జాతరకు ప్రత్యేక బస్సులు
భక్తుల సౌకర్యార్థం పాడేరు డిపో మేనేజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 20 ప్రత్యేక బస్సులు కేటాయించారు. ఈ నెల 14 నుంచి పాడేరు పాత బస్టాండ్ నుంచి రెండు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈనె 15 వ తేదీ నుంచి పాడేరుతో పాటు అరకులోయ, చింతపల్లి, ముంచంగిపుట్టు రూట్లలో అన్ని బస్సులు మత్స్యగుండం క్షేత్రానికి సర్వీసులు అందిస్తాయి.
● పాడేరు పట్టణంలోని సుండ్రుపుట్టు సాయిబాబా గుడి, మెయిన్ రోడ్డు, పాత బస్టాండ్, సినిమా హాల్ సెంటర్ మరియు ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతాల నుంచి బస్సులు నడుస్తాయి.
● మూడు రోజుల పాటు భక్తులు మత్స్యదేవతలను (చేపలను) సందర్శించుకునేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


