వచ్చే నెల 14న జాతీయ లోక్‌అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

వచ్చే నెల 14న జాతీయ లోక్‌అదాలత్‌

Feb 21 2026 7:11 AM | Updated on Feb 21 2026 7:11 AM

వచ్చే నెల 14న జాతీయ లోక్‌అదాలత్‌

వచ్చే నెల 14న జాతీయ లోక్‌అదాలత్‌

మాట్లాడుతున్న ఇన్‌చార్జి జడ్జి రాము

అరకులోయటౌన్‌: జాతీయ లోక్‌ అదాలత్‌ మార్చి 14వ తేదీన నిర్వహించనున్నట్టు అరకులోయ ప్రథమ శ్రేణి జ్యూడిషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇన్‌చార్జి జడ్జి ఏ.రాము తెలిపారు. స్థానిక ప్రథమ శ్రేణి జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఏపీపీ, పోలీస్‌ అధికారులు, లాయర్లతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లోక్‌ అదాలత్‌లో వీలైనంతవరకు కేసులను రాజీ కుదర్చాలని ఏపీపీ, పోలీసు అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీపీ రమేష్‌, సీఐ ఎల్‌.హిమగిరి, అరకులోయ, డుంబ్రిగుడ ఎస్‌ఐలు గోపాలరావు, సురేష్‌, న్యాయవాదులు మురళీమోహన్‌, సింహాచలం, రాంబాబు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement