● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో పాడి పశువుల పాత్ర కీలకమని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శనివారం స్ధానిక పశువైద్యశాలలో జాతీయ పశువ్యాధి నియంత్రణకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పశువులు వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. పశువైద్యాధికారి సాగరి గణేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ఈనెల 16 నుంచి వచ్చే నెల 29 వరకు జరుగుతుందన్నారు.


