రహదారి నిర్మాణంపైస్థలం పరిశీలన
గూడెంకొత్తవీధి: మండలం దేవరాపల్లి పంచాయతీలోని ఎలుగురాతిబంద గ్రామంలో రహదారి నిర్మాణ పనులను గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ ఈఈ డేవిడ్రాజ్ గురువారం డీఈ రఘుతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం ఇటీవల ఆ గ్రామానికి రూ.2కోట్లతో రహదారిని మంజూరు చేసింది. అయితే తాము సూచించిన మార్గం ద్వారా రహదారిని నిర్మించాలని గ్రామస్తులు పట్టుబట్టారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో కలెక్టర్ అధికారులను విచారణకు ఆదేశించారు. దీంతో గురువారం ఇంజినీరింగ్ అధికారులు ఎలుగురాతి బంద గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.సర్పంచ్ సిరిబాల బుజ్జిబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు. వివరాలను కలెక్టర్కు నివేదిస్తామని అధికారులు తెలిపారు.


