ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమే..
కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ఉత్తుత్తి ప్రేమనే చూపింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.605 కోట్లు చూపుతున్నారు. అసలైన ప్రాజెక్టు పనులకు రూ.200 కోట్లను కూడా కేటాయించలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపేశారు. తాండవ ప్రాజెక్టు వద్ద రూ.470 కోట్లకుపైగా వ్యయంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టు పనులను ఈ ప్రభుత్వం నిలిపివేసింది. కేవలం తాండవ, ఏలేరు ప్రాజెక్టుల నిర్వహణ కోసం తూతూ మంత్రంగా రూ.8.13 కోట్లను కేటాయించి చేతులు దులిపేసుకుంది. విశాఖ అభివృద్ధిపైనా అదే నిర్లక్ష్యం. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి


