breaking news
Srikakulam District Latest News
-
సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకోవాలి
టెక్కలి: సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, క్యాంపస్ నుంచి నేరుగా కార్పొరేట్ స్థాయికి ఎదిగేవిధంగా చక్కనైనా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని టీసీఎస్ సంస్థ ప్రెసిడెంట్ వి.రాజన్న ఆకాంక్షించారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన రజతోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ‘క్యాంపస్ టు కార్పొరేట్’ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం కేవలం ఉద్యోగాల కోసం కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా ఆలోచన చేయాలన్నారు. పాఠ్యంశాలతో పాటు పరిశ్రమలకు అవసరమైన అన్ని రకాల నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ఏఐ, ఐవోటీ వంటి సాంకేతికత భవిష్యత్లో కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. అనంతరం కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, డైరక్టర్ వి.వి.నాగేశ్వర్రావు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ప్లేస్మెంట్ డీన్ ఎం.సంతోష్కుమార్, కన్వీనర్ బి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా
నందిగాం: టెక్కలి నియోజకవర్గంలో నిత్యం గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. తాజాగా నందిగాం మండలం ఆనందపురం పంచాయతీ మాదిగాపురం కొండపై అక్రమ తవ్వకాలు, తరలింపు చేపడుతుండగా.. అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై తిరగబడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాదిగాపురం పరిధి సర్వే నంబర్ 253లో ఉన్న కొండపై అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్నట్లు సమాచారం అందుకున్న నందిగాం డిప్యూటీ తహసీల్దార్ రామారావు, స్థానిక వీఆర్వో మధు అక్కడికి చేరుకున్నారు. అక్కడ యంత్రాలతో తవ్వుతున్నవారిని అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వడం, తరలించడం నేరమని, తక్షణం పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. అయితే వారు పట్టించుకోకపోవడంతో యంత్రాల తాళాలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగి తిరగబడ్డారు. ఈ క్రమంలో డీటీ రామారావు చేతికి గాయమైంది. దీంతో డీటీ నందిగాం పోలీసులకు విషయం తెలియజేయడంతో కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. దీంతో తవ్వకందారులు తాళాలు అప్పగించారు. డీటీ వాటిని పోలీసులకు అప్పగించారు. రెవెన్యూ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. ఈ కొండపై 1980 దశకంలో హరిదాసుపురానికి చెందిన 21 మంది దళితులకు 8 ఎకరాల పట్టాలు అందజేసి ఉన్నారు. ఆ పట్టాలకు 1–బీ, అడంగల్ వంటివి రావడం లేదు. కానీ ఆ 8 ఎకరాలు ఆ దళిత కుటుంబాల ఆధీనంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టడంతో అడ్డుకున్నామన్నారు. కాగా అక్రమంగా కొండను తవ్వేసి, గ్రావెల్ తరలిస్తూ కూడా.. అధికారులపై తిరగబడ్డారంటే వారి వెనుక అధికార పార్టీ నాయకులు ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
మందస: మండలంలోని కొత్తపల్లి జాతీయ రహదారి బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన కొత్తపల్లి కాంతారావు(43) కంచిలి నుంచి పలాసకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు తీవ్రగాయాలతో ఉన్న కాంతారావును హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన అనంతరం 108 వాహనంలో టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే మార్గమధ్యలో అతను మృతి చెందారు. కాంతారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కంచిలి మండలంలో ఉన్న ఫాస్ట్ఫుడ్ సెంటర్లో మాస్టర్గా పనిచేస్తున్నారు. మందస పోలీసులు కేసు నమోదు చేశారు. -
వెంటాడిన దురదృష్టం
● ఆగివున్న ట్రాక్టర్ను ఢీకొన్న లారీ ● ట్రాక్టర్ మరమ్మతులు చేస్తున్న డ్రైవర్ మృతి టెక్కలి రూరల్/నరసన్నపేట: తన వాహనం మరమ్మతులకు గురవ్వడంతో రహదారి పక్కన ఆపి వాహనాన్ని మరమ్మతులు చేస్తుండగా.. అనుకోకుండా ఓ కంటైనర్ లారీ ఆ వాహనాన్ని ఢీకొనడంతో చోటుచేసుకున్న ప్రమాదంలో వాహనం మరమ్మతులు చేస్తున్న వ్యక్తి మృతి చెందిన ఘటన కోటబొమ్మాళి మండలం జర్జంగి గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నరసన్నపేట మండలం బుచ్చిపేట గ్రామానికి చెందిన కొన్న నవీన్(35) అనే వ్యక్తి తన ట్రాక్టర్తో ఇసుక లోడ్కు వెళ్లి మడపం నుంచి టెక్కలి వైపు వస్తున్న సమయంలో కోటబొమ్మాళి మండలం జర్జంగి ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగుతుండగా టైర్ పంక్చర్ అవ్వడంతో రోడ్డు పక్కగా ఆపి మరమ్మతులు చేపట్టాడు. అయితే అదే మార్గంలో వచ్చిన ఒక కంటైనర్ లారీ మరమ్మతులు చేస్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. దీంతో ట్రాక్టర్ సమీపంలోని పంట కాలువలో పడిపోగా.. మరమ్మతులు చేస్తున్న డ్రైవర్ ట్రాక్టర్ కిందనే ఉండిపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు హుటాహుటిన కోటబొమ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నాడు. అనంతరం హైవే సిబ్బంది భారీక్రేన్ల సాయంతో ట్రాక్టర్ని బయటకు తీయడంతో నవీన్ మృతదేహం బయటపడింది. కాగా ఈ ఘటనతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్ సరిచేసి మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు పొలం పనులు చేసుకుంటూ ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్య అశ్విని, మూడేళ్ల కుమారుడు ధీరజ్కుమార్లు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోటబొమ్మాళి రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
టెండర్లకు మోక్షమెన్నడో..!
శ్రీకాకుళం పాతబస్టాండ్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలకు కూరగాయలు, పండ్లు, మాసం తదితర సామగ్రి అందించేందుకు వేసిన టెండర్లకు మూడు నెలలు గడుస్తున్నా ఇంకా మోక్షం కలగడం లేదు. ఈ టెండర్లు సజావుగా నిర్వహించేందుకు రాజకీయాలు అడ్డుతగులుతున్నాయి. ప్రతిఏటా జూన్ నెలలో విద్యాసంస్థలు ప్రారంభం నాటికి టెండర్లు పూర్తి కావాలి. అప్పటినుంచి ఏడాది పాటు టెండర్ పొందిన వ్యక్తులు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చికెన్ తదితర వస్తు సామగ్రిని అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది ఈ టెండర్ ప్రక్రియ ఒక ప్రవాసంగా మారింది. జూన్లో పూర్తి కావాల్సిన ఈ టెండర్ల ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. అధికార పార్టీకి చెందిన ఒక ప్రధాన నాయకురాలి బినామీలకు టెండర్లు దక్కించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ జాప్యం జరుగుతోందని టెండరుదారులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో గురుకుల విద్యాలయాలు శ్రీకాకుళం జిల్లాలో డాక్డర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ విద్యాలయాలు 9 ఉన్నాయి. దుప్పలవలస, ఎచ్చెర్ల, పెద్దపాడు, కొల్లివలస, తామరాపల్లి, పాతపత్నం, నందిగాం, మందస, కంచిలిలో ఇవి ఉన్నాయి. సుమారుగా ఒక్కో గురుకులంలో 3 వందల నుంచి 5 వందలు వరకు విద్యార్థులు ఉన్నారు. కొన్ని గురుకులాల్లో ఇంటర్మీడియట్ కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఈ గురుకులాల్లో ఏడాది పాటు కూరగాయలు ఇతర సరుకులు అందించేందుకు టెండర్లు పిలిచారు. రాజకీయ జోక్యంతో... జిల్లాలోని గురుకులాల్లో ఈ ఏడాది జూన్ 18వ తేదీన టెండర్లు పిలిచారు. ఈ టెండరు ప్రక్రియ ఆదే నెల 27తో ముగిసింది. సుమారుగా 140 మంది వరకు టెండరులో డీడీలు కట్టి వేశారు. జూన్ 29న జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్ ఓపెన్ చేసి, లాటరీ విధానంలో టెండర్ ఖరారు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. లాటరీలు కూడా నిర్వహించారు. అయితే ఈ లాటరీల్లో హేమంత్, వేణుగోపాల్కు రెండేసి గురుకులాలు, ధనలక్ష్మికి నాలుగు గురుకులాలు వచ్చాయి. ఇక్కడే సమస్య మొదలైయింది. పలాసకు చెందిన కూటమి ప్రధాన నాయకురాలి తాలుకా టెండరుదారు మోహనరావుకి తొమ్మిదిలో ఒక్కటి కూడా రాలేదు. దీంతో అతనికి కనీసం మూడు గురుకులాలు ఇవ్వాలని సంబంధిత నాయకులు పట్టుబట్టడంతో ఈ టెండర్లు తాత్కాలికంగా వాయిదా వేశారు. తర్వాత రద్దు చేశారు. మరలా ఇదే గురుకులాలకు జూన్ ఒకటో తేదీన మరోసారి టెండర్లు పిలిచారు. అప్పుడు సుమారుగా 180 మంది వరకు బిడ్లు వేశారు. వీరిలో కొటేషన్ ఆధారంగా లాటరీ విధానంలో సంప్రదింపులతో టెండరు ఖరారుకి సిద్ధమయ్యారు. ఈ టెండర్లను జూన్ 7న నిర్వహించారు. ఈసారి పలాకు చెందిన రాజకీయ నాయకురాలి అనుచరుడు కేవలం ఒక్క రూపాయికే కిలో అరటిపండ్లు ఇచ్చేందుకు గాను టెండరు బిడ్లో పేర్కొన్నారు. ఇది అసాధ్యమని, అటువంటి టెండర్ బిడ్ చెల్లదని అధికారులు తేల్చిచెప్పారు. అయితే ఈసారి కూడా రాజకీయ ఒత్తిడి రావడంతో టెండర్లు ఎవ్వరికీ ఇవ్వకుండా ఇంకా జాప్యం చేస్తున్నారు. దీంతో టెండర్లు వేసిన కూరగాయల వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. టెండర్లు మొత్తం సుమారుగా రూ.90 లక్షలు డిపాజిట్లు రూపంలో ఉండిపోయాయి. అర్హులకు దక్కుకుండా అడ్డంకులు వాస్తవంగా టెండర్లో తక్కువ కొటేషన్ ఉన్నవారు, సంప్రదింపుల ద్వారా వచ్చినవారు, గతంలో చక్కగా సరుకులు గురుకులాలకు అందించినవారిని ఎంపిక చేయాల్సింది. అయితే ఈ గురుకుల సరుకు టెండర్లులో రాజకీయ ప్రమేయం పెరగడంతో పూర్తిగా ఈ విధానం తప్పుదోవపడుతోందని, రాజకీయ అండతో వచ్చినవారు సరుకులు సక్రమంగా ఇవ్వరని టెండరుదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై టెండరుదారులు పలుమార్లు జాయింట్ కలెక్టరుని నేరుగా ఆయన చాంబర్లో కలిసి వారి సమస్యలు విన్నవించుకున్నారు. అలాగే పీజీఆర్ఎస్లో కూడా వారి ఇబ్బందులు పరిష్కరించాలని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. రాజకీయలకు అతీతంగా ఈ టెండర్లు అర్హులైన వారికి ఇప్పించాలని కోరుతున్నారు. డీసీఎంఎస్కి ఇవ్వాలని ఒత్తిడి ఇదిలా ఉండగా ఈ ఏడాది నుంచి ప్రతీ వసతి గృహం, గురుకులాలు అన్నింటా సరుకులు సరఫరా డీసీఎంఎస్కి ఇవ్వాలని ఆ సంస్థ నాయకులు టీడీపీ నేతలు, అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒకప్పుడు డీసీఎంఎస్ వారు అందరిలాగానే టెండర్లు వేసి, కూరగాయలు మినహా ఇతర కిరాణా సామాగ్రిని గురుకులాలకు అందించేవారు. అయితే ఈసారి అడ్డగోలుగా వారికే దక్కాలని ఆ నాయకులు పట్టుబట్టడంతో ఈ టెండర్లు నిర్వహించే అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మూలుగుతున్న పాత బకాయిలు గతేడాది టెండర్లు ద్వారా ఇప్పటివరకు సరఫరా చేస్తున్న కూరగాయలు, చికెన్, ఇతర సామగ్రికి చెల్లించాల్సిన మొత్తం ఈ ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో ఈ వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది బిల్లులతో పాటు, ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే వారికి సక్రమంగా బిల్లులు మంజూరవ్వక ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలుగా ఖరారవ్వని గురుకులాల టెండర్లు అక్రమార్కులకు కట్టబెట్టేందుకు యత్నం అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఎటూ తేల్చుకోలేక సతమతం -
ఎమ్మెల్యేపై కలెక్టర్కు ఫిర్యాదు
● నా కుటుంబ విషయాల్లో ఎమ్మెల్యే జోక్యం ● పీజీఆర్ఎస్లో మహిళ ఫిర్యాదు శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలోని గార వీధిలో తన పేరిట ఉన్న ఆస్తి హక్కుతో కూడిన మున్సిపల్ ట్యాక్స్ను మార్చేందుకు తన కుమారులు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పురపాలక అధికారులకు సూచనలు ఇస్తున్నారని పొలుమూరు మీనాక్షి అనే మహిళ సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం నగరంలోని గార వీధిలో సర్వే నంబర్లు 1242 లేదా 1240కు సంబంధించి ఆస్తి తన పేరిట ఉందని, మున్సిపల్ ట్యా క్స్ను కూడా తానే చెల్లిస్తున్నానని ఆమె తెలిపారు. ఈ ఆస్తిని తన కుమార్తె లక్ష్మికి పసుపు కుంకాల కింద ఇచ్చానని, ప్రస్తుతం తన కుమార్తే ఆదుకుంటోందని ఆమె వివరించారు. కానీ ఈ ఆస్తిని తన కుమారులైన పొలుమూరు ఈశ్వరరావు, పొలుమూరు సింహాచలం తీసుకోవాలని చూస్తున్నారని, దీని కోసం ఎమ్మెల్యే వద్దకు వెళ్లారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యేకి బేరం పెట్టుకొని, ప్యాకేజీ మాట్లాడుకున్నారని మీనాక్షి ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపల్ ట్యాక్స్లో పేరును చనిపోయిన తన భర్త పేరు మీద గానీ, కుమారుల పేరు మీద గానీ మార్చాలని చూస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, దీనిపై చర్య లు తీసుకోవాలని ఆమె వినతి అందించారు. ఎమ్మెల్యే కుటుంబ విషయాల్లో తలదూర్చుతు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
● కాలువలోకి దిగబడిన ఆర్టీసీ బస్సు
ముండ్ల పంచాయతీ పరిధి సాగరనౌగాం గ్రామం వద్ద రోడ్డు పక్కన పంట కాలువలోకి ఆర్టీసీ బస్సు సోమవారం దిగబడింది. బస్సు సోంపేట నుంచి కుంబరినౌగాం గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఒక ద్విచక్ర వాహనదారుడిని తప్పించడానికి డ్రైవర్ బండిని పక్కకు తప్పించాడు. ఆ ప్రదేశంలో మొక్కలు పెరిగిపోవడంతో అక్కడ ఏమీ కనిపించక రోడ్డు కిందకు దిగబడింది. ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్ర మాదం జరగలేదు. ఎంత ప్రయత్నించినా బస్సును బయటకు తీయలేకపోవడంతో ఆ రూట్లో రోజంతా సర్వీసులు నిలిచిపోయాయి. – కంచిలి -
మానవత్వం చాటుకున్న శ్యాంప్రసాద్రెడ్డి
కంచిలి: ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్రెడ్డి మానవత్వం చాటుకున్నారు. సోమవారం ఉదయం ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా పలాస మండల శాసనం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై రోడ్డు పక్కన పడివున్న వ్యక్తిని గమనించారు. హైవే మార్గంలో హైవే సేఫ్టీ సిగ్నల్ వాహనాన్ని ద్విచక్ర వాహనంతో ఢీకొని ప్రమాదానికి గురైన వ్యక్తిగా గుర్తించారు. అక్కడ ఆగి అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి గురించి అంబులెన్స్కు సమాచారం ఇచ్చి పలాస ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదానికి గురైన వ్యక్తికి చేయి విరగడంతోపాటు శరీరంపై గాయాలయ్యాయి. హెల్మెట్ ధరించడం వలన తలకు ఎటువంటి గాయాలు కాలేదు. శ్యాం ప్రసాద్రెడ్డి ప్రమాదానికి గురైన వ్యక్తికి అందించిన సహాయానికి పలువురు అభినందించారు. విద్యుత్ శాఖ ఉద్యోగి ఆత్మహత్య కాశీబుగ్గ: పలాస విద్యుత్ డివిజన్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఒక ఉద్యోగి అదే కార్యాలయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, విద్యుత్ సిబ్బంది సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న కంచి సంతోష్కుమార్ (31) సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చాడు. తన బ్యాగును బయటే ఉంచి నేరుగా డాబాపైకి వెళ్లి, అదే కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న ఉద్యోగినికి ఫోన్ చేశాడు. అనంతరం డాబాపై ఉన్న సోలార్ ప్యానల్ బోర్డులకు వేలాడుతున్న వైర్లతో ఉరేసుకున్నాడు. విషయాన్ని తెలుసుకున్న అటెండర్ వెంటనే వచ్చి డాబాపైకి వెళ్లి చూసి కేకలు వేసింది. స్పందించిన కార్యాలయ సిబ్బంది సంతోష్కుమార్ను పలాస ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సారా ప్యాకెట్లతో వ్యక్తి అరెస్టు కంచిలి: మండలంలోని తలతంపర పంచాయతీ పరిధి కాకర్లపుట్టుగ గ్రామంలో సోంపేట ఎకై ్సజ్ శాఖ సిబ్బంది సోమవారం దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా ఆ గ్రామానికి చెందిన కాకర్ల దాలయ్య అనే పాత ముద్దాయి నుంచి 100 నాటుసారా ప్యాకెట్లు(సుమారు 10 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, సోంపేట కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. విచారణలో భాగంగా సదరు వ్యక్తికి నాటుసారా సరఫరా చేసిన శ్రీరాంపురం గ్రామానికి చెందిన లండ నవీన్ మీద కూడా కేసు నమోదు చేశారు. ఒడిశా నుంచి నాటుసారా రవాణా అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు సీఐ జి.వి.రమణ తెలిపారు. గతంలో నాటుసారా కేసులు కలిగి ఉన్న అందరి మీద ప్రత్యేక నిఘా ఉందన్నారు. దాడుల్లో ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది కృష్ణమూర్తి, ఉమాపతి, మార్కారావు తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన ఉద్యోగులు
● ప్రభుత్వంపై నిరసన జ్వాల కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందజేస్తున్న ఉద్యోగులుప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఉద్యోగులు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛన్దారుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు కదం తొక్కారు. ప్ర భుత్వ తీరును ఎండగడుతూ సోమవారం జిల్లా కేంద్రంలో నినాదాలు చేసి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీజీఆర్ఎస్లో వినతి పత్రం అందజేశారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర సద స్సులో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ని కలిసి, రేపటి నుంచి జరగబోయే ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన వివరాలతో కూడిన నోటీసును అందజేశారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లుపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. రాష్ట్ర ఉద్యమ కమిటీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ను జిల్లా, డివిజన్, మండల, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ స్థాయిలో తప్పనిసరిగా పాటిస్తూ పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ భైరి రాజు, ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమణ, మహిళా విభాగం చైర్మన్ కె.ప్రవల్లిక ప్రియ, ప్రధాన కార్యదర్శి జి.అరుణ కుమారి పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
● మద్యం మత్తు.. మానవత్వం చిత్తు
శ్రీకాకుళం పెద్దపాడు రామిగెడ్డ సమీపంలోని వైన్షాపు వద్ద సోమవారం మధ్యాహ్నం కనిపించిన దృశ్యమిది. ఈ వ్యక్తి ఇక్కడే మద్యం కొనుగోలు చేసి అక్కడే తాగి పడిపోయాడు. అతడిపై సైకిల్ పడిపోయి ఉన్నా.. పై అంతస్తు నుంచి నీళ్లు పడుతున్నా.. అతడు చిన్నగా మూలుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి వైన్షాపు సిబ్బంది కూడా కొనుగోలుదారులను చూసుకున్నారు తప్ప ఇతడిని లేపి పక్కన ఉంచుదామని కూడా ఆలోచించలేదు. వ్యసనం వారి గల్లె పెట్టెలు నింపుతుంటే.. సామాన్యుడి ఒంటిని, ఇంటిని గుల్ల చేస్తోంది. – శ్రీకాకుళం క్రైమ్ -
విజయ శంఖం పూరిద్దాం
మాట్లాడుతున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. చిత్రంలో బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, పిరియా విజయ, రెడ్డి శాంతి, గొర్లె కిరణ్కుమార్, నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎంవీ పద్మావతి, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ్, దుంపల లక్ష్మణరావు, కిల్లి సత్యన్నారాయణ, కరిమి రాజేశ్వరరావు తదితరులు సభకు హాజరైన పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రశ్నించడమే మన కర్తవ్యం టౌన్హాల్ మనందరికీ పార్టీ కార్యాలయంగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నించడమే మన కర్తవ్యం. ఆర్టీఐ ద్వారా సమాచారం తెలుసుకుని వారి తాట తీయాలి. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత వైఎస్ జగన్ పర్యటనతో తేటతెల్లమైంది. నాకు టికెట్ వచ్చినా రాకున్నా పార్టీని వీడే ప్రసక్తే లేదు. ఆరుగురు మత్స్యకారుల గృహ ప్రవేశాలకు వెళ్తే దానిపై హౌసింగ్ పీడీ చేత కేసులు పెట్టించడం దారుణం. అసలు కలెక్టర్ అన్నీ తెలిసే చేస్తున్నారా.? కేసు పెట్టిన 12 గంటల్లోనే కొట్టేశారు. కలెక్టర్ స్థాయి వ్యక్తి అంత దిగజారి ఉద్యోగం చేయడం అవసరమా? గృహ ప్రవేశాలకు, ఇనాగిరేషన్కు తేడా తెలీని వారు అధికారులుగా ఉండడం మన దౌర్భాగ్యం. నన్నెందుకు జైల్లో వేస్తారు. జిల్లాకు రోడ్లు వేశాననా, రైతులకు నీరిచ్చాననా, రిమ్స్ కట్టాననా, అభివృద్ధి చేశానని నన్ను జైల్లో పెడతారా. చంద్రబాబు రైతు భరోసా, నేతన్న నేస్తం, మత్య్సకార భరోసా, ఫీజు రీయింబర్స్మెంట్ వంటివి ఎగ్గొట్టి ధరలు మూడింతలు పెంచారు. రైతులకు నీరు లేదు, ఎరువు లేదు, పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. దీనికి ఎవరూ భయపడరు. స్థానిక సంస్థల్లో మనం పోటీ చేయాల్సిందే. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సీదిరి అప్పలరాజును జైల్లో పెట్టినప్పుడు శ్రీకాకుళం జిల్లాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయల్దేరిన నాడే పార్టీ గెలుపునకు బాటలు పడ్డాయని వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఆనాడు వైజాగ్ నుంచి శ్రీకాకుళంలోని అంపోలు జైలు వద్దకు వెళ్లేందుకు ఆరు గంటలు పట్టిందంటే వైఎస్ జగన్పై జనాభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు. శ్రీకాకుళం నగరంలో జిల్లా పార్టీ కార్యాలయం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ముందుగా జీటీ రోడ్డు వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి భారీ ర్యాలీ గా పాతబస్టాండ్ మీదుగా టౌన్హాల్ వద్దకు చేరుకున్నారు. పార్టీ జిల్లా కార్యాలయం అన్ని చాంబర్లు లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా ప్రధాన కార్యద ర్శి గేదెల పురుషోత్తం సతీసమేతంగా హోమం చే యించి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ 2029 ఎన్నికల విజయానికి టౌన్హాల్ వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. చంద్రబాబు అ ధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోయాయని, కిలో పంచదార రూ.40 నుంచి రూ.75కి చేరడం దారుణమన్నారు. అప్పట్లో ధర్మాన మంత్రిగా తన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన క్రమశిక్షణను చూసి తనకు రాజకీయాల్లోకి రావాలని అనిపించిందని అన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయసాయిరాజ్, ఎమ్మెల్సీలు నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, పెనుమత్స సురేష్బాబు, మున్సిపల్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు, మహిళావిభాగం నాయకులు ఎంవీ పద్మావతి, పార్టీ ముఖ్య నాయకులు మామిడి శ్రీకాంత్, దుంపల లక్ష్మణరావు, కేవీజీ సత్యనారా యణ, ఎన్ని ధనుంజయరావు, అంబటి శ్రీనివాసరావు, చల్ల రవికుమార్, కరిమి రాజేశ్వరరావు, పిన్నింటి సాయికుమార్, గేదెల పురుషోత్తం, చింతా డ వరుణ్కుమార్, పిల్లల రామకృష్ణ, ఉలాల దివ్య భారతి, రుప్ప దివ్య, ఆరంగి లక్ష్మీపతీ, కొర్ల భారతి, పొన్నాడ రుషి, శిమ్మ రాజశేఖర్, ఎం.ఏ భేగ్, ముంజేటి కృష్ణ, మార్పు పృథ్వీ, ముత్తా విజయ్కుమార్, నర్తు నరేంద్రయాదవ్, ప్రత్తి అన్వేష్, గొండు కృష్ణమూర్తి, కోణార్క్ శ్రీను, డాక్టర్ శ్రీనివాసపట్నాయక్, బొడ్డేపల్లి రమేష్కుమార్, సాదు వైకుంఠరావు, బుక్కూరు ఉమామహేశ్వరరావు, పీస శ్రీహరి, గంట్యాడ రమేష్, గద్దిబోయిన కృష్ణయాదవ్, ఎంఏ రఫీ, చిట్టి జనార్ధనరావు, మూకళ్ల తాతబాబు, సనప ల నారాయణరావు, మండవల్లి రవి, తంగుడు నాగేశ్వరరావు, కోట గోవిందరావు, మొదవలస చిరంజీవి, రౌతు శంకరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగనే అండ చంద్రబాబు గెలుపు అంతా వెన్నుపోటుతో వచ్చినదే. ఆ పార్టీకి వెన్నుపోటు పార్టీ అని పేరు పెడితేనే బాగుంటుంది. పార్టీలో ఎవరికి కష్టం వచ్చినా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారు. దానికి నేనే సాక్ష్యం. అధికార దాహంతో అనేక అబద్ధపు హామీలివ్వడం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నింటినీ విస్మరించడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి భయపడేదే లేదు.. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తే భయపడిపోతామని అనుకుంటున్నారు. అది కూటమి నేతల అవివేకం. 2019 ఎన్నికల కంటే మిన్నగా 2029 ఎన్నికల్లో ఫలితాలు తీసుకొచ్చేందుకు మనందరం కృషి చేయాలి. వైఎస్సార్సీపీకి చెందిన 800మంది సోషల్ మీడియా వ్యక్తులపై కేసులు పెట్టారు. వారికి పార్టీ అండగా నిలబడింది. ప్రతి కేసుపై ప్రతిస్పందన కచ్చితంగా ఉంటుంది. – హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి (కో–ఆర్డినేషన్) విజయ దుందుభి మోగిద్దాం టౌన్హాల్ వేదికగానే అనేక విజయాలు సాధించాం. 2029లో మళ్లీ విజయ దుందుభి మోగిద్దాం. వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం, రూ.265కోట్లుతో పాతపట్నం నియోజకవర్గంలో తాగునీరు, రూ.750కోట్లుతో ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, పలాస కిడ్నీ ఆస్పత్రి, మూలపేట పోర్టు వంటి అనేక అభివృద్ధి పనులు చేసిన ఘనత వైఎస్ జగన్ది. పథకాలు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుది. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే పార్టీని గెలిపిద్దాం జిల్లాలో మనకు మంచి నాయకత్వం ఉంది. రానున్న మూడేళ్లు కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించుకోవాలి. పలాస, ఆమదాలవలస నియోజవర్గాల నాయకులు సీదిరి అప్పలరాజు, చింతాడ రవికుమార్కు పార్టీ అండగా నిలబడిన తీరు అందరికీ ధైర్యాన్నిచ్చింది. – సాడి శ్యామ్ప్రసాద్ రెడ్డి, పార్టీ ఇచ్ఛాపురం సమన్వయకర్త కలిసికట్టుగా ముందుకెళ్దాం స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకెళ్తే విజయం మన సొంతం. సమర్థులు అవకాశం వచ్చినప్పుడు పార్టీని గెలిపించాలి. ప్రతి గ్రామంలో తటస్థులను కలుపుకుని వెళ్లాలి. ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ పోటీ చేయాలి. ఎవరికీ భయపడేది లేదు. రానున్న 2029 ఎన్నికల్లో గెలుపుజెండా టౌన్హాల్ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఎగురవేద్దాం. – ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మోసకారి పాలన చంద్రబాబుది మోసకారి పాలన. 2029 ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానం, 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహుమతిగా ఇవ్వాలన్నదే మనందరి లక్ష్యం. కూటమి పాలకుల మోసాలు అందరికీ వివరించాలి – పేరాడ తిలక్, పార్టీ టెక్కలి సమన్వయకర్త ఒకే బాటలో నడుద్దాం అందరం ఒకే బాటలో నడుద్దాం. ఆశావహులకు తగు సూచనలు, సలహాలిచ్చి బరిలో దిగేలా పార్టీ పెద్దలు చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలే అసెంబ్లీ ఎన్నికలకు పునాదులవుతాయి. – గొర్లె కిరణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే కేసులకు బెదిరేది లేదు ఎస్పీ రాజ్యాంగబద్ధంగా కాకుండా చంద్రబాబు తొత్తులా పనిచేయడం సరికాదు. ఓ మహిళా ఎస్ఐని సుపారి గ్యాంగ్తో చంపేయాలని చూశామని 13 సెక్షన్లు కింద 13 కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఇలాంటి కేసులకు భయపడిపోతామని అనుకోవడం కూటమి నేతల భ్రమ. కూన రవికుమార్ ఏకంగా ఆ ఎస్ఐను ఇమిటేట్ చేసి కించపరచడం ప్రజాప్రతినిధిగా సరికాదు. వైఎస్ జగన్ మనకు అండగా ఉన్నారు. – చింతాడ రవికుమార్, పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త ఇది గెలుపు ముహూర్తం ఇది పార్టీ కార్యాలయానికి పెట్టిన ముహూర్తం కాదు.. 2029లో గెలుపునకు పెట్టిన ముహూర్తం. ఎన్ని కష్టాలు, నష్టాలున్నా అలుపెరగని పోరాటం చేస్తున్నది పార్టీ కార్యకర్తలే. ఎవరిపై ఎలాంటి కేసులు పెట్టినా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. – ధర్మాన రామ్మనోహర్నాయుడు, పార్టీ యువనేత కార్యకర్తలకు గుర్తింపు జగన్ 2.0లో కార్యకర్తలకు తగిన న్యాయం, గుర్తింపు లభిస్తుంది. మనందరిదీ వైఎస్సార్సీపీ కుటుంబం. ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తప్పవు. – ధర్మాన కృష్ణచైతన్య, పోలాకి జెడ్పీటీసీ సిక్కోలుకి వైఎస్ జగన్ వచ్చిన రోజే గెలుపు ఖాయమైపోయింది: బూడి ముత్యాలనాయుడు ప్రతి పంచాయతీలో పోటీ చేద్దాం: ధర్మాన ప్రసాదరావు ప్రణాళికాబద్ధంగా ఎన్నికలకు వెళ్దాం: ధర్మాన కృష్ణదాస్ టీడీపీ కాదు అది వెన్నుపోటు పార్టీ: సీదిరి అప్పలరాజు కార్యకర్తల పార్టీ వైఎస్సార్సీపీ: హర్షవర్ధన్రెడ్డి సందడిగా వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం భారీగా తరలి వచ్చిన పార్టీ నాయకులు -
గంజాయితో ఇద్దరు అరెస్టు
ఆమదాలవలస: స్థానిక పోలీసుస్టేషన్ పరిధి కొత్తరోడ్డు సమీపంలోని నాగావళి నది పరివాహక ప్రాంతంలో 2.5 కిలోల గంజాయితో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ ఎం.సన్యాసినాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. నాగావళి నది బ్రిడ్జి కింద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ సనపల బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం వారిని తనిఖీ చేయగా అలికాన నవీన్ కుమార్, చింతాడ దిలీప్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. మండల డిప్యూటీ తహసీల్దార్, వీఆర్వోల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా నవీన్ కుమార్ వద్ద 1.5 కిలోలు, దిలీప్ వద్ద కిలో గంజాయి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచామన్నారు. నిందితులిద్దరికీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో వారిని అంపోలు జిల్లా జైలుకు తరలించినట్లు వెల్లడించారు. -
ఫోర్జరీ పత్రాలతో భూ ఆక్రమణ
శ్రీకాకుళం క్రైమ్: తాతల వారసత్వంగా వచ్చిన తమ ఇనాం భూమిలోని కొంత స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో రావాడ అరుణకుమారి ఆక్రమణ చేస్తున్నారని, అడ్డుకుంటే దాడులకు ఎగబడుతున్నారని కొత్తూరు మండలం కలిగాంకు చెందిన అలికాన శ్రీనివాసరావు ఎస్పీ గ్రీవెన్సులో సోమవారం ఫిర్యాదు చేశారు. కలిగాం బౌండరీలో దాదాపు 70 సెంట్ల స్థలాన్ని ఎం.రాజారావు, అలికాన తులసీదాసుల సహకారంతో అరుణకుమారి ఆక్రమించారని, ఇదే విషయాన్ని సీఎం గ్రీవెన్సులో గత నెల 30న ఫిర్యాదు చేశామని, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్సులో బాధితుల నుంచి 63 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల వద్ద నుంచి వినతులు స్వీకరించి సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. -
అర్జీదారులు స్పందన తెలియజేయవచ్చు
పలు వినతులు పరిశీలిస్తే... ● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్లో 163 వినతులు స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: క్యూఅర్ కోడ్ను ఉపయోగించుకొని అర్జీదారులు పెట్టుకున్న అర్జీ పరిష్కారానికి సంబంధించిన స్పందన (ఫీడ్బ్యాక్) తెలియజేయవచ్చని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోని గ్రీవెన్స్ కేంద్రాల వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కోసం క్యూఆర్ కోడ్ను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు అర్జీదారులను ప్రోత్సహించాలని సూచించారు. అర్జీలు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్కు వచ్చే ప్రతి వ్యక్తి ఇచ్చిన అర్జీని రిజిస్ట్రేషన్ చేయాలని, వారికి రశీదు ఇవ్వాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్కు నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని సిబ్బందికి హెచ్చరించారు. ఈ వారం 163 అర్జీలు స్వీకరించగా.. ఇందులో రెవెన్యూ 63, పంచాయతీ రాజ్ 14, పట్టణ, పరిపాలన శాఖ 12, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 11, గృహ నిర్మాణ శాఖ 7, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ 6, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ 5, స్కిల్ డవలప్మెంట్ 5, హోంశాఖ 5, వాటర్ రిసోర్స్ ఈఎన్సీ 4, ఏపీ ఈపీడీసీఎల్ 4, స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు 4, గ్రామీణ నీటి సరఫరా 3, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 2, గ్రామీణాభివృద్ధి 2, విద్యాశాఖ 2, ఏపీఎస్ ఆర్టీసీ 2, సమగ్ర శిక్ష 2, హార్టికల్చర్, దేవదాయ శాఖ, కుటుంబ సంక్షేమం, ఏపీ స్టేట్ ఇరిగేషన్ డవలప్మెంట్ కార్పొరేషన్, బీసీ సంక్షేమం, మెడికల్ ఎడ్యుకేషన్, మైన్స్ అండ్ జియాలజీ, సీ్త్ర, శిశు సంక్షేమం తదితర శాఖలకు సంబంధించి ఒక్కటి చొప్పున అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, డిప్యూటీ కలెక్టర్ జి.జయదేవి, ఆర్డీవో కె.సాయి ప్రత్యూష, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ● ఇసుక ర్యాంపు నిలిపివేయాలి గార మండలం శాలిహుండం వద్ద వంశధార నదిపై గల ఇసుక ర్యాంపుని నిలిపి వేయాలని ఆ గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు పీజీఆర్ఎస్లో వినతిని అందజేశారు. గతంలో ఇసుక ర్యాంపు వద్దని, బోరు బావులకు నీటి ఇబ్బంది వస్తోందని తెలియజేయడం జరిగిందన్నారు. ఇసుక ర్యాంప్ వలన బోరు బావులకు నీరురాక పంటలు పండించుకోవడం కష్టంగా మారిందని వాపోయారు. అలాగే గార గ్రామానికి తాగునీరు కూడా సమస్యగా మారుతోందని తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాల కోసం కొత్తగా సీసీ రోడ్డును వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చింతల గడ్డెయ్య, బి.రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ● ప్రతిపాదన ఆపాలి నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం లింగాలవలస గ్రామ పంచాయతీ పరిధిలోని తమ ఓట్లను దరివాడ గ్రామ పంచాయతీలోకి మార్చే ప్రతిపాదనను తక్షణమే నిలిపివేయాలని లింగాలవలస గ్రామస్తులు కోరారు. గత 50 ఏళ్లుగా తాము లింగాలవలస గ్రామ పంచాయతీ పరిధిలోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాల కోసం తమ గ్రామంలోని ఓటర్లను దరివాడ గ్రామ పంచాయతీ పరిధిలోకి మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోయారు. ఈ రెండు గ్రామాల మధ్య సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉందని పేర్కొన్నారు. ఓటర్లను దరివాడకు మార్చడం వల్ల వృద్ధులు, మహిళలు, సాధారణ ఓటర్లు ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. దోబీఖానా పునరుద్ధరించాలి పాత శ్రీకాకుళం సంతోషిమాత ఆలయం ఽసమీపంలో నివసిస్తున్న సుమారు 30 రజకుల కుటుంబాలకు అక్కడ ఎప్పటినుంచో ఉన్న దోబీఖానాను పునరుద్ధరించాలని రజక కులస్తులు కోరారు. చెరువు పక్కనున్న దోబీ ఖానాలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. అలాగే చెరువులో ఆక్రమణలు తొలగించాలని విన్నవించారు. -
బలం చూపిద్దామనా.. బలి చేద్దామనా..?
