లిక్విడ్ గంజాయితో ముగ్గురు పట్టివేత
సీలేరు: ఒడిశా నుంచి సీలేరు మీదుగా ద్విచక్ర వాహనాల పై తరలిస్తున్న లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీలేరు ఎస్ఐ యాసిన్ తెలిపారు. ఒడిశాలోని ఓ గ్రామంలో ఏడు కిలోల గంజాయితో తయారుచేసిన లిక్విడ్ గంజాయిని కొనుగోలు చేసి మైదాన ప్రాంతానికి రెండు ద్విచక్ర వాహనాల మీద తరలిస్తుండగా సీలేరులో సోమవారం పట్టుకున్నట్టు ఆయన చెప్పారు. దారకొండ గ్రామానికి చెందిన బంగారు రాజు, రింతాడ గ్రామానికి చెందిన వీరయ్య, డబల్ప హాడ్ ప్రాంతానికి చెందిన బిక్కులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.


