Alluri Sitarama Raju District News
-
ఆకట్టుకున్న పారిశ్రామిక సామర్థ్యం ఎక్స్పో
కశింకోట: జిల్లా స్థాయి పారిశ్రామిక సామర్థ్యం ఎక్స్పో ప్రాజెక్టుల పోటీలో అచ్యుతాపురం మండలం హరిపాలెం హైస్కూలు విద్యార్థుల ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి లభించింది. కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూలులో ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించారు. దీనిలో ఎస్.రాయవరం మండలం గుడివాడ హైస్కూలుకి విద్యార్థుల ప్రాజెక్టుకు ద్వితీయ బహుమతి లభించింది. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు తయారు చేసిన పది వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించి ఆహూతులను ఆశ్చర్యచకితులను చేశారు. పర్యావరణం పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రూపొందించిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. తక్కువ ఖర్చుతో సామాజిక సమస్యల పరిష్కారానికి అనువైన ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి దాడి కాళిదాసు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సమస్యల పరిష్కార నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. భవిష్యత్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా విజేతలకు జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. జిల్లా మేనేజర్ నారాయణరావు, పాఠశాల హెచ్ఎం ఎన్.వి.జె. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
15 అడుగుల పాము హతం
రైతుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం జీకే వీధి/సీలేరు: జీకే వీధి మండలం ఎ.దారకొండ పంచాయతీ పరిధిలోని ఎ.దారకొండ గ్రామంలో సోమవారం భారీ విష సర్పం కలకలం రేపింది. సుమారు 15 అడుగుల పొడవు గల పాము రైతుల కంటపడటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో రైతులు టమాటా పంట పొలాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ సందర్భంగా విష సర్పం ఒక్కసారిగా దాడి చేయడానికి ప్రయత్నించగా, ఆనందరావు అనే రైతు చాకచక్యంగా తప్పించుకుని ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అనంతరం అక్కడున్న మిగతా రైతులతో కలిసి పామును హతమార్చారు. పొలాల్లో పనిచేసే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచించారు. -
ఆర్టీసీ బస్సుల కోసం అగచాట్లు
గంటల కొద్దీ రోడ్లపై నిరీక్షణ ముంచంగిపుట్టు: మండల కేంద్రం ముంచంగిపుట్టులో ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. ముంచంగిపుట్టు నుంచి పాడేరు వెళ్లే ప్రయాణికులు రోడ్లపై గంటల తరబడి నిరీక్షించవలసి వస్తోంది. ప్రతి రోజు ఉదయం 7గంటలకు ముంచంగిపుట్టు నుంచి పాడేరుకు ఆర్టీసీ బస్సు సర్వీసు ఉంది.ఆ బస్సు వెళ్లి పోతే మళ్లీ 9గంటల వరకు బస్సు సర్వీసు లేదు.రెండు గంటల పాటు బస్సు సర్వీసు లేకపోవడంతో ప్రయాణికులకు ప్రైవేట్ వాహనాలే దిక్కుగా మారుతున్నాయి. ఈ మార్గంలో అతి తక్కువ బస్సు సర్వీసులు నడుపుతుండడంతో వచ్చే బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంచంగిపుట్టు నుంచి జిల్లా కేంద్రం పాడేరుకు వెళ్లేందుకు ఎక్కువ సర్వీసులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
ముత్యాలమ్మ జాతర విజయానికి సహకరించాలి
చింతపల్లి: స్థానిక గ్రామదేవత ముత్యాలమ్మ జాతరను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క రూ సహరించాలని ఉత్సవ కమిటీ చైర్మన్ పసుపులేటి వినాయకరావు ప్రధాన కార్యదర్శులు పోతురాజు బాలయ్యపడాల్, దురియా హేమంత్కుమార్ కోరారు.ముత్యాలమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై ఎస్ఐ వెంకటరమణతో కలసి ఉత్సవ కమిటీ సభ్యులు సోమవారం పలు ప్రాంతాలను సందర్శించారు. విద్యుత్దీపాలంకరణ, ఎగ్జిబిషన్ ప్రాంతాలలో సందర్శకులకు ఇబ్బందిలేకుండా చేపట్టవలసిన అంశాలను పరిశీలించారు. ఉత్సవ కమిటీ అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ ప్రతి ఏడాదికి భిన్నంగా పట్టణంలోని అన్ని వీధుల్లో విద్యుత్ దీపాలంకరణకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.మూడు స్టేజీలను ఏర్పాటు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నట్టు తెలిపారు. ఎగ్జిబిషన్ను బస్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయించినట్టు చెప్పారు. మండలంలోగల అన్ని శాఖల ఉద్యోగుల తో సమావేశమై ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందేకు సహకరించాలని కోరినట్లు తెలిపారు. ఉత్సవ కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి పెదిరెడ్ల బేతాళుడు,కమిటీ సభ్యులు తాడి రమణ, పైలా శ్రీనివాసరావు, లోవ,శ్రీను,సత్యనారాయణ,దార పాల్గొన్నారు. -
అర్జీల వెల్లువ
తుమ్మపాల: జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వచ్చిన అర్జీదారులతో కలెక్టరేట్ కిక్కిరిసింది. ఈ వారం కుప్పలు తెప్పలుగా అర్జీలు వచ్చి పడ్డాయి. ప్రధానంగా భూ సమస్యలపై అర్జీలు అధికంగా వచ్చాయి. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల కార్యక్రమంలో విజయ కృష్ణన్తోపాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీ గడువులోపల చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ వారం పీజీఆర్ఎస్– 131, రెవెన్యూ క్లినిక్– 150 అర్జీలు మొత్తం 281 అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో పీజీఆర్ఎస్, ఎన్ఏవోబీ, ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్. సుబ్బలక్ష్మి, మనోరమ, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, జిల్లా ఎక్త్సెజ్ అధికారి వి.సుధీర్, సీపీవో జి.రామారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. డిగ్రీ చదువులకు సంకటం పరవాడలో డిగ్రీ కళాశాల ఏర్పాటుతోపాటు నక్కపల్లి డిగ్రీ కళాశాలకు భవన నిర్మాణం వెంటనే చేపట్టాలంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో ఇక్కడ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఫణింద్ర కుమార్ మాట్లాడుతూ పరవాడలో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ, అక్కడి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో లేకపోవడం అత్యంత విచారకరమన్నారు. పరిశ్రమలకు పెద్ద ఎత్తున స్థలాల కేటాయించి శంకుస్థాపనలు చేస్తున్న ప్రభుత్వాలు విద్యార్థులు చదువుకోవడానికి కళాశాల భవనాలు నిర్మించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ చదవాలంటే అనకాపల్లి, గాజువాక, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రత్యేకంగా విద్యార్థినుల విషయంలో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పంపడానికి తల్లిదండ్రులు భయపడటం వల్ల, అనేకమంది విద్యార్థినులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారన్నారు. నక్కపల్లి డిగ్రీ కళాశాల మంజూరై ఐదేళ్లవుతున్నా ఇప్పటివరకు భవన నిర్మాణానికి స్థలం కేటాయించలేదని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఒంటి పూట తరగతులు నిర్వహించడం శోచనీయమన్నారు. ఉపాధి పనులు చేపట్టాలని కలెక్టర్కు వినతి మాకవరపాలెం: మండలంలోని మామిడిపాలెం పంచాయతీలో ఉపాధి పనులు చేపట్టాలని సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్కు గ్రామస్తులు వినతిపత్రం అందించారు. గ్రామంలో గత ఏడాదిగా పనులు చేయడం లేదని వాపోయారు. పంచాయతీ పరిధిలోని మామిడిపాలెం, అడిగర్లపాలెం, పోతలూరులో ఉపాధి వేతనదారులు పనులు లేక ఖాళీగా ఉంటున్నామన్నారు. వీఆర్పీని నియమించలేదన్నారు. 120 మందికి ఒక మేట్ ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులు స్పందించి మేట్ల సంఖ్యను పెంచడంతోపాటు ఉపాధి పనులు ప్రారంభించాలని కోరినట్టు మాజీ సర్పంచ్ బుడ్డా రమణ తెలిపారు. రోడ్డు నిర్మాణంలో కాలువలను పూడ్చవద్దని నిరసన అనకాపల్లి –అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న సాగునీటి కాలువలను పూడ్చివేసి వందల ఎకరాల భూములను బీడుగా మార్చవద్దని కోరుతూ మునగపాక, తోటాడ, నాగులాపలి, ఓంపోలు, తోటాడ, మునగపాక, తిమ్మరాజుపేట, హరిపాలెం, తదితర గ్రామాల రైతులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ప్రస్తుతం ఉన్న కాలువలను రోడ్డు విస్తరణలో కలిపేస్తున్నప్పటికి సాగునీటి కాలువకు అదనపు భూ సేకరణ చేపట్టకపోవడం సరికాదన్నారు. కాలువలు నిర్మాణం చేపట్టకపోతే పంటల సాగు పూర్తిగా నిలిచిపోతుందని, వ్యవసాయ భూములు కొర్నుగా మిగిలిపోతాయని, రైతులు వ్యవసాయాన్ని వదిలి పరిశ్రమలకు కూలీలుగా పోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయన్నారు. రోడ్డు విస్తరణపై సమగ్ర విచారణ జరిపించి, కొత్త కాలువలు నిర్మించుటకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ప్రస్తుతం ఉన్న కాలువలు ధ్వంసం చేస్తూ నిర్మాణాలు చేపడుతున్న గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. -
కంటెయినర్లలో పశువుల అక్రమ రవాణా
నక్కపల్లి : కంటైనర్లలో పశువులను కుక్కి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు నక్కపల్లి పోలీసులకు సమాచారం అందడంతో వేంపాడు టోల్గేట్ వద్ద కంటైనర్ను పట్టుకున్నారు. విజయనగరం జిల్లా మానాపురం నుంచి విజయవాడ సమీపంలో ఉన్న హనుమాన్ జంక్షన్ వద్దకు కంటైనర్లో రెండు అరలను ఏర్పాటు చేసి 48 ఎద్దులను ఉంచి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ కంటైనర్ను పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి కొత్తవలసలో ఉన్న గోశాలకు తరలించినట్టు సీఐ జె.మురళి తెలిపారు. కాగా ఇదేవిధంగా నిత్యం 30 నుంచి 40 కంటైనర్లలో పశువులు కబేళాకు తరలిపోతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ఈ అక్రమ రవాణా పోలీసుల కంట పడడం లేదు. పోలీసుల కళ్లు కప్పడానికి లారీలు, వ్యాన్లు బదులుగా పశువుల రవాణాకు కంటైనర్లను ఉపయోగిస్తున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస కేంద్రంగా ఈ పశురవాణా ఏళ్ల తరబడి జరుగుతోంది. కంటైనర్లో 40 నుంచి 50 గోవులను కుక్కి ఊపిరి ఆడకుండా చేసి వందల కిలోమీటర్ల దూరం మేత గాని, తాగడానికి నీళ్లు గాని ఇవ్వకుండా హింసిస్తూ కబేళాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో కొన్ని పశువులు మృత్యువాత కూడా పడుతున్నాయి. అధికార పార్టీ నేతలు, వారి పీఏల కనుసన్నల్లో... ఈ పశువులను రవాణా చేసే వ్యక్తి అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులను, వారి వద్ద పనిచేసే పీఏలను, అనుచరులను గుప్పెట్లో పెట్టుకుని నెలవారీ మామూళ్లు చెల్లిస్తూ కంటైనర్లను పట్టుకోకుండా జాగ్రత్త పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పశు మాఫియాలో రెండు వర్గాల మధ్య విభేదాల కారణంగా ఒక వర్గానికి చెందిన కంటైనర్లను మరో వర్గానికి చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించడం జరుగుతోంది. అలాగే ఈ వ్యవహారంలో కీలక శాఖ మంత్రి వద్ద ప్రైవేటు పీఏగా పనిచేస్తున్న వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలు రావడంతో కొద్దిరోజుల పాటు పశురవాణా నిలిచిపోయింది. తాజాగా మళ్లీ పశు రవాణా ప్రారంభమైంది. తప్పుడు సర్టిఫికెట్లతో... ఈ అక్రమ రవాణాలో పశుసంవర్ధక శాఖ ప్రమేయంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. పశువుల మాఫియా వద్ద కూలీలుగా పనిచేసే వారి ఆధార్ కార్డులను ఉపయోగించి వారే రైతులు, వారే కూలీలు, కొనేది వారే, అమ్మేది వారే అన్నట్టు సర్టిఫికెట్లు సంపాదించి పశువులను మేపుకొనేందుకే తరలిస్తున్నట్టు సర్టిఫికెట్లు సంపాదిస్తున్నారు. వాటిని చూపించి అక్రమంగా రవాణా చేస్తూ కబేళాకు తరలిస్తున్నారు. -
గీతం ఆక్రమిత భూములపై చర్యలు తీసుకోవాలి
మహారాణిపేట: గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆక్రమించిన అసైన్డ్ ప్రభుత్వ భూములపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఇంటెలెక్చువల్ ఫోరం విశాఖ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ మార్కండేయులు, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పాకా సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండ ప్రభుత్వ భూముల వినియోగంపై కూడా సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. గీతం విశ్వవిద్యాలయం యాజమాన్యం ఆక్రమించిన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములు ఎండాడ, భీమిలి మండలాల పరిధిలోని రుషికొండ ప్రాంతంలో సర్వే నంబర్లు 15, 16, 19, 20లలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్ 1977 ప్రకారం ప్రభుత్వం కేటాయించిన భూములను కొనడం లేదా అమ్మడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. రుషికొండ ప్రాంతంలో పర్యాటక శాఖకు చెందిన భూమిలో గతంలో ప్రభుత్వ అవసరాల కోసం గెస్ట్ హౌస్ నిర్మాణం జరిగితే, అప్పట్లో కూటమి నాయకులు తీవ్ర విమర్శలు చేసి, దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ భవనాలు కూటమి ప్రభుత్వ హయాంలోనే ఉన్నప్పటికీ, వాటిని ప్రజల అవసరాలకు వినియోగించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పాకా విమర్శించారు. ఆ భవనాలను కొందరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగానికి దారితీస్తుందని మార్కండేయులు హెచ్చరించారు. గిన్ని రాధాకృష్ణ, విజయ్ భాస్కర్, సుగుణ కుమార్, హరి పట్నాయక్, రామకృష్ణారెడ్డి, మద్ది లక్ష్మణరావు, వెంకటరమణ, పిల్లా అప్పారావు, పైడిరాజు, బీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అప్పలస్వామి, చుక్కా అప్పారావు, బోరా రామిరెడ్డి, వీర రాఘవులు, రాజా చంద్రశేఖర్, మహమ్మద్ సలీమ్, వన్టౌన్ దాసరి విజయ భాస్కరరెడ్డి, ఎం.డి.జాఫర్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పేరం రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు -
‘దక్షిణ కోస్తా జోన్’కు రూ.3.86 కోట్లు
సాక్షి, విశాఖపట్నం: గత రెండు బడ్జెట్లతో పోలిస్తే, ఈ సారి ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే కేటాయింపులు చేపట్టింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైల్వే బోర్డు తాజాగా కన్సాలిడేటెడ్ బడ్జెట్ వివరాలను విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్తో పాటు, వాల్తేరు డివిజన్ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కేంద్రం కీలక కేటాయింపులు చేసింది. ప్రధానంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడంతో పాటు, రద్దీగా ఉండే మార్గాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వాల్తేరు డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టులు ఇక పట్టాలెక్కనున్నాయి. కేటాయింపుల వివరాలు ఇలా.. : విజయనగరం–కొత్తవలస మూడో లైన్: వాల్తేరు డివిజన్లో అత్యంత రద్దీగా ఉండే విజయనగరం–కొత్తవలస సెక్షన్లో 34.7 కిలోమీటర్ల మేర మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ.299.83 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం కూడా ఇదే కావడం విశేషం. ఈ లైన్ అందుబాటులోకి వస్తే సరకు రవాణా రైళ్ల వేగం పెరగడమే కాకుండా, ప్రయాణికుల రైళ్ల ఆలస్యానికి చెక్ పడనుంది. విశాఖ స్టేషన్ ఆధునికీకరణ, భద్రత: విశాఖపట్నం రైల్వే స్టేషన్ పరిధిలో భద్రతను మెరుగుపరచడానికి, రైళ్ల వేగాన్ని పెంచడానికి ‘ఆటోమేటిక్ సిగ్నలింగ్’వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం రూ.49.24 కోట్లు కేటాయించారు. దీని వల్ల స్టేషన్ పరిధిలో రైళ్ల రాకపోకల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఎలక్ట్రిక్ లోకో షెడ్ విస్తరణ: దక్షిణ కోస్తా రైల్వే జోన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, విశాఖ నుంచి నడిచే రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం 200 ఇంజిన్ల సామర్థ్యం ఉన్న విశాఖ ఎలక్ట్రిక్ లోకో షెడ్ను 225కు పెంచనున్నారు. ఈ పనుల కోసం రూ.20.82 కోట్లు కేటాయించారు. దీనివల్ల ఇంజిన్ల నిర్వహణ మరింత సులభతరం కానుంది. జోన్ ప్రధాన కార్యాలయానికి నిధులు: చాలా కాలంగా ఎదురుచూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి బడ్జెట్లో చేయూత లభించింది. జోనల్ కార్యాలయ భవన నిర్మాణం, ప్రహరీ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కోసం రూ.3.86 కోట్లు కేటాయించారు. ● పలాస–విశాఖపట్నం–దువ్వాడ సెక్షన్లో సుమారు 72 కిలోమీటర్ల మేర ట్రాక్ ఆధునికీకరణ పనులకు రూ.87.93 కోట్లు కేటాయించారు. ఇది రైళ్ల ప్రయాణ వేగాన్ని పెంచడానికి దోహదపడుతుంది. ● వాల్తేరు డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్లలో పాత సిగ్నలింగ్ వ్యవస్థ మార్పునకు రూ.31.26 కోట్లు, ఎఫ్అండ్ జీ క్యాబిన్ల ఆధునికీకరణకు రూ.27.41 కోట్లు కేటాయించారు. ● విశాఖ కోచింగ్ డిపోలో రన్నింగ్ రూమ్, క్రూ లాబీ అప్గ్రెడేషన్ కోసం రూ.4.90 కోట్లు కేటాయించారు. ● విశాఖ న్యూ గూడ్స్ కాంప్లెక్స్ వద్ద సౌకర్యాల మెరుగుదలకు రూ.21.84 కోట్లు కేటాయించారు. ఇది సరకు రవాణా ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడనుంది. -
గాలివాన బీభత్సం
ముంచంగిపుట్టు: మండలంలోని మాకవరం పంచాయతీ మొక్కపుట్టు,లబడపుట్టు గ్రామాల్లో గాలి,వాన బీభత్సం సృష్టించాయి.ఆదివారం రాత్రి భారీగా ఈదురు గాలులు వీచాయి. ఏకధాటిగా వర్షం పడింది.పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. గాలులకు ఏడు ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఇళ్లలో ఉన్న సామగ్రి,ధాన్యం,సామలు తదితర సరుకులు పాడైపోయాయి. ఆర్థికంగా నష్టపోయామని,ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని మొక్కపుట్టు,లబడపుట్టు గ్రామాల బాధిత కుటుంబాలవారు వేడుకున్నారు. సీలేరు: ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వారం రోజులుగా వింత వాతావరణ చోటు చేసుకుంటోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండకాస్తోంది. అనంతరం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. సీలేరులో సోమవారం అరగంటపాటు భారీ వర్షం పడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని సెల్ఫోన్లకు మెసేజ్లు రావడంతో అందరూ అప్రమత్తమై, ఇళ్లకు పరిమితమయ్యారు. ఎగిరిపోయిన ఏడు ఇళ్ల పైకప్పు రేకులు -
నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
సమస్యలు పరిష్కారించాలని డిమాండ్సాక్షి, పాడేరు: ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం ఎదుట సోమవారం నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అవలింబిస్తున్న ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను వారంతా నిరసించారు.నల్లబ్యాడ్జీలు ధరించే స్పాట్ విధుల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఫ్యాఫ్టో చైర్మన్ రావుల జగన్మోహనరావు,ప్రధాన కార్యదర్శి పి.కర్రన్న మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని, 30శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యలను పరిష్కరించడంతో పాటు సీపీఎస్,జీపీఎస్ విధానాలను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని వెంటనే అమలుజేయాలని కోరారు. ఉపాధ్యాయులకు బోధన తప్ప ఇతర కార్యక్రమాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ఎంటీఎస్ టీచర్ల పదవీవిరమణ వయస్సును 60 నుంచి 62ఏళ్లకు పెంచాలని,హైస్కూల్ ప్లస్లో వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని,ఎంఈవోలతో పాటు ఎంఈవో,హెచ్ఎంల పరస్పర బదిలీలు, ఎంఈవో–1,ఎంఈవో–2 జాబ్ చార్ట్లో అసంబద్ధాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మహేశ్వరరావు,గిడ్డి వరలక్ష్మి,వెంకటరమణనాయుడు, వల్ల వెంకటరమణ,రాంబాబు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
చెక్డ్యాంల మరమ్మతులకు ప్రతిపాదనలు
డీడబ్ల్యూఆర్వో రామచంద్రరావుకొయ్యూరు: భూ గర్భ జలాల పెంపునకు వీలుగా చెక్డ్యాం, జలాశయాలకు మరమ్మతులు చేయడంతో పాటు పూడిక తీయించేందుకు చర్యలు చేపడుతున్న ట్టు దవళేశ్వరం నీటిపారుదల శాఖ లిఫ్ట్ డిజైన్ పర్యవేక్షక ఇంజనీర్(ఎస్ఈ), అల్లూరి జిల్లా నీటివనరుల అధికారి(డీడబ్ల్యూఆర్వో) వి.రామచంద్రరావు తెలిపారు.భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవా లని సూచిస్తూ ప్రభుత్వం ఈ జిల్లాకు బాధ్యతలను తనకు అప్పగించిందని ఆయన తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నీటి వినియోగదారుల సంఘాల సభ్యులతో ఎంపీపీ బడుగు రమేష్ కుమార్ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెక్డ్యాంల మరమ్మతులు, జలాశయాల్లో పూడిక తీయించేందుకు నిధుల కోసం త్వరలో కలెక్టర్కు ప్రతిపాదిస్తామన్నారు. నిధులు విడుదలైన 80 రోజుల్లో పనులు పూర్తి చేయిస్తామని తెలిపారు. ఎంపీపీ రమేష్ మాట్లాడుతూ కించవానిపాలెం జలాశయంలో పేరుకుపోయిన పూడికను తీయించాలని కో రారు. నీటిపారుదల శాఖ జేఈ రామకృష్ణ మాట్లాడు తూ చెక్డ్యాంలు,జలాశయాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేస్తామన్నారు. ఎంపీడీవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో భార్యపై దాడి
యలమంచిలి రూరల్ : మద్యం మత్తులో భార్యపై భర్త దాడి చేయడంతో భార్య మృతి చెందిన ఘటన యలమంచిలి పట్టణానికి సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ ఎస్ఐ తెలిపిన వివరాలివి. అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం ఈదులబయలు గ్రామానికి చెందిన వంతల కుమారి (40) ఏడాది క్రితం భర్తతో విభేదాల కారణంగా ఇద్దరు పిల్లలు, భర్తను వదిలేసి దూరంగా ఉంటోంది. అల్లూరి జిల్లా పాడేరు మండలం చీడిమెట్ట గ్రామానికి చెందిన మర్రి కామేష్తో కుమారికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ వివాహం చేసుకుని యలమంచిలి సమీపంలో ఎర్రవరం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారి పక్కనున్న ఒక తుక్కు దుకాణంలో ఖాళీ మద్యం సీసాలు వేరు చేసే పని చేస్తున్నారు. దుకాణ యజమాని ప్రతి ఆదివారం వీరికి ఖర్చుల కోసం రూ.1000 అదనంగా ఇస్తూంటారు. గత ఆదివారం వీరిద్దరూ యజమాని ఇచ్చిన వెయ్యి రూపాయలతో మద్యం తాగారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త కామేష్ ఆమె ముఖంపై పిడికిలితో బలంగా గుద్దాడు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనిపై తుక్కు దుకాణం యజమాని కాకి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. కుమారి మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్టు తెలిపారు. -
ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు 65 అర్జీలు
అర్జీదారుల సమస్యను వింటున్న అదనపు ఎస్పీ మోహనరావు అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 65 అర్జీలు వచ్చాయి. అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారివారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భూ తగాదాలు–28, కుటుంబ కలహాలు– 5, మోసపూరిత వ్యవహారాలు–2, ఇతర విభాగాలకు చెందినవి – 30 అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం
విజేతలకు బహుమతులు అందజేస్తున ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆరిలోవ : పోలీసులకు పని ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు, వ్యాయామం ఎంతగానో దోహదపడతాయని విశాఖ రేంజ్ ఐజీ గోపినాఽథ్ జట్టి తెలిపారు. అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశాలాక్షినగర్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ సంబరాలు సోమవారం ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాల్లో ఐజీ పాల్గొని విజేతలను అభినందించారు. అనకాపల్లి, పరవాడ, నర్సీపట్నం, సబ్ డివిజన్లతో పాటు ఆర్మడ్ రిజర్వ్ విభాగానికి చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ మీట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి బహుమతులు అందజేశారు. అనంతరం ఐజీ గోపినాథ్ మాట్లాడుతూ పోలీసులు పని ఒత్తిడిని అధిగమించి మానసిక ఉల్లాసం పొందేందుకు యోగా, వ్యాయామం, క్రీడలను తమ దైనందని జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అనకాపల్లి ఎస్పీ తుమిన్ సిన్హా మాట్లాడుతూ పోలీసులు మరింత ఉత్సాహంతో పనిచేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. అదనపు ఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
భర్త కళ్లెదుటే.. భార్య దుర్మరణం
పెదగంట్యాడ : భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం పాలైన హృదయ విదారకమైన సంఘటన గాజువాక దరి శ్రీనగర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివి. శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన గురిబిల్లి జోగిరెడ్డి, గురిబిల్లి శాంతమ్మ (43) భార్యాభర్తలు. వీరిద్దరూ సోమవారం వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై శ్రీనగర్ వస్తుండగా.. గాజువాక పోలీస్స్టేషన్ సిగ్నిల్ పాయింట్ దాటిన తర్వాత వెనుక నుంచి వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో శాంతమ్మ వాహనంపై నుంచి కిందపడిపోయింది. లారీ ఆమె తలపై నుంచి వెళ్లిపోవడంతో తల భాగం నుజ్జునుజ్జయింది. తన కళ్లెదుటే భార్య దుర్మరణం చెందడంతో భర్త కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న గాజువాక పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సుస్థిర పాలన, సత్వర సేవలే లక్ష్యం
సాక్షి, పాడేరు: జిల్లా ప్రజలకు సుస్థిర పాలన, సత్వర సేవలు అందించడమే లక్ష్యమని, నిర్దేఽశించిన సమయానికి కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ టి.నిశాంతి హెచ్చరించారు. కలెక్టరేట్లోని అన్ని విభాగాలను సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ,సిబ్బంది హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. అధికారులు,సిబ్బంది సమయపాలన పాటించాలని ఏఒక్క ఫైలు అనవసరంగా పెండింగ్లో ఉండకూడదన్నారు. పీజీఆర్ఎస్తో పాటు ప్రజల సమస్యలన్నింటికీ అధిక ప్రాధాన్యత ఇచ్చి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యాలయంలోని రికార్డులను భద్రపరుచుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మురళీ,డ్వామా పీడీ వి ద్యాసాగర్,ఇన్చార్జి డీఆర్వో నీలకంఠరావు,సీపీవో ప్రసాద్,కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రసాదరావు, సూపరిండెంట్ లక్ష్మణరావు,తహసీల్దార్లు వంజంగి త్రినాథనాయుడు, రంగారావు పాల్గొన్నారు. అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరుచుకోవాలి గిరిజన విద్యార్థులంతా ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ టి.నిశాంతి సూచించారు. మండలంలోని గుత్తులపుట్టు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల,కుమ్మరిపుట్టు మోడల్ ప్రైమరీ బాలికల పాఠశాలను సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో పలు పాఠ్యాంశాలను చదివించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులంతా చదువుల్లో రాణించాలన్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపైన ఉపాధ్యాయులు ఽప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో శ్రీపూజ,డీఈవో రామకృష్ణారావు,గిరిజన సంక్షేమశాఖ డీడీ పరిమళ పాల్గొన్నారు. సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం జిల్లా అధికారుల మధ్య సమన్వయం ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని కలెక్టర్ నిశాంతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎటువంటి అలసత్వం లేకుండా సమన్వయంతో అభివృద్ధి పనులు నిర్వహించాలని సూచించారు.పీజీఆర్ఎస్కు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. -
విలేకరిపై చర్య తీసుకోవాలని వినతి
తహసీల్దారుకు ఫిర్యాదు చేస్తున్న మాజీ సర్పంచ్ పావని కోటవురట్ల : పాత్రికేయ ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యండపల్లి మాజీ సర్పంచ్ గుడివాడ పావని తహసీల్దారు తిరుమలబాబు, ఎస్ఐ రమేష్కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 2వ తేదీన గ్రామ దేవత నూకాంబిక అమ్మవారి జాతర నిర్వహిస్తుండగా రాఘవులు అనే విలేకరి తనను డబ్బులు డిమాండ్ చేశాడని, ఇవ్వకపోతే ఇబ్బందులు పడతారని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని డబ్బుల కోసం వేధిస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తహసీల్దారు తిరుమలబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పెట్ల రాంబాబు, నాయకులు పైల నాని, చీకట్ల వెంకట్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నూకాంబిక సన్నిధిలో నిత్య విద్యానంద భారతిస్వామి
నిత్య విద్యానంద భారతి స్వామికి నూకాంబిక అమ్మవారి చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ అనకాపల్లి : గుంటూరు చెందిన ఆదిపరాశక్తి క్షేత్ర నిర్వాహకులు నిత్య విద్యానంద భారతిస్వామి సోమవారం గవరపాలెం నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భారతి స్వామికి ఆలయ చైర్మన్ చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్ కుమార్, దాడి రవికుమార్ పొలిమేర స్వాతి ఆనంద్కుమార్, మారిశెట్టి శంకరరావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, పైడిరాజు, యరవ్రరపు సంతోషి కుమారి నాగేష్ పాల్గొన్నారు. -
వేధింపులకు పాల్పడిన హెల్త్ సూపర్వైజర్ను అరెస్టు చేయాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు అనకాపల్లి: దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గరిశింగి సచివాలయంలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న జి.రాజ్యలక్ష్మిని వేధింపులకు గురిచేసి, ఆమె ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణమైన హెల్త్ సూపర్ వైజర్ పుష్పరాజును అరెస్టు చేయాలని ఏపీ యునైటెడ్ గ్రామ, వార్డు హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ సభ్యులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశా రు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. ఏఎన్ఎం రాజ్యలక్ష్మిని వేధింపులకు గురిచేయడంతో పాటు హెల్త్ సెక్రటరీలపై కూడా పుష్పరాజు దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు.ఆత్మహత్యకు యత్నించిన రాజ్యలక్ష్మి పాడేరు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందన్నారు. దీనికి కారణమైన పుష్ప రాజు సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తు న ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. -
అడవిదున్న అలజడి
రాత్రి సమయంలో సంచరిస్తున్న అడవిదున్న హుకుంపేట (డుంబ్రిగుడ): ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన హుకుంపేట మండలంలో అడవి దున్న సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. మండలంలోని గరుడపల్లి, పామురాయి గ్రామాల సమీపంలో శనివారం భారీ అడవి దున్న ప్రత్యక్షమవడంతో స్థానిక గిరిజనులు ఒక్కసారిగా భీతిల్లారు. పామురాయి – గరుడపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై అడవి దున్న అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహన చోదకులు, గిరిజనులు ఆ భారీ జంతువును చూసి ఒక్కసారిగా వాహనాలు నిలిపివేశారు. ఊహించని విధంగా ఎదురైన అడవి దున్నను చూసి ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో అందరూ చెల్లాచెదురయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. సాధారణంగా ఈ ప్రాంతంలో ఇలాంటి పెద్ద క్రూర మృగాలు సంచరించడం అరుదని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ మా ప్రాంతంలో ఇలాంటి జంతువులు కనిపించలేదు. సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి ఇది ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అని గిరిజనులు వాపోతున్నారు. అడవి దున్న సంచారంతో అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా వణికిపోతున్నారు. -
నీటిగండం
వేసవి ఆరంభంలోనే ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లోని మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి జలగండం పొంచి ఉంది. అటు వర్షాభావం, ఇటు ఎండల తీవ్రతతో ప్రాజెక్టుకు ప్రధాన నీటి వనరులైన జోలాపుట్టు, డుడుమ జలాశయాలు క్రమంగా అడుగంటుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో రానున్న రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉత్పత్తికి ఇబ్బంది లేదని ప్రాజెక్ట్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, మే నెల నాటి పరిస్థితిపై మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. మాచ్ఖండ్కు జలాశయాలు ఎదురుచూపు ముంచంగిపుట్టు : ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి గండం పొంచి ఉంది. విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఆధారమైన జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో నీటి నిల్వలు ఏప్రిల్ నెలలోనే వేగంగా పడిపోతున్నాయి. జలాశయాల్లో నీరు అడుగంటుతుండటంతో రానున్న రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే దారుణం జోలాపుట్టు ప్రధాన జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 2,750 అడుగులు కాగా, శనివారం నాటికి అది 2,724 అడుగులకు పడిపోయింది. గత ఏడాది ఇదే రోజున 2735 అడుగుల నీరు ఉండేది. అంటే గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 11 అడుగుల నీటి నిల్వ తక్కువగా ఉంది. అటు స్పిల్వే జలాశయం ఇప్పటికే వెలవెలబోతోంది. ● డుడుమ జలాశయం పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. దీని పూర్తి స్థాయి మట్టం 2590 అడుగులు కాగా, ప్రస్తుతం 2582 అడుగులే ఉంది. డుడుమలో నీటి నిల్వను కాపాడేందుకు జోలాపుట్టు నుంచి రెండు గేట్ల ద్వారా రోజుకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రానున్న రెండు మూడు వారాల్లో భారీ వర్షాలు కురవకపోతే, మిగిలి ఉన్న నీరు కూడా అయిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అడుగంటిన మత్స్యగెడ్డ జోలాపుట్టు, డుడుమ జలాశయాలకు ప్రధాన నీటి వనరు మత్స్యగెడ్డ. ఈ ఏడాది మత్స్యగెడ్డ ఏప్రిల్ నెలలోనే ఎండిపోవడంతో జలాశయాల్లోకి ఇన్ ఫ్లో నిలిచిపోయింది. గిరిజన ప్రాంతంలోని ఎనిమిది మండలాల వర్షపాతంపైనే మత్స్యగెడ్డ ఆధారపడి ఉంటుంది. జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడమే ఈ దుస్థితికి కారణం. ఆయా మండలాల్లో భారీ వర్షాలు కురిసి, వరద నీరు మత్స్యగెడ్డకు చేరితేనే జోలాపుట్టు జలాశయం నిండుతుంది. ఉత్పత్తిపై ప్రభావం మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో మొత్తం 6 జనరేటర్ల సహాయంతో 120 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే జలాశయాల్లో నీటి స్థాయి క్రమంగా తగ్గుతుండటంతో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా వర్షాలు తక్కువగా ఉండటంతో, ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటితోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆకాశం వైపు చూస్తూ, భారీ వర్షాలు ఎప్పుడు కురుస్తాయా అని ప్రాజెక్టు అధికారులు ఎదురుచూస్తున్నారు. నీటి నిల్వ తక్కువగా ఉన్న జోలాపుట్టు జలాశయంఉత్పత్తికి ఆటంకం లేకుండా చర్యలు మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతోంది. జోలాపుట్టు జలాశయంలో నీటి నిల్వలు గత ఏడాదితో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ, ఏప్రిల్ నెలకు సరిపడా నీరు అందుబాటులో ఉంది. అందువల్ల ఈ నెలలో ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే, మే నెల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రస్తుతానికి చెప్పలేం. డుడుమ జలాశయంలో మాత్రం విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన మేర పూర్తిస్థాయి నీటి నిల్వలను కొనసాగిస్తున్నాం. – బి. గోవిందరాజులు, ఇన్చార్జి ఎస్ఈ, మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం -
రాత్రంతా ఆరుబయటే..
ముంచంగిపుట్టు: మండలంలోని 23 పంచాయతీల పరిధిలోని గిరిజన గ్రామాల్లో శనివారం రాత్రి సంభవించిన భూప్రకంపనలు కలకలం రేపాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శనివారం రాత్రి 11.33 నిమిషాల సమయంలో భూమి కంపించడం ప్రారంభమైంది. ఇళ్లలోని వస్తువులు కింద పడిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందారు. బయటే గడిపిన ప్రజలు ప్రకంపనల ధాటికి భయపడిన గిరిజనులు గంటల తరబడి ఇంటి బయటే ఉండిపోయారు. అంతా సద్దుమణిగిన తర్వాత ఇళ్లలోకి వెళ్లి పరిస్థితిని గమనించారు. కింద పడిపోయిన వస్తువులను, సామాన్లను తిరిగి సర్దుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి తమ బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి, భూకంపం వల్ల కలిగిన నష్టాన్ని, క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. డుంబ్రిగుడ: మండలంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో సంభవించిన భూప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు, ఒక్కసారిగా భూమి కంపించడంతో పాటు సుమారు 10 సెకన్ల పాటు భారీ శబ్దం రావడంతో భయంతో నిద్రలేచి ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.సుమారు గంట సేపటి వరకు ఇళ్లలోకి వెళ్లడానికి భయపడి అంతా బయటే ఉండిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, దేవునిపై భారం వేసి మరికొంతమంది ఇళ్లలోకి వెళ్లి పడుకున్నారు. అదృష్టవశాత్తూ ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వంజరి, గెమ్మెలి, సొలభం, బంధవీధి, సంతబయలు, జి.మాడుగుల, సింగర్భ, గాంధీనగరం, జి.ఎం.కొత్తూరు, జోగులపుట్టు తదితర గ్రామాల్లో కొద్ది సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రోలర్ శబ్దం అనుకున్నాం: మత్స్యరాజు పాడేరు పాత ఎంఆర్వో ఆఫీస్ కాలనీకి చెందిన తలారి మత్స్యరాజు తన అనుభవాన్ని వివరిస్తూ.. రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి భోజనం చేస్తుండగా 11:30 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఇంటి పైకప్పు రేకులు కదిలి శబ్దం రావడంతో మొదట జాతీయ రహదారి పనుల కోసం వైబ్రేషన్ రోలర్ వాడుతున్నారేమో అని భ్రమపడ్డాను. కానీ కొద్దిసేపటికే సోషల్ మీడియాలో భూప్రకంపనల వార్తలు రావడంతో అసలు విషయం తెలిసింది అని పేర్కొన్నారు. ఇల్లంతా కదిలిపోయింది రాత్రి 11.33 గంటల సమయంలో గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా ఇల్లంతా కదిలిపోయింది. ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో భయాందోళనకు గురయ్యాను. వెంటనే కుటుంబ సభ్యులందరినీ నిద్రలేపి సురక్షితంగా బయటకు తీసుకువచ్చాను. సుమారు రెండుసార్లు భూమి కంపించింది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. మొదటిసారి భూకంపం రావడంతో చాలా భయం వేసింది. – ఎ. సాయికిరణ్, ముంచంగిపుట్టు వస్తువులన్నీకింద పడిపోయాయి భూమి కంపించడంతో ఇంట్లోని వస్తువులన్నీ కింద పడిపోసాగాయి. గ్రామంలో అందరూ కేకలు వేస్తూ ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. మొదట నాకే ఇలా అనిపించిందేమో అనుకున్నా. కానీ ఆరా తీస్తే మా గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చిందని తెలిసింది. ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. – లక్ష్మణ్, జోలాపుట్టు భూప్రకంపనలతో వణికిన గిరిజనులు తమ వారి క్షేమ సమాచారం కోసం ఎటువంటి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న జనం భయాందోళనకు గురయ్యాం భూకంపం వస్తే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తే కానీ అర్థం కాలేదు. ఒక్కసారిగా ఇళ్లు కూలిపోతాయేమో అన్నట్లుగా భూమి కంపించింది. ప్రాణభయంతో కుటుంబంతో సహా బయటకు వచ్చేసరికి, అప్పటికే గ్రామస్తులందరూ వీధుల్లోనే ఉన్నారు. ఫోన్ల ద్వారా కూడా చాలా మంది తమ భయాందోళనలను నాతో పంచుకున్నారు. అదృష్టవశాత్తూ మన పంచాయతీ పరిధిలో ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదు కానీ, ఈ ఘటన అందరినీ తీవ్రంగా భయపెట్టింది. – వి. రమేష్, సర్పంచ్, సుజనకోట -
కిల్లోగుడలోకార్డన్ సెర్చ్
డుంబ్రిగుడ: ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు, మండలంలోని సాగర పంచాయతీ కిల్లోగుడ గ్రామంలో ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ సాయంతో సుమారు 82 గృహాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ప్రజల వివరాలను సేకరించారు. అలాగే డ్రోన్ కెమెరాల ద్వారా గ్రామాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ.. మహిళల భద్రత, గంజాయి సాగు–నివారణ, రోడ్డు ప్రమాదాల అదుపు, ఆన్లైన్ మోసాలు, నాటుసారా వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. గంజాయి సాగు చేసినా లేదా రవాణా చేసినా కఠిన కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలందరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. -
మన్యాన్ని ప్రగతిపథంలో నడిపిస్తా
సాక్షి, విశాఖపట్నం: అల్లూరి సీతారామరాజు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో శాయశక్తులా కృషి చేస్తానని కలెక్టర్ టి. నిశాంతి పేర్కొన్నారు. ఆదివారం ఆమె జిల్లా 4వ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఘాట్రోడ్డులోని అమ్మవారి పాదాలు, పాడేరు పట్టణంలోని శ్రీ మోదకొండమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టరేట్కు చేరుకున్న ఆమెకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యాలయంలో ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వేదమంత్రాల నడుమ తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టి, తొలి సంతకం చేశారు. ఐటీడీఏ పీవో, ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, వివిధ శాఖల అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పూలగుత్తులు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి జిల్లాకు కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి, గిరిజనుల సమస్యలను నేరుగా తెలుసుకుంటా. జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సహకరించాలని ఆమె కోరారు. -
ఇటుకల పండగ సంబరం
ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో పాత తరం నాటి ఆచార వ్యవహారాలు, అపురూప సంస్కృతికి అద్దం పడుతూ ఇటుకల పండుగ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తరతరాలుగా తమ పూర్వీకులు పాటించిన పద్ధతులను ఏమాత్రం విస్మరించకుండా, గిరిజనులు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ● గ్రామ చావిడి వద్ద కొలువైన శంకుదేవుడికి గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గధ రూపంలో ఉండే దేవుడికి గొడుగులు, జెండాలతో అలంకారం చేసి, పూలమాలలు వేసి గ్రామ వీధుల్లో వైభవంగా ఊరేగిస్తున్నారు. ● ఈ పండుగలో అత్యంత కీలకమైన ఘట్టం ’వేట’. వేటలో భాగంగా తమ ఇళ్లలో భద్రపరుచుకున్న ఈటెలు, బల్లెంలు, విల్లు–బాణాలను శుభ్రం చేసి పూజలు నిర్వహిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా కోడిగుడ్డును పగలగొట్టి, గ్రామ పురుషులంతా సమిష్టిగా అడవికి వేట కోసం బయలుదేరుతారు. వారం రోజులు సందడి వారం రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో గిరిజన గ్రామాలు పండుగ జోష్లో మునిగితేలుతున్నాయి. రాత్రి వేళల్లో యువతీ యువకులు, పెద్దలు అంతా కలిసి థింసా నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లోకి వచ్చే వారి నుంచి మహిళలు ‘తాచేరు’ వసూలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. గిరిజన ఆచారాల ప్రకారం జరుగుతున్న ఈ వేడుకలతో మన్యం ప్రాంతమంతా కొత్త వెలుగును సంతరించుకుంది. బోడిపుట్టులో ఈటెలు, బల్లెంలు, బాణాలకు పూజలు చేస్తున్న గిరిజనులుబరడలో వేటకు సిద్ధం అవుతున్న గిరిజనులుగిరిజన గ్రామాల్లో వెల్లివిరిసిన సంప్రదాయం -
చింతపల్లిలో ముత్యాలమ్మ జాతర సందడి
చింతపల్లి: స్థానిక గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి తీర్థమహోత్సవాలను పురస్కరించుకుని విద్యుత్ దీపాలంకరణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల పాటు ఈ తీర్థమహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. జాతర సందర్భంగా పట్టణమంతటా భారీ విద్యుత్ దీపాలంకరణతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం చింతపల్లి పాత బస్టాండ్ ఆవరణలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దీపాలంకరణ పనులను అధికారికంగా ప్రారంభించారు. సాధారణంగా ఈ విద్యుత్ పనులు మొదలైనప్పటి నుంచి చింతపల్లిలో జాతర వాతావరణం నెలకొందని స్థానికులు భావిస్తారు. జాతరకు ఇంకా కేవలం పది రోజులే సమయం ఉండటంతో, ఏర్పాట్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయడానికి శరవేగంగా పనులు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పసుపులేటి వినాయకరావు, పోతురాజు బాలయ్య పడాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బేతాళుడు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ నిలిపివేతతో మరణాలు
అనకాపల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీకి ) ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు అత్యవసర ఆపరేషన్లు నిలిపివేయడం వల్ల పేద రోగులు మరణాలు సంభవిస్తున్నాయని, వీటిని ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని సీపీఐ జిల్లా సీనియర్ నాయకుడు వై.ఎన్.భద్రం అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంకు విద్య, వైద్యం పట్ల చిత్తశుద్ధి లేదని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మూడుసార్లు ఆరోగ్యశ్రీని సేవలు నిలిపివేయడం, రోగులు చనిపోవడం జరుగుతూనే ఉందని ఓట్లు దండుకునే పథకాలకు నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం పేద రోగుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పగడ్బందీగా అమలు చేసి చికిత్స అనంతరం భృతిని అందజేసేదని కానీ దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వారికి అప్పగించడం వల్ల పేద వైద్య విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు తెలుస్తుందని, అదే జరిగితే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా ఇంటికి పంపిస్తారన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరించి పేద రోగులకు సేవలు అందించాలని లేకుంటే వారి ఆగ్రహాన్నికి గురికాక తప్పదన్నారు. ఆరోగ్యశ్రీని పునరుద్ధరించకుంటే ప్రజల తరఫున సీపీఐ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ అనకాపల్లి జోనల్ కార్యదర్శి తాకాసి వెంకటేశ్వరరావు, సభ్యులు శ్రీరామదాసు అబ్బులు, కోరుబిల్లి శంకరరావు పాల్గొన్నారు.అవి ప్రభుత్వ హత్యలేనని సీపీఐ ధ్వజం -
లలితా పీఠంలో గణపతి పూజలు
సీతంపేట(విశాఖ): సంకట హర చతుర్ధి సందర్భంగా ఆదివారం లలితానగర్ లలితా పీఠంలో విజయగణపతికి పంచామృతాభిషేకం, అర్చన, ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. పీఠం అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య దూప దీప నైవేద్యం, గణేశ స్త్రోత్రం, వ్రత కథ చదివారు. అనంతరం పీఠం దర్బారు హాల్లో శాస్త్రోక్తంగా హరిద్రా గణపతి హోమం నిర్వహించారు. ఈ హోమం వల్ల కార్యసిద్ధి, విఘ్నాల నివారణ, ఐశ్వర్యం, వివాహ సంబంధ సమస్యల పరిష్కారం, విద్య, బుద్ధి వృద్ధి, వ్యాపార పురోగతి, ఆరోగ్యం, విజయం లభిస్తాయని అర్చకులు తెలిపారు. పీఠం మేనేజర్ మన్నవ కృష్ణసేన్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
మహిళను మోసగించి, సజీవ దహనానికి యత్నం
కూర్మన్నపాలెం (విశాఖ): కల్లబొల్లి కబుర్లతో ఓ మహిళను నమ్మించి, ఆమెను శారీరకంగా లొంగదీసుకోవడమే కాకుండా, ఏకంగా ఆమెను అంతం చేయాలనే క్రూర ఆలోచనతో ఇంటికి నిప్పు పెట్టిన అమానుష ఘటన వడ్లపూడి అప్పికొండ కాలనీలో కలకలం రేపింది. దువ్వాడ సీఐ కె.మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త మరణించిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి వడ్లపూడిలో నివాసముంటోంది. ఈ క్రమంలో రాంబిల్లి మండలం రాజుపాలేనికి చెందిన సాయికృష్ణ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేసిన సాయికృష్ణ, ఆ తర్వాత ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, ఐదు నెలలుగా జైల్లో ఉన్న సాయికృష్ణ ఇటీవలే విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా సాయికృష్ణ బుద్ధి మార్చుకోకుండా, శుక్రవారం రాత్రి పుష్ప ఇంటికి వెళ్లి ఆమెను బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా అనుభవించాడు. శనివారం రాత్రి కూడా ఆమెతో ఘర్షణకు దిగి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే ఆమైపె కక్ష పెంచుకున్న నిందితుడు ఆదివారం తెల్లవారుజామున మళ్లీ వచ్చి ఇంటి బయట ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించి స్కూటీతో పాటు ఇంట్లోని సామగ్రి కూడా తగులబడింది. మంటలను గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సకాలంలో చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అదృష్టవశాత్తూ స్థానికుల చొరవతో పుష్ప, ఆమె కుమారుడు పెను ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. లేనిపోతే సజీవ దహనం అయ్యేవారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు సాయికృష్ణకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు విచారణలో తేలింది. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించగా, ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ కిరాతక ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ మల్లేశ్వరరావు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.ఇంటికి నిప్పుపెట్టిన వైనం -
17న నూకాంబిక జాతర
దేవరాపల్లి: మండలంలోని ఎం.అలమండలో నూకాంబిక అమ్మవారి జాతర (ఒడ్డు పండగ)ను ఈ నెల 17న భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు మాజీ సర్పంచ్లు దాడి జగన్, పోతల లక్ష్మీశంకర్ తెలిపారు. గ్రామ పెద్దలు, ప్రజలతో పండగ ఏర్పాట్లపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు జిల్లాల నుంచి వచ్చే సుమారు 70కు పైగా మహిళా కోలాట బృందాలు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పండగలో ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బృందాలను విజేతలుగా ప్రకటించి బహుమతులను అందజేస్తామని తెలిపారు. మధ్యాహ్నం భారీ ఎత్తున ఎడ్ల పరుగు పోటీ నిర్వహించి విజేతలకు నగదు బహుమతులను అందజేస్తామన్నారు. దేవతామూర్తుల వేషధారణలతో అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నట్టు చెప్పారు. అదే రోజు రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వారు తెలిపారు. -
జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు పాటుపడాలి
మునగపాక: దళితజాతి సముద్దరణ కోసం తపించిన మహోన్నత వ్యక్తి బాబూ జగ్జీవన్రామ్ ఒక్కరే అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి జగ్జీవన్రామ్ జయంతి కార్యక్రమం ఆదివారం మునగపాకలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్రామ్ చిత్రపటానికి ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ అంటరానితనానికి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేసి జన చైతన్యం తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ పాటుపడాలన్నారు. అంబేడ్కరిజమ్ పునాది అసోసియేషన్ కన్వీనర్ రాజాన బుజ్జిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోనపల్లి రామ్మోహనరావు, పెంటకోట సారథి, ఎస్సీ సెల్ విభాగం మండల అధ్యక్షుడు దిమ్మల శివ, పెంటకోట శ్రీనివాసరావు, ఆడారి రమణబాబు,కాండ్రేగుల రాజు, భీశెట్టి ఈశ్వరరావు పాల్గొన్నారు. నాగులాపల్లి జగ్జీవన్రామ్ కాలనీలో జరిగిన జయంతి కార్యక్రమంలో అనకాపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దొడ్డి శ్రీనివాసరావు జగ్జీవన్రామ్కు నివాళులర్పించారు. ఎంపీటీసీ చిందాడ దేవి, పొలమరశెట్టి నాగు,గోసాల గోవింద, పొలమరశెట్టి నూకాలయ్య, డొక్కా శివకుమార్, రాజు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ -
నూకాంబిక సన్నిధిలో కూచిపూడి వైభవం
అనకాపల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనకాపల్లి నూకాంబికా అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం అంబరాన్ని తాకుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశాఖపట్నంకు చెందిన ‘సిరి డ్యాన్స్ అకాడమీ’ వ్యవస్థాపకురాలు, ప్రముఖ నృత్య గురువు స్వర్ణ టీచర్ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన నాట్య విన్యాసాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. శాసీ్త్రయ నృత్య రీతులతో అలరించిన చిన్నారులు కూచిపూడి నృత్యంలోని ప్రాశస్త్యాన్ని చాటిచెబుతూ చిన్నారులు చేసిన ప్రదర్శనలు అత్యంత నిష్ణాతులైన కళాకారులను తలపించాయి. సంప్రదాయబద్ధమైన వేషధారణతో, ముఖంలో నవరసాలను పలికిస్తూ వారు చేసిన అభినయం చూపరులను కట్టిపడేసింది. గణపతి ప్రార్థనతో మొదలైన ఈ నృత్యోత్సవం, అమ్మవారి స్తోత్రాలు, తరంగం వంటి క్లిష్టమైన నృత్య రీతులతో కొనసాగింది. చిన్నారులు లయబద్ధమైన పాదముద్రలతో, చేతి ముద్రలతో కూచిపూడి సొగసును వేదికపై ఆవిష్కరించారు. అభినందనల జల్లు ఆ బాల కళాకారుల కళ్లలోని మెరుపు, దేహ కదలికల్లోని నృత్య సౌరభం అమ్మవారి సన్నిధిలో ఒక అద్భుత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించాయని అతిథులు అభినందించారు. అకాడమీ వ్యవస్థాపకురాలు స్వర్ణ టీచర్ను, ఆమె శిష్య బృందాన్ని ఆలయ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ప్రముఖ గాయకులు మల్లికార్జున, గోపిక పూర్ణిమ కూడా వీరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఓటీపీ మాయ
గ్యాస్ సరఫరాలోమహారాణిపేట: విశాఖ నగరంలో వంట గ్యాస్ బుకింగ్లో ఓటీపీ మాయాజాలం నడుస్తోంది. ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ అక్రమాలకు నిలయంగా మారింది. ఓటీపీ వచ్చి వారం రోజుల తర్వాత గ్యాస్ వస్తోందని ఏజెన్సీలు చెబుతున్నాయి. పది పదిహేను రోజులైనా రాకపోవడంతో సిలిండర్ పట్టుకుని వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. అక్కడకు వెళ్లినా ఇంకా మీ గ్యాస్ రాలేదని ఏజెన్సీల నుంచి సమాధానం వస్తోంది. దీంతో గ్యాస్ బుక్ చేసిన వినియోగదారులకు సరఫరా ఎగ్గొట్టి సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొరత లేదని చెప్తున్నా.. నగరంలో హెచ్పీసీఎల్, భారత్, ఐవోసీ గ్యాస్ కంపెనీలు వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరాపై ఆంక్షలు విధించడంతో ఆచూతూచి సరఫరా చేస్తున్నారు. దీంతో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. విశాఖలో మొత్తం 62 గ్యాస్ ఏజెన్సీల్లో 8 లక్షల 90 వేల డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. నేటికి లక్షా 65 వేల మందికి పైగా గ్యాస్ బుక్ చేశారు. వీరికి గతంలో ఓటీపీ నెంబర్ వచ్చాక ఒకట్రెండు రోజుల్లోనే సిలిండర్ వచ్చేదని, ఇప్పుడు ఓటీపీ వచ్చి 10–15 రోజులవుతున్నా.. సిలిండర్ డెలివరీ కావట్లేదని వినియోగదారులు వాపోతున్నారు. వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదని జిల్లా అధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఏజెన్సీలపై తీవ్ర ఒత్తిడి వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ మీద ప్రభుత్వం ఇప్పటికే పలు అంక్షలు విధించింది. 40 శాతం మేర సరఫరా తగ్గించారు. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్పై కూడా ఆంక్షలు వస్తాయన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బుకింగ్కు బుకింగ్కు మధ్య కనీసం 25 రోజుల వ్యవధి ఉండాలి. దీంతో ఖాళీ సిలిండర్లున్నవారు, ఒకట్రెండు వారాల్లో సిలిండర్ ఖాళీ అవుతుందనుకునేవాళ్లు తమ గడువు తీరిన వెంటనే బుకింగ్ చేస్తున్నారు. దీంతో ఏజెన్సీలపై ఒత్తిడి పెరుగుతోంది. పెరుగుతోన్న బుకింగ్ జాబితా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పలు ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి జిల్లాకు సాధారణ స్థాయిలోనే సిలిండర్లు సరఫరా అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మూడు నెలల గణాంకాలను పరిశీలిస్తే రోజుకు 18 వేలు చొప్పున సిలిండర్లు వస్తున్నాయి. యుద్దం నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులతో ప్రస్తుతం రోజుకు 25 వేల వరకు అందిస్తున్నారు. ఇప్పటికే లక్షా 65 వేల సిలిండర్లకు బుకింగ్ ఉంది. ఈ జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది.గ్యాస్ ఏజెన్సీ వద్ద క్యూ కట్టిన వినియోగదారులుడొమెస్టిక్ సిలిండర్ పక్కదారి? మరోవైపు డొమెస్టిక్ సిలిండర్లు టీ, టిఫిన్ దుకాణాలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్ల బాట పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల అధికారుల దాడుల్లో దొరికిన సిలిండర్లు ఈ ఆరోపణలను నిజం చేస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ కుమ్మకై ్క.. డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్లు తామే జరిపి, సిలిండర్లను బహిరంగ మార్కెట్లో వాణిజ్య వినియోగదారులకు రెండింతలు, మూడింతల ధరకు విక్రయిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొందరు వినియోగదారులు తాము బుక్ చేయకుండానే తమ మొబైళ్లకు ఓటీపీలు వస్తున్నాయని, తమ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. -
అలలపై విద్యుత్ కాంతులు
సాగర తీరాన ఆదివారం రాత్రి ఒక అద్భుత దృశ్యం పర్యాటకులను కట్టిపడేసింది. సముద్ర అలలపై రంగురంగుల విద్యుత్ దీపాలతో జిగేల్మంటూ కనిపిస్తున్న ఈ ఓడ కేవలం అలంకారానికే పరిమితం కాదు, తీర రక్షణలో దీని పాత్ర అత్యంత కీలకం. ప్రతి ఏటా తీర ప్రాంతంలో జరిగే భూకోతను అరికట్టేందుకు, సముద్ర గర్భంలోని ఇసుకను తవ్వి తిరిగి తీరానికి చేర్చే ‘డ్రెడ్జింగ్’ ప్రక్రియలో ఈ నౌకను వినియోగిస్తారు. రాత్రి వేళ తన విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్న ఈ డ్రెడ్జర్, చీకటి సముద్రంపై ఒక అందమైన దీపంలా మెరుస్తూ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. – ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
గంజాయి స్మగ్లర్ ఆస్తుల జప్తు
● విలువ రూ.రూ.34,93,031 ● పాడేరు డీఎస్పీ అభిషేక్ వెల్లడి పాడేరు: గంజాయి అక్రమ రవాణా ద్వా రా ఆస్తులు కూడబెట్టిన ఒక స్మగ్లర్కు చెందిన ఆస్తులను జప్తు చేసినట్లు పాడే రు డీఎస్పీ అభిషేక్ వెల్లడించారు. శనివారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.పాడేరు మండలం, డి.గొందూరు పంచాయతీ, పాలమామిడిశంక గ్రామానికి చెందిన డుంబేరి సతీష్ గతంలో గంజాయి వ్యాపారం చేస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిపై మొత్తం నాలుగు కేసులు నమోదు కాగా వీటిలో ఒకటి పాడేరు పోలీస్ స్టేషన్ పరిధిలోనిది. గంజాయి విక్రయాల ద్వారా సతీష్ భారీగా ఆస్తులు సంపాదించాడనే సమాచారంతో పాడేరు సీఐ దీనబంధు నేతృత్వంలో ఆర్థిక విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా ఒక భవనం, ఒక కారును గుర్తించి సీజ్ చేశారు. వీటి వివరాలను చైన్నెలోని కాంపిటెంట్ అథారిటీకి పంపించారు. అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం, ఆ ఆస్తుల విలువ రూ.34,93,031 గా నిర్ధారించి వాటిని జప్తు చేశారు. జప్తు చేసిన వీటిని కొనుగోలు చేసేందుకు ఎవరికీ అవకాశం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. గతంలో గంజాయి వ్యాపారం చేసిన వారిపై, ప్రస్తుతం చేస్తున్న వారిపై గట్టి నిఘా ఉంచామని డీఎస్పీ తెలిపారు. అక్రమ సంపాదనతో కూడబెట్టిన వారి ఆస్తులపై కూడా విచారణ కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పాడేరు సీఐ దీనబంధు పాల్గొన్నారు. -
అక్రమ దుకాణాల తొలగింపుతో ఉద్రిక్తత
పాడేరు రూరల్: జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో శనివారం అక్రమ దుకాణాల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. ముందస్తు సమాచారం ప్రకారమే తాము దుకాణాలను తొలగిస్తున్నామని పాడేరు మేజర్ పంచాయతీ ప్రత్యేక అధికారి రమేష్ స్పష్టం చేశారు. సిబ్బంది, వ్యాపారుల మధ్య వాగ్వాదం తొలగింపు చర్యలను చిరు వ్యాపారులు అడ్డుకోవడంతో పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది, వ్యాపారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పట్టణంలోని పీఎంఆర్సీ జంక్షన్ నుంచి రేకుల కాలనీ వరకు రహదారికి ఇరువైపులా ఉన్న అక్రమ దుకాణాలను పోలీసుల సహాయంతో తొలగించామని తెలిపారు. అలాగే తలారిసింగి అగ్నిమాపక కేంద్రం (ఫైర్ స్టేషన్) నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా పాత బస్టాప్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామన్నారు. పాడేరు జిల్లా కేంద్రం కావడంతో రోజురోజుకు వాహనాల తాకిడి, ప్రజల రద్దీ పెరుగుతోందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫుట్పాత్ ఆక్రమణలను తొలగిస్తున్నామని, ఎవరైనా అడ్డుకుంటే పోలీస్ కేసులు తప్పవని హెచ్చరించారు. పట్టణ సుందరీకరణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపార నిర్వాహకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది శేషగిరిరావు, చిన్ని, రాంనాయుడు తదితరులు పాల్గొన్నారు. అడ్డుకున్న వ్యాపారులు ముందస్తు సమాచారంతోనే చర్యలు.. ఈవో రమేష్ పోలీసుల రంగ ప్రవేశంతోసద్దు మణిగిన వివాదం -
పిడుగుపాటుకుగిరిజన రైతు మృతి
● రంగబయలులో విషాదం ముంచంగిపుట్టు: మండలంలోని అత్యంత మారుమూల ప్రాంతమైన రంగబయలు పంచాయతీలో ప్రకృతి ప్రకోపానికి ఒక గిరిజనుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగబయలు గ్రామానికి చెందిన సీసా గాసి (68) అనే గిరిజన రైతు శుక్రవారం సాయంత్రం తన పొలంలో పనులు చేసుకుంటుండగా, ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మొదలైంది. వర్షం నుంచి రక్షణ పొందేందుకు ఆయన సమీపంలోని ఒక చెట్టు నీడకు వెళ్లారు. దురదృష్టవశాత్తూ అదే సమయంలో ఆ చెట్టుపై పిడుగు పడటంతో, గాసి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. ఆ దారి వెంబడి వెళ్తున్న స్థానికులు గమనించి ఆయనను గ్రామానికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ఆయన ప్రాణాలు విడిచారు. కష్టపడి పనిచేసే వయసు మళ్లిన రైతు ఇలా అకాల మరణం చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ భాగ్యవతి, సర్పంచ్ దనియా, మండల వైఎస్సార్సీపీ నేతలు దేవా, బలరాజు శనివారం రంగబయలు గ్రామాన్ని సందర్శించారు. గాసి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
టీటీడీ ప్రతిష్టను దిగజార్చకండి
