మంచి స్థానం కోసం..
రాష్ట్రంలో మంచి స్థానం కోసం కృషి చేస్తున్నాం. వంద రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వారిని నిశితంగా గమనిస్తూ వెనుకబడిన సబ్జెక్టులలో తర్ఫీదునిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు ప్రస్తుతం ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం.
– ఎం.వినోద్బాబు, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్


