దేవరాపల్లి: పరాభవ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలకు సకల శుభాలు, విజయాలు సిద్ధించాలని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ డిప్యూటీ బూడి ముత్యాలనాయుడు ఆకాంక్షించారు. తారువలో బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ తెలుగు నూతన సంవత్సరాదిలో ప్రతి ఒక్కరూ అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తలతూగాలని మనసారా భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమృద్దిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా వృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.