పాడేరు: తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీస్తూ, హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. మోదకొండమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు శనివారం గిరిజనుల ఇలవేల్పు పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. మాజీ మంత్రి, పార్టీ గాజువాక నియోజకవర్గ పరిశీలకుడు పసుపులేటి బాలరాజుతో కలిసి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వంపై విమర్శలు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రానికి చైర్మన్గా ఉంటూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న బీఆర్ నాయుడును ముఖ్యమంత్రి చంద్రబాబు వెనకేసుకురావడం సిగ్గుచేటని విమర్శించారు. మహిళల గౌరవం గురించి గొప్పలు చెప్పే సీఎం, ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తిరుమల ఖ్యాతిని మంటగలిపేలా ప్రవర్తిస్తున్న వ్యక్తిని వెంటబెట్టుకుని ఒంటిమెట్ట ఉగాది వేడుకల్లో పాల్గొనడం ఏమిటని నిలదీశారు. పోరాటం ఆపేది లేదు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ.. కళంకితుడైన వ్యక్తి చైర్మన్ పదవిలో కొనసాగడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయన్ను తొలగించకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి కూతంగి సూరిబాబు, మండల అధ్యక్షులు సీదరి రాంబాబు, నుర్మానీ మత్స్యకొండం నాయుడు, వైఎస్ ఎంపీపీలు కుడుముల సత్యనారాయణ, కుంతూరు కనకాలమ్మ, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షురాలు లకే రామసత్యవతి, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అపవిత్రమైన వ్యక్తిని తొలగించాలి: అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడుని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శనివారం స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు గోబ్యాక్, వివాదాస్పద వ్యక్తిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలి.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వామి వారు మంచి బుద్ధిని ప్రసాదించాలని, టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును మార్చాలని ప్రార్థించినట్లు తెలిపారు. అపవిత్రమైన వ్యక్తిని చైర్మన్గా కొనసాగిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. బీఆర్ నాయుడుకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు ఇప్పటికై నా మేల్కొని అతడిని వెంటనే తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయ చైర్మన్పై ఇన్ని ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? హిందూ ధర్మంపై ప్రేమ చూపే ప్రధాని మోదీ, సనాతన ధర్మం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు? అని ప్రశ్నించారు. 2029లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, కూటమి ప్రభుత్వ ఆరాచకాలకు ప్రజలే గుణపాఠం చెబుతారని ఆమె అన్నారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు కనీస గౌరవం ఇవ్వని వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించి చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దిగజారుస్తున్నారన్నారు. తిరుపతిలో ఈ ఘటనపై నిరసన తెలిపిన మహిళలపై దాడి చేయడం దారుణం అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ఉమ్మడి విశాఖ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్, సర్పంచ్లు పెట్టెలి సుస్మిత, ఇరగాయి బుటికి, పాగి అప్పారావు, రాధిక, హరి, మండల పార్టీ అధ్యక్షులు రామూర్తి, పాంగి పరశురామ్, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, శత్రుఘ్న, రామచందర్, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి,వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, కల్చరల్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు పెట్టెలి సుక్రయ్య, నాయకులు శోభ సోమేశ్వరి, చినసత్యం, నర్సింగరావు పాల్గొన్నారు. అరకులో నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర,మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలుపాడేరులో మోదకొండమ్మ ఆలయ ఆవరణలో బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ మంత్రి బాలరాజు, వైఎస్సార్సీపీ శ్రేణులు బీఆర్ నాయుడును చైర్మన్ పదవి నుంచి తొలగించండి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై పాడేరు, అరకులో నిరసనలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు -
రోగులకు నరకయాతన
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలి ఉదయం నుంచి క్యూలైన్లో నిలబడ్డా జ్వరంతో ఈనెల 2వతేదీ గురువారం జిల్లా ఆస్పత్రిలో ఇన్పేషెంట్గా చేరా. వైద్యులు రక్తపరీక్షలు చేయించమన్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలైన్లో నిల్చుని తీవ్ర ఇబ్బందులు పడ్డా. మధ్యాహ్నం 3గంటలకు పరీక్షలకు రక్తం సేకరించారు. – గెమ్మెలి గున్మమ్మ, బిరిమిశాల, పాడేరు మండలం సాక్షి, పాడేరు: జిల్లావ్యాప్తంగా సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో పాడేరు జిల్లా సర్వజన ఆస్పత్రికి రోగుల తాకిడి గణనీయంగా పెరిగింది. అయితే, రక్తపరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులతో రోగులు తీవ్ర నరకం చూస్తున్నారు. ప్రతిరోజూ 200 నుంచి 300 మందికి పైగా రోగులు రక్తపరీక్షల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడలేక అవస్థలు పడుతున్నారు. జ్వరపీడితులతో రద్దీ జిల్లా ఆస్పత్రి కావడంతో అన్ని ప్రాంతాల నుంచి జ్వరపీడితుల రద్దీ అధికంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కూడా అత్యవసర కేసులను పాడేరు ఆస్పత్రికే రిఫర్ చేస్తున్నారు. రోజువారీ ఓపీ సంఖ్య 500 దాటుతుండగా, వారిలో సుమారు 200 మందికి పైగా రక్తపరీక్షలు అవసరమవుతున్నాయి. ● ప్రస్తుతం రక్తపరీక్షల విభాగాన్ని ఆస్పత్రిలోని ఒక ఇరుకై న వరండాలో ఏర్పాటు చేశారు. అక్కడ సరైన గాలి వెలుతురు లేకపోవడంతో రోగులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఫ్యాన్ల సౌకర్యం కూడా లేకపోవడంతో, తీవ్ర జ్వరంతో ఉన్న రోగులు ఆ ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. సిబ్బంది కొరత.. ఒక్కరితోనే పరీక్షలు రక్తపరీక్షల విభాగంలో రోగుల సంఖ్యకు తగ్గట్టుగా సిబ్బంది లేరు. ఓపీ రాసేందుకు ఇద్దరు ఉన్నప్పటికీ, రక్త నమూనాలు సేకరించడానికి ఒక్కరు మాత్రమే అందుబాటులో ఉండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. రోజుకు వందలాది మంది వస్తున్నా, అదనపు కౌంటర్ ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రోగులు మండిపడుతున్నారు. ఇన్పేషెంట్లకూ తప్పని తిప్పలు గతంలో ఆస్పత్రిలో చేరిన ఇన్పేషెంట్ల వద్దకే సిబ్బంది వెళ్లి రక్త నమూనాలు సేకరించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తీవ్ర అస్వస్థతతో ఉన్న రోగులు కూడా సహాయకుల సాయంతో నడుచుకుంటూ లేదా చక్రాల కుర్చీలపై పరీక్షా కేంద్రానికి రాక తప్పడం లేదు. ఆలస్యంగా రిపోర్టులు: మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధుల నిర్థారణకు రక్త నమూనాల సేకరణలో జాప్యం జరగడమే కాకుండా, రిపోర్టులు ఇవ్వడంలోనూ తీవ్ర ఆలస్యమవుతోంది. ఇక్కడ పూర్తిస్థాయి సిబ్బందికి బదులుగా ఎక్కువ మంది ట్రైనీ విద్యార్థులే విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిపోర్టులు సకాలంలో రాకపోవడంతో రోగులకు సత్వర వైద్యం అందడం లేదని వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడేరు రూరల్: మత విద్వేషాలకు తావులేకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని క్రైస్తవ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి ఆధ్వర్యంలో పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ నాయకులు పాస్టర్ తిమోతి, మత్స్యరాజుల నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ అధికారులకు, సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పాలకులందరూ ప్రజలందరినీ సమానంగా చూడాలని కోరారు. అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటున్న హిందూ, క్రైస్తవ, మైనారిటీ వర్గాల మధ్య రాజకీయాల కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం తగదన్నారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాల వారికి రిజర్వేషన్లు వర్తించవని చెప్పడం భావ్యం కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించి, గతంలో ఉన్న విధంగానే రిజర్వేషన్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాస్టరర్ల సంఘ నాయకులు సల్మాన్, బాబురావు, జాన్, జోసెఫ్, యోబు, ప్రేమ్ కుమార్, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. రక్తపరీక్షల విభాగంలో రక్తపరీక్షల విభాగం విస్తరిస్తాం రక్తపరీక్షల విభాగం సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వరండాకు ఆనుకుని ఉన్న విశాలమైన గదిలో రక్తపరీక్షల విభాగం ఏర్పాటుకు నిర్ణయించాం. అక్కడ ఫ్యాన్లు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంచుతాం. రక్తపరీక్షలు వేగవంతానికి తగిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ ఎర్రయ్య, ఇన్చార్జి డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రి, పాడేరు క్రైస్తవ సంఘాల డిమాండ్ పాడేరు జిల్లా ఆస్పత్రిలో రోగుల పాట్లు రక్తపరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షణ! ఊపిరి సలపక అవస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న రోగులు -
వైఎస్సార్సీపీ హయాంలోనే గ్రామాభివృద్ధి
చోడవరం: వైఎస్సార్సీపీ హయాంలోనే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పంచాయతీ సర్పంచ్ల పదవీ ముగిసిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని 91 మంది సర్పంచ్లను శనివారం ఘనంగా సత్కరించారు. చోడవరంలో జరిగిన సన్మాన సభలో చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల నుంచి వివిధ గ్రామాల సర్పంచ్లు, మండల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నెరవేర్చారన్నారు. పంచాయతీలను బలోపేతం చేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చారన్నారు. అన్ని శాఖల సచివాలయ ఉద్యోగులు సర్పంచ్ల పర్యవేక్షణలో పనిచేసే మహోన్నత విధానాన్ని తెచ్చారన్నారు. సచివాలయ వ్యవస్థలో వలంటీర్లను తెచ్చి సంక్షేమ పథకాలన్నీ నేరుగా ప్రజల ఇంటి వద్దకే అందించేలా చేశారని కొనియాడారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా ప్రతీ పని వలంటీర్ల ద్వారా సచివాలయంలోనే జరిగేలా ఒక కొత్త వ్యవస్థను తెచ్చి దేశ చరిత్రలో రికార్డు సృష్టించిన ఘనత జగన్మోహన్రెడ్డిదే అన్నారు. ప్రతీ పంచాయతీలో రూ. 2.5 కోట్లతో పంచాయతీ భవనాలు, సచివాలయం, కమ్యూనిటీ ఆస్పత్రి, రైతు భరోసా కేంద్రం కట్టించి, ఆయా కార్యాయాల్లోనే పూర్తి స్థాయిలో ప్రజలు సేవలు అందించారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ఐదేళ్లపాటు గ్రామ స్థాయిలో ప్రజలకు ఎంతో సేవలు అందించిన సర్పంచ్లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంటు పరిశీలకురాలు శోభా హైమావతి, చోడవరం నియోజకవర్గ పరిశీలకుడు గండి రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, సంయుక్త కార్యదర్శి దొండ రాంబాబు, జెడ్పీటీసీ పోతల శ్రీనివాసరావు, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, ఎంపీపీలు గాడి కాసు, పైల రాజు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు బైన ఈశ్వరరావు, దొండా నారాయణమూర్తి, శరగడం నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నంపై విచారణ
దేవరాపల్లి: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గరిశింగి సచివాలయంలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న జి.రాజ్యలక్ష్మి పాడేరులో శుక్రవారం ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి (డీఐవో) చంద్రశేఖర్దేవ్ స్థానిక పీహెచ్సీలో శనివారం విచారణ జరిపారు. పీహెచ్సీ వైద్యాధికార్లు ఈ.పూజ్యమేఘన, డి.వనజల నుంచి ఆయన వివరాలను సేకరించారు. స్థానిక పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజ్ వేధింపులకు గురి చేయడంతోనే తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. హెల్త్ సూపర్వైజర్ వేధింపులపై ఇటీవల స్థానిక ఎంపీడీవోకు సైతం ఏఎన్ఎం రాజ్యలక్ష్మి ఫిర్యాదు చేసినట్లు స్థానిక పీహెచ్సీ వైద్యులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు సూపర్వైజర్ను అదే రోజు మరో సబ్సెంటర్కు తాత్కాలింగా మార్పు చేశామని స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి పూజ్యమేఘన తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజ్ను సైతం ప్రశ్నించారు. ఆత్మహత్యకు యత్నించిన రాజ్యలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని పాడేరు వైద్యులు, బంధువులను అడిగి తెలుసుకుంటున్నామని డీఐవో చంద్రశేఖర్దేవ్ తెలిపారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన అనంతరం పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. కాగా ఎనిమిది నెలలు క్రితం ఆమె బదిలీపై దేవరాపల్లి పీహెచ్సీకి వచ్చారు. -
లాడ్జీలో కర్ణాటక వ్యక్తికి తీవ్ర గాయాలు
నర్సీపట్నం: పట్టణంలోని లాడ్జీలో కర్ణాటక వ్యక్తి తీవ్ర గాయాల పాల య్యాడు. అతడితోపాటు వచ్చిన వారు బి.ఎన్.సాగర్ పేరు మీద లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. రెండు రోజులుగా నలుగురు కలిసి ఉంటున్నారు. శనివారం రాత్రి రూమ్లో బీరు సీసాలు పడి ఉన్నాయి. వారిలో ఒకరిపై దాడి జరిగింది. దాడికి గురైన వ్యక్తి అపసార్మక స్థితిలో పడి ఉన్నాడు. లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడితో దిగిన బి.ఎన్.సాగర్, మరో ఇద్దరు రూమ్ నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని పోలీసులు సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. -
సకలజీవులపై ప్రేమ, కరుణ కలిగి ఉండాలి
బయ్యవరం వద్ద పాదయాత్ర ముగించి ధ్యానం చేస్తూ విశ్రమిస్తున్న దిగంబర జైన ముని ఆచార్య ప్రముఖ్ సాగర్ జి మహారాజ్ కశింకోట: సకల జీవుల పట్ల ప్రేమ, గౌరవం,కరుణ కలిగి ఉండాలని దిగంబరజైన ముని ఆచార్య ప్రముఖ్ సాగర్జి మహారాజ్ ఉద్బోధించారు. మండలంలోని బయ్యవరం గ్రామానికి దిగంబర జైన మునులైన సాగర్జి మహారాజ్ సహా ప్రభాకర్ సాగర్ చేపట్టిన మంగళ అహింస పాద యాత్ర శనివారం సాయంత్రం చేరింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సకల జీవుల పట్ల ప్రేమ, గౌరవం,కరుణ కలిగి ఉండాలనే సందేశాన్ని బోధించడానికి దేశ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నామన్నారు. గత ఏడాది నవంబర్ 30న కోల్కత్తా నుంచి చేపట్టిన పాద యాత్ర కర్నాటకలోని బెంగళూరుకు వచ్చే జులై వరకు సాగనుందన్నారు. ప్రతి రోజు సుమారు 25 కిలో మీటర్లు యాత్ర చేస్తున్నట్టు చెప్పారు. -
ఉర్రూతలూగించిన గజల్ శ్రీనివాస్ గానం
మద్దిలపాలెం: గజల్ విద్వాంసుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తన గానంతో విశాఖ వాసులను ఉర్రూతలూ గించారు. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో గజల్ శ్రీనివాస్ను గజల్ కళాభారతి పురస్కారంతో కళాభారతి ట్రస్ట్ ప్రతినిధులు ఎం.ఎస్.ఎన్.రాజు, గుమ్మూలూరి రాంబాబు, పైడా కృష్ణప్రసాద్ సత్కరించారు. వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్, స్పిరిట్యుయల్ గురు మౌలానా అమిర్ ఉద్దీన్ మలక్ సాహెబ్, స్థానిక వస్త్ర వ్యాపార అధిపతి శ్రీ మల్లిక్, అధ్యక్ష, కార్యదర్శులు రూ.20 వేలు నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కళాభారతి ట్రస్ట్ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ మూడు సార్లు గిన్నిస్బుక్ ప్రపంచ రికార్డు అందుకుని, 150 భాషల్లో గజల్స్ పాడుతూ, అనేక దేశాల్లో గజల్ కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందిన తెలుగు తేజం డాక్టర్ గజల్ శ్రీనివాస్ అని కొనియాడారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే తనకు కొన్ని వందల బిరుదు సత్కారాలు జరిగాయన్నారు. కళలకు నిలయమైన కళాభారతి పేరుతో గజల్ కళాభారతి అనే సత్కారం మొదటిసారి అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం జరిగిన గజల్ గాత్ర కచేరీలో ఆయన పలు గజల్స్ పాడి శ్రోతలను మైమరపించారు. భారతం, భాగవతం, రామాయణం, వంటి పుణ్య గ్రంథాల నుంచి క్లుప్తంగా గానం చేసి ఆధ్యాత్మికత భావాన్ని కల్పించారు. -
ఉత్సాహంగా పోలీస్ వార్షిక క్రీడా సంబరాలు
పరుగు పోటీలో పాల్గొన్న పోలీస్ అధికారులు ఆరిలోవ(విశాఖ తూర్పు): అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని విశాలాక్షినగర్ ఆర్మ్డ్ రిర్వ్డ్ పోలీస్ మైదానంలో శనివారం పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి క్రీడా పోటీలు పోలీస్ విభాగంలో ఐపీఎస్ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు ఒకే వేదికపైకి తీసుకువస్తుందని తెలిపారు. తోటి సిబ్బందితో పరిచయాలు పెంచుకొని సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడతాయన్నారు. ఆయా పోటీల్లో అనకాపల్లి, పరవాడ, నర్సీపట్నం, సబ్ డివిజన్లతోపాటు ఆర్మ్డ్ రిజర్వ్డ్ విభాగానికి చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చూపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై అట్రాసిటీ కేసు పెట్టాలి
ఆరిలోవ: దళిత డప్పు కళాకారుడు నాగులాపల్లి రాందాస్పై దాడి చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి జిల్లా ఎస్సీ విభాగం పరిశీలకుడు అల్లంపల్లి రాజుబాబు డిమాండ్ చేశారు. పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలన్నారు. మద్దిలపాలెంలో పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు, హత్యలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. నిన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో మరిడిమాండ జాతరలో దళిత డప్పుకళాకారుడి చెంపపై కొట్టారు..మొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆకివీడులో దళిత పేటలో శ్రీరామనవమి వేడుకలో 300 మంది కిరాయి రౌడీలతో దళితలపై దాడులు చేయించి, వీరిలో 57 మంది దళిత యువకులపై హత్యాయత్న కేసులను బనాయించారన్నారు. ఇద్దరూ గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి దళితలపై దాడులకు పాల్పడడం హేయమన్నారు. ఇటీవల దళితుడైన మంద సాల్మాన్ హత్య చేశారని, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు, దళిత మహిళపై సదరు ఎమ్మెల్యే అనుచరుడు నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డాడని వాపోయారు. ప్రభుత్వం తీరు మారకుంటే వచ్చే ఎన్నికల్లో దళితులంతా తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. -
అక్రమ దుకాణాల తొలగింపుతో ఉద్రిక్తత
పాడేరు రూరల్: జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో శనివారం అక్రమ దుకాణాల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. ముందస్తు సమాచారం ప్రకారమే తాము దుకాణాలను తొలగిస్తున్నామని పాడేరు మేజర్ పంచాయతీ ప్రత్యేక అధికారి రమేష్ స్పష్టం చేశారు. సిబ్బంది, వ్యాపారుల మధ్య వాగ్వాదం తొలగింపు చర్యలను చిరు వ్యాపారులు అడ్డుకోవడంతో పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది, వ్యాపారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పట్టణంలోని పీఎంఆర్సీ జంక్షన్ నుంచి రేకుల కాలనీ వరకు రహదారికి ఇరువైపులా ఉన్న అక్రమ దుకాణాలను పోలీసుల సహాయంతో తొలగించామని తెలిపారు. అలాగే తలారిసింగి అగ్నిమాపక కేంద్రం (ఫైర్ స్టేషన్) నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా పాత బస్టాప్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామన్నారు. పాడేరు జిల్లా కేంద్రం కావడంతో రోజురోజుకు వాహనాల తాకిడి, ప్రజల రద్దీ పెరుగుతోందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫుట్పాత్ ఆక్రమణలను తొలగిస్తున్నామని, ఎవరైనా అడ్డుకుంటే పోలీస్ కేసులు తప్పవని హెచ్చరించారు. పట్టణ సుందరీకరణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపార నిర్వాహకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది శేషగిరిరావు, చిన్ని, రాంనాయుడు తదితరులు పాల్గొన్నారు. అడ్డుకున్న వ్యాపారులు ముందస్తు సమాచారంతోనే చర్యలు.. ఈవో రమేష్ పోలీసుల రంగ ప్రవేశంతోసద్దు మణిగిన వివాదం -
స్పీకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
నర్సీపట్నం: జాతరలో దళితుడిని కొట్టిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని విదసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. పండగలో డప్పు కొట్టడానికి వచ్చిన దళితుడిని స్పీకర్ చెంప పగల గొట్టడాన్ని నిరసిస్తూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం నర్సీపట్నం అబిద్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల మంది సమక్షంలో దళితుడిని బహిరంగంగా కొట్టడం స్పీకర్ అహంకారానికి నిదర్శనమన్నారు. పండగలో ప్రజలంతా సంతోషంతో ఉంటే, దళితులను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగడం అమానుషమన్నారు. తప్పును సరిదిద్దుకోకుండా బాధితుడిని బెదిరించి రాజకీయ ప్రకటన ఇప్పించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తమకు రాజకీయాలు అనవసరమని, తప్పు ఎవరు చేసినా చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. నేతల నాగేశ్వరరావు మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడుకు దళితులను అవమానించటం పరిపాటిగా మారిందన్నారు. పదవి ఉంటే నేల మీద నిలబడు అన్నారు. మట్ల అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విదసం నాయకులు లావణ్య, గోడి వెంకటేశ్వరరావు, అల్లంపల్లి ఈశ్వరరావు, ఈరెల్లి సుదీర్కుమార్, చెక్క రాంబాబు, తాతబాబు తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ దళితుడిని కొట్టడం అమానుషం: కె.వి.పి.ఎస్ నర్సీపట్నం: అమ్మవారి జాతరలో డప్పు కొట్టడానికి వచ్చిన దళితుడిని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొట్టడం అమానుషమని కె.వి.పి.ఎస్. నాయకులు పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ ఈ విధంగా దాడి చేయటం దారుణమన్నారు. స్పీకర్ వంటి వ్యక్తుల వల్లే దళితులపై దాడులు నానాటికీ పెరుగుపోతున్నాయన్నారు. తక్షణమే స్పీకర్ అయ్యన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఆగిఉన్న లారీనీ ఢీకొన్న వ్యాన్
ప్రమాదవివరాలు తెలుసుకుంటున్న ఎస్ఐ సన్నిబాబు, (ఇన్సెట్) రామ్మూర్తి మృతదేహం నక్కపల్లి: జాతీయరహదారిపై వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంంలో ఒక వ్యక్తి మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం గింజేరి గ్రామానికి చెందిన సుమారు 10 మంది వ్యాన్లో ఒంగోలు వెళ్లారు.అక్కడ ఫంక్షన్ చూసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ నక్కపల్లి సమీపంలో వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డుపక్కన పార్క్చేసిన ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొంది. ఈఘటనలో వ్యాన్లో డ్రైవర్ పక్కన కూర్చొన్న రాజాన రామ్మూర్తి(60) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు.వ్యాన్లో ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలోవిజయనగరం జిల్లా ఎస్.కోట మండలం కొట్టాంకు చెందిన దండుపాటి శాంతి, ఇదే మండలం చామలపల్లిగ్రామానికి చెందిన జుత్తాడ దేవి,కొత్తవలస మండలం ముమ్మలోడుపాలెంకు చెందిన మంతిన దుర్గమ్మ, చామలపల్లి గ్రామానికి చెందిన రాపర్తి రామలక్ష్మి,గింజేరి గ్రామానికి చెందిన నానిపల్లి లక్ష్మి ఉన్నారు. వీరికి నక్కపల్లి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి విశాఖ కేజీహెచ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
పలు రైళ్లు దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం: ఈస్ట్రన్ రైల్వే పరిధిలో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను ఏప్రిల్ నుంచి జూన్ 30వ తేదీ వరకు దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్కుమార్ తెలిపారు. ● ఏప్రిల్ 6, 13, 20, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో తాంబరం–సిల్ఘాట్ టౌన్(15629) నాగోన్ ఎక్స్ప్రెస్, తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 3,10,17,24, మే 1,8,15,22,29 జూన్ 5,12,19,26వ తేదీల్లో సిల్ఘాట్ టౌన్–తాంబరం(15630) నాగోన్ ఎక్స్ప్రెస్లు మళ్లించబడిన మార్గంలో వయా అసన్సోల్, అండల్, సయింథియా మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ● ఈ నెల 2,9,16,23,30 మే 7,14,21,28, జూన్ 4,11,18,25వ తేదీల్లో తాంబరం–న్యూ టిన్సుకియా (15929) ఎక్స్ప్రెస్, తిరుగు ప్రయాణంలో ఈ నెల 6,13,20,27 మే 4,11,18,25 జూన్ 1,8,15,22,29వ తేదీల్లో న్యూ టిన్సుకియా–తాంబరం(15930)ఎక్స్ప్రెస్లు మళ్లించబడిన మార్గంలో వయా అసన్సోల్, అండల్, సయింథియా మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ● ఈ నెల 8,15,22,29 మే 6,13,20,27 జూన్ 3,10,17,24వ తేదీలల్లో డాక్టర్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–న్యూ జల్పయ్గురి (22611) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, తిరుగు ప్రయాణంలో ఈ నెల10,17,24 మే 1,8,15,22,29 జూన్ 5,12,19,26వ తేదీల్లో న్యూ జల్పయ్గురి–డాక్టర్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ (22612) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు మళ్లించబడిన మార్గంలో వయా అసన్సోల్, అండల్, సయింథియా మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ● ఈ నెల 4,11,18,25 మే 2,9,16,23,30 జూన్ 6,13,20,27వ తేదీల్లో ఎస్ఎంవీటి బెంగళూరు–కామాఖ్య (12551)ఎక్స్ప్రెస్, తిరుగు ప్రయాణంలో ఈ నెల 8,15,22,29 మే 6,13,20,27 జూన్ 3,10,17,24వ తేదీల్లో కామాఖ్య– ఎస్ఎంవీటీ బెంగళూరు (12552) ఎక్స్ప్రెస్లు మళ్లించబడిన మార్గంలో వయా అసన్సోల్, అండల్, సయింథియా మీదుగా రాకపోకలు సాగిస్తాయి. -
మౌనిక హత్య కేసుపై జ్యూడిషియల్ విచారణ జరపాలి
కంచరపాలెం: గాజువాకలో గత నెల 29న దారుణ హత్యకు గురైన దళిత మహిళ పోలిపల్లి మౌనిక ఘటనపై ఉన్నత స్థాయి జ్యూడిషియల్ విచారణ జరపాలని పలు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీ–1లో మహిళా, దళిత సంఘాలు, స్థానిక కాలనీ యూత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ.. మౌనికను అత్యంత కర్కశంగా హతమార్చిన నేవీ ఉద్యోగి రవీంద్ర పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని మండిపడ్డారు. నిందితుడికి నేర చరిత్ర లేదని, మృతదేహాన్ని ఏం చేయాలో పాలుపోక లొంగిపోయాడని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకవైపు నిందితుడు కిటికీలోంచి వెళ్లి తలుపు తీశాడని చెబుతూనే, మరోవైపు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం వెనుక అసలు నిజాన్ని దాచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మృతురాలు దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడమే ఈ నిర్లక్ష్యానికి కారణమని నేతలు ధ్వజమెత్తారు. పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే తక్షణమే జ్యూడిషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు అనురాధ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రతినిధి బేగం, సీఎమ్మెస్ నేత లలిత, చింతాడ సూర్యం, న్యాయవాదులు గిరిధర్, పద్మ, దళిత సంఘాల నాయకులు కొత్తపల్లి వెంకటరమణ, పీవోడబ్ల్యూ ప్రతినిధులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మహిళ, దళిత ప్రజాసంఘాల నేతల డిమాండ్ -
కాపర్ వైరు దొంగ అరెస్టు
అచ్యుతాపురం రూరల్: సెజ్ పరిసర ప్రాంతాల్లో కాపర్ వైరు చోరీ చేసిన ఓ వ్యక్తిని అచ్యుతాపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి, మార్చి నెలల్లో సెజ్ పరిధిలో ఉన్న మెగా ఇంజినీరింగ్ కంపెనీలో రూ.1.50 లక్షల విలువైన వైరును గాజువాకలోని కణితి రోడ్డుకు చెందిన గడ్డిపాటి తిలక్ కుమార్ చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వైరును విక్రయించగా వచ్చిన నగదుతో ఓ కారు కొనుగోలు చేసినట్టు వారు చెప్పారు. ఆ కారులో దర్జాగా వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్టు వారు తెలిపారు. ఇతనిపై ఇప్పటికే గాజువాక, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం పరిధిలో పలు పోలీసు స్టేషన్లలో చోరీ కేసులు నమోదైనట్టు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
గడ్డివాము, పశువుల పాకలు దగ్ధం
మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది నాతవరం: గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మండలంలోని ఎం.బి.పట్నంలో గడ్డివాము, పశువుల పాకలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన వి.రాజుబాబు తన పొలంలో పశువుల మకాం వద్ద గడ్డి వాము, పాకలు వేసుకున్నాడు. శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం ఎస్ఐ అప్పలస్వామి, సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. గడ్డి వాము, పశువుల పాకలు దగ్ధమవడంతో రూ. 50 వేలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. -
వీసీసీఐ ఆధ్వర్యంలో స్పీకర్ మీట్
ఏయూక్యాంపస్: విశాఖపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(వీసీసీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం బీచ్ రోడ్డులోని ఒక హోటల్లో స్పీకర్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. గూగుల్ ఇండియా కస్టమర్ ఎంగేజ్మెంట్ విభాగాధిపతి మైత్రేయి గణపతి కీలకోపన్యాసం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కస్టమర్ ఎంగేజ్మెంట్ను బలోపేతం చేయడం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఏఐ టెక్నాలజీ పాత్రను వివరించారు. అభివృద్ధి చెందుతున్న డిజిట్ ప్రపంచంలో ఎంసెస్ఎంఈలు, పరిశ్రమల వాటాదారులకు ఎంతో ఉపయుక్తంగా ఈ ప్రసంగం నిలచింది. వీసీసీఐ అధ్యక్షుడు ఎం.సుదర్శన్ స్వామి ప్రారంభోపన్యాసం అందించారు. మ్యాపిల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శివ్కుమార్ మాట్లాడుతూ సాంకేతికత స్వీకరించడం, ఆవిష్కరణలు, భవిష్యత్కు సిద్ధమైన వ్యాపార వ్యూహాలను వివరించారు. డబ్ల్యూఎన్ఎస్ ఉపాధ్యక్షుడు ఆర్.ఎల్.నారాయణ మోడరేటర్గా నిర్వహించిన రెండో సెషన్లో కృష్ణ మోహన్, నీరజ్ సార్ధా, కీర్తన ఆనంద్, రాజేష్ పూసర్ల, పవన్ తదితరులు వ్యాపార విస్తరణ వ్యవస్థలకు సంబంధించిన విభిన్న అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ చర్చలో పాల్గొన్నారు. వీసీసీఐ కార్యదర్శి పి.రాజేష్ వందన సమర్పణ చేశారు. -
గిరిజన యువతి ఆత్మహత్య
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతోనే దేవరాపల్లి: ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లికి నిరాకరించడంతోనే తీవ్ర మనస్తాపం చెందిన గిరిజన యువతి దూసరి లక్ష్మి (22) ఆత్మహత్య చేసుకుంది. దేవరాపల్లిలో గత నెల 30న అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ శివారు కొరపర్తికి చెందిన గిరిజన యువతి లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం సీఐ కె.కృష్ణ, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణతో కలిసి అనకాపల్లి ఇన్చార్జి డీఎస్పీ ఈ.శ్రీనివాసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతగిరి మండలం కొరపర్తి గ్రామానికి చెందిన దూసరి లక్ష్మి దేవరాపల్లిలోని ఓ ప్రైవేటు క్లినిక్లో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. దేవరాపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కొల్లి లోకేష్ (24)కు ఐదేళ్ల క్రితం లక్ష్మితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. అయితే ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, నిందితుడు లోకేష్ మీది తక్కువ కులం అని, పెళ్లి చేసుకోవడం కుదరదని నిరాకరించాడు. ప్రియుడు నమ్మించి మోసగించడాన్ని తట్టుకోలేని లక్ష్మి తీవ్ర మనస్తాపంతో గత నెల 30న తాను నివాసం ఉంటున్న ఇంటిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి దూసరి పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే గిరిజన యువతిని వంచించి ఆత్మహత్యకు కారకుడైన లోకేష్ను రైవాడ జలాశయం సమీపంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు లోకేష్పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ, ఆత్మహత్యకు ప్రేరేపించడం, పెళ్లి చేసుకుంటానని మోసగించడానికి సబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఇన్చార్జి డీఎస్పీ చెప్పారు . నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్టు ఆయన తెలిపారు. -
కలెక్షన్ల కలకలం
హెడ్ నర్సుల పోస్టింగ్ల్లోసీఎంవోకు ఫిర్యాదు 13న కమిటీ విచారణ మహారాణిపేట: వైద్య ఆరోగ్యశాఖలో ఇటీవల జరిగిన హెడ్ నర్సుల పదోన్నతులు, పోస్టింగ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రాధారాణి ఆధ్వర్యంలో ఇటీవల హెడ్ నర్సులకు పదోన్నతులు కల్పించి, పలు ఆస్పత్రుల్లో పోస్టింగ్లు జారీ చేశారు. అయితే ఈ పదోన్నతులు, పోస్టింగ్ల వెనుక లక్షలాది రూపాయల అవినీతి జరిగిందని విశాఖ సిటిజెన్ ఫోరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బీవీకే బాబ్జీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పదోన్నతులు పొందిన పలువురు నర్సుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఆయన తన లేఖలో ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన ఈ ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు, దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా కలెక్టర్ను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ ఆ ఫిర్యాదును కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణికి పంపించారు. అయితే హెడ్ నర్సుల పదోన్నతుల వ్యవహారం తన పరిధిలోకి రాకపోవడంతో.. సూపరింటెండెంట్ ఆ లేఖను తిరిగి వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ డైరెక్టర్కు బదిలీ చేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు.. వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ (మేల్) ప్రిన్సిపాల్ డాక్టర్ మీనాక్షిని విచారణ అధికారిగా నియమించారు. ఈ నెల 13న ఈ వ్యవహారంపై డాక్టర్ మీనాక్షి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఆ ముగ్గురే కీలకం.. ముఖ్యమంత్రికి అందిన ఫిర్యాదులో ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. నర్సుల సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగాభవాని, కార్యదర్శి వరలక్ష్మి, ఈసీ సభ్యురాలు గౌరి.. పదోన్నతి పొందిన మొత్తం 30 మంది నర్సుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సదరు 30 మంది నర్సులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గురు నాయకురాళ్లను కూడా విచారణ అధికారి ప్రత్యేకంగా ప్రశ్నించనున్నారు. అంతేకాకుండా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తమ రోజువారీ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని కూడా ఫిర్యాదులో ఆరోపించారు. వీరికి కేటాయించిన వార్డుల్లో డ్యూటీలు చేయకుండా, నిత్యం క్లాక్ రూమ్లోనే ఉంటూ అక్కడి నుంచే సెటిల్మెంట్లు చేస్తున్నారని విమర్శించారు. నర్సింగ్ సూపరింటెండెంట్ అండదండలతోనే.. మిగతా నర్సులందరికీ ఎప్పటికప్పుడు డ్యూటీలు మారుస్తున్నప్పటికీ, వీరు మాత్రం ఏళ్ల తరబడి ఒకే వార్డులో తిష్టవేశారని ఫిర్యాదులో ఆక్షేపించారు. నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి అండదండలతోనే వీరు ఇలా రెచ్చిపోతున్నారని, ఎవరికై నా తమకు అనుకూలమైన డ్యూటీలు లేదా మంచి పోస్టింగ్లు కావాలంటే వీరిని కలిసి అడిగినంత ఇచ్చుకుంటే.. పద్మావతిని మేనేజ్ చేసి డ్యూటీలు వేయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంగాభవాని, వరలక్ష్మి స్పందిస్తూ.. తమకు సంబంధిత అధికారుల నుంచి ఇంకా ఎలాంటి నోటీసులు రాలేదని, విచారణ అధికారి కోరితే అన్ని వివరాలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
పట్టుదలకు ప్రతిరూపం లలిత శ్రీ.. ప్రతిభకు నిదర్శనం బిందు
పెదగంట్యాడ: గాజువాక ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళా న్యాయవాదులు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించారు. పట్టుదల ఉంటే ఏ వయసులోనైనా విజయం సాధించవచ్చని ధర్మాల లలిత శ్రీ నిరూపించగా, యువ న్యాయవాది కొట్టాన బిందు తొలి అడుగుల్లోనే అత్యున్నత శిఖరాన్ని అధిరోహించారు. వివాహమైన 15 ఏళ్ల తర్వాత జడ్జిగా లలిత శ్రీ ధర్మాల లలిత శ్రీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. వివాహమైన 15 ఏళ్ల తర్వాత ఆమె ఉన్నత చదువులపై దృష్టి సారించారు. ముందుగా పీజీ పూర్తి చేసి, ఆపై ఎల్ఎల్బీ పట్టా పొందారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమయ్యారు. కేవలం రెండో ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై తన కలని సాకారం చేసుకున్నారు. తొలి అడుగులోనే విజయం సాధించిన బిందు : జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సీనియర్ న్యాయవాది ఎం. శాంతి కుమార్తె కొట్టాన బిందు కూడా జడ్జిగా ఎంపికయ్యారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఈమె, సీనియర్ న్యాయవాది వెన్నెల ఈశ్వరరావు వద్ద జూనియర్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వృత్తిలో రాణిస్తూనే జూనియర్ సివిల్ జడ్జిగా విజయం సాధించారు. గాజువాక బార్ అసోసియేషన్ నుంచి ఒకేసారి ఇద్దరు మహిళలు న్యాయమూర్తులుగా ఎంపిక కావడంపై బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు యశోధర వేదమణి హర్షం వ్యక్తం చేశారు. ధర్మాల లలితాశ్రీ కొట్టాన బిందు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఇద్దరు మహిళలు -
విశాఖ వేదికగా నౌకాదళ గర్జన
ఐఎన్ఎస్ తారాగిరి, అరిధామన్లను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి తారాగిరి వార్షిప్ని జాతికి అంకితం చేస్తున్న రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ మహారాణిపేట(విశాఖ): విశాఖలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా భారత నౌకాదళానికి చెందిన కీలక ప్రాజెక్టులు ముందుకు సాగాయి. ప్రాజెక్ట్–17ఏలో భాగమైన అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ తారాగిరిని జాతికి అంకితం చేశారు. 75 శాతం పైగా స్వదేశీ సాంకేతికతతో నిర్మితమైన ఈ నౌక దేశ సముద్ర భద్రతను బలోపేతం చేయడంలో కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో అత్యంత రహస్యంగా విశాఖ షిప్బిల్డింగ్ సెంటర్లో అణు శక్తితో నడిచే జలాంతర్గామి అరిధామన్ను కూడా నౌకాదళానికి సమర్పించారు. అరిహంత్ శ్రేణిలో మూడో ఈ సబ్మైరెన్ సుమారు 7,000 టన్నుల సామర్థ్యంతో, 80 శాతం స్వదేశీ సాంకేతికతతో నిర్మితమై, కే–4 క్షిపణులను మోసుకెళ్లగలదు. దీని ద్వారా భారతదేశం తన ‘న్యూక్లియర్ ట్రయాడ్’ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. పర్యటనలో భాగంగా ఐఎన్ఎస్ డేగా వద్ద కేంద్ర మంత్రికి కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్, సీపీ శంఖబ్రత బాగ్చి, కోస్ట్గార్డ్, నేవీ అధికారులు స్వాగతం పలికారు. -
సాగు విధానం
జాగ్రత్త పడితేనే జవజీవం అన్నట్లుగా.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ సాగు విధానాన్ని మార్చుకోవాలి. శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తేనే పొంచి ఉన్న ఎల్నినో ముప్పు నుంచి బయటపడి గిరిజన వ్యవసాయాన్ని నిలబెట్టుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మళ్లాల్సినగిరి సాగుకు ఎల్నినో గండం● నీటి పొదుపే శ్రీరామరక్ష ● చిరుధాన్యాలు, ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం ● గిరి రైతులకు శాస్త్రవేత్తల సూచనమారుతున్న కాలంవిత్తే సమయం మార్చుకోవాలికాలం మారితే.. సాగు మారాలి అన్నట్లుగా.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన విత్తే సమయాన్ని, పంటల ఎంపికను మార్చుకోవాలి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఇటీవల జరిగిన సదస్సులో శాస్త్రవేత్తలు సూచించినట్లుగా, ఏజెన్సీ రైతులు అప్రమత్తంగా ఉంటేనే ఎల్ నినో ముప్పు నుంచి బయటపడగలం. పొంచి ఉన్న వర్షాభావం చింతపల్లి: ప్రకృతి ఒడిలో సాగే ఏజెన్సీ వ్యవసాయానికి ఎల్నినో ముప్పు పొంచి ఉంది. రానున్న రోజుల్లో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఇప్పటి నుంచి వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ గిరిజన రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోకపోతే భారీ నష్టాలు తప్పవని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కుమార్ ఇటీవల స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించిన సదస్సులో స్పష్టం చేశారు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల వల్ల ఏర్పడే ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడతాయి. దీనివల్ల ఏజెన్సీ ప్రాంతంలో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చు. భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు పెరిగి పంటలు త్వరగా ఎండిపోతాయి. ఎక్కువ నీటిపై ఆధారపడే పంటలు ఈ పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కాఫీ: ఏజెన్సీ ప్రాంతానికి కాఫీ ఒక ప్రధాన జీవనాధారం. ఇది చాలా సున్నితమైన పంట. దీనికి మితమైన ఉష్ణోగ్రత (15ని డిగ్రీల నుంచి నుంచి 28ని డిగ్రీలు), అధిక ఆర్ద్రత ఉండాలి. పూత పూసే సమయంలో (మార్చి–ఏప్రిల్) తేలికపాటి వర్షాలు చాలా అవసరం. ఎల్నినో వల్ల ఉష్ణోగ్రతలు పెరిగితే కాఫీ గింజలు సరిగ్గా ఊరవు. తేమ తగ్గిపోవడం వల్ల వైట్ స్టెమ్ బోరర్ వంటి పురుగులు ఆశించే ప్రమాదం ఉంది. సమయానికి వర్షాలు లేకపోతే దిగుబడి పడిపోతుంది. మిరియం: ఉష్ణోగ్రత 10ని డిగ్రీల నుంచి 30ని డిగ్రీల మధ్య ఉండాలి. ఏడాదికి 150 నుంచి 250 సెంటీమీటర్ల వర్షం అవసరం. ముఖ్యంగా పూత పూసే సమయంలో (మే–జూన్ నెలల్లో) తొలకరి చినుకులు పడటం చాలా కీలకం.గాలిలో తగినంత తేమ ఉంటేనే మిరియాల తీగలు ఆరోగ్యంగా పెరుగుతాయి. వర్షాలు తగ్గితే పూత రాలుతుంది. పూత దశలో చిరుజల్లులు కురిస్తేనే పరాగసంపర్కం జరుగుతుంది. వర్షాలు ఆలస్యమైనా.. అసలు కురవకపోయి పూత ఎండిపోయి రాలిపోతుంది. మిరియం తీగలు ఎండ తీవ్రతను అస్సలు తట్టుకోలేవు. వాతావరణంలో వేడి పెరిగితే ముక్కు పురుగు, వేరు కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వరి: గిరిజన రైతులు పల్లపు ప్రాంతాల్లో, గెడ్డల వెంట వరిని ప్రధానంగా సాగు చేస్తున్నారు. ఈ పంటకు నిరంతరం నీటి లభ్యత ఉండాలి. సాగు కాలంలో కనీసం 100–150 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం. ఎల్నినో వల్ల వర్షాభావం నెలకొంటే నారుమళ్లు ఎండిపోతాయి. నీరు తక్కువైతే పొట్ట దశలో గింజ పాలుపోసుకోదు. దీనివల్ల తాలు ఎక్కువగా వస్తుంది. ఎక్కువ వేడి వల్ల ఆకు ముడత తెగుళ్లు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చిరుధాన్యాలు: రాగులు, సామలు, కొర్రలు ఏజెన్సీ ప్రాంతపు సంప్రదాయ పంటలు.ఇవి తక్కువ నీటితో పండే పంటలు. వీటికి 25ని డిగ్రీల నుంచి 35ని డిగ్రీల ఉష్ణోగ్రత సరిపోతుంది. తక్కువ వర్షపాతం (50–70 సెంటీమీటర్లు) ఉన్నా ఇవి తట్టుకోగలవు. మిగిలిన పంటలతో పోలిస్తే వీటికి ముప్పు తక్కువే. కానీ, విత్తే సమయంలో అస్సలు వర్షం లేకపోతే మొలక శాతం తగ్గుతుంది.అయితే, వరితో పోలిస్తే ఎల్నినో పరిస్థితుల్లో రైతును ఆదుకునేవి ఇవే. రాజ్మా: శీతాకాలంలో ఏజెన్సీలో పండే అత్యంత విలువైన పంట.దీనికి చల్లని వాతావరణం (15 డిగ్రీల నుంచి 25డిగ్రీలు) ఉండాలి. పూత, కాయ దశలో తక్కువ తేమ, పగటిపూట మితమైన ఎండ ఉండాలి. ఎల్నినో వల్ల శీతాకాలంలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగితే రాజ్మా పూత సరిగ్గా రాదు. మంచు కురవాల్సిన సమయంలో వేడి గాలులు వీస్తే కాయ సైజు తగ్గిపోతుంది, గింజ నాణ్యత దెబ్బతింటుంది.ఎల్నినో ప్రభావం వల్ల రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కుమార్ తెలిపారు. ఇటీవల చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన సదస్సులో పలు సూచనలు చేశారు. రైతులు తమ సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలన్నారు. వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున, ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలను తగ్గించాలని, చిరుధాన్యాలు, రాజ్మా, వలిసెలు (అలసందలు) వంటి తక్కువ నీటితో పండే పంటలపై మొగ్గు చూపాలని పేర్కొన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విత్తే సమయం, సాగునీటి యాజమాన్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
వచ్చేనెల 3 నుంచి మత్స్య మాడుగులమ్మ జాతర
జి.మాడుగుల: మండల కేంద్రంలోని గంతకొండపై కొలువై ఉన్న శ్రీ మత్స్య మాడుగులమ్మ తల్లి జాతర మహోత్సవాలను వచ్చే నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించాలని ఉత్సవ కమిటీ, గ్రామ పెద్దలు నిర్ణయించారు. శుక్రవారం స్థానిక మాడుగులమ్మ తల్లి ఆలయ ఆవరణలో గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జాతర నిర్వహణపై చర్చించి, నూతన ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా మత్స్యరాస రామరాజు, ప్రధాన కార్యదర్శులుగా గసాడి రెడ్డిబాబు, ఎం. నారాయణరాజు, కూర్మరాజు, ఎం. మత్స్యరాజు, ఎం. సింహచలంరాజు, ఎం. మత్స్యరాజు (మాస్టర్), కిముడు వెంకటరమణ, గౌరవ అధ్యక్షులుగా మాజీ మంత్రులు మత్స్యరాస బాలరాజు, ఎం. మణికుమారి, జెడ్పీటీసీ డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి, మాజీ ఎంపీపీ మత్స్యరాస వరహాలమ్మ, హెచ్ఎం మత్స్యరాస వరహారాజు, ఎంపీటీసీ ఎం. విజయకుమారి నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా మత్స్యరాస వెంకటగంగరాజు (బుజ్జి), సర్పంచ్ కిముడు రాంబాబు, ఎం. సత్యనారాయణరాజు, ఎం. రామచంద్రరాజు, సహాయ కార్యదర్శులుగా ఎస్.కె. రెహ్మాన్, సత్తిబాబు, రాము, బ్రహ్మాజీ, శ్రీను, గంగాధర్, వరహాలుదొర, ఎం. నాగరాజు, మైనారావు, కోశాధికారిగా ఎస్కే అమీర్, సహాయ కోశాధికారిగా అచ్చుతరావు, ఆర్గనైజింగ్ సభ్యులుగా బి. అరుణ్కుమార్, టి. సత్యనారాయణ, సిహెచ్. వెంకటరమణ, వి. శ్రీను, జి. గణేష్, సీహెచ్. శేఖర్ను నియమించారు. వీరితో పాటు కొంతమందిని కమిటీ సభ్యులుగా నియమించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను విజయవంతానికి సహకరించాలని కోరారు.ఏర్పాటైన ఉత్సవ కమిటీ -
ఆదివాసీ హక్కుల రక్షణే లక్ష్యం
పాడేరు రూరల్: ఆదివాసీల హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా పోరాడుతామని ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావుదొర స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, గిరిజన చట్టాల రక్షణ కోరుతూ ఆదివాసీ జేఏసీ నిర్వహించిన 146 రోజుల సత్యాగ్రహ యాత్ర శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా పాడేరులో భారీ ముగింపు ర్యాలీ నిర్వహించారు. స్థానిక తలారిసింగి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమా హాల్ సెంటర్ మీదుగా పాత పాడేరులోని అంబేడ్కర్ సెంటర్ వరకు కొనసాగింది. అనంతరం జరిగిన సభలో రామారావుదొర మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల్లో హక్కులు, చట్టాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీలకు సార్వభౌమాధికారం ఉన్నప్పటికీ, అభివృద్ధి ఫలాలు మాత్రం గిరిజనేతరులకే అందుతున్నాయని విమర్శించారు.ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆయన మండిపడ్డారు. రెండేళ్లు కావస్తున్నా నిరుద్యోగ భృతి ఊసే లేదని ధ్వజమెత్తారు.అరకు బహిరంగ సభలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జీవో నంబర్ 3ను తక్షణ పునరుద్ధరించాలని లేదా దానికి ప్రత్యామ్నాయంగా 100 శాతం రిజర్వేషన్ కల్పించే జీవోను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి ఆదివాసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎం. ఈశ్వరరావు, ఆదివాసీ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు చిట్టపుల్లి శ్రీనివాస పడాల్, నాయకులు కిల్లు గంగన్న పడాల్, వెంకటరమణ, నందు, సింహాచలం, బాబూజీ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా హక్కులు సాధించుకుంటాం ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావుదొర హెచ్చరిక 146 రోజుల సత్యాగ్రహ యాత్ర ముగింపు -
సింహగిరిపై ‘దొంగల’ వేట
సింహాచలం: ‘మీరు స్వామి వారి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం’ అంటూ అర్చకులు గద్దిస్తుంటే, భక్తులు బిత్తరపోయారు. నిష్కల్మషమైన భక్తితో కొండెక్కిన తమను ‘దొంగలు’ అనడమేమిటి? పైగా చేతులకు తాళ్లు కట్టి బంధించడమేమిటి? అని ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. కానీ, అదంతా ’దొంగ–పోలీస్’ ఆటలా సాగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టమని తెలిసి చివరకు ఆనంద డోలికల్లో మునిగిపోయారు. అసలేం జరిగింది? : సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ‘వినోదోత్సవం’ కనువిందుగా జరిగింది. గురువారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో (వేట ఉత్సవం) స్వామివారి ఉంగరం పోయిందని, అది భక్తులే తీశారని అర్చకులు సరదాగా నిలదీసే ఘట్టమే ఈ ఉత్సవ విశేషం. బంధీలుగా వీఐపీలు.. సామాన్యులు రాజగోపురం వద్ద స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి ఏడు పరదాల చాటున వేంజేసి ఉండగా.. ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు స్వామివారి దూతగా మారి.. చేతిలో కర్ర, తాడు పట్టుకుని భక్తులను బంధించి తీసుకువచ్చారు. గాజువాకకు చెందిన వ్యాపారవేత్త సాగర్, ఇంజనీరింగ్ విద్యార్ధి ప్రణతి, విశాఖకు చెందిన ఫిజియోథెరపిస్టు రేష్మి, విజయనగరానికి చెందిన ఆమె సోదరి భార్గవి, ఒడిశాలోని జాజ్పూర్కి చెందిన ప్రభుత్వ వైద్య విద్యార్థులు, శ్రీహరిపురానికి చెందిన భరత్, హేమ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కుమారుడు సిద్ధార్థ, కోడలు నిత్య, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జర్నలిస్టుల సంఘం జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, పలువురు నూతన దంపతులతోపాటు దేవస్థానం ఈవో జె.వెంకటరావు దంపతులను కూడా వదలకుండా తాళ్లతో బంధించి స్థానాచార్యుల ముందు ప్రవేశపెట్టారు. సీసీ కెమెరా సాక్ష్యం ఉంది.. ఇచ్చేయండి! స్థానాచార్యులు రాజగోపాల్ భక్తులను ప్రశ్నించిన తీరు అత్యంత సహజంగా సాగింది. ‘మీరు దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయి’ అని ఆయన గర్జించడంతో భక్తులు హడలిపోయారు. భక్తుల చేతికి ఉన్న ఉంగరాలు చూపిస్తూ.. ‘ఇదే స్వామివారి ఉంగరం’ అని అర్చకులు నిలదీయడంతో చాలామంది భక్తులు ఆవేశంతో, మరికొందరు బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ట్విస్ట్ ఏమిటంటే: అందరినీ బంధించిన ప్రధానార్చకుడిని, అందరినీ ప్రశ్నించిన స్థానాచార్యుడిని, ఏఈవోలను కూడా చివర్లో తాళ్లతో బంధించడం ఈ ఉత్సవంలో హైలైట్గా నిలిచింది. పరదా వెనుక దొరికిన ‘నిజమైన’ దొంగ భక్తుల విచారణ ముగిసిన తర్వాత, స్వామివారి పల్లకీకి ఉన్న ఏడు పరదాలను ఒక్కొక్కటిగా తొలగించారు. ఆశ్చర్యంగా ఆఖరి పరదా చాటునే స్వామివారి ఉంగరం లభ్యమైంది. అంటే దొంగ మరెవరో కాదు.. ఆ స్వామివారే అని తేలడంతో భక్తులంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. తమను దొంగలుగా పట్టుకోవడం కూడా ఆ నృసింహుడి లీలగా భావించి భక్తులు పులకించిపోయారు. -
అప్పన్నకు ఘనంగాశ్రీ పుష్పయాగం
● సింహగిరిపై ముగిసిన అప్పన్న వార్షిక కల్యాణ మహోత్సవాలు సింహాచలం: సింహగిరిపై వారం రోజులుగా జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణమహోత్సవాలు శుక్రవారం రాత్రితో ఘనంగా ముగిశాయి. కల్యాణోత్సవాల ముగింపు పురస్కంచుకుని సాయంత్రం నుంచి స్వామికి శ్రీ పుష్పయాగం విశేషంగా నిర్వహించారు. కల్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పూల అంకరణ చేసి ఆలయ కల్యాణమండపంలో శేషతల్పంపై ఆళ్వారులతో సహా వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం జరిపారు. ద్వాదశి ఆరాధనలతో, పలు రకాల పుష్పాలతో పుష్పాంజలి సేవ చేశారు. విశేష హారతులు అందించారు. అనంతరం భోగమండపంలో ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అశేషంగా కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, అర్చకులు ఈ సేవను నిర్వహించారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు దంపతులు పాల్గొన్నారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
చింతపల్లి: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గిరిజన కాఫీ రైతులు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం చింతపల్లిలోని ఉద్యానవన నర్సరీ శిక్షణ కేంద్రం (హెచ్ఎన్టీసీ) లో ఐటీడీఏ కాఫీ అసిస్టెంట్ డైరెక్టర్ లకే బొంజుబాబుతో కలిసి ఆయన రైతులకు పరికరాలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా కాఫీ బేబీ పల్పింగ్ యూనిట్లు, మిరియాలు కోసే నిచ్చెనలు, టార్పాలిన్లను అందజేశారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం ఉచితంగా అందజేస్తున్న పరికరాలను ప్రతి రైతు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆధునిక పరికరాలను ఉపయోగించి పంట దిగుబడిని పెంచుకోవడమే కాకుండా, నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా అధిక ఆదాయం పొందేందుకు కృషి చేయాలని సూచించారు. ఐటీడీఏ పరిధిలోని మాక్స్ సొసైటీల ద్వారా కాఫీ విక్రయాలు జరిపితే రైతులకు మరిన్ని పథకాలు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. గతంలో జీసీసీని నమ్మి గిరిజన రైతులు నష్టపోయారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులకు నిచ్చెనలు 400, బేబీ పల్పింగ్ మిషన్లు 400, టార్పాలిన్లు 100 పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాఫీ ఏఈవో ధర్మారాయ్, గూడెంకొత్తవీధి, జి.మాడుగుల కాఫీ అసిస్టెంట్లు అరుణకుమారి, బాబూరావుతో పాటు పలువురు కాఫీ రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్ -
గంధం అమావాస్యకుపటిష్ట ఏర్పాట్లు
సింహాచలం: ఈ నెల 17న గంధం అమావాస్య పురస్కరించుకుని వరాహ పుష్కరిణి వద్ద స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. వరాహ పుష్కరిణి వద్ద ఏయే ఏర్పాట్లు చేయాలో శుక్రవారం ఆయన పరిశీలించారు. భక్తులు కోనేరులో దిగే సమయంలో ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గజ ఈతగాళ్లను, కోనేరు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎక్కడా చెత్త ఉండకూడదని ఆదేశించారు. నీటిలో లోతైన ప్రదేశాలకు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట ఈఈలు రాంబాబు, వెంకటరమణ, డీఈ తాతాజీ ఉన్నారు. -
‘జోలాపుట్టు’ యంత్రాలకు
మరమ్మతులు● డ్యామ్ సేఫ్టీ బృందం హెచ్చరికతో కదిలిన యంత్రాంగం ముంచంగిపుట్టు: ఆంధ్ర – ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి ప్రధాన నీటి వనరుగా ఉన్న జోలాపుట్టు జలాశయానికి ఎట్టకేలకు మరమ్మతులు పూర్తయ్యాయి. దశాబ్దా ల చరిత్ర కలిగిన ఈ జలాశయ గేట్లకు రంగులు వేసి, సాంకేతిక లోపాలను సరిదిద్ది కొత్త హంగులు అద్దారు. బృందం తనిఖీలతో.. ఇటీవలే జాతీయ డ్యామ్ సేఫ్టీ బృందం ఈ అతి పురాతనమైన జలాశయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా గేట్ల పనితీరు, నీటి నిల్వ సామర్థ్యం, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించింది. గేట్లు తుప్పు పట్టి ఉండటం, పలు సాంకేతిక సమస్యలు ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. జలాశయ అధికారులపై అసహనం వ్యక్తం చేస్తూ పలు సూచనలు చేశారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు కేంద్ర బృందం హెచ్చరికలతో స్పందించిన జలాశయ అధికారులు.. వెంటనే అన్ని గేట్లు, యంత్రాలకు గ్రీజు వేయించి, నలుపు రంగులు దిద్దించారు. అత్యవసర సమయాల్లో గేట్లు ఎత్తేటప్పుడు లేదా నీటిని విడుదల చేసేటప్పుడు ఎటువంటి సాంకేతిక అడ్డంకులు ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. హెచ్చరిస్తే గాని కదలని తీరుపై విమర్శలు జోలాపుట్టు జలాశయం గేట్లు తుప్పు పట్టి ప్రమాదకరంగా మారుతున్నాయని గతంలో అనేకసార్లు పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ అధికారులు ఏమాత్రం స్పందించలేదు. తీరా జాతీయ స్థాయి అధికారులు వచ్చి తనిఖీ చేసి పరిస్థితి తీవ్రతను హెచ్చరిస్తే తప్ప పనులు ప్రారంభించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా భద్రతా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించాలని ఏవోబీ ప్రజలు కోరుతున్నారు. -
సమయపాలన పాటించకుంటే చర్యలు
ముంచంగిపుట్టు: విధి నిర్వహణలో సమయపాలన పాటించని గ్రామ సచివాలయ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరించారు. గురువారం మండలంలోని కర్రిముఖిపుట్టు సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐదుగురు ఉద్యోగులు ఉండాల్సిన చోట ఉదయం 11 గంటలైనా కేవలం ఇద్దరు మాత్రమే ఉండటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో పుస్తకాలు చదివించి, పలు ప్రశ్నలు వేసి వారి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. గత ప్రభుత్వంలో నాడు–నేడు పథకంలో కింద మంజూరైన పాఠశాల భవన పనులు అసంపూర్తిగా ఉండటంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులకు కనీస వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన పనుల అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అర్జున్, కొండబాబుపాల్గొన్నారు.రేషన్ బియ్యం పంపిణీలో జాప్యంపై ఆగ్రహం పెదబయలు: కూటమి ప్రభుత్వంలో రేషన్ కార్డుదారులకు తిప్పలు తప్పడం లేదని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. గురువారం ఆయన పెదబయలులోని రేషన్ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. రోజువారీ విక్రయాల వివరాలు రికార్డుల్లో నమోదు చేయకపోవడంపై జీసీసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. సుమారు 100 మంది కార్డుదారులకు ఫింగర్ ప్రింట్ తీసుకున్నప్పటికీ, రెండు టన్నుల బియ్యం పంపిణీ చేయలేదని ఫిర్యాదు చేశారు. గత రెండు నెలల బకాయిల గురించి అడిగితే పాత సేల్స్మన్ ఇవ్వాలని, తాము ఈ నెల కోటా మాత్రమే ఇస్తామని ప్రస్తుత సిబ్బంది చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చొరవతో బకాయిల పంపిణీ మెషీన్లో నమోదైన తర్వాత కూడా బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ అందేదని, నేడు డిపోల చుట్టూ తిరిగినా బియ్యం దొరకని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాలతో జీసీసీ మేనేజర్ అప్పన్న సమక్షంలో లబ్ధిదారులకు గత రెండు నెలల బకాయి రేషన్ను వెంటనే పంపిణీ చేశారు. కార్డుదారులకు రేషన్ ఇవ్వడంలో కోతలు విధిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. తమకు న్యాయం చేసిన ఎమ్మెల్యేకు కార్డుదారులు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు సందడి కొండబాబు పాల్గొన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరిక -
ప్పం ట్టాల్సిందే..!
