breaking news
Srikakulam District Latest News
-
‘రోడ్డు ప్రమాద బాధితులకు త్వరగా పరిహారం’
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రమాదం చేసిన వాహనం గుర్తించలేకపోయినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు వెల్లడించారు. ఆయన గురువారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాలోని హిట్ అండ్ రన్ ప్రమాదాలు, మోటారు యాక్సిటెంట్ విక్టిమ్ కాంపోజిషన్ స్కీం–2022 కింద త్వరితగతిన పరిహారం అందిస్తామన్నారు. ఉచిత న్యాయ సహాయం కోసం విస్తృతంగా ప్రచారం చేయా లని సూచించారు. ప్రతి మండలంలోనూ పోలీస్ శాఖ, డీఎల్ఎస్ఏలు సంయుక్తంగా హిట్ అండ్ రన్ పరిహారం గురించి అవగాహన శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. ప్రమాదం జరిగిన 60 రోజుల్లోపు బాధితులు ఎఫ్ఐఆర్ మెడికల్ రిపోర్ట్తో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేలా పోలీస్ అధికారులు సాయం చేయాలన్నారు. ప్రమాదం చేసిన వాహనం గుర్తించలేకపోయినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మరణం జరిగితే రూ.2,00,000, తీవ్ర గాయాలైతే రూ.50,000 వరకు పరిహారం వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కెఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.పద్మావతి, ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, డీసీఆర్బీ పి.శ్రీనివాసరావు, రషీద్ అహ్మద్, ఎస్ రామయ్య, బి ప్రకాశరావు, తదితరులు పాల్గొన్నారు. -
‘విద్యార్థినికి పరామర్శ’
పలాస: మెళియాపుట్టి మండలం భరిణికోట గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పలాస మండలం లొత్తూరు పంచాయితీ హల్ధిగాం గ్రామానికి చెందిన నవ్యశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై సమగ్ర విచారణ జరిపించాలని పలు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పలాస ప్రభు త్వ ఆస్పత్రిలో గురువారం ఆమె చికిత్స పొందు తుండగా ఆమెను కలిసి పరామర్శించారు. ఈ ఘటనకు జరిగిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. బుధవారం ఉదయం ప్రేయర్ అనంతరం ఆమె వసతి గృహంలోకి వెళ్తుండగా ఆమెను ఫిజిక్స్ టీచర్ వసంత బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్లడంతో ఆమె మనస్తాపానికి గురై ఇలా చేసిందని తెలిపారు. గిరిజన సంఘం నాయకుడు సవర జగన్నాయకులు, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.వినోద్, లిబరేషన్ రాష్ట్ర నాయకులు మద్దిల రామారావు, జనశక్తి జిల్లా నాయకుడు కోనేరు రమేష్, గిరిజన సంఘాల నాయకులు సవ ర నరిసింహులు, కుమార్బంగ్లా, సవర రవి, సవర సింహాద్రి తదితరులు పరామర్శించారు. విద్యార్థుల భద్రతను గాలికి వదిలేస్తున్నారని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. -
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
టెక్కలి రూరల్: స్థానిక జగతి మెట్ట సమీపంలో నివాసముంటున్న ధవళ అనిత(43) అనే అనే వివాహిత బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అనిత విజయనగరం జిల్లా జీఎస్టీ కార్యాలయం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త జన్ని హరి సంతబొమ్మాళి మండలంలో డీటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ జగతిమెట్ట సమీపంలో నివాసముంటున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని క్లూస్ టీం పరిశీలించిన తర్వాత శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. మృతురాలికి 11 ఏళ్ల కుమారుడు ఉన్నా డు. అనంతరం టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్గా శ్రీనివాసరావు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సివిల్ సప్లయ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్గా పి.శ్రీనివాసరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈయన కోనసీమ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్గా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా మేనేజర్గా పనిచేసిన వేణుగోపాల్ను మాతృభాషకు పంపించారు. ‘కేజీబీవీల్లో ఖాళీలు భర్తీ చేయాలి’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27 విద్యా సంవత్సరానికి బోధనా సిబ్బంది నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేసి ఖాళీలను భర్తీ చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ పేడాడ కృష్ణారావు మాట్లాడుతూ గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం వంటి ప్రధాన సబ్జెక్టులకు ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థుల చదువు తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని నోటిఫికేషన్ ప్రకారం కేజీబీవీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని కోరారు. నీలకంఠేశ్వర ఆలయంలో హుండీ చోరీ పాతపట్నం: పాతపట్నం మహేంద్రతనయ నదీ తీరాన ఉన్న శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో బుధవారం అర్ధరాత్రి హుండీ చోరీ జరిగింది. దుండగులు ఆలయం ప్రహరీ దూకి లోపలకు వచ్చారు. ఆలయం గర్భగుడి నుంచి బయటకు వచ్చే దారిలోని సేఫ్టీ గిల్స్కు ఉన్న రెండు తాళాలు పగలగొట్టి లోపలకి ప్రవేశించారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ముగ్గురు వచ్చినట్లు సీసీ పుటేజ్లో కనిపిస్తోంది. దుండగులు ముసుగులు వేసుకున్నారు. గురువారం ఉదయం ఆలయ అర్చకులు ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు సేఫ్టీ గ్రిల్స్కు ఉన్న తాళాలు పగలగొట్టి ఉండడంతో వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు తెలిపారు. ఎస్ఐ కె.మధుసూదనరావు, క్లూస్ టీం బృందం వచ్చి, ఆధారాలు సేకరించారు. సుమారు రూ.20 వేలు నగదు ఉంటుందని అర్చకులు తెలిపారు. పలాస, నందిగాం, శ్రీకాకుళం క్రైమ్ : పూండి – నౌపడ రైలు మార్గంలోని వల్లభరావుపేట రైలు ట్రాక్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం గురువారం లభ్యమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. పోల్ నంబర్ 28/30 వద్ద డౌన్లైన్ ట్రాక్పై సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళ ఛామన ఛాయ రంగు, నెరిసిన జుట్టు, కుడి ముంజేటిపై ఒడియా లిపిలో జై శ్రీరామ్ అని పచ్చబొ ట్టు రాసి ఉందని తెలిపారు. ఈమె యాచకురాలై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం తెలిసిన వారు పలాస రైల్వే స్టేసన్ ఎస్ఐ డి.శ్రీనివాసరావును 9492250069 నంబర్ ద్వారా ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు. -
తీరం..కళా విహీనం
● కొట్టుకుపోతున్న రిసార్టులు ● పట్టించుకోని పాలకులు ● నిరాశలో పర్యాటకులు శ్రీకాకుళం రూరల్: జిల్లాలో సముద్ర తీర పర్యాట కం రానురాను కళా విహీనంగా మారుతోంది. పాలకుల నిర్లక్ష్యం సందర్శకుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని పెదగనగళ్లవానిపేట వద్ద కొద్ది నెలల ప్రభు త్వ అనుమతులతో ఏర్పాటు చేసిన ప్రైవేట్ రిసార్ట్ ఇప్పుడు అధ్వానంగా తయారైంది. నాగావళి నది నుంచి వచ్చిన నీరును వేరు చేయడానికి నది మధ్యలో ఏర్పాటు చేసిన గ్రోయిన్ రోడ్డు సైతం అర్ధంతరంగా ఆగిపోయింది. దీంతో సముద్రంలో ఆటుపోట్లు సంభవించినప్పుడు ఇక్కడ భారీ ప్రవాహంలా దూసుకొస్తుంది. ఫలితంగా నదీ పరివాహక ప్రాంతలో ఉండే రోడ్లు, జీడిమామిడి తోట లు, చెట్లు, చేపల చెరువుల, భూములు, బారికేడ్లు సైతం కొట్టుకుపోతూ పెదగనగళ్లవానిపేట గ్రామం వైపు దూసుకొచ్చేస్తున్నాయి. దీంతో పర్యాటకులు సైతం ఇటువైపు రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తీర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. పర్యాటకులు రావడం లేదు.. మా గ్రామ పరిధిలో విశాలమైన సముద్రతీర ప్రాంతం ఉండటంతో పర్యాటకులతో నిత్యం కళకళలాడేది. ఇప్పుడు తీరమంతా కళా విహీనంగా మారడంతో శని, ఆదివారాలు సైతం ఇటువైపు రావడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. నిధులు మంజూరు చేసి తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్ర భుత్వ పెద్దలు చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. – అప్పన్న, పెదగనగళ్లవానిపేట -
మద్యం మత్తులో కర్రతో దాడి.. వ్యక్తి మృతి
కుత్బుల్లాపూర్: తాగిన మైకంలో గొడవ పడి తలపై కర్రతో కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బేరి నరసింహులు గత 6 నెలలుగా కొంపల్లి పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కింద ఉంటూ అడ్డా కూలీగా పని చేస్తున్నాడు. ఇతనితో పాటు కన్నా అనే వ్యక్తి కూడా ఉండేవాడు. ఇద్దరూ కలిసి ఒకే చోట నిద్రపోతూ.. ఉద యం కూలి పనులకు వెళ్లి వచ్చేవారు. బుధవారం రాత్రి ఇద్దరూ మద్యం తాగి గొడవపడ్డారు. నరసింహులు తలపై, కాళ్ల పైన కర్రతో కన్నా కొట్టి తీవ్రంగా గాయపరచడంతో అతడు కింద పడిపోయాడు. అతని పక్కనే తాగిన మైకంలో ఉన్న కన్నా సైతం నిద్రపోయి తెల్లవారుజామున పరారయ్యాడని పోలీ సులు తెలిపారు. మృతుని జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా చనిపోయిన వ్యక్తి శ్రీకాకుళానికి చెందిన నరసింహులు అని తేలింది. ఈ మేరకు ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
● తరతరాల ఆవేదన
వీళ్లేమీ మృతదేహాన్ని మోసుకురావడం లేదు. అనారోగ్యంతో ఉన్న వృద్ధ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి గిరిజనులు పడుతున్న అగచాట్లు ఇవి. బూర్జ మండలం జంగాలపాడు పంచాయతీ చిన్నచలం గ్రామానికి ఇప్పటికీ సరైన దారి లేదు. గ్రామంలోని ఓ వృద్ధ మహిళకు గురువారం ఆరోగ్యం బాగోలేకపోవడంతో దగ్గరలో ఉన్న బొడ్లపాడు తీసుకువచ్చి అక్కడి నుంచి శ్రీకాకుళం తరలించడానికి ఇలా డోలీ కట్టారు. చిన్నచలం నుంచి బొడ్లపాడుకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ దూరాన్ని దాటేందుకు ఈ పాట్లు తప్పడం లేదు. – బూర్జ -
ఆహ్వానితులు 268 మంది.. కుర్చీలు 80
కంచిలి: స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం బీఎల్ఓలు, బీఎల్ఎల నిర్వహించి సమావేశం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమావేశానికి బీఎల్ఓలు 67 మంది, బీఎల్ఎలు మూడు రాజకీయ పార్టీలు కలిసి 201 మంది కలిపి మొత్తంగా 268 హాజరవ్వాల్సి ఉంది. కానీ సమావేశ మందిరంలో 80 కుర్చీలు మాత్రమే వేశారు. దీంతో కేవలం టీడీపీకి సంబంధించిన వారు మాత్రమే హాజరై.. వైఎస్సార్ సీపీకి చెందిన 67 మంది బీఎల్ఏలు బయటే వేచి చూసి వెనుదిరిగారు. స్థానిక ఎంపీపీని ఆ హ్వానించకుండానే సమావేశం నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తమైంది. ఎలాంటి పదవి లేని టీడీపీ నేతను వేదికపై కూర్చోబెట్టడం వివాదాస్పదమైంది. ఇది ఎంత వరకు సమంజసంగా ఉందని ఎంపీపీ పైల దేవదాస్రెడ్డి ప్ర శ్నించారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి, నిష్పక్షపాతంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీలో పలు హోదాల్లో నియామకం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): శ్రీకాకుళం జిల్లాలో పలువురికి వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల్లో పలు హోదాల్ని ఇస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం నియోజక వర్గానికి చెందిన వారికి వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా అంధవరపు వెంకట రమే ష్, లీగల్సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా లోలుగు వెంకటరమణ, ఆర్టీఐ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మాధాబత్తుల జయంత్కుమార్, జిల్లా కళింగకోమటి, కళింగవైశ్య విభాగం అధ్యక్షులుగా తంగుడు జోగారావు (నరసన్నపేట), నియోజకవర్గాల అధ్యక్షులు గా కింతలి తిరుమలకుమార్ (టెక్కలి), వైశ్యరాజు కేశవరాజు (నరసన్నపేట), బరాటం సంతోష్ (శ్రీకాకుళం), నారాయణశెట్టి వెంకటరమణ (ఎచ్చెర్ల), శిల్లా మల్లికార్జునరావు (ఆమదాలవలస)కు చెందిన వారిని నియమించారు. నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం అరసవల్లి: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి జెడ్పీ మీటింగ్ హాల్లో జరగనుంది. జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్రామన్ సమక్షంలో జెడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరై జిల్లా లో ముఖ్య సమస్యలపై సమీక్షించనున్నారు. అలాగే ప్రభుత్వ శాఖల పనితీరు, అలాగే ఉమ్మడి జిల్లాల్లో వివిధ శాఖల ప్రగతిపై కూడా ప్రజాప్రతినిధులు తమదైన శైలిలో ప్రశ్నలు సంధించి అధికారుల నుంచి వివరణలను కోరనున్నారు. ఇక జిల్లా పరిషత్ పాలక మండలి ఐదేళ్ల పదవీ కాలం రానున్న సెప్టెంబర్ 24తో ముగియనున్న నేపథ్యంలో సర్వసభ్య సమావేశాల్లో ఇదే చివరి కీలక సమావేశంగా చెప్ప వచ్చు. సెప్టెంబర్ 23వ సాయంత్రం ఎంపీటీసీ, ఎంపీపీల పదవీకాలం ముగియనుండగా జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్ల పదవీ కాలం కూడా సెప్టెంబర్ 24న సాయంత్రంతో ముగియనున్నాయి. అయితే ప్రస్తుతానికి పాలకవర్గం కొనసాగుతున్న క్రమంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సెప్టెంబర్ 8 లోగా ఇదే సభ్యుల ఆధ్వర్యంలో జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరగాల్సి ఉంది. పూర్తి కోరంతో ఈ సమావేశాలు జరిగితే, మరోసారి కచ్చితంగా మరో సర్వసభ్య సమావేశాన్ని సెప్టెంబర్ 24వ తేదీ లోపు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ సమావేశంలోనే దాదాపుగా పాలకమండలి వీడ్కోలు కూడా జరగనున్న నేపథ్యంలో తాజాగా నేడు జరుగనున్నదే అధికారిక వ్యవహారాలు జరిగే చివరి సర్వసభ్య సమావేశంగా జెడ్పీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం పాతబస్టాండ్: నిధుల వినియోగంలో నిర్లక్ష్యం చేయకూడదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. ఆయన గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో కంపెనీల యాజమాన్య సిబ్బంది, అధికారులతో నిధుల మంజూరు, నిధుల వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖ ల వారీగా జిల్లాలో సీఎస్సార్, సీఈఆర్ గ్రాంట్లలో మంజూరైన నిధులు వాటి వివరాలను పరిశీలించారు. మొక్కల పెంపకం, చెరువులు, కుంటల అభివృద్ధి, తాగునీటి సదుపాయాల కల్పన, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, గ్రామాల్లో ప్రజలకు పారిశుద్ధ్య సదుపాయాల ఏర్పాటు, విద్య, ఆరోగ్యం, జీవనోపాధి కల్పించడం వంటి విషయాలపై తగు సూచనలు చేశారు. ‘భూ రికార్డుల ప్రక్షాళనకే రీ సర్వే’ శ్రీకాకుళం పాతబస్టాండ్: రైతులకు మేలు చేకూర్చేలా రాష్ట్రంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికే అత్యంత పారదర్శకంగా రీ సర్వే పనులు చేపడుతున్నామని భూమి రికార్డుల సహాయ సంచాలకులు సి.హెచ్.వి.యస్.యన్.కుమార్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన మండల సర్వేయర్లు, రీ–సర్వే ఉప తహసీల్దార్ల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చే యాలని అధికారులను ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా యజమానులకు శాశ్వత హక్కులు లభిస్తాయని, ఈ క్రమంలో తలెత్తే భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సర్వేను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షకు ముందు లావేరు, ఆమదాలవలస మండలాల గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సర్వేయర్ లాగిన్ లను తనిఖీ చేసి ఆన్లైన్ ప్రగతిని పరిశీలించారు. అనంతరం ఎచ్చెర్ల మండలం షేర్ మహమ్మద్ పురం గ్రా మానికి చేరుకుని అక్కడ రీ–సర్వే పనులను నిశితంగా తనిఖీ చేసిన ఆయన, సిబ్బంది విధులను అభినందిస్తూ స్థానిక రైతులకు సర్వే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. -
‘ముద్రగడ సేవలు చిరస్మరణీయం’
నరసన్నపేట: నిరుపేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, వారి హక్కుల పరిరక్షణకు ముద్రగడ పద్మనాభం చేసిన పోరాటాలు, అందించిన సేవలు ఎల్లకాలం చిరస్మరణీయం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మంత్రి, ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ముద్రగడ చిత్ర పటానికి కృష్ణదాస్ పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కృష్టదాస్ మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో చెరపలేని ముద్ర వేసుకున్నారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కరిమి రాజేశ్వరరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చింతు రామారావు, వైఎస్సార్సీపీ నాయకులు కేసీహెచ్బీ గుప్త, రాజాపు అప్పన్న, దామ మన్మధరావు, పతివాడ గిరీశ్వరరావు, కనపల శేఖరరావు, సురంగి నర్శింగరావు, పాగోటి రాజారావు, మోజ్జాడ శ్యామసుందరరావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో యువకుడు మృతి
టెక్కలి రూరల్: మండలంలోని బొప్పాయిపురం పంచాయతీ పరిధి చల్లపేట గ్రామంలో గురువారం విద్యుత్ షాక్కు గురై అదే గ్రామానికి చెందిన గురుజు ఈశ్వరరావు(చంటి)(19) అనే యువకుడు మృతిచెందాడు. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. చల్లపేట గ్రామానికి చెందిన మృతుడు ఈశ్వరరావు గ్రామం సమీపంలో గల జీడిబంద చెరువుకి బహిర్భూమికి వెళ్లాడు. అయితే ఆ ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతుండటంతో సంబంధిత కాంట్రాక్టర్ విద్యుత్ చౌర్యానికి పాల్పడి నీటి మోటార్ను ఏర్పాటు చేసి రోడ్డు వాటరింగ్ చేస్తుండేవారని, ఆ యువకుడు బహిర్భూమికి వెళ్లి అక్కడే ఉన్న విద్యుత్ వైర్పై కాలు వెయ్యడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై అక్కడిక్కడే పడిపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు హుటాహు టిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి అప్పడికే ఆ యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి తండ్రి ఎర్రయ్య, తల్లి లక్ష్మిలు ఉన్నారు. చేతికి అందివచ్చిన కుమా రుడు విద్యుత్ షాక్తో మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. -
గట్టు చదును చేసి.. పొలంలో కలిపేసి..!
● ఆక్రమణలకు గురవుతున్న నారాయణపురం కాలువ ● యథేచ్ఛగా సాగు చేసుకుంటున్న పలువురు ● పట్టించుకోని అధికారులు చర్యలు తీసుకుంటాం నారాయణపురం ఎడమ ప్రధాన కాలువ ఆక్రమణకు గురైన విషయం వాస్తవమే. అందువలన త్వరితగతిన ఆక్రమణలు తొలగించే చర్యలు చేపడతాం. రైతులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటాం. – వై.రవీంద్ర, డీఈ, నీటి పారుదల శాఖ ఆమదాలవలస రూరల్: రైతులకు ఎంతో ఉపయోగకరంగా నిలవాల్సిన నారాయణపురం ఎడమ కాలువకు ఇరువైపులా గట్లు ఆక్రమణకు గురవుతున్నాయి. నాగావళి నది ద్వారా నారాయణపురం నుంచి కళ్లేపల్లి వరకు సుమారు నాలుగు పంటలకు సంబంధించి లక్షల ఎకరాలకు ఇదే కాలువ ద్వారా సాగునీరు అందాల్సి ఉంది. అయితే నారాయణపురం ఎడమ ప్రధాన కాలువకు ఇరువైపులా ఉండే గట్టు కబ్బాచేసి కొంతమంది ఆక్రమణదారులు సాగు చేసుకుంటున్నారు. వాస్తవానికి నారాయణపురం కుడి, ఎడమ కాలువ లకు సంబంధించి ఇరువైపులా రహదారి నిర్మాణం కోసం 2014లో జైకా నిధులు రూ.47 కోట్లతో అప్పటి టీడీపీ ప్రభుత్వం అంచనాలు వేసింది. అయితే సకాలంలో నిధులు మంజూరవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయి. కానీ కాలువకు ఇరువైపులా చదును చేసిన స్థలంలో కొందరు ఆక్రమణదారులు అరటి, ఉలవ, మొక్కజొన్న, కంది తదితర పంటలు పండించుకుంటున్నారు. బూర్జ మండలంలోని నారాయణపురం నుంచి శ్రీకాకుళం రూరల్ మండలంలోని కళ్లేపల్లి వరకు కాలువకు ఇరువైపు లా రహదారి నిర్మాణం చేసేందుకు చదును చేశారు. రహదారి నిర్మాణం చేపట్టకపోవడంతో ఆక్రమణదారులు పలు పంటలు పండించుకొని యథేచ్ఛగా అనుభవిస్తున్నారు. కుచించుకుపోతున్న కాలువ పలువురి ఆక్రమణలతో ప్రధాన కాలువ కుచించుకుపోతోంది. దీనివల్ల దిగువ ప్రాంత రైతులకు నీరందించే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు కాలువకు ఇరువైపులా ఆక్రమణ చేసి పలు పంటలు వేయగా, మరికొందరు కాలువ గట్టును తమ పంట పొలాల్లో కలుపుకొని దురాక్రమణకు పాల్పడుతున్నారు. దీనివల్ల రైతులు పండించే పంట పొలాలకు విత్తనాలు, ఎరువులు తరలించేందుకు సైతం అవకాశం లేకుండాపోతోంది. వాస్తవంగా రైతులు తమ పంట పొలా లకు ఎరువులు, విత్తనాలు కాలువ గట్టు నుంచి తరలిస్తారు. అయితే కాలువ గట్లు పూర్తిగా ఆక్రమణకు గురవ్వడమే కాకుండా, ఆక్రమణదారులు పలు పంటలు వేయడంతో కాలువ గట్టుపై నడిచే అవకాశం లేకుండా పోయింది. దీంతో పంట పొలాల నుంచే విత్తనాలు, ఎరువులు తరలించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అందువలన ఇప్పటికై నా నీటిపారుదల శాఖ అధికారులు కాలువ గట్టు ఆక్రమణలు తొల గించి ప్రభుత్వ భూములు కాపాడడమే కాకుండా.. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
చరిత్ర, సంస్కృతి పరిరక్షణ సమితి ఏర్పాటు
శ్రీకాకుళం కల్చరల్: జిల్లాలో కొత్తగా వెలుగు చూస్తున్న ప్రాచీన చరిత్ర, సంస్కృతి అవశేషాలు, శిల్పాల పరిరక్షణకు, పురావస్తు శాఖ ప్రకటించిన స్థలాల రక్షణకు ఒక స్టీరింగ్ కమిటీ స్థానిక క్రాంతి భవన్ంలో గురువారం ఏర్పాటైంది. పురావస్తు చట్టాలను ఉల్లంఘించి, దంతపురం బౌద్ధ క్షేత్రాన్ని అన్యాక్రాంతం చేశారని, సంగమయ్య కొండ రూపురేఖలను మార్చి వేస్తున్నారని, శాలి హుండం కొండపై కొత్త ఆలయాల నిర్మాణం పేరుతో, చారిత్రక ఆనవాళ్లు ధ్వంసం చేస్తున్నారని శ్రీకాకుళం చరిత్ర, సంస్కృతి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ చరిత్ర పరిశోధకులు, ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్త ఆచార్య కేఎస్ చలం మార్గదర్శకత్వంలో ఒక పరిరక్షణ సమితి ఏర్పాటు చేయాలని సమా వేశం నిర్ణయించింది. దీనికోసం ఆరుగురితో ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రముఖ వైద్యు లు, కళింగ సీమ ఉద్యమ నాయకులు డాక్టర్ డి. జీవితేశ్వరరావు, ప్రముఖ రచయితలు, పరిశోధకు లు నల్లి ధర్మారావు, దుప్పల రవికుమార్, మామిడి కోదండరావు, ప్రముఖ సైకత శిల్పి గేదెల హరికృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ సున్నపు చిన్నారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మందస ప్రాంతంలో ఇటీవల వెలుగు చూసిన ప్రాచీన జైన, బౌద్ధ మతా ల అవశేషాలను, విగ్రహాలను పరిరక్షించాలని కలె క్టర్ స్వప్నిల్ దినకర్కు గురువారం ఉదయం ప్రాచీ న చరిత్ర, సంస్కృతి పరిరక్షణ సమితి ఒక వినతిపత్రం సమర్పించింది. ప్రత్యమ్నాయ స్థలం ఉన్నా, జైన విగ్రహం, మరికొన్ని అవశేషాలు కనిపిస్తున్న ఆలయ పరిసరాలను ధ్వంసం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిసర ప్రాంతాల్లోనే గోవర్ధనగిరి మెట్ట, ఆనంద గిరి మెట్ట పై బయటపడిన మరికొన్ని జైన, బౌద్ధ అవశేషాలను కూడా పరిరక్షించాలని కోరారు. -
లిఫ్ట్లో జారిపడి ప్రముఖ వ్యాపారి మృతి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని ఎల్బీఎస్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్ కట్టా వెంకటేశ్వరరావు(కట్టా బాబు) బుధవా రం రాత్రి లిఫ్ట్లో జారి పడి మరణించారు. ఎల్బీఎస్ కాలనీ ఫ్లాట్ నంబర్ 29లో రెండంతస్తుల సొంత నివాస గృహంలో భార్యతో కలసి కట్టాబాబు (66) నివసిస్తున్నారు. ఈయన నగరంలోని పలు హోటళ్లు సోదరుని సాయంతో నడుపుతుండటమే కాకుండా ఉత్తరాంధ్రలో లగ్జరీ అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాజెక్టులను నిర్మించి రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేశారు. నగరంలోని కిన్నెర, కీర్తిక, కీర్తన థియేటర్లకు మేనేజర్గా వ్యవహరించారు. ఆయన బుధవారం రాత్రి 6.43 గంటలకు భార్యకు బయటకు వెళ్తున్నానని.. కొద్దిసేపట్లో వచ్చేస్తానని చెప్పి ఇంటినుంచి బయల్దేరారు. అర్ధరాత్రి అయినా రాకపోవడంతో పని ప్రదేశంలో ఉండిపోయి ఉంటారని కుటుంబ సభ్యులు భావించా రు. గురువారం ఉదయం 6 గంటలకు శ్రీనివాస్ అనే కార్మికుడికి లిఫ్ట్ సమీపంలో కట్టాబాబు కాలు కనిపించడంతో నిశ్చేష్టుడయ్యాడు. గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు, కట్టాబాబు భార్య చేరుకున్నారు. అనంతరం కట్టాబాబు మృతదేహాన్ని లిఫ్ట్ షాఫ్ట్ నుంచి బయటకు తీశారు. ఎలా జరిగిందంటే.. ఘటనాస్థలిలో సీసీ ఫుటేజీ పరిశీలించగా లిఫ్ట్వైపు కట్టాబాబు రావడం, ఆ ప్రదేశం చీకటి మయం కావడం, లిఫ్ట్ క్యాబిన్ రెండో అంతస్థుకు రాకముందే తలుపులు తెరుచుకున్నాయన్న భావనతో లోపలకు అడుగు పెట్టడంతో జారిపడి కింద అంతస్తులో ఉన్న లిఫ్ట్పై పడిపోయారు. సీసీ ఫుటేజీలో కట్టాబాబు కేకలు వేస్తున్నట్లు ఆడియో సైతం వినిపించింది. తలకు, ఎడమ చేతికి, ఎడమకాలికి తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో పాటు అంతర్గత రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనాస్థలికి ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ, సిబ్బంది వెళ్లారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరికృష్ణ పేర్కొన్నారు. కట్టా బాబు కుమారుడు నాగచైతన్యకు వివాహమై విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తుండగా, కుమార్తెకు సైతం వివాహమై బెంగళూరులో కుటుంబంతో స్థిరపడ్డారు. -
జై జగన్నాథ్
వారికైతే ఉపేక్ష.. వీరిపై కక్ష● రోడ్డు ప్రమాదం కేసుని హత్య కేసుగా ఎలా చిత్రీకరిస్తారు ● వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, అడ్వకేట్ శిమ్మ రాజశేఖర్ ● చంద్రబాబు ప్రభుత్వం దుర్నీతి ● పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు కారు ఢీకొట్టిన ఘటనపై నమోదు కాని హత్య సెక్షన్లు ● మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ ఘటనపై నేర పూరిత హత్య సెక్షన్లు నమోదు ● చర్చనీయాంశమైన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరు కంచిలి : బలియాపుట్టుగ కాలనీలో బుల్లి రథాలతో చిన్నారుల రథయాత్రశ్రీకాకుళంలో..కంచిలిలో జగన్నాథ స్వామి రథయాత్రసీదిరి అప్పలరాజే టార్గెట్.. సీదిరి అప్పలరాజును ఎలాగైనా ఇరుకున పెట్టాలన్నది అధికార పక్ష తాపత్రయం. రోడ్డు ప్రమాదం జరిగితే నేరపూరిత హత్య సెక్షన్లు నమోదు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అధికార పార్టీ నాయకులే చెప్పాలి. దర్యాప్తు పూర్తికాక ముందే తీవ్రమైన సెక్షన్లు నమోదు చేయడం వెనక రాజకీయ దురుద్దేశం ఉందని స్పష్టమైంది. అప్పలరాజును లక్ష్యంగా చేసుకుని కేసును మలుస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీదిరి కుమారుడికి బెయిల్ కూడా దక్కకుండా ఉండేలా పావులు కదపడమే కాకుండా సీదిరి అప్పలరాజును అరెస్టు చేసి తీరాలన్న కసితో వెళ్తున్నారు. అంతా నిబంధనల ప్రకారమే అనుకుంటే.. కొరసవాడలో ఆటోను ఢీకొట్టి, ఒకరు మృతికి, మరో నలుగురికి గాయాలకు కారణమైన పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు కుమారుడు సాయి గణేష్ కారు ఘటనపై అలాంటి నేర పూరిత హత్య సెక్షన్లు నమోదు చేశారా? అన్నది చెప్పాల్సిన బాధ్య త పోలీసులపైన, ప్రస్తుత పాలకులపైన ఉంది. సమావేశంలో మాట్లాడుతున్న శిమ్మ రాజశేఖర్, చిత్రంలో పార్టీ నాయకులుశ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, న్యాయవాది శిమ్మ రాజశేఖర్ మండిపడ్డా రు. ఇటీవల పలాసలో ఈ నెల 10వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదాన్ని హత్యాయత్నంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉందన్నారు. యాక్సిడెంట్ జరిగిన రోజు ఎఫ్ఐఆర్కి, ఆ తర్వాత రోజు ఇన్చార్జి మంత్రి వచ్చిన తర్వాత రోజుకి కాగితాల్లో రాతలు ఎలా మారిపోతాయన్నారు. ఆయన గురువారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. ఎఫ్ఐఆర్లో మార్పులు చేసి రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప అక్రమ కేసులు పెడితే ఎవరూ బెదిరిపోయేది లేదన్నారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు సాధు వైకుంఠరావు, ఎంపీపీ గొండు రఘురాం, రూరల్మండల పార్టీ అధ్యక్షులు చిట్టి జనార్ధనరావు, మండవల్లి రవిలు మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పె ట్టుకుని ప్రతిపక్ష నాయకులను వేధించడం మా నుకోవాలని అన్నారు. సీదిరి మత్స్యకార కులానికి చెందినవారు కావడం వల్లే ఈ రకంగా వేధిస్తున్నా రన్నారు. చవకబారు రాజకీయాలు మానుకుని రాజ్యాంగబద్ధ పాలన అందించాలని కోరారు. ఈ సమావేశంలో మత్స్యకార సంఘ నాయకులు సూరాడ కన్నబాబు, మూగి రామారావు తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దాదాపు ఏడాదిన్నర కిందట.. సరిగ్గా 2024 డిసెంబర్ 21న కొరసవాడ దగ్గర పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు సాయి గణేష్ కారు.. ఆటోను ఢీకొట్టడంతో, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో భామిని మండలం లివిరి గ్రామానికి చెందిన చెప్పల బోగయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా మారి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే ఘటనలో ఈయన కోడలు చెప్పల సంతోషి, సవలాపురం నరేష్, గణేష్, ఆటో డ్రైవర్ కూర్మాన సునీల్కు గాయాలయ్యాయి. ఈ కేసుకు సంబంధించి మూడు రోజుల తర్జనభర్జనల తర్వాత, దర్యాప్తు పేరుతో కాలయాపన చేసి, చివరికీ ఎమ్మెల్యే తనయుడి కారును పల్లి రాజేష్ డ్రైవింగ్ చేసినట్టు కేసు నమోదు చేశారు. దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రమాద సమయంలో మద్యం మత్తులో ఉన్నారని, ఎమ్మెల్యే కుమారుడే ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ, చివరికి పల్లి రాజేష్ డ్రైవ్ చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేసి, తేల్చేశారు. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో చాలా మేనేజ్మెంట్ జరిగింది. కానీ ప్రతిపక్షం రాద్ధాంతం చేయలేదు. కావాలని ఎవరూ రోడ్డు ప్రమాదాలు చేయరనే కోణంలో రాజకీయం చేయలేదు. మొత్తానికి పోలీసులు పల్లి రాజేశ్ డ్రైవ్ చేశాడని నిర్ధారించి, కేసు నమోదు చేశారు. అంతే తప్ప నేర పూరిత హత్యగా సెక్షన్లు నమోదు చేయలేదు. అంతకుమించి అనుమానాలున్న మేరకు లోతుగా కేసు దర్యాప్తు కూడా చేయలేదు. ప్రత్యర్థులకై తే మరొకటి.. ఇటీవల కాశీబుగ్గలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్తో వెళ్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగిన గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. యాక్సిడెంట్కు కారణమైనవారు తమకున్న పరిజ్ఞానం మేరకు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దానయ్యకు సీపీఆర్ చేశారు. వెంటనే 108కి ఫోన్ చేశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న సీదిరి అప్పలరాజు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో ఘటనలో గాయాలైన తన కుమారుడిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంతవరకు బాగానే ఉన్నా తర్వాత రాజకీయం జోక్యం పెరిగిపోయింది. ఇంకేముంది కేసు బిగుసుకుంది. ఏకంగా హత్యా నేరాన్ని మోపారు. రోడ్డు ప్రమాదంతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. పెదబాబు, చినబాబు దగ్గరి నుంచి, మంత్రులు, ఎమ్మెల్యేల వరకు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ స్పందిస్తూ సీదిరి అప్పలరాజును టార్గెట్గా చేసుకుని ప్రెస్మీట్లు, ప్రకటనలు చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండటం తప్పు కాదు. విషాదంలో ఉన్న వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఆ దిశగా టీడీపీ ఎమ్మెల్యే, మంత్రులు స్పందించి, పరామర్శ, ఆర్థిక సాయం చేస్తే అంతా స్వాగతించారు. కానీ టీడీపీ నాయకులు ఇందులో కూడా రాజకీయం చూసుకున్నారు. రాష్ట్రంలో ప్రమాదాలకు గురైన వారందరి ఇళ్లకు వెళ్లి, ప్రత్యేకంగా పరామర్శ, ఆర్థిక సాయం చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ, సీదిరి అప్పలరాజును లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే దగ్గరి నుంచి జిల్లా ఇన్చార్జి మంత్రి వరకు స్పందించడం చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి రోడ్డు ప్రమాద ఘటనను ఎవరు రాజకీయాలకు వాడుకుంటున్నారో జనాలకు స్పష్టంగా అర్థమైంది. మాజీ మంత్రి సీదిరిని వేధించడం సరికాదని వైఎస్సార్సీపీ లీగల్సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ట దామోదరరావు ఓ ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదానికి రాజకీయ రంగు పులిమి, రాజకీయ కక్ష సాధింపులకు పూనుకోవడం సమంజసం కాదన్నారు. -
శ్రమ అధనం
● బస్తా యూరియా కోసం రైతుల అగచాట్లు ● ప్రభుత్వ విధానాలపై విస్తుపోతున్న అన్నదాతలు టెక్కలి: ఒక బస్తా యూరియా కోసం రైతులు అదనపు శ్రమ పడుతున్నారు. గురువారం టెక్కలి పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా పంపిణీ చేపట్టారు. అయితే టెక్కలి మండలం మేఘవరం పంచాయతీతో పాటు తిర్లంగి పంచాయతీ గంగాధరపేట గ్రామానికి చెందిన రైతులకూ ఇక్కడే పంపిణీ చేశారు. గతంలో ఆయా గ్రామాల రైతుల చెంతకు యూరియా పంపిణీ జరిగేది. మేఘవరం పంచాయతీ పరిధి మేఘవరం, బొరిగిపేటతో పాటు గిరిజన గ్రామాలు భీంపురం, చిన్నభీంపురం, జీడిపేట, జక్కరపేట, కోదండపురం, సరియాపల్లి, డెప్పూరు తదితర గ్రామాల నుంచి ఇరువైపులా సుమారు 18 కిలోమీటర్ల మేరకు ఆటోలపై రైతులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణానికి కనీ సం రూ.180 అయినా ఖర్చు పెట్టాలి. ఇది రైతుకు అదనపు ఖర్చు. పీఏసీఎస్ కార్యాలయం వద్ద యాప్లో నమోదు చేసిన తర్వాత మరి కొద్ది దూరంలో గల గోపీనాథపురం వద్ద గోడౌన్ వద్దకు వెళితే తప్ప యూరియా దక్కని పరిస్థితులతో రైతు లు అవస్థలకు గురవుతున్నారు.ఒక్క యూరియా బస్తా కోసం ఎక్కడో మారుమూల గ్రామం నుంచి మండల కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇబ్బంది పడుతున్నాం మాది మేఘవరం పంచాయతీ భీంపురం గ్రామం. యూరియా కోసం టెక్కలి రావాలని చెప్పారు. మా గ్రామం నుంచి ఆటోలో ఉదయం 8 గంటలకు టెక్కలి వచ్చాం. మధ్యాహ్నం వరకు పడిగాపులు కాస్తున్నాం. ఇంతకు ముందు మా పంచాయతీకే యూరియా ఇచ్చేవారు. ఈ పరిస్థితి గందరగోళంగా ఉంది. – జె.సూర్యనారాయణ, రైతు, భీంపురం, టెక్కలి మండలం. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నాం... యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నాం. మా ఊరి నుంచి అంద రం ఆటోలో వచ్చాం. యూరియా ఎప్పుడిస్తారో, మేమంతా ఎప్పుడు ఇంటి వెళతామో తెలియదు. – జె.పెంటమ్మ, రైతు, భీంపురం 50 సెంట్లు భూమికి యూరియా లేదన్నారు నా భార్య సుజాత పేరు మీద 50 సెంట్లు భూమి ఉంది. గత రెండు రోజుల కిందట మేఘవరం పంచాయతీ కేంద్రానికి వెళ్లి యూరియా కోసం వాకబు చేస్తే 50 సెంట్లు భూమికి యూరియా ఇవ్వమని చెప్పారు. నా పేరు మీద ఉన్న 75 సెంట్లు భూమికి యూరియా కోసం వచ్చాను. తెల్లవారి నుంచి పడిగాపులు కాస్తున్నాను. ఇదేం విధానమో అర్థం కావడం లేదు. – డి.అప్పారావు, రైతు, బొరిగిపేట, టెక్కలి మండలం -
అధ్వాన భోజనంపై విచారణ
● పాఠశాలను పరిశీలించిన డిప్యూటీ డీఈవో విలియమ్స్ సోంపేట: స్థానిక బాలికోన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ డీఈవో విలియమ్స్ బుధవారం పాఠశాలను పరిశీలించి విచారణ చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది, వైద్య సిబ్బందితో మాట్లాడారు. అధికారులతో పాఠశాల ఎస్ఎంిసీ చైర్మన్ సురేష్, సభ్యుడు నారాయణ స్వామి మాట్లాడుతూ విద్యార్థులు అస్వస్థతకు గురైతే పాఠశాల హెచ్ఎం కనీసం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నోటుబుక్స్ అందజేయలేదని ఫిర్యాదు చేశారు. నాణ్యమైన భోజనం అందించకపోవడంతో సగం మంది విద్యార్థులు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. నాసిరకం సరుకులు, భోజనంపై ప్రత్యేక దృష్టిలేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. హెచ్ఎంను మార్చాలని, లేదంటే విద్యార్థుల టీసీలు ఇచ్చేయాలని కోరారు. జెడ్పీటీసీ తడక యశోద మాట్లాడుతూ.. పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా అందజేయడం దారుణమన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కలెక్టర్కు పూర్తిస్థాయి నివేదిక అందజేస్తామని విలియమ్స్ తెలిపారు. పరిశీలనలో డీఈవో కార్యాలయం ఏడీ శ్రీనివాసరావు, విద్యాశాఖాధికారులు ఎస్.జోరాడు, కృష్ణంరాజు, పలాసపురం సర్పంచ్ తడక జోగారావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయురాలు సస్పెన్షన్ సోంపేట బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.పుష్పాంజలిని సస్పెండ్ చేస్తూ కలెక్టరేట్ నుంచి ఉత్తర్వులు అందాయని మండల విద్యాశాఖాధికారి ఎస్.జొరాడు తెలిపారు. మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు బుధవారం పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు పాఠశాలలో విచారణ జరిపి ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న అండర్ ట్రైల్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా ఆదేశించారు. బుధవారం జిల్లా కోర్టు భవనంలో అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. విచారణ దశలో ఉన్న ఖైదీల కేసుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ ట్రయల్ ఖైదీలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా న్యాయవాదులను నియమించి ఉచిత న్యాయ సహాయం అందించాలని ఆదేశించారు. కేసుల విచారణలో జాప్యం నివారించేందుకు సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు చొరవ తీసుకోవాలన్నారు. చిన్న నేరాలకు ఎక్కువ కాలం జైలులో ఉన్న వారి బెయిల్ దరఖాస్తులను సానుభూతితో పరిశీలించాలన్నారు. సమావేశంలో ఒకటో అదనపు జిల్లా జడ్జి వై.బెన్నయ్య నాయుడు, రెండవ అదనపు జిల్లా జడ్జి బి.సాధుబాబు, మూడో అదనపు జిల్లా జడ్జి సీహెచ్.వివేక్ ఆనంద్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఆర్.శాంతి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, జిల్లా ప్రభుత్వ న్యాయవాది, ఏఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఆర్ఓ వి.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘కార్గో’ నిరసన ర్యాలీలో ఉద్రిక్తత
పలాస: ఉద్దానం ప్రాంతంలోని కార్గోఎయిర్ పోర్టు కు వ్యతిరేకంగా వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ముందుగా ప్రజాసంఘాల నాయకులను గృహ నిర్బంధం చేశారు. దీనిని నిరసిస్తూ బిడిమి, రాంపురం, భేతాళపురం, గంగువాడ, ఒంకులూరు తదితర 18 గ్రామాల్లో ప్రజలు నిరసన ప్రదర్శనలు చేశారు. అనంతరం ఆయా గ్రామాల నుంచి ప్రతినిధులు ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఆర్డీఓకు ఇవ్వాల్సిన వినతిపత్రాన్ని కాశీబుగ్గలోని మహాత్మాగాంధీ విగ్రహానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటల ఆధారిత పరిశ్రమలు కాకుండా ఎవరి ప్రయోజనాల కోసం కార్గో ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తున్నారో కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు సమాధానం చెప్పాలన్నారు. నిరసన కార్యక్రమంలో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, కార్యదర్శి జోటి అప్పారావు, వామపక్ష నాయకులు పి.నాగేశ్వరరావు, సి.హెచ్ రవి, బి.కూర్మారావు, ఎం.వినోద్కుమార్, బత్తిన లక్ష్మణరావు, గుంటు లోకనాథం, లండ రామ స్వామి, పొట్టి ధర్మారావు, ఎన్.పరుశురాం, జోగి శ్రీదేవి, ఎల్.సంధ్య, రామారావు పాల్గొన్నారు. -
నిబద్ధత గల నాయకుడు
నిజాయితీ, నిబద్ధత, విలువలకు కట్టుబడి పనిచేసిన నేత ముద్రగడ పద్మనాభం. నమ్మిన సిద్ధాంతాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చివరి శ్వాసవరకు పట్టుదలతో నిలిచిన నాయకుడిగా పేరుగాంచారు. ఆయన మరణం ఆ కుటుంబానికే కాకుండా సమాజానికి తీరని లోటు. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి విలక్షణ నేత ముద్రగడ మాజీ మంత్రి, కాపు ఉద్య మ నేత ముద్రగడ పద్మనాభం అకాల మరణం రాష్ట్ర ప్రజలకు, రాజకీయాలకు తీరని లోటు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పదవుల కంటే కాపు సమాజం కోసం రాజీపడని పోరాటం చేసిన ఉద్యమ శిఖరంగా చరిత్రలో నిలిచిపోతారు. నిజాయితీ, నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు పోరాడేతత్వం, ఇచ్చిన మాట కోసం నిలబడే నైజం కలిగిన ఒక విలక్షణ నాయకుడిని రాష్ట్రం కోల్పోయింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. – తమ్మినేని సీతారాం, మాజీ శాసనసభ స్పీకర్ నిస్వార్థ నాయకుడు ప్రజా సమస్యలపై నిరంతంరం పోరాడుతూ విలువలు, విశ్వసనీయత కలిగిన నాయకుడు ముద్రగడ పద్మనాభం. మంచి వ్యక్తిత్వం ఉన్న ముద్రగడ లేని లోటు తీరనిది. మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు నిస్వార్థమైన సేవలు అందించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. – చింతాడ రవికుమార్, వైఎస్సార్సీపీ ఆమదావలస నియోజకవర్గ సమన్వయకర్త శాకంబరి దేవిగా కొత్తమ్మ తల్లి కోటబొమ్మాళి కొత్తమ్మతల్లిని శాకంబరిదేవిగా బుధవారం అలంకరణ చేశారు. ఆషాఢమాసం సందర్భంగా గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి వి.రాధాకృష్ణ తెలిపారు. – టెక్కలి నారాయణపురం నీరు విడుదల సంతకవిటి: రంగారాయపురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్ట నుంచి కుడి ప్రధాన కాలువకు సాగునీటిని ఆనకట్ట వైస్ చైర్మన్ ఎం.కృష్ణమూర్తి బుధవారం విడుదల చేశారు. దాదాపు 50 కిలోమీటర్ల పొడవున్న కుడిప్రధాన కాలువ నుంచి సంతకవిటి, పొందూరు, ఆమదాలవలస, ఎచ్చెర్ల మండలాల పరిధిలో 18 వేల ఎకరాల పైబడి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. కార్యక్రమంలో ఆనకట్ట డీఈ వై.రవీంద్రనాయుడు, కుడి ప్రధాన కాలువ ఏఈ రాంబాబు, తదితరుల పాల్గొన్నారు. చైన్నెలో వలస మత్స్యకారుడి దుర్మరణం కవిటి: ఇద్దివానిపాలెం గ్రామానికి గండుపల్లి గోపాలరావు (58) చైన్నెలో వలస మత్స్యకారుడిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తూ బోటుపై నుంచి జారి సముద్రంలో గల్లంతయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగ్గా బుధవారం మృతదేహాన్ని గుర్తించారు. గోపాలరావుకు భార్య గోపమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాతపట్నం: ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణీ దుర్గ అమ్మవారి హుండీ కానుకల ద్వారా రూ.7,67,657 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ టి.వాసుదేవరావు, చైర్మన్ అక్కందర సన్యాసిరావు తెలిపారు. ఆలయ హుండీని బుధవారం లెక్కించగా 57 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చిందన్నారు. జిల్లా సహాయ కమిషనర్ కార్యాలయం సీనియర్ సహాయకులు జీవీబీఎస్ రవికుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గుమస్తా సుదర్శన్, వేంకటేశ్వర స్వామి సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ఇలా బతికిస్తున్నారు..!
