అనకాపల్లి/రోలుగుంట: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం ఆ పార్టీ యువజన విభాగం ఉత్తరాంధ్ర జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్, అనకాపల్లి యువజన విభాగం అధ్యక్షుడు వెంకటేష్ , వైఎస్సార్సీపీ జిల్లా యూత్ సెక్రటరీగా ఇటీవల నియమితులైన కన్నడ చలనచిత్ర నటుడు, మండలం బి.బి.పట్నం గ్రామానికి చెందిన గొందు సిద్ధు మర్యాదపూర్వకంగా వేర్వేరుగా కలిశారు. తాడేపల్లిలో గల క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి సింహాచలం శ్రీ నృసింహస్వామి వారి విగ్రహాన్ని అందజేశారు.