తట్టెడు మట్టికీ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : తట్టెడు మట్టికీ తలవంచాల్సిందే.. పిక్కెడు రాయికీ పిండుకోవాల్సిందే.. ఉమ్మడి విశాఖ జిల్లాలో ’రాయల్టీ’ పేరిట ఏఎంఆర్ సంస్థ సాగిస్తున్న అక్రమ వసూళ్లు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. సొంత పొలంలో మట్టి తీసినా, సొంత ఇంటికి రాయి తెచ్చినా.. ఎక్కడ చిన్న ఇసుక కుప్ప కనిపించినా.. ప్రైవేటు సంస్థ ప్రతినిధులు స్కానర్లు పట్టుకుని వాలిపోతున్నారు. లోడును బట్టి వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ శాఖ అండతో గ్రామగ్రామాన చెక్పోస్టులు పెట్టి సాగిస్తున్న ఈ ’దోపిడీ’ పర్వంపై జనాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. చెక్పోస్టులు.. ఫ్లైయింగ్ స్క్వాడ్ల దందా వాస్తవానికి గతంలో రాయల్టీ వసూలు బాధ్యతను మైనింగ్ శాఖే నిర్వహించేది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బాధ్యతను జిల్లాల వారీగా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. ఇందుకోసం మైనింగ్ శాఖ టెండర్లను ఆహ్వానించగా.. విశాఖ జిల్లాలో ఈ టెండర్ను ఏఎంఆర్ సంస్థ దక్కించుకుంది. టెండర్ పొందినప్పటి నుంచి సంస్థ ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వాహనాలతో ఫ్లైయింగ్ స్క్వాడ్ పేరుతో గ్రామాల్లో తిరుగుతోంది. ఎక్కడైనా చిన్న ట్రాక్టర్లో మట్టి కనిపించినా, ఎర్రపిక్క కనిపించినా రాయల్టీ చెల్లించాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తోంది. తమ సొంత పొలంలో నుంచి మట్టిని తీసుకెళుతున్నా ఎందుకు డబ్బులు ఇవ్వాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక వసూలు చేసే మొత్తాన్ని స్కానర్ ద్వారా సేకరిస్తున్నప్పటికీ, ఆ వివరాలను మైనింగ్ శాఖకు క్రమం తప్పకుండా సమర్పిస్తున్నారా లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదనే విమర్శలు ఉన్నాయి. వసూలైన డబ్బులు కంపెనీ ఖాతాలోకే వెళుతున్నాయా, లేక సొంత ఖాతాలకు మళ్లుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, వసూలు చేస్తున్న రాయల్టీకి సరైన బిల్లులు ఇస్తున్నారా అనే అంశాన్ని కూడా మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద మైనింగ్ శాఖ మౌనంతో ఏఎంఆర్ సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయల్టీ వసూలు పేరుతో రుబాబు..! రాయల్టీ వసూలు బాధ్యతను దక్కించుకున్న ఏఎంఆర్ సంస్థ ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేసుకుంది. చెక్పోస్టుల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. అక్కడ పనిచేసే సిబ్బంది క్వారీల నుంచి వచ్చే వాహనాల లోడ్ను గమనిస్తూ, అదనపు లోడు ఉంటే అదనపు రాయల్టీని ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ‘ఫ్లైయింగ్ స్క్వాడ్’ పేరుతో జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ, ఎక్కడైనా ఇంటి అవసరాల కోసం మట్టిని తరలిస్తున్నా రాయల్టీ చెల్లించాల్సిందేనంటూ వాలిపోతున్నారు. ఇంటి నిర్మాణం కోసం కొద్దిపాటి పిక్క తీసుకున్నా వందల్లో రాయల్టీ చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రైతులు తమ సొంత పొలంలో నుంచి మట్టిని తవ్వుకుని ఇంటి నిర్మాణం కోసం తరలిస్తున్నా అక్కడికక్కడే సిబ్బంది చేరుతున్నారు. రాయల్టీ కట్టాల్సిందేనంటూ చెబుతూ, ఎంత మొత్తం చెల్లించాలనే విషయాన్ని స్కానర్ ద్వారా చూపించి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ‘మాకు సంబంధం లేదు’ అంటూ తప్పుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయల్టీ పేరుతో ఏఎంఆర్ రుబాబు ఇంటి నిర్మాణం కోసం పిక్కకు రొక్కం లెక్క ఉమ్మడి జిల్లాలో ఇష్టారాజ్యంగా చెక్పోస్టుల ఏర్పాటు ఫ్లైయింగ్ స్క్వాడ్లతో గ్రామాల్లో వేట ట్రాక్టర్ కనిపిస్తే స్కానర్ ఓపెన్ రూ.వందల నుంచి రూ.వేల వరకూ వసూళ్లు సొంత పొలం మట్టికీ రాయల్టీ తప్పదా..? మైనింగ్శాఖ మౌనం విమర్శలకు తావు -
గిరిజనులతో ఎంతో అనుబంధం
● కలెక్టర్ దినేష్కుమార్ ● బదిలీపై వెళ్తున్న ఆయనకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పాడేరు: గిరిజన ప్రాంతంలో కలెక్టర్గా పని చేయడం తన అదృష్టమని, రెండేళ్లకు పైగా స్థానిక గిరిజనులతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. గిరిజనులతో ఎంతో అనుబంధాన్ని ఏర్పరుచుకున్నానని, జిల్లాను విడిచి వెళ్లడం బాధగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఏపీఐఐసీ ఎండీగా బదిలీపై వెళ్తున్న కలెక్టర్ దినేష్ కుమార్కు గురువారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ సహా వివిధ శాఖల అధికారులు కలెక్టర్తో తమకున్న పని అనుభవాన్ని, అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జిల్లా అధికారులతో పాటు పలు ప్రజా, గిరిజన సంఘాల నాయకులు కలెక్టర్ను దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. అంతకుముందు, పట్టణంలోని పాత బస్టాండ్ అంబేడ్కర్ సెంటర్ నుంచి సినిమా హాల్ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్, తలారిసింగ్ జంక్షన్ మీదుగా కలెక్టరేట్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర కలెక్టర్కు వీడ్కోలు పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. -
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
జి.మాడుగుల: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అల్లూరి జిల్లా పాడేరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఆర్. అభిషేక్ పిలుపునిచ్చారు. ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు, మండలంలోని మద్దిగరువు గ్రామంలో గురువారం భారీ స్థాయిలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి వంటి వ్యసనాలు యువత జీవితాలను నాశనం చేయడమే కాకుండా, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. వీటితో పాటు సైబర్ నేరాలు మరియు రోడ్డు భద్రతా నియమాలపై కూడా అవగాహన కల్పించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. భవిష్యత్తులోనూ విద్యార్థులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. మెగా వాలీబాల్ టోర్నమెంట్లో గిరిజన ప్రాంతాల నుంచి 20 జట్లు పాల్గొన్నాయి. ప్రథమస్థానం సాధించిన మద్దిగరువు జట్టుకు రూ.10 వేల నగదు, వాలీబాల్ కిట్, ద్వితీయ స్థానం సాధించిన మడతకొండ జట్టురే నై.5 వేల నగదు, వాలీబాల్ కిట్, సూరిమెట్ట, బొయితిలి జట్లకు క్రికెట్ కిట్లను అందజేశారు. అనంతరం స్థానిక మహిళలకు చీరలు పంపిణీ చేసి, పోలీస్ శాఖ పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎంపీపీ అప్పలరాజు, ఎస్ఐ సాయిరాం పడాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.పాడేరు డీఎస్పీ అభిషేక్ -
పాత హామీలు నెరవేర్చాకే ‘ఏరోడ్రోమ్’ నిర్మించండి
● స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి ● ప్రజాభిప్రాయ సేకరణలోగ్రామస్తుల డిమాండ్సీలేరు: గతంలో ఇచ్చిన హామీలనే గాలికి వదిలేశారు.. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు అంటే నమ్మేదెలా?.. అంటూ సీలేరు గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సీలేరు గుంటవాడ రిజర్వాయర్లో ప్రతిపాదించిన వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టుపై గురువారం ఏపీ జెన్కో కల్యాణ మండపంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏపీ ఎయిర్ పోర్ట్ డవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభ వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ, గత ఏడాది పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు (1350 మెగావాట్లు) సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టులో వచ్చే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సీలేరు నిరుద్యోగులకే కేటాయించాలని, ఎంతమందికి ఉద్యోగాలిస్తారో ముందే రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం నిధులను సీలేరు ప్రాంత అభివృద్ధి పనులకే ఖర్చు చేయాలని కోరారు. దశాబ్దాల క్రితం జలవిద్యుత్ కేంద్రం కోసం పనిచేసిన కూలీల వారసులకు, స్థానికులకు ఈ ప్రాజెక్టుల్లో తగిన గుర్తింపు, హక్కులు కల్పించాలని వారు కోరారు. ఈ డిమాండ్లు నెరవేర్చినప్పుడే ప్రాజెక్టు నిర్మాణానికి గ్రామం తరఫున పూర్తి సహకారం అందిస్తామని గ్రామస్తులు తేల్చి చెప్పారు. పర్యావరణానికి ఢోకా లేదు.. కాలుష్య నియంత్రణ మండలి ఈఈలు సరిత, ఉపేంద్ర, టూరిజం డీవీఎం జగదీష్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి, అటవీ సంపదకు ఎలాంటి హాని జరగదని వివరించారు. ఇది పూర్తిగా నీటిపై తేలుతూ ఉండేలా డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అని, దీనివల్ల పక్షులకు కూడా ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఏపీ ఎయిర్ పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధిని పెంచేలా ప్రాజెక్టులు : ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజ జిల్లాలో పర్యాటక అభివృద్ధి మరింత పెంచేలా ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతాయని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రూ 16.45 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల పర్యాటక రంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. లంబసింగి నుంచి సప్పర్ల రెయిన్గేజ్, ఘాట్ రోడ్ దారాలమ్మ ఆలయం, సీలేరు జల విద్యుత్ కేంద్రం, జలపాతాలకు సందర్శకుల తాకిడి పెరుగుతుందన్నారు. ఇటువంటి కీలక ప్రాజెక్ట్ల నిర్మాణానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. తహసీల్దార్ అన్నాజీరావు, ఎంపీటీసీ సాంబమూర్తి, సర్పంచ్ దుర్జో, ఉపసర్పంచ్ వల్లి ప్రసాద్, గిరిజన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. -
8న ‘అనకాపల్లి’ సినిమా రిలీజ్
అనకాపల్లి: అనకాపల్లి సినిమాను ఈనెల 8న దేశవ్యాప్తంగా విడుదల చేయడం జరుగుతుందని సినీదర్శకుడు నక్కిన త్రినాథ్ అన్నారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘అనకాపల్లి’ సినిమాను అనకాపల్లి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరిగిందన్నారు. అనకాపల్లిపై ఉన్న అభిమానంతో సినిమాను తీయడం జరిగిందని, ఇక్కడ ప్రజలు ఎక్కువగా సినిమాన్ని ఆదరించడమే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని పదర్శించి, అనకాపల్లి పేరును చాటడం జరుగుతుందన్నారు. విక్రమ్ సహదేవ్ హీరోగా సంధ్య వశిష్ట హీరోయిన్గా తారక్ కొండప్ప విలన్గా నటించడం జరిగిందన్నారు. అంతకుముందు సంధ్య వశిష్ట, తారక్ కొండప్పలు సినిమా షూటింగ్లో వారి అనుభవాలను వివరించారు. కార్యక్రమంలో భవ్యశ్రీ డెవలపర్ అధినేత, గవరపాలెం కనకదుర్గమ్మవారి ఆలయ శాశ్వత చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్, ఆలయ వ్యవస్థాపకుడు పి.వి.రమణ, సహనిర్మాత కుమార్రాజా, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల మురళీకృష్ణ పాల్గొన్నారు. -
తేగాడ కేజీబీవీలో కేంద్ర బృందం
తేగాడలోని కస్తూర్భాగాంధీ విద్యాలయంలో పరిశీలిస్తున్న కేంద్ర అధ్యయన బృందం కశింకోట : మండలంలోని తేగాడ వద్ద ఉన్న కస్తూర్భాగాంధీ విద్యాలయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రొనాల్డ్ రోజ్ బృందం గురువారం సందర్శించింది. ఈ సందర్భంగా వ్యర్థాలను అరికట్టడానికి ప్రయోగాత్మకంగా జిల్లాలోని వసతి గృహాలు, కస్తూర్భాగాంధీ విద్యా సంస్థలతోపాటు ఇక్కడ కూడా ఏర్పాటు చేసిన కంపోస్టు ఎరువు తయారీ, వర్షం నీరు, వాడుక నీరు నివారణ కోసం నిర్మించిన ఇంకుడు గొయ్యి, కూరగాయలు పండించేందుకు ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్లను బృందం పరిశీలించింది. వాటి నిర్వహణ తీరును అధ్యయనం చేసి సంతృప్తి వ్యక్తం చేసింది. విద్యార్థులతో ఈ కార్యక్రమం అమలుపై ఉన్న అవగాహన గురించి బృందం చర్చించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించింది. ఈ సందర్భంగా రోనాల్డ్ రోజ్ కస్తూర్భా విద్యా సంస్థ ఆవరణలో మొక్కలు నాటారు. బృందంలో ఏపీ ప్రిన్సిపల్ కార్యదర్శి రొనాల్డ్ రోజ్ , డీఈవో అప్పారావునాయుడు, ఎంఈవోలు సురేష్కుమార్, రమణశ్రీ, ఎంపీడీవో సిహెచ్.చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. -
అధినేతతో ఆత్మీయ కలయిక
నర్సీపట్నం : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మర్యాద పూర్వకంగా కలిసారు. నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు గణేష్ తెలిపారు. తుమ్మపాల: జడ్పీ వైస్ చైర్పర్సన్ భీశెట్టి సత్యవతి, ఆమె కుమారుడు వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకుడు భీశెట్టి జగన్ తాడేపల్లిలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు. దుశ్శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై ఆయనతో చర్చించినట్లు తెలిపారు. జిల్లాలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. -
నాణ్యత డొల్ల
పాయకరావుపేట: పట్టణంలో రూ.5.20 కోట్లతో విస్తరిస్తున్న మెయిన్ రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా, ఉప సర్పంచ్ జగతా భవానీశ్రీనివాస్, పట్టణ శాఖ అధ్యక్షుడు ధనిశెట్టి మహేష్ విమర్శించారు. పట్టణంలో దగ్గుపల్లి సాయిబాబా కార్యాలయంలో గురువారం వారు మాట్లాడుతూ వీఎంఆర్డీఏ నిధులతో చేపట్టిన విస్తరణ పనుల్లో అధికారుల పర్యవేక్షణ లేదన్నారు. కరెంటు లేకుండానే రాత్రిపూట పనులు చేపడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మిగిలిన మూడేళ్ల పాటు మనుగడ ఉండేలా రోడ్డు నిర్మిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆ తర్వాత ఎలా పోయినా పర్వాలేదన్నట్లు కాంట్రాక్టర్లు, కూటమి నాయకుల వ్యవహారశైలి ఉందన్నారు. పూర్తిగా కూటమి నాయకుల కనుసన్నల్లోనే పనులు జరగడం వల్ల నాణ్యత లోపించిందన్నారు. ఎస్టిమేషన్లో పేర్కొన్న విధంగా మెటీరియల్ను సముపాళ్లలో వినియోగించడం లేదన్నారు. 20 ఎంఎం, 40 ఎంఎం, క్రషర్ చిప్స్ బూడిద వేయాల్సి ఉండగా, బూడిద మాత్రమే వేస్తున్నారన్నారు. సరిగ్గా రోలింగ్ చేయడం లేదన్నారు. రోడ్డు విస్తరణ చేసేందుకు హోం మంత్రి నిర్ణయించినప్పుడు పాయకరావుపేట పట్టణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్వాగతించామన్నారు. రోడ్డుపై చిరువ్యాపారులకు న్యాయం చేయలేదన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇంతవరకు చూపలేదన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి ఆపేశారన్నారు. కోర్డు వివాదం కారణంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విస్తరణను పక్కన పెట్టి కొత్త రోడ్డు నిర్మించామన్నారు. అదే సమయంలో రోడ్డుకు ఇరువైపులా వేసిన బెర్మ్లను ఇప్పుడు తొలగిస్తున్నారన్నారు. తవ్వకాల్లో వచ్చిన గ్రావెల్ను అనధికార లేఅవుట్లకు తరలిస్తున్నారన్నారు. హోం మంత్రి ఈ రెండు విషయాలపై దృష్టి సారించాలన్నారు. నాసిరకం పనులపై విచారణ జరిపించాలని, బెర్మ్ తవ్వకాల్లో వచ్చిన గ్రావెల్ను తరలిస్తున్న అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాసిరకం పనులపై క్వాలిటీ కంట్రోలు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో వార్డు సభ్యులు కొప్పిశెట్టి మోహన్, పిరాది రాజు, తుమ్మలపల్లి సతీష్, బీసీ సెల్ అధ్యక్షుడు కేశనకుర్తి సత్తిబాబు, కోనేటి పద్మారావు, పోసిన వీరబాబు, కె. రంగ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు స్టే ఇచ్చినా బేఖాతరు
నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువులో సృష్టి క్షేత్రం పేరుతో చేస్తున్న అక్రమ నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. కోర్టు అదేశాలను అమలు చేయాల్సిన అధికార యంత్రాగం కనీసం పట్టించుకోలేదు. స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడి ఆధ్వర్యంలో చేపట్టిన సృష్టి క్షేత్రం అక్రమ నిర్మాణాలను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హైకోర్టును ఆశ్రయించారు. పెద్ద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ఈ పిల్పై ప్రతివాదులుగా ఉన్న జలవనరులు, కలెక్టర్తో పాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చి 24 గంటలు గడుస్తున్నా ఇరిగేషన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చెరువు మధ్యలో వేస్తున్న రోడ్డు నిర్మాణానికి వినియోగిస్తున్న మిషనరీ ఇంకా అక్కడే ఉంది. ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు వెనకాడుతున్న ఇరిగేషన్ అధికారుల వైఖరిని కోర్టు దృష్టికి తీసుకువెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్ధమవుతున్నట్టు తెలిసింది. -
భూసేకరణ జరపకుండా సాగునీటి కాల్వల తవ్వకాలు
మునగపాక : రైతుల నుంచి ఎటువంటి భూమి సేకరించకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువలను ఎలా తవ్వేస్తారంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ధ్వజమెత్తారు. రైతులకు ప్రత్యామ్నాయం చూపించి సాగునీటి కాలువ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతవరకు పనులు జరగకుండా చూడాలని తహసీల్దార్ సత్యనారాయణను కోరారు. వివరాలివి. పూడిమడక రోడ్డు విస్తరణలో భాగంగా మునగపాక మండలం గంగాదేవిపేట నుంచి మున గపాక జంక్షన్ వరకు వచ్చే మార్గంలో ఇరువైపులా సాగునీటి కాలువలు ఉండేవి. రహదారి విస్తరణలో ప్రస్తుతం ఉన్న కాలువల ద్వారా వేలాది ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందుతూ వచ్చేది. అయితే విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువలో రిటైనింగ్ వాల్ నిర్మించే క్రమంలో పొక్లెయిన్ ద్వారా పనులు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న స్థానిక రైతులు సమస్యను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన గురువారం సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించారు. రైతులకు జరుగుతున్న అన్యాయం గుర్తించి సమస్యను తహసీల్దార్ సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువలను తవ్వేసే కార్యక్రమం ఎలా చేపడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి విస్తరణకు తాము సమ్మతమేనని అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంటలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఆలోచన లేకుండా రైతులకు నష్టం వాటిల్లేలా పనులు చేపట్టడం సరికాదన్నారు. దీంతో స్పందించిన తహసీల్దార్ సత్యనారాయణ సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, రైతు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆడారి మహేష్, దాడి శివ, సీపీఎం నేత ఎస్.బ్రహ్మాజీ, రైతులు పాల్గొన్నారు. -
సీలేరు కాంప్లెక్సులోజోరుగా విద్యుత్ ఉత్పత్తి
● గోదావరి డెల్టాకు 12 టీఎంసీలు విడుదల ● చీఫ్ ఇంజినీర్ కేవీ రాజారావు సీలేరు: ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లో గడిచిన వారం రోజులుగా జోరుగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు తెలిపారు. గురువారం సీలేరు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వేసవిలో ఏప్రిల్, మే నెలలో రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తి అందించడంలో సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే సీలేరు, మాచ్ ఖండ్, పొల్లూరు జల విద్యుత్ కేంద్రాల్లో రోజుకు గత వారం రోజులుగా 9 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అన్నారు. మార్చి నాటికి 2314 మిలియన్ యూనిట్లు లక్ష్యం కాగా అంతకు మించి 24 65 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేశామన్నారు. ప్రస్తుతం డొంకరాయి యూనిట్లో చేపట్టిన మరమ్మతు పనులు 45 రోజుల్లో పూర్తవుతాయని తెలిపారు. సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి బలిమెల జలాశయం నుంచి గడిచిన వారం రోజులుగా రోజుకు 8 క్యూసెక్కులు సీలేరు జలాశయంలోకి తీసుకుంటున్నామని అన్నారు. బుధవారం రాత్రి నుంచి 4వేల క్యూసెక్కులు మాత్రమే విడుదలవుతుందని.. ప్రస్తుతం ఆ నీటితో సీలేరు జల విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా రోజుకు మూడు మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరుగుతందని తెలిపారు ప్రస్తుతం బలిమెల జలాశయంలో ఆంధ్రా వాటా నీటిని కలుపుకొని సీలేరు, డొంకరాయి జలాశయంలో మొత్తం 57.2563 టీఎంసీల నీరు ఉందని అన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు డొంకరాయి మెయిన్ డ్యామ్ ద్వారా గోదావరి డెల్టాకు 12 టీఎంసీల వరకు నీటిని విడుదల చేశామన్నారు. ఆయన వెంట ఎస్ఈ జాకీర్ హుస్సేన్, మోతుగూడెం డీఈ బాలకృష్ణ ఉన్నారు. -
గడ్డివాము దగ్ధం
నాతవరం : మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్సీపీ నేత గుడివాడ వెంకటరమణకు చెందిన గడ్డివాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిబూడిదైంది. నాతవరం గ్రామ సమీపంలో రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 336లో సుమారుగా మూడు ఎకరాలు 60 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో వ్యవసాయం సాగు చేసుకుంటూ పశువులు పాకలు వేసుకుని పాడి పరిశ్రమ నడుపుతున్నారు. గేదెలు, ఆవులు కలిపి 15పైగా పశువులు ఉన్నాయి. పాడి పరిశ్రమ నడుపుతున్న వెంకటరమణ పశువులకు ఏడాది కాలం పాటు మేతకు అవసరమైన ఇటీవల ఆరు ట్రాక్టర్లు ఎండిగడ్డి కొనుగోలు చేసి తన పశువుల మకాం వద్ద నిల్వ చేసుకున్నాడు. ఎప్పటి మాదిరిగా బుధవారం సాయంత్రం వరకూ పశువుల సంరక్షణ చూసి ఇంటికి వచ్చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో గడ్డి వాము తగలబడడం చూసి స్థానికులు సమాచారం అందించారు. వెంకటరమణ వెంటనే పశువుల మకాం వద్దకు వెళ్లి చూసేసరికి పెద్ద మంటలతో గడ్డివాములు కాలిపోతుంది. నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసిందన్నారు. సమీపంలో ఉన్న పశువులు పాకలు, పశువులకు ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఇటీవల పాడి పశువుల మేత కోసం సుమారుగా లక్ష రూపాయలతో కొనుగోలు చేసి నిల్వ చేసుకున్న గడ్డివాము పూర్తిగా కాలిపోయిందని బాధితుడు వెంకటమణ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటరమణ నాతవరం గ్రామంలో వైఎస్సార్సీపీలో కీలకంగా పని చేస్తుంటాడు. వెంకటరమణ గడ్డివామును ఎవరో కావాలనే తగులబెట్టి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనపై బాధితుడు వెంకటరమణ గురువారం తహసీల్దార్ చందనరేఖకు ఫిర్యాదు చేశారు. -
రాయితీపై కొరమీను చేపల పెంపకం
కొరమీను చేప పిల్లలు విడుదలకు భూమి పూజ చేస్తున్న ప్రజాప్రతినిధులు అధికారులు నాతవరం : చేపల పెంపకానికి ప్రభుత్వం రాయితీపై యూనిట్లు మంజూరు చేస్తుందని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం మూడు కొరమీను చేప పిల్లలు పెంపకం యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వెలుగు పథకంలో కొరమీను చేపల పెంపకం కోసం రాయితీపై మూడు యూనిట్లు మంజూరు చేశామన్నారు. యూనిట్కు రూ.4 లక్షల 41వేలు కాగా అందులో రూ.లక్షా 35వేలు సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ యూనిట్ ఏర్పాటు చేసుకునే లబ్ధిదారుకు వ్యవసాయ భూమి, విద్యుత్, బోరు సదుపాయం ఉండాలన్నారు. యూనిట్ ఏర్పాటు చేసేందుకు బ్యాంకు ద్వారా రుణం ఇస్తామన్నారు. కొరమీను ఏడాదికి మూడు విడతలుగా పంట వస్తుందన్నారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం కనకరాజు, జిల్లా మహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలు కోరుబిల్లి మణి, నాతవరం, గన్నవరం పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జిలు అపిరెడ్డి మాణిక్యం, సింగంపల్లి సన్యాసిదేముడు తదితరులు పాల్గొన్నారు. -
కుంచవానిపాలెంలో వ్యక్తి అనుమానాస్పద మృతి
మునగపాక : మండలంలోని కుంచవానిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్టు ఎస్ఐ పి.ప్రసాదరావు తెలిపారు.ఇందుకు సంబందించిన వివరాలను ఆయన గురువారం విలేకరులకు తెలిపారు. కుంచవానిపాలెం గ్రామానికి చెందిన పుచ్చ పారిపల్లి (38) ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగానే బుధవారం పనులు ముగించుకొని ఇంటికి చేరుకొని రాత్రి నిద్రపోయాడు. తెల్లవారు లేచి చూసేసరికి పారిపల్లి మృతి చెంది ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా గుర్తించి కేసు నమోదు చేశారు. పారిపల్లి మృతదేహాన్ని అనకాపల్లి వందపడకల ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. -
యువకుడిని రక్షించిన మైరెన్ పోలీసులు
నీటమునిగిన శ్రీనివాస్తో మైరెన్ పోలీసులు ఎస్.రాయవరం : రేవుపోలవరం తీరంలో సముద్రంలో మునిగిపోతున్న యువకుడిని గస్తీ నిర్వహిస్తున్న పెంటకోట మైరెన్ పోలీసులు కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ సంఘటన మేరకు మైరెన్ ఏఎస్ఐ ఎం.కృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాకవరపాలెం మండలం జి.కోడూరు గ్రామానికి చెందిన చవ్వాకుల శ్రీనివాస్ గురువారం 10వ తరగతి చివరి రోజు పరీక్ష రాసి స్నేహితులతో కలిసి సుమారు 10 మంది రేవు పోలవరం తీరానికి వచ్చారు. వీరిలో నలుగురు స్నేహితులు స్నానం కోసం సముద్రంలోనికి దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పెద్ద అలరావడంతో శ్రీనివాస్ మునిగిపోయాడు. అది గమనించిన మైరెన్ పోలీసులు హెచ్ఎస్ పి.అప్పలరాజు, శ్రీను, కానిస్టేబుల్ చినబాబు కలసి సముద్రంలోనికి దిగి శ్రీనివాస్ను ఒడ్డుకు చేర్చారు. స్వల్ప అస్వస్థతతో తీరంలో నుంచి బయటపడిన శ్రీనివాస్ను చూసి స్నేహితులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీనివాస్ ఆరోగ్యం నిలకడగా ఉండడంతో స్వగ్రామానికి పంపారు. -
ఐఐఎం విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు
గంభీరంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రాంగణంతగరపువలస: ఆనందపురం మండలం గంభీరం గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–విశాఖపట్నం(ఐఐఎంవీ)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. యునైటెడ్ కింగ్డమ్ కేంద్రంగా పనిచేసే బిజినెస్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నుంచి ఐదేళ్ల కాలానికి గాను ఐఐఎంవీ అక్రిడిటేషన్ను దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార విద్యలో నాణ్యత, సామాజిక ప్రభావాన్ని గుర్తించే ఈ అక్రిడిటేషన్ను పొందిన దేశంలోని అతికొద్ది సంస్థల్లో ఐఐఎంవీ ఒకటిగా నిలవడం విశేషం. ఈ సందర్భంగా ఐఐఎంవీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ గుర్తింపు అంతర్జాతీయ ప్రమాణాల పట్ల తమకున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, బాధ్యతాయుతమైన నిర్వహణ, నిరంతర అభివృద్ధి అనేవి తమ సంస్థ మూల విలువలని, ఈ అక్రిడిటేషన్ వాటిని మరింత ప్రతిబింబిస్తోందన్నారు. ఈ గుర్తింపుతో గ్లోబల్ స్థాయిలో ఐఐఎంవీ ప్రతిష్ట మరింత పెరుగుతుందని, తద్వారా విదేశీ భాగస్వామ్యాలు, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, అంతర్జాతీయ పరిశోధనలకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
సోలార్ ప్లాంట్ పేరుతో భూసేకరణ ఆపాలి
తుమ్మపాల: సోలార్ పవర్ ప్లాంట్ పేరుతో భూసేకరణ ఆపాలంటూ చీడికాడ మండలం జి.కొత్తపల్లి, అడవుల అగ్రహారం, బైలపూడి, చిన్నగోగాడ గ్రామాల ప్రజలు కలెక్టరేట్ గేటు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి ఆర్ దేముడు నాయుడు మాట్లాడుతూ జి. కొత్తపల్లిలో సర్వే నంబరు 166,167లో 40 ఎకరాలు, అడవుల అగ్రహారంలో సర్వే నంబరు 63లో 55 ఎకరాలు, బైలపూడిలో సర్వే నంబరు 122లో 60 ఎకరాలు, చిన్న గోగాడలో సర్వే నంబరు2లో 70 ఎకరాలు మొత్తం 225 ఎకరాలకు సాగు నిమిత్తం 65 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం డీ పట్టా ఇచ్చిందన్నారు. 320 మంది పేద రైతు కుటుంబాలు తాతలు, తండ్రుల నాటి నుంచి సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ ఈపీడీసీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 57.97 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ని నిర్మించనున్నట్లు ప్రకటించిందన్నారు. జీడి, మామిడి, పామాయిల్, నువ్వులు, వేరుశనగ వంటి పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద రైతులు నుంచి భూములు తీసుకుంటే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతుల భూములు లాక్కోవద్దని, సోలార్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఏ అగ్రహారం సర్పంచ్ సలారి గంగశేషు, మాజీ ఎంపీపీ కొల్లి అప్పలనాయుడు, గంటా మాచిరాజు, కన్నబాబు నాగరాజు, చలుగు శ్రీనువాస్, రైతులు పాల్గొన్నారు. -
అంతిమయాత్రకు కష్టాలెన్నో...
