breaking news
Alluri Sitarama Raju District News
-
చిత్తశుద్ధితో కృషి
మాదిగల సమస్యల పరిష్కారానికి ఎస్సీ కాలనీలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న నాయకులు సుబ్బారావు, బుచ్చిబాబుఎంపీటీసీ జయలక్ష్మి పాత బస్టాండ్లో అంబేడ్కర్ విగ్రహానికి నివాలర్పిస్తున్న ఎంఆర్పీఎస్ నాయకులు చిన సుబ్బారావు,బుచ్చిబాబు తదితరులుచింతపల్లి: ఏజెన్సీ ప్రాంతంలో మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఎంఆర్పీఎస్ జాతీయ పొలిట్బ్యూరో సభ్యుడు ముమ్మిడివరపు చిన సుబ్బారావు స్పష్టం చేశారు. మంగళవారం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని చింతపల్లిలో ఎంఎస్పీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు మోర్తా బుచ్చిబాబు మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక హనుమాన్ జంక్షన్ నుంచి పాత బస్టాండు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్సీ కాలనీలో ’మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్థిల్లాలి అంటూ నూతనంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సుబ్బారావు మాట్లాడుతూ.. అల్లూరి జిల్లాలో మాదిగలు ఎంతో వెనుకబాటుతనంతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి మాదిగలంతా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన చట్టాలకు, హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లకుండా, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ అరకు పార్లమెంట్ అధ్యక్షులు కుందూరు రాజు, మహిళా నాయకురాలు, ఎంపీటీసీ చిందాడ జయలక్ష్మి, చింతపల్లి మండల అధ్యక్షులు పెదపూడి నాగేశ్వరరావు, కార్యదర్శి చిన అప్పారావు, నాయకులు వెంకట్రావు, అప్పారావు, నూకేశ్వరరావు, సలికి లక్ష్మి, సాయి లక్ష్మి, సోమరాజు తదితరులు పాల్గొన్నారు.ఎంఆర్పీఎస్ నేత సుబ్బారావు -
రూ.2 కోట్ల ఖర్చు.. రెండేళ్లుగా ఎదురు చూపులు
బుచ్చెయ్యపేట : మేజర్ పంచాయతీ వడ్డాది కేజీబీవీ వసతి గృహ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. సుమారు రూ.రెండు కోట్లతో వడ్డాది కోవెల అప్పనదొర జిల్లా పరిషత్ హైస్కూల్ పక్కనే 9వ తరగతి నుంచి ఇంటర్ చదువుతన్న విద్యార్థినుల కోసం నిర్మించిన టైప్ –4 వసతి గృహాన్ని 2024 అక్టోబర్ 16వ తేదీన ప్రారంభించేందుకు శిలాఫలకం వేశారు. కూటమిలో ఉన్న కుమ్ములాటల వల్ల ఆగిపోయింది. దీంతో రెండేళ్లుగా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. మళ్లీ మంగళవారం ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు మంగళవారం సాయంత్రం ప్రారంభోత్సవానికి రావాలని సమాచారం ఆందించారు. దీంతో అందరూ హాజరయ్యారు. ఆఖరు సమయంలో ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు రావడం లేదని తెలిసి కేజీబీవీ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. టీడీపీలో ఎమ్మెల్యే రాజు, హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబుల మధ్య ఉన్న వర్గ పోరు కారణంగా మళ్లీ కేజీబీవీ ప్రారంభోత్సవం వాయిదా పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. సుమారు రూ.రెండు కోట్లతో కేజీబీవీ నిర్మాణం చేపట్టిన ప్రారంభోత్సవానికి ముందే గోడలు బీటలు వారుతున్నాయి. కేజీబీవీ నాణ్యతపై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. కేజీబీవీ చుట్టూ తుప్పలు, డొంకలు పెరిగిపోయి ఉండగా శుభ్రం చేయకపోగా చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేయకుండానే ప్రారంభోత్సవం ఏర్పాట్లు చేయడంపై పలువురు మండిపడుతున్నారు. కేజీబీవీ పోస్టులు భర్తీపైనా పలు ఆరోపణలు చేస్తున్నారు. కూటమిలో నాయకుల మధ్యన కుమ్ములాటల వల్ల విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకం కలుగుతుంది. -
నేడు వైఎస్ జయంతి వేడుకలు
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: ఈ నెల 8వ తేదీ, బుధవారం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అరకులోయలోని నాలుగు రోడ్ల జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం జరిగే ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పంచాయతీ, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయంతిని విజయవంతం చేయాలని కోరారు. -
బాకై ్సట్పై కూటమి వైఖరి స్పష్టం చేయాలి
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం డిమాండ్ పాడేరు: బాకై ్సట్ తవ్వకాలు, 1/70 చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్లూరి జిల్లాలోని విలువైన ఖనిజాలను ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరుతో కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. జర్రెల బాకై ్సట్ కొండల్లో మట్టి నమూనాల సేకరణ, హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న సర్వేలపై కలెక్టర్కు తెలియకపోవడం ఆశ్చర్యకరమన్నారు. పర్యావరణ విధ్వంసానికి దారితీసే బాకై ్సట్ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. 1/70 చట్టం రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం గిరిజనులను మోసం చేయడమేనని లోకనాథం ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నంబరు 3 పునరుద్ధరణ హామీని ప్రభుత్వం విస్మరించిందని, డీఎస్సీలో గిరిజన నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. గత ఏడాది నిర్వహించిన డీఎస్సీలో జిల్లా ఏజెన్సీలో గిరిజన నిరుద్యోగులకు ఏకంగా రెండు వేల ఉద్యోగాలు కల్పించామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్కుమార్ అబద్దపు మాటలు చెప్పారన్నారు. ఏజెన్సీలో ఎపిడమిక్ సీజన్ దృష్ట్యా జ్వరాలు మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలు విజృంభిస్తున్నాయని కానీ వైద్యారోగ్య శాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు ఏ మాత్రం కూడా నష్ట నివారణ చర్యలు తీసుకోవడం లేదన్నారు. జిల్లాలో సర్ ప్రక్రియ అంత గందరగోళంగా ఉందన్నారు. సర్ ప్రక్రియపై గిరిజనులకు అవగాహన లేకపోవడంతో ఎంతో విలువైన ఓటును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. గిరిజన ప్రాంతంలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని గ్రామసభలు నిర్వహించి గ్రామ సభ ఆమోదంతో ఓటర్ సవరణ పక్రియ చేపట్టాలన్నారు. గిరిజన ప్రాంతంలో బాకై ్సట్ అంశం, 1/70 చట్టం అమలు, జీవో నంబర్3పై సీఎం చంద్రబాబు పూర్తి స్పష్టత ఇచ్చిన తరువాతే అగస్టు 9న రంపచోడవరంలో నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి హాజరు కావాలని లేని పక్షంలో గిరిజనులు, గిరిజన, ప్రజా, విద్యార్థి సంఘాలు, సీపీఎం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొవాల్సి వస్తుందని, ఆయన పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పి. అప్పలనర్స, అనంతగిరి జెడ్పీటీసీ దూసురి గంగరాజు, సీపీఎం నేత హైమవతి పాల్గొన్నారు. -
డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి
అనంతగిరి, (అరకులోయ టౌన్): మండలంలో ఓటరు నమోదు ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశించారు. మంగళవారం ఆయన 284, 285 పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. పోలింగ్ కేంద్రం 284లో 1118 ఓటర్లు ఉండగా 608 మంది ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. 285 పోలింగ్ కేంద్రంలో 622 మంది ఓటర్లకు 363 మంది డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. వీటిని ఈనెల పదో తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ ఎం. వీరభద్రాచారి, బూత్ స్థాయి అధికారులు కుసుమ, దేముడు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏకలవ్య తరగతులు వెంటనే ప్రారంభించాలి
● తల్లిదండ్రుల డిమాండ్ ● పాఠశాల వద్ద ఆందోళన జి.మాడుగుల: మండలంలో కొత్తగా ఏర్పాటైన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వెంటనే తరగతులు ప్రారంభించాలని కోరుతూ మంగళవారం తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రామకృష్ణ, లక్ష్మి, సుజాత, మాధవరావు మాట్లాడుతూ.. పాఠశాలలు తెరిచి నెల రోజులు గడుస్తున్నా, కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇప్పటివరకు తరగతులు ప్రారంభం కాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యార్థులకు ఈ దుస్థితి దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అరకొర వసతులతోనే నెట్టుకొస్తున్నామని, సొంత భవనం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సరైన త్రాగునీరు, మరుగుదొడ్లు, తగినన్ని తరగతి గదులు లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారని, పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా ఏకలవ్య పాఠశాలల తీరు ఉందని విమర్శించారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిందని వారు మండిపడ్డారు. ఇప్పటికై నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు కలెక్టర్, ఐటీడీఏ పీవో, సంబంధిత అధికారులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించి, వెంటనే తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
రాజీ మార్గంతోనే కేసులకు శాశ్వత పరిష్కారం
పాడేరు: రాజీ మార్గమే అత్యంత ఉత్తమమైన విధానమని, ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను ఇరువర్గాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని పాడేరు ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎ.రాము సూచించారు. మంగళవారం కోర్టు ప్రాంగణంలో కోర్టు పరిధిలోని ఐదు మండలాల సీఐలు, ఎస్ఐలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ఈ నెల 11న అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను ఇరువర్గాలు చర్చల ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పాడేరు సీఐ ఎస్.రామారావు, పాడేరు ఎకై ్సజ్ సీఐ టి.వి.వి.ఎస్.ఎన్.అచారి, పాడేరు, జి.మాడుగుల ఎస్ఐలు పాపినాయుడు, సాయిరాం పడాల్, ఏఎస్ఐలు ఎస్.వల్లభనాయుడు, జి.మహేష్, హెడ్ కానిస్టేబుల్ కె.లోకేష్, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. పాడేరు మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి రాము -
జేఎన్యూ అసోసియేట్ ప్రొఫెసర్గా కాశీపురం వాసి
దేవరాపల్లి: మండలంలోని కాశీపురానికి చెందిన డాక్టర్ ధుబిరెడ్డి అప్పలనాయుడు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఎన్యూలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఎంపికయ్యారు. సాధారణ వ్యవసాయ కూలి కుటుంబంలో జన్మించిన అప్పలనాయుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సవాళ్లను, ఒడిదుడుకులను అధిగమించి జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ), న్యూఢిల్లీలో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. 2015 సెప్టెంబర్లో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఆత్మారామ్ సనాతన్ ధర్మ కళాశాల అర్థశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులై విద్యార్థులకు బోధనతో పాటు పరిశోధన రంగంలో సేవలందించారు. అనంతరం జేఎన్యూలో స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో అసోసియేట్ ప్రొఫెసర్గా ఎంపికై ప్రస్తుతం బోధన, పరిశోధన, అకడమిక్ రంగాలలో విశేష సేవలందిస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు దేముడు, పైడితల్లమ్మ వ్యవసాయ కూలీలుగా పని చేసి కుటుంబాన్ని పోషించారు. అప్పలనాయుడు కాశీపురం ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5 వరకు, కొరువాడ, గోవాడ బీసీ సంక్షేమ హాస్టళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. దేవరాపల్లిలో ఇంటర్, విశాఖ ఏవీఎన్లో డిగ్రీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. 2004–2006 మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగంలో పీజీ, 2008–2012 మధ్య అదే విభాగంలో పీహెచ్డీ పూర్తి చేశారు. పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తూ విద్యా, పరిశోధన ప్రాజెక్టులలో పని చేశారు. జేఎన్యూలో అసోసియేట్ ప్రొఫెసర్గా అప్పలనాయుడు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. -
అర్హులందరికీ ఓటు హక్కు లక్ష్యం
● రాజకీయ పార్టీలు సహకరించాలి ● కలెక్టర్ నిశాంతి సాక్షి,పాడేరు: జిల్లాలో జరుగుతున్న ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమంలో అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని,కలెక్టర్ టి.నిశాంతి కోరారు.ఓటర్ల జాబితా సవరణకు సంభందించి అన్ని రాజకీయ పార్టీల నేతలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల సవరణ ప్రక్రియ చురుగ్గానే జరుగుతుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఏలు కూడా బీఎల్వోలు, ఇతర ఎన్నికల సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ ఎస్.దొన్నుదొర, వైఎస్సార్సీపీ నేత కటారి చంటి తదితరులు పాల్గొన్నారు. -
తేమ అదును చూసి నేలను దున్నాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఏడీఆర్ ముకుందరావు అనకాపల్లి: వరి నారుమళ్లు వేసుకోవడానికి తేమ అదును చూసుకుని నేలను దున్నాలని ఏడీఆర్ డాక్టర్ సీహెచ్.ముకుందరావు తెలిపారు. స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం శాస్త్రవేత్తలతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారుమడిని ఎత్తుగా వేసుకుని 5 సెంట్ల నారుమడికి 200 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల యూరియా, 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ను, ఎకరాకు 20 కిలోల చొప్పున విత్తనం వేసుకోవాలన్నారు. తేమను చూసుకుని మొక్క జొన్న పంటకు నేలను దున్ని, తయారు చేసుకోవాలని చెప్పారు. విత్తే ముందు కత్తెర పురుగును అంచనా వేయడానికి ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలను అమర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వి.గౌరీ, ఎం.విశాలాక్ష్మి, ఎ.శిరీష, వి.చంద్రశేఖర్, పి.వి.పద్మవతి, ఎన్.భారతి, ఎ.అలివేణి తదితరులు పాల్గొన్నారు. -
నెట్వర్క్ సమస్యతో సర్ ప్రక్రియకు ఆటంకం
అరకులోయ టౌన్: సెల్ నెట్వర్క్ సమస్యల కారణంగా ఓటర్ల నమోదు (సర్వే) ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లోని కొత్తభల్లుగుడ, సుంకరమెట్ట, పోతంగి, కించుమండ, రంగశీల సచివాలయాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు ప్రక్రియ పురోగతి, బీఎల్ఓల పనితీరు, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఓటరు నమోదు ప్రక్రియలో బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై నిరుద్యోగ యువత, రాజకీయ పార్టీల నాయకులు ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు. బీఎల్వోలకు బీఎల్ఏలు సహకరించాలని, ఇంటింటి సర్వేలో సేకరించిన వివరాలతో కూడిన ఫారంలను ఈ నెల 10వ తేదీలోపు బీఎల్వోలకు అందజేయాలని, వారి నుంచి తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. సుంకరమెట్ట, కొత్తభల్లుగుడ పంచాయతీల్లో నెట్వర్క్ సమస్యను పరిష్కరించాలని పాడేరు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లానని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 10వ తేదీలోపు ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని కోరారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేలా కృషి చేస్తున్న కలెక్టర్ నిశాంతి.టి, జిల్లా యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి
అనకాపల్లి: పార్లమెంటు ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం అమలును డీలిమిటేషన్తో ముడిపెట్టడం పెద్ద కుట్ర అని, నియోజకవర్గాల పునర్విభజన, జనగణనతో సంబంధం లేకుండా తక్షణమే చట్టసభల్లో మహిళా కోటాను అమలు చేయాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జిల్లా కార్యదర్శి బూసి పరమేశ్వరి డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్లో ఇన్చార్జ్ డీఆర్వో శ్రీనివాసరావుకు మంగళవారం ఆమె వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ సర్కార్ రాజకీయ లబ్ధి కోసమే మహిళా బిల్లును ఆమోదించిందని, దానిపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 2023 బిల్లులో మోసపూరిత షరతులు పెట్టి మోదీ ప్రభుత్వం మహిళలను వంచించిందని ఆరోపించారు. ఒకవేళ పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో తక్షణమే అమలు చేసి ఉంటే.. 2024 ఎన్నికల ద్వారా 180 మంది మహిళలు ఎంపీలుగానూ, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలుగానూ చట్టసభల్లో ఉండేవారని పేర్కొన్నారు. చట్టానికి జనగణన, డీలిమిటేషన్తో ముడిపెట్టి దాని అమలుకు మోదీ మోకాలడ్డారని దుయ్యబట్టారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ప్రధాని మోదీని నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కె.లక్ష్మి, రమణమ్మ, రమ్య, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. -
గ్రావెల్ ట్రాక్టర్ల పట్టివేత
నాతవరం: అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరిపి గ్రావెల్ తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను మండలంలోని వల్సంపేట జంక్షన్లో మంగళవారం తహసీల్దార్ ఓ.చందనరేఖ పట్టుకున్నారు. వాటిని నాతవరం కార్యాలయానికి తరలించి జరిమానా విధించారు. ఈసందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గ్రావెల్ తవ్వకాలు అక్రమంగా జరిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. చెరువులో మట్టి తవ్వకాలు కూడా ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి అనుమతులు ఉండాలని, వారిని చెప్పిన విధంగా నిబంధనలకు లోబడి తవ్వకాలు జరపాలని తెలిపారు. చమ్మచింత, గుమ్మడిగొండ, చిక్కుడుపాలెం వద్ద తాండవ నదిలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఇసుక తవ్వకాలు చేసుకోవాలన్నారు. చిక్కుడుపాలెం వద్ద తాండవ నదీలో తాగునీటి పథకం పైలట్ ప్రాజెక్టు ఉందని దానికి దూరంగా తవ్వకాలు జరపాలన్నారు. -
రైవాడలో రెండు నెలలు చేపల వేట నిషేధం
దేవరాపల్లి: మండలంలోని రైవాడ జలాశయంలో రెండు నెలల పాటు చేపల వేటపై నిషేధం విధిస్తున్నట్టు స్థానిక మత్స్యశాఖ సహాయకుడు ఎన్. అప్పలనారాయణ తెలిపారు. చేపల పునరుత్పత్తి, మత్స్య సంపద సంరక్షణ లక్ష్యంగా జిల్లా మత్స్యశాఖ అధికార్ల ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక వేటదారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతీ ఏటా మాదిరిగా జూలై ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు జలాశయంలో చేపల వేట పూర్తిగా నిషేధించబడుతుందన్నారు. ఈ కాలంలో చేపలు గుడ్లు పెట్టి సహజసిద్ధంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం కల్పించడమే నిషేధం ఉద్దేశ్యమని వివరించారు. నిషేధ కాలంలో రైవాడ జలాశయం పరిధిలో వేటదారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి వేటసాగించే వారిపై లైసెన్స్ రద్దు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వేట నిషేధం అమలులో ఉన్న రెండు నెలల కాలానికి ప్రభుత్వం నుంచి జీవన భృతి అందించాలని సమావేశంలో పాల్గొన్న వేటదారులంతా అధికారులను కోరారు. -
రేషన్ షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
విజిలెన్స్ అధికారులు సీజ్ చేసిన 6వ నంబరు చౌక దుకాణం యలమంచిలి రూరల్: పట్టణంలోని రేషన్ షాపుల్లో సోమవారం రాత్రి విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు.పలు దుకాణాల్లో బియ్యం,పంచదార,ఇతర సరుకుల నిల్వలను పరిశీలించారు. స్థానిక కాకివానివీధిలో 6వ నంబరు చౌకదుకాణంలో 43 క్వింటాళ్ల బియ్యం నిల్వలు అదనంగా గుర్తించారు.అదనపు సరుకు ఎందుకు ఉందని ప్రశ్నించిన అధికారులకు వినియోగదారులు తర్వాత తీసుకెళ్తామని చెప్పి బియ్యం ఇక్కడ ఉంచారని చౌక దుకాణం నిర్వాహకుడు సమాధానమివ్వడంతో విస్తుపోయారు.దుకాణ నిర్వాహకుడిపై 6ఏ కేసు నమోదు చేసిన అధికారులు దుకాణాన్ని సీజ్ చేశారు.అయితే మంగళవారం కూడా ఆ వివరాలు మీడియాకు చెప్పకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.పట్టుబడిన దుకాణ నిర్వాహకుడు అధికారపార్టీకి చెందిన వ్యక్తి కావడంతో నాయకుల ఒత్తిడివల్లే వివరాలు చెప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా విజిలెన్స్ నిఘా నీరుగారిపోవడంతో చౌక దుకాణాల నిర్వాహకులు బియ్యాన్ని అక్రమంగా రైసు మిల్లులకు తరలిస్తున్నారు.తనిఖీలు కేవలం మొక్కుబడేనన్న విమర్శలున్నాయి. -
కేజీబీవీ విద్యార్థినికి తీవ్ర గాయాలు
బుచ్చెయ్యపేట : మండలంలో గల మేజర్ పంచాయతీ వడ్డాది కస్తూర్బా పాఠశాల మేడ మీద నుంచి ఇంటర్ విద్యార్థి ప్రమాదవశాత్తూ జారిపడగా తీవ్రంగా గాయపడింది. వడ్డాదికి చెందిన కాకినాడ నాగమణి కేజీబీవీలో ఇంటర్ చదువుతొంది. మంగళవారం ఉదయం మేడ మీద బట్టలు ఆరబెడుతుండగా కాలుజారి కింద పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమై రక్తస్రావమై కోమాలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ప్రిన్సిపాల్ పరిమళ లేకపోవడంతో స్థానిక సిబ్బంది నాగమణి కుటుంబ సభ్యులు 108లో అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఆమె చేతికి తలపైన గాయాలవగా కేజీహెచ్లో చికిత్స పొందుతూ కోలుకుంటుంది. జెడ్పీటీసీ దొండా రాంబాబు, కోఆపరేటివ్ అధ్యక్షుడు దొండా నరేష్, పేరెంట్స్ కమిటీ చైర్మెన్ రామూర్తి తదితరులు విశాఖ కేజీహెచ్లో కోలుకుంటున్న నాగమణిని పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఏడాది కాలంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్తో కేజీబీవీ నడుస్తుంది. నాలుగు రోజుల కిందట కొత్త ప్రిన్సిపాల్ విధుల్లో చేరిన విద్యార్థులకు స్థానికంగా అందుబాటులో ఉండకపోగా ఆరు నెలలుగా వసతి గృహంలో ఆర్ఓ ప్లాంట్ పనిచేయక తాగునీరు అందకపోగా, సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, విద్యార్థుల భోజనాలు సరిగా వండి పెట్టడం లేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
విద్యుత్ వైర్ల చోరీపై ఫిర్యాదు
హెచ్సీ ధనరాజ్కు ఫిర్యాదు చేస్తున్న రైతులు మునగపాక: గత కొద్ది రోజులుగా విద్యుత్ మోటార్ల వైర్లు చోరీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హెచ్సీ ధనరాజ్కు ఫిర్యాదు చేశారు. స్థానిక మెయిన్రోడ్డులోని హరేరామ బిల్డింగ్ దరి ఆడారి సాంబశివరావు మోటార్కు చెందిన వైర్లు సోమవారం రాత్రి చోరీకి గురయ్యాయి. దీంతో రైతు సంఘం అధ్యక్షుడు ఆడారి మహేష్తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎస్.బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. -
జడ శ్రావణ్కుమార్పై జనసేన నాయకుల ఫిర్యాదు
జడ శ్రావణ్ కుమార్పై కొత్తకోట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న జనసేన ఇన్చార్జ్ రాజు రావికమతం : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన లాయర్ జడ శ్రావణ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని మంగళవారం కొత్తకోట పోలీసులకు చోడవరం నియోజవర్గ జనసేన ఇన్చార్జి పి.వి.ఎస్.ఎన్ రాజు, జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ బద్దమైన ప్రజల చేత ఎన్నుకోబడిన పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేయడమే అని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన లాయర్ జడా శ్రావణ్కుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అజెండా!
సంక్షేమమేఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల కష్టాలను స్వయంగా చూసి, వారి అభివృద్ధిని తన పాలనలో ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న నాయకుడు దివంగత సీఎం రాజశేఖరరెడ్డి. కేవలం పథకాలకే పరిమితం కాకుండా, గిరిజనుల జీవన ప్రమాణాలను మార్చేందుకు ఆయన ప్రవేశపెట్టిన అటవీ హక్కుల చట్టం, ఆరోగ్యశ్రీ, కాఫీ ప్రాజెక్టులు నేటికీ మన్యంలో ఆయనకు ఒక దైవత్వాన్ని ఆపాదిస్తున్నాయి. మహానేత మరణించి దశాబ్ద కాలం దాటినా, ఆనాడు ఆయన నాటిన అభివృద్ధి ఫలాలు నేటికీ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతూనే ఉన్నాయి. ఆయనతో తమకున్న ఆత్మీయ బంధాన్ని, ఆయన కల్పించిన సౌకర్యాలను గిరిజన రైతులు, సామాన్యులు నేటికీ ఎంతో కృతజ్ఞతతో నెమరువేసుకుంటున్నారు. ఎంతో మేలు చేశారు కొండపోడు భూమిలో కాఫీ మొక్కలు వేసుకున్నాం. సాగు భూమికి హక్కులు లేకపోవడంతో అటవీశాఖ ద్వారా అప్పట్లో ఇబ్బందులు పడేవాళ్లం. వైఎస్ సీఎం అయిన తరువాత అటవీ హక్కుల చట్టం ద్వారా తమ కాఫీతోటలకు పట్టాలు ఇచ్చారు. అలాగే మరో రెండు ఎకరాల్లో కాఫీతోటను విస్తరించేందుకు ఐటీడీఏ చర్యలు తీసుకుంది. అదనపు కాఫీతోటతో మహానేత ఎంతో మేలు చేశారు. – కూడా నాగేశ్వరరావు, కాఫీ రైతు, కరకపుట్టు, పాడేరు మండలం మోడల్ కాలనీతోపక్కా గృహాలు మహానేత డాక్టర్ వైఎస్సార్ మా గ్రామంలో అన్ని కుటుంబాలకు ఎంతో మేలు చేశారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మాతో పాటు అనేక గ్రామాలకు పక్కా గృహాలతో మోడల్ కాలనీ నిర్మించి సొంత గూడు కల్పించారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు తాగునీరు, సీసీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ఆయన చేసిన మేలు ఎన్నటికీ మరువలేం. – బారికి ఎల్లాజీ, పాడేరు సాక్షి, పాడేరు: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గిరిజనుల హృదయాల్లో దైవంగా కొలువై ఉన్నారు. ఆయన మరణించినప్పటికీ, తన హయాంలో చేపట్టిన విశేష అభివృద్ధిని గిరిజనులు నేటికీ కృతజ్ఞతతో గుర్తుచేసుకుంటారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో మన్యం అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. అనుసంధానానికి ప్రత్యేక చొరవ మారుమూల గ్రామాలకు రోడ్ల అనుసంధానం కోసం ప్రత్యేక చొరవ చూపారు. ఉపాధి హామీ పథకం ద్వారా మట్టి రోడ్లను, గిరిజన సంక్షేమ మరియు పంచాయతీరాజ్ శాఖల నిధులతో తారు రోడ్లను నిర్మించారు. 2009 పునర్విభజనలో చింతపల్లి నియోజకవర్గం రద్దయి పాడేరులో విలీనమైంది. అరకు, చింతపల్లి, పాడేరు ప్రాంతాలను వైఎస్సార్ సమానంగా అభివృద్ధి చేశారు. రూ.150 కోట్లతో రోడ్ల అభివృద్ధి సుమారు రూ.150 కోట్లతో మారుమూల గ్రామాలకు రోడ్లను నిర్మించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి వందల కోట్ల నిధులను రప్పించిన ఘనత వైఎస్సార్దే. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయన కుమారుడు సీఎం జగన్ హయాంలో ఆ మట్టి రోడ్లన్నీ పక్కా రోడ్లుగా రూపాంతరం చెందాయి. అటవీ భూములకు హక్కు పత్రాలు అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు భూమిపై సర్వ హక్కులను కల్పించారు. 2009 జూలై 13న పాడేరులో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి హోదాలో మొదటి విడతగా 20 వేల ఎకరాల అటవీ భూములకు పట్టాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత మరో 60 వేల ఎకరాలకు హక్కు పత్రాలు అందజేశారు. గిరిజనులకు ఆరోగ్యశ్రీ వరం కార్పొరేట్ వైద్యమంటే తెలియని గిరిజనులకు ఆయన ప్రవేశపెట్టిన ’ఆరోగ్యశ్రీ’ పథకం వరంలా మారింది. వేలాది మంది గిరిజన కుటుంబాలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉన్నత వైద్య సేవలు పొందాయి. పాడేరు, చింతపల్లి ఆస్పత్రుల బలోపేతంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించారు. గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీపై వ్యవసాయ విత్తనాలను ఐటీడీఏ ద్వారా పంపిణీ చేశారు. విద్య, వైద్యం, తాగునీరు, సాగునీటి రంగాల్లో ఆయన చేసిన అద్భుతమైన కృషి, రాజకీయాలకు అతీతంగా గిరిజనుల గుండెల్లో ఆయనను చిరస్థాయిగా నిలిపాయి. గిరిజనుల జీవన ప్రమాణాల్లోమార్పునకు కృషి అటవీ హక్కుల చట్టంతోఎంతోమందికి భరోసా నాటి అభివృద్ధి ఫలాలుగిరిజనుల జీవితాల్లో వెలుగులు మన్యం అభివృద్ధిలోదివంగత వైఎస్ది తనదైన ముద్ర నేడు ఆయన జయంతి రూ.349 కోట్లతో కాఫీ ప్రాజెక్టు గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణకు రూ.349 కోట్లతో మహోన్నత కాఫీ ప్రాజెక్టును ఆయన అమలు చేశారు. 2009 నుంచి 2016 మధ్య విస్తరించిన ఈ తోటలు నేడు గిరిజనులకు ఏటా లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఆరోగ్యశ్రీతోగుండె ఆపరేషన్ మహానేత డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నాకు పునరజన్మనిచ్చింది.గుండె సంబంధిత వ్యాధితో అప్పట్లో బాధపడేదానిని. మా తల్లిదండ్రులు పేదరికం కావడంతో పెద్దాసుపత్రులకు తీసుకు వెళ్లే స్థోమత లేదు.ఆ సమయంలో ఆరోగ్యశ్రీ ద్వారా విశాఖలోని సెవెన్హిల్స్ ఆస్పత్రిలో చేర్చారు.గుండెకు అపరేషన్ జరపడంతో ప్రాణాపాయం తప్పింది.సుమారు రూ.2లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చుపెట్టారు.నేను ఆరోగ్యంగానే జీవిస్తున్నా. – వెచ్చంగి రాములమ్మ, గిరిజన మహిళ, పరదానిపుట్టు, పెదబయలు మండలం 60 వేల కుటుంబాలకుపక్కా ఇళ్లు ఇందిరమ్మ పథకం ద్వారా ఏజెన్సీలోని 11 మండలాల్లో 60 వేల కుటుంబాలకు పక్కా గృహాలను మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కింది. గుడిసెల్లో దుర్భర జీవనం గడిపే గిరిజనులకు సొంత గూడు కల్పించారు. అరకులోయ మండలంలోని కోడిపుంజువలస వరద బాధితుల కోసం యుద్ధప్రాతిపదికన మోడల్ కాలనీని నిర్మించి ఆదుకున్నారు. ఇవే తరహాలో అనేక మోడల్ కాలనీలను నిర్మించి గిరిజనులకు ఎంతో మేలు చేశారు. -
వివాహిత ఆత్మహత్య
మునగపాక/అనకాపల్లి: కుటుంబ కలహాల కారణంగా వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. చూచుకొండకు చెందిన కోరిబిల్లి చరణ్ కిరాణా షాపు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. అతని భార్య అనూషా అనకాపల్లిలోని ప్రైవేటు మెడికల్ ల్యాబ్లో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోదుగా ఉంటుంది. కొంత కాలంగా భార్యాభర్తల నడుమ కలహాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అనూష మంగళవారం అనకాపల్లి శారదానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.మృతురాలికి గతంలో వివాహం జరిగింది. మొదటి భర్త అనారోగ్య కారణంగా మృతిచెందడంతో, రెండో వివాహం చేసుకుంది. మృతురాలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న భర్త చరణ్, ఇద్దరు పిల్లలు విలపించారు. అనూష ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. ఇద్దరు పిల్లలను ఆనాథలుగా చేసి తల్లి అసువులుబాయడంతో కన్నీటి పర్వంతమయ్యారు. ఈ ఘటనతో చూచుకొండలో విషాదం అలముకుంది. అనుషా తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి పట్టణ ఎస్ఐ శ్రీనివాసరావు -
మహా వృక్షం.. మహానేత జ్ఞాపకం!
● పాడేరులో నేటికీ పదిలంగా కదంబ వృక్షం సాక్షి, పాడేరు: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనాడు నాటిన మొక్క నేడు మహా వృక్షంగా ఎదిగి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. అటవీ హక్కు చట్టం అమలులో భాగంగా, గిరిజన రైతుల సాగు భూములకు పట్టాలు పంపిణీ చేసేందుకు 2009 జూలై 12న ముఖ్యమంత్రి హోదాలో పాడేరు వచ్చిన డాక్టర్ వైఎస్సార్, తలారిసింగి పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఒక కదంబ మొక్కను నాటారు. కాలగమనంలో ఆ మొక్క నేడు మహావృక్షంగా ఎదిగి కళాశాల ప్రాంగణంలో చిరస్మరణీయంగా నిలిచింది. మహానేత భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన నాటిన ఈ కదంబ వృక్షాన్ని స్థానికులు ఆయనకు గుర్తుగా భావిస్తూ ఎంతో పదిలంగా చూసుకుంటున్నారు. -
ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు 38 అర్జీలు
అర్జీదారుల సమస్యను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 38 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా ఆర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలు వారంరోజుల్లో పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు, ఆస్తి గొడవలు, ఆర్థిక మోసాలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల వేధింపులు, గృహ కలహాలు, శాంతిభద్రతలపై అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఈదురు గాలుల బీభత్సం
పెదబయలు: మండలంలోని గలగండ పంచాయతీ గసాబు గ్రామంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈదురు గాలులకు ఓ ఇంటిపై చెట్టు కూలడంతో పైకప్పు ధ్వంసమైంది. ఇంట్లో నిద్రిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. సుమారు రూ.30 వేలు నష్టం జరిగినట్టు బాధితుడు పూజారి గణేశ్వరరావు తెలిపారు. వీఆర్వో కొండబాబు సోమవారం ఆ ఇంటిని పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు ఆయన చెప్పారు. చెట్టుకూలి ఇంటి పైకప్పు ధ్వంసం -
సాగునీటి కాలువలు కప్పేయడం అన్యాయం
మునగపాక: భూసేకరణ చేపట్టకుండా సాగునీటి కాలువలు కప్పేయడం సరికాదని సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టారు. సాగునీటి కాలువలు కప్పేసి రిటైనింగ్ వాల్ నిర్మించడం వల్ల సాగునీరు ప్రవహించే పరిస్థితులు ఉండవని, ఈ విషయమై న్యాయం చేయాలని కోరారు. గంగాదేవిపేట నుంచి మునగపాక బ్రిడ్జి వరకు ఉన్న రైతులు ఆందోళనకు దిగి డీటీ మురళీధర్కు వినతి అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, బాధిత రైతు ఆడారి అచ్చియ్యనాయుడు మాట్లాడుతూ పూడిమడక రోడ్డు విస్తరణలో భాగంగా పొలాలు, గృహాలు నష్టపోతున్న రైతులు, బాధితులకు మెరుగైన పరిహారం అందించాలన్నారు. ఆర్ఆండ్బీ, జిరాయితీకి సంబంధించి పక్కాగా సర్వే చేయించాలన్నారు. సీఐటీయూ నాయకుడు ఎస్.బ్రహ్మాజీ మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లకు అంగీకరించడం లేదన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం గ్రామసభల హామీలో భాగంగా బాధితులకు మెరుగైన పరిహారం అందించాలన్నారు. ఆడారి సన్యాశిదేవుళ్లు, ఆళ్ల కృష్ణ, దొడ్డి శేషుకుమార్, దొడ్డి జగన్నాథరావు, ఆళ్ల జగ్గారావు, ఆడారి అప్పారావు, కాండ్రేగుల పైడికొండ, వేగి వెంకటప్పారావు, ఆళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
‘అడ్రస్’ అడిగారు.. చైన్ లాగేశారు
పెందుర్తి : నడిచి వెళ్తున్న వృద్ధురాలిని అడ్రస్ అడిగే నెపంతో బురిడీ కొట్టించి, ఆమె మెడలోని బంగారు ఆభరణాలు అపహరించుకుపోయిన తల్లీకొడుకును పెందుర్తి క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.9 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైమ్ విభాగం ఏసీపీ ఎ.వెంకటరావు కేసు వివరాలను వెల్లడించారు. స్కూటీపై వచ్చి స్కెచ్.. సుజాతనగర్కు చెందిన కిలపర్తి చెల్లయ్యమ్మ గత నెల 27న ద్వారకానగర్లోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం తిరిగి సుజాతనగర్లో బస్సు దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా.. రామాటాకీస్ ప్రాంతానికి చెందిన మాదివాడ ధనలక్ష్మి, ఆమె కుమారుడు మాదివాడ అక్షిత్లు స్కెచ్ వేశారు. ముఖాలకు మాస్కులు ధరించి స్కూటీపై వృద్ధురాలిని వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను ఆపి, అడ్రస్ అడిగే నెపంతో నమ్మించారు. చెల్లయ్యమ్మ అడ్రస్ చెబుతున్న తరుణంలో.. ఒక్కసారిగా ఆమె మెడలోని పుస్తెలతాడు, నల్లపూసల దండను తెంచుకుని పరారయ్యారు. పోలీసుల గాలింపు.. నిందితుల అరెస్ట్ బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పెందుర్తి క్రైమ్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.9 లక్షల విలువైన ఆభరణాలను రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించి ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ సీఐ ఎం.చంద్రమౌళి, ఎస్ఐ డి.సూరిబాబు, ఏఎస్ఐ జి.నాగరాజు, హెచ్సీ వి.పేరయ్యనాయుడు, పీసీలు టి.శివప్రసాద్, ఎస్.జానకిరామ్, జె.శ్యాంసుందరరెడ్డి, జి.శివకృష్ణ, ఎల్.కే తాతారావులను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. -
నిలిచిన లావాదేవీలు
నక్కపల్లి : రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటు పరం చేస్తూ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 396 రద్దు చేయాలంటూ దస్తావేజు లేఖర్లు నిరసన బాట పట్టారు. సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేశారు. దీంతో సోమవారం నక్కపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో లావాదేవీలు నిలిచిపోయాయి. దస్తావేజు లేఖర్ల పెన్డౌన్కు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, వైస్ ఎంపీపీ వీసం నానాజీ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వీసం రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దాదాపు 550 రకాల ప్రభుత్వ సేవలను గ్రామాల్లోనే అందించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ సేవలతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సచివాలయాల్లో నిర్వహించాలని నిర్ణయిస్తే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. దస్తావేజు లేఖర్ల ఉపాధి దెబ్బతింటుందని గగ్గోలు పెట్టిన పార్టీలు ఇప్పుడు అదే విధానాన్ని ఎందుకు అవలంబిస్తున్నారని ప్రశ్నించారు. నాటి జగనన్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను ప్రభుత్వ కార్యాలయాలైన సచివాలయాల్లో నిర్వహించాలని నిర్ణయించిందని, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఈ ప్రక్రియను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల డేటా అంతా ప్రైవేటు ఏజెన్సీల చేతుల్లోకి వెళ్లిపోతుందన్నారు. దీనివల్ల అనేక అక్రమాలు, అనర్థాలు జరిగే అవకాశం ఉందన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. సబ్ రిజిస్టార్ గోపీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. దస్తావేజు లేఖర్ల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు దాతారం మురళి, కొంగర కృష్ణ మాట్లాడుతూ మంగళవారం కూడా పెన్డౌన్ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, ఎంపీటీసీ గంటా తిరుపతిరావు, పార్టీ నాయకులు వీసం శ్రీను, బంగార్రాజు, దస్తావేజు లేఖర్లు యాళ్ల చిరంజీవి, వై.ఎస్.ఎన్.రాజు, గోవిందు, రమేష్ పాల్గొన్నారు. నర్సీపట్నంలో... నర్సీపట్నం: ప్రైవేటు రిజిస్ట్రేషన్ కేంద్రాల ఏర్పాటు చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డాక్యుమెంట్ రైటర్ల సంఘం అధ్యక్షుడు సున్నం చిదంబరం స్వామి డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ దస్తావేజు లేఖరులు పెన్డౌన్ చేపట్టి నల్లబాడ్జీలు ధరించి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనకకు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ సేవలను ప్రభుత్వమే కొనసాగించాలన్నారు. ప్రజల ఆస్తుల భద్రత, హక్కుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అన్నారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్ల సంఘం ఉపాధ్యక్షులు ఎం.సత్తిబాబు, కార్యదర్శి రుత్తల శివకుమార్, వాణి, నరం సన్యాసినాయుడు, డాక్యుమెంట్ రైటర్లు పాల్గొన్నారు. యలమంచిలి రూరల్: జీవో నంబరు 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం యలమంచిలిలో దస్తావేజు లేఖరులు పెన్డౌన్ నిరసన తెలిపారు. పనులు కట్టిపెట్టి ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. డాక్యుమెంటు రైటర్ల సంఘం అధ్యక్షుడు నాగశేషు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది ఉపాధి కోల్పోతారన్నారు. డాక్యుమెంటు రైటర్లు విధులు బహిష్కరించడంతో కక్షిదారులు ఇబ్బంది పడ్డారు. రైటర్ల నిరసనతో నిత్యం జనంతో రద్దీగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బోసిపోయింది. అధికారులు, సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. నిరసనలో సంఘం కార్యదర్శి శానాపతి రాము, పిల్లా నాగేశ్వర్రావు పాల్గొన్నారు. చోడవరం: దస్తావేజు లేఖరులు విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు. చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద సోమవారం టెంట్ వేసి ధర్నా చేశారు. అనంతరం ఎమ్మెల్యే కేఎస్ ఎన్ఎస్ రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనలో చోడవరం దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు వడ్డాది రమేష్, గౌరవాధ్యక్షుడు సీతారామయ్య, ఉపాధ్యక్షుడు బొబ్బిలి చంద్రశేఖర్, కార్యదర్శి కోరుకొండ శ్రీనివాసరావు, పులగాయల నారాయణరావు, బొబ్బిలి రామారావు, కె. నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. కె.కోటపాడు: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేఖరులు పెన్డౌన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీ శేఖర్మంత్రి శ్రీనివాసరావు, దస్తావేజు లేఖరుల జిల్లా కమిటీ మెంబర్ వడ్డాది రమేష్ మాట్లాడుతూ ప్రైవేట్ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుతో ప్రజలు విలువైన ఆస్తుల వివరాలు ఇతరుల చేతుల్లోకి వెళితే భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో ఈ నెల 14న చలో విజయవాడ చేపట్టనున్నట్లు తెలిపారు. దస్తావేజు లేఖరులు బొబ్డిలి సన్యాసిరావు, బొడ్డు దొరస్వామినాయుడు, దుంగల రమేష్, తొండవరపు రాజు, సీముసురు దేముడుబాబు, కోట అప్పలనాయుడు, రెడ్డి నాగేశ్వరరావు, కర్రి దేముడునాయుడు పాల్గొన్నారు. దస్తావేజు లేఖర్లకు సంఘీభావం తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలు వీసం తదితరులు సబ్ రిజిస్టార్కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు లేఖర్లు -
విత్తనాల సరఫరాలో కూటమి విఫలం
పాయకరావుపేట: కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని, రైతులకు సకాలంలో వరి విత్తనాలు సరఫరా చేయడంలో విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ చిక్కాల రామారావు విమర్శించారు. మండల రైతులతో కలిసి ఆయన సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట వరి విత్తనాలు సమస్యపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిక్కాల రామారావు మాట్లాడుతూ గతేడాది రైతులకు నాణ్యమైన విత్తనాలు, సక్రమంగా ఎరువులు సరఫరా చేయకపోవడం వల్ల రైతులు ఎంతో నష్టపోయారన్నారు. ప్రస్తుతం 20 శాతం విత్తనాలు ఇంతవరకు సరఫరా జరగలేదన్నారు. పలుచోట్ల రైతు సేవా కేంద్రాలు మూతబడ్డాయన్నారు. రైతులకు వ్యవసాయ సిబ్బంది ఎక్కడా అందుబాటులో ఉండడం లేదన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో వరి విత్తనాలు, ఎరువులు సరఫరా చేశారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత అప్పటి సీఎం జగన్కే దక్కిందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ రైతు విభాగం కార్యదర్శి సూరకాసుల గోవిందు మాట్లాడుతూ రెండేళ్ల పాలనలో రైతులకు ఏ విధంగా న్యాయం జరగడం లేదన్నారు. అంతకుముందు ఎంపీడీవో ఎ.లవరాజుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ లంక సూరిబాబు, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు గెడ్డమూరి శ్రీనివాసరావు, ధనిశెట్టి మహేష్, పార్టీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి పడాల గోవిందు, మండల రైతు విభాగం అధ్యక్షుడు కోనే పుత్రరావు, మాజీ సర్పంచ్ పన్నీరు బాబ్జి, ఎంపీటీసీలు కొంతం నరేష్, పల్లేల లక్ష్మణ్, ఎగదాసు శేఖర్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు వై.అన్నవరం, నాయకులు ఇసరపు తాతారావు, పందిరి ధర్మాజీ, కాకాడ కృష్ణ, చేపల తాతాజీ, పేపకాయల అప్పారావు, గర్లంక వెంకటసూరి, త్రిపర్ణ శ్రీను తదితరులు పాల్గొన్నారరు. -
ఆధునిక సాంకేతికతను యువత అందిపుచ్చుకోవాలి
ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ పాడేరు: జిల్లాలోని గిరిజన యువత సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ అన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన యువత కోసం ఏఐ ఆరోహణ్, ఏఐ డిజిటల్ స్కిల్స్ ఫెలోషిప్ కోర్సును సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశల వారీగా మూడు బ్యాచ్లలో ఆరు నెలల కాలానికి ఆన్లైన్, ఆఫ్లైన్ విధానం ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. సాంకేతిక రంగంలో ఉన్నత సామర్థ్యం కలిగిన గిరిజన యువతను గుర్తించి ప్రోత్సహించడం కోసం శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. అర్హత కలిగిన గిరిజన యువత ఈ అవకాశాలను స ద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, ఏవో హేమలత, గిరిజన యువత పాల్గొన్నారు. -
‘సర్’ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
కలెక్టర్ నిశాంతిసాక్షి, పాడేరు: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ టి.నిశాంతి హెచ్చరించారు. సోమవారం ఆమె అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఓటర్ల జాబితా సమగ్ర సర్వే కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, నూరుశాతం ఓటర్ల డిజిటలైజేషన్ను ఈనెల 10వతేదీ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనిచేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నియమితులైన 624 మంది బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్ణీత గడువులోగా ‘సర్’ను పూర్తి చేయాలన్నారు. అరకులోయ నియోజకవర్గంలో 2,48,665 ఓటర్ల ఫారాల పంపిణీ చేయగా,52.92శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని, పాడేరు నియోజకవర్గంలో 2,51,083 ఫారాలకు గాను 48.48 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేశామన్నారు. ప్రత్యేక అధికారులు, ఏఆర్వోలు, సంబంధిత సిబ్బంది ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులకు హాజరు కావాలి ఓటర్ల సవరణ కార్యక్రమానికి నియమితులైన అడిషనల్ అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు తప్పనిసరిగా ఎన్నికల విధులకు హాజరుకావాలని, లేని పక్షంలో సస్పెన్షన్ తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. విధులకు గైర్హాజరైనా, అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోయినా ఆయా అధికారుల తీరును తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఇదే చివరి హెచ్చరిక అని అందరూ విధుల్లో నిమగ్నమవ్వాలని ఆదేశించారు. 270 నంబర్ పోలింగ్ కేంద్రం తనిఖీ పాడేరు మండలం నడిమివీధిలోని 270 నంబర్ పో లింగ్ కేంద్రాన్ని కలెక్టర్ టి.నిశాంతి ఆకస్మికంగా త నిఖీ చేశారు.గ్రామ సచివాలయంలో ఓటర్ల సవరణ ప్రక్రియను పరిశీలించారు.నిర్ణీత గడువులోగా ఓటర్ల జాబితా సవరణను పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరితగతిన ‘సర్’ పూర్తి: జేసీగూడెంకొత్తవీధి: ‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలని జేసీ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. మండలంలోని బూత్ నంబర్ 23 పరిధిలో ఉన్న డి.అగ్రహారంలో ఆమె సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఎల్వోలకు అంతా సహకరించాలని కోరారు. అవసరమైన శాఖల సిబ్బంది సాయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్యుమరేషన్ ఫారంలను తీసుకున్న వెంటనే నింపి బీఎల్వోలకు ఓటర్లు అందజేయాలని ఓటర్లను కోరారు. అవసరమైన ఫొటోలు,ఆధార్ జెరాక్స్ కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.ఈ నెల పదవ తేదీ నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. జిమాడుగుల(పాడేరు రూరల్): సర్ వేగవంతంగా పూర్తి చేయాలని పాడేరు జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు, సోమవారం జిమాగుల మండలంలో సొలభం,గడుతూరు పంచాయతీల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై శాఖా పరమైన చర్యలు తప్పవన్నారు. -
విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపర్చాలి
పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ పెదబయలు: విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపర్చాలని పాడేరు ఐటీటీఏ పీవో ఆదిత్య వర్మ అన్నారు. సోమవారం పెదబయలు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–1ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు గణితంలో చతుర్విద ప్రక్రియలను బోధించి, వారి నుంచి సమాధానాలు రాబట్టారు. చదవడం,రాయడం ప్రతీ విద్యార్థినికి వస్తుందో, లేదో ఆరా తీశారు. అనంతరం పాఠశాల టాయిలెట్స్ను, వసతి గృహంలో స్టాక్ రూమ్ను పరిశీలించారు.వసతి గృహం పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో వార్డెన్ను మందలించారు. పాఠశాల,వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతీ రోజు ఉదయం రెండు పీరియడ్లు కచ్చితంగా గణితం బోధించాలని ఆదేశించారు. ఎన్యుమరేషన్ ప్రక్రియ వేగవంతం ‘సర్’ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని పీవో తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన ఎన్యుమరేషన్ను పరిశీలించారు. బీఎల్వోలు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్యాంసుందర్, తహసీల్దార్ లక్ష్మయ్య, గిరిజన సంక్షేమశాఖ సహాయ అధికారి స్వర్ణలత, మండల విద్యాశాఖ అధికారి కె.కృష్ణమూర్తి,హెచ్ఎం నారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి : స్థానిక రైల్వేస్టేషన్ 3వ నంబర్ ప్లాట్ఫారంలో సుమారుగా 50 సంవత్సరాల వయస్సుగల గుర్తు తెలియని వ్యక్తి స్వర్ణజయంతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి ప్రమాదశాత్తూ జారిపడిపోయి అక్కడిక్కడే మృతిచెందినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి చెప్పారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేవని, బ్లూ, బ్లాక్ చెక్స్ షర్ట్, సిమెంట్ రంగు పుల్ఫ్యాంట్ ధరించి ఉన్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్ 7382058996ను సంప్రదించాలన్నారు. -
అస్వస్థతతో కేజీబీవీ విద్యార్థిని మృతి
డుంబ్రిగుడ: హోమ్ సిక్తో సెలవుపై స్వగ్రామానికి వెళ్లిన కేజీబీవీ విద్యార్థిని అకస్మాత్తుగా అస్వస్థతకు గురై అరకులోయ ఏరియా ఆస్పత్రిలో మృతి చెందింది. మండలంలోని పోతంగి పంచాయతీ పెద్దపాడే గ్రామానికి చెందిన బడ్నాయిని లక్ష్మీదేవి(15) స్ధానిక కస్తుర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఈనెల 4వ తేదీన విద్యార్థిని తండ్రి బడ్నాయిని రామస్వామి పాఠశాలకు వెళ్లి హోమ్ సిక్పై సెలవు అడిగి గ్రామానికి తీసుకెళ్లాడు. శనివారం సాయంత్రం విద్యార్థిని అజీర్తితో బాధపడింది. ఆదివారం ఉదయం కూడా అదే పరిస్థితి ఉండటంతో పసర (పోదు)మందు రాశారు మధ్యాహ్నం హఠాత్తుగా అస్వస్థతకు గురవడంతో డుంబ్రిగుడ పీహెచ్సీకి తరలించారు. వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆదివారం సాయంత్రం అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఈవిషయంపై ఆ పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించగా తమ పాఠశాలలో ఆరో తరగతి నుంచి చదువుతోందని, ఎప్పుడూ అనారోగ్యానికి గురి కాలేదన్నారు. ఆదివారం సాయంత్రం బాధిత కుటుంబ సభ్యులు పాఠశాలకు సమాచారం అందించారని ఆపాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పద్మ తెలిపారు. విద్యార్థిని మృతిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నామని ఆమె చెప్పారు. -
మోదకొండమ్మను దర్శించుకున్న కేంద్ర ఎన్నికల అధికారి
మోదకొండమ్మను దర్శించుకుంటున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.బి.జోషికి అమ్మవారి మెమెంటో అందజేసి సత్కరిస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ అప్పలరాజు, కమిటీ సభ్యులు మాడుగుల : మాడుగుల మోదకొండమ్మను కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.బి.జోషి సోమవారం దర్శించుకున్నారు. దీంతో ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజుతో పాటు ఇతర కమిటీ సభ్యులు జోషికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు.ఆలయ కమిటీ సభ్యులు దేవరాపల్లి శ్రీనివాసరావు, దంగేటి సూర్యారావు, తహసీల్దార్ రమాదేవి, స్థానిక నాయకులు పుప్పాల లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. -
కోలాహలం
పొలాల్లోజిల్లాలో ఎటు చూసినా వ్యవసాయ పనులతో పొలాలు కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో గిరిజన రైతులు ఖరీఫ్ వరి సాగు పనుల్లో నిమగ్న మయ్యారు. పలువురు అన్నదాతలు నారు మడులకు సిద్ధం చేసుకుంటుండగా, మరి కొంతమంది నాట్లు వేస్తున్నారు. ఏజెన్సీలోని గిరిజన రైతులంతా ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు. సాక్షి, పాడేరు: కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలోని 11 మండలాల్లో ఖరీఫ్ పనులు జోరందుకున్నాయి. పొలాలు కోలాహలంగా మా రాయి. ఏరువాక పనుల్లో గిరిజనులు నిమగ్నమయ్యారు. ఐదు రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలు వ్యవసాయానికి ఎంతో మేలు చేశాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. వర్షాలు కురుస్తుండడంతో గిరిజన రైతులు పొలంపనులు చేపట్టారు. రెండవ దుక్కులు, నీటి నిల్వలు అధికంగా ఉన్న వ్యవసాయ భూముల్లో దమ్ము పనులు, ఆశాజనకంగా ఎదిగిన వరినారు తీత, వెనువెంటనే వరినాట్ల వేయడం తదితర పనులు జోరుగా సాగుతున్నాయి. 42వేల హెక్టార్లలో ఖరీఫ్ వ్యవసాయం జిల్లాలో ఖరీఫ్లో ప్రతి ఏడాది 42వేల హెక్టార్లలో వరి సాగుచేస్తారు. 20వేల క్వింటాళ్ల వరకు వరి విత్తనాలు అవసరమవుతాయి.అయితే ప్రభుత్వం 9,800 క్వింటాళ్ల విత్తనాలను 90శాతం సబ్సిడీపై ఆలస్యంగా అందుబాటులోకి తెచ్చింది. అప్పటికే పలువురు గిరిజన రైతులు వారపు సంతలు, ఒడిశాలో హైబ్రిడ్ రకం వరి విత్తనాలను కొనుగోలు చేసి నారుమడులు వేసుకున్నారు.ఆ తర్వాత వ్యవసాయశాఖ పంపిణీ చేసిన విత్తనాలను పలువురు రైతులు పొందారు. జూన్ నెలలో ఆశించినంత వర్షాలు కురవక పోవడంతో అన్నదాతలు ఆందోళన చెందారు.ఈ వారంలో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో నారుమడుల ఎదుగుదలకు ఎంతో మేలు చేసింది. జిల్లాలో జోరందుకున్న ఖరీఫ్ పనులు పలు చోట్ల నారుమడులు సిద్ధం... మరికొన్ని చోట్ల వరి నాట్లు ప్రారంభం వాతావరణం అనుకూలం ఖరీఫ్ వ్యవసాయ పనులకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వర్షాలు కురుస్తుండడంతో వరినాట్లు పడుతున్నాయి. వ్యవసాయశాఖ ద్వారా సబ్సిడీపై పొందిన 9,800 క్వింటాళ్ల విత్తనాలతో వేసిన నారుమడులు కూడా ఆశాజనకంగా ఎదుగుతున్నాయి.రైతులంతా గ్రామ సచివాలయాల పరిధిలో వ్యవసాయ అసిస్టెంట్ల సలహాలు,సూచనలు పాటించి అధిక దిగుబడుల లక్ష్యంగా వ్యవసాయం చేయాలి –ఎస్.బి.ఎస్.నందు, జిల్లా వ్యవసాయాఽధికారి -
తమ్ముడి భిక్షే నా ప్రాణం
అక్కిరెడ్డిపాలెం: ‘నేను బతికున్నానంటే అది కేవలం నా తమ్ముడు పెట్టిన భిక్ష.. నన్ను బతకమని తను మునిగిపోయాడు‘ అంటూ విశాఖ తీరంలో బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన భోగాపురం మత్స్యకారుడు కారె చిన్న మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యాడు. ప్రస్తుతం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఆ నరకప్రాయమైన రోజు సముద్ర గర్భంలో ఏం జరిగిందో వివరిస్తూ గుండె పగిలేలా రోదించాడు. ఆయన మాటల్లోనే.. 37 మైళ్ల దూరం వెళ్లాం.. ‘మేము జాలై 1వ తేదీన హార్బర్ నుంచి వేటకు బయలుదేరి సముద్రంలో సుమారు 30 నుంచి 37 మైళ్ల దూరం లోపలికి వెళ్లాం. రెండు రోజుల పాటు వేట బాగానే సాగింది. ఇక ఇంటికి తిరుగు ప్రయాణం అవుదాం అనుకుంటుండగా.. తీరానికి మరో 10 మైళ్ల దూరం ఉందనగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తుఫాను గాలులు, రాకాసి అలలు బోటును ముంచెత్తాయి. మేము తేరుకునే లోపే ఒక భారీ అల వచ్చి బోటును బోలల్తా కొట్టేసింది. ఆ క్షణంలోనే నా కళ్ల ముందే మా అన్నయ్య కొడుకు (చిన్నయ్య) నీటిలో పడిపోయాడు. వాడు కొట్టుకుపోతుంటే మా అన్నయ్య ’బాబూ.. నా కొడుకు కనిపించట్లేదు’ అని ఏడుస్తూ వాడిని కాపాడటానికి నీళ్లలోకి దూకాడు. అలా వాళ్లిద్దరూ మా కళ్లముందే సముద్రంలో కలిసిపోయారు.‘ బోటు మునుగుతోంది.. రాత్రంతా ఆరుగురం ఒకే ఫోర్సు పట్టుకుని కూర్చున్నాం.. ‘అప్పటికి బోటు పైన మేం ఆరుగురం మిగిలాం. సమయం గడుస్తున్న కొద్దీ రాత్రి 9 గంటల ప్రాంతంలో బోటు నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోవడం ప్రారంభమైంది. ’మనం విడిపోతే ఎక్కడో దగ్గర చచ్చిపోతాం.. రాత్రంతా ఆరుగురం కలిసే ఉందాం’ అని ఒకరినొకరు ధైర్యం చెప్పుకున్నాం. రాత్రంతా సముద్రం మధ్యలో ఆ మునుగుతున్న బోటుపై రెండు లైఫ్ బాయ్ ఫోర్సులను (రక్షణ వలయాలు) ఆరుగురం గట్టిగా పట్టుకుని తెల్లవార్లూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం.కానీ, తెల్లవారేసరికి మాలో ఒక మనిషి కనిపించలేదు. చీకట్లోనే ఎప్పుడు అలల దాటికి కొట్టుకుపోయాడో తెలియదు. అప్పటికి మేం ఐదుగురం మిగిలాం.‘ కదిలించిన తమ్ముడి త్యాగం! ‘ఉదయం వెలుతురు వస్తున్న సమయంలో చాలా దూరంలో ఒక చైనా వాణిజ్య నౌక (షిప్) వెళ్లడం కనిపించింది. నేను మా తమ్ముడితో అన్నాను.. ’తమ్ముడూ.. అక్కడ షిప్ కనిపిస్తోంది, ఎలాగోలా ఈదుకుంటూ అక్కడికి వెళ్దాం పదా’ అని పిలిచాను. కానీ నా తమ్ముడు నీరసంగా నా వంక చూసి.. ‘నా ప్రాణం ఇక్కడితో అయిపోయింది, నా వల్ల ఇక ఈదడం సాధ్యం కాదు. నేను రాను. నువ్వు నలుగురు పిల్లలున్న వాడివి.. నా మాట విని నువ్వు వెళ్ళు, ఎలాగోలా బతుకు!‘ అని నన్ను బలవంతంగా ముందుకు నెట్టాడు. నా తమ్ముడు నన్ను వెళ్లమన్న ఆ మాట నా గుండెను కోసేసింది. వాడు చెప్పినట్లే మేం నలుగురం ఆ షిప్ వైపు ఈదడం ప్రారంభించాం. మేం ఈదుకుంటూ వెళ్తుంటే.. వెనక నుంచి నా తమ్ముడు ’నేను వచ్చేస్తాను.. మీరు వెళ్ళండి’ అని ధైర్యం చెప్తూనే ఉన్నాడు. కానీ కొద్దిసేపటికే వాడు కూడా అలల తాకిడికి సముద్రంలో కలిసిపోయాడు.‘ 15 కిలోమీటర్ల ఈత.. చైనా షిప్ లంగర్ పట్టుకుని మృత్యుంజయుడిగా.. ‘నాతో పాటు బయలుదేరిన మిగిలిన ముగ్గురు కూడా మధ్యలోనే అలల వేగానికి కొట్టుకుపోయారు. చివరకు నేను ఒక్కడినే మిగిలాను. దాదాపు 15 కిలోమీటర్ల దూరం మృత్యువుతో పోరాడుతూ ఈదాను. ఎలాగోలా ఆ చైనా షిప్ దగ్గరకు చేరుకుని, దాని ’లంగర్’ (యాంకర్) గొలుసును గట్టిగా పట్టుకున్నాను. ఆ సమయంలో పెద్ద అల వచ్చి నన్ను కిందకు పడేసింది. చచ్చిపోతాననే భయంతో ’బాబోయ్ కాపాడండి.. కాపాడండి..’ అని గట్టిగా కేకలు వేశాను. నా కేకలు విని షిప్ పైనున్న చైనా సిబ్బంది కిందికి చూశారు. వెంటనే వారు ఒక లైఫ్ జాకెట్, తాడు కిందికి విసిరారు. దాన్ని నడుముకు కట్టుకోగానే నన్ను పైకి లాగారు. నన్ను పైకి తీసుకెళ్లాక దాదాపు రెండు వాటర్ బాటిళ్లు తాగాను. ఆ తర్వాత వాళ్లు నాకు బట్టలు ఇచ్చి, భోజనం పెట్టి ఆదరించారు. నౌకాదళ హెలికాప్టర్ వచ్చేంత వరకు నేను ఆ చైనా షిప్లోనే ఉన్నాను‘ అని చిన్న కన్నీరు మున్నీరవుతూ ముగించాడు. మిగిలిన వారి కోసం ఉత్కంఠగా గాలింపు తమ కళ్లముందే కుటుంబ సభ్యులు, తోటి మ త్స్యకారులు ఒక్కొక్కరుగా సముద్రంలో కలిసిపోతుంటే ఏమీ చేయలేకపోయానన్న చిన్న ఆవేదన అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. ప్రస్తుతం చిన్న ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ, మానసిక ఆందోళనలో ఉన్నాడు. కాగా, ప్రమాదంలో కొట్టుకుపోయిన మిగిలిన ఆరుగురి కోసం నౌకాదళ హెలికాప్టర్లు, కోస్ట్ గార్డ్ బోట్లు సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నాయి. నూకాంబికను దర్శించుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారిఅనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్.బి.జోషి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి సారిగా అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. అనంతరం ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్, చైర్మన్ పీలా నాగశ్రీనులు జోషిని శాలువాలతో సత్కరించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.ఆర్టీవో షేక్ ఆయిషా, ఇన్ఛార్జ్ జోనల్ కమిషన్ లక్ష్మీతులసి పాల్గొన్నారు. అల మా బతుకులు బోల్తానా వాళ్లు మునిగిపోతుంటే.. ఏమీ చేయలేకపోయాను ఆసుపత్రి బెడ్పై నుంచి ఒళ్లు గగుర్పొడిచే కారె చిన్న కన్నీటి కథనం -
26న రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు
మాట్లాడుతున్న అసోసియేషన్ నిర్వాహక సభ్యులు కంచరపాలెం: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ నెల 26న ‘మిస్టర్ ఆంధ్ర’ రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్, యువ స్పోర్ట్స్ క్లాసిక్ పోటీలను నిర్వహించనున్నట్లు స్టేట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.సుబ్బమ్మ తెలిపారు. కంచరపాలెం ఐటీఐ జంక్షన్ వద్ద గల హనుమాన్ జిమ్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు తరలిరానున్నట్లు పేర్కొన్నారు. 55 కేజీల నుంచి 90 కేజీల విభాగంలో మెన్స్ ఫిజిక్, క్లాసిక్ ఫిజిక్, డిసేబుల్డ్ , మహిళా బాడీ బిల్డింగ్ ప్రత్యేక గ్రూపులలో ఈ పోటీలు ఉంటాయని వివరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు బి.శ్రీనివాసరావు, ఆర్.కుమార్, సింహాద్రి, కె.వి.కమలకర్, ఎస్కే బషీర్ ఉద్దీన్, ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వేగవంతంగా ‘సర్’
ఎమ్మెల్యే రేగం మత్స్యలింగండుంబ్రిగుడ: ‘సర్’ సర్వే వేగవంతం చేయాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సచివాలయం ఉద్యోగులను హెచ్చరించారు. మండలంలోని అరకు, కొర్రాయి, కొల్లపుట్టు, గసభ, సొవ్వ సచివాలయాలతో పాటు సొవ్వ ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా మండలంలో నిర్వహిస్తున్న ‘సర్ ’, బీఎల్వోల పనితీరు, కొత్త ఓటర్ల నమోదు, వలస ఓటర్లు వివరాలను సచివాలయం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఎల్వోలు నిర్లక్ష్యం వహించకుండా ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని ఆదేశించారు. సొవ్వ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్రావు, రామ్ప్రసాద్, అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ రోడ్డు దుస్థితి మారదా..
అనకాపల్లి టౌన్: ఒక్కసారి వర్షం కురిస్తే చాలు తుమ్మపాల ప్రధాన రోడ్డు చెరువులా మారిపోతుంది. అత్యంత ప్రధాన మార్గం కావడం, రోడ్డుకు పక్కన కాలనీలు ఉండడంతో ఈ ప్రాంత వాసులు రాక పోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ రోడ్డును బాగు చేయాలని నెలలు కాదు సంవత్సరాల నుంచి మొరపెట్టుకుంటున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ రోడ్డుకు ఆనుకొని ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి మార్గ్, తిల్ మార్గ్, మహాత్మా గాంధీ మార్గ్ తదితర కాలనీ వాసులు ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కుర్జీలు వేసుకొని రోడ్పై బైఠాయించి తమ నిరసనను తెలిపారు. దీంతో ఆ రహదారిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ రహదారి గుండానే చోడవరం, మాడుగుల, పాడేరు తదితర ప్రాంతాల నుంచి ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు నిత్యం తమ రాకపోకలు సాగిస్తుంటారు. మండలంలో ఉన్న క్వారీల నుంచి అధిక సంఖ్యలో క్వారీ లారీలు వెళుతుంటాయి. దీంతో గోతులు ఆపే వర్షపు నీరు వెరసి ఈ రోడ్పై ప్రాణం అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. ప్రతీ ఏడాదీ ఇదే పరిస్థితి అని, తమ పిల్లలను స్కూళ్లకు పంపాలన్నా, అత్యవసరమై ఆసుపత్రికి వెళ్లాలన్నా భయపడాల్సి వస్తుందని, అధికారులు ప్రజా ప్రతినిధులు ఇప్పటికై నా రోడ్డును ఎత్తు చేసి, డ్రైనేజీ నిర్మించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తుమ్మపాల ప్రధాన రహదారిపై గ్రామస్తుల బైఠాయింపు -
శోకం
సంద్రమంతగుండెలవిసేలా రోదిస్తున్న మహిళలుగంగవరం సమీపంలో సుమారు 10 నాటికల్ మైళ్ల దూరంలో బోటు ప్రమాదంసముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం వారి కుటుంబాలు ఆందోళనగా ఎదురుచూస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విశాఖ తీరం గంగవరం సమీపంలో సుమారు 10 నాటికల్ మైళ్ల దూరంలో ఓ ఫిషింగ్ బోటు ప్రమాదానికి గురైంది. బోటులో మొత్తం ఏడుగురు మత్స్యకారులు ఉండగా, వారిలో బోటు యజమాని–డ్రైవర్ కారి చిన్నను విదేశీ సరుకు నౌక సురక్షితంగా రక్షించింది. మిగిలిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారిని గుర్తించేందుకు కోస్ట్ గార్డ్, నేవీ సంయుక్తంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అల్లకల్లోలంగా సంద్రం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1న ఐఎన్డీ–ఏపీ–ఎంఎం–వి–583 నంబరు గల బోటు ఏడుగురు మత్స్యకారులతో వేటకు బయలుదేరింది. వేట సాగుతున్న సమయంలో అల్పపీడనం ప్రభావంతో సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. భారీ అలలు, బలమైన ఈదురుగాలుల కారణంగా బోటుకు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇంజిన్ పనిచేయకపోవడంతో పాటు బోటు నియంత్రణ కోల్పోయింది. అలల ధాటికి తాడు తెగిపోవడంతో బోటు సముద్రంలో కొట్టుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. బోటు యజమాని క్షేమం బోటులో ఉన్న ఏడుగురిలో కారి చిన్నను పనామా దేశానికి చెందిన ఓ వాణిజ్య నౌక సురక్షితంగా రక్షించింది. జాయింట్ ఆపరేషన్స్ సెంటర్కు సమాచారం అందిన వెంటనే కోస్ట్ గార్డ్ చర్యలు చేపట్టి ఆయనను సురక్షితంగా తీరానికి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆయన నుంచి ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. మిన్నంటిన కుటుంబాల రోదనలు గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యుల ఆవేదన హృదయ విదారకంగా మారింది. ఆదివారం ఉదయం విశాఖ ఫిషింగ్ హార్బర్లోని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించి తమ వారిని సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మహిళలు కన్నీరు మున్నీరవుతూ అధికారులను వేడుకోవడం అక్కడ విషాద వాతావరణాన్ని నెలకొల్పింది. కడలే వారికి కన్నతల్లి. అలలే వారికి బతుకు బాట. తుపాను హెచ్చరికలు లెక్కచేయకుండా, కుటుంబాల పొట్ట నింపేందుకు ఆ ఏడుగురు మత్స్యకారులు గంగమ్మ తల్లిని నమ్ముకుని సముద్రంలో అడుగు పెట్టారు. కానీ ఈసారి గంగమ్మ తల్లి కరుణించలేదు. బంగాళాఖాతంలో పుట్టిన అల్పపీడనం కన్నెర్ర చేయడంతో అలలు రెచ్చిపోయాయి, గాలులు బీభత్సం సృష్టించాయి. ఇంజిన్ ఆగిపోయి, తాడు తెగిపోయి బోటు కడలి కడుపులో కొట్టుకుపోయింది. ‘ఇంకో గంటలో ఇంటికి వస్తా’ అని చెప్పిన మాటలే ఆఖరి మాటలుగా మారాయి. భర్త కోసం రాత్రంతా వంట సిద్ధం చేసి ఎదురుచూసిన నరసయ్యమ్మ కళ్లు నీటి చెలమలు అయ్యాయి. బోటు యజమానిని ఒక విదేశీ నౌక కాపాడగా, గల్లంతైన ఆరుగురు కోసం ఆ కటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి. – మహారాణిపేటగాలింపు ముమ్మరంభర్త కోసం తీవ్ర ఆందోళన ‘మరో గంటలో ఇంటికి వస్తానని నా భర్త ఫోన్ చేశారు. ఆయన కోసం వంట చేసి ఎదురు చూశాను. కానీ 24 గంటలు దాటినా ఇంకా రాలేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదు. నా భర్త ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు. దయచేసి ఆయనను సురక్షితంగా నాకు తీసుకురండి’అంటూ గల్లంతైన మత్స్యకారుడు కారి సీతోడు భార్య నరసయ్యమ్మ కన్నీరుమున్నీరయ్యారు. భర్త కోసం రాత్రంతా ఎదురుచూశానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహారాణిపేట/బీచ్రోడ్డు: సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం నేవీ, కోస్ట్ గార్డ్, మైరెన్ పోలీసులు సంయుక్తంగా యుద్ధప్రాతిపదికన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఆదివారం విశాఖ ఫిషింగ్ హార్బర్లో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, గల్లంతైన వారిని గుర్తించే వరకు గాలింపు నిరంతరంగా కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి కూడా బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. రంగంలోకి నౌకలు, హెలికాప్టర్లు బోటు చివరిసారిగా ఉన్న సిగ్నల్స్ ఆధారంగా నడిసముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. కాగా కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఐజీ గోపీనాథ్ జట్టి కోస్ట్ గార్డ్ కార్యాలయాన్ని సందర్శించి రెస్క్యూ ఆపరేషన్ను సమీక్షించారు. ప్రస్తుతం సహాయక చర్యల కోసం కోస్ట్ గార్డ్కు చెందిన రెండు నౌకలు, రెండు హెలికాప్టర్లు, అలాగే నేవీకి చెందిన ఒక నౌక సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నాయని ఆయన వెల్లడించారు -
ఆరుగురు మత్స్యకారుల గల్లంతు.. ఒకరు సురక్షితం
ముమ్మరంగా నేవీ, కోస్ట్ గార్డ్ గాలింపువాసుపల్లి జానకీరామ్ సమాచారంతో అప్రమత్తమైన యంత్రాంగం గల్లంతైన మత్స్యకారులు ప్రస్తుతం విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని జాలారిపేట, జబ్బర్ తోట ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ విషయాన్ని మత్స్యకారులు వైఎస్సార్సీపీ నేత, ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే జిల్లా యంత్రాంగం, కోస్ట్ గార్డ్, నేవీ, మైరెన్ పోలీసులకు సమాచారం అందించి తక్షణ గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు. -
బలవంతపు భూ సేకరణ ఆపాలి..
చీడికాడ: సోలార్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో నాలుగు గ్రామాల రైతుల నుంచి బలవంతపు భూ సేకరణను ఆపాలని, అలాగే రైతులకు బలవంతంగా ఇచ్చిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, సోలార్ ప్లాంట్ నోటిఫికేషన్ను రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం బాధిత గ్రామాలైన బైలపూడి, చినగోగాడ, జి.కొత్తపల్లి, అడవి అగ్రహారం గ్రామాల రైతులతో కూడి ఆయా భూముల్లో గల పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతులకు మద్దతుగా పాల్గొన్న వీరు మాట్లాడుతూ 4 గ్రామాల పరిధిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు పేరిట 262 ఎకరాల భూమిని భూ సేకరణ చేస్తున్నట్టు గతంలో సంబంధిత రైతులకు నోటీసులు ఇవ్వడంతో తమ భూములను ప్లాంట్ ఏర్పాటుకు ఇవ్వమని ఇప్పటికే నోటిసులకు సమాధానం చెప్పినా తహసీల్దార్ అవి ప్రభుత్వ భూములని, మీకు పట్టాలున్నా రైతులకు ఏ హక్కులు ఉండవని బెదిరిస్తూ రైతుల సహనానికి పరీక్ష పెడుతున్నారన్నారు. నాలుగు గ్రామాల్లో కలసి 262 ఎకరాల భూముల సేకరణ పేరిట రైతులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 40 ఏళ్ల క్రితమే సాగుదారులకు హక్కు పత్రాలు మంజూరు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీఈపీసిఎల్ ద్వారా 57.97 మెగా వాట్ల సోలర్ ప్లాంట్ నిర్మిచనున్నట్టు ప్రకటించిందన్నారు. ఈ భూముల్లో ఉన్న వందలాది మంది రైతు కుటుంబాలు పామాయిల్, నువ్వులు, వేరుశనగ పంటల ద్వారా తమ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ యంత్రాంగం రైతులకు ఇష్టం లేకుండా భూముల సేకరణ పేరిట ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. 9–77 యాక్టు ప్రకారం రైతులు డీ–ఫారం భూములు అమ్మకాలు, కొనుగోలు జరిగాయని వీటిని తీసుకుంటామని రెవెన్యూ అధికారుల బెదిరింపులతో కుంగిపోతున్న రైతులు గుండెపోటుకు గురై మరణిస్తున్నారని, పలువురు మహిళా రైతులు భర్త మృతి చెందితే ఈ భూములని ఉపాధిగా చేసుకుని కుటుంబాలను సాకుతున్నారన్నారు. గ్రామ సభల్లోనే భూములు ఇవ్వమని చెప్పినా పట్టించుకోకుండా సేకరణ పేరిట ముందుకు వెళ్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వృత్తిదారుల సంఘం జిల్లా ఛైర్మన్ గంటా శ్రీరామ్, సీఐటీయు జిల్లా, మండల కార్యదర్శిలు ఆర్.రాము, ఆర్.దేముడునాయుడుతో పాటు మాజీ ఎంపీపీ కొల్లి అప్పలనాయుడు, గంటా మత్స్యరాజు, జాజిమొగ్గల రమేష్, సిహెచ్. శ్రీను, సన్యాసిరావు, సిరికి రాము, సలాది గంగశేషు,కొన ఈశ్వరరావు, మైచర్ల నానాజీ, కె.కన్నబాబుతో పాటు పెద్ద ఎత్తున మహిళా రైతులు పాల్గొన్నారు. -
ఉద్యోగాన్వేషణలో.. ప్రమాదం బారిన పడి
పెందుర్తి: ఉద్యోగాన్వేషణలో వలస బాట పట్టిన ఓ నిరుద్యోగి ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడిన ఘటన పెందుర్తి సమీపంలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతడ్ని పెందుర్తిలో పోలీసులు తక్షణమే స్పందించి ఆస్పత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు. వివరాలివి.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన దున్నా తిలక్(35) ఉద్యోగాన్వేషణ నిమిత్తం ఇటీవల విశాఖకు వచ్చాడు. అనంతరం తిరిగి శనివారం అర్ధరాత్రి శ్రీకాకుళానికి వెళ్లే రైల్లో ఇంటికి ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో వేకువజాము 2.30 గంటల సమయంలో పెందుర్తి దాటిన తరువాత రైల్లో నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. తీవ్ర గాయాలతో ట్రాక్పై అచేతనంగా పడి ఉన్నాడు. నైట్ రౌండ్స్లో ఉన్న సీఐ కె.వి.సతీష్కుమార్కు ప్రమాదంపై సమాచారం అందింది. వెంటనే స్పందించిన ఆయన ఘటనాస్థలికి అంబులెన్స్ రప్పించి గాయపడ్డ తిలక్ను కేజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సీఐ తెలిపారు. -
తల్లి అంత్యక్రియలకు నిందితుడికి అనుమతి
మానవత్వాన్ని చాటుకున్న ఎస్పీ తుహిన్ సిన్హామాడుగుల రూరల్: చట్టాన్ని అమలు చెయ్యడంలోనే కాదు ఆపదలో వున్నప్పుడు మానవత్వాన్ని చాటడంలో తాము ఎప్పుడూ ముందే ఉంటామని అనకాపల్లి జిల్లా పోలీసులు నిరూపించారు. పిట్ ఎన్డీపీఎస్ చట్టం కింద విశాఖపట్నం సెంట్రల్ జైల్లో రిమాండ్లో వున్న నిందితుడు బుదిరెడ్ల కొండలరావు తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మానవతాదృక్పథంతో ఒక రోజు తాత్కాలిక బెయిల్ (పరోల్ ) మంజూరు చేయించడంలో అనకాపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం చూపిన చొరవపై సర్వత్రాపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఎస్ఐ జి. నారాయణరావు ఆదివారం రాత్రి స్థానిక విలేకరులకు అందించిన వివరాలిలా వున్నాయి. అనకాపల్లి జిల్లా, మాడుగుల మండలం, ఎం. కోటపాడు గ్రామానికి చెందిన బుదిరెడ్ల కొండలరావు గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉంటూ, ఎస్పీ తుహిన్సిన్హా ఆదేశాల మేరకు 2025 జూలై 14 న పిట్ ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టు అయి విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్ అనుభవిస్తున్నాడు. కాగా పది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న అతని తల్లి బుదిరెడ్ల పైడితల్లమ్మ (50) ఈ నెల 4 వ తేదీ శనివారం మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కన్నకొడుకు జైలులో ఉండడంతో ఆఖరి చూపు కూడా నోచుకోలేని దైన్యస్థితిలో ఆ కుటుంబం పుట్టెడు దుఖంలో మునిగిపోయింది. కన్నతల్లి చివరి చూపునకై నా కొడుకును తీసుకురావాలని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు జిల్లా పోలీసులను ఆశ్రయించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న వారు తక్షణమే ఈ విషయాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా , ఆదనపు ఎస్పీ పి.ఎల్.మోహన్రావుకు నివేదించారు. ఎస్పీ వెంటనే స్పందించి, ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ, సిఫార్సు మేరకు రెవెన్యూ, ఎక్సెయిజ్శాఖ వారు వెంటనే స్పందించి, అత్యవసరంగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిందితుడు బుదిరెడ్ల కొండలరావుకు ఒక రోజు పాటు తల్లి అంత్యక్రియలకు హాజరు అయ్యేందుకు తాత్కాలిక విడుదల మంజూరు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తగిన పోలీసు భద్రత నడుమ, కొండలరావు ఆదివారం ఎం. కోటపాడు గ్రామానికి చేరుకుని తన తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఎస్పీ తుహిన్సిన్హా, ఆదనపు ఎస్పీ మోహన్రావు, పోలీసు సిబ్బందికి కొండలరావు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. -
రాష్ట్ర స్థాయి టెన్నీకాయిట్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
సబ్బవరం: అనకాపల్లి జిల్లా సబ్ జూనియర్ బాల బాలికల టెన్నీకాయిట్ జట్టు ఎంపికలు ఆదివారం సబ్బవరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించారు. ఈ నెల 11, 12వ తేదీలలో ప్రకాశం జిల్లా జరుగుమల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగే 38వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ టెన్నీకాయిట్ చాంపియన్ షిప్లో పాల్గొనే క్రీడాకారులను ఈ సందర్భంగా ఎంపిక చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన అనకాపల్లి జిల్లా టెన్నీకాయిట్ అసోసియేషన్ అధ్యక్షుడు రౌతు శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలతో పాటు చదువులోను ప్రతిభ కనబరిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. బాలుర విభాగంలో జె.సంపత్ వినయ్ కుమార్, కె.పండు, ఎం.కిశోర్, జి.నిఖిల్, వి.సూర్యదేవ, బాలికల విభాగంలో జి.వర్షిణి, పి.మంజు, వి.సృమైన, ఎ.కుసుమ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టెన్నీకాయిట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఎన్.వి.సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి జి.కనకరావు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్.కేశవరావు, వ్యాయామ ఉపాధ్యాయులు వి.సూర్యనారాయణ, మహాలక్ష్మి, భీమిలి ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల, రాజాం ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై వ్యాన్ దగ్ధం
కశింకోట: కశింకోట వద్ద జాతీయ రహదారిపై షార్టు సర్క్యూట్ కారణంగా వ్యాన్ దగ్దమైంది. సుమారు రూ.8 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా. విజయనగరం నుంచి విజయవాడ వైపు వెళుతున్న ప్రైవేటు మార్టుకు చెందిన వ్యాన్ ఇక్కడి కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్దకు చేరే సరికి ఒక్కసారిగా మంటలు వ్యాపించి కాలిపోసాగింది. ఈ విషయాన్ని గమనించిన మరో వాహన చోదకుడు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వ్యాన్ను డ్రైవర్ పక్కకు నిలిపాడు. దీంతో మంటలు పెద్దవయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది శకటంతో వచ్చి మంటలను అదుపు చేశారు. ఇందుకు స్థానికులు సహకారం అందించారు. ఇంజిన్లో ఏర్పడిన షార్టు సర్క్యూట్ కారణంగా మంటలు ఏర్పడి ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. -
అర్హులైన ప్రతిఒక్కరికి ఓటు హక్కు
కలెక్టర్ నిశాంతిసాక్షి, పాడేరు: ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంతో పాటు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. చట్ట నిబంధనల ప్రకారమే సవరణలు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, మరణించిన లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియను చట్ట నిబంధనల మేరకు చేపట్టాలని ఎన్నికల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం ఎంతో కీలకమని, క్షేత్రస్థాయిలో ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. రాజకీయ పార్టీల నేతలు వ్యక్తం చేసిన పలు సూచనలను నిబంధనల మేరకు పరిశీలిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అలసత్వం వహిస్తే చర్యలు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అలసత్వం వహించే బీఎల్వోలపై కఠిన చర్యలు తీసుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. మారుమూల గ్రామాల్లోని ప్రతి పోలింగ్ బూత్ పరిధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, బీఎల్వోలు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా యంత్రాంగం పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్వో లోకేశ్వరరావు, ఆర్డీవో భుజంగరావు, టీడీపీ నేత ఎస్. దొన్నుదొర, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జనసేన నేత సీదరి రామ్మూర్తి, బీజేపీ నేత ఎస్. వేమనబాబు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో బస్సు అద్దాలు ధ్వంసం
కశింకోట: కశింకోటలో జాతీయ రహదారిపై బస్సు, లారీతో పాటు వరుసగా మూడు వాహనాలు ఆదివారం సాయంత్రం ఢీకొన్నాయి. ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. బస్సు ముందు, వెనుక భాగాలు, దెబ్బతిన్నాయి. ప్రయాణికులు సురక్షితం. రాజమండ్రి నుంచి విశాఖ వెళుతున్న జేఎన్ఆర్ఎం ఏసీ ఆర్టీసీ మెట్రో బస్సు ముందు ఆగిన వ్యాన్ను ఢీకొంది. దీంతో బస్సును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. కశింకోట కూడలి వద్ద జరిగిన ప్రమాదంలో బస్సు వెనుక అద్దాలు పగిలిపోయాయి. ముందు అద్దం బీటలు వారి దెబ్బతింది. ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. వీరిని వేరే బస్సులో తరలించారు. ప్రమాదం వల్ల జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దాదాపు బయ్యవరం వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహన చోదకులు ఇబ్బంది చెందారు. దీంతో సీఐ అల్లు స్వామినాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ లక్ష్మణరావు, సిబ్బంది క్రేన్ సహాయంతో అడ్డంగా ఉన్న బస్సును పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించారు. -
ప్రమాదస్థాయికి డుడుమ
● కొనసాగుతున్న నీటి విడుదల ● వెయ్యి నుంచి 2,500 క్యూసెక్కులకు పెంపు ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయంలో నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరుకుంటోంది. రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రమాదస్థాయిలో నీటిమట్టం మొత్తం 2590 అడుగుల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం కలిగిన డుడుమ జలాశయంలో, ఆదివారం నాటికి నీటి మట్టం 2588.60 అడుగులకు చేరుకుంది. జలాశయం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది ఏడవ నంబర్ గేటును మూడు అడుగుల మేర పైకెత్తి, సుమారు 2,500 క్యూసెక్కుల నీటిని బలిమెల జలాశయానికి విడుదల చేస్తున్నారు. నిరంతరం పర్యవేక్షణ వర్షాలు ఇదే విధంగా కొనసాగితే జలాశయానికి ముప్పు పొంచి ఉందని భావించిన ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది నిరంతరం నీటి నిల్వలను పర్యవేక్షిస్తున్నారు. జలాశయ నీటి మట్టాన్ని ప్రమాదస్థాయి నుంచి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. -
మన్యంలో స్తంభించిన జనజీవనం
● నాలుగురోజులుగా ఈదురు గాలులు ● ఇళ్లకు పరిమితమవుతున్న గిరిజనులు ● ఎడతెరిపి లేకుండా వర్షాలు ● అల్లాడుతున్న ముంచంగిపుట్టు పాడేరు: ఏజెన్సీ ప్రాంతాన్ని గత నాలుగు రోజులుగా వర్షాలు వణికిస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండటంతో గిరిజన ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎడతెరిపి లేని వానలతో ముసురు వాతావరణం నెలకొనగా, గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. అంధకారంలో ఏజెన్సీ ఈదురుగాలుల తీవ్రతకు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. తీగలపై చెట్లు పడటంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా శనివారం అర్ధరాత్రి నుండి పాడేరు, డుంబ్రిగుడ మండలాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. కొనసాగుతున్న వాన ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం ఏమాత్రం విరామం లేకుండా కురుస్తూనే ఉంది. రహదారులపై ట్రాఫిక్ తగ్గిపోవడంతో రోడ్లన్నీ వెలవెలబోయాయి. వర్షాల ప్రభావంతో రోజువారీ పనులు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే వ్యవసాయ పనులకు కూడా ఆటంకం కలిగే అవకాశం ఉందని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. స్తంభించిన జనజీవనం ముంచంగిపుట్టు: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంచంగిపుట్టు మండలంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎడతెరిపి లేని వానలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పనసపుట్టు పంచాయతీ కేంద్రం వద్ద ఆర్అండ్బీ రోడ్డుపై ఈదురుగాలులకు భారీ వృక్షం అడ్డంగా పడిపోవడంతో, ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు, డుడుమ మార్గాల్లో కొన్ని గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు శ్రమించి చెట్టును తొలగించడంతో వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. మరోవైపు, ముంచంగిపుట్టు నుంచి పెదబయలు వెళ్లే మార్గంలో విద్యుత్ స్తంభాలపై చెట్టు పడటంతో వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి చెట్టును తొలగించి, వైర్లను సరిచేశారు. నీట మునిగిన పంట పొలాలు మాకవరం, జోలాపుట్టు, దొడిపుట్టు, కర్రిముఖిపుట్టు, పనసపుట్టు పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో పంట పొలాల్లోకి భారీగా వరదనీరు చేరడంతో పంటలు నీట మునిగాయి. దీంతో గిరిజన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనుగుమ్మ పంచాయతీ తర్లాగూడ గ్రామానికి వెళ్లే మార్గంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీనివల్ల ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
హెచ్డబ్ల్యూవోలజిల్లా కార్యవర్గ ఎన్నిక
పాడేరు రూరల్: హెచ్డబ్ల్యూవోల జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం పాడేరులో ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో భాగంగా నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జె. జగత్రాయ్ (పెదబయలు), ప్రధాన కార్యదర్శిగా వై.కుంఠరావు (డుంబ్రిగుడ), ఉపాధ్యక్షుడు: తిరుపతిరావు (బాకూరు), కార్యదర్శి: పాంగి చిట్టిబాబు (లోచలిపుట్టు, పాడేరు), కోశాధికారి: సీహెచ్. కాళీదాస్ (పాడేరు) వీరితో పాటు మరో 10 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. సమస్యల పరిష్కారమే లక్ష్యం ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సహోద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని, సంఘం బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. -
సర్ ప్రక్రియ మరింత వేగవంతం
కొయ్యూరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె కొయ్యూరు మండలంలోని మల్లవరం (బూత్ నంబర్ 108), డౌనూరు (బూత్ నంబర్ 109) గ్రామాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నేరుగా ప్రజలతో మాట్లాడారు. 2002లో ఓటర్ల జాబితాలో పేరు లేని వారు తప్పనిసరిగా తమ తల్లి లేదా తండ్రి ఓటు వివరాలను ధృవీకరణ కోసం చూపించాల్సి ఉంటుందని ఆమె వివరించారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందిన వెంటనే, ప్రజలు వాటిని పూర్తి చేసి ఫోటోలను అతికించి, ఆధార్ కార్డును జతపరచాలని కోరారు. ఒకవేళ 2002లో తమకు ఓటు లేకపోతే, తమ తల్లిదండ్రులలో ఎవరో ఒకరి ఓటరు కార్డును లేదా జాబితాలోని సీరియల్ నంబర్ను బీఎల్వోలకు చూపించాలని ఆమె సూచించారు. సకాలంలో పూర్తి చేయాలి ఓటర్ల నమోదుకు గడువు తక్కువగా ఉన్న నేపథ్యంలో, ప్రజలందరూ బీఎల్వోలకు పూర్తి సహకారం అందించాలని ఆమె కోరారు. మండలంలోని అన్ని బూత్లలో పనితీరుపై తహసీల్దారు ప్రసాదరావుతో ఆమె సమీక్షించారు. డిజిటలైజేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతున్న బూత్లపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, డీఎల్పీవో పీఎస్ కుమార్, ఎంపీడీవో ప్రసాదరావు, వీఆర్వో సుజాత, పంచాయతీ కార్యదర్శి రాము, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశం మల్లవరం, డౌనూరులో పర్యటన బీఎల్వోలకు సహకరించాలనిప్రజలకు విజ్ఞప్తి -
పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ
అరకులోయ టౌన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్బీ. జోషి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన అరకులోయ మండలంలోని మాడగడ పంచాయతీ పరిధిలో ఉన్న పలు పోలింగ్ స్టేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సవరణ కార్యక్రమం నిర్వహణపై అధికారులతో సమీక్షించిన ఆయన, నేరుగా ఇంటింటికీ వెళ్లి వివరాలను ఆరా తీశారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న అనంతరం పలు కీలక సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల సందర్శన సందర్భంగా, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియపై బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యం వహించకూడదు ఈ సందర్భంగా ఎస్బీ జోషి మాట్లాడుతూ.. సవరణ కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను సేకరించి, నమోదు చేయాలని, ఈ ప్రక్రియలో ఎటువంటి లోపాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజశ్రీధర్, ఎంపీడీవో వీసం ప్రసాద్, ఎంఆర్ఐ శంకరరావు, సూపర్వైజర్ రవికుమార్, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ భోగిరాజు, బీఎల్వోలు పాల్గొన్నారు. కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి ఆదేశం -
ఓటర్ల మౌనం!
జోరు వాన..ఓటర్ల నమోదుపై ఆశలు.. వరుణుడి అడ్డంకులు! ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జిల్లాలో నీరుగారింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల జాడ లేకపోవడం, తోడుగా కురిసిన భారీ వర్షాలు ఈ ప్రక్రియను ముందుకు సాగనివ్వలేదుసాక్షి, పాడేరు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శని, ఆదివారాల్లో నిర్వహించాల్సిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జిల్లాలో ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది పడిగాపులు కాయగా, ఓటర్ల స్పందన కరువైంది. తెరచుకోని పోలింగ్ కేంద్రాలు జిల్లాలోని అరకులోయ, పాడేరు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలు ఆదివారం వెలవెలబోయాయి. నిబంధనల ప్రకారం శని, ఆదివారాల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పాడేరులోని 318, అరకులోయలోని 306 పోలింగ్ కేంద్రాల వద్ద కనీసం సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. సచివాలయాల బాట పట్టిన సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఎవరూ రాకపోవడంతో, గ్రామాల వారీగా సచివాలయాల్లో బీఎల్వోలు, పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండి ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పనుల్లో నిమగ్నమయ్యారు. అరకులోయ మండలం చినలబుడు పంచాయతీలోని పోలింగ్ స్టేషన్లను మండల ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, బీఎల్వోలు పరిశీలించారు. కొంతమంది సిబ్బంది నేరుగాా గ్రామాల్లోని ఇళ్లకు వెళ్లి ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించారు. జోరు వాన.. ఓటర్ల నిరాసక్తత జిల్లావ్యాప్తంగా ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఓటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. వాతావరణం సహకరించకపోవడంతో ఓటరు నమోదు ప్రక్రియపై ఆసక్తి చూపలేదు. సచివాలయాలకు అతి తక్కువ మంది మాత్రమే వచ్చి దరఖాస్తులు సమర్పించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం వాతావరణం సహకరించకపోవడంతో ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని అధికారులు పేర్కొంటున్నారు. -
బాధితుడి పక్షాన న్యాయ పోరాటం చేస్తాం
నర్సీపట్నం: నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు పెట్టిన చిత్రహింసల్లో గాయపడిన మా పార్టీ నాయకులు, బాధితుడైన సుర్ల నూకరాజు పక్షాన న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పినట్టు నేను అసత్య ఆరోపణలు చేయలేదు, బాధితుడు చెప్పిన విషయాలనే మీడియాకు వెల్లడించానని గణేష్ తెలిపారు. డీఎస్పీ ఆహ్వానం మేరకు సీసీ పుటేజ్లు పరిశీలించేందుకు మాజీ ఎమ్మెల్యే ఆదివారం డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. డీఎస్పీ చూపించిన సీసీ పుటేజ్లను గణేష్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితుడు నూకరాజును 4.30 గంటలకు పోలీసులు స్టేషన్కు తీసుకువచ్చారన్నారు. ఎస్ఐ పెట్టిన చిత్రహింసలకు బాధితుడు లాకప్లో మొలతాడుతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడన్నారు. ఆ సమయంలో ఎస్ఐ, బాధితుడు మధ్య జరిగిన సంభాషణ ఆడియో సీసీ పుటేజ్ లేదన్నారు. 6.50 గంటల వరకు ఉన్న సీసీ పుటేజ్ను మాత్రమే చూపించారన్నారు. అదే రోజు బాధితుడిని రాత్రి 10 గంటల వరకు స్టేషన్లో ఉంచారన్నారు. 7.30 గంటల నుంచి 10 గంటల మధ్య సీసీ పుటేజ్ను బయట పెట్టాలని డీఎస్పీని కోరితే ఎస్పీ కార్యాలయంలో ఉందని సమాధానం ఇచ్చారన్నారు. దయచేసి 7.30 గంటల నుంచి 10 గంటల మధ్య సీసీ పుటేజ్లను బయట పెట్టి మా అనుమానాలను నివృత్తి చేయాలని డీఎస్పీని కోరాడం జరిగిందన్నారు. ఎస్ఐను వెనకేసుకువచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. సంఘటన 3వ తేదీన జరిగితే వారు చేసిన తప్పు కప్పించుకునేందుకు 4వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఆ రోజే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని గణేష్ ప్రశ్నించారు. తహసీల్దార్, వీఆర్వోలతో తప్పుడు ఫిర్యాదు చేయించి మా నాయకుడుపై తప్పుడు కేసు పెట్టారన్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తామని, అక్కడ కూడా న్యాయం జరగకపోతే నూకరాజుకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఆయన పార్టీ లీగల్సెల్ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర, మండల పార్టీ అధ్యక్షులు శానపతి వెంకటరత్నం, ఎంపీపీ బోళెం వెంకటేష్ ఉన్నారు. -
4.2 కిలోల శిశువు జననం
తల్లీబిడ్డ క్షేమం: సూపరింటెండెంట్ ధరణి ముంచంగిపుట్టు: ని స్థానిక సీహెచ్సీలో వైద్యులు అరుదైన ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించారు. మాకవరం పంచాయతీ లబడపుట్టు గ్రామానికి చెందిన గర్భిణి, పురిటి నొప్పులతో మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరింది. అప్పటి నుంచి సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ ధరణి పర్యవేక్షణలో స్టాఫ్ నర్సులు వసంత, నూకలమ్మ, వైద్య సిబ్బంది ఆమెకు నిరంతరం వైద్య సేవలు అందించారు. ఆరోగ్యంగా తల్లీబిడ్డ ఆదివారం ప్రసవ వేదన తీవ్రం కావడంతో, డాక్టర్ ధరణి నేతృత్వంలోని బృందం ఎంతో చాకచక్యంగా సాధారణ ప్రసవం (నార్మల్ డెలివరీ) చేశారు. ఈ ప్రసవంలో గర్భిణి ఏకంగా 4.2 కిలోల బరువున్న పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. సాధారణంగా శిశువులు 2 నుంచి 3 కిలోల బరువుతో జన్మిస్తుంటారని, కానీ 4.2 కిలోల బరువున్న శిశువు సాధారణ ప్రసవంతో జన్మించడం చాలా అరుదైన విషయమని డాక్టర్ ధరణి పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని ఆమె తెలిపారు. క్లిష్టమైన సమయంలో తమకు అండగా నిలిచి సుఖ ప్రసవం చేసిన వైద్యులకు, సిబ్బందికి బాలింత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఘనంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట
సాక్షి,పాడేరు: స్థానిక గిరికై లాస క్షేత్రంలోని ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. గత మూడు రోజుల పాటు విగ్రహానికి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నిర్ణీత ము హూర్తం ప్రకారం ప్రాణ ప్రతిష్ట ఘట్టం అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ నరసింగరావు దంపతులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం, ప్రధాన అర్చకులు రామం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ వేడుక అనంతరం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
అల్లూరి సేవలు చిరస్మరణీయం
● కలెక్టర్ నిశాంతి ● ఘనంగా జయంతి వేడుకలు సాక్షి,పాడేరు: గిరిజన హక్కుల సాధనతో పాటు స్వాతంత్య్ర పోరాట యోధుడిగా అల్లూరి సీతారామరాజు చరిత్రలో నిలిచారని కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. ఆయన జయంతి వేడుకలను శనివారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు.అల్లూరి విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదురించి, గిరిజనుల కోసం అలుపెరగని పోరాటాలు చేసిన అల్లూరి పిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన మహోన్నత వీరుడుగా నిలిచారన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో లోకేశ్వరరావు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. పాడేరు : అల్లూరి జయంతి వేడుకలను శనివారం ఐటీడీఏలో ఘనంగా నిర్వహించారు. ఇక్కడి కాంస్య విగ్రహానికి ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, సిబ్బంది పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు చూపిన పోరాట పటిమ, దేశభక్తి నేటి తరానికి ఎంతో ఆదర్శమన్నారు. మన్యం ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన రంప తిరుగుబాటు ఓ చరిత్ర అన్నారు. దేశ స్వాతంత్య్రంతో పాటు గిరిజనుల హక్కులు కోసం ఆయన చేసిన పోరాటాలు ఎంతో చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏవో హేమలత, ట్రైకార్ అసిస్టెంట్ సీతారామయ్య, ఐటీడీఏ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో.. పాడేరు: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కార్యాలయ ఆవరణలోని అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహానికి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వై.శృతి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలను, ఆయన పోరాట పటిమను కొనియాడారు. నేటి యువత అల్లూరి స్ఫూర్తిని, ఆయన చూపిన ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీపీఎస్ వింగ్ ఇన్స్పెక్టర్ ఫైడపు నాయుడు, స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్బీ, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్లు, సబ్–ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
పాడేరు: ఇన్సర్వీస్ (పనిలో ఉన్న) ఉపాధ్యాయులకు ’టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని, అందుకు అనుగుణంగా విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని ప్రభుత్వాలకు సిఫార్సు చేయాలని ఫ్యాఫ్టో జిల్లా చైర్మన్ రావుల జగన్మోహన్రావు కోరారు. ఈ మేరకు శనివారం ఫ్యాఫ్టో నాయకులు అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజరాణిని, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి చేయడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని, దీనివల్ల విద్యావ్యవస్థ కుంటుపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో టెట్ నిర్వహించాల్సి వస్తే, అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా వారి వారి సబ్జెక్టుల ప్రాతిపదికన పరీక్ష నిర్వహించాలని కోరారు. ఈ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాఫ్టో ప్రధాన కార్యదర్శి పలాసి కర్రన్న, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, బీటీఏ జిల్లా అధ్యక్షుడు వల్ల వెంకటరమణ, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రతినిధి కంబిడి నాగరాజు, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అంబిడి శ్యాం సుందర్, శెట్టి శాంతికుమారి, బాబురావు, సోంబాబు, రమ్యప్రియ, సూర్యమణి తదితరులు పాల్గొన్నారు.ఇన్సర్వీస్ టీచర్ల వినతి -
గందరగోళంగా ఓటరు సర్వే
● వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగాఉండాలి ● మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ముంచంగిపుట్టు: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్వే) కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఎస్టీ సెల్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రానికి వచ్చిన ఆమె, జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రతో కలిసి సర్వే నిర్వహణలో ఉన్న లోపాలు, తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, గ్రామాల్లో జరుగుతున్న ఈ సర్వే కార్యక్రమంపై వైఎస్సార్సీపీ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా తేడాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్వోలతో కలిసి బీఎల్ఏలు ప్రతి ఇంటికీ వెళ్లి, సర్వేను పారదర్శకంగా పర్యవేక్షించాలని కోరారు. ఎన్యుమరేషన్ ఫారాలను రెండు కాపీలు తీసుకుని, పూర్తి వివరాలు సేకరించాలని తెలిపారు. మరో పది రోజుల్లో సర్వే ముగిసే అవకాశం ఉందని, గిరిజన గ్రామాల్లో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని ఆమె పేర్కొన్నారు. ఎన్యుమరేషన్ ఫారాల్లో వివరాలు సరిగ్గా లేకున్నా, లేదా ఫారాలు తిరిగి ఇవ్వకపోయినా ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 2002కు ముందున్న ఓట్లను, 2024 ఓటర్ల జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్ చేయడం అత్యంత కీలకమని ఆమె గుర్తుచేశారు. -
పాడేరు సీఐగా రామారావు బాధ్యతలు స్వీకరణ
పాడేరు: పాడేరు సీఐగా ఎస్.రామారావు శనివారం ఉదయం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ సీఐగా పనిచేసిన డి.దీనబంధు విశాఖపట్నం రైల్వే విభాగానికి బదిలీ కావడంతో, శనివారం ఆయన తన విధుల నుంచి రిలీవ్ అయ్యా రు. ఆయన స్థానంలో అనకాపల్లి నుంచి పదోన్నతిపై ఎస్.రామారావు పాడేరువచ్చారు. బాధ్యతలు చేపట్టడానికి ముందుగా రామారావు స్థానిక మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఐగా బాధ్యతలు స్వీకరించిన రామారావును స్థానిక పోలీస్ సిబ్బంది, పలువురు అధికారులు కలిసి అభినందనలు తెలిపారు. -
దొండపూడిలో అభివృద్ధి పనులకు భూమిపూజ
రావికమతం: మండలంలోని దొండపూడిలో మల్టీ పర్పస్ హాల్, పార్క్, ప్రహరీ నిర్మాణం కోసం వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం.వి. ప్రణవ్గోపాల్, చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డా.వేపాడ చిరంజీవిరావు శనివారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఎంఆర్డీఏ నిధుల నుంచి సుమారు రూ.93 లక్షలతో ఈ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, పార్టీ అధ్యక్షుడు శంకరరావు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండనాయుడు, మండల టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు వెదురుపర్తి ఆచారి, ఎంపీటీసీ కొప్పాక లక్ష్మినాయుడు, రిజర్వాయర్ చైర్మన్ బంటు రామునాయుడు, పాతాళ చిరంజీవి, కోట నీలవేణీ గోవిందరావు, ఫాల్గుణ పాల్గొన్నారు. -
చేరేదెలా?
భోగాపురం భోగాపురం ఎయిర్పోర్టుకు మెట్రో అనుసంధానం అత్యవసరమన్న నీతిఆయోగ్ 2030 నాటికి 77 కిలోమీటర్ల లైన్ పూర్తి కావాలని స్పష్టీకరణ గ్లోబల్ బెంచ్మార్క్ ప్రకారం విశాఖకు 150 కిలోమీటర్ల నెట్వర్క్ అవసరం సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కలగా రూపుదిద్దుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే వేళ.. దానికి నగరం నుంచి సమర్థవంతమైన ప్రజారవాణా అనుసంధానం లేకపోవడం ప్రధాన ఆందోళనగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగి వేగంగా నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ విమానాశ్రయం ప్రాంతీయ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది. అయితే విమానాశ్రయానికి వేలాది మంది ప్రయాణికులు సులభంగా చేరుకునేలా వైజాగ్ మెట్రోను పూర్తి చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతిఆయోగ్ సైతం స్పష్టంగా ప్రస్తావించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ కార్యాచరణలో వేగం చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2030 లక్ష్యం.. ప్రస్తుతం సున్నా.. ఇటీవల విడుదలైన ’విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ గ్రోత్ హబ్ మాస్టర్ప్లాన్’లో నీతిఆయోగ్ విశాఖ నగర భవిష్యత్ రవాణా అవసరాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. 2028–2030 మధ్యకాలంలో కనీసం 77 కి.మీ మెట్రో నెట్వర్క్ను పూర్తి చేయాలని సూచించింది. అయితే ప్రస్తుతం నగరంలో ఒక్క కిలోమీటరు మెట్రో మార్గం కూడా అందుబాటులో లేకపోవడాన్ని నివేదిక ప్రస్తావించింది. అంతేకాదు.. ప్రపంచ స్థాయి ప్రమాణాలను పరిశీలిస్తే విశాఖ పరిమాణంలోని నగరానికి 100 నుంచి 150 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్వర్క్ అవసరమని పేర్కొంది. భవిష్యత్ జనాభా, పారిశ్రామిక విస్తరణ, విమానాశ్రయం, పోర్టు కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. కాగితాలపై ఫేజ్లు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్–1, ఫేజ్–2 డీపీఆర్లు అంటూ కేవలం కాగితాలపైనే కాలయాపన చేస్తోంది తప్ప క్షేత్రస్థాయిలో అడుగులు వేయడం లేదు. కేంద్ర అనుమతులు, నిధుల సమీకరణలో అవసరమైన చొరవ కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత వేలాది మంది ప్రయాణికులు, ఉద్యోగులు, సరుకు రవాణా వాహనాలు ఒకేసారి రోడ్లపైకి వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మెట్రో వంటి భారీ ప్రజారవాణా వ్యవస్థ లేకుంటే నగర ట్రాఫిక్పై తీవ్ర ఒత్తిడి పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీచ్ కారిడార్ నత్తనడకనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా విశాఖ నుంచి భోగాపురం వరకు ఆరు వరుసల బీచ్ కారిడార్కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం ప్రకటించారు. విశాఖ పోర్టు నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురాన్ని అనుసంధానించే ఈ 55 కిలోమీటర్ల ప్రాజెక్టుకు రూ.6,300 కోట్ల వ్యయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టు భూసేకరణ, రహదారి విస్తరణ అంశాల వద్దే నిలిచిపోయింది. స్థానికుల అభ్యంతరాలు, మారిన ప్రతిపాదనల కారణంగా ఇప్పటికీ డీపీఆర్ దశను దాటలేకపోయింది. ఐటీ అభివృద్ధికీ మెట్రో కీలకం విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలంటే ప్రధాన ఐటీ కేంద్రాలకు ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో మెట్రో కనెక్టివిటీ ఉండాలని నీతిఆయోగ్ స్పష్టం చేసింది. మెరుగైన ప్రజారవాణా లేకపోవడం ఐటీ రంగ విస్తరణకు అడ్డంకిగా మారుతోందని నివేదిక పేర్కొంది. మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులు, నిధుల మంజూరులో వేగం పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కూడా సూచించింది. మెట్రో ఇక లగ్జరీ కాదు.. అత్యవసరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా లేకపోయినా.. విశాఖ నగరానికి మెట్రో అత్యవసరం. ఒకవైపు సముద్రం, మరోవైపు కొండలతో సహజ పరిమితుల మధ్య విస్తరించిన నగరంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెట్రోతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణం తప్పనిసరి. ప్రస్తుతం నగరంలో బాటిల్నెక్ రోడ్లు అధికంగా ఉండటంతో దాదాపు అన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోంది. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన మాస్టర్ప్లాన్లు, డీపీఆర్ల రూపకల్పనలో స్థానికుల అభిప్రాయాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే ఆలస్యం జరుగుతోంది. ఇకపై డీపీఆర్లలో మార్పుల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలి. – యల్లపు రఘురామ్, వాణిజ్య నిపుణుడు -
సర్.. ఎక్కడ?
● సచివాలయాల వద్ద కనిపించని బీఎల్వోలు, సిబ్బంది ● ఆదేశాలు భేఖాతరు ● నేడు అన్ని సచివాలయల్లో అందుబాటులో సిబ్బంది..డీఆర్వో లోకేశ్వరరావు వెల్లడిసాక్షి,పాడేరు: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పాడేరు ఏజెన్సీలో గందరగోళంగా మారింది. శనివారం జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ సచివా లయాల్లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించలేదు. బోసిపోయిన కేంద్రాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏజెన్సీలోని మెజారిటీ సచివాలయాల వద్ద బీఎల్వోలు గానీ, ఇతర సిబ్బంది గానీ అందుబాటులో లేకపోవడంతో కేంద్రాలు వెలవెలబోయాయి. అరకు నియోజకవర్గ పరిధిలోని 306, పాడేరు నియోజకవర్గ పరిధిలోని 318 మొత్తం 624 పోలింగ్ బూత్లలో కనీసం తాళాలు కూడా తీయలేదు. ఈ బూత్లన్నీ ఎక్కువగా పాఠశాల భవనాల్లోనే ఉండటంతో, అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రమే కనిపించారు తప్ప, ఓటర్ల జాబితా సవరణ కోసం ఎవరూ హాజరు కాలేదు. అధికారుల వివరణ గ్రామసచివాలయాల్లో ఈ కార్యక్రమం జరగకపోవడంపై డీఆర్వో లోకేశ్వరరావును వివరణ కోరగా, కొన్ని బూత్ల పరిధిలో మాత్రం బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ వంటి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. సమయం తక్కువగా ఉండటం, మారుమూల ప్రాంతాల భౌగోళిక పరిస్థితుల వల్ల కొంత జాప్యం జరిగి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ, ఆదివారం మాత్రం అన్ని పోలింగ్ బూత్లలో ఎన్నికల సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉంటారని, ఓటర్లు తమ పేర్ల నమోదుకు లేదా మార్పులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
మన్యం వీరుడా మన్నించు!
నాతవరం: మన్నించు మన్యం వీరుడా! మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జయంతి సందర్భంగా అధికారులు కనీసం పూలదండ వేయకుండా వదిలేశారు. అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. నాతవరం మండలానికి పక్కనే ఉన్న గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో గల అల్లూరి పార్కులో విగ్రహం వద్ద స్పీకర్, కలెక్టర్, ఎస్పీ జిల్లాలో గల ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, జిల్లా అధికారులు అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాతవరం తహసీల్దార్, పోలీసు కార్యాలయాల ముందున్న అల్లూరి విగ్రహాన్ని కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ఈ విగ్రహాన్ని గతంలో ఇక్కడ పని చేసిన తహసీల్దార్ ఎస్.ఎస్ శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. అంతకు ముందు అల్లూరి జయంతి వర్థంతి వేడుకలు చిత్రపటం ఏర్పాటు చేసి నిర్వహించేవారు. దీనిని గమనించిన అప్పటి తహసీల్దార్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అందుబాటులో ఉంటుందని నిర్మించారు. అప్పట్లో ఇక్కడ అధికారులు జయంతి, వర్ధంతి వేడుకలు బాగానే నిర్వహించేవారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఇక్కడకు బదిలీపై వచ్చిన అఽధికారులు అల్లూరి జయంతి వర్థంతి వేడుకలు పూర్తిగా మరిచారు. -
టీడీపీ ప్రభుత్వమే శాశ్వతమనే భ్రమ వీడాలి
ఆస్పత్రి సూపరింటెండెంట్కు మాజీ ఎమ్మెల్యే హితవునర్సీపట్నం: శాశ్వతంగా టీడీపీ ప్రభుత్వమే ఉంటుందన్న భ్రమను వీడాలని స్థానిక ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్కు మాజీ ఎమ్మెల్యే హితువు పలికారు. చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకుడు నూకరాజును పరామర్శించేందుకు గణేష్ ఏరియా ఆస్పత్రి వెళ్లారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మించిన అదనపు భవన ప్రారంభోత్సవ శిలాఫలకం కనిపించకుండా ప్లాస్టర్ అతికించి ఉండడాన్ని గణేష్ గమనించి, తానే ప్లాస్టర్ తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.9 కోట్లతో అదనపు భవనాన్ని నిర్మించినట్టు చెప్పారు. భవనం ప్రారంభోత్సవ శిలాఫలకం కనిపించకుండా సూపరింటెండెంట్ సుధాశారద ప్లాస్టర్లు అతికింపజేశారన్నారు. ఆమె తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు పనులు చేయడం మంచిది కాదన్నారు. -
ఓటర్ల డిజిటలైజేషన్పై సమీక్ష
సాక్షి, పాడేరు: భారత ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్బీ జోష్ శనివారం పాడేరులో పర్యటించారు. జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్షించేందుకు వచ్చిన ఆయనకు, జిల్లా కలెక్టర్ టి. నిశాంతి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన ఎన్నికల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడేరు, అరకులోయ నియోజకవర్గాల్లో ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియపై ఆయన సమగ్రంగా తెలుసుకున్నారు. జిల్లాలోని భౌగోళిక పరిస్థితులు, ఓటర్ల నమోదులో ఎదురవుతున్న సవాళ్లు, క్షేత్రస్థాయిలో సిబ్బంది నియామకాలపై కలెక్టర్ వివరించారు. గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యతతో పాటు డిజిటల్ అక్షరాస్యత తక్కువగా ఉందని, మారుమూల గ్రామాల్లో మొబైల్, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం ఓటర్ల నమోదు ప్రక్రియకు ఆటంకంగా మారిందని కలెక్టర్ తెలిపారు. కష్టతరమైన కొండ ప్రాంతాలు, రవాణా సౌకర్యాలు లేకపోవడం, స్వల్ప జనాభాతో గ్రామాలు చెల్లాచెదురుగా ఉండటం, భాషా పరమైన సమాచార లోపాలు ఉన్నాయని వివరించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్లలో ఎన్నికల సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అన్ని అంశాలను ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్వో లోకేశ్వరరావు, ఆర్డీవో భుజంగరావు, అన్ని విభాగాల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
మ్యారేజ్ సర్టిఫికెట్ అత్యంత కీలకం..
అనకాపల్లి: మారుతున్న కాలంలో వివాహ సర్టిఫికెట్లు తప్పని సరిగా ఉండాలని ప్రభుత్వం నిబంధనలు చేపడుతుంది. ఇటీవల సీజన్లో పెళ్లిళ్లు కొత్త జంటలు వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీరి జీవితం కొత్తగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రభుత్వ పథకాలు రావాలన్నా, రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయించాలన్నా, పాస్పోర్టు, భూములకు ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పటికప్పుడు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతూ చివరికి సర్టిఫికెట్ కోసం ఇతరులపై ఆధారపడి ఎక్కువ మొత్తంలో సొమ్ములు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను ముందుగానే గుర్తించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికెట్ పొందితే వారికే మంచిది. మ్యారేజ్ సర్టిఫికెట్ వల్ల ఉపయోగాలు... పాస్పోర్టు అప్లికేషన్, బ్యాంక్ జాయింట్ అకౌంట్, కేంద్ర, రాష్ట్ర బలగాలల్లో విధులు నిర్వహిస్తున్న వారి సర్వీస్ రికార్డుల్లో పేర్లు మార్పుకునేందుకు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి వీసా ప్రొసెస్, వీటితో పాటు ప్రభుత్వ పథకాలు పాందేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నవ వధూవరులు పెళ్లి చేసుకునే ప్రదేశం ఆధారంగా గ్రామం అయితే గ్రామ సచివాలయం, పంచాయతీ కార్యాలయం, పట్టణ పరిధిలోవార్డు సచివాలయ, మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం వివాహ శుభలేఖ, జీలకర్ర బెల్లం తలపై పెట్టుకున్న వధూవరుల ఫొటో, మంగళసూత్రం కట్టేటప్పుడు వధూవరుల ఫొటో, పూలదండలు మార్పుకునే ఫొటోలు ఉండాలి. పెళ్లి కుమారుడు, కుమార్తె జనన ధ్రువీకరణ పత్రాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుల జెరాక్స్లను జతచేయాలి, వధూవరుల తరపున ఇద్దరు సాక్షులు, వారి ఆధార్ కార్డుల జెరాక్సులను గ్రామ, వార్డు సచివాలయం లేదా గ్రామ ప్రంచాతీ కార్యాలయంలోగానీ, మున్సిపాల్ కార్యాలయంలో అందజేయాలి. జత చేసిన ధ్రువీకరణ పత్రాలను జనన, మరణ రిజిస్ట్రేషన్ అధికారి పరిశీలించి సర్టిఫికెట్ను జారీ చేస్తారు, ఆలయాల్లో వివాహం చేసుకుంటే దేవదాయశాఖ ముందుగానే నిర్దేశించిన రుసుం చెల్లిస్తే అధికారులు రశీదులు ఇస్తారు, వాటి ఆధారంగానే వివాహానికి సంబందించిన ఇతర పత్రాలు, ఫొటోలు, సాక్షుల ఽధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. గృహాలు, కల్యాణ మండపాల్లో సంప్రదాయకంగా వివాహం చేసుకుంటే అందుకు తగ్గ అన్నిరకాలు పత్రాలు సమర్పించి దరఖాస్తులు చేసుకోవాలి. 90 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వివాహం జరిగిన 90 రోజుల్లో పంచాయతీ, గ్రామ సచివాలయం, మున్సిపాల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే తక్కువ ఫీజు ఉంటుంది. సాధారణంగా ఫీజు రూ.100 నుంచి 500 మాత్రమే ఉంటుంది. వివాహం జరిగిన 90 రోజులు దాటితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్లైన్ల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి, ఖర్చు అధికంగా అవుతుంది. – ఆశా జ్యోతి, ఎంపీడీవో, అనకాపల్లి -
భావితరాలకు స్ఫూర్తిప్రదాత అల్లూరి
● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్జల్లిపల్లి సుభద్ర ● ముంచంగిపుట్టులో ఘనంగాఅల్లూరి విగ్రహావిష్కరణముంచంగిపుట్టు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భావితరాలకు స్ఫూర్తిప్రదాత అని విశాఖ ఉమ్మడి జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. శనివారం మండల కేంద్రంలోని చెరువు ప్రాంగణంలో అల్లూరి 129వ జయంతి పురస్కరించుకుని, జెడ్పీ చైర్పర్సన్ దంపతులు సుభద్ర, మూర్తి తమ సొంత నిధులతో అల్లూరి విగ్రహన్ని ఏర్పాటుచేశారు. దీనిని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి ఆశయాలను సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో అల్లూరి జయంతిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ, స్వాతంత్య్ర సంగ్రామంలో అల్లూరి పోరాటం మరువలేనిదని, గిరిజన ప్రాంతాల్లో ఆంగ్లేయులను ఎదిరించి, ఆదివాసీలకు అండగా నిలవడంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. ప్రజల హక్కు ల పరిరక్షణ, న్యాయం కోసం నిలబడటం వంటి లక్ష్యాలు అందరికీ ఆదర్శనీయమని ఆయ న పేర్కొన్నారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే, ఎస్టీ సెల్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, బ్రిటీష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన గొప్ప యోధుడు అల్లూరి అని కొనియాడారు. ముంచంగిపుట్టులో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా యువతలో చైతన్యాన్ని నింపేందుకు సుభద్ర తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆమె అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ, అల్లూరి పోరాట పటిమ, ఆత్మస్థైర్యం నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే బ్రిటీష్ వారికి వణుకు పుట్టించిన తెలుగు వీరుడని, తెలుగు నేలకు ఆయన ఎంతో గౌరవాన్ని తెచ్చారని పేర్కొన్నారు. అల్లూరి త్యాగాన్ని గుర్తించి, గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టి, ఆయనకు సముచిత గౌరవం ఇచ్చారని గుర్తుచేశారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన జల్లిపల్లి సుభద్ర, మూర్తి దంపతులను పలువురు నేతలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ, ఎంపీడీవో ధర్మారావు, ఎంఈవోలు కృష్ణమూర్తి, త్రినాథ్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పద్మారావు, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, గణపతి, గిరిజన ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షులు బాబురావు, మాజీ సర్పంచ్ నరసింగరావు, అంబేడ్కర్ సాధన సమితి నాయకులు అనిల్, కొండపడాల్, గోవింద్, వైఎస్సార్సీపీ మండల నేతలు రాంప్రసాద్, పాపారావు, అర్జున్, గాసిరావు, దశరథ్, తిరుపతి మరియు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అలుపెరగని పోరాట యోధుడు అల్లూరి: ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పాడేరులోని తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.గిరిజన హక్కుల పరిరక్షణ,స్వాతంత్య్రం కోసం గిరిజనుల పక్షాన అల్లూరి చేసిన అలుపెరగని పోరాటాలను ఈసందర్భంగా ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, నాయకులు దశమూర్తి, రాజంనాయుడు, రామ్గోపాల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం మోత తప్పట్లే!
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే వాహనాల ద్వారా నిత్యావసర సరుకులు పొందిన గిరిజనులు, ప్రస్తుత కూటమి పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటికీ రేషన్’ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో, గత ఏడాది కాలంగా గిరిజనులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రేషన్ డీలర్ల దుకాణాల (డీఆర్ డిపోలు) నుంచి తమ గ్రామాలకు నిత్యావసర సరుకులను మోసుకెళ్లడానికి గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తు తం కురుస్తున్న వర్షాల వల్ల ఈ ఇబ్బందులు మరింతగా పెరిగాయి. జిల్లాలోని 486 రేషన్ డిపోల పరిధిలో ఉన్న సుమారు లక్షా 80 వేల మంది తెల్లరేషన్ కార్డుదారులు, ప్రతి నెలా బియ్యం బస్తాలను సొంతంగా మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. తమకు మళ్లీ ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయాలని గిరిజనులు కోరుతున్నారు. – సాక్షి పాడేరు -
పాడేరులో ‘సర్’.. 33 శాతమే!
● ప్రక్రియ పూర్తికి పదిరోజులే గడువు ● అధికారులకు సవాల్గా మారిన ఎన్నికల సంఘం ఆదేశాలు కొయ్యూరు: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సవరణ (సర్వే) ప్రక్రియను ఈనెల 14 లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, మైదాన ప్రాంతాలతో పోలిస్తే భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉండే జిల్లా మన్యంలో ఈ గడువులోగా పని పూర్తి చేయడం అధికారులకు సవాలుగా మారింది. ● మైదాన ప్రాంతాల్లో రవాణా, ఇతర సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుంది. కానీ, మన్యంలో పరిస్థితి అందుకు భిన్నం. ఒక ఆధార్ కార్డు జిరాక్స్ కావాలన్నా, పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకోవాలన్నా మైళ్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితి ఉంది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా బీఎల్వోలు ఇచ్చిన ఫారమ్లకు ఫోటోలు జతపరచాల్సి ఉండగా, మారుమూల గ్రామాల ప్రజలకు ఫోటోల కోసం 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం వెళ్లడం పెనుభారంగా మారింది. కొనసాగుతున్న నత్తనడక.. ప్రస్తుత లెక్కల ప్రకారం పాడేరు నియోజకవర్గంలో సగటున 30 శాతం మాత్రమే ప్రక్రియ పూర్తయింది. అందులో పాడేరులో 33 శాతం, కొయ్యూరులో 32.26 శాతం, మిగిలిన మండలాల్లో 28 శాతం చొప్పున మాత్రమే పురోగతి నమోదైంది. ముఖ్యంగా మంప (బూత్ నం: 84) పరిధిలోని ఆర్. డొడ్డవరం, గంగవరం, తిటిపిట్ల వంటి గ్రామాలు ప్రధాన కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఫారంలు అందజేసినా, ఓటర్లు ఫొటోలు, ఆధార్ పత్రాలను సేకరించి తిరిగి ఇచ్చే లోపే ఒక రోజంతా గడిచిపోతోంది. ● పని భారంతో పాటు పైస్థాయి అధికారుల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పరిస్థితిని గమనించిన తహశీల్దార్ ప్రసాదరావు, శుక్రవారం బూదరాళ్ల పంచాయతీలోని గరిమండ, వంతమర్రి, గొర్లెమెట్ట, కన్నవరం, పిట్లపాడు గ్రామాల్లో పర్యటించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అంగన్వాడీలు, కాఫీ బోర్డు లైజన్ వర్కర్ల సహాయం తీసుకుంటున్నారు. ఓటర్ల జాబితా సవరణలో స్థానికులు కూడా అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు. ఏది ఏమైనా, భౌగోళిక అవరోధాల మధ్య నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి అవుతుందో లేదో వేచి చూడాలి. పూర్తి చేయిస్తాం ఎన్యూమరేషన్ ఫారంలకు జతపరచాల్సిన ఫొటోలు,ఆధార్ జెరాక్స్లకు ఇబ్బందులు వస్తున్నాయి.వెంటనే వాటిని సమకూర్చుకోలేకపోతున్నారు. ఇక నెట్ వ్ర్క్ సమస్యల మూలంగా అప్లోడ్ చేసేందుకు ఇబ్బందులున్నాయి. అయినా అందరి సహకారంతో ఈనెల పది నాటికే ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించాం.అంగన్వాడీ వర్కర్ల సహకారం తీసుకుంటున్నాం. – కె. ప్రసాదరావు, తహసీల్దార్, కొయ్యూరు -
జిల్లాలో 182.8 మిల్లీమీటర్ల వర్షపాతం
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో గత మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.శుక్రవారం ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.పాడేరుతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లోను వర్షం సాయంత్రం వరకు కురుస్తూనే ఉంది. పాడేరు,అరకు వారపుసంతలకు వర్షం ఆటంకం కలిగించింది. సంతకు వచ్చిన గిరిజనులతో పాటు చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. పూర్తిస్థాయిలో జనసంచారం లేక సంతలు కళతప్పాయి. జిల్లాలో ముంచంగిపుట్టులో 48.6, పెదబయలులో 36.4, గూడెంకొత్తవీధిలో 20.4, పాడేరులో 14,8, అరకులోయలో 12.6, అనంతగిరిలో 12.2, డుంబ్రిగుడలో 10.4, హుకుంపేటలో 9.4, జి.మాడుగులలో 8.6, చింతపల్లిలో 6.4, కొయ్యూరు 3ఎంఎం చొప్పున జిల్లా వ్యాప్తంగా 182.8 మిల్లీమీటర్ల వర్షపాతం శుక్రవారం నమోదైంది. -
పీజీఆర్ఎస్కు రావాల్సిందే
● అధికారులకు కలెక్టర్ నిశాంతి ఆదేశం ● 117 వినతుల స్వీకరణ పాడేరు: ప్రతి శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇన్చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, పాడేరు ఆర్డీవో భుజంగరావులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 117 వినతులను ఆమె స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారుల నుండి వచ్చే అత్యవసర ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం మండల స్థాయిలో, శుక్రవారం జిల్లా స్థాయిలో నిర్వహించే ిపీజీఆర్ఎస్ కార్యక్రమాలకు అధికారులు సమగ్ర సమాచారంతో హాజరుకావాలని, ఒకవేళ హాజరు కాలేని పక్షంలో ముందస్తుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. అలాగే, అర్జీదారులు మీ కోసం కాల్ సెంటర్ నంబర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం అనంతరం, ప్రతి శుక్రవారం అర్జీదారులకు ఏర్పాటు చేసే ఉచిత భోజన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ నిశాంతి స్వయంగా ఫిర్యాదుదారులకు భోజనాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూ డీడీ పరిమళ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, డ్వామా పీడీ విద్యాసాగర్రావు, డీఆర్డీఏ పీడీ మురళి, ఎల్డీఎం మాతునాయుడు తదితర శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
మన్యం వీరుడు.. పాండ్రంగి చిట్టిబాబు!
