రాష్ట్రస్థాయి క్రీడాపోటీల పర్యవేక్షణకు నలుగురు నియామకం
పాడేరు రూరల్: ఈనెల 8,9 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి క్రికెట్, త్రోబాల్ క్రీడా పోటీల పర్యవేక్షణకు నలుగురిని నియమించినట్టు డీఈవో రామకృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరు కేంద్రంగా మహిళలు, పురుషుల క్రికెట్, త్రోబాల్ క్రీడా పోటీలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. వీటి ప్రత్యేక పర్యవేక్షణకు నలుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్టు తెలిపారు. క్రికెట్ జట్టు మేనేజర్గా పాంగి సూరిబాబు (పాడేరు), క్రికెట్ టీమ్ కెప్టెన్గా కిముడు సింహాద్రి (ముంచంగిపుట్టు), త్రోబాల్ టీమ్ మేనేజర్గా పలాసి రాజులమ్మ (పాడేరు), మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్గా ఎ.చిన్నమి (జి.మాడుగుల)ను నియమించినట్టు ఆయన తెలిపారు.
సింహాద్రి
చిన్నమి
రాజులమ్మ
సూరిబాబు
రాష్ట్రస్థాయి క్రీడాపోటీల పర్యవేక్షణకు నలుగురు నియామకం
రాష్ట్రస్థాయి క్రీడాపోటీల పర్యవేక్షణకు నలుగురు నియామకం
రాష్ట్రస్థాయి క్రీడాపోటీల పర్యవేక్షణకు నలుగురు నియామకం