బుచ్చెయ్యపేట: మేజర్ పంచాయతీ వడ్డాదిలో శ్మశానానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేక పలువురు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో కొత్తూరు రెల్లివీధికి చెందిన కొత్తపల్లి రాజు అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. వీరి శ్మశానం మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న పెద్దేరు కస్పా కాలువ అవతల ఉంది. కాలువపై నుండి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేక కుటుంబ సభ్యులు రాజు మృతదేహంతో కాలువలోకి దిగి అవస్థలు పడ్డారు. మోకాళ్ల లోతు నీటిలో నుంచి దిగి శ్మశానానికి చేరుకుని దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఎవరైనా మృతి చెందితే ఈ రోజుతో ఆయనకు కష్టాలు పోయాయి సంతోషంతో దహన సంస్కారాలు చేయాలంటారు. కానీ శ్మశానంకు వెళ్లే రహదారి సౌకర్యం లేక అంతిమయాత్రకు నానా కష్టాలు తప్పడం లేదని పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో అవసరం లేకపోయినా పంట పొలాలకు లే అవుట్లకు ప్రభుత్వ నిధులతో రోడ్లు వేస్తున్న అధికారులు అవసరం ఉన్న చోట మాత్రం రోడ్డు సదుపాయం కల్పించడం లేదని, నాయకులు ఎక్కడ చెబితే అక్కడే రోడ్లు వేస్తున్నారు తప్ప ప్రజాప్రయోజనాలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. -
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
గోవాడ ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు చోడవరం: కార్మికులను నష్టం కలిగించే లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో గోవాడ సుగర్ఫ్యాక్టరీ గేటు వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా సీఐటీయు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు ఇవ్వడంతో దీనిలో భాగంగా గోవాడ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ధర్నా చేశారు. లేబర్ కోడ్స్ను రద్దు చేసి గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను నష్టం కలిగించే చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందని, వెంటనే వీటిని రద్దు చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు, గోవాడ సుగర్స్ కార్మిక సంఘం నాయకులు శరగడం రామునాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల గోవాడ సుగర్ ప్యాక్టరీలో కార్మికులు, రైతులకు తీరని నష్టం కలిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణంలో రైతులు, కార్మికులకు రావలసిన బకాయిలను చెలించాలని వారు డిమాండ్చేశారు. ఈ ఆందోళనలో నాయకులు ఎస్.వి నాయుడు, రాయి సూరిబాబు, రామకుమార్ పాల్గొన్నారు. -
పింఛన్లు పంపిణీ చేసిన హోం మంత్రి
నక్కపల్లి: మండలంలో అప్పలపాయకరావుపేట, నక్కపల్లి గ్రామాల్లో బుధవారం హోం మంత్రి వంగలపూడి అనిత సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ నేతన్నలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. దీనివల్ల కరెంటు బిల్లుల భారం నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. చేనేత కార్మికురాలితో కలిసి నక్కపల్లిలో మగ్గం నేశారు. వారి నుంచి చీర కొనుగోలు చేశారు. అనంతరం నక్కపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏపీఐఐసీ పునరావాస కాలనీలో నిర్వాసితుల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కొప్పిశెట్టి వెంకటేష్, పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జ్ కొప్పిశెట్టి బుజ్జి, ఎంపీడీవో చైతన్య, నాయకులు పాల్గొన్నారు. -
పటిష్ట చర్యలు
ప్రభుత్వ భూముల పరిరక్షణకు● సీఎంఓ కార్యాలయం, పీజీఆర్ఎస్ దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ ● రెవెన్యూ అధికారుల సమీక్షలో కలెక్టర్ విజయకృష్ణన్తుమ్మపాల: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ ఽశౌర్యమాన్ పటేల్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న భూముల తాలూక తాజా పరిస్థితులను తెలుపుతూ నివేదికలు సమర్పించాలని, సంక్షిష్ట పరిస్థితులకు సంబంధించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టాదార్ పాస్పుస్తకాలు పంపిణీ, రీ సర్వే, వెబ్ ల్యాండింగ్ పోర్టింగ్, తదితర అంశాలపై నిర్వహించాల్సిన విధి విధానాల గురించి ప్రస్తావించారు. మ్యుటేషన్ల ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జీవో నెం. 30 ప్రకారం అందరికీ ఇల్లు కార్యక్రమంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సీఎంవో కార్యాలయం నుంచి, పీజీఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తులపై అధికారులు స్వయంగా పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. 22(ఏ) పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల విషయంలో అధికారుల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చౌక ధరల దుకాణాలు, పెట్రోలు బంకులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. చౌక ధరల దుకాణాలకు మహిళలు పిల్లలు వచ్చినట్లయితే ముందుగా వారికి సరుకులు పంపిణీ చేయాలని, మంచి నీరు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదని, గ్యాస్ ఏజెన్సీలలో ముందస్తు బుకింగ్స్ లేకుండా చూడాలని, గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరీ ద్వారా మాత్రమే అందజేయాలని, గ్యాస్ గోడౌన్ వద్ద ఎటువంటి డెలివరీలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గనులు క్వారీలపై అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. ఫైర్ క్రాకర్ యూనిట్లకు సంబంధించిన తనిఖీ నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణ రావు, ఆర్డీవోలు వి.వి. రమణ, షేక్ ఆయేషా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నాయకులపై కేసు కొట్టివేత
చోడవరం : వైఎస్సార్సీపీ నాయకులకు కోర్టులో ఊరట లభించింది. ఆ పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసును చోడవరం కోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. 12 మంది వైఎస్సార్సీపీ నాయకులపై పెట్టిన కేసు నిరాధారమైనదంటూ నిర్దోషులుగా పేర్కొంటూ వారిపై పెట్టిన కేసును కోర్టు కొట్టేసింది. వివరాల్లోకి వెళితే... 2018లో వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్పోర్టులో ఒక యువకుడు కోడి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళన చెందిన చోడవరం వైఎస్సార్సీపీ నాయకులు తమ అధినేతపై జరిగిన హత్యాయత్నానికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ శాంతియుతంగా చోడవరం పట్టణంలో నిరసన తెలిపారు. ఈ నిరసనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి స్థానిక వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, చోడవరం జెడ్పీటీసీ మారిశెట్టి విజయశ్రీకాంత్, చోడవరం ఉపసర్పంచ్ పుల్లేటి వెంకట్రావు,బిసీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లా నర్సింగరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంపలి ఆనంద్, జిల్లా ప్రతినిధి జ్యోతుల రమేష్, సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఓరుగంటి నెహ్రూ, జిల్లా ప్రతినిధి వడ్డాది నర్సింహమూర్తి, మండల బీసీసెల్ అధ్యక్షుడు సూరిశెట్టి నాగదుర్గగోవింద, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శరగడం నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షురాలు అల్లాడ భవానీతో సహా 12 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి 9సంవత్సరాలు పాటు వాయిదాలకు కోర్టుకు తిరిగిన ఆ పార్టీ నాయకులకు కోర్టులో ఎట్టకేలకు ఊరట లభించింది. వైఎస్సార్సీపీ నాయకుల తరపున ఆ పార్టీ లీగల్ అడ్వయిజర్ కాండ్రేగుల డేవిడ్ కోర్టులో వాదనలు వినిపించారు. అప్పటి తహసీల్దార్, ఇద్దరు ఎస్ఐలు, పలువురు కానిస్టేబుళ్లు ఈ విచారణలో కోర్టుకు హాజరయ్యారు. చోడవరం జుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి స్వర్ణ ఈ కేసును విచారణ చేసి తుది తీర్పు చెప్పారు. నిందితులపై మోపబడిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో వారిని నిర్దోషులుగా పరిగణిస్తూ న్యాయమూర్తి కేసును కొట్టివేశారని నిందితుల తరపు న్యాయవాది కాండ్రేగుల డేవిడ్ చెప్పారు. ఈ సందర్భంగా వారంతా డెవిడ్కు కృతజ్ఞతలు తెలిపారు. తమపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినప్పటికీ న్యాయమే గెలిచిందని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. -
వాల్తేరులో సరికొత్త మైలు రాళ్లు
సాక్షి, విశాఖపట్నం : భారతీయ రైల్వేలో వాల్తేరు విభాగం మునుపెన్నడూ లేని విధంగా చరిత్రాత్మక విజయాలను నమోదు చేస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతోందని డీఆర్ఎం లలిత్ బోహ్రా తెలిపారు. వాల్తేరు డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో వాల్తేరు ప్రగతి వివరాలను వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన ఈ విభాగం, దేశవ్యాప్తంగా అత్యధిక ఆదాయం గడించిన విభాగాల్లో ఐదో స్థానాన్ని కై వసం చేసుకుని తన ప్రత్యేకతను చాటుకుందని తెలిపారు. ప్రధానంగా సరుకు రవాణాలో 85.1 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా, మునుపటి ఏడాదితో పోలిస్తే 17.25 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించామన్నారు. వాల్తేరు డీఆర్ఎం ఇంకా ఏం చెప్పారంటే.. ఆర్థిక రికార్డులు.. కార్యకలాపాల జోరు వాల్తేరు విభాగం ఈ ఏడాది మొత్తం రూ.11,598 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది గతేడాదితో పోలిస్తే 17 శాతం అధికం. ముఖ్యంగా సరుకు రవాణా, రవాణా నిర్వహణలో 150 మిలియన్ టన్నుల మైలురాయిని దాటి అగ్రగామిగా నిలిచింది. ప్రయాణికుల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగాయి. సుమారు 3.34 కోట్ల మంది ప్రయాణికులు వాల్తేరు రైల్వే సేవలను వినియోగించుకోగా, గత 21 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల విభాగం ద్వారా రూ.881.37 కోట్ల ఆదాయం సమకూరింది. క్యాటరింగ్, పార్కింగ్, ప్రకటనలు, టికెట్ తనిఖీల ద్వారా కూడా భారీగా ఆదాయం ఆర్జించాం. శరవేగంగా స్టేషన్ల నవీకరణ పనులు వాల్తేరు డివిజన్ పరిధిలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 15 రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు ఎంపిక చేశాం. విశాఖపట్నం ప్రాంతంలో రైలు ఫ్లైఓవర్లు, అదనపు లైన్ల నిర్మాణం, స్టేషన్ల నవీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం విశాఖపట్నం స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్, విశాఖలో 220, విజయనగరంలో 24 డిజిటల్ స్క్రీన్లు, అత్యాధునిక వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశాం. పండగలు, సెలవుల రద్దీని తట్టుకునేందుకు 300కు పైగా ప్రత్యేక రైళ్లు, 400 అదనపు కోచ్లను నడిపాం. విశాఖపట్నం నుంచి తిరుపతి, చర్లపల్లి వెళ్లే ప్రత్యేక రైళ్లను క్రమబద్ధీకరించారు. అరకు, కొరాపుట్ కాఫీ బ్రాండ్లను ప్రోత్సహించడానికి ఆయా స్టేషన్లలో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్లాటినం రేటింగ్ కలిగిన హరిత రైల్వే స్టేషన్గా విశాఖపట్నం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదు వాల్తేరు విభాగం సాంకేతికత వినియోగంలోనూ ముందుంది. భద్రత, నిఘా కోసం విశాఖ స్టేషన్లో ‘ఆర్క్ అర్జున్’ అనే కృత్రిమ మేధస్సుతో పనిచేసే రోబోను ప్రవేశపెట్టాం. ఇది నేరస్తులను గుర్తించడంలో, ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భద్రతా పరంగా అప్రమత్తంగా వ్యవహరించిన సిబ్బందికి ప్రత్యేక అవార్డులు అందజేయడమే కాకుండా, సిబ్బంది నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. మౌలిక వసతుల విస్తరణ రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు మౌలిక సదుపాయాల విస్తరణపై విభాగం దృష్టి సారించాం. ఈ ఏడాది జనవరి నాటికి 380 కిలోమీటర్లకు పైగా డబుల్ లైన్ పనులను పూర్తి చేసి ప్రారంభించడం ఒక పెద్ద విజయం. దీనివల్ల రైళ్ల రాకపోకల్లో జాప్యం తగ్గడమే కాకుండా, సరుకు రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుంది. పార్లమెంట్లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించినట్లుగా.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ త్వరలో రాబోతుందని డీఆర్ఎం స్పష్టం చేశారు. -
కార్మికులకు సంక్షేమ పథకాల పునరుద్ధరణ
మాట్లాడుతున్న సహాయ కార్మికాధికారి సూర్యనారాయణ చోడవరం: కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని కార్మిక శాఖ సహాయ కార్మికాధికారి పి. సూర్యనారాయణ అన్నా రు. బుధవారం చోడవరంలో సబ్బవరం, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ, బుచ్చెయ్య పేట, రావికమతం, మాడుగుల మండలాలకు చెందిన కార్మిక సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. గత నెల నుంచి సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరించామ న్నారు. కార్మికుల కుమార్తెల వివాహానికి రూ.40 వేలు, ప్రసూతి ఖర్చులకు రూ. 20వేలు, సహజ మరణానికి రూ.60వేలు, దహన ఖర్చులకు రూ. 20వేలు ఇచ్చే పథకాలు పునరుద్ధరించామన్నారు. -
ఘనంగా మరిడమ్మ జాతర
నర్సీపట్నం: మూడేళ్లకోసారి నిర్వహించే పట్టణ ప్రజల ఇలవేల్పు మరిడమ్మ జాతర కనులపండువగా జరిగింది. రెల్లివీధి నుండి అమ్మను గరగలు నృత్యం, వివిధ కాగితపు పువ్వుల అలంకరణతో తీసుకువచ్చారు. ఊరేగింపులో వివిధ రకాల కళాకారులు, వేషదారుణలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తీన్మార్ డప్పులు, అమ్మవారి శక్తి అవతారాలతో కళాకారులు, వివిధ రకాల డప్పు వాద్యకారులు ఊరేగింపులో పాల్గొన్నారు. దారిపొడవునా ప్రజలు ఊరేగింపును తిలకించడానికి బారులు తీరారు. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ ఊరేగింపు సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు ఊరేగింపులో పాల్గొన్నారు. -
హోంగార్డు కుటుంబానికి రూ.4.24 లక్షల సాయం
హోంగార్డు వెంకటరావు భార్య నీలిమకు చెక్కు అందజేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: పోలీస్ శాఖలో హోంగార్డులు ఒక భాగమేనని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు డి.వి.వెంకటరావు భార్య నీలిమకు రూ.4,24,120 చెక్కును బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ఆర్.ఐ.ఎన్.ఎల్ స్టీల్ ప్లాంట్లో డిప్యూటేషన్పై విధులు నిర్వర్తిస్తూ, అనారోగ్యంతో మరణించిన వెంకటరావు కుటుంబానికి అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మిగిలిన హోంగార్డులు ఒక రోజు గౌరవ వేతనాన్ని అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎ.ఓ సి.హెచ్.తిలక్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ దేవరాజు, జూనియర్ అసిస్టెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక చట్టాల అమలులో ప్రభుత్వాలు విఫలం
పాడేరు రూరల్: కార్మిక చట్టాలు, హక్కులు పటిష్టంగా అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనట్టు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జల్లి రాజబాబు, అమర్ చెప్పారు. పాడేరు ఐటీడీఏ ముఖద్వారం వద్ద కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపుమేరకు ఏఐటీయూసీ జిల్లా సమితి బుధవారం ధర్నా చేపట్టారు. నాయకులు నల్లరిబ్బన్లతో కళ్లకు గంతలు కట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు అదనపు పనిభారం పెరుగుతోందని, దీంతో తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు అందరూ వ్యతిరేకించాలన్నారు. ఈ మేరకు కేంద్ర కమిటీ పిలుపుమేరకు ఏప్రిల్ 1న బ్లాక్ డేగా పాటించామన్నారు. గతంలో ఉన్న కార్మిక చట్టాలను కొనసాగించి, అమలు చేయాలని లేనిపక్షంలో భవిష్యత్లో ఉద్యమాలు తీవ్రం చేస్తామని వారు చెప్పారు. కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శి రాంబాబు, ఉపాధ్యక్షుడు కృష్ణ, నాయకులు శివశంకర్, లక్ష్మయ్య, సత్తిబాబు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులను మోసం చేసిన చంద్రబాబు
● డిమాండ్ల సాధన కోసంయూటీఎఫ్ రణభేరి 3.0 ● ఐటీడీఏ కార్యాలయం ఎదుట రీలే దీక్ష పాడేరు : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల మాదిరిగానే ఉద్యోగ, ఉపాధ్యాయులకు సూపర్ సిక్స్ హామీలను ఇచ్చిన కూటమీ పార్టీలు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించకుండా నిలువునా మోసం చేసిందని యూటీఎఫ్ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు రఘునాధ్, మహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక ఐటీడీఏ ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.0 ఒక రోజు రిలే దీక్షను చేపట్టారు. ఈ దీక్షలను యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీలక్ష్మి, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అద్యక్షుడు మసాడ ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ హామీలు అమలుచేయకుండా ఉపాధ్యాయులను చంద్రబాబు మోసం చేశారనన్నారు. ఉద్యోగ, ఉపాద్యాయులపై కూటమీ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని , ఆర్థిక బకాయిలన్నింటిని తక్షణమే చెల్లించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, పాత డీఏ బకాయిలు చెల్లించాలని, ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని, కేజీబీవీ, ఎంటీఎస్ ఉపాద్యాయుల సమస్యలను పరిష్కారించాలని వారంతా ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. రిలే దీక్షకు పలు సంఘాల మద్దతు యూటీఎఫ్ చేపట్టిన దీక్షకు పలు ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. సీపీఎస్ జిల్లా అద్యక్షుడు మోరి మోహన్బాబు, ప్రతినిధులు యువరాజు, గంపరాయి రమేష్, ఉబ్బేటి నరేష్, దండకారణ్య ఉద్యోగ సమితి రాష్ట్ర కార్యదర్శి యం.రాజాబాబు, బీటీఏ జిల్లా అద్యక్షుడు వి.వెంకటరమణ, ఏపీ జేఏసీ డివిజన్ చైర్మన్ కె.సుబ్రమణ్యం, కార్యదర్శి జి.సింహాచలం పాల్గొని సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నారు. అనంతరం యూటీఎఫ్తో సహా పలు ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల ప్రతినిధులు, నాయకుల సమస్యలపై ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. యూటీఎఫ్ నాయకులు చీకటి నాగేశ్వరరావు, పార్వతి, చిట్టిబాబు, ధరమారావు, దేముడు, కన్నయ్య, శ్రీను, రాంబాబుతో పాటు జిల్లాలోని పలు మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మోదకొండమ్మ ఉత్సవాలు ఘనంగా ఏర్పాట్లు
పాడేరు : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరు మోదకొండమ్మ తల్లి జాతర ఉత్సవాలను ఈ ఏడాది మే 10, 11, 12 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పాడేరు ఎమ్మెల్యే, మోదకొండమ్మ తల్లి ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. స్థానిక అమ్మవారి ఆలయం అన్నదాన సత్రంలో ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ సభ్యులతో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ గత ఏడాది కన్నా గొప్పగా ఉత్సవాల నిర్వాహణకు కార్యచరణ రూపొందించామన్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతంలోని అన్ని వర్గాల భక్తులు ఉత్సవాల నిర్వాహణ కోసం విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించాలన్నారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పలాసి కృష్ణారావు, కిల్లు గంగన్న పడాల్, కుడుముల వెంకటరమణ, మాసాడ ఈశ్వరరావు, వర్తన పిన్నయ్య దొర, బోనంగి వెంకటరమణ, డి.పి. రాంబాబు, టి.ప్రసాద్నాయుడు పాల్గొనారు.పాడేరు ఎమ్మెల్యే, మోదకొండమ్మ తల్లి ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు -
వెండితెర వెలుగులు
ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతం ప్రకృతి రమణీయతకు అద్దంపడుతోంది. పర్యాటకులనే కాకుండా సినీ ప్రపంచాన్నీ ఆకర్షిస్తోంది. దీంతో ఎన్నో సినిమా సన్నివేశాలకు నిలయంగా మారింది. పలు సుందర దృశ్యాలు కెమెరాలకు చిక్కుతున్నాయి. ఈ సుందర ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే రానున్న కాలంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.సినిమా షూటింగ్లు జరిగేతారబు జలపాతంఏవోబీలోముంచంగిపుట్టు: మన్యం.. ప్రకృతి అందాలకు పేరుగాంచింది. ఇందులోనూ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఒకవైపు దీవులను తలపించే జోలాపుట్టు అందాలు మరోవైపు పచ్చని కొండలతో నిండిన ప్రశాంత వాతావరణం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతంలోని సుందర ప్రకృతి దృశ్యాలు సినీ దర్శకులను సైతం కట్టిపడేస్తోంది. దీంతో సినిమా షూటింగ్లు తరచూ జరుగుతున్నాయి. చిత్రీకరణ జరిగే ప్రాంతాలు జోలాపుట్టు జలాశయం ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో సుమారు 250 పైగా గ్రామాలకు విస్తరించి ఉంది. జలాశమం మధ్యలో మట్టిదిబ్బలు అందమైన దీవులను తలపించేలా దర్శనమిస్తున్నాయి. ఇక్కడున్న మత్స్యగెడ్డ అందాలు అందరిని కట్టిపడేస్తున్నాయి. మెలికలు తిరుగుతూ ఎత్తైన గిరుల మధ్య ప్రవాహించే మత్స్యగెడ్డ అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి చేరేందుకు ఏర్పాటుచేసిన వించ్ ప్రయాణం ఓ అద్భుతం.. ఈ ప్రయాణాన్ని కూడా సినిమాల్లో చిత్రీకరిస్తున్నారు. డుడుమ, మాచ్ఖండ్, మత్స్యగెడ్డ సుందర ప్రదేశాలకు వచ్చి లోకేషన్లు చూసిన ప్రముఖ డైరెక్టర్లు, ఫోటోగ్రాఫర్లు కెమెరాలో బంధించి వెళ్తున్నారు. చిత్రీకరించిన సినిమాలు ● 2021లో ‘హనుమాన్’ సినిమా షూటింగ్ జరిగింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హిరోగా తేజ సజ్జా, హిరోయిన్గా అమృత అయ్యర్లపై పలు పాటాలు, సన్నివేశాలను చిత్రీకరించారు. ● 2022లో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా షూటింగ్కు మూడు రోజులు పాటు జరిగింది. హిరో అల్లరి నరేష్, హిరోయిన్ ఆనందిపై పాటను మత్స్యగెడ్డ ఒడ్డున చిత్రీకరించారు. ● 2023లో ఏవోబీ సరిహద్దు ప్రాంతమైన వంతాల ఘాట్లో ‘పుష్ప–2’ సినిమాలో లారీ ఛేజింగ్ సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ చిత్రీకరించారు. ● 2024లో మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం పరిసరాల ప్రాంతాల్లో ప్రముఖ సినీ డైరెక్టర్ జాగర్లమూడి రాధాక్రిష్ణ(క్రిష్) దర్శకత్వంలో ‘ఘాటీ’ సినిమా షూటింగ్ జరిగింది. హిరోయిన్ అనుష్క శెట్టి, ప్రముఖ నటుడు జగపతిబాబు, జాన్ విజయ్లపై సన్నివేశాలు, యాక్షన్ సీన్లు చిత్రీకరించారు. ● 2024 సంవత్సరం అక్టోబర్లో ‘రాబిన్హుడ్’ చిత్రంలోని హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీలపై కొన్ని సన్నివేశాలు షూటింగ్ తీశారు. ● 2025లో సరిహద్దులోని పలు ప్రాంతాల్లో దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్బాబుల షూటింగ్ గుట్టు చప్పుడు కాకుండా జరిగింది. మౌలిక సదుపాయాలు లేక అవస్థలు ప్రకృతి అందాలకు నిలయంగా మారిన ఏవోబీలోని తరచూ సినిమా షూటింగ్లు జరుతున్నా కనీస మౌలిక సదుపాయాలు లేక సిని చిత్ర బృందం అవస్థలు పడుతున్నారు. సినిమా షూటింగ్లు, పర్యాటకులు పెరుగుతున్న సౌకర్యాలు కల్పన లేక ప్రభుత్వాలు విఫలమైయ్యాయి. బస చేసేందుకు కాటేజీలు, రెసిడెన్సీలు లేక పర్యాటకులు ఉండలేకపోతున్నారు. ఇక్కడ బస చేసేందుకు కాటేజీలు, హోటళ్లు లేకపోవడంతో సినిమా షూటింగ్ చేసే వారు అరకు, పాడేరు తదితర ప్రాంతాల నుంచి సుమారు 50 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ప్రాంతానికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సమయం వృథా అవుతుంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని పలువురు చెబుతున్నారు. డుడుమ జలాశయంపై షూటింగ్లో జగపతిబాబుసుజనకోట మత్స్యగెడ్డ ఒడ్డున షూటింగ్ సందడి అందాలు అద్భుతం ఏవోబీ ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయి. డుడుమ జలపాతం, మాచ్ఖండ్ వించ్ హౌస్లో ప్రయా ణం మధుర అనుభూతి ఇస్తుంది. సినిమా షూటింగ్లకు అనువైన ప్రాంతం. మొదట వారం రోజులు సినిమా షూటింగ్ చేస్తే చాలు అనుకున్నాను. కానీ రెండు వారాలుగా సినిమా షూటింగ్ జరుగుతుంది. నేను చూసిన అందమైన లొకేషన్లో మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం, డుడుమ జలపాతం ఒకటి. ఈ ప్రాంతం చిత్రీకరణకు బాగుంది. – జాగర్లపూడి రాధాక్రిష్ణ(క్రిష్), ప్రముఖ సినీ దర్శకుడు ప్రకృతి అందాలకు నెలవుగా సరిహద్దు ప్రాంతం సినిమా షూటింగ్లతో నిత్యం సందడి తరలివస్తున్న చిత్ర యూనిట్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తే మరింత ఆదరణ షూటింగ్లకు అనువైన ప్రాంతం కేరళ, గోవాలలోనే సినిమా షూటింగ్కు మంచి లోకేషన్ లు ఉన్నాయని అనుకుంటారు. కాని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో చాలా అందమైన లోకేషన్లు ఉన్నాయి. ఎతైన కొండల నడుమ మత్స్యగెడ్డ ఒంపులు తిరుగుతూ వెళ్తున్న దృశ్యం చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడి ప్రకృతి అందాలు బాగున్నాయి. రానున్న రోజుల్లో ఎక్కువ షూటింగ్లు జరిగే అవకాశాలున్నాయి. – జగపతిబాబు, ప్రముఖ సినీ నటుడు -
ఉపాధి పనుల కల్పనలో జవాబుదారీతనం అవసరం
డ్వామా పీడీ విద్యాసాగర్ ముంచంగిపుట్టు: ఉపాధి హామీ పథకం ద్వారా జరిగే పనులపై క్షేత్రసాయిలో జవాబుదారీతనంగా ఉపాధి సిబ్బంది పనిచేయాలని జిల్లా డ్వామా పీడీ డి.విద్యాసాగర్ అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులపై ప్రజావేదిక కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ మేరకు ఉపాధి పనుల్లో రూ.26.25కోట్లకు, మెటీరియల్ ద్వారా రూ.94.81లక్షలు, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ.6,22,99,000, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ద్వారా రూ.7,54,58,000, సమగ్ర శిక్ష అభియాన్ శాఖ ద్వారా రూ.46లక్షలతో జరిగిన పనులపై ఇటీవల 17వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ పనులు పారదర్శకంగా జరగాలని, వేతనదారులకు మస్తర్లు సకాలంలో సక్రమంగా వేయాలని ఆదేశించారు.పనుల కల్పనలో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మండలంలో అన్ని పంచాయతీల్లో సామాజిక తనిఖీల్లో రూ.14, 500లు రికవరీ చేయగా, రూ.18,900 అపరాధ రుసుము విధించినట్టు చెప్పారు. ఏపీడీ వెంకటరావు, ఎంపీపీ సీతమ్మ, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రమేష్, ఎంపీడీవో ధర్మారావు, ఏపీవోలు సంఘంనాయుడు, వెంటేశ్వర్లు, ఎస్ఆర్పీలు అప్పారావు, అచ్యుతరావు, డీఆర్పీలు నరసింహామూర్తి, రాజేశ్వరరావు, వరహాలమ్మ, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపాధి హామీ పిబ్బంది, వేతనదారులు తదితరులు పాల్గొన్నారు. -
వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టు కోసం గ్రామసభ నేడు
సీలేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా ఒడిశా–పోలవరం సరిహద్దు సీలేరు గుంటవాడ రిజర్వాయర్ వద్ద వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం గురువారం గ్రామసభ నిర్వహించనున్నట్టు తహసీల్దార్ అన్నాజీరావు చెప్పారు. ఈ మేరకు సీలేరులోని మారెమ్మ తల్లి ఆలయం ఎదురుగా ఉన్న ఘాట్ను ఆయన బృందంతో కలిసి పరిశీలించారు. సర్పంచ్ దుర్జోను కలిసి స్థానిక వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అన్నాజీరావు మాట్లాడుతూ వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ఏపీ జెన్కో కల్యాణమండపంలో నిర్వహించనున్న గ్రామసభకు జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హాజరుకానున్నట్టు చెప్పారు. ప్రజల సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తయితే అల్లూరి జిల్లాకు రాష్ట్రంలోనే మంచి గుర్తింపు వస్తుందని, పర్యాటకంగా మరింత ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. -
స్థానిక గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి
ముంచంగిపుట్టు : మత్స్యగెడ్డలో ఏర్పాటుచేయనున్న వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టులో స్థానిక గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉమ్మడి విశాఖ జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర డిమాండ్ చేశారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు పంచాయతీ కేంద్రంలోని మత్స్యగెడ్డలో మంజూరైన వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏపీ ఎయిర్ పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును నిర్వహించారు. జోలాపుట్టు పంచాయతీలోని 11 గ్రామాల నుంచి గిరిజనులు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేశారు. మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం నిర్మించి 70 ఏళ్ల అవుతున్నా ప్రాజెక్టు వలన భూములు కోల్పోయిన వారికి నేటీకీ ఎటువంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని, మైదాన ప్రాంతానికి చెందిన వారికే మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రంలో ఉద్యోగాలు కల్పిస్తున్నారని, తమకు తీరని అన్యాయం జరిగిందని స్థానిక గిరిజనులు చెప్పారు. ప్రస్తుతం నిర్మించే వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టులో 85 శాతం ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే కల్పిస్తామని తీర్మాణం చేస్తేనే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో స్థానిక గిరిజనులకే ప్రాధాన్యం కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి విశాఖ జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టు నిర్మిస్తే జోలాపుట్టు పంచాయతీ గిరిజనులకు న్యాయం జరిగేలా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తారో స్పష్టమైన తీర్మానం చేయాలన్నారు. ముఖ్యంగా భూ బదలాయింపు చట్టం, గిరిజన హక్కులు, చట్టాలకు ఎటువంటి భంగం కలకుండా చూడాలని, బినామీ వ్యవస్థ ఉండకూడదని స్పష్టం చేశారు. జోలాపుట్టు పరిసర గ్రామాల్లో చేపల వేట చేసే గిరిజనులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, పర్యావరణం కలుషితం కాకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయాలన్నారు. ఫిషింగ్ టూరిజం ఏర్పాటుకు చర్యలు కార్యక్రమంలో పాల్గొన్న ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ , ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ అందరి అనుమతులతోనే ప్రాజెక్టు నిర్మించాలనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతుందన్నారు. స్థానిక గిరిజన యువతీ, యువకులకు ప్రాజెక్టులో ఉద్యోగాల కల్పన కోసం చర్యలు తీసుకుంటామన్నారు. జోలాపుట్టు పరిసర ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.16.45కోట్లతో మంజూరైన వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు. అన్ని అనుమతులతోనే ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందని, గిరిజన మత్స్యకారుల కోసం ఫిషింగ్ టూరిజం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖపట్నం, విజయనగరం కాలుష్య నియంత్రణ మండలి ఈఈలు సరిత, ఉపేంద్ర, టూరిజం డీవీఎం జి.వి.బి.జగదీష్, విశాఖకు చెందిన పర్యవరణవేత్త జె.పి.రామారావు, జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్ భాస్కరఅప్పారావు, సర్పంచ్ నీలకంఠం, ఎంపీటీసీలు కమల, సుబ్బలక్ష్మీ, వివిధ పార్టీల నేతలు జగబంధు, దశరధి, మూర్తి, ఎండీ సోలెమాన్, మణి, ప్రకాశ్, రామస్వామి, రాందాసు, భగత్రామ్, స్థానికులు పాల్గొన్నారు. వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ గిరిజన హక్కులు, చట్టాలకు విఘాతం కలగకుండా ప్రాజెక్టు నిర్మించాలి జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర పూర్తిస్థాయి అనుమతులతోనే పనులు ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ , ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ -
ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు చీకట్లు చెదిరిపోతున్నాయి. ఏపీఈపీడీసీఎల్ ప్రారంభించిన ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం ద్వారా ప్రజల విద్యుత్ సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్నాయి. సీఎండీ పృథ్వీతేజ్ స్వయంగా కాల్స్ స్వీకరిస్తూ అధికారులను కదిలించడంతో మారుమూల గ్రా
సాక్షి, విశాఖపట్నం: ఒక ఫోన్ నంబర్.. 8 వారాలు.. 11 జిల్లాలు.. 11 సర్కిళ్లు.. 345 ఫిర్యాదులు.. వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. మొత్తంగా వినూత్నంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రారంభించిన ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి స్వయంగా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం ఫిర్యాదులు తీసుకొని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత విభాగాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 345 ఫిర్యాదులు.. 35 పెండింగ్ ఇప్పటివరకు 8 వారాల పాటు డయల్యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు 345 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 310 ఫిర్యాదులను ఈపీడీసీఎల్ అధికారులు పరిష్కరించారు. ఫోన్లో ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ఆ గ్రామానికి రావడంతో ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెరుగుతూ వస్తోంది. ఎక్కువగా లోవోల్టేజీ సమస్యపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటివరకు 76 వరకూ లోవోల్టేజీ ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యప్రకాష్ పర్యవేక్షిస్తూ.. పరిష్కరిస్తున్నారు. 76 ఫిర్యాదుల్లో 62 పరిష్కరించారు. లోవోల్టేజీని అధిగమించేందుకు... 43 ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు మార్చారు. లోవోల్టేజ్ ఉన్న ప్రాంతంలో 7.5 కి.మీ మేర పాత కండక్టర్లు మార్చడం విశేషం. మిస్డ్ కాల్స్పైనా దృష్టి పెడుతున్నాం.. ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకూ ఫిర్యాదులు తీసుకుంటున్నాం. ఒక ఫిర్యాదు తీసుకున్న సమయంలో ఏవైనా మిస్డ్ కాల్స్ ఉంటే.. 11.30 గంటల తర్వాత ఆ నంబర్లకు ఫోన్ చేసి.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. ప్రతి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించాం. విద్యుత్ అంతరాయాలు, వోల్టేజ్ సమస్యలు, కొత్త సర్వీస్ కనెక్షన్ జాప్యం, విద్యుత్ పునరుద్ధరణ, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి వంటి అంశాలను నేరుగా నా దృష్టికి తీసుకురావొచ్చు. –పృథ్వీతేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీదెబ్బలపాడు గ్రామస్తులతో ఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది -
రెవెన్యూ సమస్యలపై సత్వర పరిష్కారం
● అలసత్వం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు ● ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పాడేరు: రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, విధి నిర్వాహణలో అధికారులు అసలత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. కలెక్టరేట్ వీడియో కాన్పరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని రెవెన్యూ అధికారులతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీజీఆర్ఎస్, ఐవీఆర్ఎస్ కాల్స్, కేవైసీ, రేషన్ పంపిణీ, పట్టదారు పుస్తకాల పంపిణీ తదితర వాటిపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రజా సమస్యల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్యకు మార్గం చూపాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. సివిల్ సప్లై అధికారులు నిరంతరంగా రేషన్ దుకాణాలు, డీఆర్ డిపోలను తనిఖీలు చేయాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటి పన్ను, నీటి పన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఇన్చార్జి డీఆర్వో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.నీలకంఠేశ్వరరావు, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
రహదారుల పనుల్లో నాణ్యత పాటించాలి
ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల రహదారి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండలంలోని జర్రెల పంచాయతీ కేంద్రంలో మంగళవారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పర్యటించారు. గ్రామంలో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జర్రెల నుంచి మండిభ వరకు పంచాయతీరాజ్ ద్వారా నిర్మించనున్న రోడ్డు పనులకు ఎమ్మెల్యే మత్స్యలింగం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన గ్రామాల్లో సంక్షేమ పాలన జరిగిందని, నేడు చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాన్ని కనీసం పట్టించుకోవడం లేదన్నారు. బడులు లేక విద్యార్థుల అవస్థలు పాడేరు ఐటిడిఏ పరిధిలో 168 పాఠశాలలకు భవనాలు లేక గిరిజన విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో నాడు–నేడు ద్వారా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో అనేక ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని గుర్తు చేశారు. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి గడప గడపకు సంక్షేమాన్ని అందించారన్నారు. ఇంటి వరకు పింఛన్లు, రేషన్ సరకులు అందించిన ఘనత నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం మాటల్లోనే తప్ప ఆచరణలో లేదని స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీలో తీసుకువచ్చిన మార్పులతో పింఛన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రేషన్ సరకుల కోసం కిలోమీటర్లు నడిచి వెళ్లి తీసుకు రావాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పనులకు బిల్లుల విషయంలోనే నేటి ప్రభుత్వం అసత్యం ప్రదర్శిస్తుందన్నారు. రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత కోరవడుతుందన్నారు. గిరిజన ప్రాంతానికి మేలు జరిగేలా పాలన అందించాలన్నారు. ఎంపీపీ సీతమ్మ, సర్పంచులు భాగ్యవతి, నరసింగరావు, రమేష్, బాబూరావు, ఎంపీటీసీ సుబ్బలక్ష్మీ, వైఎస్సార్సీపీ ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల అధ్యక్షులు పద్మరావు, చంద్రుబాబు, నాయకులు సురేష్, సుందరరావు, రాంప్రసాద్, సన్యాసిరావు, పాపారావు, దేవ, దాసు, తిరుపతి, రామ్మూర్తి, పులిరాజు, కొండలరావు పాల్గొన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
ఆత్మీయ సన్మానం
చింతపల్లి: ఉన్నత సేవలతోనే మంచి గుర్తింపు ఉంటుందని ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి అన్నారు. లంబసింగి గిరిజన సంక్షేమ బాలకల ఆశ్రమ పాఠశాలలో పదవీ విరమణ పొందిన పీజీ హెచ్ఎం (పానల్ గ్రేడ్ హెచ్ఎం) జక్కు శంకరరావు దంపతులను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన 34 ఏళ్లుగా గిరిజన ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ జక్కు శంకరరావు ఎంతో అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. ఎంతోమంది గిరిజన విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారన్నారు. ఉన్నత ఉపాధ్యాయుడిగా గుర్తింపు తెచ్చుకోగలగారన్నారు. ఈ సందర్భంగా పలువురు శంకరరావు సేవలను కొనియాడారు. పీజీ హెచ్ఎంలు రాజు, సాగిన రామరాజు పడాల్, సింహాచలం, రాజంనాయుడు, పూర్వ విద్యార్థులు నూకరాజు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత సమాజానికి సహకరించాలి
● పాడేరు డీఎస్పీ అభిషేక్ ● భూసిపుట్టు వారపు సంతలో ఆపరేషన్ వజ్ర ప్రహార్ ముంచంగిపుట్టు: డ్రగ్స్ రహిత సమాజానికి ప్రజలంతా సహకరించాలని పాడేరు డీఎస్పీ ఆర్ఆర్విఎస్ అభిషేక్ అన్నారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు మండలంలోని భూసిపుట్టు పంచాయతీ కేంద్రంలో పోలీసులు ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పాడేరు డీఎస్పీ అభిషేక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంజాయి నివారణ, సైబర్ నేరాలు, రహదారి భద్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆర్ఆర్విఎస్ అభిషేక్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగంతో జీవితాలు నాశనం అవుతాయన్నారు. ముఖ్యంగా యువత భవిష్యత్తు జైల్ పాలు అవుతుందని. దీంతో వారి కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. గంజాయి రవాణా, సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలపై ఎటువంటి సమాచారం ఉన్న 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలన్నారు. ప్రజలంతా పోలీసుశాఖకు సహకరించాలని ఆయన కోరారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ నాని, పోలీసులు, గిరిజనులు పాల్గొన్నారు. -