నారు పోసినా నీరు లేకపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. వరినారును బతికించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షాల జాడలేకపోవడంతో కొన్నిచోట్ల బిందెలతో నారు తడుపుతుండగా మరికొన్ని చోట్ల సుదూర ప్రాంతాల్లోని చెరువుల వద్ద మోటారు పంపులు ఏర్పాటు చేసి పైపుల ద్వారా నీటిని తీసుకొచ్చి పొలాలను తడుపుతున్నారు. జి.సిగడాం, రణస్థలం, ఎచ్చెర్ల, బూర్జ తదితర మండలాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. – జి.సిగడాం/బూర్జ బూర్జ వద్ద ఎండిపోతున్న నారుమడులను ట్యాంకర్లతో తడుపుతున్న రైతులు సర్వేశ్వరపురంలో పైపులైన్ ద్వారా తీసుకొచ్చిన నీటితో పంటను తడుపుతున్న రైతు గెడ్డకంచరాం–బాతువ గ్రామాల మధ్య వరినారును బతికిస్తున్న రైతులు -
ఆపేదెవరు..?
● యథేచ్ఛగా మట్టి, గ్రావెల్ తవ్వకాలు ● రూపం కోల్పోతున్న చెరువులు, కొండలు ● చోద్యం చూస్తున్న అధికారులు అక్రమ తవ్వకాలను..వజ్రపుకొత్తూరు: కాదేదీ తవ్వకాలకు అనర్హం.. అన్న రీతిలో కూటమి ప్రభుత్వంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారం అండతో చెరువులు, కొండలను చెరబడుతున్నారు. మట్టి, గ్రావెల్ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వేస్తూ జేబులు నింపుకొంటున్నారు. పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు, పలాస, మందస మండలాల్లో తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతుండటంతో కొండలు, చెరువులు రూపు కోల్పోయి ప్రమాదకరంగా మారుతున్నాయి. రాత్రీ పగలు తేడాలేకుండా.. వజ్రపుకొత్తూరు మండలం బెండికొండ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉంది. సర్వే నంబరు–1లో నిత్యం గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నా అధికారుల్లో చలనం ఉండటం లేదు. నందిగాం మండలం కవిటి అగ్రహారానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు తన వద్ద ఉన్న యంత్రాలతో గ్రావెల్ తరలించి దాదాపు 1.80 ఎకరాలు మేర చదును చేసి జీడి, ఇతర పండ్ల మొక్కలు నాటినా ఎవరూ స్పందించడం లేదు. ఇతనికి జిల్లా మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. తాడివాడ కొండ, ఉండ్రుకుడియా, అనంతగిరి కొండలు ఇప్పటికే సగం మేర కరిగిపోయాయి. మందస మండలంలోని గోపాలసాగరం సుందరీకరణ పేరుతో ఓ టీడీపీ యువ నాయకుడు పెద్ద ఎత్తున మట్టి తరలించి అక్రమాలకు పాల్పడ్డాడు. ఆర్కేపురం పరిధిలోని చెరువుల్లోనూ అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. కొండలోగాం, చాపరాయి కొండల్లో అక్రమ గ్రానైట్ మైనింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నా ఆపే వారే కరువయ్యారు. వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి పెద్ద చెరువు, లింగాలపాడు చెరువు, ఉద్దానం గోపినాథపురం కంబగాయ చెరువు, పలాస– కాశీబుగ్గలో నెమలి కొండ, గోపాలపురం, గరుడకండి వద్ద చెరువుల్లో జేసీబీలు, ప్రొక్లెయినర్స్తో మట్టి తవ్వకాలు చేపట్టి లోడు రూ.1000 వరకు అమ్ముకుంటున్నారు. దాదాపు 10 నుంచి15 అడుగుల లోతులో గోతులు తవ్వుతున్నందున అవి బావులను తలపిస్తూ అటుగా వెళ్లే చిన్నారులు, వృద్ధులకు మరణశాసనం రాస్తున్నాయి. వర్షాకాలంలో తప్ప ఈ గోతుల్లో నీరు నిలవకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు. సహజ వనరులు కాపాడుకోవాలి.. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను కాపాడుకోవాలి. కొండలు, చెరువుల పర్యావరణానికి చాలా అవసరం. సునామీ, తుఫాన్ల వంటి విపత్తుల సమయంలో చెట్లు, కొండలు ఉంటే గాలి పీడన దిశ మారి ప్రమాద తీవ్రతను తగ్గిస్తాయి. – బి.గోపాల్, గ్రీన్ ఆర్మీ అధ్యక్షుడు, పలాస చర్యలు తప్పవు.. అనుమతులు లేకుండా కొండలు, చెరువులను తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో తవ్వకాలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం ఎక్కడైనా చెరువులు, కొండలను తవ్వి మట్టి, గ్రావెల్ తరలిస్తే మా దృష్టికి తీసుకురావాలి. – బి.సీతారామయ్య, తహసీల్దార్, వజ్రపుకొత్తూరు -
శ్రీకాకుళం
హలో.. హలోఉద్దానంలో నెట్వర్క్ సమస్య వేధిస్తోంది. సిగ్నళ్లు రావడం లేదు. –8లోఅక్కడ అనారోగ్యం కవరింగ్ ● కాంతమ్మ మృతికి పరిహారమేదీ? ● వైఎస్ జగన్ దృష్టికి కాంతమ్మ మృతి వివరాలు బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బస్తా యూరియా కోసం వెళ్లి మహిళా రైతు కాంతమ్మ చనిపోయింది. మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలం పెద్దలవునిపల్లి రైతు సేవా కేంద్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఎప్పుడైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావించిందో.. లేని అనారోగ్యాన్ని కాంతమ్మకు అంటగట్టి, నిజాన్ని చంపేసే ప్రయత్నం చేశారు. రైతుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుండటంతో టీడీపీ తనకే అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ ఎంచుకుంది. రోడ్డు ప్రమాదం ఘటనను ఎంచుకుని రాజకీయం చేస్తోంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్లో గొర్రెల కాపరి చనిపోయారు. ఈ ఘటన చాలా బాధాకరం. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనను రాజకీయ చేసి లబ్ధి పొందాలని టీడీపీ నాయకులు చూస్తున్నారు. ఏకంగా సీదిరి కుమారుడిపై హత్య కేసు పెట్టారు. సీదిరిని టార్గెట్ చేసి అరెస్టు చేయాలని రాద్ధాంతం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఏ కుటుంబానికై నా విషాదమే. బాధిత కుటుంబానికి అండగా ఉండడం, సాయం చేయడం అందరి కర్తవ్యం. కానీ దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే కుటిలత్వాన్ని టీడీపీ ప్రదర్శించింది. ఏకంగా సీదిరి కుమారుడిపై హత్య కేసు బనాయిస్తే.. కోర్టు సీరియస్గా మందలించడంతో సెక్షన్లు మార్చారు. అంతటితో కక్ష ఆగలేదు.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైలుకు పంపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ దిశగా ఒత్తిళ్లు, రాజకీయ ఆందోళనలు చేస్తున్నారు. ఎరువు కోసం వెళ్లి చనిపోయిన కాంతమ్మ కుటుంబాన్ని ఒక్కరు కూడా పరామర్శించలేదు. సొంత నియోజకవర్గానికి చెందిన మహిళా రైతు కాంతమ్మ కుటుంబాన్ని పరామర్శించాలన్న ఆలోచన అచ్చెన్నాయుడికి రాలేదు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న కొండపల్లి శ్రీనివాస్కూ తట్టలేదు. వాళ్లకు రాజకీయంగా ఏది లబ్ధి చేకూరుతుందో వాటిపైనే స్పందిస్తారని తాజా ఘటనతో తేట తెల్లమైంది. రోడ్డు ప్రమాద ఘటనను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్న టీడీపీ నాయకులు ఎరువుల కోసం వెళ్లి చనిపోయిన కాంతమ్మను పట్టించుకోని వైనం పైగా అనారోగ్యంతో చనిపోయారని తప్పుడు ప్రచారం -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన వ్యాన్
నందిగాం: మండల కేంద్రం నందిగాంలో విద్యుత్ స్తంభాన్ని వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రఽహదారి నుంచి బీసీ కాలనీ మీదుగా నందిగాం వచ్చే మార్గంలో అంగన్వాడీ కేంద్రం వద్ద ఉన్న విద్యుత్ స్తంభాన్ని శ్రీకాకుళం నుంచి పెంటూరు కర్రల లోడ్తో వెళ్తున్న వ్యాన్ ఆటోను తప్పించబోయి ఢీకొట్టింది. ఈ ఘటనలో స్తంభం విరిగిపోయి కళ్లాల వైపు వాలిపోయింది. అదే రోడ్డు వైపు ఒరిగి ఉంటే పెను ప్రమాదం జరిగేది. గమనించిన స్థానికులు విద్యుత్ కార్యాలయానికి ఫోన్ చేసి సరఫరాను నిలిపివేయించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులు వచ్చి సరఫరాను పునరుద్ధరించారు. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమ పరిశీలన టెక్కలి రూరల్: రావివలలోని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమను మంగళవారం టెక్కలి డీఎల్డీఓ అలివేలు మంగమ్మ పరిశీలించారు. పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యంతో సమీప ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, పంటలు నాశనం అవుతున్నాయని, మూగజీవాలకు వింత వ్యాధులు వస్తున్నాయని కొందరు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో క్షేత్రస్థాయిలో పకరిశీలించి ఆరా తీశారు. ఆమెతో పాటు ఎంపీడీఓ ఎం.రేణుక, డిప్యూటీ ఎంపీడీఓ కె.సింహాద్రి తదితరులు ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల అమలుపై ఆరా ఎచ్చెర్ల : రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం మంగళవారం ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి వర్సిటీలో రిజర్వేషన్ల అమలు తీరును సమీక్షించారు. అధ్యాపక, బోధనేతర పోస్టుల భర్తీలో ఎస్సీ రిజర్వేషన్ల అమలు తీరును రిజిస్ట్రార్ బి.అడ్డయ్య వివరించారు. అనంతరం సీతారాం మాట్లాడుతూ ఉన్నత విద్యలో సీట్ల కేటాయింపు వంటి అంశాల్లోనూ రిజర్వేషన్లు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఇంటింటి సర్వే గడువు 24 వరకు పొడిగింపు శ్రీకాకుళం పాతబస్టాండ్: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం బూత్ స్థాయి అధికారుల ఇంటింటి సర్వే గడువును జూన్ 15 నుంచి జూలై 24 వరకు పొడిగించామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, సవరించిన ప్రత్యేక సంక్షిప్త సవరణ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను జూలై 24 లోగా పూర్తి చేయాలని, జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణకు అవకాశం ఉంటుందని, సెప్టెంబర్ 28 లోగా వాటి పరిష్కారాన్ని పూర్తి చేసి, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,358 పోలింగ్ కేంద్రాల పరిధిలో 18,97,405 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 17,30,748 ఓటర్ల దరఖాస్తుల (91.22 శాతం) కంప్యూటరీకరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. ఇంకా అనుసంధానం కావా ల్సిన 79,396 మంది ఓటర్ల ప్రక్రియను, మిగిలిన ఇతర సాంకేతిక లోపాలను యుద్ధప్రాతిపదికన సవరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు రౌతు శంకరరావు (వైఎస్సార్ సీపీ), పీఎంజే బాబు (టీడీపీ), పి.సురేష్ సింగ్ (బీజేపీ), ఐటీ.కుమార్ (వైఎస్సార్ సీపీ), ఎస్. సత్యనారాయణ (వైఎస్సార్ సీపీ), ఈశ్వరి (కాంగ్రెస్) తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఐటీఐ కౌన్సెలింగ్ ఎచ్చెర్ల : ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగించారు. 657 సీట్లకు గాను 285 మంది హాజరయ్యారు. వీరిలో 162 సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఐటీఐ ప్రిన్సిపాల్ ఎల్.సుధాకర్, చిట్టి నాగభూషణరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
జీఓ 329 రద్దు చేయాలి
సోంపేట : బీల ప్రాంతంలో బహుళ ఉత్పత్తుల పరిశ్రమల నిర్మాణానికి విడుదల చేసిన జీఓ 329 రద్దు చేసి చిత్తడి నేలల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని పర్యావరణ పరిరక్షణ సంఘ నాయకులు, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. థర్మల్ ఉద్యమం సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెంది 16 ఏళ్లు పూర్తయిన సందర్బంగా మంగళవారం అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సంఘ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ చిత్తడి నేలల మనుగడతోనే మానవ మనుగడ సాగుతుందన్నారు. భూమికి కిడ్నీలు వంటి చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కార్యదర్శి తమ్మినేని రామారావు మాట్లాడుతూ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ బీల ప్రాంతంలో చేపల చెరువుల నిర్మాణానికి ఏర్పాటు చేసిన గట్లు తొలగించాలని కోరారు. కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు బార్ల సుందరరావు, సూరాడ చంద్రమోహన్, సనపల శ్రీరామమూర్తి, వైశ్యరాజ్ నాగు, సత్యరాజ్, డిక్కల దామోదరం, బెందాళం వెంకటరమణ, సింహాచలం పాడి, బి.బాబూరావు, టి.కోదండ, బి.శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
వంశధార ఎడమ కాలువకు
● 10 అడుగుల మేర పడిన గండి ● స్పష్టమైన అధికారుల నిర్లక్ష్యం ● వృధాగా పోయిన సాగునీరు అక్కివలస సమీపంలో వంశధార ఎడమ కాలువకు పడిన భారీ గండి సారవకోట: మండలంలోని గుమ్మపాడు పంచాయతీ అక్కివలస సమీపంలో సోమవారం అర్ధరాత్రి వంశధార ఎడమ కాలువకు 10 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో గండి పడింది. మంగళవారం ఉదయం 5 గంటలు దాటిన తర్వా త స్థానిక రైతులు గండిని గమనించి వంశధాన అధికారులకు సమాచారం అందజేశారు. రాత్రే గండి పడడంతో సాగునీరు చాలావరకు వృధాగా పోయింది. ఉదయం వంశధార అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గొట్టా బ్యారేజ్ దగ్గర నీటి విడుదలను నిలుపుదల చేశారు. అనంతరం మధ్యాహ్నం వరకు నీటి ప్రవాహం ఉద్ధృతంగా వస్తుండటంతో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ నెల 6న వంశధార ఎడమ కాలువలో నీటిని విడుదల చేశారు. అనంతరం సంబంధిత అధికారులు కాలు వ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ గట్లు బలహీనంగా ఉన్నాయి అన్నవి గమనించలేదు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో ఉన్న నీటిని ఎంతో పొదుపుగా వినియోగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యంతో గండి పడి ఎంతో విలువైన నీరు వృధాగా పోయింది. రబీ పంట కు చివరి దశలో నీరు కావాలని మొరపెట్టుకున్నా నీరు విడిచి పెట్టలేదని, కానీ సోమవారం రాత్రి కాలువకు పడిన గండితో ఎంతో నీరు వృధా అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఆగ్రహం వంశధార కాలువకు గండి పడడంపై జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వంశధార అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే గండి పూడ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వృధాగా పోతున్న నీరు బతిమలాడాం.. రబీలో చివరి తడి కోసం నీరివ్వాలని ఎంత బతిమలాడినా అధికారులు నీరివ్వలేదు. ఇప్పు డు గట్లు పరిశీలించకుండా నీటి వృధాకు కారణమయ్యారు. – మెండ సూర్యనారాయణ, రైతు, బద్రి గ్రామం, సారవకోట మండలం గండి పూడ్చుతాం అక్కివలస సమీపంలో వంశధార ఎడమ కాలువకు పడిన గండిని పూడ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సమాచారం వచ్చిన వెంటనే నీటి విడుదలను నిలుపుదల చేసి గండి పడిన చోట ఇసుక బస్తాలు వేశాం. బుధవారం నాటికి మళ్లీ నీటిని విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – మురళీ మోహన్, వంశధార నీటి పారుదల శాఖ ఈఈ -
మృతుడి వివరాలు లభ్యం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని మత్స్యకార కార్యాలయంలో గుర్తు తెలియని మృతదేహం సోమవారం బయటపడిన విషయం తెలిసిందే. మృతుడు పార్వతీపురం–మన్యం జిల్లా పాలకొండ మండలం వడమకు చెందిన తాపీ మేసీ్త్ర బొద్దాన సింహాద్రి (48)గా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మొబైల్ విడిచిపెట్టి ఈ నెల 8న బయటకొచ్చిన సింహాద్రి నగరంలోని మత్స్యశాఖ కార్యాలయంలోని ఓ పాడుబడిన గదిలో తలదాచుకున్నాడు. నిద్రాహారాలు లేక మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం కుటుంబసభ్యులు వచ్చి గుర్తించారు. సింహాద్రికి ఇద్దరు భార్యలు. వీరిలో మొదటి భార్య సరస్వతి అంగన్వాడీ కార్యకర్త, రెండో భార్య ఆరుద్ర గృహిణి. ఈ ఘటనపై రెండో పట్టణ ఎస్ఐ బి.హైమావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యూరియా పంపిణీలో గందరగోళం
టెక్కలి: అక్కవరం రైతు సేవా కేంద్రం వద్ద మంగళవారం యూరియా పంపిణీలో గందరగోళం చోటు చేసుకుంది. రైతు సేవా కేంద్రానికి వచ్చిన సుమారు 232 యూరియా బస్తాలను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే యాప్లో పేర్కొన్న మేరకు యూరియా పంపిణీ చేయడంతో గతంలో ఎదురైన అనుభవాల మేరకు మిగిలిన రైతులకు యూరియా అందని పరిస్థితి నెలకొంటుందనే భయంతో ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు చేసేది లేక యూరియా పంపిణీ నిలిపివేసి రైతు సేవా కేంద్రానికి తాళాలు వేశారు. ఉదయం 6 గంటల నుంచే పెద్ద సంఖ్యలో రైతులు యూరియా కోసం చేరుకున్నారు. మొదట 50 సెంట్లు భూమి ఉన్న వారికి యూరియా ఇవ్వమని చెప్పడంతో రైతులు ఆందోళన చెందారు. అయితే అడ్డదారిలో కొందరికి, యాప్లో పేర్కొన్నట్లు కాకుండా అధికంగా ఇంకొందరికి యూరియా ఇవ్వడంతో తమకు ఒక్క బస్తా అయినా దక్కుతుందో లేదోనని అధికారులను నిలదీయడంతో గందరగోళం నెలకొంది. -
వినియోగదారుల హక్కులు ఉల్లంఘిస్తే చర్యలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: వినియోగదారుల హక్కుల పరిరక్షణకు, నకిలీలు, కల్తీల నియంత్రణకు జిల్లాలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా వినియోగదారుల రక్షణ మండలి (డీసీపీసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ చైర్పర్సన్గా వ్యవహరించగా, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, పౌరసరఫరాలు, లీగల్ మెట్రాలజీ, ఆహార భద్రతా విభాగాలు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులను తప్పుదోవ పట్టించే మోసపూరిత ప్రకటనలపై, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు వస్తువులు విక్రయించే వ్యాపారులపై నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. జిల్లా సరఫరాల అధికారి సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వినియోగదారుల సేవా సంస్థల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బగాది రామమోహనరావు, సీనియర్ న్యాయవాది అన్నెపు భువనేశ్వర్, శ్రీకాకుళం కన్జూమర్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ అధ్యక్షుడు బమ్మిడి నరేంద్రకుమార్, లఖినాన వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. -
బడికి కుళ్లిన కోడి గుడ్లు
సరుబుజ్జిలి: మండలంలోని పెద్ద సవళాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పంపిణీ చేసిన కోడిగుడ్లలో నాణ్యత లోపించింది. మంగళవా రం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ వారు గుడ్లను ఉడకబెట్టగా దాదాపు ఆరు గుడ్లు కుళ్లిపోయాయని విద్యార్థులు తెలిపారు. ఏజెన్సీ వారు ఎప్పటివో గుడ్లను అంటగడుతున్నారని, అధికారులు కూడా తనిఖీ చేయడం లేదని పలువురు ఆరోపించారు. ఇదే విషయమై హైస్కూల్ హెచ్ఎం అప్పలరాజును వివరణ కోరగా 6 గుడ్లు పూర్తిగా కుళ్లిపోయినట్లు గుర్తించామని, ఏజెన్సీ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగినట్లు వెల్లడించారు. -
క్రైస్తవ పరిరక్షణ కమిటీ కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం కల్చరల్: క్రైస్తవ సమాజం బలోపేతం, హక్కుల పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణ, పరస్పర సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లా క్రైస్తవ పరిరక్షణ కమిటీ నూతన జిల్లా కార్యవర్గాన్ని మంగళవారం స్థానిక చర్చిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతినిధులతో నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా ఒంపూరు రమేష్ (శ్రీకాకుళం), ఉపాధ్యక్షులుగా రాడ విజయకుమార్ (ఆమదాలవలస), ప్రత్తి అన్వేష్ (ఇచ్చాపురం), ప్రధాన కార్యదర్శిగా టి.జార్జి ముల్లర్ (ఆమదాలవలస), కోశాధికారిగా ఈ.శామ్యూల్ జాన్ (సరుబుజ్జిలి), కార్యదర్శిగా కె.పీటర్ పాల్ (చాపర), ఏరియా కో–ఆర్డినేటర్గా భీమ్ బెహరా (ఇచ్చాపురం), ప్రేయర్ కన్వీనర్గా జాడుపల్లి ఆనందరావు (సోంపేట) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కె.చిన్నవాడు (నరసన్నపేట), పి.సింహాజాన్ (మాకివలస), ఎస్.ప్రసాద్ (శ్రీకాకుళం), శ్రీరామ్ రమేష్ (నరసన్నపేట), పీస దాసుబాబు (మందస), బి.శేఖర్బాబు (ఇచ్ఛాపురం), పి.జోసెఫ్ (కంచిలి) ఎన్నిక కాగా, గౌరవ అధ్యక్షుడిగా కొత్తపల్లి అబ్రహం (సోంపేట), సీనియర్ అడ్వైజర్లుగా కె.వి.సాల్మన్ (టెక్కలి), వి.జాషువ (గార), ప్రత్తి విజయ్ కుమార్ (ఇచ్ఛాపురం) బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల అధికారిగా కె.వి.సాల్మన్ (టెక్కలి) వ్యవహరించారు. -
కొరత ‘సాధారణమేనా..?’
● జిల్లాలో పెట్రోల్ కొరత ● స్పీడ్ పెట్రోల్ మాత్రమే లభ్యం ● మరో రెండు రోజులపాటు ఇంతే అంటున్న పెట్రోల్ బంక్ వర్గాలు శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లాలో మళ్లీ పెట్రోల్ కొరత ప్రారంభమైంది. ప్రస్తుతానికి జిల్లాలో స్పీడ్ పెట్రోల్ మాత్రమే చాలాచోట్ల విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఈ కొరత అధికంగా కనిపిస్తోంది. సాధారణ పెట్రోలు మరో రెండు రోజుల పాటు అందుబాటులో ఉండదని చెబుతున్నారు. ఇటీవల రెండు రోజులు సెలవులు వచ్చాయని, అందువల్ల పెట్రోల్ కంపెనీల ఫిల్లింగ్లో జాప్యం జరిగిందని అందుకే సాధారణ పెట్రోల్ అమ్మలేకపోతున్నా మని యజమానులు చెబుతున్నారు. అయితే పలు బంకుల్లో స్పీడ్ పెట్రోల్ చాలాకాలంగా ఉండిపోవడం వల్ల సాధారణ పెట్రోల్ విక్రయాలు కావాలనే ఆపి స్పీడ్పెట్రోల్ అమ్ముతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర బాగా పెరిగిపోయింది. దీంతో పాటు సాధారణ లీటరు పెట్రోల్ ధరకి, స్పీడ్ పెట్రోల్ ధరకు మధ్య వ్యత్యాసం దాదాపు రూ.5లు ఉంది. దీంతో స్పీడ్ పెట్రోల్ కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వెనుకంజ వేస్తున్నా రు. ప్రధానంగా నగరంలో బలగ, తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యత్యాసం వల్ల రోజుకు రూ.2.50 లక్షల వరకు అదనపు భారం ప్రజలపై పడుతోంది. -
ఫ్యాప్టో నిరసన జ్వాల
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ర్యాలీ, పికెటింగ్ నిర్వహించారు. ముందుగా ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్, జిల్లా సహాధ్యక్షుడు చల్ల శ్రీనివాసరావులు మద్దతు పలికి ర్యాలీ ప్రారంభించారు. నిరసనలు, నినాదాలతో 80 ఫీట్ రోడ్ మీదుగా ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ వద్దకు చేరి బైఠాయించి పికెటింగ్ చేపట్టారు. ఫ్యాప్టో చైర్మన్, సెక్రటరీ జనరల్ బమ్మిడి శ్రీరామ్మూర్తి, పడాల ప్రతాప్కుమార్ ఆధ్వర్యంలో పలు భాగస్వామ్య సంఘాల నాయకులు ఇచ్చి ప్రసంగించారు. ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్ఓ వి.విశ్వేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు ఎస్.రమేష్బాబు, పూజారి హరిప్రసన్న, వై.వాసుదేవరావు, ప్రభాకరరావు, తిరుమలరావు, బి.వెంకటేశ్వర్లు, కె.జగన్మోహన్రావు, లండ బాబూరావు, సీహెచ్ దిలీప్, ఎస్.రమేష్ బాబు, బంగారు షణ్ముఖరావు, కోలక కృష్ణమోహన్, పి.కృష్ణారావు, ఎం.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
తెగి పడిన రైలు విద్యుత్ తీగలు
● 14 రోజుల వ్యవధిలో రెండోసారి ప్రమాదం ● అధికారులు నిర్లక్ష్యంతో ప్రయాణికులు ఇబ్బందులు ● లైదాం రైల్వే గేటు మధ్య నిలిచిన గూడ్స్ రైలు జి.సిగడాం: పొందూరు రైల్వే స్టేషన్లో మరోసారి విద్యుత్ హైటెన్షన్ వైర్లు ట్రాక్పై తెగిపడ్డాయి. 14 రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రమాదకరమైన హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి పడడంతో రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 1వ తేదీన హైటెన్షన్ వైర్లు ట్రాక్పై పడడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో ట్రాక్ లో ట్రైన్ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా విద్యుత్ వైర్లు తెగిపడడంతో మూడు గంటల పాటు ఆమదాలవలస, చీపురుపల్లి రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. స్థానిక రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బంది మరమ్మతులు నిర్వహించి రాకపోకలు పునరుద్ధరించారు. గేటు మధ్యలో నిలిచిన గూడ్స్ రైలు వైర్లు తెగి పడడంతో లైదాం రైల్వే గేటు సమీపంలో మధ్యాహ్నం 2.30కు గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో పొందూరు, సంతకవిటి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే గేటు ఇరువైపులా వాహనాలు బారులు తీరి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనహదారులు పెందుర్తి అండర్ పాస్ మీదుగా రాకపోకలు సాగించారు. తీగలు తెగి పడిన విషయాన్ని విశాఖపట్నంలోని ఉన్నతాధికారులకు స్థానిక సూపరింటెండెంట్ సమాచారం ఇవ్వడంతో టవర్ వ్యాగన్ ఓహెచ్ ఈ కారుతో పొందూరు చేరుకుని సాంకేతిక సిబ్బందితో మరమ్మతులు చేయించారు. -
వినిపిస్తుందా?
