సాక్షి, పాడేరు: మాస్ కాపీయింగ్కు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో టెన్త్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ ఆదేశించారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల సెంటర్లోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.అన్ని గదులను సందర్శించారు.విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా 44 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ తీరును తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు,ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై ఉన్న నిషేధాన్ని పక్కాగా అమలుజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఈవో రామకృష్ణారావు,పరీక్షల ముఖ్య పర్యవేక్షకు డు కె.జె.రమణ, డిపార్ట్మెంట్ అధికారి ఎం.రాజు.హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


