Srikakulam District Latest News
-
డీఈఈ సెట్–2026కు దరఖాస్తులకు గడువు పొడిగింపు
గార: జిల్లాలోని ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ వమరవల్లిలో రెండేళ్ల ప్రాథమిక విద్యలో డిప్లమో కోర్సు ప్రవేశం కోసం దరఖాస్తులకు గడువు పొడిగించారని డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎ.గౌరీశంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు ప్రిన్సిపాల్ ఎ.గౌరీశంకర్ 9492848205, జీవీ రమణ 9491843995 లకు సంప్రదించాలన్నారు. రిమ్స్ ఎక్స్రే విభాగంలో షార్ట్ సర్క్యూట్ శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రిలో గురువారం ఉదయం ఐదు గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగిన మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఓ టేబుల్, కంప్యూటర్ మానిటర్ కాలిపోయాయి. ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమా దం తప్పింది. పొగలు రావడంతో అక్కడ ఉన్న సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చా రు. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్, ఆర్ఎంఓ డాక్టర్ సుభాషిని, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ సీపీ శ్రీదేవి గదిని పరిశీలించారు. నేడు అర్జీల స్వీకరణ మెళియాపుట్టి: మండలకేంద్రంలో శుక్రవారం గ్రీవెన్స్ ద్వారా సమస్యల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీతంపేట ఐటీడీఏ పీఓ స్వప్నిల్ పవార్ ఒక ప్రకటన ద్వారా గురువారం తెలిపారు. కార్యక్రమంలో నేరుగా ఆయనే సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం ఖూనీ హిరమండలం: కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యు రాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టును ఆమె తీవ్రంగా ఖండించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా పూడి శ్రీహరిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ కక్షల కోసం పోలీసు వ్యవస్థను పావుగా వాడుకుంటున్నారని తెలిపారు. శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం ఆర్టీవో అధికారి పి.వి.గంగాధర్కు రోడ్సేఫ్టీ అవేర్నెస్తో పాటు పబ్లిక్ అవుట్రీచ్లో మంచి ప్రతిభ కనపర్చినందు కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఇటీవల బెంగళూరులోని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ వెహికల్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక రవాణా శాఖమంత్రి రామలింగారెడ్డి ఈ అవార్డును ప్రదానం చేశారు. కార్మికుల సంక్షేమానికి దరఖాస్తుల ఆహ్వానం వజ్రపుకొత్తూరు రూరల్: భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్మిక శాఖాధికారి పి.విజయ్కుమార్ తెలిపారు. మార్చి 1 నుంచి నాలుగు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సంక్షేమ నిధి ద్వారా కార్మిక శాఖలో సభ్యత్వం పొందిన అర్హులైన ప్రతి కార్మికుల కుటుంబానికి వివాహ కానుకగా రూ. 20 వే లు, ప్రసూతి సాయం రూ.20 వేలు, సహజ మరణానికి రూ. 60 వేలు కాగా అంత్యక్రియలకు తక్షణ సాయంగా రూ.20 వేలు అందించనున్నట్లు తెలిపారు. వివరాలకు కాశీబుగ్గలో ఉ న్న కార్మిక శాఖను లేదా 94925 55040 ఫోన్ నంబర్ ను సంప్రదించాలని సూచించారు. -
నాలుగు గంటల పాటు తిలక్ విచారణ
టెక్కలి: వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ను గురువారం టెక్కలి పోలీసులు నాలుగు గంటల సేపు విచారించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణంపై మంత్రి కె.అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఇటీవల వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీనిపై టెక్కలి పోలీసులు తిలక్కు నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై ఈ నెల 13న టెక్కలి పోలీస్ స్టేషన్కు తిలక్ హాజరయ్యారు. మళ్లీ రెండో దఫాగా గురువారం సాయంత్రం 4 గంటల తర్వాత విచారణకు హాజరయ్యారు. రాత్రి 8 గంటల వరకు విచారణ కొనసాగించారు. ఆయనతో పాటు నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, నాయకులు ఎస్.సత్యం, టి.కిరణ్, చిన్ని జోగారా వు, కె.జీవన్ ఉన్నారు. ఇదిలా ఉండగా తిలక్ స్టేషన్కు హాజరవుతున్న నేపథ్యంలో పట్టణంలో పలు జంక్షన్ల వద్ద పోలీసులు పహరా కాశారు. -
భూ సమస్యల పరిష్కారమే ధ్యేయం
జలుమూరు: భూముల రీ సర్వే అనంతరం ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించి రైతులకు తప్పులు లేని పట్టాదారు పాస్పుస్తకాలు అందజేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. గురువారం అక్కురాడలో రీ సర్వేపై అధికారులు, రైతులతో మాట్లాడారు. అక్కురాడ పరిధిలోని 924 ఖాతాల్లో ఇప్పటి వరకూ 45 ఖాతా లను మాత్రమే సరిచేయడం జరిగిందన్నారు. మిగిలిన ఖాతాల్లో తప్పులు సరిదిద్దడంపై జాప్యంపై అధికారులతో మాట్లాడారు. సర్వే లోపాలను సవరించేందుకు మండల,సచివాలయ అధికారు లు సమన్వయంతో సనిచేయాలని సూచించారు. ప్రధానంగా అక్షర దోషం లేని పాస్ పుస్తకాలు రైతులకు అందించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. దీని కోసం ప్రతి ఖాతాను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. -
రేపు జాబ్మేళా
శ్రీకాకుళం న్యూకాలనీ: నిరుద్యోగ యువతీయువకుల కోసం శనివారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రలోని బలగ హాస్పటల్ జంక్షన్లో ఉన్న డీఎల్టీసీ/ఐటీఐ శిక్షణా కేంద్రంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి జాబ్మేళా జరుగుతుందన్నారు. ఈ జాబ్మేళాను మిడ్ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్, ఐ స్మార్ట్ సొల్యూషన్స్ సంస్థ, అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీ కోసం చేపడుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. ● మిడ్ ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగాల కోసం ఇంటర్ /ఐ.టి.ఐ /డిప్లమో వి ద్యార్హత కలిగి ఉన్న, 18–29 మధ్య వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు, ఎంపికై న వారు శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, సాలూరు, ఇచ్చాపురం, పాలకొండ, కోటబొమ్మాళి, విజయ నగరంలలో పని చేయాల్సి ఉంటుంది. 150 ఫీల్డ్ ఆఫీసర్, సెంటర్ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి. జీతం నెలకు రూ.12వేల నుంచి రూ.18వేల వరకు ఉంటుంది. ఇతర అలవెన్సులు లభిస్తాయి. ● ఐ స్మార్ట్ సొల్యూషన్స్ సంస్థలో ఉద్యోగాల కోసం ఇంటర్ ఆపైన విద్యార్హత కలిగి, 20–35 మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగ యువత అర్హులు. 75 టెలిసేల్స్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళంలో పనిచేయాల్సి ఉంటుంది. జీతం నెలకు రూ.8వేల నుంచి రూ.12వేల వరకు ఉంటుంది. ● అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థలో ఇంటర్ ఆపైన విద్యార్హత కలిగి ఉన్న, 20–30 మధ్య వయస్సు గల యువతీ యువకులకు 120 ఖాళీల కు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, పలా స, సోంపేట, పార్వతీపురం, రాజాం, విజయనగరంలలో పనిచేయాల్సి ఉంటుంది. జీతం రూ.16 వేల నుంచి రూ.35వేల వరకు ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్సీఎస్.జీవోవి.ఇన్ వెబ్పోర్టల్ లో అభ్యర్థులు వివరాలు నమోదు చేసుకోవాలి. -
25 నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
పాతపట్నం: పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారి దేవస్థానం 51వ వార్షిక నవరాత్రి యాత్రా మహోత్సవాలు సంద ర్భంగా ఈ నెల 25 నుంచి 27 వరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్, రాష్ట్ర వ్యాయామ సంఘం అధ్యక్షులు అక్కందర సన్యాసిరావు, ఎన్ని శేఖర్బాబు తెలిపారు. గురువారం ఆల య ఆవరణలో వారు విలేకరులతో మాట్లాడుతూ సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఫ్లడ్లైట్ల వెలుగులో పోటీలు నిర్వహిస్తామని, ఆసక్తి గల జట్లు 9393946424 నంబరుకు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శనరావు, ఆలయ కమిటీ సభ్యులు, పీడీలు, పీఈటీ పాల్గొన్నారు. -
గంజాయి ముఠా కిరాతకం
● పాతపట్నం నియోజకవర్గంలో ఘటన ● గంజాయి బ్యాచ్ ఆగడాలపై పోలీసులకు సమాచారం ఇచ్చిన సామాన్య వ్యక్తి ● ఆ వ్యక్తిపై దాడికి తెగబడిన గంజాయి బ్యాచ్ ● చెట్టుకు కట్టి విచక్షణరహితంగా దాడి ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన బాగోతం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో గంజాయి ప్రభావం రోజు రోజుకూ హద్దులు దాటి పోతోంది. కొంత మంది ముఠాలుగా తయారై ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేసే స్థాయికి అక్రమ వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఎవరైనా పోలీసులకు సమాచారం ఇస్తే వారిపై కాపు కాసి మరీ దాడులు చేస్తున్నారు. ఇలాంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా జిల్లాకు ఒడిశా దగ్గరగా ఉండడం.. మారు మూల ఒడిశా ప్రాంతంతో జిల్లాకు అనేక అక్రమ మార్గాలు ఉండడంతో ఈ గంజాయి అక్రమ రవాణాకు అన్ని రకాలుగా మార్గం అనుకూలంగా మారుతోంది. అయితే ఎప్పటికప్పుడు గంజాయి రవాణా పోలీసులకు చిక్కుతున్నప్పటికీ, అవి ఇతర ప్రాంతాలకు చెందిన వారు మాత్రమే పట్టుబడుతున్నారు తప్పా, జిల్లాకు చెందిన గంజాయి బ్యాచ్ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. ఇంటిదొంగలెవరు..! జిల్లా పోలీస్ అధికారి ప్రత్యేక నిఘా వేస్తున్నప్పటికీ ఆయా శాఖలో మాత్రం కొంత మంది గంజాయి బ్యాచ్కు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గత కొన్ని నెలల క్రితం పాతపట్నం నియోజకవర్గంలో బహిరంగంగా జరిగిన సంఘటనను కొంత మంది ప్రమేయంతో దాచాలని చూసినప్పటికీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒడిశా ప్రాంతం బినలా పరిసర ప్రాంతాల నుంచి కొసమాల మీదుగా కొంత మంది గంజాయి బ్యాచ్ అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని కొసమాల గ్రామానికి చెందిన హైదరాబాద్లో వలస కార్మికుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులకు ఇచ్చిన సమాచారం గంజాయి ముఠాకు చేరింది. అంతే సమాచారం ఇచ్చిన వ్యక్తి పాతపట్నంలో బస్సు దిగే సమయంలో కాపు కాసి దాడి చేశారు. అక్కడితో విడిచిపెట్టకుండా మోటారు సైకిల్పై బలవంతంగా తీసుకువెళ్లి కొసమాల గ్రామంలో చెట్టుకు కట్టి మరీ విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. గ్రామానికి రానివ్వకుండా హుకుం జారీ చేశారు. ఈ సంఘటన తెలిసిన పోలీసులు మాత్రం ఎందుకో సైలెంట్ పాత్ర వహించడంతో బాధితుడు చికిత్స పొందుతూ ప్రాణ భయంతో హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఒడిశాకు ఆనుకుని ఉన్న పాతపట్నం నియోజకవర్గంలో గంజాయి రవాణా, ఆయా ముఠాల ప్రాబల్యం ఉన్నప్పటికీ స్థానికంగా ప్రజా ప్రతినిధుల అండ కావచ్చు, కట్టడి చేయాల్సిన అధికారుల రక్షణ కావచ్చు.. మొత్తంగా ఒక ఆరుగురు ముఠా చెప్పిందే వేదంగా ఈ అక్రమ వ్యవహారం సాగుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో విశాఖ పట్టణంలో ఒక ప్రాంతం, హైదరాబాద్లో బాలానగర్ ప్రాంతాలకు గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్లో ఓ హాస్టల్లో పాతపట్నం నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి గంజాయి సరఫరా చేస్తూ అక్కడ యువతను బలి చేస్తున్నారని తెలుస్తోంది. నేర సమాచారం ఇచ్చేవారు వివరాలను గోప్యంగా ఉంచాలని చట్టాలు ఘోషిస్తున్నాయి. కానీ కొందరు ఇంటి దొంగలు తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే రీతిలో ఆ సమాచారాన్ని నేర ముఠాలకు లీక్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. సమాచారం ఇచ్చిన పాపానికి అమాయకులు నేరగాళ్ల చేతిలో చిక్కి చితికిపోతున్నారు. జిల్లా శివారు గ్రామం కోసమాలకు చెందిన ఓ వ్యక్తి గంజాయి బ్యాచ్ చేతిలో ఇదే తరహాలో చావుదెబ్బలు తిన్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
సజ్జలను సత్కరించిన జిల్లా బీసీ నాయకులు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ బీసీ విభాగం నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ పీఏసీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్యాదవ్తో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగవైశ్య కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, వెలమకుల రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు ఆరంగి మురళి, పొందర కుల రాష్ట్ర అధ్యక్షుడు రాజాపు అప్పన్నలు తదితరులు సత్కరించి జ్ఞాపిక అందజేశారు. -
శ్రీకాకుళం
ఎండల్లో చల్లటి నేస్తంశుక్రవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఎండలు ఠారెత్తుతున్నాయి. అడుగు బయట పెడితే చాలు ఒంటిలోని నీరంతా చెమటలా బయటకు పోతోంది. ఎండల వేడిని తగ్గించేందుకు తాటి ముంజెలు వచ్చేశాయి. పోషకాల గనిగా పేరొందిన ఈ ముంజెలు ఇప్పుడు విరివిగా లభ్యమవుతున్నాయి. తాటిముంజల్లో శరీరానికి చలువ చేసే గుణాలు ఉండటంతో కొనేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రస్తుతం డజన్ రూ.50 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. వ్యాపారులకూ లాభసాటిగా ఉండడంతో దాదాపు ప్రతి జంక్షన్లోనూ తాటి ముంజెలు కనిపిస్తున్నాయి. పోషకాలు మెండు.. తాటి ముంజెలు శరీరంలో నీటిశాతాన్ని పెంచుతాయి. ఎండ వేడిమికి గురికాకుండా కాపాడతాయి. వీటిలో విటమిన్ ఏ, బి, సీలతో పాటు శరీరానికి కావాల్సిన జింక్, పొటాషియం, పాస్పరస్, ఐరన్ ఉంటాయి. ట్యూమర్లు, క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. పొటాషియం అధికంగా ఉండటంతో రక్తపోటు తగ్గించి శరీరంలో మలినాలను బయటకి పంపుతుంది. కడుపు ఉబ్బరం, వికారం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. –హిరమండలం -
భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
మెళియాపుట్టి : భరణికోట గ్రామానికి చెందిన సవర జగ్గారావుకు జిల్లా అదనపు న్యాయ స్థానం జీవిత ఖైదు విధించిందని ఎస్పీ మహేశ్వరరెడ్డి గురువారం వెల్లడించారు. భార్య పద్మ (33)పై అనుమానంతో జగ్గారావు 2021 అక్టోబర్ 16న గొడవకు దిగాడు. తనతో పాటు తెచ్చుకున్న నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో పద్మ అక్కడికక్కడే మృతిచెందింది. కుమారుడు జగదీశ్ విషయాన్ని మావయ్య సవర నరసింహులుకి చెప్పడంతో ఆయన మెళియాపుట్టి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో జగ్గారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో జగ్గారావుకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. స్వీయ గణనకు శ్రీకారం శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తన కార్యాలయంలో గురువారం స్వీయ గణనను విజయవంతంగా నిర్వహించి జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వీయ గణన కాలపరిమితి ఏప్రిల్ 30 వరకు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఎవరి వివరాలు వారే వెబ్సైట్లోకి వెళ్లి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర జనగణన సంచాలకులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియను ఆయన ప్రారంభించారు. అధికారిక లింక్ http://se.census. gov.in/ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. -
18న ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా
శ్రీకాకుళం: రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్య ల పరిష్కారం కోరుతూ ఈ నెల 18న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చావాలి శ్రీనివాస్, పప్పల తిరుమలరావు తెలిపారు. గురు వారం వారు విలేకరులతో మాట్లాడుతూ విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన న్యాయపరమైన సమస్య ల సాధనకు ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పా రు. 12వ పీఆర్సీ 2023 జూలై 1 నుంచి అమ లు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలని, 11వ పీఆర్సీ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. -
ఏడాదంతా... ఏ చింత లేకుండా..!
● ఏజెన్సీ చింతపండుకు వినియోగదారుల క్యూ ● ఏడాదంతా నిల్వ ఉండేలా ఏర్పాట్లు ఒకేసారి కొనుగోలు చేస్తాం ప్రతిఏటా సీజన్ ఏజెన్సీకి వచ్చి మాకు, మా బంధువులకు సరిపడిన చింతపండును ఒకేసారి కొనుగోలు చేస్తాం. చింతపండుకు పిక్కతీసి, బాగా శుభ్రపరిచిన అనంతరం హైదరాబాద్ తో పాటు పలు పట్టణాల్లో ఉన్న మా బంధువులకు పంపిస్తుంటాము. – జి.శారద, కొత్తూరు కష్టమే మిగులుతోంది ఏడాది మొత్తం చింతపంటను నమ్ముకొని ఉంటాము. ప్రమాదకరమైన చెట్లు ఎక్కి చింతబొట్లను చెట్టు నుంచి తీయడం జరుగుతుంది. తీసిన బొట్టలు నుంచి చింత పండును వేరు చేయడానికి రోజులు తరబడి కష్టపడతాము. కానీ తగిన ధరలు లభించడం లేదు. – సవర సుంకయ్య, కొత్తూరుకొత్తూరు: ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చారు లేకుండా భోజనం ఉండదు. నిత్యం వంటింట్లో ఏదో రకంగా చింతపండు వినియోగం ఉంటుంది. అలాగే పచ్చళ్ల తయారీకి సైతం అత్యంత కీలకంగా చింతపండును పేర్కొంటున్నారు. అలాంటి నాణ్యమైన చింతపండుకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు, సీతంపేట, భామిని మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు ప్రసిద్ధిగాంచాయి. వేసవి సమీపిస్తున్న తరుణంలో మైదాన ప్రాంతం వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు సంతల్లో గిరిజనులు విక్రయించే చింతపండు కోసం క్యూ కడుతుంటారు. అధిక మొత్తంలో కొనుగోలు చేసి ఏడాదంతా వినియోగించడం, అమ్మకాలు సాగిస్తుండడం పరిపాటిగా మారింది. ఏజెన్సీ చింతపండుకు గిరాకీ జిల్లాలో ఏజెన్సీ చింతపండుకు అత్యంత గిరాకీ ఉంది. ఇక్కడి గిరిజనులు ఆటవీ ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద చింత చెట్లు వద్ద చింతపండును సేకరిస్తారు. దీని రుచి వేరుగా ఉంటుంది. ఇక్కడ లభ్యమయ్యే చింతపండుతో తయారు చేసిన పచ్చళ్లు. చారు, పులుసు తదితర వంటకాలు మంచి రుచిని కలిగి ఉంటాయి. అందుకే ఒకేసారి అధిక మొత్తంలో కొనుగోలు చేసి వివిధ రకాల పద్ధతుల్లో నిల్వ ఉంచుకొని ఏడాదంతా వినియోగించడంతో పాటు.. పట్టణాల్లో ఉండే బంధువులు, స్నేహితులకు పంపిస్తామని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఇకపోతే పంట దిగబడిని బట్టి ధర ఆధారపడుతుంది. ఈ ఏడాది పంట తక్కువ ఉండడంతో పాటు ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు సంతలకు ఎక్కువ మంది రావడంతో కిలో రూ.75 లు నుంచి రూ.80లు ధర ఉంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని కొనుగోలుదారులు చెబుతున్నారు. నిల్వచేసే విధానం సాధారణంగా ఏజెన్సీలోని సంతల్లో గిరిజనుల వద్ద వినియోగదారులు కొనుగోలు చేస్తారు. చింతపండుకు ఉన్న పెంకులు, ఇతరాలను వేరుచేసి శుభ్రపరుస్తారు. పల్లె ప్రాంతాల ప్రజలు కేజీ నుంచి రెండున్నర కేజీల పరిమాణంలో ఉప్పు వేసి గోళాకారంగా ఉండలను చేసి ఎండబడతారు. ఎండిన తర్వాత ఉండలను మట్టి, ప్లాస్టిక్ బకెట్లలో ఏడాదంతా ఉంచుకొని వినియోగిస్తారు. పట్టణ ప్రజలైతే పై ప్రక్రియ మాదిరిగానే చేసి ప్రత్యేక కవర్లలో, ఫ్రిడ్జ్లలో పెట్టి ఏడాదంతా నిల్వ ఉంచి వినియోగిస్తారు – నష్టపోతున్నాం ప్రస్తుతం చింతపండు నిల్వ చేసేందుకు శీతల కేంద్రాలు లేకపోవడంతో దళారీలు అడిగిన ధరకు విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నాము. అధికారులు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తే మాకు మేలు జరుగుతుంది. – నిమ్మక అప్పన్న, గొట్టిపల్లి, కొత్తూరు -
మొక్కా.. ఏదీ నీ లెక్కా..?
ఇచ్ఛాపురం రూరల్: ఉపాధి హామీ పథకంలో భాగంగా గతంలో వేతనదారులకు ఇచ్చిన మొక్కలు ఇప్పుడు సామాజిక తనిఖీ బృందానికి దొరకడం లేదు. మొక్కలు నాటినట్లు రికార్డుల్లో ఉన్నా.. లెక్కకు మాత్రం అక్కడ ఒక్క మొక్క కూడా సామాజిక తనిఖీ బృందాలకు చిక్కకపోవడం విశేషం. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 1,252 పనులకు గత నెల రోజులుగా సామాజిక బృందం సభ్యులు గ్రామాల్లో ఆడిట్ నిర్వహించారు. వేతనాల రూపంలో రూ.10.75 కోట్లు, మెటీరియల్ రూపంలో రూ.5.14 కోట్లకు సామాజిక తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో బుధవారం నిర్వహించిన ప్రజావేదికలో మండలంలోని ఏ గ్రామంలో కూడా మొక్కలు లేకపోవడంతో పీడీ లవరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మొక్కలు నాటాలని ఆదేశించారు. బాలకృష్ణాపురంలో రూ.1.05 లక్షల ఖర్చుతో నీటి కుంట తవ్వారు. అయితే జేసీబీతో కప్పివేసినట్లు సామాజిక బృందం గుర్తించింది. అదే గ్రామంలో రూ.5.38 లక్షలతో నక్కల బంధ చెరువు పూడిక తీత పనులు చేపట్టారు. అయితే ఆ చెరువు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించి చెరువు గట్టును పూర్తిగా తొలగించి, గ్రావెల్ రోడ్డు వేసి స్థలాలుగా మార్చుకున్నట్లు సామాజిక తనిఖీలో బృందం గుర్తించింది. దీనిపై ఏపీడీ ఎంకై ్వరీ వేస్తున్నట్లు పీడీ లవరాజు ఆదేశించారు. వివిధ కారణాలతో ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.4,500ల జరిమానా విధించారు. కార్యక్రమంలో ఎంపీపీ బోర పుష్ప, పీఏసీఎస్ చైర్మన్ పెదిన బాబ్జీ, డ్వామా పీడీ బి.లవరాజు, ఏపీడీ పి.రాధ, ఏపీడీ సీహెచ్ శ్రీనివాసరెడ్డి, విజిలెన్స్ అధికారి శ్రవణ్కుమార్, ఎంపీడీవో ఎ.ప్రభాకరరావు, ఎస్ఆర్పీ సిర్ల మాధవరావు, ఏపీవో పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పోలీస్స్టేషన్ పరిశీలన
జి.సిగడాం: స్థానిక పోలీస్స్టేషన్ను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. దీనిలో భాగంగా సిబ్బంది పనితీరు, స్టేషన్ నిర్వహణపై ఆరా తీశారు. గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసుల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పోలీసులు పక్కాగా గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో తగాదాలు సృష్టించేవారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. ఆయనతో పాటు శ్రీకాకుళం డీఎస్సీ వివేకానంద, జేఆర్పురం సీఐ అవతారం, ఎస్ఐ సందీప్కుమార్లు ఉన్నారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు హిరమండలం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలానికి చెందిన మీసాల రజిని, ష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా సొర్లంగి గ్రామానికి చెందిన వంగపల్లి లక్ష్మినారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మీసాల రజిని లక్ష్మినారాయణ -
ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న వసతి గృహంలో చేరేందుకు చలన సంబంధ, బధిర విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థినులను ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ ఏడీ శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి గృహంలో 50 మంది విభిన్న ప్రతిభావంతులైన బాలికలు చేరేందుకు అవకాశం ఉందన్నారు. 1వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యూయేషన్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచిత భోజనం, వసతితో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, సంవత్సరానికి నాలుగు జతలు యూనిఫామ్స్, కాస్మోటిక్ చార్జీలకు గానూ ప్రతినెల రూ.250లు అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న, ఉపాధి శిక్షణ పొందుతున్న విభిన్న ప్రతిభావంతులైన బాలికలకు సైతం శిక్షణ కాలములో వసతి గృహంలో వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వసతి గృహంలో చేరే విద్యార్థినుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలని, వికలాంగత్వం 40 శాతం కానీ అంతకంటే ఎక్కువ గానీ ఉండాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రం(ఓసీలకు అవసరం లేదు) ఉండాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 08942–240519, 99519 71764, 80747 77210 నంబర్లను సంప్రందించాలని సూచించారు. అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం టెక్కలి: అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక పట్టుమహదేవి కోనేరు గట్టుపై ఆలయం అభివృద్ధి పనులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం అన్న క్యాంటిన్ను ప్రారంభించారు. అలాగే స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అంతకుముందు కోటబొమ్మాళిలో పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఆయనతో పాటు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఏఎంసీ చైర్మన్ బి.శేషగిరి, నాయకులు కె.హరివరప్రసాద్, వి.విజయలక్ష్మి, ఎం.సుందరమ్మ, ఎం.దమయంతి తదితరులు ఉన్నారు. గాయత్రీలో మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ శ్రీకాకుళం రూరల్: గాయత్రీ కాలేజ్ ఆఫ్ సైన్సు అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో డిగ్రీ ప్రవేశం పొందాలనుకునే విద్యార్థుల కోసం 2026–27 విద్యా సంవత్సరం నుంచి మెరిట్స్కాలర్ షిప్ ఇవ్వనున్నట్లు గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ స్వామినాయుడు బుధవారం తెలిపారు. మే 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ 100 మందిలో ఉత్తమ మార్కులు సాధించిన 5 మందికి రూ.25 వేల ప్రతిభా పురస్కారం అందజేస్తామన్నారు. ఈ పరీక్ష అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ స్టడీస్ వంటి అంశాలపై ఉంటుందన్నారు. పరీక్ష కోసం ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. మరిన్ని వివరాలకు 94403 95109 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఆయనతో పాటు కరస్పాండెంట్ రంగారావు, ప్రిన్సిపాల్ కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చిరుతిండి.. ప్రమాదమండి..!
● జంక్ ఫుడ్తో చిన్నారులకు అనారోగ్యాలు ● ప్యాకింగ్ పదార్థాలతో అపాయం ● సంప్రదాయ సమతుల్య ఆహారంతో మేలు అవగాహన కల్పిస్తున్నాం పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు జంక్ ఫుడ్ మాన్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ఉండే ఆహార పదార్థాల వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేసి పిల్లలకు అందివ్వాలి. దీనివలన వారిలో శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. – విద్యా శతపతి, సీడీపీవో, టెక్కలి జంక్ఫుడ్తో అనారోగ్య సమస్యలు జంక్ ఫుడ్ వలన చిన్నారుల్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, గుండె, పొట్ట సమస్యలతో పాటు మెదడు ఎదుగుదల లేకుండా చేస్తాయి. జంక్ఫుడ్ ఆకర్షణకు గురి కాకుండా చూసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – బీఆర్కే మహారాజ్, చిన్న పిల్లల వైద్య నిపుణుడు, టెక్కలి జిల్లా ఆస్పత్రి ఎదుగుదలకు హానికరం చిన్నారుల ఎదుగుదలపై ఈ జంక్ ఫుడ్స్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు, చక్కెర, ఉప్పు ప్రభావంతో వారిలో రోగ నిరోధక శక్తి నశించి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వీటిలో ఎటువంటి ప్రోటీన్లు, విటమిన్లు ఉండవు. దీనివల్ల పెరుగుదల, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. బర్గర్లు, పిజ్జా, చిప్స్, సోడాల్లో పోషకాలు తక్కువ, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. దీంతో శరీరం పోషక లోపంతో ఎదుగుతుంది. అధిక బరువు, గుండె, లివర్ సమస్యలకు దారి తీస్తాయి. ఎక్కువ చక్కెర, ఫ్యాట్స్ వలన స్థూలకాయం, మధుమేహపు ప్రమాదం, ఫాటీ లివర్ మొదలైన సమస్యలు చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఏకాగ్రత తగ్గి, చిరాకు, అలసట, నిద్రలేమి సమస్యలు వస్తాయి. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి చిన్నారులకు జంక్ ఫుడ్ను మాన్పించే విషయంలో తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలి. ఇంట్లో తల్లిదండ్రుల ఆహార అలవాట్లుకు అనుగుణంగా పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయంలో ఆకర్షణీయంగా ఇంట్లోనే పదార్థాలను తయారు చేసి వారికి అందివ్వాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని తయారు చేయడంలో పిల్లలు భాగస్వామ్యం ఉండే విధంగా చూడాలి. దీనివలన వారు తయారు చేసిన ఆహారాన్ని ఎలాగైనా తినాలి అనే మార్పు వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే విషయంలో వారిని ప్రోత్సహించే విధంగా చిన్నపాటి ప్రోత్సాహకాలు అందజేయాలి. దీనివలన ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్ ఆహారం అనారోగ్యం అనే విషయంపై చిన్నారులకు అవగాహన కల్పించాలి. సంప్రదాయ ఆహారంతో మేలు చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు కొన్ని రకాల సాంప్రదాయ ఆహారాలను అలవాటు చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇంట్లో వండిన సమతుల్య ఆహారం అనగా పప్పు, కూరలతో చేసిన ఆహారం, పాలు, గుడ్లు, చికెన్, చేపలు వంటి ప్రోటీన్ ఆధారిత ఆహారం వారి పెరుగుదలకు ఎంతో మంచిది. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, అరటి, పచ్చి కూరలు, క్యారట్, బీట్రూట్తో చేసిన ఆహార పదార్థాలతో విటమిన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయి. -
ఆదిత్య విద్యార్థుల ప్రతిభ
టెక్కలి: ఇటీవల సత్యసాయి జిల్లాలో నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్నోవేషన్, డిజైన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ బూట్ క్యాంప్లో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కళాశాలలో బుధవారం వారిని అభినందించారు. ఏఐసీటీఈ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 250 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. వారిలో ఆదిత్య విద్యార్థులు మైరెన్ ఎక్స్, కాష్యుహబ్, ఎఫీసోల్వో తదితర ఇన్నోవేషన్ ప్రాజెక్టులతో పాల్గొన్నట్లు వెల్లడించారు. కాష్యు హబ్కు జ్యూరీ ప్యానెల్ ఉత్తమ జట్టు అవార్డు, ప్రశంసా పత్రాలు అందజేసినట్లు తెలిపారు. అలాగే ఎఫీసోల్వోకు ప్రశంసపత్రాలు అందజేశారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ఐతమ్ రైజ్ సీఈవో మనోజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తూతూమంత్రంగా సామాజిక తనిఖీ ప్రజావేదిక
కవిటి: మండలంలోని ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిర్వహించిన 18వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక తూతూమంత్రంగా జరిగింది. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జరిగిన పనులకు సంబంధించి ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక సభ బుధవారం కవిటిలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.లవరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. వాస్తవానికి సామాజిక తనిఖీ ఆడిట్ బృందం ఫిబ్రవరి 11 నుంచి మార్చి 31 వరకు గ్రామస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ గ్రామస్థాయి సభలకు సంబంధించి మీడియా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడంలో తనిఖీ బృందం ఆసక్తి చూపకపోవడం గమనార్హం. వేజ్ కాంపోనెంట్ రూ.10.56 కోట్లకు పైగా నిధులు, పీఆర్ విభాగంలో రూ.4.10 కోట్లు, సోషల్ ఫారెస్ట్రీలో రూ.97,713లు, కాంపౌండ్స్ రూ.1.14 లక్షలకు సంబంధించిన పనులపై ఈ తనిఖీ నిర్వహించారు. సమీక్ష ప్రారంభం అయిన గంటలోనే 5 పంచాయతీలకు సంబంధించిన సానుకూల, ప్రతికూల అంశాలకు సంబంధించిన చర్చ సోషల్ ఆడిట్ సిబ్బంది పూర్తి చేసేశారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.15 కోట్ల నిధులు వినియోగానికి సంబంధించి కేవలం రూ.20,500లు దుర్వినియోగం అయినట్లు అధికారులు తేల్చారు. ఈ నిధులు బెజ్జిపుట్టుగలో రూ.6,000లు, సహలాలపుట్టుగలో రూ.7,500లు, బల్లిపుట్టుగలో రూ.4,500లు, వరకలో రూ.2,500లుగా నిర్దారించారు. కార్యక్రమంలో అడిషనల్ పీడీ టి.రాధ, ఏపీడీ సీహెచ్ శ్రీనివాసరెడ్డి, హెచ్ఆర్ మేనేజర్ శ్రావణ్, ఎంపీడీవో ఎల్.త్రినాథ, ఏపీవో టి.మోహనరావు, ఈసీ నీలాంబర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీహరి అరెస్టు అప్రజాస్వామికం
నరసన్నపేట: జర్నలిస్టుగా సామాజిక అంశాలపై అవగాహన ఉన్న వైఎస్సార్ సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి ప్రజల ఇబ్బందులను సోషల్మీడియా ద్వారా బయటపెడుతుంటే, దానిని తట్టుకోలేక కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ బుధవారం తీవ్రంగా ఖండించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా మారు వేషాల్లో వచ్చి పోలీసులు ఎత్తుకుపోవడం దారుణమన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. సుప్రీం కోర్టు నిబందనల మేరకు ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో 41ఏ నోటీసు ఇచ్చి విచారణ జరపాలని, పోలీసులు ఆ నిబంధనను తుంగలోకి తొక్కి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శ్రీహరిని వెంటనే విడిచిపెట్టాలన్నారు. అక్రమ అరెస్టు అన్యాయం... టెక్కలి: వైఎస్సార్సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని అక్రమ అరెస్టు చేయడం అన్యాయమని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ బుధవారం మండిపడ్డారు. చంద్రబాబు ప్రభు త్వం చేస్తున్న అక్రమాలను మీడియా ద్వారా బహిర్గతం చేస్తున్న ప్రతినిధులపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. -
భూసమస్యలు పరిష్కరించని రీ సర్వే మాకొద్దు
● సత్యవరంలో గ్రామసభను బహిష్కరించిన రైతులు నరసన్నపేట: ‘ఎన్నో ఏళ్ల తర్వాత భూములు రీ సర్వే చేస్తున్నారు. ఇప్పుడు కూడా రికార్డులు పూర్తి స్థాయిలో సరిదిద్దరా.. భూ సమస్యలు ఎక్కడికక్కడ ఉంచేసి తూతూమంత్రంగా రీ సర్వే చేసి వెళ్లిపోతామంటే మేం సహకరించం. ఇటువంటి రీ సర్వే మాకు వద్దు. ఉన్న భూములు అన్నింటినీ రీ సర్వే చేసి సమస్యలు పరిష్కరించండి. అన్ని విధాలా సహకరిస్తాం. ప్రధానంగా సత్యవరం రెవెన్యూ గ్రామ పరిధిలోని హెల్డోవర్ భూములను రీ సర్వే చేయాలి. లేకుంటే రీ సర్వే వద్దు’ అంటూ నరసన్నపేట మండలం సత్యవరం, దూకులపాడు, తండ్యాలవానిపేట రైతులు రీ సర్వే గ్రామసభను బహిష్కరించారు. మూడో విడతలో సత్యవరం రెవెన్యూ పరిధిలో భూముల రీ సర్వేకు అనుమతి రావడంతో బుధవారం అవగాహన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భూముల సమస్యలు పరిష్కరించకపోతే రీ సర్వే ఎందుకంటూ రైతులు రెవెన్యూ అధికారులను నిలదీశారు. వివాదాస్పద భూములంటూ కొన్నింటిని హెల్డోవర్ పేరిట ఏళ్ల తరబడి పక్కన పెట్టేశారు. వీటికి పాస్ పుస్తకాలు కావాలని అడుగుతున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ ఆరంగి మురళి మాట్లాడుతూ దున్నేవాడిదే భూమి అని గతంలో కేంద్రం తీసుకువచ్చిన చట్టం ప్రకారం 600 ఎకరాలు మాకు దకలు పడ్డాయని, ఇప్పటికీ సాగు చేస్తున్నామని, ఆ తర్వాత భూములను హెల్డోవర్లో పెట్టారని చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హెల్డోవర్ క్లియరెన్స్ చేసి 600 ఎకరాల్లో రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ పక్కన పెట్టారని తెలిపారు. ఈ భూముల్లో పట్టా పుస్తకాలు పొందిన వారు కొందరు మరణించారని, వారి పిల్లలకు పాస్ పుస్తకాలు ఇప్పించాలని విన్నవించారు. అనంతరం తహసీల్దార్ టి.సత్యనారాయణ మాట్లాడుతూ రీ సర్వేకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
● కేజీబీవీలో 87.82 శాతం ఉత్తీర్ణత
శ్రీకాకుళం: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటాయి. 25 కేజీబీవీల నుంచి 772 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 678 మంది ఉత్తీర్ణత సాధించారు. 87.82 శాతం ఉత్తీర్ణత నమోదైంది.పొందూరులో 97.30, గారలో 97.22, సారవకోటలో 96.7, పోలాకిలో 96.55, కొత్తూరులో 96.4 3, ఆమదాలవలసలో 95.45, కవిటిలో 95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మందసలో 54.84, ఎల్లంపేటలో 42.86, ఇచ్ఛాపురంలో 73.53, పాతపట్నంలో 71.43 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. పలు కేజీబీవీల్లో 970 మార్కులకు పైగా సాధించి ప్రతిభ చాటుకున్నారు. విద్యార్థినులతో పాటు ప్రిన్సిపాళ్లను, పీజీటీలను ఏపీసీ వేణుగోపాలరావు అభినందించారు. ఆమదాలవలస కేజీబీవీ విద్యార్థిని జె.వనజాక్షి ఎంపీసీలో 983 మార్కులు సాధించి కేజీబీవీల్లో టాపర్గా నిలిచింది. -
శ్రీకాకుళం
చిట్టచివరన సిక్కోలు ● ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అట్టడుగు స్థానాల్లో నిలిచిన శ్రీకాకుళం ● జిల్లా సగటుతో పోలిస్తే వెనుకబడిన ప్రభుత్వ యాజమాన్య కళాశాలలు ● ప్రభుత్వ హడావుడి నిర్ణయాలు, ఏకపక్ష వైఖరే కారణమంటున్న విశ్లేషకులు చిన్నారుల ఆరోగ్యాన్ని జంక్ఫుడ్ దెబ్బతీస్తోంది. ప్యాకింగ్ పదార్థాలు తీవ్ర అనారోగ్యాన్ని కలగజేస్తున్నాయి. –8లోగురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026మే 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. ప్రధాన పరీక్షలు జూన్ 2తో ముగుస్తాయి. ఉదయం మొదటి సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు, మార్కులు ఇంప్రూవ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు పరీక్షలకు సమాయత్తం కావాలి. ఏప్రిల్ 20 నుంచి 27 వరకు పరీక్ష ఫీజులను కాలేజీల్లోనే చెల్లించాలి. రీ–కౌంటింగ్, రీ–వెరిఫికేషన్కు నిర్దేశిత ఫీజులు చెల్లించి, కాలేజీల్లో దరఖాస్తులు చేసుకోవాలి. – రేగ సురేష్కుమార్, జిల్లా ఆర్ఐఓ/డీవీఈఓ (ప్రస్తుత ఫలితాలు) శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు తీవ్రంగా నిరాశపరిచారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతంతోపాటు రాష్ట్రస్థాయిలోనూ వెనుకబడ్డారు. గత ఏడాది 74 శాతం సాధించగా.. ఈ ఏడాది ఒకశాతం దిగజారి 73కి చేరింది. ఇక ఎప్పటిలాగే ఈ సారి కూడా బాలురు కంటే బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో 71 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వ తేదీ వరకు 23రోజులపాటు పరీక్షలు జరగగా.. స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 తేదీ వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఫస్టియర్లో 70 శాతం.. ప్రథమ సంవత్సరం విద్యార్థులు గత ఏడాదితో కాస్త పోలిస్తే మెరుగనిపించారు. గత ఏడాది జనరల్ కోర్సులలో 63 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 70 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 21వ స్థానంలో నిలిచారు. 17,432 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాగా.. 12,163 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకెండియర్లో 73 శాతం.. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్ధులు గత ఏడాది కంటే ఒక శాతం దిగజారి 74 శాతం నుంచి 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్లో మాత్రం ముందు వరుసలో నిలిచారు. జనరల్ కోర్సుల పరీక్షలకు 17,355 మంది హాజరుకాగా, 12,684 మంది పాసయ్యారు. సర్కారు వెనుకంజ.. గత ఏడాది వరకు మెరుగైన ఉత్తీర్ణత సాధిస్తూ వచ్చిన ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలలు తాజా ఫలితాల్లో వెనుకబడ్డాయి. జిల్లా సగటు ఉత్తీర్ణతతో పోలిస్తే సర్కారీ కళాశాలల ఫలితాలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన హడావుడి నిర్ణయాలు, కనీస అభిప్రాయ సేకరణ, దిగువ స్థాయిలో అధికారులతో సమీక్షలు, సమావేశాలు లేకుండా తీసుకొచ్చిన ఏకపక్ష విధానాలే కారణామనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా క్లాసులు నిర్వహించకుండా వారోత్సవాలు, పేరెంట్స్ మీటింగ్స్ పేరిట 15 రోజులు, జీఎస్టీ వారోత్సవాలు, వినియోగదారుల వారోత్సవాలు, రాజ్యాంగ ఆమోదం, జాతీయ సేవా పథకం దినోత్సవం, ర్యాలీలు, ప్రతినెల స్వర్ణాంధ్ర–స్వచ్ఛంధ్రా పేరిట పరిసరాల పరిశుభ్రత, ఒకటేంటి.. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలతో విద్యార్థులకు క్లాసులు లేకుండా చేయడంతో తమకు పాఠాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఆదేశాలతో కార్యక్రమాలను జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలన్నీ కాలేజీల్లో అమలుచేస్తూ అధ్యాపకులు పాఠాలకు నోచుకోలేదని.. ఈ విషయంలో తాము కూడా ఏమీ చేయలేకపోయామని ప్రిన్సిపాళ్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వెరసి ప్రభుత్వ యాజమాన్య కాలేజీల్లో పూర్తిస్థాయిలో క్లాసులు జరగలేదనే సర్వత్రా అంగీకరిస్తున్నారు. సత్తాచాటిన గురుకులాలు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఫస్టియర్లో 566 మంది విద్యార్థులకు గాను 496 మంది ఉత్తీర్ణులయ్యారు. 88 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎల్.గోవింద్ (బైపీసీ) 440, లింగాల రేష్మ, పొట్నూరు చరణ్కుమార్ (ఎంపీసీ) 462, టి. దీపిక (సీఈసీ) 456, మార్కులతో ప్రతిభ చాటారు. సెకెండియర్లో 591 మందికి గాను 517 మంది పాసై 87 శాతం ఉత్తీర్ణత సాధించారు. అల్లాడ సోనియా (బైపీసీ) 977, కొప్పిలి జగదీష్ (ఎంపీసీ) 973, కోనారి గీతాలక్ష్మి (సీఈసీ)850 మార్కులతో సత్తాచాటారు. వీరితో పాటు అధ్యాపక బృందాన్ని జిల్లా కో–ఆర్డినేటర్ వై.యశోదలక్ష్మి అభినందించారు. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాల్లో ఫస్టియర్లో 67 శాతం, సెకెండియర్లో 70 శాతం ఉత్తీర్ణత సాధించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 18 వసతి గృహాల నుంచి ఫస్టియర్లో 571 మంది హాజరుకాగా 381 మంది ఉత్తీర్ణులయ్యారు. 66.73 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకెండియర్లో 468 మంది హాజరు కాగా, 326 మంది పాసయ్యారు. 69.66 శాతం పలితాలు సాధించారు. -
స్వీయగణన ప్రక్రియ విజయవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జనగణన–2027లో భాగంగా తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘స్వీయ గణన’ ప్రక్రియను జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 16 నుంచి 30 వరకు నిర్వహించే జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలు htt ps://se.census.gov.in పోర్టల్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రక్రియను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, ప్రభుత్వ సిబ్బంది భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతిరోజూ కనీసం 10 నుంచి 20 మంది వ్యక్తులు స్వీయ గణన చేసుకునేలా సిబ్బంది చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 26న జిల్లా కేంద్రం, మున్సిపాలిటీలలో ‘సెన్స స్ 5కేరన్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రి య పూర్తిగా స్వచ్ఛందమైనదని స్పష్టం చేశారు. ఆదిత్యుని సన్నిధిలో మహాలింగార్చన అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలోని అనివెట్టి మండపంలో మాస శివరాత్రి సందర్భంగా బుధవారం శివ పంచాయతన సహిత మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్శర్మ అర్చనాభిషేకాలను శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తులు, ఆలయ అధికార సిబ్బంది పాల్గొన్నారు. ఖైదీలకు న్యాయ సహాయం శ్రీకాకుళం పాతబస్టాండ్ : జైళ్లలో విచారణ ఎదుర్కొంటున్న ముద్దాయిల హక్కులను కాపాడటంతో పాటు వారికి సత్వర న్యాయం అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీసు, ఎకై ్సజ్ అధికారులు, న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ ద్వారా బెయిల్ లభించినా బయటకు రాలేకపోతున్న వారు, మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ముద్దాయిల కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సూచించారు. రాబోయే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడంపై దిశానిర్దేశం చేస్తూ.. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రికార్డు స్థాయిలో కేసులను రాజీ మార్గంలో పరిష్కరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి హరిబాబు, అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్, ఎస్.డి.పి.ఓ వి.వెంకటప్పరావు, అదనపు ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.నాగభూషణ రావు, జైలు అధికారులు పాల్గొన్నారు. అంబేడ్కర్ వర్సిటీలో ఎంఓయూ ఎచ్చెర్ల: స్థానిక డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ, హైదరాబాద్కు చెందిన టార్చ్ ఫిన్టెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ మధ్య బుధవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, స్వయం సాధన కోర్సులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందిస్తారు. భారత ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈ విభాగం ద్వారా నిధులు సమకూరుతాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వీసీ కె.ఆర్.రజనీ, రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, టార్చ్ ఫిన్టెక్ డైరెక్టర్ వైభవ్ సీపాన, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న రైతుల గోడు పట్టదా?
● వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలి ● మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ గార/శ్రీకాకుళం రూరల్ : మొక్కజొన్న కొనుగోలు లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికై నా నిర్లక్ష్యం వీడి వెంటనే మొక్కజొన్న కేంద్రాలను తెరిచి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం గార మండలం కొత్తూరు, అచ్చెన్నపాలెం, శ్రీకాకుళం రూరల్ మండలం బలివాడ గ్రామాల్లో మొక్కజొన్న రైతులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పెట్టిన మద్దతు ధరకు కొనకపోతే కలిగిన నష్టాన్ని ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. పరిశ్రమ, ప్రైవేటు వర్తకులు మాట తప్పవచ్చు కానీ ప్రభుత్వమే మాట తప్పితే ఎలా అని నిలదీశారు. ఏసీ గదుల్లో ఉండటం కాదని, పొలాల్లోకి వచ్చి రైతుల కన్నీరును చూడాలన్నారు. రైతుల ఘోష మీ చెవికి వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. యూరియాను టీడీపీ కార్యకర్తలు బ్లాక్ మార్కెట్ ద్వారా అధిక ధరలకు అమ్ముకున్నారని, జగన్ ప్రభుత్వం మాదిరిగా రైతు భరోసా కేంద్రాల వద్ద యూరియా అమ్మకాలు జరగాలని, విత్తనాలు అన్ని అందుబాటులో ఉంచాలన్నారు. రూ.280లకే దొరకాల్సిన యూరియాను రూ.700కు పక్క గ్రామాల్లో కొనుగోలు చేసుకున్నామని రైతులే చెబుతున్నారని, ఇవన్నీ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు. జిల్లాలో 80 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోందని, ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 కాగా, రూ.1700కే కొనుగోలు చేస్తున్నారని, ఎకరాకు సరాసరి 40 క్వింటాళ్లు దిగుబడి రాగా రూ.28 వేలు నష్టపోతున్నారని చెప్పారు. జిల్లాలో రూ.240 కోట్ల మేర రైతులకు నష్టం వాటిల్లుతోందన్నారు. రెండేళ్ల కిందట అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మద్దతు ధరకే కొనుగోలు జరిగిందని రైతులే చెబుతున్నారని, కరోనా వంటి పరిస్థితుల్లో కళ్లాల వద్దకే వచ్చి తీసుకెళ్లారని గుర్తు చేశారు. జిల్లాలో ఓ వర్తకుడు క్వింటా రూ.1800 కంటే ఎక్కువ కొనవద్దని చెబుతున్నాడని తెలుస్తోందన్నారు. డ్యాష్బోర్డుపై చూడటం కాదని, పొలాల్లోకి వచ్చి రైతుల కన్నీరు చూడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ యువనేత ధర్మాన రామ్మనోహర్నాయుడు, పార్టీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీపీ గొండు రఘురామ్, నియోజకవర్గాల పరిశీలకులు చల్లా రవికుమార్, ఎన్ని ధనుంజయరావు, పార్టీ ఎస్ఈసీ మెంబర్ చల్ల శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు పీస గోపి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మార్పు పృథ్వీరాజ్, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు పీస శ్రీహరిరావు, మండల వ్యవసాయ విభాగం అధ్యక్షుడు శిమ్మ ధర్మరాజు, అంబటి శ్రీనివాసరావు, చిట్టి జనార్దన, బరా టం నాగేశ్వరరావు, సుంకాన సురేష్, గురువు అప్పలనాయుడు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కాశీబుగ్గ డీఎస్పీగా భవాని బాధ్యతల స్వీకరణ
పలాస/శ్రీకాకుళం క్రైమ్: కాశీబుగ్గ డీఎస్పీగా టి.భవాని బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఈమె గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశారు. తర్వాత పోటీపరీక్షలు రాసి కడప జిల్లాలో డిప్యూటీ తహశీల్దారుగా కొలువు సాధించారు. తాజాగా గ్రూప్–1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికై కాశీబుగ్గలో నియమితులయ్యారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిని బుధవారం డీఎస్పీ భవాని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ ఆమెకు సూచించారు. -
అదరగొట్టారు..
● ఇచ్ఛాపురం రూరల్: మండపల్లి గ్రామానికి చెందిన తిప్పన రాజు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులకు 990 సాధించిటాపర్గా నిలిచాడు. ఎం.తోటూరు ఆదిత్యా విద్యా సంస్థల్లో చదువుతున్న రాజు కంప్యూటర్ ఇంజనీర్ కావడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. ● శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్ సెకెండియర్ ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో శ్రీకాకుళం శ్రీచైతన్య విద్యార్థులు కంచరాపు రేవంత్కుమార్, మూల సాత్విక, వడ్డి మురళీకృష్ణ 989 మార్కులతో సత్తాచాటారు. నారాయణ కాలేజ్కు చెందిన కొత్తకోట ఉజ్వల 988 మార్కులతో మెరిసింది. సీనియర్ బైపీసీ గ్రూపులో శ్రీకాకుళం శ్రీచైతన్య కాలేజ్కు చెందిన పెడగోపు బిందుమాధవి 990 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది. ఫస్టియర్ ఎంపీసీలో శ్రీకాకుళానికి చెందిన ఎం.సౌందర్యలహరి 470 మార్కులకుగాను 467 మార్కులు సాధించింది. పొడుగు ప్రణీల, వంక జనీష, ఎస్.లక్ష్మిచేతన్, చిట్టి షణ్ముకసాయి, బైరి హస్మిత, పొలుమూరు శ్యామ్కృష్ణ, గుడ్ల హిమజ, గున్ను నేహ, లిస మహంతి 466 మార్కులు, దుంగ లిఖిత, అల్లాడ ఉర్షిత 465 మార్కులు సాధించి సత్తాచాటారు. బైపీసీలో 455 మార్కులకుగాను శ్రీకాకుళం నగరానికి చెందిన లిమ్మక లక్ష్మిత, పప్పల హర్షిత 451 మార్కులతో జిల్లా టాపర్లగా నిలిచారు. పైడిపెద్ది గిరి మేఘన 449, డి.భార్గవి 445 మార్కులు సాధించారు. వీరంతా స్థానిక శ్రీచైతన్య, నారాయణ కాలేజ్ విద్యార్థులే. ● జలుమూరు: ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థిని పాగోటి మౌనిక ద్వితీయ సంవత్సరం బైపీసీలో 990 మార్కులు సాధించింది. తల్లిదండ్రు లు రమణమ్మ, అశోక్ కుమార్ ఇద్దరూ వ్యవసాయ కూలీలే. ● బూర్జ: ఓప్పివాడ ఏపీ మోడల్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకెండియర్ చదువుతున్న చింతాడ అనన్యశ్రీ 990 మార్కులతో సత్తాచాటింది. -
కష్టాల మోత!
● గర్భిణులను డోలీతో మోసుకొస్తున్న గిరిజనులు ● చిన్నారులకు తప్పని నాలుగు కిలోమీటర్ల కాలినడక ● రోడ్డు లేక మామిడిజోల గ్రామస్తుల అవస్థలు 4సారవకోట : ఎన్ని మారుతున్నా తమ డోలీ మోతల కష్టాలు మాత్రం మారడం లేదని సారవకోట మండలం బద్రి పంచాయతీ మామిడిజోల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు లేక నిత్యం అవస్థలు పడుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కొన్నేళ్ల కిందట సీతంపేట, సరుబుజ్జిలి, కొత్తూరు, హిరమండలం మండలాలలోని పలు ప్రాంతాల నుంచి పలు కుటుంబాల గిరిజనులు బద్రి గ్రామానికి సుమారు 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న మామిడిజోల గ్రామానికి వలస వచ్చారు. చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాలను చదును చేసి చీపురు, పసుపు, వేరుపనస తదితర పంటలను సాగు చేస్తూ జీవనం సాగు చేస్తున్నారు. మొదటి నుంచీ ఈ గ్రామానికి రోడ్డు సమస్య వెంటాడుతోంది. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో ఏ కష్టమొచ్చినా కాలినడకనే సమీప గ్రామాలకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం రోడ్డు మార్గమైనా కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. డోలీలే గతి.. గ్రామంలో గర్భిణులకు ఆరోగ్య పరీక్షలకు సంబంధించి అవస్థలు తప్పడం లేదు. ప్రతి నెలా బుడితి సీహెచ్సీకి వైద్య పరీక్షల నిమిత్తం డోలీ కట్టుకుని మోసుకొచ్చి తిరిగి తీసుకెళ్తున్నారు. ప్రసవ సమయంలో ఆస్పత్రికి తీసుకురావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏమాత్రం పొరపాటు జరిగినా తల్లీ, బిడ్డలకు ప్రాణాపాయం తప్పదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 -
ఉనికి కోసమే ‘కూన దిగజారుడు వ్యాఖ్యలు
● వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆమదాలవలస: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మతిభ్రమించిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. ఆమదాలవలసలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై చేసిన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరన్నారు. కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీలో ఉనికి కోసమే ఇలా చేస్తున్నారని, వైఎస్సార్ సీపీ నాయకులతో తిట్టించుకుంటే మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దివంగత ఎన్టీఆర్ మరణం వెనుక కారణం ఎవరో ఈ దేశం మొత్తం చెప్పగలదనే విషయం గుర్తుంచుకోవాన్నారు. కూన రవికుమార్కు చేతనైతే టీడీపీలో ఈనాటికీ అనుమానాలు ఉన్న వంగవీటి రంగా, కింజరాపు ఎర్రన్నాయుడు, ఎలిమినేటి మాధవరెడ్డి, ఇంద్రారెడ్డి, జీఎంసీ బాలయోగిల మరణాలపై చంద్రబాబు వద్దకు వెళ్లి అడిగి తెలుసుకోవాలని హితవుపలికారు. తమ నేతలు జగన్మోహన్ రెడ్డి, దివంగత రాజశేఖరరెడ్డిలు ప్రజల హృదయాలు గెలుచుకొని నాయకులు అయ్యారని, మీ నాయకుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యాడని, ఇది ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసని పేర్కొన్నారు. మీ యువ నాయకుడు లోకేష్ త్వరలోనే నాన్నకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నాడని విమర్శించారు. కూన రవికుమార్ చేసే చీకటి వ్యాపారాలు నియోజకవర్గ ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. కూన కేకలకు బెదిరే వారు లేరని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, పార్టీ ముఖ్య నాయకులు సురవరపు నాగేశ్వరరావు, బోర చిన్నంనాయుడు, పొడుగు శ్రీనివాసరావు, బెవర మల్లేశ్వరరావు, దుంపల శ్యామలరావు, పొన్నాడ చిన్నారావు, మొండేటి కూర్మారావు, సంపతిరావు రామారావు, పున్నపురెడ్డి తవిటినాయుడు, బొడ్డేపల్లి మన్మధరావు, బొడ్డేపల్లి వెంకటరమణ, పొదిలాపు తిరుపతిరావు, సత్యనారాయణ, మెట్ట వసంతరావు, అన్నపు కృష్ణ, ప్రసాద్, అన్నపు సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీపై తప్పుడు ప్రచారం తగదు
ఇచ్ఛాపురం: బాపు బొమ్మ స్పీక్స్ అనే ట్విట్టర్(ఎక్స్) ఖాతా ద్వారా ఫేక్ స్క్రీన్షాట్ సృష్టించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, నాయకులు పట్టణ పోలీసుస్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రజల్లో అపోహలు కలిగించడానికి, రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి దుష్ప్రచారాలతో ప్రజాస్వామ్యం దెబ్బతినడమే కాక శాంతిభద్రతలకు ముప్పు కలిగే అవకాశముందన్నారు. ఇటువంటి ఫేక్ ఖాతాను సృష్టించిన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, ఎంపీపీ బోర పుష్ప, మునిపల్ మాజీ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, సల్లా దేవరాజు, పిలక సంతు, కారింగి మోహన్రావు, చిరంజీవి, సోషల్మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
వసతి గృహానికి సామగ్రి వితరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్ : నగరంలోని ఎస్సీ హాస్టల్ –2 (భీమ్ భవన్ హాస్టల్)కు యూనియన్ బ్యాంక్ యాజమాన్యం మంగళవారం రూ.30 వేలు విలువైన 15 ఫ్యాన్లు, ట్యూబ్లైట్లను అందజేశారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు మెరుగైన వసతులు సమకూర్చేందుకు గాను బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కోలక కృష్ణమోహన్ విజ్ఞప్తి మేరకు, హాస్టల్ విద్యార్థులకు వేసవి ఎండల తీవ్రత దష్ట్యా ఈ సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు యూనియన్ బ్యాంక్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ శ్రీకాకుళం రీజినల్ హెడ్ పైడి రాజా, లీడ్ బ్యాంక్ మేనేజర్ పేడాడ శ్రీనివాసరావు, ఆర్ఎస్ఈటీఐ మేనేజర్ రాంజీ, ఏఐబీఓసి రీజనల్ సెక్రటరీ తేజేశ్వరరావు, బ్యాంకర్స్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ మజ్జి రాజశేఖర్, అసోసియేషన్ లీడర్ ధనరాజు, అసోసియేషన్ జోనల్ సెక్రటరీ రాజేంద్రప్రసాద్, బ్యాంకు ఉద్యోగులు అనిల్ సూర్య కిరణ్, బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సీర రమేష్బాబు, విద్యార్థులు పాల్గొన్నారు. -
యంత్రం.. పనిచేసే మంత్రం
● అగ్నిమాపక శాఖ వద్ద అధునాతన పరికరాలు ● జిల్లాలో అగ్ని మాపక వారోత్సవాలుమన జిల్లాలో లేనివి మల్టీ పర్పస్ వాటర్ ట్రెండింగ్ (విశాఖ) పదివేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ బౌజర్స్, ఎనిమిది వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ లారీలు, బహుళ అంతస్థుల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు అవసరమైన హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ స్నారికల్ లేడర్స్ (విశాఖపట్నం, విజయవాడల్లో) ఉన్నాయి. వాటర్ టెండరింగ్ ఫైర్ ఇంజిన్ నీటి సామర్థ్యం 4,500 లీటర్లు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలు ఇరుక్కున్నా, నీటిలో మునిగిన వాహనాలను బయటకు తీయాలన్నా దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఎలక్ట్రిక్ రిమోట్ సాయంతో ఆపరేటర్ చేస్తారు. ఆయిల్ ప్రమాదాలకు ఫోమ్ మేకింగ్ బ్రాంచిని ఉపయోగించి ఫోమ్ను స్ప్రే చేస్తారు. 360 డిగ్రీల కోణంలో వాటర్ స్ప్రే చేయొచ్చు. 40.6 అడుగుల పొడవున్న అల్యూమినియం ఎక్సటెన్షన్ ల్యాడర్(నిచ్చెన) ఉంటుంది, సింగిల్ యూనిట్ అయితే 16, డబుల్ యూనిట్ అయితే 32 మంది ఉంటారు. అడ్వాన్స్ (మల్టీపర్పస్) వాటర్ టెండరింగ్ ఫైర్ ఇంజిన్ నీటి సామర్థ్యం 4,500 లీటర్లు. సాధారణంగా వాటర్ ట్రెండింగ్ ఇంజిన్లో కిందనుంచి వాటర్ ప్రెజర్ కొడతారు. దీనికై తే పైన హ్యాండిల్ పట్టుకుని వాటర్ కొట్టవచ్చు. ఫోమ్, కార్బన్డైయాకై ్సడ్ ఉంటుంది. దీని ద్వారా ఫైర్ను కట్ చేయొచ్చు. మిస్ట్ జీప్ ఇది కాన్వాయ్లో ఉపయోగపడుతుంది. మినీ ఫైర్ ఇంజిన్ అని కూడా అంటారు. 200 లీటర్ల నీటి సామర్థ్యం ఉంటుంది. మిస్ట్ గన్తో ఫైర్ను కట్ చేస్తారు. ఈ గన్ నుంచి వెలువడే ఒక నీటి బిందువు అనేక మిల్లీ మైక్రాన్ అణువులుగా ఏర్పడి మంటలను ఆర్పుతుంది. చిన్న చిన్న సందుల్లోంచి వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. ట్రూప్ క్యారియర్ ప్రమాదం సంభవించే ప్రాంతానికి అప్పటికప్పుడు సిబ్బంది వెళ్లేందుకు ప్రయాణంలో ఉపయోగపడేదే ట్రూప్ క్యారియర్. 30 మంది సిబ్బంది ఇందులో వెళ్లవచ్చు. ఫైర్ బుల్లెట్ బైక్ ఇదికూడా ఇరుకై న సందుల్లోంచి వెళ్లడానికి వీలుగా ఉంటుంది. 10 లీటర్ల ఫోమ్తో కూడిన నీళ్లుంటాయి. రెండు సిలిండర్లు ఉంటాయి. గ్యాస్ లీకై నప్పుడు త్వరగా ఫైర్ కటింగ్ అవుతుంది. ఆయిల్ ఫైర్ అయినప్పుడు ఫోమ్ ఉపయోగపడుతుంది. ఎలక్ట్రానిక్ బేస్ అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ ఇంజిన్ జిల్లాలోని సోంపేట, నరసన్నపేటలకు అధునాతన ఎలక్ట్రానిక్ బేస్ అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ ఇంజిన్లు కొత్తగా రెండు వచ్చాయి. వీటి నీటి సామర్థ్యం 4,500 లీటర్లు. సుదూర బహుళ ప్రయోజన నాజి ల్తో కూడిన కొత్త అధునాతన వాటర్ టెండర్ ఇంజిన్ ఇది. బోట్లు, ఇతర పరికరాలు ఉన్నాయి. వాటర్ టెండరింగ్ ఫైర్ ఇంజిన్ జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శకటాలు, అధునాతన పరికరాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వేర్వేరు ప్రమాదాలు జరిగినప్పుడు వేర్వేరు పరికరాలను ఉపయోగిస్తారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా వీటిపై అవగాహన తప్పనిసరి. – శ్రీకాకుళం క్రైమ్ -
ఆదిత్యుని సన్నిఽధిలో సెంట్రల్ జాయింట్ సెక్రటరీ
అరసవల్లి : అరసవల్లి సూర్యనారాయణ స్వామిని కేంద్ర ప్రభుత్వ స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్కుమార్ గుప్తా కుటుంబసమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ బృందం స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అఖండ భారత్ లక్ష్యంగా పాదయాత్ర రణస్థలం: భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని, దేశ సమైక్యతను బలపరిచి అఖండ భారత్ సాధించాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంచాలకులు మాతా సుమనపురి పాదయాత్ర చేపట్టారు. ద్వాదశ జ్యోతిర్లింగాల పాదయాత్రలో భాగంగా రణస్థలం మండలం పతివాడపాలెం విచ్చేసిన ఆమెకు విశ్వహిందూ పరిషత్ సభ్యులు స్వాగతం పలికారు. ఈమె గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. రోజుకు సుమారు 20 కిలోమీటర్లు నడుస్తూ ఇప్పటి వరకు రెండేళ్లు యాత్ర పూర్తి చేశారు. నాలుగు సంవత్సరాల పాటు కొనసాగే ఈ యాత్ర రామేశ్వరం వద్ద ముగియనుందని సభ్యులు తెలిపారు. భార్యాభర్తలకు రిమాండ్ పాతపట్నం: చిన్నలోగిడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దయానిధి సోయి ఈ నెల 11న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దలోగిడి గ్రామానికి చెందిన ఆశ వర్కర్ జైనవలస చిలకమ్మ, ఆమె భర్త జైనవలస ముఖలింగం వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టాడు. ఈ నేపథ్యంలో మంగళవారం దంపతులను నరసన్నపేట కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. వీరిని అంపోలు జిల్లా జైలుకు తరలించామని ఏఎస్ఐ కె.శ్రీరామ్మూర్తి తెలిపారు. ఫలసాయం హక్కులకు రీటెండర్ ఎచ్చెర్ల : ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్శిటీ క్యాంపస్లో మామిడి, జీడి వృక్షాల పంట ఫలసాయం హక్కుల కోసం రీ టెండర్ దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు రిజిస్ట్రార్ బి.అడ్డయ్య ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్శిటీ శ్రీకాకుళం పేరిట రూ.10 వేల డిపాజిట్ డీడీని జతపరచి టెండర్ కొటేషన్ను సీల్డ్ కవర్లో వర్శిటీలోని ప్రధాన పరిపాలనా భవనం వద్ద ఏర్పాటుచేసిన బాక్స్లో ఈ నెల 16వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు వేయాలని సూచించారు. మరుసటి రోజు సాయంత్రం నాలుగు గంటలకు కవర్లు బహిర్గతం చేసి ఎక్కువ మొత్తం చెల్లించే వారికి ఫలసాయం అందిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు సరికాదు నరసన్నపేట: కూటమిలో లేని రాష్ట్రాలపై ఎస్ఐఆర్(సర్) పేరుతో కేంద్ర ప్రభుత్వం దాడులు నిర్వహించడం తగదని ీసీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ అన్నారు. మంగళవారం నరసన్నపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యుద్ధ ప్రభావం ప్రజలపై పడుతోందని, ఆ భారాన్ని నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఇదే సమయంలో సర్ పేరుతో కూటమిలో లేని రాష్ట్రాలపై దాడులకు దిగుతోందని విమర్శించారు. ఓటమి భయంతో అర్హులైన ఓట్లను తొలగిస్తోందని ఆరోపించారు. కేరళ వంటి రాష్ట్రంలో ఇదేలా వ్యవహరించిందన్నారు. గ్యాస్ కష్టాలు రెట్టింపు అయ్యాయని, విమాన చార్జీలు తగిడి మోపెడయ్యాయని, గ్యాస్ సరఫరాలో కేంద్రం చేతులెత్తేసిందని అన్నారు. ఓవైపు అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తూనే.. మరోవైపు ఆయన ఆశయాలకు తిలోదకాలు ఇస్తూ తూట్లు పొడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు వ్యవసాయం చేయడానికి ఇబ్బందులు పడుతున్నా వారి రుణాలను మాఫీ చేయని మోదీ సర్కారు.. కార్పొరేట్లకు రుణ మాఫీ చేయడం దారుణమన్నారు. నరసన్నపేటలో అక్రమ కట్టడాలు పెరుగుతున్నాయని, అధికార పార్టీ నాయకుల అండతోనే అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్కు నివాళి అర్పించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వంట గ్యాస్కీ తిప్పలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఇప్పటివరకు కమర్షియల్ గ్యాస్కే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పు డు ఇంటిలో వంట గ్యాస్కు కూడా తిప్పలు తప్పడం లేదు. ఇదే అదనుగా కొన్ని గ్యాస్ ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇప్పటికే జిల్లాలో చాలా దుకాణాలు, హొటళ్లు, ప్రైవేటు వసతి గృహాలు, ఇలా పలు వ్యాపార కేంద్రాలు మూతపడ్డాయి. అయితే ప్రభుత్వం, గ్యాస్ కంపెనీల అధికారులు గృహావసర వంటగ్యాస్ కొరత లేదని ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వంట గా్య్స్కు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిలిండర్లు ప్రైవే టు మార్కెట్కు వెళ్లిపోతుండడం, అధిక ధరలకు అడ్డగోలుగా విక్రయిస్తుండడం కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో బ్లాక్ మార్కెట్లో విరివిగా వంట గ్యాస్ సరఫరా అవుతోంది. ముఖ్యంగా నగరంలో కొత్తగా ఏర్పడిన రెండు ఏజెన్సీల్లో ఈ అక్రమాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గృహ అవసరాలకు సిలిండర్ ఆన్లైన్లో బుక్ చేసి మూడు వారాలు గడిచినా చాలా మందికి బండ అందలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే కొరత ఉంది. బ్లాక్ మార్కెట్ చీకటి వ్యాపారం కూడా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ స్థాయిలో జరుగుతోంది. ఇటీవల గ్యాస్ ఇవ్వడం లేదని ఇచ్ఛాపురానికి చెందిన వ్యాపారులు నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం నగరంలో రెండు మూడు ఏజెన్సీల్లో అడ్డగోలుగా బ్లాక్ మార్కెట్ విక్రయాలు జరుగుతున్నాయి. ఆ రెండు రాజకీయ నాయకులకు చెందినవి కావడంతో వాటి జోలికి అధికారులు వెళ్లడం లేదు. ఇందులో ఒక ఏజెన్సీ యజమాని స్థానికంగా ఉండరు. కేవలం సిబ్బందిపై ఆధారపడి ఈ ఏజెన్సీని నడపడంతో సిబ్బంది అడ్డగోలు ఆదాయానికి ఆశపడి అఽధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఫిర్యాదు చేసినా.. జిల్లా కేంద్రంలోని రెండు ఏజెన్సీలపై వందలాది ఫిర్యాదులు ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వారు ఇష్టారాజ్యంగా కమర్షియల్ సిలిండర్, డొమెస్టిక్ సిలిండర్ అనే తేడా లేకుండా ఒక్కో బండపై రూ.1500 నుంచి రూ.3000 వరకు అదనంగా వసూలు చేస్తూ అమ్మకాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమావేశమైనా ఉందా..? గ్యాస్ కొరతతో జనం అల్లాడుతున్నా ఉన్నతాధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు కనీసం సమావేశాలైనా నిర్వహించలేదు. సమస్యను పరిష్కరించే మార్గం వెతకడం లేదు. జిల్లాలో 39 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నా యి. ప్రధానంగా బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసిఎల్ వంటి సంస్థలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 6,92,825 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సగటున ప్రతి వారంలో 13 వేలు వరకు బండలు అవసరం ఉంది. అయితే సిలిండర్ల కొతర చూపడంలో వినియోగదారులు అధికంగా బక్ చేయడంతో సమస్యలు వస్తున్నాయి. గడువును నిర్ణయించడంతో కూడా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. బుక్ చేసిన మూడు వారాలైనా అందని గ్యాస్ బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు వంట గ్యాస్ స్పందించని అధికారులు -
ప్రభుత్వ భూమిలో టీడీపీ నాయకుల ఇళ్ల నిర్మాణం
గార: విలువైన ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా టీడీపీ వర్గీయులు ఆక్రమించుకుంటున్నారు. మండలంలోని శ్రీకూర్మం గ్రామంలోని బస్టాండ్ సమీపంలో సర్వే నంబర్ 600 లో 0.12 సెంట్లు ప్రభుత్వం స్థలం ఉంది. ఈ స్థలాన్ని గత ప్రభుత్వంలో శ్రీకూర్మనాథుని దర్శనం కోసం వచ్చే దూర ప్రాంత భక్తుల కోసం ఉచిత గదులతో పాటు కల్యాణ మంటపం నిర్మించాలన్న ఆలోచనతో ఢిల్లీకి చెందిన ఆదిలీలా ఫౌండేషన్కు అప్పగించింది. దీనికోసం అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. తర్వాత ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ స్థలంపై స్థానిక టీడీపీ నాయకుల కన్ను పడింది. నియోజకవర్గ ఎమ్మెల్యే సహకారంతో స్థానికులైన ముగ్గురు పేరున పట్టాలు ఇచ్చారని ప్రచారం జరిగింది. దీంతో గ్రామంలోని మంగళవారం అన్ని పార్టీలకు చెందిన పలువురు వెళ్లి నిర్మాణం జరుగుతున్న పనులును నిలిపేశారు. ప్రభుత్వం ఆదిలీలా ఫౌండేషన్కు ఇచ్చిన స్థలంలో ఎలా ఇళ్లు నిర్మిస్తారని నిలదీశారు. గత ఏడాది ఈ స్థలంలో నిర్మాణాలు ప్రారంభించేందుకు ప్రయత్నించగా పత్రికల్లో వార్తలు రావడతో అధికారులు నోటీసులు ఇచ్చి పనులను నిలిపేశారు. ప్రస్తుతం అధికార బలంతో పట్టాలు తెచ్చామని పనులు చేయడంపై స్థానికులు పీజీఆర్ఎస్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. -
ఫేక్ ప్రచారంపై వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదు
నరసన్నపేట: బాపు బొమ్మ స్పీక్ అనే ట్విట్టర్(ఎక్స్) ఖాతా ఉంచి ఫేక్ స్క్రీన్ షాట్ సృష్టించి.. అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిందని కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారని, పార్టీ అభివృద్ధిని ఓర్వలేకే కొందరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. నరసన్నపేటలోని పార్టీ కార్యాలయం వద్ద ఎంపీపీ ఆరంగి మురళి, నాయకులు కరిమి రాజేశ్వరరావు, ముద్దాడ బైరాగినాయుడు, రాజాపు అప్పన్న, చింతు రాఘవరావు, సురంగి నర్శింగరావు, బొబ్బాది ఈశ్వరరావు తదితరులు మాట్లాడుతూ ఫేక్ స్క్రీన్ ప్రచారాన్ని తప్పుపట్టారు. దీనికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు నరసన్నపేట ఎస్సై బి.గణేష్కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో నరసన్నపేట సోషల్ మీడియా ప్రతినిధులు పి.రమణ, రామకుమార్, అరవిందు పాల్గొన్నారు. -
బాబోయ్ కింగ్ కోబ్రా
ఇచ్ఛాపురం రూరల్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు చీకటిలో సుమారు పది అడుగుల కింగ్ కోబ్రాను మంగళవారం రాత్రి స్థానికులు గుర్తించారు. ఆందోళనకు గురైన ప్రజలు స్నేక్ హెల్ప్లైన్కు సమాచారం అందివ్వడంతో స్నేక్ క్యాచర్ రామచంద్ర జగన్నాథ్ సాహు సంఘటనా స్థలానికి చేరుకొని కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకొని దగ్గర్లో ఉన్న అడవుల్లో విడిచిపెట్టారు. గత వారం రోజుల నుంచి ఒడిశా జయంతిపురం, పాత్రపురం గ్రామాల్లో భారీ కింగ్ కోబ్రాలు సంచరిస్తుండటంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. అంబులెన్స్లు ఇలా.. సేవలు ఎలా..? పాతపట్నం: అత్యవసర సమయాల్లో రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్ 108 వాహనంతో పాటు కోవిడ్ సమయంలో సీహెచ్సీకి అదనంగా ఇచ్చిన అంబులెన్స్ ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. పాతపట్నం సీహెచ్సీ ఆస్పత్రిలో ఈ వాహనాలు తుప్పు పట్టి, మూలన పడి ఉన్నాయి. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన అంబులెన్స్కు రంగులు వేసి ఉపయోగిస్తున్నారు. 108కు ఫోన్ చేస్తే అత్యవసర సేవలు అలస్యం అవుతున్నాయని బాధితులు పేర్కొంటున్నారు. నేటి నుంచి ఈయూ రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం అర్బన్: ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 28వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో బుధవారం జరగనున్నాయి. ఈ మహాసభలకు హాజరయ్యేందుకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి ఈయూ నాయకులు మంగళవారం బస్సులో బయలుదేరి వెళ్లారు. యూనియన్ ముఖ్య అంశాలు, ఉద్యోగుల సమస్యలు, భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించనున్నట్లు యూనియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. నూతన రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఈయూ నాయకులు ఎస్.వి.రమణ, జి.వి.రమణమ్మ, సనపల శ్రీనివాసరావు, డి.సుజాత, ఎం.వనజాక్షి, డి.బి.మూర్తి, కె.వై.బాబు, ఆర్ఎస్రావు, వై.కె.కుమార్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
చిరుద్యోగి అరెస్ట్ అన్యాయం
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న చిరుద్యోగిని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అరెస్ట్ చేయించి శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించడం అన్యాయమని ఏపీఎస్ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న క్రమంలో స్వీపింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్న రెల్లి కులస్తుడైన ఆకుల శీనును పనితీరు బాగోలేదనే కారణంతో ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా నేరుగా స్టేషన్లో పెట్టండని కలెక్టర్ ఆదేశించడం దారుణమన్నారు. అంబేద్కర్ జయంతి రోజునే ఎస్సీ వర్గానికి చెందిన ఉద్యోగిని అరెస్ట్ చేయడం రాజ్యాంగ హక్కుని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. దీనిని ఏపీఎస్ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు టి.తిరుపతిరావు, ముత్యాలరావు, కిరణ్, నవీన్, అనిల్, ఈశ్వరమ్మ, జయంతి, పూర్ణ, సత్యవతి, పార్వతమ్మ, కార్మికులు పాల్గొన్నారు. సిబ్బంది పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం.. శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దూరప్రాంతాలకు, మారుమూల గ్రామాలకు నిత్యం వేలమంది ప్రయాణిస్తుంటారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉందన్నారు. కాంప్లెక్స్ ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, ఎటువంటి చెత్త, చెదారం లేకుండా చూడాలన్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఔట్సోర్సింగ్ సిబ్బంది పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్.అప్పలనారాయణ, ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్ఎస్ శర్మ, శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల అసిస్టెంట్ మేనేజర్లు పి.సంతోష్కుమార్, ఎ.గంగరాజు, ఆర్టీసీ ఎస్ఎం ఎంపీ రావు, ఆర్టీసీ అధికారులు ఎఎన్ఎస్ శ్రీనివాస్, రాజు, ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
జనగణనకు శ్రీకారం
● తొలిసారిగా స్వీయ నమోదుకు అవకాశం ● స్వగ్రామాల్లో లేనివారికి ఉపయోగకరం ● గత గణనలో జిల్లా జనాభా సంఖ్య 28 లక్షలు స్వీయ నమోదు ఇలా.... స్వీయగణన కోసం ‘ఎస్ఈ.సీఈఎన్ఎస్యూఎస్.జీఓవీ.ఇన్’ వెబ్సైట్ నుంచి లింక్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ లోనికి వెళ్లి రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని అందులో ఉన్న క్యాప్చాను నమోదు చేయాలి. అటు తరువాత కుటుంబ యజమాని పేరు, మొబైల్ నెంబర్ నమోదు చేస్తే ఫార్మేట్ తెరుచుకుంటుంది. ఇందులో భాషను ఎంపిక చేసుకుని, ఓటీపీ నమోదు చేసి, లొకేషన్ వివరాలను నమోదు చేయాలి. అటు తర్వాత కుటుంబానికి సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలను నింపాలి. అన్నీ మరోసారి సరిచూసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 11 అంకెల సెల్ఫ్ యాన్యుమరేషన్ ఐడీ నెంబర్ జనరేట్ అవుతుంది. దీనిని ఓ చోట రాసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. జనగణన సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడీ నంబర్ను చెబితే వారు మరోసారి చూసుకొని సబ్మిట్ చేస్తారు. ఏవైనా తప్పులు దొర్లినా, మార్పులు చేసుకోవాలన్నా సిబ్బంది సమక్షంలో సరిచేసుకునే అవకాశం కూడా ఉంటుంది. శ్రీకాకుళం : రాష్ట్రంలో 2011 తర్వాత చేపడుతున్న జనగణనలో తొలిసారిగా స్వీయ నమోదు ప్రవేశపెట్టారు. ప్రజలే తమ వివరాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా నమోదు చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా చేపడుతున్న జనగణన కోసం భారీ కసరత్తు జరుగుతుంది. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కలను సేకరించేందుకు ఏర్పాటు చేశారు. మే ఒకటి నుంచి 31 వరకు మొదటి విడత లెక్కింపు చేపడతారు. ఈ ప్రక్రియ ప్రారంభానికి 15 రోజులు ముందుగా అంటే మే 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ జనగణనకు అవకాశం కల్పించారు. దేశ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కీలకంగానున్న జనగణనలో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యేలా అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాలను చేస్తున్నారు. జిల్లాలో 2011 ప్రకారం 28 లక్షల జనాభా ఉన్నారు. 15 ఏళ్ల తర్వాత జనగణన.. జిల్లాలో 2011లో చివరిసారిగా జనగణన జరిగింది. 2021లో కరోనా కారణంగా లాక్డౌన్ పరిస్థితుల్లో జనగణనను చేపట్టలేకపోయారు. ప్రస్తుతం 2026–27 జనగణన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే తెలియజేసింది. డేటా గోప్యతకు ప్రాధాన్యత.. ప్రజల వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచేందుకు గాను స్వీయ గణనకు అవకాశం కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం డిజిటల్ విధానంలో ఉంటుంది. స్థానికంగా అందుబాటులో లేని వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జనగణనను రెండు దశల్లో చేపట్టనున్నారు. తొలిదశ మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు జరగనుండగా ఇందులో ఇళ్ల వివరాలు, సదుపాయాలను తెలుసుకుంటారు. రెండో దశలో జనాభా లెక్కింపు సామాజిక, ఆర్థిక, సాంస్కతిక స్థితిగతులు ఆధారంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి సిబ్బందికి శిక్షణ ప్రక్రియ జరుగుతుంది. -
●అగంతకుల ఆచూకీ కోసం..
శ్రీకాకుళం క్రైమ్ : కాశీబుగ్గ కేంద్రంగా వెంకటేశ్వర జ్యూయలరీ షాపులో దోపిడీ కేసుకు సంబంధించి అగంతకుల ఆచూకీ కోసం పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు బృందాలు గాలింపు చేస్తుండగా ఇప్పటికే నలుగురు నిందితులు ఒడిశాలో పట్టుబడినట్లు విశ్వసనీయ సమాచారం. వీరి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేలా విచారణాధికారులు కృషి చేస్తున్నారు. దుండగులు ఉపయోగించిన కారును సైతం ట్రేసవుట్ చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ దోపిడీలో స్థానికుల హస్తం సైతం ఉందన్న కోణంలో కొందరిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కాశీబుగ్గ వ్యాపార వర్గాల్లో ఈ దోపిడీ కాస్తా కలకలం రేపిందనే చెప్పాలి. పన్నుల అధికారులు సైతం నిఘా పేరిట కన్నేయడంతో జీఎస్టీలు ఎగ్గొట్టి వ్యాపారాలు చేస్తున్న వారు కలవరపడుతున్నారు. -
విరామ సమయం
అరసవల్లి: తీరం నిశ్శబ్దం కానుంది. ఇంజిన్ల ఘోష నుంచి సంద్రానికి విరామం లభించనుంది. మత్స్య సంపద పునరుత్పత్తి కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు జిల్లాలోని సముద్ర తీరంలో వేట నిలిచిపోనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఏపీ మైరెన్ ఫిషింగ్ యాక్ట్ 1994 ప్రకారం ఏటా ఇలా ఈ 61 రోజుల పాటు వేట నిషేధ కాలంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో తీరంలో వేటకు వెళ్లకుండా ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా ‘మత్స్యకార సేవల’ కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల నగదు బదిలీ చేయనుంది. నిబంధనల ప్రకారం మోటరైజ్డ్ పడవ యజమానితో పాటు ఆరుగురు, సంప్రదాయ పడవ యజమానితో కలిపి ముగ్గురు అర్హులుగా గుర్తించి వారికి ఆర్థిక సాయాన్ని అందజేస్తుంటారు. అయితే జిల్లాలో అర్హుల సంఖ్య తగ్గిపోతోందనే ఆరోపణలు ఉన్నాయి. 2024 వరకు అర్హులుగా ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ కింద భృతి పొంది న వందలాది మంది మత్స్యకారులకు 2025 జాబితాలో చోటు దక్కలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మత్స్యకార సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తిన సంగతి విదితమే. అర్హుల గుర్తింపులో మల్లగుల్లాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ఏడాది మత్స్యకార సేవల పేరుతో జమ చేసిన మొ త్తంలో పెద్ద సంఖ్యలో అనర్హులకే లబ్ధి చేకూరినట్లు గా పెద్దెత్తున విమర్శలు రావడంతో ఈసారి అర్హుల గుర్తింపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అర్హుల సంఖ్య తగ్గింపునకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. తమ వాళ్లకు ఎలాగైనా ఈ లబ్ధి అందాలంటూ స్థానిక కూటమి నేతల సిఫారసులతో సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక జిల్లాలోనే మత్స్యకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతిని ధ్యం వహిస్తుండడంతో సిఫారసుల్లో తగ్గేదేలా అంటూ కూటమి నేతలు తమ జాబితాలను జిల్లా మత్స్యశాఖ కార్యాలయానికి ఇప్పటికే చేర్చేశారు. ఎలాగైనా తమ వాళ్లు పేర్లు ఉండాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఆర్థిక భారం పడకూడదని.. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని కార్పొరేషన్ల నుంచి ప్రభు త్వ ఆస్తులను తనఖా పెట్టి మరీ అప్పులు చేస్తున్న ప్రభుత్వానికి సంక్షేమ పథకాల అమలు పెద్ద సవాల్గా మారింది. తాజాగా సంక్షేమ క్యాలండర్ ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరంలో మత్స్యకార సేవలే తొలి సంక్షేమ పథకం కానుంది. దీంతో ఎలాగైనా రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం కాకుండా ఉండే లా అధికారులు తగిన చర్యలు చేపట్టాలంటూ ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఎలాగైనా అర్హుల జాబితాను తగ్గించేందుకు ఎలాంటి ప్రయోగాలు చేయాలో.. అధికారులకు సెలవిచ్చారు. దీంతో రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు స్థానిక జిల్లాలో కూడా మత్స్యకార ఆర్ధిక సహాయానికి అర్హుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒకే రోజున ఎన్యూమరేషన్ జరిగితే.. ఉన్నవాళ్లను మాత్రమే లెక్కించేసి, బోట్ల లెక్కల ప్రకారం అర్హుల సంఖ్యను కుదించేలా ప్రణాళికను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఈనెల 17న ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 11 తీర ప్రాంత మండలాల్లో ప్రత్యక్ష సమాచార సేకరణ నిర్వహించి, 23న సచివాలయాల్లో ప్రాథమిక లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించి, 25వ తేదీ వరకు దీనిపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం ఈనెల 27న తుది జాబితాను కలెక్టర్ ఆమోదించేలా సిద్ధం చేసి 30వ తేదీన ప్రభుత్వ నిర్ణయం మేరకు డీబీటీ ద్వారా నగదును అర్హుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. గత ఏడాది మత్స్యకార సేవలు పొందిన వారు 15548 తీర ప్రాంత గ్రామాలు 104 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు 61 మత్స్యకార జనాభా సుమారు 1.40 లక్షల మంది జిల్లాలో తీర ప్రాంత మండలాలు 11 మోటరైజ్డ్ బోట్లు 1623 ఈ ఏడాది మత్స్యకార సేవల కింద వేట నిషేధ కాలంలో తీర మత్య్సకార అర్హులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున నగదు బదిలీ కానుంది. ఈ మేరకు అర్హుల గుర్తించేందుకు ఈనెల 17న ఒక్కరోజే ఎన్యూమరేషన్ చేపట్టనున్నాం. ఈ ప్రక్రియలో కచ్చితంగా మా అధికార సిబ్బంది ప్రత్యక్షంగా వెళ్లి సమాచారాన్ని సేకరణ చేయనున్నాం. అనర్హులకు ఈ లబ్ధి అందకుండా చర్యలు చేపడుతున్నాం. – వై.సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ -
స్టేషన్లో గంటల తరబడి ఉంచుతారా..?
ఆమదాలవలస: మంత్రి అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ క్యాడర్పై పోలీసుల లాఠీచార్జి చేయడం, నోటీసులు ఇచ్చి స్టేషన్లకు తరించడం సరికాదని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నా రు. పోలీసులు పార్టీ క్యాడర్కు, కొంతమంది కార్యకర్తలకు నోటీసులు జారీ చేసి సోమవారం 10 గంటలకు పోలీస్స్టేషన్కు హాజరవ్వాలని చెప్పారని, స్టేషన్కు వెళ్తే గంటల తరబడి ఉంచేయడం సరికాదని అన్నారు. కక్ష కట్టి నేరస్తులుగా చూడడం పోలీసులకు తగదన్నారు. పోలీస్స్టేషన్కు వెళ్లిన వారిలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, దన్నాన అజయ్, దుంపల శ్యామలరావు,పొడుగు శ్రీనివాసరావు, రామ్మోహన్ తోపాటు మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు. -
కుక్కలు.. భౌబోయ్..!
● జిల్లాలో కుక్కల స్వైర విహారం ● విచ్చలవిడిగా దాడులు చేస్తున్న వైనం ● బెంబేలెత్తిపోతున్న ప్రజలు హిరమండలం: జిల్లాలో కుక్కల బెడద రోజురోజుకూ ఎక్కువవుతోంది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ప్రతిచోట స్వైర విహారం చేస్తున్నా యి. పట్టణాల్లోని ప్రధాన రహదారులు, రద్దీ ఉన్న ప్రాంతాల్లో సైతం గుంపులుగా సంచరిస్తూ అటువైపుగా వచ్చేవారిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. అధికారులు శస్త్ర చికిత్సల పేరుతో లక్షలా ది రూపాయలు ఖర్చు చేసినట్టు గణాంకాలు చూపిస్తున్నారే తప్ప, వీటిని కట్టడి చేసే ప్రయత్నం చేయడం లేదు. గతేడాది 43,294 మంది కుక్కకాటు బాధితులుగా జిల్లాలో నమోదయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఎక్కువగా.. జిల్లాలో గతేడాది జనవరి, ఫిబ్రవరి, నవంబర్లో ఎక్కువగా కుక్కకాట్ల కేసులు నమోదయ్యాయి. వేసవిలో కొంత తగ్గాయి. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో వీటి బెడద ఎక్కువగా ఉంది. ఆయా చోట్ల వీటి నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఇటీవల శ్రీకాకుళంలోని సర్వజన ఆస్పత్రిని ప్రపంచ బ్యాంకు సర్వే బృందం సందర్శించింది. ఆ సమయంలో కుక్కకాటు బాధితుల ఓపీ చూసి ఆశ్చర్యపడింది. జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ, పలాస–కాశీబుగ్గ, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలు ఉన్నాయి. 12 మేజర్ పంచాయతీలు కొనసాగుతున్నాయి. 777 పంచాయతీలుగా ఉన్నాయి. అయితే మున్సిపాలిటీల్లో అస్సలు కుక్కల నియంత్రణ చర్యలు కానరావడం లేదు. కుక్కల నియంత్రణకుగాను వాటి సంరక్షణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు, వాటికి ఆహారం వంటివి సమకూర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒక్క శ్రీకాకుళం నగరంలో 2021 నుంచి 2025 వరకు రూ.73.8 లక్షలు ఖర్చుచేసి 5,203 శస్త్రచకిత్సలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ మిగతాచోట్ల మాత్రం అటువంటివేమీ కనిపించడం లేదు. ఇప్పటికై నా యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుక్కకాటు చాలా ప్రమాదక రం. కరిచిన వెంటనే యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు వేసుకోవాలి. హిరమండలంలో ఇటీవల 10 మంది కుక్కకాటుకు గురయ్యారు. వారికి తక్షణ వైద్య సాయం అందించాం. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందికర మే. అందుకే కరిచిన వెంటనే ఆస్పత్రికి రావాలి. – పి.సాయికుమార్, వైద్యాధికారి, హిరమండలం పీహెచ్సీ -
ఘనంగా ఆదిత్యుని కల్యాణం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణం సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సంద ర్భంగా శ్రీ ఉషా పద్మిని ఛాయా దేవేరులతో శ్రీ సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను కల్యాణ మూర్తులుగా అలంకరించి ఆగమశా స్త్రం ప్రకారం కల్యాణ సేవను అర్చకులు పూర్తి చేశారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్శర్మ ఈ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా వేదమంత్రో చ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించారు. శ్రీకాకుళం : జిల్లాలో త్వరలో ప్రారంభం కానున్న జనగణన– 27లో డిజిటల్ విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ వివరాలను శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్, జనగణన నగర ఇన్చార్జి కూర్మారావు ‘సాక్షి’కి తెలిపారు. ప్రజలు తమ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి వారు సూచించిన మేరకు ఓ లింకును డౌన్లోడ్ చేసుకుని కుటుంబ యజమాని ఆధార్ కార్డ్ నంబర్, సెల్ నంబర్తో నమోదు కావచ్చని తెలిపారు. అందులో పొందుపరిచిన 31 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను నమోదు చేసి వాటిని మరోసారి చూసుకొని సబ్మిట్ చేయాలని సూచించారు. సబ్మిట్ చేసిన తర్వాత ఓ నంబర్ వస్తుందని, దాన్ని జాగ్రత్తగా ఉంచాలని చెప్పారు. జనగణన ఎన్యుమరేటర్ ఇళ్లకు వచ్చినప్పుడు ఆ నంబర్ను చెబితే వారు ఆ సమాచారాన్ని సరిచూసుకొని సబ్మిట్ చేస్తారని అక్కడితో జనగణన నమోదు పూర్తయినట్లేనని పేర్కొన్నారు. ఏప్రి ల్ 16 నుంచి డిజిటల్ జనగణన విధానం అమల్లోకి వస్తుందని 30వ తేదీలోగా పూర్తి చేయా లని చెప్పారు. ఎన్యుమరేటర్ వచ్చే సమయాని కి తాము ఊరిలో లేమని, ప్రయాణాలు వా యిదా వేసుకోవాల్సి వస్తుందన్న చింత ప్రజల కు లేకుండా ఉండేందుకే ఈ డిజిటల్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పోలీసువారి శిక్ష
శ్రీకాకుళంకుక్కలు.. భౌబోయ్కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వరుస పెట్టి దాడులకు దిగుతున్నాయి. –8లో● టెక్కలి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ● పోలీసుల నోటీసులతో టెక్కలి పోలీస్ స్టేషన్కు హాజరైన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ● విచారణ పేరుతో గంటల తరబడి స్టేషన్లోనే ఉంచేసిన వైనం ● పెద్ద ఎత్తున నిరసనకు దిగిన వైఎస్సార్ సీపీ శ్రేణులు ● తిలక్ భార్య భార్గవితో కలిసి రోడ్డు డివైడర్పై నిరీక్షించిన ధర్మాన కృష్ణదాస్, నాయకులు ఇదో రకం కక్ష.. ఖాకీలతో ఓ ఖద్దరు చొక్కా వేయించిన శిక్ష. తెగువ చూపినందుకు, నిజాలు చెప్పినందుకు విపక్ష నాయకులపై జరిగిన వివక్ష. ధిక్కార గళాన్ని వినలేక, తనపై జరిగిన తిరుగుబాటును తట్టుకోలేక పెద్ద నేత చేయించిన రాజ్యాంగ హననానికి టెక్కలి పోలీస్స్టేషన్ వేదికై ంది. నోటీసులు ఇవ్వడం, స్టేషన్కు రప్పించడం, సాయంత్రం వరకు అక్కడే ఉంచడం వంటి ఉద్దేశపూర్వక చర్యలతో రాజకీయం బట్టబయలైంది. జిల్లాలో రెడ్బుక్ రాజ్యాంగమే అమలవుతోందని స్పష్టమైంది. టెక్కలి/టెక్కలి రూరల్: టెక్కలి పోలీస్స్టేషన్ రాజకీయ డ్రామాకు వేదికై ంది. మహానేత వైఎస్సార్ మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇటీవల వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో టెక్కలిలో చేపట్టిన నిరసన కార్యక్రమంపై పోలీసులు ఇచ్చిన నోటీసులను గౌరవిస్తూ వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ సోమవారం టెక్కలి పోలీస్స్టేషన్కు హాజరయ్యారు. అయితే విచారణ పేరుతో ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు తిలక్ను బయటకు వదలకపోవడంపై వైఎస్సార్సీపీ నాయకులంతా నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ శ్రేణులను కట్టడి చేయడానికి ముందస్తు ప్లాన్ ప్రకారం.. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐల తో పాటు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో టెక్కలి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వా ణి, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, కోటబొ మ్మాళి జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, పార్టీ మండల అధ్యక్షులు హెచ్.వెంకటేశ్వర్రావు, ఎస్.హేమసుందర రాజు, టి.ఫల్గుణరావు, నాయకులు సత్తారు సత్యం, తమ్మన్నగారి కిరణ్, చిన్ని జోగారావు, ఆట్ల రాహుల్ , పోలాకి లక్ష్మి, రాములమ్మ, యర్ర చక్రవర్తి, కె.అజయ్, కోత సతీష్తో పాటు టెక్కలి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలంతా మండుటెండలో నడిరోడ్డుపై బైఠాయించి తిలక్ను విడిచిపెట్టాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ప్రత్యేక బలగాలతో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను నెట్టివేసే చర్యలకు దిగారు. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, పార్టీ ఆమదాలవలస, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్తలు చింతాడ రవికుమార్, సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, ధర్మాన కృష్ణచైతన్య తదితరులు టెక్కలి పోలీస్స్టేషన్ వద్దకు చేరుకుని తిలక్ను కలిసే ప్రయత్నం చేయగా, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో స్టేషన్ బయట తిలక్ భార్య నందిగాం జెడ్పీటీసీ పేరాడ భార్గవితో కలిసి డివైడర్పై నిరీక్షించారు. అనంతరం సాయంత్రం 6 గంటల తర్వాత తిలక్ను విడిచిపెట్టడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలంతా నినాదా లు చేస్తూ టెక్కలి పార్టీ కార్యాలయానికి చేరుకున్నా రు. మీడియాను సైతం స్టేషన్ ఆవరణకు అనుమతించకుండా ఆంక్షలు విధించారు. తిలక్కు మద్దతుగా పలాస నియోజకవర్గం పరిశీలకుడు ఎన్ని ధనుంజయ్, నాయకులు ఎం.బైరాగినాయుడు, నర్తు నరేంద్ర, ఆరంగి మురళి, మామిడి శ్రీకాంత్, జి.గురునాధ్ యాదవ్, కె.బాలకృష్ణారావు, కె.కృష్ణారావు, పి.రమేష్, ఆర్.ఉమామల్లేశ్వర్రావు, ఎన్.సత్యరాజ్, ఎం.అశోక్, కె.నారాయ ణ మూర్తి, కె.జీవన్, బి.రాజేష్, జి.మోహన్రెడ్డి, వి.శ్రీధర్రెడ్డి, జె.తిరుమలరెడ్డి, కె.సంజీవ్, బి.వెంకటరమణ, బి.కూర్మారావు, జి.సోమేష్, డి.రామకృష్ణారెడ్డి, ఎన్.సాబతో, బి.కార్తీక్, జె.జయరాం, డి. లోకేశ్వర్రెడ్డి, బి.కామరాజు, పి.వెంకట్రావు, బి.రాకేష్, ఎ.విష్ణు, కె.కామేష్, ఎస్.జనార్ధన్రెడ్డి, ఎస్.వినోద్, బి.దివాకర్, పి.మోహన్,టి.విమల, ఆర్.కూర్మారావు, ఎ.లోకనాధం, ఆర్.జయమోహన్, ఎస్.సుధాకర్, ఎం.నాగభూషణ్, మాధవరావు, డి.నీలకఠం, బి.మోహన్, నరేష్, లెనిన్, బి.ఉదయ్, కె.రామరాజు తదితరులు నిలిచారు. -
ప్రజలకు అందుబాటులో రైల్వే సేవలు
ఆమదాలవలస: జిల్లా ప్రజలకు రైల్వే సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం తన వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతికి రైల్వే శాఖ నూతనంగా మంజూరు చేసిన రైలును శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదివరకు జిల్లా ప్రజలు వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడానికి ప్రయాణం చేయాలంటే విశాఖపట్నం లేదా ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణం సాగించేవారన్నారు. కానీ ఇప్పుడు జిల్లా నుంచే వెళ్లే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. త్వరలో శ్రీకాకుళం రోడ్డు నుంచి హైదరాబాద్ వెళ్లడానికి కూడా మరో రైలు ప్రారంభించడానికి ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం లలిత్ బోహారా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
400 నాటుసారా ప్యాకెట్లు స్వాధీనం
కంచిలి: సోంపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ ఆధ్వర్యంలో నాటుసారా రవాణా, అమ్మకాలపై వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం తనిఖీలు చేపట్టారు. పాత నేరస్తులపై నిఘా ఉంచి, గత నేర చరిత్ర కలిగిన పులకపుట్టుగ గ్రామానికి చెందిన పులక లక్ష్మణరావు అనే వ్యక్తి నాటుసారా రవాణా చేస్తున్న సమాచారంతో నిఘా పెట్టారు. దీంతో ఆయన ఒడిశా తుటుపురం నుంచి 300 నాటుసారా ప్యాకెట్లను ద్విచక్ర వాహనంపైన రవాణా చేస్తుండగా.. ఆదివారం సంత దగ్గర కాపుకాసి పట్టుకున్నారు. ఇతని నుంచి నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. అదేవిధంగా మఠం సరియాపల్లి గ్రామంలో నాటుసారా అమ్ముతున్న రత్నాల హేమలత, బొండాడ మోహనరావుల నుంచి 100 నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. బొండాడ మోహనరావు, పులక లక్ష్మణరావులు గతంలో పలు కేసుల్లో ముద్దాయిలు. వీరి ముగ్గురినీ సోంపేట కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ జీవీ రమణ తెలిపారు. ఒడిశా నుంచి నాటుసారా రవాణా అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. నాటుసారాపై ఏదైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 14405 లేదా 94409 02358 నంబర్కు తెలియజేయాలని కోరారు. దాడుల్లో ఎస్ఐ జగన్నాథ్, సిబ్బంది భాను ప్రసాద్, ఉమాపతి, మార్కారావు తదితరులు పాల్గొన్నారు. -
రైతులపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది
గార: రైతులపై కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభా గం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీపీ గొండు రఘురా మ్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట, ఎండబెట్టిన పంటలను పలువురు నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలకు మద్దతు ధర దక్కక శ్రమ దోపిడీ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరిపంట వద్దు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని ప్రభుత్వం చెప్పడమే గానీ రైతులను ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్వింటాకు రూ.2,200ల మద్దతు ధర ఇచ్చినట్లు గుర్తు చేశారు. అందువలన రైతులు మొక్కజొ న్న సాగు అధికంగా చేశారన్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులకు యూరియా కూడా ఇవ్వలేని పరిస్ధితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని దుయ్యబట్టా రు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిచి, మద్దతు ధరకు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. లేదంటే పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ నియోజకవర్గ రైతు విభా గం అధ్యక్షుడు పీస శ్రీహరిరావు మాట్లాడుతూ.. యూరియా కోసం ఆపసోపాలు పడాల్సి వచ్చిందని, ఇంతటి అసమర్థ ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ మూకాళ్ల తాతబాబు మాట్లాడుతూ డీజిల్ ఇంజిన్లు ద్వారా సాగునీరు పెట్టుకోవడంతో మదుపులు పెరిగాయని, మద్ధతు ధర దక్కకపోతే నష్టాల పాలవుతారన్నారు. కార్యక్రమంలో గార, శ్రీకాకుళం మండల రైతు విభాగం అధ్యక్షులు శిమ్మ ధర్మరాజు, బగ్గు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బందికి ఇబ్బంది
శ్రీకాకుళం: ప్రజా ప్రతినిధుల ప్రచార ఆర్భాటాలు సిబ్బందికి తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి జిల్లా కేంద్రంలో పలు పనులను ప్రారంభించి బైక్ నడిపారు. ఆయన బైక్పై కలెక్టర్ కూడా ఉన్నారు. ఆపక్కనే ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా బండి తీశారు. దీంతో వీరికి భద్రత కల్పించాల్సిన వారు ద్విచక్ర వాహనాల వెనుక కిలో మీటర్ మేర పరుగులు పెట్టారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఇటీవల ప్రయాణికులు ఉన్న ఓ బస్సును నడిపారు. టెక్కలిలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా బైక్ నడుపుతుంటారు. వీరి ప్రచార ఆర్భాటం భద్రత సిబ్బందికి సవాల్ విసురు తోంది. దీన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా ప్రజాప్రతినిధులకు ఈ విషయాన్ని చెప్పలేకపోతున్నారు. ఇటీవల సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు పెరగడంతో వారితో పాటు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎచ్చెర్ల: మండలంలో కుశాలపురం గ్రామానికి సమీపంలోని ఫ్లై ఓవర్పై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం రూరల్ మండలంలోని భైరి గ్రామానికి చెందిన కొంగరాపు రంగయ్య మృతి చెందగా, బూరె లక్ష్మణరావుకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం రూరల్ మండలం భైరి గ్రామానికి చెంది న బూరె లక్ష్మణరావు, కొంగరాపు రంగయ్యలు మేకను అమ్మేందుకు లావేరు మండలంలోని బుడుమూరు సంతకు మోపెడ్పై వెళ్లారు. మేకను సంతలో అమ్మి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా వాహ నం నడుపుతున్న లక్ష్మణరావు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక కూర్చున్న రంగయ్య రోడ్డుపై పడ్డారు. దీంతో రంగయ్య (50) తలకు తీవ్రంగా గాయమై అక్కడికక్కడే మృతి చెందగా, లక్ష్మణరావుకు గాయాలయ్యాయి. 108 సాయంతో వీరిని రిమ్స్కు తరలించారు. రంగయ్య కుమారుడు లక్ష్మీనారాయ ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగయ్యకు భార్యతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్లో సోంపేట యువకుడు మృతి సోంపేట: పట్టణానికి చెందిన యువకుడు వికాష్కుమార్ నెపాక్ హైదరాబాద్లో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సోంపేటలోని నేతాజీ నగర్లో నివాసముంటున్న ఉపాధ్యాయుడు లింగరాజ్ నెపాక్ కుమారుడు వికాష్కుమార్ నెపాక్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం జరిగిన రహదారి ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. వికాష్ మృతితో నేతాజీ నగర్లో విషాదచాయలు అలముకున్నాయి. -
●దారిలో గోడ కట్టేశారు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా కేంద్రంలోని కంపోస్టు కాలనీలో దాదాపుగా నివసించేదంతా నిరుపేదలే. హుద్హుద్ సమయంలో అక్కడ పేదలకు నివాస గృహాలు అందించారు. అయితే ఇక్కడ నడిరోడ్డుపై టీడీపీకి చెందిన ఇన్చార్జి తనయుడు అడ్డంగా గోడ నిర్మించేశారని స్థానికులు కొంతమంది కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావుకి వినతి పత్రాన్ని సోమవారం ఆయన చాంబర్లో అందించారు. ఫిర్యాదు చేసేందుకు అధిక సంఖ్యలో బయలుదేరడంతో వెళ్లే వారికి పింఛన్, రేషన్ కట్ చేస్తామని బెదిరించారు కూడా. అయినా కొందరు వెళ్లి ఫిర్యాదు చేశారు. కంపోస్టు కాలనీ ఎన్టీఆర్నగర్ కాలనీ బ్లాక్ –11, 12 వెనుక భాగాన నడక దారిని మూసేశారు. తన బంధువులకు లబ్ధి చేకూర్చేందుకే ఇలా చేశారని స్థానికులు తెలిపారు. కమిషనర్ తాను స్వయంగా వచ్చి చూస్తానని చెప్పడంతో మహిళంతా ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం వినతుల స్వీకరిస్తానని తెలిపారు. -
గడ్డి వాములు దగ్ధం
నరసన్నపేట: మండలంలోని జమ్ము పంచా యతీ దశుమంతపురంలో ప్రమాదవశాత్తు గడ్డివాములు సోమవారం దగ్ధమయ్యాయి. జుత్తు వెంకటరమణకు చెందిన 6 ఎకరాల గడ్డి నిల్వ చేయగా మంటలు అంటుకున్నాయి. గ్రామస్తు లు స్పందించేసరికే మంటలు అధికమయ్యా యి. రూ.20 వేల వరకు నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం క్రైమ్: ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సులో బాధిత ప్రజల నుంచి 72 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వినతులు స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడి సత్వరమే న్యాయం జరిగేలా చూస్తామని భరోసా అందించారు. -
అక్కసుతోనే..
హామీలు అమలు చేయకుండా విపక్షంపై కక్ష సాధిస్తున్నారు. వైఎస్ జగన్పై విమర్శలు చేయ డమే అధికార పార్టీ నాయకులు పనిగా పెట్టుకున్నారు. కింజరాపు బుజ్జి, ఎర్రన్నాయుడు మరణం వెనుక ఎవరి పాత్ర ఉందో అందరికీ తెలుసు. అబద్ధాలతో చంద్రబాబు మెప్పు కోసం పాకులాడుకోవడం మానుకోవాలి. వైఎస్ జగన్పై విమర్శలు చేసే స్థాయి అచ్చెన్నాయుడుకు లేదు. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు టెక్కలిలో అరాచక పాలన సాగుతోంది. తిలక్ ను విచారణ కోసం పోలీస్స్టేషన్కు పిలుపించు కుని గంటల తరబడి నిర్భందించడం అన్యాయం. మరణించిన వారిపై లేని పోని విమర్శ లు చేసిన అచ్చెన్నాయుడుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులు బనాయించడమే తప్ప ప్రజల కోసం ఆలోచన చేయడం లేదు. మూలపేట పోర్టు సభ పెద్ద ఎత్తున విజయవంతం కావడంతో అది తట్టుకోలేక ఇలా అక్రమంగా విచారణలు, కేసులతో పోలీసులు వేధిస్తున్నారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి వైఎస్సార్ మరణంపై అచ్చెన్నాయుడు ఉన్మాది లా మాట్లాడారు. అచ్చెన్నాయుడుకు దమ్ముంటే దివంగత నేత ఎర్రన్నాయుడు మరణంపై సీబీఐ, సీఐడీ దర్యాప్తులు చేయాలి. ఆనాడు ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న కారులో ఒక్క ఎర్రన్నాయుడు తప్ప మిగిలిన వారంతా ఎలా బతికి బయట పడ్డారు. కేవలం అచ్చెన్నాయు డు ప్లాన్ ప్రకారమే జరిగింది. కారులో ఎర్రన్నాయుడుతో ప్రయాణించిన వారిలో చౌదరి బాబ్జికు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి, అప్పలనాయుడుకు ఎంపీ పదవులు కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటి. అక్రమ విచారణలు, కేసులకు భయపడేది లేదు. – పేరాడ తిలక్, వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త -
అర్జీలు వేగవంతంగా పరిష్కరించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్లో 99 వినతులు స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే అర్జీలను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో భాగంగా బాధితుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వహించరాదని, ప్రతీ అర్జీదారుడికి సంత ప్తికరమైన సమాధానం అందాలని ఆయన స్పష్టం చేశారు. సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా జిల్లావ్యాప్తంగా మొత్తం 99 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 22 అర్జీలు రాగా, పంచా యతీ రాజ్ శాఖకు 20, సెర్ప్ విభాగంలో 15, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో 9 వినతులు అందాయి. పోలీసు శాఖకు 4, సర్వే సెటిల్మెంట్స్ మరియు విద్యుత్ శాఖలకు సంబంధించి చెరో 3 చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ క్లినిక్ పర్యవేక్షణ పీజీఆర్ఎస్ అనంతరం కలెక్టర్ అక్కడ ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ను స్వయంగా పర్యవేక్షించారు. మండలాల వారీగా ఏర్పా టు చేసిన డెస్క్ల వద్దకు వెళ్లి, దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడి వారి భూసంబంధిత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల అర్జీలను పరిశీలించి, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అక్కడికక్కడే రెవెన్యూ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించాలని, ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొన్ని వినతులు పరిశీలిస్తే... ●వారసత్వంగా వచ్చిన తన జిరాయతీ భూమి 20 సెంట్లలో వజ్రపుకొత్తూరు మండల అధికారులు నలుగురికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని, వారికి వేరేచోట ఇళ్ల పట్టాలి ఇప్పించి తన స్థలం తనకు ఇవ్వాలని వజ్రపుకొత్తూరు మండలం కంబాల రా యుడుపేట గ్రామానికి చెందిన బైపల్లి పార్వతి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఇదివరకే ఫిర్యాదు చేశానని, తనకు అనుకూలంగా న్యాయస్థానం కూడా తీర్పునిచ్చినప్పటికీ రెవె న్యూ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ●అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని, ఖాతాదారులకు న్యా యం చేయాలని కోరుతూ పాతపట్నం అగ్రిగోల్డ్ బ్రాంచ్ పరిధి లో ఉన్న ఏజెంట్లు, ఇతర సిబ్బంది పీజీఆర్ఎస్లో కోరారు. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ●గార మండలం అంపోలు గ్రామానికి చెందిన కురమాన మల్లేశ్వరరావుకు ప్రభుత్వం గతంలో డీ –పట్టా ఇచ్చిందని, అయితే రీ–సర్వేలో 1బీ అడంగల్ లేకుండా చేశారని, తిరిగి తనకు అడంగల్ పాస్బుక్ మంజూరు చేయాలని ఆయన కోరారు. ●సంకిలి షుగర్ ఫ్యాక్టరీలో 1996 నుంచి పనిచేస్తున్న 16 మంది ఉద్యోగులను ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా మేనేజ్మెంట్ ఉద్యోగాల నుంచి తొలగించిందని, తమను వెంటనే తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వారు కోరారు. -
కారుని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
● త్రుటిలో తప్పిన ప్రమాదం టెక్కలి రూరల్: టెక్కలి నౌపడ రోడ్డులో స్థానిక మేదర వీధి జంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. టెక్కలి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోరుభద్ర నుంచి టెక్కలి వస్తుండగా మేదర వీధి జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ బస్సును గుర్తించి కారును రోడ్డుపై ఆపేశాడు. బస్సు డ్రైవర్ బస్సు వేగాన్ని అదుపు చేయలేక ఆగి ఉన్న కారుని బలంగా ఢీకొన్నాడు. ఆ కారు ఒక్కసారిగా వెనక్కి వెళ్లి మరో కారును ఢీకొట్టింది. ఆ కారు మరో కారును ఢీకొంది. మొత్తం మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. కారులో ఎవరికీ ఎలాంటి గాయా లు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో ఆర్టీసీ బస్సుతో పాటు మూడు కార్లు మరమ్మతులకు గురయ్యాయి. ప్రమాదంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఎస్ఐ రాము కార్లను రోడ్డు పక్కకు మళ్లించి ట్రాఫిక్ క్లీయర్ చేశారు. అనంతరం స్థానికుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. -
జాతీయ బాక్సింగ్ పోటీలకు భార్గవ్
శ్రీకాకుళం న్యూకాలనీ: తొమ్మిదో ఆలిండియా నేషనల్ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలకు జిల్లాకు చెందిన యువ క్రీడాకారుడు భార్గవ్ ఎంపికయ్యాడు. ఈ ప్రతిష్టాత్మక పోటీలు ఈనెల 12 నుంచి 19వ తేదీ వరకు అస్సోంలోని గువాహటి వేదికగా జరగనున్నాయి. శ్రీకాకుళం నగరానికి చెందిన ఈ యువ స్టార్ బాక్సర్ ఈ పోటీల కోసం ఇప్పటికే అస్సోం చేరుకున్నాడు. భార్గవ్ ఈ పోటీల్లో 85–90 కిలోల విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. మెగా టోర్నీకి సిక్కోలు బాక్సర్ ఎంపిక కావడంపై జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బలగ అనంత లక్ష్మణ్దేవ్(అను), సీతారామ్, వంగా మహేష్, డీఎస్డీఓ ఎ.మహేష్బాబు, కోచ్ ఉమామహేశ్వరరావు, రాజీవ్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. -
నిర్లక్ష్యం కొనసాగుతోంది..!
● రైతులకు కలగా మిగిలిపోయిన ఉపాధి అనుసంధానం ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● 2014 నుంచి హామీ ఇస్తున్న టీడీపీ కంచిలి: ఉపాఽధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఎప్పుడో 2014 నుంచి టీడీపీ దీనిపై హామీలు ఇస్తోంది. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి గానీ దీన్ని అమలు చేసిన పాపాన పోలేదు. వేతనదారులు ఎక్కువగా ఉపాధి హామీ పనులకు వెళ్తుండటంతో వ్యవసాయ పనులకు కొరత ఏర్పడుతోంది. దీంతో కూలి రేటు పెరగడంతోపాటు వ్యవసాయ పనులు సకాలంలో పూర్తికాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యంత్ర పరికరాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా చాలా పనులు కూలీల ద్వారానే చేయించాల్సి ఉంటుంది. దీంతో కూలీల కొరత ఏర్పడి రైతులు అగచాట్లు పడుతున్నారు. అందువలన రైతన్నలు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ అనుసంధానం చేస్తే బాగుంటుందని రైతులపై ఖర్చులు భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. 2014 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అను సంధానం చేస్తామని హామీ ఇచ్చి విస్మరించింది. ప్రస్తుతం బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి టీడీపీ కూటమి ప్రభుత్వంగా ఏర్పడి అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు వారిచ్చిన హామీని అమలు పరిచేందుకు ఉపక్రమించడం లేదని వ్యవసాయదారులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఎంపీలు అవసరమైనంత ఎక్కువ మంది ఉన్నప్పటికీ, గతంలో ఇచ్చిన హామీ అయిన ఉపాఽధి హామీ పథకానికి వ్యవసాయానికి అనుసంధానించాలనే ఆలోచన చేయడం లేదని రైతులు వాపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉపాఽధి హామీ పథకంలో 1,81,101 జాబ్కార్డులు నమోదయ్యాయి. సుమా రు 40 లక్షల పనిదినాలు లక్ష్యంగా పనులు చేపట్ట డం జరిగింది. ఈ పథకం ద్వారా ఎస్సీ వర్గాలకు 28.66 శాతం, ఎస్టీ వర్గాలకు 0.87 శాతం, మహిళలకు 55.45 శాతం పని దినాలు కల్పించారు. ఇక జిల్లాలో 3,56,654 హెక్టార్ల భూమిని సాగుచేస్తున్నా రు. ఇందులో ప్రధాన పంటల్లో వరి 7.78 లక్షలు ఎకరాలు, మొక్కజొన్న 4.49 లక్షల ఎకరాలు, కంది 3.43 లక్షల ఎకరాలు, ఉద్యాన పంటలు 1.10 లక్షల ఎకరాలు సాగుచేస్తున్నారు. రైతులకు పంటల సాగు భారంగా మారింది. వ్యవసాయంపై పెట్టిన పెట్టుబడులు కూడా దక్కడం లేదు. పెట్టిన ఖర్చు రాకపోగా అప్పుల పాలవుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతుల కష్టాలను గుర్తించి, ఉపాఽధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. అప్పుడే కొంత ఖర్చు భారం రైతులపైన తగ్గుతుంది. – లడ్డుకేశవ పాత్రో, రైతు, డోలగోవిందపురం గ్రామం, కంచిలి మండలం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి. ప్రస్తుత పరిస్థితిలో పంటసాగు రైతులకు భారంగా మారింది. ప్రతి పంటకు రైతులు అప్పులు చేసి సాగు చేస్తున్నప్పటికీ లాభాలు మాత్రం రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. లేదంటే రైతులు వీధులపాలైపోతారు. – యారడి ఆనందరావు, రైతు, మాజీ సర్పంచ్, గోకర్ణపురం గ్రామం, కంచిలి మండలం జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్, రబీ కాలంలో సాగునీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో వరి పంటను, తర్వాత కమర్షియల్ క్రాప్స్ వేరుశనగ, చెరుకు, తడులు తక్కువగా ఉన్న సమాయాల్లో అపరాలను సాగుచేస్తున్నారు. రైతులు వారి స్థోమతకు మించి పెట్టుబడులు పెడుతూ వ్యవసాయం చేస్తూ, ఖర్చులు భారమై లబోదిబోమంటున్నారు. నష్టాలపాలవుతున్నారు. వరి, వేరు శనగ రైతులకు ఎకరాకు రూ.25 వేలు నుంచి రూ.35వేలు వరకు ఖర్చవుతుందని అంటున్నారు. వ్యవసాయ రంగాన్ని ఉపాఽధికి అనుసంధానం చేస్తే కూలీల కొరతతోపాటు రైతులపై వ్యవసాయ సాగు ఖర్చు తగ్గుతుందని అంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కేంద్రాన్ని ఒత్తిడి చేసి ఉపాఽధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు కోరుతున్నారు. -
● ముగిసిన నాటిక పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల నాల్గో ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా కాకినాడకు చెందిన బీవీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో డి.వినయ్ దర్శకత్వంలో ‘కన్నీటికి విలువెంత’ నాటిక ఆలోచించే విధంగా ప్రేక్షకులను ఎంతగానో హత్తుకుంది. విజయవాడకు చెందిన హర్ష క్రియేషన్స్ ఆధ్వర్యంలో కత్తి శ్యాం ప్రసాద్ దర్శకత్వంలో ‘చెరిగిపోని చిరునామా’ నాటిక అద్భుతంగా ప్రదర్శించారు. అనంతరం కళాకారులు, నిర్వాహకులను సత్కరించారు. కార్యక్రమంలో కేతిరెడ్డి రాజేశ్వరి, బలివాడ శ్రీనివాసరావు, కీర్తి, ఎల్.రామ లింగస్వామి, కంచరానా అప్పారావు, పన్నాల నరసింహమూర్తి, రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనగా ‘చిటికెన వేలు’నాటిక పొటీల్లో ఉత్తమ ప్రదర్శనగా ‘చిటికెన వేలు’ నాటిక ఎంపికై ంది. రెండో ప్రదర్శనగా ‘చెరిగిపోని చిరునామా’, మూడో ప్రదర్శనగా ‘సీ్త్రమాత్రేయనమః’ ఎంపికయ్యాయి. -
‘పైడిగాం ప్రాజెక్టు బాగు చేయాలి’
సోంపేట: పైడిగాం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి ఖరీఫ్కు సాగునీరు అందించాలని ఎంజేఆర్ పూలే రాష్ట్ర బీసీ సంఘం ప్రతినిధులు, రైతులు డిమాండ్ చేశారు. పైడిగాం ప్రాజెక్టును ఆదివారం ఆ సంఘ నాయకులు పరిశీలించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధికారులు, ప్రభుత్వం రూ.45 కోట్ల అంచనాతో పూర్తి స్థాయి మరమ్మతులు చేపడతామని చెప్పి ఏడాది గడు స్తు న్నా పనులు జరగలేదన్నారు. కనీసం కోటి రూపాయల నిధులు వెచ్చించి థర్డ్ యాప్రాన్ మరమ్మతులు, చీకటి గెడ్డ పైపూన్ మరమ్మతులు, 9/4 పైపూన్ మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం మరమ్మతులు చేపట్టకుంటే ప్రాజెక్టు ఆయకట్టు ఎడారిగా మారిపోతుందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరారు. -
జనారణ్యంలోకి జింక
పాతపట్నం: మండల కేంద్రంలోని ఉమామహల్ వెనుక ఉన్న టీచర్స్కాలనీ సమీపంలో ఆదివారం సాయంత్రం జింక జనారణ్యంలోకి వచ్చింది. జింక రాకను పసిగట్టిన కుక్కలు దాన్ని తరుముతుండడంతో టీచర్స్ కాలనీ వాసులు కుక్కల బారి నుంచి జింకను కాపా డారు. జింక పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది టీచర్స్ కాలనీకు చేరుకుని, స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అటవీ ప్రాంతం నుంచి తాగునీటి కోసం జింక జనారణ్యంలోకి వచ్చి ఉంటుందని స్థానికులు అంటున్నారు. తెలంగాణ ఇంటర్లో జిల్లా వాసుల ప్రతిభ హిరమండలం: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థిని ఆ రాష్ట్ర ద్వితీయ ర్యాంకర్గా నిలిచింది. ఎల్ఎన్పేట గ్రామానికి చెందిన పల్లా హాసిని ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440 మార్కులకుగాను 438 మార్కులు సాధించింది. ఎల్ఎన్పేట గ్రామానికి చెందిన సింహాచలం, యమునలు వివాహం జరిగిన తర్వాత హైదరాబాద్ వలసపోయారు. హాసిని అక్కడే పుట్టింది. ప్రాథమిక విద్యతో పాటు ఇంటర్ విద్య అక్కడే పూర్తిచేసింది. ఈ క్రమంలో ప్రైవేటు కాలేజీలో చదువుతున్న హాసిని ఏకంగా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకర్గా నిలవడం విశేషం. ఎల్ఎన్పేటలో మిగతా కుటుంబసభ్యులతో పాటు బంధు గణం ఉంది. దీంతో హాసినికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇజ్జాడపాలెం అమ్మాయి ప్రతిభ రణస్థలం: లావేరు మండలం ఇజ్జాడపాలెం గ్రామానికి చెందిన ఇజ్జాడ మేఘన ఆదివారం విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో సత్తా చాటింది. మేఘన ఎంపీసీలో 466/470 మార్కులు సాధించింది. మేఘన తల్లిదండ్రులు రాంబాబు, త్రివేణి ఇజ్జాడపాలెం నుంచి కొన్నేళ్ల కిందటే హైదరాబాద్కు వలస వెళ్లారు. కంచిలి యువకులు.. కంచిలి: ెపద్దశ్రీరాంపురం, సిర్తలి గ్రామాలకు చెందిన విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచారు. పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన లమ్మత రమేష్ కుమారుడు లమ్మత అఖిల్ సాయి ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 470కి గాను 467 మార్కులు సాఽధించాడు. ఇతడు రంగారెడ్డి జిల్లా అరంఘర్ ప్రాంతంలో గాయత్రి కాలేజీలో చదువుతున్నాడు. కాలేజీలో అధిక మార్కులు సాధించడంతో యాజమాన్యం అభినందించారు. మండలంలోని సిర్తలి గ్రామానికి చెందిన పైల రామారావు కుమార్తె పైల వైష్ణవి రెడ్డి కూడా తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంఈసీ గ్రూపులో 500కు గాను 492 మార్కులు సాధించింది. నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగా పై కార్యక్రమంలో లేదా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీదారుల అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి గురించి తెలుసుకోవాలంటే 1100కు కాల్ చేయవచ్చని తెలిపారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమో దు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఆదిత్యాలయంలో సందడి
అరసవల్లి: సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజల సందడి కనిపించింది. శ్రవణ నక్షత్రం, దశమి తిథి, ఆదివారం కావడంతో ప్రత్యేక శుభయోగం కావడంతో స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలకు బారులు తీరారు. ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనాలు జరిగేలా చర్యలు చేపట్టారు. ఎండ నుంచి ఉపశమన చర్యలతో పాటు ఉచిత మంచినీటిని పంపిణీ చేయించారు. అలాగే మరోవైపు ఇంద్రపుష్కరిణి అభివృద్ధి పనులు జరుగుతున్న దృష్ట్యా ఈశాన్య గేటు నుంచి దర్శనాలను నిలిపివేసి ప్రధాన సింహద్వారం నుంచే దర్శనాలకు అనుమతించారు. వీఐపీలతో పాటు సామాన్యులకు కూడా ఇదే మార్గంలో దర్శనాలకు పంపించడంతో పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. ఇక అంతరాలయం వద్ద దాతలకు రూ.300 టిక్కెట్టు దారులకు మాత్రమే అంతరాలయ దర్శనాలు చేయించేలా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ చర్యలు చేపట్టారు. ఆన్లైన్ దర్శనాల టిక్కెట్ల విక్రయాలన్నీ బ్యాంకు సిబ్బంది అలాగే ఆలయ రెగ్యులర్ ఉద్యోగులతో మాత్రమే విక్రయాలు జరిపిస్తున్నామని, గత కొంతకాలంగా ఇదే విధానం అమలవుతుందని ఆలయ ఈఓ ప్రసాద్ స్పష్టం చేశారు. టార్పాలిన్లు సరిచేశారు.. సూర్య క్షేత్రంలో ఎండ తీవ్రత కారణంగా భక్తులు ఇబ్బంది పడేవారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నాశిరకపు టార్పాలిన్లను ఏర్పాటు చేశారంటూ ‘సాక్షి’లో ఇటీవల ప్రచురించిన కథనం పై ఆలయ ఈఓ కెఎన్విడివి ప్రసాద్ స్పందించారు. ఈ మేరకు బ్రిడ్జిపై ఎండ నుంచి భక్తులకు రక్షణగా ఉండేలా టార్పాలిన్లు సరిచేశారు. దీంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. -
● జిల్లా కేంద్రంలో డ్రోన్ నిఘా
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఒకటి, రెండో పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలోని కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో ఆదివారం పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. అరసవల్లి, ఖాజీపేట, భైరివానిపేట, శాంతినగర్ కాలనీ, నాగావళి రివర్ వ్యూపార్కు, బలగ, నదీ పరివాహక ప్రాంతాల్లో జల్లెడ వేశారు. బహిరంగ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట, ఈవిటీజింగ్, చైన్స్నాచింగ్ అరికట్టడంలో భాగంగానే డ్రోన్ ఎగురవేశారు. పోలీసుల అదుపులో ముగ్గురు.. నగర పరిధిలో ముగ్గురు గంజాయి నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద సుమారు 3 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు, సోమవారం రిమాండ్కు తరలించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
అందని ప్రసాదం..!
గ్యాస్ ప్రభావం..● అరసవల్లిలో ప్రసాదాలకు గ్యాస్ కష్టాలు ● టోకెన్లతో అన్నప్రసాదాలు అందిస్తున్న వైనం ● సగం మందికే అందుతున్న ప్రసాదాలు ● ఇబ్బందులు పడుతున్న భక్తులు అరసవల్లి: ఎక్కడో అమెరికా–ఇరాన్ దేశాల మధ్య యుద్ధం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో నిత్యాన్న ప్రసాదంపై ప్రభావం చూపించింది. ఇప్పటికే గత నెల రోజులుగా యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ దొరక్క చాలా ప్రాంతాల్లో ఇటు వినియోగదారులు.. అటు ఫుడ్ మార్కెట్ వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే ఇంతవరకు లేని సమస్య.. ఇప్పుడిప్పుడే అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి తాకుతోంది. వంట గ్యాస్పై ఆధారపడుతూ రోజూ వందలాది మందికి అన్నప్రసాదాలను అందిస్తున్న ఆలయ వర్గాలకు ఈ గ్యాస్పెద్ద షాకే ఇచ్చింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఇక్కడి అన్నప్రసాదం దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితులు ఎదురయ్యాయి. అలాగే లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీపై కూడా పెద్ద ప్రభావమే చూపుతోంది. అయితే ఫిక్స్డ్గా నంబర్ టోకెన్ల ద్వారా అన్నదాన ప్రసాదాలను అందజేస్తే గ్యాస్ కష్టాల నుంచి కొంతమేరకు గట్టెక్కవచ్చుననే భావనతో ఆలయ అధికారులు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ప్రసాదాలను కూడా ఒక పూట మాత్రమే విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి తాత్కాలిక విధానాలే అని.. గ్యాస్ కష్టాలు తీరిపోతే మళ్లీ అంతా యథావిధిగా జరుగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇదే నిర్థిష్ట టోకెన్ల విధానమే కొనసాగిస్తారనేలా భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఇండెంట్ ఇస్తున్నా.. అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో గ్యాస్ వినియోగం అధికంగానే ఉంటుంది. నిత్యం పులిహోర, లడ్డూ తయారీతో పాటు.. ప్రధానంగా నిత్యాన్నదాన ప్రసాదాల తయారీ కోసం రోజుకు కనీసంగా 10 నుంచి 12 సిలిండర్ల వినియోగం తప్పనిసరి. సరాసరి నెలకు రూ.250 నుంచి 300 వరకు సిలిండర్లు వినియోగమవుతుంటాయి. అయితే ప్రత్యేక అనుమతుల ద్వారా ఆలయంలో భక్తుల అవసరాల నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లకు బదులుగా ఇక్కడ డొమస్టిక్ సిలిండర్లు (ఇంటికి వినియోగిస్తున్నవి) మాత్రమే వినియోగిస్తున్నారు. నిత్యం ఇక్కడ 800 నుంచి 1,000 మంది వరకు అన్నదాన ప్రసాదాలను స్వీకరిస్తుంటారు. అయితే ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా నెలకు 300 వరకు సిలిండర్లు అవసరమంటూ ఇండెంట్ పెట్టినప్పటికీ, సగం మాత్రమే డెలివరీ అవుతున్నాయి. దీంతో ఈ ప్రభావం ఇటు భక్తులకు విక్రయించే ప్రసాదాలపైన, అటు అన్న ప్రసాదాల వంటల తయారీపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రోజుకు 500 మందికే భోజనాలు అరసవల్లి ఆలయంలో ప్రసాదాలుగా లడ్డూ, పులిహోరతో పాటు మధ్యాహ్నం అన్నప్రసాదాలు స్వీకరించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రాధాన్యమిస్తుంటారు. అయితే గ్యాస్ కొరత కారణంగా ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదాలను లెక్కమీద అందించాలని నిర్ణయించారు. ఆలయంలో దర్శనాలు ముగించుకుని వస్తున్న భక్తులకు ప్రత్యేకంగా ఉచిత అన్నప్రసాదాల టోకెన్లు పేరిట పరిమితంగా ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో గత కొద్ది రోజులుగా సగం మందికే అన్నప్రసాదాలు అందుతున్నాయి. మొన్నటి వరకు రోజుకు వెయ్యిమంది ప్రసాదాలను స్వీకరిస్తే.. నేడు కేవలం 500 మందికే పరిమితం చేశారు. ఆదివారాల్లో అయితే 3 వేల మంది వరకు గతంలో ప్రసాదాలకు వచ్చేవారు. ఇప్పుడు అంతా లెక్క మీద టోకెన్ల పేరుతో 1,200 మంది నుంచి 1,500 మంది వరకు భక్తులకు మాత్రమే అన్నప్రసాదాలను అందిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అదనంగా భోజనాలు పెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో వందలాది మంది భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాజాగా ఆదివారం అయితే చాలా మందికి భోజనాలు అందని పరిస్థితి కనిపించింది. ఇదేం పద్ధతి..? ఇటీవల ఇంద్ర పుష్కరిణి అభివృద్ధి పనులు కాంట్రాక్టు క్రింద సుమారు 70 మంది వరకు కూలీలు రోజూ ఆలయం వద్ద పనులు చేస్తున్నారు. వీరు కూడా రోజూ ఈ నిత్యాన్నదాన పథకంలో ఉచితంగా భోజనం చేస్తున్నారు. వాస్తవానికి వీరికి సంబంధిత కాంట్రాక్టర్ బిల్లుల రూపంలో భోజనాలు పెట్టించాల్సి ఉంది. అయినప్పటికీ సదరు సబ్ కాంట్రాక్టర్ మాత్రం కూలీలకు ఎంచక్కా ఆలయంలోనే భోజనాలు పెట్టించేస్తున్నాడు. దీంతో దర్శనాలకు వచ్చిన భక్తులకు అన్నప్రసాదం దొరక్క వెనుదిరుగుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఇతర ప్రాంతాల భక్తులకు అన్నప్రసాదాలు అందడం లేదు.. గ్యాస్ కొరతతో అన్నదాన ప్రసాదాలను గతంలో లాగా అన్లిమిటెడ్ విధానంలో కాకుండా లిమిటెడ్ విధానంలో టోకెన్ల సంఖ్యలో అందజేస్తున్నాం. అలాగే దర్శనాలకు వచ్చిన భక్తులకు అత్యంత ప్రాధాన్యతగా ఈ ప్రసాదాలను అందించాలని ఆదేశించాం. గ్యాస్ బండలు డెలివరీ తక్కువగా వస్తున్న నేపథ్యంలో రోజుకు సగటున 500 మంది భక్తులకు మాత్రమే అన్నప్రసాదాలను అందించేలా చర్యలు చేపట్టాం. గ్యాస్ కొరత సమస్య ఇంకా కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎన్జీ విధానాన్ని అమలు చేసేలా ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – కేఎన్వీడీవీ ప్రసాద్, అరసవల్లి ఆలయ ఈవో -
మంత్రి అచ్చెన్నాయుడివి దిగజారుడు వ్యాఖ్యలు
రణస్థలం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణంపై మంత్రి అచ్చెన్నాయుడివి దిగజారుడు వ్యాఖ్యలని ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కూటమి నాయకులు అడ్డగోలుగా మాట్లాడినా ఎటువంటి చర్యలు ఉండడం లేదన్నారు. అదే వైఎస్సార్సీపీ నాయకులు ప్రజల పక్షాన పోరాడేందుకు చిన్న కార్యక్రమం చేసినా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడికి మతిభ్రమించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పిన మావిగన్కు ప్రజల మద్దతు వస్తుండడంతో.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయనతో పాటు నాలుగు మండలాల నాయకులు ఉన్నారు. -
సేంద్రియ ఉత్పత్తుల సంత
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక 80 ఫీట్ రోడ్లో సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో వారాంతపు సేంద్రియ సంత ఆదివారం నిర్వహించారు. సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులను ఒక వేదికపైకి తీసుకొచ్చి, పండించిన పంటలను మధ్యవర్తులు లేకుండా ప్రజలకు అందించడంతో రైతులకు మంచి ఆదాయం, వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుతున్నాయని నిర్వాహకులు అన్నారు. ఈ సంత ప్రతినెలా రెండో ఆదివారం, నాలుగో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందన్నారు. సంతలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారని, అలాగే వివిధ రకాల విత్తనాలు, పండ్లు, మొక్కలు ప్రజలకు అందుబాటులో ఉంచారన్నారు. -
మండుటెండలో.. చల్లటి నేస్తం!
పాతపట్నం: వేసవి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా వాటర్ మిలాన్(పుచ్చకాయ)లే దర్శనమిస్తున్నాయి. వివిధ పనుల రీత్యా బయటకు వచ్చిన వారికి ఎండ నుంచి తక్షణ ఉపశమనం అందించే ఈ పుచ్చకాయలకు వేసవి సీజన్ అంతా గిరాకీ ఉంటోంది. సాధారణంగా వేసవిలో మన శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోతుంటాయి. తద్వారా డీ హైడ్రైషన్, వడదెబ్బకు గురై కళ్లు తిరిగి కిందపడిపోతుంటారు. ఈ పరిస్థితి ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. అందుకే మన శరీరంలో వాటర్, షుగర్ లెవల్స్ తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ముక్కలు తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పుచ్చకాయలో విటమిన్లు, పోషకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ యాక్సిండెంట్లు, బీ విటమిన్, క్లోరిన్, జిలాకెరోటిన్లు, ఆల్కలైన్, విటమిన్–ఎ, విటమిన్ బీ–6, విటమిన్–సీ, సుక్రోజ్, గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్లు, ఎండాకాలంలో మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. రోజురోజూకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి శరీరానికి ఉపశమనం కల్పిస్తాయి. భలే గిరాకీ.. ఆరోగ్యం అందిపుచ్చుకునేందుకు చాలామంది పుచ్చకాయలు కొనుగోలు చేస్తున్నారు. చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకు వీటిని ఎంతో ఇష్టంగా తింటున్నారు. దీంతో పుచ్చకాయల అమ్మకాలు జోరందుకున్నాయి. నియోజకవర్గ కేంద్రమైన పాతపట్నంలోని దుకాణాలతో పాటు మెళియాపుట్టి, కొత్తూరు, హిరమండలం, ఎల్.ఎన్.పేట మండల కేంద్రాల్లో రోడ్డు పక్కన దుకాణాలు, తోపుడు బండిలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కిలో పుచ్చకాయ రూ.20 నుంచి రూ.30 పలుకుతుండగా, కప్పు పుచ్చకాయ ముక్కల ధర రూ.20 ఉంటోంది. 100 గ్రాముల పుచ్చకాయలో 91.45 గ్రాముల నీరు, 6 శాతం చక్కెర, 90 కేలరీల శక్తి, 7.6 గ్రాముల పిండి పదార్థాలు, 0.6 మాంసకృత్తులు ఉంటాయి. వీటితో పాటు 12 గ్రాముల పొటాషియం, 7 గ్రాముల కాల్షియం, ఓ మిల్లీ గ్రాము సోడియం ఉంటాయి. వేసవి తాపం..పుచ్చకాయతో ఉపశమనం మార్కెట్లో భలే గిరాకీ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న జనం ఎన్నో ప్రయోజనాలు.. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్దకం రాకుండా చేస్తుంది. వృద్ధాప్యంలో అంధత్వం నివారిస్తుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించి తక్షణ శక్తినిస్తుంది. ఆరోగ్యానికి మంచిది పుచ్చకాయ ఆరోగ్యం కలిగిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ తినవచ్చు. కంటి చూపు మెరుగవుతుంది. కిడ్నీలు, గుండెకు మేలు జరుగుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. వేసవితాపం నుంచి రక్షణ కలుగుతుంది. వీలు దొరికనప్పుడల్లా పండ్ల రూపంలో గానీ, జ్యూస్ రూపంలో గానీ తీసుకోవచ్చు. – డాక్టర్ జి.వేణుగోపాల్, సీహెచ్సీ, పాతపట్నం -
కార్యకర్తలపై లాఠీచార్జి హేయమైన చర్య
ఆమదాలవలస: ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడం హేయమైన చర్యని, కార్యకర్తలపై పడ్డ ప్రతీ లాఠీ దెబ్బకూ కాలమే సమాధానం చెబుతుందని వైఎస్సార్సీపీ యువనేత, పోలాకి జెడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన కార్యకర్తలు, అరైస్టెన నాయకులకు సంఘీభావం తెలిపేందుకు ఆదివారం ఆయన ఆమదాలవలస పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ని కలిశారు. అనంతరం బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, పార్టీ కొండంత అండగా ఉంటుందని తెలిపారు. అధికార మదంతో మా పార్టీ కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కేడర్కు ఎటువంటి కష్టం వచ్చినా నాయకత్వం రోడ్డుమీదకు వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆమదాలవలస నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కరిమి రాజేశ్వరరావు, రాష్ట్ర కాళింగ విభాగ అధ్యక్షుడు ఆరంగి మురళీధర్, జలుమూరు మండల పార్టీ అధ్యక్షుడు కనుసు సీతారాం, పోలాకి మండల అధ్యక్షుడు కణితి కృష్ణారావు, పార్టీ సీనియర్ నాయకుడు రాజపు అప్పన్న, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, పార్టీ జిల్లా మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు బొడ్డేపల్లి అజంతాకుమారి, ముఖ్య నాయకులు చిగురుపల్లి ధనలక్ష్మి, దుంపల శ్యామలరావు, ఖండాపు గోవిందరావు, బెవర మల్లేశ్వరరావు, నాగేశ్వరరావు, నాగరాజు, రామ్మెహన్రావు, చింతు రామారావు, గుప్తా, బార్ల వేణుగోపాల్రావు, గరుగుబెల్లి వెంకటరమణి, చింతాడ ఉమా మహేశ్వరరావు, కనపల శేఖర్రావు, సతివాడ రామినాయుడు, కళ్లేపల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇరాన్పై యుద్ధాన్ని ఆపాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పశ్చిమాసియాలో గత కొద్దిరోజుల నుంచి అమెరికా, ఇజ్రాయిల్లు ఇరాన్పై ఉమ్మడిగా చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని పౌర హక్కుల సంఘం నేతలు కోరారు. ఈ మేరకు ప్రపంచ శాంతిని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని శ్రీకాకుళంలోని ఎన్జీవో హోమ్లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పత్రి దానేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జగన్నాథరావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నంశెట్టి రాజశేఖర్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిల వినోద్ కుమార్, సీపీఐ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మద్దిల రామారావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ అమ్మన్నాయుడు, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావులు మాట్లాడుతూ.. మానవజాతి మనుగడకు ప్రమాదకరమైనటువంటి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని తీవ్రంగా ఖండించారు. యుద్ధం వల్ల అనేక దేశాలు ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కృత్రిమ యుద్ధాలను సృష్టించి తన ఆయుధ సంపదను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్న అమెరికా కుటీల బుద్ధిని, వ్యాపార విధానాన్ని వ్యతిరేకించారు. చర్చలు ద్వారా రెండు దేశాలు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్వేచ్ఛ మహిళా సంఘం నాయకులు నాగమణి, భానుమతి, నాయకులు గీతారాణి, జోగారావు, దానయ్య, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధుడిపై యువకుడి దాడి
మెళియాపుట్టి: మండలంలోని గొప్పిలి గ్రామానికి చెందిన బూరగాపు వెంకటరమణ తన 10 ధాన్యం బస్తాలు గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఉంచాడు. అయితే ఒక బస్తా కనబడడం లేదని.. ఎవరో దొంగిలించారని తిట్టుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో బూరగాపు విజ్ఞపతి అనే యువకడు అదేచోట ఉండడంతో తననే తిడుతున్నాడని వృద్ధుడిపై దాడి చేశాడు. దీంతో వృద్ధుడి కాలుకి గాయమవ్వడంతో కుటుంబ సభ్యులు టెక్కలి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం ఎస్ఐ మహ్మద్ అమీర్ అలీ గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేశారు. గడ్డిమందు తాగి వృద్ధుడు మృతి బూర్జ: మండలంలోని బూర్జ గ్రామానికి చెందిన చుక్కర తౌవుడు(70) గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు చుక్కర తౌవుడు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని, రెండు ఎకరాల్లో వరిపంట, మరో రెండు ఎకరాల్లో అరటి పంటలు వేశాడు. ఇటీవల వడగండ్లతో ఆకాల వర్షం పడడంతో అరటి పంట పూర్తిగా నేలమట్టమైంది. వరిపంటకు కూడా తీవ్రనష్టం జరిగింది. దీంతో అప్పులు పాలయ్యానని మనస్థాపం చెందాడు. ఈనెల 10వ తేదీన ఉపాధి హామీ పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెదికారు. సాగు చేసిన పొలం వద్దకు వెళ్లి చూడగా అతడు గడ్డిమందు తాగినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు వెంటనే పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య చుక్కర లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎం.ప్రవల్లిక తెలిపారు. -
ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై అవగాహన కల్పించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశం శ్రీకాకుళం పాతబస్టాండ్: పలాసలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి పలాస ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 50 మంది రైతులకు ఒక్కొక్క వీఆర్వో చొప్పున ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీఆర్వోలు ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి, రైతుల నుంచి రెవెన్యూ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామసభలు ఏర్పాటు చేసినపుడు తహసీల్దార్లు, పోలీసులకు పలు సూచనలు జారీ చేశారు. వీఆర్వోల వద్ద వారికి కేటాయించిన వారి వివరాలు ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరావు, పలాస ఆర్డీవో ఆర్.అప్పలరాజు, డీఎస్పీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. -
ఆదిత్యుని సన్నిధిలో గజపతి కలెక్టర్
అరసవల్లి: ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్ కుటుంబ సమేతంగా శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సాంప్రదాయం ప్రకారం గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు.గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. కౌన్సిలింగ్ బుక్ ఆవిష్కరణ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజినీరింగ్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రూపొందించిన కౌన్సిలింగ్ బుక్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో శనివారం ప్రారంభించారు. యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులు, ప్రత్యేకతలు, మౌలిక వసతులు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిఏటా రూ.100 కోట్ల స్కాలర్షిప్స్ మెరిట్ విద్యార్థులకు అందించే ప్రణాళిక విషయమై ప్రశంసించారు. యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్తో పాటు వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థుల గురించి యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు తెలియజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ఇన్చార్జి రాధాకృష్ణ, సీనియర్ మేనేజర్స్ కుమార్, రెడ్డి, నరసింహులు, వెంకట్ పాల్గొన్నారు. కోర్ ఇంజినీరింగ్తో అపారమైన అవకాశాలు టెక్కలి: కోర్ ఇంజినీరింగ్ బ్రాంచ్లతో భవిష్యత్లో అపారమైన అవకాశాలు ఉంటాయని అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు అన్నారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ స్థాయి అధ్యాపక శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కృత్రిమ మేథస్సు, ఆధునిక సాంకేతిక రంగాల అభివృద్ధితో కోర్ ఇంజినీరింగ్ విభాగాలు కొత్త దిశగా ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. ఇంజినీరింగ్ కళాశాలలు సమకాలిన అవసరాలకు అనుగుణంగా కోర్సులను విస్తరించాలని సూచించారు. సాంకేతిక రంగంలో వేగవంతంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అధ్యాపకులకు సాంకేతిక శిక్షణ తరగతులు అందజేసి తద్వారా విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. అనంతరం ఐఎస్టీఈ–2026 వార్షిక అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. కళాశాల డైరక్టర్ వీవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 2007లో ఐఎస్టీఈ మెంబర్ షిప్తో అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 2014 నుంచి 2026 వరకు తమ కళాశాలలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ అవార్డులను అందజేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఐఎస్టీఈ అధ్యక్షుడు ప్రతాప్ సింహాకసాహెబ్ దేశాయ్, జేఎన్టీయూ జీవీ పూర్వపు వీసీ ప్రొఫెసర్ కట సుబ్బయ్య, ఐఎస్టీఈ ఏపీ చైర్మన్ ప్రొఫెసర్ జి.రంగ జనార్ధన, కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, డైరక్టర్ కె.మధుకుమార్, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక పోరుకు సిద్ధంగా ఉండాలి
● మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ● తాజా, మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్లకు సత్కారంపలాస: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని మాజీమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. ఇప్పటినుంచే గ్రామాల్లో తగిన వాతావరణాన్ని తమకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ తాజా, మాజీ కౌన్సిలర్లు, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన మాజీ సర్పంచ్లను శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయం ఆవరణలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపాలిటీలోని కౌన్సిలర్ల ఎంపికపై కార్యకర్తల అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు. గెలిచే అభ్యర్థికే అవకాశాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. 2027లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ఉంటుందని, ఆ సమయంలో మనం కూడా స్థానికంగా అందుకు అనుగుణమైన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, పలాస నియోజకవర్గ పరిశీలకుడు ఎన్ని ధనుంజయరావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో నాయకులంతా కష్టపడి పనిచేసి పార్టీని గెలుపించుకోవడానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి, జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడ దుర్యోధనరావు, పార్టీ సీనియర్ నాయకులు హనుమంతు వెంకటరావు, పలాస ఏఎంసీ మాజీ చైర్మన్ పి.వి.సతీష్, వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం నాయకుడు మొదలవలస మన్మథరావు, పలాస–కాశీబుగ్గ పట్టణ కమిటీ అధ్యక్షుడు శిస్టు గోపి, పైల వెంకటరావు, ఉంగ సాయికృష్ణ, డల్లి జానకిరెడ్డి, దువ్వాడ రవి, తిర్రి రాజారావు, బత్తిన హేమేశ్వరరావు, బోర చంద్రకళ, సుజాత పండా, మీసాల సురేష్బాబు, బెల్లాల శ్రీనివాసరావు, మందస మాజీ ఎంపీపీ డొక్కర దానయ్య, ఉప్పరపల్లి ఉదయ్కుమార్, మచ్చ రత్నాలు, సవర చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గడ్డిమందు తాగి ఆటోడ్రైవర్ ఆత్మహత్య
పాతపట్నం: మండలంలోని చిన్నలోగిడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దయానిధి సోయి(30) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నలోగిడి గ్రామానికి చెందిన దయానిధి సోయి ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త జైనవలస చిలకమ్మకు రూ.3 లక్షలు అప్పు ఇచ్చాడు. చిలకమ్మకు ఐదు రోజుల క్రితం డబ్బులు అడగగా.. చిలకమ్మ, ఆమె భర్త ముఖలింగంలు కలిసి పోలీసుస్టేషన్లో దయానిధిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దయానిధి సోయిని పోలీసు స్టేషన్కు పిలిపించారు. స్టేషన్లోనే దయానిధి సోయిని చిలకమ్మ ధూషించింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఈనెల 10వ తేదీన గడ్డిమందు తాగాడు. అనంతరం ఆటోలో సెల్ఫీ వీడియో తీశాడు. తన మృతికి పెద్దలోగిడి ఆశ వర్కర్ జైనవలస చిలకమ్మ, ఆమె భర్త మొఖలింగంలు కారణమని, అప్పు ఇచ్చిన డబ్బులు అడిగితే తనపై కేసు పెట్టారని వాపోయాడు. వీడియోని చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు దయానిధిని పాతపట్నం సీహెచ్సీకి తరలించగా, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లారు. రిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. రిమ్స్లో పంచనామా , పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ కె.శ్రీరామమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. హిరమండలంలో చోరీ హిరమండలం: హిరమండలం మేజర్ పంచాయతీ దేవరశెట్టి వీధిలోని అందవరపు కస్తూరి ఇంట్లో శనివారం తెల్లవారుజామున దొంగతనం జరినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే కొత్తూరు సీఐ సీహెచ్ ప్రసాదరావు, హిరమండలం, కొత్తూరు ఎస్ఐలు వై.మధుసూదనరావు, కె.వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్ బృందం, జాగిలాలను తెప్పించారు. ఇంటి యాజమాని అందవరపు కస్తూరి పొలాకిలోని తన కన్నవారింటికి వెళ్లడంతో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. చోరీ సంఘటనపై కొత్తూరు సీఐ వద్ద ప్రస్తావించగా దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. -
గ్రంథాలయం.. దయనీయం..!
శ్రీకాకుళం అర్బన్: గత నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లు అందకపోవడంతో జిల్లాలోని గ్రంథాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వం గ్రంథాలయాలకు ఇవ్వాల్సిన గ్రాంట్ సక్రమంగా విడుదల చేయకపోవడం వలన నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లు, 10 నెలలుగా పత్రికల బిల్లులు, కరెంట్ బిల్లులు, స్వీపర్ ఛార్జీలు కూడా చెల్లించక ఇబ్బందులు తప్పడం లేదు. ఒక నెలకు గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పేపర్ బిల్లులకు రూ.45 లక్షలు అవసరమవ్వగా.. ఆ నిధులను విడుదల చేయడం లేదు. జిల్లాలో 20 మంది శాశ్వత ఉద్యోగులు, 60 మంది పెన్షనర్లు, 13 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వీరికి ఏడాదికి చెల్లించేందుకు కనీసం రూ.6 కోట్లు కావాల్సి ఉంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ కేవలం రూ.2.22 కోట్లు మాత్రమే గ్రాంటు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. అదనపు గ్రాంటు కోసం ప్రభుత్వాన్ని కోరగా ఇవ్వడం కుదరదని ఫైలు తిప్పి పంపించి వేసింది. దీంతో సక్రమంగా జీతాలు, పింఛన్లు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. నిర్వహణకు గడ్డు పరిస్థితి ప్రభుత్వం సకాలంలో నిధులు చెల్లించకపోవడం వలన గ్రంథాలయాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. గ్రంథాలయాల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలు వసూలైన సెస్సుతో అభివృద్ధి జరిగేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీంతో గ్రంథాలయాలకు, పుస్తకాల కొనుగోళ్లకు, రోజువారీ వచ్చే దిన, వార, మాస పత్రికలకు సొమ్ములు చెల్లించడం లేదు. ఇలా అయితే గ్రంథాలయాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు, డిమాండ్లను పరిష్కరించని పక్షంలో దశలవారీగా ఆందోళన చేపడతాం. అలాగే వేసవి శిక్షణా శిబిరాలను కూడా బహిష్కరిస్తాం. – పి.ఉగ్రసేన, జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జిల్లా గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తాం. ఇటీవలే మంత్రి నారా లోకేష్కు సమస్యను వివరించాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ నిధుల కోసం కృషి చేస్తున్నాం. ఇటీవల వసూలైన సెస్సు నుంచి రెగ్యులర్ ఉద్యోగులకు డిసెంబర్ నెల జీతం ఇవ్వడం జరిగింది. మరికొంత వసూలైన సెస్లో పెన్షనర్లకు ఒక నెల పెన్షన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. అయితే మార్చినెలాఖరు కావడంతో ఆగింది. త్వరలోనే పెన్షనర్లకు ఒక నెల పెన్షన్ చెల్లిస్తాం. జిల్లాలో కూడా ఇళ్లు, పంచాయతీల నుంచి రావాల్సిన నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – పీరుకట్ల విఠల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ములిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా ఈనెల 26వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించాల్సి ఉంది. అయితే గ్రంథాలయ ఉద్యోగులకు గత నాలుగు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతుంటే వేసవి శిక్షణా శిబిరాల నిర్వహణ, వాటి ఖర్చు ఉద్యోగులే భరించాలని అనడం దారుణమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించినా వాటికి సంబంధించి ఎటువంటి బిల్లులూ చెల్లించలేదని, ఆ నిర్వహణ ఖర్చుల భారం గ్రంథాలయ ఉద్యోగులే భరించాల్సి వచ్చిందని వాపోతున్నారు. గత నాలుగు నెలలుగా జీతాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా సమస్యలపై జేసీ, మున్సిపల్ అధికారులను కలిశాం. శ్రీకాకుళం మున్సిపాలిటీ కట్టాల్సిన సెస్ను త్వరలోనే కట్టించే ఏర్పాట్లు చేస్తామని జేసీ చెప్పడం జరిగింది. సెస్ వసూలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. మా జీతాలను ప్రభుత్వం ఇచ్చే స్థితిలో లేదని, స్థానిక సంస్థల నుంచే వసూలు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడం శోచనీయం. – వీవీజీ శంకరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. గత 33 ఏళ్ల చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదు. 40 శాతం నిధులు ప్రభుత్వం విడుదల చేసి.. 60 శాతం ఇళ్లు, పంచాయతీల నుంచి వసూలైన సెస్ నుంచి జీతాలు, పెన్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం చెప్పడం సరికాదు. నాలుగు నెలలుగా పెన్షన్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మందులకు, నెలవారీ ఖర్చులకు కూడా అవస్థలు పడుతున్నాం. – టి.వైకుంఠరావు, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రాంట్ సక్రమంగా విడుదల చేయని ప్రభుత్వం నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లకు ఉద్యోగుల ఎదురుచూపులు పత్రికల బిల్లులూ చెల్లించలేని వైనం ప్రశ్నార్థకంగా వేసవి శిక్షణా శిబిరాలు -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై
ఆమదాలవలస: మహానేత వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు దిగజారుడు వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమదాలవలస వైఎస్సార్సీపీ ఇన్చార్జి చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆమదాలవలసలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాలుగు మండలాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు ఆమదాలవలస పార్టీ కార్యాలయానికి తరలివచ్చాయి. అయితే వారెవరూ అక్కడ నుంచి కదలడానికి వీల్లేదని ఆమదాలవలస సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా పోలీసుల బలగాలు, ఎస్ఐలు, అక్క డకు చేరుకొని అడ్డుకున్నారు. అచ్చెన్న దిష్టిబొమ్మ దహనం కోసం పార్టీ కార్యాలయం నుంచి బ్రిడ్జి డౌన్లో గల వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీగా చేరుకునేందుకు పార్టీ క్యాడర్ కదిలింది. పోలీసులను రిక్వెస్టు చేసుకుంటూ చింతాడ రవికుమార్తోపాటు నాయకులు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్ తదితరులు ముందుకు సాగారు. ఈ నేపథ్యంలోనే విగ్రహం వద్దకు చేరుకునే సమ యంలో పోలీసులు లాఠీచార్జి మొదలుపెట్టారు. దీంతో పొందూరు మండలానికి చెందిన పార్టీ జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు సత్యనారాయణకు వీపుపై లాఠీ దెబ్బలు తగిలాయి. అలాగే ఆమదాలవలస మున్సిపాలిటీ బొడ్డేపల్లి పేటకు చెందిన సింగూరు రమేష్కు చేతిపైన, చేతి వేళ్లపైన లాఠీలు దెబ్బలు తగిలి గాయాలయ్యాయి. బొడ్డేపల్లి రమణమూర్తికి కాలిపైన దెబ్బలు తగిలాయి. వీరితోపాటు మరికొంతమందికి పలు చోట్ల గాయాలయ్యాయి. -
‘బలవంతంగా భూ సేకరణ’
వజ్రపుకొత్తూరు రూరల్: కూటమి పాలనలో అభివృద్ధి పేరిట శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంతంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో రైతుల వద్ద ఉన్న భూమిని బలవంతంగా లక్షలాది ఎకరాలను సేకరిస్తున్నారని, రైతులు తిరగబడిన చోట వెనక్కి తగ్గుతున్నారని న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు అన్నారు. మండలంలో గల రిట్టపాడులో కామ్రేడ్ పైల వాసుదేవరావు 16వ వర్ధంతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన స్మారక స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలకుల నిర్లక్ష్యంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, గ్యాస్ కొరత ఏర్పడిందని విమర్శించారు. ప్రజల కోసం 42 ఏళ్లు అజ్ఞాతంలో గడిపిన వాసుదేవరావు ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. శ్రీకాకుళం కల్చరల్: ఉభయ తెలుగు రాష్ట్రాల నాల్గో ఆహ్వాన నాటిక పోటీలు శనివారం రెండో రోజు అలరించాయి. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. విశాఖపట్నంకు చెందిన తెలుగు కళా సమితి చలసాని కృష్ణ ప్రసాద్ దర్శకత్వంలో, శ్రీకాకుళం నగరానికి చెందిన అట్టాడ అప్పలనాయుడు రచన, నాటకీకరణలో వచ్చిన ‘చిటికెన వేలు’ అబ్బురపరిచింది. మారిన పరిస్థితుల వల్ల గిరిజనులు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్టు చూపించారు. విజయవాడకు చెందిన శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ వారి ‘మరో పుత్తడి బొమ్మ’ సాంఘిక నాటిక కూడా ఆకట్టుకుంది. నేడు కాకినాడకు చెందిన బీవీ క్రియేషన్స్ వారి ‘కన్నీటికి విలువెంత’, విజయవాడకు చెందిన హర్ష క్రియేషన్స్ వారి ‘చెరిగిపోని చిరునామా’ నాటికలు ప్రదర్శించనున్నారు. వజ్రపుకొత్తూరు రూరల్: వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా ల విద్యార్థులు కె.నీరజ, కె.చైతన్య, ఎన్.రిషిత్ లు సైన్స్ ఉపాధ్యాయులు కొయ్యిల శ్రీనివాసరావు మార్గదర్శకత్వంతో రూపొందించిన ‘బ్లూమ్ బ్యాగ్’ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి (ఈఎండీపీ) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్ పోటీలలో విద్యార్థులు ఉత్తమ ప్రాజెక్ట్ను ప్రదర్శించి తృతీయ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి ప్రదర్శన పోటీల కు అర్హత సాధించారు. దీంతో డీఈఓ ఎ.రవిబాబు, జిల్లా సైన్స్ అధికారి ఎన్.కుమారస్వా మి, ఈఎండీపీ జిల్లా మేనేజర్ అనూష చేతుల మీదుగా విద్యార్థులు, సైన్స్ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.హేమారావు, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. -
జెండా ఎత్తేసిన వ్యాపారి
● రూ. కోటికి పైగా నగదుతో ఉడాయించిన వైనం ● లబోదిబోమంటున్న బాధితులు సంతబొమ్మాళి: ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకున్న ఓ వ్యాపారి నగదు, బంగారం పట్టుకుని ఉడాయించిన ఘటన మండలంలోని బోరుభద్రలో చేటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని బోరుభద్రలో పోలాకి మండలం పిన్నింటిపేటకు చెందిన పొట్నూరు కృష్ణారావు 30 ఏళ్లుగా వెంకట భగవాన్ పేరుతో మెడికల్ షాపు నడుపుతున్నారు. మెడికల్ షాపులో మందులు అమ్ముతూ చాలా కాలం నుంచి వడ్డీకి డబ్బులు అప్పులు ఇస్తున్నారు. బంగారు వస్తువులు తనఖాగా ఉంచుకుని డబ్బులు అప్పుగా ఇస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా తన మరదలి కుమారుడైన పొట్నూరి నానిని బోరుభద్ర తీసుకువచ్చి మెడికల్ షాపు వ్యాపారం అప్పగించాడు. కృష్ణారా వు మకాం నరసన్నపేటకు మార్చి అక్కడ వేరే వ్యాపారాలు చేస్తూ అప్పుడప్పుడూ బోరుభద్ర వచ్చి షాపు లెక్కలు చూసి వెళ్లిపోయేవాడు. అయితే అప్పటి నుంచి బంగారం వస్తువుల తనఖా వ్యాపారాన్ని నాని చూసుకుంటూ అందరితో నమ్మకంగా మెలిగేవాడు. అయితే గత కొద్ది రోజులుగా బంగా రం వస్తువులు తనఖా పెట్టిన వారు డబ్బులు తీసుకువచ్చి తమ వస్తువులు ఇవ్వమని అడగ్గా వేరే వారి వద్ద ఉన్నాయని నాని తిప్పుతున్నాడు. మరికొంతమంది వద్ద డబ్బులు తీసుకొని నెలలు కావస్తున్నా బంగారం తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడంతో బాధితులు గట్టిగా నిలదీశారు. దీంతో గురువారం మెడికల్ షాపునకు తాళాలు వేసి నాని పరారైపోయాడని స్థానికులు చెబుతున్నారు. నాని ఈ ప్రాంతంలో రూ. 30లక్షలు వరకు అప్పులు చేశాడని, మరికొందరి వద్ద నెలకు నూటికి రూ. 10లు వరకు వడ్డీకి అప్పులు వాడాడని సమాచారం. డబ్బులతో పాటు తనఖా పెట్టిన 50తులాల బంగా రం వస్తువులను తీసుకుని మెడికల్ షాపు మూసి పరారు కావడంతో బాధితులు లబోదిబోమంటు న్నారు. మోసపోయిన వారిలో బోరుభద్ర, గొద లాం, మలగాం, పాలతలగాం, శిమ్మయ్యపేట, కొల్లిపాడు, గెద్దలపాడు, పిట్టవానిపేట, పాత మేఘవరం బాధితులు ఉన్నారు. పిట్టవానిపేట గ్రామాని కి చెందిన పిట్ట చిన్నమ్మ రెండున్నర తులాలు, మలగాంకు చెందిన లండ వరలక్ష్మి అరతులం, చిన్నమ్మి ఐదుతులాల బంగారాన్ని తాకట్టు పెట్టా మని డబ్బులు ఇస్తామన్నా నెలలు తరబడి ఇవ్వకపోవడంతో పాటు పరారు కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంతబొమ్మాళి ఎస్ఐ వై. సింహాచలంకు అడుగగా ఎవరూ లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేయలేదని తెలిపారు. -
‘దమ్ముంటే రాజీనామా చెయ్’
పాతపట్నం: మహానేత మరణంపై, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెప్పు కోసం మంత్రి ఇలా వాఖ్యలు చేయడం దగదని వైఎస్సార్సీ పీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతప ట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రంగా ఖండించారు. శనివారం మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రెడ్డి శాంతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ ఉనికి కోసం మరణించిన వ్యక్తిపై బురద చల్లడం మంత్రి అచ్చెన్నాయుడికి తగదన్నారు. ఎర్రన్నాయుడు మరణిస్తే గానీ మంత్రి పదవి రాదు అని అచ్చెన్న సహచరుల వద్ద ఎన్నోసార్లు అన్నారని గుర్తు చేశారు. దమ్ముంటే మంత్రి, ఎమ్మెల్యే పదవు లకు అచ్చెన్న రాజీనామా చేసి, పోటీ చేయాలని, డిపాజిట్ కూడా రాదని అన్నారు. సమావేశంలో పాతపట్నం, మెళియాపుట్టి పీఏసీఎస్ అధ్యక్షులు మిరిబిల్లి శ్యామ్సుందరరావు, ఉర్లాన బాలరాజు, పాతపట్నం, మెళియాపుట్టి, ఎల్.ఎన్.పేట పార్టీ మండల అధ్యక్షులు సవిరిగాన ప్రదీప్, పోలాకి జయమునిరావు, పెనుమజ్జి విష్ణుమూర్తి, కొత్తూరు ఎంపీపీ సవర సావిత్రి, రాష్ట్ర బీసీ సెఎల్ జాయింట్ సెక్రటరీ చింతాడ సూర్యనారాయణ, రాష్ట వాణిజ్య విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ యరుకోల వెంకటరమణ, రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ రమే ష్, రెడ్డి రామారావు, మడ్డు తాతయ్య, వెంకటరమ ణ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం
సరుబుజ్జిలి: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తప్పుడు వ్యాఖ్యలకు నిరసనగా ఆమదాలవలస పట్టణంలో కార్యకర్తలు, నేతల ఆధ్వర్యంలో రవికుమార్ శనివారం నిరసన ర్యాలీ చేసేందుకు సమాయత్తమయ్యారు. అయితే ర్యాలీ చేయకుండా పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేసి సరుబుజ్జిలి పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, పలువురు కార్యకర్తలు స్థానిక పోలీస్స్టేషన్ వద్దకు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు స్టేషన్లో రవికుమార్ను నిర్బంధించారు. దీంతో కార్యకర్తలు నిరసనలు తెలిపారు. అనంతరం రవికుమార్ను స్టేషన్ నుంచి పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తులను తూలనాడుతూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న మంత్రిని అదుపు చేయకుండా, శాంతి ర్యాలీ చేస్తున్న వారిపై లాఠీచార్జీలు చేసి, అక్రమ అరెస్ట్లు చేసి ఇతర మండలాల పోలీస్స్టేషన్కు తరలించడం ఎంతవరకు సమంజసమ ని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతుకలపై కత్తులు పెడుతున్నారని అన్నారు. నిజాలు మాట్లాడేవారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టడం దుర్మార్గ పరిపాలనకు నిదర్శనమన్నారు. శాంతియుత మార్గాల్లో పయనిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీస్ యంత్రాగం వ్యవహరించిన తీరు గర్హణీయమని ఎద్దేవా చేశారు. -
వసూల్ రాజాలు
అరసవల్లి: వైద్యారోగ్య శాఖలో తనిఖీల పేరిట అక్రమ వసూళ్ల దందా నడుస్తోంది. కొందరు ఉద్యోగులు విధులను పక్కన పెట్టి మరీ వసూళ్లకు తెగబడుతున్నారు. జిల్లాలో వివిధ ఆస్పత్రుల్లో పరిస్థితులు, ధ్రువీకరణ పత్రాల పరిశీలన, రెన్యువల్స్ పేరుతో అధికారిక బృందం ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్లను తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్దేశిత రుసుమును వసూలు చే యాల్సి ఉంటుంది. పీరియాడికల్గా కొన్ని ఆస్పత్రులకు జిల్లా వైద్యారోగ్యశాఖాఽధికారి కార్యాల యం నుంచి నేరుగా నోటీసులు జారీ అవుతాయి. అయితే ఇదే అదనుగా నోటీసులు జారీకానున్న ఆస్పత్రులకు కొందరు సంబంధం లేని విభాగ ఉద్యోగులు కూడా బృందంగా ఏర్పడి అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇదే విషయం గత ఆరు నెలల నుంచి జిల్లాలో పలు డివిజన్లలో జరుగుతుందని, జిల్లా కేంద్రం నుంచి వెళ్లి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పేరుతో శానిటేషన్ విభాగ పనితీరు పేరుతో వసూళ్లకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఫిర్యాదులు చేయడానికి సిద్ధపడ్డారు. సీసీ కెమెరాల ఫుటేజీలతో కూడిన ఆధారాలతో డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. తాజాగా పాతపట్నం, ఆమదాలవలస, నరసన్నపేట, పలా స, టెక్కలి తదితర చోట్ల ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీల పేరిట రూ.వేలల్లో వసూలు చేసిన వ్యవహారం ఇప్పుడు జిల్లా కేంద్రంలో హాట్టాపిక్ అయ్యింది. ప్రొగ్రాం ఆఫీసర్లు లేకుండానే తనిఖీలా.. జిల్లాలో వివిధ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య పరికరాలు, రసాయనాలతో పరీక్షలు జరిగేలా, అలాగే ప్రభుత్వ నిర్దేశిత ధరల అమలు, శానిటేషన్, ఫైర్ సేఫ్టీ, ఆస్పత్రులు, క్లినిక్లు, ల్యాబ్ల నిర్వహణకు పక్కాగా ధ్రువీకరణ పత్రాలు, అనుమతులన్నీ ఉండాలి. అయితే ప్రతి ఐదేళ్లకు ఒకసారి ధ్రువీకరణ పత్రాల రెన్యువల్స్ కూడా జరగాల్సి ఉంది. వీటి తనిఖీలకు డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ మాస్మీడియా అధికారి (డెమో) ఆధ్వర్యంలో వైద్యశాఖకు చెందిన కీలకమైన ఐదు ప్రొగ్రాం ఆఫీసర్ల పర్యవేక్షణలో ఈ తనిఖీలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే జిల్లా వైద్యారోగ్యశాఖాఽధికారి ఆదేశాల మేరకు ప్రతి నెల 30 వరకు ఒక్కో ప్రొగ్రాం అధికారితో కూడిన బృందానికి ఈ తనిఖీల బాధ్యతలను అప్పగిస్తుంటారు. అయితే ఎలాంటి ప్రొగ్రాం ఆఫీసర్ల ప్రమే యం లేకుండానే నాన్ కమ్యూనికేబుల్ డిసిజెస్ (ఎన్సిడి)/ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ్ (ఆర్బిఎస్కె) ప్రొగ్రాంలకు చెందిన కొందరు ఉద్యోగు లు దర్జాగా కలెక్షన్లు చేసేశారు. తనిఖీల నిర్వహణ లో సంబంధం లేని వాళ్లు, కొత్త ల్యాబ్లు, ఆస్పత్రు లు కనిపిస్తే అనుమతుల పేరిట కూడా వసూలు చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్ల వ్యవహారంలో కొద్ది నెలల క్రితమే ఓ ప్రొగ్రాం ఆఫీసర్ కూడా విపరీతంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో కలెక్షన్లు చేసిన సంగతి విదితమే. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఈయనకు కేవలం ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే పరిశీలన చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అనిత ఆదేశించారు. అయితే మళ్లీ ఇప్పుడు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ్ (ఆర్బిఎస్కె) ప్రొగ్రాంకు చెందిన ఓ ‘అక్రమ నాయుడు’ వసూళ్ల దందా వ్యవహారం తెరమీదకు వచ్చింది. నెలకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది. -
స్పా, మసాజ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా
రణస్థలం: స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వ హిస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సీహెచ్ వివేకానంద హెచ్చరించారు. ‘మసాజ్ పేరు.. అసాంఘిక కార్యక్రమాల జోరు..’ శీర్షికతో ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో కొందరు వ్యక్తులు స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో స్పా, మసాజ్ సెంటర్లలో నిబంధనలకు విరుద్ధంగా, చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న స్పా, మసాజ్ సెంటర్లపై ప్రత్యేక నిఘాతో పాటు తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమాచారం ఇవ్వండి నిబంధనల పాటించకపోతే చర్యలు తప్పవని డీఎస్పీ తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలకు భవనం అద్దెకు ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సెంటర్లు నిర్వహిస్తే అనుమతి ధ్రువీకరణ పత్రాలను ప్రవేశ మార్గం వద్ద ఉంచాలన్నారు. స్పా/మసాజ్ సెంటర్ల పేరుతో ఎవరైనా అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గమనిస్తే 112తో పాటు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ 6309990804, సంబంధిత పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు. వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సీహెచ్ వివేకానంద వెల్లడి -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
నందిగాం: టెక్కలి పోలీస్స్టేషన్లో విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామానికి కూతవేటు దూరంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగాంకు చెందిన కానిస్టేబుల్ చీమల గోపాలకృష్ణ(40) మృతి చెందారు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కానిస్టేబుల్ గోపాలకృష్ణ శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని తన బుల్లెట్ వాహనంపై జాతీయ రహదారి మీదుగా నందిగాం వస్తుండగా, సుమారు రాత్రి 11.30 – 12 గంటల మధ్య వరిపంటను కోసుకొని వస్తున్న కోత మిషన్ రేవడిమెరక వద్ద జాతీయ రహదారి ఎక్కే క్రమంలో గోపాలకృష్ణను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయలు పాలైన గోపాలకృష్ణను విడిచిపెట్టి కోత మిషన్తో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి మిషన్తో పాటు వెళ్లిపోయారు. అయితే రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై ఉన్న బుల్లెట్ను చూసిన గుర్తు తెలియని వాహనదారుడు, 100కు ఫోన్ చేసి ప్రమాద విషయం తెలియజేశారు. సమాచారం అందుకున్న నందిగాం పోలీస్స్టేషన్ ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ తదితరులు ప్రమాద స్థలానికి చేరుకొని 108 వాహనానికి సమాచారం అందించారు. 108 వాహన సిబ్బంది గోపాలకృష్ణను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రమాదం స్థలంలో దొరికిన ఆనవాళ్లతో దర్యాప్తు సాగించిన పోలీసులు కోత మిషన్ ఢీకొట్టినట్లు అనుమానించి ఒడిశా రాష్ట్రం జాజ్పూర్కు చెందిన విజయ్ను అదుపులోకి తీసుకున్నారు. గోపాలకృష్ణ మృతదేహానికి శవపంచనామా అనంతరం గ్రామానికి తీసుకొచ్చి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో టెక్కలి సీఐ విజయ్కుమార్, టెక్కలి ఎస్ఐ రాము తదితరులు పాల్గొన్నారు. గోపాలకృష్ణ మృతితో నందిగాంలో విషాదం నెలకొంది. ఆయనకు భార్య యెతీష, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట
సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ భర్త కర్రి విష్ణుమూర్తితో పాటు అతను అనుచరుడు అనపాన నగేష్పై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త, ఒక పత్రిక విలేకరి(సాక్షి కాదు) సదాశివ, మరికొందరు టీడీపీ కార్యకర్తలు శనివారం దాడిచేసి గాయపరిచారు. వివరాల్లోకి వెళ్తే.. నౌపడ గ్రామానికి చెందిన అనపాన నగేష్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ చేయి అడ్డుపట్టి ఉమ్ము వేశాడు. అయితే అతని వెనుక ద్విచక్ర వాహనంపై వస్తున్న టీడీపీ కార్యకర్త, విలేకరి సదాశివ కాలుపై పడింది. దీంతో సీతానగరం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆపి కావాలనే నా మీద ఉమ్ము వేశావని.. సారీ చెప్పమని నగేష్కు సదాశివ సూచించాడు. అయితే కావాలని తాను చేయలేదని అనడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్నవారు ఇరువురికీ నచ్చజెప్పడంతో వెళ్లిపోయారు. అంతటితో సదాశివ ఆగకుండా కొంతమంది టీడీపీ కార్యకర్తలతో వెళ్లి.. పార్టీ కార్యాలయంలో ఉన్న అనపాన నగేష్ను పిలిచి దాడి చేశారు. ఇరువురూ కొట్టుకోవడంతో ఈ దాడిని అడ్డుకోవడానికి వెళ్లిన మాజీ ఎంపీపీ భర్త కర్రి విష్ణుమూర్తిపై సైతం దాడి చేశారు. ఈ దాడిలో విష్ణుమూర్తి కళ్లజోడు విరిగిపోగా, కాళ్లకు గాయమై రక్తస్రావం అయింది. దీనిపై ఇరువర్గాలు పరస్పరం నౌపడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అనపాన నగేష్ ఫిర్యాదు మేరకు సదాశివ, తిప్పాన కామరాజు, కీలుగు సత్యంపై.. సదాశివ ఫిర్యాదు మేరకు అనపాన నగేష్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నారాయణస్వామి తెలిపారు. -
అచ్చెన్నాయుడూ.. నోరు అదుపులో పెట్టుకో..!