హలో హలో.. కంచిలి : హైస్పీడ్ నెట్, 5జీ, 4జీ సంగతి తర్వాత.. ముందు మాట్లాడటానికి సిగ్నల్స్ వస్తే చాలని భావిస్తున్నారు ఉద్దాన ప్రాంతంలోని అనేక గ్రామాల ప్రజలు. కాల్ డ్రాప్లు, బలహీన సిగ్నల్, అతి నెమ్మదైన ఇంటర్నెట్ వంటి సమస్యలను ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్నా పరిష్కారం మాత్రం దక్కడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశమంతా డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుతుండగా.. ఉద్దానం ప్రజలు మాత్రం ఇప్పటికీ ఒక ఫోన్ కాల్ చేయాలంటే ఇంటి నుంచి బయటకు వెళ్తేకాని సాధ్యం కావడం లేదు. సమస్య ఏంటో.. మొబైల్ నెట్వర్క్ను టెలికాం సంస్థలు నిర్వహిస్తాయి. ఇవి తమ వ్యాపార లాభాలు, సాంకేతిక అవసరాలు, ప్రభుత్వ అనుమతులు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని నెట్వర్క్ను విస్తరిస్తాయి. అయితే రాజకీయాలకు సంబంధం లేదా అంటే.. పరోక్షంగా సంబంధం ఉంటుందనే చెప్పాలి. ప్రభుత్వాలు డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రాధాన్యంగా తీసుకుంటే, టవర్ అనుమతులు వేగంగా ఇవ్వడం, ప్రభుత్వ భూములు కేటాయించడం, విద్యుత్, ఫైబర్ కనెక్టివిటీ వంటి అంశాల్లో సహకారం అందించగలవు. ప్రజాప్రతినిధులు నిరంతరం ఒత్తిడి తీసుకొస్తే అభివృద్ధి వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ చర్యలు లేకపోతే అభివృద్ధి ఆలస్యం అవుతోంది. అదనపు టవర్లు ఏవీ? ఉద్దాన ప్రాంత గ్రామాల్లో ఎక్కువగా కొబ్బరి, జీడి, మామిడి తదితర పంటలు వ్యాప్తి చెంది ఉన్నాయి. ఇక్కడ మొబైల్ టవర్ల నిర్మాణం ఎక్కువ అవసరం పడుతుంది. మైదాన ప్రాంతాల కంటే ఇక్కడ నెట్వర్క్ సమస్య ఎక్కువగా ఉంటోంది. మొబైల్ కంపెనీలు వ్యాపార దృక్పథం కంటే నాణ్యమైన నెట్వర్క్ అందించేందుకు కాస్త పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి ఉంది. దీని కోసం ప్రజాప్రతినిధులు తమ వంతుగా టెలికాం సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధమైన ప్రయత్నాలు ఎంతవరకు జరుగుతున్నాయో నేతలకే తెలియాలి. అధిక రీచార్జులు చెల్లిస్తున్నా.. వినియోగదారులు 5జీ నెట్వర్క్ సేవల కోసం రీచార్జి చేస్తుంటే వాస్తవంగా ఇక్కడ అందేది మాత్రం 4జీ.. అంతకంటే తక్కువ స్పీడు. ప్రతి ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్లు ఉన్నప్పటికీ అదే స్థాయిలో అవసరమైన టవర్లు ఇక్కడ ఏర్పాటు చేయలేదు. దీంతో ఒకే టవర్పై వేలాది మంది వినియోగదారులు ఆధారపడటం వల్ల సిగ్నల్ బలం, ఇంటర్నెట్ వేగం తగ్గడం జరుగుతోంది. 5జీ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో వినియోగదారులు చెల్లిస్తున్న ధరకు తగిన సేవలు అందిస్తున్నారా అనే ప్రశ్నకు టెలికాం సంస్థల వద్ద సమాధానం కరువవుతోంది. ప్రతి గ్రామంలో తెల్లవారే సరికి ఉపాధి హామీ పథకం పనులు చేయడానికి వెళ్లే వేతనదారులకు మొబైల్ హాజరు అనేది సమస్యగా మారింది. యాప్లో ఫీల్డ్ అసిస్టెంట్లు వివరాలు అప్లోడ్ చేసేందుకు నెట్వర్క్ సమస్య తీవ్ర ఆటంకంగా మారుతోంది. ప్రతినెలా సామాజిక పింఛన్ల పంపిణీలో కూడా ఉద్దానం ప్రాంతంలో నెట్వర్క్ సమస్యలతో చాలా సార్లు జాప్యం జరుగుతోంది. ప్రతి సచివాలయం పరిధిలో ఉద్యోగుల హాజరు కూడా ఇంటర్నెట్పైనే ఆధారం. ప్రస్తుతం భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సర్ ప్రక్రియ పూర్తిగా మొబైల్ నెట్వర్క్ మీదే ఆధార పడిఉంది. ఈ ప్రాంతంలోని బలహీనమైన నెట్వర్క్తో బీఎల్ఓలు అవస్థలు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, టెలికాం సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఉద్దానం ప్రాంతానికి ప్రత్యేక నెట్వర్క్ అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలి. దీని కోసం గ్రామాలవారీగా సిగ్నల్ సర్వే చేసి, అవసరమైన చోట కొత్త టవర్లు ఏర్పాటు చేసి ఫైబర్ కనెక్టవిటీ బలోపేతం చేయాలి. మొబైల్ నెటవర్క్ అనేది విలాసం కాదని.. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి వంటి అత్యవసర సేవలు, ప్రభుత్వ సేవలకు ప్రాథమిక మౌలిక సదుపాయంగా గుర్తించాలి. ఉద్దానం ప్రజలకు నాణ్యమైన నెట్వర్క్ అందించడం అభివృద్ధిలో కీలకమైన అడుగు. ప్రస్తుతం మొబైల్ ఇంటర్నెట్ బలంగా లేకపోవడంతో చాలా పౌరసేవలు అందించడంలో అధికార యంత్రాంగం ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కోకొల్లలు. -
విలువలు కలిగిన నాయకుడు
ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాడిన నాయకుడు, కాపు ఉద్యమానికి గుర్తింపుగా నిలిచిన నేత ముద్రగడ పద్మనాభం. మంచి వ్యక్తిత్వం ఉన్న ముద్రగడ లేని లోటు తీరనిది. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు అందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. – ధ ర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సంకల్పం గొప్పది కాపు ఉద్యమ నేత ము ద్రగడ పద్మనాభం మృతిచెందడం కాపు ఉద్యమానికి తీరనిలోటు. ఆయన సంకల్పం చాలా గొప్పది. అలాంటి నేత మన మధ్య లేకపోవడం తీరని లోటు. – పిరియా విజయ, జెడ్పీ చైర్పర్సన్, శ్రీకాకుళం పోరాటయోధుడు పద్మనాభం రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాపు ఉద్యమానికి ఊపిరిపోసిన ముద్రగడ పద్మనాభం పోరాటయోధుడు. ఆయన సామాజిక వర్గం అణచివేతకు గురవుతోందని గొంతెత్తి చాటిన వైనం ఎప్పటికీ మర్చిపోలేనిది. అలాంటి ఉద్యమకారులు అరుదు. – నర్తు రామారావు, ఎమ్మెల్సీ బలమైన నేత ఏపీ రాజకీయాల్లో బలమైన నేత, కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటు. కాపు నాయకులు ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటారు. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే రాజీ లేని పోరాటం కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం మంచి పేరు ప్రఖ్యా తలు గడించారు. నమ్మి న సిద్ధాంతం కోసం రాజీ లేని పోరాటం చేశారు. ఆయన మృతి కాపులకు తీరని లోటు. – గొర్లె కిరణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే బాధాకరం నిబద్ధత కలిగిన నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి ఎంతో బాధాకరం. కాపు సామాజిక వర్గానికి అండగా ఉద్యమాలు చేసిన గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, టెక్కలి తీరని లోటు రాష్ట్ర కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అకాల మరణం ఆ సామాజిక వర్గంతో పాటు, ఆ ప్రాంతానికి తీరనిలోటు. కాపులకు బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఆయన చేసిన పోరాటాలు చిరకాలం గుర్తుంటాయి. ఆయన మృతికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. – సాడి శ్యాంప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త -
అధ్యాపక పోస్టు భర్తీకి ఇంటర్వ్యూ
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఐ.టి.ఈ.పి. విభాగంలో ఎకనామిక్స్ కాంట్రాక్ట్ అధ్యాపక పోస్టు భర్తీకి ఈ నెల 16న వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్ బి.అడ్డయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8, 10వ తేదీల్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న పోస్టులకు ఇది అదనమని వెల్లడించారు. పీహెచ్డీ పూర్తిచేసి నెట్, స్లెట్ ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు విశ్వవిద్యాలయం వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోని సంబంధిత సర్టిఫికెట్లు జతచేసి ఉదయం 10 గంటలకు వర్సిటీ పరిపాలనా భవనంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి సోంపేట: మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని కోరుతూ సోంపేట మండలం ఉప్పలాం పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రతినిధులు రక్తతర్పణ వేలిముద్రలతో ప్రధానమంత్రి మోదీకి లేఖలు రాశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి పుక్కల్ల ఆరేలమ్మ, ప్రతినిధులు మడికమ్మ, నానమ్మ, లక్ష్మీకాంత తదితరులు పాల్గొన్నారు. నేడు ‘చలో పలాస ఆర్డీఓ ఆఫీస్’ వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన ప్రాంతాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదనను రద్దు చేయాలని కోరుతూ బుధవారం ఉదయం 10 గంటలకు చేపట్టనున్న చలో పలాస ఆర్డీఓ ఆఫీస్ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణ, ఉద్దాన ప్రాంత ప్రజల భవిష్యత్ కోసం, పచ్చని ఉద్దాన విధ్వంసానికి వ్యతిరేకంగా బాధిత గ్రామాల రైతులు సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మహాధర్నాలో బాధిత గ్రామాల ప్రజలంతా పాల్గొనాలని కోరారు. -
ఈగల సమస్య తగ్గుముఖం
టెక్కలి: మండలంలోని బూరగాం పంచాయతీ బాలకవానిపేట గ్రామంలో గత కొద్ది రోజులుగా చోటు చేసుకున్న ఈగల సమస్యకు ప్రధానమైన కారణాలపై స్పష్టత రాలేదు. అయితే గత కొద్ది రోజులుగా గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేస్తుండడంతో ప్రస్తుతానికి ఈగల సమస్య తగ్గుముఖం పట్టింది. ఇదిలా ఉండగా గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామంలో ఈగల మోతపై గ్రామస్తులు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెబుతున్నారు. గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి పంట పొలాల వద్ద కొంతమంది కోళ్ల వ్యర్థాలను ఎరువులుగా వినియోగించేందుకు నిల్వగా చేయడంతో ఈ సమస్య తలెత్తినట్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోళ్ల వ్యర్థాలపై ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో ఈగలు పెరిగి గ్రామంపై దాడి చేశాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా అధికారులు పరిశీలన చేసినట్లయితే భవిష్యత్లో బాలకవానిపేట గ్రామానికి ఈగల దాడి లేకుండా శాశ్వతమైన పరిష్కారం చూపవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
బలి తీసుకున్న అతివేగం
● కారు ఢీకొని వ్యక్తి మృతి రణస్థలం: కారు డ్రైవర్ నిర్లక్యం, అతివేగానికి ఒక నిండు ప్రాణం బలయ్యింది. మండలంలోని నెలివాడ సమీపంలో జాతీయ రహదారిపై శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో బైకుపై ఉన్న ఈల్ల శ్రావణ్(33) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం ఉదయం రణస్థలం మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న తన భార్య కోమలిని మృతుడు శ్రావణ్ 8 గంటల సమయంలో పాఠశాల వద్ద దించి తిరిగి ఇంటికి బయల్దేరాడు. అతడిని నెలివాడ పైవంతెన దిగువున ఉదయం 8.25 గంటల సమయంలో వెనుక నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం 50 మీటర్లు దూరంలో ఎగిరిపడింది. తీవ్రగాయాలు కావడంతో ప్రమాదస్థలంలోనే శ్రావణ్ మృతి చెందాడు. కారు ఒడిశా రాష్ట్రంలోని బరంపురం నుంచి వస్తోందని పోలీసులు తెలిపారు. మృతుడి స్వగ్రామం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని గునపురెడ్డిపేట. ఇతను పైడి భీమవరంలోని డాక్టర్ రెడ్డీస్లో కెమిస్ట్రీగా పని చేస్తున్నాడు. అలాగే కారు నడుపుతున్న వ్యక్తి సైతం అదే కంపెనీలో పని చేస్తున్నాడు. మృతుడికి భార్య కోమలి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ప్రమాదంతో గునపరెడ్డిపేట గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. -
గట్లుతో ఇక్కట్లు
థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ఈ ప్రాంత ప్రజలు ఒప్పుకోకపోవడంతో 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం బీల ప్రాంతంలో బహుళ ఉత్పత్తుల పరిశ్రమలు నిర్మించుకోవడానికి ఎన్సీసీ యాజమాన్యానికి జీవో నంబర్ 329 విడుదల చేసింది. దీనిని అదునుగా తీసుకుని ఎన్సీసీ యాజమాన్యం 2017 సంవత్సరంలో సవిత్ర అగ్రి ఇండస్ట్రీయల్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తాము కొనుగోలు చేసిన భూముల్లో చేపల చెరువుల నిర్మాణం చేపడతామని ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు దరఖాస్తులు చేసింది. అనంతరం అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సహకారంతో 2018 మే నెలలో 182 ఎకరాల్లో చేపల చెరువుల నిర్మాణాకి పెద్దగట్లు వేశారు. పెద్ద గట్లు వేయడం, ఆక్వా చెరువులు ఏర్పాటు చేస్తున్నారనే ఊహగానాలు నేపథ్యంలో రైతులు, అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక ఆధ్యర్యంలో చేపల చెరువుల నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అయితే అనంతరం ఎటువంటి అనుమతులు రాకపోవడంతో చెరువుల నిర్మాణం తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కానీ అప్పట్లో నిర్మించిన గట్లు నేటివరకు తొలగించలేదు. నీటి ప్రవాహానికి అడ్డుగా గట్లు వేయడంతో బారువ, పలాసపురం, బెంకిలి, జింకిభద్ర పంచాయతీల పరిధిలో వేలాది ఎకరాల వరి పొలాలు ప్రతిఏటా అక్టోబర్, సెప్టెంబర్లో కురిసే భారీ వర్షాలకు ముంపునకు గురవుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2018లో జిల్లా కలెక్టర్ గట్లు తొలగిస్తామని హమీలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని స్థానిక రైతులు తెలియజేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి అడ్డంగా వేసిన చెరువు గట్లు తొలగించాలని కోరుతున్నారు. -
ఎస్సీ వర్గీకరణతో ఒరిగేదేమీ లేదు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎస్సీ వర్గీకరణతో మాలలకు ఒరిగేదేమీ లేదని మాలల ఐక్యత రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు అన్నారు. ఈ బృందం ఏప్రిల్ 25వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రారంభించిన మాలల ఐక్యత చైతన్య యాత్ర ఆదివారం శ్రీకాకుళం చేరుకుంది. ఈ మేరకు నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వలన ఏ ఒక్కరికీ మేలు జరగడం లేదని, మాదిగ సామాజికవర్గంలో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని, రెల్లి సామాజిక వర్గానికి అత్యంత నష్టం జరిగిందని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఎస్సీ రిజర్వేషన్ 15 శాతంగానే ఉందని, ప్రస్తుతం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగ యువతకు స్కిల్ డవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. బ్యాక్ లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. క్రిస్టియానిటీ పేరుతో దళితుల మధ్య చిచ్చుపెట్టి విభజించడం తగదన్నారు. కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు నాయకులు, జిల్లా రెల్లి కుల సంక్షేమ సంఘం నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘కార్పొరేట్ల విద్యాశాఖ మంత్రి మాకు వద్దు’
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రవ్యాప్తంగా విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని, వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వల్లరాజు మాట్లాడుతూ.. డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ చదువుకున్న విద్యార్థులకు దాదాపు పదివేల 700 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటనలు పేపర్లకే పరిమితమవుతున్నాయని తెలిపారు. చాలా వసతి గృహాల్లో తాగడానికి శుద్ధమైన జలం అందడం లేదని, ధరలు ఆకాశం అంటుతుంటే విద్యార్థులకు ఇచ్చే మెస్ ఛార్జీలు మాత్రం అంతంత మాత్రమేనని అన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు చేస్తామన్నారు. కార్పొరేట్ల విద్యాశాఖ మంత్రి మాకు వద్దు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.సోమశేఖర్, సీహెచ్ రవి జిల్లా నాయకులు చరణ్ తేజ అశోక్ హర్షవర్ధన్ ఉదయ్ సాయి భవాని తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలపై ఆందోళన నేడు
శ్రీకాకుళం: రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం ఆందోళన చేపట్టనున్నట్లు ఏపీటీఎఫ్ నాయకుడు మామిడి భుజంగరావు, బుక్కురు వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఐక్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటలకు 80 అడుగుల రోడ్డు నుంచి ర్యాలీ ప్రారంభించి, కలెక్టర్ కార్యాలయం వద్ద పికెటింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శ్మశానవాటిక ఆక్రమణపై ఫిర్యాదు రణస్థలం: మండల కేంద్రంలోని జేఆర్పురం పంచాయతీ దన్నానపేట గ్రామానికి చెందిన శ్మశానవాటికను కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నారని గ్రామస్తులు తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 211–1లో గెడ్డ వాగును గత 50 ఏళ్లుగా శ్మశానవాటికగా వాడుతున్నామన్నారు. ప్రస్తుతం ఆ గెడ్డవాగును కప్పేసి పంట పొలాలుగా మార్చేస్తున్నారని, శ్మశానవాటిక, గెడ్డవాగుకు హద్దులు నిర్ణయించి ఆక్రమణలు తొలగించాలని కోరారు. ఈ ఫిర్యాదు చేసినవారిలో దన్నాన లక్ష్మణరావు, దన్నాన శ్రీరామ్, సత్య, దినేష్ కుమార్, సాయి, తేజ తదితరులు ఉన్నారు. ఎస్పీ గ్రీవెన్స్కు 88 ఫిర్యాదులు శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ (ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక)కు 88 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో పరిష్కారం అయ్యేలా చొరవ చూపుతానని భరోసా ఇచ్చారు. -
సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్లో 180 వినతుల స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యమిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి స్వయంగా 180 వినతులను స్వీకరించారు. అయితే వినతులు ప్రతివారం వస్తున్నా.. పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. ప్రతీ సమస్యకు ఒక ఎండార్సుమెంట్ జారీచేసి, అ సమస్య పరిష్కారం జరిగినట్టు చూపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారుకి న్యాయం జరగడం లేదు. కార్యక్రమంలో డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అక్రమాలపై విచారణ జరపాలి కంచిలి మండలంలోని భవానీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవానీ ఐటీఐలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని పలువురు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే రెట్టింపు వసూలు చేస్తూ.. విద్యార్థులకు ఉపకార వేతనాలను కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ప్రాక్టికల్స్ కూడా నిర్వహించడం లేదని, మాస్ కాపీయింగ్ కోసం, హాజరు సర్దుబాటు కోసం, రికార్డుల మేనేజ్మెంట్ కోసం వివిధ రకాల ఫీజులు కూడా వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినవారిలో ఈశ్వరరావు, సత్యం నాయుడు, శ్రీకాంత్, ఎన్.బాబురావు, జి.రాంబాబులు ఉన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాంతో కలిసి పలువురు ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగి అనారోగ్యం బారినపడినప్పుడు ఆర్టీసీ డాక్టరు గానీ, ప్రభుత్వ డాక్టరు గానీ ఇచ్చిన సిక్ సర్టిఫికెట్ ఆధారంగా ఉద్యోగి లీవ్ అకౌంట్లో తగినన్ని లీవ్ బ్యాలన్స్ ఉన్నప్పటికీ పూర్తి జీతం ఇవ్వాలని కోరారు. సీ్త్ర శక్తి పథకంలో ఓవర్ లోడ్ ఉన్నప్పటికీ తనిఖీ అధికారులు కేసులు రాయడంతో ఉద్యోగి పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించలేకపోతున్నారని తెలిపారు. జిల్లాలో డిపో మేనేజర్లు, కేంద్ర కార్యాలయం సర్కులర్కు విరుద్ధంగా క్యుములేటివ్ ఇంక్రిమెంట్లు కోత విధిస్తున్నారని వాటిని ఆపాలన్నారు. రణస్థలం మండలం జీరుపాలెం గ్రామ పంచాయతీ పరిధి జగన్నాథపురం గ్రామ ప్రభుత్వ భూమి సమస్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని గ్రామస్తులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. కోటిపాలెం గ్రామ సరిహద్దులో ఉన్న ప్రభుత్వ భూమిని గతంలో భూమిలేని పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, గ్రామాభివృద్ధి అవసరాల కోసం కేటాయించారని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ భూమిలో కొంతభాగం కొద్దిమంది వ్యక్తుల ఆధీనంలో ఉందని, గ్రామంలోని అనేక మంది భూమిలేని పేద కుటుంబాలకు ఇప్పటికీ ఇళ్ల స్థలాలు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇదివరకే అధికారులకు కలిసినా పరిష్కారం కాలేదని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు ప్రభుత్వ భూమి సమస్యపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టి, న్యాయం చేయాలని కోరారు. రెవెన్యూ (సీసీఎల్ఏ) 66 వినతులు పంచాయతీ రాజ్ శాఖ 22 సెర్ప్ విభాగం 15 వ్యవసాయ శాఖ 13 మున్సిపల్ పరిపాలన 11 సర్వే సెటిల్మెంట్స్ విభాగం 10 ఈపీడీసీఎల్ (విద్యుత్) 9 రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 4 పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం 4 పోలీస్ శాఖ 3 సచివాలయ విభాగం 3 మెడికల్ ఎడ్యూకేషన్ 3 రూరల్ డవలెప్మెంట్ 2 వాటర్ రిసోర్సు 2 బీసీ వెల్ఫేర్, ఏపీఎస్ ఆర్టీసీ, ఐసీడీఎస్, సెకండరీ హెల్త్, సమగ్ర శిక్ష, ఎండోమెంట్, ఫ్యాక్టరీస్, రూరల్ వాటర్ సప్లయ్, బోర్డు ఆప్ ఇంటర్మీడియట్, సివిల్ సప్లయ్, ఏపీ పొల్యూషన్ బోర్టు, ఎంప్లాయీమెంట్ అండ్ ట్రైనింగ్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ శాఖలకు ఒక్కక్కటి వంతునా ఫిర్యాదులు వచ్చాయి. -
సర్దేశారా..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గత నెల రోజులుగా చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నేటితో ముగియనుంది. అనేక సందేహాలు, అనుమానాలు, ఆరోపణలు, అభ్యంతరాల నడుమ జిల్లాలో ఒక్కరోజు ముందే సర్ కార్యక్రమం దాదాపు ముగిసింది. జిల్లాలో ఉన్న ఓటర్లలో 851 మినహా మిగతావన్నీ సోమవారం సాయంత్రానికి డిజిటలైజేషన్ దాదాపు పూర్తయింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో 100శాతం డిజిటలైజేషన్ జరిగిపోయింది. పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు, తిరిగి సేకరించిన ఫారాలు, డిజిటలైజేషన్ పూర్తయినట్టు అధికారులు అంకెలు చూపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. నేటికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని, తిరిగి తీసుకోలేదని చెబుతున్న ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం శతశాతం పూర్తయిపోయిందని దాదాపు సర్దేశారు. ఇక, ప్రతిపాదిత జాబితా వచ్చాకే లొసుగులు, చిక్కులు బయటపడనున్నాయి. డిజిటలైజేషన్ సమయానికే జిల్లాలో లక్షా 63వేల 757ఓట్లు పోయాయి. డెత్లు, డూప్లికేట్లు, ఆబ్సెంట్, షిప్టింగ్, ఆల్రెడీ ఎన్రోల్మెంట్ పేరుతో తేలిపోయాయి. ఇక, డిజిటలైజేషన్ చేసిన మిగతా ఓట్లలో ఎన్ని పోతాయన్నదే చూడాల్సి ఉంది. చాలా చోట్ల బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు అందించలేదని, టీడీపీ నాయకుల కనుసన్నల్లో వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. పత్రికల్లో అనేక కథనాలు కూడా వచ్చాయి. కథనాలు వచ్చాక అందులో పేర్కొన్న కేస్ స్టడీస్ ఆధారంగా స్పందిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలు అందించడం, తిరిగి తీసుకోవడం చేసినా దృష్టికి రానివి ఎన్నో ఉండిపోయాయి. అవన్నీ ప్రతిపాదిత జాబితా వచ్చాక బయట పడనున్నాయి. మొత్తానికి అధికార యంత్రాంగమైతే సర్ ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. నియోజకవర్గం పోలింగ్ మొత్తం ఓటర్లు యూఈఎఫ్ డిజిటలైజేషన్ శాతం శ్రీకాకుళం 279 2,75,852 23,143 2,75,001 99.69 ఇచ్ఛాపురం 299 2,73,230 30,551 2,73,230 100 పలాస 284 2,22,430 19,732 2,22,430 100 టెక్కలి 315 2,38,703 18,980 2,38,703 100 పాతపట్నం 323 2,28,424 19,596 2,28,424 100 ఆమదాలవలస 259 1,93,043 14,594 1,93,043 100 ఎచ్చెర్ల 309 2,48,748 21,633 2,48,748 100 నరసన్నపేట 290 2,16,975 15,528 2,16,975 100 జిల్లాలో ఒక రోజు ముందే దాదాపు పూర్తి 851 మినహా దాదాపు డిజిటలైజేషన్ లక్షా 63వేల 757 ఓట్లు ఇప్పటికి పోయినట్టే -
డీ సెట్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం
గార: ప్రభుత్వ డైట్, ప్రైవేటు డీఈడీ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి డీ సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైందని వమరవల్లి ప్రభుత్వ డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎ.గౌరిశంకరరావు ఒక ప్ర కటనలో పేర్కోన్నారు. డీసెట్లో అర్హత సాధించిన ర్యాంకు హోల్డర్లు ఈ నెల 15వ తేదీ వరకు తామ ప్రవేశం కోరుకునే కళాశాలలను ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. 16వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. 19 నుంచి 23వ తేదీ వరకు డైట్లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 25వ తేదీ నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా డాక్టర్ నరేష్కుమార్ అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖాఽధికారిగా డాక్టర్ ఈవీ నరేష్కుమార్ నియ మితులయ్యారు. ఈ మేరకు సోమ వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన విశాఖ జీవీఎంసీలో వైద్యాధికారిగా పనిచేస్తూ బదిలీ అయ్యారు. కాగా ఇప్పటివరకు స్థానిక జిల్లాలో జీజీహెచ్ ఆర్ఎంఓగానూ అలాగే డీఎంహెచ్ఓగా కూడా విధుల్లో ఉన్న డాక్టర్ కె.అనితకు కాకినాడ జిల్లా వైద్యశాఖాధికారిగా బదిలీ అయ్యింది. మంగళవారం కొత్త డీఎంహెచ్ఓ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. నవోదయలో ప్రవేశాలు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యాసంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్, నవోదయ విద్యాలయ కమిటీ చైర్మన్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్ (www. navodaya.gov.in లేదా http://cbreitmr.rci .gov.in/ nvr/) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 31 ఆఖరు తేదీ అని నవంబర్ 28న ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు. ‘గిరిజనులకు ‘అన్నదాత సుఖీభవ’ అందడం లేదు’ పాతపట్నం: పోడు పట్టాలతో గిరిజనులు పంటలు పండించుకుంటున్నామని, పండించిన పంటలకు యూరియా, అన్నదాత సుఖీభవ పథకాలు తమకు ఇప్పించాలని భగంతర, బురికిపేట, రంకిణి గ్రామాలకు చెందిన గిరిజనులు దిమిలి రత్నాలమ్మ, దిమిలి శాంతమ్మ, లాబర సుశీల, చిన్మమ్మడు కోరారు. ఈ మేరకు సోమవారం సీతంపేట ఐటీడీఏ పీఓ పవర్ స్వప్నిల్ జగన్నాథ్కు గిరిజనులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజనులు మా ట్లాడుతూ గత ప్రభుత్వంలో పోడు పట్టాలు అందించారని, పంటలు పండించుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. గతంలో అన్నదాత సుఖీభవ , యూరియా ఇచ్చేవారని, ఇప్పుడు రావడం లేదన్నారు. ఇప్పుడు 1బిలు కూడా రావడం లేదన్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి తమకు యూరియా, అన్నదాత సుఖీభవ ఇప్పించాలని కోరుతున్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో జన్ని లక్ష్మి, జ్యోతి, శారద, ఆఫీసమ్మ, పార్వతి, కరునమ్మ తదితరులు ఉన్నారు. మహిళ ఆత్మహత్య కేసులో నలుగురికి రిమాండ్ శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఆదివారంపేటలో వివాహిత షర్మిల ఆత్మహత్యకు కారణమైన అత్తింటిలో నలుగురినీ రిమాండ్కు తరలించినట్లు సీఐ పి.ఈశ్వరరావు సోమవారం వెల్లడించారు. రిమాండ్కు వెళ్లిన వారిలో షర్మి ల అత్తమామలు దమయంతి, రామారావు, భర్త నాగరాజు, మరిది తేజేశ్వరరావు ఉన్నారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): దస్తావేజు లేఖరుల పొట్టకొట్టే జీఓ నంబర్ 396కి వ్యతిరేకంగా ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు పెన్డౌన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు దస్తావేజు లేఖరుల సంఘ నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐకమత్యంతో పెన్ డౌన్ కార్యక్రమం చేసి మన జీవన భృతిని కాపాడుకోవాలని కోరారు. -
లేని అనారోగ్యాన్ని సృష్టించి నిజాన్ని చంపేస్తారా?
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రైతు సేవాకేంద్రం వద్ద ప్రాణాలు కోల్పోయిన మహిళా రైతు కాంతమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ టెక్క లి సమన్వయకర్త పేరాడ తిలక్ స్పష్టం చేశారు. ఎరు వుల కోసం వెళ్లి చిన్న గదిలో క్యూలో గాలి ఆడక, ఆ లైనులో నిలబడలేక కాంతమ్మ మృతి చెందారని ఆమె కుటుంబ సభ్యులే చెబుతుంటే.. దాన్ని కప్పిపుచ్చేందుకు కలెక్టర్, మంత్రులు ఆరోగ్య సమస్యలను తెర మీదకు తీసుకురావడం దారుణమన్నారు. కాంతమ్మ కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా కింద రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంతమ్మ ఆ రోజు నందిగాం మండలం పెద్దలేల్లపల్లి నుంచి నేషనల్హైవేపై లట్టిగాంలో ఉన్న ఆర్ఎస్కే వరకు నడిచి వెళ్లి ఉదయం నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు క్యూలో నిలబడి మృత్యువాత పడిందని స్పష్టం చేశారు. దీన్ని ప్రభుత్వ హత్యగా పరిగణించాలన్నారు. గత మూడు నెలలు గా ఆమె ఒక్క మందు బిళ్ల కూడా వేయలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారని, ఆమె మందులు వాడినట్టు కలెక్టర్, మంత్రి, వ్యవసాయాధికారులు నిరూపించగలరా అని ప్రశ్నించారు. క్యూలో తోపులాట జరుగుతోందని 3.28 నిమిషాలకు అక్కడే ఉన్న జనసేన నాయకుడు ఎస్ఐ, కానిస్టేబుల్కి ఫోన్ చేస్తే స్పందించకపోతే 100కి కాల్ చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. పోలీ సుల చేత కుటుంబ సభ్యుల్ని సైతం బెదిరించి శవం దగ్గర ఉండనివ్వకుండా, కనీసం ఏడవనీయకుండా బయటకు పంపించేశారని పేర్కొన్నారు. వ్యవసా య శాఖ మంత్రి, అయన అన్నదమ్ములు యూరి యాను బ్లాక్మార్కెట్లో అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటున్నారని, దీనిపై విచారణ చేయాలని కోరారు. టెక్కలి నియోజకవర్గంలో ఓ ఇద్దరు సైనికులు వీరమరణం చెందితే ఇప్పటివరకు వాళ్ల కుటుంబాలకు పైసా చెల్లించలేదన్నారు. సమావేశంలో కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు నందిగాం ఎంపీపీ శ్రీరామ్మూర్తి, మాజీ ఎంపీపీ చక్రవర్తి, కణితి నారాయణమూర్తి, పూడి ఆశారాణి, వంజంగి లోకనాథం, బడ్డ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గత మూడు నెలలుగా ఆమె ఒక్క మందు బిళ్ల కూడా వేయలేదుకాంతమ్మ మందులు వాడినట్టు కలెక్టర్, మంత్రి, వ్యవసాయాధికారులు నిరూపించగలరా..!రైతు మృతిపై రాజకీయమామృతురాలి కూతురు వంజంగి సుమతి, భానుమతి, మనవడు లోకనాథంలు మాట్లాడుతూ అమ్మ మృతి చెందినప్పుడు అక్కడే ఉన్నామని మృతదేహం దగ్గరకు కూడా చేరనివ్వలేదని, ఏడ్చేందుకు కూడా అవకాశం లేకుండా దూరంగా తీసుకెళ్లిపొమ్మన్నారని తెలిపారు. మృతికి సంబంధించి, అక్కడ జరిగిన సంఘటలన్నీ ఆరు వీడియోలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. ఎరువుల కోసం క్యూలో నిలబడడం వల్లే మరణం ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..! ఆరోగ్యం బాగోలేక చనిపోయిందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం దారుణం కలెక్టర్, మంత్రి, జేడీ, ఏడీలపై కేసు నమోదు చేయాలి మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ -
నేడు పెన్షనర్ల వైద్య శిబిరం
శ్రీకాకుళం కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు శ్రీకాకుళం ఏపీ ఎన్జీవో హోంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రకాశరావు, జిల్లా అధ్యక్షుడు సోమసుందరరావు ఒక ప్రకటనలో తెలిపారు. జెమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ, 2–డీ ఇకో టెస్టులు ఉచితంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. పెన్షనర్లంతా ఈహెచ్ఎస్ కార్డులతో వచ్చి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు యాసిడ్ తాగి మహిళ ఆత్మహత్య పొందూరు : మండల కేంద్రం పొందూరులో లావేటివీధికి చెందిన అల్లాడ సత్యవతి(45) ఆదివారం యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సత్యవతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో మనస్తాపానికి గురై యాసిడ్ తాగడంతో వెంటనే కటుంబసభ్యులు రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యవతి మృతిచెందింది. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు జడ్జి జస్టిస్ గిరిధర్ అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆలపాటి గిరిధర్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు.ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులు పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనివెట్టి మండపంలో వేదాశీర్వచనం చేయించారు. ఆలయ విశిష్టతను వివరించి అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో ప్రొటోకాల్ అధికార సిబ్బంది పాల్గొన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లీలావరప్రసాద్ మృతి టెక్కలి: ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ గుంట లీలావరప్రసాద్ (49) శనివారం రాత్రి మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. టెక్కలి మండలం శ్యామసుందరాపురం గ్రామంలో లీలావరప్రసాద్ భౌతికకాయానికి భార్య మాధవి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. ఈయన సీనియర్ జర్నలిస్టుగా, రచయితగా, విశ్లేషకునిగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సుపరిచుతులు. ఈయన రచనల్లో సిక్కోలు రాజకీయ చరిత్ర పుస్తకం ఎంతగానో ఆదరణ పొందింది. ఉత్తరాంధ్ర జర్నలిజం ఆవిర్భావం, వికాసం, పయనం, ఉత్తరాంధ్ర సాహితి శిఖరాలు, వర్క్ కండీషన్స్, జాబ్ శాట్సిఫికేషన్ అండ్ జర్నలిస్ట్, ఏ స్టడీ ఆఫ్ ప్రింట్ మీడియా ఇన్ విశాఖ, కళింగాంధ్ర కలం యోధులు, సిక్కోలు రాజకీయ చరిత్ర తదితర రచనలు చేశారు. పలు పత్రికల్లో 300కు పైగా వ్యాసాలు రాసి నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. లీలావరప్రసాద్ మృతి పట్ల టెక్కలికి చెందిన సాహిత్య సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు జి.వి.రెడ్డి మాస్టారు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి నరసన్నపేట: నడగాం –గొనబుపేట మధ్య ఆర్అండ్బీ రహదారిపై ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో పశ్చిమబెంగాల్కు చెందిన షేక్ ఇబ్రహీం(30) మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన పలువురు మండలంలో ఆర్డీఎస్ఎస్(విద్యుత్ ప్రత్యేక లైన్) పనులు చేస్తున్నారు. శనివారం పనులు ముగించిన అనంతరం రాత్రి మద్యం సేవించి ట్రాక్టర్పై వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికులు గమనించి గాయపడిన షేక్ ఇబ్రహీంను శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోదరుడు షేక్ ఇవాదుల్ ఆశిన్ ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఎస్సై–2 లక్ష్మినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జాతీయ స్థాయి కథల పోటీలకు ఆహ్వానం
శ్రీకాకుళం కల్చరల్: బండికల్లు వేంకటేశ్వరులు ఫౌండేషన్, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త నిర్వహణలో 10వ జాతీయ స్థాయి కథల పోటీలకు కథలను ఆహ్వానిస్తున్నట్లు అధ్యక్షులు బండికల్లు జమదగ్ని, కలిమిశ్రీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు కథకులు ఎక్కడ ఉన్నా పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు. కుటుంబ గౌరవం, నైతిక విలువలను తెలియజేసే కథలు, సమాజంలో తాజా మార్పులు, సమస్యలు చూపుతూ వాటికి చక్కని పరిష్కారాలను తెలిపే కథలను ‘బండికల్లు జమదగ్ని, ఫ్లాట్ నెం.402, హిమజ టవర్స్, 3/10 బ్రాడీపేట, గుంటూరు –522002’ చిరునామాకు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 98482 64742 నంబరును సంప్రదించాలని కోరారు. ఇవేం పనులు? హిరమండలం: శ్రీముఖలింగం నుంచి నవతల వరకు కోట్ల రూపాయలతో ఇటీవల రహదారి నిర్మంచారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో భగీరథిపురం, మహాలక్ష్మిపురం మధ్య పలుచోట్ల రోడ్డుపై రాళ్లు తేలిఛిద్రం అయ్యింది. నిర్మించిన రెండు నెలలకే రహదారిపై రాళ్లు తేలితే ఏళ్ల తరబడి ఎలా ఉంటుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే రహదారులు, భవనాలశాఖ అధికారులు స్పందించి లోపాలను గుర్తించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. -
యాప్సోపాలు
అన్నదాతకు..● యూరియా, డీఏపీ కొనేందుకు కష్టాలు ● ఓటీపీ వస్తేనే ఎరువుల విక్రయం ● కౌలు రైతులకు పూర్తిగా ఎరువులు లేనట్లే.. గార : కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాతలకు కష్టాలు ఒకదాని తర్వాత మరొకటి వెంటాడుతునే ఉన్నాయి. ముఖ్యంగా ఖరీఫ్లో ఎరువులు(యూరియా, డీఏపీ) అందడం పెద్ద ప్రహసనంగా తయారయ్యింది. గంటల తరబడి క్యూలైన్లో ఉండటం, బస్తా యూరియా కావాలంటే అదనంగా రూ.300 చెల్లించడం వంటివి రెండేళ్లుగా కొనసాగుతున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కలగడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్లో యూరియా, డీఏపీ అమ్మకాలను శాస్త్రవేత్తల సిఫారసుల మేరకు అందించాలని నిర్ణయించి ఏపీఏఐంఎస్ (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్) 2.ఓ అనే యాప్ తీసుకొచ్చింది. దీని ద్వారా మాత్రమే ఎరువులు అమ్మాలని నిర్దేశించింది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 30 మండలాల్లో 3,62,325 మంది రైతులుండగా, ఈ ఏడాది 5లక్షల 60 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా. కొన్ని ప్రాంతాల్లో వెబ్సైట్లో ఆధార్ ఎర్రర్, భూ విస్తీర్ణంలో తక్కువ చూపించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జాయింట్ ఎల్పీఎం రైతుల వివరాలు యాప్లో నమోదు చేయకపోవడంతో వారికి నిరీక్షణ తప్పడం లేదు. 20 సెంట్లు కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పూర్తిగా ఎరువు ఇవ్వడం లేదు. వారంతా కాంప్లెక్సు ఎరువులపైనే ఆధారపడాల్సిందే. ఓటీపీ ఇస్తేనే.. యాప్ ఆధారిత ఎరువుల పంపిణీలో రైతు భూమి వివరాలు పక్కాగా నమోదై ఉండాలి. కచ్చితంగా ఆధార్ సీడింగ్లో ఏ ఫోన్ నంబర్ ఉందో, వాటికే ఓటీపీ వస్తుంది. వాస్తవానికి సగం మంది రైతుల వద్ద ఫోన్ సౌకర్యం తక్కువే ఉంటోంది. వారి కుటుంబ సభ్యులకు నంబరుకు ఓటీపీ వెళ్లడంతో సకాలంలో చెప్పే వీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మాదిరిగా వేలిముద్రలు ద్వారా పంపిణీ చేయాలని కోరుతున్నారు. భూమి విస్తీర్ణంలో కొంతే.. రైతుల భూమి విస్తీర్ణం పూర్తిస్థాయిలో పాస్బుక్లో నమోదు కావడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా వ్యవసాయ శాఖ రైతు యాప్ డౌన్లోడ్ చేసుకొని భూమి విస్తీర్ణం నమోదు చేసుకోవచ్చని బెబుతున్నా క్షేత్రస్థాయిలో కష్టతరంగా ఉంది. దీంతో యాప్లో చూపిన భూమికి మాత్రమే ఎరువు అందిస్తారు. కౌలు రైతులకు మొండిచెయ్యి.. కొత్త విధానం ద్వారా కౌలు రైతులకు యూరియా, డీఏపీ ఎరువులు అందే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ఈ ఏడాది 90,600 మంది కౌలు రైతులు 2లక్షల 50 వేల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారని ప్రాథమిక అంచనా. వీరిలో సగం మందికి ఎరువులు అందే పరిస్ధితి లేదు. జిల్లాలో దేవదాయ శాఖ పరిధిలో 9650 ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగు చేస్తున్నారని అంచనా. వీరికీ ఎరువులు అందడం అనుమానమే. -
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
ఇచ్ఛాపురం రూరల్: ‘సొంతవాడే కదా.. మా బిడ్డను బంగారంగా చూసుకుంటాడు’ అనే ఆశతో కుమార్తెను మేనమామకు ఇచ్చి వివాహం చేసిన తల్లిదండ్రుల కలలు కల్లలయ్యాయి. ఇచ్ఛాపురం మండలం ధర్మపురం గ్రామానికి చెందిన మరడ రుక్మిణమ్మ, దేవేందర్ల కుమార్తె ధనలక్ష్మి(27)ని 2018 ఆగస్టులో ఒడిశా రాష్ట్రం రొంపా బొరడా గ్రామానికి చెందిన నందిక లోకనాథంకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఏడేళ్ల కుమారుడు రక్షిత్ ఉన్నాడు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతుండటంతో ధనలక్ష్మి కన్నవారి గ్రామం ధర్మపురంలో ఉంటోంది. పెద్దలు పలుమార్లు రాజీ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ భర్త వేధింపులు తీవ్రంగా ఉండటంతో మనస్థాపం చెందిన ధనలక్ష్మి శనివారం రాత్రి కన్నవారింట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి మృతదేహం వద్ద రక్షిత్ ‘అమ్మా.. లేవమ్మా.. నాతో మాట్లాడమ్మా..!’ అంటూ అమాయకంగా పిలుస్తూ కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. మృతురాలి తల్లి రుక్మిణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ ఆర్.జనార్దనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మహిళా రైతుది ప్రభుత్వ హత్యే
ఆమదాలవలస: సంతబొమ్మాళి మండలానికి చెందిన మహిళా రైతు కాంతమ్మ మరణం ముమ్మాటికీ చంద్రబాబు ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. ఆమదాలవలసలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల ఫలితంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలోనే ఈ ఘటన జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో యూరియా బస్తాల కోసం రైతులు రోడ్డుపై గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఓటీపీలు, యాప్లు, రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రైతులను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. రైతుల ప్రాణాలతో చెలగాటమాడడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగదన్నారు. యూరియా, విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కడం చూస్తుంటే బాధాకరంగా ఉందన్నారు. గత వైఎస్సార్సీసీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రైతు భరోసా కేంద్రాలు, ఉచిత పంట బీమా, రైతు భరోసా వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచారన్నారు. పార్టీ రాష్ట్ర పంచాయితీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి శ్రీనివాసరావు, జిల్లా ఇంటలెక్చువల్ విభాగం అధ్యక్షుడు కొప్పల ఈశ్వరరావు, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు వీరగట్టపు కృష్ణారావు, నియోజకవర్గ మున్సిపల్ విభాగం అధ్యక్షుడు పొదిలాపు తిరుపతిరావు, నాయకులు అన్నెపు కృష్ణ, పైల చిన్నారావు, అన్నెపు సంజయ్, తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయశాఖ మంత్రి ఇలాకాలో యూరియా కోసం మహిళా రైతు మరణం సిగ్గుచేటు వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ -
గాయని జానకి మృతికి సంతాపం
పాతపట్నం: ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి మృతి తెలుగు ప్రేక్షకులకు, సినీ పరిశ్రమకు తీరని లోటు అని డి.వి.సుబ్బారావు కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏ.హరిబాబు అన్నారు. పాతపట్నం ఆల్ఆంధ్ర రోడ్డు సమీపంలోని షిర్డీగిరిపై సంఘం ఆధ్వర్యంలో సంతాప సభ ఆదివారం నిర్వహించారు. జానకి చిత్రపటానికి పూలుమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ సుమారు 50 వేల పాటలు పాడిన జానకి గొప్ప గాయకురాలిగా చరిత్రలో చిరస్మరణీయురాలిగా నిలిచిపోతారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెద్దింటి మోహన్దాస్, ప్రధాన సలహాదారుడు శాసనపూరి మధుబాబు, వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్ట ఆంజనేయులు, సహాయ కార్యదర్శి బాడాన షణ్ముఖరావు, కార్యనిర్వహణ అధ్యక్షుడు కొన వెంకటరమణ, సింగర్ ఎస్పీ మిశ్రా, సంపతరావు, కృష్ణారావు, సోమేశ్వరరావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఎదురుచూపులు ఎన్నాళ్లో!
● జిల్లా కేంద్రంలో మూలుగుతున్న ‘జనగణన హౌస్మ్యాపింగ్’ నిధులు ● కేంద్రం విడుదల చేసినా పంపిణీ చేయని జిల్లా అధికారులు ● రెండు నెలలుగా ఉద్యోగుల నిరీక్షణ శ్రీకాకుళం పాతబస్టాండ్: భారత ప్రభుత్వం నిర్వహించిన జనగణనకు సంబంధించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ విధుల నిధులకు మోక్షం కలగడం లేదు. ఈ ప్రక్రియ నిర్వహించి రెండు నెలలు గడిచినా ఎన్యుమేరేటర్లు, ట్రైనర్లు, మాస్టర్ ట్రైనర్లు, ఇతర సిబ్బందికి డబ్బులు చెల్లించడం లేదు. ఈ సెన్సెస్కు సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం జిల్లాకు గత నెలలోనే విడుదల చేసింది. అయినా ఉద్యోగులకు పంపిణీ చేయడానికి మాత్రం అధికారులకు తీరికలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ పరిస్థిథి.. 2027లో జరగనున్న జనగణనకు ముందస్తుగా క్షేత్రస్థాయిలో అన్ని గృహాలను సర్వే చేయించారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, మండల స్థాయి పరిశీలకులు, తహసీల్దార్లు, గణాంక శాఖ నుంచి ఏఎస్ఓలు, వీరికి టెక్నాలజీ ఇచ్చిన శిక్షకులు, వారికి శిక్షణను ఇచ్చిన మాస్టర్ ట్రైనీలు, ఇలా పలు స్థాయిల్లో గ్రామ వార్డు సచివాలయం రెవెన్యూ గణాంక శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు అదనపు పనులుగా ఈ సర్వే పూర్తి చేశారు. ఇందుకు గాను గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. నిధులు విడుదలైనా.. ఈ హౌస్ హోల్డ్ సర్వేకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మే నెలాఖరున రూ.89,98,450 నిధులను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఎన్యూమరేటర్ నుంచి అన్ని స్థాయిల్లో సర్వేలో పనిచేసిన వారికి, నిర్వహణ ఖర్చులు స్టేషనరీ ఖర్చులు, శిక్షణ సమయంలో భోజనాలు ఇతర ఖర్చులు చేసిన వారికి చెల్లించాల్సింది. అయినప్పటికీ నిధులు విడుదల చేయకుండా అధికారులు అట్టిపెట్టుకొని ఉంచడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సెన్సెస్ సిబ్బంది వీరే.. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించారు. జిల్లాలోని 30 మండలాలకు మాస్టర్ ట్రైనీ, ట్రైనీలు కలిపి 90 మంది, మండల స్థాయిల్లో 750 మంది సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది 3600 మందిని నియమించారు. వీరితోపాటు తహసీల్దార్లు ప్రత్యేక అధికారులుగా, ఎంపీడీవోలను పర్యవేక్షణ అధికారులుగా విధుల్లో పాల్గొన్నారు. వీరందరికీ గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. సూపర్వైజర్లకు, ఎన్యుమరేటర్లకు మూడు దశల్లో శిక్షణ అందజేశారు. ఆ సమయంలో స్టేషనరీ సిబ్బందికి, భోజనాలు పెట్టిన హోటళ్ల నిర్వాహకులకు, ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఖర్చులు, టెక్నికల్ సపోర్ట్ స్టేషనరీ ప్రింటింగ్ ముద్రణ సామగ్రి, ఇతర ఖర్చులకు కలిపి సుమారు రూ.80లక్షలు పైచిలుకు చెల్లించాల్సి ఉంది. -
ప్రాచీన కట్టడాల కూల్చివేత సరికాదు
మందస: మందసలో చారిత్రక మండపం, దాని చుట్టూ ప్రత్యేక రాతితో నిర్మించిన కట్టడాన్ని ధ్వంసం చేయడం సరికాదని కళింగ సీమ సాధన కమిటీ నాయకుడు డాక్టర్ దువ్వాడ జీవితేజేశ్వరరావు అన్నారు. ఇటీవల ధ్వంసమైన ఈ ప్రదేశాన్ని ఆదివారం పరిశీలించారు. 2100 ఏళ్ల కిందట ఖారవేలుడి పాలనా కాలంలో జరిగిన ఇటువంటి ప్రాచీన నిర్మాణాలను పరిరక్షించుకోవాలని బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గోపాలసాగర్ అభివృద్ధిలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఓపెన్ జిమ్ నిర్మాణానికి కావలసిన ఖాళీ ప్రదేశం పుష్కలంగా ఉన్నప్పటికీ, ఈ చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేయడం చరిత్రహీనుల లక్షణమన్నారు. ఇక్కడి శివాలయం గోడపై ఉన్న 23వ జైన తీర్థంకరుడైన వృషభనాథుడి విగ్రహం వరకు తవ్వకాలు జరిపారంటే, ఆ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయాలన్న కుట్రకోణం అందులో దాగి ఉందనే అనుమానం వ్యక్తంచేశారు. ప్రాచీన కట్టడాల పరిరక్షణ కమిటీ కన్వీనర్ మామిడి కోదండరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ప్రాచీన కట్టడాలను కాపాడాలని, ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిన్ని తిరుపతి రెడ్డి, కంచి బెహరా, పట్నాయక్, కురేష్, నిరంజన్, సంతోష్, చిన్నరెడ్డి, మల్లారెడ్డి, హేమరాజు, గొంగా బెహరా, బాసుదేవ, హేమంత్, గంట గోపి, గణపతి బెహరా పాల్గొన్నారు -
ఏం పాపం చేశామని..
