మత్స్యగుండం.. భక్త జనసంద్రం
భారీగా తరలివచ్చిన భక్తులు
● చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు
● ఘనంగా ముగిసిన శివరాత్రి ఉత్సవాలు
సాక్షి,పాడేరు: ఆధ్మాత్మిక,పర్యాటక కేంద్రం హుకుంపేట మండలంలోని మత్స్యగుండం క్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు సోమవారం రాత్రితో ఘనంగా ముగిసాయి. చివరిరోజు భక్తులు పోటెత్తారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలిరావడంతో ఈ ప్రాంతం రద్దీగా మారింది. స్థానికులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు మత్స్యగుండానికి చేరుకుని మత్స్యలింగేశ్వరస్వామితో పాటు మత్స్యగుండంలోని మత్స్యదేవతలను దర్శించుకున్నారు. అన్ని దుకాణాలు రద్దీగా మారాయి. భక్తుల కోసం ఆర్టీసీ 20 ప్రత్యేక బస్సులను నడిపింది.
మత్స్యగుండం.. భక్త జనసంద్రం
మత్స్యగుండం.. భక్త జనసంద్రం
మత్స్యగుండం.. భక్త జనసంద్రం