● ఎర్రన్నాయుడి మరణంలో నీ హస్తం లేదని చెప్పగలవా? ● ఆ రోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు ● విలేకరుల సమావేశంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమదాలవలస: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆమదాలవలసలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ రాజకీయ ఉనికి కోసం చనిపోయిన వ్యక్తిపై బురద చల్లడం అచ్చెన్నాయుడి దిగజారుడుతనానికి పరాకాష్ట అని మండిపడ్డారు. వైఎస్సార్ మరణించిన సమయంలో జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ, ఆనాడు తండ్రి మరణవార్త విని కుప్పకూలిపోయిన కుటుంబానికి జగన్ అండగా ఉండి, అంత్యక్రియల వరకు అన్ని తానై చూసుకున్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని గుర్తుచేశారు. మంత్రి రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు ఆడటం తగదన్నారు. సింగుపురం వద్ద ఎర్రనాయుడిపై జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనలో అచ్చెన్నాయుడి హస్తం లేదని చెప్పగలవా అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో రణస్థలం మండలం వద్ద ఎర్రన్నాయుడు వాహన ప్రమాదంలో మృతి చెందిన ఘటనలో నీ హస్తం లేదని చెప్పగలవా..! అంటూ నిలదీశారు. వైఎస్సార్ తన పాదయాత్ర ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అనేక మంది జీవితాలను మార్చాయని గుర్తు చేశారు. అలాంటి మహనీయుడిపై విమర్శలు చేయడం ఆకాశంపై ఉమ్మి వేయడమేనని అన్నారు. రాష్ట్రంలో ‘మావిగన్’ ప్లాన్–బికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందని, అమరావతిలో జరుగుతున్న దోపిడీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ఆదేశాలతో అచ్చెన్నాయుడు ఇటువంటి నీచమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ‘అమరావతి వద్దు.. మావిగన్ ముద్దు’ అని ప్రజలు అంటున్నారని చెప్పారు. వైఎస్సార్ పాదయాత్ర చేసి 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించిన సేవలు గుర్తుచేశారు. మహానేత అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి వ్యక్తులపై నోరుజారడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు, బూర్జ జెడ్పీటీసీ బెజ్జపురం రామారావు, బూర్జ నాయకులు కర్నేని నాగేశ్వరరావు, ఆమదాలవలస మాజీ జెడ్పీటీసీ బొడ్డేపల్లి నారాయణరావు, రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీ బెండి గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
వలస పింఛనుదారులకు గాలం!
● కంబాలరాయుడుపేటలో చక్రం తిప్పుతున్న టీడీపీ నేత ● కోల్కతా, ఖరగ్పూర్, బిలాయి వంటి దూరప్రాంతాలకు వెళ్లి వసూళ్లు వజ్రపుకొత్తూరు: మత్స్యకార పంచాయతీ కంబాలరాయుడుపేటలో వలస పింఛన్దారులకు టీడీపీ సీనియర్ నాయకుడు గాలం వేస్తున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోల్కతా, ఖరగ్పూర్, బిలాయిలో వలస ఉన్న దాదాపు 60 మంది పింఛన్దారుల స్థానిక సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్లి సేవలందిస్తున్నామనే ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం స్థానిక గ్రామ సంఘాల్లో ఇది చర్చనీయాంశమైంది. సదరు టీడీపీ నేత గ్రామంలో తగాదాలు సైతం సృష్టించి సంఘాల విచ్ఛిన్నానికి పూనుకుంటున్నట్లు గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం వలస పింఛన్దారులకు మూడు నెలల వరకు పింఛన్ తీసుకునేందుకు గడువు ఇచ్చింది. కానీ టీడీపీ నేత మాత్రం లబ్ధిదారుల వద్దకు ప్రతి నెలా వెళ్లి నియోజకవర్గ టీడీపీ కీలక నేత ఆదేశాలతో మీ వద్దకే పింఛను తెస్తున్నానని నమ్మబలికి, రానున్న సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చూస్తున్నాడని, అంతేకాకుండా సచివాలయ సిబ్బంది ఖర్చులంటూ వసూళ్లు కూడా చేస్తున్నట్లు గ్రామస్తులు ఇటీవల ఎంపీడీఓ ఎన్.రమేష్ నాయుడుకి ఫిర్యాదు చేశారు. దానిపై నేటి వరకు ఎలాంటి విచారణ జరగలేదని ఫిర్యాదుదారులు లండ రుద్రమూర్తి, డి.విఘ్నేష్, ఎల్.చైతన్య, ఎల్.గురుమూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము ఆధారాలతో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రతి నెలా ఓ ప్రాంతానికి(ఇతర రాష్ట్రాలకు) పింఛన్ల పంపిణీ కోసం వెళ్లిన సచివాలయ సిబ్బంది హాజరు రికార్డుల్లో మాత్రం సంతకాలు చేస్తుండం గమనార్హం. ఈ విషయమై ఎంపీడీఓ ఎన్.రమేష్ నాయుడును వివరణ కోరగా గ్రామస్తుల నుంచి ఫిర్యాదు అందిందని, వారికి ఆధారాలు అందించాలని కోరామని, పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పారిశ్రామికవాడలో ప్రమాదం
● కార్మికుడు మృతి ఎచ్చెర్ల : కుశాలపురం ప్రాంతంలోని పారిశ్రామికవాడలో ఓషియానిక్ శాండ్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో మొదలవలస సంతోష్కుమార్ (36) అనే కార్మికుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, ఎచ్చెర్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుశాలపురంలో నివాసముంటున్న సంతోష్కుమార్ ఈ నెల 9న రాత్రి షిఫ్టుకు హాజరయ్యాడు. విధులు నిర్వహిస్తుండగా శుక్రవారం వేకువజామున పరిశ్రమలోని ఫోర్కు లిఫ్ట్ బలంగా ఢీకొట్టింది. ఛాతి, తలకు గాయాలు కావడంతో తోటి కార్మికులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంతోష్కుమార్కు భార్య కవిత, కుమారుడు శ్రావణ్కుమార్ ఉన్నారు. సంతోష్ మామయ్య హరిప్రసాద్ ఫిర్యాదుమేరకు ఎచ్చెర్ల ఎస్సై జి.లక్ష్మణరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దళిత మహిళ ఆత్మహత్యాయత్నం
● నోటీసు ఇవ్వకుండానే ఇంటిని కూల్చేశారని ఆవేదన ● పలాస సూదికొండలో ఘటన పలాస : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని సూదికొండ కాలనీకి చెందిన దళిత మహిళ శుక్రవారం ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాను ఎంతో కష్టపడి కట్టించుకున్న ఇంటిని అధికారులు కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని వాపోయింది. వివరాల్లోకి వెళ్తే.. సూదికొండ కాలనీకి చెందిన కింతాడ దేవి భర్త కొన్నేళ్లు క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. జీడి పరిశ్రమలో పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. వీరంతా కలిసి ప్రస్తుతం అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. దేవి గతంలో సూదికొండలోని వీరబ్రహ్మేంద్ర దేవాలయం వద్ద ఓ వ్యక్తి నుంచి స్థలం కొనుగోలు చేసింది. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో పాటు కొంత అప్పు చేసి ఇంటి నిర్మాణం చేపట్టింది. ఇంతలో గురువారం మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు వచ్చి ఆ స్థలం దేవాలయానికి చెందినదంటూ ఆ ఇంటిని జేసీబీతో కూల్చేశారు. దీంతో బాధితురాలు నిర్ఘాంతపోయింది. ఆమె బాధ చూసిన తోటి మహిళలు బాసటగా నిలుస్తూ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో మనస్థాపానికి గురైన దేవి వెంటనే ఫినాయిల్ తాగేసింది. అంతకుముందే కొన్ని మాత్రలు మింగినట్టు కుటుంబీకులు చెబుతున్నారు. అపస్మారక స్థితికి చేరుకున్న దేవిని వెంటనే పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
న్యాయవాదులపై దాడులు అరికట్టాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, న్యాయవాదులపై జరుగుతున్న దాడులు ఖండించాలని జిల్లా న్యాయవాదుల బార్ అధ్యక్షుడు కూన రాజారావు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాలో న్యాయవాది పి.ఎల్లయ్య దారుణ హత్యకు నిరసగా జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు ర్యాలీ, మానవహారం చేపట్టారు. న్యాయవాదులపై దాడి, హత్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి చిట్టి సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు డి.సరళకుమారి, సహాయ కార్యదర్శి డి.ఈశ్వరరావు, జి.సత్యభామ, ఎస్.సుజాత, జి.ఇందిరాప్రసాద్, మాజీ అధ్యక్షుడు ఎన్ని సూర్యారావు, బీసీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆగూరి ఉమామహేశ్వరరావు, కూన అన్నంనాయుడు, సనపల హరి, పి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
విప్లవ సాంస్కృతికోద్యమ ధ్రువతార కానూరి
పలాస: విప్లవ సాంస్కృతికోద్యమ ధ్రువతార కానూరి వేంకటేశ్వరరావు అని అరుణోదయ సాంస్కృతి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సొర్ర రామారావు చెప్పారు. పలాస మండలం చిన్ననీలావతి గ్రామంలో కానూరి 11వ వర్ధంతి సభ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కానూరి 99వ ఏట అమరులయ్యారని, జీవితాంతం కళారంగానికి అంకితమయ్యారని, ఉద్దానం ప్రాంతంతో ఎంతో అవినాభావ సంబంధం ఉందని, అరుణోదయ సంస్థ వ్యవస్థాపకులని గుర్తు చేశారు. ఎన్నో సినీ అవకాశాలు వచ్చినా ప్రజాకళలకు అంకితమైన నిజమైన ప్రజా కళాకారుడని కొనియాడారు. కార్యక్రమంలో సి.పి.ఐ.ఎం.ఎల్.న్యూడెమొక్రసీ జిల్లా నాయకుడు వంకల మాధవరావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు జుత్తు వీరాస్వామి, కుత్తుం ధర్మారావు, వంకల పాపయ్య, మురిపింటి తాతారావు, పుచ్చ దుర్యోధనరావు, ఎం.వినోద్ తదితరులు పాల్గొన్నారు . -
చెట్టుపొదిలాం యువతి ప్రతిభ
జి.సిగడాం: చెట్టుపొదిలాం గ్రామానికి చెందిన భూపతి సాయికావ్య కేంద్ర ప్రభుత్వ కొలువుల సాధనలోసత్తా చాటింది. ఎస్ఎస్సీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ (అడ్మినిస్ట్రేషన్)–టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ, కోర్ట్ మాస్టర్–ఆర్థిక మంత్రిత్వ శాఖ, సీజీఎల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలను సాధించింది. కావ్యను తండ్రి భూపతి అర్జునరావు, తల్లి రమాదేవి, గ్రామస్తులు అభినందించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలి శ్రీకాకుళం: వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి తక్షణం ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక కార్యవర్గ సభ్యుడు పేడాడ కృష్ణారావు తదితరులుడిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ తక్షణం ఏర్పాటు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 లో పొందుపరిచిన విధంగా ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద రూ.12 వేల కోట్లు కేటాయించాలని కోరారు. గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య రణస్థలం: జె.ఆర్.పురం పంచాయతీకి చెందిన నాగవరపు వీరబాబు(39) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వీరబాబు తల్లి చనిపోయినప్పటి నుంచి మానసిక ఆవేదన చెందుతూ మతిస్థిమితం లేకుండా తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు రణస్థలం సీహెచ్సీకి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. వీరబాబుకు భార్య దుర్గ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేశారు. -
ఆయన నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని కొన్నావీధికి చెందిన వి.సూర్యనారాయణరాజు (91) మరణించడంతో నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. విషయాన్ని కుమారుడు వి.వి.వి.సత్యనారాయణరాజు, ఎస్.గోవిందరావు, పి.నాగేశ్వరరావు రెడ్క్రాస్కు తెలియజేయడంతో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ద్వారా కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. సహకరించిన కుటుంబ సభ్యులకు రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్ అభినందించారు. నేత్ర దానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు. -
పేరాడ తిలక్కు నోటీసులు
టెక్కలి: వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్కు టెక్కలి పోలీసులు శుక్రవారం రాత్రి నోటీసులు అందజేశారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై గురువారం టెక్కలిలో తిలక్ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ రఘునాథరావు, సిబ్బంది టెక్కలిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి వెళ్లి తిలక్కు నోటీసులు అందజేశారు. టెక్కలి పోలీస్ స్టేషన్కు హాజరై సంజాయిషీ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం శ్రీకాకుళం అర్బన్: తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి కె.రూపలత అన్నారు. జిల్లా కేంద్రంలోని గుజరాతిపేటలో అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో శుక్రవారం 8వ పోషణ పక్వాడపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 8 మంది అంగన్వాడీ కార్యకర్తలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో మిషన్ శక్తి వాస్తల్య కో–ఆర్డినేటర్ డి.ఉమ, సీడీపీఓ పి.నాగరాణి, పర్యవేక్షకులు పి.సీతామహాలక్ష్మి, యశోద, బి.యోగేశ్వరి, బీపీసీ గజలక్ష్మి, యూడీసీ హరికృష్ణ, అంగన్వాడీ కార్యకర్తలు ఆదిలక్ష్మి, సంధ్యారాణి, దమయంతి, అరుణ కుమారి, జ్యోతిలక్ష్మి, ఇందిరా, రాజేశ్వరి పాల్గొన్నారు. గిరిజన మహిళ కుటుంబాన్ని ఆదుకోండి కొత్తూరు: అడ్డంగి పంచాయతీ దిగువ మల్లెలుగూడకు చెందిన గిరిజన మహిళ సవర చిన్నారి ఏడాది కిందట పిడుగుపాటుకు గురై మృతిచెందిందని, ఇంతవరకు ఆమె తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించకపోవడం దారుణమని ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న అన్నారు. శుక్రవారం గ్రామస్తులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందిస్తామని కూటమి నేతలు, అధికారులు హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఒక్క రూపాయి కూడా అందజేయకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి రూ. 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
దళారులే దిక్కు!
● రోజురోజుకూ పడిపోతున్న ధాన్యం ధర ● కలవరపెడుతున్న వాతావరణం ● ఆందోళనలో రైతులు నరసన్నపేట: రబీలో ధాన్యం విక్రయాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి కనీస మద్దతు లేకపోవడంతో ధాన్యం అమ్మకాలకు దళారులపైనే ఆధారపడుతున్నారు. చేసేది లేక వారు ఎంత రేటు చెపితే ఆ ధరకే విక్రయాలు చేస్తున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పెద్ద ఎత్తున రైతులు రబీలో వరి సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో మంచి దిగుబడులు వస్తున్నాయి. అయితే ధర ఆశించిన లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. సుగర్ లెస్ సాంబా(ఆర్ఎన్ఆర్), 1010 వంటి రకాలను రైతులు వేశారు. ప్రస్తుతం నరసన్నపేట, సారవకోట మండలాల్లో ముమ్మరంగా వరి కోతలు జరుగుతున్నాయి. మిషన్లు పొలాల్లో కలియ తిరుగుతున్నాయి. అయితే ధర ఆశించినంత లేకపోవడం రైతులను కలవర పరుస్తోంది. 10 రోజుల క్రితం సుగర్ లెస్ ధాన్యం 80 కేజీల బస్తాను రూ.2150కు కొనుగోలు చేశారు. ప్రస్తుతం రూ.1910 లకు కొనుగోలు చేస్తున్నారు. ఇంకా ధరలు తగ్గుతాయని, యుద్ధ ప్రభావం ధాన్యం ధరలపై ఉందని దళారులు రైతులను హెచ్చరిస్తున్నారు. మరోవైపు వాతావరణం మారుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇదీ పరిస్థితి.. నరసన్నపేట మండలంలో చెన్నాపురం, తోటాడ, నడగాం, గునబుపేట, ఉర్లాంలతో పాటు అనేక గ్రామాల్లో వరి పంట కోత దశలో ఉంది. ఆయా గ్రామాల్లో కోతలు ప్రారంభమైతే ధాన్యం మరింతగా మార్కెట్కు వస్తుంది. అప్పుడు ధరలు మరింతగా తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 8764 ఎకరాల్లో వరి పంట వేశారు. సరాసరి ఎకరాకు 27 నుంచి 34 బస్తాల వరకూ దిగుబడి వస్తుంది. ధర బాగుంటే కలిసి వచ్చేదని, ఇప్పుడు దళారులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉంటే రైతులకు దన్నుగా ఉండేదని అంటున్నారు. ఎంతో ఆశతో సన్నరకాలు పండిస్తున్నామని, అయినా ధర నిరాశ పరుస్తుందని వాపోతున్నారు. మార్కెట్లో సన్న బియ్యం ధరలు చూస్తే ఆకాశానికి అంటుతున్నాయి. వంద కేజీలు రూ.6500 లకు విక్రయాలు చేస్తున్నారు. ఈ దశలో ధాన్యానికి ధర ఉండక పోవడానికి కారణం దళారుల మాయాజాలమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధాన్యం 80 కేజీలు రూ.1920 కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర నిలిస్తే కొంత అనుకూలంగా ఉంటుంది. తగ్గితే తీవ్ర నిరాశ కలుగుతుంది. మరో వారం కల్లా 80 కేజీలు ధర రూ.1800 అవుతుందని దళారులు అంటున్నారు. ధాన్యం ధర తగ్గకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – డోల ఈశ్వరరావు, రైతు, జగన్నాథపురం రబీ ధాన్యం అమ్మకాలు, కొనుగోళ్లు విషయంలో అంతా దళారులతే హవా. వారు చెప్పిన ధరే ఫైనల్. దీంతో దళారులు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తున్నారు. రైతులకు ప్రభుత్వం నుంచి మద్దతు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. – నేతింటి రాజేశ్వరరావు, రైతు, భవానీపురం -
60 లీటర్ల సారాతో ఇద్దరి అరెస్టు
కంచిలి: ఒడిశా నుంచి రెండు కావుళ్లతో నాటుసారా రవాణా చేస్తున్న ఇద్దరిని సోంపేట ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సిబ్బంది, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒడిశా రాష్ట్రం తుంబగడకి చెందిన భాస్కర్ కార్జీ, కృష్ణ సబర్ ఉన్నారు. వీరిని సోంపేట మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. వీరి వాంగ్మూలం ద్వారా కంచిలి మండలం దొలాయిసాయి గ్రామానికి చెందిన చైతన్య భుయ్యాపై కూడా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సోంపేట సీఐ జి.వి.రమణ మాట్లాడుతూ ఒడిశా నుంచి సారా రవాణా జరగకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఈ దాడుల్లో సోంపేట సీఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు సుజాత, జగన్నాథ్, సిబ్బంది విజయ్, రమణ, గాలిబ్, వెంకటేష్, ఉమాపతి, మార్కారావు పాల్గొన్నారు. -
నేలను సారవంతంగా మార్చాలి
నరసన్నపేట: ఖరీఫ్కు ముందు నేలను సారవంతంగా మార్చుకోవాలని గోగు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త జి.చిట్టిబాబు రైతులకు సూచించారు. కామేశ్వరిపేటలో శుక్రవారం ‘ఆత్మా’ సౌజన్యంతో పంటల్లో యాజమాన్య పద్ధతులు, వేసవిలో రైతులు చేపట్టాల్సిన జాగ్రత్తల రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రియ పదార్థాలను అందించడం ద్వారా భూమి సారవంతం అవుతుందన్నారు. పచ్చిరొట్ట ఎరువులు వినియోగించాలన్నారు. ఖరీఫ్లో వరి పంట వేసే ముందు కట్టె జనుము, జీలుగు, పిల్లి పెసర వంటి విత్తనాలు వేసుకోవాలన్నారు. 45 రోజులు తర్వాత పొలంలో కలియ దున్నడం వల్ల భూమికి అవసరమైన పోషకాలు అందుతాయన్నారు. ఏటా ఎద పద్ధతిలో వరి పండించడం మంచిది కాదని, కనీసం మూడేళ్లకోసారి అయినా దమ్ము చేసి వరి ఉభాలు చేయడం మంచిదన్నారు. వ్యవసాయ శాఖ ఏడీ ఎల్.వి.మధు మాట్లాడుతూ రైతులు యాంత్రీకరణను వినియోగించడం వల్ల ఖర్చు తగ్గుతుందన్నారు. వరిలో సుడిదోమ నివారణకు కాలిబాటలు తీయాలని సూచించారు. రసాయన ఎరువులు వాడకం తగ్గించాలని, యూరియా అధికంగా వాడటం మంచిది కాదన్నారు. నానో యూరియా, అమ్మోనియం సల్ఫేట్ వాడుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వనరుల కేంద్రం ఏఓ సురేష్, నరసన్నపేట ఏఓ వై.సూర్యకుమారి, రైతు ప్రతినిధులు వాకముళ్లు చక్రధర్, కోట జోగినాయుడు, ఏఈఓ శిరీషా తదితరులు పాల్గొన్నారు. -
పోస్టల్ పార్సిల్ ప్యాకేజీ కౌంటర్ ప్రారంభం
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలాశాఖ కార్యాలయంలో పార్సిల్ ప్యాకేజీ సెంటర్ను పోస్టర్ సూపరింటెండెంట్ వండాన హరిబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రం, దేశమే కాకుండా విదేశాలకు సైతం తపాలాశాఖ ద్వారా పార్సిళ్లను పంపించుకోవచ్చన్నారు. వ్యాపారులు, వినియోగదారులు మెటీరియల్ తెచ్చుకుంటే తపాలా సిబ్బందే బాక్స్లో ప్యాకేజీని చేస్తారని, ఇందుకు తగిన రుసుం మాత్రం చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో పార్శిల్ ప్యాకేజీ కౌంటర్లను ప్రధాన తపాలా కార్యాలయంతో పాటు శ్రీకాకుళం కోర్టు ప్రాంగణం, సోంపేట, కాశీబుగ్గ, పలాస, టెక్కలి, ఆమదాలవలస, రాజాంలలో ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 19 చోట్ల ఆధార్ అప్డేషన్ కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. కార్యక్రమంలో పోస్ట్మాస్టర్ పడాల రంగారావు, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ నూలు భానోజీరావు, తపాలాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జనసేనకు మరోసారి భంగపాటు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జనసేనకు మరోసారి భంగపాటు తప్పలేదు. కూటమి పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేలా తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్న తీరును జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ కృషితో నిర్మించిన కార్గిల్ పార్కును ఆయన లేకుండానే ప్రారంభించడం ఇటీవల చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా కొత్తరోడ్డు వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోష్ విగ్రహాన్ని సుడా నిధులతోనే ఏర్పాటు చేసినప్పటికీ చైర్మన్ కొరికాన లేకుండానే ప్రారంభించడం, ప్రోటోకాల్ను బహిరంగంగా తుంగలో తొక్కయడంపై జనసైనికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జనసేనను పక్కన పెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే కూటమి ధర్మానికి ద్రోహం చేసినట్టేనని వాపోతున్నారు. అప్పుడూ..ఇప్పుడూ.. సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ అందుబాటులో లేని సమయంలో పనులు పూర్తి కాకముందే కార్గిల్ పార్క్ను హడావుడిగా ప్రారంభించేశారు. ఇప్పుడు అందుబాటులో ఉన్నప్పటికీ రవికుమార్కి పూర్తిగా ఆహ్వానం లేకుండా నేతాజీ విగ్రహం ప్రారంభించడం పట్ల జనసైనికులతో పాటు కాపు కులానికి చెందినవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కార్గిల్ పార్క్ ప్రారంభోత్సవం రోజునే కొత్తరోడ్డు వద్ద సుడా నిధులతో ఏర్పాటుచేసిన నేతాజీ విగ్రహావిష్కరణ చేద్దామనుకున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ అందుబాటులో లేరని ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తాజాగా చైర్మన్కు ఆహ్వానం అందించకుండా ప్రారంభోత్సవాలు చేయడం ఏంటని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. సొంత పార్టీకి ఒక న్యాయం, మిత్రపక్షానికి మరో న్యాయమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్గిల్ పార్క్ ప్రోటోకాల్ వివాదంపై జనసేన పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుందని..కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు భోగట్టా. కాగా, నేతాజీ విగ్రహం ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, విప్ బెందాళం అశోక్, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్లు హాజరయ్యారు. కూటమికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ లేకపోవడం గమనార్హం. సుడా నిధులతో నేతాజీ విగ్రహం ఏర్పాటు చైర్మన్ కొరికాన లేకుండానే ప్రారంభించిన టీడీపీ నాయకులు మండిపడుతున్న జన సైనికులు నేతాజీ విగ్రహం ప్రారంభోత్సవంలో కానరాని జనసేన, బీజేపీ నేతలు -
ఉపాధి హామీ పథకం నిర్వీర్యం
హిరమండలం: గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ ఆరోపించారు. శుక్రవారం గులుమూరులో ఉపాధి వేతనదారులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఉపాధి పథకంలో ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నేషన్ యాప్తో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, తక్షణమే యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ వాటా తగ్గడంతో వేతనదారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పనికి తగిన వేతనం అస్సలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 200 పని దినాలు కల్పించడంతో పాటు రోజువారి వేతనాన్ని రూ.600కు పెంచాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో తాగునీరు, ఇతర సదుపాయాలను కల్పించాలని కోరారు. ఆయనతో పాటు బాలరాజు, తులసీరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ కిచెన్లు తక్షణమే రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు, విద్యార్థులకు నష్టం కలిగించే స్మార్ట్ కిచెన్లను తక్షణమే రద్దు చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం ఎంఈఓ–2 ఎన్.కృష్ణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్షయపాత్రను తప్పించి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వమే వంట కార్మికులతో విద్యార్థులకు భోజనం అందించాలని కోరారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఒక్కొక్క విద్యార్థికి రూ.20 చొప్పున మెనూ చార్జీలు చెల్లించాలని, ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా 5లోపు బిల్లులు, జీతాలు చెల్లించాలని కోరారు. కిచెన్ షెడ్లు లేనిచోట్ల వంట గదులు ఏర్పాటు చేయాలని కోరారు. పాఠశాల, కళాశాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, యూనియన్ మండల కార్యదర్శి టి.ప్రవీణ, నాయకురాలు జి.గౌరీ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ హక్కుల సాధనకు కృషి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నవారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో చోటు కల్పిస్తూ నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు ఇస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు అమిరుల్లా బేగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దిబోయిన కృష్ణయాదవ్ అన్నారు. కలిసికట్టుగా బీసీల హక్కుల సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా సంఘ కార్యదర్శిగా దండి పాపారావు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా బలివాడ కళావతి, నగర మహిళా అధ్యక్షురాలిగా గొల్తి పద్మావతికి నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎల్.నాగరాజు, కర్రి రంగాజీదేవ్, రహీమ్, మరలా శంకరరావులు శుభాకాంక్షలు తెలిపారు. జీడి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి నరసన్నపేట: జీడి మద్దతు ధర కేజీకి రూ.200 ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏపీ కౌలురైతుల సంఘం జిల్లా కార్యదర్శి వెలమల రమణ డిమాండ్ చేశారు. శుక్రవారం పోతయ్యవలసలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా జీడి పంటకు బయట మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, అయితే ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదన్నారు. ఖర్చులు పెరిగి.. దిగుబడులు తగ్గి రైతులు నష్టాలకు గురి అవుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో మండల కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు గదిలి రేయన్న పాల్గొన్నారు. ఖైదీల కుటుంబాలకు భరోసా శ్రీకాకుళం పాతబస్టాండ్: నేర బాధితులతో పాటు జైలులో ఉన్న వ్యక్తులపై ఆధారపడిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ‘స్పృహ’ అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యాయ సేవా సదన్లో ప్రభుత్వ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైలులో ఉన్న వ్యక్తుల కుటుంబాలు, నేర బాధితులకు చట్టపరమైన సలహాలతో పాటు మానసిక, విద్యా, ఆర్థిక సామాజిక మద్దతును ఈ పథకం ద్వారా అందిస్తామన్నారు. ముఖ్యంగా ఖైదీలపై ఆధారపడిన పిల్లల విద్య, కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. సమాజంలో వారిపై ఉన్న అపవాదును తొలగించి, ఆత్మగౌరవంతో జీవించేలా అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. ప్రస్తుత సంక్షేమ పథకాలలోని లోపాలను గుర్తించి, బాధితులకు నేరుగా ఫలాలు అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయ ప్రతినిధులు, జైలు అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ, సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు పాల్గొన్నారు. ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం శ్రీకాకుళం కల్చరల్: శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ ఆధ్వర్యంలో పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వహణలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాలుగో ఆహ్వాన నాటిక పోటీలు బాపూజీ కళామందిర్లో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ అకాడమీ రచయిత్రి, దర్శకురాలు పెమ్మరాజు పూర్ణిమ ఆధ్వర్యంలో ‘సీ్త్ర మాత్రే నమః’ నాటిక ఆద్యంతం అలరించింది. ప్రతి కుటుంబాన్ని నడిపించి, గెలిపించే సీ్త్రని కూడా సీ్త్ర మాత్రే నమః అని పూజించాలనే సందేశంతో ప్రదర్శన సాగింది. పెందుర్తికి చెందిన నటరాజ డ్రామాటిక్ అసోసియేషన్ బి.శెట్టి శేఖర్ దర్శకత్వంలో చందు తులసి రచనలో ‘నీళ్లు– నీళ్లు‘ నాటికలో ప్రస్తుత కాలంలో గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరమని పేర్కొంటూ నటీనటులు అద్భుతంగా ప్రదర్శించిన తీరు ఆహూతులను అలరించింది. కార్యక్రమంలో కేతిరెడ్డి రాజేశ్వరి, నిక్కు హరిసత్యనారాయణ, పొగిరి సత్యం, పూజారి మన్మధరావు, ఉంగటి రమణమూర్తి, పాత్రుని పాపారావు, సనపల అన్నాజిరావు, పొగిరి సుగుణాకరరావు, నల్లి ధర్మారావు, బలివాడ శ్రీనివాసరావు, కీర్తి పాల్గొన్నారు. -
ప్రైవేటు దందా!
ప్రభుత్వ ఆస్పత్రి పేరుతోఇచ్ఛాపురం రూరల్: పాతిక గ్రామాల కలలను సాకారం చేస్తూ రూ.1.85 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈదుపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సుస్తీ చేసింది. మత్స్యకార గ్రామాలతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2024 ఫిబ్రవరి నెలలో ప్రారంభించారు. రోగుల తాకిడి దృష్ట్యా ఈ ఆస్పత్రికి ప్రభుత్వం ఇద్దరు వైద్యులతో పాటు సిబ్బందిని నియమించింది. కానీ వైద్యులు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు ఉండరో తెలీక రోగు లు తికమక పడుతూ ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్ర యిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించాల్సిన ప్రధాన వైద్యాధికారి ఇచ్ఛాపురంలో తన సొంత ఆస్పత్రికే పరిమితమయ్యారు. ఉద యం పది గంటలకు ప్రభుత్వాస్పత్రిలో ఉండాల్సిన ఈ వైద్యుడు పదకొండున్నర గంటలకు ఆస్పత్రికి చుట్టం చూపుగా వస్తూ స్థానిక బాహుదా నది బ్రిడ్జి వద్దనే ముఖ హాజరు వేసుకుంటూ వెళ్లిపోతుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయనకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో సిబ్బంది సైతం ఆయన ముందు నోరు మెదిపేందుకు జంకుతుంటారు. ఈయన ఈ ఆస్పత్రికి డీడీఓగా వ్యవహరిస్తున్నారు. ఇచ్ఛాపురం వచ్చేయండీ.. ఎముకల విభాగంలో స్పెషలిస్ట్ అయిన ఈ వైద్యు డు ఇచ్ఛాపురం పట్టణంలోని చిన్న మేదర వీధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నడుపుతున్నారు. కండరాలు, ఎముకలు వంటి సమస్యలతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వివిధ కారణాలు చూపుతూ తన ప్రైవేటు ఆస్పత్రికి పంపుతుంటారని స్థానికులు చెబుతున్నారు. గత నెల మార్చిలో సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు మో చేయి బెణికిందంటూ ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే, ఈ వైద్యుడు ఇచ్ఛాపురంలోని తన సొంత ఆస్పత్రిలో చికిత్స చేసి సుమారు ఐదు వేల రూపాయల వరకు చెల్లించినప్పటికీ ఫలితం కనిపించలేదని, ఇక డబ్బులు చెల్లించలేక మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రికే వెళ్లానని ఆమె తెలిపారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేకు అనుచరుడినని చెప్పుకుంటూ ఎవ్వరూ తనను ప్రశ్నించలేరన్న ధైర్యంతో వ్యవహరిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఫిర్యాదు చేసినా.. మా గ్రామంలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న ఆయన సమయానికి ఆస్పత్రికి వచ్చే రోజులు చాలా తక్కువ. ఎక్కువ సమయంలో తన సొంత ఆస్పత్రిలో గడిపే ఈ వైద్యుడు చుట్టం చూపుగా ప్రభుత్వ ఆస్పత్రికి వస్తుంటారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉండటమే ప్రధాన కారణం. సొంత ఆస్పత్రే ఆయనకు ముఖ్యం. ఈయనపై పలుమార్లు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. – నర్తు ప్రేమ్కుమార్ యాదవ్, ఈదుపురం పేరుకే ఇద్దరు వైద్యులు విధులు నిర్వహిస్తోంది ఒక్క వైద్యురాలే చుట్టం చూపుగా విధులకు హాజరవుతున్న వైద్యుడు ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు సొంత ఆస్పత్రిలో వైద్యం ఇచ్ఛాపురం వెళ్లి వైద్యం చేయించుకున్నా... మోచేయి బెణికిందని ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే ఇచ్ఛాపురంలో తన సొంత ఆస్పత్రిలో చికిత్స చేశారు. మందులు, వైద్యం ఖర్చులు మొత్తం ఐదువేల రూపాయల వరకు ఖర్చయ్యింది. కానీ తగ్గకపోవడంతో మళ్లీ ప్రభు త్వ ఆస్పత్రికి వచ్చి సూది మందు వేసుకున్నాను. – పి.సరస్వతి, రోగి, సన్యాసిపుట్టుగ -
వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల్లో నియామకాలు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో శ్రీకాకుళం జిల్లాలో పలువురిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్టీఎఫ్ రాష్ట్రకార్యదర్శిగా ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన ఇసాయి వెంకటరావుని, రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శిగా పాతపట్నం నియోజకవర్గం నుంచి సవర రమేష్ని, రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శిగా చింతాడ సూర్యనారాయణను, రాష్ట్ర వాణిజ్య విభాగం సంయుక్త కార్యదర్శిగా పాతపట్నం నియోజకవర్గం నుంచి ఎరుకోల వెంకటరమణను, రజక విభాగం జిల్లా అధ్యక్షులుగా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి నడుపూరి ఏసుపాదంను నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. ‘చెత్త నుంచి సంపద’ కేంద్రం స్థలం ఆక్రమణ నందిగాం: మండలంలోని ప్రతాపవిశ్వనాథపురం పంచాయతీ ప్రతాపవిశ్వనాథపురంలో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం స్థలంలో గ్రామానికి చెందిన వ్యక్తి ఆక్రమించి పునాదులు తవ్వారు. తనకు ఉన్న కొద్ది స్థలంతో పాటు పక్కనున్న ఈ స్థలంలో కూడా పునాదులు తీసి కట్టడానికి పూనుకుంటున్నారు. ఇంతకాలం సర్పంచ్ల పదవీ కాలం ఉండటంతో గుమ్మనంగా ఉన్న వారు పదవీకాలం ముగియడంతో స్థానిక తెలుగుదేశం నాయకుడి అండతో ఈ ఆక్రమణకు పూనుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు దృష్టిసారించి ప్రభుత్వ కేంద్రాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. పిచ్చికుక్క దాడిలో 10 మందికి గాయాలు హిరమండలం: హిరమండలంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. 10 మందిని గాయపరచింది. దీంతో వారికి హుటాహుటిన స్థానిక పీహెచ్సీలో వైద్యసేవలందించారు. ఉదయం పిచ్చికుక్క స్థానికులపై ఎగబడింది. కనిపించిన వారిపై దాడిచేసింది. కుక్క దాడిలో పిల్లి ప్రసాద్, ఎస్.బాపన్న, డి.ముకుంద, టి.రామలక్ష్మీ, ఎస్.నూకరాజు, ఎస్.వెంకటరమణ, లోపింటి అప్పారావు, ఇంటి మల్లేశ్వరరావు ఏ.ఈశ్వరరావు తదితరులు గాయపడ్డారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా పీహెచ్సీ వైద్యాధికారి పి.సాయికుమార్ వైద్యసేవలందించారు. కాళ్లతో పాటు శరరీంలో పలు భాగాలను కరిచింది. గత రెండు రోజులుగా ఈ కుక్క స్థానికులను ఇబ్బందిపెడుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. జీడి తోటలకు సస్యరక్షణ అవసరం పలాస: ఉద్దానం ప్రాంతంలోని జీడి తోటలకు తక్షణమే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటను రక్షించుకోవాలని ఉద్యానవన శాఖ శాస్త్రవేత్తలు సూచించారు. ఈ మేరకు పలాస మండలం బొడ్డపాడు, మాకన్నపల్లి, మామిడిపల్లి తదితర గ్రామాల్లో గురువారం పర్యటించి జీడితోటలను పరిశీలించారు. గ్రామాల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి సలహాలు సూచనలు చేశారు. అకాల వర్షాల వల్ల, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల జీడి పంటకు వివిధ రకాలు తెగుళ్లు వ్యాపించాయని, వాటి ఉద్ధృతి తీవ్రంగా ఉందన్నారు. జీడిపూత, పిక్క మాడిపోతుందన్నారు. వీటి నివారణకు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో శాస్త్ర వేత్తలు డాక్టర్ జి.స్రవంతి, టి.రాజశేఖర్, పలాస ఉద్యాన వన శాఖాధికారి సీహెచ్ శంకరదాసు, కె.వెన్నెల, నీలమణి, రైతులు పాల్గొన్నారు. -
ఎర్రన్నాయుడు మరణంలో నీ హస్తం లేదా..?
● మంత్రి అచ్చెన్నాయుడి పై విమర్శలు ఎక్కుపెట్టిన పేరాడ తిలక్ ● మహానేత మరణంపై అచ్చెన్న వ్యాఖ్యలపై భగ్గుమన్న వైఎస్సార్సీపీ శ్రేణులు ● టెక్కలిలో అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మ దహనం .. మానవహారంతో నిరసన ● అచ్చెన్న వ్యాఖ్యలు అహంకారపూరితం టెక్కలి: మహానేత మరణంపై, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడుపై వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ దుమ్మెత్తిపోశారు. ఎర్రన్నాయుడు మరణం వెనుక అచ్చెన్నాయుడు ఉన్నారని ఈ జిల్లా అంతటికీ తెలుసని అన్నారు. టెక్కలి వైఎస్సార్ జంక్షన్ వద్ద అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎర్రన్నాయుడు మరణం వెనుక అచ్చెన్నాయుడు హస్తం ఉందని ఆరోపించారు. తన ఎదుగుదలకు ఎర్రన్న అడ్డుగా ఉన్నాడని పలు సందర్భాల్లో అచ్చెన్నాయుడు అన్నారని తిలక్ గుర్తు చేశారు. మూలపేట పోర్టు సభ విజయవంతం తర్వాత అచ్చెన్నాయుడుకు భయం పట్టుకుందన్నా రు. తన మంత్రి పదవిని కాపాడుకోవడానికి రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా సంస్కార హీనంగా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తిలక్ హెచ్చరించారు. కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, పార్టీ మండల అధ్యక్షులు హెచ్.వెంకటేశ్వరరావు, ఎస్.హేమసుందర్రాజు, టి.ఫల్గుణరావు, పట్టణ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, పార్టీ నాయకులు వై.చక్రవర్తి, వైస్ ఎంపీపీ పి.రమేష్, పి.వెంకట్రావు, కె.అజయ్, వి.శ్రీధర్రెడ్డి, ఎన్.సాబతో, బి.కార్తీక్, బి.రాజేష్, కె.జీవన్, జి.మోహన్రెడ్డి, పి.శ్రీను, కె.కామేష్, కె.సంజీవ్, జె.తిరుమలరెడ్డి, బి.ఎల్లయ్య, బి.కూర్మారావు, ఎ.రాహుల్, బి.రాకేష్, పి.కృష్ణ, బి.శ్రీను, పి.శివ, కె.రామరాజు, డి.కామన్న, ఎస్.వెంకటరమణ, బి.జయరాం, ఎ.విష్ణు, శివారెడ్డి, రామయ్య, ఆర్.మురళీరెడ్డి, డి.లోకేష్రెడ్డి, కె.చిన్న, గౌడ శ్రీనివాస్, చింతాడ అప్పన్న తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. అచ్చెన్నాయుడు స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. సంతకాల సేకరణ అంటూ అచ్చెన్న అసత్యాలు చెబుతున్నారని, ఆనాడు ప్రత్యక్షంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు అచ్చెన్నాయుడు గమనించాలన్నారు. అభివృద్ధిని మరిచి, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్నారు. స్థాయిని మరిచి విమర్శలు చేయడం మానుకోవాలని హితబోధ చేశారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ విషయంలో అధికార పార్టీ విమర్శలు అర్ధ రహితమన్నారు. -
రోత రాతలపై ఆగ్రహం
కాశీబుగ్గ పోలీస్స్టేషన్లో సీఐకి ఫిర్యాదు చేస్తున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుఏబీఎన్ రాధాకృష్ణ రోత రాతలపై నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. మహిళలను కించపరిచేలా వ్యవహరించిన రాధాకృష్ణపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు గురువారం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదనీయం కావని, సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారని మండిపడ్డారు. పోలీసులు చర్యలు తీసుకుని ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఇచ్ఛాపురంలో.. నరసన్నపేటలో ఆమదాలవలసలో బొడ్డేపల్లి రమేష్కుమార్, శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న దుంపల లక్ష్మణరావు, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ్ తదితరులుటెక్కలిలో.. -
బాబోయ్ పిడుగు
● భయపెడుతున్న పిడుగు ప్రమాదాలు ● ఇటీవల కాలంలో వరుసగా పిడుగు మరణాలు ● జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు టెక్కలి, హిరమండలం: కాలం కాని కాలంలో పిడుగులు భయపెడుతున్నాయి. వాతావరణంలో వస్తున్న విపరీత మార్పులతో మేఘాలు కమ్ముకువచ్చి పిడుగుల వాన కురుస్తోంది. జిల్లాలో పిడుగు పాట్లు భయపెడుతున్నాయి. అప్పటి వరకు నిర్మలంగా ఉండే ఆకాశం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడం, ఉరుములు రావడం, పిడుగులు పడడం క్షణాల్లో జరిగిపోతోంది. దీంతో తప్పించుకునే అవకాశం కూడా ఉండడం లేదు. ఇటీవల కాలంలో పిడుగుల వల్ల మందస మండలం పెద్దకేశుపురం గ్రామంలో తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. ఇదే మండలం పుచ్చపాడు గ్రామంలో పిడుగు పాటుకు గురై వృద్ధుడు చనిపోయారు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో పిడుగు పడి ఆవు మృత్యవాత పడింది. అలాగే కవిటి మండలంలో కొబ్బరి చెట్టు పై పిడుగు పడి మంటలు వ్యాపించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● పిడుగులు సంభవించే పరిస్థితులు కనిపించినప్పుడు ఇంటి తలుపులు, కిటికీలు మూసేయాలి. వాటి ద్వారా కూడా పిడుగు ప్రభావం ఇంటి లోపలకు వచ్చే అవకాశం ఉంటుంది. ● టీవీ, ఫ్రిజ్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు వంటి విద్యుత్ పరికరాలను స్విచ్చాఫ్ చేయడం ఎంతో శ్రేయస్కరం. ● ముఖ్యంగా చార్జింగ్లో ఉన్న ఫోన్లు పక్కకు తీసేయాలి. ● నీటి పైపులు, మెటల్ తలుపులు, మోటార్లు వద్ద ఉండకూడదు. నీటి ద్వారా వేగంగా ప్రసరించే ప్రమాదాలు ఉన్నాయి. ఇంటి బయట ఉన్నప్పుడు.. ● బయటకు వెళ్లే సమయాల్లో పిడుగు పడే అవకాశాలు ఉన్నపుడు కాస్త జాగ్రత్తలు పాటించాలి. ● ముఖ్యంగా చెట్ల కింద, పెద్ద టవర్ల దగ్గర, ఎత్తయిన ప్లాట్ఫామ్ మీద నిలబడకూడదు. ఇవి పిడుగును ఆకర్షించే అవకాశం ఉంటుంది. ● నదులు, సరస్సులు, పెద్ద నీటి ఉపరితలాలు, మైదానాల్లో నుంచి వెంటనే సురక్షితమైన భవనాలు, కార్ల లోపలకు వెళ్లి తలదాచుకోవాలి. కొన్ని సందర్భాల్లో భవనాలు అందుబాటులో లేకపోతే ఎత్తయిన వస్తువులను వదిలి కొంచెం లోతైన ప్రదేశాల్లో తలదాచుకోవడం మంచిది. భూమిపై నిలబడినప్పుడు రెండు కాలు మడమలు కొంచెం దగ్గరగా ‘వి’ ఆకారంలో ఉంచాలి. ఇలా చేస్తే పిడుగు భూమిలోకి వెళ్లే మార్గం తక్కువగా ఉంటుంది. వీలైతే మోకాళ్ల మీద కూర్చొని, చేతులు మోకాళ్ల మీద లేదా తల మీద ఉంచి, శరీరాన్ని భూమికి వ్యత్యాసం తగ్గించాలి. తడిసిన నేలపై ఉండకుండా పొడి ప్రదేశానికి చేరుకోవాలి. ముఖ్యంగా వాతావరణం చల్లబడే పరిస్థితులు కనిపిస్తున్నపుడు రైతులు త్వరగా ఇళ్లకు చేరుకోవడం ఎంతో మంచిది. ఇళ్లకు శాశ్వత రక్షణ ఇలా.. పిడుగుపాటుకు గురి కాకుండా ఇళ్లపై కొన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టవచ్చు. ఇళ్లపై, ఎత్తైన భవనాలపై లైట్నింగ్ కండక్టర్ ఏర్పాటు చేసుకోవాలి. పిడుగు పడినప్పటికీ ప్రమాదం లేకుండా రక్షణగా నిలుస్తుంది. ఇంటి చుట్టూ ఎత్తైన చెట్లు, కర్రలు, అగ్ని ప్రమాదానికి గురి చేసే పదార్థాలు లేకుండా చూసుకోవాలి. ఇలాంటి రక్షణ చర్యలు పాటిస్తే పిడుగు ధాటికి గురి కాకుండా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా రక్షణగా నిలుస్తాయి. పిడుగుపాటుకు గురైన వ్యక్తులకు ప్రథమ చికిత్స అందజేసి ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. పిడుగుపాటుకు గురైన వ్యక్తి నుంచి ఎలాంటి విద్యుత్ ప్రసరణ జరగదు. సమీపంలో ఉన్న వారు క్షతగాత్రుడి మెడ కింద భాగంలో రెండు వైపులా ఉన్న కెరోటిడ్ పల్స్ను పరిశీలించాలి. వెంటనే సీపీఆర్ చేయాలి. శరీరం పై కాలిన గాయాలు కనబడితే పొడి గుడ్డతో కవర్ చేయాలి. గాలి, వెలుతురు తగిలే విధంగా చూసుకోవాలి. అనంతరం ఆస్పత్రికి తరలించాలి. ముఖ్యంగా వర్షాలు పడే సమయాల్లో పొలాల్లోకి వెళ్లడం, మైదానాల్లో తిరగడం, ద్విచక్రవాహనాలపై ప్రయాణాలు చేయడం, చెట్లు కింద తలదాచుకోవడం మానేయాలి. – ఎస్.గాయత్రి, వైద్యురాలు, కె.కొత్తూరు పీహెచ్సీ, టెక్కలి మండలం. -
టెన్త్ స్పాట్ కేంద్రాల వద్ద టీచర్ల నిరసన
శ్రీకాకుళం: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఫ్యాఫ్టో చైర్మన్ బి. శ్రీరామమూర్తి కోరారు. గురు వారం శ్రీకాకుళంలోని పదో తరగతి స్పాట్ కేంద్రం వద్ద రాష్ట్ర ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ సీపీఎస్ , జీపీఎస్ వి ధానాలు రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు. 2003లో నియామ కం పొందిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. సరెండర్ లీవ్లు, డీఏ బకాయిలు తక్షణమే చెల్లించాలని, 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10 శాతం, 75 ఏళ్లు దాటిని వారికి 15 శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలు చేయాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, ఉమ్మడి సర్వీస్ రూల్స్ సంబంధించి జీఓ నంబర్ 72,73,74 అమలుపరచాలని, ఆంగ్లమాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. స్పాట్ కేంద్రంతో పాటు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టి నినాదాలు చేశారు. -
76 వేల గృహాల మంజూరుకు ప్రతిపాదనలు
జి.సిగడాం: జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు పక్కా గృహాలు మంజూరు కోసం 76 వేల గృహల కోసం సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని జిల్లా గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.రమాక్రాంత్ వెల్లడించారు. గురువారం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణం చేపట్టే ప్రతి ఒక్క లబ్ధిదారుడుకి 2లక్షల 39 వేల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. వీటిలో రూ.95,400లు కేంద్రప్రభుత్వం వాటా, రూ.63,600లు రాష్ట్ర ప్రభుత్వం వాటా, మిగతా రూ.80వేలు డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలను మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం నియమ నిబంధనలు మేరకే బిల్లులు చెల్లింపు చేస్తామన్నారు. ఆయనతోపాటు స్థానిక ఏఈఈ గొల్లంగి యువరాజ్, రాజశేఖర్, సుధీర్, శ్రీనివాసరావుతో పాటు సిబ్బంది ఉన్నారు. -
చేనేత క్లస్టర్ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
పొందూరు: చేనేత క్లస్టర్ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని క్రాఫ్ట్ కౌన్సిల్ మెంబర్ మీనా అపనేందర్, డిజైనర్ గౌరంగ్షా అన్నారు మండలంలోని రాపాక కూడలి సమీపంలో గల 310 సర్వే నంబర్లో ఉన్న ఐదు ఎకరాల్లో చేనేత క్లస్టర్ ఏర్పాటు గురువారం స్థలాన్ని పరిశీలించారు. చేనేత క్లస్టర్ను ఏర్పాటు చేయడం ద్వారా అధునాతన డిజైన్ల తో చేనేత వస్త్రాలను రూపొందించడంతో మార్కెటింగ్ విస్తృతమవుతుందని అన్నారు. స్థల పరిశీలన చేసిన వారిలో ఆర్కిటిక్ నీలేష్, రీసర్వే డీటీ రాధాకృష్ణ, మండల సర్వేయర్ గణపతి, ఈఓ పొన్నాడ జగదీష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గిరిజన బాలిక హత్యపై ఆరా హిరమండలం: జిల్లాలో ఇటీవల జరిగిన గిరిజన బాలిక హత్యపై రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయమూర్తి జస్టిస్ కె.హరిబాబు గురువారం ఆరా తీశారు. ఈ కేసులో నిందితుడు రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక తహసీల్దార్ బాలకృష్ణతో పాటు పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ సైతం పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రేమసాయి వృద్ధాశ్రమాన్ని జిల్లా న్యాయమూర్తి జస్టిస్ హరిబాబు సందర్శించారు. ఆశ్రమవాసుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికై నా న్యాయసంబంధ సమస్యలు ఉన్నా, ప్రభుత్వ పథకాలు అందకపోయినా, పింఛన్లు అందకపోయినా విన్నవించాలని కోరారు. అనధికార ర్యాంప్పై దాడులు శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కిల్లిపాలెం పరిసర ప్రాంతం కలెక్టరేట్ సమీపంలో గల నాగావళి నదీ తీరాన గడిచిన కొన్ని నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న అనధికారిక ఇసుక ర్యాంప్పై జిల్లా మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ సి.మోహన్రావు నేతృత్వంలో గురువారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక జేసీబీతో పాటు ఒక ట్రాక్టర్ను మైన్స్ అధికారులు స్వా ధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ శ్రీకాకుళం పరిధిలోని ఎవరైనా అనధికారికంగా ఇలాంటి ర్యాంప్లను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా యంత్రాంగం ఇచ్చిన అనుమతులు మేరకు మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని, వాల్టా చట్టాన్ని అధిగమించకూడదన్నారు. ‘పనుల్లో జాప్యం వద్దు’శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల అవసరాల కోసం కేటాయించిన ఎంపీ లాడ్స్ నిధులు ప్రతి పైసా సద్వినియోగం కావాలని, అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దని కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన 17, 18వ లోక్సభ ఎంపీ లాడ్స్ నిధుల సమీక్షలో ఆయన పాల్గొని, నిధుల వినియోగంపై శాఖల వారీగా విశ్లేషణ చేశారు. పనులు పూర్తయిన వెంటనే వాటికి సంబంధించిన ఫొటోలను ‘ఈ–సాక్షి’ పోర్టల్లో అప్లోడ్ చేయాలని, అప్పుడే నిధుల విడుదల వేగవంతం అవుతుందని అధికారు లను ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖలో ఇంకా 76 పనులు, విద్యుత్ శాఖలో 42 పనులు పెండింగ్లో ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా టెక్కలి, శ్రీకాకుళం డివిజన్ల పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కార్యనిర్వాహక ఇంజినీర్లను ఆదేశించారు. ‘పోషణ్ పక్వాడాను విజయవంతం చేయండి’ శ్రీకాకుళం అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15 వరకు నిర్వహించనున్న పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐసీడీఎస్ పీడీ కె.రూపలత పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులోగల ఐసీడీఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సీడీపీఓలతో సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా రూపలత మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఈనెల 9వ తేదీ నుంచి 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని అందరు అంగన్వాడీలు చేపట్టేలా చూడాలన్నారు. రాపాక కూడలి సమీపంలో చేనేత క్లస్టర్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు మాట్లాడుతున్న రూపలత -
న్యాయవాది హత్య అమానుషం
ఆమదాలవలస: న్యాయవాదులపై జరుగుతున్న దాడులు అమానుషమని, ఇలాంటి ఘటనలు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని బార్ అసోసియేషన్ అధ్యక్షులు కణితి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం పాత వడ్డిపల్లి గ్రామానికి చెందిన యువ న్యాయవాది పూజారి ఎర్రయ్య దారుణ హత్యను ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా న్యాయవాదులు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. న్యాయవాదులపై దాడులను ఖండిస్తూ బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కణితి విజయలక్ష్మి మాట్లాడుతూ న్యాయవాదులు సమాజంలో న్యాయం నిలబెట్టే కీలక వర్గమని, వారి భద్రత కోసం ప్రత్యేక చట్టం అవసరమని పేర్కొన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రభు త్వం వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు సీపాన గోవిందరావు, తమ్మినేని అన్నం నాయుడు, బొడ్డేపల్లి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
మనసు కరిగేనా.. గొంతు తడిచేనా..?
● ఆమదాలవలస మున్సిపాలిటీలో దాహం కేకలు ● ట్యాంకర్ ద్వారా వారంలో రెండు రోజులు మాత్రమే తాగునీరు ● తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు ఆమదాలవలస: ఆమదాలవలస.. ట్యాంకర్ ముందు వరస కడుతోంది. కనీసం వారానికి రెండుసార్లు ఇలా నించుంటేనే పురపాలిక గొంతు తడుస్తుంది. మున్సిపాలిటీ పరిధి ఒకటో వార్డు పార్వతీశ్వరుని పేట, జగ్గుశాస్త్రులపేట, 6వ వార్డు సప్తపురాలు, 5వ వార్డు పంతులపేట, రెడ్డి పేట, సొట్టవానిపేట, 7వ వార్డు చింతాడ తదితర ప్రాంతాల్లో తాగునీరు అందక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారానికి రెండుసార్లు మాత్రమే ట్యాంకర్లతో తాగునీరు అందిస్తుండడంతో ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని బిందెలతో రోడ్డుపై పడిగాపులు కాస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాంకర్లతో నీరు అందించడంలో గ్యాప్ వచ్చిందని, గత ప్రభుత్వంలో ప్రతి రోజూ తాగునీరు అందించేవారని ప్రజలు, మహిళలు చెబుతున్నారు. తాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు మున్సిపాలిటీ పరిధిలోని శివారు ప్రాంతాల్లో 15 రక్షిత మంచినీటి పథకాలు నిర్మించి తాగునీరు అందించే ఏర్పాట్లను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేశా రు. కొన్ని ప్రాంతాల్లో పనులు నిర్వహిస్తున్నందున మూడు ట్యాంకర్లతో అప్పట్లో నీరు సరఫరా చేసేవారు. 23 వార్డులకు పూర్తిస్థాయిలో నీరిచ్చేవారు. తిమ్మాపురం, జగ్గుశాస్త్రులపేట, చొట్టవానిపేట, ఊసవానిపేట, గేదెలవానిపేట, చింతాడ, పంతులపేట, లక్ష్ముడిపేట, వెంకయ్యపేట, సొట్టవానిపేట, గేదెలవానిపేట తదితర ప్రాంతాల్లో 15 రక్షిత మంచినీటి పథకాల ద్వారా నిత్యం తాగునీరు అందించేవారు. ప్రభుత్వం మారాక పనుల నిర్వహణ ఆగిపోయింది. దీంతో పాటు ట్యాంకర్లతో నీరివ్వడం కూడా తగ్గిపోయింది. ఇటీవల ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి పార్వతీశ్వరుని పేట తదితర గ్రామాల ప్రజలు విన్నవించారు కూడా. నీరు లేక ఇబ్బంది.. శివారు ప్రాంతాలకు తాగునీరు రావడం లేదు. రెండురోజులకు ఓ సారైనా నీరివ్వాలి. నీరు లేక ఇబ్బందిగా ఉంది. – నాగమ్మ , చింతాడ ముస్లిమ్ కాలనీ, మున్సిపాలిటీ 7వవార్డు చర్యలు తీసుకుంటాం మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు ఉన్న వనరులతో తాగునీరు అందిస్తున్నాం. వేసవి కాలం దృష్ట్యా ప్రత్యేక ప్రణాళికతో చర్యలు చేపట్టి పూర్తి స్థాయిలో ప్రజలకు తాగునీరు అందించేందుకు నా వంతు కృషిచేస్తాను. ప్రజలు కూడా సహకరించాలి. – టి.రవి, మున్సిపల్ కమిషనర్, ఆమదాలవలస -
పొలం కంట నీరు
● రబీ వరికి అందని సాగునీరు ● మూడు మండలాలకు తీవ్ర నష్టం ● లబోదిబో మంటున్న రైతన్నలు అవస్థలు పడుతున్నాం ప్రస్తుతం పంట హారం పట్టే దశలో ఉంది. ఇంకో రెండు మూడు తడులు అందిస్తే కొంతవరకూ అయినా పంటను దక్కించుకుంటాం. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలి. – మెండ సూర్యనారాయణ, రైతు, బద్రి గ్రామం సారవకోట మండలం రైతులకు కష్టాలే టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ రైతులకు కష్టాలే. విత్తనాలు మొదలు ప్రస్తుతం సాగునీరు వరకూ నిత్యం పోరాటాలు చేయాల్సి వస్తోంది. సాగునీరు లేక వేలాది ఎకరాలు ఎండిపోతోంది. – బీవీ రమణ, శ్రీముఖలింగం, జలుమూరు మండలం జలుమూరు: ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంతోపాటు రబీలో కూడా రైతన్నలు పంటలు పండించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతు సంక్షేమమే తమ ధ్యేయం అని గొప్పలు చెప్పిన నాయకులు కనీసం సాగు నీరు అందించ డం లేదు. ఓ వైపు ఎరువులు దొరక్క నానా అవస్థలు పడిన రైతులకు ఇప్పుడు సాగు నీరు కూడా అందించకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఫిబ్రవరి నుంచి రబీ వరి పంట వేసిన రైతులు నీరు లేక తల్ల్లడిల్లుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన వీరంతా సాగునీరు లేకపోవడంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావని ఆందోళన చెందుతున్నారు. వరి నారు పోసిన నుంచి పంట చేతికి వచ్చే వరకూ ఎకరాకు సుమారు రూ. 20 వేలు వర కూ దమ్ము, నారు తీత, నాట్లు వేయడం, గట్టు తదితర పనులతోపాటు ఎరువులు, పురుగు మందులు పిచికారీ తదితర వాటికి ఖర్చవుతోంది. సుమారు 120 రోజుల పంట కాలం గల ఈ రబీ వరి పంట మరి కొద్ది రోజుల్లో చేతికి వస్తుందన్న సమయంలో ఇలా సాగునీరు అందించకపోవడంతో రైతులు తల లు పట్టుకుంటున్నారు. మరో రెండు మూడు తడులు అందిస్తే కొంతవరకూ అయినా పంటను కాపాడుకుంటామని రైతులు చెబుతున్నారు. ఈ మండలాల్లో సాగు అత్యధికం హిరమండలం, సారవకోట, జలుమూరు, నరసన్నపేట మండలాల్లో ఎక్కువగా రైతులు రబీ వరి పంట వేశారు. కేవలం 15 శాతం వరకే కోతలు అయ్యాయి. మిగిలిన 85 శాతం పంట పొట్టదశ, చేని ఈని వెన్ను హారం పట్టేదశలో ఉంది. ఇదే సమయంలోనే పంటకు నీరు అందించాలి. వంశధార ప్రధాన ఎడమ కాలువ ద్వారా ఆయా మండలాలకు సాగునీరు అందాల్సి ఉంది. వంశధార తగినంత నీటి నిల్వ లేక పోవడంతో సాగునీరు అందించలేకపోతున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఉన్నంతలో ప్రత్యామ్నాయం చూడాలని రైతులు కోరుతున్నారు. వైఎస్సార్సీపీ విన్నపం గత సోమవారం నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్యతోపాటు పలువురు రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు సాగునీరు అందించాలని కలెక్టర్ కార్యాలయంలో వినతి అందించారు. ఈ మేరకు అధికారులు చొరవ చూపి ఎండుతున్న పొలాలకు సాగునీరు అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
13 నుంచి విలేకరులకు ఆరోగ్య పరీక్షలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పాత్రికేయులకు ఈ నెల 13 నుంచి వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికా రి కమ్మినాన చెన్నకేశవరావు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ నెల 13 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు జెమ్స్ ఆస్పత్రిలో నిర్వహిస్తామన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీపీ, సుగర్, ఈసీజీ, 2డీ ఎకో (గుండె సంబంధిత), కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సిబిపి) వంటి కీలక పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి జన రల్ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్, న్యూ రో, ఆర్థో, గ్యాస్ట్రో నిపుణుల ద్వారా తనిఖీలు చేయనున్నట్లు వివరించారు. వైద్య పరీక్షలకు హాజరు కావాలనుకునే జర్నలిస్టులు తమ పేరు, పనిచేస్తున్న మీడియా ఆర్గనైజేషన్, అక్రిడిటేషన్ నంబరుతో పాటు, కుటుంబ సభ్యుల వివరాలు, అందరి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సమాచార శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు. ముందుగా ఈ నెల 10వ తేదీ లోపు 8985539662, 9493399367 నంబర్లలో పేర్లు న మోదు చేసుకోవాలని సూచించారు. పేర్లు నమోదు చేసుకున్న వారు, వారికి కేటాయించిన తేదీల్లో మాత్రమే ఆస్పత్రికి హాజరుకావాలన్నారు. -
మహిళా టీచర్ల సమస్యలపై సంతకాల సేకరణ
శ్రీకాకుళం: మహిళా ఉపాధ్యాయులకు సంబంధించి రక్షణ, ఉన్నత పాఠశాలలో ప్రత్యేకమైన స్టాఫ్ రూమ్స్, టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలని, మహిళా ఉపాధ్యాయుల సమస్యలపై సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) జిల్లా సహాధ్యక్షురాలు, జిల్లా కార్యదర్శిలు బి.ధనలక్ష్మి, జి.శారదలు అన్నారు. గురువారం యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శ్రీకాకుళంలోని ఎస్ఎస్సీ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద యూటీఎఫ్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. మహిళా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు విజ్ఞాపనలను అందించేందుకు మహిళా ఉపాధ్యాయుల సంతకాలు సేకరిస్తునామన్నారు. జిల్లా కన్వీనర్ కొరాడ శాంతిప్రియ, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పంట దిగుబడిపై పురుగు మందు ప్రభావం
వజ్రపుకొత్తూరు రూరల్: లేత చిగురు, పూత, పింది దశలో రైతులు మోతాదుకు మించి రసాయన, పురుగు మందులు వినియోగించడంతో తోటలు సహజ గుణాన్ని కోల్పోయి జీడి పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని జీడి మామిడి పరిశోధన స్థానం (బాపట్ల) సీనియర్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ జి.స్రవంతి, ఉద్యాన పరిశోధన స్థానం(పెద్దపేట) తెగుళ్ల విభాగం సీనియర్ శాస్త్రవేత్త టి.రాజశేఖరం అన్నారు. మండలంలో గల గరుడబద్ర, బైపల్లి, అక్కుపల్లి, చీపురపల్లి గ్రామాల్లో వారు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో తో టలను పరిశీలించారు. అలాగే జీడి పంటలను అశించే తెగుళ్లు, కీటకాలు, పురుగుల నివారణపై అవగాహన కల్పించారు. అలాగే పంట సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఏడాది వర్షాలు అనుకూలించకపోవడంతో పంట పూత ఆలస్యమైందని అన్నారు. అలాగే ఉష్ణోగ్రతలు పెరగడంతో పిందె కాపు తగ్గిందని తెలిపారు. వీటి ప్రభావంతో ఈ ఏడాది పంట దిగుబడి 40 శాతం దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. అయితే ప్రస్తుతం పంటకు పూతమాడు తెగులు 20 శాతం, పిండినల్లి 15 శాతం సంక్రమించినట్లు గుర్తించామని తెలిపారు. వీటి నివారణకు అజాదిరచ్తిన్ ప్రతీ లీటర్ నీటికి రెండు ఎంఎల్, ప్రోఫెనోఫోస్ ప్రతి ఒక లీటర్ నీటికి ఒక ఎంఎల్ మోతాదులో కలిపి పంటకు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఉద్యానశాఖ అధికారి కె.శంకర్దాస్, సచివాలయ ఉద్యాన శాఖ సిబ్బంది, అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు. -
130 కొబ్బరి చెట్లు.. 63 ఎకరాల టమాటా
కంచిలి: మండలంలోని మంగళవారం కురిసిన వడగళ్ల వర్షానికి ఉద్యాన పంటలకు నష్టం ఏర్పడింది. ఇందులో మండలంలో కుత్తుం, కొక్కిలిపుట్టుగ పంచాయతీల పరిధిలో 130 కొబ్బరి చెట్లు నేలకొరిగా యి. అదేవిధంగా బూరగాం, కుత్తుం తదితర గ్రామాల్లో 63 ఎకరాల్లో టమాటా పంటకు నష్టం వాటిల్లింది. అదేవిధంగా జీడిచెట్లు కూడా మండపల్లి, కుత్తుం, కొక్కిలిపుట్టుగ పంచాయతీల పరిధి గ్రామాల్లో నేలకొరిగాయి. పంట చేతికి వచ్చిన సమయానికి ఇలా హఠాత్తుగా ప్రకృతి ప్రకోపించడంతో ఉద్యాన పంటలు సాగుచేస్తూ జీవనాధారం పొందుతున్న రైతుల కష్టం వర్షం పాలైందని ఆందోళన చెందుతున్నారు. తమకు ఏర్పడిన నష్టాలపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సర్వేచేసి, తగిన నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరుతున్నారు. నష్టాలు పరిశీలన.. మండలంలో ఉద్యాన పంటలకు ఏర్పడిన నష్టాల ను ఉద్యానశాఖ అఽధికారి పి.మాధవీలత బుధవా రం పరిశీలించారు. ఆమె కొక్కిలిపుట్టుగ, కుత్తుం, బూరగాం గ్రామాల్లో పర్యటించారు. బూరగాం, కుత్తుం గ్రామాల్లో సాగుచేస్తున్న టమాటా పంట పొలాలను పరిశీలించారు. ఇక్కడ టమాటా సాగుచేస్తున్న 55 మంది రైతులకు సంబంధించి 63 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. అలాగే పంట పొలాల్లో నీరు నిలువ ఉండకుండా చేసి, బిల్టాక్స్ కానీ కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ లీటరు నీటికి 3 గ్రాములు చొప్పున కలుపుకొని పిచికారీ చేయమని రైతులకు సూచించారు. అలాగే కుత్తుం, మండపల్లి పంచాయతీ పరిధి అమ్మవారిపుట్టుగ, కొక్కిలిపుట్టుగ గ్రామాల్లో నేలకొరిగిన కొబ్బరి చెట్లను పరిశీలించారు. ఈ గ్రామాల్లో 130 కొబ్బరి చెట్లు నేలకొరిగాయని గుర్తించారు. ఈ నష్టాల వివరాలను నమోదు చేసి, ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లు మాధవీలత తెలిపారు. -
వధువు కావలెను
● జిల్లాలో పెరుగుతున్న ‘పెళ్లి కాని ప్రసాదులు’ ● వధువు ఓకే అంటేనే పెళ్లి అంతా 30 ఏళ్లు పైబడినవారే జాతకాల కోసం ముహుర్తాల కోసం వచ్చేవారు అధికంగా 30ఏళ్లు పైబడినవారే. చాలా మంది తల్లిదండ్రులు వారి అబ్బాయిలకు తగిన అమ్మాయిలు దొరకడం లేదని బాధ వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలను ఎంచుకునే అవకాశం అమ్మాయిలకు లభిస్తుండడం గమనిస్తున్నాం. – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం, గుడివీధి యువత ఆలోచనలో మార్పు యువత ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పే ఒక కారణమైతే, అమ్మాయిలు తక్కువగా ఉండ డం మరో కారణం. పెళ్లి కోసం అమ్మాయిలను వెతుక్కోవడానికే సరిపోతుంది. – వేదుల విజయభాస్కరశర్మ, పురోహితులు శ్రీకాకుళం కల్చరల్, శ్రీకాకుళం రూరల్: జిల్లాలో పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నారు. ఇదివరకు అబ్బాయి ఓకే అంటే అమ్మాయి తరఫు వారు హమ్మయ్య అంటూ గెంతులు వేసే వారు. కానీ ఇప్పుడు ఓకే చెప్పే అధికారం పూర్తిగా అమ్మాయి తరఫు వారికే మళ్లిపోయినట్టు ఉంది. ఫలితంగా వయసు ముదురుతున్నా పెళ్లి కాక ఎంతో మంది యువకులు మిగిలిపోతున్నారు. ఒకప్పటిలా తల్లిదండ్రులు చూపించిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పుడు తక్కువైపోయారు. అబ్బాయిలు రాజీ పడుతున్నా అమ్మాయిలు నో అంటున్నారు. పెరిగిన అడ్డుగోడలు.. ప్రస్తుతం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫలానా విధంగా ఉండాలని అమ్మాయిలు చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు. సంపాదన ఒక్కటే చూడకుండా ప్రొఫెషన్ను కూడా గమనిస్తున్నారు. తక్కువ సంపాదన ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వాళ్లకి తక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద స్థాయిలో జీతాలు ఉండి ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగాల సంబంధాలను కూడా వదిలేసుకోవడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తుండడంతో ఉన్నత ఉద్యోగులకు అందునా ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటిలాగానే డిమాండ్ ఉంది. పెళ్లికి అమ్మాయిల అనుమతి రోజులు మారాయి. అమ్మాయి కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి నేను నచ్చానో లేదో ఒకసారి అడగండి అని అబ్బాయిలే అంటున్నారు. అవసరమైతే కట్నం లేకుండా చేసుకుంటామంటున్నారు. గతంలో వైద్య వృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బిఎస్సీ అగ్రికల్చరల్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజినీరింగ్ వంటి కోర్సులను చదివే వారి సంఖ్య తక్కువగా ఉండేది. ఈ అర్హతలు చెబితే చాలు ఇట్టే పెళ్లయిపోయేది. కానీ ఇప్పుడా పప్పులు ఉడకడం లేదు. పెరిగిన వివాహం వయసు ఒకప్పుడు అమ్మాయికి పెళ్లీడు రాగానే పెళ్లి చేసే వారు. ఇప్పుడు 25 ఏళ్ల వరకు వివాహ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఒకప్పుడు అబ్బాయిలు కూడా 20 ఏళ్లకు పెళ్లి చేసుకునే వారు. కానీ వారు కూడా 30 ఏళ్లు దాకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆ తర్వాత అమ్మాయిలు దొరకడం కష్టమవుతోంది. గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే సరైన వయసులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాలలో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెపుతున్నారు. అమ్మాయికి వంట వచ్చా.. అనే ప్రశ్న బదులు.. అబ్బాయి సంపాదన ఎంత అనే క్వశ్చన్ బాగా వినిపిస్తోంది. అమ్మాయి చదువుకుందా.. అని ఆరా తీయడం బదులు.. అబ్బాయి బుద్ధిమంతుడా కాదా అన్న ఎంకై ్వరీలు మొదలయ్యాయి. కట్నం ఎంత ఇస్తారు.. అన్న మాట వినిపిస్తున్నా.. కట్నం ఇవ్వకపోయినా పర్లేదు అన్న అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. జిల్లాలో పురుష పుంగవులకు వివాహ రేఖలు కనిపించడం లేదు. 30 దాటినా పెళ్లి కాని వారి మగవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. -
భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంచి, నీటి భద్రతను కల్పించడమే లక్ష్యంగా ‘జలధార–జలహారతి’ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి బృందాలు, వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. అన్నమయ్య జిల్లాలో విజయవంతంగా అమలు చేసిన జలధార కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతి గ్రామంలోనూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో ఏర్పాటు చేసిన బృందా లు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించాలని, ప్రజలను, సాగునీటి సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. జూలై నాటికి నిర్దేశించిన పనులన్నీ నూరు శాతం పూర్తి కావాలని, ఇందుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను ఈ నెల 15 లోపు ముగించాల ని స్పష్టం చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. శివారు భూ ములకు సాగునీరు అందేలా డ్రైయిన్లు, కాలువలకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, పూడిక తొలగింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా మిగులు జలాలను అవసరమైన చోటికి అనుసంధానం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ లవరాజు, ఇరిగేషన్ ఎస్ఈ పొన్నాడ సుధాకర్ రావు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వంశధార, అటవీ శాఖ అధికారులు, మండల స్థాయి బృందాల సభ్యులు పాల్గొన్నారు. -
దోపిడీ దొంగల దారెటు..?
శ్రీకాకుళం క్రైమ్ : కాశీబుగ్గ కేంద్రంగా మంగళవారం పట్టపగలు బంగారం దుకాణంలో దోపిడీ దొంగలు చొరబడి భయానక వాతావరణం సృష్టించిన సంగతి తెలిసిందే. తనకు చూపించిన గన్ ఒరిజినల్దేనని షాపు యజమాని చెప్పడం గమనార్హం. షాపు ఓనరైన కిల్లంశెట్టి రామకృష్ణారావు నుంచి దుండగులు మంగళవారం మొబైల్ఫోన్ ఎత్తుకు వెళ్లిపోయినట్లు పోలీసు వర్గా ల సమాచారం. టవర్ డంప్ లొకేషన్ ఆధారంగా విజయనగరం బొబ్బిలి దగ్గర ఒకసారి చూపించగా మరోసారి రాయపూర్ వద్ద సిగ్నల్స్ చూపించినట్లు విశ్వసనీయ సమాచారం. దీన్ని బట్టి మంగళవారం గారబంద మీదుగా లూప్ మార్గాల్లో దుండగులు పర్లాఖిముడి (ఒడిశా) చేరి అక్కడి నుంచి బొబ్బిలి, సాలూరు ఘాట్రోడ్డు మీదుగా చత్తీస్గఢ్ చేరి రాయపూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. వచ్చిన వారు హిందీ భాషలో ఎక్కువగా మాట్లాడటంతో పక్కా గా మహారాష్ట్ర గ్యాంగ్ లేదంటే బీహార్ గ్యాంగు పనేనని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దుండగుల్లో బంగారం ఎత్తుకుపోయిన కొందరు ఒకవైపు, మొబైల్ ఫోన్ తీసుకెళ్లిన వారు మరో వైపు వెళ్లి పోలీసులకు రాంగ్ డైవర్షన్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక కూ డా 3 చోట్ల చోరీలు జరిగాయి. పాత జాతీయ రహదారికి ఆనుకుని మంకినమ్మ చికెన్, మటన్ సెంటర్, డెకరేషన్ సాపు, రైల్వేస్టేషన్ దారిలో చోరీలు జరిగాయి. ఇటీవల కాలంలో 3 మెడికల్స్టోర్స్లో దాదాపు రూ. 4 లక్షల వరకు చోరీకి గురైనా పోలీసులు రికవరీ చేయలేకపోయారన్న ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. లక్ష్మీస్వీటుషాపులో సైతం రూ. 1.20 లక్షలు నగదు దొంగిలించారు. ‘పక్కా ప్లాన్తోనే వచ్చారు’ పలాస: దొంగలు పక్కా ప్లాన్తోనే వచ్చారని, దేవు డి దయ వల్ల తన ప్రాణాలు మిగిలాయని కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర జ్యూయలర్స్ షాపు యజ మాని కిల్లం శెట్టి రామకృష్ణారావు అన్నారు. ఆయన బుధవారం తన ఇంటి వద్ద భార్య లలిత, అతను అక్కడకు వచ్చిన వారితో జరిగిన సంఘటన గురించి చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించారు. దొంగలు పక్కా ప్లాన్తోనే వచ్చారన్నారు. హిందీలో ఏదేదో చెప్పారని, ఆ తర్వాత రెండు చేతులకు బేడీలు వేశారు. మొత్తం బంగారం దోచుకు పోయారని, తన మెడలో ఉన్న గొలుసు కూడా తీసుకుపోయారని, అంతా ఒక్క 5 నిమిషాల్లో జరిగిపోయిందని తెలిపారు. ఆయనను మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ పలాస నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు బుధవారం పరామర్శించారు. దొంగతనం జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు శిస్టు గోపి, తాజా మాజీ కౌన్సిలరు బెల్లాల శ్రీనివాసరావు, పెంట రత్నాకర్, బోర బుజ్జి, బత్తిన హేమేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
మళ్లీ భూ సేకరణ ఎందుకు..?
● మూలపేట పోర్టు కోసం భూసేకరణ పేరుతో దోపిడీ ● మండిపడిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం క్రైమ్ : ఉత్తరాంధ్రలో జరుగుతున్న భూ కుంభకోణాలపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రంగా స్పందించారు. మూలపేట పోర్టుకు అన్ని అనుమతులు తీసుకువచ్చి వైఎస్ జగన్ 70 శాతం పనులు పూర్తిచేశారని, ఇప్పుడు బాబాయ్–అబ్బాయ్లు మరో 15 వేల ఎకరాల భూసేకరణ పేరుతో కొత్త దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. ఉద్యమాల పురిటిగెడ్డలో రైతుల భూములతో ఆడుకుంటే సహించేది లేదని, పీక తెగినా అదనపు భూసేకరణ కానివ్వబోమని హెచ్చరించారు. ఆయన బుధవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతి ముసుగులో జరుగుతున్న ఈ దోచుకో.. పంచుకో.. తీసుకో విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే దీనికి తగిన మూల్యం కూటమి ప్రభుత్వం చెల్లించుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం, శ్రీకాకుళం పార్టీ నియోజకవర్గాల పరిశీలకులు దుంపల లక్ష్మణరావు, పిన్నింటి సాయికుమార్, శ్రీకాకుళం ఎంపీపీ అంబటి శ్రీను, రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం కార్యదర్శి పిల్లల రామకృష్ణ, ఎచ్చెర్ల మాజీ జెడ్పీటీసీ సనపల నారాయణరావు, కొత్తూరు మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణ, టెక్కలి వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, సీనియర్ న్యాయవాది సింగుపురం మోహనరావు, కిష్టుపురం మోహనరావు, ఆమదాలవలస మాజీ జెడ్పీటీసీ బొడ్డేపల్లి నారాయణరావు, జిల్లా వైఎస్సార్ సీపీ యువ విభాగం అధ్యక్షులు మార్పు పృధ్వీరాజ్, ద్వారపు అజయ్, సీపాన వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
‘నీరు’పయోగమేనా..?
● అభివృద్ధికి నోచుకోని అక్కలగెడ్డ ● నామ మాత్రంగా మిగిలిన గెడ్డ ● పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు కొత్తూరు: యువత మత్తుకు అలవాటు కా వద్దని స్థానిక ఎస్ఐ కె.వెంకటేష్ అన్నారు. కొత్తూరులోని రాజు వీధిలో బుధవారం రాత్రి సంకల్పం కార్యక్రమం నిర్వహించా రు. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితం అంధకారమవుతుందన్నారు. పలాస: ఉద్దానం ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే అక్కల గెడ్డ నిర్లక్ష్యానికి గురై నిరుపయోగంగా మారింది. ఈ గెడ్డ పలాస వజ్రపుకొత్తూరు మండలాల రైతులకు సుమారు 20వేలు ఎకరాలకు సాగునీరు అందించేది. అలాగే ఈ ప్రాంత ప్రజలకు తాగు నీరు కష్టాలను కూడా గతంలో తీర్చింది. ఇంతటి ప్రాధాన్యత గల అక్కల గెడ్డ నేడు నిర్లక్ష్యానికి గురైంది. ఇరిగేషన్ అధికారులు ఈ గెడ్డ ఉందన్న సంగతే మరిచి పోయారు. గత కొన్నేళ్లుగా గెడ్డలో పూడిక పేరుకు పోవడంతో పాటు, మొగిలి డొంకలు, ఇతర పిచ్చి చెట్లు మొలిచిపోయి అవి పెద్దగా తయారై ఇప్పుడు అక్కడ గెడ్డను పూర్తిగా కప్పేశాయి. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పలాస మండలం మాకన్నపల్లి గ్రామం చింతల గుండం చెరువు నుంచి ప్రారంభమైన ఈ గెడ్డ పలాస రైల్వే లైను పక్క నుంచి వస్తోంది. పెంటిభద్ర కొండ, బొడ్డపాడు చీపురు బంద, జగ్గోరు చెరువు, గరుడభద్ర ఎంకాయ చెరువులు నిండి వర్షాకాలంలో పొలాల మీదుగా ఈ గెడ్డలోకి నీరు ప్రవహించేది. వజ్రపుకొత్తూరు మండలం మర్రిపాడు, గరుడభద్ర, రిట్టపాడు, రాజాం, తాళభద్ర తదితర గ్రామాల రైతులకు సాగు నీరు అందించేది. అంతేకాకుండా పశువులకు ఎక్కువగా ఉపయోగపడేది. ఇంతటి ప్రాధాన్యత గల ఈ గెడ్డను సంబంధిత అధికారులు పూర్తిగా మరిచి పోయారు. దీంతో గెడ్డ ఆనవాలు కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. దీంతో ఈ గెడ్డపై ఆధారపడిన ఆయకట్టు రైతులకు సాగు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఈ గెడ్డపై దృష్టి సారించి పూడిక తీసి, పెరిగిపోయిన చెట్లను తొలగించాలని రైతులు కోరుతున్నారు.ఇది ఊట గెడ్డ. ఎండాకాలంలో కూడా నీరు ఉండేది. ఇది ఎంతో రైతులకు ఉపయోగ పడేది. మాకన్నపల్లి చింతల గుండం నుంచి ప్రారంభమైన ఈ గెడ్డ రిట్టపాడు మీదుగా నువ్వల రేవు వద్ద సముద్రంలో కలిసేది. ఎప్పుడు కూడా నీరు ఉండేది. అధికారుల నిర్లక్ష్యం వల్ల గెడ్డ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. వర్షాలు పడితే అక్కల గెడ్డ మీదుగా ధర్మపురం తాళభద్ర మద్య రోడ్డు పూర్తిగా జలమయమై పోతుంది. తక్షణమే ఈ గెడ్డను బాగు చేయాలి. – తామాడ సన్యాసిరావు, రైతు, బొడ్డపాడు, పలాస మండలఉద్దానం ప్రాంత రైతులకు ఏకై న సాగునీటి వనరు ఈ అక్కల గెడ్డ. దీనికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. ఈ గెడ్డపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు సాగు నీటి కష్టాలు ఏటా తప్పడం లేదు. పూడిక తీయాలి. పిచ్చిమొక్కలు, మొగిలి డొంకలను తొలగించాలి. – వంకల అప్పారావు, రైతు, మామిడిపల్లి, పలాస మండలం -
సారా స్థావరాలపై దాడులు
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్రా, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా బుధవారం దాడులు నిర్వహించారు. కొత్తూరు, మెళియాపుట్టి, పలాస మండలాలకు అనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన పెద్ద బురుజోల, చిన్న బురు జోల, సింగిపూర్ తదితర సరిసరాల్లో 1,080 లీటర్ల నాటు సారా, 10,500 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసి, భారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఈ దాడుల్లో శ్రీకాకుళం జిల్లా ఎకై ్సజ్ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు, ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ ఎం శ్రీనివాసరావు, పాతపట్నం, పలాస, టెక్కలి, శ్రీకాకుళం టాస్క్ ఫోర్స్ ఎకై ్సజ్ అధికారులు, ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి, ఉదయ్గిరి, కాశీనగర్ ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి
● నేడు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట: చేసిన తప్పునకు క్షమాపణ చెప్పకపోగా మరింత దిగజారి ఏబీఎన్ రాధాకృష్ణ ప్రవర్తిస్తున్నందుకు నిరసనగా గురువా రం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదా స్ పిలుపు నిచ్చారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ కొత్త పలుకు కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ నాయకుల భార్యలపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక మీడియా సంస్థ అధినేత రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను, ఆడ బిడ్డలను నీచమైన భాషతో దూషించడం దురదృష్టకరమన్నారు. రాధాకృష్ణ ప్రవర్తనపై కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ‘రాధాకృష్ణ తీరు ఆక్షేపణీయం’ కంచిలి: ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ పత్రిక అధినేత రాధాకృష్ణ తీరు ఆక్షేపణీయంగా ఉందని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. ఆయన ఈ విషయమై బుధవారం సాయంత్రం ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్ల మెప్పు పొందడం కోసం, వారి నుంచి పొందిన ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తన ఎల్లో మీడియాలో ఎన్నిరకాలుగా తప్పుడు ప్రచారాలు చేయించినా కూడా ప్రజలకు వాస్తవాలు తెలుసని రామారావు అన్నారు. మహిళలను కించపరిచే విధంగా వారి మనోభావాలు దెబ్బతీసేలా, అసభ్యకర రీతిలో, సభ్య సమాజం తలతదించుకునేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై నర్తు రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అవి కొత్త పలుకులు కావని, చెత్త పలుకులు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ మహిళను దూషించినా చర్యలు తీసుకుంటామని పలుమార్లు డైలాగులు కొట్టిన నారా లోకేష్, హోం మంత్రి అనిత ఏబీఎన్ రాధాకృష్ణపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎచ్చెర్ల: ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో గత ఐదురోజులుగా నిర్వహిస్తున్న ఫేర్వెల్ డే వేడుకలను బుధవారం ఘనంగా ముగించారు. ఈసీఈ ఇంజినీరింగ్ విభాగం వారు ఈ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొఫెసర్ సండ్ర అమరేంద్రకుమార్ మాట్లాడుతూ ఐదు రోజులు పాటు వినోద కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, వెల్ఫేర్ డీన్లు సింహాచలం, యోగీశ్వరి, గగనదీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ వ్యాఖ్యలు జుగుప్సాకరం
ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదురుగా నిరసన వ్యక్తం చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు ఏబీఎన్ రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలిఅడుగడుగునా ఆంక్షలే.. శాంతియుతంగా ఆందోళన చేసేందుకు వచ్చిన నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. పోలీస్ క్వార్టర్స్ వద్దకు చేరుకున్న నాయకులను పోలీసులు ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ జోక్యం చేసుకుని.. అక్కడ ఎలాంటి అంతరాయం కలిగించబోమని శాంతియుతంగా నిరసన తెలుపుతామని, ఏదైనా జరిగితే తనను అరెస్ట్ చేయవచ్చని తెలిపారు. దీంతో వీరిని నిరసనకు పంపించారు. ర్యాలీ చేయకూడదని నివారించారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదురుగా ప్లకార్డులు ప ట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో యువ నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్య తన వర్గంతో ఇక్కడకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వీరిని పోలీసులు రోప్ సాయంతో ఇక్కడ నుంచి పక్కకు తరలించారు. హైవేపై మోహరించిన పోలీసులు ఎవరినీ ఇటువైపు రానీయకుండా అడ్డుకున్నారు. డీఎస్పీ వివేకానంద, సీఐ అవతారంతోపాటు జిల్లాలో పదిమంది ఎస్ఐలు, సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నాను శాంతియుతంగా ముగించి పంపించారు. ఆమదాలవలసలో చింతాడ రవికుమార్ను అడ్డుకుంటున్న పోలీసులువైఎస్సార్సీపీ నేతల వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులుఎచ్చెర్ల: మహిళలపై అవమానకర వాఖ్యలు చేసిన ఏబీఎన్, అంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్చేశారు. ఎచ్చెర్లలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదురుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్యలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన రాధాకృష్ణ రాష్ట్ర మహిళలందరికీ తలవంచి క్షమాపణ చెప్పాల్సిందేనని వైఎస్సార్ సీపీ నేతలు కోరారు. మహిళలకు గౌరవం ఇస్తామని చెప్పుకునే కూటమి నాయకులు ఈ ఘటనపై స్పందించకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన రాధాకృష్ణపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్చార్జి సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు కిల్లి వెంకట సత్యనారాయణ, అసెంబ్లీ నియోజక వర్గ పార్టీ పరిశీలకులు దుంపల లక్ష్మణరావు, అంధవరపు సూరిబాబు, పిన్నింటి సాయికుమార్, కరిమి రాజేశ్వరరావు, ఎన్ని ధనుంజయ్, తూర్పు కాపు, కాళింగ, వెలమ సామాజిక విభాగాల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, ఆరంగి మురళీధర్, అంబటి శ్రీనివాస్, ఎంపీపీ పైలా వాసుదేవరెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ సెక్ర టరీ నర్తు నరేంద్ర, పార్టీ నాయకులు తడక జోగారావు, బొడ్డేపల్లి పద్మజ, సనపల నారాయణరావు, చింతాడ సూర్య నారాయణ, జరుగుళ్ల శంకరరావు, లావేరు జెడ్పీ టీసీ మీసాల సీతంనాయుడు, మేధావుల ఫోరం ప్రతినిధి పిల్లల రామక్రిష్ణ, పైడి శ్రీనివాసరావు, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, పొందూరు మండల పార్టీ అధ్యక్షులు బోర సాయిరాం, దన్నాన రాజీనాయుడు, గొర్లె శ్రీనివాసరావు, కొంచాడ రమణమూర్తి, లండ కిరణ్కుమార్, గొర్లె ప్రభాకరనా యుడు, మీసాల శ్రీనివాసరావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గురాన మానస, కెల్ల రామకృష్ణ, అల్లు కన్నబాబు, మాడుగుల జగదీష్, డొంక రమణ, తండ్యాన లక్ష్మణ, మహంతి విజయలక్ష్మీ, గుదే శారద, వెంకన్నగారి శ్రీను, సివిల్ప్రసాద్, రౌతు శంకరరావు, గుమ్మడి రాంబాబుపాల్గొన్నారు. కాశీబుగ్గలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్ -
‘కార్గో ఎయిర్పోర్టు భూ సేకరణను వ్యతిరేకిస్తున్నాం’
మందస: మందస మండలం భేతాళపురం రైతులు కార్గోఎయిర్ పోర్టుకు వ్యతిరేకిస్తూ భూ వివరాల జాబితాపై నిరసన తెలిపారు. ఈ సందర్భంలో మందస ఎమ్మార్వో కార్యాలయం, పలాస ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి తమ ఆందోళన వ్యక్తం చేశారు. మందస ఎమ్మార్వో మిస్క శ్రీకాంత్కు మెమొరాండం అందజేశారు. కార్యక్రమంలో మడియా పురోషోత్తం, బత్తిన దేశయ్య, బొడ్డు శంకర్రావు, బత్తిని కృష్ణరావు, గార ఆనందరావు, బత్తిని ఉమాపతి, కీలు భీమారావు, ఇరోతు దేవరాజు, మడియా జగన్నాథం, ఆడతాల కూర్మారావు, మడియా ఋషి, బత్తిని మాధవరావు, బత్తిన మహేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. సినీ నటుడు శివాజీ రాజాకు సత్కారం వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలో గల పల్లిసారథిలో బుధవారం ప్రముఖ సినీ నటుడు శివాజీ రాజాను ఏపీ తెలుగు ఫిలిం ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కుమార్ నాయక్ సత్కరించారు. డొక్క కృష్ణారావు స్వీయ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చలన చిత్రంలో పలు సన్నివేశాలు ఉద్దాన ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం పల్లిసారథి ప్రాంతంలో చలన చిత్ర షూటింగ్ జరిగింది. చిత్రంలో నటించేందుకు శివాజీ రాజా వచ్చారు. కాగా హీరోగా, ప్రతి నాయకుడిగా సుమారు 500 పైచిలుకు సినిమాల్లో నటించినట్లు తెలిపారు. పెళ్లి సందడి, కళ్లు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. ఈ ఉద్దాన ప్రాంతంలో పర్యటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సత్కా రం చేసిన వారిలో ఫెడరేషన్ సభ్యులు కొండల ప్రకాశ్, షేక్ రాజాబాబు, మేకప్ ఆర్టిస్ట్ ఈశ్వరరావు తదితరులు ఉన్నారు. జనసేన, టీడీపీ నాయకుల కుమ్ములాట రణస్థలం: లావేరు మండలంలోని కొత్తరౌతుపేట గ్రామంలో కూటమి నాయకులు ఆల య నిర్మాణ స్థలంపై గొడవ పడ్డారు. స్థానికులు, లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కొత్తరౌతు పేట గ్రామంలో కొంత స్థలంలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించేందుకు టీడీపీ నాయకులు, గ్రామస్తులు పూనుకున్నారు. బుధవారం ఉదయం ఆ స్థలంలో కొలతలు వేస్తుండగా స్థానిక జనసేన నాయకుడు మా ఇంటికి వెళ్లే రోడ్డుకు అడ్డంగా ఆలయ నిర్మాణం కట్టడం సరికాదని నిలదీశారు. ఇరు పక్షాల మధ్య కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని తోసుకున్నారు. దీంతో జనసేన నాయకుడు 100కి ఫోన్ చేయడంతో లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి వెళ్లి పరిస్థితిని గమనించి గొడవ పడవద్దని ఇరుపక్షాలకు సూచించారు. రెవెన్యూ అధికారులు వచ్చి కొలతలు వేసిన తర్వాత పనులు చేపట్టాలని చెప్పి వెనుదిరిగారు. -
గుండెపోటుతో ఉపాధి వేతనదారు మృతి
జి.సిగడాం: మండలంలోని వాండ్రంగి గ్రామంలో ఉపాధి పను లు చేస్తూ గుండెపోటుతో పప్పల భాస్కరరావు (59) ఒకేసారి కుప్పకూలిపోయారు. తోటి వేతనదారులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని కొత్త చెరువులో బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఉపాధి పనులు చేస్తున్నారు. సుమారుగా 10.30 గంటల సమయంలో భాస్కరరావు ఉన్నట్టుండి పని చేస్తున్న ప్రదేశంలోనే కుప్పకూలిపోయారు. 108 వాహనం వచ్చే సరికే ఆయన మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతి చెందిన విషయం తెలుసుకుని ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బూరాడ వెంకటరమణ, ఏపీఓ చోళ్ల సత్యనారాయణ, వీఆర్ఓ శివనారాయణ సంఘటన స్థలం చేరుకుని వివరాలు సేకరించారు. వేతనదారు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని తోటి వేతనదారులు కోరారు. -
తీసుకున్నారా..?
మ్యారేజ్ సర్టిఫికెట్ ..● మ్యారేజ్ సర్టిఫికెట్ అత్యంత కీలకం ● రిజిస్ట్రేషన్తో సర్టిఫికెట్ జారీ ఇచ్ఛాపురం: ఇటీవల సీజన్లో పెళ్లిళ్లు జోరుగా జరిగాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన కొత్త జంటలు వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీరి జీవితం కొత్తగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రభుత్వం పథకాలు రావాలన్నా, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయించాలన్నా, పాస్పోర్టు, భూములకు సంబంధించిన మ్యుటేషన్లు ఇతరత్రా అవసరాలు ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పటికప్పుడు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతూ చివరికి సర్టిఫికెట్ల కోసం బ్రోకర్లపై ఆధారపడి ఎక్కువ మొత్తంలో సొమ్ములు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను కొత్త జంట ముందుగానే గుర్తించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్ పొందితే వారికే మంచిది. పాస్పోర్టు అప్లికేషన్, బ్యాంక్ జాయింట్ అకౌంట్, కేంద్ర, రాష్ట్ర రక్షణ బలగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి సర్వీస్ రికార్డుల్లో పేరు చేర్చుకునేందుకు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి వీసాప్రాసెస్, వీటితో పాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ సర్టిఫికెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నవ వధూవరులు పెళ్లి చేసుకొనే ప్రదేశం ఆధారంగా గ్రామం ఐతే గ్రామ సచివాలయం లేదా పంచా యతీ కార్యాలయం, పట్టణం ఐతే వార్డు సచివా లయం లేదా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం వివాహ శుభలేఖ, జీలకర్ర బెల్లం తలపై పెట్టుకున్న వధూవరుల ఫొటో, మంగళసూత్రం కట్టేటప్పుడు ఫొటో, పూల దండలు మార్చుకున్నప్పుడు ఫొటోలు ఉండాలి. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె జనన ధ్రువీకరణ పత్రాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుల జిరాక్సులను జతచేయాలి. నవవధూవరుల తరఫున ఇద్దరు సాక్షులు, వారి ఆధార్ కార్డుల జిరాక్సు లను గ్రామ/వార్డు సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయంలోగానీ మున్సిపల్ కార్యాలయంకు గానీ అందజేయాలి. జత చేసిన ధ్రువీకరణ పత్రాలను జనన, మరణ రిజిస్ట్రేషన్ అధికారి పరిశీలించి సర్టిఫికెట్ని జారీ చేస్తారు. ఆలయాల్లో వివాహం చేసుకుంటే దేవదాయ శాఖకు మందస్తుగానే రుసుం చెల్లిస్తే అధికారులు రశీదులు ఇస్తారు. వాటి ఆధారంగానే వివాహానికి సంబంధించిన ఇతర పత్రాలు ఫొటోలు సాక్షుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఇళ్లు, కల్యాణ మండపాల్లో సంప్రదాయంగా వివాహం చేసుకుంటే అందుకు తగ్గ అన్ని రకాలు పత్రాలు సమర్పించి దరఖాస్తులు చేసుకోవాలి. పెళ్లి జరిగిన 30 రోజుల్లో మున్సిపల్, పంచాయతీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొంటే తక్కువ ఫీజు ఉంటుంది. సాధారణంగా ఫీజు రూ.100 నుంచి రూ.500 వరకు మాత్రమే ఉంటుంది. వివాహం జరిగి 90రోజులు దాటితే సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఇందుకు ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి. యు.ఉపేంద్ర, జనన,మరణ, రిజిస్ట్రేషన్ అధికారి, ఇచ్ఛాపురం మున్సిపాలిటి -
బతుకు సాగడం లేదు.. చావే దిక్కు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘పద్నాలుగేళ్లుగా వారసత్వ భూమి కోసం పోరాడుతున్నాను. న్యాయం జరగలేదు. ఇప్పుడు కటిక దరిద్రం అనుభవిస్తున్నాను. కానీ ఆదుకునే వారు లేరు. కనీసం పింఛనైనా ఇచ్చి కరుణించండి’ అంటూ శ్రీకాకుళం నగరానికి చెందిన లొట్టి మంగమ్మ పీజీఆర్ఎస్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఇదివరకు ఆమె ఇదే పీజీఆర్ఎస్లో అధికారుల సమక్షంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. అయినా ఆమెకు న్యాయం జరగలేదు. ఆమెకు న్యాయస్థానం అప్పజెప్పిన భూ మి రియల్ ఎస్టేట్లో పడిపోవడంతో న్యాయం కోసం తిరుగుతున్నారు. పింఛన్ కోసం కూడా రెండేళ్లుగా తిరుగుతున్నారు. ఎన్ని సార్లు తిరగాలని ఎస్డీసీ జయదేవి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. -
మ్యాథ్స్ ఒలింపియాడ్లో విద్యార్థుల ప్రతిభ
కంచిలి: కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్, న్యూఢిల్లీ వారు నిర్వహించిన మ్యాథ్స్ ఒలింపియాడ్–2025 పరీక్షలు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. బంగారు, రజత, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. వీటిని సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.చాణక్య, మిగతా ఉపాధ్యాయులు మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు. బంగారు పతకాలను సాయి కిషోర్ పాత్రో, మల్లార్పు బాలకృష్ణ, గుడియా యువశ్రీ, రజిత పతక విజేతలైన మారేడు దీపిక, నక్క పవన్, గణప అవంతిక, కొండా శ్యాం, కాంస్య పతక విజేతలైన లోపింటి ధనలక్ష్మి, గుడియా చరణ్, గగన్ పాత్రో, లండ ప్రసాద్రెడ్డి, యజ్జల పూజ ఉన్నారు. ఒలింపియాడ్ కోసం ప్రత్యేక తర్ఫీదునిచ్చిన గణిత ఉపాధ్యాయులు అశోక్ కుమార్, సూర్యప్రకాశ్, ప్రసాదరావు, సుధాకర్లను హెచ్ఎం సత్కరించారు. -
మిషన్.. అడ్మిషన్
● ఇంటర్ అడ్మిషన్ల వేట ● సంక్రాంతి నుంచే కార్పొరేట్ కాలేజీల హవా మేము విశాఖలో కార్పొరేట్ కాలేజీ నుంచి వచ్చాం. మీ అమ్మాయి బాగా చదువుతుందట. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెస్తుందట. అందుకే తెలుసుకొని వచ్చాం. మా కాలేజీలో చేర్పించండి. అమ్మాయి భవిష్యత్కు మాది భరోసా. మంచి విద్యాబోధనతో పాటు అన్నిరకాల వసతులు ఉంటాయి. ఆలస్యం చేస్తే అడ్మిషన్లు పూర్తవుతాయి. ఇలాంటి అవకాశం మీకు రాదు. కొంత మొత్తం అడ్వాన్స్ కట్టి అడ్మిషన్ను ఖరారు చేసుకోండి. – ఎల్ఎన్పేటకు చెందిన వెన్నెల అనే విద్యార్థిని తల్లిదండ్రులను కార్పొరేట్ ప్రతినిధులు ఒప్పిస్తున్న తీరు ఇది.. హిరమండలం: టెన్త్ పరీక్షలు అయ్యాక కాలేజీల్లో అడ్మిషన్ల కోసం కార్పొరేట్ కళాశాలలు పెద్ద మిషనే మొదలుపెట్టాయి. నిజానికి పరీక్షల ముందు నుంచే విద్యార్థుల వేట మొదలైంది. తాజాగా పరీక్షలన్నీ ముగియడంతో ప్రచారాలు పతాక స్థాయికి చేరుకుంటు న్నాయి. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా నడిచే కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి పీఆర్వోలు వందలా ది మంది జిల్లాలో ఉన్నారు. వారు విద్యాశాఖ వద్ద ఉన్న పదో తరగతి విద్యార్థుల వివరాలు తీసుకొని తల్లిదండ్రులను కలుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పిల్లాడు చేజారిపోకూడదనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. వీరి దూకుడుకు జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలు ఉన్నా అడ్మిషన్ల విషయంలో వెనుకబడుతున్నాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 38, ఆదర్శ పాఠశాలలు 13, కేజీబీవీలు 25, ప్లస్ 2 పాఠశాలలు 6, గురుకుల పాఠశాలలు 9 ఉన్నాయి. ప్రతి సంవత్సరం 20 వేలకుపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. గత ఏడాది పదో తరగతి విద్యార్థులు 28,176 మంది పరీక్షలకు హాజరుకాగా.. 23,219 మంది ఉత్తీర్ణత సాధించారు. కానీ ఇందులో కేవలం 6,491 మంది మాత్రమే జిల్లాలో ఇంటర్లో చేరారు. ఈ ఏడాది 29,362 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరికలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నా యి. అధ్యాపకుల కొరత విద్యాబోధనపై ప్రభావం చూపుతోంది. అటు ఆశించిన స్థాయిలో జూనియర్ కాలేజీల్లో వసతులు ఉండడం లేదు. ఉత్తీర్ణతా శాతం అంతంత మాత్రమే. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. వైఎస్సార్సీపీ హయాంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేజీబీవీల్లో ఇంటర్ కాలేజీలను అప్గ్రేడ్ చేశారు. సంప్రదాయ కోర్సులతో పాటు సాంకేతిక కోర్సులు సబ్జెక్టులను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఉద్యోగం, ఉపాధినిచ్చే కోర్సులు సైతం వచ్చాయి. అలాగే 2021లో నరసన్నపేట మండలం ఉర్లాం, సరుబుజ్జిలి మండలం రొట్టవలస, పలాస మండలం బ్రాహ్మణతర్లా, మందస మండలం హరిపురం, వజ్రపుకొత్తూరు మండలం వజ్రపుకొత్తూరు, టెక్కలి మండలం టెక్కలిలో ప్లస్ 2గా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను అప్గ్రేడ్ చేశారు. అప్పట్లో ఇవన్నీ విద్యార్థులతో నిండిపోయి కళకళలాడేవి. కానీ గత రెండేళ్లలో సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. వేసవిలో అధికారులు అవగాహన పెంచుతున్నా విద్యార్థులు ఆసక్తి చూపని పరిస్థితి. పీఆర్వోల హల్చల్ జిల్లా నుంచి ఎక్కువగా విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల్లో చేరుతున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్న 71 జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తవుతున్నాయి. కానీ ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాత్రం సీట్లు నిండడం లేదు. సంక్రాంతి నుంచే కార్పొరేట్ కంపెనీల పీఆర్వోలు గ్రామాల్లో ప్రవేశిస్తున్నారు. విద్యార్థుల అడ్మిషన్లు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి ఫీజులతో పాటు హాస్టల్కు రూ.2 లక్షలకుపైగా వసూలు చేస్తున్నారు. మీ పిల్లాడు చాలా బాగా చదువుతాడట. అందుకే తెలుసుకొని వచ్చాం. మా కాలేజీలో చేర్పిస్తే పిల్లాడి భవిష్యత్కు మాదీ భరోసా. విద్యార్థికి ఇంటర్ కీలకం. అందుకే మా కాలేజీలో చేర్పించండి. మంచి విద్యా బోధనతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించి అన్నిరకాల శిక్షణలు ఇస్తాం. నీట్, జేఈఈ, ఎంసెట్ ఇలా అన్ని రకాల శిక్షణలు ఉంటాయి. ముందుగా చేరితే ఫీజుల్లో రాయితీ ఉంటుంది. ఆలస్యం చేస్తే వెనుకబడి పోతారు. – హిరమండంలో శ్రీనివాస్ అనే పదో తరగతి విద్యార్థి తల్లిదండ్రులను కలిసి కార్పొరేట్ కాలేజీ ప్రతినిధులు చెప్పిన మాట ఇది..ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు చేరాలి. ఇక్కడ ఉత్తమ విద్యాబోధనతో పాటు సౌకర్యాలు ఉంటాయి. సామాన్య, మధ్యతరగతి వారికి ఇవి ఎంతో మేలు. అనవసరం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి భారం పడవద్దు. కేజీబీవీల్లో విద్యార్థినులు చేరాలి. ఇక్కడ ఉత్తమ విద్యాబోధన, రక్షణ, వసతులు ఉంటాయి. సద్వినియోగం చేసుకోవాలి. – కృష్ణవేణి, ఎస్ఓ, హిరమండలం కేజీబీవీ -
వెలుగుతూనే ఉంటాయి
కొత్తూరు: మండలంలోని కడుము గ్రామ పంచాయతీ పరిధిలోని కడుము, కడుము కాలనీ, గొట్లభద్ర, జగన్నాథపురం గ్రామాల్లో వీధి లైట్లు చాలాకాలంగా వెలుగుతూనే ఉన్నాయి. పగలు, రాత్రి ఇవి వెలుగుతూనే ఉండడం విశేషం. ట్రాన్స్ కో అధికారులకు పంచాయతీ సర్పంచ్తో పాటు గ్రామస్తులు పలు దఫాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. తుఫాన్ సమయంలో వీధి లైట్లకు సంబంధించిన వైర్లు పాడైపోయాయి. అప్పటి నుంచి వీధి లైట్లకు కేబుల్ వేయలేదు. ఇంటికి సంబంధించిన వైర్లతో కనెక్షన్ ఇచ్చారు. దీంతో వీటిని ఆఫ్ చేసే అవకాశం లేకుండాపోయింది. ట్రాన్స్ కో అధికారులు స్పందించి స్ట్రీట్ లైన్కు సంబంధించి కేబుల్ ఏర్పాటు చేయలని పలువురు కోరుతున్నారు -
పిడుగు పడి వ్యక్తి మృతి
మందస: మందస మండలం పుచ్చపాడు గ్రామంలో మంగళవారం సాయంత్రం పిడుగు పడి వృద్ధుడు మృతి చెందారు. గ్రామానికి చెందిన శిష్టు బీమారావు(72) ఊరిలోని రావి చెట్టు చెరువు వద్దకు వెళ్లి కాళ్లు కడుగుతుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే నీటిలో పడి ప్రాణాలు వదిలేశారు. సాయంత్రం అటుగా వెళ్తున్న గ్రామస్తులు బీమారావును గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పోలీసులకు కూడా సమాచారం అందజేశారు. ఎస్ఐ కె.కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని హరిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే అంబుగాం గ్రామంలో ఇంటిపై పిడుగు పడి ఓ మహిళ అస్వస్థతకు గురైంది. భిన్నళమదనాపురంలోనూ చెట్టుపై పిడుగు పడి పక్కన ఉన్న పూరి గుడిసైపె మంటలు రేగాయి. రైలు ఢీ కొని యువకుడు..పాతపట్నం: మండలంలోని తెంబూరు రైల్వే స్టేషన్ సమీపంలోని తెంబూరు ఎస్సీ వీధి సమీపంలో రైలు ఢీ కొని తెంబూరు ఎస్టీ వీధికి చెందిన గిట్టంగి హిమగిరిరావు(20)మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... మంగళవాం సాయంత్రం గుణుపూర్ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలు తెంబూరు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత.. తెంబూరు ఎస్సీ వీధి సమీపంలో గిట్టంగి హిమగిరిరావును ఢీకొంది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తండ్రి గిట్టంగి అప్పలస్వామి, తల్లి గిట్టంగి లక్ష్మి ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి..రణస్థలం: లావేరు మండలం తాళ్లవలస గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు పోవు ఎన్హెచ్–16 రోడ్డు మీద సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఆ వ్యక్తి అక్కడక్కడే మృతి చెందాడు. తాళ్లవలస వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేశారు. మృతుని శరీరంపై బిస్కట్ రంగు చొక్కా లుంగీ ధరించి ఉన్నారు. వివరాలు తెలిస్తే సమాచారం అందిచాలని లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి తెలిపారు. వివరాలు తెలిస్తే ఫోన్ నంబర్స్ 6309990816, 6309990851 నంబర్లకు తెలియజేయాలని సూచించారు. శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సంపద పంపిణీతోనే సామాజిక న్యాయమని, జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ జయంతులను వాడవాడలా నిర్వహించి సామాజిక న్యాయ వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు. శ్రీకాకుళం సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ దేశంలో కొద్దిమంది దగ్గర పోగుపడిన సంపదను వివిధ పన్నుల ద్వారా సేకరించి పునఃపంపిణీ చేయడం ద్వారా సామాజిక న్యాయం సాధించాలని, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న అన్ని శ్రామిక సంఘాలు, దళిత, బహుజన, మైనార్టీ, మహిళా సంఘాలు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. మోదీ 12 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి రాజ్యాంగానికి ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం అంటేనే బిలియనీర్లు, కార్పొరేట్ల ప్రభుత్వమని పేరు పొందిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వై.వేణు తదితరులు పాల్గొన్నారు. -
పోర్టుకు పోదాం సభతోనే ప్రభుత్వంలో చలనం
● వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ టెక్కలి: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన పోర్టుకు పోదాం పదండి కార్యక్రమం విజయవంతం కావడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చలనం కలిగిందని, దీంతో మంత్రులను పోర్టుకు పరుగులు పెట్టించారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ అన్నా రు. మంగళవారం టెక్కలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మూలపేట పోర్టు పనులపై మంత్రి అచ్చెన్నాయుడు పదే పదే చెబుతున్న అబద్ధాలు ఒక్క సారిగా బహిర్గతమయ్యాయని తిలక్ ఎద్దేవా చేశారు. పోర్టు పనులు 70 శాతం మాత్రమే జరిగాయని ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి చెప్పడంతో పోర్టు పరిశీలించిన కూటమి నాయకులు అవాక్కయ్యారని తిలక్ పేర్కొన్నారు. పోర్టు పనులపై కనీసం అవగాహన లేకుండా కేవలం ఆర్డీవో అందజేస్తున్న స్క్రిప్ట్తో మంత్రి అచ్చెన్నాయుడు లేనిపోని అబద్ధాలు చెబుతూ వచ్చారని తిలక్ మండిపడ్డారు. దమ్ముంటే 2024 ఎన్నికల నాటికి పోర్టు పనులు చేపట్టిన విశ్వ సము ద్ర సంస్థకు ఎంత మేరకు బిల్లులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని తిలక్ డిమాండ్ చేశారు. కేవలం మంత్రి పదవి కాపాడుకోవడానికే అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దశాబ్దాలుగా అధికారం దక్కించుకుంటున్న మంత్రి అచ్చెన్నాయుడు ఆయన కుటుంబ సభ్యులు ఈ జిల్లాకు గానీ, టెక్కలి నియోజకవర్గానికి గానీ ఎలాంటి శాశ్వత అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి వైఎస్ జగన్ వేల కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. మూలపేట పోర్టు, నిర్వాసిత కాలనీ, రోడ్లు, రైల్వే మార్గాలు ఇతర అవసరాల కోసం గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని రకాల అనుమతులతో పా టు ఆర్థిక వనరులు సైతం ఇచ్చారని గుర్తు చేశారు. రెండేళ్ల కూటమి పాలనలో కనీసం నిర్వాసిత కాలనీ కూడా పూర్తి చేయలేని అసమర్థత మంత్రి అచ్చెన్నాయుడు అని తిలక్ మండిపడ్డారు. సమావేశంలో సంతబొమ్మాళి జెడ్పీటీసీ పాల వసంత్రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి సత్తారు సత్యం, యువజన విభాగం అధ్యక్షుడు చిన్ని జోగారావు, ఆర్టీఐ వింగ్ అధ్యక్షుడు బి.రాజేష్ తో పాటు డి.ఈశ్వరరావు ఉన్నారు. -
తీవ్ర నష్టం
అకాల వర్షం..శ్రీకాకుళం రూరల్: అకాల వర్షం కారణంగా జొన్న, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల పరిధిలోని కళ్లేపల్లి పంచాయతీ పరిధిలోని బందరువానిపేట, మోఫస్బందరు, పరదేశీపాలెం, ఇప్పిలి, తదితర ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం కురిసిన తీవ్రగాలులకు, వర్షానికి ఈ నష్టం వాటిల్లిందని మండల వ్యవసాయాధికారి నవీన్ తెలిపారు. వడగళ్ల వాన కంచిలి: మండలంలో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్ష బీభత్సంతో మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో నష్టాలు ఏర్పడ్డాయి. ఈదురుగాలులు వీయడంతో రేకులు ఎగిరి పడటం, చెట్లు కూలిపోవడం, గోడలు కూలిపోవడం, జీడి, మామిడి పిందెలు రాలిపోవడం వంటి నష్టాలు ఏర్పడ్డాయి. మండపల్లి గ్రామంలో మాదిన ధనుంజయకు చెందిన రేకుల షెడ్డులో రేకులు ఎగిరిపడి, పక్కనే ఉన్న సోలార్ యూనిట్ ప్యానల్స్ మీద పడ్డాయి. కుదేలైన అరటి రైతులు జి.సిగడాం : అరటి పంట సాగు చేసిన రైతుల ఆశలు ఆవిరైపోయాయి. పంట చేతికొచ్చిన సమయంలో అకాల గాలి వాన పంటలను ధ్వంసం చేసిందని వెంకయ్యపేట గ్రామానికి చెందిన గల్లా కృష్ణ ఆందోళన చెందుతున్నారు. రెండు ఎకరాలు అరటి తోట ఈనెల 6న వీచిన గాలలుకు పూర్తిగా నేలమట్టం అయిపోయిందని వాపోయారు. ఎకరాకు సుమారుగా 80 వేలు రూపాయల వరకు మదుపులు పెట్టామని వాపోతున్నారు. పంట చేతికి వస్తున్న సమయంలో ఇలాంటి వానలు రావడంతో రైతన్న దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. -
సోంపేటలో వర్ష బీభత్సం
సోంపేట: సోంపేటలో మంగళవారం మధ్యా హ్నం మూడు గంటల నుంచి 5 గంటల వరకు వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. చెట్లు పడిపోవడంతో పాటు, విద్యుత్ వైర్లు నేలకొరిగాయి. మండలంలోని సాగుచేస్తున్న ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బెంకిలి, జింకిభద్ర, పలాసపురం, బారువ గ్రామాల్లో టమాటా సాగు చేస్తున్న రైతులకు తీరని నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన పంట వర్షానికి తుడిచిపెట్టుకుపోవడంతో రైతన్న ముఖంలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా టమాటా పంట కొద్దిగా ధర పెరుగుతుండటంతో రైతుల్లో ఆశలు కనిపించాయి. పాడైపోయిన టమాటా పంటను ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ మంగళవారం సాయంత్రం పరిశీలించి, రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి కోరారు. -
మీకు నీరు.. మాకు కన్నీరా..?
● తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆఫ్షోర్ నిర్వాసితులు ● గ్రామాలను త్యాగం చేసి, న్యాయం కోసం దీక్షలు ● నేటికీ 132 కుటుంబాలకు అందని పరిహారాలు ● 300 రోజులుగా దీక్షలు ● పట్టించుకోని అధికారులు, నాయకులు వలస కూలీలమని.. నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఇద్దరు పిల్లలతో కాలం వెళ్లదీస్తున్నా. వలస కూలీగా ఉన్నానని, అధికారుల తప్పుగా నమోదు చేయడం వల్ల నాకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదు. నేనెలా బతకాలి. అధికారులు నాకు న్యాయం చేసి పరిహారం ఇప్పించాలి. – ఇప్పిలి వరలక్ష్మీ, చీపురుపల్లి గ్రామం గ్రామాన్ని ఇచ్చి దీక్షలు చేయాలా..? సర్వస్వం అర్పించాం. గ్రామాలను విడిచి కన్నీటితో బయట బతుకుతున్నాం. నా కుటుంబానికి ఒక్క పైసా ప్యాకేజీ రాలేదు. నాకు ముగ్గురు పిల్లలు. నిర్వాసితుడినైనా పరిహారానికి నోచుకోలేదు. న్యాయం కోసం దీక్షలు చేయాల్సిన దుస్థితి ఎదురైంది. – నందిగాం భాస్కరరావు, చీపురుపల్లి గ్రామం మెళియాపుట్టి: మండలంలోని ఆఫ్షోర్ రిజర్వాయర్కు భూములు, ఇళ్లు, గ్రామాలను సైతం త్యాగం చేసిన వారు ఇప్పుడు న్యాయం కోసం రోడ్డెక్కే దుస్థితి దాపురించింది. మండలంలోని చీపురుపల్లి, దాసుపురం, సవరచీపురుపల్లి గ్రామాల్లో నిర్వాసితులు ఉన్నారు. ఆఫ్షోర్ రిజ ర్వాయర్లో మెళియాపుట్టి, టెక్కలి, నందిగాం మండలాలకు చెందిన పలు గ్రామాలు ఉండడంతో నిర్వాసితులకు న్యాయపరంగా వారికి ప్యాకేజీలు అందించాల్సి ఉంది. అయితే వారికి తగిన న్యాయం జరగకపోవడంతో వారు నిరాహార దీక్షలు ప్రారంభించారు. మే 22న చీపురుపల్లి గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. నేటికి 300 పైచిలుకు రోజులైనా స్పందించే వారే కరువయ్యారని నిర్వాసి తులు వాపోతున్నారు. అర్హులైన 132 మందికి నేటికి కూడా పరిహారాలు అందలేదు. గ్రామంలో 14.55 ఎకరాల డి–పట్టాభూములకు సైతం పరి హారం అందించలేదని నిర్వాసితులు తెలిపారు. అంతేకాకుండా సుమారు 240 మంది యువతకు ప్యాకేజీలు అందించలేదని, 360 కుటుంబాలకు 5 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరినా ప్రభు త్వం పట్టించుకోవడం లేదని, హిరమండలం నిర్వాసితులకు ఇచ్చిన 460 జీఓ ప్రాప్తికి పూర్తిస్థాయి ప్యాకేజీలు ఇవ్వాలని అన్నారు. చెల్లింపు ల్లో తేడాలు ఉన్నాయని, వాటిని సవరించి ఇళ్లకు పరిహారం ఇవ్వాలని యవ్వారి ఈశ్వరరావు, నందిగాం జగన్నాయకులు, గుమ్మడి మల్లేసు, నందిగాం హేమలత, చిన్నమ్మి, కొక్కిరి కిరణ్, ఉమాశంకర్, వెంకటరమణతోపాటు పలువురు నిర్వా సితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్వాసిత గ్రామాల్లో ద్విచక్రవాహన ర్యాలీ, స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం, కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, వినతిపత్రం సైతం అందించారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సైతం నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినా వారి సమస్యలు పరిష్కారం కాలేదని నిర్వాసిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జిల్లా మంత్రు లు, అధికారులు స్పందించి న్యాయం చేయకపో తే పోరాటాలు చేస్తామని వారు హెచ్చరిస్తున్నా రు. వీరు కోర్టుకు కూడా వెళ్లారు. -
మీతోటి కష్టమే!
శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో పోస్టుమార్టం కష్టాలు ఎదురవుతున్నాయి. పుట్టెడు దుఖంలో ఉండే రోగి బంధువులకు చెప్పలేని కష్టాలు కలుగుతున్నాయి. ఇంత పెద్ద ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన మార్చురీ అసిస్టెంట్లు(తోటి) లేరంటే నమ్మాల్సిందే. వైద్య కళాశాలకు అనుబంధ వైద్యశాలగా ఉండి 950 పడకలకు స్థాయి పెరిగినా తోటీలను మాత్రం నియమించుకోలేకపోయారు. మార్చురీలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నలుగురు మార్చురీ అసిస్టెంట్లు పనిచేస్తుండేవారు. వీరిలో ఇద్దరు పదవీ విరమణ చేయగా, ఆ పోస్టులు తిరిగి భర్తీ చేయలేదు. మిగిలిన ఇద్దరికీ పోస్టుమార్టం పనుల్లో పెద్దగా అనుభవం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నా యి. కొన్ని రోజుల కిందట బుడుమూరు సమీపంలో జరిగిన ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందగా వారి మృతదేహాలను పోస్టుమార్టం అనంత రం బంధువులకు అప్పగించేందుకు 24 గంటలకు పైగా పట్టడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశా రు. మృతుని బంధువులు సాయం చేయడంతో శవ పరీక్ష పూర్తి చేయగలిగారు. దాదాపు నెల రోజులు గా పరిస్థితి ఇలాగే ఉంది. మార్చురీలో ఉన్న ఇద్దరు అసిస్టెంట్లకు పెద్దగా అనుభవం లేకపోవడం, కాస్తంత బెరుకు ఉండడంతో పారిశుద్ధ్య విభాగంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న వ్యక్తికి చెందిన బంధువులను అనధికారికంగా తీసుకువచ్చి వీరి ద్వారా పోస్టుమార్టం చేయిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇష్టారీతిన పోస్టుమార్టం చేయడంతో మృతదేహాలు ఛిన్నాభిన్నమవుతున్నాయనే వా దన ఉంది. పోస్టుమార్టం కోసం చెల్లింపులు కూడా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ వారిని పోగొట్టుకొని మృతదేహాన్నైనా సక్రమంగా ఇంటికి తీసుకువెళదాం అనుకునే వారికి అది కూడా సాధ్యం కావడం లేదు. రిమ్స్లో నిత్యం మూడు నుంచి ఐదు వరకు పోస్టుమార్టంలు నిర్వహించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన అనుభవజ్ఞులైన మార్చురీ అసిస్టెంట్లు లేకపోవడం విడ్డూరమైతే, ఉన్న వారిని అకారణంగా తొలగించడం విచారకరం. తొలగింపులతోనే ఇబ్బంది రిమ్స్లో మార్చురీలో పనిచేస్తున్న ఇద్దరు అనుభవజ్ఞులైన పారిశుద్ధ్య కార్మికులతో పాటు మరో 22 మంది పారిశుద్ధ్య కార్మికులను మార్చి 8వ తేదీ నుంచి విధుల నుంచి కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు తొలగించారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు ల మేరకు రూ.16,000 వేతనం ఖాతాలకు జమ చేయాలని, మిగిలిన రూ.2500లు పీఎఫ్, ఈఎస్ఐలకు చెల్లించాలని కోరడమే ఇందుకు కారణం. అలాగే సంస్థ ప్రతినిధులు ఓ అంగీకార పత్రంపై సంతకం చేయాలని కోరగా, అందులో ఉన్న కొన్ని షరతులు నచ్చక ఈ 24 మంది సంతకాలు చేసేందుకు నిరాకరించారు. ఈ షరతుల్లో ప్రధానమైనది సంస్థ కాంట్రాక్టు పొందిన ఏ ఆస్పత్రికై నా భారత దేశవ్యాప్తంగా వెళ్లేందుకు అంగీకరించాలని పొందుపరచడం. దీన్ని తిరస్కరించడం కూడా ఈ 24 మంది తొలగింపునకు కారణమైంది. వీరికి ఐదు నెలలు జీతాలు కూడా చెల్లించకుండా విధుల నుంచి తొలగించి, మీరు తమ సంస్థ ప్రతినిధులు కా దని చెప్పడంతో జిల్లా అధికారులు, రిమ్స్ అధికారులు, ప్రజాప్రతినిధులను కలసి వినతి పత్రాలు సమర్పించారు. విధుల్లో చేర్చుకోవాలని ఆదేశించినా కాంట్రాక్టర్ మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. రిమ్స్ వైద్య కళాశాలలో భర్తీ కాని మార్చురీ అసిస్టెంట్ పోస్టులు కొన్ని రోజుల కిందట ‘తోటీ’లను విధుల నుంచి తొలగింపు పోస్టుమార్టం నిర్వహణలో ఇబ్బందులు అనధికారిక వ్యక్తులతో పోస్టుమార్టం పనులు చేయిస్తున్న వైనం -
పోలీసులమని చెప్పి..చేతులకు బేడీలు వేసి.. దోచుకెళ్లిన ఘరానా చోరులు
● కాశీబుగ్గలో బంగారం షాపులో ఘటన ● షాపు యజమాని రెండు చేతులకు బేడీలు వేసిన వైనం ● షాపులో ఉన్న ముప్పావు కిలో బంగారంతో ఉడాయించిన దొంగలు ● అందరూ చూస్తుండగానే దొంగతనం రెక్కీ చేశారా..? చోరీ జరిగిన తీరు.. దుండగుల వేగాన్ని బట్టి చూస్తే పథకం ప్రకారం వారం రోజుల ముందే రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు 4 ద్విచక్ర వాహనాల్లో దుండగులు వచ్చారని, వాటిలో ఒక ద్విచక్రవాహనానికే నంబర్ ప్లేట్ ఉందని చెబుతుండగా పోలీసులు మూడు ద్విచక్రవాహనాలు, కారులో వచ్చారని సీసీ ఫుటేజీ దృశ్యాలను బట్టి చెబుతున్నారు. కారు హైస్కూల్గ్రౌండ్ సమీపంలో పార్క్ చేసినట్లు తెలుస్తోంది. షాపు ఉన్న ప్రాంతంలోనే రేషన్ షాపు ఉండటంతో జనాలు నిత్యం అక్కడ ఉంటారు. కానీ ఆ షాపు మంగళవారం తెరవలేదు. వాస్తవానికి వేంకటేశ్వర జ్యూయలర్స్లో ఇద్దరు సిబ్బంది అదే రోజు సెలవు పెట్టడం గమనార్హం. షాపులో సీసీ ఫుటేజీలో కూడా ఆధారాలు చెరిపేసినట్లు, జీరో బ్యాకప్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. బయట మాత్రమే సీసీఫుటేజీ ఆధారంగా దుండుగులు 12.35 గంటలకు వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దుండగులు ఈ షాపు దగ్గరకు వెళ్లాలంటే కాశీబుగ్గ పాత జాతీయ రహదారి బంకేశ్వరి మాత గుడి సందు నుంచైనా, పాతబస్టాండు దరి సంత మైదానం నుంచి భగవతి థియేటర్ మీదుగా నిత్యానందనగర్కు వచ్చి ఉంటారా లేదంటే కారు పార్కింగ్ను బట్టి ఎంపీడీఓ కార్యాలయం మీదుగా వచ్చుంటారా అన్నది తెలియాలి. వెళ్లేటప్పుడు మాత్రం మంకినమ్మ గుడి నుంచి శివాజీనగర్ మీదుగా పారిశ్రామికవాడ మీదుగా పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నేరుగా మొగిలిపాడు బ్రిడ్జికి చేరుకుని అక్కడి నుంచి గొప్పిలి లేదంటే కంబరిగాం మీదుగా గారబంద చేరి ఒడిశా వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయమై అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ 8 మంది దుండగులు చోరీకి పాల్పడ్డారని, ఒక కారు, 3 ద్విచక్రవాహనాల్లో వచ్చారని, నాలుగు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని, బయట గ్యాంగుల పనే ఇదని అనుమానిస్తున్నట్లు చెప్పారు. పలాస/శ్రీకాకుళం క్రైమ్: ఆ వీధులన్నీ తెలిసినట్టే వారు వచ్చారు.. రోడ్లన్నీ పరిచయం ఉన్నట్టుగానే బైకులు పార్క్ చేశారు.. ఏ సమయానికి ఏం చేయాలో ముందే అనుకున్నట్టు అరగంటలో పని పూర్తి చేశారు. ఎలా వెళ్లాలో ముందే నిర్ణయించుకున్నట్లు వాహనాలను పోనిచ్చారు. కాశీబుగ్గలో పట్ట పగలు ఓ బంగారం షాపులోకి ప్రవేశించిన దొంగలు దర్జాగా దొంగతనం చేశారు. విజిలెన్స్ పోలీసులమంటూ భయపెట్టి, యజమాని చే తులకు బేడీలు వేసి దొరికింది దోచుకుని వెళ్లిపో యారు. స్థానికంగా ఈ ఘటన సంచలనమైంది. స్థానికులు, పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. సుమారు 8 ఏళ్ల కిందట త్రిపాఠి క్వార్టర్స్ వీధి లోని తన సొంత ఇంటి వద్దనే శ్రీ వేంకటేశ్వర జ్యూయలర్స్ షాపును కిల్లంశెట్టి రామకృష్ణారావు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఈ దుకాణం ఉన్నట్టు చాలా మందికి తెలియదు. నిత్యానందనగర్కు ఒక మూలలో ఉంటుంది. ఎప్పటి లాగే కిల్లంశెట్టి రామకృష్ణారావు దుకాణం తెరిచి కూర్చున్నారు. తన గుమస్తా శోభన్బాబు(అప్పలాచారి)ని రశీదు బుక్కులు తీసుకురమ్మని పంపించారు. అతను వెళ్లిన కొద్ది సేపటికే కాశీబుగ్గ నిత్యానగర్ నుంచి నాలుగు బైకుల మీద మొ త్తం 8 మంది మధ్యాహ్నం 12.30 గంటలకు షాపు వద్దకు చేరుకున్నారు. బయ ట బైకులను కొద్ది దూరంలో పార్క్ చేసి పెట్టారు. నలుగురు వ్యక్తులు షాపులోకి ప్రవేశించారు. ఎవరా సూడో పోలీస్..అందరూ ముఖానికి మాస్క్లు, కర్చీఫ్లు కట్టుకుని స్టైలిష్ టీషర్టులు వేసుకోగా వారిలో ఒకరు ఖాకీ ఫ్యాంటు, వెనుక ‘పోలీస్’ స్టిక్కర్ ఉన్న టీషర్టు ధరించడం విశేషం. తాము పోలీసులమని, మీ షాపులో విజిలెన్సు తనిఖీలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. అప్పటికే యజమాని భార్య టీ తీసుకొచ్చినా తాగకుండా ఆమెను పంపించే శారు. వెంటనే యజమాని రెండు చేతులకూ బేడీలు వేసి లోపలే ఉన్న స్టోర్రూమ్కు తీసుకెళ్లారు. ఈలోగా మిగిలిన నలుగురు దుండగులు ముఖానికి మాస్కులు, చేతిలో హెల్మెట్లతో వచ్చారు. డమ్మీ తుపాకీ చూపించి ..యజమాని గట్టిగా కేకలు వేసేందుకు ప్రయత్నించగా దుండగుల్లో ఒకరు డూప్లికేట్ తుపాకీ ఎక్కుపెట్టి చంపేస్తామనడంతో బెదిరిపోయి మిన్నకుండిపోయారు. ఈ లో గా దుకాణంలో ఉన్న వెండిని వదిలేసి సుమారు 800 గ్రామలకు పైగా బంగారు ఆభరణాలను బ్యాగుల్లో సర్దేశారు. సరిగ్గా 12.35 గంటలకు బయటకు వచ్చేశారు. సమీపంలో పార్క్ చేసి ద్విచక్రవాహనాల్లో ఉడాయించేశారు. వచ్చిన దారిలో కాకుండా త్రిపాఠి క్వార్టర్స్ మీదుగా కాశీబుగ్గ హైస్కూల్ క్రీడా మైదానం పక్కనున్న మంకినమ్మ గుడి సందునుంచి వెళ్లిపోయారు. వారు వచ్చిన బైకుల మీదుగా వెళ్లిపోయిన వెంటనే రెండు చేతులకు బేడీలతో ఉన్న రామకృష్ణారావు బయటకు వచ్చి స్థానికులకు జరిగిన విషయం చెప్పారు. ఈ విషయం కాశీబుగ్గ పోలీసులకు తెలియడంతో వెంటనే సీఐ రామకృష్ణ తన పోలీసు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. ఆ తర్వాత శ్రీకాకుళం నుంచి వేలిముద్రల క్లూస్ టీం, డాగ్ స్క్వా డ్ వచ్చి పరిశీలించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ఇన్చార్జి డీఎస్పీ గోవిందరావులు వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు విలేకరులతో మా ట్లాడుతూ సంఘటన తీరుతెన్నులను పరిశీలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఫుటేజ్ వాచ్మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 36నిమిషాల వేళ నేరస్థలం సమీపంలో సీసీ కెమెరాల్లో నమోదైన దుండగుల కదలికలు -
‘దళిత, పీడిత కులాల ఆత్మగౌరవ దినాలుగా పాటిద్దాం’
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పూలే జయంతి ఏప్రిల్ 11 నుంచి అంబేడ్కర్ జయంతి 14వ తేదీ వరకు ‘దళిత, పీడిత కులాల ఆత్మగౌరవ పోరాట దినాలుగా పాటిద్దాం’ అని వక్తలు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియం అంబేడ్కర్ విగ్రహం వద్ద కరపత్రాలు ఆవిష్కరణ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కేఎన్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెలమర ప్రభాకర్ మాట్లాడుతూ.. భారతదేశంలో అంబేడ్కర్, ఫూలే సామాజిక ఉద్యమాలు జరపడం వల్లే మనుస్మృతి పాలన నుంచి విముక్తి లభించిందన్నారు. ఐక్యంగా ఉండి రాజ్యాంగంలో ఉన్న హక్కులు దళిత పీడిత కులాల పేద ప్రజలకు హక్కులు చేరే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేఎన్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్క కృష్ణయ్య, నల్లబారికి శ్రీను, గురుమూర్తి, రాకోటిరాంబాబు, కె.కాళిదాసు, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.దానేసు, దానయ్య, వైకుంఠరావు, దేశభక్త ఉద్యమం నాయకులు సాలిన వీరా స్వామి, జె.వెంకటరావు, దాలినాయుడు, రైతుకూలీ సంఘం నాయకులు బైరి కూర్మారావు, బొత్స రమణ, బైరి. పాపారావు తదితరులు పాల్గొన్నారు. అన్ని పంచాయతీల్లోనూ ప్రత్యేక అధికారుల నియామకాలు అరసవల్లి: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోందని, ఈమేరకు అన్ని గ్రామ పంచాయతీల్లోనూ నియామక చర్యలు చేపట్టామని జిల్లా పంచాయతీ అధికారి ఆర్.గోపిబాల ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 912 గ్రామ పంచాయతీలకు గాను గత ఐదేళ్లుగా వివిధ కారణాలతో సర్పంచ్ ఎన్నికలు జరగని 15 పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన జరుగుతూ వస్తోందని, ఇప్పుడు మిగిలిన పంచాయతీల్లోనూ ఈ ప్రత్యేకాధికారుల పాలన మొదలైందని వివరించారు. ఈనెల 2వ తేదీతో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవీ కాలం ముగిసిందని, అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి ఆదేశాలు, ఎన్నికల ప్రక్రియ జరిగినంత వరకు పంచాయతీల్లో కార్యకలాపాలు, ప్రజల సౌకర్యార్థం చర్యల నిమిత్తం అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వినియోగం తదితర కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం లేకుండా మండల స్థాయి అధికారులతో ఈ ప్రత్యేకాధికారులను నియమించామని, అయితే చిన్నచిన్న పంచాయతీలను కలుపుకుంటూ మొత్తం 897 పంచాయతీలకు మొత్తం 335 మందిని ప్రత్యేకాధికారులుగా నియమించామని వివరించారు. డిప్యూటీ వార్డెన్ సస్పెన్షన్ హిరమండలం: మండలంలోని మర్రిగూడ ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ వార్డెన్గా పనిచేస్తున్న కె.బాలరాజును సీతంపేట ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ మంగళవారం సస్పెండ్ చేశా రు. వార్డెన్ మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారని ఫిర్యాదుపై స్పందించిన యంత్రాంగం విచారణకు ఆదేశించింది. డిప్యూటీ డీఈఓ, ఏటీడబ్లూఓ విచారణలో వార్డెన్ మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడం, అదే విధంగా విచారణ సమయంలో కూడా మద్యం సేవించి ఉండడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వార్డెన్ను ఐటీడీఏ పీఓ సస్పెండ్ చేశారు. -
బుజ్జాయికి పెద్ద కష్టం
ఇచ్ఛాపురం రూరల్: లొద్దపుట్టి గ్రామం అంబుగాం వీధికి చెందిన ఇసురు దానయ్య–శ్రావణి దంపతులకు చెందిన రెండు నెలల పసిపాప యామిని ప్రాణాల కోసం పోరాడుతోంది. జన్మతః మలవిసర్జనకు అవసరమైన మార్గం సరిగా ఏర్పడకపోవడంతో చిన్నారి తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ప్రస్తుతం పాప వయసు కేవలం రెండు నెలల 7 రోజులు మాత్రమే కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు పూర్తి స్థాయిలో చికిత్స కోసం మరో అత్యవసర ఆపరేషన్ అవసరమని సూచించారు. శస్త్ర చికిత్స, మందులు, ఆస్పత్రి ఖర్చులు కలిపి సుమారు నాలుగు లక్షలు అవసరమని వైద్యులు తెలిపినట్లు చిన్నారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవించే చిన్నారి తల్లిదండ్రులు దానయ్య–శ్రావణి దంపతులకు ఈ భారీ ఖర్చు భరించడం సాధ్యం కావడం లేదు. ఇద్దరు కుమార్తెల్లో చిన్న కుమార్తెకు ఈ సమస్య రావడంతో తమ కుమార్తెను కాపాడుకోవాలని తల్లిదండ్రులు కన్నీళ్లతో వేడుకుంటున్నారు. పాప ప్రాణాలు నిలబెట్టేందుకు దాతలు ముందుకు రావాలని వారు అభ్యర్థిస్తున్నారు. మానవత్వంతో స్పందించి చిన్నారి ప్రాణాలను రక్షించాలని కుటుంబం వేడుకుంటోంది. ఆర్థిక సాయం అందించే దాతలు 9986856973 నంబర్కు సంప్రదించాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు. మల విసర్జన లోపంతో ఆస్పత్రి పాలు కుమార్తెను దక్కించుకునేందుకు తల్లిదండ్రుల ఆరాటం దాతల సాయం కోసం ఎదురు చూపులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసిపాప యామిని -
సాగునీరు అందించండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రబీ వరి పంటకు సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని, వంశధార ఎడమ కాలువ ద్వారా సాగునీటిని తక్షణమే అందజేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య కోరారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఈ మేరకు ఆయన వినతి పత్రం అందజేశారు. జలుమూరు, సారవకోట మండలాల పరిధిలోని భగీరథపురం, దోమలపల్లి, అక్కరపల్లి, పిండ్రువా డ, కరకవలస, ముఖలింగం, నగిరి కటకం, మర్రివలస తదితర గ్రామాల్లో సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని తెలిపారు. ఆ ప్రాంతంలో సుమారు 15000 ఎకరాల్లో వరి పంట ప్రస్తుతం పొట్ట దశలో ఉందని, ఈ కీలక సమయంలో నీరు అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, రాష్ట్ర రైతు కార్యదర్శి కనపల శేఖర్ రావు, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు రౌతు శంకరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గురుగుబెల్లి వెంకట రమణి, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు ధర్మాన జగన్ మోహన్, మండల అధ్యక్షులు కనుసు సీతారాం, మండల బూత్ కమిటీ అధ్యక్షులు బబ్బోది ఈశ్వరరావు, మండల ఉప అధ్యక్షులు బసవ రమణమూర్తి, సీపాన మోహన్,తోట భార్గవ్, కనపల అరవింద్, రౌతు శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
అలుదు.. ఆయుష్షు లేదు
● కబళిస్తున్న కిడ్నీ వ్యాధి ● ఇప్పటికే పలువురు మృత్యువాత ● డయాలసిస్ దశలో మరికొందరు ● సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన యువకులు వారానికి రెండు సార్లు డయాలసిస్కు వెళ్తున్నా ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించుకోగా కిడ్నీ సమస్య ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ప్రస్తుతం వారానికి రెండు సార్లు డయాలసిస్కు శ్రీకాకుళం వెళ్తున్నాను. మా గ్రామంలో ఇది వరకు ఎంతో మంది కిడ్ని వ్యాధితో చనిపోయారు. – యారబాటి సుందరమ్మ ఆరోగ్యం దెబ్బతింది కిడ్నీ వ్యాధి సోకడంతో గత 7 నెలలు నుంచి డయాలసిస్కు వెళ్తున్నారు. ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో మంచానికి పరిమితం కావాల్సి వస్తుంది. డయాలసిస్కు వెళ్లేందుకు ఓపిక లేకుండా పోతుంది. – కుంచి నరసయ్య, అలుదు, సారవకోట మండలం సారవకోట: మండలంలోని అలుదు గ్రామంలోని ఎస్సీ వీధిని కిడ్నీ వ్యాధి కబళిస్తోంది. వ్యాధి బారిన పడి గత ఏడాదిన్నర కాలంలో సుమారు పది మంది వరకు మృత్యువాత పడ్డారని పలువురు ప్రస్తుతం శ్రీకాకుళం డయాలసిస్కు వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడున్న రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా అవుతున్న నీటిని తాగడం వల్ల తాము వ్యాధి బారిన పడుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినప్పటికీ నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానిక యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నరలో 10 మంది మృతి ఈ గ్రామంలోని ఎస్సీ వీధికి చెందిన 10 మంది ఏడాదిన్నరలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సతివాడ భాస్కరరావు, కూన మల్లేష్, సాగిపల్లి సింహాచలం, నాగవంశం బుడ్డెమ్మ, కూన శివ, యారబాటి మల్లేష్, యారబాటి గవిరేష్, బండి గౌరమ్మ, సతివాడ నారాయణరావులు ఈ కిడ్నీ వ్యాధితో మృతి చెందినట్లు తెలిపారు. ప్రస్తుతానికి ముగ్గురు శ్రీకాకుళంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు డయాలసిస్ కోసం వారానికి రెండుమూడు సార్లు వెళ్తున్నారు. మండల గ్రీవెన్స్లో ఫిర్యాదు.. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో గ్రామానికి చెందిన విజయాంబికా రెల్లి కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంపీడీఓ ఎల్.అప్పన్నకు ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలోని రెల్లి వీధిలో రక్షిత మంచినీటి పథకం ద్వారా కిడ్నీ వ్యాధి వ్యాపిస్తుందని నీటిని పరీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘సమస్యలు చట్టపరిధిలో పరిష్కరించాలి’
శ్రీకాకుళం క్రైమ్ : ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో వచ్చిన వినతులు చట్టపరిధిలో పరిష్కరించాలని, అర్జీదారులు సంతృప్తిచెందేలా విచారణ జరిపి బాధితులకు న్యా యం చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో బాధితుల నుంచి 61 వినతు లను ఎస్పీ స్వీకరించారు. బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు. 49 వేల యూరోలు ఇవ్వలేదు.. చర్యలు తీసుకోండంటూ వినతి.. బెల్జియం కంపెనీకి చెందిన రాజీవ్ బెహల్ తమను మోసగించారని ఎస్పీ గ్రీవెన్సులో బ్లూరాక్ మినరల్స్ కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కంపెనీ పేరుతో ఉన్న గ్రానైట్ స్మారక చిహ్నాలు, శ్లాబులను వివిధ రంగులతో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నామని, బ్రెజిల్కు చెందిన శరణ్ ఇంటర్నేషనల్ ఎండీ రాజీవ్ బెహల్ ఇంటర్నెట్ మెయిళ్ల ద్వారా కావాలని అభ్యర్థించారన్నారు. దీంతో వివిధ తేదీల్లో 4 కంటైనర్ల గ్రానైట్ స్మారక చిహ్నాలను వారికి సరఫరా చే శామని, వాటి పత్రాలను సిండికేట్ బ్యాంకు, శ్రీకాకుళం ద్వారా కొనుగోలుదారుల బెల్జియం బ్యాంకుకు పంపించామన్నారు. బ్యాంకు నుంచి పత్రాలు పొందిన తర్వాత వారు రాటర్డామ్ పోర్టు నుంచి 4 కంటైనర్లను విడుదల చేసి స్టాకు విక్రయించారన్నారు. అయినప్పటికీ తమకు పంపాల్సిన 49,962.65 యూరోలు (మన కరెన్సీ అయితే రూ. 53,60,471.26 లు) వారి బ్యాంకు నుంచి పంపలేదన్నారు. దీంతో స్థానిక శ్రీకాకుళం కోర్టును ఆశ్రయించగా కంటైనర్లకు సంబంధించి అనుకూలంగా డిక్రీని ఇచ్చిందని, రాజీవ్ బెహల్పైన లుకౌట్ నోటీస్ జారీ చేసిందని, దాని ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని బ్లూరాక్స్ మినరల్స్ యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ శాఖ కార్యాలయ ఉద్యోగులు తన విధుల్లో ఆటంకపర్చడమే కాకుండా దాడికి యత్నిస్తున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఖజానా శాఖ డీడీ రవికుమార్ ఎస్పీ గ్రీవెన్స్ను ఆశ్రయించారు. ఆదివారం రాత్రి ఇదే డీడీ రవికుమార్పై ఫిర్యాదు ఇచ్చేందుకు కార్యాలయ ఉద్యోగులు ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. గతంలో కూడా ఇరువర్గాలు ఒకటో పట్టణ పోలీస్స్టేషన్కు ఫిర్యాదులు ఇచ్చేందుకు వెళ్లడంతో సీఐ పైడపునాయుడు సుతిమెత్తగా హెచ్చరించి పంపించేశారు. -
‘కుల గణనతో ఎస్సీల వర్గీకరణ చేయాలి’
కొత్తూరు : కూటమి ప్రభుత్వం చేసిన ఎస్సీల వర్గీకరణతో రెల్లి ఉప కులస్తులకు తీవ్ర అన్యాయం జరి గిందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, రెల్లి ఉప కులస్తుల మండల సంఘం అధ్యక్షుడు దూళి అప్పన్న, జిల్లా ఉపాధ్యక్షుడు లోకొండ లక్ష్మణరావు, మండల నాయకులు దూలి మోహనరావు అన్నారు. కొత్తూరులో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాల వారీగా కుల గణన చేసిన తర్వాతే ఎస్సీల వర్గీకరణ చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా నేటికీ జిల్లాల వారీగా ఎస్సీ కుల గణన చేయకపోవడంతో రెల్లి ఉప కులాలు ఉద్యోగ, ఉన్నత విద్య, స్వయం ఉపాధి వంటివి పొందలేక తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. 85 శాతం మార్కులు సాధించినా రెల్లి ఉప కులస్తులు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో తీరని నష్టం జరిగిందన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సాయం అందేదని తెలిపారు. కుల గణన జరిగే వరకు పాత పద్ధతిలోనే ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. -
నాటిక పరిషత్ పోటీల విజేత హైదరాబాద్
కవిటి : మండలంలోని బొరివంకలో కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల పరిషత్ నాటిక పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా న్యాయనిర్ణేతలు మానాపురం సత్యన్నారాయణ, బల్లెడ మోహనరావు, ఎల్.రామలింగ స్వామిలు ఫలితాలు వెల్లడించారు. ఉత్తమ ప్రదర్శనగా హైదరాబాద్ గోవాడ ఆర్ట్స్ వారి ‘అమ్మచెక్కిన బొమ్మ’, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా అభినయా ఆర్ట్స్ గుంటూరు వారి ‘సహాన’, తృతీయ స్థానంలో కరీనగర్ చైతన్య కళాభారతి వారి స్వప్నం కురిసిన అమృతం నిలిచాయి. ఉత్తమ సంగీతం సహాన నాటికలో లీలామోహన్, ఉత్తమ రంగాలంకరణ రమణ అప్పారావు(చిటికెనవేలునాటిక), ఉత్తమ ఆహార్యం మా ఇంట్లో మహాభారతం చిత్రాలకు దక్కాయి. స్వర్గీయ బెందాళం ప్రకాష్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రముఖ రంగస్థల నటుడు యడ్ల గోపాలం, ప్రముఖ సంగీత కళాకారునిగా గుర్తింపు పొందిన బొంతలకోటి కృష్ణారావుకు నిమ్మన పురుషోత్తం లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రధానం చేశామని కళింగసీమ కళాపీఠం అధ్యక్షుడు బల్లెడ లక్ష్మణమూర్తి తెలిపారు. -
పింఛన్ సొమ్ము ఇప్పించాలని వినతి
నందిగాం: జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్లకు నాలుగు నెలలుగా ఇవ్వాల్సిన పింఛన్ మొత్తాన్ని తక్షణం చెల్లించి ఆదుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు టి.వైకుంఠరావు కోరారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది డిసెంబరు నుంచి మార్చి 2026 వరకు నాలుగు నెలలుగా పింఛన్ ఇవ్వకపోవడంతో జిల్లాలోని 52 కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగులు పండగ పూట కూడా అర్ధాకలిలో ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థల నుంచి, ఇంటి పన్నుల నుంచి వచ్చిన లైబ్రరీ సెస్ 8 శాతం వినియోగించుకోవాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నారని గుర్తు చేశారు. స్థానిక సంస్థలు ఈ లైబ్రరీ సెస్ను జిల్లా గ్రంథాలయ సంస్థకు జమ చేసేలా జిల్లా అధికారులు, కలెక్టర్ చొరవ చూపి పెన్షన్లు అందేలా చూడాలని ఆయన కోరారు. విద్యుత్ షాక్తో వృద్ధురాలికి గాయాలు టెక్కలి రూరల్: స్థానిక రామదాసుపేటకి చెందిన లండ లక్ష్మమ్మ అనే వృద్ధురాలు సోమవారం విద్యుత్ షాక్కు గురై గాయాలపాలైంది. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆమె ఇంటి వెనుక ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. సోమవారం ఉదయం ఇంటి మేడపై బట్టలు ఆరబెట్టేందుకు వెళ్తుండగా ట్రాన్స్ఫార్మర్కి తాకుతూ ఉన్న ఓ ఇనుప రాడ్డును పట్టుకోవడంతో షాక్ కొట్టింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను వెంటనే టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పలాసలో.. పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని గాంధీనగర్లో నిర్మాణంలో ఉన్న ఇంటిలో విద్యుత్ పనులు చేస్తుండగా సూదికొండకు చెందిన సీతం మురళి అనే యువకుడు అకస్మాత్తుగా విద్యుత్ షాక్కు గురై గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు టెక్కలి రూరల్: స్థానిక చిన్న బ్రాహ్మణ వీధి సమీప జాతీయ రహదారిపై సోమవారం ఒక కారు అదుపు తప్పి రోడ్డు నుంచి కిందకు వెళ్లిపోవడంతో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. బరంపురం నుంచి నిక్కి మహాంతి తన కుమారుడు కేదార్ మహంతితో కలసి కారులో శ్రీకాకుళం వైపు వెళ్తుండగా టెక్కలి సమీపంలోకి వచ్చే సరికి డ్రైవర్ ఒక్కసారిగా నిద్రమత్తులోకి జారిపోవడంతో కారు రోడ్డు నుంచి కిందకు వెళ్లిపోయింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. క్షతగాత్రులను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు. పశువుల అక్రమ రవాణా అడ్డగింత నరసన్నపేట: జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 19 దూడలను నరసన్నపేట పోలీసులు మండలం తామరాపల్లి వద్ద పట్టుకున్నారు. నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ తెలిపిన వివరాలు మేరకు నారాయణవలస సంత నుంచి 19 దూడలను ఒక వ్యాన్లో గుంటూరుకు తరలిస్తుండగా వచ్చిన సమాచారం మేరకు తామరాపల్లి వద్ద కాపు కాచి సోమవారం సాయంత్రం పట్టుకున్నామన్నారు. పశు రవాణా నిబంధనలు ఉల్లంఘించినందుకు దీనిపై కేసు నమోదు చేసి వ్యాన్ను సీజ్ చేశామని దూడలను గోశాలకు తరలించామని తెలిపారు. -
ఉద్యమ సెగ
మూలపేటకు మంత్రుల ఉరుకులు● వైఎస్సార్ సీపీ ఉద్యమంతో మంత్రుల్లో చలనం ● ఎట్టకేలకు మూలపేట పోర్టును సందర్శించిన మంత్రులు జనార్ధనరెడ్డి, అచ్చెన్నాయుడు ● నత్తనడకగా పనులు సాగుతున్నట్టుగా కన్పించిన దృశ్యాలు ● క్రెడిట్ చోరీ కోసం తీవ్ర యత్నాలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ ఉద్యమిస్తే తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో కదలిక రాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 70 శాతం పనులు చేసిన మూలపేట పోర్టును గాలికొదిలేసిన టీడీపీ ప్రభుత్వంలో ఎట్టకేలకు చలనం వచ్చింది. ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతున్నాయని మూలపేట పోర్టు సందర్శనకు ఉపక్రమించారు. రాష్ట్ర భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలిసి హుటాహుటిన పోర్టులో పర్యటించి, పనులు పరిశీలించారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులే దాదాపు కన్పించాయి. నత్తనడకగా పనులు సాగుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. వచ్చిన తర్వాత ఏదో ఒక హడావుడి చేయాలన్న సంకల్పంతో పనుల పురోగతిపై సమీక్ష చేసి వచ్చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ మాదిరి మూలపేట పోర్టు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాలకు తెరలేపారు. మూలపేట పోర్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చిన దగ్గరి నుంచి నిధుల సమీకరణను వైఎస్ జగన్ ప్రభుత్వమే చేపట్టింది. భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించింది. పోర్టు పనులకు శంకుస్థాపన చేసి చకచకా పనులు చేపట్టారు. దీనికొక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. ముమ్మరంగా పనులు సాగుతున్న వేళ ఎన్నికలు రావడం, ఇంతలో వైఎస్సార్సీపీ ఓటమి పాలవ్వడం, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఏడాదిన్నరకు పైగా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కనే అన్న చందంగా ఉండిపోయాయి. కానీ, మూలపేట పోర్టు ఘనతే తమదే అని చెప్పుకోవడం మొదలెట్టారు. కేంద్ర మంత్రి దగ్గరి నుంచి చంద్రబాబు వరకు క్రెడిట్ చోరీకి యత్నించారు. ఎప్పుడైతే మూలపేట పోర్టు కోసం వైఎస్సార్సీపీ గళమెత్తిందో అప్పటి నుంచి పోర్టువైపు ప్రభుత్వం చూడటం మొదలెట్టింది. ‘మన మూలపేట పోర్టుకు పోదాంపదండి’ కార్యక్రమం తర్వాత ప్రభుత్వంలో మరింత కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియడంతో భోగాపురం ఎయిర్పోర్టు మాదిరిగానే ఫొ టోలతో పోజులిచ్చి, తామే పనులు చేపడుతున్నా మని చెప్పుకోవడానికి పోర్టు సందర్శనకు ప్లాన్ చేశారు. అందులో భాగంగా సోమవారం ఇద్దరు మంత్రులు, అధికారులు నిర్మాణంలో ఉన్న పోర్టు ను పరిశీలించి, నిర్వాహకులతో సమీక్షించారు. వ చ్చే నవంబర్ కల్లా పూర్తి చేస్తామని ప్రకటన ఇ చ్చారు. భూసేకరణ సమస్య అంటూ తాత్సారానికి గల కారణాలు కూడా చెప్పేశారు. పనిలో పనిగా గత ప్రభుత్వంపై నిందలు వేసి వచ్చేశారు. -
మూల్యాంకన కేంద్రం వద్ద టీచర్ల ఆందోళన
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. కొత్త కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువస్తున్నారని, వాటిని తక్షణం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు జరిమానా విధించడం దారుణమైన విషయమని, దీన్ని తక్షణం విరమించుకునేలా రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడాలని వారు కోరా రు. ఉపాధ్యాయుల ఆందోళన నేపథ్యంలో మధ్యా హ్నం 12 గంటల తర్వాత మూల్యాంకనం ప్రారంభమైంది. తొలి రోజున సుమారు 15000 జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేశా రు. ఎలాంటి పొరపాటు వచ్చినా ఉపాధ్యాయులపై జరిమానాలతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకునే హెచ్చరికలు ఉండడంతో అంతా జాగ్రత్త పడ్డారు. చాలామంది ఉపాధ్యాయులు నల్ల బ్యా డ్జీలతోనే మూల్యాంకన కేంద్రంలో కనిపించారు. డీఈవో రవిబాబు పరిశీలించారు. మూల్యాంకన కేంద్రం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు -
కొనేదెవరు.. ఆదుకునేదెవరు..?
నరసన్నపేట నుంచి పాతపట్నం వెళ్లే జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ రోడ్లపై మొక్కజొన్న పంటను ఆరబెట్టుకుంటున్న దృశ్యమిది. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో మద్దతు ధర కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రోడ్లపైనే మొక్కజొన్న బస్తాలు పెట్టుకుని ప్రభుత్వ కరుణ కోసం నిరీక్షిస్తున్నారు. పండిన పంటను కాపాడుకోవడానికి పాట్లు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని మొక్కజొన్న రైతులు రోడ్డున పడే స్థితికి వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత జిల్లా అయినా రైతులకు ఏ మాత్రం మద్దతు దక్కడం లేదు. మొక్కజొన్న రైతులను నిర్లక్ష్యంగా గాలికొదిలేస్తున్నారు. శాఖా పరమైన కనీసం చర్య లు తీసుకోవడం లేదు. జిల్లాలో 87,821 ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేశారు. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అంతా బాగున్నా పండిన పంటను కొనుగోలు చేసే నాథుడు లేకుండా పోయాడు. పండిన పంటను గ్రామాలకు తీసుకొ చ్చి, రోడ్లపై ఆరబెట్టుకుని, కంటికి రెప్పలా పంటను కాపాడుకోవాల్సి వస్తోంది. క్వింటా మొక్క జొన్న కు రూ. 2400 మద్దతు ధర ప్రకటించారు. కానీ, కొనుగోలుచేసేందుకు కేంద్రాలు ప్రారంభించలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి, రైతుల నుంచి కొనుగోలు చేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చేసిన ప్రకటనలు మాటలకే పరిమతమయ్యాయి. ఇంతవరకు జిల్లా లో ఒక్క కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు. ప్రభుత్వంపై ఆగ్రహం.. అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అటు ఖరీఫ్లోనూ, ఇటు రబీలోనూ ధాన్యం, మొక్కజొన్న తదితర పంటల కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులంటే చంద్రబాబుకు ఎందుకంత చులకనా అని ఆవేదన చెందుతున్నారు. విత్తనం దగ్గరి నుంచి పంట విక్రయం వరకు తమకు కష్టాలు తప్పడం లేదని, ఏ ఒక్క నేత పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళారుల బారిన రైతన్న పండిన పంటను ప్రభుత్వం ఎంతకీ కొనుగోలు చేయకపోవడంతో ఇంట్లో దాచుకోలేక రోడ్డుపైనే ఆరబెట్టుకుంటున్నారు. ఆక్కడ మూటలు కట్టి ఉంచుతున్నారు. రాత్రి పూట దొంగతనాలు జరుగుతాయేమోనని ఆ రోడ్లుపైనే కాపలా ఉంటున్నారు. ఎంత వేచి చూసినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో చాలా మంది రైతులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. క్వింటాకు రూ. 1500 నుంచి రూ.1700 మించి ఇవ్వలేమని, కావాలంటే ఇవ్వండి లేదంటే వదిలేసుకోండి అని ఖరాఖండీగా చెప్పేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో క్వింటాకు రూ.700కు పైగా రైతులు నష్టపోతున్నారు. దీంతో పెట్టుబడులు సైతం రావని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అకాల వర్షాలతో రోడ్డుపైన ఆరబెట్టిన మొక్కజొన్న తడిచి ముద్దవుతోంది. దీని వల్ల తేమ శాతం ఎక్కువై, తక్కువ ధరకు విక్రయించుకోవాల్సి వస్తోంది. రోడ్డున పడిన మొక్కజొన్న రైతులు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం రైతులకు దక్కని మద్దతు ధర తక్కువ ధరకు విక్రయించుకోవాల్సిన దుస్థితి క్వింటాకు రూ.700కు పైగా నష్టపోతున్న వైనం -
నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత ప్రారంభం
సంతబొమ్మాళి: నౌపడలో ఆర్అండ్ఆర్ కాలనీ వద్ద నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, సాగునీటి సంఘాలు సమర్థంగా పని చేస్తే రైతులకు మెరుగైన నీటి పంపిణీ సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్ తరాల కోసం నీటి వనరులను కాపాడుకోవడం అత్యంత అవసరమని ఆయన పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో కృష్ణమూర్తి, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు. కొబ్బరి చెట్టుపై పిడుగుహిరమండలం: ఎల్ఎన్ పేట మండలంలోని తురకపేట కృష్ణాపురంలో సోమవారం సా యంత్రం ఉరుములతో కూడిన వర్షం కురియడంతో కొబ్బరి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. సోమవారం సాయంత్రం తురకపేట ప్రాంతంలో ఒక్కసారిగా గాలులు చెలరేగి, ఉరుములతో కూడిన వర్షం పడింది. పాలీసెట్ శిక్షణ తరగతులు ప్రారంభంఎచ్చెర్ల: స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో సోమవారం ఉదయం నుంచి పాలీసెట్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ టి.విక్టర్ పాల్ మాట్లాడుతూ.. ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి 12. 30 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామ న్నారు. హాజరైన విద్యార్థులకు ఉచిత మెటీరియల్ కూడా అందజేయనున్నారు. ‘నిర్దేశిత మెనూ అందించాలి’ ఎచ్చెర్ల: విద్యార్థులకు నిర్దేశిత మెనూ అందజేయాలని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య అమరేంద్ర కుమార్ సండ్ర అన్నారు. రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ సండ్ర అమరేంద్ర కుమార్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా మెస్ను సందర్శించారు. ఉదయం తయారు చేసిన అల్పాహారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహరం చేశారు. విద్యార్థులకు అందజేసిన ఆహారం క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పరిపాలన అధికారి ముని రామకృష్ణ, డీన్ శివ రామకృష్ణ, పైనాన్స్ ఆఫీసర్ వాసు, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ విభాగపతి శ్రీధర్ ఉద్యోగులు, సహచర ఉద్యోగులు ఉన్నారు. ‘గ్యాస్ డీలర్ పై దాడులకు పాల్పడితే గ్యాస్ సరఫరా నిలిపివేస్తాం’ ఇచ్ఛాపురం: రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా గ్యాస్ డీలర్లపై దాడులకు పాల్పడితే గ్యాస్ సిలిండర్ల సరఫరాని నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఇటీవల పట్టణంలో వినియోగ దారునితో అకారణంగా దాడికి గురైన స్థానిక ఎస్వీఎస్బీ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి వజ్రపు వెంకటే ష్ను వారంతా సోమవారం పరామర్శించారు. డీలర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల నిబంధనల మేరకే గ్యాస్ సరఫరాలు చేస్తున్నామని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల గ్యాస్ బుకింగ్ కాకపోతే గ్యాస్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఎవరైనా తప్పు చేసినా ఫిర్యాదుచేసేందుకు అనేక వ్యవస్థలు ఉన్నాయని, అలా కాకుండా దాడి చేయడం సరికాదన్నారు. -
వినతుల వెల్లువ
● పీజీఆర్ఎస్లో 123 అర్జీల స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీలు సత్వరమే పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ జయదేవి అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో డిప్యూటీ కలెక్టర్లు జయదేవి, డిప్యూటీ కలెక్టర్ పద్మావతిలు 123 అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 31, రెవెన్యూ శాఖ 18, పంచాయతీ రాజ్ 16, రూరల్ వాటర్ సప్లై ఇంజినీరింగ్ 7, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ 6, మున్సిపల్ శాఖ 6, విద్యుత్ శాఖ 4, సర్వే, ల్యాండ్ రికార్ుడ్స 4, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 4, రోడ్లు, భవనాల శాఖ 4, రూరల్ డెవలప్మెంట్ 4, వాటర్ రిసోర్స్ 4, వ్యవసాయ శాఖ 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 2, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 2, మార్కెటింగ్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, కో ఆపరేటివ్ సొసైటీ, సైనిక్ వెల్ఫేర్, సివిల్ సప్లై, ఫైనాన్స్, రోడ్డు రవాణా, ఫారెస్ట్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఒక్కో దరఖాస్తు చొప్పున స్వీకరించారు. ఆయా శాఖలకు సంబంధించి 123 అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరావు, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీఏ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యథావిధిగా రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, ఆర్డీవోలు సాయిప్రత్యూ ష, కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. పాత ఆమదాలవలస కుద్దిరాం వద్ద గల పెద్ద చెరువును దౌర్జన్యం చేసి ఆక్రమించారని, పొలాలకు సాగునీరు అందడం లేదని పాత ఆమదాలవలస, కుద్దిరాం గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పలుసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. చెరువు విస్తీర్ణంపై సర్వే జరిపించి నిజ వైశాల్యం గల చెరువును రైతులకు సాగు నీటికి అందజేయాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఎచ్చెర్ల : మండలంలోని కేశవరావుపేట సమీపంలోని బాబాయ్ హోటల్ దగ్గర ఆదివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామానికి చెందిన హనుమంతు వనజాక్షి (38) మృతి చెందారు. ఈమె భర్త కామేశ్వరరావుకు కాలికి గాయాలయ్యాయి. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై ఎచ్చెర్ల బంధువుల ఇంటికి పరా మర్శకు వెళ్తుండగా.. బాబాయ్ హొటల్ వద్దకు వచ్చే సమయంలో రాత్రి 9 గంటలకు ఎదురుగా ఒడిశాకు చెందిన బొలేరో వ్యాన్ ఢీకొట్టింది. దీంతో దంపతులు గాయపడ్డారు. వీరిని వెంటనే శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో వనజ మృతి చెందారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పెద్దబ్బాయి జ్ఞానేశ్ ఇంటర్ చదువుతున్నాడు. సాత్విక్ 10వ తరగతి ఎగ్జామ్ రాశాడు. కామేశ్వరరావు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వనజ మృతిని తెలుసుకున్న బంధువులు రిమ్స్ ఆస్పత్రి వద్ద కన్నీరుమున్నీరయ్యారు. ఎచ్చెర్ల పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
30 వరకు బీసీ రిజర్వేషన్లపై అభిప్రాయాల సేకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ప్రభుత్వం ‘డెడికేటెడ్ కమిషన్’ను నియమించిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆది వారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ‘ట్రిపుల్ టెస్ట్’ నిబంధనలను అనుసరిస్తూ, బీసీల వెనుకబాటుతనంపై సమగ్ర అనుభవ ఆధారిత విచారణ చేపట్టేందుకు కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిషన్, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు వివిధ స్టేక్ హోల్డర్లు, సంస్థలు, వ్యక్తుల నుంచి లిఖితపూర్వక వినతిపత్రాలను ఆహ్వానిస్తోందని వివరించారు. ఈ అంశంపై అవగాహన ఉన్న వారు తమ వినతిపత్రాలను ఈ నెల 30వ తేదీలోపు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ‘సెక్రటరీ, డెడికేటెడ్ కమిషన్, డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయం, 1వ అంతస్తు, మొఘల్రాజపురం, విజయవాడ – 520010’ చిరునామాకు పంపాలి. అలాగే ఈ మెయిల్ ద్వారా కూడా వివరాలు పంపవచ్చు. ప్రత్యక్షంగా కలిసి వినతిపత్రాలు సమర్పించాలనుకునే వారు కమిషన్ కార్యదర్శిని ( 901 0400500) లేదా సంబంధిత అధికారిని (798 9344521) సంప్రదించి ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవాలని ఆయన వెల్లడించారు. ఎండలో భక్తుల అవస్థలు అరసవల్లి: సూర్య నారాయణ స్వామి క్షేత్రంలో భక్తులు ఎండలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆలయానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు పలు ఏర్పాట్లు చేసినప్పటికీ, భక్తులకు ఎండ నుంచి రక్షణ కోసం వేసిన టార్పాన్లు నాసిరకానివి కావడంతో ఎక్కడికక్కడ చిరిగిపోయి తెగిపడ్డాయి. దీంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఏర్పా టు చేసిన టార్పాలిన్లు భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కల్పించాయి. ఇక ఆలయం నుంచి బయట ప్రాంతంలో కూడా టెంట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంజాయితో ఇద్దరు అరెస్టు ఇచ్ఛాపురం రూరల్: మండలం ఎం.తోటూరు వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఎం. చిన్నంనాయుడు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం ఎం.తోటూరు రైల్వే క్రాసింగ్ గేటు వద్ద రూరల్ ఎస్ఐ ఆర్.జనార్ధనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న కేదారిపురం గ్రామానికి చెందిన భుక్త బలరాం, బింగి కుమార్ను అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహించారు. వీరి వద్ద నుంచి 2.100 కిలోల గంజాయి, రెండు మొబై ల్ ఫోన్లను స్వాఽధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన పత్రి కా సమావేశంలో సీఐ చిన్నంనాయుడు మాట్లాడుతూ గంజాయికి అలవాటుపడిన భుక్త బలరాం, బింగి కుమార్లు వారు పనిచేసే అచ్యుతాపురం పట్టణంలో గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి, అధిక ధరలకు అమ్ముకుంటుంటారని తెలిపారు. బరంపురానికి చెందిన గంజాయి వ్యాపారి నిలంచల వద్ద రూ.3వేలుకు రెండు కిలోలు కొనుగోలు చేసి అచ్యుతాపురం వెళ్లేందుకు ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్కు వెళ్తున్న సమయంలో ఎల్సీ గేటు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