● ఎనిమిదేళ్లుగా వెంటాడుతున్న కేసులు ● నరకం చూస్తున్న వంశధార నిర్వాసితులు దారుణం.. కేసులతో ఉక్కిరిబిక్కిరి అయ్యాం. కోర్టు వాయిదాలకు తిరగలేకపోతున్నాం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు కొట్టివేస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లు దాటుతున్నా ఇంతవరకూ ఆ ఊసేలేదు. కనీసం ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకపోవడం దారుణం. – గొర్లె మోహన రావు నిర్వాసితుడు, హిరమండలం కూటమి ప్రభుత్వం డ్రామా.. నిర్వాసితులపై కేసులను ఎత్తివేసే విషయంలో కూటమి ప్రభుత్వం డ్రామాలాడుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. కానీ తర్వాత ఆ ఊసే లేదు. – రెడ్డి శాంతి, వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం హిరమండలం: వంశధార నిర్వాసిత గ్రామానికి చెందిన ఓ యువకుడు దుబాయ్లో ఓ కంపెనీలో పనికి కుదిరాడు. పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ పోలీస్ ఎంకై ్వరీలో ఆయనపై కేసులు ఉన్నాయని తేలడంతో పోలీసుల నుంచి నిరభ్యంతర పత్రం రాలేదు. వాస్తవానికి ఆ యువకుడు ఎలాంటి నిరసనల్లో పాల్గొన లేదు. కానీ అప్పట్లో కేసు నమోదైంది. వంశధార నిర్వాసిత గ్రామానికి చెందిన ఓ రైతు తనకున్న భూమిని ప్రాజెక్టు కోసం కోల్పోయాడు. కానీ అప్పట్లో గ్రా మాలను ఖాళీ చేసే సమయంలో రైతులు నిరసన తెలిపారు. దీంతో ఆయనపై కూడా కేసు నమోదైంది. ఎక్కడో ఒడిశాలో బంధువుల గ్రామంలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నాడు. కోర్టు వాయిదాలకు రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ ఇద్దరు మాత్రమే కాదు. 13 వంశధార నిర్వాసిత గ్రామాల్లో వందలాది మంది పరిస్థితి ఇలాగే ఉంది. తొమ్మిదేళ్ల కిందట అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో భూ సేకరణ, గ్రామాలను ఖాళీ చేసే సమయంలో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆ సమయంలో కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో వివాదంతో అస్సలు సంబంధం లేని వ్యక్తులు, దివ్యాంగులు, నడవలేని వారు, వృద్ధులపై సైతం కేసులు నమోదుచేశారు. అసలు ఈ గొడవలతో సంబంధం లేకపోయినా వివిధ మార్గాల్లో పేర్లు సేకరించి హిరమండలం, కొత్తూరు, ఆమదాలవలస పోలీస్స్టేషన్లలో చాలా మందిపై కేసులు నమోదు చేశారు. ఇలా దాదాపు 1500 కేసులు నమోదైనట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. కార్యరూపం దాల్చని హామీ.. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నిర్వాసితులపై కేసులు ఎత్తివేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా కేసులను మాత్రం ఎత్తివేయలేదు. ఇటీవల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సైతం నిర్వాసితులు వినతిపత్రం అందించారు. కానీ ఇంతవరకూ ఎలాంటి ఆదేశాలు రాలేదు. 2018కి ముందు నిర్వాసితులు తమ సమస్యలపై పలు రూపాల్లో పోరాటాలు, ఆందోళనలు జరిపారు. ఆ సమయంలో వందలాది కేసులు నమోదయ్యాయి. అలా బాధితులుగా మారిన వారు ఇప్పటికీ కోర్టు మెట్లు ఎక్కుతూ నే ఉన్నారు. కొన్ని కేసులను కోర్టులు కొట్టివేశాయి. ఇంకా కొనసాగుతున్నవే అధికం. ఈ కేసుల్లో చిక్కుకున్న వారిలో విద్యార్థులు, నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో ఉన్నారు. ఉద్యోగాలతో పాటు విదేశాలకు వెళ్లేందుకు వీలుగా పాస్పోర్టులు పొందలేకపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వంశధార నిర్వాసితులపై లాఠీచార్జ్ చేస్తున్న పోలీసులు (ఫైల్) -
ఎరువుల పంపిణీలో వివక్ష
జలుమూరు: అల్లాడ ప్రాథమిక సహకార సంఘం పరిధి గొటివాడలో ఆదివారం యూరియా పంపిణీ వివాదాస్పదమైంది. అల్లాడపేటకు చెందిన రైతులకు కనీసం ఒక్క బస్తా కూడా యూ రియా ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులకు నిబంధనలకు విరుద్ధంగా ఎకరాకు మూడు నుంచి నాలుగు బస్తాలు అందించారు. నిబంధనల ప్రకారం ఎకరాకు రెండు బస్తాలు యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇక్కడ అవేమీ పట్టించుకోవడం లేదని అల్లాడపేటకు చెందిన రైతులు కల్యాణం శ్రీనివాసరావు, వెలమల అప్పారావు, కల్యాణం సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువు తీసుకోవాలంటే ఉదయం నుంచి సా యంత్రం వరకు నిరీక్షించాల్సి వస్తోందని, టీడీపీ వారికి మాత్రం నిబంధనలు వర్తించడం లేదని తెలిపారు. -
కొనసాగుతున్న వైద్య సేవలు
గార: మండలంలోని శాలిహుండం కస్తూర్బా విద్యాలయంలో ప్రబలిన డయేరియా తగ్గుముఖం పట్టడం లేదు. ఆదివారం నలుగురు విద్యార్థినులు వ్యాధి లక్షణాలతో బాధపడుతుండటం, కొత్తగా ఒక విద్యార్థినికి డయేరియా రావడంతో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ కొత్త కేసులు వస్తుండడంతో ఆందోళన పెరుగుతోంది. ఆదివారం అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చా రు. చికిత్స పూర్తి చేసుకున్న విద్యార్థినులు వారి ఇళ్లకు వెళ్లిపోయారు. ‘పాతిక వేల చొప్పున ఎస్సీ ఓట్లు తొలగించే కుట్ర’ ఇచ్ఛాపురం రూరల్: ఆంధ్రప్రదేశ్లో దళితులను అణగదొక్కేందుకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం ‘ఎస్ఐఆర్’ కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గంలో పాతిక వేల ఎస్సీ ఓట్లను తొలగించే కార్యక్రమానికి పూనుకుందని మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకటరావు ఆరోపించారు. మాలల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన ‘మాలల ఐక్యతా చైతన్య యాత్ర’ ఆదివారం ఇచ్ఛాపురానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఎస్సీ మాల ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పో యిందని, ఎస్సీలమంటూ సమస్యలతో స్థానిక ఎమ్మెల్యే, పోలీస్ స్టేషన్లకు వెళ్లినా న్యాయం దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేపట్టిన ఎస్సీ వర్గీకరణతో మాలలు రిజర్వేషన్ పరంగా అన్ని అర్హతలను కోల్పోయారని, ఇటీవల డీఎస్సీలో మెరి ట్ జాబితాలో ఉన్న ఎస్సీ మాల వర్గానికి చెందిన నిరుద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యా యం జరిగిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మాల జాతి ప్రజలపై కూటమి ప్రభుత్వం క్రూరమైన వివక్షపూరిత విధానాలు అవలంబిస్తోందని, ఆగస్టు 11న ఏలూరులో 30 ఏళ్ల మాల మృతవీరుల సంస్మరణ సభను నిర్వహిస్తున్నామని అన్నారు. బ్యాడ్మింటన్ చాంపియన్గా సోమేష్ శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్థాయి సీనియర్స్ పురుషుల బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టైటిల్ను కవిటికి చెందిన జి.సోమేష్ కై వసం చేసుకున్నాడు. రన్నరప్గా ఎస్సీఐబీసీకి చెందిన ఎ.అభిరామ్ నిలిచాడు. శ్రీకాకుళం జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ నారాయణశెట్టి వెంకట శ్రీనివాసులు జ్ఞాపకార్థం నగరంలోని శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండు రోజుల జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్–2026 పోటీలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. అంతకుముందు క్వార్టర్ఫైనల్స్ నుంచి ఫైనల్స్ పోరు వరకు జరిగిన మ్యాచ్లు ఉత్కంఠగా సాగాయి. తుది పోరులో అండర్–19 బాలుర విభాగంలో సోంపేటకు చెందిన ఎం.అభి విజేతగా నిలవగా, వీబీఏకు చెందిన కె.రోణి రన్నరప్గా నిలిచాడు. చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమే విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమనే విషయాన్ని 3వ అదనపు జిల్లా జడ్జి సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్ పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. రెండు రోజుల బ్యాడ్మింటన్ టోర్నీకి చేసిన ఏర్పాట్లు, బ్యాడ్మింటన్ సంఘ ప్రగతి గురించి బ్యాడ్మింటన్ జిల్లా సీఈఓ సంపతిరావు సూరిబాబు వివరించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణశెట్టి వెంకట కిరణ్కుమార్ మాట్లాడుతూ ఇక్క డ విజేతలుగా నిలిచిన క్రీడాకారులు వివిధ జిల్లాల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్టు తెలియజేశారు. -
మమ్మల్ని బతకనివ్వండి
● కొండే మా బతుకులకు అండ ● ప్రభుత్వం తీసుకుంటే మేమెలా బతకాలి ● నడిమివలసలో తిరగబడిన ప్రజలు సెంటు భూమి కూడా వదలం మేము సెంటు భూమి కూడా ఇవ్వ దలచుకోలేదు. ఈ కొండ లేకపోతే మాగ్రామస్తులు జీవనోపాధి కోల్పో తారు. అవసరమైతే పోరాటలు చేసి మా కొండను కాపాడుకుంటాం. – బాలి రమేష్, నడిమివలస ఏ ఆధారం లేదు మాకు ఎలాంటి ఆధారం లేదు. ఈ కొండపై ఇచ్చిన పట్టాలతో జీవిస్తు న్నాం. ప్రభుత్వం ఈ కొండను తీసుకుని పెద్దలకు అప్పగించడానికి చర్యలు తీసుకున్నారు. ఇలా చేస్తే మా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తాం. – ఆబోతుల జగన్నాథం, నడిమివలస మాకు ఇదే ఆధారం నా చిన్నతనం నుంచి ఈ కొండపైనే సాగు చేసుకుంటున్నాం. మా భూములను పెద్దలకు అప్పగించడం ఎంత వరకు న్యాయం. ప్రాణాలకు తెగించైనా మా భూమిని కాపాడుకుంటాం. – బాలి అసిరినాయుడు, నడిమివలస జి.సిగడాం: ‘మేం పేదవాళ్లం.. మాకు ఉండేది ఈ కొండ మాత్రమే. మాకు భూములు లేవు. కొండ మీద చెట్లు, చిన్నపాటి వ్యవసాయ పనులు చేసుకుంటూ బతుకుతున్నాం. మాతో పాటు మా ఆవులు, మేక లు, గొర్రెలకు ఈ కొండే ఆధారం. ఆ కొండ లేకుంటే మాకు బతుకు లేదు’ అంటూ నడిమివలస వాసులు రోడ్డెక్కారు. నడిమివలస–గదబపాలెం గ్రామ సమీపంలో ఉన్న కొండలో సుమారుగా 202 ఎకరాలను ప్రభు త్వం స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఈ కొండలో ఏపీఐఐసీ పరిశ్రమ వాడగా ఏర్పా టు చేయడానికి అధికార యంత్రాంగం ముందడుగు వేసింది. సర్వే నంబర్ 36.38లో 202 ఎకరాలపై ఉన్న రైతులు ఆదివారం గ్రామంలో ఉన్న రామమందిరం వద్ద సమావేశమయ్యారు. కొండపైనే ఆధారపడి బతుకుతున్నామని, కొండను ఇవ్వబోమని అన్నారు. సచివాలయంలో ఇదివరకు నిర్వహించిన గ్రామసభలో ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. తీర్మానించాం.. మాకు తెలియకుండా వేరే తీర్మానాలు చేస్తే సహించేది లేదు. పరిశ్రమల వాడకు భూములు ఎవరూ ఇవ్వవద్దు. ఆ మేరకు మేం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. – బాలి సావిత్రమ్మ, మాజీ సర్పంచ్, నడిమివలస -
ప్రాణం తీసిన ఆమ్లెట్ గొడవ
శ్రీకాకుళం క్రైమ్ : అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాకేంద్రంలోని ఆదివారంపేటలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్మేన్గా పనిచేస్తున్న కోనాడ నాగరాజు పొందూరు మండలం బొడ్డేపల్లికి చెందిన షర్మిల(26)ను ఏడాది కిందట వివాహం చేసుకున్నాడు. నాగరాజు తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఆదివారంపేటలో ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. ఆమ్లెట్ వేయనందుకు..! నాగరాజు కాస్త అమాయకుడు కావడంతో అత్త దమయంతితో షర్మిలకు తరచూ తగాదాలొచ్చేవి. ఈ క్రమంలో ఈ నెల 8న షాపులో విధులు ముగించుకుని వచ్చిన భర్తకు భోజనంతో పాటు ఆమ్లెట్ పెట్టింది. పక్కనే తింటున్న చిన్న కుమారుడికి ఆమ్లెట్ పెట్టలేదని అత్త దమయంతి ప్లేట్ విసిరికొట్టడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో భర్త నాగరాజు స్పందించకపోవడంతో శనివారం మరోసారి గొడవపడింది. దీంతో షర్మిల మనస్థాపానికి గురై అందరూ నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య -
చరిత్ర ఘనం.. నిర్వహణ శూన్యం
కాశీకి తుల్యమైన క్షేత్రంగా ఖ్యాతి.. కృతయుగం నుంచి పూజలు అందుకుంటున్న ఆనవాళ్లు.. అనన్య సామాన్యమైన శిల్ప కళ.. శ్రీముఖలింగం సొంతం. కానీ ఇంతటి ఘన చరిత్రను కాపాడుకోలేకపోతున్నాం. ఆలయంలోని నిర్మాణాలు నానాటికీ కళావిహీనమవుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేక, నిర్వహణ లోపాలతో ఈ అరుదైన క్షేత్రం తన వాస్తవ రూపాన్ని కోల్పోతోంది. శ్రీముఖలింగ క్షేత్రంలో నిర్వహణ లోపాలు అరుదైన శిల్ప సంపదకు అపాయం దృష్టి సారించాలని భక్తుల విన్నపం జలుమూరు: ముఖలింగేశ్వరుడి క్షేత్రం సమస్యలను ఎదుర్కొంటోంది. సరైన ఆలనాపాలనా లేకపోవడంతో పురాతన విగ్రహాలు, శివలింగాలు పాడైపోతున్నాయి. చోళుల కాలం 8 వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ,విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు నిత్యం ఇక్కడకు వ స్తుంటారు. కార్తీక మాసం, శివరాత్రి ఉత్స వాలకు దేశం నలుమూలలు నుంచి సుమారు మూడు లక్షల మంది వరకూ భక్తులు స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తుంటారు. కానీ నిర్వహణ లోపంతో ఆలయ విశిష్టత దెబ్బ తింటోంది. ప్రధాన సమస్యలు వర్షాలు పడినప్పుడు గర్భగుడి లోపల కారిపోతోంది. గర్భగుడి లోపల మధుకేశ్వరుని పానపట్టం గోతులుగా మారి పూజాది ద్రవ్యాలు, పంచామృతాలు నిల్వ ఉండి పోతున్నాయి. ప్రధాన ఆలయం గర్భ గుడిలో ఫ్లోరింగ్ బీటలు వారి పూజా సామగ్రి నిల్వ వల్ల దుర్వాసన వస్తోంది. ప్రధాన ఆలయంలో నిత్యాభిషేకాలు జరిగేటప్పుడు ఆ నీరంతా బయటకు వెళ్లి వంశధారలో కలిసేలా అనుసంధానం చేశారు. కానీ నిర్వహణ లోపంతా నీరు అక్కడే ఉండిపోయి దుర్గంధం వస్తోంది. అష్ట దిక్పాలకులైన ఇంద్రేశ్వరుడు, వాయువేశ్వరుడు, అగ్నీశ్వరుడు, వరుణేశ్వరుడు, నైరుతేశ్వరుడు, యమేశ్వరుడు, కుబేరశ్వరుడు, ఈశానేశ్వరుడు వంటి శివలింగాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. కుబేరుడు మినహా అన్ని శివలింగాల పానపట్టాలు శిథిలమైపోయాయి. అభిషేక, పూజా ద్రవ్యాలు అక్కడే నిల్వ ఉండిపోతున్నాయి. ఆలయం అభివృద్ధి చేయాలి ఏటా మేం ఇక్కడకు వస్తాం. భక్తులు, యాత్రికులు ఉండేందు కు కనీస సదుపాయాలు లేవు. – వి.కిశోర్, భక్తుడు, పర్లాఖిముండీ దుర్గంధం వస్తోంది గర్భగుడిలో దుర్గంధం వస్తోంది. దేవదాయ, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అభిషేక ద్రవాలు బయటకు వెళ్లే మార్గం చూపాలి. – ఎన్.నాంచారయ్య, భక్తుడు, హైదరాబాద్ చర్యలు తీసుకుంటాం శ్రీముఖలింగంలో ప్రధాన ఆలయం, గర్భగుడిలో పలు సమస్యలు గుర్తించాం. లోపలి భా గం అంతా అస్తవ్యవస్తంగా ఉంది. ఇటీవలే కేంద్రపురావస్తు శాఖ ఇంజినీరుతో పరిశీలించి నివేదిక సిద్ధంచేశాం. – మూర్తి,కన్జర్వేటివ్ అసిస్టెంట్, కేంద్ర పురావస్తు శాఖ, విశాఖపట్నం -
● అ‘పూర్వ’ సమ్మేళనం
ఇచ్ఛాపురం పట్టణంలోని ప్రరభుత్వ పాఠశాలలో 1991–92లో చదివిన పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 35 సంవత్సరాల తర్వాత కలిసిన స్నేహితులంతా ఒకరినొకరు పలకరించుకుని ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పరపటి రాజలక్ష్మి, కేశరావు, కె.మోహన్రావు, ఢిల్లీరావు, శంకర్రావు, రాము, తాయారమ్మ, జ్ఞానేశ్వరి, ఉమామహేశ్వరి, ద్రాక్షావతి, లక్ష్మి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. – ఇచ్ఛాపురం -
ఆన్లైన్కు ఫీట్లు
ఫారాలతో పాట్లు.. ● ఆఖరి దశకు చేరుకుంటున్న ‘సర్’ ● అర్ధరాత్రిళ్లూ పనిచేయిస్తున్న వైనం ● కార్యాలయాల్లోనే ఎన్యుమరేషన్ డేటా ఎంట్రీలు సాక్షి నెట్వర్క్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అయితే ఈ దశలోనూ గందరగోళం వదలకపోవడం గమనార్హం. ముఖ్యంగా మైగ్రేషన్, డబుల్ ఎంట్రీ, చనిపోయిన ఓటర్లను గుర్తించడంలో ఇప్పటికీ అయోమయమే నెలకొంది. ప్రధానంగా ఒడిశాతో సంబంధ బాంధవ్యాలు ఉన్న గ్రామాల్లో కొత్త కోడళ్ల కుటుంబ వివరాలు తెలుసుకోవడం తలకు మించిన భారమైంది. అర్ధరాత్రి ఆపసోపాలు.. టార్గెట్ దగ్గరపడుతుండడంతో చాలా చోట్ల సిబ్బంది అర్ధరాత్రి వరకు కార్యాలయాల్లోనే ఉంటూ పనులు చేశారు. ముఖ్యంగా పోలాకి మండల కేంద్రంలో సర్ కార్యక్రమం వెనుకబడటంతో శనివా రం అర్ధరాత్రి వరకు తహసీల్దార్ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ రాజారెడ్డి స్థానిక సచివాలయంలో ఉండి సిబ్బందితో ఫారాలు అప్లోడ్ చే యించారు. మిగిలిన చోట్ల కూడా రాత్రిళ్లు పనిచేస్తూ సిబ్బంది ఒత్తిడికి గురయ్యారు. అర్ధరాత్రి వరకు కార్యాలయాల్లో ఫీట్లు.. ఫారాల పంపిణీలో ఎడతెగని పాట్లు.. ఆన్లైన్ చేసేందుకు ఆపసోపాలు.. వెరసి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ఆఖరి దశకు చేరుకుంటోంది. అందరికీ ఫారాల పంపిణీ అయిపోయిందని అధికారులు అంకెలు చూపిస్తుంటే.. అసలు తమకు ఇవ్వనే లేదని చాలా మంది రంకెలు వేస్తూనే ఉన్నారు. వందశాతం ఆన్లైన్ జరిగి తీరాల్సిందే అంటూ ఉన్నతాధికారులు సూచనలు చేస్తుంటే.. అర్ధరాత్రి ఆవులింతలు తీస్తూ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.ఆ ఓటర్ల గతేమిటో..? మరో రెండు రోజుల్లో సర్ ముగియనుంది. ఈ నేపథ్యంలో పట్టణాల్లో నివసిస్తున్న, వలస ఓటర్ల ఆచూకీ తెలియకపోవడం విస్తు గొలుపుతోంది. వారి ఓట్లు ఉంటాయో, ఊడుతాయో అన్నది ముసాయిదా జాబితా వచ్చే నాటికి తెలుస్తుంది. కొన్ని చోట్ల ఫోన్లతో మేనేజ్ చేస్తున్నారు. అయినా చాలా మంది వివరాలు తెలియరావడం లేదని సిబ్బందే చెబుతున్నారు. -
‘భూములు ఇచ్చేదే లేదు’
మందస: ఉద్దాన ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని, స్థానికులు సహకరించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. మందస మండలం బిడిమి గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులంతా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ కొబ్బరి, జీడి, పనస, అరటి, మున గ, మామిడి పంటలు అధిక సంఖ్యలో పండుతున్నాయని, అలాంటి భూములను ఎయిర్పోర్టు నిర్మాణానికి ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు బాధిత గ్రామస్తులంతా కలిసి కేంద్ర మంత్రికి వినతి పత్రం కూడా అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సీపీఐఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావును తన ఇంటి వద్దనే పోలీసులు నిర్బంధించారు. ఎయిర్పోర్టు వ్యతిరేక కమిటీ నాయకుడు బత్తిన లక్ష్మణరావును ఆదివారం ఉద యం అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. వామపక్ష పార్టీ నాయకులు వంకల మాధవరావు, తామాడ సన్యాసిరావు, చాపర వెంకటరమణ, ఎన్.గణపతి తదితరుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎయిర్పోర్టు గ్రామాలకు వెళ్లరాదని హెచ్చరించారు. -
పశువులు పట్టివేత
రణస్థలం: లావేరు మండలం రావివలస జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం శ్రీకాకుళం వైపు వెళుతున్న లగేజ్ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న ఏడు గేదెలను పోలీసులు పట్టుకున్నారు. లావేరు ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుడా సెక్రటరీ సురేష్కు బదిలీ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) సెక్రటరీ ఎల్.సురేష్ను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సరెండర్ చేశారు. ప్రస్తుతం బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఏవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఎస్జేవీ రత్నరాజుకు శ్రీకాకుళం సుడా కార్యాలయం ఏవోగా బాధ్యతలు అప్పగించినప్పటికి తిరిగి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం జీవో ఆర్టీ నెం.895ను విడుదల చేశారు. -
జిల్లా ఫుట్బాల్ జట్టు ఎంపిక
నరసన్నపేట: స్థానిక కాలేజీ గ్రౌండ్లో శనివారం జిల్లా ఫుట్బాల్ జట్టు ఎంపిక సజావుగా జరిగింది. 33 మంది ఫుట్బాల్ క్రీడాకారులు సెలెక్షన్కు హజరుకాగా వీరిలో 20 మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ముని శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఫుట్బాల్ పై క్రీడాకారులు ఆసక్తి చూపుతున్నారని మంచి క్రీడాకారులు ఉన్నారని అన్నారు. అర్హత కలిగిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశామన్నారు. ఎంపికలు జిల్లా, నరసన్నపేట ఫుట్బాల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఫుట్బాల్ అసోషియేషన్ నరసన్నపేట అధ్యక్ష, కార్యదర్శులు పి.రమేష్, బంకుపల్లి రవిబాబు విశ్రాంత పీఈటీ కుంచి గోపి, ఫుట్బాల్ కోచ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. కంచిలి: కంచిలిలో గల సోంపేట రైల్వేస్టేషన్లో ఓ నాలుగేళ్ల చిన్నారి శనివారం ఉదయం నుంచి టికెట్ కౌంటర్ వద్ద ఒంటరిగా ఉంది. ఆమె వద్ద ఎవరూ లేరు. స్థానికులు గమనించి చిన్నారిని స్టేషన్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లారు. పాపం తప్పిపోయి ఉంటుందని అంతా భావించారు. కానీ అసలు విషయం అప్పుడే బయటపడింది. 1098 చైల్డ్లైన్ వారికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి, బాలిక కుటుంబ సభ్యుల సమాచారం సేకరించారు. ఈ బాలికను పిడి మందస గ్రామానికి చెందిన తారకేశ్వరరావు కుమార్తె విసినాని విషితగా గుర్తించారు. బాలిక తండ్రితో మాట్లాడగా తనకు అనారోగ్యంగా ఉందని, బాలిక తల్లిని సంప్రదించాలని సూచించారు. కానీ బాలిక తల్లి ఎప్పుడో భర్తను విడిచిపెట్టి వెళ్లిపోయారని తెలిసింది. బాలిక ప్రస్తుతం సోంపేట మండలం కొరంజిభద్ర గ్రామంలో అమ్మమ్మ ఇంటివద్ద ఉంటోందని, బాలిక వాళ్ల అమ్మమ్మ, పెద్దనాన్న తీసు కొచ్చి సోంపేట రైల్వేస్టేషన్లో విడిచిపెట్టేశారని చైల్డ్లైన్ పలాస కార్యాలయ సూపర్వైజర్ జె.భాగ్యలక్ష్మి తెలిపారు. దీంతో బాలికను బాలల సంక్షే మ సమితి వారి మౌఖిక ఆదేశాల మేరకు శ్రీకాకుళం శిశు గృహ చిల్డ్రన్ హోమ్లో ప్రస్తుతం చేర్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. సోంపేట రైల్వేస్టేషన్లో ఉన్న చిన్నారి బాలిక -
‘అక్రమాలకు పాల్పడితే చర్యలు’
సరుబుజ్జిలి: ఎరువుల పంపిణీ సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని సహకార సంఘం ఉద్యోగులపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని చినకాగితాపల్లి గ్రామ సచివాలయం వద్ద నిర్వహిస్తున్న ఎరువుల పంపిణీ, సర్ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీ సమయంలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా రైతులను క్రమ పద్ధతిలో ఉంచాలని ఆదేశించారు. ఓటీపీ ద్వారా మాత్ర మే రైతులకు ఎరువులు పంపిణీ చేయాలన్నా రు. డీఎపీ కొరత అధికంగా ఉందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరిశీలనలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, పలువురు అఽధికారులు ఉన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ లోక్ అదాలత్లో శనివారం అధిక సంఖ్యలో కేసులు పరిష్క రించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జునైద్ అహ్మద్ మౌలానా, ఇతర న్యాయమూర్తులు జిల్లా కోర్టులో ఈ అదాలత్ను నిర్వహించారు. ఈ సారి జిల్లా వ్యాప్తంగా 13,555 కేసులు పరిష్కరించారు. వీటికి గాను రూ.8.63 కోట్లు నగదును కక్షిదారులకు చెల్లించారు. -
క్రీడలతో మెరుగైన ఆరోగ్యం
● బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ టెక్కలి: క్రీడలతో ఆరోగ్యం ముడిపడి ఉందని, ప్రతి ఒక్కరికీ క్రీడలు అలవాటుగా మారాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్, భారత మాజీ క్రికెటర్ ఎం.ఎస్.కె.ప్రసాద్ అన్నారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్లో విజేతలకు శనివారం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో క్రీడలను తప్పనిసరి చేయాలన్నారు. కాగా, క్రికెట్ పోటీల్లో ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విజయం సాధించగా, సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ జట్టు రన్నర్గా నిలిచింది. వాలీబాల్లో రఘు ఇంజినీరింగ్ కళాశాల విజేతగా నిలవగా, ఆదిత్య కళాశాల రన్నర్గా నిలిచింది. త్రోబాల్లో దువ్వాడ విజ్ఞాన్ కళాశాల విజేతగాగా, విజయనగరం ఎంవీజీఆర్ రన్నర్గా నిలిచాయి. మహిళా విభాగం చెస్లో ఆదిత్య కళాశాల విన్నర్గా నిలిచింది. పురుషుల చెస్లో విశాఖకు చెందిన సాంకేతిక విద్యా పరిషత్ విజేత కాగా, శ్రీకాకుళం ఎర్రన్నాయుడు అగ్రి కల్చరల్ కళాశాల రన్నర్గా నిలిచాయి. అధ్యాపకుల క్రికెట్ పోటీల్లో పర్లాఖిమిడి సెంచూరియన్ యూనివర్శిటీ విజేత కాగా, జీఎంఆర్ఐటీ కళాశాల రన్నర్గా నిలిచాయి. వాలీబాల్, త్రోబాల్లో జీఎంఆర్ఐటీ కళాశాల విన్నర్ కాగా, ఆదిత్య కళాశాల రన్నర్గా నిలిచాయి. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, డైరెక్టర్ వి.వి.నాగేశ్వర్రావు, కె.మధుకుమార్, టి.నాగశేషు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, డీన్ డి.శ్రీరాములు, ఎం.సంతోష్కుమార్, ఎస్టేట్ మేనేజర్, పి.రమేష్, పీడీలు ఎస్.లక్ష్మణమూర్తి, మురళీమోహన్, తేజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
కేఆర్ స్టేడియం పనులకు రూ.5 కోట్ల బకాయిలు చెల్లింపు
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం పనులకు సంబంధించిన రూ.5 కోట్ల పెండింగ్ బకాయిలు ఇటీవల చెల్లించామని.. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఇండోర్ స్టేడియం పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని మరో మూడు నెలల్లో పూర్తిచేస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా షటిల్ బాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారాయణశెట్టి వెంకట శ్రీనివాసులు జ్ఞాపకార్ధం శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండు రోజుల జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్–2026 పోటీలను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ జిల్లా సీఈఓ సంపతిరావు సూరిబాబు, చైర్మన్ ఆర్.రాజేంద్రన్, అధ్యక్షుడు కె.సాగర్, కార్యదర్శి ఎం.అశోక్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.వి.కిరణ్కుమార్, ఉపాధ్యక్షులు బి.దామోదరరావు, కేఎస్ మదీనా శైలానీ, ఎం.రత్నాజీ, కోశాధికారి జి.అనిల్కుమార్, జి.ప్రసాద్, జి.అనిల్కుమార్, ఎం.శాంతికుమార్, సబ్ రిజిస్ట్రార్ డాక్టర్ గురుగుబెల్లి రాజు, ఐ.ఆశాలత, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం, మ్యాచ్ పాయింట్ ఛైర్మన్ హైదారాబాద్ ముప్పాల వేణు, రవి, మాధురి, సంఘ ప్రతినిధులు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉత్సాహంగా సాగుతున్న పోటీలు.. జిల్లాస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో అండర్–11, 13, 15, 17, 19, సీనియర్స్(మెన్,ఉమెన్) విభాగాల్లో పోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రంతో పోటీలు ముగియనున్నాయని మీట్ స్పాన్షర్, జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి నారాయణశెట్టి వెంకట కిరణ్కుమార్ తెలిపారు. ఈ టోర్నీకి చీఫ్ రిఫరీగా ఎస్.సూరిబాబు వ్యహరిస్తున్నారు. -
అదుపులోకి రాని డయేరియా
● మరో పది మంది విద్యార్థినులకు డయేరియా లక్షణాలు ● కేజీబీవీలోనే నేలపై వైద్యం అందిస్తున్న వైనం గార: శాలిహుండం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో డయేరియా అదుపులోకి రావడం లేదు. శనివారం మరో పది మందికి విరేచనాలు కావడంతో వారందరికీ చికిత్స అందిస్తున్నారు. పాఠశాలను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించి పలు చర్యలు చేపడుతున్నా ఇంకా డయేరియా లక్షణాలతో విద్యార్థినులు ఇబ్బందు లు పడుతుండటం, కొత్త కేసులు నమోదవుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోనే గార మండలం ఉన్నా మెరుగైన వైద్య చికిత్స ఎందుకు అందించడం లేదో సమగ్ర శిక్ష అధికారులే చెప్పాలి. ఆదివారం మధ్యాహ్నం పెట్టిన చికెన్ను పూర్తి స్థాయిలో అందించకుండా కొంత ఉంచేసి మళ్లీ రాత్రి కూడా విద్యార్థినులకు వడ్డించడంతో మొదలైన సమస్య, సోమ, మంగళ, బుధవారాల్లో పప్పు పూర్తిస్థాయిలో ఉడకకపోవడం, నాణ్యత లేని వంటలతో ఇబ్బందిని ఫుడ్ రికార్డులో కొందరు విద్యార్థినులతో పాటు సిబ్బంది నమోదు చేశారు. రాగి అంబలిలో పురుగులు కనిపించడంతో సమస్యను వెంటనే విద్యార్థినులు చెప్పడంతో వాటిని పారబోశామని విద్యార్థులే అధికారులకు చెప్పారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడం, డయేరియా ప్రబలిన తర్వా త ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా, తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆమెతో పాటు అకౌంటెంట్, కుక్, ఏఎన్ఎంలను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. డీఈఓ రవిబాబు, సమగ్ర శిక్ష ఏపీసీ, సీఎంఓ, జీసీడీఓ, వైద్య శాఖ ప్రోగ్రాం అధికారులు కేజీబీవీని సందర్శించి, పలు సూచనలు చేసినా డయేరియా అదుపులోకి రాలేదు. గార కేజీబీవీలో ఏపీసీ సుదీర్ఘ విచారణ శ్రీకాకుళం: శ్రీకాకుళం సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాలరావు గార కేజీబీవీలో సుదీర్ఘ విచారణ చేపట్టారు. మధ్యాహ్నం రెండు గంటలకు కేజీబీవీ చేరుకున్న ఆయన రాత్రి 7.30 గంటల తర్వాత కూడా అక్కడే ఉండి విద్యార్థులను సిబ్బందిని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏఎన్ఎంను సస్పెండ్ చేసిన దృష్ట్యా వీలైన పక్షంలో రోజుకొకరు చొప్పున కేజీబీవీలో ఏఎన్ఎంలకు డ్యూటీ వేయాలని త్వరలోనే తాము వేరొకరిని నియమిస్తామని ఆయన చెప్పా రు. ఎస్ఓను సస్పెండ్ చేయడంతో ఆ బాధ్యతలను ఓసీఆర్టీకి అప్పగించారు. హెడ్ కుక్ను సస్పెండ్ చేయడంతో అటు తర్వాత ఉన్న కుక్ను బాధ్యతలు జాగ్రత్తగా చూడాలని వేరొక సహాయకురాలను తాత్కాలికంగా సమకూర్చుకోవాలని సూచించారు. ఏపీసీ చేపట్టిన విచారణలో అక్కడ సిబ్బంది ముఖ్యంగా ప్రిన్సిపాల్ వ్యవహరించిన నిర్లక్ష్య ధోరణి ఆయన దృష్టి వచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలించి ఆ వివరాలను కూడా సేకరించినట్లు తెలియ వచ్చింది. వీటన్నింటి ఆధారంగా ఒకటి రెండు రోజుల్లో నివేదికని సిద్ధం చేసి జిల్లా ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులకు నివేదించనున్నారు. అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒకరిద్దరిపై విధుల నుంచి తొలగించే వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. జీసీడీఓ మాధవి శనివారం ఉదయమే గార కేజీబీవీకి చేరుకొని మ ధ్యాహ్నం ఒంటిగంట వరకు పర్యవేక్షణ జరిపారు. కేజీబీవీలో డయేరియా లక్షణాలతో ఇప్పటివరకు 45 మంది వరకు వచ్చారు. పాఠశాలలో ఉన్న 270 మంది విద్యార్థినులకు, బాధిత విద్యార్థినులకు కామన్ మరుగుదొడ్లే వాడటం ఇబ్బందిగా మారింది. మరుగుదొడ్ల పరిశుభ్ర త విషయంలో ఇంకా గట్టి చర్యలు తీసుకోవ డం లేదని సమాచారం. డయేరియా బయటపడిన తర్వాత మరుగుదొడ్లలో వాడాల్సిన కెమికల్స్ను తెప్పించారని, అప్పటివర కు కొద్ది రోజులుగా బాత్రూమ్ క్లీనింగ్ మెటీరియల్ లేదని తెలుస్తోంది. ఇక స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం మధ్యాహ్నం పాఠశాలకు వచ్చిన సమయంలో నేలపైనే చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. -
సర్
శ్రీకాకుళంఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026అంతా అయోమయమే సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)తప్పుల తడకలా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ఓటర్లు తమకు ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదు మొర్రో అంటుంటే జిల్లాలోని ఓటర్లందరికీ ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్టు కలెక్టర్ చెబుతున్నారు. వంద శాతం పంపిణీ జరిగిపోయినట్టు అధికారులు తేల్చేశారు. ఇప్పుడంతా డిజిటలైజేషన్ చేసే పనిలో ఉన్నామని, అది కూడా 90.39శాతం జరిగినట్టు చెబుతున్నారు. ఈ లెక్కలు చూస్తుంటే ఓట్లు గోల్మాల్ అయ్యే పరిస్థితి కనబడుతోంది. మరో రెండు రోజుల్లో సర్ ప్రక్రియ ముగియనుంది. తర్వాత ఎవరి ఓట్లు ఉంటాయో, ఎవరి గల్లంతవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే, జిల్లాలో ఓటర్లందరికీ 100 శాతం ఎన్యుమరేష న్ ఫారాలు పంపిణీ చేసినట్టు చూపిస్తున్నారు. ఈ లెక్కన ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదని గగ్గోలు పెడుతున్న వారి ఓట్లు ఏమవుతాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తేడాలుంటే ఫారం 6 ద్వారా కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చి వదిలేస్తున్నారు. మొత్తంగా సర్ కార్యక్రమం గందరగోళంగా ఉందని చెప్పాలి. జిల్లాలో 18,97,405 ఓటర్లు ఉండగా వారందరికీ 100శాతం ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకు 16లక్షల 97వేల 988(89.49శాతం)మంది నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించినట్టు చూపిస్తున్నారు. వీటిలో 90.30శాతం ఓట్లు డిజిటలైజేషన్ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, హౌస్ టూ హౌస్ సర్వేలో షిఫ్టింగ్, ఆబ్సెంట్, మరణాలు, డూప్లికేటు ఆల్రెడీ ఎన్రోల్ మెంట్ (ఎఎస్డీడీ ఓటర్లు) కింద 74,438 ఓట్లు ఉన్నాయని గుర్తించినట్టు నివేదికలో పొందుపరిచారు. అదే విధంగా సర్ ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చాక ఏఎస్డీడీ(ఆబ్సెంట్, షిప్టింగ్, డెత్, డూప్లికేట్) ఓటర్లుగా మరో 81,073మంది ఉండటంతో ఆ ఫారాలు తిరిగి రాలే దని లెక్కల్లో చూపిస్తున్నారు. ఈ లెక్కలన్నీ అంతు చిక్కడం లేదు. ఒకవైపు క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వలేదని ఓటర్లు చెబుతుంటే, మరోవైపు 100 శాతం పూర్తయినట్టు అఽధికారులు చెప్ప డం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదంతా చూస్తుంటే చివరిలో నాట్ ట్రేస్డ్ కాలమ్గా పెట్టి లక్షలాది ఓట్లు చూపించే అవకాశం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న ఓటర్లు : 18,97,405 డిజిటలైజేషన్ చేసిన ఫారాలు : 90.30 శాతం జిల్లాలో పోలింగ్ బూత్లు : 2358 పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలు :100 శాతం వెనక్కి వచ్చిన ఫారాలు : 89.49 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు రాని ఏఎస్డీడీ ఓటర్లు : 81,073 హౌస్ టూ హౌస్ సర్వేలో గుర్తించిన ఏఎస్డీడీ ఓటర్లు : 74,438 ఇచ్ఛాపురం రూరల్: ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ లొద్దపుట్టిలో 56,57,58,59 పోలింగ్ కేంద్రాల్లో ‘సర్’ పురోగతి మందగించిందని, వెంటనే 90 శాతం లక్ష్యాన్ని తప్పని సరిగా పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ డిజిటలైజేషన్ నత్తనడకనే సాగుతోంది. ముఖ్యంగా ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న ద్వంద్వ ఓటర్లును తొలగించాలని సూచించడంతో ఆ పనిలో బీఎల్వోలు పడ్డారు. -
ముమ్మరంగా ‘సర్’
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అత్యంత వేగంగా, పారదర్శకంగా సాగుతోందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియాలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 90.39 శాతం ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని, రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా ఐదో స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. ప్రజలు సందేహాల నివృత్తికి ‘బుక్ ఏ కాల్ విత్ బి ఎల్ ఓ‘ ఆప్షన్ వాడుకోవచ్చన్నారు. జిల్లా స్థాయి సహాయం కోసం 9491 222 122 నంబర్ను, కామన్ హెల్ప్ లైన్ 1950ను సంప్రదించవచ్చని వివరించారు. 14,269 మెట్రిక్ టన్నుల యూరియా సిద్దం జిల్లాలో యూరియా కొరత ఏ మాత్రం లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం 14,269 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆధార్–మొబైల్ లింక్ లేని వారు ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. 50 సెంట్ల కంటే తక్కువ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఇద్దరు ముగ్గురు కలిసి గ్రూప్గా ఏర్పడి బస్తా యూరియా తీసుకో వచ్చని తెలిపారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు స్వయంగా రానవసరం లేదని, కొరియర్ లేదా అథరైజేషన్ ఆప్షన్ ద్వారా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఓటీపీ చెబితే వారి తరఫున యూరియా అందజేస్తామన్నారు. -
దవాఖానా.. నిర్వహణ ఇలాగేనా..?
