వ్యవసాయ రంగానికి అరకొర కేటాయింపులు
అన్నదాతను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది. ఇటీవల ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అరకొర కేటాయింపులు చేసింది. గత ప్రభుత్వంలో రైతులకు వర్తింపజేసిన ఉచిత పంటల బీమా పథకం అటకెక్కించింది. దీనివల్ల ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ పెట్టుబడులు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించినా సరే సున్నావడ్డీ రాయితీ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ 3 శాతం మాత్రమే జమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 4 శాతం వడ్డీ రాయితీ ఎగనామం పెట్టింది.
– శానాపతి కొండలరావు, ఏఎంసీ మాజీ చైర్మన్, ఎం. కోటపాడు, మాడుగుల మండలం