పద్మనాభం: పద్మనాభం మండలం పాండ్రంగిలో పుట్టిన అల్లూరి సీతారామరాజు కాలక్రమంలో తెల్లదొరలకు సింహస్వప్నంగా మారిన విప్లవ వీరుడిగా ఎదిగారు. గిరిజనుల బాధను తన బాధగా భావించి, స్వాతంత్య్రం కోసం తుపాకీని చేతబట్టారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాల్ చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అడుగుజాడలు ఇప్పటికీ పాండ్రంగి నేలపై సజీవంగా నిలిచాయి. ప్రతి ఏటా మాదిరిగానే శనివారం ఆయన జయంతి సందర్భంగా అల్లూరి జన్మస్థలం పాండ్రంగి దేశభక్తి నినాదాలతో మార్మోగనుంది. చిట్టిబాబు నుంచి మన్యం వీరుడిగా.. 1897 జూలై 4న పాండ్రంగిలోని తన తాతగారింట వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు శ్రీరామరాజుగా జన్మించారు. అల్లూరిని చిన్ననాటి నుంచి ‘చిట్టిబాబు’గా పిలిచేవారు. బాల్యం పశ్చిమగోదావరి జిల్లా మొగల్లులో గడిచింది. నాలుగేళ్ల వయసు వరకు అక్కడే పెరిగారు. అయినప్పటికీ.. జన్మస్థలమైన పాండ్రంగి ఆయన జీవితానికి చిరునామాగా నిలిచింది. చిన్ననాటి నుంచే ఆధ్యాత్మికత, దేశభక్తి, అన్యాయాన్ని ఎదిరించే తత్వం అలవర్చుకున్న ఆయన.. గిరిజనులపై బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాన్ని చూసి సాయుధ పోరాటమే మార్గమని నిర్ణయించుకున్నారు. మన్యం ప్రాంతంలో గిరిజనులను ఏకం చేసి గెరిల్లా పోరాటానికి శ్రీకారం చుట్టిన అల్లూరి.. చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై వరుస దాడులతో బ్రిటిష్ పాలకులను వణికించారు. చివరకు 1924 మే 7న బ్రిటిష్ సైన్యానికి చిక్కి వీరమరణం పొందినా, ఆయన త్యాగం భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. పాండ్రంగిలో చిరస్థాయిగా జ్ఞాపకాలు అల్లూరి జన్మించిన ఇంటిని స్మారకంగా అభివృద్ధి చేశారు. గ్రామంలో ఆయన విగ్రహం, జన్మగృహంలోని ప్రత్యేక ప్రదర్శనలు, అల్లూరి సామాజిక వేదిక సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. జయంతి, వర్ధంతి వేళ రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి చేరుకుని నివాళులర్పించడం ఆనవాయితీగా మారింది. జయంతికి సర్వం సిద్ధం మన్యం వీరుడి జయంతి సందర్భంగా పాండ్రంగిలో వేడుకల నిర్వహణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జన్మగృహం, విగ్రహం వద్ద పుష్పాంజలి, నివాళి కార్యక్రమాలతో పాటు సాయంత్రం జయంతి సభ నిర్వహించనున్నారు. భరతమాత జాతర కూడా జరగనుండడంతో పాండ్రంగి గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. అల్లూరి ఉగ్గుతాగిన ఊరు పద్మనాభం ఇక్కడే జన్మించి.. తెల్లదొరల గుండెల్లో మరఫిరంగిలా మారి.. పాండ్రంగి కన్న విప్లవసింహం జయంతి నేడు ఇప్పటికీ చెక్కుచెదరని జ్ఞాపకాలు.. మన్యంవీరుడికి నీరాజనాలు.. -
గిరిజనేతరులకు పట్టాల జారీ నిలిపివేయాలి
● ఆదివాసీ జేఏసీ డిమాండ్ కొయ్యూరు: గిరిజన చట్టాలను గౌరవిస్తూ, షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనేతరుల భూములకు పట్టాలు ఇచ్చే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరుతూ శుక్రవారం ఆదివాసీ జేఏసీ నాయకులు తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆడాకుల, ఆర్. కొత్తూరు, బాలారం గ్రామాల్లో గిరిజనేతరులకు పట్టాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో భూ బదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు గిరిజనేతరులకు పట్టాలు జారీ చేస్తే, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజుబాబు, మండల జేఏసీ అధ్యక్షులు ఎస్.అశోక్ లాల్, ఉపాధ్యక్షులు కొర్ర తిరుపతి, నాయకులు శివకుమార్, పాటి శేఖర్, సునీల్, ప్రసాద్ పాల్గొన్నారు. -
ఓటర్ల నమోదులో నిర్లక్ష్యం వద్దు
జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజసీలేరు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల నమోదు ప్రక్రియను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని, ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని పాడేరు జేసీ శ్రీపూజ తిరుమణి హెచ్చరించారు. శుక్రవారం ఆమె గూడెం కొత్తవీధి మండలంలో పర్యటించి, బీఎల్వోలతో సమావేశమయ్యారు. రోజుకు కనీసం 100 ఫారాల చొప్పున ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.అరకు నియోజకవర్గంలో 34 శాతం, పాడేరు నియోజకవర్గంలో 30 శాతం ఫారాల సేకరణ పూర్తయిందని, ఈ నెల 14లోపు వంద శాతం ప్రక్రియ పూర్తి చేయాలని జేసీ స్పష్టం చేశారు. ఓటర్లు తమ బాధ్యతగా ఓటును నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. పర్యటనలో భాగంగా స్థానికులు పలు సమస్యలను జేసీ దృష్టికి తీసుకెళ్లారు:ఆర్వీ నగర్ నుంచి పాలగడ్డ వరకు గత రెండేళ్లుగా నిలిచిపోయిన రహదారి నిర్మాణ జాప్యంపై అధికారులను నిలదీస్తామని హామీ ఇచ్చారు.అంబులెన్స్ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడతామని, ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సీలేరు ఆసుపత్రిని సీహెచ్సీగా మార్చేందుకు ఇప్పటికే లేఖ రాశామని తెలిపారు.చిన్న గంగవరం వంతెన నిర్మాణం, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు, గృహ నిర్మాణాల్లో జెన్కో అడ్డంకులు వంటి అంశాలపై జేసీ సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అన్నాజీరావు, సీలేరు సెక్రటరీ పరశురాం పాల్గొన్నారు. ఓటర్ల సర్వే ప్రక్రియ వేగవంతం చింతపల్లి: జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఓటర్ల నమోదు, సర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీపూజ తిరుమణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె చింతపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, ఓటర్ల నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తప్పుల సవరణలు మరియు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలన్నారు. అనర్హులను తొలగించి, అర్హులను చేర్పించే క్రమంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రతి మండలానికి చెందిన సిబ్బంది తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, నిర్దేశిత గడువులోపు ఈ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సీతామహాలక్ష్మి, తహసీల్దారు త్రివేణి, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు. -
బూదరాళ్ల పాఠశాలకు తాళాలు
కొయ్యూరు: పాఠశాలకు ఉపాధ్యాయులు సరిగా రాకపోవడంతో విసిగిపోయిన బూదరాళ్ల గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఏమిటీ సమస్య? పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గణేశ్ సరిగా విధులు నిర్వహించడం లేదని, పాఠశాలకు వెళ్లకుండా, కనీసం సెలవు కూడా పెట్టకుండా గైర్హాజరవుతున్నారని తోటి ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంఈవో సింహాచలం విచారణ నిర్వహించి, గణేశ్ స్థానంలో మరో ఉపాధ్యాయుడు సత్యనారాయణను బూదరాళ్లకు నియమించారు. అయితే, సత్యనారాయణ కూడా కేవలం కొద్ది రోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లి, ఆ తర్వాత వెళ్లడం మానేశారు. దీంతో పాఠశాల పరిస్థితి మొదటికి వచ్చింది. తల్లిదండ్రుల డిమాండ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాత ఉపాధ్యాయుడు గణేశ్ తమకు వద్దు, పాఠశాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు పాఠశాల గేటుకు తాళం వేశారు. అధికారుల స్పందన ఈ ఘటనపై ఎంఈవో సింహాచలం స్పందిస్తూ.. విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయుడు గణేష్పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుడు సత్యనారాయణను వెంటనే పాఠశాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తామని, ఈ విషయమై ఇప్పటికే పూర్తి నివేదికను డీఈవోకు పంపినట్లు ఆయన తెలిపారు. ఉపాధ్యాయుడు రాకపోవడంతో తల్లిదండ్రుల నిరసన -
మన్యం వీరుడి స్మారకాలు వెలవెల
నేడు ముంచంగిపుట్టులో అల్లూరి విగ్రహ ఆవిష్కరణ మన్యం వీరుడు అల్లూరి జయంతి, వర్ధంతి వేడుకలంటే కేవలం పూలమాలలు వేసి, నివాళులు అర్పించి, ఫొటోలకు ఫోజులిచ్చే కార్యక్రమాలు మాత్రమేనా? మన్యం ప్రాంతంలో ఆయన పోరాట స్ఫూర్తిని సజీవంగా ఉంచాల్సిన స్మారక చిహ్నాలు నేడు నిధుల లేమితో, నిర్లక్ష్యంతో పర్యాటకుల ముందు వెక్కిరిస్తున్నాయి. శనివారం జయంతి సందర్భంగా అల్లూరి నడయాడిన మంప, రాజేంద్రపాలెం పార్కులదయనీయ స్థితిపై ప్రత్యేక కథనం. ● హామీల కేరాఫ్ అడ్రస్గా అల్లూరి గుర్తులు! ● నేడు విప్లవ జ్యోతి జయంతి కొయ్యూరు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.. స్వాతంత్య్ర సంగ్రామంలో సింహస్వప్నం. కానీ, నేడు ఆ మహనీయుడి స్మారకాలు మాత్రం అనాదరణతో కుమిలిపోతున్నాయి. ఏడాదికి రెండుసార్లు జయంతి, వర్ధంతి పేరుతో అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించడం.. అంతే! ఆ తర్వాత మళ్లీ మౌనమే. ఆచరణకు నోచుకోని హామీల మధ్య అల్లూరి నడయాడిన మంప, రాజేంద్రపాలెం ప్రాంతాలు నేడు పర్యాటకుల రాక కోసం ఎదురుచూస్తున్నాయి. అందని నిధులు.. ఆగిపోయిన పనులు అల్లూరి పోరాట స్ఫూర్తిని చాటిచెప్పేలా ఈ ప్రాంతాలను పర్యాటక కారిడార్గా మారుస్తామన్న ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. గతంలో రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు నిధులతో రాజేంద్రపాలెంలో ప్రహరీ వంటి పనులు కొంతవరకు జరిగాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరితో పాటు గంటం దొర, మల్లు దొర, బోనంగి పండు పడాల్ వంటి యోధుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కానీ, కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి రావాల్సిన నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో మిగిలిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మంపలో అస్తవ్యస్తం అల్లూరి పట్టుబడిన మంప ప్రాంతంలో పార్కు ఆవరణను కొంతవరకు అభివృద్ధి చేసినా, అక్కడ నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అల్లూరి స్నానం చేసే కొలనును సుందరీకరించినప్పటికీ, ప్రస్తుతం అది పిచ్చి మొక్కలతో నిండిపోయి కనుమరుగవుతోంది. కొలను మధ్యలో ధ్యానముద్రలో ఉన్న అల్లూరి విగ్రహం మాత్రమే సందర్శకులను ఆకట్టుకుంటోంది. అయితే, స్మారక స్తూపాలపై కనీసం అల్లూరి జనన, మరణ వివరాలు కూడా లేకపోవడం గమనార్హం. పోరాట చరిత్రను కళ్లకు కట్టేందుకు ఏర్పాటు చేసిన దృశ్య ఫలకాలు ఖాళీగానే దర్శనమిస్తూ, చారిత్రక సాక్ష్యాలు కనుమరుగవుతున్నాయనే భావనను కలిగిస్తున్నాయి. మళ్లీ కొత్త ఆశలు.. మరి ఫలితం దక్కేనా? ఈ ఏడాది మే 7న అల్లూరి వర్ధంతి సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్ మంప, రాజేంద్రపాలెం పార్కులను సందర్శించారు. ఒక్కో పార్కుకు రూ. కోటి చొప్పున మొత్తం రూ. రెండు కోట్లు కావాలని కేంద్ర మంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని, అలాగే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా నిధుల కోసం హామీ ఇచ్చారని మాధవ్ తెలిపారు. రాజకీయ వర్గాల నుంచి వస్తున్న ఈ తాజా హామీలైనా అమలుకు నోచుకుంటాయా? లేక పాత హామీల మాదిరిగానే కాలగర్భంలో కలిసిపోతాయా? అన్నది స్థానికుల ప్రశ్న. పర్యాటకులు వేల కిలోమీటర్లు దాటి వచ్చి ఇక్కడి దుస్థితిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారంటే, మనం చరిత్రను ఎంతలా విస్మరిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, మన్యం వీరుడి స్మృతి చిహ్నాలకు పూర్వవైభవం కల్పిస్తారని ఆశిద్దాం. జీతం ఇస్తున్నారు గిరిజన సాంస్కృతిక పరిశోధన సంస్థ మంప, రాజేంద్రపాలెం, కృష్ణదేవిపేట పార్కుల్లో ఉన్న వాచ్మెన్లకు జీతాలు ఇస్తుంది. దీంతో పార్క్లను కొంత వరకు శుభ్రంగా ఉంచుతున్నారు.ఈ ఏడాది జనవరి నుంచి నెల నెల జీతాలు ఇస్తున్నారు. – రాజుబాబు, వాచ్మెన్, అల్లూరి పార్కు, మంప -
ప్రశాంతి ఎక్స్ప్రెస్లో దోపిడీ.. నలుగురు అరెస్టు
తాటిచెట్లపాలెం(విశాఖ): భువనేశ్వర్–బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో ప్ర యాణికులను లక్ష్యంగా చేసు కుని దోపిడీలకు పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), విశాఖపట్నం డివిజన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న ప్రశాంతి ఎక్స్ప్రెస్లోని వివిధ బోగీల్లో నిందితులు దొంగతనాలకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ), విశాఖపట్నం సిటీ పోలీసులు, విజయవాడ డివిజన్ ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాల సహాయంతో కొద్ది గంటల్లోనే గోకుల్ థియేటర్ సమీపంలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.43,800 నగదు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను తుని జీఆర్పీ పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. హత్యాయత్నం కేసులో రౌడీషీటర్లకు నాలుగేళ్ల జైలు గాజువాక : గాజువాకలో 2017లో జరిగిన ఒక హత్యాయత్నం కేసులో ఇద్దరు రౌడీషీటర్లకు నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో నాలుగు నెలలపాటు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించింది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మెహర్నగర్కు చెందిన పీతల బాల భవాని భర్త అదే ప్రాంతానికి చెందిన పి.మహలక్ష్మినాయుడుకు రూ.5వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పు మొత్తం తిరిగి ఇవ్వాలని అడిగిన భవాని భర్తతో నిందితుడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడు. దీంతో 2017 జనవరి 2వ తేదీ రాత్రి నిందితులు పి.మహలక్ష్మినాయుడు, పి.గౌరీసాయి అలియాస్ గుర్రాల సాయి బాధితుడి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. స్టీల్ ఫోర్క్తో బాధితుడి కంఠ భాగంలో పొడిచి తీవ్రంగా గాయపరిచారు. దీంతో బాల భవాని గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివరాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితులకు జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. -
గారడీ
గణాంకాలఏజెన్సీలో ఓటర్ల నమోదు ప్రక్రియఅస్తవ్యస్తంగా సాగుతోంది. ఓవైపు ఎన్యుమరేషన్ ఫారాలు అందక గిరిజన ఓటర్లు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు అధికారులు మాత్రం అంతా సవ్యంగా జరిగిపోయిందని కమిషన్కు నివేదించి చేతులు దులుపుకుంటున్నారు. యంత్రాంగం అధికారిక లెక్కలు ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సాక్షి, పాడేరు: భారత, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఒకలా ఉంటే, జిల్లా ఎన్నికల యంత్రాంగం నివేదికలు మరోలా ఉండటం గమనార్హం. ఓటర్లకు ఫారాలు అందలేదని ప్రజలు ఆరోపిస్తుంటే, వంద శాతం పంపిణీ పూర్తయిందని అధికారులు కమిషన్కు నివేదికలు పంపడం చర్చనీయాంశంగా మారింది. నివేదికల్లోనే నూరుశాతం.. పాడేరు, అరకు నియోజకవర్గాల్లోని బూత్ లెవల్ అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమిస్తున్నా, ఓటర్ల నమోదు ప్రక్రియలో వేగం కనిపించడం లేదు. మారుమూల గిరిజన గ్రామాల్లోని అనేకమంది ఓటర్లు తమకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని వాపోతున్నారు. కానీ, జిల్లా ఎన్నికల యంత్రాంగం మాత్రం తమకు అందిన గణాంకాల ప్రకారం 4,99,752 మంది ఓటర్లందరికీ (అరకులో 2,48,665, పాడేరులో 2,51,087) ఎన్యూమరేషన్ ఫారాలు వంద శాతం పంపిణీ చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నివేదించింది. అధికారుల అబద్ధపు లెక్కలు ఇప్పుడు గిరిజన గ్రామాల్లో చర్చకు దారితీస్తున్నాయి. డిజిటలైజేషన్లోనూ వెనుకబడే.. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ వంద శాతం పూర్తయిందని గొప్పగా చెప్పుకుంటున్న జిల్లా యంత్రాంగం, ఓటర్ల డిజిటలైజేషన్ విషయానికి వచ్చేసరికి వాస్తవాలను బయటపెట్టింది. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 29.93 శాతం (1,49,558 మంది) ఓటర్ల వివరాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. ఇంకా 3,50,194 మంది ఓటర్ల డేటా పెండింగ్లోనే ఉంది. అలాగే, 80.72 శాతం మందికి (4,03,406 మంది) మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కాగా, మరో 96,346 మందికి ఇంకా మ్యాపింగ్ చేయాల్సి ఉంది. బీఎల్వోల తిప్పలు.. ఫారాలు పంపిణీ చేసిన తర్వాత, వాటిని తిరిగి సేకరించడంలో బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిశిఖర గ్రామాలకు పదేపదే వెళ్లడం సాధ్యం కాకపోవడంతో, మండల కేంద్రాలకే గ్రామ పెద్దల ద్వారా ఫారాలను, ఫొటోలను తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటరు సవరణలో నెలకొన్న ఈ అలసత్వంపై గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నత్తనడకన ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా నివేదికలు? గందరగోళంలో ఓటర్లు ఫారం అందలేదు ఓటర్ల సవరణకు సంబంధించి మా కుటుంబానికి ఇంత వరకు ఎన్నికల అధికారుల నుంచి ఫారం అందలేదు. తమ గ్రామంలో కొంతమందికే ఫారాలు ఇచ్చి మాకు మాత్రం ఇవ్వలేదు. – సీదరి టింబురు, జర్రిపాడు, డుంబ్రిగుడ మండలం -
ఏయూ దూరవిద్యలో సర్టిఫికెట్లు సుదూరం!
విశాఖ విద్య: ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించాల్సిన ఏయూ దూరవిద్యా కేంద్రం విద్యార్థుల పాలిట ఇబ్బందుల కేంద్రంగా మారుతోంది. మార్కుల జాబితాలు, ఒరిజినల్ డిగ్రీ(ఓడీ) సర్టిఫికెట్లు, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోలు(సీఎంఎం), బదిలీ ధ్రువపత్రాలు(టీసీలు) సకాలంలో అందించట్లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కింది స్థాయి సిబ్బందిని పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాళ్లరిగేలా ప్రదక్షిణలు దూరవిద్యా కేంద్రంలో యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు మార్కుల జాబితాలను సకాలంలో పోస్టు ద్వారా పంపించడం అధికారుల బాధ్యత. ఓడీలు, సీఎంఎంల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 10 నుంచి 15 రోజుల్లో పత్రాలు అందాల్సి ఉంటుంది. అయితే వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. నెలలు గడిచినా సర్టిఫికెట్లు అందకపోవడంతో దూరవిద్యా కేంద్రానికి పలుమార్లు తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. కార్యాలయానికి వెళ్లినా రేపు రండి, వారం తర్వాత రండి.. అనే సమాధానాలే వినిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. టీసీల జారీ పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమన్వయ లోపమే శాపం? దూరవిద్యా కేంద్రంలో ఏర్పడుతున్న సమస్యలకు సిబ్బంది మధ్య సమన్వయ లోపమే ప్రధాన కారణమని తెలుస్తోంది. సెక్షన్ సూపరింటెండెంట్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు నిర్లిప్తత రాజ్యమేలుతోంది. పనితీరును పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పనులు పేరుకుపోతూ, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నెలలు గడిచినా సర్టిఫికెట్లు అందని పరిస్థితి గత ఏడాది మార్చి, నవంబర్లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర ధ్రువపత్రాలు ఇప్పటికీ అందలేదని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షల దరఖాస్తుల కోసం ఈ సర్టిఫికెట్లు కొందరికి అత్యవసరం. అయినప్పటికీ వాటి జారీపై దూరవిద్యా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం. సమన్వయ లోపం ఉండదు. పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి, విద్యార్థులకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం. – ఆచార్య డి.అప్పలనాయుడు, డైరెక్టర్, ఏయూ దూరవిద్యా కేంద్రం -
అల్లూరిని విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం
అల్లూరి సీతారామరాజు జన్మస్థలమైన పాండ్రంగిలో ఆయన జ్ఞాపకార్థం నిర్మిస్తున్న మ్యూజియం పనులు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయాయని స్థానికులు, పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో మ్యూజియం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భవనాన్ని స్లాబ్ స్థాయి వరకు నిర్మించారు. అనంతరం ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం స్లాబ్, ఫ్లోరింగ్, తలుపులు, ద్వారబంధాలు, పెయింటింగ్ తదితర పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా వాటిని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టలేదు. అల్లూరి వంటి మహనీయుడి జ్ఞాపకాలను భావితరాలకు చేరవేసే మ్యూజియం నిర్మాణం పూర్తి కాకపోవడం పట్ల చరిత్రకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిధులు విడుదల చేసి మ్యూజియాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. -
స్టీల్ప్లాంట్ మృతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
పరవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎస్ఎంఎస్–1లో జూన్ 8న జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ.కోటి ప్రకటించి జ్యూడిషియల్ విచారణ జరిపించాలని ఎన్టీపీసీ కాంట్రాక్టు వర్క్ర్స్ యూనియన్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మెయిన్గేట్ వద్ద స్టీల్ప్లాంట్ ప్రమాద మృతులకు శుక్రవారం ఘన నివాళులర్పించారు.ఆయన మాట్లాడుతూ ప్రమాదాలకు పూర్తి బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రవేటీకరణ విధానాలే కారణమన్నారు. నాశిరకం ముడి సరుకును వాడడం, యంత్రాల మరమ్మతులు చేయకపోవడం, అనుభవం ఉన్న కార్మికులను తొలగించడం, కార్మికులపై విపరీతమైన పనిభారం మోపడం వంటి కారణాలే ఈ ప్రమాదానికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు రూ.కోటి చెల్లిస్తూ క్షతగాత్రులకు రూ.50 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు గోవిందరాజు, నాగేశ్వరరావు, నాయుడు, శ్రీను, సత్తిబాబు, అప్పారావు, రమణ తదితరులు పాల్గొన్నారు. -
11 మంది ఎస్ఐల బదిలీ
అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మంది ఎస్ఐలకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.కె.ఖాదర్ బాషాను వన్టౌన్ లా అండ్ ఆర్డర్ నుంచి ఎంవీపీ లా అండ్ ఆర్డర్కు, ఎం.శిరీష్కుమార్ను కంచరపాలెం క్రైమ్ నుంచి వన్టౌన్ లా అండ్ ఆర్డర్కు, జి.వెంకటరావును పద్మనాభం క్రైమ్ నుంచి అరిలోవ క్రైమ్కు, ఎస్.శ్రీకాంత్ను సీఎస్బీ నుంచి పీసీఆర్, ఎయిర్పోర్టు ట్రాఫిక్కు అటాచ్మెంట్పై, కొమర శ్రీనివాసరావును ఎయిర్పోర్టు ట్రాఫిక్ నుంచి సీఎస్బీకి బదిలీ చేశారు. పదోన్నతిపై విశాఖ రేంజ్ నుంచి సిటీ కమిషనరేట్కు వచ్చిన టి.కె.మూర్తికి పోలీస్ కంట్రోల్ రూమ్, పి.జనార్దనరావుకు సిటీ వీఆర్ (ఐటీ సెజ్–మధురవాడ అటాచ్మెంట్), టి.శ్రీనివాసరావుకు పద్మనాభం క్రైమ్, ఎన్.ధనుంజయ ఆచార్యులకు సీసీఎస్, ఎ.రహమాన్కు సీసీఎస్ (సీటీఆర్బీ అటాచ్మెంట్)లో పోస్టింగ్లు ఇచ్చారు. అలాగే, ప్రస్తుతం త్రీటౌన్ క్రైమ్ నుంచి మహిళా పోలీస్ స్టేషన్కు అటాచ్గా పనిచేస్తున్న ఎం.రాజారావును ఆయన అభ్యర్థన మేరకు మహిళా పోలీస్ స్టేషన్కు రెగ్యులర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావుకు బదిలీ మహారాణిపేట: మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావుకు బదిలీ అయింది. నెల్లూరు జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.బి.ఎస్.వర్దన్ను విశాఖ జిల్లా మత్స్యశాఖ జేడీ(ఇన్చార్జి)గా నియమించారు. శనివారం వర్దన్ పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. నేడు పాండ్రంగిలో అల్లూరి జయంతి మహారాణిపేట : పద్మనాభం మండలం పాండ్రంగిలో శనివారం అల్లూరి సీతారామరాజు 129వ జయంతి ఉత్సవాలు జరుగుతాయని కలెక్టరు ఎం.అభిషిక్త్ కిషోర్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ఆ గ్రామంలో అల్లూరి సీతారామరాజు ఇంటి నుంచి భరతమాత గుడి వరకు విద్యార్థులు, కళాకారులతో ర్యాలీ, అనంతరం బహుమతుల ప్రదానం జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
పెళ్లి మండపం వద్ద చోరీ
నర్సీపట్నం: నాతవరం పోలీసు స్టేషన్ పరిధి శృంగవరంలో ఓ పెళ్లి మండపం వద్ద నగదు బ్యాగ్ను చోరీ చేసిన వ్యక్తిని గంట వ్యవధిలో పోలీసులు అరెస్టు చేసి, రూ.5లక్షల నగదు, పావుతులం బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు అందించిన వివరాలు..నగదు కాజేసిన వ్యక్తి విద్యావంతుడు. ఇతను డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై చోరీలకు పాల్పడుతున్నాడు. శృంగవరంలో ఈ నెల 2వ తేదీ రాత్రి పైల వారి వివాహ వేడుక జరిగింది. వధువు రమణమ్మ సోదరి రజని వివాహ ఖర్చుల నిమిత్తం రూ.5లక్షల నగదు, పావుతులం బంగారు కాసు, ఒక సెల్ఫోన్, చీర బ్యాగ్లో పెట్టుకుని పెళ్లి మండపం వద్ద కూర్చుంది. తెల్లవారుజాము 3.40 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన పైల చిట్టిబాబు మండపంలోకి పరుగు పరుగున వచ్చి రజని వద్ద ఉన్న బ్యాగ్ లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు కేకలు వేసి వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. ఆమె వెంటనే 112కి కాల్ చేసింది. నాతవరం స్టేషన్ బీట్ సిబ్బంది కానిస్టేబుల్ మహేష్, హోంగార్డు సంజీవ్ అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ సిగ్నిల్ సాయంతో గ్రామ శివారులో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గడ్డి వాములో దాచిన నగదు బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. వేగంగా స్పందించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. -
నర్సీపట్నం మదిలో అల్లూరి స్మృతులు
నర్సీపట్నం: అల్లూరి సీతారామరాజు పోరాట స్మ ృతులు నేటికీ నర్సీపట్నంలో సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గిరిపుత్రల పక్షాన..తెల్లదొరల దాస్య శృంఖాలల నుంచి విముక్తి కలిగించేందుకు అల్లూరి సీతారామరాజు వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. గత చరిత్రకు సాక్షాలెన్నో నర్సీపట్నంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. దేశ స్వాతంత్య్ర ఉద్యమం స్మ ృతిచిహ్నాలతో అలనాటి బ్రిటిష్ పాలకుల పాలనను గుర్తుకు తెస్తుంది. ఈ పట్టణంలో అల్లూరి చేతులో హతమైన బ్రిటిష్ సైనికాధికారులైన హైవర్టు, కవర్టు సమాధులు, బ్రిటిష్ వారు నిర్మించిన ఏనుగుశాలలు నేటికీ పదిలంగా ఉన్నాయి. ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉన్న పలు బ్రిటిష్ కాలం నాటి భవనాలు గత చరిత్రను కళ్ల ముందు ఉంచుతాయి. ఆ భవనాలు రాతి కట్టడంతో రాజసం ఉట్టిపడే విధంగా చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ భవనాల్లో ప్రస్తుతం సబ్కలెక్టర్, తహసీల్దార్, సబ్ట్రెజరీ కార్యాలయాలు, సబ్జైలు నిర్వహిస్తున్నారు. సబ్ట్రెజరీ కార్యాలయం లోపల గల మెట్ల మార్గం గుండా భవనంపైకి వెళ్లవచ్చు. ఈ పైభాగంలో ప్రత్యేకంగా ఉన్న ఒక గదిలో అప్పట్లో జవాను ఒకరు కాపలా ఉండేవాడు. అప్పట్లో ఈ కార్యాలయంలో సమయాన్ని తెలియజేస్తూ గంటలు కూడా మోగించేవారు. మన్యం ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తూ వారి శ్రమను దోపిడీ చేసేవాడని పేర్కొంటున్న తెల్లదొర బాష్టియన్ అప్పుడు ఇదే భవనాన్ని కార్యాలయంగా చేసుకుని తహసీల్దార్గా పనిచేశారు.సబ్ కలెక్టర్ కార్యాలయం భవనం కూడా బ్రిటిష్ పాలకులు నిర్మించిందే. -
గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యం
● కలెక్టర్ నిశాంతి సాక్షి, పాడేరు: జిల్లాలోని గిరిజన రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. పాడేరులోని యూనియన్ బ్యాంక్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన రుణమేళాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు రుణ మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో 29 బ్యాంక్ బ్రాంచీల పరిధిలో 130 రుణమేళాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గిరిజన రైతుల వ్యవసాయ పెట్టుబడుల కోసం 7 శాతం వడ్డీకే పంట రుణాలు అందిస్తున్నామని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మాతునాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
మన్యంలో బాకై ్సట్ తవ్వకాల కుట్ర
● వ్యతిరేకంగా సభ్యుల నిరసన, తీర్మానం ● వాడివేడిగా గూడెంకొత్తవీధి మండల సర్వసభ్య సమావేశం గూడెంకొత్తవీధి: జిల్లాలోని బాకై ్సట్ నిల్వలను వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, ప్రైవేటు సంస్థల పేరుతో రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్నారని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆరోపించారు. ఇటీవల గూడెంకొత్తవీధి మండలం జర్రెల ప్రాంతంలో కొందరు వ్యక్తులు రహస్యంగా బాకై ్సట్ నమూనాలను తరలిస్తుండగా గిరిజనులు అడ్డుకున్నారని, అధికారుల పరోక్ష సహకారంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని వారు మండిపడ్డారు. గురువారం ఎంపీపీ బోయిన కుమారి అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. తొలుత ఎంపీడీవో రమణబాబు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. అనంతరం గాలికొండ ఎంపీటీసీ సభ్యుడు అంపురంగి బుజ్జిబాబుతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు స్పందిస్తూ, మన్యంలో బాకై ్సట్ తవ్వకాలు చేపట్టవద్దని, రహస్య సర్వేలను నిలిపివేయాలని కోరుతూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీపీ బోయిన కుమారి స్పందిస్తూ, గిరిజనుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మన్యంలో బాకై ్సట్ తవ్వకాలను జరగనివ్వమని స్పష్టం చేశారు. గిరిజనుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని, ఎంపీటీసీ సభ్యుల డిమాండ్ మేరకు తగిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, ప్రస్తుతం మన్యంలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్యాధికారులు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించాలని సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ కల్యాణ్, ఆర్అండ్బీ జేఈ భరత్, ఏవో ఇమ్మానుయేల్, ఏపీఓ రాంప్రసాద్, ఎంఈఓ నరసింగరావు, వ్యవసాయాధికారులు సురేష్, గిరిబాబు, వైద్యాధికారి శివరాం తదితర శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కారానికి కృషి
అనకాపల్లి: ఏపీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశం, నూతన కమిటీ ఎన్నిక ద్వారకా తిరుమలలో గత నెల 30వ తేదీన జరిగింది. అనకాపల్లి పట్టణం చవితిని వీధికి చెందిన విశ్రాంత డిప్యూటీ డీఈవో కె.వి.గౌరీపతిని అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు స్థానిక జార్జీక్లబ్ ఆవరణలో గురువారం గౌరీపతిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా గౌరీపతి మాట్లాడుతూ విద్యాశాఖలో విశాఖ ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో విధులు నిర్వహించి, పదవీ విరమణ చేయడం జరిగిందన్నారు. అప్పటి నుంచి నేటి వరకూ ఏపీ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ల్లో మండల, జిల్లా అధ్యక్షులుగా విధులు నిర్వహించి, ప్రస్తుతం రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సీనియర్ సిటిజన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు ఎన్.వి.వి.స్వామి, బి.కాశీవిశ్వేశ్వరరావు, ఎ.ఎన్.వి.అప్పారావు, మళ్ల చంద్రశేఖర్, జి.భీమేశ్వరరావు పాల్గొన్నారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌరీపతి -
వానాకాలం...జీవాలు పదిలం...
మాడుగుల: వర్షాకాలం ప్రారంభం కావడంతో మూగ జీవులకు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. జోరీగలు, దోమలు వల్ల గొంతువ్యాపు, గాలికుంటు, తదితర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ముందస్తు జాగ్రతలు వల్ల ఈ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చునని పశువైద్యాధికారులు చెబుతున్నారు. చిటికి వ్యాధి వర్షాకాలం ప్రారంభం కావడంతో పచ్చిక చిగురులు రావడంతో మేకలు, గొర్రెలు, వీటితో పాటు సూక్ష్మజీవులను తినడం వల్ల కడుపులోకి వెళ్లి విష పదార్థాలు విసర్జించడం వల్ల జీవాలు చెంగున ఎగిరి మృత్యువాత పడతాయి. కొన్నిసార్లు కాళ్లు బిగించి ఊపిరాడక మృతి చెందుతాయి. వర్షాకాలం ముందు ఈ చిటికి వ్యాధి ప్రబలకుండా నాలుగు నెలలు పైబడి గొర్రె పిల్లలకు నివారణ టీకాలు వేసుకోవాలి. గొంతువ్యాపు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో గొంతువ్యాపు (గురకవ్యాధి) ప్రమాదకరమైనది. ఈ వ్యాధి సోకిన జీవాలకు ఉష్ణోగ్రత పెరిగి గొంతువాపు వచ్చి శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఈ వ్యాధులు ప్రబ లకుండా వర్షాకాలం ముందు టీకాలు వేయించాలి. ముందస్తు వ్యాక్సిన్ వేయించాలి వర్షాల్లో పశువులను తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మేతకు తీసుకువెళ్లినపుడు తుప్పలు ఉన్న చోట పాము కాటుకు గురి కాకుండా జాగ్రత్త పడాలి. తగిన మోతాదులు మేత వేయాలి. ఉరుములు, మెరుపులు వచ్చినపుడు పశువులను పాకల్లో ఉంచాలి. సీజనల్గా ముందస్తుగా వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు వేయించాలి. –వి. చిట్టినాయుడు, ఏడీ మాడుగులసీజనల్ వ్యాధులపై తీసుకోవలసిన జాగ్రత్తలు వర్షాకాలంలో జీవాలను పాకల్లో ఉంచాలి చిత్తడి, బురద నేలలో జీవాలను తోలరాదు ముందుజాగ్రత్తగా యాంటీ బయోటిక్ వేక్సిన్లు వేసుకోవాలి ఎటువంటి వ్యాధి లక్షణాలున్నా సరే పశువైద్యులను వెంటనే సంప్రదించాలి -
ఇద్దరు యువతులను రక్షించిన లైఫ్గార్డ్స్
కొమ్మాది: ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండ బీచ్లో అలల ఉధృతికి కొట్టుకుపోతున్న ఇద్దరు పర్యాటకులను లైఫ్గార్డ్స్ రక్షించారు. వివరాలు.. కొమ్మాదికి చెందిన సీహెచ్ దీప్తి, యామిని అనే ఇద్దరు యువతులు గురువారం మధ్యాహ్నం సరదాగా గడిపేందుకు బీచ్కు వచ్చారు. కాసేపటి తర్వాత స్నానం చేసేందుకు సముద్రంలో దిగారు. అలల ఉధృతికి కొట్టుకుపోతున్న వీరిని అక్కడే విధులు నిర్వహిస్తున్న లైఫ్గార్డ్స్ గమనించారు. వెంటనే స్పందించి, వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మైరెన్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వారిని ఇంటికి పంపించారు. లైఫ్గార్డ్స్ను మైరెన్ సీఐ శ్రీనివాస్రావు అభినందించారు. -
అలంకార చేపల పెంపక కేంద్రం ప్రారంభం
సాక్షి,పాడేరు: కొత్త పాడేరు గ్రామంలో గిరిజన మహిళ కిముడు జానకి ఏర్పాటు చేసుకున్న ’పెరటి అలంకార చేపల పెంపక కేంద్రాన్ని కలెక్టర్ టి.నిశాంతి గురువారం ప్రారంభించారు. గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మత్స్యశాఖ ఈ యూనిట్ను మంజూరు చేసింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన, ధర్తీ అబా జన్జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకాల కింద ఈ యూనిట్ను ఏర్పాటు చేశారు. మొత్తం రూ. 1.97 లక్షల వ్యయం కాగా, అందులో 90 శాతం నిధులను రాయితీ రూపంలో కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని అధికారులు తెలిపారు. స్వయం ఉపాధి దిశగా గిరిజన మహిళలు అడుగులు వేయడం అభినందనీయమని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్ పి.శ్రీనివాసరావు, జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి జి.మురళీకృష్ణ, మత్స్యశాఖ అసిస్టెంట్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీకి ఎస్జీటీల వినతి
నర్సీపట్నం: అల్లూరి జిల్లాలో శాశ్వత స్థానికతతో పని చేయాలనే నిబంధనను సడలించేలా చూడాలని ఎస్జీటీలు గురువారం నర్సీపట్నం విచ్చేసిన ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడును కలిసి వినతిపత్రం అందజేసారు. మొదటి ప్రత్యామ్నాయంగా జోన్–1లో సెలెక్ట్ అయిన 2018–2025 ఉపాధ్యాయులను విభజనల్లో జోన్–2లో గల అల్లూరి జిల్లాకు బలవంతంగా పంపించడం జరిగిందని, విశాఖ, అనకాపల్లిలో జిల్లాలోనే ఉండేలా సర్దుబాటు చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్సీ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్ ఉన్నారు. -
బాటలో
కష్టాలప్రయాణంజీవనంఅవస్థలస్వాతంత్య్రం సిద్ధించి ఎనిమిది దశాబ్దాలు కావస్తోంది. దేశం అంగారక గ్రహం మీదకు దూసుకెళ్తోంది. కానీ, ముంచంగిపుట్టు మండలంలోని గొబ్బరపడ, బుడ్డపనస, డెంగం, జర్రెలపోదర్ గ్రామాల గిరిజనులకు మాత్రం నేటికీ రోడ్డు అన్నది తీరని కలగానే మిగిలిపోయింది. గురువారం ఉదయం... ఆ నాలుగు గ్రామాలకు చెందిన గిరిజనులు తమ నిత్యావసర సరుకుల కోసం, పంచాయతీ పనుల కోసం ఐదు కిలోమీటర్ల కాలిబాటను ఎంచుకున్నారు. చేతిలో సరుకులు, భుజాన బస్తాలతో కొండలు, కోనలు దాటుతూ వారు పడుతున్న అవస్థలు చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. ఒక్క గొబ్బరపడ నుంచి జర్రెలపోదర్ వరకు సుమారు 180 కుటుంబాలు, 600 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరందరికీ నేటికీ ఆధునిక రవాణా సౌకర్యం అందనంత దూరంలో ఉంది. ఈ ప్రాంత ప్రజల కష్టాలను గుర్తించి ప్రభుత్వం జోడిగుమ్మ నుంచి జర్రెలపోదర్ వరకు రహదారిని మంజూరు చేసింది. కానీ, పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. అటవీశాఖ అనుమతుల పేరుతోనో, అధికారుల నిర్లక్ష్యం వల్లనో ఆ రోడ్డు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఫలితంగా, గిరిజనుల జీవితాలు మళ్లీ మొదటికే వచ్చాయి. మాకు రవాణా సౌకర్యం కల్పించండి.. మమ్మల్ని మనుషులుగా గుర్తించండి.. అంటూ వారు విన్నవించుకుంటున్నా వినే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికై నా మా సమస్యను పట్టించుకోవాలని వారు కోరుతున్నారు. – ముంచంగిపుట్టు -
దళిత కాలనీ చుట్టూ స్టీల్ప్లాంట్ ఫెన్సింగ్
నిరసన తెలిపిన దళితులునక్కపల్లి: మండలంలో చందనాడ దళిత కాలనీ చుట్టూ ఆర్సిలర్మిట్టల్ స్టీల్ప్లాంట్ వారు ఫెన్సింగ్ వేయడం సమంజసం కాదంటూ గురువారం పలువురు దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో ఫెన్సింగ్ వేసే చోట నిరసన తెలిపారు. దళిత కాలనీ చుట్టూ ఉన్న భూములను స్టీల్ప్లాంట్కు కేటాయించడంతో యాజమాన్యం ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తోంది. ఇలా చేయడం వల్ల దళితకాలనీలో నివసించేవారు రాకపోకలు సాగించే వీలుండదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు అన్నారు. దళిత కాలనీని ఖాళీ చేయించి అక్కడ నివసించేవారిలో 18 ఏళ్లు నిండినవారికి ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇవేమీ చేయకుండా కాలనీ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రాకపోకలు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేయడంతో పాటు, ఫెన్సింగ్ పనులు అడ్డుకుంటామన్నారు. -
ఏపీఈఏపీసెట్లో సంజన ప్రతిభ
ముంచంగిపుట్టు: ఏపీఈఏపీసెట్–2026 ఫలితాల్లో మండలానికి చెందిన గిరిజన విద్యార్థిని గంపరాయి సంజన అద్భుత ప్రతిభ కనబరిచింది. జర్రెల పంచాయతీ దాశరిపుట్టు గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు గంపరాయి కృష్ణమూర్తి, బేబిరాణిల కుమార్తె సంజన, ఈ పరీక్షలో 2204వ ర్యాంకు సాధించింది. గిరిజన విద్యార్థిని మంచి ర్యాంకు సాధించడంతో గ్రామస్తులు, మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంజన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్నది నా లక్ష్యం. ఆ కలను సాకారం చేసుకు నేందుకు రేయింబవళ్లు శ్రమించాను. భవిష్యత్తులో వైద్యురాలిగా మారి, వెనుకబడిన గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేదే నా సంకల్పం. నీట్ ఫలితాల్లో కూడా అత్యుత్తమ ర్యాంకు సాధించి, మంచి వైద్య కళాశాలలో సీటు సంపాదిస్తానన్న నమ్మకం ఉంది అని ధీమా వ్యక్తం చేసింది. -
కృష్ణవంశీ.. గిరి యువతకు స్ఫూర్తి
చింతపల్లి: ఎటువంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే స్వయంకృషితో అగ్నివీర్గా ఎంపికై న కృష్ణవంశీ, గిరిజన యువతకు స్ఫూర్తిదాయకమని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా కొనియాడారు. గురువారం సాయంత్రం సబ్–డివిజనల్ పోలీస్ కార్యాలయంలో, అగ్నివీర్ శిక్షణ పూర్తి చేసుకుని ఉత్తరప్రదేశ్లో విధుల్లో చేరుతున్న పాంగి కృష్ణవంశీని ఏఎస్పీ ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. కొయ్యూరు మండలం బంగారంపేట గ్రామానికి చెందిన కృష్ణవంశీ, నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసించి ఈ ఘనత సాధించడం అభినందనీయమని అన్నారు. 2025 డిసెంబర్లో జరిగిన అగ్నివీర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఆరు నెలల శిక్షణ తర్వాత మీరట్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టడం గిరిజన ప్రాంత యువతకు గర్వకారణమని పేర్కొన్నారు. కృష్ణవంశీ తండ్రి రాజుబాబు సాధారణ రైతు కాగా, తల్లి ఆశా కార్యకర్తగా పనిచేస్తూ తన కుమారుడిని ఉన్నత స్థానంలో చూడాలనుకున్న కల నిజమైందని అన్నారు. ఏఎస్పీ ఇంకా మాట్లాడుతూ.. మన ప్రాంత గిరిజన యువతీ యువకులకు నేవీ, ఆర్మీ, ఎయిర్ఫోర్స్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి కీలక విభాగాల్లో ఉద్యోగాలు సాధించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అయితే, సరైన శిక్షణ, అవగాహన లేకపోవడం వల్లనే చాలామంది అవకాశాలను కోల్పోతున్నారు. యువత కృష్ణవంశీని ఆదర్శంగా తీసుకుని దేశసేవ కోసం సైన్యంలో చేరేందుకు కృషి చేయాలి. రక్షణ దళాల్లో చేరాలనుకునే నిరుద్యోగ యువత స్థానిక పోలీస్ స్టేషన్లలో సంప్రదిస్తే, వారికి ఉద్యోగ అవకాశాలపై తగిన సలహాలు, సూచనలు అందజేస్తాం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి, కొయ్యూరు సీఐలు సింహాచలం, శ్రీనివాసరావు, ఎస్ఐ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా -
ఇంటికి 5 నిమిషాల దూరంలో... గాల్లో కలిసిన స్నేహితురాళ్ల ప్రాణాలు
అగనంపూడి: వివాహ వేడుకకు ఆనందంగా వెళ్లిన ఇద్దరు స్నేహితురాళ్లు... ఇంటికి చేరుకోవడానికి మరో ఐదు నిమిషాల ప్రయాణమే మిగిలుండగా అనంతలోకాలకు చేరారు. కారు అదుపు తప్పి వంతెనను ఢీకొని కాలువలో పడిన ఘనటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయాలతో బయటపడ్డారు. వివరాలు.. గాజువాక కణితి రోడ్డులోని శివాజీనగర్(అజీమాబాద్)కు చెందిన లఖనాపురం మంగ (48), ఆమె స్నేహితురాలు బన్నా కుసుమ తమ కుటుంబ సభ్యులు, మరో 15 మందితో ఐదు కార్లలో అనకాపల్లిలో బుధవారం జరిగిన వివాహానికి హాజరయ్యారు. వేడుక అనంతరం గురువారం తెల్లవారుజామున తిరుగుముఖం పట్టారు. ఉదయం సుమారు 5.30 గంటలకు టోల్గేట్ సమీపంలోని ఉప్పర కాలనీ వంతెన వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వంతెనను బలంగా ఢీకొని కాలువలో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన మంగ(48) అక్కడికక్కడే మృతిచెందగా, కుసుమ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ప్రమాదంలో కారు డ్రైవర్, కుసుమ కుమారుడు బాలమురళీకృష్ణ, సొల్లేటి విజయలక్ష్మి, బాలమురళీకృష్ణ మేనకోడలు తాన్వి పట్నాయక్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారికి ఏప్లస్, కిమ్స్ ఐకాన్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఒక్క రోజు వ్యవధిలోనే.. బుధవారం ఉదయం వడ్లపూడి వంతెన వద్ద ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు సోదరులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరుసటి రోజు అదే సమయంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై ప్రమాదాల నివారణకు శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడికి ఎన్ఐటీ డాక్టరేట్
యలమంచిలి రూరల్: యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్రం విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్న కె. వెంకన్న తాడేపల్లిగూడెం ఎన్ఐటీ నుంచి డాక్టరేట్ పొందారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. క్లిష్టమైన, అత్యంత ఉపయుక్తమైన భార లోహాలైన నియోబియం, హాఫ్నియం,జెర్కోనియంలతో పాటు అల్యూమినియం, టిన్ లోహాల మిశ్రమాలపై నిర్మాణాత్మక, అయస్కాంత, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రానిక్, ధర్మో ఎలక్ట్రిక్, మాగ్నెటోకాలోరిక్ లక్షణాల ప్రథమ సూత్రాలపై పరిశోధన చేయడం అభినందించదగ్గ విషయంగా పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు. నిట్ అధ్యాపకుడు డాక్టర్ జె.కృష్ణమూర్తి పర్యవేక్షణలో డాక్టరేట్ పట్టా పొందడం గొప్ప విషయమని పలువురు ప్రశంసించారు. పరిశోధన పూర్తి చేసిన అధ్యాపకుడు వెంకన్న మాట్లాడుతూ భవిష్యత్తులో తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ సామర్థ్యం కలిగిన మెమొరీ పరికరాలు, అయస్కాంత సెన్సార్లు, కొత్త ఎలక్ట్రానిక్ పరికరాల అభివృద్ధికి తన పరిశోధన ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల పూర్వ భౌతికశాస్త్రం విభాగాధిపతి జగ్గారావు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. అభినందించిన ప్రిన్సిపాల్, అధ్యాపకులు -
బ్రిడ్జిలో ఇరుక్కుని ఒకరి మృతి
పూసపాటిరేగ: భోగాపురం మండలకేంద్రంలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. భోగాపురంలోని హనుమాన్ జంక్షన్ నుంచి ముక్కాం వైపు వెళ్తున్న డీజే సౌండ్ సిస్టం వ్యాన్పై టాప్లో కూర్చున్న ఇద్దరు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి టాప్, వ్యాన్ మధ్య ఇరుక్కుపోవడంతో విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం జంగులూరు గ్రామానికి చెందిన దుల్లా లోకనాథంఅక్కడికక్కడే మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన లాలం పార్థసారథి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని విజయనగరం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట గ్రామానికి తరలించారు. ఈ మేరకు భోగాపురం ఎస్ఐ వి.పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరొకరికి గాయాలు -
పని దినాల పెంపుతో ఆర్థిక భద్రత
కలెక్టర్ నిశాంతిసాక్షి, పాడేరు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకాన్ని కలెక్టర్ టి.నిశాంతి గురువారం చింతలవీధిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ కొత్త పథకం ద్వారా ఉపాధి పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడం జరిగిందని తెలిపారు. అలాగే, రోజువారీ కూలిని రూ. 312కు పెంచడం వల్ల కూలీలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర ఆర్థికాభివృద్ధిని, జీవనోపాధి భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని ఆమె వివరించారు. అంతకుముందు కలెక్టరేట్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ పథకం ప్రారంభోత్సవానికి సంబంధించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్న ప్రత్యక్ష ప్రసారాన్ని అధికారులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముద్రగడకు ధర్మశ్రీ పరామర్శ
యలమంచిలి రూరల్: అస్వస్థతకు గురై హైదరాబాద్ సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను యలమంచిలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వకర్త కరణం ధర్మశ్రీ గురువారం పరామర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి వెళ్లిన ఆయన ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ముద్రగడ గిరి, సింధు ఆస్పత్రి చైర్మన్ పార్థసారధిరెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే ముద్రగడ పద్మనాభం కోలుకుని స్వగ్రామం కిర్లంపూడి వస్తారని ధర్మశ్రీ అన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ పాల్గొన్నారు. -
హైవేలో అదుపు తప్పి కారు బోల్తా
ఎస్.రాయవరం: గోకులపాడు జంక్షన్లో జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయిన కారు అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టిన ఘటనలో అయిదుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. అడ్డురోడ్డు ట్రాఫిక్ పోలీసులు అందించిన వివరాలివి. విశాఖపట్నానికి చెందిన నవ దంపతులు చంద్రమౌళి, అభిలలతో కలిసి మరో ముగ్గురు అన్నవరం దేవస్థానంలో వ్రతం చేసుకుని విశాఖపట్నం వెళుతుండగా గురువారం గోకులపాడు జంక్షన్లో కారు బోల్తాపడింది. అయితే కారు మూడు పల్టీలు కొట్టినా కారులో ఉన్న అయిదుగురికి చిన్న గాయం కూడా కాకుండా బయటపడ్డారు. రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు వద్దకు అడ్డురోడ్డు ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన చేరుకుని కారులో ఉన్నవారిని స్థానికులు సహాయంతో బయటకు తీశారు. ఈ సంఘటనపై ఎస్.రాయవరం పోలీసులకు ఫిర్యాదు రాలేదని చెప్పారు. -
అటవీ అభివృద్ధికివిత్తన బంతులు
● సీలేరు అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణహిత కార్యక్రమం సీలేరు: అడవులను సంరక్షించడం, అటవీ విస్తీర్ణాన్ని పెంచడం ద్వారానే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని సెక్షన్ ఆఫీసర్ సతీష్ అన్నారు. సీలేరు అటవీ రేంజ్ పరిధిలోని ధారకొండ, దుప్పులవాడ బీట్లలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గురువారం భారీగా ’విత్తన బంతులను’ (సీడ్ బాల్స్) వెదజల్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా దుప్పులవాడ పంచాయతీ దెబ్బకోట గ్రామంలో 4 వేలు, గొందిపోలంలో 2 వేలు, అలాగే అమ్మవారి ధారకొండ బీట్ పరిధిలోని ఏనుగుబైలు ప్రాంతంలో మరో 4 వేలు.. మొత్తం 10 వేల విత్తన బంతులను సెక్షన్ ఆఫీసర్ సతీష్ ఆధ్వర్యంలో వెదజల్లారు. ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజన యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. అడవులను నాశనం చేయడం వల్ల అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. విత్తన బంతులను తయారు చేసి అటవీ ప్రాంతాల్లో జల్లడం ద్వారా అడవులను మరింత పచ్చదనంతో నింపవచ్చు.. అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుప్పులవాడ ఏబీవో ప్రకాష్, బీట్ ఆఫీసర్ లోవరాజు, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాల భవన నిర్మాణాలు వేగవంతం
పెదబయలు: సమగ్ర శిక్షా అభియాన్ పథకం ద్వారా చేపడుతున్న పాఠశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ స్వామి నాయుడు ఆదేశించారు. గురువారం ఆయన పెదబయలు మండలంలోని మారుమూల ప్రాంతాలైన జామిగుడ, జీలుగులపుట్టు ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు మరియు విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం పెదబయలు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–2లో నిర్మాణంలో ఉన్న ’పీఎం జన్మన్’ హాస్టల్ పనులను ఆయన తనిఖీ చేశారు. పనులను వేగవంతం చేయాలని సంబంధిత ఇంజనీర్లతో ఫోన్లో మాట్లాడి సూచనలు జారీ చేశారు. ఆ తర్వాత, సర్వేపల్లి రాధాకృష్ణన్ ’విద్యార్థి మిత్ర’ కిట్ల పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఆర్కేవీఎం యాప్లో విద్యార్థులకు అందించిన కిట్ల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి కొమ్ము కృష్ణమూర్తి, సమగ్ర శిక్షా సిబ్బంది సీఎంఓ ప్రకాష్, ఏపీవో ఎంఎస్ఎల్ పాత్రుడు, కూర్మారావు, సీఆర్పీలు పాల్గొన్నారు.ఏపీసీ డాక్టర్ స్వామి నాయుడు ఆదేశం -
అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత
కశింకోట: మండలంలోని బయ్యవరం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన కోటా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అనకాపల్లి పౌర సరఫరాల అధికారి లీలా గురువారం రాత్రి తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా ఒక పాడుబడిన ఇంట్లో 9 బస్తాల బియ్యం పట్టుబడ్డాయన్నారు. వాటిని తూకం వేయగా 480 కిలోలు ఉన్నాయని గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో బియ్యాన్ని ఉగ్గినపాలెం ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించామన్నారు. పేదలకు చెందాల్సిన ఉచిత బియ్యాన్ని కొనుగోలు చేయడం, అమ్మకాలు జరపడం, అక్రమ రవాణా జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఉన్నత లక్ష్యంతో చదవాలి
అరకు ఎంపీ తనూజరాణి సాక్షి,పాడేరు: గిరిజన విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను సాధించాలని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి పిలుపునిచ్చారు. విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్న హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామానికి చెందిన ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్థిని రేగం నీలిమను గురువారం పాడేరులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థిని రేగం నీలిమతో పాటు, ఇంటర్లో 982 మార్కులు సాధించిన బాకూరు గౌతమ్ శివరామకృష్ణ, పదో తరగతిలో 542 మార్కులు సాధించిన సమరెడ్డి శివకేశవనాయుడులను ఎంపీ సన్మానించి, బహుమతులు అందజేశారు. ప్రతిభావంతులకు ఎంపీ అభినందనలు ఈ సందర్భంగా ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్కే పరిమితం కాకుండా ఉన్నత విద్యలో రాణించాలని సూచించారు. గిరిజన యువతీ యువకులు ఉన్నత శిఖరాలను అధిరోహించడం వల్ల వారి కుటుంబాల్లోని పేదరికం తొలగిపోవడమే కాకుండా, గిరిజన సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సాధారణ గిరిజన కుటుంబానికి చెందిన రేగం నీలిమ కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయిలో బంగారు పతకం సాధించడం మన్యం ప్రాంతానికే గర్వకారణమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత చెట్టి వినయ్, అడ్డుమండ మాజీ సర్పంచ్ గుమ్మా శ్యాంసుందర్, న్యాయవాది బాకూరు కరుణాకర్, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి కంబిడి సుబ్రహ్మణ్యం, అడ్డుమండ గ్రామ పెద్దలు మజ్జి కై లాసం, సంపంగిబోయిన రామన్న, ఏడెలి రామ్ప్రసాద్, జంపరంగి వనజ తదితరులు పాల్గొన్నారు. -
జోరుగా పశువుల అమ్మకాలు
సాక్షి, పాడేరు: ఖరీఫ్ వ్యవసాయ సీజన్ జోరందుకోవడంతో, పాడేరు మండలం గుత్తులపుట్టు పశువుల సంతలో గురువారం సరికొత్త సందడి నెలకొంది. వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న గిరిజన రైతులు, తమ పొలాలను దున్నేందుకు అవసరమైన మేలు జాతి పశువుల కోసం సంతకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒడిశాతో పాటు విజయనగరం, పార్వతీపురం వంటి పొరుగు ప్రాంతాల నుంచి వ్యాపారులు ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న ఆరోగ్యకరమైన పశువులతో సంత కళకళలాడింది. రైతులకు నచ్చిన జత పశువులను ఎంచుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉండటంతో, అక్కడ గంటల తరబడి బేరసారాలు కొనసాగాయి. పశువుల పరిమాణం, బలిష్టత బట్టి, ఒక జత పశువుల ధర రూ. 30 వేల నుండి రూ. 65 వేల వరకు పలికింది. ఏడాది పొడవునా సాగుకు పునాది వేసే ఈ ఖరీఫ్ సీజన్ కోసం, రైతులు ఎంతో ఆశగా తమకు నచ్చిన పశువులను కొనుగోలు చేశారు. పశువులను కొనుగోలు చేసిన గిరిజన రైతులు, తమ పంట పొలాల్లో సిరులు పండించాలనే నమ్మకంతో, ఎంతో ఉత్సాహంగా పశువులను తమ గ్రామాలకు తోలుకువెళ్లారు.గుత్తులపుట్టు సంతలో సందడి -
కూలిన చెట్టు.. నిలిచిన రాకపోకలు
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఒనకఢిల్లీలో గురువారం మధ్యాహ్నం భారీ వృక్షం నేలకూలడంతో రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. స్థానిక డీఏవీ పాఠశాల సమీపంలో ఈదురుగాలులకు భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనివల్ల మాచ్ఖండ్ ప్రాజెక్టుకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే రోజు ఒనకఢిల్లీలో వారపు సంత కావడంతో వ్యాపారులు, ప్రజలు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడ్డారు. సమాచారం అందుకున్న ప్రాజెక్టు సివిల్ అధికారులు వెంటనే స్పందించి, రోడ్డుపై పడిన చెట్టును తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. అయితే, చెట్టు నేలకూలే సమయంలో సమీపంలోని విద్యుత్ స్తంభాలపై పడటంతో అవి దెబ్బతిన్నాయి. అలాగే విద్యుత్ వైర్లు సైతం తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రానికి చెందిన డిస్ట్రిబ్యూషన్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, తెగిపోయిన వైర్లను, దెబ్బతిన్న స్తంభాలను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యారు. -
‘ఉపాధి హామీ’ నిర్వీర్యానికి కుట్ర
పాడేరు రూరల్: ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో దానిని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని పీసా కమిటీ డివిజన్ అధ్యక్షుడు పాలికి లక్కు ఆరోపించారు. గురువారం మండలంలోని గురగరువు గ్రామంలో ఉపాధి కూలీలతో ఆయన సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాలికి లక్కు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేందుకే ప్రభుత్వం పేర్లు మార్పు చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వాలు పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని, ప్రస్తుత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం పేరు మార్చడం ద్వారా పని దినాలను తగ్గించడమే కాకుండా, ఉన్న ఉపాధిని కూడా లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పథకాన్ని నీరుగార్చే కుట్రలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, ప్రస్తుతం ఉన్న 150 పని దినాలను ఎటువంటి షరతులు లేకుండా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హాజరు విధానాన్ని రద్దు చేయాలని, రోజువారీ కూలీని రూ. 600కు పెంచి చెల్లించాలని కోరారు. ఇప్పటికే ఈ పథకానికి కేటాయించే నిధులను 90 శాతం నుంచి 60 శాతానికి కుదించి, కూలీల పొట్టగొడుతున్నారని ఆరోపించారు. ఆదివాసీ ఉపాధి కూలీలపై చిత్తశుద్ధి ఉంటే, పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని పాలికి లక్కు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూలీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పీసా కమిటీ డివిజన్ అధ్యక్షుడు పాలికి లక్కు -
ఆకులూరు పాఠశాలకు ఉపాధ్యాయుడి నియామకం
సీలేరు: బడి తెరిచినా రాని బడిపంతులు.. శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. సుమారు నెల రోజుల తర్వాత గాలికొండ పంచాయతీ ఆకులూరు పాఠశాలకు బుధవారం ఉపాధ్యాయుని నియమించి, తరగతులను పునఃప్రారంభించారు. ఈ విషయాన్ని గాలికొండ మాజీ సర్పంచ్ కాకూరి బుజ్జిబాబు బుధవారం విలేకరులకు తెలిపారు. పాఠశాల తెరిచినప్పటి నుంచి విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఉపాధ్యాయులు లేక విద్యార్థులు విద్యకు దూరమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని సమస్యలను పత్రికలు వెలుగులోకి తీసుకురావడం వల్లనే గిరిజనులకు న్యాయం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. -
నిత్య పోరాటం
స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్నా, టెక్నాలజీతో అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా, జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో మాత్రం జీవన పరిస్థితులు మారలేదు. నేటికీ కనీస మౌలిక సదుపాయాలు లేక గిరిజనులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా తమ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉందని గుమ్మరేవులు పంచాయతీ పరిధిలోని 30 గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీలేరు: గూడెం కొత్తవీధి మండలం, గుమ్మరేవులు పంచాయతీ పరిధిలోని సుమారు 30 గ్రామాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అగ్గిపెట్టి కొనాలన్నా, అంగన్వాడీ కేంద్రం నుంచి గుడ్లు తెచ్చుకోవాలన్నా, పాఠశాలకు వెళ్లాలన్నా కిలోమీటర్ల కొద్దీ కొండలు ఎక్కాల్సిందే. ఒడిశా, పోలవరం సరిహద్దుల్లో ఉన్న పులుసు మామిడి, పెంటకోట, శనగనూరు, దొరగొంది, పరమశింగవరం వంటి గ్రామాలకు రోడ్డు మార్గం లేదు. సుమారు 13 కిలోమీటర్ల ప్రయాణంలో నాలుగు కిలోమీటర్లు మాత్రమే మెటల్ రోడ్డు ఉండగా, మిగిలిన దూరం కొండ కోనల గుండా ప్రమాదకర ప్రయాణం చేయాల్సిందేనని స్థానికులు వాపోతున్నారు. ● ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంగా, గంజాయికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఈ గ్రామాల్లో, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భారీ మార్పులు వచ్చాయి. రోడ్ల నిర్మాణం, సచివాలయ భవనాలు, విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, సెల్ టవర్ల ఏర్పాటుతో మారుమూల గిరిజన గ్రామాల్లో వసతులు మెరుగుపడ్డాయి. దశాబ్దాలుగా చూడని అభివృద్ధిని అప్పట్లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేసి చూపిందని గిరిజనులు గుర్తు చేసుకుంటున్నారు. నేడు మళ్లీ మొదటికి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అభివృద్ధిని గాలికి వదిలేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. గత రెండేళ్లుగా కొత్త పనులు చేపట్టకపోగా, ఉన్న రోడ్లు, భవనాల నిర్వహణ కూడా కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు, గెలిచిన తర్వాత తమ కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ● విద్య, వైద్యం, సాగునీరు, కరెంటు.. ఇలా ఏ ఒక్క సౌకర్యం లేక అల్లాడుతున్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించాలని గిరిజన ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో తమ నిరసనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి అంటే తెలియదు మేము 30 ఏళ్లు గా ఇక్కడే ఉంటు న్నాం. పంచాయతీ కేంద్రానికి వెళ్లే 13 కిలోమీటర్ల మార్గంలో నా లుగు కిలోమీటర్లు రోడ్డు లేక కొండల మీదుగా కాలినడకన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నాం. అభివృద్ధి అంటే ఏంటో మాకు తెలియడం లేదు, అత్యవసరమైతే ఆసుపత్రికి వెళ్లే దారి కూడా లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు నిర్మించాలి. – పాంగి ఆనందరావు, పాంగి గోపాల్, గుమ్మరేవులు పంచాయతీప్రభుత్వం కళ్లు తెరవాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, మారుమూల ప్రాంతాల్లో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. కోట్ల రూపాయల నిధులు ఆరోగ్య శాఖకు వెళ్తున్నా, సరైన రోడ్లు లేక అంబులెన్స్ కూడా రాక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆసుపత్రులు, పాఠశాలలు, వంతెనలు లేక మా బతుకులు దుర్భరంగా మారాయి. ప్రభుత్వం కళ్లు తెరవాలి. – పాంగి నాగేశ్వరరావు, అధ్యక్షుడు, ఏపీజీఎస్ -
గిరిజన బిడ్డల ఆరోగ్యమే ధ్యేయం
● సికిల్సెల్ అనీమియాపై డాక్టర్ కె. కరుణ సమగ్ర పరిశోధన ● జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వివరాలు వెల్లడి డుంబ్రిగుడ: గిరిజన ప్రాంతాల్లో తరం మారుతున్నా, వారిని వెంటాడుతున్న ఒక ప్రధాన ఆరోగ్య సమస్య సికిల్ సెల్ అనీమియా. ఈ వ్యాధిపై గిరిజన యువతలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి, వారి ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా కమ్యూనిటీ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలు డాక్టర్ కమ్మిడి కరుణ చేసిన పరిశోధన ఇప్పుడు చర్చనీయాంశమైంది. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆమె తన పరిశోధనా విశేషాలను వెల్లడించారు. 11 ఏళ్ల సేవ.. పరిశోధనకు పునాది.. రంగరాయ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థిని అయిన డాక్టర్ కరుణ, వైద్య వృత్తిని కేవలం ఉద్యోగంగా చూడలేదు. పాడేరు ఏరియా ఆసుపత్రిలో ఐదేళ్లు, కిల్లోగూడ పీహెచ్సీలో 6 ఏళ్లు.. మొత్తం 11 ఏళ్ల పాటు మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆమె సేవలందించారు. గిరిజన ప్రజలు సికిల్ సెల్ ఎనీమియాతో పడుతున్న ఇబ్బందులను, అవగాహనా లోపాన్ని దగ్గరగా చూసిన ఆమె, ఈ సమస్యకు మూలాల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలనే పట్టుదలతో 2023లో కమ్యూనిటీ మెడిసిన్లో పీజీని ఎంచుకున్నారు. వెయ్యి మంది విద్యార్థులపై అధ్యయనం తన పరిశోధనలో భాగంగా గిరిజన ప్రాంతానికి చెందిన 4 ప్రముఖ విద్యాసంస్థల్లోని వెయ్యి మంది విద్యార్థులపై డాక్టర్ కరుణ విస్తృత అధ్యయనం నిర్వహించారు. ఈ సర్వేలో తేలిన గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. 93 శాతం మంది విద్యార్థులకు సికిల్ సెల్ అనీమియాపై కనీస అవగాహన లేదు. 6.9శాతం మంది విద్యార్థులు ఈ వ్యాధి వాహకాలుగా ఉన్నారు.1.7 శాతం మంది నేరుగా ఈ వ్యాధిగ్రస్తులుగా ఉన్నారని తేలింది. వ్యాధి నిర్మూలనకు ’పంచసూత్రాల’ ప్రణాళిక ఈ ఫలితాల ఆధారంగా గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ నిర్మూలనకు డాక్టర్ కరుణ ఐదు కీలక సూచనలు చేశారు. బాల్యం నుంచి కౌమారదశ, వివాహం వరకు ప్రతి దశలోనూ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి చేయాలని కరుణ సూచించారు.వైద్యశాఖతో పాటు విద్యా, గిరిజన సంక్షేమ శాఖలు కలిసి పనిచేయాలి. పాఠ్యప్రణాళికల్లో అవగాహన అంశాలను చేర్చాలని కోరారు. వ్యాధి గుర్తింపు నుంచి చికిత్స, పునరావాసం, కౌన్సెలింగ్ వరకు అన్నీ ఒకే చోట అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ‘జాతీయ సికిల్ సెల్అనీమియా నిర్మూలన మిషన్’ను చివరి లబ్ధిదారుడి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆశా కార్యకర్తలు, గిరిజన పెద్దలు, యువతను భాగస్వాములను చేస్తూ దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆమె సూచించారు. సికిల్ సెల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి పెళ్లిళ్లకు ముందు, గర్భధారణ సమయంలో సికిల్ సెల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసుకుంటే, రాబోయే తరాలకు ఈ వంశపారంపర్య వ్యాధి సోకకుండా అడ్డుకోవచ్చు. గిరిజన సమాజ ఆరోగ్య హక్కును కాపాడటానికి తన వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తా. – డాక్టర్ కమ్మిడి కరుణ, సికిల్సెల్ అనీమియా అధ్యయన వైద్యురాలు -
ఎడతెరిపి లేని వర్షాలు
● అల్లాడుతున్న గిరిజన గ్రామాలు ● తీవ్ర ఇబ్బందుల్లో రైతులు ముంచంగిపుట్టు: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలో జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. లక్ష్మీపురం పంచాయతీలో నిర్వహించే వారపు సంతకు వర్షం తీవ్ర ఆటంకం కలిగించింది. వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతుండటంతో మారుమూల గ్రామాల నుంచి గిరిజనులు సంతకు రాలేకపోయారు. సంత ప్రాంగణం అంతా బురదమయంగా మారడంతో పాటు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక సంతకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు మాకవరం, జోలాపుట్టు, దొడిపుట్టు, కర్రిముఖిపుట్టు, పనసపుట్టు పంచాయతీల్లోని పలు గ్రామాల్లో పంట పొలాలు భారీగా నీట మునిగాయి. దీంతో గిరిజన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్రిముఖిపుట్టు పంచాయతీ నందిమెట్ట గ్రామంలో పాంగి మొన్ని అనే గిరిజనుడి ఇంటి పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోగా, మట్టి గోడ కూలిపోయింది. అయితే, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన నష్టానికి ఆర్థికంగా దెబ్బతిన్నానని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు మొన్ని కోరారు. -
36 మంది బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు
● ఓటర్ల సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ● జేసీ తిరుమణి శ్రీపూజ హెచ్చరిక సాక్షి,పాడేరు: కేంద్ర,రాష్ట్ర ఎన్నికల కమిషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ తిరు మణి శ్రీపూజ హెచ్చరించారు. బుధవారం ఆమె కలెక్టరేట్లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ సర్వే రిపోర్ట్ను తక్కువగా నమోదు చేయడంతో పాటు ఓటరు ఎన్యూమరేషన్ ఫారంను డిజిటలైజేషన్ చేయడంలో కొంతమంది నిర్లక్ష్యం చేశారని తెలిపారు. జి.మాడుగుల మండలంలో 8మంది, కొయ్యూరులో 8 మంది బీఎల్వోలు, ఒక సూపర్వైజర్, గూడెంకొత్తవీధిలో 7, పాడేరులో 7, చింతపల్లిలో 5గురు చొప్పున మొత్తం 36మందిని గుర్తించి, నోటీసుల జారీకి ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎన్నికల అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్కు నివేదికలు పంపుతున్నామన్నారు. విధుల పట్ల అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. బూదరాళ్ల బీఎల్వోపై విచారణ కొయ్యూరు: బూదరాళ్ల బీఎల్వోగా విధులు నిర్వహిస్తున్న సచివాలయ డీఏ బాబురావు పనితీరుపై మండల ప్రత్యేకాధికారి, డీఎల్పీవో పీఎస్ కుమార్ బుధవారం విచారణ చేపట్టారు. జేసీ ఆదేశాల మేరకు ఆయన వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటరు నమోదు (సర్వే) ప్రక్రియలో బీఎల్వో పనితీరు సరిగా లేదని జేసీ గుర్తించారని, నిర్లక్ష్యం వీడకుంటే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారని తెలిపారు. ప్రతి బీఎల్వో రోజుకు కనీసం వంద ఎన్యూమరేషన్ ఫారంను ఓటర్లకు పంపిణీ చేసి, వాటిని వెంటనే డిజిటలైజేషన్ చేయాలని ఆదేశించారు. ఈ నెల 14తో ఓటరు నమోదు ప్రక్రియ ముగియనున్నందున, గడువులోగా ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 14 వరకు పంచాయతీ కార్యదర్శులు విధిగా తమ కార్యాలయాల్లోనే ఉండాలని, బీఎల్వోలకు సహకరించాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీడీవోప్రసాదరావు పాల్గొన్నారు. -
సర్ ప్రక్రియను వేగవంతం చేయండి
డుంబ్రిగుడ: గిరిజన గ్రామాల్లో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని పాడేరు డివిజన్ ఆర్డీవో భుజంగరావు ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలో పర్యటించారు. ఇందులో భాగంగా ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలను సందర్శించి, అక్కడ ఎదురవుతున్న సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణానికి తగిన రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పాఠశాల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టరుకు నివేదిస్తామని ఆయన తెలిపారు. అనంతరం, ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా అరకు పంచాయతీ కేంద్రంలో జరుగుతున్న పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఓటరు నమోదులో ఏమాత్రం అలసత్వం వహించకూడదని, ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఓటరు నమోదులో వారిని భాగస్వాములను చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కోటేశ్వరరావు, ఎంపీడీవో సీతయ్య, డీటీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. పాడేరు ఆర్డీవో భుజంగరావు -
గిరిజన బాలిక చిత్రహింసలపై విచారణ
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం దారకొండ గ్రామంలో తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై అమానుషంగా చిత్రహింసలకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సదరు బాలిక చేతులపై అట్లకాడతో వాతలు పెట్టిన ఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు, బుధవారం చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిత్ర దారకొండ గ్రామాన్ని సందర్శించారు. గ్రామ పెద్దల సమక్షంలో ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్పీ వివరాలు సేకరించిన ఆయన బాలికను చిత్రహింసలకు గురిచేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం బాధిత బాలికతో మాట్లాడి వివరాలు సేకరించారు. గ్రామంలోని పెద్దల నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. ఇప్పటికే ఈ దారుణానికి పాల్పడిన చర్చి పాస్టర్, ఆయన భార్య, ఇంటి పక్కనే ఉన్న మరో మహిళపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, ఆధారాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. మళ్లీ ఇలాంటివి జరగకూడదు : ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మైనర్ పిల్లలను కూలి పనులకు వాడుకోవడం చట్టరీత్యా నేరమని, ఎవరూ ఇలాంటి పనులకు వారిని ప్రోత్సహించవద్దని హెచ్చరించారు. బాలికను రెండు రోజుల్లో ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తామని, ఆమెకు మెరుగైన విద్య, ఆరోగ్యం అందేలా బాధ్యత తీసుకుంటామని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి డబ్బుకు ఆశపడి గిరిజనులు ఎవరూ గంజాయి రవాణా, పెంపకం వంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవద్దని ఏఎస్పీ కోరారు. ఒడిశా నుంచి ఆంధ్రా మీదుగా ఇతర రాష్ట్రాలకు సాగుతున్న గంజాయి రవాణాను అడ్డుకుంటున్నామని, ఇందులో గిరిజనులు భాగస్వాములు కావద్దని సూచించారు. చింతపల్లి సబ్–డివిజన్ పరిధిలో రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. ఎన్హెచ్5 రోడ్డు నిర్మాణం తర్వాత ప్రమాదాలు పెరిగి ప్రాణనష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు సీటు బెల్టు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సీలేరు పోలీస్ స్టేషన్ను సందర్శించి భద్రతపై సూచనలు చేశారు. నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్, ఎస్ఐ యాసిన్ తదితరులు పాల్గొన్నారు.వివరాలు సేకరించిన ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా -
మన్యం సహజసిద్ధఅందాలకు నిలయం
● ఎమ్మెల్సీ నాగేంద్రబాబు డుంబ్రిగుడ: మన్యం ప్రకృతి అందాలు భారతదేశానికే తలమానికగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ నాగేంద్రబాబు అన్నారు. బుధవారం ఆయన మండలంలోని అంజోడ సిల్క్ ఫారమ్, అరకు నర్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, వన సంరక్షణ సమితి సభ్యుల ఆధ్వర్యంలో మొక్కను నాటారు. అనంతరం గిరిజన మహిళలతో ముచ్చటించి, వారి థింసా నృత్యంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా, ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులు, స్థానిక గిరిజనులు పాల్గొన్నారు. -
పరిశోధకురాలినవుతా
మా అమ్మ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో వార్డెన్గా ఉన్నారు. నాన్న అడ్వకేట్. 2020–25 బ్యాచ్లో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివాను. మొట్టమొదట వర్సిటీ చూస్తే.. కాస్తా ఆందోళనగా అనిపించినా.. క్రమంగా రెండేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఫ్యాకల్టీ ఎంతో బాగా సహకరించి.. మమ్మల్ని ఇంతటి వాళ్లని చేశారు. ప్రస్తుతం కెమిస్ట్రీలో పీహెచ్డీ చేస్తున్నాను. భవిష్యత్తులో పరిశోధకురాలినవ్వాలన్నది నా ఆకాంక్ష. – ఉమ్మిడి ఇషిత, గోల్డ్మెడల్ విద్యార్థిని, విశాఖ -
గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి
సాక్షి,పాడేరు: జిల్లాలో అన్ని ఇంజనీరింగ్ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ టి.నిశాంతి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీఎం జన్మన్, డీఏ జూగా, ఎన్హెచ్ఎం, సీసీడీపీ నిధుల కింద మంజూరై, నిర్మాణదశలో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.అంగన్వాడీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గర్భిణి రక్షణ, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అన్ని అభివృద్ధి పనులు నాణ్యంగా జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, గిరిజన సంక్షేమశాఖ పాడేరు ఈఈలు డేవిడ్రాజ్, పంచాయతీరాజ్ ఈఈ కొండయ్యపడాల్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నాగేశ్వరరావు, ఆర్అండ్బీ ఈఈ సాగర్, ఇరిగేషన్ ఈఈ రాజేశ్వరరావు, హౌసింగ్ ఈఈ బాబునాయక్ పాల్గొన్నారు. కలెక్టర్ నిశాంతి -
నన్ను అనాథలా వదిలేశారు.. నా ఆశయాన్ని కాదు
నాకు ఏడాది వయసులోనే అమ్మ చనిపోయారు. నాన్న దివ్యాంగుడు కావడం వల్ల.. నన్ను పోషించలేక హైదరాబాద్లోని ఎస్ఓఎస్ అనాథ శరణాలయంలో చేర్పించారు. అప్పటి నుంచి నా ఆలనా పాలనా అంతా శరణాలయమే చూసుకుంది. ఉన్నత విద్యకు కావాల్సిన మొత్తం సహకారం అందించారు. నేను అనాథలా అయ్యానే తప్ప.. నా ఆశయం కాదని నిరూపించేందుకే పట్టుదలతో చదివాను. గ్రాడ్యుయేషన్, ఎంబీఏ ఇక్కడే పూర్తి చేశాను. ప్రస్తుతం జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. – జొన్నలగడ్డ దివ్య, గోల్డ్మెడల్ విద్యార్థిని, హైదరాబాద్ -
గర్భిణికి తప్పిన ప్రాణాపాయం
● 108 అంబులెన్సులో సుఖప్రసవం జి.మాడుగుల: మండలంలోని పెద్దలోచల్లి పంచాయతీకి చెందిన కిల్లో దేవకి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో, కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం జి.మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉందని (హైరిస్క్) గమనించిన వైద్యులు, మెరుగైన వైద్యం కోసం పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు 108 అంబులెన్స్లో పాడేరుకు తరలిస్తుండగా, మార్గమధ్యంలోని కె.కోడాపల్లి సమీపంలో ఆమెకు నొప్పులు తీవ్రమయ్యాయి. వెంటనే స్పందించిన ఈఎంటీ రామకృష్ణ, పైలట్ పవన్కుమార్ అంబులెన్స్ను రోడ్డు పక్కన నిలిపివేసి, అత్యవసర వైద్య సేవలు అందించి సురక్షితంగా ప్రసవం చేయించారు. దేవకి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబ్డి ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
నేడు కలెక్టరేట్లో రైతులకు ప్రత్యేక పీజీఆర్ఎస్
● కలెక్టర్ నిశాంతి సాక్షి,పాడేరు: జిల్లాలోని రైతుల సమస్యలు పరిష్కారం లక్ష్యంగా ఈనెల ఒకటోతేదీ బుధవారం ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ టి.నిశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాడేరు కలెక్టరేట్లో ఉదయం 11 గంటలకు రైతుల ప్రత్యేక పీజీఆర్ఎస్ ప్రారంభమవుతుందన్నారు. వ్యవసాయ, అనుబంధ విభాగాల హెచ్వోడీలు, అన్నిశాఖల జిల్లా అధికారులు తమ డివిజన్, మండల స్థాయి అధికారులతో కలిసి తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె ఆదేశించారు. జిల్లాలోని రైతులంతా పీజీఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. -
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
అరకులోయ టౌన్: ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధన నుంచి మినహాయింపు లభించేలా విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సిఫార్సు చేయాలని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగానికి ఫ్యాప్టో జిల్లా చైర్మన్ రావుల జగన్మోహన్రావు వినతిపత్రం అందజేశారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యేను ఆయన నివాసంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధనను రద్దు చేయాలని, లేదా వారికి ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని కోరారు. అలా కాని పక్షంలో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని, తద్వారా పాఠశాలల్లో విద్యాబోధన కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ పలాసి కర్రన్న, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శ్యామ్సుందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధనుర్జయ్, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, బీటీఏ జిల్లా అధ్యక్షుడు సలీం, ఇతర ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగానికి ఫ్యాప్టో నాయకుల వినతి -
వైద్యుల కొరత..కిక్కిరిసిన వార్డులు
● పెరుగుతున్న జ్వరపీడితుల సంఖ్య ముంచంగిపుట్టు: వాతావరణ మార్పులు, కురుస్తున్న వర్షాల కారణంగా గిరిజన గ్రామాల్లో జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. మంగళవారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి (సీహెచ్సీ) టైఫాయిడ్, మలేరియా, వైరల్ జ్వరాలతో బాధపడుతున్న రోగులు పెద్ద సంఖ్యలో చికిత్స కోసం వచ్చారు. ఆసుపత్రిలో కేవలం 30 పడకలు మాత్రమే ఉండటంతో వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వార్డులు రోగులతో నిండిపోవడంతో, గత్యంతరం లేక ఒకే బెడ్పై ఇద్దరు రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా రోగులు వైద్య సేవల కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా ఈ సీహెచ్సీని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని, ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పో స్టులను భర్తీ చేయాలని రోగులు కోరుతున్నారు. -
పదవీ విరమణ అధికారులకు ఘన వీడ్కోలు
తుమ్మపాల: పోలీసు శాఖలో దశాబ్దాల పాటు నిస్వార్థ సేవలందించి, క్రమశిక్షణతో కూడిన విధి నిర్వహణతో ఆదర్శంగా నిలిచిన ఏడుగురు అధికారులకు జిల్లా పోలీసు శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఎస్పీ ఎల్.మోహనరావు పదవీ విరమణ పొందిన అధికారులను, వారి కుటుంబ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వృత్తి ఎంతో ఒత్తిడితో కూడుకున్నదన్నారు. అటువంటి బాధ్యతాయుతమైన రంగంలో 35 నుంచి 40 ఏళ్ల పాటు నిబద్ధతతో పనిచేయడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో వీరు అందించిన సేవలు శాఖకు గర్వకారణమన్నారు. పదవీ విరమణ పొందిన అధికారులు ఎస్ఐ వి.వెంకటరమణ (కమ్యూనికేషన్), ఏఎస్ఐ పి.వెంకటేశ్వరరావు (నాతవరం పి.ఎస్), ఏఎస్ఐ పి.కేశవరావు (వి.మాడుగుల పి.ఎస్), ఏఎస్ఐ బి.అప్పారావు (కొత్తకోట పి.ఎస్), హెచ్సీ పి.కొండల రావు (నర్సీపట్నం టౌన్ పి.ఎస్), హెచ్సీ ఆర్.రాఘవులు, హెచ్సీ హెచ్.టి.నాయుడు (జిల్లా ఆర్మడ్ రిజర్వ్)లను సన్మానించి విశ్రాంత జీవితం కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కె.రవికుమార్, ఏఓ. సిహెచ్.తిలక్ బాబు, ఇన్స్పెక్టర్లు బాల సూర్యారావు, లక్ష్మి, వెంకటచిట్టి, రామకృష్ణారావు, మన్మథరావు, రమణమూర్తి, సేనం రమేష్, పిల్లా రమేష్, సీనియర్ అసిస్టెంట్ అప్పలరాజు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
స్కూటీని ఢీకొట్టిన లారీ
యలమంచిలి రూరల్ : విధి నిర్వహణలో భాగంగా జిల్లా పంచాయతీ కార్యాలయానికి వెళ్తున్న పంచాయతీ కార్యదర్శిని రోడ్డు ప్రమాదం కబళించింది. పంచాయతీ కార్యదర్శి నడుపుతున్న స్కూటీని యలమంచిలి మండలం మర్రిబంద సమీపంలో లారీ ఢీకొట్టిన ప్రమాదంలో అతను అక్కడికక్కడే దుర్మరణం పొందాడు. 16వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపిన వివరాలివి. పాయకరావుపేటకు చెందిన కిల్లాడ బాబూరావు(52) నక్కపల్లి మండలం ఎన్.నర్సాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. అనకాపల్లిలో ఉన్న జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి స్కూటీపై వెళ్తుండగా యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్రిబంద వద్ద వెనుక నుంచి వస్తున్న ఏపీ39యూజెడ్ నంబరు గల లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదంలో రోడ్డుపై పడిపోవడంతో తల, శరీర భాగాలకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాదస్థలంలోనే పంచాయతీ కార్యదర్శి బాబూరావు ప్రాణాలు విడిచారు. అతని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఊహించని విధంగా పంచాయతీ కార్యదర్శి రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శవపంచనామా, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సమాచారం తెలియడంతో యలమంచిలి మార్చురీ వద్దకు పెద్ద సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులు చేరుకుని బాబూరావు కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. -
పరారీలో ఉన్న గంజాయి నిందితుడు అరెస్ట్
రోలుగుంట : గంజాయి కేసు నమోదై నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న కొర్రా ప్రసాద్ను గాలించి పట్టుకుని అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ పి.రామకృష్ణారావు మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం పెదబయిల గ్రామానికి చెందిన కొర్రా ప్రసాద్ రోలుగుంట పోలీస్ స్టేషన్లో 155/2022 గంజాయి కేసులో 4.ఎ నిందితుడుగా ఉండి నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు అతనిని గాలించి పట్టుకొని అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరుపరిచి, జైలుకు తరలించడం జరిగిందని ఎస్ఐ విలేకరులకు తెలిపారు. -
కొండపై సిగ్నల్!