● గురువుల ఆత్మగౌరవంపై సర్కారు ఒత్తిళ్ల రాజకీయం ● ఇది సరికాదంటోన్న మేధావులు, విద్యావేత్తలు కాశీబుగ్గ : గరుడఖండి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఐదుగురు టీచర్లు గాయపడ్డారు. వీళ్లేమీ విహార యాత్రకు బయల్దేరలేదు. ప్రభుత్వం బలవంతపెట్టడంతో ఆత్మగౌరవ ర్యాలీకి బయల్దేరి ఇలా క్షతగాత్రులయ్యారు. వీరు భౌతికంగా గాయపడ్డారు. సర్కారు తీరు వల్ల మానసికంగా ఇబ్బంది పడుతున్న టీచర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. డీఎస్సీ 2025లో వైఫల్యాలు, తప్పిదాలు జరిగాయంటూ ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అధికార పక్షం వాటికి ఆధారాలు చూపించి అక్రమాలు జరగలేదని నిరూపిస్తే సరిపోతుంది. కానీ టీచర్లను ఉసిగొల్పి వారితో ర్యాలీలు చేయించి రాజకీయాలకు పూనుకోవడం విద్యా వేత్తలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. గురువుల ఆత్మగౌరవంపై ఒత్తిళ్ల రాజకీయం ఉపాధ్యాయులు విద్యా బోధన మరిచి ప్రభుత్వ బలనిరూపణకు బలవుతున్నారు. డీఎస్సీ–2005 నియామక ప్రక్రియలో జరిగిన వైఫల్యాలు, తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి అధికార పార్టీ చివరికి గురువులను కూడా తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటోంది. బోధనేతర విధులతో ఇప్పటికే సతమతమవుతున్న టీచర్లను ఇప్పుడు బలవంతంగా రోడ్లపైకి లాగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఒత్తిళ్ల వలయంలో ఉపాధ్యాయులు ప్రస్తుతం విద్యా బోధన కంటే ప్రభుత్వ యాప్ల నిర్వహణలోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. డిజిటల్ అటెండెన్స్, మధ్యాహ్న భోజన నిర్వహణ వివరాల అప్ లోడ్ అంశాలతో అనుని త్యం ఒత్తిళ్ల నడుమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు తమకు మద్దతుగా ఆత్మ గౌర వ ర్యాలీలు చేయాలంటూ సర్కారు హుకుం జారీ చేస్తోంది. ఫలితంగా ఊరుకాని ఊరికి వెళ్లి ర్యాలీలకు హాజరు కావాల్సి వస్తోంది. విద్యావేత్తలు, మేధావుల ఆందోళన ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలనే ఆరాటంలో ఉపాధ్యాయులు భౌతిక, మానసికంగా తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. సమయానికి హాజరవ్వాలనే కంగారు, అధికారుల వేధింపుల భయంతో వారు ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇందుకు గరుడఖండిలో జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం. ఉపాధ్యాయులను ర్యాలీలకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం గురువుల ప్రాణాలను ఫణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని విద్యావేత్తలు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. -
ఉపాధ్యాయురాలు నీరజకు ప్రశంసలు
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని ఎ.వి.ఎన్(వరం) మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తిమ్మరాజు నీరజ ప్రతిభ కనబరిచారు. ఫిన్లాండ్ తుర్క్ యూనివర్సిటీ అంతర్జాతీయ విద్యాభివృద్ది ప్రతినిధులు సంజాయ్, సారి ఐసో క్యోటో, సువి పువోలక్క చేతులమీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు ఫిన్లాండ్లోని తుర్క్ యూనివర్సిటీలో నిర్వహించిన ఈ విజిట్లో జాయ్ అండ్ ప్లే వినూత్న పద్ధతుల ద్వారా పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్ధాయి విద్యలో వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడం, కర్క్యులం, సంస్కరణలు తదితర అంశాలను పరిశీలించినట్లు తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు విద్యాభోధనలో వారు చేస్తున్న వినూత్న పద్థతులను పరిశీలించామని నీరజ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
రైలు నుంచి జారిపడి మహిళకు గాయాలు
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస రైల్వే స్టేషన్లో ఆదివారం రైలు నుంచి జారిపడి మహిళకు గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. కోల్కతా నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఫలక్నామా ఎక్స్ప్రెస్ రైలు పలాస రైల్వే స్టేషన్కు చేరుకున్న సమయంలో అసోంకు చెందిన మహిళా ప్రయాణికురాలు అజ్మినా ఖాన్ జారిపడటంతో గాయాల పాలైంది. స్థానికులు స్పందించి 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సత్యం, వెంకటరావు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్తకు తలకొరివి పెట్టిన భార్య సంతబొమ్మాళి: భర్తను కోల్పోయిన వేళ కుమారుడు విదేశాల్లో ఉండటంతో భార్యే తలకొరివి పెట్టిన ఘటన సంతబొమ్మాళి మండలం సూరాడవానిపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సూరాడ మోహనరావు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన కుమారుడు విదేశాల్లో ఉండటంతో స్వగ్రామానికి చేరుకోలేకపోయారు. దీంతో మోహనరావు భార్యే భర్త అంత్యక్రియలను నిర్వహిస్తూ తలకొరివి పెట్టారు. మోహనరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం పరిధిలోని కొత్తరోడ్ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు...స్థానిక హడ్కో కాలనీకు చెందిన చుక్క సంతోష్ దొర (36) జూనియర్ లైన్మేన్గా విధులు నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత పనిమీద కొత్త రోడ్ జంక్షన్ వచ్చి రోడ్డు క్రాస్ చేస్తుండగా పాలకొండ నుంచి శ్రీకాకుళం వస్తున్న ఆర్టీసీ హయర్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో సంతోష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంతోష్కు భార్య కళ్యాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం పునఃప్రారంభం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం పునఃప్రారంభం సోమవారం సాయంత్రం 4:23కు నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా మీడియా సెల్ ఇన్చార్జి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ మండవల్లి రవి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు 7 రోడ్డు జంక్షన్ వద్ద మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి, టౌన్ హాల్కు చేరుకుంటామన్నారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. వేధిస్తున్న సుంకు పురుగుల బెడద సరుబుజ్జిలి: నందికొండ కాలనీకి సమీపంలో నిర్మించిన ఆంధ్ర రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిర్మించిన గోదాములు నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల సుంకు పురుగుల బెడద పెరిగిందని ప్రజలు వాపోతున్నారు. గోదాంలో నిల్వ ఉన్న బియ్యానికి పట్టిన సుంకు పురుగుల వల్ల సమీపంలో ఉన్న వైఎస్సార్ కాలనీ, నందికొండ కాలనీ నివాసం ఉంటున్న సుమారు 1456 కు టుంబాల వారు ఇబ్బందులు పడుతున్నారు. గృహాల్లోకి రాత్రి, పగలు తేడా లేకుండా పురుగులు వచ్చేస్తున్నాయి. అధికారులు తక్షణ చర్యలు చేపట్టకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు కాలనీవాసులు తెలిపారు. ఉల్లాసంగా ఆట్యా–పాట్యా జిల్లా జట్ల ఎంపికలు టెక్కలి: టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఆట్యా–పాట్యా సబ్ జూనియర్స్ క్రీడా ఎంపికల్లో బాల బాలికలు ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల బాలికలకు వేర్వేరుగా ఎంపికలు నిర్వహించారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో కర్నూలులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. -
జ్వరాల పంజా
పల్లెల్లో ..● రోజురోజుకూ విస్తరిస్తున్న జ్వరాలు ● గ్రామాల్లో క్షీణించిన పారిశుద్ధ్యం ● ఆర్ఎంపీ వైద్యులే దిక్కు సారవకోట: ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాల్లో వైరల్ జ్వరాలు విస్తరిస్తున్నాయి. పారిశుద్ధ్యం క్షీణించడం, సకాలంలో పనులు చేపట్టకపోవడం వంటి కారణాలతో జ్వరాల బారిన పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సచివాలయం స్థాయిలో పూర్తిస్థాయిలో వైద్య సేవలందించేందుకు ఎంఎల్ఏహెచ్పీ, ఏఎన్ఎంలను నియమించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టించుకునేవారు లేకపోవడంతో గ్రామస్థాయిలో వైద్య సేవలు గగనంగా మారాయి. దీంతో ప్రజలు అందుబాటులో ఉన్న ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఎంఎల్హెచ్పీలు గ్రామాలలో పర్యటించి ప్రస్తుతం వస్తున్న వ్యాధులకు సంబంధించిన సమాచారాన్ని వారి పరిధిలో ఉన్న పీహెచ్సీ వైద్యులకు సమాచారం అందజేయాలి. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని గుర్తించి వారు సంబంధిత పీహెచ్సీకి గానీ సచివాలయానికి గానీ రాలేని పక్షంలో వారి ఇంటికే వెళ్లి వైద్య సేవలందించాల్సి ఉంది. ఇప్పుడు ఇవేవీ అమలు కావడం లేదు. వివిధ రకాల వ్యాధులతో వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి పీహెచ్సీ, సీహెచ్సీలలో ఉన్న వైద్యులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు మేరకు రోగులకు వైద్య సేవలందించాల్సి ఉన్నా అవేమీ చేయకుండా సచివాలయాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పల్లెల్లో జ్వరాలు విజృంభిస్తుండటంతో సారవకోట, అలుదు, బొంతు, బుడితి తదితర గ్రామాలలో ఆర్ఎంపీ వైద్యులను రోగులు ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా కొందరు ఆర్ఎంపీలు ఇష్టానుసారంగా దండుకుంటున్నారు. ఎల్ఎన్టీ పోస్టు ఖాళీ.. సారవకోట మండల కేంద్రంలోని పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉండటంతో వైద్య పరీక్షల కోసం వచ్చే వారంతా ప్రైవేట్ ల్యాబ్లకు పరుగులు తీస్తున్నారు. మరికొందరు బొంతు పీహెచ్సీకి వెళ్తున్నారు. ఇక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్ను సంతబొమ్మాళి పీహెచ్సీకి డిప్యూటేషన్పై పంపించడంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. అదీకాక సారవకోట సచివాలయం ఏఎన్ఎం గతంలో జరిగిన సచివాలయ ఉద్యోగుల బదిలీల నుంచి ఖాళీగా ఉండటంతో గ్రామంలో జ్వరాలపై పర్యవేక్షణ కొరవడుతోంది. కొరవడిన పారిశుద్ధ్యం.. గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణిస్తోంది. దీంతో వ్యాధులను వ్యాపింపజేసే దోమలు, ఈగలు ప్రబలి వైరల్ జ్వరాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణమవుతున్నాయి. కాలువల్లో పూడికలు తొలగించకపోవడంతో మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండిపోతోంది. కొన్ని పంచాయతీలలో నిధులున్నప్పటికీ అక్కడున్న టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారు. ఫలితంగా పనుల నిర్వహణకు పంచాయతీ కార్యదర్శులు ముందుకు రావడం లేదు. అక్కరకు రాని ఫాగింగ్ యంత్రాలు: గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో దోమల నివారణకు ప్రతీ సచివాలయానికి ఫాగింగ్ యంత్రాలు మంజూరు చేశారు. ఆ యంత్రాల వినియోగం లేకపోవడంతో ప్రస్తుతం మూలకు చేరాయి. కొన్ని సచివాలయాలలో ప్యాకింగ్లు సైతం తీయకుండా ఉండటం గమనార్హం. -
సకల కళల సమాహారం..హరికథ
● సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించడంలో తోడ్పాటు ● అంతరించిపోతున్న కళను ఆదరిస్తున్న సంస్థలు ● నేడు హరికథా పితామహుడు ‘నారాయణదాసు’ జయంతి శ్రీకాకుళం కల్చరల్ : సకల కళల సమాహారంగా నిలిచే హరికథకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఒకే వ్యక్తితో సందర్భానుసారంగా హావ, భావ, రాగ, తాళ, నాట్య విన్యాసం ఆవిష్కరించడం ఈ కళ గొప్పతనం. ప్రాచీన జానపద కళారూపమైన హరికథను సంస్కరించి సామాన్యుని మనోజన హృదయ రంజకంగా తీర్చిదిద్దిన ఘనత హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసుకే దక్కుతుంది. అందుకే ఆయన హరికథా పితామహుడయ్యారు. కొన్ని గంటల సమయంలో పురాణ కథ, కీర్తనలు, పద్యం, మంజరి, తోహరా, వచనాలతో రసవత్తరమైన గాన, తాళ, భావయుక్త, పరిపూర్ణమైన మహోన్నత కథా కధనం తయారుచేసి నవరస భరితంగా ప్రదర్శించగల గంధర్వుడు ఆదిభట్ల. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టుల ద్వారా హరికథలను ఆదిరించి జీవింపచేస్తున్నారు. ఆవిధంగా హరికథ ఇప్పటికీ జనాదరణలోనే ఉంటోంది. రేడియోలలో ఇప్పటికీ హరికథకులకు ఆదరణ లభిస్తోందనే చెప్పాలి. ఈ కళకు గుర్తుగా జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో ప్రముఖ కళాభిమాని డాక్టర్ నిక్కు అప్పన్న.. నారాయణదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో హరికథకులు.. శ్రీకాకుళం జిల్లా హరికథ చరిత్రలో ఈశ్వర సత్యనారాయణ శర్మ ప్రథములు. ఈయన శర్మద రామాయణం, భక్తనందనార్, సతీసులోచన, వామన చరిత్ర, లక్ష్మీవిజయం, త్యాగరాజ, శ్రీనివాస కల్యాణం, సతీ పరిణయం రచించారు. డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు హరికథలపై పరిశోధన గ్రంథాన్ని రచించి బర్హెంపూర్ యూనివర్సిటీకీ సమర్పించి డాక్టరేట్ పొందారు. జిల్లాలో సీనియర్ భాగవతారులైన దివంగత దూసి బెనర్జీ ఇంగ్లీషులో కూడా హరికథ చెప్పగల దిట్టగా పేరుగాంచారు. బుసకల రంగారావు, యెన్ని రామం, ముగితి వెంకటనారాయణ, బొంతలకోటి యతిరాజులు, వడగ సుబ్రహ్మణ్యం, జయంతి సావిత్రి, రోణంకి మీనాక్షి, సిద్దేశుల శారదాంబ, సరోజిని, పి.వి.సత్యనారాయణ, ఎం.శివదండాసి వంటి ఎందరో భాగవతారులు కళను తమ ప్రదర్శనలతో బతికిస్తున్నారు. ఇంకా ఎందరో హరికథా గానం చేస్తూ జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. సుమిత్రా కళా సమితి ప్రోత్సాహం.. జిల్లాలో సుమిత్రా కళా సమితి నిర్వాహకులు హరికథ కళను ఆదరిస్తున్నారు. ప్రతి ఏడాది హరికథా సప్తాహం నిర్వహిస్తూ కళ కోసం కృషి చేస్తున్నారు. జిల్లా కళాకారులనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా యువ కళాకారులను తీసుకువచ్చి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 6న బాపుజీ కళామందిర్లో ప్రదర్శన ఏర్పాటు చేశారు.రంగస్థ కళాకారులు కూడా హరికథ ప్రదర్శనలను ఏర్పాటు చేస్తు కళను ఆదరిస్తున్నారు. -
వంశధారలో కాలువలో పడి యువకుడు మృతి
హిరమండలం: కుమారుడికి వివాహం జరిపించాలని ఆ తల్లిదండ్రులు భావించారు. ఇంతలోనే కాలువ రూపంలో మృత్యువు కబళించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హిరమండలంలోని చిన్నకోరాడ వీధికి చెందిన కొంకి గోవింద (37) ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి స్నానం కోసం చిన్నకోరాడ సమీపంలోని వంశధార కుడి కాలువలో దిగాడు. కొద్దిసేపటికే గల్లంతయ్యాడు. అక్కడే స్నానం చేస్తున్న స్థానికులు గమనించి గ్రామంలోకి వెళ్లి సమాచారం అందించారు. వారంతా వచ్చి కాలువలో గాలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొత్తూరు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. సాయంత్రానికి మృతదేహాన్ని బయటకు తీశారు. కుమారుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు అప్పలనరసమ్మ, దుర్గా రావు గుండెలవిసేలా రోదించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మధుసూదనరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఆస్పత్రికి తరలించారు. -
పనులు మావి.. సెల్ఫీలు మీవి
● మా హయాంలో జరిగిన అభివృద్ధిని మీ ఖాతాలో వేసుకుంటున్నారు ● ప్రభుత్వంపై మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మండిపాటు కాశీబుగ్గ: వైఎస్ జగన్ హయాంలో అనూహ్య రీతిలో అభివృద్ధి జరిగిందని, పలాస నియోజకవర్గంలో గత 50 ఏళ్ల కాలంలో చూడని పురోగతి కనిపించిందని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ ప్రాంతానికి కిడ్నీ ఆస్పత్రి వచ్చిందని, ప్రభుత్వ కాలేజీలు అవసరమైన చోట వెలిశాయని, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న రహదారి సౌకర్యం కల సాకారమైందని గుర్తు చేశారు. గత రెండేళ్ల కాలంలో పలాసలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. మేం గతంలో చేపట్టిన చోటికి వెళ్లడం, సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం మినహా ఒరిగింది శూన్యం అంటూ విరుచుకుపడ్డారు. పలాసలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు తన కుమారుడి అరెస్టు సందర్భంలో మీడియా అండగా నిలిచిందని కృతజ్ఞతలు తెలిపారు. పలాస నియోజకవర్గంలో ప్రస్తుతం మీడియాకు స్వేచ్ఛ కరువైందని, ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకానికి స్వతంత్రం ఎక్కడ లభిస్తుందని అన్నారు. పలాసలో వ్యాపారులు సైతం బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారని అన్నారు. ఇళ్లస్థలాల విషయంలో ఈ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగని పక్షంలో 2029 లో ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని సీదిరి హామీ ఇచ్చారు. రెండేళ్లయింది.. ఏం చేశారో చెప్పండి? కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయిన కాలంలో పలాస నియోజకవర్గంలో అభివృద్ధి పని ఒక్కటైనా చేపట్టారా? గతంలో మేం చేపట్టిన పనుల దగ్గరికి వెళ్లడం, ఫొటోలు దిగడం తప్ప ఏం చేశారంటూ ఎమ్మెల్యే శిరీషను మాజీ మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర చొరవ, వైఎస్ జగన్ మోహన్రెడ్డి కృషి, వీటిని మరిచిపోయి ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి ఫొటోలు దిగడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పలాస–కాశీబుగ్గ జంటపట్టణాల రూపురేఖలు మార్చామని తెలిపారు. మేం చేసింది కొండంత.. చెప్పుకున్నది గోరంత అని తెలిపారు. ఒక్కో మద్యం బాటిల్పై వెన్నుపోటు నాయకులు రూ.10మేర చిల్లర ఏరుకుంటున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే వాళ్లపై కేసులు పెడుతున్నారని సీదిరి తెలిపారు. ప్రజలు తమ సొంత కార్యకలాపాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు, పోలీస్ స్టేషన్కు వెళ్లే సందర్భంలో అక్కడి అధికారులు సమస్య ఏంటని అడగటం లేదని, వచ్చినవారిని ఏ పార్టీ అని అడుగుతున్నారని సీదిరి అన్నారు. అదే వైఎస్సార్సీపీ హయాంలో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా పార్టీ, కులం,మతం చూడకుండా ప్రజలకు మేలు చేసిన మాట వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. -
మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా ఆమదాలవలసకు చెందిన బొడ్డేపల్లి నారాయణరావు మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ చల్లా జగదీష్ను ఎన్నుకున్నారు. శ్రీకాకుళంలోని ఎన్జీవో హోమ్లోని ఆదివారం అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశంతోపాటు నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. కార్యాచరణ అధ్యక్షులుగా ఎం.భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షులుగా ఎ.ఈశ్వరరావు, కె.పద్మజ, కె.రాజారావు, బి.నిర్మల్కృష్ణ, కోశాధికారిగా ఒ.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా టి.ఆనందరావు(పురుషుల విభాగం), డి.యశోద (మహిళా విభాగం), సంయుక్త కార్యదర్శులగా కె.చిన్నమ్మడు, జె.రవికుమార్, సాంకేతిక సలహాదారుగా కేవీఎస్ మూర్తి, కార్యవర్గ సభ్యులగా మురళి, కుమారస్వామి, దాలయ్య, వసంతరావు, రామారావు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ శ్రీకాకుళంలో జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడమే లక్ష్యమన్నారు. కోడిరామ్మూర్తి స్టేడయం పనులు పూర్తయి, సరైన వసతులు సిద్ధం చేసుకుని అన్నీ అనుకూలిస్తే 2028లో నేషనల్ మీట్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘ ప్రతినిధులు, వివిద శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. -
నెల రోజుల్లో 100కు పైగా పాముకాటు కేసులు
టెక్కలి రూరల్: ఖరీఫ్ సీజన్ కావడంతో పొలాల్లో వ్యవసాయ పనులు పెరగడంతో రైతులు పాముల సంచారం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పొలాల్లో కలుపు మొక్కలు తొలగించే సమయాల్లోను, పంటకు నీరు పెట్టే సమయాల్లో రైతులు పాముకాటుకు గురవుతున్నారు. గత నెల రోజులు వ్యవధిలో టెక్కలి జిల్లా ఆస్పత్రి పరిధిలో 110 పైగా పాముకాట్లకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజులు కిందట తొలుసూరు పల్లి గ్రామంలో పాము కాటుకు గురై ఓ వృద్ధురాలు సైతం మృతి చెందింది. ప్రతి రోజు మూడుకు పైగా పా ముకాటు కేసులు ఆస్పత్రి చేరుతున్నాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పొలంలో పనులు చేసే సమయంలో ఏదైనా కరిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. చాలా మంది పాములను పట్టుకోవాలనే ప్రయత్నంలో సైతం పాముకాటులకు గురవుతున్నారని కావున విషపూరిత జీవులపై జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. -
పరిశ్రమ బూడిదతో పాట్లు
రణస్థలం: బంటుపల్లి పంచాయతీ పరిధిలో ఓ పరిశ్రమ నుంచి వెలువడుతున్న ధూళి, బూడిదతో ఇబ్బందులు పడుతున్నామని పరిసర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లటి బూడిద ఇళ్లపైన, నీళ్లలోనూ, తినే ఆహా రంలో పడుతోందని, సమీప వాణిజ్య పంటలకు సైతం నష్టం వాటిల్లుతోందని వాపోయా రు. వాహనచోదకుల కళ్లలో పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ విఫయమై కాలుష్య నియంత్రణ అధికారి కుసుమశ్రీ వద్ద ప్రస్తావించగా, గతంలో పరిశ్రమకు షోకాజ్ నోటీస్ జారీ చేశామని, మరల పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
నీట్ పీజీ పరీక్షకు
● 15 మంది గైర్హాజరు 97.85%మంది హాజరు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ–2026 (మోడ్రన్ మెడిసిన్) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పకడ్బందీగా పరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు మొత్తం 697 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వారిలో 682 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 15 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. దీంతో జిల్లాలో మొత్తం 97.85 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు అధికారులు ధ్రువీకరించారు. పరీక్షా కేంద్రాల వారీగా చూస్తే.. పరీక్ష కేంద్రాలవారీగా విద్యార్థుల హాజరును చూస్తే.. చిలకపాలెంలోని శ్రీ శివాని ఇంజినీరింగ్ కాలేజీ సెంటర్లో 270 మందికిగాను 266 మంది, ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 100 మందికి 97 మంది, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీస్లో 312 మందికిగాను 305 మంది, అలాగే టెక్కలి ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (ఐతమ్)లో 15 మందికిగాను 14 మంది అభ్యర్థులు హాజరయ్యారు. శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష, ఇతర అధికారులు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని నాలుగు కేంద్రాలైన చిలకపాలెం శివాని, శ్రీ వెంకటేశ్వర, నరసన్నపేట కోర్ టెక్నాలజీస్, టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆదివారం నిర్వహించిన నీట్–పీజీ 2026 పరీక్ష పోలీసుల పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుంండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించామని, కేంద్రాలను డ్రోన్ సర్వేలైన్స్ వినియోగించి పర్యవేక్షించామన్నారు. బందోబస్తును శ్రీకాకుళం, టెక్కలి డీఎస్పీలు సిహెచ్ వివేకానంద, డి.లక్ష్మణరావు సమక్షంలో సీఐలు ఎం.అవతారం, ఎం.శ్రీనివాసరావు, విజయ్లు తమ సిబ్బందితో కలసి నిర్వహించారు. -
ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని మహిళా కాలేజీ సమీపంలో కుమ్మరి వీధిలో ఆక్రమణల తొలగింపునకు ఒకటో పట్టణ పోలీసుల సమక్షంలో మున్సిపాలిటీ అధికారులు ఆదివారం ఉదయం యత్నించారు. చగళ్ల రమణ, మడ్డు గోవిందలకు చెందిన నివాసగృహాల మెట్లను జేసీబీ యంత్రం సాయంతో తొలగించగా ఒకేసారి స్థానికులు మూకుమ్మడిగా వచ్చి అడ్డుకున్నారు. ఇద్దరి కానిస్టేబుళ్ల మధ్య వ్యక్తిగత వైరానికి వీధి మొత్తం బలవ్వాలా? అంటూ స్థానికులు అడ్డుకోవడంతో అధికారులు యంత్రాలతో సహా వెనుదిరగాల్సివస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కుమ్మరి వీధిలో ఎదురెదురు నివసిస్తున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పొట్టూరు హరిప్రసాద్, లావేరు పీఎస్లో కానిస్టేబుల్గా ఉన్న ఎ.భారతి భర్త మాధవరావులు మూడు నెలలుగా పార్కింగ్ విషయంలో గొడవ పడుతున్నారు. పార్కింగ్ స్థలం ప్రభుత్వానిదే కావడం, రెండిళ్లకు హక్కేనంటూ గొడవపడ్డారు. ఇదే విషయమై ఎస్పీ గ్రీవెన్సులో సైతం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడం, ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఇరువైపులా బైండోవర్ కేసులు నమోదు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో సైతం ఫిర్యాదులుండటంతో అధికారుల ఆదేశాలతో ఆదివారం జేసీబీ యంత్రాలతో వీధి మొత్తం ఆక్రమణల తొలగింపునకు రావడంతో స్థానికులు తిరగబడటంతో పాటు ఉన్నతాధికారులకు విన్నవించుకోగా మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసులు వెనుదిరిగారు. -
చట్టపరంగానే ఇళ్లలోకి దిగాం
● నోటీసులు ఇచ్చినా మేము ఇళ్లు ఖాళీ చేయం ● ఈ ఇళ్ల కోసం టీడీపీ నాయకుడు డబ్బులు తీసుకున్నాడు ● కుందువానిపేటలో హుద్హుద్ ఇళ్ల లబ్ధిదారులుమేమే ఆహ్వానించాం మా గ్రామంలో హుద్హుద్ ఇళ్ల నిమిత్తం అర్హత కలిగిన ఆరుగురు మాత్రమే ఉండిపోయారు. వారి గృహప్రవేశం నిమిత్తం మేమంతా వెళ్లి గృహప్రవే శానికి రావాలంటూ మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావును ఆహ్వానించాం. అర్హులైన వారికి మాత్రమే ఇళ్లు అందించారు. నోటీసులకు భయపడే ప్రసక్తి లేదు. ఈ ఇంటిలోనే ఉంటున్నాం. – సూరాడ సూర్యం, మాజీ సర్పంచ్, కుందువానిపేట టీడీపీ నాయకుడు డబ్బులు తీసుకున్నాడు మా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సూరా డ అప్పన్న ఇంటి కోసం రూ.12వేలు తీసుకున్నాడు. మేము వైఎస్సార్ సీపీ కావడంతో మా పట్టాను ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు. మా లాంటి పేద మత్స్యకారులను ఇల్లు ఖాళీ చేయించమనడం చాలా దారుణం. – బర్రి సీతమ్మ, కుందువానిపేట గ్రీవెన్స్లో దరఖాస్తు పెట్టాం అర్హులైన మాకు పట్టాలు ఇవ్వాలంటూ దఫదఫాలుగా గ్రీవెన్స్లోనూ, హౌసింగ్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాం. కానీ ఇంతవరకూ పట్టాలు ఇవ్వలేదు. మా ఇళ్లలో మేము స్వచ్ఛందంగానే గృహప్రవేశాలు చేశాం తప్ప ఇందులో ఎవరి ఒత్తిడి లేదు. ఇప్పుడు మాకు కరెంట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. మాకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆ ఇల్లే దిక్కు. – రాయి కనకమ్మ, కుందువానిపేట శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కుందువానిపేట గ్రామంలో ఏర్పాటు చేసి న హుద్హుద్ ఇళ్లు అర్హత ప్రకారమే వచ్చాయని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని లబ్ధిదారులు తేల్చి చెప్పారు. ఈ ఇళ్ల కోసం స్థానిక టీడీపీ నాయకుడు రూ.12వేలు చొప్పున 145 మంది వద్ద డబ్బు దండేశాడని బట్టబయలు చేశారు. కాలక్రమంలో ఇందులో 21 మంది మిగిలిపోయారని, అందులో 15 మందికి స్థానిక టీడీపీ నాయ కులు ఇళ్లను కట్టబెట్టారని, ఆరుగురు వైఎ స్సార్ సీపీ సానుభూతిపరులనే కారణంతో ఇల్లు రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. కానీ ప్రభుత్వం తమ అర్హత మేరకు ఆ ఇళ్లను తమకు కేటాయించిందని, దీని కోసం టీడీపీ నాయకుడు డబ్బులు కూడా తీసుకున్నాడని లబ్ధిదారులైన బర్రి సీతమ్మ, రాయి కనకమ్మ, బుర్రి ఈశ్వరమ్మ, బర్రి లక్ష్మమ్మతో పాటు మరో ఇద్దరు గృహ ప్రవేశాలు చేశారు. ఈ గృహ ప్రవేశాలకు రావాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అప్పట్లో ఆహ్వానం ఇచ్చారు. ఈ ఆరుగురికి మాత్రమే నోటీసులు హుద్హుద్ ఇళ్లు మంజూరు చేసిన వారిలో ఈ ఆరుగురికి మాత్రమే హౌసింగ్ అధికారులు నోటీసులు ఇచ్చి ఇల్లు ఖాళీ చేయించాలని చూడడం చర్చనీయాంశమైంది. ఉన్న ఫళంగా ఇళ్లను ఖాళీ చేయాలని హుకుం జారీ చేయడం, మూడు రోజులే గడువు ఇవ్వడంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన హుద్హుద్ ఇళ్లలో గృహ ప్రవేశం చేయడం తప్పు కాదని హౌసింగ్, రెవెన్యూ అధికారులకు సైతం ఉత్తర్వులు వచ్చాయి. ఇది కోర్టు ధిక్కరణే హుద్హుద్ ఇళ్లను పేదలైన మత్స్యకారులకు అర్హత మేరకు ప్రభుత్వం మంజూరు చేసింది. స్థానిక టీడీపీ నాయకుడు కక్ష పూరితంగా ఇల్లు ఇవ్వకుండా అడ్డుకుంటూ వేరొకరికి కట్టబెట్టాలని పూనుకున్నాడు. ఇదే విషయంపై హైకోర్టులో కేసు వేశాం. ఇటీవల వచ్చిన ఉత్తర్వులు ప్రకారం అర్హత ఉన్న వారికి, ప్రభుత్వం మంజూరు చేసిన లిస్టులో ఉన్న వారికి ఇల్లు ఇవ్వడం తప్పు కాదని కోర్టు స్పష్టం చేసింది. అంతా లీగల్గానే ఇళ్లల్లో గృహప్రవేశాలు జరిగాయి. హౌసింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారు లు బలవంతంగా ఇల్లు ఖాళీ చేయిస్తే కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. – అంబటి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు -
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
శ్రీకాకుళం రూరల్: రాగోలు పంచాయతీ రాయిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు పొలాల్లోకి దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. నేరుగా పొలాల్లోకి దూసుకుపోయినప్పటికీ ఎవరికీ ఎటువంటి నష్టం కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కారును ఢీకొట్టిన లారీ రణస్థలం: శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆదివారం సాయంత్రం రణస్థలం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ కూడలి వద్ద జరిగిన ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న ముగ్గురూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జె.ఆర్.పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు పెట్టి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. నేత్రదానంపై అవగాహన ర్యాలీ శ్రీకాకుళం అర్బన్/శ్రీకాకుళం కల్చరల్: జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్వహిస్తున్న ‘41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు‘ సందర్భంగా 80 ఫీట్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నేత్రదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆప్తాలమిక్ అధికారి ఎంఆర్కే దాస్ వాకర్లకు నేత్రదానం – కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అనంతరం క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వైశ్యరాజు తిరుమలరాజు, పొట్నూరు మాధవరావుల పిలుపుమేరకు 30 మంది వాకర్ల కుటుంబ సభ్యులకు దాస్ అవగాహన కల్పించారు. మరణానంతరం నేత్రదానం చేస్తామని ప్రతిజ్ఞ పత్రాలు అందజేశారు. -
ఆదిత్యాలయానికి పోటెత్తిన భక్తజనం
● ఆన్లైన్ టికెట్లలో సాంకేతిక లోపంతో ఇక్కట్లు అరసవల్లి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. శ్రావణ మాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాదాలు, మంచినీటి సౌకర్యాలను కల్పించారు. రూ.300 చెల్లించిన భక్తులకు అంతరాలయంలో గోత్రనామాలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో భక్తులకు ఆదివారం ఉదయం 5.30 గంటల నుంచి సర్వదర్శనాలను కల్పించారు. ఆరోగ్యం కోసం రూ.300 చెల్లించి సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. ఈఓకు ఫిర్యాదులు.. ప్రసాదాల పంపిణీ వద్ద ఆన్లైన్ సమస్య తలెత్తడంతో కొందరికి విక్రయాలు సాధ్యం కాలేదు. కేశఖండన శాలలో ఎప్పట్లాగే అక్రమ వసూళ్లు వ్యవహారం తలెత్తింది. టికెట్ల సొమ్ము కంటే అదనంగా డబ్బులు అడుగుతున్నారంటూ కొందరు భక్తులు ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల పట్ల గౌరవంగా ప్రవర్తించకుండా రెగ్యులర్ ఉద్యోగులు సైతం నోరుపారేసుకుంటూ అవమాన పరుస్తున్నారంటూ ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఈవోకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ అవస్థలు..! దేవదాయశాఖ ఆన్లైన్ విధానంలో ఇటీవల మార్పులు చేపడుతున్న క్రమంలో అరసవల్లి ఆలయంలో ఆన్లైన్ విధానంలో సమస్యలు తలెత్తాయి. వివిధ దర్శనాల టికెట్లతో పాటు ఇతరత్రా సౌకర్యాల కల్పనకు ఆలయ ఆన్లైన్ వ్యవస్థ ద్వారానే భభక్తులకు సేవలందిస్తున్నారు. అయితే టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (టీఎంఎస్) ఆన్లైన్ పోర్టల్లో మార్పులు కారణంగా స్థానికంగా ఆలయంలో ఆన్లైన్ పనులన్నీ నిలిచిపోయాయి. దీంతో విరాళాల రశీదులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఆన్లైన్ టిక్కెట్లు ఆగిపోవడంతో మాన్యువల్గా ఇచ్చిన టికెట్లు, టైం స్లాట్ ఆలస్యమైన టికెట్లతో దర్శనాలకు వెళ్లిన వారు కూడా సిబ్బంది చేష్టలతో ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఈఓ స్పందిస్తూ సాంకేతిక లోపంతో ఆలస్యమయ్యాయని, నకిలీ టికెట్లు కావంటూ ధ్రువీరించారు. ఆన్లైన్ సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
ఆపద వేళ అండగా నిలిచారు
కాశీబుగ్గ: ‘అక్రమ అరెస్టులతో నన్ను, నా కుమారుడిని జైలుకు పంపిన సందర్భంలో అహర్నిశలు శ్రమించారు. రేయింబవళ్లు 50 మంది చొప్పున డ్యూటీలు వేసుకుని మరీ నాతో ఉన్నారు. జైలుకు పంపినప్పుడు అండగా మేమున్నామంటూ మహిళలు సైతం ధైర్యంతో ముందుకొచ్చారు. కంటికి రెప్పలా కాచుకున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి మారుమూల గ్రామంలోని కార్యకర్త వరకు మద్దతుగా నిలిచారు.’ అంటూ మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. కక్ష పూరిత రాజకీయాలకు మనం పోవ ద్దని, ఓర్పుతో ప్రజల్లోకి వెళ్దామని పిలుపునిచ్చారు. ఆయన శనివారం తన స్వగృహంలో పార్టీ కార్యకర్తలతో జరిగిన కృతజ్ఞత సభలో మాట్లాడారు. అనుకోని ప్రమాదానికి తనతోపాటు కుమారుడిని అక్రమంగా జైలుకు పంపి, నియోజకవర్గ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలనే వెన్నుపోటు పార్టీ కుట్రలను కార్యకర్తలు ఐకమత్యంగా తిప్పికొట్టిన తీరు మరువలేనిదని ప్రశంసించారు. ఈ ఘటనతో కార్యకర్తల క్రమశిక్షణ, నిబద్ధత ఎలాంటిదో మరోసారి రుజువైందన్నారు. ఎమ్మెల్యేకు థాంక్స్ ‘నా అక్రమ అరెస్టుతో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు కదిలివచ్చారు. ఆయన రాకతో ఈ ప్రాంతం ఆ రోజు ప్రజా ప్రభంజనాన్ని చూసింది. ఈ విధంగా అన్యాయమైన చర్యలకు పాల్పడి ఓ విధంగా వెన్నుపోటు పార్టీ ఎమ్మెల్యే శిరీష మంచి పనే చేశారు. అందుకు ఆమెకు కృతజ్ఞతలు’ అంటూ సీదిరి చురకలు అంటించారు. ఆ సమయంలోనూ జిల్లాలో పార్టీకి చెందిన నాయకులపై అక్రమ కేసులు బనాయించారని, చింతాడ రవిని బంధించారని, 27మందిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. తాజాగా అల్లు వెంకటరమణను ఏ4 ముద్దాయిగా జైలుకు పంపారని, పేరాడ తిలక్ను మెళియాపుట్టి తీసుకెళ్లి నిర్బంధించారని, ఎన్ని చేసినా తొణకని స్థైర్యం వైఎస్సార్ సీపీ కార్యకర్త నైజమని సీదిరి స్పష్టం చేశారు. స్థానికంలో సత్తా చాటుదాం ప్రస్తుతం ప్రజలు చీకటి పాలన చూస్తున్నారని, పాలనపై ప్రజలు విసిగిపోయారని, మరో రెండున్నరేళ్ల కాలం తర్వాత ప్రతి కార్యకర్త గౌరవంగా బతికే రోజు వస్తుందన్నారు. స్థానిక సంస్థలు ఎప్పుడు వస్తాయా? పాలకులకు తగిన బుద్ధి చెబుదామా అంటూ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపిద్దాం. అధినేతకు బహుమానంగా ఇద్దాం.. అంటూ సీదిరి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు ఎన్ని ధనుంజయరావు, హనుమంతు వెంకటరావు, ఉదయ్ కుమార్, పాలిన శ్రీనివాసరావు, ఉంగ సాయి,శిష్టు గోపీ, బమ్మిడి దుర్యో ధన, భాస్కరరెడ్డి, బి.చంద్రకళ, హేమంత్ కుమార్, కంచరాన చినబాబు, బోర బుజ్జి, తమ్మినాన శాంతారా వు, బి.హేమేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. ‘సార్.. మీరు ముందుండి నడిపించండి. అన్యాయంగా అరెస్టు చేశారన్నది ప్రజలందరికీ తెలు సు. విద్యార్థులు, రాజకీయ విశ్లేషకులు, ఉద్యోగులు అందరూ మీ అరెస్టును వ్యతిరేకించారు. చివరికి న్యాయమే గెలిచింది. స్వచ్ఛంగా తిరిగి వచ్చారు. మీరే మా ఽధైర్యం. కాలం ఒకేలా ఉండదు. మనం మంచే చేశాం. ఇలాంటి తాటాకు చప్పుళ్లు మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీరే మా ధైర్యం.. ఆ స్థైర్యంతో మమ్మల్ని నడిపించండి. రానున్న స్థానిక ఎన్నికలలో ఫ్యాన్ ప్రభంజనం ఎలా ఉంటుందో చూపిస్తాం. ఆ గెలుపు ప్రేరణతో 2029లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా, మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తాం’ అంటూ మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఎదుట పార్టీ నాయ కులు, కార్యకర్తలు ముక్తకంఠంతో నినదించా రు. సభలో సీదిరి అప్పలరాజును సార్ అంటూ కార్యకర్తలు అభివర్ణించారు. ఇంతకీ ‘సార్’ అంటే సీదిరిలో తొలి అక్షరం ఎస్, అప్పలరాజును ఏఆర్గా వెరసి ఎస్ఏఆర్ అంటూ పిలవడంతో అందరి మోముల్లో నవ్వులు పూశాయి. -
చిరు తిండి.. ప్రాణాంతకమండి!
బడికి వెళ్లడానికి ఓ చిప్స్ ప్యాకెట్.. ఇంటర్వెల్లో తినేందుకు ఓ చాక్లెట్.. మధ్యాహ్న భోజనం అయ్యాక మరో ప్యాకెట్.. ఓ రెండు పీరియడ్ల తర్వాత వచ్చే ఇంటర్వెల్లో పంటి కిందకు బిస్కెట్ ప్యాకెట్.. మళ్లీ ఇంటికి వచ్చాక ఇంకా ఏవేవో. సగటు విద్యార్థి ఒక రోజుకు తినే చిరు తిండి ఆ విద్యార్థి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రంగురంగుల ప్యాకెట్లు మార్కెట్ను ముంచెత్తుతుండడంతో వాటికి ఆకర్షితులై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొరవడిన అధికారుల పర్యవేక్షణ చిన్నారుల ప్రాణాంతకంగా మారుతోంది. ● మార్కెట్లో నాసిరకం చిరుతిళ్లు ● చిన్నారుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం ● కొరవడిన అధికారుల పర్యవేక్షణ వజ్రపుకొత్తూరు రూరల్, సారవకోట: చిరు తిండి పిల్లలకు అనారోగ్యం తెచ్చి పెడు తోంది. ఒకప్పుడు చిరుతిండి అంటే ఇంట్లో చేసుకు నే పిండి వంటలైన చుప్పులు, జంతికలు, అరిసె లు, చేగొడియాలు తినేవారు. ఇప్పుడు మాత్రం బయట దుకాణాల్లో విక్రయించే రంగు రంగుల చి ప్స్ ప్యాకెట్లు, చాక్లెట్స్, ఐస్ స్టిక్స్, కలర్ క్యాండీలు, కూల్డ్రింక్స్, కేక్లు అంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇవి కంటికి అందంగా, నోటికి రుచికరంగా ఉన్నా అవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కొన్నయితే ఏకంగా పిల్లల శరీర అవయవాలపై ప్రభావం చూపిస్తాయంటే అతిశయోక్తి కాదు. పాఠశాలలు, పలు కూడళ్లలో ఉన్న దుకాణాల్లో విక్రయించే తిను బండారాల నాణ్యతపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ చిరుతిళ్లకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నది చిన్నారులే. వైద్యుల అభిప్రాయం ప్రకారం అధిక మోతాదులో కృత్రిమ రంగులు, రసాయనాలు, చక్కెర, ఉప్పు కలిగిన ఆహార పదార్థాలతో పాటు కాలం చెల్లిన ఆహార పదార్థాలు తరచూ తీసుకోవ డం వల్ల జీర్ణకోశ సమస్యలు, ఊబకాయం, పోషకాహార లోపం, ఏకాగ్రత తగ్గడం, దంత క్షయం, ఫుడ్ పాయిజనింగ్, కేన్సర్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రంగు రంగుల ప్యాకెట్లలో బ్రాండెడ్ కానివే అధికంగా ఉన్నాయి. ప్యాకెట్ ఆకర్షణీయంగా తయారుచేసి విక్రయిస్తుండడంతో పిల్లలు, తల్లిదండ్రులు మోసపోతున్నారు. బ్రాండెడ్ కాని ఈ తినుబండారాలు పక్కనున్న ఒడిశా రాష్ట్రం నుంచి దళారులు కొనుగోలు చేసి గ్రామాల్లో విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీ వారి తినుబండారాలు అమ్మితే ప్యాకెట్కు 50 పైసలు మాత్రమే కమీషన్ వస్తుంది. అదే లోకల్లో తయారు చేసే అన్బ్రాండెడ్ తినుబండారాలు విక్రయిస్తే ప్యాకెట్కు రూ పాయికి పైనే కమీషన్ వస్తుంది. దీంతో వ్యాపారులు నాసిరకం చిరుతిళ్లు కొనేసి విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. విచ్చలవిడిగా అమ్ముతున్న నాసి రకం తినుబండారాలను అరికట్టేందుకు అధికారుల తనిఖీలు నామమాత్రంగా ఉన్నాయి. ఆహార తనిఖీలు, పంచాయతీ తూనికలు, కొలతల శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వీటి అమ్మకాలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు ప్రకారం పాఠశాలల లోపల గానీ, పాఠశాలకు 50 మీటర్ల పరిధి లో గానీ ఎలాంటి జంక్ ఫుడ్స్, కూల్డ్రింక్స్, ఇతర హానికరమైన తినుబండారాలు అమ్మకూడదు. ఈ నిబంధనలను ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కఠినంగా అమలు చేస్తున్నాయి. మన వద్ద మాత్రం యథేచ్ఛగా అమ్ముతున్నారు. జంక్ ఫుడ్కు అంతా దూరంగా ఉండాలి. రుచి, ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వివిధ రకాల రసాయనా లు, రంగులు వాడుతుంటారు. అలాంటి చిరుతిళ్లు తీసుకోవడం వల్ల పిల్లల్లో కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇదే కొనసాగితే అసిడీటీ, జీర్ణకోశం, పేగు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. – సుధారాణి, వైద్యులు, సారవకోట పీహెచ్సీ రంగులు, రుచులకు అలవా టు పడితే ప్రమాదం తప్ప దు. మంచి ఆరోగ్యం కోసం పౌష్టికాహారం, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. హానికరమైన జంక్ అండ్ ఆయిల్ ఫుడ్కు దూరంగా ఉండాలి. – కాస మనోహర్, అనస్థీషియా, ఇంటెన్సివ్ కేర్ నిపుణులు, వైద్యాధికారి, పలాస సీహెచ్సీ -
విచారణకు తమ్మినేని దంపతులు
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం రూరల్ పోలీస్స్టేషన్లో విచారణకు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిలు శనివారం హాజరయ్యారు. ఒక ల్యాండ్ కేసు విషయమై ఇద్దరూ హాజరైనట్లు రూరల్ ఎస్ఐ సురేష్ తెలిపారు. ఇచ్ఛాపురం రూరల్: ఆంధ్ర విశ్వకళా పరిషత్ తెలుగు శాఖ విద్యార్థిని, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామమైన జయంతిపురానికి చెందిన గిరిజన యువతి కిల్లో సరోజిని యూజీసీ–నెట్ జూన్–2026 ఫలితాల్లో సత్తా చాటారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతతో పాటు ప్రతిష్టాత్మక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) సాధించి జాతీయ స్థాయిలో ఘనత సాధించినట్లు ఆమె సోదరుడు, శాసనాం ఉన్న త పాఠశాల స్కూల్ అసిస్టెంట్ బొమ్మిడి ఢిల్లేష్ శనివారం తెలిపారు. తన విజయానికి తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, ఆచా ర్యులు వెలమల సిమ్మన్న, పరిశోధకుడు, సోదరుడు బొబ్మిడి ఢిల్లేష్ అందించిన మార్గదర్వకత్వం, ప్రోత్సాహమే కారణమని సరోజిని తెలిపారు. కవిటి: మండల పరిధిలోని జాడుపుడి ఆర్ఎస్, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు శనివారం గుర్తించారు. మృతుడు ఎరుపు రంగు టీషర్ట్, నీలంరంగు నైట్ప్యాంట్ ధరించి ఉన్నట్లు వెల్లడించారు. అతని చేతిపై ఇంగ్లిష్లో జయదేబ్ అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉందన్నారు. మృతదేహాన్ని గుర్తించినవారు పలాస రైల్వే పోలీ సు ఎస్ఐ డి.శ్రీనివాసరావు(92475 85743) ను సంప్రదించాలని కోరారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: పెండింగ్లో ఉన్న నోటీసులను సత్వరమే పూర్తి చేయాలని అదనపు ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి శేనాపతి ఢిల్లీరావు తెలిపారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లతో కలసి ఆయన ప్రత్యేక జాబితా సవరణపై సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక జాబితా సవరణపై కలెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గల ఎనిమిది నియోజకవర్గాల్లో నోటీసుల పంపిణీ పూర్తయ్యిందా లేదా అని ప్రశ్నించగా పంపిణీ పూర్తయ్యిందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో మ్యాపింగ్ కాని వివరాలను, ఫార్మ్ 6, 7, 8ల గూర్చి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 93,457 విచారణ జరిగాయని, 7184 పెండింగ్లో ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. బందరువానిపేట బీఎల్ఓ రమేష్ మాట్లాడుతూ 150 మంది మత్స్యకార ఓటర్లు జాబితాలో నమోదు కాలేదని, మత్స్యకారులు సముద్రంలో వేటనిమిత్తం వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లినట్లు చెప్పగా మత్స్యకారులు సముద్రంలో ఉన్నప్పుడు వర్చ్వుల్గా నమోదు చేయవచ్చని అదనపు సీఈఓ చెప్పారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: గిరిజనుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం కలెక్టరేట్లో చెంచు తెగకు సంబంధించిన జిల్లా సంఘం ఉన్నతి సభ్యులకు సున్నా వడ్డీతో బ్యాంక్ లింకేజ్ రుణం రూ.8 లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శిక్షణ కలెక్టర్ హరి ఓం పాండ్య తదితరులు పాల్గొన్నారు. -
టీచర్లకు టెట్ రద్దు చేయాలని బైక్ ర్యాలీ
పాతపట్నం: ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాల ని, పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమాకం చేపట్టి, వెంటనే 29 శాతం ఐఆర్ ప్రకటించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు లండ బాబూరా వు, మజ్జి వెంకటరమణలు డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మార్కెట్ మీదుగా ఆల్ఆంధ్రరోడ్డు, ఆస్పత్రి కూడలి మీదుగా అంబేడ్కర్ జంక్షన్ వరకు ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఉద్యో గ, ఉపాధ్యాయులకు బకాయి పడిన ఐదు డీఏల ను ప్రకటించాలని, 40 వేల కోట్ల ఆర్థిక బకాయిల ను విడుదల చేయాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అభినందనలు
శ్రీకాకుళం న్యూకాలనీ: క్రీడల్లో జిల్లా జట్లకు ఎంపిక కావడమే కాకుండా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో 2025 –26 విద్యా సంవత్సరంలో విద్యార్థులు సాధించిన ప్రగతి, ఫలితాలు ఆధారంగా మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ మేరకు జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ఆయా పాఠశాలల హెచ్ఎంలు, అక్కడి వ్యాయామ ఉపాధ్యాయులను శనివారం సత్కరించారు. జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, జిల్లా పీడీ–పీఈటీ సంఘ కోశాధికారి కె.మాధవరావు, జిల్లా గ్రిగ్స్ సెక్రటరీ టి.శ్రీనివాసరావు, ఎస్జీఎఫ్ కార్యదర్శులు బీవీ రమణ, ఆర్.స్వాతి తదితరులు పాల్గొన్నారు. మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన పాఠశాలలు ఇప్పిలి జెడ్పీహెచ్ స్కూల్, శాస్త్రులపేట ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ స్కూల్, మాణిక్యపురం జెడ్పీహెచ్ స్కూల్, నరసన్నపేట జీహెచ్ స్కూల్, సింగుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. -
లీగల్ ఎయిడ్ క్లినిక్ల పరిశీలన
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా లీగల్ ఎయిడ్ క్లినిక్ల తనిఖీల్లో భాగంగా శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు జిల్లా కేంద్రంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం 12.30 గంటలకు శ్రీకాకుళంలోని ఆర్డీఓ కార్యాలయం నందు గల లీగల్ ఎయిడ్ క్లినిక్ను సందర్శించారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రశాంతి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ ను సందర్శించారు. నమోదైన కేసుల వివరాలు, ప్యానెల్ న్యాయవాది, పారా లీగల్ వలంటీర్లు నిర్వహిస్తున్న సేవలను, రిజిస్టర్ నిర్వహణను పరిశీలించారు. క్లినిక్కు వచ్చిన అభ్యర్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఆర్డీఓ ఆఫీస్ క్లినిక్లో రెవెన్యూ సంబంధిత సమస్యలు, భూ వివాదాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జాప్యంపై వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ప్యానెల్ న్యాయవాదికి, పారా లీగల్ వలంటీర్లకు సూచించారు. వృద్ధులకు ఉచిత న్యాయ సహాయం, సీనియర్ సిటిజన్ల హక్కుల చట్టం–2007 పై అవగాహన కల్పించారు. ప్రజలు న్యాయ సహాయం కోసం 15100 టోల్ ఫ్రీ నంబర్ను లేదా జిల్లా కోర్టు కాంప్లెక్స్ లోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు అని ఆయన తెలిపారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ న్యాయవాది అన్నెపు భువనేశ్వర రావు, జ్యోతి, లీగల్ వాలంటీర్లు, ఆర్డీఓ కుమారి సాయి ప్రత్యూష, ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు పాల్గొన్నారు. -
సాంకేతిక నైపుణ్యాలతో ఉపాధి అవకాశాలు
● సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ సాంబశివరావు ● టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో పారిశ్రామిక సదస్సు టెక్కలి: విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే విస్తారమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ జి.సాంబశివరావుతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం పారిశ్రామిక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థికి కష్టపడేతత్వం ఉండాలని ఆకాంక్షించారు. పరిశ్రమల్లో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్ మేనేజింగ్ డైరక్టర్ డి.రామకృష్ణ మాట్లాడుతూ.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను సద్వినియోగం చేసుకునే ప్రతీ విద్యార్థికి మంచి వేతనాలతో ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎల్అండ్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సి.జయకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని సూచించారు. పట్టుదల, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా రాణిస్తారని వెల్లడించారు. నిర్మాణ రంగంలో ప్రస్తుతం విస్తారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రపంచం ఏఐ వైపు అడుగులు బ్రైట్కాన్ చీఫ్ టెక్నికల్ అధికారి సీహెచ్ సోమేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం ఏఐ వైపు అడుగులు వేస్తోందన్నారు. ప్రతీ రంగంలో ఏఐ ఒక ప్రత్యక స్థానం సంపాదించుకుందని తెలిపారు. ఏఐలో మెలకువలు నేర్చుకున్న విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం కళాశాల డైరక్టర్ వీవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లేవిధంగా సరైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి పారిశ్రామిక సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా సుమారు 50 బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వివిధ కంపెనీలతో ఒప్పంద పత్రాలను పుచ్చుకున్నారు. కార్యక్రమంలో కేవీఎం గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కె.నారాయణరావు, కళాశాల కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ప్రిన్సిపాల్ ఏఎస్ శ్రీనివాసరావు, ఇండస్ట్రీయల్ రిలేషన్ డీన్ బి.రాజేష్, ప్లేస్మెంట్ డీన్ ఎం.సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ చేనేత పురస్కార గ్రహీతకు సన్మానం
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని అలి కాం గ్రామానికి చెందిన చేనేత మాస్టర్ మురకల నటరాజ్ ప్రతిష్టాత్మకమైన జాతీయ చేనేత పురస్కారాన్ని ఢిల్లీలో అందుకున్నారు. దీంతో శనివారం పెదపాడులోని ధర్మాన క్యాంప్ కా ర్యాలయంలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్లు కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయిలో జిల్లా చేనేత రంగానికి గుర్తింపు తీసు కురా వడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అంబటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.టెక్కలి: తమ ప్రాంతంలో హానికరమైన రసాయన పరిశ్రమల పార్కులకు ఎలాంటి భూములిచ్చేది లేదంటూ సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర పంచాయతీ ప్రజలు ఏకగ్రీవంగా స్పష్టం చేశారు. ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి నేతృత్వంలో శనివారం వడ్డితాండ్ర లో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు, ప్రజలు మాట్లాడుతూ కెమికల్ పార్కుల వల్ల తమ జీవనోపాధి పూర్తిగా కోల్పోతామని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పరిశ్రమలకు అంగీకరించేది లేదని వెల్లడించారు. కెమికల్స్ పార్కులకు సుమారు మూడు వేల ఎకరాల భూములు అవసరమని, దీనికి ఒక్క వడ్డితాండ్ర పంచాయతీలో 500 ఎ కరాలు భూసేకరణ అవసరమని అధికారులు పేర్కొన్నారు. దీని పై రైతులు, ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. రైతులు, మత్స్యకారులు, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసే కెమిక ల్స్ పరిశ్రమలు కాకుండా అందరికీ ఆమోదయోగ్య మైన పరిశ్రమలు వస్తే తమ ఆలోచన చెబుతామని స్థానికులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ హేమసుందర రావుతో పాటు వడ్డితాండ్ర పంచాయతీ పరిధిలో రైతులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. సంతబొమ్మాళి: సీతానగరం గ్రామంలో తాగునీటి పైపులైన్ పనులను మహిళలు శనివారం అడ్డుకున్నారు. మూలపేట పోర్టు ఆర్అండ్ఆర్ కాలనీకి సీతానగరం గ్రామం మీదుగా తాగునీటి పైపులైన్లు వేస్తుండగా మహిళలు పనులను నిలిపివేశారు. తామే రెండేళ్లుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తాగునీరు అందించకుండా మా గ్రామం మీదుగా పైపులైన్లు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ పైపులైన్ ద్వారా తమకు కూడా తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు నీటి సౌకర్యం కల్పించే వరకు పనులు జరగనివ్వబోమని భీష్మించారు.దీంతో కొద్దిసేపు పనులు నిలిచిపోయాయి. ఓ జనసే న కార్యకర్త వచ్చి మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. అంతా కలిసి అతడిపై మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళలతో మాట్లాడి పనులు కొనసాగించారు. -
పసిడి కోసం పాశవికం..!
పసిడి మెరుపు నేరగాళ్ల కళ్లను కప్పేస్తోంది. బంగారం కనిపిస్తే చాలు దోచుకునేందుకు ఎంతకై నా తెగిస్తున్నారు. సులభంగా సొమ్ము చేసుకోవాలనే దురాశతో చోరీలు, దోపిడీలకు పాల్పడడమే కాకుండా.. అవసరమైతే హత్యలకు కూడా వెనుకాడడం లేదు. కొన్నిసార్లు నమ్మకస్తులు సైతం బరితెగిస్తున్నారు. ఆప్తులుగా మెలుగుతూ అదునుచూసి బంగారంపై కన్నేస్తున్నారు. ఇలా పసిడి చుట్టూ పెరుగుతున్న నేరాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. శ్రీకాకుళం క్రైమ్: జిల్లాలో బంగారం నేరాలు సామాన్య ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏ క్షణాన గుర్తు తెలియని అగంతకులు షాపులు, ఇళ్లల్లో నగలు దోచేందుకు చొరబడతారో.. అడ్డుపడితే ఎక్కడ మారణాయుధాలతో దాడికి తెగబడి ప్రాణాలు తీస్తారోనని ఆందోళన చెందుతున్నారు. బంగారం ధర పెరగడంతో అత్యాశతో అత్యంత నమ్మకస్తులు సైతం సొంతమనుకున్నవారినే మట్టుబెడుతున్నారు. దీంతో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సైతం ప్రాపర్టీ నేరాలపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారనడానికి ఇటీవల చాలా కేసుల్లో పురోగతి లేకపోవడమే నిదర్శనంగా చెప్పవచ్చు. నెలలు, ఏళ్లు గడుస్తున్నా భారీ చోరీల్లో సొత్తు రికవరీ చేయకపోవడమే కాకుండా.. నేరం చేసి క్షణాల్లో దాటేస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తులను పట్టుకోవడంలో చతికిలపడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన పట్టపగలు కాశీబుగ్గ వేంకటేశ్వర జ్యూయలర్స్లో వృద్ధుడైన యజమానికి బేడీలు వేసి గన్ నెత్తిన పెట్టి బెదిరించిన ఒడిశా, యూపీ డెకాయిట్లు 800 గ్రాముల బంగారంతో పాటు కొంత నగదును తీసుకొని సినీ ఫక్కీలో రాష్ట్రాలు దాటేశారు. అక్కడికి దాదాపు నెలరోజులకు ఒడిశాకు చెందిన ఐదుగురు డెకాయిట్ల దగ్గర 243 గ్రాముల బంగారాన్నే స్వాధీనం చేసుకున్నారు తప్ప, భయంకర యూపీ గ్యాంగ్ను పట్టుకోకపోవడంతో 557 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకోలేకపోయారు. 260 పెండింగ్ కేసులున్న కాశీబుగ్గ జిల్లాలోనే క్రైమ్రేట్లో ప్రథమ స్థానంలో ఉంది. దీనికి తోడు రాజకీయ కేసుల జోక్యం అదనం కావడం, అది పోలీసులపై ఒత్తిడిగా మారి తమ జాబ్లు కాపాడుకోవడానికే టైం సరిపోతుందని ఇక్కడి పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారంటే ఏ స్థితిలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ●గత నెల 23న మడపాం పంచాయతీ కొత్తపేటకు చెందిన వ్యాపారి జామి నర్సింగరావు భార్యకు శస్త్ర చికిత్స నిమిత్తం విశాఖ వెళ్లి తిరిగి 28న వచ్చి చూసేసరికి ఇంట్లో 56 తులాల బంగారం పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 29న 34 తులాలు పోయిందని పోలీసులు కేసైతే నమోదు చేశారు గానీ గ్యాంగ్ ట్రేస్ అవ్వలేదు. ●ఈ ఏడాది ఆరంభంలో వజ్రపుకొత్తూరు మండలం పూండి–గోవిందపురంలో పంచాయతీ కార్యదర్శి ఇంట్లో 75 తులాల వెండి, ఐదున్నర తులాల బంగారం, నగదు రూ.90 వేలు దోచుకుపోగా, ఇదే పూండిలో రవికుమార్కు చెందిన బంగారం షాపులో దాదాపు 20 తులాల బంగారం మధ్యప్రదేశ్కు చెందిన ముఠా పట్టుకుపోయారు. అక్కడికి కొద్దిరోజుల్లోనే రవికుమార్ భార్య మెడలోంచి చైన్ తెంచుకొని పరారయ్యారు. ఇప్పటికీ ఈ ముఠా జాడ లేదు, సొత్తు రికవరీ కాలేదు. ●నరసన్నపేట ఇందిరానగర్లోని ఓ డెంటిస్ట్ ఇంట్లో దాదాపు 109 తులాలు చోరీకి గురై రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ పూర్తిగా రికవరీ కాలేదు. బీహార్ గ్యాంగ్లో కొందరిని పట్టుకున్నా వారిలో సూత్రధా రి పరారీలో ఉన్నారన్న కారణంతో 2 తులాలే రికవరీ చూపించడం, ఇప్పటికీ నిందితులను పట్టుకోకపోవడం పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. పెరుగుతున్న బంగారం ధరలు మానవత్వాన్ని మరిచేలా చేస్తున్నాయి. అత్యంత నమ్మకస్తులే బంగారం కోసం దాడులు, హత్యలు చేస్తుండడం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ఎవరిని నమ్మాలో తెలియడం లేదని ప్రజలు, షాపుల యజమానులు వాపోతున్నారు. అలాంటివి కొన్ని ఘటనలు పరిశీలిస్తే... ●మందస మండలం వీరభద్రలో గత నెల 31న తల్లిదండ్రులతో విభేదాలున్న కొడుకు వివేక్ మరో ముగ్గురిని సుపారీకి మాట్లాడి ముసుగు దాడి చేయడమే కాకుండా.. తల్లి మెడలోని బంగారు గొలుసు ఎత్తుకుపోయాడు. ●నరసన్నపేటలో ఏడాదిన్నరలోపే బంగారం దోచేందుకు అత్యంత నమ్మకస్తులు ముగ్గురిని హత్య చేశారు. గతేడాది ఆగస్టు 26న వ్యాపారి గుప్తాతో పాటు బంగారాన్ని తెచ్చేందుకు వెళ్లిన కారు డ్రైవర్ పెద్దపాడు మార్గమధ్యలో మరికొందరితో కలిసి హత్య చేసి భారీ మొత్తంలో బంగారాన్ని దోచేసి పోలీసులకు చిక్కాడు. గతేడాది మార్చి 2న కేవిటి గున్నమ్మ అనే వృద్ధురాలిని అతి కిరాతకంగా చంపి బంగారాన్ని దోచుకుని పారిపోయారు. తాజాగా చిన్నమ్మడును చంపి భారీ మొత్తంలో బంగారాన్ని దోచుకున్నారు. ●గతేడాది డిసెంబర్ 1న లావేరు మండలం మురపాకకు చెందిన వృద్ధురాలు వడ్డీ పార్వతి చెవి, ముక్కు కోసి కాల్చి పాడుబడిన బావిలో శవాన్ని పడేసి బంగారం దోచుకుపోయారు. ఈ కేసు ఇప్పటికీ తేలలేదు. సొంత కుటుంబీకులే హత్య చేశారన్న వార్తలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ●శ్రీకాకుళం నగరంలోని బాలాజీ నగర్లో వృద్ధురాలి మెడపై కత్తిని పెట్టి చంపుతానని బెదిరించి బంగారు తాడును పట్టుకుపోగా, న్యూకాలనీలో కళావతిని నగలు కోసమే పరిచయస్తుడు హత్య చేశాడు. బంగారు ఆభరణాలు ధరించి వెళ్లే సమయంలో మహిళలు ముఖ్యంగా వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నది ముందుగానే కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. అవసరం లేకున్నా భారీగా ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళ్లరాదు. కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన వ్యక్తులతో కలిసి వెళ్లాలి. బంగారం ధరలు అధికంగా పెరగడంతో మనకు పరిచయం ఉన్నవారినుంచే ముప్పు వాటిళ్లుతోంది. గతంతో పోల్చుకుంటే 2024 నుంచి ఇప్పటివరకు రికవరీ శాతం బాగా పెంచాం. భారీ చోరీలను ఛేదిస్తున్నాం. మరింత కష్టపడి రికవరీ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తాం. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం -
రెచ్చిపోయిన దొంగలు
సోంపేట: మండలంలో పలాసపురం గ్రామంలోని బెందాళం రాజశేఖర్ ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే అదే గ్రామంలో నౌపడ నారాయణకు చెందిన సెలూన్ షాప్ వద్ద ఉంచిన టీవీఎస్ ఎక్స్ఎల్ ద్విచక్ర వాహనం సైతం చోరీకి గురైంది. సోంపేట సీఐ బి.మంగరాజు, ఎస్ఐ బి.మోహిని, క్లూస్ టీం సంఘటన స్థలాలను శనివారం పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సోంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. పూండిలో 3 తులాలు వజ్రపుకొత్తూరు రూరల్: పలాస నియోజకవర్గంలో వాణిజ్య, వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న వజ్రపుకొత్తూరు మండలం పరిధి పూండిలో శుక్రవారం దొంగతనం ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూండి సాగర్కాలనీలో భద్రాచలం రామకృష్ణ, మురళి అనే సోదరులు ఒకే ఇంట్లో పైన, కింద గదుల్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు అన్నదమ్ములు ఉపాధి కోసం దుబాయిలో ఉన్నారు. అయితే రాఖీ పండగ రోజున వారి భార్యలైన స్వాతి, బిందులు కలిసి స్కూటీపై చినబడాంలో ఉన్న సోదరులకు రాఖీ కట్టేందుకు ఉదయం 9.30 గంటలకి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి పైన ఇంటి తాళాలు తీసి ఉండడంతో అందోళన చెందారు. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి బెడ్రూంలో బీరువ పక్కన షూట్కేసులో ఉన్న 3 తులాల బంగారు అభరణాలు, రూ.15 వేల నగదు అపహరణకు గురయ్యిందని గుర్తించారు. వెంటనే స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ, కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అలాగే బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా పూండిలో గత కొంతకాలంగా కేవలం మహిళలు ఉండే ఇళ్లలోనే దొంగతనాలు జరుగుతుండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కింద ఇంట్లో దొంగతనం జరగకుండా పైఇంట్లో దొంగతనం జరగడం, అది కుడా కేవలం షూట్ కేసులో ఉన్న ఈ బంగారు అభరణాలు, నగదు చోరీ జరగడంతో తరుచూ ఇంటికి వచ్చి వెళ్లేవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. -
అగ్నివీర్ కుటుంబానికి అండగా...
జి.సిగడాం(పొందూరు): మండలంలోని మజ్జిలపేట గ్రామానికి చెందిన మొజ్జాడ అసిరినాయుడు, వరలక్ష్మి దంపతుల కుమారులు మొజ్జాడ విష్ణుమూర్తి, రామకృష్ణ ప్రమాదవశాత్తు నేలబావిలో పడి మృత్యువాతపడిన విషయం తెలిసిందే. వీరిలో విష్ణుమూర్తి అగ్నివీర్లో శిక్షణ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. వీరిని దృష్టిలో ఉంచుకుని జిల్లా మాజీ సైనికుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రూ.82 వేల ఆర్థిక సాయం ఆ కుటుంబానికి శనివారం అందజేసింది. కార్యక్రమంలో చైర్మన్ కల్నల్ ఎం.టి.రాజు, అధ్యక్షుడు సువ్వారి నీలాచలం, జనరల్ సెక్రటరీ అమ్మాజీరావు, కిల్లి వెంకటరమణ, కింతలి రామారావు, అన్నెపు నర్సింహులు, పైడి రంగనాథం, కీర్తి సుశీల, బొడ్డేపల్లి మోహన్, పి.జగన్మోహన్, బి.గోవిందరావు, మల్లేశ్వరరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
‘సీపీఎస్ రద్దు చేయాల్సిందే’
శ్రీకాకుళం అర్బన్: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయా లని ఏపీసీపీఎస్ఈఏ ప్రతినిధులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో శనివారం ఏపీ ఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం ఆధ్వర్యంలో ఏపీసీపీఎస్ఈఏ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీసీపీఎస్ఈఏ జిల్లా అధ్యక్షుడు వీవీ రాజు మాట్లాడుతూ సెప్టెంబరు 1న జరగబోయే ధర్నాను విజయవంతం చే యాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీసీపీఎస్ఈఏ ప్రతినిధుల డిమాండ్కు మద్దతుగా ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బి. శ్రీరామ్మూర్తి, పీఆర్టీయూ అధ్యక్షుడు టి.మురళి, ఏపీటీఎఫ్ అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస, బీటీఏ జిల్లా అధ్యక్షుడు ఎస్.రమేష్బాబు, ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.వేణుగోపాల్, ఏపీ ఎన్ జీజీవో జిల్లా కార్యదర్శి చల్లా శ్రీనివాసరావు, కోశాధికారి బడగల పూర్ణచంద్రరావు, ఉపాధ్యాయులు ఎం.రామ్మోహనరావు, టి.ఉపేంద్ర పాల్గొన్నారు. -
బైక్పై నుంచి జారిపడి మహిళ మృతి
మెళియాపుట్టి: సత్యనారాయణ వ్రతానికి వెళ్తూ ప్రమాదానికి గురై మహిళ ప్రాణాలు విడిచిన ఘటన శనివారం మెళియాపుట్టి మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పాతపట్నం మండలం బడ్డుమర్రి గ్రామానికి చెందిన కోన ద్రాక్షవేణి(42) శనివారం ఉదయం మెళియాపుట్టి మండలం గుమ్మడ గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి సత్యనారాయణ వ్రతంలో పాల్గొనడానికి తన తండ్రి కొల్లి రాములుతో కలిసి వెళ్తోంది. ఆ సమయంలో బురదరామచంద్రాపురం వద్ద కళ్లు తిరిగి బైక్మీద నుంచి కింద పడిపోయింది. వెంటనే అపస్మారక స్థితికి చేరుకోవడంతో చాపర పీహెచ్సీకి తరలించారు. ఆమె కోమాలో ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించి టెక్కలి రిఫర్ చేశారు. అక్కడ వైద్యం తీసుకోకుండా కుటుంబ సభ్యులు ప్రైవేట్ అంబులెన్స్లో పాతపట్నం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు మెళియాపుట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం సీహెచ్సీకి తరలించారు. మృతురాలి భర్త హైదరాబాద్లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
●మహాత్మా.. నీవైనా మందలించు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆర్థిక మంజూరు లభించిన నాలుగు నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే ఆ ఎంపీ ల్యాడ్ నిధులను నిరుపయోగంగా ఉంచకుండా, తక్షణమే ఇతర అత్యవసర ప్రజా ప్రయోజన పనులకు మళ్లించి వినియోగించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించా రు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సాయంత్రం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలసి ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించాలని, జల జీవన్ మిషన్ పురోగతిపై ఎమ్మెల్యేలకు సమాచారం అందించాలన్నారు. -
దర్యాప్తు వేగవంతం చేయాలి
● పోలీసులు పల్లెనిద్ర చేయాల్సిందే ● ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శ్రీకాకుళం క్రైమ్: దర్యాప్తులో పెండింగ్ ఉన్న ప్రాపర్టీ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని, నేరస్థలి లో లభించే భౌతిక, సాంకేతిక ఆధారాలను శాసీ్త్రయంగా విశ్లేషించి వాటి ఆధారంగా కేసులను త్వరగా ఛేదించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శనివారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బంది ప్రతీ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకమవ్వాలన్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు ప్రజల సమస్యలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. నీట్ పీజీ పరీక్షలకు భద్రత ఆదివారం జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్న నీట్ పీజీ –2026 పరీక్షలకు పటిష్ట పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలన్నారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం కూడలిలోని శ్రీశివానీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, శ్రీవేంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, నరసన్నపేట మారుతీనగర్–2లోని కోర్ టెక్నాలజీస్తో పాటు టెక్కలి ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల లోపలికి అనుమతించాలని, పరిసరాల్లో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేసేలా చూడాలన్నారు. కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు పరిశీలించి అవసరమైన చోట డ్రోన్ సర్వైలైన్సు ద్వారా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. -
‘ఐ గాట్ కర్మయోగి’.. ఇదేం యాగీ..?
● ‘ఐ గాట్ కర్మయోగి’ పేరుతో ఉద్యోగులపై పెత్తనం ● నైపుణ్య శిక్షణ ముసుగులో కార్పొరేట్ దందా ● జీతాల కోత? కార్పొరేట్ అనుకూలత.. కమీషన్ల గుసగుసలు పనితీరును మెరుగుపరచని ఇలాంటి ఆన్లైన్ వేదికల వెనుక భారీ ఎత్తున నిధుల మళ్లింపు, సాంకేతిక ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నా యి. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల అండ దండలతోనే ఇలాంటి ప్రాజెక్టులు అమల్లోకి వస్తున్నాయని, ఇందులో పెద్ద ఎత్తున కమీషన్లు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాకుళం: పాలన వ్యవస్థలో సామర్థ్యాన్ని పెంచడం, ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడం అనే ఆకర్షణీయమైన నినాదంతో కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన ‘మిషన్ కర్మయోగి’ వేదిక ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ప్రజాధనంతో ఏర్పాటైన ఒక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను క్షేత్రస్థాయి పరిస్థితు లతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై బలవంతంగా రుద్దుతుండటం తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. నైపుణ్య సాధనా? లేక నిబంధనల ఉచ్చులా? కేంద్ర సివిల్ సర్వెంట్లు, వివిధ శాఖల సిబ్బందికి నిరంతర ఆన్లైన్ శిక్షణ అందించడమే దీని ప్రధాన లక్ష్యమని పాలకులు చెబుతున్నారు. కానీ వాస్తవంలో ఇది ఒక రొటీన్ ఆన్లైన్ మాడ్యూల్ తప్ప, కింది స్థాయి ఉద్యోగులైన రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామ/వార్డుసచివాలయాల ఉద్యోగుల క్షేత్రస్థాయి విధులకు ఎంతవరకు అక్కరకొస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నా యి. రాష్ట్ర పాలనా వ్యవస్థకు, ఇక్కడి స్థానిక సమస్యలకు సంబంధం లేని కోర్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మెడ కు చుట్టడంపై ఉద్యోగ వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది. జీతాలతో ముడిపెడతారా.. ‘ఐ గాట్ కర్మయోగి’ యాప్లో కోర్సులు పూర్తి చేయకపోతే నెలాఖరున జీతాలు ఆపేస్తామంటూ ప్రభుత్వం జారీ చేస్తున్న ఆదేశాలు ఉద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే బయోమెట్రిక్ హాజరు, యాప్ల భారం, ఆన్లైన్ నివేదికలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉద్యోగులపై ఈ అదనపు భారం మోపడం వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమే. ప్రజలకు అందించాల్సిన నిత్యావసర సేవలను పక్కనపెట్టి, మొబైల్ స్క్రీన్ల ముందు గంటల తరబడి కోర్సులు క్లిక్ చేయాలని ఒత్తిడి తేవడం పాలనా లోపానికి నిదర్శనమని సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భావజాల వ్యాప్తికి సాంకేతిక ఎత్తుగడ? పాలనా నైపుణ్యాల కంటే కూడా, కేంద్రంలోని పా లకుల భావజాలాన్ని, కేంద్రీకృత ఆలోచనా విధానాన్ని దేశవ్యాప్తంగా ఉన్న యంత్రాంగంపై జొప్పించేందుకే ఈ విధమైన వేదికలను విస్తరిస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. ఉద్యోగులకు నిజమైన నైపుణ్యం కావాలంటే క్షేత్రస్థాయి శిక్షణ, వనరుల కల్పన ముఖ్యం తప్ప, ఇలా జీతాలను బంధించి ఆన్లైన్ వీడియోలు చూడాలని బలవంతం చేయడం నిరంకుశ పోకడే. ఉద్యోగులను తీవ్ర అసహనానికి గురిచేస్తున్న ఈ బలవంతపు కోర్సుల విధానాన్ని ప్రభుత్వం తక్షణమే సమీక్షించాల్సిన అవసరం ఉంది. -
నడిమివలస కొండ జోలికి రావద్దు
● మళ్లీ రోడ్డెక్కిన నడిమివలస వాసులు జి.సిగడాం: ‘మా అందరికీ ఈ కొండే ఆధారం. మాకు భూములు లేవు, కొండమీది చెట్లు, చిన్న చిన్న వ్యవసాయ సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. కొంతమంది ఆవులు, మేకలు, గొర్రెలు ఇక్కడే మేపుతారు. మాకు కూడా ఈ కొండే జీవనాధారం. ఈ కొండ జోలికి రావద్దు’ అంటూ నడిమివలస వాసు లు మళ్లీ రోడ్డెక్కారు. నడిమివలస–గదబపాలెం గ్రామ సమీపంలో ఉన్న కొండలో సుమారుగా 202 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఈ కొండలో ఏపీఐఐసి పరిశ్రమ వాడగా ఏర్పాటు చేయడానికి అధికార యంత్రాంగం ముందడుగు వేసింది. సర్వే నంబర్ 36.38 లో 202 ఎకరాలపై ఉన్న రైతులు శుక్రవారం నిరసనకు దిగారు. గ్రామం సచివాలయంలో వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలు అందించారు. ఈ కొండను ఎన్ఈఆర్ సివికాన్ కంపెనీకి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. తోటపల్లి, నారాయణపురం, మడ్డువలస నీరు తీసుకురావాలి గానీ ఇలా పచ్చని భూములను విధ్వంసం చేయరాదని కోరారు. ప్రాణాలకు తెగించి కాపాడుకుంటాం మా గ్రామంలో ఉన్న కొండ జోలికి అధికారులు వస్తే ప్రాణాలకు తెగించి మేము కాపాడుకుంటాం. ఎంతవరకై నా పోరాటాలు చేస్తాం. – ఇజ్జిరోతు రమేష్, పోరాట కమిటీ అధ్యక్షుడు, నడిమివలస సెంటు భూమి కూడా వదలం మాకు గత ప్రభుత్వం హయాంలో కొండపై పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి మేమంతా సాగు చేసుకుని జీవనోపాధి సాగిస్తున్నాం. ఈ భూమి తీసుకుంటే మా ఆధారం పోతుంది. సెంటు భూమి కూడా మేము వదులుకోలేము. – యడ్ల గౌరినాయుడు, గదబపాలెం -
వైఎస్సార్.. వైఎస్ జగన్ హయాంలోనే అభివృద్ధి
● అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలి ● 31న పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి తరలిరండి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా అభివృద్ధి వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డిల హయాంలోనే సాధ్యమైందన్న విషయం జిల్లాలో, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసునని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ధర్మాన సోదరులు జిల్లాకు ఏం చేశారని ఓ వీడియోలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రశ్నించడం చూశానని, ఇది సిగ్గు చేటని, కళ్లు ఉండి కూడా కింజరాపు కుటుంబం చూడలేకపోతోందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయం టౌన్హాల్ పనులు పరిశీలించిన అనంతరం మీడియాతో శుక్రవారం మాట్లాడారు. అంతకుముందు వైఎస్సార్సీపీ మహిళా నాయకు లు పి.సుగుణారెడ్డి, గుంట జ్యోతి ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనుల గురించి వారికి తెలియకపోవడం దారుణమన్నారు. కింజరాపు కుటుంబం రాజకీయాల్లోకి వచ్చి బాగా డ బ్బు గడించారని, ఎదుటి వారిని విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని అచ్చెన్నకు హితవు పలికారు. తల్లకిందులుగా తపస్సు చేసినా ధర్మాన సోదరులకు వచ్చిన పేరు అచ్చెన్నకు రాదనే విష యం తెలుసుకోవాలన్నారు. ఇటీవల బొత్స సత్యనారాయణపై అచ్చెన్న వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకు నిదర్శనమని పేర్కొన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. 31న జిల్లా పార్టీ కార్యాలయం పునఃప్రారంభం సోమవారం నాడు జిల్లా కేంద్రంలో టౌన్హాల్ వద్ద జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు. ముందుగా జీటీ రోడ్డులో వైఎస్సార్ విగ్రహానికి మధ్యాహ్నం 3గంటలకు పూలమాలలు వేసి భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయం వరకు వచ్చి ప్రారంభించనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి పార్టీ నాయకులు భారీగా హాజరు కావాలని కోరా రు. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనపై గౌరవం పెరిగిందన్న విషయం కూటమి రెండున్నరేళ్ల పాలనలో తేటతెల్లమైందన్నారు. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా జిల్లాలో పార్లమెంట్తో సహ ఎనిమిదికి ఎనిమిది వైఎస్సార్సీపీ గెలిచి తీరుతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క గ్రామంలో పోటీ చేసి సత్తా ఏంటో చూపించాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ సీఈసీ మెంబర్ అంధవరపు సూరిబాబు, తూర్పుకాపు బీసీ విభా గం రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, రాష్ట్రకార్యదర్శి, పలాస నియోజకవర్గ పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, యువజన విబాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్, ఎస్ఈసీ మెంబర్ చల్ల శ్రీనివాసరావు, జిల్లా ప్రధానకార్యదర్శి గేదెల పురుషోత్తం, గ్రీవెన్స్సెల్ జిల్లా అధ్యక్షులు రౌతు శంకరరావు, తంగుడు నాగేశ్వరరావు, ఊన్న నాగరాజు, నల్లబారికి శ్రీనివాసరావు, కింజరాపు రమేష్, భైరి మురళి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్కు నవోదయ విద్యార్థి
సరుబుజ్జిలి: అహ్మదాబాద్లో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరగనున్న జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్కు 10 వతరగతి విద్యార్థి విద్యాశ్రీమహంతి ఎంపికై నట్లు వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయం ఇన్చార్జి ప్రిన్సిపాల్ బేతనసామి శుక్రవారం తెలిపారు. మహంతి ఎగ్జిబిషన్ పోటీల్లో చక్కగా రాణించి అత్యుత్తమ ప్రతిభ చూపాలని కోరారు. ఆదిత్యుడిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి శ్రీకాకుళం కల్చరల్: ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామిని శుక్రవారం ఉదయం హైకోర్టు జడ్జి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. శ్రీకూర్మంలోనూ స్వామిని దర్శించుకున్నారు. ‘పీ–4లో లక్ష మందిని చేర్చాం’ శ్రీకాకుళం పాతబస్టాండ్: అట్టడుగు వర్గాల సంక్షేమానికి ఉద్దేశించిన ‘పీ–4’ కార్యక్రమం మంచిదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షకు శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇతర అధికారులతో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా లో లక్ష మందికి పైగా లబ్ధిదారులను గుర్తించగా, ఇప్పటికే 51 వేల మందిని మార్గదర్శకులకు అనుసంధానం చేసి వారి ఉపాధికి పూర్తి తోడ్పాటు అందిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జిల్లాలోని దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ క్రమంగా పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, నేపాల్ ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. రెండో రోజూ విధుల బహిష్కరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక ‘న్యాయవాద రక్షణ చట్టం’ తీసుకురావాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన విధుల బహిష్కరణ రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగింది. శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూన రాజారావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. న్యాయవాదుల రక్షణకు చట్టబద్ధమైన భద్రత కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరినా ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. చట్టాల అమలు కోసం వాదించి, కృషి చేసే న్యాయవాదులకే తగిన రక్షణ లేకపోవడం విచారకరమన్నారు. -
ఆట్యా–పట్యా జట్ల ఎంపిక రేపు
టెక్కలి రూరల్: శ్రీకాకుళం జిల్లా ఆట్యా–పాట్యా జట్ల ఎంపిక ఈ నెల 30న టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతుందని ఆ క్రీడ కార్యదర్శి కె.చిరంజీవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ జట్లకు జరిగే ఈ ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు తీసుకురావాలని సూచించారు. అలాగే ఈ ఎంపికలు ఉదయం 9 గంటల నుంచి జరుగుతాయని, ఎంపికై న జట్టు వచ్చే నెల 12, 13 తేదీల్లో కర్నూలులో జరిగే 11వ రారష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్ షిప్ 2026లో పాల్గొంటారని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు 9440941974, 8500007272 నంబర్ను సంప్రదించాలని సూచించారు. యువకుడు అదృశ్యం మెళియాపుట్టి: మండలంలోని మర్రిపాడు ‘సి’ గ్రామానికి చెందిన బదకల హరి (17) గురు వారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫోన్ రీచార్జ్ చేస్తానని తన తల్లి బదకల ఆదిలక్ష్మిని డబ్బులు అడిగి ఇంటి నుంచి వెళ్లాడు. శుక్రవారం ఉదయానికి కూడా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందజేశా రు. వారి బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. యువకుడు మెళియాపుట్టి జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం మధ్య లోనే నిలిపి వేసి, మేకలు కాపలా కాసుకుంటున్నాడు. ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదనీ, మొబైల్ రీచార్జ్ అని డబ్బులు తీసుకుని వెళ్లాడనీ, మొబైల్కు ఫోన్ చేసినా అవ్వడం లేదని తల్లి దండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘పీఎఫ్ ఫైనల్ క్లెయిమ్స్ పరిష్కరించాలి’ శ్రీకాకుళం: రిటైర్డ్ ఉపాధ్యాయులు, రెగ్యులర్ ఉద్యోగుల జిల్లా పరిషత్ పీఎఫ్ ఫైనల్ క్లెయిమ్స్ను త్వరితగతిన పరిష్కరించడంలో జిల్లా ప్రజా పరిషత్, స్టేట్ ఆడిట్ కార్యాలయాల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటరామన్, జిల్లా ఆడిట్ అధికారి కె.అంబేడ్కర్ను కలిసి సమస్యలపై చర్చించి మెమొరాండం సమర్పించారు. క్లెయిమ్లు నెలల తరబడి పెండింగ్లో ఉంచడం సబబు కాదన్నారు. -
రోడ్డు ప్రమాదంలో కూరగాయల వ్యాపారి మృతి
వజ్రపుకొత్తూరు రూరల్: రాఖీ పండగ రోజున ఇంటి పెద్దదిక్కు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. పలాస మండలం చినమామిడి మెట్ట గ్రా మానికి చెందిన కూరగాయల చిరు వ్యాపారి చెల్లూరి బైరాగి(75) శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బైరాగి ప్రతి రోజు తన ద్విచక్రవాహనంపై గ్రామాల్లో తిరుగుతూ కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగానే ఆయన శుక్రవారం తన కూరగాయల బండితో ఇంటి నుంచి బయల్దేరారు. తన భార్య దమయంతితో కలిసి గ్రామం నుంచి పలాస వస్తుండగా ఎన్హెచ్–16 జాతీయ రహదారిపై మాకన్నపల్లి వద్ద లారీ ఢీ కొట్టడంతో బైరాగి అక్కడికక్కడే మృతి చెందగా భార్య దమయంతి తీవ్ర గాయాలకు గురైంది. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆమెను పలాస ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరు కొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
బంగారం దొంగల గుర్తింపు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలో ఆటోలో ప్ర యాణిస్తున్న వృద్ధ దంపతుల బ్యాగులో దాదాపు 29 గ్రాముల బంగారు ఆభరణాలున్న పర్సును కొట్టేసిన దొంగలను రెండో పట్టణ పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులిద్దరూ తిరుప తి జిల్లా గూడూరు గాంధీనగర్కు చెందిన అమావాస్య మణికంఠ, సుక్కు విజయ్ అని, విచారణ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పి.ఈశ్వరరావు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 16న పాతబస్టాండు సమీప మేదరవీధికి చెందిన అప్పారావు దంపతులు ఆటోలో ఎక్కడం గమనించిన మణికంఠ, విజయ్లు పాతబస్టాండ్ వద్దే అదే ఆటోలో ఎక్కారు. వృద్ధులు పెట్టిన బ్యాగు పైనే తమ బ్యాగు పెడుతూ మెల్లగా వృద్ధుల బ్యాగులో చేయి పెట్టి బంగారు పర్సు తీసేశారు. కాంప్లెక్స్ సమీపంలో దిగి బ్యాగు చూసేసరికి 24.26 గ్రాముల పుస్తెల తాడు, 4.20 గ్రాముల చెవిదిద్దులున్న పర్సు లేకపోవడంతో మరుసటి రోజు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వృద్ధు లు ఆటోలో ప్రయాణించిన సమయాన్ని బట్టి కృష్ణాపార్కు సమీపంలో మ్యాట్రిక్స్ సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి నిందితులను గుర్తించారు. గురువారం నగరంలో సంచరిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు మాటు వేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరైన మణికంఠపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 కేసులున్నాయని, ఇటీవలే తెలంగాణ మెహబూబాబాద్ జిల్లాలో ఓ చోరీ చేశారని తె లిపారు. ఆటోల్లో ప్రయాణించే వృద్ధుల వద్ద బంగారం దోచేయడమే వీరి నైజమని సీఐ పేర్కొన్నారు. -
బోన్మ్యారో వ్యాధిగ్రస్తుడు మృతి
కంచిలి: మండలంలోని బూరగాం గ్రామానికి చెందిన దూపాన మాధవరావు గత కొన్ని నెలలుగా బోన్మ్యారో కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆరోగ్యం బాగా క్షీణించడంతో విశాఖపట్నంలో అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతిచెందారు. చికిత్స కోసం దాతలు సహకరించినా వ్యాధి నుంచి బయట పడలేకపోయాడు. మృతునికి భార్య విజయ, మిగతా కుటుంబ సభ్యులు ఉన్నారు. మాధవరావు మృతితో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. మృతుడు దూపాన మాధవరావు(ఫైల్) -
ఇసుక ర్యాంప్పై ఆకస్మిక దాడులు
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కరజాడ గ్రామ సరిహద్దు వంశధార నదీ తీరాన అక్రమంగా నడుస్తున్న ఓ ఇసుక ర్యాంప్పై శ్రీకాకుళం రెవెన్యూ, మైన్స్, రూరల్ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు లారీలు, రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. గడిచిన కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు తహసీల్దార్ గణపతిరావు, రూరల్ ఎస్ఐ సురేష్, మైన్స్ ఆర్ఐ మాణిక్యాలరావు కలిసి దాడులు నిర్వహించారు. తహసీల్దార్ మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంతంలో ఇసుక తరలింపునకు సంబంధించి మైన్స్, రెవెన్యూ అనుమతులు ఇవ్వలేదన్నారు. అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపితే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. -
ఐటీఐ నాల్గో విడత నోటిఫికేషన్ వెల్లడి
శ్రీకాకుళం న్యూకాలనీ, ఎచ్చెర్ల: ప్రభుత్వ ఐటీఐల్లో ఒకటి, రెండు, మూడు విడతల ప్రవేశాల సందర్భంలో వివిధ కారణాలతో ప్రవేశాలు పొందని విద్యార్థులకు డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ తీపికబురు చెప్పింది. 2026–27 విద్యా సంవత్సరంలో నాల్గో విడతలో ప్రవేశాలు పొందేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన విద్యార్థులు ఈనెల 31వ తేదీన ఉదయం 11.30 గంటల్లోపు రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని డైరెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు. అదేరోజు ఉదయం 11.30 నుంచి ప్రభుత్వ డీఎల్టీసీ/ఐటీఐ శ్రీకాకుళంలో కౌన్సెలింగ్ జరగనుంది. శ్రీకాకుళం డీఎల్టీసీలో డ్రాఫ్ట్మెన్ సివిల్, కోపా, సూయింగ్ టెక్నాలజీ(టైలరింగ్) (మహిళలకు మాత్రమే) ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయని, వెంటనే విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎల్టీసీ ఏడీ వి.రఘురాం తెలిపారు. 31న శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో మెగా జాబ్మేళా శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్)కళాశాలలోని నోడల్ జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) ఆధ్వర్యంలో ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో ఈనెల 31వ తేదీన మెగా జాబ్మేళా జరగనుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నంద సూర్యనారాయణ స్వామి, జేకేసీ కోఆర్డినేటర్ డాక్టర్ డి.పైడితల్లి పేర్కొన్నారు. జాబ్మేళాలో ఐసీఐసీఐ బ్యాంకు, ఇసుజు మోటర్స్, ఎల్అండ్టీ, వి ప్రో, అరబిందో అపిటోరియా, టాటా ఎలక్ట్రానిక్స్, హీరో, హెట్రో, న్యూ లాండ్ లేబరేటరీస్, కియా, అపోలో టైర్స్, రాయల్ ఎన్ఫీల్డ్, డాయ్కిన్, గోద్రేజ్, ఫోఫ్క్సోన్ తదితర కంపెనీల్లో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. టెన్త్, ఇంటర్మీడియెట్, డిప్లమో, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ తదితర కోర్సుల్లో విద్యార్హతలు కలిగి 18 నుంచి 38 ఏళ్ల మధ్య వయసు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్మేళాలో పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 9553994923, 9440425606 నంబర్లను సంప్రదించాలని వారు కోరారు. హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పూర్తిచేసుకున్న అభ్య ర్థులు ఆ శిక్షణను సద్వినియోగం చేసుకుని భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం ఆధ్వర్యంలో నడుస్తున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన 27వ బ్యాచ్ అభ్యర్థులకు సర్టిఫికెట్స్ను శుక్రవారం జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ అందజేసి అభినందనలు తెలిపారు. తదుపరి 28వ బ్యాచ్లో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని అప్పలనారాయణ తెలిపారు. లైట్ వెహికల్ లైసెన్స్ ఒక సంవత్సరం అనుభవం కలిగి 21 ఏళ్లు నిండిన వారు ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ కు అర్హులన్నారు. మొత్తం శిక్షణ 40 రోజుల పాటు ఉంటుందన్నారు. ఫీజు, ఇతర వివరాలకు 9390886033 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. -
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రణస్థలం: లావేరు మండలంలోని బెజ్జిపురం జంక్షన్ ఎన్హెచ్–16పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఐసర్ వ్యాన్ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. లావేరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో రణస్థలం నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న ఐసర్ వ్యాన్ రోడ్డు దాటుతున్న గొర్లె తేజేశ్వరరావు (55) అనే వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునిది సంతకవిటి మండలంలోని సిరిపురం గ్రామం. మృతుడి భార్య ఇటీవల చనిపోవడంతో లావేరు మండలంలోని బుడతవలస గ్రామంలో ఉన్న తన కుమార్తె దగ్గర గత కొన్ని నెలలుగా ఉంటున్నారు. శుక్రవారం ఉదయం కుమార్తె ఇంటి దగ్గర బయల్దేరి సిరిపురం వెళ్తూ బెజ్జిపురం కూడలికి వచ్చారు. రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లావేరు పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతుని వివరాలు సేకరించారు. ఎస్ఐ వి.సందీప్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నీరొస్తే ఒట్టు!
ఆయకట్టు..● చుక్క నీరు పారని తోటపల్లి కాలువ ● బీడు భూములుగా మారుతున్న పంట పొలాలు ● ఆయకట్టు రైతులకు తప్పని పాట్లు జి.సిగడాం : తోటపల్లి ఆయకట్టు బీడువారుతోంది. ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల రికార్డుల ప్రకారం తోటపల్లి నీరు జి.సిగడాం మండలం ఆయకట్టు వరకు పారాలి. కానీ ఈ మండలానికి చుక్క నీరు కూడా రావడం లేదు. ఒక పక్క వర్షాలు కురవకపోవడంతోపాటు మరో పక్క సాగునీరు అందకపోవడంతో దమ్ములు లేక పొలా లు బీడు వారుతున్నాయి. వరి నారు వేసి నేటికి 60 రోజులు పూర్తయినా సాగునీరు లేకపోవడంతో ఉభాలు వేయక, నారు ముదిరిపోతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గదబపాలెం–నడిమివలస గ్రామాల మధ్యలో పిచ్చి మొక్కలతో నిండి ఉన్న కాలువ -
నీట్ పీజీ పరీక్షకు జిల్లాలో 4 కేంద్రాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: నీట్ పీజీ–2026 పరీక్షలకు శ్రీకాకుళం జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం తెలిపారు. గతంలో కేటాయించిన మూడు కేంద్రాలతో పాటు కొత్తగా టెక్కలిలోని ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ను కూడా పరీక్ష కేంద్రంగా చేర్చడంతో జిల్లాలో మొత్తం కేంద్రాల సంఖ్య 4కు చేరిందని వెల్లడించారు. ఆదివారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఎచ్చెర్ల మండలంలోని శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ చిలకపాలెం జంక్షన్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పక్కన, నరసన్నపేట లోని కోర్ టెక్నాలజీస్ మారుతీ నగర్–2 తో పాటు కొత్తగా టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశా రు. ఈ కేంద్రాల పర్యవేక్షణకు శ్రీకాకుళం ఆర్డీవోతో పాటు టెక్కలి ఆర్డీవోను సూపర్వైజరీ అధికారిగా, టెక్కలి ఆర్ఎస్డీటీని నోడల్ అధికారిగా నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి భద్రతతో పాటు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షలకు పంపుతారని, అభ్యర్థులు ఈ విషయంలో సహకరించాలని కోరారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపారు. -
సమరశీల పోరాటాలే విద్యుత్ అమరులకు నివాళి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు చేయడమే విద్యుత్ అమరవీరులకు ఘనమైన నివాళి అర్పించడమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. సీపీఎం కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోవాలని, విద్యుత్తు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో టీడీపీ ప్రభుత్వం బషీరాబాగ్ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అసువులు బాసారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు విద్యుత్ విషయంలో మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టండి అని పిలుపునిచ్చి, అదానీ స్మార్ట్ మీటర్లు పెట్టడం మోసం కాదా అని ప్రశ్నించారు. జీడి గిట్టుబాటు ధర, జీడి బోర్డు, రిమ్స్ను సూపర్ స్పెషాలిటీగా తీర్చిదిద్దడం, కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణం, జిల్లాకు ఐటీడీఏ వంటి హామీలేవీ నెరవేరలేదని గుర్తు చేశారు. -
వంశధార భూములు కబ్జా
నరసన్నపేట: స్థానిక వంశధార డివిజన్ పరిధిలోని భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఇప్పటికే కిళ్లాం చానెల్కు ఆనుకొని నరసన్నపేట ఇందిరానగ ర్ ప్రాంతంలో విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. ఎలాంటి అనుమతులు లేకుండా భవనా లు నిర్మించారు. ఇప్పుడు తాజాగా నరసన్నపేట బ్రాంచి కెనాల్కు ఆనుకొని జమ్ము కూడలి వద్ద ఉన్న విలువపైన భూమి కబ్జాకు స్థానికులు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో లక్షలాది రూపాయల విలువ కలిగిన ఈ స్థలం కాజేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. లారీ అసోసియేషన్ పేరున ఈ స్థలం కాజేయడానికి కుట్రలు చేస్తున్నారు. గురువారం ఈ స్థలంలో జేసీబీతో మట్టి నెరిపారు. ఇలా వదిలేస్తే ఈ స్థలం ఆక్రమణ అవుతుందని స్థానికులు అంటున్నారు. వంశధార అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విలువైన ఈ స్థలం ఆక్రమణలు కాకుండా చూడాలన్నారు. దీనిపై వంశధార ఈఈ మురళీ మోహనరావు దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్కు లెటర్ రాస్తామని తెలిపారు. -
శ్రీకాకుళం
● విద్యార్థుల విన్యాసం శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026పర్యావరణ పరిరక్షణకు ప్రతి వ్యక్తి కృషి చేయాలని పర్యావరణ సంఘ నాయకులు పేర్కొన్నారు. పల్లిగొల్లగండి గ్రామంలో పర్యావరణ ప్రేమికులు రాఖీపౌర్ణమి విశిష్టత తెలియజేస్తూ, మహిళలకు చెట్లపై అవగాహన కల్పించి, పెద్ద వృక్షాలకు రాఖీలు కట్టించారు. చెట్ల మనుగడతోనే మానవజాతికి మేలు జరుగుతుందని తెలిపారు. – సోంపేటపలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల రామకృష్ణాపురం శ్రీ సత్యసాయి విద్యావిహార్ పాఠశాలలో గురువారం ముందస్తుగా రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాఖీ ఆకృతిలో ఏర్పడి విద్యార్థులు విన్యాసం చేశారు. – వజ్రపుకొత్తూరు రూరల్ రాఖీ పండగ సందర్భంగా మార్కెట్లలో రాఖీలకు గిరాకీ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో ప్రత్యేక స్టాళ్లు వెలిశాయి. వినూత్నమైన రాఖీలను అందుబాటులో ఉంచాయి. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాతపట్నం మార్కెట్లో రాఖీ కొనుగోలు చేశారు. –పాతపట్నం -
యంత్రం.. కుతంత్రం
నరసన్నపేట: ఎరువు కావాలంటే లైనులో నిలబడమంటున్నారు. విత్తనం ఆశిస్తే నిరీక్షించాలని ఆదేశిస్తున్నా రు. సాగునీరు రాలేదంటే.. ఎల్నినో పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. ఆఖరకు యంత్రాలకు దరఖాస్తు చేసినా ఇవ్వలేకపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుకు కష్టాలు మొదలయ్యాయి. రైతులను ఏ కోశానా ఆదుకోని చంద్రబాబు సర్కారు ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం, ఎరువులు, విత్తనాలు పంపిణీ, పంటలకు మద్దతు ధర వంటి అన్ని అంశాల్లోనూ తీవ్ర అన్యాయం చేసింది. తాజాగా సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద సబ్సిడీతో కూడిన వ్యవసాయ యంత్రీకరణ పథకానికి అనుగుణంగా పరికరాలు ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించి ఇప్పటికీ పరికరాలు ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 7200 దరఖాస్తులు.. జిల్లాలో రూ.4.84 కోట్ల రాయితీతో 1376 యూని ట్లు మంజూరు చేశారు. మే నెల 5 నుంచి 29 వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల రైతుల నుంచి 7200 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో లాటరీ పద్ధతిపై లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, జూన్ నెలాఖరుకల్లా పరికరాలు రైతులకు ఖరీఫ్ పనులుకు వీలుగా అందిస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. అలాగే రాయితీపై స్ప్రేయర్లు, నూ ర్పిడి, పంటకోత యంత్రాలు, పవర్ టిల్లర్, రోటావేటర్లు, 40 హెచ్పీ లోపు ఉండే ట్రాక్టర్లు, ఇతర పరికరాలు ఇస్తామని ప్రకటించారు. రైతులు ఎంతో ఆశగా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ పరికరాలు మంజూరు చేయకపోవడంపై రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇస్తారా.. ఎగ్గొడతారా..? కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత బీసీ, ఎస్టీ, ఎస్సీలకు సబ్సిడీ పై రుణాలు ఇస్తామని పెద్ద ఎత్తున నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు తీసుకున్నారు. వందల మంది ఆశగా సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకూ రుణాలు ఊసేలేదు. ఈ పద్ధతిలోనే వ్యవసాయ పరికరాల పంపిణీకి కూడా ఎగ్గొడతారా అనే అనుమానం రైతుల్లో వ్యక్తం అవుతోంది. దరఖాస్తులు స్వీకరించి మూడు నెలలు అవుతోంది. ఖరీఫ్లో ఉబాలు, కలుపు నియంత్రణ, ఎరువుల యాజమాన్యం వంటి పనులు దాదాపుగా అయిపోయే కాలం వస్తోంది. కనీసం కోతల సమయానికైనా పరికరాలు అందిస్తారా.. లేదా రబీ వరకూ వేచి ఉండమంటారా అంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అసలు పరికరాల మంజూరుకు ఇంత జాప్యం ఎందుకు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు కాకుండా తమకు నచ్చిన వారికి ఇచ్చేందుకు కాలయాపన చేస్తున్నారా.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తామన్నా.. లోపల ఏదో జరుగుతోందనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న జిల్లాలోనే వ్యవసాయ పరికరాలు పంపిణీ ఇంత జాప్యమా రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి లాగిన్లో.. జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలన పూర్తి చేసి జిల్లా ఇన్చార్జి మంత్రి లాగిన్లో వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు ఉంచారు. ఆయన అనుమ తి ఇచ్చిన తర్వాత జేసీ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వీలున్నంత తొందరగా పరికరాలు అందజేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. అయితే కాలయాపన జరుగుతుండటంతో రైతుల నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాయితీ యంత్రాల కోసం దరఖాస్తుదారుల నిరీక్షణ ఖరీఫ్ ప్రారంభానికే ఇస్తామన్నా ఇవ్వని వైనం జిల్లాలో 1328 యూనిట్లకు 7200 దరఖాస్తులు -
సారా విక్రయదారుకు ఏడాది జైలు శిక్ష
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల సూదికొండకు చెందిన ముద్దాయి దూలి రాజేశ్వరికి సారా విక్రయించిన కేసులో ఏడాది కాలం జైలు శిక్షతో పా టు రూ. 2లక్షల జరిమానా విధిస్తూ గురువా రం పలాస జూనియర్ సివిల్ కోర్టు న్యాయ మూర్తి యు.మాధురి తీర్పు వెలువరించారు. పలాస ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కె.మల్లికార్జునరావు తెలిపిన వివరాలు మేరకు.. పలాస ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 2021 మార్చి 4న ముద్దాయి దూలి రాజేశ్వరి సారా విక్రయి స్తూ పట్టుబడటంతో అప్పట్లో విధుల్లో ఉన్న ఎకై ్సజ్ ఎస్ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసు లో ముద్దాయి రాజేశ్వరిని ఈ ఏడాది మార్చి 23న కోర్టులో హాజరుపర్చాల్చి ఉండగా ముద్దా యి అందుబాటులో లేకపోవడంతో తీర్పు రిజ ర్వ్ చేశారు. అయితే ముద్దాయి రాజేశ్వరిని గురువారం పలాస జూనియర్ సివిల్ కోర్టులో హాజరు పరిచామని అన్నారు. ఈ మేరకు కోర్టు తుది తీర్పు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. రణస్థలం: కోష్ట జాతీయ రహదారిలోని పై వంతెనపై ఈ నెల 22న ముందు వెళ్తున్న లారీని ఢీకొని గాయపడిన డ్రైవర్ పొట్నూరు ఎర్రిబా బు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జేఆర్ పురం ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నం జిల్లాలోని భీమిలి మండలానికి చెందిన ఎర్రిబాబు క్యాబిన్లో ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డారు. రిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వజ్రపుకొత్తూరు రూరల్: బెండి గేటు సమీపంలోని కాశీబుగ్గ పాత జాతీయ రోడ్డులో గరుడఖండి దగ్గర గురువారం గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అరుదైన నక్క మృతి చెందింది. ప్రధానంగా ఈ నక్కలు కొండ ప్రాంత పరిసర తోటలో సంచరిస్తుంటాయి. రాత్రి సమయంలో ఆహారం కోసం బెండి కొండ నుంచి వస్తూ ప్రమాదానికి గురై ఉండవచ్చని స్థానికులు తెలిపారు. రణస్థలం: లావేరు మండలంలోని లావేటిపా లెం గ్రామానికి చెందిన ఓయిబోయిన గంగు లు, అప్పలసూరిలకు చెందిన సుమారు 20 గొర్రె పిల్లలను కుక్కలు చంపేశాయి. బుధవా రం అర్ధరాత్రి సమయంలో కుక్కలు ఈ దారుణానికి ఒడికట్టాయి. ఇంతలా నష్టం వాటిల్లడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. సుమారు రూ. 2లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవా లని వేడుకుంటున్నారు. లావేరు పశువైద్యులు గాయిత్రిదేవి, వీఆర్ఓలు వేణుగోపాల్ పరిశీలించి శవపంచనామా చేశారు. లావేరు వైఎస్సార్సీపీ గ్రామనాయకులు లంకలపల్లి మహే ష్ సంఘటన స్థలానికి వెళ్లి జరిగిన నష్టాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
‘నీరివ్వండి మహాప్రభో’
నరసన్నపేట: మండలంలోని గోపాలపెంటకు సాగునీరు విడుదల చేయాలని, నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని నీటి సంఘం గోపాలపెంట డైరెక్టర్ తోట భార్గవ్, రైతులు బొబ్బాది ఈశ్వరరావు, గదిలి రమేష్, సనపల రమేష్, మార్పు అమ్మాజీ బుడుమూరు రమణ తదితరులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక వంశధార ఈఈ కార్యాలయ హెచ్డీ నారాయణమూర్తికి విన తి పత్రం అందించారు. ఈ సందర్భంగా బొబ్బాది ఈశ్వరరావు మాట్లాడుతూ కాలువల్లో పూడిక తీయలేదని, చుక్క నీరు రావడం లేదని ఆందోళన చెందారు. ఏటా నష్ట పోతున్నామని, వంశధార అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఏలూరు డిపో మేనేజర్నంటూ హల్చల్
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో ఓ యువకుడు గురువారం హల్చల్ చేశా డు. తాను ఏలూరు డిపో మేనేజర్నని, కొత్తూరు వెళ్లేందుకు సీటు ఏర్పాటు చేయాలని అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బందికి హుకుం జారీ చేశాడు. ఉన్నది కాసేపైనా అక్కడి సిబ్బందిని ఓ అధికారి మాదిరిగానే హడలెత్తించాడు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కాంప్లెక్స్లోకి ఓ యువకుడు సూటూ బూటా వేసుకుని వచ్చాడు. కొత్తూరుకు వెళ్లడానికి సీటు కావాలని నానా హంగామా చేశాడు. అతడి హడావుడి చూసి అనుమా నం వచ్చిన వెంటనే స్టేషన్ మాస్టర్ ప్రసాదరావు, డిపో మేనేజర్ పినకాన సంతోష్లకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చీ రావడంతోనే యువకుడిని ఏ బ్యాచ్కు చెందినవాడివని ప్రశ్నించగా.. 2019 బ్యాచ్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యానని చెప్పడంతో అనుమానం మరింత బలపడింది. అసలు 2019లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరగలేదని, బ్యాచే లేదని గ్రహించి యువకుడిని ఐడీ కార్డు చూపించమన్నారు. తనతో తెచ్చుకున్న సూట్కేస్ కాసేపు తెరుస్తున్నట్లు నటిస్తూనే అధికారుల ప్రశ్నల వర్షాని కి తడబడిపోయాడు. దీంతో చేసేదేమీ లేక ‘సార్ తప్పయిపోయింది.. నాపేరు వారాడ సుధీర్, విశా ఖ చిన్నవాల్టేరులో నివాసముంటున్నాను, ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ చేస్తున్నాను. బస్లు ఇరు కుగా ఉండటంతో ఇలా చేశాను..’ అంటూనే సూట్కేసు పట్టుకుని క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించేశాడు. దీంతో డిపోమేనేజర్ సంతోష్, స్టేషన్ మాస్టర్ ప్రసాదరావులు రెండో పట్టణ పీఎస్ను ఆశ్రయించారు. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ప్రదే శ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుని గా వీవీ రాజును నియ మించినట్లుగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం.దాసు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీపీఎస్ రద్దయ్యే వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని, సెప్టెంబర్ 1 చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని రాజు కోరారు. -
బ్యాంకు సిబ్బంది నిరసన
శ్రీకాకుళం అర్బన్: బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఉమెన్స్ కాలేజ్ రోడ్డులో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద సాయంత్రం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు అధికారులు నిరసన కార్యక్రమం చేశా రు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ సెప్టెంబర్ 11వ తేదీ సమ్మె చేస్తామని, సమస్యలు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజులు సమ్మె చేస్తామని అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఆఫీసర్ సంఘ నాయకులు కె.తేజేశ్వరరావు మాట్లాడుతూ 5 రోజుల బ్యాంకింగ్ డిమాండ్కు ఐబీఏ అంగీకరించింది. దానికి బదులుగా రోజువారీ పని గంటలను 40 నిమిషాలు పెంచడానికి యూనియన్లు కూడా అంగీకరించాయన్నారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినా ఇప్పటివరకు ఆమోదం రాలేదని, దీనివల్ల ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. -
యాదాద్రిలో జింకిభద్ర యువకుడు మృతి
సోంపేట: మండలంలోని జింకిభద్ర గ్రామానికి చెందిన అంబటి జానకిరావు (32) బుధవారం రాత్రి తెలంగాణ రాష్ట్రం యాదాద్రిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జింకిబద్ర గ్రామానికి చెందిన అంబటి విశ్వనాథం, అప్పలనరసమ్మ తృతీయ పుత్రుడు జానకిరావు. మూడేళ్ల కిందటే వివాహమైంది. సంతానం లేదు. గత ఎనిమిదేళ్లుగా యాదాద్రిలో వలస కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలం పనులు లేక పోవడంతో, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. యాదాద్రి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. జానకిరావు మృతితో జింకిభద్ర గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. జానకిరావు అన్నయ్య సోమేశ్వరరావు సుమారు 15 ఏళ్ల కిందట సోంపేట–జింకిభద్ర రహదారిలో బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. -
సెల్యూట్
డైనా సేవలకు డైనాకు నివాళులు అర్పిస్తున్న పోలీసు సిబ్బందిఎచ్చెర్ల: శ్రీకాకుళం పోలీసు శాఖలో గత ఎనిమిదేళ్లుగా విశిష్ట సేవలందించిన పోలీసు జాగిలం డైనా గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసు క్వార్టర్స్ ఆవరణలోని శ్మశానవాటికలో పోలీసు అధికార లాంఛనాలతో డైనా అంత్యక్రియలు నిర్వహించారు. డైనా సేవలివే.. ● ఈ జాగిలం లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందినది. ● డైనా 2017 సంవత్సరంలో జన్మించి 2018 సంవత్సరంలో మంగళగిరిలో డాగ్ ట్రైనింగ్ సెంటర్లో ఎక్స్ప్లోసివ్ డిటెక్షన్ స్నిఫర్ డాగ్గా ప్రత్యేక శిక్షణ పొందింది. ● 2018 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని విధు లు నిర్వహించి వాసన ఆధారంగా పేలుడు పదార్థాలు, కీలక ఆధారాలను గుర్తించడంలో అసాధారణ ప్రతిభను కనబరిచింది. ● వీఐపీ, వీవీఐపీ పర్యటనలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, చెక్పోస్టు తనిఖీలు భారీ బందోబస్తు విధుల్లో కీలక పాత్ర పోషించింది. ● స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు సందర్భంగా నిర్వహించే పోలీసు పరేడ్లలో పాల్గొని విన్యాసాలతో అలరించేది. సేవలు చిరస్మరణీయం అదనపు ఎస్పీ ఎల్.శేషాద్రి మాట్లాడుతూ పేలుడు పదార్థాల గుర్తింపు, భద్రతా తనిఖీలు, పోలీసు విధుల్లో అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పోలీసు శాఖకు డైనా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శంకర్ప్రసాద్, అర్ఎస్ఐలు, పోలీసు డాగ్ హ్యాండ్లర్ మాధవరావు, ఏఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఈ–ఎస్ఆర్తోనే సరి.. పని ఎలా మరి?
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లను డిజిటలైజ్ చేసుకోవాలని ఆదేశా లు జారీ చేయడం వారికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. రోజుకో కొత్త పని అప్పజెబుతుండ డంతో బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నామని, యాప్లతోనే సమయం సరిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ–ఎస్ఆర్ ప్రక్రియలో తొలుత నిధి లాగిన్లో ఉద్యోగ ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సర్వీసు వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా జీవిత భాగస్వామి వివరాలు నమోదు చేసి ఈ కేవైసీ ద్వారా నిర్ధారించుకుంటేనే మిగిలిన వివరాలు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. డీడీఓకు ఆ వివరాలను ఓటీపీ ద్వారా ధ్రువీక రించాలి. డీడీఓ కన్ఫర్మేషన్ పూర్తి చేస్తేనే కుటుంబ సభ్యుల వివరాలు వ్యక్తిగత సర్వీసు వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని ఉద్యోగు లు అంటున్నారు. ఇది కొంత మంది ఉద్యోగ ఉపా ధ్యాయులకు ఇబ్బంది కలిగించే అంశమని చెబుతు న్నారు. జీవిత భాగస్వామితో విడాకులు తీసుకు న్నా, మరే కారణాలతో అయినా దూరంగా ఉన్నా ఈ వివరాలు నమోదు చేయడం కష్టతరం. అలాగే జీవిత భాగస్వామి మృతి చెందితే కూడా కొంతమేర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఉద్యోగితోపాటు డీడీఓ కూడా పని భారం అనే చెప్పాలి. వివాహ వివరాలు నమోదు చేయడం కష్టమే ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయుడు తన వివాహానికి సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది నమోదు చేయడం కష్టం కాకపోయినప్పటికీ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, ఫోటోలు, మరికొన్ని ఆధారాలను పొందుపరచాల ని ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయా వర్గాలు తప్పుపడుతున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయుల్లో చాలామంది 30, 40 ఏళ్ల కిందటే పెళ్లి చేసుకున్నారు. వారి వివాహ ఆహ్వాన పత్రికలు, పెళ్లి ఫొటోలు ఏ విధంగా తీసుకురాగలుగుతారని ఉద్యోగ ఉపాధ్యాయు లు ప్రశ్నిస్తున్నారు. అలాగే వివాహానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా అడుగుతున్నారని కొందరు చెబుతుండగా, గతంలో వివాహ రిజిస్ట్రేషన్ ను ఏ ఒక్కరూ చేయించుకునేవారు కాదు. ఇటీవల కాలంలోనే రిజిస్ట్రేషన్ పై పలువురు శ్రద్ధ చూపిస్తున్నారు. అలాంటిది ఎప్పుడో వివాహమైన వారిని ఇలాంటి ఆధారాలను పొందుపర్చాలని కోరడాన్ని తప్పుపడుతున్నారు. ఇందులో కూడా విడాకులు తీసుకున్న వారు వితంతువులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని, దీనిపై ఏం చేయాలో కూడా అర్థం కాక మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఉద్యోగులు అంటున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ఎస్ ఆర్ విధానాన్ని తీసుకువచ్చారని అప్పట్లోనే తామంతా ఈ ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ కొత్త కొత్త నిబంధనలను తెచ్చి దాన్ని అప్డేట్ చేసుకోవాలని చెప్పడం సరైన విధానం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు. -
అప్పుల బాధతో హోటల్ నిర్వాహకుడు ఆత్మహత్య
పాతపట్నం: పాతపట్నంలో చంటి బిర్యానీ హొటల్ నడుపుతున్న కొల్లి చిన్నారా వు అలియాస్ చంటి (38) గురువారం ఉదయం హొటల్లో ఫ్యాన్ హుక్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరా ల ప్రకారం.. పాతపట్నం మేజర్ పంచాయతీ రాళ్ల క్వారీలో కొల్లి చిన్నారావు అలియాస్ చంటి నివసిస్తున్నాడు. పాతపట్నం యూనియన్ బ్యాంకు పక్కన చంటి బిర్యానీ హోటల్ను నెల రోజుల కిందట ప్రా రంభించాడు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటి నుంచి హోటల్కు చేరుకుని, హోటల్ షట్టర్ తీసుకుని, లోపలకి వెళ్లి షట్టర్ను మూసివేసి, హోటల్ లోపల గదిలోకి వెళ్లి ఫ్యాన్ హుక్కు ఉరివేసుకున్నాడు. రోజూ లాగానే హోటల్కు తల్లి కొల్లి వెంకటలక్ష్మి, భార్య రాణిలు చేరుకుని, షట్టర్ తీసి చూడగా ఫ్యాన్ హుక్కు మృతదేహం వేలాడుతూ కనిపించింది. వెంటనే వారు 104కు ఫోన్ చేసి పాతపట్నం సీహెచ్సీకు తరలించారు. అప్పటికే చిన్నారావు మృతి చెందాడు. సంఘటన స్థలానికి ఎస్ఐ కె.మధుసూదనరావు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చిన్నారావు ఒడిశాకు చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడని, ఆమె వద్ద కొంత బంగారం తాకట్టు పెట్టి నగదును, బయట కూడా అప్పులు తెచ్చి, హోటల్కు పెట్టుబడి పెట్టాడని మృతుడి భార్య పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. నీలిమకు తన భర్త చిన్నారావు ఇటీవల మనస్ఫర్థలు వచ్చాయని, నీలిమ తన దగ్గర తీసుకున్న పద్దు పెట్టిన నగదు ఇమ్మని తన భర్తను అడిగిందని, అప్పుల బాధతో తన భర్త మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
పాత్రునివలస దుర్గమ్మ ఆలయంలో చోరీ
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పాత్రునివలస గ్రామంలో గల దుర్గమ్మ ఆలయంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత చోరీ జరిగింది. రూరల్ పోలీసులు అందించిన వివరాలు మేరకు.. గ్రామస్తులు నిత్యం కొలిచే అమ్మవారి ఆలయంలోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి తులం బంగారంతో పాటు రెండున్నర కిలోల వెండిని తస్కరించారు. గురువారం ఉదయం గ్రామంలో గల అర్చకుడు తలుపులు తెరిచిచూడగా ప్రధాన ఆలయం ముఖద్వారం వద్ద తాళాలు పగలకొట్టి ఉండడంతో దొంగతనం జరిగిందని గ్రహించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. టౌన్ సీఐ పైడపునాయుడు ఆదేశాల మేరకు క్లూస్టీంతో పాటు వారు డాగ్ స్క్వాడ్ను తీసుకొని వచ్చి తనిఖీలు చేపట్టారు. స్థానికంగా గల నూతిలో సీసీ కెమెరాలు బద్దలుకొట్టి పడేసినట్లు పోలీసులు గుర్తించారు. రూరల్ ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక ‘న్యాయవాద రక్షణ చట్టం’ తీసుకురావాలని శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రాజారా వు డిమాండ్ చేశారు. గురువారం శ్రీకాకుళం నగరంలో జిల్లా బార్ అసోసియేషన్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. రెండు రోజులు విధుల బహిష్కరణలో భాగంగా గురువారం విధు లు బహిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణకు చట్టబద్ధమైన భద్రత కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరినా ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో న్యాయవాదుల రక్షణకు సంబంధించి ప్రత్యేక చట్టాలు అమలులోకి తీసుకువ చ్చారని తెలిపారు. ఇక్కడ కూడా అలాంటి చట్టాన్ని తీసుకురావాలని కోరారు. -
‘కాన రాని దూరంలో’ పాట విడుదల
శ్రీకాకుళం అర్బన్: ‘కొన్ని పేజీల జ్ఞాపకాలు’ పేరు తో నిర్మించిన సిక్కోలు చిత్రాన్ని ఆదరించాలని ఆ చిత్ర యూనిట్ బృందం కోరింది. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్క్ వద్ద ‘కొన్ని పేజీల జ్ఞాపకాలు‘ చిత్ర బృందం వారి మొదట పాటను లిరికల్ రూపంలో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బృందం మాట్లాడుతూ కొన్ని పేజీ ల జ్ఞాపకాలు చిత్రాన్ని, పెద్ద సినిమాలకు దీటుగా నిర్మించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రేమ్ సుప్రీం యూట్యూబ్ చానెల్లో పూర్తి పాటను అందించామన్నారు. ‘కాన రాని దూరంలో’ అనే ఈ పాటలో సాహిత్యం, సంగీతం శ్రోతల్ని అలరిస్తోంద ని తెలిపారు. చిరంజీవి మజ్జి రాసిన పాటను ప్రము ఖ సంగీత గురువు వరద దుర్గరాజు మాస్టారు, హీరో మిధున్, తల్లిదండ్రులు సంయుక్తంగా లాంచ్ చేశారు. పూర్తిగా గ్రామీణ వాతావరణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా గొప్ప విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ పాటకు రచన చిరంజీవి మజ్జి, సంగీతం నిజానీ అంజన్, వయోలి న్ హేమంత్ కశ్యప్, గానం హితేష్ సాయి, దర్శకు లు ప్రేమ్ సుప్రీం అని తెలిపారు. అనంతరం నటు లు బాబూరావు, రమేశ్ నారాయణ్, సాయి సుధాక ర్, తదితరులు చిత్ర విశేషాలను, కాన రాని దూరంలో పాట ప్రాముఖ్యతను ప్రేక్షకులకు తెలియజేసారు. -
‘ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి’
వజ్రపుకొత్తూరు రూరల్: విద్యాశాఖ నిర్వహిస్తున్న స్పెషల్ టెట్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు వినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిశోర్కుమార్ కోరారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో గురువారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో బైక్ జాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయు లు టెట్ మినహాయింపు ఇవ్వాలని కోరుతుంటే ప్రభుత్వం కోర్టు తీర్పుల పేరుతో సాకులు చెబుతోందని అన్నారు. ఒక వైపు విద్యార్థులు పాఠాలను బోధించాలని, మరో వైపు శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావడంతో పాటు ఇతర బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు సతమతం అవుతున్నార ని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల కు టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలని లేనిపక్షంలో బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, చలో విజ యవాడ కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎల్.బాబురావు,గుంటు కోదండరావు, బల్ల చిట్టిబాబు, ఎల్వీ చలం, టి.జయరాం, కంచరాన జయరాం తదితరులు ఉన్నారు. -
హత్య కేసు నిందితులకు రిమాండ్
నరసన్నపేట: జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు హత్య కేసు నిందితులను జిల్లా జైలుకు తరలించారు. వృద్ధురాలి హత్య కేసులో కింతలి ధనలక్ష్మితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి న విషయం విదితమే. గురువారం ఉదయం నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. సివిల్ జడ్జి ఎస్.వాణి వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు జిల్లా జైలుకు తరలించినట్లు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ‘మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి’ శ్రీకాకుళం: వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున శ్రీకాకుళం జిల్లా పరిధిలోని సముద్రతీర మత్స్యకారులు తీవ్ర అప్రమత్తతతో ఉండాలని మత్స్యశాఖ ఉప సంచాలకు లు టి.సుమలత తెలిపారు. సముద్రంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందు న వేటకు వెళ్లే ప్రతి ఒక్కరూ ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ మత్స్యకారుల రక్షణకు సంబంధించిన పలు ముఖ్యమైన సూచనలు చేశారు. జిల్లా పరిధిలో ట్రాన్స్పండర్లు అమర్చిన అన్ని మోటరైజ్డ్ బోట్ల యజమానులు వేటకు వెళ్లే సమయంలో ట్రాన్స్పండర్ను తప్పనిసరిగా ఆన్లోనే ఉంచాలని తెలిపారు. లైఫ్ జాకెట్లు విధిగా తీసుకెళ్లాలని సూచించారు. మేళ తాళాల మధ్య గ్రామదేవత తరలింపు సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామమైన మూలపేట గ్రామస్తులు సంప్రదాయాల ప్రకారం డప్పులు, వాయిద్వాలు, నృత్యాలు, మేళతాళాల నడుమ గ్రామ దేవత పెద్దమ్మ తల్లితో పాటు పలు దేవతామూర్తులను, రథాన్ని కొత్తగా నిర్మాణం అవుతున్న నౌపడ పునరావాస కాలనీకి ఊరేగింపుగా గు రువారం తరలించారు. గ్రామంలో ఉన్న మహిళలు ముర్రాటలతో పాటు పెద్దలు, యువకులు, చిన్నారులు అందరూ కలిసి ఊరేగింపుగా బయలుదేరి సుమారు ఐదు కిలోమీటర్లు వరకు నడిచి విగ్రహాలను పునరావాస కాలనీలో కేటాయించిన స్థలంలో ప్రతిష్టించారు. కొత్త ఆలయాలు నిర్మాణం అయ్యేంతవరకు పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ‘నల్సా శిక్ష–2026’తో పేద పిల్లలకు సమగ్ర విద్య శ్రీకాకుళం పాతబస్టాండ్: సమాజంలోని నిరుపే ద, బలహీన వర్గాల చిన్నారులు ఆర్థిక, సామాజిక కారణాలతో విద్యకు దూరం కాకుండా చూడటమే ‘నల్సా శిక్ష–2026’ పథకం ప్రధాన ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణంలో గురువారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నల్సా రూపొందించిన ‘స్కీమ్ ఫర్ హోలిస్టిక్ ఇంక్లూషన్, నాలెడ్జ్ అండ్ స్కూలింగ్ త్రూ హెల్ప్ అండ్ యాక్సెస్’ (శిక్ష) ద్వారా విద్యార్థులకు సమగ్ర విద్యా సహకారాన్ని అందించడమే లక్ష్యమని తెలిపారు. ‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చంద్రబాబు డ్రామా’ నరసన్నపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జారీ చేసిన జీఓ నంబర్ 176 ను వ్యతిరేకించి కో ర్టుల ద్వారా వెన్నుపోటు పార్టీ అధినేత చంద్రబాబు అప్పట్లో అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అప్పట్లో బీసీలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని నమ్మబలుకుతూ జీఓ ఎంఎస్ నంబర్ 105 జారీ చేసి పాలాభిషేకం చేయించుకోవడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. బీసీల ఆత్మ గౌరవం గురించి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీసీలకు టీడీపీ చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారానికి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో బీసీ వర్గాలకు రాజ్యాధికారం వచ్చిందని గుర్తు చేశారు. -
● ప్రారంభించారు.. వదిలేశారు
అత్యంత వెనుకబడిన గిరిజన తెగల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ పథకంలో భాగంగా వసతిగృహాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి హిరమండలం మండలానికి ఒక వసతిగృహాన్ని ఎంపిక చేసింది. రూ.2.75 కోట్లు మంజూరు చేసింది. వసతిగృహ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం కూడా జరిగింది. కానీ ఇంతవరకూ అందులో విద్యార్థులకు విద్యాబోధన లేదు, వసతి లేదు. దీంతో ఈ భవనం నిరుపయోగంగా వెక్కిరిస్తోంది. వెనుకబడిన ప్రాంతాల్లో డ్రాపౌట్స్ను తగ్గించడం, నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో జన్మన్ వసతి గృహాలను ఏర్పాటుచేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో గిరిజన సంక్షేమ శాఖ వెనుకబడి ఉంది. బాలబాలికలకు వేర్వేరుగా ఉండే ఈ వసతిగృహాల్లో ఈ లెర్నింగ్కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఈ వసతి గృహంలో విద్యాబోధన లేదు. నిర్వహణ లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – హిరమండలం -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
సారవకోట: మండలంలోని పెద్దగుజ్జువాడ జంక్షన్ దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమ్మరిగుంట పంచాయతీ సింగంవలస గ్రామానికి చెందిన కుంచి సుబ్బారావు (36) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కుంచి సుబ్బారావు, అతని బావమరిది పోతల నాగరాజు ద్విచక్ర వాహనంపై పాతపట్నం మండలం తెంబూరు నుంచి పెద్దలంబ వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో పెద్దగుజ్జువాడ నుంచి తెంబూరు వైపు వెళ్తున్న ఒక కారు ఢీకొనడంతో సుబ్బారావు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజుకు తీవ్రగాయాలవ్వడంతో 108 వాహనంలో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులిచ్చిన సమాచారం మేరకు ఏఎస్ఐ కృష్ణారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు ప్రస్తుతం పెద్దలంబలో ఉంటూ వ్యవసాయం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య సుజాత, కుమార్తె డిల్లేశ్వరి, కుమారుడు ప్రభాస్ ఉన్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రైతు మృతదేహం లభ్యం ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని సైదాలపుట్టుగ గ్రామానికి చెందిన రైతు నారద గంగయ్య పొలం పనుల్లో భాగంగా మంగళవారం బాహుదానది దాటుతూ నది ఉద్ధృతకు గల్లంతైన విషయం తెలిసిందే. రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. అయితే బుధవారం ఉదయం బాహుదా నది ఒడ్డుకు మృతదేహం కొట్టుకొచ్చినట్లు స్థానికులు గమనించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రూరల్ ఎస్ఐ ఆర్.జనార్థనరావు మృతదేహాన్ని ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించి, శవ పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు. వ్యక్తి ఆత్మహత్య శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని గోనెలవారి వీధిలో నివసిస్తున్న తోలేటి మహేష్ (50) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ బుధవారం వెల్లడించారు. మహేష్ కార్పెంటర్గా పనిచేస్తూ భార్య రాజేశ్వరితో కలిసి గోనెలవారి వీధిలో నివసిస్తున్నాడు. భార్య రాజేశ్వరి రైతుబజారు సమీపంలోని ఒక టైలర్ షాపులో పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలుండగా.. ఒకరికి వివాహమై తన భర్తతో కలసి హరిపురంలో నివసిస్తోంది. రెండో కుమార్తె సౌమ్య రిమ్స్ కళాశాలలో నర్సింగ్ చదువుతోంది. రెండు సంవత్సరాలుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న మహేష్, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మంగళవారం రాత్రి ఉరివేసుకున్నాడు. ఎదురింటివారు వచ్చి చనిపోయాడని నిర్ధారించారని, ఈ మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని భార్య రాజేశ్వరి తెలపడంతో కేసు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు. -
నరకానికి నకలు..!
వజ్రపుకొత్తూరు రూరల్: మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న పూడిగల్లి వద్ద ఆర్అండ్బీ డబుల్ రోడ్డు పరిస్థితి నరకానికి నకలుగా మారింది. బెండి నుంచి నువ్వలరేవు వరకు ఈ డబుల్ రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రోడ్డుపైన తేలిన రాళ్లతో ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రానికి ప్రధాన రోడ్డు కావడంతో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీంతో ప్రమాదవశాత్తు వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. అలాగే ఈ రోడ్డుపై భారీ వాహనాలు ప్రయాణం చేస్తున్న సమయంలో దుమ్ము, ధూళి ఎగిరి ఇళ్లలోకి చేరుతుండడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని రోడ్డు పక్కన నివాసముంటున్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.23 కోట్లు వ్యయంతో రేగిలిపాడు నుంచి బెండి మీదుగా నువ్వలరేవు వరకు డబుల్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. అదే ప్రభుత్వ హయాంలో దాదాపుగా 60 శాతం పనులు పూర్తయ్యాయి. అనంతరం బెండి నుంచి నువ్వలరేవు వరకు మాత్రమే ఈ పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొంతవరకు పనులు హడావుడిగా చేసి అర్ధాంతరంగా వదిలివేయడంతో వాహనదారులు, ప్రయాణికులు, స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. -
అక్టోబర్లో ఉత్తరాంధ్ర సాహిత్య సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్ : విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అక్టోబర్ 10, 11వ తేదీల్లో జరగనున్న ఉత్తరాంధ్ర జిల్లాల సాహిత్య సమ్మేళనం విజయవంతం చేయాలని సాహితీవేత్తలు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో బుధవారం పోస్టర్ ఆవిష్కరించారు. కవిత్వం, కథ, పాట ప్రక్రియల్లో జరిగే ఈ సాహిత్య సమ్మేళనంలో ప్రసిద్ధ రచయితలతో యువ రచయితలకు ముఖాముఖి ఉంటుందని కథా రచయిత అట్లాడ అప్పలనాయుడు, సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు తెలిపారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి కన్వీనర్ కేతవరపు శ్రీనివాసు, విశ్వసాహితీ ఆమదాలవలస ప్రధాన కార్యదర్శి కర్నేన జనార్దనరావు, కథా నిలయం కార్యదర్శి దాసరి రామచంద్రరావు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం ప్రతినిధి ఎం.ప్రభాకర్రావు, పి.సుధాకర్రావు, నెట్టిమి రమణారావు, పూజారి దివాకర్, ఉదయ్కిరణ్, బాడాన శ్యామలరావు, భోగేల ఉమామహేశ్వరరావు, వాసవి పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి శ్రీకాకుళం: ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాలని ఏపీటీఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తూ, చట్టంలో సరిదిద్దాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నాయని గుర్తు చేశారు. ఇక్కడి ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడం తగదన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్లో 40 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు చింతాడ దిలీప్, జిల్లా గౌరవాధ్యక్షుడు టెంక చలపతిరావు, ప్రధాన కార్యదర్శి బుక్కూరు వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు మామిడి భుజంగరావు, కార్యదర్శి సుమలత, గున్న ప్రసాదరావు, నవీన్, అనంత ఆచార్యులు, వై.వి.రమణ, జితేంద్ర, కిరణ్, బాలాజీ, లక్ష్మణ్, సూర్యనారాయణ, భాస్కరరావు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు తరహాలో తీర్మానం చేయాలి టెక్కలి: ఇన్సర్వీస్ టీచర్లకు టెట్కు సంబంధించి తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ తీర్మానం చేయాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రెగ్యులర్ టెట్ రాసిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల అర్హత 60 మార్కులుగా నిర్ణయించి ఉత్తీర్ణత ప్రకటించాలని కోరారు. ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి టెక్కలి : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించేలా ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని యూటీఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్.కిశోర్కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం టెక్కలిలో ద్విచక్రవాహనాల జాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు శాశ్వతంగా టెట్ నుంచి మినహాయించాలన్నారు. కోర్టు తీర్పు ను సాకుగా చూపుతూ ప్రస్తుత ప్రభుత్వం అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. ఉపాధ్యాయుల సమస్యలపై చేస్తున్న పోరాటాలను నీరుగార్చేందుకు టెట్ వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, కె.దాలయ్య, కె.వైకుంఠరావు, గణపతి, జి.నారాయణరావు, డి.లక్ష్మినారాయణ, డి.పాపారావు, జి.మోహన్రావు, గణపతి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులు, పెన్షనర్లపై నిర్లక్ష్యం తగదు...
టెక్కలి: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులు, పెన్షనర్లపై నిర్లక్ష్య వైఖరి తగదని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర కార్యద ర్శి దివ్వల పోలయ్య బుధవారం ఒక ప్రకటనలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక వైపు నిరుద్యో గ సమస్య, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పడుతున్న అవస్థలు ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 5 డీఏలు బకాయి పడిందని పేర్కొన్నారు. పీఆర్సీ కమిషన్ నియామకం విషయంలో తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే 30 శాతం వరకు ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతీ మండలానికి సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్తో సంఘాలు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధుల సమక్షంలో వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని కోరారు. ఆరోగ్య సేవల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బ్యాంకులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి సేవలు అందజేయాలన్నారు. రైళ్ల ప్రయాణంలో ప్రత్యేక రాయితీ కల్పించాలని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. -
ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శితో వీసీ భేటీ
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేఆర్ రజనీ బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జె.శ్యామలరావును అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వర్సిటీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. సెప్టెంబర్లో వర్సిటీలో నిర్వహించతలపెట్టిన మూడో స్నాతకోత్సవం గురించి ఆయనతో చర్చించారు. అభివృద్ధికి ప్రభుత్వపరంగా సహకారం అందజేయాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు రణస్థలం: మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన గుడివాడ అప్పలనర్సయ్య, మరో వ్యక్తి కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఇరువురికీ తీవ్ర గాయాలైనట్లు జేఆర్పురం పోలీసులు తెలిపారు. స్థానికులు, జేఆర్పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణాపురం గ్రామానికి చెందిన గుడివాడ అప్పలనర్సయ్య తన ఇంటికి అవసరమైన ఎలక్ట్రికల్ వస్తువులు కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై రణస్థలం వెళ్లి తిరిగి వస్తుండగా కృష్ణాపురం, గుమ్మడాం గ్రామాల జంక్షన్ వద్ద ఒక ట్రాక్టర్ అతివేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న అప్పలనర్సయ్య, వెనుక కూర్చొని ఉన్న ఎలక్ట్రీషియన్ లంక ప్రభాకర్కు తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనంపై ఒకరిని శ్రీకాకుళం రిమ్స్కు, మరొకరిని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. కారు బోల్తా రణస్థలం: మండలంలోని పైడిపేట జాతీయ రహదారిపై బుధవారం ఉదయం శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కొత్త కారు అదుపుతప్పి డివైడర్ ఢీకొని బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న నలుగురు చిన్న, చిన్న గాయాలతో బయటపడ్డారు. అందరూ సురక్షితంగా బయటపడడంతో అంతా ఉపిరిపీల్చుకున్నారు. హైవే పెట్రోల్ పోలీసులు వచ్చి సపర్యలు చేసి అక్కడ నుంచి పంపివేశారు. దీనిపై ఎటువంటి పిర్యాదు అందలేదని జేఆర్పురం ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. రెండు చోరీ కేసుల్లో నలుగురు అరెస్ట్ పెందుర్తి : సబ్బవరం–షీలానగర్ రోడ్డు పనులకు వినియోగించే ఐరన్, కేబుల్ వైర్లను దొంగిలించిన నలుగురు వ్యక్తులను పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4.5 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి క్రైం పోలీస్ స్టేషన్లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో క్రైం ఏసీపీ ఎ.వెంకటరావు వివరాలు వెల్లడించారు. సబ్బవరం–షీలానగర్ రోడ్డు పనుల నిమిత్తం పెందుర్తి మండలం నందవరపువానిపాలెం సమీపంలో ఐవోసీఎల్ సంస్థ ఐరన్, కేబుల్ వైర్లను నిల్వచేసింది. ఈ నెల 8న సైట్ ఇన్చార్జి తోట సునీల్రాజ్ సామగ్రి సరిచూడగా అందులో దాదాపు రూ.3 లక్షల విలువైన ఐరన్, కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. – గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి అనుసంధానంగా నిర్మిస్తున్న సబ్బవరం–షీలానగర్ రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం జేపీ కన్స్ట్రక్షన్స్ సంస్థ నరవ వద్ద సెంటరింగ్ ప్లేట్లు, యూ జాకీలు, బేస్ జాకీలు భద్రపరిచింది. గత నెల 10న సైట్ సెక్యూరిటీ సూపర్వైజర్ వంకా శివశంకర్ సామగ్రి పరిశీలించగా రూ.1.50 విలువైన సామగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆయా చోరీల విషయంలో ఫిర్యాదులు అందుకున్న పెందుర్తి క్రైం విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని కొబ్బరితోట(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కుప్పిలి)కి చెందిన అలపాన రెడ్డి(29), పూర్ణామార్కెట్ కల్లు పాకల(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా లోపెంట)కు చెందిన నాయన అసిరిబాబు(30), పూర్ణామార్కెట్ ప్రసాద్ గార్డెన్స్(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వెంకయ్యపేట)కు చెందిన దల్లి గోవింద్(29), 104 ఏరియాకు చెందిన పరపటి సంతోష్కుమార్(31) ఆయా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను బుధవారం నగరంలో మాటు వేసి పట్టుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. వారిని నుంచి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ఆయా కేసుల్లో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ క్రైం సీఐ బి.తిరుమలరావు, పెందుర్తి క్రైం ఎస్ఐ డి.సూరిబాబు, ఏఎస్ఐ కె.శ్రీనివాసరావు, హెచ్సీ వి.పేరయ్యనాయుడు, పీసీలు బి.దేముడునాయుడు, ఎల్.తాతారావులను ఉన్నతాధికారులు అభినందించారు. -
బేస్బాల్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతాం
● బేస్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత ● జిల్లా బేస్బాల్ జట్ల ఎంపికలకు పోటెత్తిన క్రీడాకారులు శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లాలో సంఘ ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో బేస్బాల్ క్రీడను మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్తామని జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు తమ్మినేని సుజాత పేర్కొన్నారు. జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల బేస్బాల్ జట్ల ఎంపిక పోటీలు బుధవారం శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జరిగాయి. ఈ సెలక్షన్ ట్రయల్స్కు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పోటెత్తారు. సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా బేస్బాల్ ప్రాబబుల్స్ జట్లకు ఎంపిక చేసినట్టు జిల్లా బేస్బాల్ సంఘ ప్రతినిధులు వెల్లడించారు. జిల్లా ప్రాబబుల్స్ జట్లకు సెప్టెంబర్ 4 నుంచి 9వ తేదీ వరకు ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు గ్రామంలో నిర్వహించనున్న శిక్షణా శిబిరాల అనంతరం, జిల్లా తుది జట్లను ప్రకటిస్తామని కార్యనిర్వహణ కార్యదర్శి కొండపల్లి రవికుమార్ చెప్పారు. పుట్టపర్తిలో రాష్ట్రస్థాయి పోటీలు జిల్లా జట్లను శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనున్న 8వ ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్(మెన్, ఉమెన్) బేస్బాల్ ఛాంపియన్ షిప్–2026 పోటీలకు పంపించనున్నట్లు జిల్లా బేస్బాల్ సంఘ ప్రధాన కార్యదర్శి గుంటముక్కల వీరభద్రరావు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సమష్టిగా రాణించి పతకం సాధించడమే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, కొండపల్లి కిరణ్కుమార్, హెచ్ఎం యాళ్ల పోలినాయుడు, సీనియర్ పీడీలు చల్లా జగదీశ్, సాధు శ్రీనివాసరావు, లకిలీ రాంబాబు, సింహాద్రినాయుడు, రామాంజనేయులు, రవిబాబు, సంఘ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
టీడీపీలో స్థానిక గుబులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘సర్వేలు ప్రతికూలంగా ఉన్నాయి. అనుకూల మీడియాలు వ్యతిరేక కథనాలు రాయకతప్పడం లేదు. ప్రజల్లో వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కగలమా..?’ ఇప్పుడిదే టీడీపీలో గుబులు పుట్టిస్తోంది. ఆ నాయకుల్లో భయాందోళన రేకెత్తిస్తోంది. పోలీసు యంత్రాంగం, అధికార మంత్రాంగంతో ఏకపక్షంగా స్థానిక సంస్థలను కొట్టేద్దామన్న కలలు సాకారమయ్యేలా లేవు. ప్రతీ గ్రామంలో ఢీ అంటే ఢీ అన్నట్టుగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. కనీసం పరువు కాపాడుకోగలమా అని టీడీపీ నాయకులు అంతర్మథనంలో పడ్డారు. మోసం.. దగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. అభివృద్ధి, సంక్షేమం ఊసేలేదు. కొత్తవి పక్కన పెడితే గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు సైతం పూర్తి చేసే పరిస్థితి లేదు. గతంలో అమలైన సంక్షేమ పథకాలు ఎత్తివేశారు. ఇస్తున్న వాటిలో కోత పెట్టారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సక్రమంగా ఇవ్వలేదు. రాయితీలు, ఇన్ఫుట్ సబ్సిడీలు అందడం లేదు. వరుణుడు ముఖం చాటేయడంతో పొలాలు ఎండిపోతున్నాయి. చంద్రబాబు వస్తే ప్రకృతి విపత్తు తప్పదనే పరిస్థితులను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. సాగునీటికే కాదు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొంది. ప్రజల ముంగిటకు వైద్య సేవలు అందడం లేదు. విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారు. సరైన బ్యాగులు కూడా ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల ఊసే లేదు. ఉద్యోగ వర్గాల పరిస్థితి మరీ దారుణం. పాలకులు ప్రభుత్వ ఉద్యోగులను పురుగుల్లా చూస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలు మద్యం ఏరులై పారుతోంది. ఇంటింటికీ తాగునీటిని అందించలేకపోయినా వీధికొక బెల్ట్షాపు పెట్టి విచ్చలవిడిగా మందు అందుబాటులో ఉంచారు. ఫలితంగా ఎక్కడికక్కడ గొడవలు చోటు చేసుకున్నాయి. గంజాయికి అడ్డు అదుపూ లేకుండా పోయింది. పేకాట, ఇతరత్ర జూదం ఎక్కువైపోయింది. ఏ ఒక్క నిరుపేద, మధ్యతరగతి కుటుంబంలో ప్రశాంతత లేదు. వీటికి తోడు అధికార పార్టీ నాయకుల దాడులు, గొడవలు, విధ్వంసకర ఘటనలతో ప్రజల్లో భయాందోళన ఏర్పడింది. ఇక, తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వేధిస్తున్న ఘటనలైతే చెప్పనక్కర్లేదు. సంబంధం లేని వ్యక్తులను కేసుల్లో ఇరికిస్తున్నారు. పలాస, టెక్కలి, పాతపట్నం, ఆమదాలవలస, ఎచ్చెర్ల, శ్రీకాకుళంలో లెక్కకు మించి బాధితులు ఉన్నారు. అక్రమాలు, ఆక్రమణలు ఎంఆర్పీకి మించి విక్రయాలతో మద్యం దోపిడీ సాగిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. నదులతో పాటు రోడ్లను కూడా ఛిద్రం చేస్తున్నారు. ఎక్కడ కొండలు కన్పిస్తే అక్కడ తవ్వేస్తున్నారు. కంకర, గ్రావెల్ దోచేస్తున్నారు. విలువైన గ్రానైట్ తవ్వకాలు జరిపి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. చెరువులు తవ్వి అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములే కాదు ప్రైవేటు వ్యక్తుల జిరాయితీ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నాసిరకం రోడ్లు వేసి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేశారు. ప్రజలకు ఉపాధి లేకపోయినా అధికార పార్టీ నాయకులకు మాత్రం దండిగా సొమ్ములు వస్తున్నాయి. ఎక్కడా చూసినా అవినీతి, అక్రమాలు, ఆక్రమణలే. ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకు ఇదే పరిస్థితి. దోపిడీ విషయంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి కూటమి పాలనలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. ఎక్కడా చూసినా ప్రజల్లో వ్యతిరేకతే కనిపిస్తోంది. అభివృద్ధి పబ్లిసిటీ, రీల్స్లో తప్ప క్షేత్రస్థాయిలో లేదు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే ఏమైనా ఉందా? ఇప్పుడదే పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంటోంది. సర్వేలన్నీ అదే చెబుతున్నాయి. వైఎస్సార్సీపీని ఆపలేరని, ఇప్పు డు ఎన్నికలొస్తే ఆ పార్టీయే విజయం సాధిస్తుందని సర్వే యాజమాన్యాలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఐఐటీ నిపుణులు చేసిన సర్వేల్లో కూడా వైఎస్సార్సీపీకే పట్టం కడుతున్నాయి. దీంతో స్థానిక సంస్థలన్నీ తమ ఖాతాలో వేద్దామనుకున్న కూటమి పార్టీల కలలు కల్లలవుతున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ రోజురోజుకూ బలపడుతోంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ దక్కించుకుంటోంది. పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా జనాదరణ అంచనాలకు మించి కనిపిస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల జరిగిన జిల్లా పర్యటన జన సునామీలా సాగింది. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువైతేనే ప్రతిపక్షానికి ఆ స్థాయిలో ప్రజలు పోటెత్తుతారనేది తెలిసిన విషయమే. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా రాజీపడొద్దని, ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వొద్దని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. దీంతో ఎన్నికల్లో విజయభేరి మోగించి, సత్తా చాటాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ తరుణంలో ఎన్నికల నుంచి బయటపడటానికి కూటమి పార్టీలకు పోలీసు యంత్రాంగం, అధికార మంత్రాంగం తప్ప మరో దారి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్ సీపీకే పట్టం కడుతున్న సర్వేలు ఇటీవల జన సునామీగా సాగిన వైఎస్ జగన్ పర్యటన ప్రజలు విశ్వాసం చూరగొన్న ప్రతిపక్ష పార్టీ వెన్నుపోటు పార్టీకి చుక్కలు తప్పవంటున్న విశ్లేషకులు -
సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ ప్రగతికి వినియోగించాలి
● ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు టెక్కలి: యువ ఇంజినీర్లు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ ప్రగతికి వినియోగించే విధంగా సామాజిక బాధ్యత తీసుకోవాలని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధనం, సౌర విద్యుత్ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలతో పాటు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవడం వలన ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అభిప్రాయపడ్డారు. అలాగే ఉద్యోగ సాధనతో పాటు స్వయం ఉపాధి, వ్యాపార ఆలోచనలతో సరికొత్త చరిత్ర సృష్టించవచ్చునని తెలిపారు. దేశ ప్రగతికి ఉపయోగపడే విధంగా సరికొత్త ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సుమారు 300 మంది విద్యార్థులకు ఇంజినీరింగ్ డిగ్రీ పట్టాలను అందజేశారు. అలాగే ఉత్తమ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సిల్వర్ జూబ్లీ పైలాన్ను ప్రారంభించారు. కార్యక్రమంలో జేఎన్టీయూ వీసీ వి.వి.సుబ్బారావు, కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, డైరక్టర్లు వి.వి.నాగేశ్వరరావు, కె.మధుకుమార్, కె.రవికుమార్, టి.నాగశేషు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ఎస్టేట్ మేనేజర్ పి.రమేష్ పాల్గొన్నారు. -
నాణ్యత చూస్తే నవ్విపోతారు
● కుంగిపోతున్న తారురోడ్డు ● కడపలవానిగెడ్డ వద్ద కల్వర్టు పనుల్లో నాణ్యతాలోపం ● మండిపడుతున్న స్థానికులు హిరమండలం : లక్షల రూపాయలతో కల్వర్టు నిర్మించారు. అనుసంధానంగా 40 మీటర్ల తారురోడ్డు నిర్మించారు. కానీ నిర్మించిన నాలుగు నెలల వ్యవధిలోనే రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. ద్విచక్ర వాహనాలు తప్ప నాలుగు చక్రాల వాహనాలు వెళ్లేందుకు వీల్లేకుండా మారింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఎల్ఎన్పేట మండలంలో అలికాం–బత్తిలి ప్రధాన రోడ్డులో తురకపేట, దబ్బపాడు, మిరియాపల్లి ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇదే రహదారిని ఎల్ఎన్పేటకు కూడా అనుసంధానించారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ రోడ్డులో తురకపేట, దబ్బపాడు మధ్య కడపలవానిగెడ్డ ఉంది. ఇక్కడ వంతెన నిర్మాణంతో పాటు అనుసంధాన రోడ్డు నిర్మాణానికి రూ.67 లక్షలు కేటాయించారు. పనులు పూర్తై ఈ ఏడాది ఏప్రిల్లో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో నాలుగు నెలలకే రోడ్డు కుంగిపోయింది. బెర్ములు కిందకు దిగిపోయాయి. కొంచెం బరువుతో వాహనం వస్తే చాలు రోడ్డు ఉబికిపోయి ముందుకు కదలని దుస్థితి. పనుల్లో నాణ్యతకు, నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత ఘోరమా..? రోడ్డు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదు. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చా రు. ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఈ విషయంలో జిల్లా యంత్రాంగం స్పందించాలి. రోడ్డును సరిచేయకపోతే ఉద్యమిస్తాం. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం -
వెలుగు పంచుదాం..!
కనులు మూసినా..● నేత్రదానంతో మరొకరి జీవితంలో వెలుగు ● సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు ● విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న అధికారులు అవగాహన తప్పనిసరి ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, ఎప్పటికప్పుడు నేత్ర వైద్య నిపుణులతో కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా చూపును సంరక్షించుకోవచ్చు. ప్రస్తుతం చిన్నారులు గంటల తరబడి మొబైల్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను ఉపయోగించడం వల్ల చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పిల్లలను సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి. – ఎంఆర్కే దాస్, ఆప్తాల్మిక్ అధికారి, నేత్రదాన మోటివేటర్ ప్రోత్సహించాలి జిల్లావ్యాప్తంగా నేత్రదాన ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. నేత్రదానం మరింత విస్తృతంగా జరగాలంటే కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు సమీపంలోని నేత్రనిధి కేంద్రాన్ని సంప్రదించి, నేత్రదానానికి అనుమతి ఇచ్చి ఇతరులను కూడా ప్రోత్సహించాలి. – డా.ఎస్.పుష్పలత, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ శ్రీకాకుళం అర్బన్: సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనిషి శరీరంలో అన్ని అవయవాలు కంటే కంటికి ఉన్న ప్రత్యేకత వేరు. ప్రపంచాన్ని చూడాలంటే కళ్లతోనే సాధ్యమవుతుంది. కంటిచూపు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. అందువలన కంటి చూపు కోల్పోయిన వారికి వెలుగును ప్రసాదించేందుకు నేత్రదానం ఎంతో కీలకమని జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రజల్లో నేత్రదానంపై అవగాహన పెంపొందించేందుకు 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. కార్నియా అంధత్వం కార్నియా సంబంధిత అంధత్వం కారణంగా ఎంతోమంది దృష్టిని కోల్పోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. కార్నియా అంధత్వాన్ని నివారించడంలో నేత్రదానం ద్వారా సేకరించే ఆరోగ్యకరమైన కార్నియాలు ఎంతో ఉపయోగపడతాయి. అందువల్ల మరణానంతరం నేత్రదానం చేయడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని అధికారులు సూచిస్తున్నారు. కార్నియా అంధత్వానికి కారణాలు కంటికి గాయాలు కావడం, రసాయనాలు లేదా దుమ్ము, ధూళి పడడం, వరి రేకు, చెరుకు రేకు వంటివి కంటికి తగిలినప్పుడు సకాలంలో సరైన వైద్యం అందకపోవడం వంటి కారణాలతో కార్నియా దెబ్బతిని శాశ్వత అంధత్వం ఏర్పడే అవకాశం ఉంది. కంటికి ఏదైనా గాయం అయినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. ఎవరు నేత్రదానం చేయవచ్చు నేత్రదానానికి వయసు, కులం, మతం, లింగం వంటి భేదాలు లేవు. సాధారణంగా చాలా మంది వ్యక్తులు నేత్రదానం చేయవచ్చు. రక్తపోటు, మధుమేహం, ఆస్తమా ఉన్నవారు, గతంలో కంటి శస్త్రచికిత్స చేయించుకున్నవారు, కళ్లద్దాలు ఉపయోగించే వారు కూడా నేత్రదానం చేయడానికి అర్హులై ఉండవచ్చు. తుది నిర్ణయం నేత్రబ్యాంకు వైద్య నిపుణులదే. అయితే కొన్ని తీవ్రమైన అంటువ్యాధులు, రక్త సంబంధిత వ్యాధులు, ఇతర నిర్దిష్ట పరిస్థితుల్లో మరణించిన వారి నుంచి నేత్రాలను సేకరించడం సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల మరణం సంభవించిన వెంటనే సంబంధిత నేత్ర బ్యాంకు లేదా వైద్య సిబ్బందిని సంప్రదించి వారి సూచనలు పాటించాలి. నేత్రదానం ఎప్పుడు చేయాలి ఒక వ్యక్తి మరణించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా.. సాధారణంగా 6 నుంచి 8 గంటల్లోపు నేత్రదాన ప్రక్రియను పూర్తి చేయాలి. ముందుగా నేత్రదాన ప్రతిజ్ఞ చేయవచ్చు. ప్రతిజ్ఞ చేయకపోయినా మరణానంతరం కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించవచ్చు. మరణం సంభవించిన వెంటనే దాత తలను కొద్దిగా ఎత్తి ఉంచాలి. రెండు కళ్లను మూసి, శుభ్రమైన చల్లటి తడి వస్త్రం లేదా తడి దూదిని కళ్లపై ఉంచాలి. వీలైనంత త్వరగా సమీపంలోని నేత్రబ్యాంకు, కంటి ఆస్పత్రి, రెడ్క్రాస్ నేత్రనిధి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా జిల్లా ఆస్పత్రిని సంప్రదించాలి. నేత్రదానం ఎందుకు అవసరం దేశంలో ప్రతీ సంవత్సరం అనేక మంది వివిధ కారణాలతో మరణిస్తున్నప్పటికీ, మరణానంతరం నేత్రదానం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరోవైపు ప్రతి సంవత్సరం కొత్తగా కార్నియా అంధత్వ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రజల్లో నేత్రదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు మరణానంతరం తమ కళ్లను బూడిదపాలు కాకుండా, మట్టిపాలు కాకుండా, మరో వ్యక్తి జీవితంలో వెలుగులు నింపేలా నేత్రదానం చేయాలని అధికారులు పిలుపునిస్తున్నారు. నేత్రదానాన్ని ప్రతి కుటుంబం ఒక సామాజిక బాధ్యతగా, కుటుంబ సంప్రదాయంగా స్వీకరించాలని కోరుతున్నారు. అధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నేత్రదాన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్ర చికిత్స తర్వాత నల్లగుడ్డు అంధత్వం శస్త్ర చికిత్సకు ముందు అపోహలు తొలగించాలి నేత్రదానంపై ప్రజల్లో ఇంకా అపోహలు ఉన్నాయి. నేత్రదానంపై మరింతగా అవగాహన కల్పించి వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది. దేశంలో కార్నియా సమస్య వలన చూపు కోల్పోయినవారు 12 లక్షల మంది ఉన్నట్లు సర్వే చెబుతోంది. నేత్రదానం ద్వారా ఇటువంటి వారికి చూపు తిరిగి పొందే అవకాశం ఉంది. ఏడాదికి సుమారు 1.5 లక్షలు నుంచి 2 లక్షల కార్నియాలు అవసరం కాగా.. కేవలం 30 వేల కార్నియాలు మాత్రమే సేకరించడం అవుతోంది. – డా.పి.శ్రీకాంతి, కార్నియా ప్రత్యేక నేత్ర వైద్య నిపుణురాలు -
ప్రియుడి ఇంటి ముందు యువతి నిరసన
రణస్థలం: లావేరు మండలంలోని అదపాక గ్రామానికి చెందిన ఒక యువతి, అదే గ్రామానికి చెందిన జడ్డు సురేష్ అనే వ్యక్తి ప్రేమించి మోసం చేశాడని అతని ఇంటి ముందు బుధవారం నిరసన తెలిపింది. ఆమె తెలిపిన వివరాల మేరకు.. తాను, సురేష్ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని తెలిపింది. సురేష్కు ఇద్దరు సోదరులు ఉండడంతో వాళ్లకి పెళ్లైన తర్వాత తనను వివాహం చేసుకుంటానని చెప్పి శారీరంగా దగ్గరయ్యాడని పేర్కొంది. అయితే ఇటీవల తప్పించుకొని తిరుగుతుండడంతో ప్రశ్నించడంతో.. రూ.15 లక్షల కట్నం, 10 తులాల బంగారం, సారె, ఒక బండి తీసుకొస్తే పెళ్లికి తమ ఇంట్లో ఒప్పుకుంటారని సురేష్ చెప్పినట్లు ఆమె తెలిపింది. దీనిపై లావేరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా.. లావేరు ఎస్ఐ నిర్లక్ష్యంగా స్పందించి నామమాత్రపు కేసు రాసి ఇచ్చారని పేర్కొన్నారు. తదుపరి జిల్లా ఎస్పీకి పిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు సురేష్ కుటుంబ సభ్యులందరూ పారిపోయి.. దొంగతనంగా పెళ్లి చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తనకు న్యాయ చేయాలని కోరారు. ఈ విషయంపై ఎస్ఐ వి.సందీప్ కుమార్ను వివరణ కోరగా లావేరు పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసిన రోజే కేసు నమోదు చేశామన్నారు. బుధవారం ఘటనపై ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు. దీనిపై కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు. -
ఉపాధి కోసం వెళ్తూ.. మృత్యు ఒడిలోకి...
కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్లో విశాఖ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కుతుండగా జారిపడి వ్యక్తి దుర్మరణం చెందాడు. కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామానికి చెందిన తోట వెంకటరావు(47) అనే వ్యక్తి విశాఖ ఎక్స్ప్రెస్లో భీమవరం వెళ్లేందుకు బుధవారం బయల్దేరాడు. టికెట్ తీసి ఒకటో నంబర్ ప్లాట్ ఫాం మీద ఆగిన రైలును ఎక్కి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రైన్ నుంచి జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో ఇతని కాలి మీద నుంచి ట్రైన్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తోట వెంకటరావు భీమవరంలోని ఒక హోటల్లో వంట మనిషిగా 26 ఏళ్లు నుంచి పని చేస్తున్నాడు. మధ్యలో కొన్నాళ్లు స్వగ్రామంలో చిన్న జనరల్ స్టోర్ కూడా నడిపాడు. వ్యాపారం లేకపోవడంతో మళ్లీ వంట పనిచేయడానికి భీమవరం వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇతనికి భార్య సుజాత, కుమారుడు మణికంఠ, కుమార్తె మనీష ఉన్నారు. కుమారుడు మణికంఠ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ కాఫీ హౌస్లో పనిచేస్తుండగా, కుమార్తె మనీష సోంపేటలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటి యజమాని అకస్మాత్తుగా ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మృతుని స్వగ్రామం బల్లిపుట్టుగలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై పలాస జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి సోంపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. 40 నిమిషాలు నిలిచిపోయిన ట్రైన్ విశాఖ ఎక్స్ప్రెస్ నుంచి ప్రయాణికుడు జారిపడి మృతి చెందడంతో ట్రైన్ను సోంపేట స్టేషన్లో 40 నిమిషాలు పాటు నిలిపివేశారు. ప్రమాదం జరిగిందని తెలిసి ప్రయాణికులంతా అవాక్కయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత రైల్వే అధికారులకు స్థానిక స్టేషన్ మేనేజ్మెంట్ సమాచారం ఇవ్వడం, అక్కడి నుంచి మళ్లీ ఆదేశాలు అందిన తర్వాత ట్రైన్ను పంపేందుకు సిగ్నల్ ఇచ్చారు. -
● భానుడి భగభగ..!
ఎండ ప్రభావంతో చెట్టుకింద ఆటలాడుకుంటున్న చిన్నారులుఎండకు చెట్లు కింద సేదతీరుతున్న మూగజీవాలు వర్షాకాలం కొనసాగుతున్నా భానుడి భగభగలు తగ్గడం లేదు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ఎండ తీవ్రతకు మనుషులు, మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండతో చిన్నారులు, మూగజీవాలు చెట్టుకింద సేదతీరిన దృశ్యాలు జి.సిగడాం మండలంలోని నాగువలస నుంచి పొగిరి వెళ్లే ప్రధాన రహదారిలో కనిపించాయి. – జి.సిగడాం -
వివాహిత ఆత్మహత్య
మందస : కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై సువర్ణాపురం పంచాయతీ నాతుపురం బొడ్డులూరుకు చెందిన పుచ్చ మీనాక్షీ(40) అనే వివాహిత మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. మీనాక్షి, భాస్కరరావులు దంపతులు. ఇద్దరికీ తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మంగళవారం మీనాక్షీ భర్తతో మరోసారి గొడవపడింది. దీంతో భాస్కరరావు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. మనస్థాపానికి గురైన మీనాక్షి ఇంట్లో తలుపులు వేసి ఊరి వేసుకుంది. ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ కేసు దర్యాప్తు చేపడుతున్నారు. -
బెట్టింగ్ ఆట..చోరీల బాట
● దొంగతనాలకు పాల్పడిన డిగ్రీ విద్యార్థి అరెస్టు ● 16.25 తులాల బంగారం, రూ.39 వేలు నగదు స్వాధీనం ఇచ్ఛాపురం రూరల్: బెట్టింగులకు బానిసైన ఓ డిగ్రీ విద్యార్థి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతూ చివరకు పోలీసులకు చిక్కాడు. ఇప్పటికే బారువ పోలీస్ స్టేషన్ పరిధిలో అతనిపై ఏడు కేసులు నమోదయ్యాయి. ఇచ్ఛాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామంలో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఈ కేసు వివరాలను కాశీబుగ్గ డీఎస్పీ టీ.భవానీ మంగళవారం సీఐ ఎం.చిన్నంనాయుడు, రూరల్ ఎస్సై ఆర్.జనార్దనరావుతో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. చోరీ సొమ్ము అమ్మేందుకు సిద్ధమై.. డొంకూరు గ్రామంలో ఇటీవల రూ.24 వేల నగదు, బంగారు కాసు చోరీకి గురైనట్లు బాధితులు ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమేరాల ఫుటేజీలను పరిశీలించగా సోంపేట మండలం ఇసుకలపాలెం గ్రామానికి చెందిన వాసుపల్లి తాతారావు అనే డిగ్రీ విద్యార్థి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. తదుపరి దర్యాప్తులో అతనిపై గతంలోనే ఇచ్ఛాపురం రూరల్, కవిటి, బారువ పోలీస్ స్టేషన్లలో ఏడు కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. దొంగతనం ద్వారా సంపాదించిన సొత్తును ఒడిశాలోని బరంపురంలో విక్రయించేందుకు విద్యార్థి సిద్ధమయ్యాడు. మంగళవారం ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి జంక్షన్ వద్ద బస్సు కోసం వేచి ఊండగా, రూరల్ ఎస్ఐ ఆర్.జనార్థనరావు తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 16 తులాల పావు బంగారం, రూ.39 వేలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగులే కారణం.. బారువలో డిగ్రీ చదువుతున్న తాతారావు బెట్టింగులకు బానిసై డబ్బులు అవసరం కావడంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. యువత ఆన్లైన్ బెట్టింగులు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీఐ తెలిపారు. -
32
కిలోలగంజాయి స్వాధీనం వజ్రపుకొత్తూరు రూరల్: పర్లాకిమిడి నుంచి తమిళనాడుకు 32.590 కిలోల గంజాయి అక్రమంగా తరలిస్తు న్న కొందరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను డీఎస్పీ భవానీ మంగళవారం మీడి యా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన నిందితులు పెయింటింగ్ ప నులు చేసుకుంటూ ఒకరికొకరు పరిచయమయ్యా రు. సూళ్లురుపేట సమీపంలోని తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో బాలాజీ అనే వ్యక్తి వద్ద చిన్న చిన్న గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేసి సే వించేవారు. ఒడిశాలో గల పర్లాకిమిడికి వెళ్లి పినో ష్కుమార్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి తీసుకువస్తే ఒక్కొక్కరికి రూ.5 వేలు ఇస్తానని చెప్ప డంతో వారు గంజాయి రవాణాకు సిద్ధమయ్యారు. అక్రమంగా 16 ప్యాకెట్లలో 32.590 కిలోల గంజాయి తరలిస్తుండగా కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడటంతో వారిపై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. కేసులో ఎ–1గా సర్వసన్ ఫళని, ఎ–2గా భూపాలన్, ఎ–3గా మసన్, ఎ–4గా పినోష్కుమార్, ఎ–5గా బాలాజీ నమోదయ్యారు. -
బంధువుల వివాహానికి వచ్చి విగతజీవిగా..
● జమ్ము కాలువలో విశాల్ మృతదేహం లభ్యం నరసన్నపేట : ఖరగ్పూర్లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న మెండ విశాల్కుమార్ (30) సారవకోట మండలం కేలవలస కల్యాణ మండపంలో జరిగిన వివాహనికి వచ్చి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు. సోమవారం విశాల్కుమార్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి సారవకోట మండలం కిన్నెరవాడ సమీపంలోని వంశధార కాలువలోకి దూసుకెళ్లింది. మంగళవారం ఉదయం నరసన్నపేట మండలం జమ్ము వద్ద వంశధార బ్రాంచి కెనాల్లో విశాల్ మృతదేహం కొట్టుకురావడంతో స్థానికులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, విశాల్కుమార్ ఖరగ్పూర్ నాలుగేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తూ బంధువుల అమ్మాయి వివాహానికి వచ్చి ఇలా విగత జీవిగా మారాడు. కుమారుడు అకస్మాత్తుగా మర ణించడంతో తల్లిదండ్రులు ప్రభాకర్, భాగ్యలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సారవకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి
శ్రీకాకుళం: విద్యాశాఖ నిర్వహించనున్న స్పెషల్ టెట్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ ఒకే కనీస అర్హత మార్కులు నిర్ణయించాలని, ఏ సబ్జెట్కు వారికి ఆ సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వమే ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయుల ఆందోళన దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పును సాకుగా చూపుతూ కనీస ప్రయత్నం చేయకపోవడం సరికాదన్నారు. ఓవైపు పాఠ్యాంశాలు బోధిస్తూ, ప్రభుత్వ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలకు, కాంప్లెక్స్ సమావేశాలకు హాజరవుతూ, బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు సతమతవుతున్నారని, ఈ క్రమంలో టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బుధవారం నుంచి జిల్లాలో బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, సెప్టెంబర్ 3న చలో విజయవాడ , అప్పటికీ విద్యాశాఖ మంత్రి చర్యలు చేపట్టకపోతే సెప్టెంబర్ 4 నుంచి రాష్ట్రం, కేంద్రంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామూర్తి, కోశాధికారి పి.సూర్యప్రకాష్, సహాధ్యక్షులు వై.ఉమాశంకర్, బి.ధనలక్ష్మి, ఎస్ నారాయణరావు, స్వర్ణకుమారి, శారద, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ షెడ్యూ ల్డ్ కులాల సహకార ఆర్థిక సంస్థ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలోని ఎస్సీ యువతీ యువకులకు వివిధ సాంకేతిక, వృత్తి విద్యా విభాగాల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు (ఈడీ) వినాయకం మంగళవారం ఓ ప్రకటన లో తెలిపారు. కిసాన్ డ్రోన్ ఆపరేటర్, ఎలక్ట్రిక్ వెహికిల్ మెయింటెనెన్స్, మొబైల్ ఫోన్ రిపేర్, సోలార్ టీవీ ఇన్స్టాలర్, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, స్టిచింగ్ ఆపరేటర్, కంప్యూటర్ అసిస్టెంట్, టెలికామ్ కస్టమర్ కేర్, ఫుడ్ – బెవరేజ్, ఇజ్రాయెల్ హోమ్ మేడ్ హెల్పర్ తదితర 14 రకాల కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కోర్సు ను బట్టి 8, 9, 10, 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, నర్సింగ్ అర్హతలు ఉండి 18–40 ఏళ్లు (హోమ్ మేడ్ హెల్పర్ కోర్సుకు 25–45 ఏళ్లు) ఉన్నవారు అర్హులు. 60 నుంచి 100 రోజుల వ్యవధితో ఉండే ఈ శిక్షణ పూర్తయిన వెంటనే అభ్యర్థులకు ప్రముఖ ప్రైవేటు సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన జిల్లాలోని అర్హులైన ఎస్సీ యువతీ యువకులు తమ దరఖాస్తులను ఆగస్టు 31, 2026 లోగా శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ వద్దగల తారకరామ సముదాయ భవనంలో ఉన్న జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంస్థ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వివరాలకు 08942–240598 నంబర్ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు చెప్పండి: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్ రాజకీయ పార్టీలను కోరారు. రాజకీయ పార్టీలతో కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక జాబితా సవరణపై ఆయన మంగళవారం వారాంతపు సమావేశం నిర్వహించారు. ఈ నెల 22, 23వ తేదీల్లో స్వీకరించిన ఫారాల వివరాలను నియోజకవర్గాల వారీగా తెలియజేశారు. జారీ చేసిన 1,16,258 నోటీసులకు బీఎల్ఓ ద్వారా డాక్యుమెంటేషన్ అప్డేషన్ పూర్తి చేసినవి నేటి వరకు 51,878 ఉన్నట్టు వివరించారు. నియోజవర్గాల్లో అప్డేషన్ చేయాల్సిన వారు ఇంకెవరైనా ఉంటే వారిని సత్వరమే అప్డేషన్ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని పొలిటికల్ పార్టీ ప్రతినిధులను కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్.శంకరరావు, దామా మన్మధరావు, టీడీపీ నుంచి పీఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు. గొట్టా బ్యారేజీ పరిశీలన హిరమండలం: గొట్టా బ్యారేజీని మంగళవారం జలవనరుల శాఖ ఉత్తరాంధ్ర చీఫ్ ఇంజినీర్ వేణుగోపాల్ ఎస్ఈ రామచంద్ర పరిశీలించా రు. ఇటీవల కురిసిన వర్షాలకు గొట్టా బ్యారేజీలో వరద ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో చీఫ్ ఇంజినీర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గొట్టా బ్యారేజీ నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని ఆదేశించారు. గొట్టా బ్యారేజీ పనితీరును.. కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహం, వాటి దుస్థితిని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ నిర్వహణలో ఎలాంటి అలసత్వం వద్దన్నారు. కాలువలకు సంబంధించి ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. అలాగే వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా బ్యారేజీలో నీటి స్థిరీకరణ జరపాలని సూచించారు. వారి వెంట స్థానిక అధికారులు ఉన్నారు. -
సీసీ రోడ్డు పనుల అడ్డగింత
● తమకు చెప్పకుండా పనులు చేశారని టీడీపీ నాయకుల దుశ్చర్య ● అధికారుల తీరుపైనా విమర్శల వెల్లువ కవిటి: మండలంలోని కవిటిరాజపురంకొజ్జిరియా( కేఆర్కే) రోడ్డు నుంచి చండీపురానికి వెళ్లే అనుబంధ రోడ్డు నిర్మాణాన్ని రాజపురం పంచాయతీకి చెందిన టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీనిపై చండీపురం గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం తమకు చెప్పకుండా పను లు ప్రారంభిస్తున్నారనే కారణంతో ఈ పనులు అడ్డుకోవడం గమనార్హం. వాస్తవానికి ఈ పనులు దాదాపు 8 నెలల కిందటే జెడ్పీ చైర్పర్సన్ పిరి యా విజయ పరిపాలన అనుమతులతో మంజూరయ్యాయి. అప్పట్లో జంగిల్ క్లియరెన్స్ కోసం రాజపురం–1 ఎంపీటీసీ సనపల కృష్ణారావు రూ. 45 వేలు సాయం కూడా చేశారు. కానీ అప్పట్లో తెలుగు తమ్ముళ్లు అధికార దర్పంతో పనులు జరగనీయలేదు. నెలలు గడుస్తున్నా పనులు కాకపోవడంతో దీని వెనుక కారణాలను ఓ సామాజిక కార్యకర్త వెలికి తీశారు. సమాచార హక్కు చట్టం సాయంతో అన్ని వివరాలు రాబట్టి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు వెంటనే ప నులు ప్రారంభించాలని, లేదంటే చర్యలు తప్పవని ఆదేశించారు. దీంతో పనులకు తీర్మానం, వర్క్ ఆర్డర్ ప్రక్రి యలు పూర్తి చేసి మంగళవారం పనులు ప్రారంభించారు. కానీ మళ్లీ టీడీపీ నాయకులు అడ్డుపడ్డారు. తమకు సమాచారం లేకుండా పనులకు కొబ్బరికాయ కొట్టి ఎలా చేస్తారని పనులు ఆపేశారు. దీంతో చండీపురం గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్పీ నిధులను జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ మంజూరు చేస్తే వాటిని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. చేతనైతే అభివృద్ధి చేయాలని ఇలా అడ్డుకోవడం సబబు కాదని అన్నారు. దీనిపై అధికారులు నోరు మెదపకపోవడంతో కలెక్టర్ ఉన్నతస్థాయి విచారణ జరపాలని కోరారు. -
కొనసాగుతున్న కష్టాలు
ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి వ్యవసాయ రంగాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. కూలీల సమస్యతో రైతు లు వ్యవసాయాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడుతోంది. ఉపాధి పనులను వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తే రైతు బాగుపడతాడు. – సిర్ల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు హిరమండలం: వ్యవసాయంతో ఉపాధి అనుసంధానం.. ఏళ్లుగా రైతులను ఊరిస్తున్న కల. కాలం గడుస్తున్నా కల మాత్రం తీరడం లేదు. ఇన్నేళ్లలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు వీబీజీరామ్జీగా మారింది. రోజు వారీ కూలి రేటు పెరిగింది. పొలం పనులకు వచ్చే వారి సంఖ్య తగ్గింది. పెట్టుబడి ఇదివరకెన్నడూ లేనంతా పెరిగింది. అయినా సర్కారుకు ఈ అనుసంధానం గుర్తు రావడం లేదు. పెరుగుతున్న మదుపులు వ్యవసాయ రంగంలో మదుపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రైతుల కష్టానికి తగిన ఫలితం రావడం లేదు. ఏటా ఎరువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో వరి పంటలకు రూ.25 వేలు ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. ఇంత మొత్తంలో పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసినా కూడా పంటచేతికి వచ్చేంత వరకూ నమ్మకం ఉండదని వాపోతున్నారు. దీనికి తోడు కూలీల రేట్లు పెరుగుపోతున్నాయని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. వీబీజీరామ్జీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ రంగాన్ని వేధిస్తున్న కూలీల సమస్య ఏటా పెరుగుతున్న పెట్టుబడులు నష్టపోతున్న అన్నదాతలు ఫలించని వ్యవసాయంతో ఉపాధి అనుసంధానం కల వెంటాడుతున్న కూలీ సమస్య వ్యవసాయ రంగంలో రోజురోజుకూ కూలీల సమస్య వేధిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసా యాన్ని (వీబీజీరామ్జీ)ఉపాధి హామీకి అనుసంధానం చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – కె.నవీన్, రైతు, తాయమాంబాపురం -
ఆయిల్పామ్ సాగు లాభదాయకం
కవిటి: ఉద్యాన పంటల్లో రైతులకు అధిక దిగుబడులతో పాటు అధిక ఆదాయం ఇచ్చే పంటగా ఆయిలపామ్ నిలుస్తుందని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ రీజనల్ రీసర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.మాధవిలత అన్నారు. కవిటి మండలంలోని మాణిక్యపురం, రాజపురం గ్రామాల్లో మంగళవారం పర్యటించి రైతులతో మాట్లాడారు. కవిటి మండలం ఆయిల్పామ్ సాగుకు అనువైనదా? కాదా అనే అంశాలతో కూడిన వాస్తవ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఆయిలపామ్ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వమే మద్దతు ధర నిర్ణయిస్తుందన్నారు. తుఫాన్లను సైతం మొక్కలు తట్టుకుంటాయని చెప్పారు. కార్యక్రమంలో ఉద్యానశాఖాధికారి, సచివాలయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు. కంచిలి: ఉద్యాన పంటల్లో ఆయిల్పామ్ పంట సాగుపై ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్న శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత పేర్కొన్నారు. జలంత్రకోట, కొల్లూరు పంచాయతీల పరిధిలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆయల్పామ్ పంటపై రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ సహాయకులు ఎస్. లింగరాజు, బి.విద్యాసాగర్, పవన్కుమార్, రైతులు పాల్గొన్నారు. -
బాహుదా నదిలో రైతు గల్లంతు
ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం మండలం సైదాలపుట్టుగలో పొలం పనులకు వెళ్లిన ఓ రైతు బాహుదా నదిని దాటుతుండగా గల్లంతయ్యారు. సైదాలపుట్టుగ గ్రామానికి చెందిన రైతు నారద గంగయ్య (57)కు బాహుదానదికి అవతల శాసనాం గ్రామ పరిధిలో పంట భూమి ఉంది. సోమవారం నదిని దాటి పొలం గట్టు వేసి, దమ్ము పనులు చేశారు. మంగళవారం ఉదయం గంగయ్య భార్య జానకమ్మ తమ పొలంలో వరినాట్లు వేసేందుకు వెళ్లారు. గంగయ్య ఆమెకు భోజనం తీసుకొని మధ్యాహ్నం బాహుదా నదిని దాటుతుండగా నది ఉద్ధృతికి నీటిలో కొట్టుకుపోయారు. నదిలో స్నానం చేస్తున్న స్థానికులు ఆ ఘటనను గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న సీఐ ఎం.చిన్నంనాయు డు, రూరల్ ఎస్ఐ ఆర్.జనార్దనరావులు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు సాయంత్రం వరకు నదిలో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. గంగయ్య భార్య జానకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ జనార్థనరావు తెలిపారు. నదిలో ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయని స్థానికులు తెలిపారు. -
విద్యుత్ షాక్తో వెల్డర్ మృతి
నరసన్నపేట: మడపాం టోల్గేట్ వద్ద ఓ పరిశ్రమలో వెల్డింగ్ పనులు చేస్తున్న చేనులవలసకు చెందిన సరిపల్లి రామచంద్రరావు (35) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. గతంలో వంశధార పేపరు మిల్లులో పనిచేసిన రామచంద్రరావు ప్రైవేటుగా వెల్డింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ దశలో మంగళవారం పరిశ్రమలో వెల్డింగ్ పనులు చేస్తుండగా షాక్కు గురయ్యాడు. స్థానికులు స్పందించి నరసన్నపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు రామచంద్రరావు తల్లి మరణించగా తండ్రి అప్పన్న వృద్ధాప్యంలో ఉన్నారు. భార్య మాధవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామచంద్రరావు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం ఆమదాలవలస/బూర్జ: శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రైలు ఢీకొని తులగాపు శ్రీనివాసరావు(43) మృతి చెందినట్లు జి.ఆర్.పి. పోలీసులు తెలిపారు. బూర్జ మండలం లచ్చయ్యపేట కాలనీకి చెందిన శ్రీనివాసరావు భార్య రమ్య, ఇద్దరు పిల్లలు పూజిత, తరుణ్ ఉన్నారు. మద్యానికి బానిసై రెండురోజుక్రితం ఇంటి నుంచి వచ్చేశాడు. ఏం జరిగిందో గానీ రైలు కింద పడి మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. మనస్తాపంతో యువతి ఆత్మహత్య సంతబొమ్మాళి: గోవిందపురం గ్రామానికి చెందిన నీలాపు రమ్య(21) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ చదువుకున్న రమ్య పలుమార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమైంది. తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో దిగులు చెందుతూ గడ్డిమందు తాగడంతో రాగోలు జెమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. రమ్య తల్లి మహాలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సంతబొమ్మాళి ఎస్సై వై.సింహాచలం మంగళవారం తెలిపారు. -
గుండెకోత
తీర గ్రామాలకు ● వంశధార తీరంలో కోత భయం ● 50 మీటర్ల వరకు గట్టు కోత ● గ్రోయిన్లు నిర్మించాలని వినతి ప్రమాదం అంచున ఉన్నాం నదికి దగ్గరగా రెండు మీటర్లు దూరంలో ఉన్నాం. చిన్నపాటి వరద వస్తే చాలు ఇళ్లలోకి నీరు వచ్చేస్తోంది. ఒకటి రెండు సార్లు మేకలు, పాడి ఆవులు కూడా వరదకు కొట్టుకు పోయిన సందర్బాలు ఉన్నాయి. – రేగాన శ్యామ్ సుందర్, రామకృష్ణాపురం గ్రోయిన్లు కట్టాలి అర్జెంటుగా గ్రోయిన్స్ నిర్మాణాలు చేపట్టాలి. ఇంకా రెండు మూడు వరదలు వస్తే ప్రమాదం తప్పదు. మాకే కాదు నది తీర గ్రామాలు ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి. – అందవరపు రాము, అంధవరం జలుమూరు: వంశధార నదీ తీర గ్రామాలు మళ్లీ భయం గుప్పెట్లోకి వెళ్లిపోతున్నాయి. వానాకాలం నాలుగు నెలల పాటు వీరికి ఈ ఆందోళన తప్పడం లేదు. ఆగస్టు మొదలు అక్టోబర్ వరకు వీరిని వరద భయం వెంటాడుతుంది. ప్రధానంగా ఈ గ్రామాలకు ఆనుకొని కరకట్ట నిర్మాణం జరగక పోవడం, ఆపైన నదిలో ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వుకుపోవడంతో పాటు ప్రవాహం ఉన్న చోట గ్రోయిన్లు నిర్మించకపోవడంతో ఏటా వరద ముంచెత్తుతోంది. దీంతో ఇళ్ల వరకు కోత జరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. నదితీర గ్రామాలు 30 వంశధార నదీ తీర గ్రామాలు ఇటు నరసన్నపేట, అటు జలుమూరు, పోలాకి మండలాల్లో 30 వరకూ ఉంటాయి. ఇందులో అత్యంత ప్రమాదకరంగా ఉన్నవి గెడ్డవానిపేట, వెంకటాపురం, కొబగాం, అందవరం, ఉప్పరపేట, రామకృష్ణాపురం, పర్లాం, గొల్లపేట, డోలపేట, బుచ్చిపేట, డోల, గోవిందపురం, రేవు అంప్లాం, వనిత మండలం తదితరవి 20 వరకూ ఉంటాయి. నదిలో ప్రవాహం ఎక్కువైతే చాలు గ్రామాల గట్టు కోరుకుపోయి గ్రామంలోకి నీరు చొరబడుతోంది. కరకట్ట కట్టలేదు వరద నివారణతోపాటు పంటపొలాలు రక్షించేందుకు వంశధార నదికి ఆనుకొని ఉన్న గ్రామాల పక్కన కరకట్ట కడుతామన్న ప్రతిపాదనలు ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు. 2011లో కరకట్ట నిర్మాణాలకు సుమారు రూ.52 కోట్లు నిధులు మంజూరయ్యాయి. 15 శాతం నిర్మాణాలు కూడా జరిగాయి. తర్వాత ఆగిపోయాయి. అధికారులు స్పందించి కరకట్ట నిర్మాణంతోపాటు ముంపు వద్ద గ్రోయిన్స్ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. -
నేడు ‘ఆదిత్య’కు ఒడిశా గవర్నర్
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం నిర్వహిస్తున్న 10వ సిల్వర్ జూబ్లీ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరుకానున్నారని కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమాలు మొదలవుతాయని పేర్కొన్నారు. గురుకులాల్లో మెరుగైన ఫలితాల సాధనకు కృషి కంచిలి: జిల్లాలో గురుకుల పాఠశాల, కళాశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు వచ్చేందుకు ఐక్యంగా కృషి చేస్తున్నట్లు జిల్లా గురుకుల విద్యాలయాల సమన్వయకర్త(డీసీఓ) వై.యశోదలక్ష్మి అన్నారు. కంచిలి గురుకులాన్ని మంగళవారం సదర్శించి సమగ్ర తనిఖీ చేపట్టారు. విద్యాప్రమాణాలు, వసతులపై సమీక్ష నిర్వహించారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు తగ్గడంపై ఆరా తీశారు. ఈ విద్యా సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు తగ్గకుండా శతశాతం ఉత్తీర్ణత సాధించేలా పకడ్బందీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉపాధ్యాయులు, అధ్యాపకులను ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్.వెంకటరమణ, గురుకుల ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నేత్రాలపై శ్రద్ధ అవసరం శ్రీకాకుళం అర్బన్: ‘జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు‘ సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలికలు) ఆవరణలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ‘కంటి ఆరోగ్యం–నేత్రదానం‘ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎం.కృష్ణవేణి మాట్లాడుతూ జాతీయ అంధత్వ, దృష్టిలోప నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులంతా కంటి ఆరోగ్యం–నేత్రదానం పై అవగాహన కలిగి గ్రామాల్లో ఈ విషయం అవగాహన కల్పించాలన్నారు. కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆప్తాల్మిక్ అధికారి ఎంఆర్కె దాస్, రోటరీ క్లబ్ శ్రీకాకుళం ప్రతినిధులు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. యాజమాన్య పద్ధతులో అధిక దిగుబడులు జి.సిగడాం(పొందూరు): రైతులు ఆధునిక పద్దతిలో వ్యవసాయం సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ చిట్టిబాబు, డాక్టర్ స్వాతి అన్నారు. మంగళవారం బాణాం రైతుసేవా కేంద్రం ఆధ్వర్యంలో వరిసాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎప్పుడూ మొక్కజొన్న, వరి పంటలే కాకుండా వేరుశనగ, ఇతర ఆరుతడి పంటలు సాగు చేస్తే మంచి రాబడులు వస్తాయన్నారు. వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటే పంటలపై మరింత అవగాహన కలుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్సీ ఏవో రేణుకాసాయి, మండల వ్యవసాయాధికారి శ్రీనివాసుబాబు, ఏఈఓ ప్రవీణ్కుమార్, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, రైతులు పాల్గొన్నారు. -
మైరెన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: తీర ప్రాంత భద్రతకు కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మైరెన్ పోలీసు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తీర ప్రాంత భద్రతపై మైరెన్ పోలీస్, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖల అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 193 కిలో మీటర్లు తీర ప్రాంతం విస్తరించి ఉందని, ఇందులో 11 మండలాలు, 142 గ్రామాలు ఉన్నట్లు వివరించారు. తీర ప్రాంతంలో 3 మైరెన్ పోలీసు స్టేషన్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 172 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయన్నారు. తీర ప్రాంత పోలీసు స్టేషన్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, కాంపౌండ్ వాల్, ఫెన్సింగ్ కావాలని మైరెన్ పోలీసులు కలెక్టర్కు విన్నవించారు. తీర ప్రాంత ప్రజలకు, బీచ్లకు వచ్చే పర్యాటకులకు భద్రపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో మత్స్యశాఖ ఉప సంచాలకులు సుమలత, ఎన్ఐసీ ఉప సంచాలకులు కిరణ్కుమార్, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి రాము, మైరెన్ డీఎస్పీ, విశాఖపట్నం ఎస్.కిరణ్ కుమార్, బారువ, భావనపాడు, కళింగపట్నం సీఐలు రమేష్, డి.రాము, బి.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
లారీని ఢీకొట్టిన ఆటో
నరసన్నపేట: జమ్ము కూడలి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఆగి ఉన్న లారీని విజయనగరం జిల్లా జామి నుంచి పలాస వైపు వెళ్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న శ్రావణ్కుమార్, వెంకటరమణలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ముందు భాగం పూర్తిగా నుజ్జు కావడంతో డ్రైవర్తో పాటు పక్కనే కూర్చున్న వెంకటరమణ ఇరుక్కున్నారు. వారిని బయటకు తీయడానికి స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ అతి వేగంగా వాహనం నడుపుతుండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను కాపాడిన స్థానికులు, ఎస్సై -
మాజీ మంత్రి సీదిరి అనుచరుడికి రిమాండ్
● అంపోలు సబ్ జైలుకు తరలింపు ● కాశీబుగ్గ పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత వజ్రపుకొత్తూరు రూరల్: రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగం మేరకు కేసులో ఏ–4గా ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రధాన అనుచరుడైన అల్లు వెంకటరమణకు పలాస జూనియర్ సివిల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు నిందితుడిని అంపోలు జైలుకు మంగళవారం పోలీసులు తరలించారు. అల్లు వెంకట రమణను సోమ వారం రాత్రి ఆయన స్వగ్రామమైన లక్ష్మీపురంలో పోలీసులు అరెస్టు చేసి కాశీబుగ్గ పోలీసు స్టేషన్కు తరలించారు. అప్పటి నుంచి పోలీసు అదుపులో ఉన్న రమణను మంగళవారం సాయంత్రం పలాస కోర్టులో హాజరుపరిచారు. దీంతో పలాస కోర్టు అల్లు రమణకు 14 రోజులు రిమాండ్ విధించడంతో అంపోలు సబ్ జైలుకు తరలించారు. అరెస్టుపై ఉద్రిక్తత వెంకటరమణ అరెస్టుపై పలాస–కాశీబుగ్గలో ఉద్రి క్తత చోటు చేసుకుంది. వెంకటరమణను పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు కాళింగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, పెద్దలు సోమవారం రాత్రి నుంచి పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్లోకి మీడియాను, నాయకులను అనుమతించకపోవడంతో స్టేషన్ లోపల ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. మంగళవారం ఉద యం సైతం నాయకులు స్టేషన్కు చేరుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వెంకటరమణను కలిసేందుకు ఎవరినీ అనుమతించకపోవడంతో స్టేషన్ వెలుపల నాయకులు రమణ రాక కోసం ఎదురు చూశారు. అప్పటికే మోహ రించిన పోలీసులు నాయకులను అక్కడ నుంచి పంపించేయడంతో వారు వెనుదిరిగారు. కూటమి కక్షపూరిత రాజకీయాలపై నాయకులు మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని రోడ్డు ప్ర మాదాలకు పోలీసులు ఇదే తీరున వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నించారు. -
గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సహకరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి జిల్లా శాఖ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. నోడల్ సింగిల్ విండో ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అనుమతులు మంజూరు చేయాలని, ఎలాంటి కాషన్ డిపాజిట్లు, రుసుములు వసూలు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. గతేడాది మాదిరిగానే జిల్లావ్యాప్తంగా ఉచిత విద్యుత్ సరఫరా అందించాలని, విగ్రహాల ఎత్తు, పర్యావరణ కాలుష్యం పేరిట నిబంధనలతో ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు సూచనలు ఇవ్వాలని విన్నవించారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు ముందస్తుగా రూట్ మ్యాప్ ఆమోదించి భద్రతా ఏర్పాట్లు చేయాలని, నిమజ్జన ప్రాంతాల్లో జేసీబీలు, క్రేన్లు, పరిశుభ్రత సదుపాయాలు కల్పించాలని కోరారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు ప్రశాంత వాతావరణం నెలకొనేలా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షుడు బుర్రా ఆదినారాయణ శాస్త్రి, ఉపాధ్యక్షుడు శింతు సుధాకర్, ప్రధాన కార్యదర్శి గొడ్డు భాస్కరరావు, కోశాధికారి ఇప్పిలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
తప్పు చేస్తే చర్యలు తప్పవు: డీఎంహెచ్ఓ
అరసవల్లి: ఎట్టకేలకు జిల్లా వైద్యారోగ్య శాఖా ధికారిగా డాక్టర్ ఈవీ నరేష్కుమార్ సోమ వారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. గత నెల 13న జిల్లాకు డీఎంహెచ్ఓగా నియ మిస్తూ ఉత్తర్వులు వచ్చినా.. విశాఖపట్నంలో రిలీవింగ్ సమస్యల కారణంగా సరిగ్గా 40 రోజుల తర్వాత స్థానిక జిల్లాలో డీఎంహెచ్ఓగా నరేష్కుమార్ విధుల్లోకి చేరారు. ఈ సందర్భంగా జిల్లాలో వైద్యారోగ్యశాఖకు చెందిన కీలక అధికారులు, వైద్యులు, ఇతర విభాగాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కోవిడ్ సమయంలో తాను ఇక్కడ నోడల్ అధికారిగా పనిచేశానని, సీతంపేట ఐటీడీఏ పరిధిలోనూ వైద్యాధికారిగా విధులు నిర్వర్తించానని అన్నా రు. ఫైళ్లు నడపడంలో జాప్యం జరిగితే ఎలాంటి మొహమాటం లేకుండా చర్యలకు దిగి ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటానని స్పష్టం చేశారు. తప్పు చేస్తే ఉపేక్షించబోనని తేల్చి చెప్పారు. పొలం పనికి వెళ్లి కుప్పకూలిన యువకుడు మందస: మండలంలోని జిల్లుండ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రౌతు తిరుపతిరావు(30) సోమవారం ఉదయం పొలంలో గట్లు వేసేందుకు వెళ్లాడు. ఎండ తీవ్రంగా ఉండడంతో పొలంలోనే నేలకు ఒరిగిపోయాడు. తోటి రైతులు చూసి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి పరీక్షించి తిరుపతిరావు చనిపోయినట్లు నిర్ధారించారు. తిరుపతిరావు జీవన ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లి పని చేసి తన సొంత గ్రామానికి వచ్చి తన సొంత పనులు చేసుకుంటున్నాడు. తిరుపతికి భార్య రాజేశ్వరి, కుమారుడు ఉన్నాడు. కుమారుడు దివ్యాంగుడు. తిరుపతిరావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. హెచ్ఎంపై ఆరోపణలు.. డీఈఓకు నివేదిక నరసన్నపేట: మేజరు పంచాయతీ పరిధిలోని దేశవానిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిపై అదే స్కూల్లో పనిచేస్తున్న మహిళా టీచర్లు చేసిన ఫిర్యాదుపై విచారణ చేసి నివేదికను డీఈఓ రవిబాబుకు పంపించానని డిప్యూటీ డీఈఓ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం ఉదయానికే డిప్యూటీ డీఈఓ స్కూల్కు ఎంఈఓ యు.శాంతారావుతో కలిసి వెళ్లారు. ముందుగా హెచ్ఎంతో మాట్లాడారు. అనంతరం స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులందరితో సమావేశం నిర్వహించి వివరాలు సేకరించారు. తరువాత ఫిర్యాదు చేసిన మహిళా టీచర్లతో వేర్వేరుగా మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. వారి సెల్ఫోన్లను కూడా పరిశీలించారు. హెచ్ఎం వేధింపుల సెల్ రికార్డును డిప్యూటీ డీఈఓకు ఒక ఉపాధ్యాయుడు అందజేసినట్లు సమాచారం. శ్రీకాకుళం కల్చరల్: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈ నెల 26న శ్రీకాకుళం నగరంలో నిర్వహించనున్న ర్యాలీని విజయవంతం చేయాలని నగర ముస్లిం జమాత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు స్థానిక జామియా మసీదు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు జమాత్ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని అన్ని మసీదుల ఇమాములు, అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ సభ్యులు, పట్టణంలోని ముస్లింలందరూ ర్యాలీలో బాధ్యతగా పాల్గొని ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనాలకు ర్యాలీలో అనుమతి ఉండదని, వృద్ధులు, పిల్లల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
బతుకుల్లో కారు చీకటి
శ్రీకాకుళంగుడ్లు సరఫరాలో నిర్లక్ష్యంప్రభుత్వ బడులకు గుడ్లు సరఫరాలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. గుడ్డు బదులు వేరే కూర పెడుతున్నారు. –8లోమంగళవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2026సారవకోట: మండలంలోని కిన్నెరవాడ గ్రామానికి సమీపంలో సోమవారం వంశధార ఎడమ కాలువలోకి కారు దూసుకుపోవడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాలు ప్రకారం.. కేళవలసలో ఉన్న కల్యాణ మండపంలో సోమవారం ఓ వివాహం జరిగింది. ఈ వివాహానికి గోపాలపురం గ్రామానికి చెందిన పీస రాము (46), ఖరగ్పూర్కు చెందిన రాము మేనల్లుడు మెండ విశాల్(30) వచ్చారు. పీస రాము కుమార్తె శృతి పార్వతీపురంలో చదువుతుండడంతో ఆమెను తీసుకురావడానికి గోపాలపు రం గ్రామానికే చెందిన గొటివాడ నాగరాజు కారు లో బయల్దేరారు. కారు కిన్నెరవాడ సమీపంలో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొని అకస్మాత్తుగా వంశధార ఎడమ కాలువలోకి దూసు కుపోయింది. కారు కాలువలోకి వెళ్లిపోవడాన్ని చూసిన అవలింగి గ్రామానికి చెందిన కూర్మాపు వెంకటరమణ వెంటనే స్పందించి కాలువలోకి దూకి అద్దాలు పగుల గొట్టి కారులో ఉన్న డ్రైవర్ గొటివాడ నాగరాజును ప్రాణాలతో కాపాడారు. కారులో ఉన్న మరో ఇద్దరిని కాపాడాలని ప్రయత్నించినా.. కారు నీటిలో మునిగి పోవడంతో వారిని కాపాడే అవకాశం లేకుండా పోయింది. దీంతో కిన్నెరవాడ గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరి కారును గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానిక ఎస్ఐ అనిల్ కుమార్ కోటబొమ్మాళి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. వారు తమ సిబ్బందితో వచ్చి స్థానికుల సాయంతో కాలువలో మునిగి పోయిన కారును గుర్తించి బయటకు తీశారు. కారులో పీస రాము మృతదేహం మాత్రమే లభ్యం కావడంతో మెండ విశాల్ మృత దేహం గల్లంతైందని గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. మృతుని భార్య చిలకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం తరలించారు. పెళ్లింట చావు వార్త.. చనిపోయిన పీస రాము భార్య సోదరి కుమార్తెకే వివా హం జరుగుతోంది. ఆ వివాహానికి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తూ రాము చనిపోయారు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి కుమార్తెకు మృతి చెందిన పీస రాము చిన్నాన్న కావడం, గల్లంతైన విశాల్ కూడా బంధువే కావడంతో అంతా కన్నీరుమున్నీరయ్యారు. మద్యపానమే కారణమా.. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. డ్రైవర్ మద్యం సేందించి వాహనాన్ని నడుపుతున్నాడన్న వాదనలూ వినిపించాయి. వంశధార ఎడమ కాలువలోకి దూసుకెళ్లిన కారు ఒకరు మృతి.. మరొకరు గల్లంతు పెళ్లింట విషాదం డ్రైవర్ మద్యం మత్తే ప్రమాదానికి కారణమంటున్న ప్రత్యక్ష సాక్షులు -
వామ్మో.. వయ్యారిభామ
గార: వినాశకరమైన కలుపు మొక్క వయ్యారిభామ అంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు భయపడుతున్నారు. రోడ్లు పక్కన, కాలువ గట్లు, పొలం గట్లు, ఖాళీ ప్రదేశాల్లో పెరిగే ఈ కలుపు మొక్క పొలాల్లో పంటను మించి పెరిగిపోతుంది. ఈ కలుపు మొక్క పొలాల్లో త్వరితగతిన వ్యాపిస్తూ పంటల దిగుబడిని తగ్గిస్తుంది. అంతేకాక జంతువులతో పాటు మానవులకు హాని చేస్తుంది. నిలువెల్లా విషం కలిగిన వయ్యారిభామ శాసీ్త్రయ నామం పార్ధినీయం హిస్టోరోఫోరెస్. ఈ మొక్క ఇంటి పరిసరాల్లో ఉంటే రోగాలు వెంటే ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దిగుబడిని తగ్గిస్తుంది వయ్యారిభామ అనే కలుపు మొక్క పంట మొక్కల ఎదుగుదలను నియంత్రిస్తుంది. పంటలకు వేసిన ఎరువుల సారాన్ని కూడా పీల్చివేస్తుంది. పూత, పిందె దశలో ప్రతాపం చూపి దిగుబడి తగ్గిస్తుంది. మొక్కలను తొలిదశలోనే నియంత్రించాలి. మొక్కజొన్న, పూల తోటలు, కూరగాయల పొలాలు, కొబ్బరి, మామిడి తోటల్లో ఈ కలుపు మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. మనుషులకూ ప్రమాదమే మొక్క పుప్పోడిని పీలిస్తే జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పలు వాపు వస్తాయి. వయ్యారిభామతో డర్కాటైటిస్, ఎగ్జిమా హైఫీవర్, ఉబ్బసం, బ్రాంకై టీస్ వంటి వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. పువ్వుల నుంచి రేణువులు గాలిలో కలిసిపోవడంతో ఆ గాలి పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు పాడవుతాయి. జంతువులకు వెంట్రుకలు ఊడిపోవడం, హైపర్ టెన్షన్ పెరగడం జరుగుతుంది. సాధారణంగా పశువులు ఈ మొక్కను తినవు. పొరపాటున గడ్డితో పాటు వయ్యారిభామను తిన్న పశువులు జీర్ణక్రియ, కిడ్నీ, లివర్, శ్వాసక్రియలు దెబ్బతింటాయి. చివరకు మరణించే అవకాశాలున్నాయి. నివారణ చర్యలు గ్రామాల్లోనూ, పొలాల్లోనూ ఉన్న వయ్యారిభామను పూతదశ రాకముందే వేర్లతో సహా తొలగించాలి. పూతదశకు రాకముందే 10 లీటర్లు నీటిలో 5 కిలోల ఉప్పు కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయడం వలన మొక్కలు మొలవవు. వయ్యారిభామ కలుపు మొక్కలు ఇటీవల కాలంలో పొలాల్లోనూ, రోడ్లు వెంబడి ఏపుగా పెరుగుతున్నాయి. వీటివలన పంటలతో పాటు మనుషులు, జంతువులకు ప్రమాదమే. దిగుబడి తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వీటికి తొలి దశలోనే నివారణ చర్యలు తీసుకోవాలి. ఉప్పు ద్రావణం స్ప్రే చేయడం, కలుపు మందులు కొట్టడం వలన నివారించవచ్చు. – డి.పద్మావతి, వ్యవసాయాధికారి, గార పంట పొలాల్లో ఏపుగా పెరుగుతున్న కలుపు మొక్క దిగుబడిపై తీవ్రమైన ప్రభావం మనుషులకు సైతం వివిధ వ్యాధులు వేర్లతో సహా తొలగించాలని అధికారుల సూచనలు -
గుడ్లు సరఫరాలో నిర్లక్ష్యం
● పాఠశాలల్లో నిండుకున్న గుడ్లు ● విద్యార్థులకు వేరేకూర వండిపెట్టిన వైనంనరసన్నపేట: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్లు సరఫరాలో జాప్యం జరుగుతోంది. సకాలంలో గుడ్లు స్కూల్స్కు చేరవేయడంలో గుత్తేదారు నిర్లక్ష్యం వహిస్తున్నాడు. దీంతో మండలంలో ఎప్పటికప్పుడు స్కూల్స్లో గుడ్లు నిండుకుంటున్నాయి. ఫలితంగా హెచ్ఎంలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పక్క స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాల నుంచి అప్పుగా తీసుకొని విద్యార్థులకు ఇస్తున్నారు. అప్పుగా తీసుకురావడానికి వీలులేని చోట్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గుడ్లు ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది. సోమవారం నాటికి సత్యవరం, మడపాం పంచాయతీ కొత్తపేట, నరసన్నపేట పంచాయతీలోని వీడీ కాలనీ, గోపాలపెంట స్కూల్స్లోతో పాటు పలు స్కూల్స్లో గుడ్లు నిండుకున్నాయి. శనివారం నుంచీ ఈ పరిస్థితి ఉండగా ఉపాధ్యాయులు గుత్తేదారు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. సోమవారం నాటికీ గుడ్లు సరఫరా మెరుగుపడలేదు. దీంతో సత్యవరం స్కూల్ హెచ్ఎం అప్పలనాయుడు పొరుగున ఉన్న అంగన్వాడీ కేంద్రం నుంచి అప్పుగా తీసుకురాగా, మిగిలిన చోట్ల ఆ సదుపాయం లేకపోవడంతో విద్యార్థులకు గుడ్లు లేకుండానే ఆహారం వడ్డించారు. వీడీ కాలనీలో గుడ్డు బదులు మరో కూరను వడ్డించారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సమతుల పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్య బలహీనతలు మెరుగుపరిచేందుకు వారానికి ఐదు రోజులు గుడ్డు ఇస్తున్నారు. దీంట్లో మూడు రోజులు ఉడికించిన గుడ్డు, మరో రెండు రోజులు గుడ్డు కూరను ఇస్తున్నారు. అయితే గుత్తేదారు నిర్లక్ష్యంతో విద్యార్థులకు గుడ్డు సక్రమంగా అందడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఎంఈవో యు.శాంతారావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కామ్రేడ్ మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): AüÌS ¿êÆý‡™èl MìSÝ믌S çÜ¿ýæ Ð]l*i E´ë-«§ýlÅ-„ýS$yýl$, EÐ]l$Ãyìl B…{«§ýl{ç³-§ólÔŒæ OÆð‡™èl$ çÜ…çœ$… Æ>çÙ‰ {糫§é¯]l M>Æý‡Å-§ýlÇØ M>{Ðól$yŠæ ÝëÆý‡…-ç³-ÍÏ Ð]l$ÌêÏ-Æð‡yìlz õÜÐ]lË$ _Æý‡-çÜÃ-Æý‡×îæ-Ķæ$Ð]l$° B…{«§ýl-{ç³-§ólÔŒæ OÆð‡™èl$ çÜ…çœ$… Æ>çÙ‰ E´ë-«§ýlÅ-„ýS$yýl$ Ð]l¬{Æ>ç³# çÜ*Æý‡Å-¯é-Æ>-Ķæ$׿ A¯é²Æý‡$. }M>-MýS$âýæ… ïÜIsîæÄ¶æÊ M>Æ>ÅÌS-Ķæ$…ÌZ Ð]l$ÌêÏ-Æð‡yìlz _{™èl-ç³-sê-°MìS ç³NÌS-Ð]l*-ÌSË$ ÐólíÜ ÝùÐ]l$ÐéÆý‡… °Ðé-â¶æ$-ÌS-Ç-µ…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> Ð]l*sêÏ-yýl$-™èl*.. OÆð‡™èl$ E§ýlÅÐ]l*-°MìS G¯]lÌôæ° õÜÐ]l ^ólÔ>Æý‡-°, Ð]lÅÐ]l-ÝëĶæ$ Æý‡…VýS…Oò³ çÜ…ç³NÆý‡~ gêq¯]l… MýSÍ-W¯]l Ð]lÅMýS$¢ÌZÏ Ð]l$ÌŒæ-{Ìê-ెyìlz JMýSÆý‡° VýS$Æý‡$¢ ^ólçÜ$-MýS$-¯é²Æý‡$. ÝëVýS$-±sìæ çÜÐ]l$-çÜÅË$, OÆð‡™é…VýS E§ýlÅ-Ð]l*-ÌSOò³ A¯ólMýS Æý‡^èl-¯]lË$ ^ólÔ>-Æý‡°, ºçßæ$âýæ gê† MýS…ò³-±ÌS ò³™èl¢-¯é-°MìS Ð]lņ-Æó‡-MýS…V> fÇ-W¯]l E§ýlÅ-Ð]l$…ÌZ {ç³Ð]l¬Q ´ë{™èl Ð]líßæ…-^é-Æý‡-¯é²Æý‡$. }M>-MýS$âýæ… hÌêÏÌZ ™èl$¸ë¯ŒS çÜ…§ýl-Æý‡Â…V> ÐólÌê¨ Möº¾-Ç, iyìl-^ðlr$Ï ç³yìl´ùƇ$$ OÆð‡™èl$Ë$ ¯]lçÙt´ùƇ$$¯]l-糚yýl$ B {´ë…™éÌZÏ Ð]l$ÌêÏ-Æð‡yìlz ç³Æý‡Å-sìæ…_ ¯]lçÙt-ç³Ç-àÆý‡… MøçÜ… MýS–íÙ ^ólÔ>-Æý‡-¯é²Æý‡$. M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ B…{«§ýl{ç³-§ólÔŒæ OÆð‡™èl$ çÜ…çœ$… hÌêÏ A«§ýlÅ„ýS, M>Æý‡Å§ýl-Æý‡$ØË$ ´÷…§ýl*Æý‡$ ^èl…{§ýl-Æ>Ð]l#, ´ùÌêMìS {ç³Ýë-§ýl-Æ>Ð]l#, OÆð‡™èl$ çÜ…çœ$… ¯éĶæ$-MýS$Ë$ MðS.Ððl*-çßæ-¯ŒSÆ>Ð]l#, ºV>¨ ÐéçÜ$-§ólÐ]l-Æ>Ð]l#, M>Æý‡-V>¯]l Mö…yýlĶæ$Å, ™ø¯]l…W ¯]l…¨Ðéyýl$, MøÆ>yýl çᑀ ™èl¨-™èlÆý‡$Ë$ ´ëÌŸY¯é²Æý‡$. ఎల్నినో నుంచి పంటలను రక్షించుకోవాలి ఆమదాలవలస: ప్రస్తుతం ఏర్పడిన ఎల్నినో పరిస్థితుల నుంచి రైతులు తమ పంటలను రక్షించుకోవాలని, అప్పుడు రానున్న రోజుల్లో పంటల్లో దిగుబడి సాధ్యమవుతుందని ఉత్తర కోస్తా జోనల్ ఎల్నినో కో–ఆర్డినేటర్ డాక్టర్ జి.జోగినాయుడు సూచించారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శ్రీకాకుళం జిల్లాలో నెలకొన్న తీవ్ర ఎల్నినో పరిస్థితులు, వర్షపాత లోటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ, ఆత్మ అధికారులతో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత జిల్లా పరిస్థితుల గురించి చర్చించారు. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం వలన వడలిన పంటలను ఏవిధంగా రక్షించుకోవాలి, ముదురు నారు నాటేటప్పుడు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలు, ఎల్నినో పరిస్థితులను అధిగమించడానికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయడంపై చర్చించారు. కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ సీహెచ్ ముకుందరావు, జిల్లాల ఎల్నినో సమన్వయకర్తలు డాక్టర్ కె.భాగ్యలక్ష్మి, విజయనగరం వ్యవసాయ పరిశోధస్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి.ఎస్.ఎస్.కె.పాత్రో, విజయనగరం, అనకాపల్లి, యలమంచిలి, నైర వ్యవసాయ కళాశాల, కొండపూడి, ఆమదాలవలస కేవీకే, వ్యవసాయ పరిశోధన స్థానాలకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ కె.లక్ష్మణరావు, డాక్టర్ బి.రాజ్ కుమార్, డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి, డాక్టర్ డి.చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. మల్లన్న సన్నిధిలో న్యాయశాఖ కార్యదర్శి టెక్కలి: మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జునస్వామివారిని న్యాయశాఖ విభాగం కార్యదర్శి గొట్టపు ప్రతిభాదేవి సోమవారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ కార్య నిర్వాహణాధికారి జి.గురునాథరావు ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి చిత్రపటానికి బహూకరించారు. -
● ఆదిత్యా.. ఇది రూ.62 లక్షల రోడ్డంట..!
ఒకటి కాదు రెండు కాదు రూ.62.50 లక్షలు ఖర్చు పెట్టారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా హాజరై అట్టహాసంగా రోడ్డును ప్రారంభించారు. అక్కడకు సరిగ్గా ఐదు నెలలు గడిచి ఆరో నెల వచ్చాక రోడ్డు అసలు రంగు బయటపడింది. ఎక్కడికక్కడ బీటలు వారిపోయి కట్టిన వారి నైపుణ్యాన్ని బట్ట బయలు చేసింది. అరసవల్లి ఆదిత్య క్షేత్రానికి సమీపంలో ఉన్న రోడ్డు స్థితి ఇది. రథసప్తమి సందర్భంగా కూట మి పెద్దలే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి పనులు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తూ రోడ్లు ఇలా కనిపిస్తున్నాయి. ఆదిత్యాలయానికి సమీపంలోని ఈ సీసీ రోడ్డు నాణ్యత చూసి స్థానికులు, భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. – అరసవల్లి -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నందిగాం: మండలంలోని రథజన బొడ్డపాడుకు చెందిన మాజీ సర్పంచ్ అంబలి సోమేశ్వరరావు(65) ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్యహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సోమేశ్వరరావు వ్యవసాయం, గొర్రెల పెంపకం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గతంలో సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించిన సోమేశ్వరరావు ఇటీవల ఆర్థికంగా ఇబ్బందిపడి అప్పులు చేశారు. వీటిని తీర్చే మార్గం లేక ఈనెల 21న ఇంట్లో ఉన్న పురుగుల మందును బాత్రూమ్లోకి తీసుకెళ్లి తాగారు. దీన్ని గమనించిన కుమారులు హుటాహుటిన టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా, అక్కడ ప్రథమ చికిత్స అందజేసి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. మృతుడికి భార్య పార్వతి, అయిన ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుని కుమారుడు మోహనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్ఐ షేక్ మహ్మద్ అలీ కేసు నమోదు చేశారు. -
ఎస్పీ గ్రీవెన్సుకు 56 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్సుకు బాధితులు నుంచి 56 ఫిర్యాదులందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని, నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు జూమ్ కాన్ఫరెన్సు ద్వారా సూచించారు. టెక్కలి సీఐపై ఫిర్యాదు లారీ ఢీకొట్టిన ఘటనలో తన చేయి విరిగినా నేటికీ సీఐ విజయ్ కేసు నమోదు చేయలేదని టెక్కలి లచ్చన్నపేటకు చెందిన పి.వెంకటరమణ తన తల్లి వసంతకుమారితో కలిసి ఎస్పీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈనెల 6న లచ్చన్నపేటలో ఇంటి వద్ద నుంచి సైకిల్పై బయల్దేరి వస్తుండగా లారీ ఢీకొట్టిందని, అదేరోజు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరామని, ఎంఎల్సీ అయినా మీరు ముందు వైద్యం చేయించుకోండని తర్వాత కేసు సంగతి చూద్దామని చెప్పారన్నారు. చేతి ఎముకలు చిట్లి గాయం తీవ్రత ఎక్కువై చేతిని తీసేయాల్సిన పరిస్థితి రావడంతో శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా శస్త్ర చికిత్స జరిగిందన్నారు. ఈ జాప్యంతో తర్వాత వెళ్లి సీఐని కలిసి కేసు నమోదు చేయమని కోరగా.. ఢీకొన్న ముద్దాయిని తీసుకురావాలంటే రూ.10 వేలు ఖర్చవుతుందని, అది మీరు ఇచ్చుకోవాలనడంతో అవాక్కయ్యామన్నారు. దీనిపై తమకు న్యాయం చేయాలని కోరారు. ఆస్తి కోసం అడ్డదారులు టెక్కలి: తమ తండ్రి నుంచి సంక్రమించే ఆస్తులను కాజేయాలనే దుర్బుద్ధితో రెవెన్యూ అధికారులను మేనేజ్ చేస్తూ తన తమ్ముడు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించాడని బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. టెక్కలి తెలుకలవీధికి చెందిన కుసుమూరు మల్లేశ్వరరావు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు వేణు, చిన్న కుమారుడు మోహన్రావు. అయితే తండ్రి మల్లేశ్వరరావు కొద్దిరోజుల క్రితం మరణించారు. దీంతో అన్న వేణు ఊరులో లేని సమయంలో తమ్ముడు మోహన్రావు రెవెన్యూ ఉద్యోగులను మేనేజ్ చేస్తూ ఎటువంటి విచారణ లేకుండా అన్న పేరును గల్లంతు చేస్తూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను సృష్టించాడు. దీంతో తండ్రి నుంచి వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ఆస్తులను తన సొంత పేరుకు మళ్లించుకున్నాడు. ఈ విషయమై కొన్ని రోజులుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదంటూ వేణు వాపోయాడు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మంజూరు విషయంలో ఎటువంటి విచారణ చేయకుండా తప్పుడు పత్రాన్ని ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది. ● తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించిన తమ్ముడిపై అన్న ఫిర్యాదు -
విన్నపాలు వినవలె..!
● అర్జీలు జిల్లాస్థాయి అధికారులు పరిశీలించాలి ● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 171 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చే అర్జీలను జిల్లాస్థాయి అధికారులు స్వయంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో 171 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లాస్థాయి అధికారులు మాత్రమే హాజరవ్వాలని, సెకండ్ లెవెల్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ రావొద్దని తేల్చిచెప్పారు. మొత్తం 171 అర్జీల్లో అత్యధికంగా రెవెన్యూ (సీసీఎల్ఏ) శాఖకు సంబంధించి 88 వినతులు వచ్చాయి. పంచాయతీ రాజ్ శాఖకు 18, సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ 9, సెర్ప్ 9, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 9, విద్యుత్ శాఖ 8, స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు 6, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 4, ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ 3, సమగ్ర శిక్ష 3 చొప్పున అర్జీలు నమోదయ్యాయి. అదేవిధంగా ఏపీ ఎస్సీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, జలవనరులు, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖలకు చెరో 2 చొప్పున వినతులు వచ్చాయి. గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, గ్రామీణాభివృద్ధి, ఏపీఎస్ ఆర్టీసీ, హౌసింగ్ కార్పొరేషన్, పోలీసు, సివిల్ సప్లయ్, వ్యవసాయ శాఖ, మహిళా శిశు సంక్షేమం, టిడ్కో, మత్స్య శాఖ, ఆర్థిక శాఖలకు చెరో 1 చొప్పున అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. పలు వినతులు పరిశీలిస్తే... ● పోలాకి మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య వినతిపత్రం అందజేశారు. ● ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారిందని కాలనీకి చెందిన వానపల్లి లక్ష్మి, మీసాల వనజాక్షి, కె.మాలతి, కృపా, ఎం.కృష్ణవేణి, జె.ధనలక్ష్మి తదితరులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. నీరు నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగిందని, దీంతో అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ● సారవకోట మండలం పెద్దలంబ గ్రామానికి చెందిన లుకలాపు చిన్నారావు తన ఆస్తిని అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఆక్రమించుకున్నాడని ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని, తన భూమిని తనకు ఇప్పించాలని కోరారు. గతంలో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదని వాపోయారు. ● జిల్లాలోని పలు ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా హాస్టళ్లను నిర్వహిస్తున్నాయని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలు, హాస్టళ్లు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత ఆర్ఐఓ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చొరవ తీసుకొని అనుమతులు లేకుండా నడుస్తున్న హాస్టళ్లను వెంటనే మూసివేయాలని, ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కళాశాలలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ● వృద్ధాప్య పింఛన్ పేరుతో సంతకం చేయించుకొని తన ఆస్తిని తన తమ్ముడు పల్లిసారధి గ్రామానికి చెందిన బెలమర మోహనరావు రాయించుకున్నాడని పలాస మండలంలోని కాశీబుగ్గ పోస్టు తాళభద్ర గ్రామానికి చెందిన ఇప్పిలి ధమయంతి ఫిర్యాదు చేశారు. మాయ మాటలు చెప్పి, పింఛను ఇప్పిస్తానని మోసం చేశాడని వాపోయారు. అధికారులు స్పందించి తన భూమి తన పేరిట మార్చాలని కోరింది. -
న్యాయం చేయండి
● నా కుమార్తె చావుకు కారణమైనవారిపై చర్యలు తీసుకోండి ● సీజీఎంను కలిసిన గార ఎస్బీఐ ఉద్యోగిని ఉరిటి స్వప్న తల్లి సరళశ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని పెద్దపాడు మార్గంలో ఉన్న శ్రీకాకుళం రీజనల్ స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియాను చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పాటిల్ సోమవారం సందర్శించారు. గార ఎస్బీఐ బ్యాంకులో జరిగిన తనఖా బంగారం మా యం కేసుకు ముందే అప్పటి రీజనల్ మేనేజర్ టీఆర్ఎం రాజు, బ్యాంకు ప్రతినిధులు అకౌంటెంట్ అయిన ఉరిటి స్వప్నప్రియపై ఆరోపణలు చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్వప్నప్రియ తల్లి ఉరిటి సరళాదేవి సీజీఎం రాజేష్ కుమార్ పాటిల్ను కలసి తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కన్నీటిపర్యంతమై వివరించారు. దానికి స్పందించిన సీజీఎం జరిగిన విషయాలేవీ తనకు తెలియవని, కచ్చితంగా నిజా నిజాలు తెలుసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మీకు రావాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సరళా దేవికి మద్దతుగా బంధువులు అధికంగా రీజనల్ బ్యాంకుకు చేరుకున్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో డీఎస్పీ సీహెచ్ వివేకానంద కేసు దర్యాప్తు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
గంజాయితో ఇద్దరు మహిళలు అరెస్టు
ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలను పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లోని హౌరాకు చెందిన పాయల్పాల్ కలకత్తాలోని గంజాయి వ్యాపారి సమీర్దాస్తో కలిసి కలకత్తా అటవీ ప్రాంతం కుచ్ బీహార్ నుంచి గంజాయి రవాణా చేసేంది. దీనికోసం గంజాయి వ్యాపారి గంజాయి రవాణా చేసిన ప్రతిసారి పాయల్పాల్కు రూ.10 వేలు ఇచ్చేవాడు. ఈవిధంగా కలకత్తా అటవీ ప్రాతం నుంచి పలుమార్లు గంజాయి వ్యాపారి సమీర్దాస్తో కలిసి గంజాయిని కలకత్తాకు తరలించింది. అయితే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వారివురు హౌరాజిల్లా బెల్లి దుర్గాపూర్కి చెందిన మౌమఖాల్ అలియాస్ తనీష అనే మహిళతో కలిసి ఒడిశా నుంచి గంజాయి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఒడిశాలోని దిగపొహండి పద్మనాభపూర్లో గంజాయి వ్యాపారం చేసే రంజిత్కుమార్ సాహు వద్దనుంచి12.520 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం ముగ్గురూ ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కి బస్ ద్వారా గంజాయితో చేరుకున్నారు. మహిళలిద్దరూ గంజాయి కలిగిన సూట్కేస్లతో రైల్వేస్టేషన్ సమీపంలో వేచి ఉండగా సమీర్దాస్ టికెట్లు తీసేందుకు వెళ్లాడు. ఈ ఇద్దరు మహిళలు అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరివద్ద నుంచి గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐతో పాటు పట్టణ ఎస్ఐ ఎం.ముకుందరావు తదితరులు ఉన్నారు. -
కారుమూరి అరెస్టు సరికాదు
● ఎమ్మెల్సీ నర్తు రామారావు మండిపాటు కవిటి: రాష్ట్రంలోని బీసీ కులాల గొంతును సీఎం చంద్రబాబు నొక్కేస్తున్నారని ఎమ్మెల్సీ, యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు నర్తు రామారావు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో లిక్కర్ పాలసీ పారదర్శకంగా నడిచిందని గుర్తు చేశారు. అక్రమాలే లేని మద్యం విధానంలో కుంభ కోణానికి ఆస్కారం ఎక్కడుంటుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పని చేసిన మంత్రులను టార్గెట్ చేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతూ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా కోర్టులో నిరూపణ చేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయక, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని దుమ్మెత్తిపోశారు. రానున్న రోజుల్లో బీసీలు కూటమి ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో యువ నాయకుడు నర్తు శివాజీ యాదవ్ తదితరులు ఉన్నారు. -
దళితపేటల్లో సౌకర్యాలు కల్పించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: దళితపేటల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు కోరారు. కుల వివక్షకు వ్యతిరేకంగా దళితుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం పేరుతో ఛలో కలెక్టరేట్ సోమవారం నిర్వహించారు. ఆర్అండ్బీ బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిర్ల ప్రసాద్, గంగారాపు సింహాచలం, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరావులు మాట్లాడుతూ.. 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో దళితుల సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత పేటల్లో కనీసం మంచినీరు, సరైన డ్రైనేజీ వంటి సౌకర్యాలు కూడా లేవన్నారు. అనేక గ్రామాల్లో శ్మశానవాటికకు రహదారి సౌకర్యం లేక పంట పొలాల మధ్యలో నుంచి భౌతికకాయాన్ని మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, దళిత పేటల్లో మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైట్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని, దళిత యువకులకు స్వయం ఉపాధిని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి.ఈశ్వరమ్మ, కొల్లి ఎల్లయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.చంద్రరావు, పోలాకి ప్రసాదరావు, వివిధ సంఘాల నాయకులు కె.మోహనరావు, ఎన్.షణ్ముఖరావు, ఎన్.గణపతి, హెచ్.ఈశ్వరరావు, అల్లు సత్యనారాయణ, నిమ్మక అప్పన్న, కుప్పిలి గోపి, పనస రమేష్, బి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఆన్లైన్ కౌన్సెలింగ్
ఎచ్చెర్ల: శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అర్హత గల అభ్యర్థులకు ఏపీఐసెట్–2026 ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఆన్లైన్లో సమస్యలుంటే నేరుగా కళాశాలకు వచ్చి పరిష్కరించుకోవచ్చు. వీటికి సంబంధించి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు, రిజి స్ట్రేషన్ ఈ నెల 24 వ తేదీ నుంచి 31 వరకూ చేసుకోవచ్చు. ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 25 వ తేదీ నుంచి వచ్చే నెల 1 వ తేదీ వరకూ చేసుకోవచ్చు. ఆప్షన్ల ఎంట్రీ ఈ నెల 27 వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకూ చేసుకోవచ్చు. ఆప్షన్లు మార్చుకోవాలంటే వచ్చే నెల 3 వ తేదీలోగా చేసుకునే అవకాశం ఉంది. వచ్చే నెల 7వ తేదీన సీట్ల అలాట్మెంట్ చేయ నున్నారు. సెల్ఫ్ జాయినింగ్లు వచ్చె నెల 8 వ తేదీనుంచి 11 వరకూ నిర్వహించనున్నారు. వచ్చెనెల 8 నుంచి క్లాసులు ప్రారంభించనున్నారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు మాత్రం నేరుగా ఈ నెల 31 తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకూ విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లి వెరిఫికేషన్ చేసుకోవాలి. చిక్కాలవలసలో విరిగిన విద్యుత్ స్తంభాలు నరసన్నపేట: చిక్కాలవలస కుమ్మరివీధిలో శనివారం రాత్రి రెండు విద్యుత్ స్తంభాలు విరిగి రేక్ షెడ్, ప్రహరీలపై పడ్డాయి. అయితే ఎవరికీ ఎ లాంటి ప్రమాదం జరగలేదు. అంబటి రాంబాబు కుమ్మరి శాల, పండూరి తవుడు ప్రహరీలపై పడటంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. పోల్స్ సక్రమంగా వేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. వర్షాలకే ఇలా పోల్స్ పడిపోతే ఎలా అని గ్రామస్తులు అంటున్నారు. డీఎస్సీ అవకతవకలపై బీజేపీ నాయకుడి నిరసన నందిగాం: బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి, బీజేపీ సభ్యత్వానికి మండలం దేవళభద్రకు చెందిన చింతాడ శ్రీనివాస్ ఆదివారం రాజీనామా చేశారు. రాష్ట్రంలో డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలపై వచ్చిన ఆరోపణలు, అభ్యర్థుల ఆందోళనలు ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన జిల్లా అధ్యక్షునికి సమాచారం అందించారు. ముగిసిన సాఫ్ట్బాల్ సబ్ జూనియర్స్ జట్ల ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో అనతి కాలంలో సాఫ్ట్బాల్ క్రీడకు గణనీయమైన ఆదరణ లభిస్తుండటం సంతోషంగా ఉందని సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో జిల్లాస్థాయి సబ్–జూనియర్స్ బాలబాలికల జట్ల ఎంపికలు జరిగాయి. సుమారు 150 మంది క్రీడాకారులు హాజరై తమ ప్రతిభ నిరూపించుకున్నారు. పాఠశాలస్థాయిలో సాఫ్ట్బాల్ క్రీడ పట్ల విద్యార్థుల్లో మక్కువ పెరగడం అభినందనీయమని సంఘ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎంపిక చేసిన జిల్లా జట్లను విజయనగరం జిల్లా బొబ్బిలి వేదికగా సెప్టెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి(అంతర్జిల్లాల) సబ్ జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్బాల్ చాంపియన్షిప్–2026 పోటీలకు పంపించనున్నట్టు సంఘ రాష్ట్ర కన్వీనర్ మొజ్జాడ వెంకటరమణ, ఉపాధ్యక్షుడు మెట్ట తిరుపతిరావు పేర్కొన్నా రు. ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన చెరో 20 మంది క్రీడాకారులను జిల్లా ప్రాబబుల్స్ జట్లకు ఎంపికచేశారు. వారికి శిక్షణా శిబిరాలను నిర్వహించిన అనంతరం తుది జట్లను ప్రకటించనున్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.సాంబ మూర్తి, సలహాదారు పి.సుందరరారావు, సాఫ్ట్బాల్ సంఘ ప్రతినిధులు అన్నెపు రాజగోపా ల్, ఢిల్లీశ్వరరావు, మహంతి, మధుసూదన్, వెంకటరమణ, హరికృష్ణ పాల్గొన్నారు. -
డేటా సెంటర్లతో పర్యావరణ విధ్వంసం
జి.సిగడాం(పొందూరు): విశాఖపట్నంలో పర్యావరణాన్ని విధ్వంసం చేసేందుకు కూటమి ప్రభుత్వం డేటాసెంటర్లను ఏర్పాటు చేస్తోందని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త వి.ఎస్.కృష్ణ అన్నారు. ఆదివారం పొందూరు మండల కేంద్రంలో శ్రీరామా ఐటీఐ ప్రాంగణంలో డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ విద్యాసదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖను నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నాయని చెప్పారు. డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే 300 మందికే ఉద్యోగాలు వస్తాయన్నారు. 2017న పోలవరం నీటిని ఉత్తరాంధ్ర ప్రజలకు అందిస్తామని చంద్రబాబు చెప్పినా ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్వీ రమణయ్య, రాష్ట్ర మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు మాట్లాడుతూ సామాజిక సంక్షోభంలో చిక్కుకున్న విద్యారంగాన్ని కాపాడుకునేందుకు ఉపాధ్యాయులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. అనంతరం పేడాడ కృష్ణారావు రచించిన వ్యాస సంపుటి ఈ అడుగులు ఏ ప్రస్థానానికి పుస్తకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ పట్నాన రాజారావు, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.హరి, విజయనగరం జిల్లా కన్వీనర్ దుర్గాశి గణేష్, ప్రధాన కార్యదర్శి కుమ్ము అప్పలరాజు, మండల శాఖ అధ్యక్షుడు గురుబిల్లి వెంకటరావు, రాజశేఖరం, బి.గున్ననాయుడు, తమ్మినేని మురళీ, జి.భాస్కరరావు, తమ్మినేని సన్యాసిరావు, జి.బాలకృష్ణ, పార్వదేశం రమణమూర్తి, గండం రామారావు, మధుసూదనరావు, మోహన్రావు పాల్గొన్నారు. -
బీఎల్ఓల పనితీరు పరిశీలన
టెక్కలి: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(సర్)లో భాగంగా ముసాయిదా విడుదల అనంతరం వివిధ రకాల క్లెయిమ్స్, అభ్యంతరాలకు సంబంధించి టెక్కలి మేజర్ పంచాయతీలో బూత్ స్థాయిలో నిర్వహిస్తున్న నమోదు పరిశీలనను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. బూత్ స్థాయిలో బీఎల్ఓల పనితీరును తెలుసుకున్నారు. ముసాయిదా అనంతరం వివిధ రకాల కారణాలతో తప్పిపోయిన ఓటర్లను మళ్లీ జాబితాలో చేర్చేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక నమోదు కార్యక్రమంలో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటు గల్లంతు కా కూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయనతో పాటు ఇన్చార్జి తహసీల్దార్ రాంబాబు ఉన్నారు. -
18 తులాల బంగారం రికవరీ
● చిన్నమ్మడు అంత్యక్రియలు పూర్తి ● మహిళా న్యాయవాది, ఆమె కుటుంబ సభ్యుల నుంచే బంగారం రికవరీ జలుమూరు: అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామంలో కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. కేసులో అనుమానితులుగా ఉన్న మహిళా న్యాయవాది, ఆమె సోదరుడు అచ్యుతరావు, ఆమె కుమారులు నుంచి సుమారు 18 తులాల వరకూ బంగారం రికవరీ చేశారు. ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిన చిన్నమ్మడు హత్యకు గురై ఆనవాలు కూడా గుర్తుపట్టలేని విధంగా మూటలో కనిపించే సరికి గ్రామస్తులు గొల్లుమన్నారు. శ్రీకాకుళం రిమ్స్లో పోస్టుమార్టం అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు మృత దేహాన్ని అప్పజెప్పారు. అలాగే అనుమానితుల నుంచి బంగారం రికవరీ చేసి చిన్నమ్మడు కుమారులు శంకర్ నారాయణ, సు ధాకర్లకు అప్పజెప్పారు. ఇంతటి దారుణానికి ఒడికట్టిన న్యాయవాది తోపాటు ఆమెకు సహకరించిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కుమారుడు సుధాకర్ కోరాడు. వృద్ధ మహిళ అని కనీసం చూడకుండా నమ్మకంగా ఇంటికి పిలిచి ఇలా చేయడం దారుణమని వాపోయాడు. -
అండర్–18 రగ్బీ పోటీలు ప్రారంభం
టెక్కలి రూరల్ : చాకిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం అండర్–18 ఉమెన్స్ రగ్బీ టోర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రగ్బీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. జిల్లా నుంచి 13 జట్లు పాల్గొన్నాయి. సిక్కోల్ జట్టు గెలుపొందగా, కేజీబీవీ సంతబొమ్మాళి జట్టు ద్వితీయ, జలుమూరు కేజీబీవీ జట్టు తృతీయ బహుమతులు సాధించాయి. ప్రధానోపాధ్యాయుడు కె.నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు డొంకాన రామకృష్ణ, జనరల్ సెక్రటరీ పొన్నాడ పార్వతీశం, కోశాధికారి కాపల రఘురాం, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాడన నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీ సంఘం కార్యవర్గ ఎన్నిక శ్రీకాకుళం కల్చరల్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మహమ్మద్ అక్బర్ బాషా, జనరల్ సెక్రటరీగా ముజీబుర్ రెహమాన్ (ముజీబ్)లను ఎంపిక చేశారు. జిల్లా కేంద్రంలోని కంపోస్టు కాలనీ యాదవ భవనం వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర అధ్యక్షుల అనుమతితో హాజీ అమీరుల్లా బేగ్ నియమించారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా డాక్టర్ ఆదిబ్ హసన్, వర్కింగ్ ప్రెసిడెంట్గా షేక్ ముబారక్, ఉపాధ్యక్షులుగా షేర్ అలీబేగ్, మహమ్మద్ అబ్దుల్ రజాక్, రెహమతుల్లా ఖాన్, రవుఫ్ ఖాన్, జిల్లా కార్యదర్శులుగా సుకుర్ఖాన్, మహమ్మద్ యాసీన్, షేక్ హుస్సేన్, షేక్ ఫిరోజుద్దీన్, కోశాధికారిగా సయ్యద్ రోషన్ బాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మహమ్మద్ అబ్దుల్ ఉస్మాన్, మహమ్మద్ అబ్దుల్ హబీబుల్లా, షేక్ నిజాముద్దీన్, పబ్లిసిటీ సెక్రటరీగా షేక్ షాన్వాజ్, జాయింట్ సెక్రటరీగా సలీం ఖాన్, మీడియా అధ్యక్షులుగా మహమ్మద్ రఫీ, కార్యదర్శిగా మహమ్మద్ అబ్దుల్ సత్తార్, ఈసీ మెంబర్లుగా షేక్ యూసుఫ్, జిలానిని నియమించారు. మూలపేట నుంచి భోగాపురం వరకు అభివృద్ధి టెక్కలి: మూలపేట నుంచి భోగాపురం వరకు నాలుగ వరుసల రోడ్లతో అభివృద్ధి చేపడతామని మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం సంతబొమ్మాళి మండలంలోని తీర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.650 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభిస్తామన్నారు. కోరమండల్ పరిశ్రమ ఏర్పాటుతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. మేఘవరంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ముగిసిన ఎంపీ కప్ చెస్ పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ : ఎంపీ కప్–2026 చెస్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ భవన్లో రెండురోజులుగా నిర్వహించిన ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 400 మందికిపైగా బాలబాలికలు హాజరయ్యారు. విజేతలకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బేస్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని సుజాత, వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఆరవల రవీంద్రబాబు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు, టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, బలగ ప్రహర్ష, దుంగ భాస్కర్, కొర్ను నాగార్జున ప్రతాప్, చెస్ సంఘ ప్రతినిధులు సనపల భీమారావు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఆరు గొర్రెలు మృతి సోంపేట: గొల్లవూరులో మద్దిల మోహన్రావు, గజ్జి తేజేశ్వరరావులకు చెందిన ఆరు గొర్రెలు అనుమానాస్పదంగా మృతి చెందాయి. ఆదివారం ఉదయం డొంకలూరు, బట్టిగళ్లూరు తీరంలో మంద మేపుతూ సాయంత్రం ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో హఠాత్తుగా కింద పడి మృతి చెందాయి. విషయం స్థానిక పశువైద్యాధికారి శిరీషకు తెలియజేయగా.. పంచనామా నిర్వహిస్తే విషయం తెలుస్తుందని తెలిపారు. -
జింకు లోపంతో జాగ్రత్త
ఆమదాలవలస: మానవ శరీరంలో జింకు కీలక పాత్ర పోషిస్తోంది. జింకు ధాతువు కణజాల వర్ధనంలో ప్రధాన పాత్ర పోషించి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చేస్తుంది. శరీరంలో హార్మోన్లను సమతుల్య పరిచే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. జింక్ ధాతువు మగవారిలో వ్యంధత్వం రాకుండా, ఆడవారికి ప్రసూతి సమయంలో మంచి ఆరోగ్యాన్నిస్తుంది. పిల్లల్లో చురుకుదనం పెరగడానికి తోడ్పడుతుంది. ఇంత ప్రాముఖ్యం కలిగిన జింకు మానవ ఆహారం ద్వారా సరైన మోతాదులో అందడంలేదు. పంట ఉత్పత్తుల్లో జింకు లేకపోవడం సరైన పౌష్టికాహారం అందని పరిస్థితి నెలకొంటోంది. ముఖ్యంగా నేలల్లో జింకు తక్కువ కావడం వల్ల పండించే పంటకు సరైన మోతాదులో జింకు అందక ఆహార పదార్థాల్లో జింకు శాతం తగ్గుతోంది. పంట ఎదుగుదల కూడా కుంటుపడుతోంది. ఆ ప్రభావం దిగుబడులపై పడుతోంది. ఈ నేపథ్యంలో జింకు లోపం రాకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.చిట్టిబాబు సూచించారు. లక్షణాలు ఇవే.. వరి: నాటిన 2–4 వారాలలో ముదురాకు చివరలు, ఈనె ఇరుపక్కలా తుప్పు లేదా ఇటుక రంగులో మచ్చలు కనిపిస్తాయి. పైనుంచి 3, 4 ఆకుల్లో ఈనె పాలిపోతుంది. ఆకులు చిన్నవిగా ఉండి పెలుసుగా మారి శబ్దం చేస్తూ విరిగిపోతాయి. వేరుశనగ: ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కనిపిస్తాయి. ఆకు ఈనెల మధ్య భాగం పసుపుగా మారి ఈనెలు మాత్రం పచ్చగా ఉంటాయి. మొక్కలు గిడసబారతాయి. మొక్కజొన్న: జింకులోపం వల్ల ఆకులమీద పసుపు వర్ణపు చారలు వరుసల్లో కనిపిస్తాయి. ముదిరేకొద్దీ ఆకులు పసుపు రంగుకు మారి తర్వాత తెల్లగా రంగు విరిగినట్లు కనిపిస్తాయి. పత్తి: పత్తిలో జింకు లోపించినపుడు ఆకు ఈనెలు పచ్చగా ఉండి మధ్యభాగం పసుపు రంగులోకి మారుతుంది. కమ్మ చివరి ఆకులు చిన్నవిగా ఉండి ముడతలు పడి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. రాగి: ఆకులపై లేత పసుపు వర్ణంలో సన్నని చారలు ఏర్పడతాయి. జింకు ధాతులోపం ఎక్కువగా ముదురు ఆకులలో కనిపిస్తుంది నివారణ చర్యలు.. వరిలో ప్రతి ఖరీఫ్ సీజన్ ఆఖరి దమ్ములో 20 కిలోల జింక్ సల్ఫేట్ను వేసి కలియదున్నాలి. దీనివల్ల 3 పంటలు వరకు జింకు ధాతు లోపం ఉండదు. పత్తిలో కూడా 20 కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. జింక్లోప సవరణ కోసం 0.2 శాతం జింక్ సల్ఫేట్ 2 గ్రాములు, 80 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం రైతులు అప్రమత్తంగా ఉండాలి ‘సాక్షి’తో వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చిట్టిబాబు -
కారు బోల్తా పడి వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం శ్రీపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన బల్లేడ కూర్మనాయుకులు(62), అతని అల్లుడు బెందాళం రాజేష్లు విశాఖపట్నంలో నివాసముంటున్నారు. వీరిద్దరూ ఆదివారం కవిటి మండలం రాజపురంలో జరిగిన ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి విశాఖ వస్తుండగా శ్రీపురం సమీపంలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డు వైపు బోల్తాపడింది. ఈ ఘటనలో కూర్మనాయుకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందగా, డ్రైవింగ్ సీట్లో ఉన్న రాజేష్కు తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న కోటబొమ్మాళి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వివరాలు సేకరించి కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. -
‘ఓట్ల తొలగింపు అడ్డుకుందాం’
నరసన్నపేట: అర్హత కలిగిన ప్రతి ఓటునూ కాపాడుకోవడమే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ కార్యాచరణ వేగవంతం చేసిందని, ఏక పక్ష ఓట్ల తొలగింపును అడ్డుకోవడానికి నియోజకవర్గ ఇన్చార్జిలు పూర్తి బాధ్యత తీసుకోవాలని పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ కార్యదర్శి హర్హవర్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక ఒక ప్రైవేటు హోటల్లో శ్రీకాకుళం, మన్యం, జిల్లాల వైఎస్సార్సీపీ అసెంబ్లీ ఎస్ఐఆర్ వార్ రూమ్ ఇన్చార్జిలతో సమీక్ష సమావేశం ఆదివారం పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో హర్షవర్దన్ రెడ్డి మాట్లాడుతూ.. వార్రూం కార్యక్రమాల సమన్వయంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ప్రధానంగా ఓటర్లకు జారీ అవుతు న్న నోటీసులు, వాటికి స్పందించే చట్టబద్ధమైన విధానాలు, సమర్పించాల్సిన ఆధార పత్రాలతో పాటు అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్(ఏఎస్టీడీ) ప్రక్రియ పై సుదీర్ఘంగా చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేయడమే మనందరి ధ్యేయమని అన్నారు. బూత్స్థాయి బీఎల్ఏలు, వార్రూం ఇన్చార్జీలు నిరంతరం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని పోలాకి జెడ్పీటీసీ కృష్ణ చైతన్య వివరించారు. సమావేశంలో జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు దామ మన్మధరావుతో పాటు నియోజకవర్గ వార్రూం ఇన్చార్జిలు పాల్గొన్నారు. -
భక్తులకు తప్పని వర్షం పాట్లు
అరసవల్లి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులకు వర్షం ఇక్కట్లు తప్పడం లేదు. శ్రావణ ఆదివారం సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు స్థానిక పరిస్థితులు సౌకర్యాలు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయి. దర్శనాల వరకు ఏర్పాట్లు బాగానే ఉన్నప్పటికీ తర్వాత పరిస్థితులు మాత్రం ఇబ్బందులకు గురిచేస్తున్నాయని భక్తులు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయలు వెచ్చించి భక్తదాతలు చేయించి ఏర్పాటు చేసిన జింకు రేకుల షెడ్లును కూల్చేసి కమ్మరేకుల శాలను వేయించిన ప్రస్తుత పాలకుల తీరుపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వర్షాలకు పూర్తిగా తడిచి ముద్దయి వర్షపునీరుతో ఉండడంతో ఎప్పటికప్పుడు సిబ్బంది నీటిని తొలిగించే చర్యలు చేపడుతున్నప్పటికీ..భక్తులకు మాత్రం అవస్థలు తప్పడం లేదు. ప్రసాదాల విభాగం కూడా ఇక్కడే ఉండడంతో కొనుగోలుతో పాటు తినడానికి కూడా భక్తులు అవస్థలు పడ్డారు. వర్షపునీటిలో బయటకు వెళ్లలేక..ఈ కమ్మ రేకుల శాలలో కూర్చోలేక నిలబడే ప్రసాదాలను తినడం కనిపించింది. ఇప్పటికై నా ఆలయ అధికారులు శాశ్వత ఏర్పాట్లపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
కవిటి: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు పిలుపునిచ్చారు. కొత్తపుట్టుగ క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సర్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ అంశంపై ఇదివరకే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పోటీకి బలంగా సిద్ధం కావాలని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.పార్టీకోసం పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. సమావేవంలో మండల కన్వీనర్ కడియాల ప్రకాష్, కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ ఇప్పిలి కృష్ణారావు, దుర్గాసి ధర్మారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
పనితనం.. ఇదే నిదర్శనం!
● మూడుసార్లు కూలిన డ్రైనేజీ ● రూ.12 కోట్ల పనుల నిర్వహణపై ఆరోపణలు ● ప్రారంభించకుండానే కూలుతున్న నిర్మాణాలు సరుబుజ్జిలి: అక్కడ రోడ్డు విస్తరణ పనులు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఈ రోడ్డు ఇంకా ప్రారంభమే కాలేదు.. కానీ మూడుసార్లు కాలువ నిర్మాణం కుప్పకూలింది. రూ.12 కోట్లతో జరుగుతున్న పనుల సమర్థతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఉపాధి నిధులతో సరుబుజ్జిలి జంక్షన్లో అలికాం–బత్తిలి రహ దారిలో సుమారు 2 కిలోమీటర్లు, పాలకొండ– కొమానాపల్లి రహదారిలో సుమారు 600 మీటర్లు రహదారుల విస్తరణ, డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్నారు. ఆర్అండ్బీ శాఖాధికారులకు పనులు అప్పగించడం వల్ల కాంట్రాక్టర్ ఆడిందే ఆట పాడిందే పాటగా పనులు సాగుతున్నాయి. నాలుగు రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించకుండానే కుప్పకూలడంతో నాణ్యత ఇట్టే అర్థమవుతోందని ప్రజలు అంటున్నారు. హిరమండలం రహదారిలో నిర్మిస్తున్న డ్రైనేజీ ఇప్పటివరకు 3సార్లు కూలిపోయింది. అదేవిధంగా నిర్మాణం చేపట్టిన రహదారి కూడా చాలా చోట్ల దిగబడి కుంగిపోయింది. తప్పులు కప్పిపుచ్చుకొనేందుకు కాంట్రాక్టర్ కూలిన చోట ఆనవాళ్లు లేకుండా పొక్లెయినర్తో తవ్వకాలు చేపట్టడం గమనార్హం. ఈ విషయమై వివరణ కోసం ఆర్అండ్బీ ఈఈను సంప్రదించగా స్పందించలేదు. -
తంపర, రెండు హృదయాలు పుస్తకాల ఆవిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళ సాహితి, సాహితీ స్రవంతి సంస్థలు సంయుక్తంగా ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు వ్యాస సంపుటి ‘తంపర’ను సాహితీ స్రవంతి శ్రీకాకుళం జిల్లా శాఖ కన్వీనర్ కేతవరపు శ్రీనివాసు ఆవిష్కరించగా, తెలంగాణ రాష్ట్రం పాల్వంచకు చెందిన ప్రముఖ రచయిత శిరంశెట్టి కాంతారావు, ప్రసిద్ధ రచయిత గంటేడ గౌరునాయుడులు సంయుక్తంగా రచించిన ‘ఎన్నో ఉదయాలు.. రెండు హృదయాలు’ ప్రయోగశీల కావ్యాన్ని పట్టణానికి చెందిన వైద్యులు డాక్టర్ కణుగుల సుధీర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రముఖులు చీకటి దివాకర్, చిగురుపల్లి ప్రభాకరరావు,, లండ సాంబమూర్తి, కల్లేపల్లి ఉదయ్కిరణ్, బాడాన శ్యామలరావు, దాసరి రామచంద్రరావు, పందిరి గోవిందరాజులు, పూజారి దివాకర్, నల్లి ధర్మారావు, బాల సుధాకర మౌళి, పీవీ నరసింహులు, చింతా అప్పలనాయుడు, సిరికి స్వామి నాయుడు, మల్లిపురం జగదీష్, పక్కి రవీంద్ర, కంచరాన భుజంగారావు, చీకటి చంద్రికరాణి, డప్పు శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఓ బొజ్జ గణపయ్య.. జీవనాధారం నువ్వేనయ్యా!
గణపతి విగ్రహాలకు మెరుగులు జగన్నాథుని ఆకృతిలో వినాయకుడు మందస వినాయక చవితి సందడి మరో 20 రోజుల్లో మొదలుకానుంది. భాద్రపద శుక్లపక్ష చవితినాడు ప్రారంభమైన నవరాత్రుల్లో ఎంతో అంగరంగ వైభవంగా హిందువులు మొదటి ఉత్సవంగా ఈ పండగను భావిస్తారు. ఈ క్రమంలో గణనాథుని విగ్రహాలకు కళాకారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. వీటినే నమ్ముకొని వేలాది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. ఏటా ఓసారి వచ్చే వినాయక చవితి ఉత్సవాల్లో అవసరమైన బొజ్జ గణపయ్య విగ్రహాలను విభిన్న ఆకృతుల్లో తయారుచేసి అమ్మకాలను సాగిస్తారు. ప్రధానంగా మందస కేంద్రంలో తయారు చేస్తున్న మట్టి విగ్రహాలకు మందస, హరిపురం, పలాస, గొప్పిలి, తర్లాకోట, రాజపురం, సారంగిపురం, ఒడిశా తదితర ప్రాంతాల్లో గిరాకీ ఉంటుంది. ఉత్సవాలకు మూడు నెలలు ముందే విగ్రహాలు తయారీకి అవసరమైన ముడి సామగ్రిని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి గణపతి విగ్రహాలను కళాకారులు ప్రారంభిస్తారు. ఇక్కడ అధిక సంఖ్యలో మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు. విభిన్న ఆకృతులు.. ఏటా విభిన్న ఆకృతిలో వినాయకులను తయారుచేస్తుండటంతో ఆదరణ పెరుగుతోంది. స్థానిక కమిటీ సభ్యుల అభిరుచులు, ఆలోచనలకు తగ్గట్టుగా రకరకాల ఆకృతిలో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. నాలుగు అడుగుల నుంచి 12 అడుగులు ఎత్తు వరకు తయారు చేసి మార్కెట్లో అమ్మకాల కోసం సిద్ధం చేస్తున్నారు. సైజును బట్టి ఒక్కొక్క విగ్రహాన్ని రూ.4,000 నుంచి రూ.25 వేల వరకు అమ్మకాలు చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో విగ్రహాల అమ్ముడుపోతేనే తమ కుటుంబ పోషణకు భరోసా దొరుకుతుందని, లేదంటే నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కళాకారులు చెబుతున్నారు. మట్టి విగ్రహాల తయారీనే నమ్ముకున్న కళాకారులు స్థానికులతో పాటు ఒడిశా ప్రాంతాల నుంచి రాక కమిటీ సభ్యుల అభిరుచులకు తగ్గట్టు విగ్రహాల రూపకల్పన -
తైక్వాండో స్టేట్మీట్లో సిక్కోలు జయకేతనం
శ్రీకాకుళం న్యూకాలనీ: తైక్వాండో సమరంలో శ్రీకాకుళం జిల్లా మరోసారి తన సత్తాచాటుకుంది. సిక్కోలు వేదికగా జరిగిన మూ డు రోజుల రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఆతిథ్య శ్రీకాకుళం క్రీడాకారులు అదిరేటి ఆటతీరును కనబర్చి విజయదుందుభి మోగించారు. న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సౌజన్యంతో తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కల్యాణ మండపం వేదికగా జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి(అంతర్ జిల్లాల) తైక్వాండో చాంపియన్షిప్–2026 పోటీలు ముగిశాయి. కన్నుల పండువలా మూడు రోజులపాటు ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు కేడిట్ విభాగంలో మూడో స్థానం, జూనియర్స్లో రెండో స్థానంలో నిలిచారు. పూమ్సే విభాగంలో విజయనగరం జిల్లా విజేతగా నిలిచింది. సబ్జూనియర్స్ విభాగంలో విశాఖపట్నం చాంపియన్గా నిలవగా, సీనియర్స్ విభాగంలో తూర్పుగోదావరి జిల్లా చాంపియన్గా నిలిచింది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ టైటిళ్లు, పతకాలు పంపిణీ చేశారు. పోటీలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ తైక్వాండో రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు, జిల్లా కార్యదర్శి కొమర భాస్కరరావు కృతజ్ఞతలు తెలిపారు. -
చిన్న వయసులో పెద్ద కష్టం!
● లివర్సిరోసిస్తో బాధపడుతున్న జోష్వర్ధన్ ● వైద్యం కోసం రూ.50 లక్షలు అవసరం ● దాతల కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు జి.సిగడాం : పదో తరగతి పూర్తి చేసిన ఆ యువకుడికి పెద్ద కష్టం వచ్చిపడింది. ఇంటర్మీడియెట్లో జాయినై ఉన్నత చదువులు చదవాలన్న కలకు అరుదైన వ్యాధి రూపంలో బ్రేక్ పడింది. చికిత్సకు రూ.50 లక్షలకు పైగా డబ్బులు అవసరం పడటంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలంటూ దాతలపైనే భారం వేశారు. ఏం జరిగిందంటే.. జి.సిగడాం మండలం ఎందువ గ్రామానికి చెందిన కింజరాపు భాస్కరరావు, రమా దంపతులకు కుమారుడు జోష్ వర్ధన్. వయస్సు 15 సంవత్సరాలు. ప్రభుత్వం పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. ఇంటర్ చదవాలనుకున్న సమయంలో లివర్సిరోసిస్ అనే అరుదైన వ్యాధి సోకింది. ఈ వ్యాధి నయంకావాలంటే సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు నిరాశలో కూరుకుపోయారు. పేద కుటుంబం కావడంతో ఆపరేషన్ చేయించలేకపోవడంతో జోష్వర్ధన్ మంచానికే పరిమితమయ్యారు. ఆస్పత్రుల్లో చూపించినా.. జోష్వర్ధన్ రెండేళ్లుగా వ్యాధితో పోరాటం చేస్తున్నాడు. విశాఖ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని ప్రముఖ ఆస్పత్రుల్లో చూపించారు. వ్యాధి నివారణ చేయాలంటే ప్రత్యేక ఆపరేషన్ చేయాలని విశాఖలోని ఓ ప్రవేట్ ఆస్పత్రి వైద్యులు తెలియజేశారు. ప్రస్తుతం ప్రతి నెలా మందులు, వైద్య పరీక్షల కోసం సమారు రూ.30 వేలు వరకు ఖర్చు అవుతోందని, ఆపరేషన్ కోసం దాతలు స్పందించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం కోసం.. దాతలు 99515 95285 నంబర్కు ఫోన్పే చేయవచ్చు. యూనియన్ బ్యాంకు (ఖాతా నంబరు 016610100122026, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూబీఐఎన్0801666) ద్వారా కూడా సాయం అందించవచ్చు. -
మౌన వేదన
కొత్తూరు: నిబంధనలను కాలరాసి.. నియమాలను తుంగలో తొక్కి పశువులను అక్రమ రవాణా చేస్తున్నారు. రైతుల ముసుగులో ఈ అక్రమాలను దర్జా గా చేస్తున్నారు. కొత్తూరు మండలంలోని బలద సంత పశువుల అక్రమ రవాణాకు కేరాఫ్గా మారుతోంది. ఒడిశాకు ఆనుకుని ఉన్నందున రవాణా సులభంగా జరిగిపోతోంది. జంతు సంక్షేమ కమిటీ వారు కన్నెత్తి కూడా చూడకపోవడంతో మూగజీవాలు సరిహద్దులు దాటి వెళ్లిపోతున్నాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయి..? ● జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ సమన్వయ కమిటీ పనిచేస్తుంది. మండల స్థాయిలో తహసీల్దార్, ఎస్ఐ, ఎంపీడీఓ, మండల పశు వైద్యాధికారులు సమన్వయ కమిటీగా ఏర్పడి పశువుల అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలి. ● జిల్లా సరిహద్దుల్లో, సంతల సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలి. ● నిబంధనలకు వ్యతిరేకంగా పశువులను అక్రమంగా రవాణా చేసిన వారిపై క్రూరత్వ నిరోధక చట్టం(పీసీఎ–1960 చట్టం) ప్రకారం కేసులు నమోదు చేయాలి. ● పట్టుకున్న పశువులను సమీపంలోని గోసంరక్షణ శాలకు తరలించి, వారి బాగోగులు చూసేందుకు చర్యలు తీసుకోవాలి. ● పశువులను రవాణా చేసినప్పుడు పశువైద్యాధికారి మంజూరు చేసిన ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ● పశువులకు ఆహారంతో పాటు దాణాను వాహనాల్లో ఏర్పాటు చేసి వాటికి అనుకూలంగా ఉన్న వాహనాల్లోనే తరలించాలి. జిల్లాలో ఏం జరుగుతోంది..? ● కొత్తూరు మండలంలోని బలద, నారాయణవలస, కొల్లివలస, చింతాడ వారపు సంతల్లో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ● ఈ సంతల్లో నుంచి ప్రతి వారం పశువులను గోవధ శాలలకు పంపిస్తున్నట్లు సమాచారం. ● పలు కంపెనీల నుంచి వచ్చిన ఏజెంట్లు సంతలో దళారుల ద్వారా పశువులను కొనుగోలు చేస్తున్నారు. ● ఒడిశాకు ఆనుకుని ఉన్నందున ఇక్కడకు ఎక్కువగా పశువులను తీసుకువచ్చి అమ్ముతారు. ● ఈ పశువులను కొనుగోలు చేశాక ఇరుకు వాహనాల్లో తీసుకెళ్తూ నరకయాతనకు గురి చేస్తున్నారు. ● జిల్లాలోని వారపు సంతల్లో కొనుగోలు చేసిన పశువులను ఒడిశా రాష్ట్రంలోని గ్రామాలకు తరలించి అక్కడ వాహనాల్లో పశువులను ఎక్కించి గోవధ శాలలకు తరలిస్తున్నట్లు తెలిసింది. ● ఒడిశాలో లోడు చేయడంతో జిల్లా పోలీసులకు సమాచారం ఉన్నా చర్యలు తీసుకోలేని పరిస్థితి. ● కొత్తూరు మండలం బలద సంతలో రైతుల ముసుగులో కొంత మంది వ్యాపారులు పశువులను అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం. బలదలో దళారీల ద్వారా పశువుల కొనుగోలు విశాఖ, కాకినాడ, హైదరాబాద్తో పాటు పలు పట్టణాలకు తరలింపు ఆరోగ్య సర్టిఫికెట్లు లేకుండానే రవాణా రైతుల ముసుగులో పశువులతో వ్యాపారం జాడ లేని జంతు సంక్షేమ సంఘం జంతు సంక్షేమ సంఘం ఏదీ? సంతల నుంచి పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి ప్రభుత్వం నియమించిన జంతు సంక్షేమ సంఘం సక్రమంగా తమ బాధ్యతలను నిర్వహించడం లేదు. సంఘంలో ఉన్న అధికారులు సక్రమంగా తనిఖీలు నిర్వహించాలి. – గేదెల మన్మధరావు, కొత్తూరు విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి అక్రమ రవాణా అరికట్టాలి.. జిల్లా నుంచి పశువులు గోవధ శాలకు ఎక్కువగా తరలిస్తున్నారు. సంతలో కొనుగోలు చేసిన పశువులను కొంత దూరం వరకు తీసుకెళ్లి అక్కడ వాహనాల్లోకి ఎక్కిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. – పొగిరి రవి, టీటీడీ ధర్మ ప్రచారక్ కొత్తూరు నిఘా పెట్టాం బలద సంతలో పశువుల అక్రమ రవాణా జరగకుండా నిఘా పెట్టాం. ప్రతి మంగళవారం సంతలో పోలీస్లు మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నారు. బలద సంతలో అక్రమ రవాణా జరిగినట్లు మా దృష్టికి రాలేదు. – కె.వెంకటేష్ ఎస్ఐ, కొత్తూరు మండలం -
‘తీర ప్రాంతంలో విధ్వంసకర తవ్వకాలు వద్దు’
టెక్కలి: సముద్ర తీర ప్రాంతాల్లో విధ్వంసకరమైన రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకాలు చేయవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు కోరారు. ఆది వారం టెక్కలిలో సమావేశాన్ని ఏర్పాటు చేసి మా ట్లాడారు. గార్నైట్, ఎలిమినైట్, జిర్కాన్, టైటానియం వంటి నిక్షేపాల కోసం సముద్ర తీర ప్రాంతాల్లో తవ్వకాలు చేయడానికి రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాజెక్టు పేరుతో అదానీ సంస్థకు ఆదాయం సమకూర్చడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంద న్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల ముఖ్యంగా సంతబొ మ్మాళి మండలంలో సుమారు 38 వేల ఎకరాల్లో బలవంతపు భూసేకరణ చేయడానికి కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతు కుటుంబాలు నడిరోడ్డున పడతాయనే విషయం మంత్రి అచ్చెన్నాయుడుకు తెలియదా అని ప్రశ్నించారు. సమావేశంలో ఎన్.షణ్ముఖరావు, కె.ఎల్లయ్య, హెచ్.ఈశ్వరరావు పాల్గొన్నారు. -
● వంశధారలోకి వరద నీరు
హిరమండలం వంశధార గొట్టా బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయానికి స్వల్పంగా వరద నీరు పెరిగింది. ఒడిశా కేచ్మెంట్ ఏరియాతో పాటు గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు వంశధారలో వరదనీరు వచ్చిచేరుతోంది. గొట్టా బ్యారేజీ వద్ద గరిష్టంగా 38.10 మీటర్లు నీటిమట్టం ఉండగా ప్రస్తుతానికి 37.20 మీటర్ల నీటిమట్టం ఉంది. బ్యారేజీలోకి ఇన్ఫ్లో శనివారం సాయంత్రానికి 2200 క్యూసెక్కులు నీరు వచ్చి చేరింది. ఆదివారం ఉదయం నాటికి 19,500 క్యూ సెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. సాయంత్రానికి 20,217 క్యూసెక్కులకు పెరిగింది. వచ్చిన నీటిని 10గేట్లు 20 సెంటీమీటర్లు మేర పైకి ఎత్తి దిగువకు 18,437 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు డీఈ సరస్వతి, ఏఈ ఆనందరావు తెలిపారు. అలాగే కుడి ప్రధాన కాలువ ద్వారా 458 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 1322 క్యూసెక్కులు నీటిని విడిచిపెట్టినట్లు డీఈ తెలిపారు. – హిరమండలం -
కమీషన్ల కక్కుర్తితోనే రెడ్జోన్ పరిశ్రమలకు అనుమతులు
● మంత్రి అచ్చెన్నపై పేరాడ తిలక్ మండిపాటు టెక్కలి: జిల్లాలో స్థానిక వనరులకు అనుకూలంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి వాటి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టును తీసుకువచ్చారని.. కూటమి ప్రభుత్వంలో మాత్రం కొన్ని రకాల కెమికల్స్ కంపెనీల నుంచి భారీగా కమీషన్లకు కక్కుర్తి పడి మంత్రి అచ్చెన్నాయుడు ఆయా పరిశ్రమల ఏర్పాటుకు పోర్టు పరిసర ప్రాంతాల్లో భూములిచ్చేందుకు సిద్ధమవుతున్నారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. ఆదివారం టెక్కలిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టెక్కలి నియోజకవర్గంతో పాటు జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేలా పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఈ ప్రాంతాన్ని దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోర్టు పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు గతంలో హల్దియా పెట్రో కెమికల్స్, కళ్యాణి స్టీల్స్, యమునా గ్రీన్ అమోనియా, హెఎంపీఎల్, నాల్కో, విశాఖ పోర్టు ట్రస్టు, గెయిల్, బీపీసీఎల్, ఎగ్జాంబుల్ తదితర కంపెనీలు ముందుకు వస్తే, ఆయా కంపెనీల నుంచి మంత్రి అచ్చెన్నాయుడు భారీగా కమీషన్లు డిమాండ్ చేయడంతో వారంతా పారిపోయారని చెప్పారు. గతంలో పవర్ప్లాంట్ ఏర్పాటుకు సేకరించిన సుమారు 1800 ఎకరాల భూమి ఆయా కంపెనీ నుంచి అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కేవలం పుష్కలంగా పంటలు పండిస్తున్న రైతుల భూములపైనే మంత్రి కన్నుపడిందన్నారు. తాము పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, రెడ్జోన్లో ఉండాల్సిన పరిశ్రమలను కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఈ ప్రాంతంలో విధ్వంసకరమైన దుస్థితికి తీసుకురావొద్దని తిలక్ పేర్కొన్నారు. పోర్టుకు అనుసంధానంగా ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమలు, గ్రానైట్ ఆధారిత పరిశ్రమలు, ఆక్వా, ఖాదీ, కొబ్బరి, జీడి ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసేలా దృష్టి సారించాలని, అంతే తప్పా భారీగా కమీషన్ల వస్తాయనే ఆశతో రెడ్జోన్లో ఉండాల్సిన పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒకే ఇంట్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఉన్నప్పటికీ స్థానిక వనరులకు అనుకూలంగా పరిశ్రమలను తీసుకురాలేని అసమర్థత మంత్రులుగా మిగిలిపోతున్నారని దుయ్యబట్టారు. కెమికల్స్ పరిశ్రమ కోసం ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 211పై మరో సారి పునరాలోచన చేసి దానిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక రైతులు, ప్రజల అభిప్రాయాలతో పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేశారు. ఈయనతోపాటు నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, పార్టీ పట్టణ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కర్నిక జీవన్, ఆర్టీఐ వింగ్ అధ్యక్షుడు బి.రాజేష్ ఉన్నారు. -
కల్యాణ వైభోగమే..!
● శ్రావణమాసంలో పెళ్లిళ్ల జోరు ● కళకళలాడుతున్న కల్యాణ మండపాలు ● వచ్చే నెల వరకూ శుభ ముహూర్తాలు ఆగస్టులో 23, 24, 26, 27, 28, 30, 31 సెప్టెంబర్లో 3, 4, 5, 6, 7 తర్వాత భాద్రపద మాసం ప్రారంభం శ్రీకాకుళం కల్చరల్ : శుభ ముహూర్తాల శ్రావణమాసంలో పెళ్లిళ్లు జోరందుకున్నాయి. నెలంతా మంచి ముహూర్తాలు ఉండటంతో కల్యాణ మండపాలు కళకళలాడుతు న్నాయి. జిల్లా కేంద్రంతో పాటు టెక్కలి, నరసన్నపేట, పలాస నియోజకవర్గాల్లో వివాహాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. పెళ్లంటేనే సందడి. జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే ఈ వేడుకను చిరకాలం గుర్తుండిపోయేలా కొందరు గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. అతిథులను ఆకట్టుకునే విధంగా ఎటుచూసినా మిరుమిట్లు గొలి పే విద్యుత్ దీపాలు, షామియానాలు, ఇంద్రలోకంలో ఉన్నామా అనే తీరుగా సరికొత్త డెకరేషన్లతో అదరగొడుతున్నారు. వీటికి తోడు కడుపునిండా తినేందుకు వివిధ రకాల వంటకాలు, ఆహా అనిపించే ఆతిథ్యం అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకకు రూ.30లక్షల వరకు ఖర్చు చేసారంటే అతిశయోక్తి కాదు. సరికొత్త ఒరవడి.. గతంలో పెళ్లంటే బ్యాండ్మేళాలు, భాజాభజంత్రీ లు, పూలమండపాలు, వీడియో షూటింగ్లు ఉండేవి. ప్రస్తుతం కొత్త ఒరవడి కనిపిస్తోంది. వివాహ ముహుర్తానికి ముందే సంగీత్, ప్రీ వెడ్డింగ్ షూట్లకు ప్రకృతి సోయగాలున్న ప్రాంతాలకు వెళ్లడంతో పాటు సముద్రతీరాలకు వెళ్లి కాబోయే వధువరులతో ప్రత్యేక పాటలు రూపకల్పన చేస్తున్నారు. కొంతమంది కల్యాణ మండపంలోనే సెట్టింగులు వేసి షూటింగ్లు నిర్వహిస్తున్నారు. మండపాలలో ఎల్ఈడీ స్క్రీన్లు వంటివి ప్రదర్శిస్తున్నారు. వరుసగా ముహూర్తాలు ఉండటంతో కల్యాణ మండపాలకు డిమాండ్ పెరిగింది. నగరంలో మండపాలతో పాటుగా నగరం వెలుపల ఉన్న రిసార్టులు, ఖాళీ ప్రదేశాలలో సెట్టింగులు, పెద్దపెద్ద ఫంక్షన్ హాళ్లు 25కు పైగా ఉన్నాయి. ఫంక్షన్హాలు బట్టి అద్దె వసూలు చేస్తున్నారు. మినీ ఫంక్షన్ హాలుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తుంటే పెద్దవాటికి రూ.3లక్షలకు పైగా అద్దెలు వసూలు చేస్తున్నారు. పూల డెకరేషన్, లైటింగ్, భోజనాల ఖర్చు వంటి వాటితో కలిపి రూ.10లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఖర్చు అవుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. -
సచివాలయ ఉద్యోగి మృతిపై సహచరుల ఆందోళన
ఇచ్ఛాపురం రూరల్: ఒకే ఉద్యోగం చేస్తున్న తమపై పలు కీలక బాధ్యతలు మోపడంతో తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్ఛాపురం మండలం మండపల్లి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పని చేస్తున్న రౌతు మెహర్ శుక్రవారం బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ శనివారం నియోజకవర్గ స్థాయి సచివాలయ ఉద్యోగులు నిరసన చేపట్టారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇచ్ఛాపురం తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల ముందు ఆందోళన నిర్వహించి సంబంధిత అధికారులకు వినత పత్రాలు అందజేశారు. విపరీతమైన ఒత్తిడి మృతుడు మెహర్ ఒక్కరిపైనే డిజిటల్ అసిస్టెంట్ విధులతో పాటు బూత్ లెవల్ ఆఫీసర్, మండల సెన్సస్ కో ఆర్డినేటర్, ఆధార్ ఆపరేటర్ వంటి కీలక బాధ్యతలు అప్పగించారని ఉద్యోగులు తెలిపారు. వీటికి తోడు రోజు వారీ సర్వీసులు, వివిధ ప్రభుత్వ సర్వేలు నిర్వహించాల్సి రావడంతో పని భారం విపరీతంగా పెరిగిందన్నారు. నిర్ణీత సమయంలో పలు రకాల విధులు పూర్తి చేయాలన్న ఒత్తిడితో ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనిపై ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వారు తెలిపారు. ఉద్యోగి మెహర్ కుటుంబం పెద్ద దిక్కును కోల్పయిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర గ్రామ, వార్డు సచివాలయ సంఘం జేఏసీ కో ఆర్డినేటర్ కూన వెంకట సత్యన్నారాయణ, ఏఎస్ఈ స్టేట్ వైస్ ప్రసిడెంట్ షేక్ ఫరూక్, జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్లు ఉప్పాడ జైకృష్ణ. పొల్లాయి అశోక్, విజయకుమారీ, ప్రదీప్, అబ్ధుల్, సర్వేశ్వరరావు, కొప్పల రవిబాబు, వాసుదేవ్, సూర్యకుమారీ, సునీల్ గఫూర్, ప్రవీణ్, మీనాక్షి, కె.నీరజ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమో కోర్సులకు మాన్యువల్ స్పాట్ కౌన్సెలింగ్
ఆమదాలవలస: ప్రాంతీయ వ్యవసా య పరిశోధన స్థానం అనకాపల్లిలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమా కోర్సు ల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 27వ తేదీన మాన్యువల్ స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తొగరాం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీపాన నీలవేణి తెలిపారు. శనివారం పట్టణంలోని వ్యవసాయ పరిశోధన స్థానంలోగల ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ 2026 – 27 విద్యా సంవత్సరానికి విశ్వవిద్యాలయం పరిధిలోని మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు జోనల్ స్థాయిలో స్పాట్ కౌన్సిలింగ్కు అనుమతి లభించిందని అన్నారు. నార్త్ కోస్టల్ జోన్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఈ నెల 27వ తేదీ గురువారం అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరుగుతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి తొగ రాం ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు శ్రీ వెంకటేశ్వర ప్రైవే టు వ్యవసాయ పాలిటెక్నిక్లో మిగిలిన సీట్లను ఈ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని సీటు పొందలేని వారు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల ని సూచించారు. సందేహాల నివృత్తికి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నంబర్ 77023 94824 కు సంప్రదించాలని కోరారు. -
ఆత్మ విశ్వాసమే ఆయుధం
టెక్కలి: విద్యార్థులు తమ కలలకు రెక్కలు తొడిగేలా ఆత్మ విశ్వాసమే ఆయుధంగా నిరంతరం ప్రణాళికతో చదివి విజయ శిఖరాలను అధిరోహించాలని సినీ నటు డు, మోటివేటర్ ప్రదీప్ కొండిపర్తి ఆకాంక్షించారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన అలు మ్నీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయం ఒక్క రోజులో దక్కేది కాదని, నిరంతరం నేర్చుకోవడం, వైఫల్యాలను చవిచూడడం, వాటి ద్వారా పాఠాలను నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం కళాశాల ప్రాంగణాన్ని సందర్శించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. సిల్వర్ జూబ్లీ ప్రయాణం గూర్చి కళాశాల యాజమాన్యం వివరించా రు. కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, డైరెక్టర్లు వి.వి.నాగేశ్వరరావు, మధుకుమార్, నాగశేషు, ప్రిన్సిపా ల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, అలుమ్ని కో–ఆర్డినేటర్ డి. యుగంధర్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యూనియన్ బలోపేతమే లక్ష్యం
అరసవల్లి: యూనియన్లో గత మరకలను పూర్తిగా తొలిగించేలా చర్యలు చేపట్టామని.. ఎలాంటి విబేధాలు అంతర్యుద్ధాలు లేకుండా సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ఆర్కే గణపతి పిలుపునిచ్చారు. శనివారం యూనియన్ గుర్తింపు చిహ్నమైన టవర్ను స్థానిక యూనియన్ కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టవర్లా సంఘ సభ్యులంతా క్రమశిక్షణతో ఉంటే మంచిగా సేవ చేసే పవర్ అందిస్తుందని గుర్తుచేశా రు.కార్యక్రమంలో 1104 సంఘ డిస్కం వర్కింగ్ ప్రెసిడెంట్ మహంతి ప్రభాకరరావు, డిప్యూ టీ జనరల్ సెక్రటరీ రాజేశ్వరరావు, రీజనల్ అధ్యక్షుడు టి.వి.సుబ్రహ్మణ్యం, రీజనల్ ప్రధా న కార్యదర్శి ఎన్.లోకేశ్వరరావు, ట్రెజరర్ శ్రీధ ర్, విశాఖపట్నం రీజనల్ కార్యదర్శి నూక రా జు, శ్రీకాకుళం బ్రాంచ్ అధ్యక్షుడు వి.నారాయణరావు, ఉమ, సూర్యనారాయణ, అచ్చెన్నాయుడు, రాజారావు తదితరులు పాల్గొన్నారు. వజ్రపుకొత్తూరు రూరల్: డోకులపాడు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు దుమ్ము పాపమ్మ (102) శనివారం మృతి చెందారు. పాపమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈమె భర్త, ఇద్దరు కుమారులు కొంతకాలం క్రితమే చనిపోయారు. ప్రస్తుతం ఓ కుమారుడు, కుమార్తెతో పాటు మరో 15 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రకటించిన 2024–25 ఆర్థిక సంవత్సరపు వార్షిక పురస్కారాల్లో శ్రీకాకుళం జిల్లా రెండు కీలక అవార్డులను కై వసం చేసుకుంది. సభ్యత్వ నమోదు, నిధుల సేకరణ విభాగానికి గానూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఎంపిక కాగా, పాత జిల్లాల విభాగంలో ఉత్తమ జిల్లా పురస్కారాల్లో ద్వితీయ స్థానానికి గానూ జాయింట్ కలెక్టర్, ఐఆర్సీఎస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఎంపికయ్యారు. సెప్టెంబరు 1న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న ఐఆర్సీఎస్ రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) రాష్ట్ర గవర్నర్, సొసైటీ ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డులను అందజేయనున్నారు. పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వ్యక్తిగత ఆహ్వాన పత్రికలను ఐఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఈఓ ఎ.కె.పరిడా జిల్లాకు పంపించారు. కవిటి: దేశంలోనే ఏకై క భారత మాత దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన సీహెచ్ కపాసుకుద్ధి భారతమాత ఆలయం 22వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులంతా వేటకు విరామం ప్రకటించి ఉత్సవాల్లో పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో మహిళలు హాజరై సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఏకాహం భజన కాలక్షేపం నిర్వహించారు. -
జూనియర్ డాక్టర్ల నిరసన ర్యాలీ
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలలోని జూనియర్ డాక్టర్లు శనివారం ర్యాలీ నిర్వహించారు. హాస్పిటల్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగిస్తూ దారి పొడవునా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి నిరసన వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు తీర్చకుండా జాప్యం చేయడం తగదన్నారు. నిబంధనల ప్రకారం ఇవన్నీ తమకు రావాల్సి ఉందని, తాము అదనంగా ఏమీ అడగడం లేదని చెప్పారు. సోమవారం నాటికి సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్న రాజు, డాక్టర్ రాజ్ సుదర్శన్, డాక్టర్ చాందిని, డాక్టర్ నరేంద్ర నాయక్, డాక్టర్ జాన్ వెస్లీ, డాక్టర్ లక్ష్మీకాంత్, డాక్టర్ మురళి, డాక్టర్ శశిభూషణ్, డాక్టర్ సతీష్, డాక్టర్ దీపిక, డాక్టర్ హేమంత్, డాక్టర్ చానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
సీబీఐ విచారణ కోరితే భయమెందుకు?
కవిటి: డీఎస్సీ–2025 నిర్వహణలో చోటుచేసుకున్న ఆరోపణలు, అవకతవకలపై ప్రతిపక్షం సీబీఐ విచారణకు పట్టుబడతారనే భయంతో పాలకులు సభ నుంచి పారిపోవడం అభ్యంతరకరమని ఎమ్మెల్సీ సభ్యులు నర్తు రామారావు అన్నారు. శనివారం కొత్తపుట్టుగలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నాలుగు రోజులు పాటు జరిగిన శాసన మండలి వర్షాకాల సమావేశాలు ఎటువంటి ఫలవంతమైన చర్చలకు అవకాశం లేకుండా ముగిసిపోవడం దురదృష్టకరమన్నారు. డీఎస్సీపై చర్చకు ప్రభుత్వాన్ని కోరితే కప్పదాటు ధోరణి అవలంబించిందన్నారు. ఒకవేళ నిష్పాక్షికంగా డీఎస్సీ నిర్వహిస్తే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఈ సమావేశాల ద్వారా నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామంటే.. సభను సజావుగా నిర్వహించలేదన్నారు. ఇచ్ఛాపురం పట్టణానికి ప్రవేశవంతెన కూలిపోయి మూడేళ్లు గడిచిందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వంతెన నిర్మాణానికి రూ.20కోట్ల నిధులు మంజూరు చేసిన జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. మూడుసార్లు టీడీపీ ఎమ్మెల్యేను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన బహుమానం ఇదేనని ఎద్దేవా చేశారు. కిడ్నీ బాధిత ఉద్దాన ప్రాంతాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించాలన్నారు. దామోదరపురం గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడంలో టీడీపీ ఎమ్మెల్యేలు విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో ఓ గర్భిణి తన బిడ్డను కోల్పోయిందన్నారు. ఇచ్ఛాపురం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి ఎల్లో బోర్డు వాహనాలు ఫిట్నెస్ పరీక్షకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలో ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎవరు ఆదుకుంటారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కడియాల ప్రకాష్ పాల్గొన్నారు. -
సెప్టెంబర్లో అఖిలభారత బహుభాషా నాటిక పోటీలు
శ్రీకాకుళం కల్చరల్ : కళారంగానికి జీవం పోస్తూ నాటక రంగాన్ని ఆదరించేందుకు నిరంతరం కృషిచే స్తున్న శ్రీసుమిత్రా కళాసమితి పర్యవేక్షణలో సెప్టెంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు అఖిలభారత బహుభాషా నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కళా సమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. నగరంలోని అవోపా కల్యాణ మండపంలో శనివారం నాటికపోటీల బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బహుభాషా నాటిక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిరంలో నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి నాటిక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. కోల్కతా, గౌహ తి, ముంబై, బెంగళూరు, రూర్కెలా, రాయ్పూర్, గుడివాడ, ప్రయాగ్రాజ్ ప్రాంతాల నుంచి కళాకారులు నాటికలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. రోజుకు రెండు చొప్పున ప్రదర్శనలు జరుగుతాయ ని చెప్పారు. శ్రీసుమిత్రా కళాసమితి పిలుపుమేరకు పలు రాష్ట్రాల నుంచి ఎంట్రీలు వచ్చాయని, వాటిలో ఎంపిక చేసిన నాటికల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. నాటికలు ఇవే.. 17న బెంగాళీ కళాకారుల జ్వాలా, అస్సామీ బృందం జీవశ్రేష్ఠ్ నాటికలు, 18న మరాఠీ నాటిక సూప్, కన్నడ నాటిక సాంగ్యాచీబాల్యా, 19న ఒడియా నాటిక ఫేసెస్ ఆఫ్ ఉమెన్, ఛత్తీస్గఢ్ నాటిక యకీనన్, 20న హిందీ– పంజాబీ భాషలో స్వాతంత్య్ర సమరయోధులు భగత్సింగ్, తెలుగు నాటిక ద్వారబంధాల చంద్రయ్యనాయుడు ప్రదర్శిస్తారని చెప్పా రు. కళాకారులు, కళాభిమానులు నాలుగు రోజులపాటు జరిగే బహుభాషా నాటికపోటీలను తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చా రు. సమావేశంలో సుమిత్రా కళాసమితి సభ్యులు కొంక్యాన మురళీధర్, గుత్తు చిన్నారావు, పొన్నాడ వెంకట సత్యనారాయణ, నక్క శంకరరావు, కిల్లాన ఫల్గుణరావు, పీఏఎన్ శాస్త్రి, వీవీఆర్ మూర్తి, బత్తుల జ్యోతి, కర్రి అశోక్కుమార్, లాడి చంద్రశేఖర్, రాజు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయంలో చోరీ
రణస్థలం: జె.ఆర్.పురం–2 గ్రామ సచివాలయంలో గురువారం రాత్రి చోరీ జరిగినట్లు పంచాయతీ కార్యదర్శి వి.చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం గ్రామ రెవెన్యూ కార్యదర్శి బలివాడ శంకర్ సచివాలయం వద్దకు వెళ్లేటప్పుడు తాళం పగుల కొట్టి ఉండటం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రెండు టీవీలు, ప్రింటర్, రెండు మానిటర్లు, కొత్త కంప్యూటర్ వంటి వస్తువులు కనిపించలేదు. ఇటీవల పాతర్లపల్లి, పిసిని సచివాలయాల్లో ఇలానే చోరీలు జరగడం పోలీసులకు సవాల్గా మారింది. జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సిక్కోలు ఆదరణ మరువలేను
● సినీహీరో సుమంత్ శ్రీకాకుళం అర్బన్: సెప్టెంబరు 11న విడుదల కానున్న మహేంద్రగిరి వారాహి చిత్రాన్ని విజయవంతం చేయాలని ఆ చిత్ర హీరో సుమంత్ కోరారు. ‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళంలోని ఎస్వీసీ థియేటర్లో ‘మహేంద్రగిరి వారాహి’ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ చిత్ర యూనిట్కు ఎస్వీసీ థియేటర్ మేనేజర్ రవి ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ఎస్వీసీ థియేటర్లో ఏర్పాటు చేసిన వారాహి అమ్మవారికి హీరో సుమంత్ పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుమంత్ మాట్లాడారు. గతంలో తాను శ్రీకాకుళం వచ్చానని, ఇక్కడి ఆదరణ మరువలేనని అన్నారు. మహేంద్రగిరి వారాహి సిని మా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందన్నారు. చిత్ర హీరోయిన్ మల్లికా గోస్వామి మాట్లాడుతూ తాను శ్రీకాకుళం రావడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రే క్షకులు చిత్ర ప్రేమికులని, మంచి చిత్రం అయి తే ఎంతో ఆదరిస్తారని తెలిసిందని, ఈ చిత్రం కూడా ఎంతో బాగా వచ్చిందని, ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలన్నారు. నాలుగో రోజుకు చేరిన జూడాల నిరసన దీక్షలు శ్రీకాకుళం: రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు చెవిలో పూలు పెట్టుకొని వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. శుక్రవారం నాటి నిరసన శిబిరంలో డాక్టర్ మోహిత్, డాక్టర్ మణికుమార్, డాక్టర్ సౌమ్య, డాక్టర్ రమ్య, డాక్టర్ రిజ్వియా, డాక్టర్ ఆర్సియా, డాక్టర్ హయేషా, డాక్టర్ సంపద తదితరులు పాల్గొన్నారు -
* ఏడాది * సాగు విస్తీర్ణం
● గిట్టుబాటు ధర కల్పించక పంట వేయని రైతులు ● ప్రభుత్వ సహకారం లేక మూతపడుతున్న షుగర్ ఫ్యాక్టరీలు ● ఏటా తగ్గుతోన్న సాగు విస్తీర్ణం ● పాత శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సంకిలి సుగర్ ఫ్యాక్టరీ మూతపడనున్న వైనం 2023● క్రషింగ్ నిలిపివేత శ్రీకాకుళం (పీఎన్కాలనీ): గత కొన్ని సంవత్సరాలుగా చెరుకు సాగు తగినంతంగా లేకపోవడం వల్ల డిసెంబర్ 2027 నుంచి మార్చి 2028 వరకు ప్రతిపాదించిన చెరకు క్రషింగ్ నిలిపివేయనున్నట్లు ఈఐడీ ప్యారీ ఇండియా లిమిటెడ్ సంకిలి మేనేజ్మెంట్ ప్రతినిధులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నెలకొన్న సూపర్ ఎల్నినో పరిస్థితుల వల్ల ఈ సీజన్లో చెరుకు క్రషింగ్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రైతులు గమనించి చెరుకు సాగు చేపట్టకుండా ఉండాలని కోరారు. 1575 హెక్టార్లు 20241102 హెక్టార్లు 2025895 హెక్టార్లు 2026శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పంచదార చేదెక్కింది. వారం రోజుల వ్యవధిలోనే రూ.25 వరకు ధర పెరగడంతో కిలో పంచదార ఏకంగా రూ.75కు చేరుకుంది. దీనికి తోడు చెరుకు రైతులకు ప్రభుత్వ సాయం లేకపో వడంతో పంట వేయడం లేదు. ప్రభుత్వం కూడా వ్యవసాయాధారిత ఫ్యాక్టరీలు షుగర్, జ్యూట్, రైస్ మిల్లర్లకు రుణాలు, సబ్సిడీలు తగ్గించేసి పొమ్మనలేక పొగపెడుతోంది. సుగర్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం మొండిచేయి గత 40 ఏళ్లుగా పాలకొండ మండలం సంకిలి సుగర్ ఫ్యాక్టరీ నుంచి రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, రవాణా చార్జీలు ఇచ్చేవారు. దీంతో రైతులు చెరుకు పండించేందుకు ముందుకు వచ్చేవారు. సుగర్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం రాయితీలిచ్చి సహకరించేది. కానీ చంద్రబాబు హయాంలో ఫ్యాక్టరీని కాపాడే పనులు చేయ డం లేదు. దీంతో సంకిలి సుగర్ ఫ్యాక్టరీలో సుగర్కి సంబంధించి అన్ని ఉత్పత్తులు ఆపేసి కేవలం ఇథనాల్ మాత్రమే తయారు చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం సహకారం అందించకపోవడమే సుగ ర్ ఫ్యాక్టరీల మూతకు కారణమని తేటతెల్లమైంది. తగ్గిన చెరుకు సాగు విస్తీర్ణం చెరుకు పండించే రైతుకు ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడం మానేసింది. రాయితీలు ఇచ్చే కంపెనీలను సైతం ప్రోత్సహించడం లేదు. దీంతో కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయి సుగర్ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. ఇటు రైతులు సైతం చెరుకు వేయడానికి ఇష్ట పడడం లేదు. దీని ప్రభావం ధరలపై పడింది. గత వారం రోజుల్లోనే పంచదార ధర రూ.50 నుంచి రూ.75కు చేరుకుంది. నిత్యావసరా ల సరుకుల ధరలు పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దారుణమని జనం మండిపడుతున్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలు మరిచిపోయి జనంలో కూటమి సర్కారు అప్రతిష్ట మూటగట్టుకుంది. ఇప్పుడు ధరల నియంత్రణ కూడా చేయకపోవడం సామాన్యులకు శరాఘాతమవుతోంది. 560 హెక్టార్లు -
ప్రాణం అలసిపోతోంది..!
● తీవ్ర ఒత్తిడిలో సచివాలయ ఉద్యోగులు ● సర్వేల నిర్వహణ బాధ్యతలన్నీ వీరిపైనే ● ఏకంగా 38 రకాల సర్వేల నిర్వహణలో బిజీబిజీ ● పని ఒత్తిడితో మరణిస్తున్న ఉద్యోగులు అరసవల్లి: సచివాలయం.. ఈ పేరే కొందరు ‘పెద్దలకు’ ఇష్టం లేనట్టు ఉంది. లక్షలాది మంది యువతకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించి పౌర సేవలను ప్రజలకు దగ్గర చేసిన ఈ ఆలయాల్లో ఇప్పుడు చావు డప్పులు వినిపిస్తున్నాయి. సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖ రి.. వారి ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులన్న కనీస గౌరవం లేకుండా ప్రతి చిన్న పనినీ వారికే అప్పగిస్తుండడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఏకంగా 38 రకాల సర్వేలంటూ ఊరంతా తిప్పుతుండడంతో తట్టుకోలేక చాలా మంది ప్రాణా లే వదిలేస్తున్నారు. ఇప్పటికే తీవ్ర ఒత్తిళ్లకు తాళలేక గుండెపోటుతో కొందరు, బ్రెయిన్ స్ట్రోక్తో కొందరు మృత్యువాతకు గురయ్యారు. తాజాగా గార మండలానికి చెందిన రౌతు మెహర్ అనే డిజిటల్ అసిస్టెంట్ ఇచ్ఛాపురం మండలం మండపల్లి సచివాలయంలో విధులు నిర్వర్తిస్తూ బ్రెయిన్ స్ట్రోక్కు గురై ప్రాణాలు కోల్పోవడంతో జిల్లా వ్యాప్తంగా ఇది నాలుగో మరణంగా నమోదై సంచలనమైంది. సచివాలయ వ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో 75కు చేరిన మరణాలు జిల్లాలో సచివాలయ ఉద్యోగుల మరణాలు నాలుగుకు చేరాయి. విధుల్లో లేని సమయాల్లో మరో ఇద్దరు వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల ట్విట్టర్ క్యాంపెయిన్ సమాచారం మేరకు 2024 సెప్టెంబర్ నుంచి ఈ నెల 15వ తేది లోపు సుమారు 75 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారని సంఘం సభ్యులు ప్రకటిస్తున్నారు. 30 ఏళ్ల వయస్సులోపు యువ ఉద్యోగులు ఇలా ప్రాణాలను కోల్పోతుంటే, సర్కార్ మొద్దు నిద్ర నటిస్తూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మన జిల్లాలో కూడా ఇప్పటికే నాలుగు మరణాలు సంభవించగా వివిధ కారణాలు చూపి రాజీనామా లు చేసిన వారి సంఖ్య పదుల్లో ఉంది. మరికొందరు లాంగ్ లీవ్ అంటూ సేవలకు దూరమయ్యారు. జిల్లాకు సంబంధించి అయితే లావేరు, శ్రీకాకుళం మండలాల్లో ఇద్దరు గుండెపోటుతో మృతిచెందారు. అయితే గత ఏడాది తీవ్ర ఒత్తిళ్లతో లావేరు మండలం బుడతవలస సచివాలయ సర్వేయర్గా పనిచేస్తున్న పొట్నూరు రాఘవరావు గుండెపోటుతో మృతిచెందాడు. అలాగే జిల్లా కేంద్రంలో నగరపాలక సంస్థ సచివాలయ వార్డు ఎమినిటీ సెక్రటరీ పల్లె దాలినాయుడు అనే ఉద్యోగి కూడా బ్రెయిన్ స్ట్రోక్తో మరణించిన ఘటన చోటుచేసుకుంది. ఒత్తిడితోనే విధులు ప్రతి నెలా ఏకంగా 38 సర్వేలను చేయడం టార్గెట్గా చేసుకుంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో ముఖ్యంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర సర్వే, పీఎం కిసాన్ డ్రోన్స్ ఓబురేషన్ స ర్వే, ఎన్సీడీసీ సర్వే, ఇ–క్రాప్ బుకింగ్ సర్వే, ఎఫ్ఎం సర్వే, ఆధార్ సర్వే, కౌశలం సర్వే, మనమిత్ర ద్వారా అందిస్తున్న 564 సేవలపై సర్వే, కొత్త రేషన్ కార్డుల సర్వే, బయోమెట్రిక్ అప్డేషన్ సర్వే, పి–4, పాస్బుక్స్ సర్వే, ఎహెచ్ఎస్ సర్వే, అభ సర్వే, సెమి ఆర్ఫన్ సర్వే తదితర 38 రకాల సర్వేలతో పాటు నెలవారీ ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ, ఆఖరికి బూత్లెవల్ ఆఫీసర్ల (బీఎల్ఓ) బాధ్యతలను, సెన్స స్ కూడా సచివాలయ ఉద్యోగులు చేపట్టాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. దీంతో పాటు ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో తిట్లు, చీవాట్లు నిత్యకృత్యం. ఇలాంటి దుర్భర పరిస్థితుల నడుమ సచివాలయ ఉద్యోగులు మనోవేదనకు గురవుతున్నారు. దీనికి తోడు చిన్నపాటి కారణాలు చూపుతూ, ఐవీఆర్ఎస్ కాల్స్ సాకుగా చూపుతూ షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. వీటికి తోడు ‘స్థానిక’ ఎన్నికలంటూ కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో మరెంత ఒత్తిడి పెరుగుతుందో అని ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సచివాలయ ఉద్యోగులకు ఉన్న విధులతో పాటు 38 సర్వేలను చేస్తూనే ఎన్నికల బీఎల్ఓ విధులను కూడా కట్టబెట్టారు. ఇవే తీవ్ర ఒత్తిడి పెంచి మా ప్రాణాలపైకి తెస్తున్నాయి. బీఎల్ఓ అధికారాలు 14 ప్రభుత్వ ఉద్యోగ శాఖలకు ఉన్నప్పటికీ, కేవలం సచివాలయ ఉద్యోగులకే కట్టబెడుతూ ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మా ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగిపోయింది. ఇప్పటికే అధికారికంగా నలుగురు ఉద్యోగులు ఒత్తిళ్లతోనే మృత్యువాత పడ్డారు. తాజాగా రౌతు మెహర్ కూడా డిజిటల్ అసిస్టెంట్ విధులతో పాటు సెన్సస్ టెక్నికల్ మండల కోఆర్డినేటర్ బాధ్యతలు కూడా ఇవ్వడంతో ఒత్తిడి పెరిగి బ్రెయిన్స్ట్రోక్కు గురయ్యాడు. ఈ మరణాలన్నీ సర్కార్ హత్యలుగానే భావిస్తున్నాం. దీనిపై నిరసన కార్యక్రమాలను నేటి (శనివారం) నుంచి ప్రారంభిస్తాం. – కూన వెంకట సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘ జేఏసీ ప్రతినిధి


