అథ్లెటిక్స్లో రామలక్ష్మణదొరకు పతకాలు
రోలుగుంట: జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో రోలుగుంట మండలం కంచుగుమల పంచాయతీకి చెందిన పరవాడ రామలక్ష్మణదొర(68) సత్తా చాటాడు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈ నెల 14న నిర్వహించిన 45వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్లో పలు దేశాల నుంచి పాల్గొన్న క్రీడాకారులతో పోటీ పడిన ఆయన రన్నింగ్, హైజంప్లో విజేతగా నిలిచాడు. నిర్వాహకుల నుంచి పతకాలు, ధ్రువపత్రాలను అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో బ్యాంకు ఉద్యోగం చేస్తున్నప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించానన్నారు. రిటైర్డ్ అయ్యాక తనకు ఆటపై మరింత మక్కువ పెరిగిందని, భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధిస్తానన్నారు.