అడవిలో టవర్లు..● అలంకారప్రాయంగా మారిన టవర్లు ● గిరిజనుల అవస్థలు వర్ణణాతీతం ● అధికారులకు విన్నవించినా చర్యలు శూన్యం సాక్షి, పాడేరు: గిరిజన ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు 4జీ, 5జీ సేవలు అందించే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం రూ.వేల కోట్లతో సెల్ టవర్ల నిర్మాణా నికి శ్రీకారం చుట్టింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పాడేరు జోన్లో 416, అరకులోయ జోన్లో 354 టవర్ల నిర్మాణా నికి చర్యలు చేపట్టగా, పనులు చురుగ్గా సాగాయి. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనుల్లో జాప్యం నెలకొంది. చాలా చోట్ల టవర్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో అవి కేవలం అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. సౌకర్యం లేక ఇబ్బందులు అరకులోయ జోన్ పరిధిలోని ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో నిర్మించిన 12 బీఎస్ఎన్ఎల్ టవర్లకు సిగ్నల్ వ్యవస్థను అందుబాటులోకి తేవడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనివల్ల గిరిజనులు కమ్యూనికేషన్ పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పనులకు ‘ముఖ హాజరు’ తప్పనిసరి చేయడంతో, సిగ్నల్ కోసం గిరిజనులు ఎత్తయిన కొండలు ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం డుంబ్రిగుడ మండలం సొవ్వ పంచాయతీలోని కమలబంద, కరకవలస, చమండపాడు, కిరిడివలస, గసబ పంచాయతీలోని మొర్రిగుడ, సువ్వగుడ, గొందివలస; సాగర పంచాయతీలోని టిక్కిలిబెడ్డ, పనసబంద తదితర గ్రామాల గిరిజనులు, తమ ప్రాంతాల్లోని టవర్లకు సిగ్నల్ సౌకర్యం కల్పించాలని విశాఖలోని నెట్వర్క్ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నారు. వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు ఆందోళనలు చేపట్టినా ఫలితం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్య, వైద్యం, ప్రభుత్వ పథకాలకు అవసరమైన సమాచారం కోసం కూడా తాము నరకయాతన పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి టవర్లను వినియోగంలోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వినతులిచ్చినా స్పందన కరువు డుంబ్రిగుడ మండలంలోని సొవ్వా, సాగర, గసబ పంచాయతీల్లో గత రెండేళ్లుగా సెల్టవర్లు నిరుపయోగంగా ఉన్నాయి.సెల్ సంకేతాలు అందుబాటులోకి తెచ్చి మారుమూల గ్రామాల గిరిజనులకు మేలు చేయాలని అనేక సార్లు విశాఖలోని బీఎస్ఎన్ఎల్ అధికారులకు వినతిపత్రాలు అందజేశాం. అయినా పట్టించుకోవడం లేదు. సిగ్నల్ వ్యవస్థ లేని సెల్ టవర్లు గ్రామాల్లో అలంకార ప్రాయంగా మారాయి. అత్యవసర, ఉపాధి పనుల ముఖ హాజరుకు కొండెక్కాల్సి వస్తోంది. – వంతాల గురునాయుడు, సామాజిక కార్యకర్త, కమలబంద, డుంబ్రిగుడ మండలం -
కుక్కల దాడిలో ఐదుగురికి గాయాలు
గొలుగొండ: స్థానిక పీహెచ్సీ పరిధిలో మంగళవారం కుక్కల దాడిలో ఐదుగురు గాయపడ్డారు. చిన్నయ్యపాలెం, జోగుంపేట గ్రామాలకు చెందిన రాజు, నూకరత్నం, తలుపులతో పాటు మరో ఇద్దరిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరికి గొలుగొండ పీహెచ్సీలో చికిత్స చేసినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. గడిచిన వారం రోజుల్లో మండలంలో చీడిగుమ్మల, కృష్ణదేవిపేట, గొలుగొండ పీహెచ్సీల పరిధిలో కుక్కలదాడిలో 22 మంది గాయపడ్డారు. పశువులు మృతి మాకవరపాలెం: మండలంలోని జి.కోడూరు కుక్కల సంచారం అధికమై ఇటీవల పశువులు, మనుషులపై దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. వీటి దాడిలో వేగి రాఘవేంద్రరావు, బొడ్డేటి పరిదేశినాయుడు, నగిశెట్టి రమణ, కర్రి గోవింద, కొండా సాయిబాబాకు చెందిన పాడి రైతుల పశువులు మృతి చెందాయని మంగళవారం తెలిపారు. మరికొన్ని గాయపడ్డాయన్నారు. వేగి రామునాయుడు, మళ్ల గోవిందలు కూడా కుక్కల దాడిలో గాయపడ్డారన్నారు. పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రసరమ్యంగా లవకుశ నాటక ప్రదర్శన
మునగపాక : మండలంలోని తోటాడలో ఏర్పాటు చేసిన సురభి నాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ప్రదర్శించిన లవకుశ పౌరాణిక నాటకం అందరినీ ఆకట్టుకుంది. శ్రీ గౌరీ నాట్యమండలి ఆధ్వర్యంలో శ్రీ భానోదయ సురభి నాట్యమండలి వారు ప్రదర్శించిన ఈ నాటకం ఆహుతులను అలరించింది. నాటకంలోని నటీ నటులతో పాటు సెట్టింగ్లు, గ్రాఫిక్స్ ఆకట్టుకున్నాయి. నాటకాన్ని తిలకించేందుకు కళాభిమానులు భారీగా తరలివచ్చారు. కాగా నాటకాన్ని తిలకించేందుకు వచ్చిన ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా స్థానిక కళాకారులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ బొడ్డేడ రాజగోపాల్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వండర్ కిడ్స్ అధినేత మల్ల రామనాయుడు, మాజీ ఎంపీపీ కొయిలాడ వెంకట్, దాడి వీరమహలక్ష్మినాయుడు, దొడ్డి కోటేశ్వరరావు, ఆళ్ల మహేశ్వరరావు, దొడ్డి రమేష్, పొలమరశెట్టి ఆనందరావు, సుందరపు కనకప్పారావు,ఆళ్ల వీరునాయుడు, రాపేటి పరమేష్, ఆడారి జగన్నాధరావు, దాడి శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా సురభి నాటకోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన బుధవారం రాత్రి 9గంటలకు మాయాబజార్ పౌరాణిక నాటక ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. -
దూసుకొచ్చిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ
కశింకోట: ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి దూసుకురావడంతో వృద్ధ మహిళ దుర్మరణం చెందింది. కశింకోట ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాలు ప్రకారం... జగ్గయ్యపేట నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కశింకోట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి హైవే పక్కనున్న కాలువ మీదుగా కొంత దూరం ముందుకు దూసుకొచ్చింది. అక్కడ ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రవేశంలో మదుం, సోలార్ లైట్ స్తంభాన్ని ఢీకొని ఆగింది. ఆ సమయంలో మట్టి పాత్రలు తీసుకొని విశాఖ వెళ్లడానికి మదుంపై కూర్చొని వాహనం కోసం నిరీక్షిస్తున్న స్థానిక కుమ్మరి వీధికి చెందిన దేవరపు చంద్ర (61) తీవ్రంగా గాయపడింది. ఆమెను అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఉన్న త వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ మేరకు కోడలు జగదీశ్వరి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం పూర్తి చేసి చంద్ర మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బస్సులోని ప్రయాణికులు మాత్రం సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటంతో ఊపిరి తీర్చుకున్నారు. వారిని వేరే బస్సుల్లో గమ్యాలకు చేర్చారు. ప్రమాదానికి గురైన బస్సు ముందు భాగం, అద్దం దెబ్బతిన్నాయి. హైవే పక్కన మురుగు కాలువ, మదుం గోడ దెబ్బతిన్నాయి. సోలార్ లైట్ స్తంభం ధ్వంసమై నేలకొరిగింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. -
కలలకు ‘పట్టా’భిషేకం
ఏడాది వయసులోనే అమ్మను కోల్పోయిన దివ్య.. అనాథ శరణాలయంలో పెరిగి గోల్డ్మెడల్ అందుకుంది. కార్పెంటర్ తండ్రి కష్టానికి ఫలితంగా లావణ్య అత్యున్నత స్థానానికి చేరింది. ఆడపిల్లకు చదువెందుకని ఊరంతా అన్నా.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్వాతి చంద్రిక నేడు పతకధారిగా నిలిచింది. ఇలా ఎందరో విద్యార్థుల కష్టార్జిత కలలు మంగళవారం విశాఖలో ‘పట్టా’లెక్కాయి. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చేతుల మీదుగా 373 మంది విద్యార్థులు పట్టాలు అందుకోగా.. 13 మంది ప్రతిభావంతులకు బంగారు పతకాలు లభించాయి. విశేషమేమిటంటే.. ఆ 13 మందిలో 11 మంది అమ్మాయిలే కావడం..! – సాక్షి, విశాఖపట్నంబీచ్రోడ్డులోని ఓ హోటల్లో అట్టహాసంగా సాగిన ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకాగా.. గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, లోకేష్, సంధ్యారాణి హాజరయ్యారు. ఎంతో కష్టపడి చదివి పట్టాలు అందుకుంటున్న సమయంలో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ పిల్లలు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి, ఏకంగా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పట్టాలు, పతకాలు అందుకోవడం చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. విజయనగరం కేంద్రంగా 2019లో అప్పటి ౖవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. 2020 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కాగా, వందలాది మంది గిరిజన, తదితర విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును అందించే దిశగా వర్సిటీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 2020 నుంచి 2025–26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు మంగళవారం నిర్వహించిన స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ పట్టాలను ప్రదానం చేశారు. వేడుకలా పట్టాల అందజేత.. : ఈ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషనల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగాల ఆధ్వర్యంలో ఎనిమిది పీజీ, ఐదు డిగ్రీ కోర్సుల్లో విద్యనభ్యసించిన వారికి పట్టాలు అందించారు. స్కూల్ ఆఫ్ సైన్సెస్ విభాగం నుంచి అత్యధికంగా 200 మంది విద్యార్థులు పట్టాలందుకోగా.. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషనల్ సైన్సెస్ నుంచి 82 మంది, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి 91 మంది విద్యార్థులు తమ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసి పట్టాలు స్వీకరించారు. ఈ స్నాతకో త్సవంలో విద్యార్థినులు తమ సత్తా చాటారు. వర్సిటీ లో విశిష్ట ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ 13 మందిలో ఏకంగా 11 మంది విద్యార్థినులే కావడం విశేషం. -
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి
మునగపాక : స్థానిక సంస్థల ఎన్నికలు ఎపుడూ జరిగినా వైఎస్సార్సీపీ జెండాలు గ్రామాల్లో ఎగురవేసేలా పాటుపడాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా ఽఅధికార ప్రతినిధి ఆడారి జన్మదినం సందర్భంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఇచ్చిన పదవులకు వన్నె తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అందేవని, నేడు అటువంటి పరిస్థితులు కనిపించడం లేదని అన్నారు. ఏ పథకం ఎపుడు వస్తుందో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కూటమికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అలాగే గ్రామాల్లో జరుగుతున్న సర్ కార్యక్రమంలో బీఎల్ఏలు చురుగ్గా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు మద్దాల వీరునాయుడు, ఇల్లా శిరీషా నాగేశ్వరరావు, బొడ్డేడ బుజ్జి, మాజీ ఎంపీటీసీ పెంటకోట అప్పలనాయుడు, మాజీ సర్పంచ్లు ఇందల హేమలత నాయుడు, చదరం నాయుడు, కర్రి పెదబ్బాయి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పెంటకోట హరేరామ పాల్గొన్నారు. -
వరి నారుమళ్లకు అనుకూల వాతావరణం
అనకాపల్లి టౌన్ : జిల్లాలో రాగల ఐదు రోజులు తేలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సి.ముకుందరావు తెలిపారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరి నారుమళ్లు రైతులు వేసుకోవచ్చని, నేలను దున్ని తయారు చేసుకొని నారుమడి ఎత్తుగా వేసుకోవాలన్నారు. ఐదు సెంట్లు నారుమడికి 2009 కిలోల పశువుల ఎరువును, 2 కిలోల యూరియా, 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 కిలోల మ్యారేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలన్నారు. తగిన తేమ చూసుకొని మొక్కజొన్న పంటకు నేలను దున్ని తయారు చేసుకొని డి.హెచ్.ఎం–115, 112,119.121 రకాలను ఎకరాకు 8 కిలోలు చొప్పున తగిన దూరంలో విత్తుకోవాలన్నారు. వర్షాధార చెరకు వేసుకునే రైతులు ముదురు గడల నుంచి విత్తనాన్ని సేకరించి వర్షం పడిన చోట ఎకరాకు 20 వేలు మూడు కళ్ల మెచ్చెల చొప్పున 60 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలన్నారు. నాటే ముందు మెచ్చెలను 10 శాతం సున్నపు నీటిలో ఒక గంట సేపు ముంచి నాటుకోవాలన్నారు. అలాగే ఎకరాకు 1.25 టన్నుల చొప్పున నాటిన మూడో రోజున చెరకు తెచ్చి కప్పాలని సూచించారు. ఈ సమావేశంలో డాక్టర్ వి.గౌరి, డాక్టర్ సిహెచ్ సీతా రామలక్ష్మి పాల్గొన్నారు. -
ఓవర్లోడ్ లారీలకు రూ.1.60 లక్షల పెనాల్టీ
నక్కపల్లి: వేంపాడు టోల్ఫీజును ఎగ్గొట్టడంతోపాటు, సామర్థ్యానికి మంచి లోడుతో అడ్డదారిలో వెళ్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. వీటిని ఆర్టీవోకు అప్పగించడంతో రెండు లారీలకు రూ.1.60 లక్షల పెనాల్టీ విధించారు. సీఐ జే మురళి తెలిపిన వివరాల ప్రకారం.. సామర్థ్యానికి మించిన లోడు టోల్ ప్లాజా ఫీజును ఎగ్గొట్టేందుకు రెండు లారీలు వేంపాడు, కాగిత మీదుగా అడ్డదారిలో రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిని పట్టుకుని కేసు నమోదు చేశారు. ఆర్టీవోకు చర్యలు నిమిత్తం సిఫార్సు చేయగా, ఒక లారీకి రూ.74 వేలు, మరో లారీకి రూ.86 వేలు పెనాల్టీ విధించారన్నారు. -
బడి తెరిచినా రాని బడిపంతులు
సీలేరు: చదువు చెప్పేందుకు రండి సార్.. అంటూ గూడెం కొత్తవీధి మండలం ఆకులూరు ఎంపీపీ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం పాఠశాలలు తెరిచి నెల రోజులు కావస్తున్నా, తమ పాఠశాల తెరచుకోకపోవడం, ఉపాధ్యాయులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అక్షర జ్ఞానానికి నోచుకోని విద్య ఆకులూరు పాఠశాలలో సుమారు 23 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకపోవడంతో, ఆ చిన్నారులు పాఠాలకు దూరంగా ఉండిపోతున్నారు. ఈ విషయాన్ని గాలికొండ మాజీ సర్పంచ్ కాకూరి బుజ్జిబాబు విలేకరులకు తెలిపారు. ఉపాధ్యాయుల బాధ్యతారాహిత్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేకుల షెడ్డులో భవిత పాఠశాలకు కనీసం శాశ్వత భవనం కూడా లేకపోవడం మరో విషాదం. విద్యార్థులు రేకుల పాకలో చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వర్షాకాలంలో ఈ రేకుల షెడ్డులో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. పక్కా భవనం నిర్మించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా, అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు ఇలా గైర్హాజరు కావడం దారుణమని, ఇప్పటికై నా అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ఆకులూరు పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన -
భవనం నిర్మించాలని విద్యార్థుల నిరసన
ఎస్.రాయవరం: మండలంలోని రేవుపోలవరం ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ డిమాండ్ చేశారు. మంగళవారం ఇక్కడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి నాడు – నేడు నిధుల నుంచి రూ.3 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. అప్పట్లో ప్రారంభించిన పనులను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆపేశారన్నారు. దాంతో తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. నిధులు విడుదలయ్యాక పనులు పూర్తి చేయకపోవడం దారుణమని, ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులతోపాటు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ అర్జిలి ఎర్రయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. -
165 కిలోల గంజాయి పట్టివేత
ఐదుగురి అరెస్టుపెదబయలు: మండలంలోని రోగులపేట జంక్షన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి మైదాన ప్రాంతాలకు ఆటోలో తరలిస్తున్న 165 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ టి. వెంకటేష్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..ఒడిశా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా ఘటీగుడ గ్రామానికి చెందిన నబిన్ కొర్ర, కాసు కొర్ర, సునీల్ సీందేరి, భీస్మ గెమ్మెలి, సాల్మాన్ గెమ్మెలి అనే ఐదుగురు వ్యక్తులు గంజాయిని కొనుగోలు చేశారు. దానిని జామిగుడ, రూడకోట, కుజభంగి జంక్షన్ల మీదుగా మైదాన ప్రాంతాలకు ఆటోలో తరలిస్తుండగా, రోగులపేట జంక్షన్ వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 165 కిలోల గంజాయితో పాటు ఆటో, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 82.50 లక్షలు ఉంటుందని ఎస్ఐ అంచనా వేశారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు ఆయన వెల్లడించారు. ఈ తనిఖీల్లో పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పెందుర్తిలో మూడు కిలోలు పెందుర్తి: అరకు ఏజెన్సీ ప్రాంతం నుంచి పెందుర్తి మీదుగా విజయవాడకు గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పెందుర్తి పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వివరాలివి.. విజయవాడకు చెందిన పార్వాడ కనక రవి కిరణ్(26) గంజాయి వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో అరకు ప్రాంతంలో 3 కిలోల గంజాయిని కొనుగోలు చేసి విజయవాడలో అమ్మకాలు జరిపేందుకు పెందుర్తి రైల్వే స్టేషన్ మీదుగా తరలిస్తున్నాడు. రైల్లో పెందుర్తి వచ్చిన నిందితుడు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగాడుతుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకున్నారు. సీఐ కె.వి.సతీష్కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఎన్వీ భాస్కరరావు, పోలీసులు అతడి వద్ద ఉన్న గంజాయిని, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. -
సీవీఏపీ యూనిట్ను సందర్శించిన సీపీవో
నక్కపల్లి: మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ పీ4 కార్యాలయాన్ని జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి జి. రామారావు మంగళవారం సందర్శించారు. ఇక్కడ కానిస్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ (సీవీఏపీ)యూనిట్లో నిర్వహిస్తున్న అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారా లేదా ఎప్పటికప్పుడు సమీకరిస్తున్నారనే విషయాలను ఆరా తీశారు. యంగ్ ప్రొఫెషనల్ మోరంపూడి జయరామ్ జీరో పావర్టీ కార్యక్రమాలు, బంగారు కుటుంబాల దత్తత, మార్గదర్శుల భాగస్వామ్యం, అవసరాల గుర్తింపు, అవసరాల పరిష్కార చర్యలు, క్షేత్రస్థాయిలో చేపట్టిన కార్యక్రమాల గురించి సీపీవోకు వివరించారు. పీ4 కార్యక్రమాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చలపతిరావు, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటం
గోపాలపట్నం: భర్త తనను మోసం చేశాడంటూ భార్య అతడి ఇంటి ముందు మౌన పోరాటం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పరిధిలోని వెలుగువాడకు చెందిన గోర్ల వనజాక్షికి, పాత కరాసాకు చెందిన గోకర్ల శ్రీనివాసరావుకు 2018లో వివాహం జరిగింది. వీరికి 2019లో ఒక కుమారుడు జన్మించాడు. అయితే పెళ్లయిన కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో వనజాక్షి ఎవరికీ చెప్పకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆమె కనిపించకుండా పోయిందంటూ మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేసి ఆమె పుట్టింట్లో ఉన్నట్లు గుర్తించి, ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ కుదిర్చారు. కొన్ని రోజులు బాగానే ఉన్నా, ఆ తర్వాత అత్తమామలు మళ్లీ వేధించడంతో ఆమె తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ ఏడాది వనజాక్షి గర్భం దాల్చగా, ఆ గర్భాన్ని తీయించుకోవాలంటూ భర్త కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధించినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. భార్య వస్తోందని తెలిసి ఇంటికి తాళం వేసి.. తన కుమారుడితో మాట్లాడించాలని కోరినా భర్త శ్రీనివాసరావు అవకాశం ఇవ్వలేదని వనజాక్షి కన్నీటిపర్యంతమైంది. ఈ క్రమంలోనే తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా అతడిని చూసుకునేందుకు ఆమె కరాసాలోని భర్త ఇంటికి వచ్చింది. అయితే ఆమె వస్తున్నట్లు ముందే తెలుసుకున్న భర్త, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని, అందుకే తనను, బిడ్డను నిర్లక్ష్యం చేస్తూ ఇల్లు వదిలి వెళ్లిపోయాడని వనజాక్షి ఆరోపిస్తూ ఆ ఇంటి ముందే కూర్చుని రోదిస్తూ నిరసన చేపట్టింది. ఈ ఘటనపై బాధితురాలు స్థానిక ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు భర్త శ్రీనివాసరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై 498ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చట్టపరిధిలో సమస్యలకు వారం రోజుల్లో పరిష్కారం
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 62 అర్జీలు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఎస్పీ తుహిన్ సిన్హాకు తెలియజేశారు. అర్జీదారుల సమస్యలను తెలుసుకుని వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిఽధిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని దిగువ స్థాయి పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. 62 ఆర్జీలు భూ తగాదాలు, ఆస్తి గొడవలు, ఆర్థిక మోసాలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల వేధింపులు, గృహ కలహాలు, శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి
మునగపాక: మండలంలోని తోటాడలో సోమవారం రాత్రి సురభి నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గౌరీ నాట్యమండలి ఆధ్వర్యంలో ప్రఖ్యాతి గాంచిన భానోదయ సురభి నాట్యమండలి వారిచే ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజున శ్రీకృష్ణలీలలు పౌరాణిక నాటక ప్రదర్శన జరిగింది. నాటకంలోని నటీనటులు అద్భుతంగా నటించారు. నాటకంలోని సన్నివేశాలతోపాటు సెట్టింగ్లు ఆహూతులను అలరించాయి. ఈ పోటీలను జ్యోతి వెలిగించి వక్తలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కొయిలాడ వెంకట్ మాట్లాడుతూ కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎంతో అనుభవం కలిగిన కళాకారులు ఉన్నారని తెలిపారు. వారిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సురభి నాటకాలకు దేశంలోనే తగిన గుర్తింపు ఉందన్నారు. కళారంగాన్ని ప్రోత్సహించడంలో మునగపాక మండలం ఎప్పుడూ ముందుంటుందన్నారు. గౌరీ నాట్యమండలి ఆధ్వర్యంలో తోటాడలో సురభి నాటక ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమన్నారు. -
గుట్టుచప్పుడు కాకుండా పాత్రుడు చెరువు రీ సర్వే
తుమ్మపాల : అనకాపల్లి మండలం రేబాక పంచాయతీ కాపుశెట్టివానిపాలెం సర్వే నెం.243లో పదేళ్లగా వివాదంలో ఉన్న పాత్రుని చెరువుకు రెవెన్యూ అధికారులు సోమవారం చేపట్టిన రీసర్వే తీవ్ర వివాదానికి తెరలేపింది. 13.70 ఎకరాల చెరువు కబ్జాదారులకు గ్రామస్తులకు మధ్య జరిగిన మాటల యుద్ధం కాస్త తోపులాటగా మారి కూటమి పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పోల్నాటి అప్పారావును మూడు గంటల పాటు గ్రామస్తులు నిర్బంధించారు. అతనితో పాటు చెరువు రికార్డులు తారుమారు చేసి కబ్జాకు యత్నిస్తున్న మరో టీడీపీ సీనియర్ నేత మామిడి చిన్నారావు, మండలంలో బడా వ్యాపారవేత్త గొట్టిపాటి సుధాకర్ రావాలంటూ, చెరువుపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పదేళ్లుగా వివాదంలో ఉన్న చెరువుపై కబ్జాదారులకు సమాచారమిచ్చి రెవెన్యూ అధికారులు చేపట్టిన రీసర్వేపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రామస్తుల అభ్యంతరంతో వివాదంలో కొనసాగుతున్న చెరువు రీసర్వేను గ్రామస్తులకు తెలియకుండా సర్వే చేపట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పది రోజుల క్రితం చెరువు రీసర్వేకు సిద్ధమైనప్పటికీ గ్రామపెద్దలు అభ్యంతరం తెలపడంతో సర్వే బృందం రీసర్వేను నిలిపివేసింది. మరలా ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా కబ్జాదారుల సమక్షంలో రీసర్వే చేపట్టడంలో అధికారుల తీరు అనుమానాలకు తావిచ్చింది. రీసర్వేను అడ్డుకున్న గ్రామస్తులు రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టడంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. పోలీసుల రాకతో అక్కడ నుంచి కబ్జాదారులు జారుకున్నారు. దీంతో గ్రామస్తులంతా అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసి కలెక్టరేట్ గేటు వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నీటి సంఘం చైర్మన్ మంత్రి కాసులునాయుడు, వైఎస్సార్సీపీ నేత మంత్రి సత్తిబాబు, వైస్సర్పంచ్ కాపుశెట్టి రామకృష్ణ, పీఏసీఎస్ డైరెక్టర్ గనిరెడ్డి రాజు మాట్లాడుతూ కాపుశెట్టివానిపాలెంలో పాత్రుని చెరువుగా ఉన్న 13.70 ఎకరాల చెరువు రెవెన్యూ రికార్డును 2016లో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మామిడి చిన్నారావు అప్పటి రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క బినామీల పేర్లతో మార్చేసారని, చెరువు విక్రయించేసి రూ.రెండు కోట్లు వరకు దోచేసిన ఉదంతంపై అప్పట్లో ఆందోళన చేపట్టడంతో రెవెన్యూ అధికారులు విచారణ జరిపి బినామీల పేర్లను తొలగించకుండా డిస్ప్యూట్గా మాత్రమే చేర్చి చేతులు దులిపేసుకున్నారని తెలిపారు. చెరువుపై జరిగిన దస్తావేజులను రద్దు చేసుకుంటామంటూ ఇద్దరు టీడీపీ నేతలతో పాటు వ్యాపారవేత్త గొట్టిపాటి సుధాకర్ కూడా కాపుశెట్టివానిపాలెం రామాలయంలో హమీలిచ్చి ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా చెరువుకు రీసర్వే చేపట్టడం దారుణమన్నారు. పాత్రుని చెరువు జలాధారంగా 150 ఎకరాల ఆయకట్టు భూమి ఉందని, కబ్జాదారులపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ, కూటమి పార్టీ నేతలు గొంతిన శివశంకర్, కాపుశెట్టి అర్జునరావు, కోసిరెడ్డి మహేష్, కరణం మాణిక్యాలరావు, బొద్దపు కోటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు. -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
తుమ్మపాల: పీజీఆర్ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మందిరంలో ఆమెతోపాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఇన్చార్జి డీఆర్వో వై.శ్రీనివాస్ దరఖాస్తుదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ప్రతి అర్జీని బాధ్యతగా తీసుకుని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఏడీ సర్వే, ఇరిగేషన్, జీవీఎంసీ, ఏడీ అగ్రికల్చర్, మైనింగ్, ట్రైబల్ వెల్ఫేర్, లేబర్ ఆఫీస్, ఫిషరీస్, ఏపీఎస్ఆర్టీసీ, డ్వామా, తాగునీరు శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలను కేవలం సమస్యలను పరిష్కరించడమే ముఖ్యం కాదని, ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందేలా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉండకూడదని, గడువు ముగియక ముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులను తిరస్కరించాల్సి వస్తే, దానికి సరైన కారణాలను తెలియజేస్తూ ఫిర్యాదుదారునికి లిఖిత పూర్వక సమాచారం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వారం పీజీఆర్ఎస్–131, రెవెన్యూ క్లినిక్– 147 వినతులు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గుడికి స్థలం కేటాయించాలని వినతి సబ్బవరం మండలం గుల్లేపల్లి గ్రామంలో గ్రామస్తులతో కలిసి వంద చదరపు గజాల స్థలంలో ఆంజనేయ స్వామి గుడి నిర్మించామని కమిటీ వారు , భక్తులు తెలిపారు. గుడి నిర్మించిన స్థలం సర్వే నంబరు 103లో ఉందని, దాన్ని అధికారికంగా గుర్తించి హిందువుల మనోభావాలను కాపాడుతూ న్యాయం చేయాలని కోరారు. గ్రామంలో ప్రజలందరికి ఉపయోగపడే ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామివారి గుడి ఒక్కటి మాత్రమే ఉందని, తమ అభ్యర్థనను మన్నించి ఆ స్థలం అధికారికంగా కేటాయించాలని కలెక్టర్ను కోరారు. అనకాపల్లి జోన్లో కార్మికుల నియామకాలు చేయాలి జీవీఎంసీ అనకాపల్లి జోన్ ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన పారిశుధ్య కార్మికులుగా 250 మందిని కొత్తగా నియమించాలని, ప్రస్తుతం ఉన్న వారిపైనే పనిభారం తీవ్రంగా ఉన్నందున ఆర్సి నంబరు 436/2025/ ప్రకారం రూ. 147 డైలీ వేజ్ ప్రాతిపదికన పారిశుధ్య కార్మికులుగా నియమించాలంటూ కార్మికులు కలెక్టర్కు వినతి అందించారు. జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి 27 మందిని సచివాలయానికి ఒకరు చొప్పున నియమించి మిగతా 120 మంది. పోస్టులు ఇంకా నియమించలేదన్నారు. వెంటనే మిగిలిన పోస్టులను పారిశుధ్య కార్మికులుగా పనిచేసి రిటైర్మెంట్, డెత్, సిక్ కార్మికుల వారసులను నియమించాలని డిమాండ్ చేశారు. -
ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి
అనకాపల్లి : మాతృభాషతో పాటు ఆంగ్ల భాషపై ఆసక్తి పెంచుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ అధ్యాపకుడు డాక్టర్. విల్లూరి ఉమామహేశ్వరరావు రచించిన ‘ఫోనెటిక్స్ ఏ బిగినర్స్ గైడ్‘ అనే ఇంగ్లిష్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో మాతృభాషతో పాటు, ఇంగ్లిష్, హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడం వల్ల పంపంచంలో ఎక్కడికై నా వెళ్లి తిరిగిరావచ్చన్నారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నేటి ప్రపంచీకరణలో చేసే వృత్తితో సంబంధం లేకుండా, తన విద్యార్హత సంబంధం లేకుండా ఇంగ్లిష్ మాట్లాడడం అనేది ఒక సర్వసాధారణమైన విషయంగా మారిందన్నారు. ఇంగ్లిష్ ఉచ్ఛారణ పడకుండా నిజమైన ఇంగ్లిష్ వారిలాగే మాట్లాడగలిగితే అటువంటి వ్యక్తికి ఈ ప్రపంచం ఎర్ర తివాచీ పరుస్తుందని, అలాగే వారు ఎక్కడైనా పెద్ద పెద్ద ఉద్యోగాలు సునాయాసంగా సంపాదించగలరని పేర్కొన్నారు. ఇంగ్లిష్ మాట్లాడించడానికి మార్కెట్లో చాలా పుస్తకాలు దొరుకుతాయని, తాను రాసిన ఫోనెటిక్స్ ఏ బిగినర్స్ గైడ్ అనే పుస్తకం ఇంగ్లిష్లో ఏ పదాలను ఎలా పలకాలి, వాటిని స్పష్టంగా పలికే విధానం, ఏ పదాలకు ఎక్కడెక్కడ వత్తి పలకాలి, అలా పలకడం ద్వారా ఒకే మాటకి రెండు మూడు అర్థాలు ఎలా వస్తాయి అనే విషయాలను రచయిత ఈ పుస్తకంలో వివరించిన తీరు ఇంగ్లిషు భాషను దాని సరైన ఉచ్ఛారణతో నేర్చుకోవాలి అనుకునే పాఠకులకు ఎవరికై నా ఈ పుస్తకం ఒక దిక్సూచిలా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
దైవ దర్శనానికి వెళ్తూ మృత్యువాత
నక్కపల్లి : దైవ దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో వివాహిత మృత్యువాత పడిన ఘటన సోమవారం జరిగింది. సీఐ జె.మురళి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెందుర్తికి చెందిన ఓలపల్లి ఈశ్వరరావు తన భార్య గాయత్రి (26)తో కలసి మోటారు సైకిల్పై సోమవారం ఉదయం అన్నవరం సత్యదేవుని దర్శనానికి బయలుదేరారు. నక్కపల్లి దాటాక న్యాయంపూడి వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ను అనకాపల్లి నుంచి తుని వైపు వెళ్తున్న ఐషర్ వ్యాన్ ఢీకొట్టి ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల మధ్య బైక్ ఇరుక్కుపోయింది. స్కూటీ వెనుక కూర్చొన్న గాయత్రి ఐషర్ వ్యాన్లో చిక్కుకుపోయి అక్కడికక్కడే మరణించింది. బైక్ డ్రైవింగ్ చేస్తున్న ఈశ్వరరావుకు స్పల్ప గాయలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
సైబర్ నేరాల నియంత్రణకు సాంకేతికత వినియోగం
అల్లిపురం: కోవిడ్ అనంతరం సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయని, వాటి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సైబర్ క్రైమ్ రీఫండ్ మేళా–3.0లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలకు గురైన 310 మంది బాధితులకు రూ.6,02,41,725 విలువైన రీఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ సైబర్ మోసాలకు గురైన వెంటనే బాధితులు 1930 హెల్ప్లైన్కు కాల్ చేయడం లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా తమ డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ రీఫండ్ మేళాల ద్వారా ఇప్పటివరకు మూడు దశల్లో మొత్తం 1,550 మంది బాధితులకు రూ.28.49 కోట్లకు పైగా నష్టపరిహారాన్ని తిరిగి అందజేశామన్నారు. అదేవిధంగా జాబ్ ఫ్రాడ్లు, టాస్క్ గేమ్ మోసాలు, లోన్ యాప్ మోసాలు, వాహన విక్రయ మోసాలు, ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్లపై ప్రత్యేక చర్యలు చేపట్టి కోట్లాది రూపాయలను రికవరీ చేసి బాధి తులకు తిరిగి అందజేసినట్లు వెల్లడించారు. -
ఎవరెస్ట్ క్యాంపు విద్యార్థికి సత్కారం
విద్యార్థి దుర్గా ప్రసాద్ను సత్కరిస్తున్న యూత్ హాస్టల్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు రాఘవేంద్రరావు, గోపాలరావు నర్సీపట్నం : ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించిన గొలుగొండ మండలం, జోగంపేట హైస్కూల్కు చెందిన విద్యార్థి రావి దుర్గాప్రసాద్ను నర్సీపట్నం యూత్ హాస్టల్ అడ్హాక్ కమిటీ, లయన్స్క్లబ్ వారు సోమవారం ఘనంగా సత్కరించారు. లయన్స్క్లబ్ పూర్వపు జిల్లా గవర్నర్, యూత్ హాస్టల్ చీఫ్ డి.రాఘవేంద్రరావు, అధికారి గోపాలరావు విద్యార్థికి జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించి విద్యార్థి చరిత్ర సృష్టించాడని అఽతిథులు కొనియాడారు. కార్యక్రమంలో యూత్ హాస్టల్ అసోసియేషన్ కన్వీనర్ పాలపర్తి సత్యానందం, లయన్స్క్లబ్ అధ్యక్షుడు ఎం.రఘురామ్, సెక్రటరీ టి.రామారావు, ట్రెజరర్ శర్మ పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా మూడో విడత చందనం సమర్పణ
అప్పన్న ఉత్సవమూర్తులకు జ్యేష్టాభిషేకం నిర్వహిస్తున్న అర్చకులుసింహాచలం : నిజ జ్యేష్ట పౌర్ణమి సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారికి సోమవారం మూడో విడత చందనం సమర్పణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు, అనంతరం సుమారు మూడు మణుగులు (సుమారు 125 కిలోలు) పచ్చి చందనాన్ని స్వామివారికి సమర్పించారు. తదనంతరం ఆరాధన, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఆలయ ఆస్థాన మండపంలో వేంచేపు చేసి జ్యేష్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించా రు. నాలుగు వేదాల పారాయణాల నడుమ స్వామివారిని కీర్తించారు. శిరస్సుపై చందనంతో అలంకరించిన స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి భక్తులకు కనువిందు చేశారు. -
చలో కలెక్టరేట్ విజయవంతం చేయండి
మాట్లాడుతున్న చిన్నయ్యపడాల్ పాడేరు రూరల్: వచ్చేనెల 30,31తేదీల్లో నిర్వహించనున్న చలో కలెక్టరేట్ను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు బోనంగి చిన్నయ్యపడాల్ కోరారు. పాడేరు సీఐటీయూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాఫీ,ఫారెస్టు,ఐటీడీఏలలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది,అంగన్వాడీ,ఆశ వర్కర్లు సీహెచ్డబ్ల్యూ ఉద్యోగులు, వెలు గు వీఏవోలు, గ్రామ రెవెన్యూ సహాయకులు, కేజీబీవీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని, లేకపోతే ఉద్యమిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు,సహాయ కార్యదర్శి సుందరరావు,మొస్య,వెంకటగిరి తదితరులు పాల్గొన్నారు.


