100 రోజుల కార్యాచరణ అమలు
జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశానుసారం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.గిరిజన విద్యార్థులకు వేకువజామున నుంచి ప్రత్యేక బోధన కార్యక్రమాలు అమలుజేస్తున్నారు, రాత్రివేళల్లో కూడా స్టడీ అవర్స్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అన్ని సబ్జెక్టులలో ప్రత్యేక బోధన అనంతరం విద్యార్థులకు రోజు వారీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాత నమునా ప్రశ్నాపత్రాలతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందని పలువురు చెబుతున్నారు. పబ్లిక్ పరీక్షలపై భయం లేకుండా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ప్రతి సబ్జెక్టుపై కార్యాచరణకు అనుగుణంగా ప్రత్యేకంగా బోధిస్తున్నారు.


