటే మరొకరు గ్రామాల్లో వైద్య శిబిరాల ద్వారా రోగులకు సేవలందించేవారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఓపి చూడడానికి ఎవ్వరు లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి రోజు ఓపీకి వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని, వారపు సంత రోజులో తప్పనిసరిగా వైద్యులు ఆస్పత్రిలో ఉండేలా చూడాలని కోరుతున్నారు. ఆస్పత్రికి ఇద్దరు వైద్యులను నియమించాలని కోరుతున్నారు. ఈ విషయంపై వైద్యాధికారి సత్యశ్రీని వివరణ కోరగా తనకు ఆరోగ్యం బాగాలేక సెలవు పెట్టడం జరిగిందని, కింద స్థాయి సిబ్బంది ఓపీ చూస్తున్నారని వెల్లడించారు. -
450 మందికి వైద్య పరీక్షలు
డుంబ్రిగుడ: మండలంలోని కొర్ర పంచాయతీ కేంద్రంలో భారత మానవ హక్కుల సంరక్షణ సంస్ధ (హెచ్ఆర్సీ) చైర్మన్ రాజన్ప్రసాద్ రావు ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కంటి పరీక్షలు, బీపీ, షుగర్ తనిఖీలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా 42 మంది కంటి పరీక్షలు చేసుకోగా 15 మందిని మెరుగైన చికిత్సలు, సర్జరీ కోసం సిఫార్సులు చేశారు. కొర్ర పంచాయతీతో పాటు సమీప గ్రామాల నుంచి సుమారు 450 మందికి వైద్య పరీక్షలు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ట్రెడ్స్, ఆశ ఫౌండేషన్ ఎన్జీవోల సహకారంతో చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వృద్దులకు రగ్గులు, దుస్తులు పంపిణీ చేశారు. ట్రెడ్స్ సంస్ధ డైరెక్టర్ వెంకటరావు, ఆవ ఫౌండేష్ సీఈవో ప్రసాద్రావు, సీఐఎస్ రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఐషత, సంధ్య, నిర్మలదేవి, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ప్రమాణం చేస్తున్న నూతన కార్యవర్గ ప్రతినిధులు సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రంలోని గిరిజన ఉద్యోగుల సంఘం భవనంలో అఖిల భారత్ గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక సోమవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా ఎన్నికల కమిషన్ చైర్మన్ పలాసి కృష్ణారావు, వైస్ చైర్మన్ జి.వి.వి.ప్రసాద్, ఎన్నికల అధికారులు టి.నాగేశ్వరరావు, జంపరంగి ప్రసాద్,కిల్లు గంగన్నపడాల్, కుడుముల కాంతారావు పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికలో కమిటీ జిల్లా అధ్యక్షుడిగా మాసాడ ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా ముఖీ శేషాద్రి, మహిళా విభాగం కార్యదర్శిగా శెట్టి శాంతకుమారి, కోశాధికారిగా వి.కొండలరావు,ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎం.ప్రసాదరావు,జోన్–1 అరకు ఉపాధ్యక్షుడిగా ఎస్.జి.దొర, సంయుక్త కార్యదర్శిగా నందో, కార్యవర్గ సభ్యులుగా ఆనందరావు,కొర్రా అమర్నాధ్,కొర్రా రమేష్, జోన్–2 పాడేరు ఉపాధ్యక్షుడిగా రేగం అనిల్కుమార్, సంయుక్త కార్యదర్శిగా కూడా ఈశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా రామచంద్రరాజు, యువరాజు, మహేష్, జోన్–3 పెదబయలు ఉపాధ్యక్షుడిగా బాలకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా తిరుపతిరావు, కార్యవర్గ సభ్యులుగా కమలకుమారి, లింగన్న, జోన్–4 చింతపల్లి ఉపాధ్యక్షుడిగా శివప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా సతీష్కుమార్, కార్యవర్గ సభ్యులుగా స్వామినాథం, మల్లేశ్వరరావు, సింహచలంలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఉద్యోగల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా నూతన కార్యవర్గంతో ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. గిరిజన గ్రామాలపై చలి పంజా ముంచంగిపుట్టు: మండలంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. గిరిజన గ్రామాలపై చలి పంజా విసురుతుంది. సోమవారం చలి తీవ్రత అధికమైంది. పనులకు వేళ్లే కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు గజగజ వణుకుతూ వెళ్లారు. సాయంత్రం 4 గంటల నుంచి మొదలైన చలి, ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. చలి నుంచి ఉపశమం పోందేందుకు గ్రామాల్లో చలి మంటలు వేసుకుంటున్నారు. విపరీతంగా కురుస్తున్న మంచు వల్ల హెడ్లైట్ వెలుతురులో వాహనచోదకులు రాకపోకలు సాగిస్తున్నారు. -
రక్తదానంతో ప్రాణదానం
సాక్షి, పాడేరు: హుకుంపేట, పాడేరు మండలాల సహాయ గిరిజన సంక్షేమ అధికారి(ఏటీడబ్ల్యువో) రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రెడ్క్రాస్ సొసైటీ సోమవారం హుకుంపేట మండల కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ శిబిరానికి స్వచ్ఛందంగా హాజరైన ఏటీడబ్ల్యూవో అఖిల రెండవ సారి రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదాన శిబిరాలకు యువతి, యువకులంతా ముందుకు వచ్చి తోటి మనుషులకు ప్రాణదాతలు కావాలన్నారు. గిరిజన ప్రాంతాల్లోను గర్భిణులు, బాలింతలు, సికిల్సెల్ ఎనిమియా కేసులకు రక్తం అవసరాలు అఽధికమయ్యాయని, ఈ మేరకు రెడ్క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలను యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ శిబిరంలో 8 మంది రక్తదానం చేశారు. రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులు గంగరాజు, వెంకట్, న్యాయవాది తమర్భ ప్రసాద్నాయుడు సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఆర్గానిక్’ పరిశ్రమల ఏర్పాటుకు చొరవ
కలెక్టర్ దినేష్కుమార్పాడేరు: జిల్లాలో ఆర్గానిక్ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ దినే ష్కుమార్ సూచించారు. సోమవారం తన చాంబర్ను నుంచి పలు శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో 250 ఎకరాలను ప్రభుత్వం కేటాయించినట్టు చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే భూమి కేటాయిస్తామన్నారు. ఆసక్తి గల పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పర్యాటక ప్రాంతాలైన అరకు, పాడేరు, మారేడుమిల్లి తదితర చోట్ల క్యార్వ్యాన్లు, రిసార్ట్స్, కాటేజీలు, క్రీడా పార్క్ల నిర్మాణాలకు భూసేకరణ చేపట్టి, గ్రామ సభల తీర్మానాల ద్వారా గ్రామ పంచాయతీల నుంచి ఆమోదం తీసుకుని సంబంధిత యాజమన్యాలకు అప్పగించాలన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు మంజూరు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చింతపల్లి, గంగవరంలలో ఎంఎస్ఎం పార్కులు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలన్నారు. విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలకు నైపుణ్య శిక్షణ, వర్క్షాపు నిర్వహించాలని, ఉదయం పోర్టల్లో శిక్షణ పొందిన వారి సమాచారం పొందుపరచాలని ఆదేశించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా శిక్షణ పొందిన అభ్యర్థులు ఉపాధి పొందేందుకు రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో వర్చువల్గా జీసీసీ ఎండీ కల్పనా కుమారి, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు స్మరణ్రాజ్, శుభం నొక్వాల్, పాడేరు ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రమణరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నంద్, లీడ్ బ్యాంకు మేనేజర్ మాతునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
గేటు పడితే ఇబ్బందే
అరకులోయ–పాడేరు ప్రధాన రహదారిలో కురిడి వద్ద రైల్వేగేటు పడితే రైలు వెళ్లేవరకు నిరీక్షించడం ఇబ్బందిగా ఉంది. గూడ్స్ రైళ్లకు వ్యాగిన్లు అధికంగా ఉండడంతో రైలు వెళ్లడం ఆలస్యమవుతోంది. ఈ ట్రాక్పై రైళ్లు ఎక్కువుగా నడుస్తుండడంతో అత్యవసర సమయంలో స్థానికులమంతా ఇబ్బందులు పడుతున్నారు. – పాంగి జీనబందు, వాహన చోదకుడు, కొర్రాయి పంచాయతీ డుంబ్రిగుడ మండలం ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించాలి జాతీయ రహదారి కావడంతో అరకులోయ–పాడేరు ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. కురిడి రైల్వేగేటు పడితే ఇరువైపులా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలకు ఇబ్బందిగా మారింది, ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి. – ముఖీ సాంబ, మోటార్ యూనియన్ నాయకుడు, అరకులోయ -
పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. అదుపులో నేరాలు
● ఈ ఏడాది నేర సమీక్ష వివరాలు వెల్లడించిన ఎస్పీ అమిత్బర్దర్ పాడేరు: గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, హత్యాయత్నం కేసుల సంఖ్య పెరిగింది.గత ఏడాది 164 రోడ్డు ప్రమాదాలు జరగా, ఈ ఏడాది 176 ప్రమాదాలు జరిగాయి. పోలీస్ శాఖ తీసుకున్న చర్యల కారణంగా మిగతా నేరాలు అదుపులోకి వచ్చాయని, వివిధ విభాగాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ 34 శాతం తగ్గిందని ఎస్పీ అమిత్బర్దర్ తెలిపారు. శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయని ఆయన చెప్పారు. వార్షిక నేర సమీక్ష వివరాలను స్థానిక జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గత ఏడాది 2,304 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 1,502 కేసులు నమోదైనట్టు చెప్పారు. ● జిల్లాను గంజాయి రహితంగా మార్చినట్టు ఆయన చెప్పారు. గత ఏడాది 316 గంజాయి కేసులు నమోదు కాగా, ఈ ఏడాది నమోదైన 135 కేసుల్లో 14,484 కిలోల గంజాయి, 35.61 లీటర్ల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని, 358 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామని చెప్పారు. రూ.4.41 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని, 11 కేసుల్లో శిక్షలు ఖరారైనట్టు ఆయన చెప్పారు. ఆరుగురు అంతరాష్ట్ర మోస్ట్ వాంటెడ్ గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించామన్నారు. మొత్తం మీద 56శాతం గంజాయి కేసులు తగ్గాయన్నారు. ● జిల్లాలో మావోయిస్టు కార్యకలపాలను పూర్తిగా నిర్మూలించామన్నారు. ఈ ఏడాది 18 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో కేంద్ర, రాష్ట్ర, డివిజన్ కమిటీలు, ఏవోబీ క్యాడర్కు చెందిన కీలక మావోయిస్టులు హతమయ్యారన్నారు. తొమ్మిది మంది మావోయిస్టులను అరెస్టు చేశామని, మరో 49 మంది జిల్లాలో స్వచ్ఛందంగా లొంగిపోయారని చెప్పారు. ఐదు చోట్ల మావోయిస్టుల డంప్లను స్వాధీనం చేసుకున్నామని, మావోయిస్టు పార్టీలో నియామకాలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. ● జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న హైవే కారణంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య కాస్త పెరిగిందన్నారు. మోతుగూడెం ప్రాంతంలో జరిగిన బస్సు యాక్సిడెంట్తో పాటు మరికొన్ని -
కొత్త జిల్లా
ఒకే ఒక్క నియోజకవర్గంతోరంపచోడవరం: ఒకే ఒక నియోజకవర్గంతో రంపచోడవరం జిల్లా ఏర్పడింది. రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు సోమవారం ఆమోదం తెలిపింది. రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో 12 మండలాలను కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2022 సంవత్సరంలో పాడేరు, అరకు, రంపచోడవరం నియో జకవర్గాలను కలిపి కొత్తగా అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేశారు. తాజాగా అల్లూరి జిల్లా నుంచి రంపచోడవరం నియోజకవర్గాన్ని వేరుచేసి, ఒక్క నియోజకవర్గంతోనే కొత్తగా రంపచోడవరం జిల్లాను ఏర్పాటు చేశారు. దీంతో అల్లూరి జిల్లాలో 11 మండాలుంటాయి. 12 మండలాలు.. రెండు రెవెన్యూ డివిజన్లు రంపచోడవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్న 11 మండలాలున్నాయి. కొత్తగా గుర్తేడు మండలాన్ని ఏర్పాటుచేస్తున్నారు. దీంతో 12 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లా ఏర్పాటవుతోంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో ఎనిమిది మండలాలు.. రంపచోడవరం, వై.రామవరం, మారేడుమిల్లి,దేవీపట్నం,గంగవరం,రాజవొమ్మంగి, అడ్డతీ గల, కొత్తగా ఏర్పాటు చేస్తున్న గుర్తేడు ఉండగా, చింతూరు రెవెన్యూ డివిజన్లో నాలుగు మండలాలు చింతూరు, వీఆర్ పురం, కూనవరం, ఎటపాక ఉన్నాయి. రంపచోడవరం, చింతూరుల్లో ఐటీడీఏలున్నాయి. కొత్త మండలం ఏర్పాటు వై.రామవరం మండలంలో ఎగువ ప్రాంతంలో ఉన్న ఐదు పంచాయతీలను కలిపి కొత్తగా గుర్తేడు మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రంపచోడవరం నియోజవర్గంలో 3,49,799 మంది జనాభా ఉన్నా రు. అలాగే 2,55,313 మంది ఓటర్లు ఉన్నారు. రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో 120, చింతూరు రెవెన్యూ డివిజన్లో 69 కలిపి మొత్తం 189 పంచాయతీలు, 827 రెవెన్యూగ్రామాలున్నాయి. రంపచోడవరం రెవెన్యూ డివిజన్ భౌగోళికంగా 4433.38 స్క్వేర్ కిలోమీటర్లు, చింతూరు రెవెన్యూ డివిజన్ 2095.14 స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉంది. అపారమైన ఖనిజ సంపద ఇక్కడ అపారమైన ఖనిజ సంపద ఉంది.రంపచోడవరం డివిజన్లో మెటల్, పాలరాయి, గ్రావెల్ క్వారీలు ఉన్నాయి.