బాల్య వివాహాలను నిర్మూలిద్దాం
సాక్షి,పాడేరు: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. ఐసీడీఎస్, సీడ్ సంస్థలు సమకూర్చిన బాల్య వివాహాల విముక్తి ప్రచార రథంను ఆయన ఐటీడీఏ ప్రాంగణంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు జరిపినా, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడ బాల్య వివాహాలు జరిగినా 100, 112, 1098, 18001027222 నంబర్లకు ప్రజలు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇన్చార్జి డీఆర్వో అంబేద్కర్, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు పాల్గొన్నారు.