మన్యంలో భారీ వర్షం
పాడేరు/గూడెం కొత్తవీది : ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులు, భీరక శబ్ధాలతో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాడేరు పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా రెండు గంటల పాటు జోరు వానా కురిసింది. దీంతో రెండు గంటల పాటు జనజీవనం స్తంబించింది. విద్యుత్ సరఫరాకు కూడా కాస్త అంతరాయం ఏర్పడింది. రోడ్లన్ని పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా పంట పొలాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. వేసవి దుక్కులను ఎంతో అనుకూలంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. జి.మాడుగుల: మండలంలో కురిసిన భారీ వర్షానికి పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి వెళ్లే మార్గం జలమయమైంది. మండలంలో నుర్మతి, మద్దగరువు రోడ్డు, లువ్వాసింగి, సొలభం, వంజరి, గెమ్మెలి పోయే రోడ్డు మార్గాల్లో రాకపోకలు సాగించే ద్విచక్ర వాహహనదారులు వర్షానికి ఇబ్బందులు పడ్డారు. జి.మాడుగుల సంతబయలు గ్రామంలో జరిగిన వారపు సంతలో దుకాణదారులు అవస్థలు ఎదుర్కొన్నారు. పాడేరు మార్గంలో జాతీయ రహదారిలో బొక్కెళ్లు వద్ద ముంచెత్తిన వర్షపు నీటి వలన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. -
రిసార్ట్స్ నిర్వాహకులపైచర్యలకు డిమాండ్
పాడేరు రూరల్: రూప రిసార్ట్స్ నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని (సీఆర్పీఎఫ్)బాలల పరిరక్షణ వేదిక రాష్ట్ర కో–కన్వీనర్ కాంగు శుభ(చిన్ని) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ అరకులోయకు చెందిన రూప ప్రైవేట్ రిసార్ట్స్ నిర్వాహకులు అమాయక గిరిజనులను టార్గేట్ చేసుకుని గంజాయి రవాణా చేస్తున్నారన్నారని ఆరోపించారు. గతంలో ఇదే రూప రిసార్ట్స్ నిర్వాహకులు స్థానిక కొంతమంది గిరిజన యువకులకు డబ్బులు ఆశ చూపించి అరకులోయ ప్రాంతం నుంచి గంజాయి రవాణా చేయిస్తుండగా విజయవాడలో పట్టుబడ్డారన్నారు. వారిపై కేసు నమోదైనప్పటికీ రిసార్ట్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇందులో భాగంగా రిసార్ట్స్ని కూడా సీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంతో నామమాత్రంగా సుమోటుగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఈ విషయంపై ఇటీవల కలెక్టర్, ఐటీడీఏ పీవోకు ఫిర్యాదులు కూడా చేశామన్నారు. సానుకులంగా స్పందించిన వారు తక్షణం చర్యలకు ఆదేశాలిస్తామని హమీ ఇచ్చిన్నట్టు ఆమె తెలిపారు. -
ఈవీఎం గోదాములోకలెక్టర్ తనిఖీ
పాడేరు : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద భద్రపరిచిన ఈవీఎం గోదాములను కలెక్టర్ దినేష్కుమార్ మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీలు చేశారు. ఈవీఎం గోదాముల వద్ద ప్రధాన ద్వారం సీల్ ఓపెన్ చేయించి గదుల్లో భద్రంగా ఉన్న ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి క్షుణ్ణుంగా తనిఖీలు చేసి అక్కడ పరిస్థితులను గమనించారు. సీసీ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈవీఎం గోదా ములను సీల్ వేయించారు, అక్కడ భద్రతగా ఉన్న పోలీస్ సిబ్బందికి పలు సలహాలు, సూచనాలు చేశా రు. అనంతరం విజిటింగ్ రిజిస్టర్లో సంతకం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ బి.అరుణ్చంద్ర, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లక్ష్మయ్య, ఎలక్షన్ సెల్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులున్నారు. -
పరుగు పోటీల్లో కండక్టర్ సత్తా
పద్మనాభం: గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 30, 31 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో అనంతవరం గ్రామానికి చెందిన కొండిమాని రాంబాబు అద్భుత ప్రతిభ కనబరిచారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఈ క్రీడల్లో రెండు బంగారు పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. విశాఖ జిల్లా తరపున 35, 45 సంవత్సరాల పురుషుల విభాగాల్లో రాంబాబు పాల్గొన్నారు. 100 మీటర్ల పరుగు పందెం, 4x100 మీటర్ల రిలే పరుగు పందెంలో బంగారు పతకాలను సాధించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కండక్టర్గా విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల పట్ల ఆయన చూపుతున్న ఆసక్తిని పలువురు అభినందించారు. -
ఉపాధి పనుల కల్పనలో అలసత్వం వహిస్తే చర్యలు
డుంబ్రిగుడ: ఉపాధి హామీ పనుల ప్రగతి, కల్పనలో అలసత్యం వహిస్తే చర్యలు తప్పవని డ్వామా పీడీ విద్యాసాగర్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను మంగళవారం నిర్వహించారు. ఎంపీపీ బాకా ఈశ్వరి సమక్షంలో పనులు వివరాలను వివరించారు.ఉపాధి హామీ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమశాఖ, సామాజిక పింఛన్లపై సామాజిక తనిఖీల వివరాలతో ప్రజావేదికను నిర్వహించారు. 2024–25 మార్చి 31 వరకు జరిగిన పనులపై సమగ్ర వివరాలతో ప్రజావేదికలో పొందుపరిచారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వేతన రూపంలో రూ 29.46 కోట్లు, మెటీరియల్ రూపంలో రూ 74.21 లక్షలతో కలిపి రూ.30.20 కోట్ల పనులు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.2.98కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.14.68 కోట్లతో పనులు జరిగినట్టు వెల్లడించారు. జాబ్కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వైస్ ఎంపీపీ ఆనంద్రావు, ఏపీడీ పవన్కుమార్, ఇన్చార్జి ఎంపీడీవో విశ్వనాథ్, ఏపీవోలు సంగంనాయుడు, దొరబాబు, గిరిజన, పంచాయతీరాజ్ శాఖల అధికారులు అజయ్కుమార్, అభిషేక్, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.డ్వామా పీడీ విద్యాసాగర్ -
సురక్షిత విశాఖే లక్ష్యంగా పనిచేద్దాం
అల్లిపురం: నగరంలో ప్రజల భద్రతను మెరుగుపరచడం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు భాగస్వాములు కావాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి కోరారు. పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో నగరానికి చెందిన సుమారు 35 మంది ఇన్ఫ్లూయెన్సర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ, సోషల్ మీడియా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే సమాజంలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుత్సాహంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ధైర్యం నింపడం, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, చిట్ఫండ్ మోసాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించడం, హెల్మెట్ ధారణ ఆవశ్యకత, రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడం, పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన స్పీడ్ లేజర్ గన్స్ పనితీరుపై సమాచారం అందించడం తదితర అంశాలపై వీడియోలు, సందేశాల రూపంలో విస్తృత ప్రచారం కల్పించాలని సీపీ కోరారు. అనంతరం ఇన్ఫ్లూయెన్సర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్ఫ్లూయెన్సర్లకు సీపీ శంఖబ్రత బాగ్చి పిలుపు -
15 కిలోల గంజాయి పట్టివేత
గంజాయిని పట్టుకున్న సెక్యూరిటీ వింగ్ (ఆర్ఐ) టీం పెందుర్తి: ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరానికి తరలిస్తున్న గంజాయిని పెందుర్తి రైల్వే స్టేషన్ వద్ద సెక్యూరిటీ వింగ్(ఆర్ఐ) టీం పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు పెందుర్తి ప్రాంతంలో ఆర్ఐ బృందం తనిఖీలు నిర్వహించింది. నార్కోటిక్ డాగ్ సహాయంతో రైల్వే స్టేషన్ వద్ద 4 ప్యాకెట్లలో 15 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయితో పాటు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంగ్లభాష ప్రాముఖ్యత పెరుగుతోంది
అనకాపల్లి : ఆంగ్లభాష ప్రాముఖ్యత నేటి ఆధనిక ప్రపంచంలో ప్రచండ వేగంతో దూసుకుపోతుందని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కె.ఎన్.ఆర్.పేటలో ఏపీ ఎంఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఆంగ్ల అధ్యాపకుడు విల్లూరి ఉమామహేశ్వరరావు రచించిన ‘ట్రాన్స్మ్యుటేషన్ ఆఫ్ హిస్టరీ లిటరేచర్’ పుస్తకాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుస్తక సాహిత్యం ద్వారా ఆంగ్ల భాషాభివృద్ధి చేసుకోవాలనుకునే వారికీ, ఆంగ్లభాష వ్యక్తీకరణని అభివృద్ధి చేసుకోదలచుకునే వ్యక్తులకు క్లుప్తంగా ఆంగ్లభాషపై మంచి పట్టు సంపాదించుకుని తనదైన శైలిలో ఆంగ్లంలో భావప్రకటన చేయదలచుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్కూళ్లు, కళాశాలల విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పుస్తక రచయిత డాక్టర్ విల్లూరి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో భారతీయుల స్థితిగతులు, వారి జీవన ప్రమాణాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు తదితర విషయాలను, వివిధ రకాల రచయితల రచనా పటిమను పరిగణనలోనికి తీసుకుంటూ రాసిన పుస్తకం ఆద్యంతం ఆసక్తిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు అప్పారావు, కిషోర్, సాయిరామ్. పలాసరావు(పోస్టల్ డెవలప్మెంట్ ఆఫీసర్), కాళిదాస్, టి.లక్ష్మీనాయుడు పాల్గొన్నారు. -
రెండు బైక్ల ఢీ... ఇద్దరు యువకుల మృతి
డుంబ్రిగుడ : మండలంలోని గోరాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎస్ఐ ఎల్.సురేష్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అరకులోయ మండలం మాదల పంచాయతీ తోటవలస గ్రామానికి చెందిన కిల్లో జోషప్(23) అనే గిరిజన యువకుడు బంధువుల ఇంటి నుంచి స్వగ్రామానికి బయలుదేరగా, హుకుంపేట మండల గడుగుపల్లి గ్రామానికి చెందిన మువ్వల శ్రీను(28) అనే యువకుడు తన స్నేహితుడితో చటువాలో జరుగుతున్న పండగను చూసేందుకు బయలుదేరారన్నారు. గోరాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో కిలోమీటరు దూరంలో రాత్రి వేళ రెండు బైకులు బలంగా ఢీ కొన్నాయని చెప్పారు. సంఘటన స్థలంలోనే శ్రీను మృతి చెందగా, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జోషప్ అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యంలో యండపల్లివలసలో మృతి చెందారని ఎస్ఐ తెలిపారు. వారితో పాటు మరొకరు గాయాలతో ఉండగా ఆసుపత్రిలో చేర్పించారని తెలిపారు. మృతదేహాలను అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించి మృతుల కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించడం జరిగిందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతి చెందిన మువ్వల శ్రీను, (ఫైల్) -
రూ.3 కోట్ల ప్రభుత్వ భూమికి స్కెచ్?
మధురవాడ: ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అక్రమార్కులు తెగబడుతున్నారు. మధురవాడ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన భూమిని కొట్టేయడానికి నియోజకవర్గ ముఖ్యనేత పేరును వాడుకుంటూ దర్జాగా పనులు సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కబ్జాదారులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతోనే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. రూ.3 కోట్లు విలువ చేసే భూమి విశాఖ రూరల్ మండలం, మధురవాడ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 388 పరిసరాల్లో ఈ దందా సాగుతోంది. మధురవాడ హైవే నుంచి ఐటీ సెజ్కు వెళ్లే మార్గంలో, వికలాంగుల కాలనీ వద్ద అదానీ డేటా సెంటర్ రోడ్డును ఆనుకుని ఉన్న సుమారు 500 గజాల ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడ గజం ధర బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.60 వేల వరకు పలుకుతోంది. అంటే సుమారు రూ.3 కోట్ల విలువైన ఈ భూమిని హస్తగతం చేసుకునేందుకు పక్కా పథకం రచించారు. గతంలో అక్రమంగా నిర్మించిన షెడ్లకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలోని తుప్పలను తొలగించి, కొండ భూమిని చదును చేసే పనులు మొదలుపెట్టారు. ఇంత దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమణకు తెరలేపడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణ పనుల్లో జీవీఎంసీ వాహనం ఈ కబ్జా పర్వంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూ ఆక్రమణను అడ్డుకునేందుకు వచ్చిన గ్రేడ్–2 వీఆర్వో, అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేయించారు. భూమిని చదును చేస్తున్న పొక్లెయిన్ను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించేందుకు ప్రయత్నించగా.. అది జీవీఎంసీ శానిటేషన్ విభాగానికి చెందిన వాహనమని తేలడంతో విస్తుపోయారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ నేత నుంచి ‘సదరు వ్యక్తులు మనవారే.. వదిలేయండి’అంటూ హుకుం జారీ కావడంతో అధికారి వెనక్కి తగ్గినట్లు సమాచారం. ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ఏకంగా ప్రభుత్వ వాహనాన్నే వాడటం చూస్తుంటే, ఈ వ్యవహారం ఎంతటి స్థాయి వ్యక్తుల కనుసన్నల్లో జరుగుతుందో అర్థమవుతోంది. అసలు సూత్రధారులు ఎవరు? అసలు అక్రమార్కుల పనులకు జీవీఎంసీ వాహనాన్ని పంపిన అధికారులు ఎవరు? ఈ కబ్జా వెనుక జీవీఎంసీలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా.. లేక ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
కందిపప్పు కలేనా.. రాగులు గతమేనా?
మహారాణిపేట: పేదల ఆహార భద్రతకు అండగా ఉండాల్సిన రేషన్ దుకాణాలు ఇప్పుడు అరకొర సరఫరాలతోనే సరిపెట్టుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలలు దాటినా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పూర్తి స్థాయిలో నిత్యావసరాలు అందకపోవడం కార్డుదారుల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఎన్నికల ముందు రేషన్ ద్వారా విభిన్న నిత్యావసరాలు అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం బియ్యం, పంచదారకే పరిమితమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే కందిపప్పు, రాగులు పంపిణీ చేస్తూ ‘మూన్నాళ్ల ముచ్చట’గా మార్చేసిందనే ఆవేదన వ్యక్తమవుతోంది. పిండితో సరిపెడుతున్న సర్కార్ బియ్యం, పంచదార తప్ప మరేమీ ఇవ్వకుండానే కాలం గడిపేస్తున్న చంద్రబాబు సర్కార్, తాజాగా పట్టణ ప్రాంతాల్లో రూ. 20లకే గోధుమ పిండి ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది. అయితే, గ్రామీణ ప్రజలకు ఈ సౌకర్యం లేకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోషకాహారం పేరిట చేస్తున్న ఈ హడావుడి, క్షేత్రస్థాయిలో కేవలం కొందరికి మాత్రమే అందుతోంది. జిల్లాలో పరిస్థితి ఇలా... డీఎస్ఓ పరిధిలో మధురవాడ, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి ప్రాంతాలు ఉండగా, జిల్లాలో 5.12 లక్షల తెలుపు కార్డులు, 600కు పైగా చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అయినప్పటికీ సరఫరా లోపాలు సరిచేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఆశలు... ఇంకా నిరీక్షణలోనే.. గడప గడపకు రేషన్ అని చెప్పిన పాలకులు, ఇప్పుడు రేషన్ షాపుల్లో సరుకులకే కత్తెర వేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరల నేపథ్యంలో, రేషన్ దుకాణాలపై ఆధారపడే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కందిపప్పు, రాగులు వంటి అవసరమైన వస్తువులు అందకపోవడంతో పేదల భోజనంలో పోషకాహారం తగ్గిపోతోంది. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి కందిపప్పు, వంటనూనె వంటి నిత్యావసరాలను పునరుద్ధరించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.రాగులు మున్నాళ్ల ముచ్చటే.. రాగులు మూడు కిలోలు ఇస్తామని చెప్పి చివరకు ఒక కిలోకే పరిమితం చేయడం కార్డుదారుల్లో అసంతృప్తిని పెంచింది. అంతేకాకుండా రాగులు ఇచ్చినప్పుడు బియ్యం కోటాలో కోత విధించడం మరో సమస్యగా మారింది. అది కూడా జనవరి నెల వరకే ఇచ్చారు. ఈనెల రాగులకు ఇండెంట్ పెట్టలేదు. అంటే ఈ నెల ఒక్క కిలో పంపిణీ చేసే అవకాశం లేదు.రేషన్ దుకాణాల్లో నిత్యావసరాల కోసం ఎదురు చూసే కార్డుదారులకు నిరాశే మిగులుతోంది. ఎన్నికల హామీల్లో చెప్పిన కందిపప్పు, రాగులు ఇప్పుడు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోగా, నెలల తరబడి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో అమాంతం పెరిగిన ధరల మధ్య రేషన్పై ఆధారపడే పేదలు కందిపప్పు, రాగుల కోసం కళ్లప్పగించి ఎదురుచూస్తుండటం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. కందిపప్పు కోసం కళ్లప్పగింత గత ప్రభుత్వ హయాంలో ప్రతి కార్డుదారుడికి నెలకు ఒక కిలో కందిపప్పు అందించేవారు. ప్రస్తుతం అది గతస్మృతిగా మారింది. ఏప్రిల్లో కూడా కందిపప్పు పంపిణీ చేసే సూచనలు కనిపించడం లేదు. ఇందుకు సంబంధించి ఇండెంట్ కూడా పెట్టకపోవడం గమనార్హం. మార్కెట్లో కందిపప్పు ధరలు రూ.150 నుంచి రూ.180 వరకు పెరగడంతో, సాధారణ ప్రజలకు కొనుగోలు భారంగా మారింది. దీంతో రేషన్ ద్వారా తక్కువ ధరకు లభించే కందిపప్పుపైనే అనేక కుటుంబాలు ఆధారపడుతున్నాయి. -
గిరిజన యువతి మృతిపై పోలీసుల విచారణ
దేవరాపల్లి : మండల కేంద్రంలో సోమవారం రాత్రి అనంతగిరి మండలం కొరపర్తికి చెందిన గిరిజన యువతి దూసరి లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. అనకాపల్లి ఇన్చార్జి డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, కె.కోటపాడు సీఐ కె.కృష్ణ, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ ఘటనా స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. యువతి ఉరి వేసుకున్న గదిలో క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. దేవరాపల్లికి చెందిన యువకుడు కొల్లి లోకేష్ ప్రేమ పేరుతో వంచించి మోసం చేయడాన్ని తట్టుకోలేక తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతురాలి కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మంళవారం స్థానిక పోలీస్స్టేషన్కు అధిక సంఖ్యలో తరలివచ్చి లక్ష్మి మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ కులానికి చెందిన యువతి కావడంతోనే సదరు యువకుడు పెళ్లికి నిరాకరించాడని, దీనిని తట్టుకోలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తూ తల్లిదండ్రులను ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని పోషిస్తున్న లక్ష్మి మృతితో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న మాట్లాడుతూ గిరిజన యువతి మృతిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ రక్షణ చట్టం కింద పరిహారం, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్ట పరిహారం, రెండు ఎకరాల భూమి, కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కె.కోటపాడు సీహెచ్సీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. -
దేవస్థానం సొసైటీ ఎన్నికల్లో హరి ప్యానెల్ గెలుపు
సింహాచలం: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు ప్రహ్లాదపురంలోని సొసైటీ కల్యాణమండపంలో మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 206 ఓట్లకు 168 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి నిరంజన్ పట్నాయక్ తెలిపారు. 9 మంది సభ్యులకు గాను పోటీలో 14 మంది(రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుతం విధుల్లో నిలిచిన ఉద్యోగులు) నిలిచారు. వీరిలో డి.వి.ఎస్.రామరాజు(హరి) ప్యానెల్ విజయం సాధించింది. డి.వి.ఎస్.రామరాజు, గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సుంకర సన్యాసిరావు(తాతాజీ), టీపీఎన్ మూర్తి, వై.అప్పారావు, ముగ్గు వరహాలరావు, లంక సూరిబాబు, కోరాడ శ్రీనివాస సాయి, గెడ్డపు సన్యాసి విజయం సాధించారు. బుధవారం అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోనున్నారు. -
నిందితుడు రవీంద్రను ఉరితీయాలి
మహారాణిపేట: ‘నా బిడ్డను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు’అంటూ మౌనిక తండ్రి పొలిపల్లి వేణుగోపాల్ కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద తన కుమార్తె మృతదేహాన్ని చూసి ఆయన బోరున విలపించారు. తన కుమార్తెను హత్య చేసిన చింతాడ రవీంద్రను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగిన సమయంలో మౌనిక ఒంటిపై ఉన్న సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయని వేణుగోపాల్ తెలిపారు. ఈ కేసుపై ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించి, తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు. -
మేడపై నుంచి పడి యువకుడు మృతి
అచ్యుతాపురం రూరల్ : ప్రమాదవశాత్తూ మేడపై నుంచి పడి అలబాని రామకృష్ణ (22) అనే యువకుడు మృతి చెందిన సంఘటన అచ్యుతాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లారస్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ అచ్యుతాపురం వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న మనోహర్ హాస్టల్లో మూడో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో మూడో అంతస్తుపై నుంచి పడిపోవడం చుట్టుపక్కల వారు కొద్ది సేపటికి గమనించి 108 ఆంబులెన్స్ ద్వారా అచ్యుతాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 3 గంటల సమయంలో రామకృష్ణ మృతి చెందాడు. ఘటనపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ చంద్రశేఖర్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
స్టీల్ప్లాంట్ తల్లీ.. ఇక సెలవు
● ఓ కార్మికుడి వీడ్కోలు స్టీల్ప్లాంట్ మెయిన్ గేటు వద్ద నమస్కారం చేస్తున్న అప్పలరాజు ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారం రుణం తీర్చుకోలేనిదని స్టీల్ప్లాంట్ కార్మికుడు గొందేశి అప్పలరాజు అన్నారు. స్టీల్ప్లాంట్ రోల్షాప్ అండ్ రిపేర్ షాప్ విభాగానికి చెందిన జనరల్ ఫోర్మెన్ అప్పలరాజు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా మంగళవారం పదవీ విరమణ చేశారు. విభాగంలో సహోద్యోగుల మధ్య జరిగిన కార్యక్రమాల అనంతరం ఆయన ఇంటికి బయల్దేరారు. స్టీల్ప్లాంట్ నుంచి బయటకు వచ్చిన అప్పలరాజు ఉద్వేగానికి లోనయ్యారు. స్టీల్ప్లాంట్ మెయిన్ గేటుకు నమస్కారం చేసి కన్నీటి పర్యంతమయ్యారు. 35 ఏళ్ల తన సేవలను పూర్తి చేసుకుని వెళ్లడం బాధగా ఉందన్నారు. తన కన్న తల్లి తర్వాత తల్లి లాంటి స్టీల్ప్లాంట్ తనకు మంచి జీవితం, కుటుంబాన్ని ఇచ్చిందన్నారు. స్టీల్ప్లాంట్ రుణం తీరుకోలేనిదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సహోద్యోగులు ఆయనను ఓదార్చి ఇంటికి పంపించారు. -
రౌడీలతో భూ ఆక్రమణకు యత్నం
పూర్వం నుంచి తమ ఆక్రమణలో ఉన్న పీడబ్ల్యూడీ భూమిలో పెంచుకున్న జీడిమామిడి, పనస చెట్లను దౌర్జన్యంగా నరికివేసి తన భూమిలోకి అక్రమంగా చొరబడి ఆక్రమించేందుకు ప్రయత్నించిన విషయమై తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని, దీంతో ఆక్రమణదారులు రౌడీలతో తమపై దాడులకు దిగుతున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించడంతో పాటు నా భూమిని రక్షించాలంటూ అనకాపల్లి మండలం దిబ్బపాలెం గ్రామానికి చెందిన భార్యభర్తలు కాండ్రేగుల సత్యవతి, సూర్యారావు ఫిర్యాదు చేశారు. చెట్ల నరికివేతపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కోరారు. – కాండ్రేగుల సూర్యారావు -
రుణాల పరిమితి పెంచాలి
పాడేరు: వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రైతులకు అందే విధంగా చూడాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ సోమవారం కలెక్టర్ దినేష్కుమార్ అధ్యక్షతన లీడ్ బ్యాంకు మేనేజర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మూడో త్రైమాసిక బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారులు, సంఘాలకు పెట్టుబడి రుణ సహాయంతో ప్రోత్సహించాలన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా కలిగిన రైతులకు రుణ వితరణ, కౌలు రైతులకు, పశు సంవర్ధక , పిషరీష్, పట్టు పరిశ్రమలకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలన్నారు. పరిశ్రమల శాఖకు సంబంధించి ముద్ర రుణాలు, తయారీ, సేవా రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, పీఎం విశ్వకర్మ రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయీమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో అరకులోయలో ప్రారంభిస్తామన్నారు. ప్రతినెల రెండు ధఫాలుగా స్వయం ఉపాధి ద్వారా వ్యాపారం ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో కొత్త బ్యాంకులను ప్రారంభించి మారుమూల గ్రామాలకు సేవలందించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్ రాజ, ఆర్బీఐ లీడ్ జిల్లా అధికారి నవీన్, నాబార్డ్ డీడీఎం గౌరీశంకర్, లీడ్ బ్యాంకు మేనేజర్ మాతునాయుడు, ఎస్బీఐ, ఏపీజీవీబీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ, ఇతర బ్యాంకుల మేనేజర్లు, పరిశ్రమల శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో రూ.2,730 కోట్ల క్రెడిట్ సామర్థ్యం అంచనా జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకులు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి క్రెడిట్ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2026–27 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,730 కోట్ల క్రెడిట్ సామర్థ్యాన్ని గుర్తించామన్నారు. వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం జిల్లా స్థాయి క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ దినేష్కుమార్ -
నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలి
పాడేరు: జిల్లాలో పలుచోట్ల చేపడుతున్న అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా బడ్జెట్ రూ.3,067.076కోట్లు కాగా అరకు నియోజకవర్గానికి రూ.1545.823 కోట్లు, పాడేరు నియోజకవర్గానికి రూ.1460.793 కోట్లతో అంచనాలను రూపొందించారు. ఆయా నియోజకవర్గాలకు ఐదుగురు అధికారులతో నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభ దశలో వారానికి రెండుసార్లు సమీప ఆస్పత్రుల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 3426 పీఎం జన్మన్ గృహాలకు 1385 గృహాలు పూర్తయినట్టు చెప్పారు. అనంతరం ఆమె మండలంలోని గొండెలి పంచాయతీ పిల్లిపుట్టు గ్రామంలో నాలుగు గృహాలను ప్రారంభించారు. గృహాలన్నీ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ దినేష్కుమార్, ఐటీడీఏ పీవో, ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్కుమార్, రాష్ట్ర జానపద కళలు, సాంస్కృతిక అకాడమి చైర్మన్ వంపూరి గంగులయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సతీష్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి -
గ్యాస్ తంటా.. కట్టెల వంట
ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో గ్యాస్ కొరతకట్టెలపొయ్యిలే ఆధారం నిర్వాహకులఅవస్థలుపట్టించుకోని అధికారులు పెదబయలు: మండలంలో వంటగ్యాస్ కొరత ఏర్పడింది. మండలంలోని 14 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహాలతో పాటుగా గురుకుల పాఠశాల వసతి గృహాలకు గ్యాస్ కొరత వేధిస్తోంది. గత పది రోజుల నుంచి కట్టెల పొయ్యిపైనే వంటలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పెదబయలు భారత్ గ్యాస్ గోదాములో గ్యాస్ స్టాక్ లేకపోవడంతో వినియోగదారులు ముంచంగిపుట్టు, పాడేరు. ఇతర ప్రాంతాల నుంచి అధిక రేట్లకు గ్యాస్ కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేసే గ్యాస్కు సంబంధించి ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడంతో కొరత నెలకొందని దీంతో సరఫరాలో జాప్యం జరిగినట్టు పలువురు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం అవస్థలు పెదబయలు భారత్ గ్యాస్ గోదాములో సోమవారం ఉదయం గ్యాస్ లోడ్ వచ్చింది. దీంతో గొదాము వద్ద వినియోగదారులు బారులు తీరారు. గ్యాస్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే సరఫరా జరుగుతుందని జీసీసీ సిబ్బంది ప్రకటించారు. దీంతో రిజిస్ట్రేషన్ కోసం వినియోగదారులు అవస్థలు పడ్డారు. కాగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కూడా గ్యాస్ అందకపోవడంతో వినియోగదారులు నానా అవస్థలు పడ్డారు. కొన్ని ఆశ్రమ పాఠశాలలకు మాత్రమే సిలిండర్లు సరఫరా చేశారు. ఆశ్రమ హాస్టళ్లు, పాఠశాలలకు నాలుగు రోజుల్లో గ్యాస్ సరఫరా చేస్తామని గొదాము సిబ్బంది హామీ ఇచ్చి ఆయా పాఠశాలల నిర్వాహకులను పంపినట్టు తెలిసింది. ఇప్పటికై నా ప్రభుత్వం, జీసీసీ ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. గ్యాస్ కొరత వాస్తవమే ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో గ్యాస్ కొరత ఉంది. వారం రోజుల నుంచి కట్టెల పొయ్యిపై వండుతున్నారు. సోమవారం స్థానిక గ్యాస్ గోదాముకు లోడ్ వచ్చినా సంక్షేమ పాఠశాలలు, ఆశ్రమ హాస్టళ్లకు సరఫరా చేయలేదు. అయితే ముంచింగిపుట్టు గ్యాస్ గోదాము నుంచి అత్యవసరంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. –జగత్రాయ్, ఏటీడబ్ల్యూవో, పెదబయలు కొరత లేకుండా చర్యలు గ్యాస్ స్టాక్ రెండు వారాల అనంతరం రావడం జాప్యం వల్ల కొరత ఏర్పడింది. అత్యవసరంగా హాస్టల్స్కు కావాల్సి వస్తే ముంచంగిపుట్టు గోదాము నుంచి సరఫరా చేయిస్తాం. ఒక్క లోడ్ వచ్చినా సరిపడడం లేదు. మరో లోడ్ కోసం ఆర్డర్ పెట్టాం. మరో నాలుగు రోజుల్లో లోడ్ రావచ్చు. గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. –సుబ్బారెడ్డి, గ్యాస్ గోదాము ఇన్చార్జి -
సర్పంచులకు ‘చెక్’ పవర్ కట్
మహారాణిపేట: గ్రామ పంచాయితీల సర్పంచుల పదవీకాలం ముగియక ముందే వారి అధికారాలను కూటమి ప్రభుత్వం పరిమితం చేయడం వివాదాస్పదంగా మారింది. ఏప్రిల్ 2తో సర్పంచుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, నిధుల దుర్వినియోగం జరుగుతుందనే అనుమానంతో ప్రభుత్వం ముందస్తుగా పలు ఆంక్షలు విధించింది. ఇప్పటివరకు స్వేచ్ఛగా చెక్కులు జారీ చేసిన సర్పంచులు, ఇప్పుడు వాటిని నేరుగా వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. చెక్కుల మంజూరు అధికారాన్ని డివిజన్ లెవల్ డెవలప్మెంట్ ఆఫీసర్ల (డీఎల్డీవో) చేతుల్లోకి మార్చారు. దీంతో గ్రామ పాలనలో సర్పంచుల పాత్ర గణనీయంగా తగ్గింది. పెత్తనమంతా డీఎల్డీవోలదే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్పంచుల అధికారాలపై తీవ్రస్థాయిలో ఆంక్షలు అమలవుతున్నాయి. జిల్లాలోని 79 గ్రామ పంచాయతీల్లో మెజారిటీ సర్పంచులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కావడమే ఈ ఆంక్షలకు ప్రధాన కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్పంచులు జారీ చేసే చెక్కులను నేరుగా ఆమోదించకుండా, పంచాయతీ అధికారుల ద్వారా డివిజన్ లెవల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనుమతిని తప్పనిసరి చేశారు. వృథా ఖర్చులు చేస్తారనే సాకుతో పాలక వర్గాలను ఆర్థికంగా కట్టడి చేయడంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్షసాధింపేనా? జిల్లాలోని మూడు వంతుల పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులే సర్పంచులుగా ఉండటంతో, వారిని ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో పదవీ కాలం ముగిసే వరకు సర్పంచులకు పూర్తి స్వేచ్ఛ ఉండేదని, కానీ ఇప్పుడు కొత్త పద్ధతుల పేరుతో తమను అధికారులు వేధిస్తున్నారని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి ’స్పెషల్’ పాలన జిల్లాలోని పంచాయతీల రూపురేఖలు ఏప్రిల్ 3 నుంచి మారనున్నాయి. భీమిలి మండలం రేఖవానిపాలెం మినహా (దీనికి ఇంకా ఏడాది గడువు ఉంది), మిగిలిన 78 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. ఏప్రిల్ 2వ తేదీ అర్ధరాత్రితో సర్పంచుల పదవీ కాలం ముగియనుండటంతో, మరుసటి రోజు నుంచే పగ్గాలు చేపట్టేందుకు 78 మంది స్పెషల్ ఆఫీసర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. -
ఎస్పీ కార్యాలయంలో 64 ఫిర్యాదులు
అర్జీదారుల సమస్యలను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 64 అర్జీలు వచ్చాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు ఎస్పీ తుహిన్ సిన్హాకు వివరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల వేదికలో వచ్చి అర్జీలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు–31, కుటుంబ కలహాలు–2, మోసపూరిత వ్యవహారాలు–5, ఇతర విభాగాలకు చెందినవి–26 వచ్చినట్టు తెలిపారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
అర్జీల్లో భూ సమస్యలే అధికం
పీజీఆర్ఎస్–167, రెవెన్యూ క్లినిక్కు 181 అర్జీలుతుమ్మపాల : పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2లో నిర్వహించిన పీజీఅర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిల్లో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిల్లోనే సమస్యలను పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని దరఖాస్తులపై కారణాలు అర్జీదారులకు వివరంగా తెలియజేయాలన్నారు. పీజీఅర్ఎస్కు 167, రెవిన్యూ క్లినిక్లో 181 మొత్తం 348 అర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు మనోరమ, రామ మాణి, మెప్మా పీడీ కె.సరోజిని, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, జిల్లా ఎక్త్సెజ్ అధికారి వి.సుధీర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్జీల్లో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి...పలు అర్జీదారుల ఫిర్యాదుల వివరాలిలా ఉన్నాయి... మైనింగ్ అధికారులపై ఫిర్యాదు చింతలూరు సర్వే నెం.379–1 లో గ్రాంట్ ఆర్డర్ లేకుండా జరిగిన 3వేల క్యూబిక్ మీటర్ల అక్రమ మైనింగ్పై విచారణ కోరుతూ నర్సీపట్నం మైనింగ్ అధికారులకు చేసిన ఫిర్యాదుపై ముందు తేదీలతో తప్పుడు నివేదికలు ఇచ్చి, ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను ఉద్దేశపూర్వకంగా నిరాకరించడం, గ్రామస్తులను మోసం చేసి సంతకాలు సేకరించడంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాడుగుల మండలం, చింతలూరు గ్రామానికి చెందిన మెలిపాక మణికంఠ కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 379–1లో అక్రమాలపై చేసిన ఆరు ఫిర్యాదులను నీరు గార్చడానికి మైనింగ్ అధికారులు, క్వారీ నిర్వాహకులు కలిసి నేరపూరిత చర్యలకు పాల్పడారని వారిపై చర్యలు తీసుకోవాలని, మైనింగ్ అధికారుల ప్రమేయం లేకుండా స్వతంత్ర టాస్క్ఫోర్స్ కమిటీతో పునర్విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ గేటు వద్ద బీజేపీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. -
కౌమార దశలో గర్భధారణతో దుష్ప్రభావాలు
తుమ్మపాల : కౌమార దశలో (చిన్న వయసులో) గర్భం దాల్చడం వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘కౌమార దశలో గర్భధారణ – కారణాలు, దుష్ప్రభావాలు అవగాహన‘ గోడ పత్రికలను ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఇంకా అక్కడక్కడా బాల్య వివాహాలు జరుగుతుండడం విచారకరమని, దీనివల్ల బాలికలు శారీరక, మానసిక సమస్యలకు గురవుతున్నారని అన్నారు. లైంగిక అవగాహన లోపం, బాల్య వివాహాలు, పేదరికం, సరైన తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. బాల్య వివాహాలను అరికట్టడం, బాలికల విద్యను ప్రోత్సహించడం, అనుమానాస్పద సంఘటనలపై తక్షణమే అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి సూర్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హైమావతి, సిబ్బంది పాల్గొన్నారు. జీరో పావర్టీ పీ4 కార్యక్రమం తొలి వార్షికోత్సవం కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ విజయ కృష్ణన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తిరుపతి పద్మావతీ మహిళా యూనివర్సిటీలో పీ4 వార్షికోత్సవాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్లో ఆమెతో పాటు జేసీ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ కుమార్ పాల్గొన్నారు. -
ఉరేసుకుని గిరిజన యువతి ఆత్మహత్య
దేవరాపల్లి: గిరిజన యువతి దూసరి లక్ష్మి(22) సోమవారం రాత్రి దేవరాపల్లిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ శివారు కొరపర్తి గ్రామానికి చెందిన పెంటయ్య, జమ్ములమ్మ దంపతుల ఇద్దరు కుమార్తెలు దేవరాపల్లిలో ఐదేళ్లగా నివసిస్తున్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి స్థానిక ప్రైవేటు మెడికల్ ల్యాబ్లోను, చిన్న కుమార్తె భవాని సెల్ దుకాణంలోను పని చేస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తన అక్క ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోతున్నట్లు వేరొక వ్యక్తి ఫోన్ ద్వారా తెలుసుకున్న చెల్లెలు భవాని వెంటనే తాము అద్దెకుంటున్న గదికి పరుగులు తీసింది. అప్పటికే అక్క చున్నీతో ఉరేసుకొని విగతజీవిగా ఉండటాన్ని చూసి బోరున విలపించింది. ఈమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని మృతురాలి చెల్లెలు భవాని చెప్పినట్లు తెలిసింది. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతిరాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని కె.కోటపాడు సీహెచ్సీకి తరలిస్తున్నట్లు తెలిపారు. గిరిజన యువతి ఆత్మహత్యతో దేవరాపల్లిలోపాటు కొరపర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పుస్తక పఠనంతో విజ్ఞానం
డుంబ్రిగుడ: మండలం కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో ఉమ్మడి జిల్లాల చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, పాఠకులను అడిగి గ్రంథాలయంలో గల సౌకర్యలపై ఆరా తీశారు. శాఖ గ్రంథాలయంలో కావలసిన అవసరాలను గురించి గ్రంథాలయ అధికారి సునీతకు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కొత్తగా వచ్చిన పుస్తకాలు కొనుగోలు చేయమని కోరారు. పుస్తక పఠనం అలవర్చుకోవాలని, దీంతో విస్తృతంగా విజ్ఞానం పొందవచ్చన్నారు. వైఫై సేవలు ఆధునీకరణ చేస్తామని చైర్మన్ అన్నారు. పాఠకులు తదితరులు పాల్గొన్నారు. -
శేషతల్పంపై అప్పన్న తిరువీధి
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మూడవరోజు సోమవారం స్వామికి శేషతల్పవాహనంపై విశేషంగా తిరువీధి నిర్వహించారు. స్వామి కల్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను శేషతల్పంపై వేంచేపు చేసి, సింహగిరి మాడవీధిలో ఊరేగించారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఊరేగింపులో ఏర్పాటు చేసిన కోలాటం, పలు సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరువీధి అనంతరం రాత్రి వేళ ఆరాధన, విశేష హోమాలు, గ్రామబలిహరణం, మంగళాశాసనం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు, ఇతర అర్చక బృందం ఆధ్వర్యంలో ఈ క్రతువులు జరిగాయి. కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు మంగళవారం ఉదయం 7 గంటలకు వైదిక సదస్యం, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పండిత సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు స్వామి వారు సర్వజన మనోరంజని వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా మంగళవారం స్వామి మూలవిరాట్ స్వర్ణ నారసింహుడి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారి దర్శనాలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై, రాత్రి 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని దేవస్థానం అధికారులు తెలిపారు.నేడు పండిత సదస్సు -
లీజు విధానం... ఆలయ భూముల ఆక్రమణలకు ఊతం
జిల్లాలో హిందు దేవాలయాల భూముల ఆక్రమణలపై విచారణ చేపట్టి భూములను రక్షించడంతో పాటు శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునఃనిర్మాణం చేయాలని బీజేపీ జనతా వారధి కోకన్వీనర్ జిల్లా ఉపాధ్యక్షుడు దొగ్గా ఈశ్వరప్రసాధ్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ప్రైవేటు భూములు దేవాలయ భూముల జాబితాలో కలిసిపోయాయనే నెపంతో వందల ఎకరాల దేవాలయ భూములను ఆక్రమించేస్తున్నారని, దీంతో పాటు 33 ఏళ్ల పాటు దేవాలయ భూముల లీజు విధానం సరైంది కాదని అధికారులు పునఃపరిశీలన చేయాలన్నారు. జీవో నెం.139ను పూర్తిగా రద్దు చేయాలని, ఆక్రమణను రెగ్యులరైజ్ చేయడం నిలిపివేయాలని, దేవాలయాల ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికే ఖర్చుచేసేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. దింతో పాటు ఏళ్ల తరబడి సంచార జాతులగా నివాసముంటున్న కుటుంబాలను గుర్తించి వారికి కులధ్రువీకరణ పత్రాలు అందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని మరో వినతి పత్రం అందించారు. –దొగ్గా ఈశ్వరప్రసాధ్ -
ఐదు నెలలుగా విద్యుత్ మీటర్ కోసం...
సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుని చీకట్లోనే నివాసముంటున్నామని, నూతన విద్యుత్ మీటర్కు ఫీజు కట్టి ఐదు నెలలు అవుతున్నా విద్యుత్ శాఖ సిబ్బంది మీటర్ వేసి విద్యుత్ సౌకర్యం కల్పించడం లేదని, తక్షణమే తమకు విద్యుత్ సౌకర్యం కల్పించాలంటూ మాడుగుల మండలం చింతలూరు గ్రామానికి చెందిన భార్యభర్తలు గుడేపు దుర్గాలు, లక్ష్మి పీజీఆర్ఎస్లో వినతి అందించారు. రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగించే తాము చీకట్లోనే నివాసముండాల్సి వస్తుందని, చుట్టుపక్కల అందరికీ అందించిన విద్యుత్ సౌకర్యం తమకు కూడా అందించి న్యాయం చేయాలని ఆమెను కోరారు. –గుడేపు లక్ష్మి అధికారుల అండతో అక్రమ రిజిస్ట్రేషన్లు రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా కొనుగోలు చేసిన భూమిని తన పేరున కాకుండా రెవెన్యూ అధికారులు రీసర్వేలో ఇతరుల పేరున ఆన్లైన్ చేయడంతో తన భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, తక్షణమే రిజిస్ట్రేషను జరగకుండా నిలిపివేసి తన పేరున ఆన్లైన్ చేయాలంటు కశింకోట మండలం అచ్చెర్ల గ్రామానికి చెందిన కర్రి రాజేశ్వరి రెవెన్యూ క్లినిక్లో ఫిర్యాదు చేశారు. దస్తావేజు నెం.2199/2023 దిన ఉన్నప్పటికీ 2024లో జరిగిన రీసర్వేలో ఇతరుల పేరున వీఆర్వో ఆన్లైన్ చేయడం దారుణమని, తక్షణమే విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. –కర్రి రాజేశ్వరి -
రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు
చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నట్టు చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగ నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు అల్లూరి జిల్లా పరిధిలో వాతావరణ వివరాలను వెల్లడించారు. డివిజన్ల పరిధిలో వర్షపాతం 0.2 నుంచి 6.0 మిల్లీ మీటర్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ణ ఉష్ణోగ్రతలు 32.2 డిగ్రీలు నుంచి 32.9 డిగ్రీలు మధ్య, కనిష్ణ ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల నుంచి 16.9 డిగ్రీల మధ్య ఉండవచ్చన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 77 నుంచి 82 శాతం మధ్యాహ్న సమయాల్లో 50 నుంచి 75 శాతం మధ్యలో ఉంటుందన్నారు. గాలి గంటకు ఆరు కిలోమీటర్లు వేగంతో వీచే సూచనలు ఉన్నట్టు తెలిపారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు. రైతులు పంటలు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఏడీఆర్ తెలిపారు. -
రాయి పిక్కలు ఏరుకున్నా టాక్స్ కట్టాల్సిందేనా..?
మైనింగ్ సిబ్బందితో గ్రామస్తుల వాగ్వాదంరావికమతం : గ్రావెల్, రాయి ఏదైనా తెచ్చుకోవాలంటే మైనింగ్ సిబ్బందికి డబ్బులు కట్టాల్సిందే.. లేదంటే కుదరదంటున్నారు మైనింగ్ సిబ్బంది. మండలంలో గర్నికంలో ఇంటి నిర్మాణానికి రాయి పిక్కలను తీసుకొస్తుండగా ఏఎంఆర్ సంస్థ మైనింగ్ సిబ్బంది అడ్డుకోవడంపై మహిళలు తిరగబడ్టారు. కొండ ప్రాంతంలో రాయి పిక్కలు ఏరుకొని తీసుకొస్తుండగా టాక్స్ కట్టమనడం ఎంత వరకు సమంజసం.. అంటూ మైనింగ్ కంపెనీ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ విషయమై సోమవారం గర్నికం గ్రామస్తులు, సర్పంచ్ భర్త నూకరాజు ిమైనింగ్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెంధిన కొందరు మహిళలు పక్కా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. గచ్చులు చేయడానికి రాయి పిక్క అవసరం కావడంతో సమీపంలో గల మెట్ట ప్రాంతంలో చిన్న రాయి పిక్కలను పోగుచేసుకొని వాటిని ట్రాక్టర్లో వేసి తీసుకెళుతుండగా ఏఎంఆర్ మైనింగ్ సంస్థ సిబ్బంది టాక్స్ కట్టాలని అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఇస్తుంటే , రాయి పిక్కలకు ట్యాక్స్ కట్టడం ఏంటని ప్రశ్నించారు. దీంతో సర్పంచ్ భర్త నూకరాజు తదితరులు అక్కడికి చేరుకొని మైనింగ్ సంస్థను తప్పు బట్టారు. రాయి పిక్కలకు కూడా ట్యాక్స్ కట్టాలని ఉందా , ఉంటే అందుకు సంబంధించిన జీవో చూపించాలని నిలదీశారు. ప్రతి దానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తే సామాన్యులు ఎలా బతకాలి... అని కూటమి ప్రభుత్వం సంపద సృష్టించడం అంటే ఇదేనా? అంటూ మహిళలు వాపోయారు. -
కోర్టు ఆదేశాలు ధిక్కరణ
గొలుగొండ: మండలంలోని సీహెచ్ నాగాపురం చెరువు గర్భంలో శ్మశాన వాటిక పనులు చేయకూడదని కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ధిక్కరించారు. మళ్లీ పనులు చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో శ్మశాన వాటిక ఉంది. ఆ స్థలాన్ని వదిలేసి కూటమి నేతలు రైతులకు ఉపయోగపడే చెరువు గర్భంలో శ్మశాన వాటిక పనులు చేస్తున్నారు. ప్రస్తుతం చెరువు గర్భంలో ఏర్పాటు చేస్తున్న శ్మశాన వాటిక పాఠశాలకు ఆనుకుని ఉండటం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతారని ప్రజలు ఆర్నెల్ల క్రితం వ్యతిరేకించారు. దీంతోపాటు రైతులు ఇబ్బందులు పడే అవకాశముందని గ్రామస్తులు, పంచాయతీ పాలకులు కోర్టును ఆశ్రయించారు. దాంతో చెరువు గర్భంలో పనులు నిలుపుదల చేయాలని నాలుగు నెలలు క్రితం కోర్టు ఎంపీడీవో, పీఆర్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అధికారులు పనులు నిలుపుదల చేశారు. మళ్లీ రెండు రోజుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా పనులు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు. కోర్టు ఆదేశాలు ధిక్కరించి పనులు చేస్తున్న అధికారులుపై జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
సరదా కోసం వెళ్తే.. ప్రాణం పోయింది
ఆనందపురం: గంభీరం రిజర్వాయర్లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒక ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామానికి చెందిన మలిరెడ్డి నితిన్ (20), తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్డీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మధురవాడలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్న నితిన్.. ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా తన స్నేహితులతో కలిసి ఆటోలో గంభీరం రిజర్వాయర్ సందర్శనకు వెళ్లాడు. రిజర్వాయర్లో స్నేహితులు ఈతకు దిగగా, నితిన్ ఒడ్డున ఉన్న సిమెంట్ గోడపై కూర్చున్నాడు. ఈ క్రమంలో అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అపస్మారక స్థితిలో నితిన్ను బయటకు తీసి, 108కు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని నితిన్ను పరీక్షించి.. అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు, ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్న మలిరెడ్డి దీక్షిత్ ఫిర్యాదు మేరకు ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేతికి అందొచ్చిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి. ఎస్ఐ పి.శివ కేసు దర్యాప్తు చేస్తున్నారు. రిజర్వాయర్లో పడి ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణముంచంగిపుట్టు: అడవులకు నిప్పు పెట్టకుండా ప్రకృతి సంపదను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ఫారెస్ట్ రేంజర్ ఎం.మురళీకృష్ణ అన్నారు.మండలంలోని రంగబయలు పంచాయతీ గొబ్బరిపడ గ్రామంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అడవులకు నిప్పు పెట్టడం వలన కలిగే అనర్థాలపై అటవీశాఖాధికారులు గిరిజనులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో అడవుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్ ఎం.మురళీకృష్ణ మాట్లాడుతూ అడవులకు నిప్పు పెట్టడం వల్ల పర్యావరణ వ్యవస్థ, వన్యప్రాణులు, మానవాళికి తీవ్ర ముప్పు కలుగుతుందని, అమూల్యమైన ప్రకృతి సంపద, చెట్లు, జీవ వైవిధ్యాన్ని నాశనమవుతుందన్నారు. వేసవిలో వ్యవసాయ వ్యర్థాలు, ఎండుగడ్డిని కాల్చవద్దని, ఎక్కడైనా మంటలు కనిపిస్తే వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అటవీ అధికారులకు సమాచారం అందించాలని, అడవులను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. అనంతరం జోడిగుమ్మ నుంచి గొబ్బరిపడ వరకు వచ్చే ఆర్వోఎఫ్ఆర్ రహదారిపై ఫారెస్ట్ అధికారులు, పిఆర్ అధికారులు సర్వే వేశారు. పీఆర్ ప్రాజెక్ట్సు ఏఈ అశోక్, ఫారెస్ట్ బీట్ అధికారి శ్రీను, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ అధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
దువ్వాడ మీదుగా మరో రెండు వీక్లీ ఎక్స్ప్రెస్లు
వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టు కోసం ప్రజాభిప్రాయ సేకరణ ముంచంగిపుట్టు: జోలాపుట్టు పంచాయతీ కేంద్రంలో వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్ ఏర్పాటుకై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును నిర్వహించనున్నట్టు తహసీల్దార్ భాస్కరఅప్పారావు తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.16.45కోట్లతో సర్వే నెం.5లోని జోలాపుట్టు పంచాయతీలో వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు జోలాపుట్టు గ్రామ సచివాలయంలో సదస్సు నిర్వహిస్తామని, ప్రజాప్రతినిధులు, స్థానికులు హాజరై తమ యొక్క అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన కోరారు. ఆర్ఐ భాస్కర్, వీర్వోలు తదితరులు పాల్గొన్నారు. -
దళితుల భూ సమస్యల పరిష్కారానికి కృషి
రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు సీతారాం నర్సీపట్నం: అన్యాక్రాంతమైన దళితుల భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం పేర్కొన్నారు. గొలుగొండ మండలం జోగంపేట గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించి దళితల భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాండవ నిర్వాసితులమైన తమకు కోటవురట్ల మండలం పందూరు గ్రామంలో అసైన్డ్ భూములు ప్రభుత్వం ఇచ్చిందని బాధిత దళిత రైతులు కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకువెళ్లారు. ఏ సంబంధం లేని పెత్తందారులు తమ భూముల్లో ఫలసాయాన్ని అనుభవిస్తున్నారని వాపోయారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వివరించారు. దీనికి సీతారాం స్పందిస్తూ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం బాలుర గురుకుల కళాశాల, పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కె.మరిడియ్య, గురుకుల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చిట్ల చతపతిరావు, తహసీల్దార్ కె.నూకరాజు, ఎంపీడీవో శ్రీనువాసరావు, ఎస్సై రామారావు, రుషికేశ్వరరావు, ఏఎస్డబ్ల్యూవో బాబూరావు, డీహెచ్పీఎస్ నాయకులు డీసీహెచ్ రాజు, డీవీఎంఎస్ సభ్యులు సహదేవుడు, ఈరెల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్: మండలంలోని మర్రిబంద కాలనీకి చెందిన మామిడి వెంకటేష్(34) ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. వివరాలివి. మృతుడికి బాగా మద్యం సేవించే అలవాటు ఉండడం వల్ల భార్యతో తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం బంధువులతో కలిసి తలుపులమ్మలోవ దర్శనానికి వెళ్లడానికి అందరూ తయారు కాగా అంతకుముందే ఉదయం వెంకటేష్ మద్యం సేవించడంతో మళ్లీ భార్యభర్తలకు చిన్న గొడవ జరిగింది. దీంతో వెంకటేష్ తలుపులమ్మలోవకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండిపోయాడు. సాయంత్రం కుటుంబసభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి పడకగదిలో చీరతో వెంకటేష్ ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. భార్య ఉమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
బెట్టింగ్ల ఉచ్చులో పడొద్దు
అనకాపల్లి: అత్యాశకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ తుహిన్ సిన్హా అదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ నిర్వాహకులపై ఆన్లైన్ బుకీలపై ప్రత్యేక పోలీస్ బృందాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. బెట్టింగ్ నిర్వహించినా, ప్రోత్సహిహించినా, పాల్గొన్నా ఏపీ జూద చట్టం ప్రకారం అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ యాప్ల ఉచ్చులో పడవద్దన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. -
నేత్రపర్వంగా ఎదురు సన్నాహం
నక్కపల్లిలో ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం నక్కపల్లి: ప్రాచీన శైవక్షేత్రం ఉపమాకలో భువనేశ్వరి సమేత లక్ష్మణేశ్వరాలయంలో వార్షిక కల్యాణోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శైవాగమన సంప్రదాయం ప్రకారం కల్యాణోత్సవాలు జరిపేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా రాత్రి స్వామివారిని సప్పర వాహనంలోను, పార్వతీ దేవిని పల్లకిలో అలంకరించి కోలాట ప్రదర్శనలతో నక్కపల్లిలో మైలవరభట్ల జోగారావు ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి ఆది దంపతుల పెళ్లి చూపులు, పెళ్లిమాటల కార్యక్రమాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. అనంతరం మంచిరాజు సూర్యనారాయణ మూర్తి (సహరాపంతులు), శింగంశెట్టి నాని కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఎదుర్కోలు ఉత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెండ్లిమాట తంతు అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను ఉపమాక ఆలయానికి ఊరేగింపుగా తరలించారు. అర్ధరాత్రి స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు వెలవలపల్లి మహేష్, పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి కొప్పిశెట్టి బుజ్జి వేదపండితులు పసర కొండ పండు, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డీవిరామారావు, శ్రీపాద ప్రణవ్రామ్ పాల్గొన్నారు. -
ఇదేం ‘పచ్చ’పాతం
● దేవరాపల్లి పార్కులో శిలాఫలకాల ఏర్పాటులో ప్రొటోకాల్కు తూట్లు ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మాణ పనులకు శ్రీకారం ● శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించిన అప్పటి డిప్యూటీ సీఎం బూడి ● తాజాగా పార్కు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన అధికారులు ● శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని మూలన పడేసిన వైనం దేవరాపల్లి: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పార్కులో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఏర్పాటు చేయకుండా మూలన పడేయడం వివాదస్పదమైంది. తాజాగా పార్కు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన వీఎంఆర్డీఏ అధికారులు శంకుస్థాపన శిలాఫకం ఏర్పాటులో పక్షపాత వైఖరిని ప్రదర్శించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో... స్థానిక పోలీస్స్టేషన్కు ఎదురుగా శిథిలావస్థకు చేరుకుని దశాబ్దాలుగా అధ్వానంగా ఉన్న ఇరిగేషన్ క్వార్టర్స్ను తొలగించి ఆహ్లాదకర పార్కు, యోగా భవనం, వాకింగ్ ట్రాక్ నిర్మించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సంకల్పించారు. అప్పట్లోనే వీఎంఆర్డీఏ నుంచి రూ. 75 లక్షలు మంజూరు చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సగం పనులను సైతం అప్పట్లోనే పూర్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేసింది. ఈ నెల 13న పార్క్ను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్తో కలిసి ప్రారంభించారు. పైలాన్ నిర్మించి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన అధికారులు, పార్కు నిర్మాణ సమయంలో వేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని యోగా భవనంలో మూలన విడిచిపెట్టడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులు కూటమి నేతల మెప్పు కోసమే ఇలా వ్యవహరించారని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రారంభోత్సవ శిలాఫలకంలో పేర్లు రాయించడంలోను వీఎంఆర్డీఏ అధికారులు ప్రొటోకాల్కు తూట్లు పొడిచారు. ఎంపీపీ, జెడ్పీటీసీ పేర్లు లేకుండా చేసి ప్రొటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ప్రొటోకాల్ పాటించకుండా పక్షపాతంగా వ్యవహరించిన వీఎంఆర్డీఏ అధికారుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
లారీ ఢీకొని యువకుడి మృతి
ప్రమాద స్థలంలో లోకేష్ మృతదేహం మాకవరపాలెం: మండలంలోని తామరం వేంకటేశ్వర ఆలయ సమీపంలో శనివారం అర్ధరాత్రి లారీ ఢీకొని యువకుడి దుర్మరణం చెందాడు. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన చింతాడ లోకేష్(25) కశింకోట మండలం సుందరయ్యపేటలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తన మోటార్ సైకిల్పై మాకవరపాలెం వైపు వస్తున్నాడు. అదే సమయంలో నర్సీపట్నం నుంచి తాళ్లపాలెం వైపు ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లోకేష్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై లోకేష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ దామోదర్నాయుడు ఆదివారం తెలిపారు. లారీని పట్టుకున్నామన్నారు. -
కమ్యూనిటీ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు
ఎంవీపీకాలనీ: నగరంలోని కమ్యూనిటీ ప్రాంతాల అభివృద్ధికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఆదివారం ఎంవీపీకాలనీలోని అప్పుఘర్, వాసవానిపాలెం సాగర తీర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్లూమ్బర్గ్ ఫిలాంత్రోపీస్ 2025–2026 మేయర్స్ చాలెంజ్కు ప్రపంచవ్యాప్తంగా ఎంపికై న 24 నగరాల్లో విశాఖ ఒకటిగా నిలవడం గర్వకారణమన్నారు. ఈ విజయం ఫలితంగా నగరంలో ‘వి–పుల్’(విశాఖ–ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్) కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున కమ్యూనిటీ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. పర్యటనలో భాగంగా శివగణేష్నగర్, వాసవానిపాలెంలోని మత్స్యకారులతో మాట్లాడి, ఆయా ప్రాంతాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, కాలువల మరమ్మతులతో పాటు గ్రీన్ బెల్ట్లను అభివృద్ధి చేయాలని మత్స్యకార గ్రామాల పెద్దలు కమిషనర్కు విన్నవించారు. ‘వి–పుల్’ద్వారా ప్రజా భాగస్వామ్యంతో ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ సిద్ధంగా ఉందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జెడ్సీ శివప్రసాద్, వైద్యాధికారి ప్రసాదరావు, పలువురు వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ -
ఇమ్మానుయేలు సంస్థ హాస్టల్లో అగ్నిప్రమాదం
● ప్రమాద సమయంలో లేని విద్యార్థులు ● తప్పిన పెనుప్రమాదం మాకవరపాలెం: హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కొండల అగ్రహారంలో ఇమ్మానుయేలు సంస్థ నిర్వహిస్తున్న హాస్టల్లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉమ్మడి జిల్లాకు చెందిన 80 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరంతా నిత్యం ఉదయం తామరంలో సంస్థకు చెందిన ఎడ్యుకేషన్ క్యాంపస్లోని స్కూల్కు బస్సుపై వెళ్లి తిరిగి సాయంత్రం హాస్టల్కు చేరుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మూడు అంతస్థులు కలిగిన హాస్టల్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో స్థానికులు గమనించిన వెంటనే స్పందించి మంటలు చెలరేగిన గదుల్లో ఎవరూ లేకపోవడంతో రెండో అంతస్థులో ఉన్న పది మంది విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ప్రతి ఆదివారం ఈ విద్యార్థులంతా హాస్టల్కు సమీపంలో సంస్థకు చెందిన చర్చికు వెళతారు. ఆదివారం కూడా సుమారు 70 మంది వరకు చర్చికి వెళ్లడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇదే అగ్నిప్రమాదం రాత్రి వేళలో జరిగితే ఎందరో విద్యార్థులు మృత్యువాత పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరిగి నా గాయపడేవారన్నారు. ఈ సంఘటనలో హాస్టల్లో ఉన్న ఒక బైక్తోపాటు విద్యార్థుల పుస్తకాలు, బట్టలు ఉంచిన పెట్టెలు కాలిపోయాయి. విద్యార్థులంతా క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా రు. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. హాస్టల్ను పరిశీలించిన ఎంఈవో హాస్టల్ను ఎంఈవో మూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా మంటలు చెలరేగిన హాస్టల్ భవనం, కాలిపోయిన విద్యార్థులు పెట్టెలను పరిశీలించారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యను తెలుసుకున్నారు. నివేదికను డీఈవోకు అందజేశామని, విద్యార్థులను ఇక్కడి నుంచి తామరంలో ఇమ్మానుయేలు సంస్థకు చెందిన మరో హాస్టల్కు తరలించామని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. -
మంచినీటి కోసం గిరిజనుల అవస్థలు
దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు మదనగురువులో గిరిజనులు మంచినీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. తాగునీటి సదుపాయం లేకపోవడంతో గ్రామానికి దూరంగా ఉన్న గెడ్డలో ఊట నీరే తమకు శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కలెక్టర్ స్పందించి తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చేతులు జోడించి వేడుకున్నారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న, మండల కార్యదర్శి బి.టి. దొర మద్దతు పలికారు. అటవీ ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనులను అడవి జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని సీపీఎం నాయకులు విమర్శించారు. గిరిజనులను ఉద్ధరించేందుకు అడవి బాట పట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఇక్కడ కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గెడ్డలో కలుషిత నీరు తాగడం వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ తదితర విష జ్వరాల బారినపడుతున్నారని వాపోయారు. ప్రభుత్వ పాలకులు యుద్ధప్రాతిపదికన స్పందించి మంచినీటి సదుపాయం కల్పించాలని, లేకుంటే వచ్చే నెల 2న కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని బాధిత గిరిజనులు హెచ్చరించారు. కార్యక్రమంలో పాంగి కన్నయ్య, పాంగి రామన్న, మామిడి చిన్నయ్య, పాంగి పెద భీమన్న, పాంగి చిన బీరాజు, పాంగి సన్యాసమ్మ, పి. దేముడమ్మ, సూకురి లక్ష్మి, మామిడి సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలి నిరసన -
మరికొంతకాలం ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరో మూణ్నెల్ల పాటు పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్కుమా ర్ ఒక ప్రకటనలో తెలిపారు. ● విశాఖపట్నం –షాలిమర్ (08508) స్పెషల్ రైలు ప్రతి మంగళవారం విశాఖపట్నంలో ఉదయం 11.20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్ల వారు 3 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. ఈ రైలును జూన్ 30 వరకు పొడిగించారు. షాలిమర్–విశాఖపట్నం (08507) స్పెషల్ ప్రతీ బుధవారం షాలిమర్లో తెల్లవారుజాము 5గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 8.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలును జూలై 1వ తేదీ వరకు పొడిగించారు. ● సంబల్పూర్– ఈరోడ్ (08311) వీక్లీ స్పెషల్ ప్రతి బుధవారం సంబల్పూర్లో ఉదయం 11.35 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 9.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ్నుంచి 9.32 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 10.50 గంటలకు ఈరోడ్ వెళ్తుంది. ఈ రైలును మే 27వ తేదీ వరకు పొడిగించారు. ఈరోడ్–సంబల్పూర్ (08312) వీక్లీ స్పెషల్ను మే 29వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ఈరోడ్లో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.35గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ్నుంచి 1.10 గంటలకు బయల్దేరి శనివారం రాత్రి 11.15 గంటలకు సంబల్పూర్ వెళ్తుంది. ● భువనేశ్వర్–యశ్వంత్పూర్(02811) వీక్లీ ఏసీ స్పెషల్ను జూన్ 27వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి శనివారం భువనేశ్వర్లో రాత్రి 7.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 1.53 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 1.55 గంటలకు బయల్దేరి సోమవారం తెల్లవారుజాము 12.15 గంటలకు యశ్వంత్పూర్ వెళ్తుంది. యశ్వంత్పూర్–భువనేశ్వర్ (02812) వీక్లీ ఏసీ స్పెషల్ను జూన్ 29వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి సోమవారం తెల్లవారుజాము 4.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10.53 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 10.55గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6గంటలకు భువనేశ్వర్ వెళ్తుంది. ● యశ్వంత్పూర్–కతిహార్(06571) వీక్లీ ఏసీ స్పెషల్ను జూలై 14వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి మంగళవారం యశ్వంత్పూర్లో ఉదయం 7 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజాము 5 గంటలకు విజయనగరం చేరుకుంఉటంది. అక్కడి నుంచి 5.10 గంటలకు బయల్దేరి గురువారం తెల్లవారుజాము 4.30గంటలకు కతిహార్ వెళ్తుంది. కతిహార్–యశ్వంత్పూర్ (06572) వీక్లీ ఏసీ స్పెషల్ను జూలై 17వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి శుక్రవారం తెల్లవారుజాము 5.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజాము 3.40 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.50 గంటలకు బయల్దేరి మరుసటిరోజుఉదయం 4గంటలకు భువనేశ్వర్ వెళ్తుంది. ● ఎస్ఎంవీ బెంగళూరు–మాల్డా టౌన్(06565) స్పెషల్ రైలును జూలై 12వతేదీ వరకు పొడిగించారు. ఎస్ఎంవీ బెంగళూరులో ఈ రైలు ప్రతి ఆదివారం రాత్రి 11.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 6.13 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 6.15గంటలకు బయల్దేరి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మాల్డా టౌన్ వెళ్తుంది. మాల్డా టౌన్– ఎస్ఎంవీ బెంగళూరు(06566) స్పెషల్ను జూలై 15వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు బుధవారాల్లో సాయంత్రం 4గంటలకు మాల్డా టౌన్లో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3.33గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.35గంటలకు బయల్దేరి మరుసటిరోజు శుక్రవారం మధ్యా హ్నం 12.45 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరు వెళ్తుంది.