రంపచోడవరం, గంగవరం మండలాల్లో పాలరాయి, నల్లరాయి మెటల్ క్వారీలు ఉన్నాయి. అడ్డతీగల మండలంలో ఎక్కువగా మెట ల్ క్వారీలు ఉన్నాయి. చింతూరు ప్రాంతంలో క్వార్జ్ నిక్షేపాలు, ఎటపాక మండలంలో ఇసుక రీచ్ ఉంది. పాపికొండలుప్రముఖ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి పొందిన పాపికొండలు జిల్లాలోనే ఉన్నాయి. ఏటా వేలాది మంది పర్యాటకులు ఈప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం వద్ద ఒకటి, వీఆర్పురం మండలంలో ఒకటి పర్యాటక బోటు పా యింట్లు ఉన్నాయి. మారేడుమిల్లి ప్రాంతంలో పర్యాటకులకు అతిథ్యం ఇచ్చేందుకు అనేక పర్యాటక వసతి గృహాలు, గుడిసె హిల్ స్టేషన్ ఉన్నాయి. పొల్లూరు వద్ద వాటర్ పాల్స్, రంప జలపాతం ఉన్నాయి. ● ఇక్కడే పాపికొండలు నేషనల్ పార్కు 1,05,690.32 హెక్టార్లుల్లో విస్తరించి ఉంది. జాతీయ ప్రాజెక్టు పోలవరం విద్యుత్ కేంద్రం జిల్లాలోనే పోశ మ్మ గండి సమీపంలోని నిర్మాణం జరుగుతోంది. నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్త జిల్లాలో నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నా యి. రంపచోడవరం మండలంలో ముసురుమిల్లి, భూపతిపాలెంలలో, గంగవరం మండలంలో సూరంపాలెం, అడ్డతీగల మండలంలో మద్దిగెడ్డలో రిజర్వా యర్లు ఉన్నాయి. వీటి ద్వారా గిరిజన రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతోంది. జిల్లాలో వరి, మొక్క జొన్న,పత్తి, అరటి, జీడిమామిడి, పొగాకు పంటలను ఎక్కువగా పండిస్తారు. మారేడుమిల్లిలో మాత్రమే రబ్బరు, కాఫీ, జాఫ్రా, నిమ్మ సాగుచేస్తున్నారు. 54,344 హెక్టార్లలో వివిధపంటలు సాగవుతున్నాయి ● చింతూరు మండలంలోని పొల్లూరు, వై రామవరం మండలంలోని డొంకరాయిలో రెండు జలవిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ● కొండరెడ్డి, కోయదొర, కొండకమ్మరి, వాల్మీకి, కొండకాపు తెగుల గిరిజనులు ఇక్కడ అధికంగా ఉన్నారు. వీరిలో కోయదొరలు, కొండరెడ్డి జనాభా ఎక్కుగా ఉంది.రంపచోడవరం వ్యూజిల్లా వివరాలు విస్తీర్ణం : 6528.52 స్క్వేర్ కిలోమీటర్లు అడవుల విస్తీర్ణం: 53,771.85 హెక్టార్లు పంట భూములు : 54,344 హెక్టార్లు జనాభా : 3,49,799 మంది ఓటర్లు : 2,55,313 మంది ఐటీడీఏలు : రెండు (రంపచోడవరం, చింతూరు) డివిజన్లు : రెండు (రంపచోడవరం, చింతూరు) మండలాలు : 12 (కొత్తగా ఏర్పాటైన గుర్తేడుతో) పంచాయతీలు : 189 గ్రామాలు : 827 జిల్లా పరిధిలో రెండు ఐటీడీఏలు, 12 మండలాలు కొత్తగా గుర్తేడు మండలం ఏర్పాటు కొండలు, అడవులతో విస్తరించిన రంపచోడవరం జిల్లా -
కురిడి ఫ్లైఓవర్పై నీలినీడలు
● రెండేళ్లుగా ప్రకటనలకే పరిమితం ● భూముల సమస్యలంటున్న రైల్వేశాఖ ● కేకే లైన్లో రోజూ 30 రైళ్ల రాకపోకలు ● రైల్వే గేటు పడితే అవస్థలే ● 108,అంబులెన్స్ సర్వీసులకు ఆటంకం ● జాతీయ రహదారితో పెరిగిన వాహనాల రద్దీసాక్షి, పాడేరు: కొత్తవలస–కిరండోల్ రైల్వే లైన్లోని కురిడి ఫ్లై ఓవర్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇది రెండేళ్లుగా ప్రకటనలకే పరిమితమైంది.అరకులోయ నుంచి పాడేరు మీదుగా రాజమండ్రికి వెళ్లే జాతీయ రహదారిలో ఉన్న కురిడి రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి రైల్వేశాఖ, జాతీయ రహదారుల విభాగం రూ.7కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించాయి. జాతీయ రహదారి నిర్మాణం పూర్తయినప్పటికీ కురిడి రైల్వేగేటు వద్ద ఇరువైపులా రోడ్డు విస్తరణ, బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం చేపట్టలేదు. దీంతో పాత రోడ్డు మీదుగా రైల్వే ట్రాక్ను దాటుతూ వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి. పెరిగిన వాహనాల రద్దీ విజయనగరం నుంచి రాజమండ్రి వరకు రెండు వరుసల జాతీయ రహదారి నిర్మించడంతో వాహనాల రద్దీ ఇటీవల అధికమైంది. పర్యాటక సీజన్ కావడంతో గత రెండు నెలల నుంచి వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది.అలాగే పాడేరు నుంచి అరకులోయ ప్రాంతాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు అధికంగానే రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు సుమారు 500 వాహనాలు ఈ జాతీయ రహదారిలో నడుస్తున్నాయి. గేటు పడితే నరకయాతనే.. డుంబ్రిగుడ మండల పరిధిలో ఉన్న కురిడి రైల్వేగేటు పడితే వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తవలస–కిరండోల్ రైల్వే లైన్లో కురిడి ట్రాక్పై ప్రతి రోజు ఎక్స్ప్రెస్, పాసింజర్, సరకు రవాణా చేసే గూడ్స్ రైళ్లు 30 వరకూ నడుస్తున్నాయి. పగలు,రాత్రి ఈ ట్రాక్పై రైళ్ల రద్దీ అధికంగా ఉంటుంది. రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో కురిడి వద్ద గేటు పడితే ఇరువైపులా వాహనాలు నిలిచిపోతున్నాయి. రైళ్లు వెళ్లే వరకు ఆర్టీసీ బస్సులతో పాటు అన్ని వాహనాలు చాలా సమయం నిరీక్షించాల్సి వస్తోంది. రోగులను 108, అంబులెన్స్లలో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించే సమయంలో గేటు పడితే రోగులతో పాటు బంధువులు నరకయాతన పడుతున్నారు. డుంబ్రిగుడ ప్రాంత అత్యవసర రోగులను పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు ఇదే ప్రధాన రహదారి. రైళ్లు వెళ్లిపోయే వరకు అన్ని వాహనాలు నిలిచిపోతుండడంతో ప్రయాణానికి ఆలస్యమవుతుండడంతో వాహన చోదకులు, పర్యాటకులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. భూముల సమస్యకు పరిష్కారమెప్పుడో? కురిడి రైల్వేగేటులో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి భూ సమస్య ఏర్పడిందని సమాచారం. రెవెన్యూ, రైల్వే, అటవీశాఖలకు చెందిన భూములు సిద్ధంగా ఉన్నాయి. అయితే వంతెన నిర్మించే ప్రాంతంలో గిరిజన రైతుల భూములు అధికంగా ఉండడంతో కొంత వివాదం నెలకొందని తెలిసింది. ఈ సాకుచూపి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టడడంలో జాతీయ రహదారులు, రైల్వేశాఖ అధికారులు జాప్యం చేస్తుండడం సమంజసం కాదని, అన్ని సమస్యలు పరిష్కరించి పనులు ప్రారంభించాలని వాహన చోదకులు డిమాండ్ చేస్తున్నారు.ఫ్లైఓవర్ నిర్మించాల్సిన కురిడి రైల్వేగేటు వద్ద నిలిచిన వాహనాలు -
ఈవీఎంల గోదాముల తనిఖీ
గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ దినేష్కుమార్ సోమవారం తనిఖీ చేశారు. ఈవీఎం గోదాముల గదుల సీల్ ఓపెన్ చేయించి, ఈవీఎంలను భద్రపరిచిన బాక్సులను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, ప్రధాన ద్వారాలకు ఉన్న సీళ్ల ను పరిశీలించారు. ఈవీఎంల గోదాంలో భద్రతా చర్యలపై అక్కడి అధికారులు, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం నెలవారీ తనిఖీల రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో అంబేడ్కర్, వైఎస్సార్సీపీ ప్రతినిధి బుటారీ వెంకటరావు, టీడీపీ ప్రతినిధి రాజేష్, బీజేపీ ప్రతినిధి కె.ఆర్.రావు, ఎన్నికల సూపరింటెండెంట్ లక్ష్మణరావు, పాడేరు, అరకు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


