ముమ్మాటికీ మోసమే...
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆడబిడ్డ నిధికి బడ్జెట్లో ఈ సారి కూడా నిధులను కేటాయించకుండా అక్కచెల్లెమ్మలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఈ పథకం ద్వారా ఆడబిడ్డలకు నెలకు రూ. 1500 చొప్పున ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండేళ్లు కావస్తున్నా ఈ పథకం ఊసెత్తలేదు. గత ఏడాది మొండి చేయి చూపగా ఈ ఏడాదైనా ఖాతాల్లో నగదు జమ చేస్తారని రాష్ట్రంలోని మహిళలంతా ఆశతో ఎదురు చూశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఈ పథకం ప్రస్తావనే లేక పోవడంతో మహిళలంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇది ముమ్మాటికీ మహిళలను మోసగించడమే.
– గొర్రుపోటు సుధారాణి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం కన్వీనర్, మాడుగుల నియోజకవర్గం