● అధ్వానంగా పోస్టుమార్టం గది ● పట్టించుకోని అధికారులు నరసన్నపేట: పందులు.. పంది కొక్కులు.. చెత్తాచెదారం..మురుగునీరు.. ఇదంతా చూసి ఇదేదో డంపింగ్ యార్డు అనుకునేరు. ఇది అచ్చంగా నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలోని ఓ గది వద్ద పరిస్థితి. ఆస్పత్రిలోని పోస్టుమార్టం గది అత్యంత అధ్వాన స్థితిలో ఉంది. గదిలో మృత దేహాలు ఉంచేందుకు ఎలాంటి సదుపాయాలు లేవు. దీనికి తోడు గది శ్లాబ్ పెచ్చులూడుతోంది. పిచ్చి మొక్కలు, మురుగు నీరు గది చుట్టూ ఉండటంతో దుర్వాసన వస్తోంది. పోస్టుమార్టం చేసేందుకు వస్తున్న వైద్యులు, సిబ్బంది నరకం చూస్తున్నారు. ప్రక్రియ అయ్యాక చేతులు కడుగుదామంటే నీరు కూడా ఉండని దుస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. నిరుపయోగంగా ఫ్రీజర్.. ఆస్పత్రికి వచ్చే మృతదేహాలు భద్రపరిచేందుకు ఇటీవల ప్రభుత్వం ఫ్రీజర్ మంజూరు చేసింది. రెండు మృత దేహాలు ఇందులో ఉంచుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పీఎం షెడ్ దాన్ని పెట్టేందుకు అనువుగా లేకపోవడంతో ఆక్సిజన్ ప్లాంట్ గదిలో పెట్టారు. దీంతో ఫ్రీజర్లు నిరుపయోగమయ్యాయి. నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి వెళ్తే సిగ్గేస్తోంది. కనీస సదుపాయాల్లేవు. చుట్టూ మురుగు నీరు ఉంది. పందులు, పందికొక్కులు తిరుగుతున్నాయి. పోస్టుమార్టం షెడ్ ఇలానే ఉంటుందా. అధికారులు చర్యలు తీసుకోవాలి. – వై.చలపతిరావు, సీఐటీయూ నాయకుడు -
‘ఉపా’ కేసును ఉపసంహరించుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ‘ఉపా’ చట్టం కింద నమోదు చేసిన కేసును తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ, విద్యార్థి, దళిత, ఆదివాసీ, ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలో ఇలిసిపురం అంబేడ్కర్ విజ్ఞాన మందిర్లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ, పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ పేడాడ కృష్ణారావు మాట్లాడుతూ ఉపా చట్టం పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసే ఒక నల్ల చట్టమని, దీన్ని ప్రజాస్వామ్యంలో ఎవరిపైనా ప్రయోగించడం సరైంది కాదన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాధరావు మాట్లాడుతూ నేరం చేయని వారిపై కూడా ఈ దారుణమైన చట్టాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టంలోని లొసుగుల వల్ల చేయని నేరానికి ఏళ్ల తరబడి జైల్లో మగ్గాల్సి వస్తోందని చెప్పారు. ప్రశ్న రావణ్పై పెట్టిన కేసు భవిష్యత్తులో ప్రశ్నించే గొంతులను భయపెట్టడానికి, సామాజిక మాధ్యమాలను అదుపు చేయడానికి ప్రభుత్వం వేసిన కుట్రగా ఆయన అభివర్ణించారు. సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పత్రి దానేష్, జిల్లా దళిత జేఏసీ కన్వీనర్ డి.గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్క కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు బెలమర ప్రభాకర్, పీడీఎం రాష్ట్ర అధ్యక్షుడు జె.వెంకటరావు, డి.టి.ఎఫ్. పూర్వ జిల్లా అధ్యక్షుడు కోత ధర్మారావు, ఆదివాసీ సంక్షేమ సంఘం ప్రతినిధి శాంతారావు, బీటీఏ నాయకుడు శ్రీనివాసరావు, జె.వి.వి. చిన్నారావు, రెల్లి సంక్షేమ సంఘం నేత అర్జి కోటి, రైతు కూలీ సంఘం నాయకుడు బి.కూర్మారావు, బుడుమూరు వెంకటరమణ, అంబేడ్కర్ చైర్ సాధన సమితి జిల్లా కన్వీనర్ టి.రమణ, పైడి కుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు నిమ్మల అనంతరావు, రాకోటి చిన్నికృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
టెక్కలి సీఐపై తప్పుడు వీడియో పోస్టింగులు
● పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న తరుణ్కుమార్పై రౌడీషీట్ టెక్కలి: పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న టెక్కలి కోదండ రామవీధికి చెందిన కొమ్ము తరుణ్కుమార్ ఇటీవల సోషల్ మీడియాలో టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియో పోస్టింగులు పెట్టాడని టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు శనివారం టెక్కలి పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. తరుణ్కుమార్ గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉండటమే కాకుండా రిమాండ్కు కూడా వెళ్లాడని చెప్పారు. ప్రస్తుతం బెయిల్పై ఉంటూ వ్యసనాలకు బానిసగా మారి పలు మోసాలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. మోసాలు బట్టబయలు కావడంతో తదుపరి నేరాలు చేసే అవకాశం ఉండదని భావిస్తూ సీఐ విజయ్కుమార్పై సోషల్ మీడియాలో తప్పుడు వీడియో పోస్టింగ్లు చేశాడని పేర్కొన్నారు. చట్ట విరుద్దమైన నేరాలు, చట్ట వ్యతిరేక పనులు చేస్తుండటంపై టెక్కలి పోలీస్ స్టేషన్లో తరుణ్కుమార్పై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ విజయ్కుమార్ ఉన్నారు. ముగ్గురికీ ఒకేచోట అంత్యక్రియలు జలుమూరు: మర్రివలస గ్రామంలో ముద్ద దాలప్పమ్మ, కుమార్తెలు దాలమ్మ, సరస్వతిలు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం శ్రీకాకుళం రిమ్స్లో పోస్టుమార్టం, పంచనామా అనంతరం కొందరు బంధువులు, మరో కుమార్తె లక్ష్మీతో కలిసి గ్రామస్తులు ముగ్గురి మృతదేహాలను గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామ యువత, మరికొందరు కలిసి కొంత నగదు సేకరించి మూడు మృతదేహాలను ఒకే చోట అంత్యక్రియలు పూర్తి చేశారు. -
రావిచెట్టు పడి మూడు ఇళ్లు ధ్వంసం
● నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో నిలిచిన విద్యుత్ సరఫరా నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేట పరిధిలోని ఆదివరపుపేటలో శనివారం రావిచెట్టు కూలిపోయింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లపై పడటంతో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. బోయిన జనార్దనరావు, తంగుడు ఆంజనేయులు, తంగుడు కృష్ణ, సుబుద్ధిల ఇళ్లపై చెట్టుకొమ్మలు పడటంతో గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. పంచాయతీ, విద్యుత్ సిబ్బంది స్పందించి చెట్లు కొమ్మలను తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. ఐటీఐ కౌన్సెలింగ్ ప్రారంభం ఎచ్చెర్ల : ఐటీఐలలో ప్రవేశాలకు సంబంధించి ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో శనివారం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. మొదటి రోజు 584 మందిని పిలవగా 255 మంది హాజరయ్యారు. వీరిలో 141 మందికి సీట్లు కేటాయించారు. ఆదివారం కూడా కౌన్సెలింగ్ కొనసాగించనున్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఐటీఐ ప్రిన్సిపాల్ ఎల్.సుధాకర్, చిట్టి నాగభూషణరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
పెండింగ్ పరిహారం ఇప్పించండి
సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోయినప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని..వెంటనే పెండింగ్ పరిహారం ఇప్పించాలని బాధిత రైతు జీరు ధర్మారావు దంపతులు కోరారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ తనకున్న ఎకరా 73 సెంట్ల భూమిని పోర్టు నిర్మాణానికి ఇవ్వగా అందులో 80 సెంట్లకు మాత్రమే రూ.21 లక్షల 50 వేలు పరిహారం ఇచ్చారని తెలిపారు. మిగిలిన పరిహారం ఇవ్వకుండా ఏళ్లు తరబడి తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా న్యాయం జరగడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోర్టు నిర్మాణానికి తనతో పాటు మరో 31 మంది రైతులు భూములు ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టుకు భూములు ఇచ్చామని తెలిపారు. దీంతో ఎకరాకి అదనంగా ఇచ్చిన రూ.12 లక్షల 50 వేలు కూడా తమకు ఇవ్వలేదని చెప్పారు. కొబ్బరి, జీడి చెట్లు పరిహారం కూడా ఇవ్వలేదని, ఇదేంటని ప్రశ్నిస్తే పోలీస్ కేసులంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. మరోవైపు, కె.లింగూడు గ్రామంలో సర్వే నంబర్ 164/12,139/6లో మూడు ఎకరాల 51 సెంట్లకు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
సేద్యంలో శాసీ్త్రయ పద్ధతులు అవలంబించాలి
రణస్థలం: వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభా వం వల్ల ఏర్పడే ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రైతులు ముందస్తు ప్రణాళిక తో పాటు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఏరువాక కేంద్రం, విజయనగరం శాస్త్రవేత్త డాక్టర్ ఎం.ఎం.వి.శ్రీనివాసరావు అన్నారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పైడిభీమవరంలో నిర్వహించిన రైతు మిత్రల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, పంటల నిర్వహణలో శాసీ్త్ర య సూచనలను పాటించడం చేయాలన్నారు. నేల ను పంట వ్యర్థాలతో కప్పడం, దేశవాళీ విత్తనాలు వాడటం, జీవ ఉత్పేరకాలు వినియోగించడం, మిశ్రమ పంటలు వేయడం ద్వారా రైతులు పంట నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్ తేజేశ్వరరావు, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ డిప్యూటీ మేనేజర్ ఆర్.హరిబాబు, ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ కంబపు కృష్ణ, ఏరి యా మేనేజర్ తవిటినాయుడు, దేవుడుబాబు, రంభ, లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఉసురు తీసిన నిర్లక్ష్యం
అతడు వృద్ధుడు.. వయసు 62 ఏళ్లు.. అయినా గ్రానైట్ క్వారీలో ఒళ్లు హూనం చేసుకుని బతకడం అలవాటైన మనిషి. యజమానుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం అతడి ప్రాణాలు తీశాయి. కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు సమీపంలో గల అరసవల్లి గ్రానైట్ క్వారీలో రేగులపాడు గ్రామానికి చెందిన పల్లి ఎర్రయ్య (62) బండరాయి కింద పడి నలిగిపోయాడు. ఒంటి మీద ఎలాంటి రక్షణ కవచం లేకుండా పనిచేస్తున్న ఎర్రయ్యపై అమాంతం దూసుకువచ్చిన బండరాయి ప్రాణాల్ని నలిపేసింది. గ్రానైట్ రాయికి రంధ్రాలు చేస్తున్న సమయంలో రాయి దొర్లుకుంటూ వచ్చి అతడిపై పడింది. ఎర్రయ్యకు భార్య పార్వతి, వివాహితులైన కుమార్తెలు కింజరాపు ఉమా, దేశల్ల హేమలత ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కు అయిన వ్యక్తిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదంలో మరికొంత మంది కార్మికులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. – టెక్కలి రూరల్ -
కాంట్రాక్ట్ అధ్యాపక పోస్టుల భర్తీకి వాక్ఇన్ ఇంటర్వ్యూలు
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో సబ్జెక్టు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు అధ్యాపక పోస్టుల భర్తీ కోసం ఈ నెల 16 న వాక్ ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య తెలిపారు. వర్సిటీలోని ఐటీఈపీ విభాగంలో ఫిజిక్స్ కోర్ సబ్జెక్ట్లో ఒకటి, పొలిటికల్ సైన్స్లో ఒకటి, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో ఒక సబ్జెక్ట్, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పోస్టు భర్తీ చేస్తామన్నారు. వీటితో పాటుగా మెయిన్ లైబ్రరీలో అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) భర్తీ చేస్తామని ఆయన అన్నారు. పీహెచ్డీ పూర్తి చేసి నెట్, సెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి అధ్యాపక పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఎంఎల్ఐసీ చేసిన వారు అదే కోర్సులో పీహెచ్డీ పూర్తిచేసిన వారికి అసిస్టెంట్ లైబ్రేరియన్ (కాంట్రాక్ట్) పోస్ట్ భర్తీలో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు విశ్వవిద్యాలయం వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని సంబంధిత సర్టిఫికెట్లు జత చేసి జూలై 16 ఉదయం 10 గంటలకు వర్సిటీ పరిపాలన భవనంలో జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆయన కోరారు. పూర్తి వివరాలు వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందాలన్నారు. -
అసమానతలు లేని సమాజమే లక్ష్యం
పలాస: అసమానతలు లేని సమాజం కోసం విద్యార్థులు పాటుపడాలని, అందుకు శాసీ్త్రయ విజ్ఞానం చాలా అవసరమని ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సూరప్పడు అన్నారు. కాశీబుగ్గలోని టి.కె.ఆర్. కల్యాణ మండపంలో పి.డి.ఎస్.యు. రాష్ట్ర విద్యావైజ్ఞానిక శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా పి.డి.ఎస్.యు. పతాకాన్ని సంఘం అధ్యక్షుడు కె.భాస్కర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో సూరప్పడు మాట్లాడుతూ శ్రీకాకుళం ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని, దోపిడీ పీడన లేని సమాజం కోసం ఈ జిల్లాలో గొప్ప ఉద్యమం జరిగిందని, అందులో ఎంతో మంది విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. ఇక్కడ ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం శుభపరిణామమని చెప్పారు. పి.డి.ఎస్.యు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్, ఎం.వినోద్ మాట్లా డుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి వాటిని అమలు చేయ డం లేదని దుయ్యబట్టారు. ఉన్నత విద్యా ఉపాధి సవాళ్లు అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్పట్నాయక్, సామాజిక మార్పు విద్యార్థుల పాత్ర అంశంపై ఎ.పి.టి.ఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సన్నశెట్టి రాజశేఖర్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పి.డి.ఎస్. యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్.రాజశేఖర్, ఎం.సునీ ల్, అంకన్న, సహాయ కార్యదర్శి రాజేష్, నాని, వీరుంద్ర, ప్రసాద్, లోకేష్, కోశాధికారి మహేంద్ర, సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సొర్ర రామారావు, ఎస్.సోమేశ్వరరావు, కృష్ణవేణి, పి.వో.డబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.ఈశ్వరమ్మ, పి.కుసుమ, ఇఫ్టూ నాయకులు జుత్తు వీరాస్వామి, గొరకల బాలకృష్ణ పాల్గొన్నారు. -
కూటమి పాలనలో..
వైఎస్సార్సీపీ హయాంలో..నాడునేడుఈ రెండు ఫొటోలు రెండు వేర్వేరు ప్రభుత్వాల హయాంలోనివి. మొదటి ఫొటోలో రైతు హాయిగా ఎరువు తీసుకుంటున్న చిత్రం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలోనిది. జి.సిగడాం మండలం ముషిణివలసలో తీసిని చిత్రమిది. అప్పట్లో ఎలాంటి క్యూలు అవసరం లేకుండా ఎరువులు ఇచ్చే వారు. ఇక రెండో ఫొటో శుక్రవారం నాటిది. బూర్జ మండలంలోని అల్లెన గ్రామంలో గల సచివాలయంలో శుక్రవారం ఉదయం నుండే రైతన్నలు ఎరువుల కోసం బారులు తీరారు. ఓటీపీ రావడం లేదని గంటల కొద్దీ రైతులను ఎండలోనే నిలుచోబెట్టారు. – బూర్జ, జి.సిగడాం -
● ఒకే రోజు మూడు దుర్ఘటనలు
రాలిపోయిన పండుటాకులు ● ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి సాక్ష్యాలువృద్ధాప్యంలో ఎటువంటి వారికై నా ఆదరించే ఒక తోడు అవసరం. అటువంటి ఆదరువు లేనివారిని ప్రభుత్వం అక్కున చేర్చుకోవాలి. కానీ ప్రభుత్వం నుంచి అదే కరువవడంతో కుటుంబ రథాన్ని నడిచే ప్రయత్నంలో పండుటాకులు రాలిపోయినట్లు ఆ వృద్ధుల జీవితాలు అర్థంతరంగా ముగిసిపోయాయి. ఎలాగైనా యూరియా సంపాదించాలన్న తపన కాంతమ్మ అనే వృద్ధురాలిని కాటేస్తే.. కూలి చేస్తే తప్ప కూడు దొరకని స్థితిలో ముదిమి వయసులోనూ క్వారీలో చెమటోడుస్తున్న ఎర్రయ్యను అదే క్వారీ బండ నుజ్జునుజ్జు చేసేసింది. ఇక మగదిక్కు లేని ఇల్లు.. పైగా ఇద్దరు ఆడబిడ్డల భారం.. ఆ వృద్ధ మాతను ఎంత కష్టపెట్టిందో లేక ఇంకేదైనా చెప్పుకోలేని సమస్య వచ్చిందో తెలియదు గానీ దాలప్పమ్మ తన ఇద్దరు కూతుళ్లతో సహా బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలో ఒకేరోజు జరిగిన ఈ విషాద ఘటనలు.. ఒక విధంగా ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి, మన చట్టాలు, సంక్షేమ ప్రణాళికల వైఫల్యానికి సాక్ష్యాలు. -
14న కలెక్టరెట్ ఎదుట ఫ్యాప్టో నిరసన
శ్రీకాకుళం: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఈ నెల 14న కలెక్టరెట్ ఎదుట భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఫ్యాప్టో చైర్మన్ బమ్మిడి శ్రీరామమూర్తి, జనరల్ సెక్రటరీ పడాల ప్రతాప్కుమార్ తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని ఫ్యాప్టో కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల నేతలతో కలిసి పోస్టర్ ఆవిష్కంచారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమ లు చేయాలని, 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేసి పాత విధానం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 5 డీఏలను వెంటనే విడుదల చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ నాయకులు పప్పల తిరుమలరావు, జి.శ్రీనివాసరావు, పి.హరిప్రసన్న, బి.నవీన్కుమా ర్, వై.ఉమాశంకర్, ఎస్.రమేష్బాబు, రవికుమార్, శ్యాంకుమార్, బి.రమేష్ పాల్గొన్నారు. -
కొత్తవి వచ్చేదెప్పుడట?
పాతవి పనికిరావట.. ● మీ–సేవా కేంద్రాలు, సచివాలయాల్లో నిలిచిన సర్టిఫికెట్ల జారీ ● సచివాలయాల పేరిట ఉన్న పత్రాలు ముద్రణకు వాడొద్దని ప్రభుత్వం ఆదేశం ● ఇంకా జిల్లాకు చేరని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు పత్రాలు ● ప్రింటింగ్ చేసేందుకు పత్రాలు లేక నిర్వాహకుల పాట్లు ● ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టినా పంపించడం లేదని ఆవేదన శ్రీకాకుళం పాతబస్టాండ్ : ప్రభుత్వం నిర్వాకం కారణంగా విద్యార్థులు, వివిధ వర్గాల వారు కుల, ఆదాయ, నివాస తదితర సర్టిఫికెట్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీ–సేవ కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో ‘సచివాలయాలు’ పేరిట ఉన్న పత్రాలు పనికిరావని, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు పేరిట ఉన్న పత్రాలపైనే సర్టిఫికెట్లు ప్రింటింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ధ్రువపత్రాల జారీ ప్రక్రియ 15 రోజులుగా నిలిచిపోయింది. కొత్త పత్రాల కోసం ఇండెంట్ పెట్టినా ఇంతవరకు రాకపోవడంతో మీ– సేవ కేంద్రాల నిర్వాహకులు, సచివాలయ సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. మీ సేవ కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో వివిధ రకాల ధ్రువపత్రాలను ముద్రించే పత్రాలు కరువయ్యాయి. కొన్నిచోట్ల 20 రోజులుగా ఈ ప్రక్రి య నిలిచిపోయింది. ఈ పత్రాలు కోసం మీ–సేవ కేంద్రాల ఆపరేటర్లు పది రోజుల క్రితమే విజయవాడలో సంబంధిత ఏజెన్సీకార్యాలయానికి నగదుని ఆన్లైన్లో చెల్లించి ఇండెంట్లు పెట్టారు. ప్రతి 1000 పత్రాలకు రూ.3400 చొప్పున చెల్లించారు. ఇప్పటికి 15 రోజులు గడుస్తున్నా పత్రాలు రాలేదు. జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాలు 460 వరకు ఉన్నాయి. మీసేవ కేంద్రాలు 115 వరకు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 20 శాఖల సంబంధించి 60 సేవల ధ్రువపత్రాలను వీటి ద్వారానే మంజూరు చేస్తున్నారు. ప్రధానంగా రెవెన్యూ శాఖ, సర్వే శాఖ, పోలీస్, ట్రాన్స్పోర్టు, కార్మిక శాఖ, మున్సిపల్ విభాగం, రిజిస్టర్ కార్యాలయం, సహకార శాఖ తదితర శాఖలకు సంబంధించి ధ్రువపత్రాలను సచివాలయం, మీసేవ కేంద్రాల ద్వారానే లబ్ధిదారులకు అందజేస్తారు. మీసేవ కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల్లోనూ ముందు జాగ్రత్తగా ఆపరేటర్లు పెద్ద ఎత్తున పత్రాలు తెప్పించుకున్నారు. అయితే ఆ పత్రాలు ప్రస్తుతం వాడరాదని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇప్పటికే వేలల్లో పత్రాలు కొనుగోలు చేసుకున్న వారంతా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామ వార్డు సచివాలయాల స్థానంలో స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయాలని పేరు పెట్టింది. దీనితో స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు పేరున ముద్రించిన పత్రాలనే వివిధ శాఖలు మంజూరు చేసిన ధ్రువపత్రాలుగా వాడాలని ఆదేశాలు జారీ చేసింది. వీటి కోసం ఇండెంట్ పెట్టినా సకాలంలో రాకపోవడంతో ధ్రువపత్రాలు మంజూరు సమస్య జఠిలంగా మారింది. ప్రస్తుతం ఈ సేవలు నిలిచిపోవడంతో సుమారు లక్ష మంది దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రధానంగా కుల, ఆదాయం, ఓబీసీ, క్రిమీలేయర్ వంటివి సంబంధిత అధికారి సంతకం చేసి సిఫారసు చేసినా పత్రాలు లేకపోవడంతో పొందలేకపోతున్నారు. వీటితో పాటు వన్ బి, అడంగల్ వంటి రెవెన్యూ సేవలు కూడా నిలిచిపోయాయి. వీటి ద్వారా ప్రతిరోజు వేలాది ధూపత్రాలు రిజిస్ట్రేషన్ చేయడం మంజూరు చేయడం ముద్రించే లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. ఈ ముద్రణ పత్రాలు లేకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. నా కుమారుడి చదువు కోసం వివిధ ధ్రువపత్రాల కోసం సచివాలయంలో దరఖా స్తు చేసుకున్నాం. తహశీల్దార్ ఆమోదం కూడా తెలిపారు. అయినా పత్రాలు లేవని సచివాలయంలో ధ్రువపత్రం ఇవ్వడం లేదు. పాత ఫారాలు ఉన్న చెల్లుబాటు కావని చెబుతున్నారు. – బి.ఆదినారాయణ, శ్రీకాకుళం రూరల్ మండలం -
‘తల్లి’డిల్లిన మనసు
మనసు నిండా ఒంటరితనం. ప్రపంచంలో తమకెవరూ లేరన్న బాధ.. కుటుంబంలో ముగ్గురు ఉన్నా.. అందరం అనాథలమే అన్న భావన.. 62 ఏళ్ల వయసులో ఆ ఆలోచన ఆత్మహత్యకు ప్రేరేపించింది. ఆమెతో పాటు ఇద్దరు కూతుళ్ల ప్రాణాలను బలి కోరింది. వారి మృతదేహాల వద్ద నాలుగు కన్నీటి చుక్కలు రాల్చే వారు లేకపోవడం ఇంకా విషాదం అనిపించింది. జలుమూరు మండలం మర్రివలసకు చెందిన ముద్ద దాలప్పమ్మ (62), తన ఇద్దరు కుమార్తెలు దాలమ్మ(45), సరస్వతి (32) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడాది కిందట దాలప్పమ్మ భర్త చనిపోయిన నాటి నుంచి ఈ కుటుంబం మానసికంగా ఆందోళనలో ఉంది. దాలప్పమ్మకు మరో ఇద్దరు కూతుళ్లు ఉన్నా.. వారు దూరంగానే ఉన్నారు. గురువారం రాత్రి ఇంటి లో తల్లీకూతుళ్లు గడ్డి మందు తాగేశారు. శుక్రవారం ఉదయం ఇరుగుపొరుగు వారు గమనించే సరికి దాలప్పమ్మ కొన ఊపిరితో ఉన్నారు. 108 వచ్చేలోపు ఆమె చనిపోయారు. దాలమ్మ, సరస్వతిలు రిమ్స్లో చికిత్స పొందు తూ మరణించారు. – జలుమూరు -
‘90 శాతానికి చేరుకోవాల్సిందే’
ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం పట్టణంతో పాటు పోలింగ్ కేంద్రాలు 56, 57, 58, 59లో ‘సర్’ పురోగతి మందగించిందని, శుక్రవారం రాత్రిలోగా 90 శాతం లక్ష్యాన్ని తప్పని సరిగా పూర్తి చేయాలని, ద్వంద్వ ఓటర్లను తొలగించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారి, ఏఈఆర్ఓ, సహాయ ఏఈఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్తో పాటు మండల స్థాయి అదనపు సిబ్బంది ప్రతి రెండు గంటలకు ఒకసారి పురోగతిని సమీక్షిస్తూ 90 శాతం లక్ష్య సాధనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన శుక్రవారం లొద్దపుట్టిలో ఉన్న 56,57,58,59 పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఆంధ్రా, ఒడిశా రెండు చోట్ల కొందరికి ఓట్లు ఉన్నట్టు గుర్తించి తొలగించాలని ఆదేశించారు. నిధుల గోల్మాల్పై విచారణ ప్రారంభం రణస్థలం: పైడిభీమవరం పంచాయతీలో గత ఏడాదిలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లోని అవకతవకలపై రణస్థలం ఎంపీడీఓ ఎం.ఈశ్వరరా వు శుక్రవారం విచారణ ప్రారంభించారు. సు మారు రూ. 9.43 కోట్ల నిధుల ఒకే ఏడాదిలో విత్డ్రా చేసి గోల్మాల్ చేయడంపై పలు పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు డీఎల్పీఓను తొలుత విచారణ అధికారిగా నియమించారు. తర్వాత కూటమి నేతల అండతో ఎంపీడీఓను నియమించారు. ఈ విచారణపై ఎంపీడీఓ ఎం.ఈశ్వరరావు మాట్లాడుతూ రికార్డులు పరిశీలిస్తున్నామని, మరో మూడు రోజుల పాటు రికార్డులు పరిశీలించాల్సి ఉందన్నారు. -
అలసిపోయింది ప్రాణం
70 ఏళ్ల వయసు.. సేద్యంపై ఆధారపడిన బతుకు. ఇంటి పనులు, పొలం పనులతో నిత్యం సందడిగా ఉండే జీవితం. కష్టపడి పనిచేసే ప్రాణం. బస్తా ఎరువు కోసం చేసిన నిరీక్షణ ఆమె ప్రాణం తీసింది. నందిగాం మండలంలో ని పెద్దలవునిపల్లి గ్రామానికి చెందిన పినకాన కాంతమ్మ(70) శుక్రవారం యూరియా కోసం రైతు సేవా కేంద్రానికి వెళ్లి అక్కడే ప్రాణాలు వదిలేశారు. పెద్దలవుని పల్లి రైతు సేవా కేంద్రంలో ఎరువులు పంపిణీ చేశారు. కొత్త నిబంధన ప్రకారం యూరియా పంపిణీ చేసేందుకు భూమి ఉన్న ప్రతి రైతు ఆర్ఎస్కేకు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. దీంతో కాంతమ్మ తన కుమార్తెతో కలిసి ఆర్ఎస్కేకు వెళ్లారు. అంత చిన్న గదిలో స్లిప్పులు రాయించుకోవడం, బయోమెట్రిక్ వేయడం, ఎరువు కోసం వేచి ఉండడంతో గాలి ఆడని స్థితి. ఎలాగోలా అవన్నీ చేయించుకున్న కాంతమ్మ బయటకు వచ్చిన కాసేపటికే కుప్పకూలిపోయారు. టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించే లోగానే ఆమె మృతి చెందారు. – నందిగాం -
పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్ట్ రద్దు
● అరసవల్లిలో ఏరో సెక్యూరిటీ సర్వీసెస్ టెండర్ కాంట్రాక్ట్ను రద్దు చేసిన ఈఓ ● స్వీపర్పై కాంట్రాక్టర్ లైంగిక ఆరోపణల నేపథ్యంలో చర్యలు అరసవల్లి: ‘జీతం కావాలా.. అయితే నా ఇంటికి రా..’’ అంటూ స్వీపర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఏరో సెక్యూరిటీ సర్వీసెస్ పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్టర్ గోవింద్పై ఎట్టకేలకు ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ చర్యలకు ఉపక్రమించారు. గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సంచలనం రేకెత్తించిన సంగతి విదితమే. పారిశుద్ధ్య విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ యువతి పట్ల కాంట్రాక్టర్ గోవింద్ అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేరడంతో ఈ విషయంలో అధికారులు సీరియస్గా వ్యవహరించారు. జిల్లా ఉన్నతాధికారులతో పాటు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు కూడా తీవ్రంగా స్పందించడంతో టెండర్దారుడైన గోవింద్కు ఆ కాంట్రాక్ట్ను రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయ నేతల ఒత్తిళ్లు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ.. స్థానిక పరిస్థితులతో పాటు పారిశుద్ధ్య కార్మికుల్లో ఐక్యతతో ఈ కాంట్రాక్ట్ను రద్దు చేసేలా అధికారులు అడుగులు వేశారని తెలుస్తోంది. కాంట్రాక్టర్కు మద్దతుగా అధికార పార్టీ నేతలు కొందరు పోలీసుల సమక్షంలోనే బాధితురాలితో పాటు జీతాల కోసం ఎదురు చూస్తున్న మిగిలిన సిబ్బందికి, కాంట్రాక్టర్కి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినప్పటికీ ‘సాక్షి’లో ఈ వ్యవహారం కూడా ప్రచురించడంతో చేసేదేమీ లేక చర్యలకు దిగినట్లుగా సమాచారం. -
బండబారుతున్న బతుకులు
● క్వారీల్లో వరుస ప్రమాదాలు ● భద్రతా చర్యలు ప్రశ్నార్థకం టెక్కలి: కూలి పనుల కోసం వెళ్తున్న వారి బతుకులు అర్ధంతరంగా కూలిపోతున్నాయి. యజమానుల లాభాపేక్ష, యంత్రాంగం నిర్లక్ష్యం కలగలిపి బడుగు జీవుల ప్రాణాలు తీస్తున్నాయి. టెక్కలి మైన్స్ కార్యాలయం పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీల్లో ఇటీవల కాలంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తూ కార్మికులు మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాలు జరిగినపుడు మాత్రమే అధికారుల హడావుడి చేస్తున్నారు తప్ప భద్రతా ప్రమాణాలపై ఎలాంటి చర్య లు తీసుకోవడం లేదు. మెళియాపుట్టి మండలం గంగరాజపురంలో ముగ్గురు, దబ్బగూడలో మరో ము గ్గురు, టెక్కలిలో ఇద్దరు, తాజాగా కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు సమీపంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇవి పాటించాల్సిందే.. ● గ్రానైట్ క్వారీ నిర్వహణలో ముఖ్యంగా హెల్మెట్లు, సేఫ్టీ షూస్, గ్లోవ్స్, సేఫ్టీ గాగుల్స్ లాంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు అందించడం తప్పనిసరి. ● భద్రతా సిగ్నల్స్, హెచ్చరికలతో సరైన హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ● సురక్షిత విధానాలు (సేఫ్టీ ప్రొటోకాల్) పాటించడం వాటిపై కార్మికులకు శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించడం, మిషన్ల తగిన రక్షణ కవచాలు (గార్డింగ్స్) ఏర్పాటు చేసి, సరైన నిర్వహణ జరపాలి. ● ప్రమాదాలతో కూడిన ప్రమాద నిరోధక బోర్డులను ఏర్పాటు చేసి విపత్తుల నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ● ముఖ్యంగా మైన్స్ మేనేజర్ పర్యవేక్షణ ఉండాలి. ● బ్లాస్టింగ్ అనుమతులు కలిగిన క్వారీల్లో పోలీసులు తరచూ తనిఖీలు చేయాలి. ● మన గ్రానైట్ క్వారీల్లో భద్రతా చర్యలు సరైన విధంగా లేకపోవడం వలన తరచూ ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయి. ● గ్రానైట్ క్వారీల్లో భద్రతా వారోత్సవాలు కూడా కానరావడం లేదు. -
సేవలకు గుర్తింపు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్సార్ సీపీలో కొత్త నియామకాలు జరిగాయి. రాష్ట్ర కళింగ వైశ్య విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన అంధవరపు సూరిబాబును సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(సీఈసీ) సభ్యులుగా నియమించగా, ఖాళీ అయిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కళింగ వైశ్య, కళింగ కోమటి విభాగం అధ్యక్షుడి స్థానానికి పట్నాల శ్రీనివాసరావు (కోణార్క్ శ్రీను) నియామకమయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ కళింగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన రాష్ట్ర కాళింగ విభాగం అధ్యక్షుడిగా నియమితులైన పట్నాల శ్రీనివాసరావు రాష్ట్ర కళింగ వైశ్య అధ్యక్షునిగా పనిచేశారు. వైఎస్సార్సీపీలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ వస్తున్నారు. సేవలను గుర్తిస్తూ తాజాగా నియమించా రు. ఇంతవరకు రాష్ట్ర కళింగ వైశ్య, కళింగ కోమటి అధ్యక్షునిగా పనిచేసిన అంధవరపు సూరిబాబు సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా నియమించారు. ఆయన తొలుత జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, సీఈసీ సభ్యుడిగా, నగర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అధికారంలోకి వచ్చాక కళింగ వైశ్య విభాగం రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. నెల్లిమర్ల, ఎచ్చెర్ల నియోజకవర్గ పరిశీలకులగా వ్యవహరించారు. తాజాగా నరసన్నపేట నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులయ్యారు. కోణార్క్ శ్రీనుకు, అంధవరపు సూరిబాబుకు పార్టీ శ్రేణులు అభినందనలు తెలియజేశాయి.● వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా అంధవరపు సూరిబాబు ● రాష్ట్ర కళింగ వైశ్య, కళింగ కోమటి విభాగం అధ్యక్షుడిగా కోణార్క్ శ్రీను నియామకం ● శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం -
తమ్మినేనిని ట్రోల్ చేయడం దుర్మార్గం
హిరమండలం : రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అసత్య ప్రచారాలు, నీచమైన ట్రోల్స్ చేయడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తప్పుగా ట్రోల్స్ చేయడం సంస్కారహీనతకు నిదర్శనమన్నారు. తమ్మినేని ప్రతిష్టను దెబ్బతీయడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల హామీలు అమలుచేయడం చేతకాక ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే తమ్మినేనిపై పెట్టిన అవాస్తపు పోస్టులను తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోంపేట: మాకన్నపురం పంచాయతీ శారదాపురంలో శుక్రవారం సాయంత్రం కోతులు దాడి చేయడంతో కోనారి నారాయణరావు, దాసరి నారాయణమ్మ, సార వల్లమ్మతో పాటు మరో పదిమందికి గాయాలయ్యాయి. బాధితులను కొర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అధికారులు స్పందించి కోతుల బారినుంచి రక్షణ కల్పించా లని గ్రామస్తులు కోరుతున్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి పలాస: కవిటి మండలం బైరిపురం గ్రామానికి చెందిన బి. సోమశేఖరరావు (48) అనుమానాస్పద స్థితిలో గురువారం రాత్రి కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వద్ద మృతి చెందాడు. ఈ విషయాన్ని కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అంతరకుడ్డలో గల తన అత్తవారింటికి మూడు రోజుల కిందట వెళ్లాడు. భార్యాపిల్లలను చూసి తిరిగి వచ్చాడు. అతనికి మద్యం అలవాటు బాగా ఉందని, మద్యం తాగడం వల్ల, సరైన ఆహారం లేక పోవడం వల్ల డ్రీహైడ్రేషన్కు గురై మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాశీబుగ్గ ఎస్ఐ సునీల్ చెప్పారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టు మార్టం చేశారు. మృత దేహాన్ని వారి కుటుంబానికి అప్పగించామన్నారు. పలాస: కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలోని అన్నా క్యాంటీన్ వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి పరిశీలించారు. మృతుడిని యాచకుడిగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ‘అర్హుల ఓట్లు పోకూడదు’ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అర్హత కలిగిన వారి ఓట్లు పోవడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పరిశీలనలో భాగంగా అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్తో కలిసి శుక్రవారం శ్రీకాకుళం విచ్చేసిన ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్ఓ విశ్వేశ్వరరావు, అన్ని నియోజకవర్గాల ఈఆర్వోలతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈఆర్వోలు తప్పకుండా తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను సందర్శించాలని, తక్కువ ఫలితాలు నమోదైన చోట క్షేత్రస్థాయి పర్యటనలు చేసి లోపాలను విశ్లేషించుకోవాలని ఆదేశించారు. అనంతరం 8 నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో నిర్వహించిన సమావేశంలో తొలుత జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ప్రకారం జిల్లాలో 9,31,640 మంది పురుష ఓటర్లు, 9,48,299 మంది మహిళా ఓటర్లు, 126 మంది ఇతర ఓటర్లతో కలిపి మొత్తంగా 18,80,065 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో కొత్తగా 107 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వెల్లడించారు. -
నాయీ బ్రాహ్మణుల నిరసన
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఒంగోలులో దారుణ హత్యకు గురైన మహేంద్ర కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు టి.తిరుపతిరావు, జిల్లా అధ్యక్షుడు కె.గజపతిరావు, జిల్లా సాధికార సమితి కన్వీనర్ కె. వెంకటరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద శుక్రవా రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో సెలూన్ నడుపుతూ జీవిస్తున్న మహేంద్ర వద్దకు జూలై 2న రామారావు అనే వడ్డీ వ్యాపారి వచ్చి దురుసుగా వ్యవహరించాడని, షేవింగ్కు నిరాకరించినందుకు కత్తెరతో పొడిచి చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. మహేంద్ర కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం, ఒకరికి ఉపాధి కల్పించాలని, 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కె.నాగరాజు, ఆర్.శంకరావు, కె.ఈశ్వర్, సి.హెచ్.కన్నయ్య, జి.శ్రీను, సి.హెచ్.లక్ష్మణరావు, పి.సురేష్, కె.కృష్ణ, జి.దుర్గాప్రసాద్, చిట్టిభాను, ఎస్.శ్రీను, కె.నీలాద్రి, కె.శశి, ఏ.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
నా ఓటు లేదంటున్నారు
నేను చాలా ఏళ్లుగా ఓటు వేస్తున్నాను. 2024 లో కూడా ఓటు వేశాను. ఇప్పుడు నా వయసు 70 ఏళ్లు. మా కుటుంబంలో నాతో పాటు భార్య, కోడలు ముగ్గురికీ ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి మళ్లీ తీసుకున్నారు. ఏమని అడిగితే మీ ఓటు మ్యాపింగ్ కాలేదు అంటున్నారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. బీఎల్ఓ వద్దకు రోజూ వెళ్తున్నా స్పందించడం లేదు. సర్ పేరున మా ఓట్లు లేకుండా చేస్తున్నారు. మా ఓట్లు లేకపోవడం ఏమిటి. బీఎల్ఓలు, ఇతర అధికారులదే తప్పు. – పొట్నూరు రామసోమేశ్వర గుప్త, స్టేట్బ్యాంకు వీధి, నరసన్నపేట -
సిబ్బంది నిర్లక్ష్యం వల్లే డయేరియా
శ్రీకాకుళం/ గార: గార కేజీబీవీలో డయేరియా ప్రబలడానికి అక్కడి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గురువారం రాత్రి సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాలరావు కేజీబీవీకి వెళ్లి విచారణ చేయగా శుక్రవారం మధ్యాహ్నం డీఈఓ రవిబాబు మరోసారి విచారణ చేశారు. కూరలను పూర్తిస్థాయిలో ఉడికించకపోవడం వల్ల డయేరియా ప్రబలినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు చెబుతున్న ప్రకారం విద్యార్థినులకు ఇచ్చిన చిక్కీలు రాగిమాల్ట్ పాడైపోవడం వల్ల వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు గార కేజీబీవీలో ప్రత్యేక తరగతులు నిర్వహించిన సందర్భంలో సరఫరా చేసిన చిక్కీలు, రాగి మాల్ట్లను విద్యార్థులకు ఇచ్చినట్లు సమాచారం. వాసన వస్తోందని విద్యార్థులు చెప్పినా.. వారిని గదమాయించి తాగించినట్లు సమాచారం. సంఘటన జరిగిన వెంటనే జిల్లా స్థాయికి సమాచారాన్ని ఇవ్వకపోవడాన్ని రాష్ట్ర అధికారులు సీరియస్ గా తీసుకున్నట్లు భోగట్టా. మరోవైపు గార పీహెచ్సీ ఆధ్వర్యంలో పాఠశాలలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధిత విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారు. కాగా, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తామని ఏపీసీ చెప్పారు. -
● ఆర్ఎస్కేకు తాళం..
రైతు భరోసా కేంద్రాల నిర్వీర్యం.. ప్రైవేటు డీలర్లకు పట్టం.. ఫెర్టిలైజర్ కంపెనీలకు దాసోహం.. వెరసి ప్రభుత్వం అన్నదాతల వెన్ను విరుస్తోంది. క్యూ కట్టకుండా, నిరీక్షణ లేకుండా ఎరువు ఇచ్చే ప్రసక్తే లేదని పరోక్షంగా స్పష్టం చేసింది. రైతు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా తన దారి తనదేనని చర్యల ద్వారా నిరూపించుకుంటోంది. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలోనూ వింత పరిస్థితులే ఎదురవుతున్నాయి. కోటబొమ్మాళిలో ఏకగ్రీవ తీర్మానం వ్యవసాయ శాఖ మంత్రి సొంత మండలం కోటబొమ్మాళిలో హోల్సేల్ అండ్ రిటైల్ డీలర్లు ఇటీవల ఒక సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. లింక్ ప్రొడక్ట్లు ఇస్తే ఏ కంపెనీ వద్ద కూడా ఎరువులు కొనుగోలు చేయకూడదని షరతు పెట్టుకున్నారు. జిల్లాలోని ఫెర్టిలైజర్ డీలర్స్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూపుల్లో సైతం ఈ విషయాన్ని వెల్లడించటంతో మిగిలిన డీలర్లు ఆలోచనలో పడ్డారు. సీజన్కు ముందే కలెక్టర్ సూచనలతో జేసీ ప్రత్యేకంగా ఫెర్టిలైజర్ కంపెనీల ప్రతినిధులు, హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్లకు లింక్లు తగ్గించాలని చెప్పినా వారి తీరు మారలేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో ఖరీఫ్ సాగు మొదలైనప్పటికీ ఎరువుల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. గత ఏడాది అనుభవాలు దృష్ట్యా ఈసారి అప్పోసప్పో చేసి ముందే ఎరువు తెచ్చుకుందామని బయల్దేరిన రైతులకు ‘యాప్ ద్వారా ఎరువులు అమ్మబడును’ అనే బోర్డులు కనిపిస్తున్నాయి తప్ప ఏ షాప్లోనూ ఎరువు దొరకటం లేదు. ఎక్కువ చోట్ల ప్రైవేట్ దుకాణాల్లో నోస్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఫెర్టిలైజర్ కంపెనీలు ఈ ఏడాది కూడా లింక్ ప్రొడక్టులు డీలర్లకు అంటగట్టడంలో ఎక్కడా తగ్గటంలేదు. ఇక నానో సంగతి చెప్పనక్కర్లేదు. జిల్లాలో 370 మంది ప్రైవేట్ ఫెర్టిలైజర్ రిటైలర్స్ ఉంటే అందులో సగానికి పైగా డీలర్లు ఎరువులు స్టాక్ తీసుకురాలేదని తెలుస్తోంది. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లాలో ఎరువుల కోసం రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. వాస్తవంగా సచివాలయంలో ఎరువులు అందుబాటులో ఉంచాలి. ఒకవేళ అందుబాటులో లేకపోతే మార్క్ఫెడ్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి సమాంతరంగా దగ్గరలో ఉన్న రిటైలర్లకు సరఫరా చేయాలి. దానిపై పర్యవేక్షణ చేయాలి. కానీ ప్రస్తుతం జిల్లాలో అలా జరగడం లేదు. అధికారం ఉన్నోడిదే రాజ్యమైపోతోంది. ఓటీపీలతో అవస్థలు ‘ఏపీఎయిమ్స్2.0’ యాప్లో ఓటీపీలతో రైతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఎక్కువ మంది హక్కుదారులు తమ భూములను చిన్న, సన్నకారు రైతులకు అప్పగిస్తుంటారు. ఇప్పుడు వారు ఓటీపీ చెప్పాల్సి రావటంతో కొందరు తొలుత కుదరని చెప్పినా తర్వాత తప్పదని తెలిసి చెప్పాల్సి వచ్చినా రెండుసార్లు చెప్పటంతో కొంత ఇబ్బంది ఫీలవుతున్నారు. దీనికి ప్రతీ డీలరు ఎల్–1 డివైస్ తీసుకోవాలని వ్యవసాయశాఖ తాజాగా సూచించినప్పటికీ ఇక్కడ ప్రత్యక్షంగా అందుబాటులో లేని వారి అథెంటికేషన్ ఎలా అనేది చెప్పాల్సి ఉంది. ఇన్ని సమస్యలు ఎందుకు అనుకున్నారో ఏమో గానీ జిల్లాలో ప్రైవేటు డీలర్లు చాలావరకు ఎరువుల నిల్వలు ఉంచుకోవటం లేదు. అందుకే యాప్లో ఉన్న యూరి యా షాపులో లేదయా అంటున్నారు రైతులు. లింక్లపై పర్యవేక్షణ ఏదీ..? వాస్తవానికి ప్రస్తుతం జిల్లా వ్యవసాయశాఖ అధికారికి లింక్ ప్రొడక్టులపై పూర్తి అవగాహన వుంది. అందుకే ఒకటికి రెండుసార్లు ఈ జిల్లాలో నడుస్తున్న ఫెర్టిలైజర్ సిండికేట్తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సున్నితంగా హెచ్చరికలు కూడా చేశారు. అయితే ఇప్పటికే మార్కెట్లోకి వెళ్లిపోయిన లింక్ప్రొడక్ట్ల విషయంపై ప్రైవేటు డీలర్లు నష్టపోతారనే సాఫ్ట్ కార్నర్ జిల్లా వ్యవసాయశాఖలో కనిపిస్తోంది. దీంతో రైతులకు భారం తప్పడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో వింత అనుభవం సగానికి పైగా డీలర్ల వద్ద నోస్టాక్ బోర్డులు స్టాక్ ఉంటే ‘లింకు’ల బెడద తూతూ మంత్రంగా వ్యవసాయశాఖ పర్యవేక్షణ -
కేజీబీవీలో డయేరియా
● శాలిహుండం కస్తూర్బా విద్యార్థినులకు అతిసారం ● గార పీహెచ్సీలో చికిత్స గార: శాలిహుండం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులకు డయేరియా సోకింది. బుధ, గురువారాల్లో మొత్తం 13 మంది డయేరియా బారిన పడ్డారు. ముందుగా బుధవారం ఉదయం ఆరుగురికి విరేచనాలు, ఒక విద్యార్థినికి వాంతులు రావడంతో కేజీబీవీ ఏఎన్ఎం కృష్ణవేణి వెంటనే గార పీహెచ్సీ వైద్యాధికారి పొంటూరు సోనియాకు సమాచారం అందించి చికిత్స ప్రారంభించారు. వి ద్యాలయంలో ఏడో తరగతి చదువుతున్న యాళ్ల జాహ్నవి (ముద్దాడ), సురాల మోక్షిత (నిజామాబాద్), నీలాపు హాసిని(నీలాపుపేట), గాబు కల్యాణి(గాబువానిపేట), ఎం.మోహిని (శ్రీకాకుళం), 10వ తరగతి విద్యార్థి ని గంటా ఛాయాదేవి (సిలగాం)లకు ఆస్ప త్రిలో చికిత్స అందజేశారు. గురువారం సాయంత్రానికి వీరి పరిస్థితి కుదుటపడింది. కుటుంబ సభ్యులు పీహెచ్సీ వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్కూల్లోని బోరు నీటిని, ఆర్ఓ ప్లాంటులో నీటిని పరీక్ష జరిపారు. నీరు సురక్షితంగా ఉందని, భోజనం ద్వారా ఇబ్బంది ఏర్పడిందని పీహెచ్సీ వైద్యాధికారిణి పి.సోనియా తెలిపారు. సమస్య బయటపడినా బుధవారం మధ్యాహ్నం ఆహారంలో చికెన్ అందించారు. దీంతో సమస్య తీవ్రత పెరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమా చారం తెలుసుకున్న సమగ్రశిక్ష సీఎంఓ శ్రీధర్ కేజీబీవీని సందర్శించారు. విద్యార్థినులు వేడి నీటిని మాత్రమే తీసుకోవాలని గార పీహెచ్సీ వైద్యాధికారి సోనియా సూచించారు. ఆహార పదార్థాలు వేడిగా నాణ్యతగా ఉండాలన్నారు.పీహెచ్సీలో విద్యార్థిని వద్ద తల్లిదండ్రులు -
13న కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ మహాధర్నా
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం కోరుతూ ఈ నెల 13న కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని క్రాంతి భవన్లో ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.సోమశేఖర్, సీహెచ్ రవి మాట్లాడుతూ పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేస్తామని చెప్పి రెండేళ్లవుతున్నా కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడం తగదన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుకున్న విద్యార్థులకు దాదాపు రూ.10వేల 700 కోట్ల బకాయిలున్నాయని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటిస్తున్నారే తప్ప విద్యార్థుల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కావడం లేదన్నారు. రెండేళ్లుగా రూ 2,200 కోట్ల స్కాలర్షిప్ బకాయిలు కూడా చెల్లించలేదన్నారు. వసతి దీవెన పథకం ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ విద్యార్థులకు రూ.20 వేలు చెల్లించేవారని గుర్తు చేశారు. తక్షణమే తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న వార్డెన్, కమాటీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో సంఘ నాయకులు అశోక్, హర్షవర్ధన్, ఉదయ్, సాయి, భవాని తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో చేరిన ఇంటర్ విద్య డీవీఈఓ
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ విద్య జిల్లా వృత్తివిద్యాధికారిగా రేగ సురేష్కుమార్ గురువారం తిరిగి విధుల్లో చేరారు. ఆయన జిల్లా డీవీఈఓగా, ఆర్ఐఓగా పనిచేస్తుండగా అనారోగ్య కారణాలతో రెండు నెలల మెడికల్ లీవ్ పెట్టారు. దీంతో రెండు నెలలపాటు శ్రీకా కుళం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మొదలవలస కృష్ణవేణి పూర్తి అదనపు బాధ్యతలతో డీవీఈఓగా, ఆర్ఐఓగా పనిచేసి మెప్పించారు. రెండు నెలలు మెడికల్ లీవ్ అనంతరం రేగ సురేష్కుమార్ విధుల్లో చేరడంతో కృష్ణవేణి ఆయనకు బాధ్యతలు అప్ప జెప్పి.. ప్రిన్సిపాల్గా ఆమె పూర్తిస్థాయిలో విధుల్లో చేరారు. ‘77.21% డిజిటలైజేషన్ పూర్తి’ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో అత్యంత పారదర్శకంగా సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ విజయవంతానికి అన్ని రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సహకరించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ పార్టీల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మా ట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి పౌరుడూ ఓటరుగా నమోదయ్యేలా చూడటం, అనర్హులు, మృతుల పేర్లను తొలగించడమే ఈ ప్రక్రియ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. జూలై 9వ తేదీ నాటికి జిల్లాలోని మొత్తం 2,358 పోలింగ్ కేంద్రాల పరిధిలో 14,65,075 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని, ఇది 77.21 శాతంగా నమోదైందని వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు డిజిటలైజేషన్ పురోగతి వివరాలను పార్టీల ప్రతినిధులకు సమర్పించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, వైఎస్సార్ సీపీ నుంచి రౌతు శంకరరావు, టీడీపీ తరఫున పీఎంజే బాబు, సీపీఐ–ఎం తరఫున ఎం.గోవిందరాజులు పాల్గొన్నారు. శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష రద్దు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తిరుమలరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు, గూడెం, పాత్రునివలస, పెద్దపాడు, సింగుపురం తదితర పాఠశాలల్లో గురువారం ఏపీటీఎఫ్ బృంద సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వేసవి సెలవుల్లో బదిలీలు చేయకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పీఆర్సీ కమిషన్ నియమించి ఉద్యోగ ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, ఇంత వరకు బకాయి ఉన్న ఐదు డీఏలు, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13లోగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎన్.వి.ఎస్ ప్రసాదరావు, పి.లక్ష్మణరావు, దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై చర్చ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన నాలుగు డీఏ బకాయిలు, మూడేళ్ల నుంచి ఇవ్వని ఐఆర్లు వెంటనే ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఆయన గురువారం జిల్లాలోని ప్రభు త్వ ఉద్యోగులు, పెన్షనర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 12న కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద ఉన్న డాక్టర్ అంబేడ్కర్ సమావేశ మందిరంలో జిల్లాలోని జోన్ 1 ఉద్యోగులు, పెన్షనర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఆ సమావేశంలో అంతా పాల్గొనాలని కోరారు. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. సమావేశంలో విశ్రాంత రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు పి.రజనీకాంతారవు, చంద్రశేఖర్ (చందు), కాళీప్రసాదు, ఎం.సీతారామ మూర్తి, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు రాజు, శ్రీనివాసరావు, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
నష్టం
రెండు రోజులు రూ. కోట్లు ● భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు ● డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనతో పడిపోయిన ఆదాయం జీఓ విరమించుకోవాలి రైటర్ల పొట్ట కొట్టే 396 జీఓ విరమించుకోవాలి. వందలాది సంవత్సరాలు చరిత్ర గల డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థను తీసేయాలన్న నిర్ణయం సరికాదు. – ఎన్వీ కామేశ్వరరావు, సీనియర్ దస్తావేజు లేఖరి, శ్రీకాకుళం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం డాక్యుమెంట్ రైటర్లు పెన్డౌన్ చేసిన రెండు రోజులు మోడల్ డాక్యుమెంట్ని వెబ్సైట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చాం. అధికారికంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశాం. డాక్యుమెంట్ రైటర్లతో పనిలేకుండా ఇంటర్నెట్ సాయంతో డాక్యుమెంట్స్ తయారుచేసేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. – బి.సంజీవయ్య, జిల్లా రిజిస్ట్రార్, శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తెచ్చే శాఖల్లో అత్యంత కీలకమైనది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు ముఖ్య పాత్ర పోషిస్తారు. డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుండంతో మూడు రోజులుగా డాక్యుమెంట్ రైటర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జీఓ 396ని తీసుకొచ్చి రోడ్డున పడేయడం సరికాదని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే)లను ఓ ప్రైవేటు ఏజె న్సీకి ఇచ్చి ఒక్కో డాక్యుమెంట్కి రూ.2వేలు ఇచ్చి తయారు చేయించుకునేందుకు ఓ పథకం పన్నార ని, చంద్రబాబు అనుచరులకే ఈ ఏజెన్సీలు అప్పగిస్తారని రైటర్లు ఆరోపిస్తున్నారు. 118 ఏళ్ల చరిత్ర ఉన్న డాక్యుమెంట్ రైటర్ల పొట్ట కొట్టే జీఓలు ఎందుకు తీసుకొస్తున్నారో తెలీడం లేదని డాక్యుమెంట్ రై టర్లు మండిపడుతున్నారు. జిల్లాలో 13 సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలు ఉండగా డాక్యుమెంట్ రైట ర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, రైటర్ల అసిస్టెంట్లు మొత్తంగా జిల్లాలో 600మందికి పైగా ఉంటారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరి బతుకు రోడ్డున పడుతుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి ఈ నెల 6, 7 తేదీల్లో డాక్యుమెంట్ పెన్డౌన్ చేశారు. దీంతో 6వ తేదీన రూ.21లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నారు. ముందురోజు స్లాట్లు బుక్చేసి, డాక్యుమెంట్లు తయారుచేసి ఉండడంతో రూ.21లక్షలు ఆదాయం అయినా వచ్చింది. సాధారణంగా అయితే రూ.కోటి వస్తుంది. 7వ తేదీన మాత్రం ఒక్క నరసన్నపేట సబ్రిజిస్ట్రార్ పరిధిలో మాత్రమే రూ 3.98 లక్షలు ఆదా యం వచ్చింది. మిగిలిన 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సున్నా ఆదాయం వచ్చింది. రెండు రోజుల్లో సుమారు రూ.2కోట్లు వరకు ఆదాయానికి గండి పడింది. ఈ జీఓను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ నెల 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పెన్డౌన్ చేసి చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్లు రైటర్లు తెలిపారు. 10న కలెక్టర్ను కలుస్తామన్నారు. -
ఆ భూములు పేదలకే అప్పగించాలి
రణస్థలం: పేదల కోసం కేటాయించిన భూములను పేదలకే అప్పగించాలని, పెద్దల పేరుతో రాయించుకున్న వాటిని తక్షణమే రద్దు చేయాలని సుమారు 200 మంది జీరుపాలెం గ్రామస్తులు తహసీల్దార్, ఎస్సైల ఎదుట డిమాండ్ చేశారు. వారం రోజులుగా జీరుపాలెం పంచాయతీ జగన్నాథపురంలో గ్రామపెద్దలకు, గ్రామస్తులకు మధ్య తలెత్తిన వివాదం తీవ్ర రూపం దాల్చింది. 13 మంది గ్రామపెద్దలు వారి కుటుంబ సభ్యుల పేరుతో 271, 272, 273 సర్వే నంబర్లలో రాయించుకున్న సుమారు 20 ఎకరాల భూమిని రద్దు చేసి పేదలకు అందజేయాలని మహిళలు, యువత, గ్రామస్తులు గురువారం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సనపల కిరణ్కుమార్ మాట్లాడుతూ భారీగా గ్రామస్తుల చేరుకుని నినాదాలు చేస్తే గందరగోళం జరగడం తప్ప సమస్యకు పరిష్కారం జరగదన్నారు. ఇరుపక్షాలతో సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్సై ఎస్. చిరంజీవి మాట్లాడుతూ గ్రామం మొత్తం తరలివస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, ఇరుపక్షాలు ఈ భూమిపైకి రాకుండా చూస్తామని, కొన్ని రోజులు శాంతియుతంగా ఉంటే సమస్య పరిష్కరించే చొరవ తీసుకుంటామని హామీఇచ్చారు. -
ఎస్ఎఫ్ఐ నిరసన దీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్: భారత విద్యార్థి ఫెడరేషన్ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లా కమిటీ ప్రతినిధులు నిరాహార దీక్ష చేపట్టారు. రిటైర్డ్ డిప్యూ టీ డీఈవో కొత్తకోట అప్పారావు, సీఐటీయూ ప్రధా న కార్యదర్శి పి.తేజేశ్వరరావులు శిబిరాన్ని ప్రారంభించి విద్యార్థులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.చందు, కార్యదర్శి పి.ఖగేష్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాక్రోచ్ జన తా పార్టీ 19 రోజులుగా, సోనమ్ వాంగుక్, విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష 11 రోజులు పూర్త య్యిందన్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వంద లాది మంది విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నా రని చెప్పారు. వారికి మద్దతుగా శ్రీకాకుళంలోనూ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. -
ఐడీఎస్పీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: వైద్య ఆరోగ్య శాఖలో ఐడీఎస్పీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డేటా మేనేజర్– 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ – 1, లేబొరేటరీస్– 1 పోస్టు లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. srikakulam.nic.inలో నోటిఫికేషన్ అందుబాటులో ఉందని వివరించారు. దరఖాస్తుల ను ఐడీఎస్పీ విభాగం, 3వ అంతస్తు, జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయం, శ్రీకాకుళంలో జూలై 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అందజేయాలని కోరారు. టెక్కలి రూరల్: బన్నువాడ గ్రామానికి చెందిన బొడ్డ గేయామృత మహిళా బాక్సింగ్ కోచ్ శిక్షణకు ఎంపికై నట్లు శిక్షకుడు నర్శిపురం శేఖర్ గురువారం తెలిపారు. ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రానికి చెందిన ఈ విద్యార్థిని ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 100 మందిని ఎంపిక చేయగా అందులో గేయామృత ఒకరు. వీరిని ఉత్తమ సర్టిఫైడ్ కోచ్లుగా తీర్చిదిద్దుతారు. ఈ నెల 13 నుంచి పంజాబ్ రాష్ట్రం పటియాలాలో జరగబోయే శిక్షణ కార్యక్రమానికి హాజరవుతారని శేఖర్ తెలిపా రు. గేయామృత శిక్షణకు కావాల్సిన సామగ్రిని జిల్లా క్రీడా అధికారి మహేష్బాబు అందించారు. శ్రీకాకుళం పాతబస్టాండ్ : సమాజంలో దివ్యాంగులైన పిల్లలకు సమాన గుర్తింపు, సమాన అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. నగరంలోని ఏపీహెచ్ బీ కాలనీలో బెహరా మనోవికాస కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. చిన్నారు ల ప్రతిభ, వారు నేర్చుకుంటున్న విద్య, శిక్షణ, వినోద కార్యక్రమాలను పర్యవేక్షించారు. థెర పీ, కౌన్సెలింగ్ సేవలను అడిగి తెలుసుకున్నా రు. శారీరక, మానసిక సవాళ్లను అధిగమించి చిన్నారులు ముందడుగు వేసేలా సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో వికాస కేంద్ర ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. అడ్డగుట్ట : ఈ నెల 7న శబరి ఎక్స్ప్రెస్లో భార్య కళ్ల ముందే భర్త, మరో మహిళ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మహిళ(36) గురువారం మృతి చెందినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. భర్త పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
● రైతు నెత్తిన అదనపు భారం
యూరియా కొనుగోలు చేయాలంటే గుళికలు, నానో యూరియా, నానో డీఏపీతో పాటు పలు రకాల రసాయన ఎరువులు కొనుగోలు చేయాలని ప్రైవేట్ డీలర్లు ఒత్తిడి పెడుతున్నారు. డీలర్లు చెప్పినవి కొనుగోలు చేయకపోతే యూరియా ఇవ్వడం జరగదని తేల్చి చెప్పడంతో రైతు నెత్తిన అదనపు భారం పడుతోంది. ఇప్పటికే కూలి ధరలు, విత్తనాల ధరలు పెరిగి రైతులు తీ వ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సచివాలయాల కు కూటమి ప్రభుత్వం ఎరువులు కేటాయించకుండా ప్రైవేట్ డీలర్లకు ఎరువులు కేటాయించడంతో మండలంలోని శివారు గ్రామాలైన ఆకులతంపర, అడ్డంగి, కడుముచ సోమరాజపురం, గొట్టిపల్లితో పాటు పలు గ్రామాల నుంచి 12 కిలోమీటర్ల దూరం వచ్చి ఎరువులు కొనాల్సి వస్తోంది. –కొత్తూరు అవస్థలు తప్పడం లేదు గ్రామ సచివాలయాలకు ఎరువులు ఇవ్వకపోవడంతో 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు వెళ్లాల్సి వస్తోంది. అవసరం లేకపోయినా గుళికలు, నానో యూరియా, డీఏపీలు అంటగడుతున్నారు. – పాపారావు, రైతు, ఆకులతంపర గ్రామం -
● తప్పని అవస్థలు
మండలంలో రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారు. సారవకోట పీఏసీఎస్ చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నా డీఏపీ దొరకడం లేదని ఆరోపిస్తున్నారు. రైతుల వివరాలు యాప్లో నమోదు చేస్తే ఏ రైతుకు ఎంత ఎరువు ఇవ్వాలని వస్తుంది. యాభై సెంట్లు కంటే ఎక్కువగా ఉన్న రైతులకు మాత్రమే డీఏపీ ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో 50 సెంట్లు ఉన్న రైతులు డీఏపీ కోసం ప్రైవేట్ వర్తకులను ఆశ్రయించాల్సి వస్తోంది. ముఖ్యంగా కౌలు రైతులు ఓటీపీల వల్ల ఇబ్బంది పడుతున్నారు. దీనిపై పీఏసీఎస్ ఇన్చార్జి సీఈఓ అశ్వినిని వివరణ కోరగా యాప్లో నమోదు చేయడానికి సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, దీంతో రైతులకు డీఏపీ అందించేందుకు ఆలస్యం అవుతుందన్నారు. మండలంలో డీఏపీ బస్తా రూ.1350కు అమ్మాల్సి ఉండగా ప్రైవేటు డీలర్లు రూ.1400 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. – సారవకోట 3 రోజులుగా వస్తున్నా డీఏపీ కోసం ఆధార్ కార్డు జిరాక్స్ మూడు రోజుల కిందట సారవకోట పీఏసీఎస్లో అందించాను. మూడు రోజుల నుంచి రోజు వస్తున్నా ఒక్క బస్తా డీఏపీ దొరకలేదు. – కర్ణం అప్పారావు, రైతు, మొదలికొత్తూరు గ్రామం, సారవకోట మండలం -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
శ్రీకాకుళం రూరల్: కేంద్రియ విద్యాలయంలో మెరు గైన ఫలితాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాల ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చా రు. పీఎం కేంద్రియ విద్యాలయంలో గురువారం నిర్వహించిన విద్యాలయ నిర్వాహణ కమిటీ సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రవేశాలు, ఉత్తీర్ణత, క్రీడాపోటీలు, ఫ్యాకల్టీ తదితర అంశాలపై ఆరా తీశారు. జేఈఈ, బిట్సాట్, ఎంసె ట్, నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత వివరాలు అడిగి తెలుసు కున్నారు. విద్యార్థులకు ప్రతినెలా ఆరోగ్య తనిఖీలు చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. శ్రీకాకు ళం నుంచి కేంద్రియ విద్యాలయానికి ఉదయం, సాయంత్రం ఆర్టీసీ బస్సు తిరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థుల తరగతి గదులను పరిశీలించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్యా, డీఈవో రవిబాబు, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత తదితరులు పాల్గొన్నారు. -
నేడు పీడీఎస్యూ విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు
పలాస: కాశీబుగ్గలోని టి.కె.ఆర్.కల్యాణ మండపంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు పి.డి.ఎస్.యు. విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ చెప్పారు. గురువారం పలాస సూదికొండ కాలనీలోని సంఘం కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి ఎం.వినోద్తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులు, శాసీ్త్రయ, లౌకిక, ప్రజాస్వామిక విలువల పరిరక్షణపై విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని కల్పించడానికి ఈ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. పి.డి.ఎస్.యు.రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి.ప్రసాద్, భారత విద్యాహక్కుల వేదిక నాయకులు రమేష్ పట్నాయక్, ఎ.పి.టి.ఎఫ్. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సన్నశెట్టి రాజశేఖర్ తదితరులు పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. -
పరిహారం అందలేదు..!
కొత్తూరు: గతేడాది ఖరీఫ్ సీజన్లో అక్టోబర్ 3వ తేదీన వంశధార నదికి వచ్చిన వరదలు కారణంగా పంట లు నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం తీవ్రస్థాయిలో దగా చేసిందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. గత 15 ఏళ్లలో ఎన్నడూ రానంతటి వరద గతేడాది వచ్చింది. ఈ వరదలు వలన కొత్తూరు, హిరమండలం, ఎల్ఎన్పేట, సరు బుజ్జిలితో పాటు పలు మండలాల్లో సుమారు 35 వేలు ఎకరాల్లో వరి, చెరుకు, అరటి, మొక్కజొన్నతో పాటు పలు రకాల పంటలు నీటి మునిగిపోయా యి. అయితే నష్టపోయిన పంటలకు కూటమి ప్రభుత్వం నష్ట పరిహారాలు చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో వ్యవసాయ అధికారులు వరదలకు నష్టపోయిన పంటలను గుర్తించి, నివేదికలు ప్రభుత్వానికి పంపించారు. కానీ పంటలు నష్టపోయి తొ మ్మిది నెలలు దాటుతున్నా ఇంతవరకు ప్రభుత్వం పంట నష్ట పరిహారాలు చెల్లించలేదు. 2026 ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ పరిహారాలు చెల్లించకపోవడంతో కూటమి ప్రభుత్వం రైతులకు వెన్నుపోటు పొడిచిందని పలువురు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని చెప్పిన కూట మి నాయకులు, అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు పొడిచారు. వంశధార వరదలకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారాలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ చెల్లించకపోవడం దారుణం. ఇప్పటికై నా పరిహారాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలి. – సిరిపురం హరీష్, ఆర్కేపురం, కొత్తూరు మండలం వరదలకు నష్టపోయిన పంటలకు నష్ట పరిహారాలు చెల్లింపులో కూటమి ప్రభు త్వం రైతులను మోసం చేసింది. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. అయితే నేటకి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. – అగతమూడి రంజిత్, కుంటిభద్ర, కొత్తూరు మండలం -
దోపిడీ కేసు నిందితులకు రిమాండ్
కొత్తూరు: కొత్తూరు రాజవీధికి చెందిన లోతుగెడ్డ ధనుంజయ్ ఇంట్లో ఈ నెల మూడో తేదీ రాత్రి జరిగిన దోపిడీ కేసులో నిందితులను గురువారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ కె.వెంకటేష్ తెలిపారు. వీరిలో కొత్తూరుకు చెందిన సొంట్యాన నవీన్(దాస్), టొంపల వినయ్కుమార్, సిరువాడ గ్రామానికి చెందిన కొన్న తరుణ్, ఎల్ఎన్పేట మండలం గొట్టిపల్లి గ్రామానికి చెందిన కురమాన శ్రీనివాసరావులకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారని చెప్పారు. నలుగురు నిందితులను జిల్లా జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. సంతబొమ్మాళి: జీవనోపాధి కోసం జిల్లాకు వచ్చిన వలస కూలీ సంతబొమ్మాళిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉమారియా జిల్లా దడకా గ్రామానికి చెందిన పుష్పరాజ్ సింగ్, ధర్మపాల్ సింగ్లు ఆరు నెలల క్రితం భద్రాచలం నాగేశ్వరరావుకు చెందిన రంగనాథ బోర్ వెల్స్లో దినసరి కూలీలుగా చేరారు. దీనిలో భాగంగా బుధవారం రాత్రి సంతబొమ్మాళిలో బోరు వేసేందుకు వచ్చారు. భోజనాలు చేసి బహిర్భూమికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వేగంగా వెళ్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న పుష్పరాజ్సింగ్ మృతి చెందగా..వెనుక ఉన్న ధర్మపాల్సింగ్కు గాయాలయ్యాయి. ప్రమాదం గమనించిన స్థానికులు టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతబొమ్మాళి ఎస్సై వై.సింహాచలం గురువారం తెలిపారు. ఎచ్చెర్ల : సనపలవాని పేట సమీపంలో జాతీ య రహదారిపై గురువా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో లావేరు మండ లం మురపాక పంచా యతీ నాజానపేట గ్రామానికి చెందిన జగ్గురోతు రామారావు (40) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈయన తన భార్యతో కలిసి ఉదయం ఇంటి నుంచి బైక్పై బయల్దేరి పండిపేట వద్ద భార్యను దించాడు. డ్యూటీ నిమిత్తం సనపలవానిపేట వచ్చి తిరిగి వెళ్తుండగా చిలకపా లెం నుంచి రాగోలు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొనకోనడంతో ఈ ప్రమాదం సంభవించింది. రామారావుకు భార్య వరలక్ష్మీ, ఇద్దరు కుమారులు గిరిధర్, వెంకటేష్ ఉన్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ జ్ఞాపకాలు పదిలం
● జిల్లాలో అడుగడుగునా వైఎస్సార్ జ్ఞాపకాలు ● చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన దశాబ్దాల తరబడి పాలించలేదు. ఏళ్లకు ఏళ్లు అధికార పీఠంపై కూర్చోలేదు. ఆరంటే ఆరేళ్లు.. మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ ఆరేళ్ల కాలంలోనే జిల్లా తలరాతను మార్చే అపురూప ప్రాజెక్టులను కానుకలుగా ఇచ్చారు. పేదలకు గూడునిచ్చి జనబాంధవుడయ్యారు. నిరుపేద రోగుల ప్రాణాలు నిలిపారు. అన్నదాతకు అండగా నిలిచి వ్యవసాయాన్ని పండగ చేశారు. నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాలుగా పాలన సాగించి సిక్కోలు గుండెలో చిరస్థానం సాధించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రిమ్స్ ఆస్పత్రి.. వంశధార ప్రాజెక్టు.. తోటపల్లి జలాశయం.. ఆఫ్షోర్ ప్రాజెక్టు.. అంబేడ్కర్ యూనివర్సిటీ.. ఇవి మావి అని జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకునే ప్రాజెక్టులు. కేవలం ఆరేళ్ల పాలనా కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లాకు ఇచ్చిన కానుకలు ఇవి. వెనుకబడిన జిల్లా అనే ముద్రను తొలగించడానికి సీఎంగా ఆయన చేసిన ప్రయత్నాలివి. ప్రజల మేలు కోరిన పనిచేసినందుకే ఆయన మహా నాయకుడయ్యారు. జిల్లాలో ఆయన జ్ఞాపకాలు అడుగడుగునా కనిపిస్తాయి. నేడు వైఎస్సార్ జయంతిజిల్లాలో రాజన్న జ్ఞాపకాలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే విశాఖపట్నానికి పరుగులు తీసే శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఓ పరిష్కారం చూపారు. జిల్లా కేంద్రంలో పెద్దాస్పత్రి ఉండాల్సిందేనని భావించి ప్రజలు కోరకుండానే ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశా రు. మంజూరు ప్రకటన చేయడమే కాకుండా రూ. 119కోట్లు కేటాయించారు. 300 పడకల జిల్లా కేంద్రాస్పత్రిని 500 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేశారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవం రెండూ ఆయన చేతులమీదుగానే జరిగాయి. 13 ఆధునిక వసతులతో కూడిన భవనాలను మంజూరు చేసిన ఘనత వైఎస్సార్దే. నదులున్నా పొలాలు తడవని పరిస్థితి, భూములున్నా సాగు చేసుకోలేని దుస్థితి, సాగు చేద్దామని భావించినా అప్పు పుట్టని రోజులను వైఎస్సార్ చూశారు. అలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకున్న ఏకైక నేత వైఎస్సారే. 2.50లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశారు. అప్పటికే రుణాలు చెల్లించేసిన వారికి రూ. 5వేలు చొప్పున ప్రోత్సాహం అందించారు. 2005మే నెలలో వంశధార స్టేజ్ 2, ఫేజ్2 ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 20మండలాల్లో 2.55 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు తలపెట్టారు. జిల్లాలోని హిరమండలం వద్ద సుమారు 10వేల ఎకరాల్లో 19టీఎంసీల నీటి నిల్వకోసం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. తోటపల్లి ఫేజ్–2 పనుల ఘనత ఆయనకే దక్కుతుంది. సాగునీరు, పలాస పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 123.25కోట్లతో ఆఫ్షోర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 12,500 ఎకరాల సాగునీటి కోసం మడ్డువలస ప్రాజెక్టు స్టేజ్–1 పనులను చేపట్టారు. నాగావళి, వంశధార నదుల వరద ఉద్ధృతి నుంచి పంట పొలాలను, ఆవాసాలను రక్షించేందుకు రూ. 300కోట్లతో కరకట్టల నిర్మాణాలకు సంకల్పించారు. సీతంపేట ఏజెన్సీలో 14 వేల ఎకరాల్లో 5వేల మందికి గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చారు. ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వైఎస్సార్ భావించారు. దానిలో భాగంగా జిల్లాకు యూనివర్సిటీని అందించారు. ఎచ్చెర్లలో 2008 జూలై 25న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నత విద్యావేత్తలుగా యూనివర్సిటీ తీర్చిదిద్దుతోంది. -
శక్తి చాలడం లేదు
బస్సెక్కడానికి.. పల్లె వెలుగులు పెంచాలి మారుమూల గ్రామాల్లో విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే సరైన బస్సు సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్కు, సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించాం. – కుమరాపు యమున, డీఆర్వలస, జి.సిగడాం అదనపు బస్సులు నడపాలి శ్రీకాకుళం డిపో నుంచి రాజాం వరకు ప్రత్యేక బస్సులు నడపాలి. సీ్త్ర శక్తి పథకం ద్వారా విద్యార్థులు సకాలంలో విద్యాలయాలను చేరలేకపోతున్నారు. తక్షణమే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలి. – వాన ప్రమీల, ఎందువ, జి.సిగడాం సీటు దొరికితే ఒట్టు.. ఉచిత బస్సులను ప్రభుత్వం ప్రవేశ పెట్టి ఆడవాళ్లుకు ఉచితంగా ప్రయాణం చేసేందుకు వీలు కల్పించింది. అయితే బస్సులు సమయానికి లేకపోవడం దానికి తోడు బస్సులు సైతం తక్కువగా ఉండటంతో ఉన్న బస్సులలో ఎక్కువ మంది ప్రయాణిస్తుండడంతో కూర్చునేందుకు సైతం సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నాం. –ఎన్ చిన్నమ్మి బూరగాం గ్రామం జి.సిగడాం: పొగిరి జంక్షన్ వద్ద నిత్యం ఇదే పరిస్థితిసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ జి.సిగడాం : కూర్చుందామంటే సీటు దొరకదు.. కుదురుగా నిలబడదామంటే ఆ రద్దీలో కుదరదు. అటు కూర్చోలేక.. నిటు నిలుచోలేక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు నరక ప్రాయంగా మారాయి. సీ్త్ర శక్తి పథకం అమలు జరిగాక బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. రద్దీ పెరిగాక బస్సుల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోవడంతో రోజూ ప్రయాణాలు చేసే వారు ఒళ్లు హూనం చేసుకుంటున్నారు. బస్సు ఆపడమే లేదు.. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయకముందు రూట్లలోని చిన్న పల్లెలు, పట్టణ శివార్లలోని చాలా చోట్ల ఆర్టీసీ బస్సులను ఆపేవారు. ప్రస్తుతం ప్రారంభ బస్టాండుల్లోనే ప్రయాణికులు నిండిపోవడంతో దారి మధ్యలో ఎక్కడా బస్సు చెయ్యెత్తినా ఆపడం లేదు. బస్టాండ్లలోనూ బస్సెక్కేటప్పుడు సిగపట్లు తప్పడం లేదు. అన్నీ పాత బస్సులే.. జిల్లాలో రోజుకి లక్షా 40వేల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సీ్త్ర శక్తి ద్వారా 70 వేల నుంచి 80 వేల మంది మహిళలు, టిక్కెట్ ద్వారా ప్రయాణిస్తున్న వారు 60వేల నుంచి 70వేల మంది వరకు ఉన్నారు. పాత బస్సులు నిరంతరం తిరగడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తి షెడ్డుకు చేరుతున్నా యి. ఫలితంగా బస్సుల కొరత ఏర్పడుతోంది. ఓవర్ లోడ్ రద్దీ కారణంగా బస్సుల బాడీ, సస్పెన్షన్, ఇంజన్ కండిషన్ పూర్తిగా దెబ్బతింటోందని అద్దె బస్సుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత వందలాది మంది డ్రైవర్లు, కండక్టర్లు పదవీ విర మణ పొందుతున్నా ఆ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం పెరుగుతోంది. రద్దీగా ఉండే బస్సుల్లో అందరికీ జీరో టిక్కెట్లు జారీ చేయడం, ఐడీ కార్డులు తనిఖీ చేయడం కండక్టర్లకు కష్టంగా మారుతోంది. ఇక ఈ పథకం పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ వంటి సర్వీసులకు మాత్రమే వర్తిస్తుంది. నాన్ స్టాప్, లగ్జరీ, డీలక్స్ బస్సులకు వర్తించదు. దీనిపై అవగాహన లేక చాలామంది మహిళలు ఈ బస్సులు ఎక్కి కండక్టర్లతో ఉచితం కోసం వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ సందడిలో దొంగలు కూడా హస్త లాఘవం చూపుతున్నారు.శ్రీకాకుళం కాంప్లెక్స్లో అవస్థలుబ్యాగు వేస్తేనే సీటు బస్సెక్కాలంటే భయపడుతున్న ప్రయాణికులు విపరీతంగా పెరిగిపోయిన రద్దీ రద్దీ బస్సుల్లో దొంగతనాలు బస్సుల సంఖ్య పెంచకపోవడంపై జనం మండిపాటు విద్యార్థులకు ఇబ్బంది మారుమూల పల్లెల్లో ఉన్న విద్యార్థులకు ప్రయాణం సదుపాయం లేదు. గతంలో జి.సిగడాం మండలానికి 5 బస్సులు నడిపేవారు. ప్రస్తుతం గెడ్డకంచరాం తప్ప ఏవీ అందు బాటులో లేవు. – కంది రమాదేవి, ఎస్పీఆర్పురం, జి.సిగడాం -
అక్రమంగా యూరియా విక్రయం
నందిగాం: మండలంలోని బెజ్జిపల్లి రైతు సేవా కేంద్రంలో ఖరీఫ్ వరి పంటకు సంబంధించిన ఎరువులను మంగళవారం పంపిణీ చేశారు. మండల వ్యవసాయధికారి శ్రీకాంత్ వర్మ ఆధ్వర్యంలో లట్టిగాం, దిమిలాడ పీఏసీఎస్ అధ్యక్షులు పినకాన అజయ్కుమార్, పోలాకి చంద్రశేఖర్లు ఈ పంపిణీని ప్రారంభించారు. ఎరువులను కూడా ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయాధికారి తెలియజేశారు. గత ఏడాది యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడగా, ఈ ఏడాది యూప్ ద్వారా ఎరువుల పంపిణీతో మరిన్ని ఇబ్బందులు తప్పవని రైతులు వాపోతున్నారు. కణితూరులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడు యూరియాను అక్రమంగా తన ఇంటిలో నిల్వ చేసుకొని గత మూడు రోజులుగా రహస్యంగా అమ్మకాలు చేపడుతున్నారు. బెజ్జిపల్లి, పెంటూరుకు చెందిన పలువురు రైతులకు యూరియా అక్రమంగా విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు అధికారికంగా రైతు సేవా కేంద్రంలో ఎరువుల పంపిణీ మంగళవారం ప్రారంభించగా, కణితూరు ఆసామి రహస్యంగా యూరియా అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. -
ఎవరెవరు ఎటు వైపో..?
● జిల్లా పోలీసు సిబ్బందిపై విభజన ప్రభావం ● జిల్లాలో 20 హెడ్కానిస్టేబుళ్లు, 5 ఏఎస్ఐ స్థానాలు ఖాళీ ● ప్రమోషన్ల డేటా అంతా విజయవాడలోనే.. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాల విభజన ప్రక్రియ ప్రభావం.. ఇప్పుడు కానిస్టేబుళ్లు, హెడ్కానిస్టేబుళ్ల ప్ర మోషన్లపై ఉత్కంఠ రేపుతోంది. ఎవరికి ప్రమోషన్ లభిస్తుందో.. ఎవరు ఏ జిల్లాకు వెళ్లాల్సి వస్తుందో అంతా విజయవాడ మంగళగిరి కేంద్రంగా ఈనెల 12నే తేలనుంది. ఆప్షనల్ అయినా, మ్యూచువల్ అయినా గూగుల్ షీట్లోనే డేటా అంతా పొందుపర్చడంతో విజ్ఞప్తులైనా, వినతులైనా అక్కడే తేలాల్సి ఉండడంతో అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మంగళవారం జిల్లా పోలీసుకార్యాలయం నుంచి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, అదనపు ఎస్పీ కేవీ రమణ (అడ్మిన్)లు జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించి ఆయా స్టేషన్ల పరిధి సిబ్బంది సాధకబాధక వివరాలు క్షుణ్ణంగా తెలుసుకున్నారు. దీనిపై ఎక్కువ శాతం మంది మ్యూచువల్, రిక్వెస్టు ప్రాతిపదికన చేస్తే మేలు చేసేవారవుతారని వారి వారి అభిప్రాయాలు విన్నవించుకున్నారు. జిల్లాలో దాదాపు 900 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 200 మంది హెడ్కాస్టేబుళ్లు ఉన్నారు. ఏఆర్కు సంబంధించి మరో 200 మంది ఉన్నారు. వీరు ఏటా 10 శాతం మంది సివిల్ విభాగంలోకి ప్రమోషన్లపై వచ్చేస్తారు. అయితే బైఫరికేషన్ అయ్యాక మన శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లా కు రాజాం అర్బన్, రాజాం రూరల్, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, వంగర వెళ్లిపోగా.. మన్యం–పార్వతీపురం జిల్లాకు దోనుబాయి, సీతంపేట, బత్తిలి, వీరఘట్టం, పాలకొండ స్టేషన్లు కేటాయించారు. అప్పట్లోనే బదిలీల సర్దుబాట్లు రేషియో ప్రకారం చేయడం, అక్కడి వారు ఇక్కడికి ఇక్కడ వాళ్లు అక్కడ చేరారు. ప్రస్తుతానికి జిల్లాలో హెడ్ కానిస్టేబుళ్ల ప్రమోషన్ల జాబితాలో 20 ఖాళీలుండగా, ఏఎస్ఐల ప్రమోషన్ల జాబితాలో 10 ఖాళీల్లో 5 ఖాళీలను ఇటీవలే భర్తీ చేశారు. మిగతా 5 ఖాళీలు ఉన్నాయి. ఎవరికి మోదం.. ఎవరికి ఖేదం ఈ నెల 5 తర్వాత ఎలాంటి ప్రమోషన్లు ఇవ్వకూడదని.. ఇచ్చేదున్నా 5వ తేదీ లోపేనని, తర్వాత ఫ్రీజింగ్ ఉల్లంఘనకు వస్తుందని చెప్పిన ప్రభుత్వం ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో ఈనెల 12 వరకు గడువిచ్చింది. దీంతో ఈలోగైనా 20 హెచ్సీ, 5 ఏఎస్ఐ ప్రమోషన్లు ఇస్తే బాగుంటుందని బాహాటంగానే అధికారులతో సిబ్బంది జూమ్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. సర్దుబాట్లలో భాగంగా కచ్చితంగా ప ది శాతం మంది మన జిల్లా నుంచి, పదిశాతం విజయనగరం జిల్లా నుంచి మన్యం జిల్లాకు రేషియో ప్రకారం బదిలీపై వెళ్లాల్సి ఉంటుంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం జూనియర్లు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వెళ్లాల్సి ఉండటంతో పాటు మొదట పనిచేసిన ప్లేసులోనూ జూనియర్గాను, తర్వాత చేరే ప్లేసులోనూ జూనియర్గానే కెరీర్ ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. -
సరుకు నిల్వల బోర్డులను ప్రదర్శించాలి
పొందూరు: మండల రేషన్ సరుకుల నిల్వల కేంద్రం, రేషన్ డిపోల వద్ద తప్పనిసరిగా సరుకు నిల్వల బోర్డులను ప్రదర్శించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఎంఎల్ఎస్ పాయింట్ను సందర్శించి గోదాంలో సరుకుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ సిలిండర్లను సకాలంలో పంపిణీ చేయడం లేదని, బ్లాక్ మార్కెట్లో మాత్రం అధిక ధరలకు యథేచ్ఛగా దొరుకుతుందంటూ పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో అటుగా వెళ్తున్న గ్యాస్ సిలిండర్ వాహనాన్ని నిలిపి డెలివరీ బాయ్ వద్ద స్లిప్పులను పరిశీలించి డీఎస్వో సూర్యప్రకాశ్తో మాట్లాడారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఆహార నాణ్యతను పరిశీలించారు. అలాగే పొందూరులోని పలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం కాకుండా రేషన్ బియ్యం సరఫరా చేయడంపై ఆఽశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు తహసీల్దార్ వెంకటేష్, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీరాములు, డీటీ తిరుపతిరావు తదితరులు ఉన్నారు. -
ఐసీడీఎస్లో వసూళ్ల పర్వం..!
సారవకోట: మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో అంగన్వాడీ కార్యకర్తల నుంచి వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు పరిధిలో సారవకోట, జలుమూరు మండలాల్లోని 193 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. 2024 డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ప్రీస్కూల్ పిల్లలకు భోజనాలు పెట్టేందుకు అంగన్వాడీ కార్యకర్తలు చేతిలో డబ్బులు ఖర్చు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆరు నెలలకో, ఏడాదికో ఒకసారి బిల్లులు మంజూరు చేస్తుంది. దీంతో ఆయా కార్యకర్తలు వాటిని తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల నిధులు జమ ఇటీవల సారవకోట కార్యాలయం నుంచి అంగన్వాడీ కార్యకర్తలు ఖర్చుపెట్టిన సొమ్మును ప్రభుత్వ నిబంధనల మేరకు ఖాతాలకు జమ చేశారు. వాటితో పాటు అద్దె భవనాల్లో నిర్వహించే అంగన్వాడీలకు అద్దె డబ్బులు సైతం విడుదల చేశారు. అయితే ఆయా కార్యకర్తలకు జమ అయ్యే బిల్లుల ప్రాప్తికి దాంట్లో 10 శాతం కార్యాలయానికి అందజేయాలని సారవకోట, జలుమూరు మండలాల్లో ఉన్న 8 సెక్టార్ల లీడర్లకు ఈ బాధ్యతను సంబంధిత కార్యాలయ సిబ్బంది అప్పగించినట్లు తెలుస్తోంది. ఏ కార్యకర్త ఎంత ముట్టజెప్పాలో తెలిపే జాబితాలు లీడర్లుకు అందజేశారు. దీంతో ఆయా లీడర్లు వారి సెక్టార్ వాట్సాప్ గ్రూపుల్లో వాయిస్ మెసేజ్లు, జాబితాలు షేర్ చేశారు. కొన్ని సెక్టార్ల లీడర్లు ఇప్పటికే డబ్బులు వసూలు చేయగా, మరికొన్ని సెక్టార్ల లీడర్లు వసూలు చేస్తున్నారు. అయితే కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు ఈ పర్సంటేజీలు ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్నారు. కూరగాయల కోసం ప్రభుత్వం మంజూరు చేసే బిల్లు తక్కువగా ఉందని, కానీ మార్కెట్లో కూరగాయల రేట్లు అధికంగా ఉన్నాయని బిల్లులు కూడా ఎన్నో నెలలకు ఒకసారి మంజూరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో ఎలా పర్సంటేజీలు ఇవ్వగలమని వాపోతున్నారు. రూ.2 లక్షల వరకు వసూలు..? ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు చెల్లించిన కూరగాయలు, అద్దె భవనాల బిల్లుల నుంచి సుమారు రూ.2 లక్షల వరకు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులను కార్యాలయ సిబ్బంది ఎవరి జేబులు నింపడానికి వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంటలజెన్స్ వాళ్లు ఆరా తీస్తున్నారు. కాగా ఈ విషయంపై సారవకోట ఐసీడీఎస్ సీడీపీవో వంశీ ప్రియను వివరణ కోరగా.. బిల్లులు తాము ట్రెజరీకి పంపిస్తున్నామని, వారు కొర్రీలు పెట్టి తిరిగి పంపిస్తున్నారని తెలిపారు. ట్రెజరీ వారికిచ్చేందుకు తాము వసూలు చేస్తున్నామని వెల్లడించారు. -
● నాటి నిర్ణయం.. నేటి ఆదర్శం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయం.. నేడు ఫలాలను అందిస్తోంది. టెక్కలి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 2021–22 సంవత్సరంలో ప్లస్–2 జూనియర్ కళాశాలను ప్రారంభించారు. ముందుగా బైపీసీ, ఎంపీసీ గ్రూప్లతో ప్రారంభమైన ఈ కళాశాల ఇప్పుడు దినదిన ప్రవర్ధమానమై ఎదిగింది. ద్వితీయ సంవత్సరంలో 80 సీట్లు పూర్తవ్వగా.. ప్రథమ సంవత్సరానికి సంబంధించి మరో 5 సీట్లు పెంచితే ఆ 85 సీట్లు కూడా పూర్తయ్యాయి. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి నో మోర్ అడ్మిషన్స్ అంటూ బోర్డు ఏర్పాటు చేశారు. – టెక్కలి రూరల్ -
దేవాలయంలో దొంగలు పడ్డారు
వజ్రపుకొత్తూరు: మండలంలోని పూండి ఉమాకామేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలుపడ్డారు. సోమవారం రాత్రి రెక్కీ నిర్వహించిన దొంగలు, అనంతరం రాత్రి 12.05 గంటల తర్వాత చోరీకి పాల్పడ్డారు. స్టీల్ హుండీ తలుపు పగలుగొట్టి రెండేళ్లుగా భక్తుల నుంచి వచ్చిన విరాళాలు సుమారు రూ.60 వేలు, అమ్మవారి విగ్రహానికి వేసిన రూ.2 వేలు విలువ చేసే బంగారం పుస్తెను దోచుకున్నారు. మంగళవారం వేకువజామున ఆలయ అర్చకుడు ఎస్.ధర్మలింగం ఆలయానికి వచ్చేసరికి హుండీ చోరీకి గురైనట్లు గుర్తించి ఆలయ ట్రస్టీలకు తెలిపారు. వారు పరిశీలించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెక్కీ నిర్వహించి చోరీ పూండి రైల్వేస్టేషన్ సమీపంలోని సంత మెదానం వద్ద శివాలయం ఉంది. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలు సోమవారం జరిగిన భజన కార్యక్రమంలో పాల్గొని రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డారు. రెండేళ్లు నుంచి ఆలయ హుండీని ట్రస్టీలు లెక్కించ లేదు. హుండీలో దాదాపు రూ.60 వేలు వరకు నగదు ఉంటుందని అంచనా. అయితే సోమవారం భజన జరుగుతున్న సందర్భంగా ఓ అగంతుకుడు వచ్చి హుండీలో ఒక నాణెం వేసి నగదు ఉందా లేదా అనేదానిపై అంచనా వేసి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆలయ అర్చకుడు ధర్మలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వజ్రపుకత్తూరు ఎస్ఐ బి.నిహార్, శ్రీకాకుళం నుంచి వచ్చిన క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. దుండగులు పట్టుకున్న ఆలయ తలుపులు, స్టీల్ గ్రిల్స్పై క్లూస్ టీం సభ్యులు వేలిముద్రలు సేరించారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు సేకరించారు. ఆలయాన్ని కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ, సీఐ తిరుపతి పరిశీలించి రెండు రోజుల్లో దొంగలను పట్టుకుని తీరుతామని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీ, వేలిముద్రల ఆధారంగా దర్మాప్తు చేపడుతున్నామని ఎస్ఐ బి.నిహార్ వెల్లడించారు. ఏడాది క్రితం దొంగతనం కాగా ఇదే ఆలయంలో ఏడాది కిందట చోరీ జరిగింది. అప్పుడు శివలింగంకు అలంకరించిన నాగాభరణం, ఇతర విలువైన ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారు. అప్పట్లో ఈ దొంగతనం సంచలనం కలిగించగా.. పోలీసులు ఆభరణాలను రికవరీ చేసి ట్రస్టీలకు అప్పగించారు. అప్పట్లో దొంగలు శివాలయంలో ఉన్న సీసీ ఫుటేజీ నిక్షిప్తమైన డీవీర్ను సైతం తమతో పాటు ఎత్తుకెళ్లారు. కాాగా ఇప్పుడు వారం రోజుల క్రితం జరిగిన చైన్ స్నాచింగ్ ఉదంతం మర్చిపోక ముందే మళ్లీ శివాలయంలో చోరీ జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. -
ప్రశ్నించే గొంతులను కేసులతో అణచలేరు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): యూట్యూబర్ ప్రశ్న రావణ్పై రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టం పెట్టడాన్ని ఖండిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.నాగభూషణం, జిల్లా కార్యదర్శి సీహెచ్ రవికుమార్ మాట్లాడుతూ ప్రశ్న రావణ్ను జైలుకు పంపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గమని, ఈ చట్టం ఏరకంగా వర్తిస్తుందో పోలీసు యంత్రాంగమే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ప్రజాసంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఒకవైపు కోరుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న కారణం చూపి ఉపా చట్టం నమోదు చేయడం తగదన్నారు. తమను ఎవరైనా ప్రశ్నిస్తే జైల్లో పెడతామనే హెచ్చరిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఇటువంటి చర్యలకు పూనుకోవడం విచారకరమన్నారు. దేశంలో ఎక్కడా విమర్శలు చేసినవారిపై ఉపా చట్టం ఉపయోగించిన దాఖలాలు లేవని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించి ప్రశ్న రావణ్పై ఉపా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, జిల్లా నాయకులు రాజు, సాయి, పవన్ కల్యాణ్, కార్తిక్, కౌశిక్, హర్ష, విజయ్ మనోహర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
రవై రెండు ప్రమాదాలు..!
ర కిలోమీటరు..ఆమదాలవలస రూరల్: అర కిలోమీటర్ రహదారిలో సుమారు 62 ప్రమాదాలు ఇటీవల కాలంలో జరగడం అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇసుక మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతుండడంతోనే ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆమదాలవలస రూరల్ మండలంలోని కొత్తవలస నుంచి రాగోలు వరకు సుమారు 10 కి.మీ దూరం ఉంటుంది. దీని మధ్యలో నారిపేట, ఇసుకలపేట, దిబ్బలుపేట గ్రామాలు పక్కపక్కనే అర కిలోమీటర్ పరిధిలో ఉంటాయి. ఈ ప్రాంతంలోనే అధికంగా ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా కారణంగా అధికంగా లారీలు, ట్రాక్టర్లు లోడ్ చేస్తున్నారు. ఆ ఇసుక ఈ ప్రాంతంలో రహదారి మీద పడుతుండడంతో బైక్పై వెళ్లినవారు బోల్తాపడక తప్పడం లేదు. ఇటీవల ఆమదాలవలస రూరల్ మండలం కనుగులువలస గ్రామానికి చెందిన గోల్లపల్లి తవుడు బైక్పై వస్తుండగా బోల్తాపడి తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. అలాగే తొగరాం గ్రామానికి చెందిన ముక్కు రమణమూర్తి, మంతిరెడ్డి కృష్ణ, గురుగుబెల్లి కృష్ణంరాజు, దూసిపేట గ్రామానికి చెందిన బుడుమూరు సాగర్ ఇలా అనేక మంది ఈ అర కిలోమీటర్ పరిధిలోనే ప్రమాదాల బారినపడ్డారు. ఇక ఈ రహదారి పొడవునా చూసుకుంటే వందల సంఖ్యలో ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. రెచ్చిపోతున్న ఇసుక మాఫియా ఆమదాలవలస రూరల్ మండలంలో రోజుకు వందల లారీలు ద్వారా నాగావళి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిపోతోంది. పాతూరు, కొత్తవలస, ముద్దాడపేట, పెద్దదూసి తదితర ప్రాంతాల్లో అక్రమ ఇసుక ర్యాంపులు కొనసాగుతున్నాయి. ఒకపక్క రహదారులు రూపురేఖలు కోల్పోతున్నా.. పలు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నా అక్రమ ఇసుక రవాణాకు అడ్డు లేకుండా పోతోంది. చివరకు ప్రజల ప్రాణాలు పోయినా అక్కడ లారీలను ఆపేవారు లేకుండా పోయారు. నేతల అండదండలు ఉండడంతో వారు చెప్పిందే వేదంగా ఇక్కడ కొనసాగుతోంది. దూసిపేట గ్రామం వద్ద ఒకరికి తీవ్రగాయాలై గ్రామస్తులు లారీలను అడ్డుకున్నారు. అయితే నేతల రంగ ప్రవేశంతో గంటల వ్యవధిలోనే లారీలను తరలించడం గమనార్హం. ప్రాణ భయంతో ప్రయాణాలు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా వలన కొత్తవలస నుంచి రాగోలు వరకు సుమారు 10 కిలోమీటర్లు పొడవున రహదారి రూపురేఖలు కోల్పోయింది. అలాగే రహదారి పొడవునా ఇసుక జారిపడి ద్విచక్ర వాహనాలు, మిగతా వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలబారిన పడుతున్నారు. దీంతో ఈ రహదారిపై ప్రాణభయంతో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బయటకు వెళ్లిన వ్యక్తులు ఎప్పుడు తిరిగి వస్తారోనని కుటుంబ సభ్యులు ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కనీసం రహదారిపై జారిపడిన ఇసుకను పక్కకు తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులకు పట్టడం లేదు. అందువలన ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
మోడ్రన్ పెంటాథ్లెన్ లేజర్ రన్ ఎంపిక పోటీలు రేపు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా మోడ్రన్ పెంటాథ్లెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోడ్రన్ ఫెంటాథ్లెన్ లేజర్ రన్ ఎంపిక పోటీలు గురువారం జరగనున్నాయని ఆ సంఘ ప్రధాన కార్యదర్శి పీవీజే కృష్ణంరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల వర్షం కారణంగా పోటీలను వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజాంలోని జీసీఎస్ఆర్ డిగ్రీ కళాశాల వేదికగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాస్థాయి ఎంపికలు ఉదయం 9 గంటలకు మొదలవుతాయని పేర్కొన్నారు. బాలబాలికలు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో ఎంపికలకు హాజరవ్వాలని సూచించారు. తప్పిన పెను ప్రమాదం పొందూరు: మండలంలోని వావిలపల్లిపేట కూడలి వద్ద మంగళవారం పెను ప్రమాదం తప్పింది. రాజాం వైపు నుంచి చిలకపాలెం వైపు వెళ్తున్న ఊకలారీ కూడలి వద్ద రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కూడలి చిన్నది కావడంతో భారీ లారీ మలుపును దాటుతున్న సమయంలో అదుపుతప్పి తొలుత ఒరిగి నెమ్మదిగా రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో రెండు వైపులా ప్రయాణిస్తున్న వాహనదారులు గమనించి, వారి వాహనాలను నెమ్మదిగా చేయడంతో ప్రమాదం బారిన పడకుండా తప్పించుకున్నారు. ఘటనలో లారీలో ఉన్న డైవర్, క్లీనర్కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఊక లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో కిలోమీటరు కంటే ఎక్కువగా వాహనాలు నిలిచిపోయాయి. కళాశాల బస్సులు, స్కూలు బస్సులు, అంబులెన్సులు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. సుమారు గంట సమయం పాటు వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పొందూరు ఎస్ఐ సత్యనారాయణ రెండు క్రేన్లు తెప్పించి లారీని పక్కకు తీయించారు. దీంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యింది. విషం తాగి ఆత్మహత్యాయత్నం అడ్డగుట్ట: రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు విషం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా చాపర గ్రామానికి చెందిన శ్రీరామ్ శిరీష్కుమార్కు సులోచనతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. రెండు నెలలుగా శ్రీరామ్ సతీష్ తన గ్రామానికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత నెలలో వీరిద్దరూ కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తమిళనాడులోని కోయింబత్తూర్కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో తన భర్త ఆచూకీ తెలుసుకున్న సులోచన కోయింబత్తూర్కు వెళ్లి సతీష్, మరో మహిళను పట్టుకుంది. వారితో మాట్లాడి ముగ్గురూ కలిసి కోయింబత్తూర్ నుంచి సికింద్రాబాద్కు శబరి ఎక్స్ప్రెస్లోని జనరల్ కోచ్లో బయల్దేరారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు రైలు చేరుకుంటున్న సమయంలో సతీష్, అతనితో ఉన్న మహిళ విషం తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేసి, పాత రిజిస్ట్రేషన్ విధానాన్నే కొనసాగించాలని దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెన్డౌన్ నిర్వహించి నిరసన తెలిపారు. జీవో 396 అమలుతో రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణకు మార్గం సుగమమవుతుందని, దీంతో దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, సహాయకులు, డీటీపీ ఆపరేటర్ల ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత విధానాన్ని కొనసాగిస్తూ లైసెన్సులు మంజూరు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేసి సంప్రదాయ వృత్తులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు పిన్నింటి శ్రీను, ఆవాల రాము, అన్నెపు సీతారాం, భువన మోహన్, బలగ చంటి, అల్లు రాజారావు, కుమారస్వామి, కామేశ్వరరావు, ఇప్పిలి శ్రీను, సంతోష్, పాత్రో తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులను బదిలీ చేయొద్దు
టెక్కలి రూరల్: మండలంలోని బొరిగిపేట ప్రాథమికోన్నత పాఠశాలలో టీచర్ల సర్ధుబాటు ప్రక్రియ గ్రామస్తుల్లో ఆందోళనకు దారితీసింది. తమ పాఠశాల ఉపాధ్యాయులను సర్ధుబాటు ప్రక్రియలో భాగంగా వేరే పాఠశాలకు పంపించడం సమంజసం కాదని, తమ పాఠశాలలో ఉపాధ్యాయులు పాఠశాలలోనే ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పాఠశాల ముందు మంగళవారం ఆందోళన చేపట్టారు. అనంతరం టెక్కలి మండల విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బొరిగిపేట ప్రాథమికోన్నత పాఠశాలలో 66 మంది విద్యార్థులు ఈ ఏడాది ఉన్నారు. వీరిలో 39 మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కాగా, 27 మంది ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలలో 31 మంది విద్యార్థులు కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే పాఠశాలలో ఉపాధ్యాయులను సద్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పాఠశాలలో ఉన్న నలుగురు స్కూల్ అసిస్టెంట్లకు గానూ ఇద్దరు ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పాఠశాల వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. తమ ఊరులో పాఠశాల ఉండాలనే ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను సైతం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామని తెలిపారు. ఒకవేళ ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు బదిలీ చేసినట్లయితే వెంటనే విద్యార్థులకు టీసీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు దాట్ల దాశరథి, దాసుపురం చిన్నారావులు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉపాధ్యాయుల పని సద్దుబాటు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. గ్రామస్తుల డిమాండ్ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉపాధ్యాయులను నియమించే విధంగా చూస్తామని తెలిపారు. -
ఘనంగా వైశ్యరాజు జ్యూయలర్స్ 8వ వార్షికోత్సవం
మహారాణిపేట (విశాఖ): నగరంలోని ఆశీలమెట్టలో ఉన్న వైశ్యరాజు జ్యూయలర్స్ షోరూమ్ 8వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ వైశ్యరాజు ఫాల్గుణ రాజు, మేనేజింగ్ డైరెక్టర్ వైశ్యరాజు భద్రగిరి రాజు, ప్రతినిధులు వైశ్యరాజు నరేష్ రాజు, వైశ్యరాజు కిరణ్ కుమార్ రాజు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. వినియోగదారుల విశ్వాసం, ఉద్యోగుల అంకితభావం వల్లే సంస్థ ఎనిమిదేళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుందన్నారు. వార్షికోత్సవం పురస్కరించుకుని వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. అన్ని రకాల 22 క్యారెట్ (916) హాల్మార్క్ బంగారు ఆభరణాలపై కేవలం 3 శాతం నుంచి 6 శాతం వరకు మాత్రమే మేకింగ్ చార్జీలు వర్తిస్తాయని వెల్లడించారు. అలాగే కిలో లేదా అంతకంటే ఎక్కువ వెండి వస్తువులు కొనుగోలు చేసే వారికి రూ.15,000 వరకు ప్రత్యేక తగ్గింపు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్లు జులై 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం కోరింది. -
నాగన్న గానం ప్రజా ఉద్యమాలకు ఉత్తేజం
పలాస: ప్రజా ఉద్యమాలకు కామ్రేడ్ నాగన్న గానం ఉత్తేజమని, సాంస్కృతికోద్యమాన్ని బలోపేతం చేయడమే నాగన్నకు మనమిచ్చే నిజమైన నివాళి అని వివిధ విప్లవ ప్రజా సంఘాల నాయకులు అన్నారు. మండలంలోని బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం వద్ద నాగన్న సంతాప సభను మంగళవారం నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సంతాప సభకు ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు సొర్ర రామారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అరుణోదయ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ.. నాగన్న జీవిత విశేషాలను వివరించారు. అతి పేద కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థాయి కళాకారుడుగా ఎదిగిన క్రమాన్ని చెప్పారు. సీపీఎం ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నియమ నిబంధనలను దాటలేదన్నారు. గాయకునిగా సినీ అవకాశాలు వచ్చినా.. పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఆర్.నారాయణమూర్తి సినిమాకు పాట పాడారని గుర్తు చేశారు. శ్రీకాకుళం పోరాటాన్ని కీర్తిస్తూ ఆట పాటలతో జనాలను ఉర్రూతలూగించారని పేర్కొన్నారు. ఆయన లేని లోటు ప్రజా ఉద్యమాలకు, ముఖ్యంగా సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, విప్లవ పార్టీల నాయకులు వంకల మాధవరావు, జోగి కోదండరావు, పత్తిరి దానేసు, తామాడ సన్యాసిరావు, కుత్తుం వినోద్, నిశితాసి, పుచ్చ దుర్యోధనరావు, ఎస్.సోమేశ్వరరావు, కొర్రాయి నీలకంఠం, ఎం.వినోద్, పి.కుసుమ, కృష్ణవేణి, నేతింటి నీలంరాజు, గొరకల బాలకృష్ణ, జుత్తు వీరాస్వామి, సాలిన వీరాస్వామి, సార జగన్, బి.ఈశ్వరమ్మ, వంకల పాపయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నాగన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
కార్యాలయాల తరలింపుపై అసంతృప్తి
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో 1971 నుంచి కొనసాగుతున్న ఏఈఎన్, ఐవోడబ్ల్యూ కార్యాలయాలను పలాసకు తరలించేందుకు దక్షిణ తూర్పు రైల్వే అధికారులు పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. దీంతో తరలింపు చర్యలు చేపట్టడానికి అధికారులు సమాయత్తం కావడంపై రైల్వే ఉద్యోగులు, ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1971వ సంవత్సరంలో అప్పటి ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు కృషితో శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్లో పలు కార్యాలయాల నిర్మాణాలు జరిగాయని, నేడు ఆ ప్రభ మసకబారుతుందని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలో ఈ రెండు కార్యాలయాలు ఉండడం వలన రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లోని సుమారు 60 షాపుల నిర్వహణ, రైల్వే నిర్మాణ పనులు, నీటి సరఫరా, ట్రాక్ల నిర్వహణ వంటి పనులు సకాలంలో జరుగుతున్నాయి. అలాగే పొందూరు నుంచి పూండి వరకు రైల్వే పరిధిలో జరిగే అభివృద్ధి, నిర్వహణ కార్యక్రమాలను ఈ కార్యాలయాలే పర్యవేక్షిస్తున్నాయి. ఈ కార్యాలయాలను పలాసకు తరలిస్తే పొందూరు నుంచి పూండి వరకు ఉన్న ప్రజలు, విశ్రాంత రైల్వే ఉద్యోగులు రైల్వే సంబంధిత అవసరాల కోసం సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని పలాసకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న వేళ, ఇక్కడి కీలక కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించడం స్టేషన్ ప్రాధాన్యాన్ని తగ్గించే చర్యగా అభిప్రాయపడుతున్నారు. -
జీవో నంబర్ 396ని రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): దస్తావేజు లేఖరుల పొట్టకొట్టే జీవో నంబర్ 396ను అమలు చేసే ఆలోచన విరమించుకోవాలని శ్రీకాకుళం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ దస్తావేజు లేఖరులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖలో స్థిరాస్తుల కోసం దస్తావేజు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమవుతున్న జీవోను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం పట్టణ దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, లేఖరుల సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలియజేశారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నోతరాల నుంచి దస్తావేజు లేఖరులకు ప్రభుత్వం దస్తావేజు లైసెన్సులు మంజూరు చేసిందన్నారు. అయితే సుమారు 2000వ సంవత్సరం నుంచి లైసెన్స్లు రెన్యూవల్ చేయక నిలుపుదల చేశారని పేర్కొన్నారు. ఈ జీవో వలన అనేక మంది రోడ్డున పడే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన ప్రభుత్వం న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళన బాట తప్పదని పేర్కొన్నారు. కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్స్, డీటీపీ ఆపరేటర్లు ఎన్వీ కామేశ్వరరావు, బలగ శ్రీనివాసరావు, భువన్మోహన్, కుమార్, కింతలి రమణ, రామకృష్ణ, బాడాన గోవింద్, అన్నెపు సీతారాం, బలగ రామకృష్ణ, అల్లు రాజారావు, శ్రీనివాస మహాపాత్రో, చింతనిప్పుల అప్పలరాజు, పొందర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో మళ్లీ చైన్ స్నాచింగ్
శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం నగరంలో మరోమారు చైన్ స్నాచింగ్ జరిగింది. సోమవారం రాత్రి పీఎన్ కాలనీలో ఐదో లైన్లో కనితి నిర్మల అనే మహిళ వాకింగ్ చేస్తుండగా బైక్పై వచ్చిన అగంతకుడు మెడలో తులంపావు గొలుసు తెంపేసి పరారయ్యాడు. ఖంగు తిన్న ఆమె కేకలు వేయడంతో స్థానికులు చేరారు. ఘటనా స్థలానికి డీఎస్పీ సీహెచ్ వివేకానంద, ఒకటో పట్టణ సీఐ పైడపు నాయుడు చేరుకున్నారు. ఏఈవో అప్పలనాయుడు బదిలీ అరసవల్లి: ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో సహాయ కార్యనిర్వహణాధికారి(ఏఈవో)గా పనిచేస్తున్న గడి అప్పలనాయుడుకు సింహాచలం శ్రీవరాహనర్సింహస్వామి ఆలయ ఏఈవోగా బదిలీ చేస్తూ దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆయన ఒకటెండ్రు రోజుల్లో అరసవల్లి నుంచి రిలీవ్ అయ్యి, సింహాచలంలో బాధ్యతలు చేపట్టనున్నారు. మండపాన్ని పునర్నిర్మించాలి మందస: పట్టణంలోని చారిత్రాత్మక గోపాల్ సాగర్ సుందరీకరణ పనుల పేరుతో ప్రాచీన కట్టడాలను ధ్వంసం చేస్తుండడంపై స్థానిక ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే ఇక్కడి పురాతన కట్టడాలకు నష్టం వాటిళ్లుతోందని స్పందనలో అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని ఆదివారం ఎంతో విశిష్టమైన రాళ్లతో పరిచిన మండపాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. శతాబ్ధాల చరిత్ర కలిగిన ఈ నిర్మాణాన్ని కూల్చివేయడాన్ని గమనించిన స్థానిక ప్రజలు, ప్రాచీన కట్టడాల పరిరక్షణ కమిటీ కన్వీనర్ మామిడి కోదండరావు తదితరులు అడ్డుకున్నారు. ఈ మేరకు చారిత్రక విధ్వంసానికి నిరసనగా అధికారులకు ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. కూల్చివేసిన మండపాన్ని పునర్నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో రట్టి లింగరాజు, శ్రీనివాస్ పాడి, పురుషోత్తం బెహరా, దువ్వ జగదీష్, యర్రనాగుల శ్రీను, పూర్ణచందు, మట్టా బెనర్జీ, పూర్ణచంద్ర, కురేష్, శంకర్, వీరాస్వామి, బాలు, పురుషోత్తం, నిరంజన్, గయా, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కాలువ నిర్మాణంలో స్థల వివాదం టెక్కలి రూరల్: స్థానిక అయ్యప్పనగర్లో జరుగుతున్న కాలువల నిర్మాణంలో సోమవారం స్థల వివాదం చోటుచేసుకుంది. అయ్యప్పనగర్ నుంచి భవానీనగర్ వెళ్లే మార్గంలో కె.నాగరాజు అనే వ్యక్తికి చెందిన స్క్రాప్ దుకాణం ఉంది. అయితే నాగరాజుకు చెందిన షాపులో కొంతభాగం ప్రభుత్వ స్థలం ఉందని గతంలో వేసిన మార్కింగ్ వరకు దానిని తొలగించి కాలువ నిర్మాణం చేపట్టాలని అధికారులు చెప్పారు. దీంతో షాపు యజమాని తన వద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయని, ప్రభుత్వ స్థలం లేదంటూ కాగితాలు చూపిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదంటూ వాపోయాడు. అధికార పార్టీ నేతలు చెప్పడంతో అధికారులు తన షాపును తొలగిస్తున్నారని వాగ్వాదానికి దిగాడు. అయితే బాధితుడు ఎంత చెప్పినా వినకుండా సంబంధిత అధికారులు పోలీసులు సమక్షంలో షాపులో కొంతభాగాన్ని జేసీబీ సాయంతో తొలగించారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఎచ్చెర్ల: స్థానిక యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ఈనెల 15వ తేదీ నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా యువతకు ఉపాధి శిక్షణను ప్రారంభించనుందని సంస్థ డైరెక్టర్ రామ్జీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీసీటీవీ ఇన్స్టాలేషన్ విభాగంలో 13 రోజులు పాటు ఉచిత శిక్షణను ప్రారంభించనున్నామని వెల్లడించారు. శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించా రు. మరిన్ని వివరాలకు 95534 10809, 79933 40407 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
పరిశీలిస్తాం..
నది ఆక్రమణలకు సంబంధించి కరకవలస నుంచి ఉప్పరపేట వరకూ పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం. ఆక్రమణలు ఉంటే చర్యలు తీసుకుంటాం. దేవాలయ భూముల్లో చెట్ల నరికివేతపై దృష్టి పెడతాం. – జెన్ని రామారావు, తహసీల్దార్, జలుమూరు ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి నది ఒడ్డునే ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులు పర్యవేక్షణ జరిపి తవ్వకాలు అడ్డుకోవాలి. ఏటా ఈ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. దీంతో నది స్వరూపమే మారిపోతుంది. – కె.నాగరాజు, పర్లాం, రైతు ఇళ్లలోకి నీరు వస్తోంది ఇసుక తవ్వకాలు, నది ఆక్రమణల వల్ల ఏటా ఇళ్లలోకి నీరు వస్తోంది. పూర్తిస్థాయి నివారణకు చర్యలు తీసుకోవాలి. – అంధవరపు రాము, అంధవరం -
మార్మోగిన జానపదం
● బూరగాంలో అల్లూరికి ఘన నివాళి జానపద ప్రదర్శనలు ఇస్తున్న దృశ్యంకంచిలి: మండలంలోని బూరగాం గ్రామం సోమవారం జానపదంతో మార్మోగింది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో భాగంగా ప్రజా కళామండలి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ రూపంలో సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అల్లూరి చిత్రపటానికి నివాళులతో మొదలైన కార్యక్రమం కాసేపట్లోనే జన జాతరగా మారింది. ప్రజా కళామండలి రాష్ట్ర కార్యదర్శి కొర్రాయి నీలకంఠం, బొట్ట శ్రీరాములు నేతృత్వంలో కళాకారులు జానపద పాటలు, కోలాటాలు, డప్పు నృత్యాలతో గ్రామ వీధుల్లో ప్రదర్శనలిచ్చారు. ఉద్దా నం ప్రాంతంపై కార్పొరేట్ సంస్థల కబ్జా దాడులు, ఉత్తరాంధ్రను అభివృద్ధిలో వెనక్కి నెడుతున్న తీరు, ఆడపిల్లల భద్రత, సామాజిక చైతన్యం వంటి అంశాలను పాటల రూపంలో ప్రజల ముందు ఉంచారు. ‘ఉద్దానం మా ఊపిరి.. కార్పొరేట్ దోపిడీ వద్దు’ అంటూ సాగిన పాటలకు ప్రజలు చేతులు ఊపుతూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కొర్రాయి నీలకంఠం మాట్లాడుతూ.. అల్లూరి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసినట్లు, నేడు ప్రజలు కార్పొరేట్ శక్తులు, వివక్షపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కార్యదర్శి కుసుమ మాట్లాడుతూ అల్లూరి త్యాగాన్ని స్మరించుకోవడమే కాదు, ఆయన చూపిన తెగువతో సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. సామాజిక కార్యకర్త అరుణక్క మాట్లాడుతూ.. జానపదం ద్వారానే మారుమూల గ్రామాల్లోకి చైతన్యం తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు మడ్డు వెంకటరావు, మాస్టీల మన్మథరావు, మడ్డు అభి తదితరులు పాల్గొన్నారు. -
సీఆర్జెడ్లో అక్రమ నిర్మాణం
సంతబొమ్మాళి: తీరప్రాంత భూములపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. ఈ భూములను ఆదాయ వనరులుగా మార్చుకోవడానికి బరితెగిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని భావనపాడు తీర ప్రాంతంలో సీఆర్జెడ్ భూములపై అధికార పార్టీ నాయకుడు కన్ను పడింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ భూమిలో ఉన్న సరుగుడు చెట్లను నరికేసి వాల్టా చట్టం ఉల్లంఘించాడు. అంతటితో ఆగకుండా ఆక్రమించిన స్థలాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడానికి పూనుకున్నాడు. దీనిలో భాగంగా రెండు గదుల నిర్మాణానికి పునాదులు వేశాడు. దీంతో అక్రమ నిర్మాణాన్ని భావనపాడు మైరెన్ సీఐ రాము అడ్డుకున్నారు. ఈ క్రమంలో మైరెన్ సీఐతో అధికార పార్టీ నాయకుడు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఆక్రమణపై తహసీల్దార్ హేమసుందర్రావుకు మైరెన్ సీఐ సమాచారం అందజేశారు. తహసీల్దార్ ఆదేశాలతో ఆర్ఐ చంద్రమౌళి సోమవారం అక్రమ నిర్మాణాలను పరిశీలించి నిలుపుదల చేశాడు. దీనిపై నివేదికను ఉన్నతాధికారులను అందజేస్తామని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. -
నిబంధనలకు తూట్లు.. దక్కని 25 శాతం సీట్లు..!
● నష్టపోతున్న పేదింటి విద్యార్థులు ● సక్రమంగా అమలు కానీ విద్యాహక్కు చట్టం ● ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు తూట్లు హిరమండలం: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించాలనే లక్ష్యంతో ఉచిత విద్యాహక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రైవే టు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు దక్కాలి. కానీ అనేక నిబంధనలు, యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి కారణంగా అర్హులైన పేద విద్యార్థులకు ప్రవేశాలు అందని ద్రాక్షగా మారాయి. జిల్లాలో ఈ ఏడాది కేవలం 1000 లోపు విద్యార్థులు మాత్రమే విద్యాహక్కు చట్టాన్ని ఉపయోగించుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏటా ఒకటో తరగతిలో జిల్లాలో 25 వేల మంది విద్యార్థులు కొత్తగా చేరుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం లెక్కన సుమారు ఆరు వేల మందికిపైగా విద్యార్థులను చేర్చుకోవాలి. స్టేట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ సిలబస్లు అయినా కూడా ప్రవేశం కల్పించాలన్న నిబంధన ఉంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. అమలులో నిర్లక్ష్యం ఈ ఏడాది వేసవిలోనే ఉచిత విద్యకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ అమలు విషయంలో మాత్రం పెద్దగా శ్రద్ధ చూపలేదన్న విమర్శ ఉంది. ప్రైవేటు బడుల్లో విధిగా 25 శాతం సీట్లు కేటాయించాలి. ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదు. దుస్తులు, పుస్తకాలు, ఇతర ఖర్చులు మాత్రమే విద్యార్థులు భరించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకుంటే..రిజర్వేషన్ల ప్రాప్తికి అమలు చేస్తారు. లాటరీ తీసి అడ్మిషన్లు కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులకు పెద్దగా అవగాహన ఉండడం లేదు. అయితే పాఠశాలల్లో చేరిన వెనుకబడిన వర్గాలకు చెందినవారినే ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు పేద విద్యార్థులుగా చూపుతున్నారు. వారికి ఈ పథకం కింద అడ్మిషన్లు ఇచ్చామని చెప్పి.. వారి దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నారు. అందువలన ఇప్పటికై నా అధికారులతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా ఉచిత ప్రవేశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు 402 వరకు ఉన్నాయి. సుమారు 1,10,692 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కానీ ఈ ఏడాది ఉచిత సీట్లు కేటాయించిన పాఠశశాలలు కేవలం 256 మాత్రమే. అవి కూడా 25 శాతం కాదు. అరకొరగానే మాత్రమే సీట్లు కేటాయించి చేతులు దులుపుకున్నాయి ఎక్కువ పాఠశాలలు. జిల్లాలో ఆరువేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పించాల్సి ఉంటే.. అందులో కేవలం 1000 మంది వరకు విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందడం ఆందోళన కలిగిస్తోంది. వారికి సైతం రకరకాల రూపంలో ఫీజుల మోత తప్పదంటున్నారు తల్లిదండ్రులు. చాలావరకూ పాఠశాలలు సాధారణ అడ్మిషన్లనే పేద విద్యార్థులుగా చూపి ఈ పథకాన్ని నీరుగార్చుతున్నాయన్న విమర్శలూ ఉన్నాయి. పట్టించుకోని అధికారులు -
దొంగ ఓట్లు తొలగించడం లేదు
● అధికారులు అధికార పార్టీకి సహాయపడుతున్నారు ● పీజీఆర్ఎస్లో పేరాడ తిలక్ ఫిర్యాదు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎస్ఐఆర్లో భాగంగా టెక్కలి నియోజకవర్గంలో అధికారులు దొంగ ఓట్లు తొలగించడం లేదని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆరోపించారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్కలి, కోటబొమ్మాళి మండలాల్లోని పోలింగ్ స్టేషన్లు వారీగా చనిపోయిన ఓటర్ల వివరాలు, వలస వెళ్లినవారి వివరాలను జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కి వివరించారు. టెక్కలి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో సంవత్సరాలుగా కొనసాగుతున్న అక్రమ ఓట్లను తొలగించాలని, అలాగే టెక్కలి గ్రామ పంచాయతీలో జరుగుతున్న సర్ ఓటర్ల సర్వేలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని విన్నవించారు. అధికారులు అధికార పార్టీకి సహాయపడుతూ వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను అడ్డుగోలుగా తొలగించేలా ఎస్ఐఆర్ చేపడుతున్నారన్నారు. సుమారు 25 వేల మంది ఓటర్లు ఉన్న టెక్కలి గ్రామ పంచాయతీలో ఇప్పటికీ అనేక మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదని, అయినప్పటికీ పంపిణీ చేసినట్లు ఆన్లైన్లో నమోదవుతోందని తెలిపారు. బూత్ లెవల్ అధికారులకు తగిన అవగాహన లేకపోవడం వల్ల సర్వే ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, 20 రోజులు గడిచినా అనేక పోలింగ్ కేంద్రాల్లో 20 నుంచి 45 శాతం వరకు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తైందని చెప్పారు. అర్హులైనవారు ఓటుహక్కును కోల్పోకుండా జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామ్మూర్తి, టెక్కలి నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు చిన్ని జోగారావు యాదవ్, మేఘవరం మాజీ సర్పంచ్ పరపతి శ్రీనివాసరెడ్డి, టెక్కలి నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు కర్ణిక జీవన్రావు, టెక్కలి మండల ఐటీ విభాగం అధ్యక్షుడు బడ్డ రాజేష్, కోటబొమ్మాళి మండల పార్టీ అధ్యక్షుడు హేమసుందర రాజు పాల్గొన్నారు. -
ఎస్పీ గ్రీవెన్సుకు 57 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్స్(పీజీఆర్ఎస్)కు బాధితుల నుంచి 57 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితులతో నేరుగా మాట్లాడి న్యాయం చేస్తానని భరోసా అందించారు. నా కుమార్తె ఆత్మహత్యకు ఉన్నతాధికారులే కారణం తన కుమార్తె స్వప్నప్రియ ఆత్మహత్యకు ఎస్బీఐ ఉన్నతాధికారుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలో నివసిస్తున్న ఉరిటి సరళ ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. గతంలో ఎస్బీఐ గార శాఖలో డిప్యూటీ మేనేజర్గా పనిచేసిన తన కుమార్తె స్వప్నప్రియను ఆత్మహత్యకు ప్రేరేపించడం, బెదిరింపులు, క్రిమినల్ కుట్రలకు సంబంధించి ఆధారాలను ఎస్పీకి అందజేశారు. ఎస్బీఐ రీజనల్ మేనేజర్ టీఆర్ఎం రాజు, క్యాష్ ఆఫీసర్ ముంజేటి సురేష్, జాయింట్ కస్టోడియన్ జి.లోకనాథం, బ్రాంచి మేనేజర్ రాధాకృష్ణతో పాటు మరికొందరు తాకట్టు బంగారం మాయం కేసులో బాధ్యులని ఆరోపించారు. వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిందితులను అరెస్టు చేసి విచారణా నివేదికలు బహిర్గతం చేయాలని కోరారు. -
‘వైఎస్సార్ జయంతి ఘనంగా నిర్వహించాలి’
నరసన్నపేట: దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో జయంతి కార్యక్రమాలు చేయాలని, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ ప్రతినిధులు, అనుబంధ సంఘాల కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఎస్సీ కేటగిరీ ఖాళీ సీట్ల భర్తీ శ్రీకాకుళం పాతబస్టాండ్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో ఎస్సీ (ఇ) కేటగిరీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత గురుకుల పాఠశాలల ను నేరుగా సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కో ఆర్డినేటర్ వై.యశోద లక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతికి సంబంధించి దుప్పలవలస, కంచిలి, పెద్దపాడు, నందిగాం, కొల్లివలస, మందస, పాతపట్నం గురుకుల పాఠశాలల్లోను, 6వ తరగతికి సంబంధించి కంచిలి, నందిగాం, పాతపట్నం గురుకుల పాఠశాలలో ఉన్నట్లు వివరించారు. ఇంటర్మీడియెట్కు సంబంధించి కంచిలి, నందిగాం, మందస గురుకుల జూనియర్ కళాశాలలో ఖాళీగా సీట్లకు అర్హత కలిగిన ఎస్సీ కేటగిరీ విద్యార్థులు వెంటనే సంబంధిత గురుకుల పాఠశాలలకు వెళ్లి దరఖాస్తు సమర్పించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు 9701736862 నంబర్ను సంప్రదించాలన్నారు. గొట్టా బ్యారేజీ నుంచి నీరు విడుదల హిరమండలం: ఖరీఫ్లో శివారు ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని వంశధార ప్రాజెక్టు చైర్మన్ ఎ.రవీంద్ర, వంశధార ఎస్ఈ జి.రామచంద్రరావు అన్నారు. సోమ వారం ప్రాజెక్టు డైరెక్టర్లు, వంఽశధార అధికారులతో కలిసి గొట్టా బ్యారేజీ నుంచి ఎడమ, కుడి ప్రధాన కాలువలోకి నీరు విడుదల చేశారు. ముందుగా గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. శివారు ప్రాంతాలకు నీరు అందేవిధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అనుకున్న సమయంలో వర్షాలు పడలేదని, ఇటీవల పడుతున్న వర్షాలకు వచ్చిన నీటిని బ్యారేజీలో నిల్వ ఉంచామన్నారు. ప్రస్తుతం 37 మీటర్ల నీటిమట్టం ఉందన్నారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు తెలిపారు. -
సీసీ ఫుటేజీ మాయం..?
శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ కూర్మారావుకు బదిలీ ఉత్తర్వులు వచ్చిన సందర్భంలో కార్యాలయ ఆవరణలోనే బాణసంచా కాల్చడాన్ని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఈ విషయం తొలుత సాక్షిలో కథనంగా ప్రచురితం కావడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలు విచారణ జరపాలని పోలీసులకు ఆదేశించారు. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ సేకరణ కోసం శనివారం కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లగా.. దీనిని పర్యవేక్షించే ఉద్యోగి లేడని, సోమవారం రావాలని తిప్పి పంపించినట్లు సమాచారం. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయానికి మరోసారి పోలీసులు వెళ్లి సీసీ ఫుటేజీ కోసం పరిశీలించగా, ఆ ఒక్క ఘటనకు సంబంధించిన అంశాలు రికార్డు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిని ఎవరైనా డిలీట్ చేసి ఉంటారని మరోసారి నిపుణులతో కూడిన బృందంతో వస్తా మని చెప్పి పోలీసులు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రశ్నించిన పోలీసులు..? కాగా పోలీసులు క్షుణ్ణంగా చిత్తశుద్ధితో తనిఖీలు చేస్తే ఎవరైనా డిలీట్ చేసినా పోలీసుల వద్ద ఉండే ప్రత్యేక సాఫ్ట్వేర్తో తొలగించిన ఫుటేజీ తిరిగి పొందవచ్చని పలువురు అంటున్నారు. కార్యాలయంలోని కొందరు ఉద్యోగులను కూడా పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వారిచ్చిన సమాచారం ఆధారంగా బాణసంచా బయట వ్యక్తులు కాల్చినప్పటికీ.. దీని వెనుక ప్రధాన పాత్ర పోషించిన ఉద్యోగి ఎవరన్నది కూడా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సదరు ఉద్యోగి ఈ కేసు ముందుకు సాగకుండా ఉండేలా ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బోగట్టా. ఇందులో భాగంగానే సీసీ ఫుటేజీ మాయం చేశారని నగరపాలక సంస్థ కార్యాలయ ఉద్యోగ వర్గాల నుంచి వినిపిస్తోంది. కమిషనర్ కూర్మారావు బదిలీకి కూడా తానే కారణమని, సీఎంవోకు ఫిర్యాదు చేయించానని ఈ ఉద్యోగి కార్పొరేషన్ కార్యాలయంలో ప్రచారం చేసుకుంటున్నట్లు పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కూర్మారావు బదిలీ ఉత్తర్వులు చూడగానే కార్యాలయంలో ఓ ‘ప్లాన్ ప్రకారం అనారోగ్య వ్యాఖ్యానాలు చేసిన ఇద్దరు అధికారుల వ్యవహారాన్ని కూడా కొందరు ఉద్యోగులు పోలీసులు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియ వచ్చింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే ఎన్నో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తాయని పలువురు చెబుతున్నారు. పోలీసులు వచ్చిన విషయాన్ని ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ సుధీర్ వద్ద సాక్షి ప్రస్తావించగా పోలీసులు వచ్చి పరిశీలన జరిపిన విషయం వాస్తవమేనన్నారు. సీసీ ఫుటేజీ లేనట్లు చెప్పారని, మరలా వచ్చి పరిశీలన చేస్తామన్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో బాణసంచా కాల్చిందెవరు..? ఘటనపై ఉన్నతాధికారుల సీరియస్ సీసీ ఫుటేజీ సేకరించేందుకు వెళ్లిన పోలీసులు ఫుటేజీ లేకపోవడంతో ఆశ్చర్యం -
అర్జీదారులు సంతృప్తి చెందాలి
● జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ● పీజీఆర్ఎస్లో 179 వినతుల స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: అధికారులు ఇచ్చే సమాధానంతో అర్జీదారులు సంతృప్తి చెందాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. మొత్తం 179 ఆన్లైన్ అర్జీలు స్వీకరించగా ఇందులో రెవెన్యూ 43, పంచాయతీ రాజ్ 20, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 26, వ్యవసాయ శాఖ 14, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 16, వాటర్ రిసోర్సెస్ ఈఎన్సీ 9, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 7, ఏపీఈపీడీసీఎల్ 6, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 5, రూరల్ డవలప్మెంట్ 4, హోం శాఖ 4, గ్రామీణ నీటి సరఫరా, పౌర సరఫరాలు, విద్యాశాఖలకు సంబంధించి మూడేసి అర్జీలు చొప్పున స్వీకరించారు. విభిన్న ప్రతిభావంతులు శాఖ, కాలేజీ ఎడ్యుకేషన్కు సంబంధించి రెండేసి అర్జీలు చొప్పున స్వీకరించగా, బీసీ కార్పొరేషన్, ఆర్అండ్బీ, స్కిల్ డవలప్మెంట్, రవాణా శాఖ, సమగ్ర శిక్ష తదితర శాఖలకు సంబంధించి ఒక్కొక్క వినతులు వచ్చాయి. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. పలు వినతులు పరిశీలిస్తే... ● రానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించి 2023లో పార్లమెంట్లో ఆమోదం పొందిన నారి శక్తి వందన్ అధినీయం 2023 బిల్లుని ప్రవేశపెట్టి, చట్టరూపంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి పుక్కళ్ల అరేలమ్మ వినతిపత్రం అందజేశారు. ఆమెతో పాటు బడే మాడికమ్మ, పుక్కళ్ల లోలాక్షి, ఏఐవైఎఫ్ నాయకుడు సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు. ● శ్రీకాకుళం నగరంలోని పెద్ద రెల్లివీధిలో నాగావళి నదికి ఆనుకుని ఉన్న రివర్ బెడ్ ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఎ.ఈశ్వరరావు, ఎ.సంతోష్, కోటి, చింతు తదితరులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద రెల్లివీధికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్రమించుకొని ఒక పెద్ద భవనాన్ని నిర్మాణం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆక్రమణపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
శఠగోపం
ఆదిత్యుని సొమ్ముకు● ఆదిత్యుని హుండీ కానుకల లెక్కింపులో చేతివాటం ● రూ.11,500 దొంగిలించి దొరికిపోయిన విశాఖకు చెందిన కృష్ణారావు ● అరెస్టు చేసిన పోలీసులు అరసవల్లి: ప్రత్యక్ష భగవానుడి సన్నిధిలో ఓ వ్యక్తి సేవ పేరు తో చొరబడి చోరకళ ప్రదర్శించాడు. స్వచ్ఛందంగా హుండీ ఆదాయం లెక్కింపులో పాల్గొని డబ్బులు కాజేయాలని చూసి దొరికిపోయాడు. ఆలయంలో సోమవారం హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం, విశాఖ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన స్వచ్ఛంద సేవకుల బృందాలు నగదును, మహిళలంతా చిల్లరను లెక్కించారు. ఇంతలో విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేట గ్రామానికి చెందిన బి.కృష్ణారావు అనే వ్యక్తి విజయనగరానికి చెందిన శ్రీవారి సేవ సంఘం ముసుగులో వచ్చి నగదును లెక్కిస్తూనే రూ.11,500 డబ్బును తన దుస్తుల్లో దాచేశాడు. ఇలా కొట్టేసిన రూ.500 నోట్ల చిన్న కట్ట (23 నోట్లు)తో బయటకు వెళ్తున్న క్రమంలో సెక్యూరిటీకి చిక్కాడు. దీంతో ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్తో పాటు పర్యవేక్షణాధికారిగా వచ్చిన జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్లు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయ ఈఓ ప్రసాద్ నేరుగా దొంగ చేతిలోని నోట్లను స్వాఽధీనం చేసుకుని సీజ్ చేయించారు. బృందం సభ్యులను కూడా విచారించి కృష్ణారావును పోలీసులకు అప్పగించారు. దీంతో ఒక్కసారిగా ఆలయ పరిసరాల్లో హడావుడి నెలకొంది. హుండీ కానుకల లెక్కింపునకు వచ్చిన స్వచ్ఛంద సేవకులందరినీ చెక్ చేయించి తిరిగి లెక్కింపు విధులను అప్పగించారు. పర్యవేక్షణ లోపం.. ఆదిత్యుని ఆలయంలో నిఘాలో డొల్లతనం ఈ ఘటనతో తేటతెల్లమైంది. ఆలయంలో సగటున ప్రతి మూడు నెలలకు ఒకసారి హుండీ కానుకల లెక్కింపు చేపడుతుంటారు. పెద్ద ఎత్తున నగదును లెక్కింపునకు వీలుగా అన్నవరం, సింహాచలం మాదిరిగానే ఇక్కడకు కూడా వివిధ స్వచ్ఛంద సేవకుల సంఘం పేరిట వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు వచ్చి లెక్కింపులో పాల్గొంటారు. కానీ మిగిలిన ఆలయాల్లో ఉన్న నిఘా వ్యవస్థ ఇక్కడ కనిపించడం లేదు. కాళ్లతో డబ్బును ఈడుస్తుంటే ఆపాను లెక్కింపు మధ్యలో తిరిగి వెళ్లిపోయేందుకు గేటు వద్దకు వస్తుంటే కాళ్ల మధ్య లో దాచుకున్న నగదు కట్ట కిందకు జారింది. కాళ్లతోనే డబ్బును ఈడుస్తూ కనిపించాడు. దీంతో వెంటనే నిలువరించి అతడిని ఆపాను. – వి.ధనలక్ష్మి, ప్రైవేటు సెక్యూరిటీ, అరసవల్లి -
ఎమర్జింగ్ క్రికెట్ టోర్నీకి విజయ్
● జిల్లా నుంచి ఈ అవకాశం దక్కించుకున్న మొదటి క్రికెటర్గా గుర్తింపు ● బెంగళూరు వేదికగా ఈనెల 24 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక పోటీలు త్రిపురాన విజయ్ శ్రీకాకుళం న్యూకాలనీ: త్రిపురాన విజయ్.. ఐపీఎల్ ఎంట్రీతో జిల్లా పేరును మార్మోగించిన క్రికెటర్. టెక్కలికి చెందిన ఈ యువ ఆల్రౌండర్ మరో మరో అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో బెంగళూరు వేదికగా జరగనున్న ఎమర్జింగ్ మెన్స్ క్రికెట్ టోర్నీకి ఎంపికయ్యాడు. జూనియర్లు, సీనియర్ క్రికెటర్లతో కలబోసిన ఈ మెగా టోర్నీలో బీసీసీఐ ప్రకటించిన ఇండియా– బీ టీమ్లో విజయ్ చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ బెంగళూరు హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ నుంచి ఏసీఏ సెక్రటరీకి వర్తమానం అందింది. ఐపీఎల్లో గత రెండు పర్యాయాలు ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించిన ఈ సిక్కోలు తెలుగు తేజం ఈ టోర్నీ కోసం ఇప్పటికే బెంగళూరు చేరుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన జిల్లా మొట్టమొదటి క్రికెటర్గా గుర్తింపు అందుకున్నాడు. ఎమర్జింగ్ మెన్స్ క్రికెట్ టోర్నీకి విజయ్ ఎంపికపై జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు, ప్రతినిధులు, కోచ్లు, సీనియర్ క్రికెటర్లు, విజయ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంతోషంగా ఉంది ఎమర్జింగ్ మెన్స్ క్రికెట్ టోర్నీకి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. నాలాంటి జూనియర్స్తోపాటు సీనియర్ క్రికెటర్లుతో కూడిన ఈ మెగా టోర్నీ ఈనెల 24 వరకు జరుగుతుంది. ఇండియా–బీ జట్టుకు ఎంపికచేశారు. అవకాశం లభిస్తే రాణించేందుకు సర్వశక్తులా ఒడ్డుతాను. నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న క్రికెట్ సంఘ పెద్దలు, కోచ్లు, తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను. – త్రిపురాన విజయ్, క్రికెటర్ -
నిరీక్షణ తప్పదా..?
● ఎరువుల కోసం ఎదురుచూపులు మళ్లీ మొదలు ● ధరలపై అదనపు వడ్డనలుబూర్జ: మండలంలో గల బూర్జ పీఏసీఎస్ కార్యాలయంలో రైతులు ఖరీఫ్ సీజన్లో ఎరువు కోసం ఆదిలోనే నానా ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయానికి ఒక్క డీఏపీ మాత్రమే వచ్చింది. శనివారం కార్యాలయానికి డీఏపీ కోసం వస్తే ఓటీపీ రావడం లేదని తిరిగి పంపించారని, అలాగే సోమవారం కూడా కార్యాలయానికి వెళ్తే ఓటీపీ వచ్చిన వారికే ఎరువుల ఇస్తామని చెబుతున్నారని బూర్జ గ్రామానికి చెందిన రైతులు చౌదరి ప్రతాప్ చౌదరి, అల్లు మురళి, చిన్న కురిమి పేట గ్రామానికి చెందిన ఇ.సూర్యారావు, కె.గణపతి, పి.అసిరినాయుడు, వావాం గ్రామానికి చెందిన సీహెచ్ సీతారాం తదితరులు ఆరోపించారు. యూరియా @ రూ.350గార: యూరియాపై అదనపు వడ్డనలు మొదలైపోయాయి. ఒక్కో బస్తా రూ. 270లు ప్రభుత్వ ధరకు అమ్మాల్సి ఉన్నా ఒక్కో ఎరువుల డీలర్ ఒక్కోలా రూ. 350 లు వరకు అమ్మకాలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది పెట్టిన ఏపీఏఐఎంస్ యాప్ ద్వారా ఆధార్ నమోదు చేసి, భూమి విస్తీర్ణం మేరకు యూరియా ఇస్తున్నారు. అయినా అధిక ధరలకు కొనాల్సిన పరిస్థితుల్లో రైతులు ఆవేదన చెందుతున్నారు. గార మండలంలో నారాయణపురం, వంశధార కాలువ పరిధిలో ముందుగా వరి వెదసాగు మొదలైంది. రెండు రోజుల కిందట వర్షాలు మొదలవ్వడంతో ఎరువుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల (రైతు భరోసా కేంద్రాలు) ద్వారా యూరి యా అమ్మకాలు జరిగితే ప్రభుత్వ ధరకే దొరుకుతుంది. మండలంలో ఎక్కడా ఆర్ఎస్కేల ద్వారా అమ్మకాలు జరపకపోవడంతో కేవలం ప్రైవేట్ డీలర్లపైనే రైతులు ఆధారపడుతున్నారు. ఈ విషయమై ఏఓ డి.పద్మావతి వద్ద ప్రస్తావించగా అధిక ధరలకు అమ్మవద్దని ఇప్పటికే స్పష్టం చేశామని, కఠిన చర్యలు తప్పవన్నారు. -
బానిషా సంకెళ్లు తెంచుదాం
● డీఆర్వలసలో బెల్టుషాపులు నిషేధిస్తూ తీర్మానం ● గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే రూ.25వేల జరిమానా జి.సిగడాం: మండలంలోని డీఆర్ వలస ఆదర్శంగా నిలిచింది. ఊరి ఆయువు తీస్తున్న మద్యం బెల్టుషాపులపై కదం తొక్కింది. ప్రభుత్వ షాపుల ద్వారా గ్రామంలోకి మద్యం తీసుకువచ్చి విచ్చలవిడిగా విక్రయిస్తుండడంపై మండిపడింది. ఈ ఊరిలో రెండు బెల్టు దుకాణాలు ఉన్నా యి. ఇకపై ఊరిలో ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.25వేల జరిమానా విధించాలని గ్రామంలోని రామమందిరం వద్ద స్థానికులు సోమ వారం తీర్మానం చేశారు. ఆ సమాచారం అందించిన వారికి రూ.3వేలు బహుమతిగా ఇస్తామన్నారు. గ్రామంలో ఎవరూ మద్యం అమ్మకుండా ప్రతి రోజు రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు యువత ప్రత్యేకంగా నిఘా వేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో కల్తీ మద్యం సేవించి పలువురు మృత్యువాత పడ్డారు. ఇకపై అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా స్థానికులంతా ముందడుగు వేశారు. -
ఉపా చట్టం కింద కేసులు అప్రజాస్వామికం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): యూట్యూబర్ ప్రశ్న రావణ్పై ఉపా చట్టం కింద కేసు పెట్టడం అప్రజాస్వామికమని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్, టౌన్ కన్వీనర్ వై.వేణులు అన్నారు. నగరంలోని రామలక్ష్మణ కూడలి వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రశ్న రావణ్పై తక్షణమే కేసు ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో పెడతామనేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఇలాంటి చర్యలకు దిగడం దుర్మార్గమని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇతరులను ప్రశ్నించవచ్చు గానీ, ఆయనను ఎవరూ ప్రశ్నించకూడదనే ధోరణి సరికాదన్నారు. ఆయనను విమర్శించేవారిని జైలుకు పంపడం దారుణమన్నారు. ఒక వ్యక్తిపై ఒకే అంశంలో అన్ని కేసులు పెట్టడం కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు. ప్రశ్న రావణ్పై ఉపా కేసును తక్షణమే ఉపసంహరించేలా సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు అన్నాజీ, హేమంత్, శశి, రామకృష్ణ పాల్గొన్నారు. -
తోటి డ్రైవరే చంపేశాడు
● హత్యగా తేలిన అనుమానాస్పద మృతి కేసు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ లక్ష్మణరావు టెక్కలి రూరల్: గత నెల 26వ తేదీన కోటబొమ్మా ళి మండలం కుజ్జిపేట గ్రామం దాలిచెరువు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని కోటబొమ్మాళి పోలీసులు గుర్తించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు కు సంబంధించి ఆదివారం టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు కోటబొమ్మాళిలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. మృతుడిని ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కోటివాడ గ్రామానికి చెందిన బాపూజీ స్వైన్ (40)గా గుర్తించామని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాలు ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బిపులింగి గ్రామానికి చెందిన లారీ ఓనర్ హరికృష్ణ చౌదరి వద్ద కేదార్దాస్ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తుండే వాడు. అయితే ఆ వ్యక్తి ఎప్పటికప్పుడు తన లారీ లోని ఆయిల్ తీసి అమ్మేస్తున్నాడనే విషయం తె లుసుకున్న బాపూజీ స్వైన్ లారీ యజమానికి హరికృష్ణ చౌదరికి తెలిపాడు. దీంతో ఆ యజమాని డ్రైవర్ను పనిలో నుంచి తొలగించాడు. దీనికి బాపూజీ స్వైన్ కారణమని కేదార్దాస్ అతనిపై కక్ష పెట్టుకున్నాడు. ఆరు నెలలు కిందట బాపూజీ స్వైన్ను యజమాని హరికృష్ణ చౌదరి డ్రైవర్గా పనిలో చేర్చుకున్నాడు. గత నెల 25వ తేదీన బాపూజీ విపులింగి గ్రామం నుంచి అట్టల లోడుతో బొబ్బిలి బయల్దేరాడు. కేదార్ దాస్ను కూడా తనతో రమ్మని చెప్పగా అతడిని చంపేందుకు ఇదే సరైన సమయం అని భావించిన కేదార్ దాస్ తనతో కలసి బయలు దేరాడు. అనంతరం బరంపురంలో కేదార్ దాస్ బాపూజీకి అధికంగా మద్యం తాగించి క్యాబిన్లో పడుకోమని చెప్పి తాను డ్రైవింగ్ చేశాడు. ఎన్హెచ్–16 నుంచి ఎచ్చెర్ల వరకు వెళ్లి మళ్లీ వెనక్కి తిప్పి కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే గేటు ఫ్లై ఓవర్ బ్రిడ్జి దాటిన తర్వాత కుజ్జిపేటకు వెళ్లే రోడ్డు పక్కన లారీ ఆపి మద్యం మత్తులో ఉన్న బాపూజీ ముఖంపై బలంగా గుద్ది మెడలో ఉన్న తువ్వాలుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని లారీ దించి రోడ్డు పక్కగా ఉన్న దాలిచెరువు వద్ద పడేశాడు. అనంతరం లారీలో ఉన్న అట్టలను రూ.45,600 కి అమ్మేశాడు. అనంతరం లారీని నందిగాం మండ లం గోలంత్ర గ్రామం సమీపంలో ఆపేసి పరారయ్యాడు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ నేతృత్వంలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి పోలీసులు 10 రోజులు పాటు గాలించి ఈ నెల 5వ తేదీన లారీ యజమాని హరికృష్ణ చౌదరి సహాయంతో ముద్దాయి కేదార్ దాస్ను నందిగాం మండలం కొత్తఅగ్రహారం వద్ద గల ఒక స్క్రాప్ కొట్టు వద్ద గుర్తించి అదుపులో తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతుడి భార్య ప్రభాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
కొట్లాట కేసులో వ్యక్తి అరెస్టు
పలాస: మండలంలోని కోసంగిపురం గ్రామ జగనన్న కాలనీకి చెందిన నెయ్యిల రాజేష్ను కొట్లాట కేసులో ఆదివారం అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపారు. ఆయన చెప్పిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. పురుషోత్తపురం గ్రామానికి చెందిన తోట హేమరాజుకు జగనన్న కాలనీలో ఇంటి స్థలం ఉంది. ఆ స్థలంలో ఆయన ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. ఇతను నిర్మిస్తున్న ఇంటి పక్కనే నెయ్యిల రాజేష్ ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాడు. తోట హేమరాజు తాను ఇల్లు కట్టుకున్న ఇంటి వద్దనుంచి జగనన్న కాలనీ మెయిన్ రోడ్డు గుండా కొండవైపు నడుచుకుంటూ వెళ్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో నెయ్యిల రాజేష్ వెనుక నుంచి వచ్చి అతనిపై దాడి చేశాడు. తలపై బలంగా సుత్తితో కొట్టాడు. దీంతో అతడు గాయపడ్డాడు. హేమరాజు తమ్ముడు సురేష్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. రాజేష్ను అరెస్టు చేసి రిమాండుకు పంపించినట్లు వెల్లడించారు. -
భక్తులకు ‘యాప్’సోపాలు..!
అరసవల్లి: ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో భక్తులకు ఆదివారం కాస్త ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలకు రావడంతో ఒకవైపు పోలీస్ శాఖ, మరోవైపు దేవదాయ శాఖలు తమదైన శైలిలో తమ యాప్లను ఇన్స్టాల్ చేయించేలా భక్తుల వెంటపడ్డారు. మహిళలు శక్తి యాప్ తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోవాలని మహిళా పోలీస్ సిబ్బంది భక్తుల వెంట పడుతుంటే.. స్వామివారి దర్శనాలు, ప్రసాదాలకు మన మిత్ర యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలంటూ ఆలయ సిబ్బంది కుస్తీ పడ్డారు. ఇదిలా ఉండగా గత ప్రభుత్వంలో ఇన్స్టాల్ చేసుకున్న దిశ యాప్ ఇంకా ఉందని కొందరు మహిళలు చెప్పడం విశేషం. -
చారిత్రక సంపద.. ముంచుకొచ్చిన ఆపద
● మందసలో చారిత్రక కట్టడాల కూల్చివేత ● తీవ్రంగా వ్యతిరేకించిన స్థానికులు మందస: వందల ఏళ్ల నాటి ఆనవాళ్లు, అంతకు ముందు నాటి కట్టడాలు.. వాటి గురించి అపురూప కథలు.. ఊరితో పెనవేసుకుపోయిన గాథలు.. ఏ గ్రామానికై నా ఇలాంటి చారిత్రక సంపద ఉంటే కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఊరి గతానికి సంబంధించిన జ్ఞాపకాలను అపురూపంగా దాచుకుంటారు. కానీ జిల్లాలోని చారిత్రక గ్రామాల్లో ఒకటైన మందసలో అందుకు వ్యతిరేకంగా జరుగుతోంది. ఇక్కడ గోపాలసాగర్ ప్రాంతంలో అష్టశంభు లక్ష్మణేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఓ పురాతన మండపం ఉండేది. ఈ ఇటుక కట్టడంపై శాసనాలు ఉండేవి. ఇక్కడే జైన తీర్థంకరుడి విగ్రహం కూడా ఉంది. చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు పేరుతో ఈ పురాతన మండపాన్ని కూలదోశారు. స్థానికులు ఎంతగా వ్య తిరేకత తెలిపినా వినకుండా కట్టడాన్ని కాలగర్భంలో కలిపేశారు. అభివృద్ధిని తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని, కానీ చరిత్రను, సంప్రదాయాన్ని, భక్తుల భావాలను గౌరవిస్తూ అభివృద్ధి జరగాలని స్థానికులు కోరినా వినకుండా కట్టడాలను కూల్చేశారు. శివాలయానికి వెళ్లే మార్గం కూడా ఇదే కావడంతో ఆదివారం అందరూ ఆ మండపం వద్దకు వచ్చి వ్య తిరేకత తెలిపారు. కార్యక్రమంలో మామిడి కోదండ, శ్రీనివాస్ పాడి, భూపతి, కంచి బెహరా, సంతోష్ గయా, పూర్ణచంద్ర, నిరంజన్ బెహరా, తిరుపతి బెహరా, బాడ సూరి, పద్మనాభం, గంగాదర బెహరా, సునీల్, కృష్ణ బెహరా సంతోష్ తదితరులు పాల్గొన్నారు. విధ్వంసం వద్దు.. మందస కేవలం గ్రామం కాదు. ఎన్నో ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి మండపం, ప్రతి ఆలయం ఓ కథ చెబుతుంది. మాకు అభివృద్ధి కావాలి. కానీ దాని కోసం ఇలా చరిత్రను ధ్వంసం చేయకూడదు. పార్కును మరో అనుకూల ప్రదేశానికి మార్చితే బాగుంటుంది. – శ్రీనివాస్ పాడి, సామాజిక కార్యకర్త, మందస మండపం కట్టాల్సిందే..మండపాన్ని మళ్లీ యథాతథంగా నిర్మించాలి. ఈ మండపంపై ఓ శిలాశాసనం ఉండేది. బ్రాహ్మీ లిపిలో ఉన్న ఆ శాసనం చారిత్రకంగా ఎంతో విలువైనది. అది మా ప్రాంత చరిత్రను చెప్పే అరుదైన ఆధారం. అలాంటి విలువైన శాసనాన్ని, మండపాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. – మామిడి కోదండ, పురాతన కట్టడాల పరిరక్షణ కమిటీ కన్వీనర్ -
త్రుటిలో తప్పిన ప్రమాదం
టెక్కలి రూరల్: మండలంలోని లింగాలవలస పంచాయతీ పరిధి బలరాంపురం గ్రామ సమీపంలో ఆదివారం ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పాతపట్నం నుంచి టెక్కలి వైపు వస్తున్న టెక్కలి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బలరాంపురం గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో పక్కనే ఉన్న బురదలో దిగబడి ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. టెక్కలి నుంచి తెంబూరు వరకు రోడ్డు చాలా చిన్నది కావడంతో తరచూ ఈ రహదారిపై ఏదో ఒక ప్రమాదం జరుగుతోందని, వారం రోజులు క్రితం లింగలవలస సమీపంలో ఒక ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి సమీప పొలంలో పడిపోయిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాలు అరికట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలి
కవిటి: రాజకీయాల్లో అధికార, విపక్షాలు పరస్పరం విమర్శించుకోవడం సహజమే అయినా నైతిక విలువలు పాటించాలని జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. మండలంలోని చండిపురంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై అధికార పక్ష నేతలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా వైఎస్సార్సీపీ తరపున ఖండిస్తున్నామన్నారు. వ్యవస్థాగత విమర్శల స్థానంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యక్తిత్వ హననానికి పూనుకుంటున్నారని మండిపడ్డారు. అధికార కూటమి నాయకులు హుందాతనంతో వ్యవహరించాలని సూచించారు. ఆమెతో పాటు నేతలు బొర్ర వెంకటరమణ, ఎన్ని అశోక్, వజ్జ ప్రసాదరావు, నరసింహమూర్తి, సంతోష్, రవి తదితరులు తమ్మినేనిపై పోస్టులు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇచ్ఛాపురం: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని టీడీపీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కష్టాలను చూసి భావోద్వేగానికి గురైన అతని వ్యక్తిత్వాన్ని కించపరిచేలా టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం దిగజారుడుతనానికి నిదర్శనంగా వివరించారు. ఉత్తరాంధ్ర బీసీ నాయకుడిగా.. స్పీకర్గా శాసనసభ గౌరవాన్ని పెంచిన ఏకై క నాయకుడు తమ్మినేని సీతారాం అని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వ్యక్తి తమ్మినేని అని తెలియజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు నర్తు ప్రేమ్కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు ఆశి కృష్ణారెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సల్లా దేవరాజు, ఆశి పురుషోత్తం, కారింగి త్రినాథ్, బర్ల నాగభూషణం, నీలాపు జగదీష్, శ్రీరామ్రెడ్డి, సాడి జయరామ్ రెడ్డి, రాజారావు తదితరులు పాల్గొన్నారు. -
● కాగితాల్లేవ్..!
మండలంలోని మీ సేవ, గ్రామ సచివాలయాల్లో స్టేషనరీ కొరత వేధిస్తోంది. ముఖ్యంగా 1బీ, అడంగల్, కుల, ఆదాయ, ఓబీసీ తదితర ధ్రువీకరణ పత్రాల కోసం వినియోగించే ప్రింటెడ్ స్టేషనరీ సరఫరా నిలిచి పోయింది. దీంతో రైతులు పంట రుణాలు రెన్యువల్ చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకర్లు ప్రింటెడ్ స్టేనరీపై 1బీ కావాలంటూ కోరడంతో చేసేంది లేక, సమయానికి పంట రుణాలు రెన్యువల్ చేయలేక అదనపు వడ్డీ కడుతున్నారు. విద్యార్థులు సైతం ధ్రువీకరణ పత్రాలు అందుకోలేకపోతున్నారు. పలాస, కాశీబుగ్గ, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోనూ ఇదే పరిస్థితి. కాగితాలు ఇవ్వలేని సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు. –వజ్రపుకొత్తూరు -
శతశాతం పూర్తి చేయాలి
జలుమూరు: ఎస్ఐఆర్లో భాగంగా ఓట్లు డిజిటలైజేషన్ శతశాతం పూర్తి చేయాలని ఎన్నికల అడిషనల్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు సూచించారు. మండలంలో శ్రీముఖలింగంలోని 1, 2, 3వ బూత్లను ఆదివారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో 62 శాతం డిజిటలైజేషన్ పూర్తవ్వగా.. నరసన్నపేట నియోజకవర్గంలో 72 శాతం పూర్తి చేసి ముందంజలో ఉందన్నారు. జలుమూరు మండలం 73 శాతం పూర్తి అయిందన్నారు. తప్పులు లేకుండా మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. కచ్చితమైన ఓటర్ల జాబితా సిద్ధం కావాలన్నారు. తొలుత శ్రీముఖలింగేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఈఆర్వో జయదేవి, తహసీల్దార్ జెన్ని రామారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
● విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందని పుస్తకాలు ● మరోవైపు కిట్లు అందక ఇబ్బందులు ● తల్లికి వందనం కోసం ఎదురుచూపులు
శ్రీకాకుళం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలలు తెరుచుకునే రోజునే పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాం, బూట్లు, బెల్టులు, డిక్షనరీతో కూడిన బ్యాగును కిట్టు రూపంలో అందజేసేవారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం గతేడాది నుంచి కిట్ల పంపిణీలో జాప్యం చేస్తూ వస్తోంది. ఈ ఏడాది పాఠశాలలు తెరుచుకొని ఇప్పటికే 20 రోజులు పైబడినా పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు అందకపోవడం వల్ల బోధనకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో ఇదీ పరిస్థితి... జిల్లాకు 6,97,678 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా.. 6,81,909 పాఠ్య పుస్తకాలు చేరాయి. అయితే ఈ పాఠ్య పుస్తకాలు తక్కువ విద్యార్థుల ఉన్నచోటికి ఎక్కువ, ఎక్కువ విద్యార్థులు ఉన్నచోటకి తక్కువ సరఫరా కావడంతో కొంతమేర ఇబ్బంది పడుతున్నామని అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఉపాధ్యాయ వర్గాలు మాత్రం పాఠ్య పుస్తకాలు అంతగా సరఫరా కాలేదని అంటున్నారు. పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో సరఫరా కాకపోవడం వల్ల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం బోధనకు కష్టపడాల్సి వస్తోంది. ఇక బూట్లు, బెల్టులు, సాక్సులు, బ్యాగుల జాడే లేకుండా పోయాయి. మరోవైపు యూనిఫాంలు 1,52,135 అవసరమని ప్రతిపాదనలు పంపగా, ఇప్పటివరకు 55,625 మాత్రమే జిల్లాకు చేరాయి. వీటిని 12 మండలాలకు పంపించారు. మిగిలినవి ఈ నెలాఖరకు వస్తాయని చెబుతున్నారు. అయితే ఇవి కూడా విద్యార్థులకు చాలినంతగా సరఫరా అయ్యే పరిస్థితి లేదని విద్యాశాఖలోని కొందరు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రతిఏటా గతేడాది విద్యార్థుల సంఖ్యలో పదిశాతం కోత పెట్టి పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు సరఫరా చేస్తున్నాయని, ఈ ఏడాది కూడా ఇలాగే సరఫరా కావడం వల్ల పాఠ్య పుస్తకాల కొరత ఏర్పడిందని చెబుతున్నారు. యూనిఫామ్లు కూడా కోతపెట్టే పంపిస్తారని చెబుతున్నారు. ఈ ఏడాది గతేడాది కంటే 7,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారని.. ప్రభుత్వం 12 వేల వరకు కోతవిధించిందని వారు అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ఉపాధ్యాయులు విశేష కృషి జరపడంతో ప్రభుత్వం భావించిన స్థాయిలో విద్యార్థుల సంఖ్య తగ్గలేదు. కానీ ప్రభుత్వం మాత్రం కిట్ల సరఫరాలో కోతలు విధించి పంపిస్తోందని, దీనివల్ల అందరు విద్యార్థులకు కిట్లను అందజేయలేక తీవ్ర విమర్శలు తాము ఎదుర్కోవాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కిట్ల పంపిణీతో పాటు తల్లికి వందనం నిధులు కూడా ఇప్పటికీ జమ చేయకపోవడంతో మెగా పేరెంట్స్ డే ను వాయిదా వేస్తూ వస్తున్నారు. పాఠశాలలు తెరిచిన వారం రోజుల్లోగా మెగా పేరెంట్స్ డేను నిర్వహించాల్సి ఉంది. అయితే నేటికీ మెగా పేరెంట్స్ డే నిర్వహించిన పాపాన పోవడం లేదు. కిట్లు సరఫరాల జాప్యం, తల్లికి వందనం నిధులు జమ చేయకపోవడమే వాయిదాకు గల కారణాలని ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తక్షణమే కిట్లను పూర్తిస్థాయిలో సరఫరా చేయడంతో పాటు తల్లికి వందనం నిధులు జమ చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. -
బాధితులకు న్యాయం చేయాలి
శ్రీకాకుళం రూరల్: నిషేధిత ల్యాండ్ సీలింగ్ భూములుగా ప్రభుత్వం వారిచే గుర్తించిన రాగోలు గ్రామ సర్వే నంబర్ 156/1, 156/2, 156/3, 156/4, 156/5లో మొత్తం 23.27 ఎకరాల భూమిని కోర్టు కేసులు నడుస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క ఉడా అనుమతులు తెచ్చుకొని అక్రమార్కులు అమ్ముకున్నారు. దీనిపై బాధితులు పైడి సూరిబాబు, పైడి గోవిందరావు, డోల పద్మాకర్, సత్తారు కూర్మారావు, బొంగు రఘ, నంబారు రంగారావు, పి.మణి తదితరులు స్థానిక వెంచర్ వద్ద ఆదివారం ధర్నా చేపట్టారు. విజయనగరానికి చెందిన దుర్గా ఉమాదేవి, ఆమె భర్త బాలాజీలు ఈ భూమిలో మధ్య తరగతి కుటుంబాలను మభ్యపెట్టి సుమారు రూ.14 కోట్లు దండుకొని అమ్మకాలు చేశారని, ఇప్పుడు వారంతా తప్పించుకు తిరుగుతున్నారన్నారు. తక్షణమే జిల్లా యంత్రాంగం చొరవ తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరారు.


