అల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ఐఐఎంవీలో వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

అల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ఐఐఎంవీలో వర్క్‌షాప్‌

Feb 20 2026 6:50 AM | Updated on Feb 20 2026 6:50 AM

అల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ఐఐఎంవీలో వర్క్‌షాప్‌

అల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ఐఐఎంవీలో వర్క్‌షాప్‌

తగరపువలస: అల్లూరి సీతారామరాజు జిల్లా స్థిరమైన వృద్ధి ప్రణాళిక రూపకల్పనపై గురువారం గంభీరం ఐఐఎంవీలో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లూరి జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర విజన్‌–2047 మార్గదర్శకాలకు అనుగుణంగా, ‘సంపూర్ణత అభియాన్‌’ కింద 5 ప్రధాన అంశాలు, 46 సూచికలతో జిల్లా పనితీరును మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జిల్లాలోని కాఫీ, మిరియాలు, పసుపు ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా నాణ్యత, బ్రాండింగ్‌ , విలువ ఆధారిత తయారీపై దృష్టి సారించాలన్నారు. నీతి ఆయోగ్‌ ప్రాజెక్టులో భాగంగా 627 గృహాల నుంచి సేకరించిన సమాచారం, 213 కీలక సూచికల విశ్లేషణతో రూపొందించిన నివేదికను ఐఐఎంవీ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ వర్క్‌షాప్‌లో ఐఐఎంవీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, ప్రొఫెసర్లు మారిశెట్టి విజయ, అంబేడ్కర్‌ పాల్గొన్నారు. తుది నివేదికను త్వరలోనే నీతి ఆయోగ్‌కు సమర్పించనున్నట్లు ప్రొఫెసర్‌ అభినాష్‌ సింగ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement