Srikakulam District Latest News
-
● జేఎల్ఎంలుగా పదోన్నతుల్లో మొండిచేయి ● తక్కువ సంఖ్యలో మాత్రమే ప్రమోషన్లు ● నిరాశలో చిరుద్యోగులు
హిరమండలం: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది గ్రేడ్–2 లైన్మెన్లుగా పిలిచే ఎనర్జీ అసిస్టెంట్ల పరిస్థితి. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఎదుగూబొదుగూ లేదు. విద్యుత్ సమస్యల పరిష్కారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నా.. అత్యవసర పరిస్థితుల్లో సేవలందిస్తున్నా పనికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. దీంతో ఎనర్జీ అసిస్టెంట్లు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇటువంటి తరుణంలో కూటమి సర్కారు వీరికి పదోన్నతులు కల్పిస్తామంటూ ప్రకటన చేసింది. దీంతో జీతాలతో పాటు అన్ని అలవెన్సులు పెరుగుతాయని భావించారు. కానీ కేవలం జూనియర్ లైన్మెన్ పోస్టుల ఖాళీ ప్రాప్తికి మాత్రమే పదోన్నతులు ఇస్తామని చెప్పడంతో వారి ఆశలు నీరుగారిపోయాయి. దీంతో సగం మందికి కూడా పదోన్నతులు లేవని తేలిపోవడంతో వారు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట వేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రజలు విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కే విధంగా విధిగా ప్రతి సచివాలయానికి ఒక విద్యుత్ లైన్మెన్ ఉండాలని చెప్పి.. 2019 అక్టోబర్ 2న ఎనర్జీ అసిస్టెంట్లను నియమించారు. జిల్లాలో 750 మంది వరకు నియమితులయ్యారు. అప్పటినుంచి పల్లెల్లో విద్యుత్ కష్టాలు లేకుండా చూడడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా సమయంలో సైతం వీరి నుంచి విశిష్ట సేవలు అందాయి. అయితే అనంతరం ప్రొబేషనరీ పీరియడ్ ముగియడంతో వీరిని వైఎస్సార్సీపీ సర్వారు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించింది. 2024 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి కావడంతో పదోన్నతులకు సిద్ధపడింది. ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వ హయాంలో ఎనర్జీ అసిస్టెంట్ల పరిస్థితి తీసికట్టుగా మారింది. వీరిని గ్రేడ్–2 లైన్మెన్లుగా గుర్తించినా వీరి జీతం మాత్రం పెరగలేదు. అలవెన్స్లు లభించడం లేదు. వీరితో పనిచేయించుకునే విద్యుత్ శాఖ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా భారీ వేతనాలు లభిస్తున్నాయి. వారితోనే సమాన పనిచేస్తున్న గ్రేడ్–2 ఎనర్జీ అసిస్టెంట్లుకు మాత్రం వేతనం రూ.25 వేలు లోపే. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం గ్రేడ్–2 ఎనర్జీ అసిస్టెంట్లు అందరికీ పదోన్నతులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జూనియర్ లైన్మెన్లుగా ప్రమోషన్లు ఇస్తామని చెప్పింది. దీంతో తమ కేడర్తో పాటు జీతాలు పెరుగుతాయని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు జూనియర్ లైన్మెన్ పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో.. అటువంటి చోట మాత్రమే పదోన్నతులు అని చెప్పడంతో నీరుగారిపోయారు. 700 మందికిపైగా ఉంటే కనీసం 200 మందికి కూడా పదోన్నతులు వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే మండలానికి రెండునుంచి నాలుగు పోస్టులు వరకూ మాత్రమే జూనియర్ లైన్మెన్ పోస్టులు ఉంటాయి. అయితే ప్రభుత్వం తలచుకుంటే అందరికీ జూనియర్ లైన్మెన్లుగా పదోన్నతులు ఇవ్వొచ్చు. కానీ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై గ్రేడ్–2 ఎనర్జీ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు. ప్రమాదకరంగా పనిచేస్తున్న విద్యుత్ గ్రేడ్–2 ఎనర్జీ అసిస్టెంట్లు ఇది చాలా అన్యాయం. గ్రేడ్–2 లైన్మెన్లందరికీ పదోన్నతులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలి. అందరికీ పదోన్నతులు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలి. తక్కువ జీతంతో పనిచేస్తున్న వారి విషయంలో కనికరం చూపాలి. – సిర్ల ప్రసాద్, సీఐటీయూ నాయకుడు -
నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం కల్చరల్: ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కీలక నియామకాలు చేపట్టింది. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో పురోహిత క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఆదివారం జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో ఈ నియామక పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని నినాదాలు చేశారు. సమాఖ్య వ్యవస్థాపకుడు యామిజాల నరసింహమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు, పురోహిత సమాజ సర్వతోముఖాభివృద్ధికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఏకగ్రీవ తీర్మానం మేరకు నూతన నియామకాలు చేశారు. ఇదే నూతన కార్యవర్గం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పొదిల నారాయణమూర్తి, రాష్ట్ర అధ్యక్షుడిగా తెన్నేటి విద్యాధర శాస్త్రి సునీల్, ప్రధాన కార్యదర్శిగా వారణాసి శ్రీధర్ శర్మలు ఎన్నికై నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో సీనియర్ పురోహిత ప్రముఖులు పురాణం శేషు, పెంటా శ్రీధర్ శర్మ, పొన్నాల నరసింహమూర్తి, వాహిణీపతి మణిశర్మ, మేడూరి సంతోష్, కూనపల్లి శ్రీనివాస్, భోగాపురపు సూర్యనారాయణ, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతి
రణస్థలం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కొమర లక్ష్మణ శనివారం చింతపల్లి సమీపంలో సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. దీంతో ఆదివారం రణస్థలం మండలంలోని కొవ్వాడ సముద్ర తీరంలో కొమర లక్ష్మణ మృతదేహం లభ్యమైంది. జే.ఆర్.పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.పీఆర్ ఏఈ కృష్ణారావుకు సన్మానం టెక్కలి: టెక్కలి డివిజన్ పంచాయతీరాజ్ ఏఈ కణితి కృష్ణారావు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆదివారం పట్టణంలో ఆత్మీయులు, అధికారుల సమక్షంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కృష్ణారావు, సుబ్బమ్మ దంపతులను సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో ఈఈ సూర్యప్రకాశ్, ప్రదీప్కుమార్, విశ్రాంత ఎస్ఈ కేఎంవీ ప్రసాదరావు, కేసీహెచ్ మహంతి, మురళీమోహన్, మందస, కంచిలి ఎంపీపీలు డి.దానయ్య, పి.దేవదాస్రెడ్డి, కంచిలి ఎంపీడీవో వి.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. సత్ప్రవర్తనతో నడుచుకోవాలి శ్రీకాకుళం క్రైమ్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి, నేర ప్రవృత్తికి స్వస్తి పలికి, సత్ప్రవర్తనతో నడుచుకోవాలని జిల్లాలో రౌడీషీటర్లను పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు నగరంలోని ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఎస్ఐ ఎం.హరికృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎవరైనా భూకబ్జాలు, ఆర్థిక లావాదేవీల్లో పాల్గొంటే సహించేది లేదని స్పష్టం చేశారు. విజయనగరం క్రైమ్: శ్రీకాకుళానికి చెందిన దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్నగర్ కాలనీలో ఉంటున్న ఓ రూమ్లో ఫ్యాన్కు తన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్నగర్ కాలనీలో రూమ్ తీసుకుని గ్రూప్–2,పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. రూమ్ పక్కనే ఉన్న రీడింగ్ రూమ్కు చదువుకోవడానికి వెళ్లి తిరిగి రూమ్కు వచ్చి తనకు పని ఉందని సహచర స్నేహితురాలు మౌనికకు చెప్పి పై రూమ్లోకి వెళ్లింది. ఎంతకీ దుర్గాభవాని పై రూమ్లోనుంచి రాకపోవడంతో మౌనిక వెంటనే విజయనగరంలోనే ఉంటున్న దుర్గాభవాని సోదరుడికి ఫోన్లో విషయం తెలియజేసింది. దీంతో సోదరుడు వెంటనే వచ్చి పై రూమ్ తలుపులు పగలగొట్టి లోపల దుర్గాభవాని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి ఆమెను కిందికి దించి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఓఆర్ఎస్..!
ఆరోగ్య రక్షణకు.. ● జిల్లాలో మండుతున్న ఎండలు ● ఓఆర్ఎస్తో తక్షణ ఉపశమనం ● ఇంట్లోనే తయారు చేసుకునే అవకాశంపాతపట్నం: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. శరీరంలో నీరు ఆవిరైపోయి జనాలు నీరసించి పోతున్నారు. ఠారెత్తిస్తున్న ఎండల తీవ్రతను తట్టుకునేందుకు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునేందుకు వేసవిలో ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలు పాటించడం అవసరం. సాధారణం కంటే అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఈ ఏడాది ఉన్నాయి. దీంతో శ్రామిక, ఉద్యోగ, వ్యాపారులు విధి నిర్వహణలో భాగంగా అనివార్య పరిస్థితుల్లో మండే ఎండల్లో తిరగక తప్పదు. ఉపాధి పనులు, ఇతరత్రా వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా మండుటెండలో పనులు చేయాల్సి వస్తుంది. అటువంటి వారు ఎండ ప్రభావానికి లోనుకాకుండా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓఆర్ఎస్తో మేలు ఎండల్లో పనిచేసే సమయంలో శరీరంలో సహజంగా నీటిశాతం తగ్గిపోవడం వలన వడదెబ్బకు గురవుతుంటారు. ఇలాంటి ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ద్రావణం ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. స్థలం, కాలాన్ని బట్టి శరీరాన్ని నిర్దేశించిన ఉష్ణోగ్రతలో ఉంచుకోవాలి. మెదడులో హైపోథలామస్ అనే భాగం శరీరంలోని వేడిని క్రమబద్ధీకరిస్తుంది. తగిన నీటిని తాగకపోయినా, ఎండలో ఎక్కువ తిరిగినా హైపోథలామస్ భాగమే అధిక ఉష్ణోగ్రతకు లోనై క్రమబద్ధీకరించే పని చేయలేదు. ఈ స్థితిలో తల తిరగడం, నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, జ్వరం, చీకటి కమ్మినట్లు అనిపించడం, వాంతి అవుతున్న భావన కలగడం వంటి లక్షణాలు వడదెబ్బకు గురైనట్లు నిర్ధారిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యారోగ్య కార్యకర్తల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. అటువంటి సమయాల్లో వీటిని తీసుకోవడం వలన వెంటనే ఉపశమనం లభిస్తుంది. సమయానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ అందుబాటులో లేకపోతే ఇంటిలోనే ఉప్పు, పంచదార, నీరు సాయంతో ఈ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. లీటరు నీటిలో చిటికెడు ఉప్పు, అరస్పూన్ పంచదారను కలిపి తాగవచ్చు. ఎండ తీవ్రతకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించడం అవసరం. ఓఆర్ఎస్ తయారీ ఇలా... ఓఆర్ఎస్ అనేది వివిధ లవణాల మిశ్రమంతో కూడిన 20.5 గ్రాముల సోడియం క్లోరైడ్. దీనిలో 1.5 గ్రాముల పొటాషియం క్లోరైడ్, 2.9 గ్రాముల సోడియం సిట్రేట్, 13.5 గ్రాముల డెక్స్ట్రోజ్ ఉంటాయి. ఈ పౌడర్ ప్యాకెట్ను సురక్షితమైన లీటరు నీటిలో కలిపి రోజు మొత్తంలో వయస్సును బట్టి తగిన మోతాదులో తాగాలి. మితిమీరిన మోతాదులో తాగడమూ అనర్థాలు తెచ్చిపెడుతుంది. వడదెబ్బ బారిన పడినవారు డీ హైడ్రేషన్కు గురవుతారు. అటువంటి సమయంలో ముందుగా ఓఆర్ఎస్ ప్యాకెట్ను వినియోగించడం వల్ల కొంతవరకు కోలుకుంటారు. ఓఆర్ఎస్లో అన్ని రకాల మినరల్స్ ఉంటాయి. అవసరమైనవారు తీసుకోవచ్చు. – డాక్టర్ జి.వేణుగోపాల్, సూపరింటెండెంట్, పాతపట్నం సీహెచ్సీ -
● ‘ఏమరపాటుగా ఉంటే ఓట్లు పోతాయి’
ఎన్నికల కమిషన్ అధికారికంగా నిర్వహిస్తు న్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్ఐఆర్) ప్రక్రియ చాలా కీలకమని, దీనిలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మన ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షు డు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోంపేట పట్టణంలోని వీబీఆర్ కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఇచ్ఛాపురం నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ సీపీ బూత్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఓటరును కాపాడుకోవాలని పార్టీ ‘సర్’ కార్యక్రమం రాష్ట్ర పరిశీలకుడు హర్షవర్ధన్రెడ్డి అన్నారు. మన ఓటుతోపాటు మన పార్టీ మద్దతుదారుల ఓటు కాపాడుకోవటమే మన పార్టీ 2029 గెలుపునకు నాంది అన్నారు. సర్ కార్యక్రమంలో భాగంగా నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు సైనికుల్లా పనిచేయాలని పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు. – కంచిలి, సోంపేట -
జిల్లా కేంద్రంలో కార్డన్ సెర్చ్
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధి పెద్దరెల్లివీధిలో ఆదివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 70 మంది సిబ్బందితో 250 ఇళ్లను సెర్చ్ చేసి సరైన పత్రాలు, రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. సీఐ పి.ఈశ్వరరావు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి, మద్యం, ఇతర అనధికార పేలుడు పదార్థాల అక్రమ నిల్వలు, అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచాలనే ఉద్దేశంతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు సెర్చ్ చేసినట్లు తెలిపారు. వ్యక్తుల ఆధార్కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు, వాహనాల రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఐలు హేమంత్ కల్యాణ్, చంద్రకళ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి: జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు సత్వర సేవలందించడంలో ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఉత్తమ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారని విద్యుత్ శాఖ ఇంజినీర్లు ప్రశంసించారు. సర్కిల్ ఎస్ఈగా పనిచేసిన నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆదివారం ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా స్థానిక విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయ ఆవరణలో కృష్ణమూర్తి దంపతులను విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, సిబ్బంది సంయుక్తంగా ఘనంగా సత్కరించారు. జిల్లా సర్కిల్లో ఎస్ఈ హోదాలో ఉన్నతాధికారులతో ఎంతో గౌరవాన్ని పొంది.. తద్వారా జిల్లా సర్కిల్కు మంచి గుర్తింపు తెచ్చారని వక్తలు కొనియాడారు. అత్యధిక కాలం జిల్లా ఎస్ఈగా పనిచేసి, ఇక్కడే పదవీ విరమణ చేస్తూ రికార్డు సృష్టించారని ఇన్చార్జి ఎస్ఈ సురేష్కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పైడి యోగేశ్వరరావు, బయ్యన్నాయుడు, నరసింగ్కుమార్, యజ్ఞేశ్వరరావు, విష్ణుమూర్తి, విశ్రాంత విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు, ఎస్ఈవో శ్రీనివాసరావు, ఏఏవోలు మహంతి ప్రభాకరరావు, సుదర్శనరావు, జేఏవోలు సనపల వెంకటరావు, ఆర్.శ్రీనివాస్, ఏఈలు జె.సురేష్కుమార్, కె.జయరాం, కమల్హాసన్, జిల్లా విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు ఉంగటి పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లయిన 21 రోజులకే..
ఆరోగ్య రక్షణకు ఓఆర్ఎస్ మండు వేసవిలో ఓఆర్ఎస్ ఓ సంజీవని. ప్రతి ఇంటిలో ఉండాల్సిన పానీయం. –8లో● రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి ● కన్నీరుమున్నీరైన భార్య, కుటుంబ సభ్యులు సంతబొమ్మాళి: కాళ్ల పారా ణి ఆరలేదు.. ఇంటికి కట్టిన తోరణాలు వాడలేదు.. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి నెలయినా కాలేదు.. అప్పుడే ఆ యువకుడికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. కట్టుకున్న భార్యకు కన్నీళ్లు మిగిల్చి, కన్నవారి మదిలో శోకాన్ని రగిల్చి పెళ్లయిన 21 రోజులకే మృత్యుదేవత ఒడికి చేరుకున్నాడు. మండలంలోని మూలపేట గ్రామానికి చెందిన దారపు రాజు (27) ఆదివారం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈయనకు మే 10వ తేదీన వివాహమైంది. వివరాల్లోకి వెళితే.. మూలపేట గ్రామానికి చెందిన దారపు రమణరెడ్డి, ఎర్రమ్మ కుమారుడు దారపు రాజు సీమెన్గా పని చేస్తున్నాడు. రాజుకు కోటబొమ్మాళి గ్రామానికి చెందిన అమ్మాయితో మే నెల 10వ తేదీన వివాహం జరిగింది. కోటబొమ్మాళిలో ఉంటున్న తన అత్తవారి ఇంటికి తన భార్య దీపికతో కలిసి ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై రాజు వెళ్లాడు. అక్కడ కొద్ది సేపు ఉండి తిరిగి ద్విచక్రవాహనం మీద స్వగ్రామం మూలపేట రా వడానికి బయలు దేరగా సవరపేట జంక్షన్ వద్ద అతివేగంగా వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాసేపటి కిందటే ఇంటి నుంచి బయల్దేరిన భర్త చనిపో యాడనే వార్త చెవిన పడడంతో ఆ నవ వధువు నిశ్చేష్టురాలైంది. భర్తను తలచుకుని గుండెలు అవిసిపోయేలా రోదించింది. ఇరు కుటుంబాలు, బంధువులు, గ్రామస్తుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సంతబొమ్మాళి ఎస్ఐ వై.సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇచ్ఛాపురం.. గంజాయికి ప్రవేశ ద్వారం
ఇచ్ఛాపురం రూరల్: రాష్ట్రానికి ప్రవేశ ద్వారంగా ఉన్న ఇచ్ఛాపురం గంజాయి అక్రమ రవాణాకు ప్రధాన మార్గంగా మారుతోంది. ఒడిశా, ఆంధ్ర సరిహద్దు ప్రాంతా ల నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు గంజాయిని తరలించేందుకు స్మగ్లర్లు ఇక్కడి రైలు, జాతీయ రహదారి మార్గాలను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు వరుసగా వెలుగు చూస్తున్న కేసులు సూచిస్తున్నాయి. పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు తరచూ దాడులు నిర్వహించి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నా.. అక్రమ రవాణా మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదని స్థానికులు అంటున్నారు. రెండేళ్లలో పెరిగిన కేసులు ప్రస్తుత టీడీపీ పాలన రెండేళ్ల కాలంలో ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో నమోదైన గంజాయి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికార గణాంకాలు సూచిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న గంజాయి పరిమాణం కూడా గతంతో పోలిస్తే అధికంగా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో ఇలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గంజాయి వంటి మత్తుపదార్థాల అక్రమ రవాణాకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆంధ్రా–ఒడిశా పరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పా టు చేసింది. గంజాయి సాగు, రవాణాపై పోలీసులు, ఎకై ్సజ్ శాఖలు సంయుక్తంగా దాడులు చేసేవి. జాతీయ రహదారులు, చెక్పోస్టుల వద్ద వాహనాలు తనిఖీలు చేసేవారు. రైల్వే స్టేషన్లలో రైల్వే పోలీసులతో సమన్వయం పెంచుకుని అంతర్రాష్ట్ర సమాచార మార్పిడి ద్వారా స్మగ్లర్లపై నిఘాతో గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు చేపట్టినట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఇచ్ఛాపురం మీదుగా వరుసగా గంజాయి కేసులు వెలుగు చూస్తుండటంతో నిఘా వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో పర్యవేక్షణ బలోపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా, అక్రమ రవాణాను అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు అవసరమని ప్రజలు కోరుతున్నారు. యువత భవిష్యత్కు ముప్పు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం యువతను వ్యసనాలకు బానిసలుగా మారుస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యా ర్థులు, యువకులు మాదక ద్రవ్యాల ప్రభావానికి లోనైతే వారి విద్య, ఉపాధి, కుటుంబ జీవితం దెబ్బతింటుందని చెబుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు యువకులు రవాణా ముఠాలకు సహకరిస్తుండటంతో మరింత ప్రమాదకరంగా మారింది. గత నెలలో ఇచ్ఛాపురం మండలం కేదారిపురం గ్రామానికి చెందిన భుక్త బలరాం అనే యువకుడు 2.100 కిలోల గంజాయితో పట్టుపడటంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జిల్లా పోలీస్ స్టేషన్కు తరలించగా, మరుసటి రోజు ఏప్రిల్ 7న బాత్రూమ్ కిటికీకి తువ్వాలును మెడకు చుట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధి లోని పురుషోత్తపురం గ్రామానికి చెందిన 23 ఏళ్ల బుగ్గ చిరంజీవి ఒడిశా రాష్ట్రం చంద్రగిరి ప్రాంతానికి చెందిన మాన్యువల్ బీరా, టీన్ఫోరియా గ్రామానికి చెందిన రవీంద్రసేధి, సింహాచల్ సేధి తదితరుల దాడులు చేస్తున్నాం ఎస్పీ ఆదేశాలు మేరకు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాం. సరిహద్దులను రవాణా కేంద్రాలుగా చేసుకొని కొంత మంది అక్రమ వ్యాపారాలు సాగిస్తున్న నేపథ్యంలో ముఖ్య కూడళ్లలో, రైల్వే కూడళ్లలో నిఘా పెట్టి వరుస దాడులు చేస్తున్నాం. యువతకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి తెర వెనుక మాఫియా దందా సాగిస్తున్నట్లు సమాచారంతో వారిపై నిఘా ఉంచడం జరిగింది. కేవలం పట్టివేతలకే పరిమితం కాకుండా సరఫరా గొలు సును పూర్తిగా ఛేదించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. అదే విధంగా రాపిడ్ టెస్ట్ల ద్వారా గంజాయి వినియోగదారులను గుర్తిస్తున్నాం. – మీసాల చిన్నంనాయుడు, సీఐ, ఇచ్ఛాపురం రైళ్లు, రహదారులే ప్రధాన మార్గాలు నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ లారీ డ్రైవర్లు తదితరులకు విక్రయిస్తుండటంతో పాటు తమిళనాడుకు చెందిన గంజాయి వ్యాపారి రమేష్ వేలాయుధంకు కూడా అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీటన్నింటిపై గతంలో ఇతనిపై పలు కేసులు నమోదయ్యాయి. ఐదేళ్లలో ఇచ్ఛాపురం సర్కిల్లో నమోదైన గంజాయి కేసులు సంవత్సరం కేసులు కిలోలు ఖరీదు వాహనాలు అరెస్టయిన వారు 2022 04 162.01 రూ.4,86,030 02 19 2023 05 112.390 రూ.2,84,370 03 20 2024 20 371.51 రూ.8,94,930 00 84 2025 42 642.870 రూ.21,58,790 07 79 2026 08 85.28 రూ.1,95,840 01 16 (నేటి వరకు)ఇచ్ఛాపురం మీదుగా వెళ్లే ప్రధాన రైల్వే మార్గం, జాతీయ రహదారి–16 గంజాయి రవాణాదారులకు అనుకూలంగా మారింది. రైళ్లలో ప్ర యాణికుల వేషంలో, బస్సులు, కార్లు, లారీలలో ప్రత్యేకంగా దాచి పెట్టి గంజాయిని తరలిస్తున్న ఘటనలు తరచూ బయటపడుతున్నా యి. 90 శాతం కేసులు స్థానిక రైలు మార్గంలో పోలీసులకు చిక్కినవే. -
యాదవులను బీసీ–ఏ కేటగిరిలోకి మార్చాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): యాదవులను బీసీ–డీ నుంచి బీసీ–ఏ కేటగిరిలోకి మార్చాలని ఎమ్మెల్సీ, యాదవ సంఘం అధ్యక్షుడు నర్తు రామారావు కోరారు. నగరంలోని ఒక ప్రైవేట్ భవనంలో యాదవ విద్యా వైజ్ఞానిక చైతన్య సదస్సు–2026, ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నర్తు రామారావు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఫలాలు జనాభా ప్రాతిపదికన యాదవులకి దక్కాలన్నారు. యాదవ కులానికి చెందిన నిరుపేద విద్యార్థులు గ్రూప్–1, 2లకు ప్రిపేర్ అయితే ఆర్థిక సాయం అందిస్తామన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐఐటీలో ఉత్తమ ఫలితాలు సాధించినవారికి ప్రోత్సాహకాలు అందించనున్నామన్నారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులను సత్కరించారు. కార్యక్రమంలో యాదవ ఉద్యోగుల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు డొక్కరి ధనుంజయరావు, ప్రధాన కార్యదర్శి కొర్రాయి రామారావు, కూస వెంకటరమణ, నర్తు సోమేశ్వరరావు, మామిడి శ్రీనివాస్, దాసరి ఈశ్వరరావు, వంకల విజయకుమారి, పాలిన శ్రీనివాసరావు, కాళ్ల జయదేవ్, దాసరి రాజు, కుజ్జ తాతారావు, ఇప్పిలి జగదీష్, ఈ.వి.సత్యనారాయణ, కిల్లాన భోజ్కుమార్, వంజరాపు రాజులు, గద్దిబోయిన కృష్ణయాదవ్, కలగ గోపాల్, వెంకటరమణ, గజ్జి షన్ముఖ, వంజరాపు కసవయ్య, కిల్లాన శ్రీనివాస్, కిల్లాన ఫల్గుణరావు, ఇప్పిలి జగదీష్, సబ్సి జానకీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏళ్లుగా పాతుకుపోయారు
సంతబొమ్మాళి: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణం. నిబంధనలకు అనుగుణంగా ప్ర తి మూడేళ్లకు ఒక సారి బదిలీలు జరుగుతుంటాయి. అయితే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా సంతబొమ్మాళిలో పనిచేసే ఉద్యోగులకు ఈ నిబంధలేవీ వర్తించవు. ఏళ్ల తరబడి ఉపాధి హామీ పథకంలో పాతుకుపోయి ఇష్టానుసారంగా వ్యవహరించి ఆడిందే ఆట.. పాడిందే పాటగా కొనసాగుతున్నా రు. ఉన్నతాధికారులు ఎందరు మారినా మేనేజ్ చేసుకుని తమ స్థానాన్ని పదిలం చేసుకోవడంలో వీరు దిట్ట. రెండేళ్ల కిందట స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన ప్రజావేదికలో అప్పటి డ్వామా పీడీ సుధాకర్ ఏళ్ల తరబడి ఒకే చోట పని చేసిన ఉపాధి హామీ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసి బదిలీ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత పీడీ సుధాకర్ బదిలీ అయి వెళ్లిపోవడంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. మురపాకల మురళి 2013 జనవరిలో సంతబొమ్మాళి ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్గా జూయిన్ అయ్యారు. ఉప్పా డ ధర్మారావు 2013 మే నెలలో టెక్నికల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. వీరిద్దరూ 13 ఏళ్లుగా ఒకే చోట పని చేస్తున్నా ఇప్పటివరకు బదిలీలు జరగలేదు. 2019 సంవత్సరంలో టెక్నికల్ అసిస్టెంట్గా టి.రాజారావు, కంప్యూటర్ ఆపరేటర్గా గంగి జయకృష్ణరావు, జె.బాబూరావు, బి.జగదాంబ చేరారు. ఏడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారు. 2021 సంవత్సరం నుంచి జి.మురళీకృష్ణ, 2022 సంవత్సరం నుంచి బి.మన్మధరావు, జి.లక్ష్మణరావు, ఎస్.రమేష్కుమార్ టెక్నికల్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకే చోట పని చేయడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఇన్చార్జిలే దిక్కు మండలంలో సుమారు 15వేల మంది ఉపాధి వేతనదారులు పని చేస్తున్నా రెగ్యులర్ ఏపీఓ, ఈసీ పోస్టులకు నియామకాలు ఏళ్లుగా లేవు. ఇన్చార్జిలే దిక్కుగా మారారు. అవుట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్గా పని చేస్తున్న పంగ నరసింహమూర్తి ఉపాధి హామీ ఏపీఓగా వ్యవహరిస్తున్నారు. అలాగే మరో టెక్నికల్ అసిస్టెంట్ జి.లక్ష్మణరావు ఇంజినీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ)గా పని చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్ పో స్టులు వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీఓ జయంత్ ప్రసాద్ను అడుగగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు. -
నేడు ‘దగా డీఎస్సీ’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీని ‘దగా డీఎస్సీ’గా మార్చారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావుపూలే పార్కు వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్, జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశా రు. కార్యక్రమానికి జిల్లాలో ముఖ్య నాయకు లు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజులు ముఖ్య అతిథులుగా హాజరవ్వనున్నట్లు తెలిపారు. దగా డీఎస్సీ కార్యక్రమం పొన్నాడ వంతెన, మహా త్మా జ్యోతిరావుపూలే పార్కు వద్ద జరగనుందని, ఈ కార్యక్రమానికి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరవ్వాలని కోరారు. విమ్స్ డైరెక్టర్గా మందస వాసి మందస: విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) డైరెక్టర్గా మందసకు చెందిన డాక్టర్ వి.మన్మథరావు నియమితులయ్యారు. మన్మథరావు మండలంలోని డబారు గ్రామంలో జన్మించారు. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తి చేశారు. హరిపురం పీహెచ్సీలో తొలి పోస్టింగ్ లభించింది. ప్రస్తుతం ఆయన విశాఖపట్నం కేజీహెచ్ సర్జరీ విభాగానికి అధిపతిగా ఉన్నారు. విమ్స్ డైరెక్టర్గా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. నేటితో ముగియనున్న బీపీసీఎల్ టోర్నీ శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పురోహిత్ బ్రాహ్మణ క్రికెట్ లీగ్ టోర్నీ తుది దశకు చేరుకుంది. సోమవారంతో ఈ మెగా క్రికెట్ టోర్నీ ముగియనుంది. ఐదురోజులపాటు హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో ఫైనల్ పోరులో విశాఖపట్నం ఆచార్య జట్టు, మహావీర్ కింగ్స్ (మోదిదేవి విజయవాడ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం) జట్టు తలపడనున్నాయి. కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జరిగే ఈ ఫైనల్ మ్యాచ్కు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, నగర ప్రముఖులు, బ్రాహ్మణ సంఘం రాష్ట్రస్థాయి నాయకులు హాజరు కానున్నట్టు నిర్వహణ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. విద్యుత్ శాఖ ఇన్చార్జి ఎస్ఈగా సురేష్కుమార్ అరసవల్లి: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సర్కిల్ ఎస్ఈగా జి.సురే ష్కుమార్కు ఇన్చార్జి బా ధ్యతలు అప్పగిస్తూ కార్పొరేట్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఇంతవరకు ఎస్ఈగా విధుల్లో ఉన్న నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆదివారం పదవీ విరమణతో టెక్నికల్ ఈఈగా పనిచేస్తున్న సురేష్కుమార్కు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. మరో రెండు రోజుల్లోగా రెగ్యులర్ ఎస్ఈ నియామకాన్ని చేపట్టనున్నారని సమాచారం. శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రం సమీపంలోని పొన్నాడ బ్రిడ్జి వద్దగల పొన్నాడ గ్రామంలో గత 41 రోజులుగా నిర్వహించిన వేసవి తరగతులు ఆదివారం ముగిశాయి. శ్రీఅయ్యప్పపీఠం, శ్రీహరేరామ భక్త భజన బృందం ఆధ్వర్యంలో చిన్నారులకు భగద్గీత పఠనం, విష్ణుసహస్రనామ పారాయణ, లక్ష్మీ సహస్ర పఠనంపై తరగతులు జరిగాయి. ముగింపు సందర్భంగా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు దాతల సహకారంతో అందజేశారు. -
స్వర నివేదన
సంగీత సాధన..● సంగీతంలో ఆకట్టుకుంటున్న చిన్నారులు వేదికపై చిన్నారుల ప్రదర్శన సంగీతం అంటే నాకు ప్రాణం. గత నాలుగేళ్లుగా నేర్చుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ప్రదర్శనలో పాడడం చాలా సంతోషంగా ఉంది. – పి.కన్విత, 6వ తరగతి, శ్రీకాకుళం శ్రీకాకుళం కల్చరల్: నగరంలో తల్లిదండ్రులు తమ చిన్నారుల ఆసక్తి మేరకు వేసవి నేపథ్యంలో పలు రకాల శిక్షణల్లో చేర్చుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా తమ పిల్లలకు సంగీతం నేర్పించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపిస్తున్నారు. అలా నేర్చుకున్న చిన్నారులు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చేస్థాయికి చేరుతున్నారు. స్థానిక బాపూజీ కళా మందిర్లో ఆదివారం శ్రీచరణి సంగీత కళాక్షేత్రంలో సంగీత సాధన చేసి.. పలువురు చిన్నారులు ప్రదర్శన ఇచ్చి తమ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపారు. సంగీతంలో రేడియో గ్రేడ్ ఆర్టిస్టుగా ఎదగాలని కోరిక ఉంది. కష్టపడి గత ఆరేళ్లుగా సాధన చేస్తున్నాను. ఇక్కడి వేదికపై ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది. – పి.జాన్విత, ఇంటర్మీడియట్, శ్రీకాకుళం ● -
నది రోదించేలా..
నరసన్నపేట: మండల పరిధిలోని వంశధార నదిలో అక్రమార్కుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంతం ఆనవాళ్లు లేకుండా చేస్తున్నా రు. అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ చోద్యం చూస్తుండటంతో అక్రమార్కులు మరింతగా రెచ్చి పోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన రెండేళ్ల నుంచీ ఇసుక అక్రమార్కులు మరింత పెరిగారు. వీరికి స్థానిక కూటమి నాయకుల అండదండలు ఉండటంతో మరింతగా రెచ్చిపోతున్నారు. మండలంలో గోపాలపెంట, మడపాం, బుచ్చిపేట, చేనులవలస వద్ద నదిలోకి రహదారులు ఏర్పాటు చేశారు. భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. రోజుకు వందల లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. పరిమితికి మించి ఇసుకను లోడ్ చేస్తుండటంతో రోడ్లు శిథిలమవుతున్నాయి. మడపాం వద్ద మూడు వంతెనలు ఉన్న చోట కూడా ఇసుక తవ్వకాల అక్రమ వ్యవహారం నిబంధనలకు విరుద్ధంగా సాగుతూనే ఉంది. దీంతో వంశధార నది స్వరూపం మారిపోతోంది. నదిలో ఎక్కడికక్కడ చెరువుల మాదిరిగా గోతు లు కనిపిస్తున్నాయి. నదిలో నీటి ప్రవాహ దిశను తమకు అనుకూలంగా మార్చి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. అంతా అనధికారికంగా జరుగుతున్నా రెవెన్యూ, గనుల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం ప్రకృతి వనరులను కాపాడాల్సిన పొల్యూషన్ బోర్డు అధికారులు, పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో వందల క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమంగా తరలుతోంది. నది ఒడ్డున వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను డంప్ చేస్తున్నారు. ఈ ఇసుక కుప్పలు కొండలను తలపిస్తున్నాయి. రోడ్డుపై ఇసుక మేటలు ఇసుక అక్రమ రవాణాతో మండల పరిధిలోని చేనులవలస, బుచ్చిపేట ఆర్అండ్బీ రోడ్డుపై ఇసుక మేటలు ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. వాహనాలు స్లిప్ అవుతున్నాయి. ఆటోలు అదుపు తప్పుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో చేనులవలస, బుచ్చిపేట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక మేటలతో ధూళి రేగుతోందని, ఏదైనా వాహనం వెళ్తే వెనుక ఉండలేక పోతున్నామని, ప్రయాణం చేయలేకపోతున్నా మని వాపోతున్నారు. అలాగే ఇసుక తరలింపుతో గోపాలపెంట, పోతయ్యవలస రోడ్డు కూడా అధ్వానంగా మారింది. మడపాంలో కూడా ఇదే పరిస్థితి. అధికారులు చర్యలు తీసుకోవాలని ఇసుక అక్రమ తవ్వకాలు నిలుపుదల చేయాలని కోరుతున్నారు. కాగా మండలంలో ఇసుక అక్రమ ర్యాంపులు అన్నింటినీ ఒకరే నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఇసుక ద్వారా ఆ పెద్దాయనకు రోజుకు కనీసం రెండు లక్షల ఆదాయం వస్తున్నట్లు సమాచారం. వంశధార నదిలో అక్రమార్కుల విధ్వంసం పట్టించుకోని అధికార గణం నరసన్నపేట మండలంలో యథేచ్చగా ఇసుక దోపిడీ -
వినూత్న ఆలోచన.. విశిష్ట గుర్తింపు
● బొంతలకోడూరు విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు ఎచ్చెర్ల: ఉత్సవాలు, జాతరల సమయాల్లో జరిగే ప్రమాదాలను నివారించేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు ప్రశంసలు అందుకుంది. ఈ అంశంపై అమెజాన్ ఫండింగ్ క్వెస్ట్ అలయన్స్ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 24 పాఠశాలలు పాల్గొన్నాయి. విశాఖపట్నంలోని గీతం ఇంజినీరింగ్ కళాశాలలో ఐదురోజులు పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు శిక్షణ కూడా పొందారు. దేవాలయ జాతరలు, ఉత్సవాలు, పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వేలాది మంది భక్తులు ఒకే చోట చేరటం ద్వారా కొన్ని సార్లు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు తక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి బొంతలకోడూరు విద్యార్థులు స్మార్ట్ గేట్ ఏ 1, ఎర్లీ డిటెక్షన్–ఇన్స్టెంట్ ప్రొటెక్షన్ వ్యవస్థను ఆవిష్కరించారు. కెమెరాలు, సెన్సార్ల సాయంతో జనసమూహాన్ని పర్యవేక్షించి రద్దీ ఎక్కువైతే అలర్ట్ ఇచ్చి గేట్లను మొబైల్ యాప్ ద్వారా నియంత్రించి తొక్కిసలాటను నివారణ చేసే విధంగా ఒక డివైస్ను రూపొందించారు. వీరి ప్రాజె క్ట్ స్టేట్ లెవెల్లో బెస్ట్ ఇన్నొవేషన్ ప్రాజెక్ట్గా నిలిచింది. కార్యక్రమంలో ఆర్జేడీ విజయ్బాస్కర్, విశాఖపట్నం సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ జోగా చంద్రశేఖర్ పాల్గొని విద్యార్థులను ప్రశంసించారు. ప్రాజెక్టును డిజైన్ చేసిన విద్యార్థులు అఖిల్పట్నాయిక్, డిల్లీశ్వరి, కావ్య, చైతన్య, కుమారి, రోహిత్లను, వీరికి మార్గ దర్శకులుగా ఉన్న సైన్స్ ఉపాధ్యాయిని పూర్ణిమలను రాష్ట్ర స్కెర్ట్ ప్రొఫెసర్ నాగమణితో పాటు క్వెస్ట్ అలియన్స్ బృందంతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనందరావు, మాజీ సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు, విద్యాకమిటీ చైర్మన్ మాడుగల సత్యానందం, చిన్నబాబు తదితరులు అభినందించారు. -
డీఎస్సీ అక్రమాలపై నిరసన ర్యాలీ విజయవంతం చేయండి
నరసన్నపేట: డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో తీవ్ర అవకతవకలు జరిగాయని, మెరిట్ లిస్టు ప్రకటించకుండా నచ్చిన వారికి పోస్టులు అమ్ముకున్నారని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ శ్రీకాకుళంలో సోమవారం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీ అభ్యర్థుల ఎంపికలో తీవ్ర అవకతవకలు జరిగాయని అన్నారు. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో అర్హులైన అభ్యర్థులకు కాకుండా తమకు నచ్చిన వారికి డబ్బులకు ఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్నారని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో మెరిట్ జాబితా విడుదల చేయకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఒక్కో పోస్టు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ అమ్ముకున్నారని విమర్శించారు. నరసన్నపేటలోనే అనిల్ అనే అభ్యర్థి తీవ్రంగా మోసపోయారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ అనిల్ తిరుగుతున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని అన్నారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో ఎంకై ్వరీ చేయించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకల్లా జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: యువత భవిష్యత్ను నాశనం చేస్తున్న గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై మరింత కఠినంగా వ్యవహరిస్తూ ఉక్కుపాదం మోపాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన అధ్యక్షతన ‘నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సెంటర్’, రోడ్ సేఫ్టీ కమిటీలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, రవాణా, పోలీస్, ఎన్హెచ్ఏఐ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గంజాయి కట్టడితో పాటు రహదారి ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ తరఫున పాల్గొన్న అదనపు ఎస్పీ కేవీ రమణ మాట్లాడుతూ.. జిల్లాలో గడిచిన మార్చి, ఏప్రిల్ నెలల్లో మొత్తం 18 కేసులు నమోదు చేసి, 119.53 కిలోల గంజాయిని, 3 వాహనాలను స్వాధీనం చేసుకుని 40 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఏపీకి చెందిన వారు 17 మంది కాగా.. ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, కేరళ, దిల్లీ రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో రణస్థలం వద్ద జాతీయ రహదారి. విస్తరణ పనులు, శ్రీకాకుళం బైపాస్ జంక్షన్ వద్ద త్వరలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. -
శ్రీకాకుళం
హాయి చాటున అపాయంఏసీలు ప్రమాదకరంగా మారుతున్నాయి. అక్కడక్కడా పేలుతున్నాయి. –8లోనరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేట పరిధిలోని సంతపేట ఎదురుగా ఉన్న కొత్తకర్ర చెరువు పరిసరాల్లో సీఎం టూర్ సందర్భంగా వేసిన చెత్తను పంచాయతీ అధికారులు ఎట్టకేలకు తొలగించే పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ట్రాక్టర్లతో వందకు పైగా చెత్త లోడులు డంపింగ్ యార్డ్కు తరలించారు. ‘సాక్షి’లో శుక్రవారం ‘కోట్లు పోయాయి.. చెత్త మిగిల్చాయి’ అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారులు వెంటనే స్పందించారు. శుక్ర, శనివారాల్లో కొత్త కర్ర చెరువు వద్ద వేసిన చెత్త తొలగించే పనులు చురుగ్గా చేపట్టారు. స్వయంగా జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి చెరువు వద్ద వేసిన చెత్తను పరిశీలించి స్థానిక ఈఓ ద్రాక్షాయినికి, పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశా రు. దీంతో ఆమె పంచాయతీ ట్రాక్టర్లు, జేసీబీ సహకారంతో చెత్తను తొలగించే పనులు చేయిస్తున్నారు. ఆదివారం నాటికి చెత్తను పూర్తిగా తొలగిస్తామని ఈఓ అన్నారు. మళ్లీ ఈ పరిసరాల్లో చెత్త వేయవద్దని ఆమె సూచించారు. ఈ మేరకు బోర్డులు పెడతామన్నారు. -
ప్రభుత్వ బడుల్లో శతశాతం ప్రవేశాలే లక్ష్యం
● విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం శ్రీకాకుళం: జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో శతశాతం ప్రవేశాలే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహించిన మండల విద్యాశాఖాధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశానికి కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా హాజరై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బడి పిలుస్తోంది–2026 కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాల నమోదు ఉత్సాహంగా సాగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. రానున్న విద్యా సంవత్సరంలో వంద శాతం ప్రవేశాల లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సరికొత్త వ్యూహాలతో, సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యాల సాధనలో అద్భుతమైన ప్రగతి కనబరుస్తున్న మండలాలను ప్రత్యేకంగా అభినందించారు. ఐదేళ్లు నిండిన పిల్లలను 1వ తరగతిలో చేర్పించడంలో బూర్జ, లక్ష్మీనర్సుపేట, మెళియాపుట్టి, సంతబొమ్మాళి, సారవకోట మండలాలు నిర్దేశిత లక్ష్యాలను అధిగమించి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. అలాగే ఉన్నత తరగతుల నమోదులో జిల్లా సగటు అత్యంత మెరుగ్గా ఉందన్నారు. లావేరు, పలాస, బూర్జ మండలాలు మంచి ప్రగతిని సాధించి ముందు వరుసలో నిలిచాయని, మిగిలిన మండలాలు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అత్యాధునిక వసతులు, లీప్ కార్యక్రమం ద్వారా అందిస్తున్న విద్యా ప్రమాణాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించి బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో డీఈవో రవిబాబు, జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఏపీపీ ఈసీఈ పరీక్ష పరిశీలకునిగా శ్రీనివాసరావు
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్–1 డాక్టర్ ఎం.శ్రీనివాసరావు ఏపీపీ ఈసీఈ–2026కు పరీక్ష పరిశీలకునిగా నియమితులయ్యారు. రెండేళ్ల డీపీఈడీ, బీపీఈడీల్లో ప్రవేశానికి వచ్చే నెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ ఈ పరీక్షలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు) క్యాంపస్ కేంద్రంగా నిర్వహించనుంది. ఈ పరీక్షల్లో భాగంగా నిర్వహించే శారీరక దారు ఢ్యం, క్రీడా నైపుణ్యాలు వంటి వాటిని పరిశీలించి పర్యవేక్షించేందుకు డాక్టర్ శ్రీనివాసరావును నాగార్జున వర్సిటీ నియమించింది. ఈ నియామకంపై వర్సిటీ వర్గాలు ఆయనకు అభినందనలు తెలిపాయి. రణస్థలం: రైతులకు ఇచ్చే యూరియాను పరిశ్రమల్లో అక్రమంగా నిల్వ ఉంచడం చట్టరీత్యా నేరమని వ్యవసాయశాఖ జేడీఏ వైవీ మురళీకృష్ణ తెలిపారు. మండలంలోని యునైటెడ్ బ్రూవరీస్, లిక్వినాక్స్ గ్యాస్ పరిశ్రమలో యూరియా నిల్వలపై వ్యవసాయశాఖ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో కూడిన టాస్క్ ఫోర్స్ టీమ్ సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో సోదాలు చేసి అక్రమ నిల్వలు లేవని గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం యూరియా అక్రమ నిల్వలు ఉంచి తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొందూరు: పొందూరులో చేనేత, ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుతో నేత కార్మికులతో పాటు, వడుకు కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మండలంలో రాపాక కూడలికి సమీపంలో ఏర్పాటు చేయనున్న ఖాదీ, చేనేత క్లస్టర్ల ఏర్పాటు కో సం రెవెన్యూ అధికారులు సూచించిన సర్వేనంబర్ 310–9లో స్థలాన్ని శనివారం పరిశీలించారు. క్లస్టర్కు 5 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ స్థలానికి ఎలాంటి సాంకేతిక సమ స్యలు ఉన్నా వెంటనే పరిష్కరించి స్థలాన్ని సిద్ధం చేయాలని తహసీల్దార్ ఆర్.వెంకటేష్ను ఆదేశించారు. క్లస్టర్ ఏర్పాటుతో ఖాదీ, చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు విస్తృత మా ర్కెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అనంతరం పొందూరులోని సాయి బాబా చేనేత సహకార సంఘం ఆవరణలో ఉన్న భవనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఎంపీఈడీఓ ఎస్.వాసుదేవరావు, మేజర్ పంచాయతీ ఈఓ పి.జగదీష్, ఏపీఓ శ్రీనివాసరావు ఉన్నారు. శ్రీకాకుళం అర్బన్: మలేరియా వ్యతిరేక మాసో త్సవ ర్యాలీ జూన్ నెల ఒకటో తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె.అనిత తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం మలేరియా వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ‘మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు’ సందర్భంగా శ్రీకాకుళం వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం నుంచి ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీకి సిబ్బంది మధ్యాహ్నం 3.30 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. -
అందెల రవమిది..
నృత్య పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శనతో గుర్తింపు పొందాలని ఆసక్తితో శిక్షణ తీసుకుంటున్నా.స్టేజ్పై నృత్య ప్రదర్శన ఇవ్వాలని కోరిక. నృత్య గురువు మంచి శిక్షణ ఇస్తున్నారు. – మోక్ష, 7వ తరగతి, దమ్మలవీధి డ్యాన్స్ అంటే ఇష్టం. అందుకే శిక్షణ పొందుతున్నా. నా సోదరితో పాటు క్లాస్కు వస్తున్నా. – తన్మయి, 6వ తరగతి, బాదుర్లపేట డ్యాన్సు నేర్చుకొని ప్రదర్శ నలు ఇస్తా. టీవీల్లో చూసి సి నిమా పాటలకు డ్యాన్సు చే స్తుంటే మా తల్లిదండ్రులు ఇక్కడ వేసవి శిక్షణలో చేర్పించారు. – యశశ్విని, 7వ తరగతి, హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీకాకుళం కల్చరల్: వేసవి సెలవులు ముగింపు దశకు వస్తున్నాయి. సరదాలు, షికార్లతో పాటు ఈ సెలవుల్లో కొందరు నృత్యాలు, గీతాలాపన, చిత్రాలు, శిల్పాల రూపకరణ నేర్చుకున్నారు. జిల్లా కేంద్రంలో నృత్య శిక్షణను చాలా మంది సద్వినియోగం చేసుకున్నారు. పాతశ్రీకాకుళంలోని కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నృత్య గురువు టి.నీరజ సుబ్రహ్మణ్యం ఇస్తున్న శిక్షణకు హాజరవుతూ తమలోని టాలెంట్కు పదును పెడుతున్నారు. ఈ చిన్నారులు ప్రతి రోజూ ఉదయం భరత నాట్యం, కూచిపూడిలో శిక్షణ పొందుతున్నారు. జూన్ 4 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉచితంగా నేర్పుతున్న వేసవి శిబిరానికి ఎంతో మంది చిన్నారులు నేర్చుకునేందుకు వస్తున్నారు. వీరిలో కొందరితో వేసవి శిబిరం ముగింపు సమయంలో ప్రదర్శన ఇప్పించేందుకు తగిన తర్ఫీదు ఇస్తున్నా. చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. – టి.నీరజ, నాట్య గురువు -
విధ్వంసకర ఎయిర్ పోర్టు మాకొద్దు
మందస: విధ్వంసకర ఎయిర్పోర్టు తమకు వద్దని, దీనికోసం భూములు ఇచ్చేది లేదని మండలంలోని భేతాళపురం గ్రామస్తులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్పష్టం చేశారు. కార్గో ఎయిర్ పోర్టు ప్రతిపాదనను రద్దు చేయాలని ముక్తకంఠంగా తెలియజేశారు. కొబ్బరి, మామిడి, జీడి, పసస, మునగ వంటి పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీ యూనిట్లు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో ఆర్.అప్పలరాజు, డిప్యూటీ తహసీల్దార్ కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఎయిర్పోర్టు నిర్మాణంతో అభివృద్ధి వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన ఎయిర్పోర్టుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మండలంలోని ఎయిర్పోర్టు బాధిత గ్రామమైన అనకాపల్లిలో శనివారం అయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంత ప్రజలు భూమిని త్యాగం చేస్తేనే సాధ్యమవుతుందని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణం జరిగితే 10వ తరగతి నుంచి ఐఐటీ వరకు చదువుకున్న యువతకు అదే ఎయిర్పోర్టులోనే ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. అలాగే భూమిని కోల్పోయిన రైతులకు మెరుగైన లబ్ధిని చేకూర్చుతామన్నారు. ఈ విషయంలో కొంతమంది పడుతున్న అపోహలు నిజం కాదని స్పష్టం చేశారు. కాగా కొంతమంది రైతులు, మహిళలు మాట్లాడుతూ తమ భూములు, ఇళ్లు విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. సమావేశంలో ఆర్డీవో అప్పలరాజు, తహసీల్దార్ సీతారామయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
నేతన్న నేస్తం అమలు ఎన్నడు..?
రణస్థలం: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేతన్న నేస్తం ఎప్పటిలోగా అమలు చేస్తారో సమాధానం చెప్పాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్వీ రమణ డిమాండ్ చేశారు. శనివారం లావేరు పర్యటనలో నేతన్నలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంతవరకు హామీ అమలు చేయకపోవడంతో నేతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న చేనేతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. 50 ఏళ్లు దాటినవారికి పెన్షన్ అమలు చేస్తామని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు వెంటనే జరిపించాలని, కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్.అసిరప్పడు, కె.రామారావు, యు.కాశీ విశ్వేశరరావు, ఎన్.భద్రకాళి, కె.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రైలు ఢీకొని ఆవు మృతి పాతపట్నం: మండలంలోని గంగువాడ గ్రామ రైల్వే గేటు సమీపంలో రైలు ఢీకొని ఆవు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం గంగువాడ రైల్వే గేటు సమీపంలో ఆవు మేత మేస్తోంది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి గుణుపూర్ వస్తున్న రైలు ఢీకొనడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. గంగువాడ గ్రామానికి చెందిన సత్రాపు అప్పన్న అనే రైతుకు చెందిన ఆవుగా గుర్తించారు. ఆవు విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందన్నారు. నష్టపోయిన పాడి రైతుకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
అక్కడో చెరువుండాలి..!
అక్కడో చెరువుండాలి.. దాదాపు పదిహేను ఎకరాల భూమికి నీరిచ్చి పెంచే తల్లిగా వర్ధిల్లుతుండాలి.. కానీ ఇప్పుడు అక్కడ కేవలం స్థలం మాత్రమే కనిపిస్తోంది. యంత్రాలతో చెరువును ఛిద్రం చేసి సమాధి చేసిన ఆనవాలు తెలుస్తోంది. అధికారం ఉందనే అహంతో చెరువును చెరబట్టిన వికృత విన్యాసానికి సాక్షిగా ఈ స్థలం నిలుస్తోంది. దశాబ్దాల పాటు నీటితో కళకళలాడిన చెరువు ప్లాటుగా మారిపోయి మౌనంగా రోదిస్తోంది. జలుమూరు: కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, గ్రామ కంఠాలు కనుమరుగైపోతున్నాయి. మండలంలోనూ ఈ ఆక్రమణలు పెచ్చుమీరిపోతున్నాయి. కొద్ది రోజుల కిందట తిమడాంలో మండల టీడీపీ నాయకుడు, అల్లాడ సొసైటీ అధ్యక్షుడు వెలమల చంద్రభూషణరావు, పల్లి రమణలు గ్రామ చెరువు, పంచాయతీ స్థలాన్ని ఆక్రమించడంతో పాటు తాగునీటి ట్యాంకు నీటిని తన పొలాలకు మళ్లించాడు. ఇప్పుడు మండల కేంద్రం సమీపంలోని కెల్లివానిపేట–నామాలపేట గ్రామాల మధ్య రోడ్డును ఆనుకుని సర్వే నంబర్ 2–77లో ఉన్న సాగునీటి చెరువును గ్రామానికి చెందిన కెల్లి బాలకృష్ణతోపాటు మరి కొందరు యంత్రాలతో కప్పేశారు. ఈ చెరువుకు సుమారు 15 ఎక రాల ఆయకట్టు కూడా ఉంది. దీనికి ఆనుకొని ఉన్న వంశధార కాలువ గట్టు, చెక్డ్యామ్ను యంత్రాలతో ధ్వంసం చేసి మరీ కప్పేశారు. సుమారు ఐదు నుంచి ఏడు ఎకరాలు విస్తీర్ణం గల ఈ చెరువు ఇప్పడు పూర్తిగా కనుమరుగైపోయింది. రాత్రికి రాత్రి యంత్రాలతో మట్టిని తవ్వి చెరువును నామరూపాల్లేకుండా చేశారు. గతంలో ఈ చెరువు విస్తీర్ణం సుమారు 12 ఎకరాలు వరకూ ఉండేదని, ప్రస్తుతం చెరువు ఆనవాళ్లు కూ డా లేవని స్థానికులు చెబుతున్నారు. దీనిపై తహ సీల్దార్ జెన్ని రామారావుకు కూడా ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. జిల్లా నేత అండ చూసుకొని ఈ ఆక్రమణలకు స్థానిక టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారని గ్రామానికి చెందిన మామిడి వరహాలు నాయుడు, రామిరెడ్డి, ధర్మారావు, మెట్ట ఆనంద్, బమ్మిడి దాలయ్యలు తెలిపారు. ఈ మేరకు తహసీల్దార్ జెన్ని రామారావుకు ఫిర్యాదు చేసినట్లు వారు వివరించారు. దీనిపై తహసీల్దార్ జెన్ని రామారావును వివరణ కోరగా ఫిర్యాదు అందిందని బాలకృష్ణ అనే వ్యక్తి సుమారు 42 సెంట్లు ఆక్రమణలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. అలాగే మరి కొందరు కూడా ఆక్రమణలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆక్రమణ దారులు అందరికీ నోటీసులు జారీ చేస్తున్నామని రికార్డులు ప్రకారం సర్వే చేసి ఆక్రమణలు తొలగిస్తామని తెలిపారు. -
ప్రథమ చికిత్సపై అవగాహన
శ్రీకాకుళం కల్చరల్: సర్వశిక్ష అభియాన్ ఒకేషనల్ విభాగం ద్వారా అంపోలులో శిక్షణ పొందుతున్న వివిధ జిల్లాలకు చెందిన హెల్త్ ఇన్స్ట్రక్టర్లకు రెడ్క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ద్వారా ప్రథమ చికిత్సపై శనివారం అవగాహన కల్పించారు. జిల్లా రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు పర్యవేక్షణలో మేనేజర్ కె.సత్యనారాయణ, జి.రమణలు ప్రథమ చికిత్స, గాయాలు, కట్లు, తరలింపు మార్గాలు, కృత్రిమ శ్వాస, సీపీఆర్, కాలిన గాయాలు తదితర వైపరీత్యాల నుంచి రక్షించుకోవడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాక్ అసిస్టెంట్ డైరెక్టర్ డి.చిట్టిబాబు, రెడ్క్రాస్ సిబ్బంది చిన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జూన్ 2న జాబ్మేళా శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలోని బలగ హాస్పిటల్ జంక్షన్లో ఉన్న ప్రభుత్వ ఐటీఐ/డీఎల్టీసీ శిక్షణా సంస్థ ప్రాంగణంలో జూన్ 2వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ తెలిపారు. కేవీఆర్ ఇంజినీర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముత్తుట్ మైక్రోఫిన్ లిమిటెడ్, 2050 హెల్త్కేర్ సంస్థల్లో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్మేళాను చేపట్టనున్నట్టు చెప్పారు. ఆకర్షణీయమైన వేతనంతో పాటు అనేక వసతి రాయితీలు ఉంటాయన్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ తదితర విద్యార్హత కలిగిన అభ్యర్థులు హాజరవ్వాలని కోరారు. బయోడేటా, విదార్హత ధ్రువీకరణ పత్రాలు, జిరాక్స్ కాపీలు, రెండు పాస్ఫొటోలతో ఆరోజు ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం డీఎల్టీసీ/ఐటీఐ శిక్షణా సంస్థ వద్దకు చేరుకోవాలని కోరారు. -
రైతు రుణాలపై అదనపు వడ్డీ వసూలు
● ఎల్ఎన్పేట పీఏసీఎస్లో గోల్మాల్ ● సీఈఓపై అధ్యక్షుడి ఆరోపణలు ● వడ్డీ వివరాలపై ప్రత్యేక కరపత్రం విడుదల హిరమండలం: ఎల్ఎన్పేట పీఏసీఎస్లో సరికొత్త అవినీతి అంశం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పీఏసీఎస్ అధ్యక్షుడు కాగాన మన్మధరావు వర్సెస్ సీఈఓ సింహాచలం అన్నట్టు పరిస్థితి ఉంది. రైతు లు తీసుకున్న రుణాలపై సీఈఓ అధిక వడ్డీ వసూ లు చేస్తున్నారన్న ఆరోపణలపై అధ్యక్షుడు మన్మధరావు మాట్లాడారు. పీఏసీఎస్ పరిధిలో లక్షల రూపాయలు అదనంగా వడ్డీ, డాక్యుమెంట్ చార్జీ రూపంలో వసూలు చేసినట్టు తెలిపారు. రైతుల వద్ద నుంచి వసూలు చేసిన వడ్డీకి ఇంతవరకు రైతులకు రశీదులు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. రైతులు అదనంగా వడ్డీ చెల్లించాల్సిన పనిలేదని తేల్చిచెప్పారు. ఇంత రుణానికి ఇంతే వడ్డీ కట్టాలని, అంతకు మించి కట్టాల్సిన పనిలేదంటూ ఆయన ఒక కరపత్రాన్ని నేరుగా రైతులకు అందించారు. కట్టిన వడ్డీకి రశీదులు పొందాలని, రశీదులు ఇవ్వకుంటే తక్షణమే ఫిర్యాదు చేయాలన్నారు. సీఈఓ సింహాచలంపై ఎప్పటి నుంచో అదనపు వసూళ్ల ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం అధ్యక్షుడు కాగాన మన్మధరావుకు తెలియడంతో ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రైతులకు రుణాలు, అదనపు వడ్డీల వసూలు రూపంలో భారీగా గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
సంగీత మహిమకు గిన్నిస్ దాసోహం
పోలాకి: మండలంలోని కొవిరిపేట గ్రామానికి చెందిన చోడిపిల్లి మహిమకు గిన్నిస్ రికార్డ్లో చోటు లభించింది. పుట్టుక నుంచి ప్రత్యేక అవసరాలు కలిగిన మహిమ ఏదైనా నైపు ణ్యాన్ని సంపాదించాలని పట్టుదలగా ఉండేది. కుమార్తె కోరిక మేరకు తల్లిదండ్రులు ఆమెకు కీ బోర్డు నేర్పించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి విక్టరీ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన గిన్నిస్ అచీవర్స్ మీట్లో మహిమ కీబోర్డును గంటపాటు నిరంతరాయంగా వాయించి రికార్డు సృష్టించింది. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 22 దేశాల నుంచి 2వేల మంది వాద్య కారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చినందున నిర్వాహక సంస్థ వ్యవస్థాపకుడు అగస్టిన్ దండింగి ఆధ్వర్యంలో అవార్డు అందించారు. మహిమ తల్లిదండ్రులు స్టీఫెన్రావు, మార్తలు హర్షం వ్యక్తం చేశారు. -
గంజాయితో వ్యక్తి అరెస్టు
కంచిలి: మండల కేంద్రం కంచిలిలోని సోంపేట రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని కంచిలి పోలీసులు శనివారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్ర పరిధి ఝార్సుగుడ జిల్లా గుమదెరా గ్రామానికి చెందిన అభినవ్ సింగ్ అనే యువకుడు మల్కన్గిరి జిల్లా సోమంతపూర్ గ్రామానికి చెందిన సుమన్ వద్ద తాను సేవించడానికి, అమ్ముకోవడానికి గానూ 3.370 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. తర్వాత ఈ గంజాయిని నలుపు రంగు బ్యాగ్లో ప్యాక్చేసి ప్రశాంతి ఎక్స్ప్రెస్లో బెంగుళూరు తరలించేందుకు సిద్ధమయ్యాడు. దీనిలో భాగంగా సోంపేట రైల్వేస్టేషన్ దగ్గరలోని రైల్వే పార్కు ముందు ఉన్న బీటీ రోడ్డు వద్ద వేచి ఉండగా కంచిలి ఎస్ఐ పి.పారినాయడు, పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. అతని వద్ద నుంచి గంజాయి నిల్వతో పాటు ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దీనిపై సోంపేట సీఐ బి.మంగరాజు కేసు నమోదు చేశారు. -
సర్వేశా.. ఇవేం కష్టాలు!
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే గందరగోళంగా మారుతోంది. భూముల సర్వేకి సంబంధించిన ఈ పనులు సక్రమంగా జరగడం లేదు. సిబ్బందితో పాటు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క మండుటెండల్లో పనులు చేయలేక ఇబ్బందులు పడుతుంటే, అదే విధంగా రైతులు వారి పొలాలను ఎండలో చూపించడం, అందుబాటులో ఉండడం కూడా సమస్యగానే మా రుతోంది. ఇన్ని కష్టాలకు ఓర్చి, సర్వే చేయాలనుకున్నా వసతులు ఉండడం లేదు. మరోవైపు అధికారులు సర్వేయర్లకు గడువు పెట్టి మెడపై కత్తిపెడుతున్నారు. ఇది అన్యాయం అని అడిగితే సస్పెన్షన్తో భయపెడుతున్నారు. ఇటీవల ఇబ్బందులపై సర్వేయర్లు నిరసనకు దిగితే జిల్లాకు చెందిన ఇద్దరు గ్రామ సర్వేయర్లు సంఘం నాయకులను సస్పెండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై చర్చ జరగడం, ఉన్నతాధికారులకు పిర్యాదులు చేరడంతో ఆ సస్పెన్షన్ను వాపసు తీసుకున్నారు. ఇలా ఇబ్బందు లు ఎన్నో ఉన్నాయి. రీ సర్వేలో పూర్తిగా పనులు సర్వేయర్లు చేయడం అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది సహకరించకపోవడం, కొన్ని సమస్యాత్యక గ్రామాల్లో భయంభయంగా సర్వేలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ‘మే’లో ఇబ్బంది ప్రస్తుతం జిల్లాలో ఫేజ్–3, ఫేజ్–4 గ్రామాలు అంటే ఫేజ్–3లో 85 గ్రామాలు, ఫేజ్–4లో 165 గ్రా మాల్లో రీ సర్వేలు జరుగుతున్నాయి. అయితే వసతులు లేక సర్వేయర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా స్టేషనరీ, కంప్యూటర్లు, ప్రింటర్లు వంటివి లేవు. రోవర్లు కూడా సరిపడినన్ని లేకపోవడంతో పని వేగంగా జరగడం లేదని సర్వేయర్లు వాపోతున్నారు. మే నెలలో ఈ సర్వేలు చేయడంతో సర్వే సమయంలో రైతులు అందుబాటులోకి వెళ్లలేకపోతున్నారు. దీంతో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఇబ్బందుల మధ్య సర్వేలు జరిగితే మళ్లీ తప్పులతో కూడిన రికార్డులు తయారయ్యే ప్రమాదం ఉంది. వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే సగానికిపైగా సర్వే పూర్తయ్యింది. అప్పుడే బేస్ స్టేషన్లు, రోవర్లు, డ్రోన్ కెమెరాలు వంటివి సరఫరా చేశారు. మొత్తం 1465 రెవెన్యూ గ్రామాలు ఉండగా, వీటిలో గత ప్రభు త్వం 738 గ్రామాల్లో సర్వేను మూడు దశల్లో పూర్తి చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ రీ సర్వే అన్నారు. పైలెట్ సర్వేగా 40 గ్రామాల్లో సర్వే చేశారు. ఫేజ్–2 లో 49 గ్రామాలు, ఫేజ్–3లో 85 రెవెన్యూ గ్రామాలు, ఫేజ్–4లో 165 రెవెన్యూ గ్రామాల్లో సర్వేకు సిద్ధమయ్యారు. ప్ర స్తుతం ఫేజ్–3, ఫేజ్–4 సర్వేలు జరుగుతున్నాయి. డిప్యుటేషన్లతో సమస్యలు తాజాగా జరుగుతున్న రీ సర్వే కోసం చాలా మందిని డిప్యుటేషన్ పద్ధతిలో నియమించారు. ఉదాహరణకు శ్రీకాకుళం రూరల్ మండలం నుంచి 12 మంది గ్రామ సర్వేయర్లను రణస్థలం, ఇతర మండలాలకు గ్రామాలకు రీ సర్వేకి నియమించారు. దీంతో వారి సొంత గ్రామాల్లో సమస్యలు పెండింగ్ లో ఉండిపోతున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం రైతులు గ్రామ సచివాలయం, మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. -
ఎరువు.. దరువు
నరసన్నపేట: కూటమి తన సంప్రదాయాన్ని కొనసాగించింది. గత ఖరీఫ్లో విత్తనాల నుంచి విక్రయాల వరకు ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం తాజాగా కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోగా మద్దతు ధరలకు పంటను కొనుగోలు చేయక రైతులకు కూటమి ప్రభుత్వం తీవ్ర నష్టాలకు గురి చే స్తోంది. తాము అధికారంలోకి వస్తే కేంద్రంతో సంబంధం లేకుండా ఏటా రూ.20వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన రూ.6 వేలుతో కలిపి రూ. 20 వేలు ఇస్తున్నారు. ఇలా ప్రతి పథకంలోనూ మెలికలు పెడుతూ రైతులను మోసగిస్తున్న సర్కారు వెనకా ముందూ చూడకుండా ఈ ఖరీఫ్కు ఎరువుల ధర లు పెంచేసింది. ఇప్పటికే ఇంధనం ధరల పెంపుతో సతమతమవుతుంటే.. ఎరువుల ధరలు కూడా పెంజిల్లాలో ఖరీఫ్లో 4.50 లక్షలు రబీలో 2.60 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఖరీఫ్లో ఎక్కువగా వరి పండిస్తున్నారు. రబీలో అయితే మొక్కజొన్న, పత్తి, చెరకు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులు బస్తా ధర (50 కేజీలు) రూ. 125 నుంచి రూ. 700 వరకూ పెరిగింది. సగటున ఎకరాకు మూడు బస్తాలు ఎరువులు వినియోగిస్తే రైతులపై ఒక సీజన్కు రూ. 600 నుంచి రూ. 1400 వరకూ భారం పడుతుంది. ఈ లెక్కన చూస్తే ఖరీ ఫ్, రబీల్లో రైతులపై రూ. 40 కోట్లకు పైగా అదనపు భారం పడుతుంది. 20.20.0.13 ఎరువు అయితే ఏకంగా రూ. 700 పెంచారు. ఈ విషయం తెలియడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చడంపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అధికంగా వాడే కాంప్లెక్స్ ఎరువుల ధర లను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా మండల కేంద్రాలకు చేరాయి. రానున్న ఖరీఫ్కు రైతులు ఎరువులు కావాలంటే కొత్త ధరలతోనే బుక్ చేసుకోవాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచనలు చేస్తున్నారు. యూరియా, డీఏపీ మినహా మిగిలిన ఎరువులు అన్నింటి ధరలు పెరిగాయి. దీంతో రైతులు ఈ ఖరీఫ్లో అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం డీఏపీ సరఫ రా తగ్గడంతో రైతులు వరికి కూడా కాంప్లెక్స్ ఎరువులనే వినియోగిస్తున్నారు. రూ. 40 కోట్ల వరకూ భారం -
●విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
డీఎస్సీ పరీక్ష పేపర్ లీకై ంది. దీని వెనుక కూటమి నాయకులు ఉన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి. లీక్ వ్యవహారంతోనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ అయ్యారు. అవినీతి ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి ఇదే ఉదాహర ణ. సాధారణంగా మెరిట్ లిస్టు, సెలెక్షన్ లిస్టు, రోస్టర్ వంటివి ఉంటాయి. కానీ ఈ డీఎస్సీలో ఇలాంటివి ఏవీ జరగలేదు. మెరిట్ జాబితా లేకుండా ఉద్యోగ నియామకాలు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలి. అవినీతికి పాల్పడిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – మెంటాడ స్వరూప్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు డీఎస్సీ పరీక్షల నుంచి నియామకాల వరకు అన్ని స్థాయిల్లో అవినీతి జరిగింది. స్పోర్ట్స్ కోటా లో టీచర్ పోస్టు రూ.15 లక్షలు వరకు అమ్ముడుపోయినట్టు వీడియోలు వెలుగు చూశాయి. ఇప్పటిౖకైనా ఉన్నత న్యాయస్థానం, గవర్నర్ సుమోటోగా తీసుకొని విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – ముత్తా విజయ్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు డీఎస్సీలో అవకతవకల వల్ల నష్టపోయిన వారిలో నేనున్నాను. నాకు ఇవ్వాల్సిన సోషల్ రిజర్వేషన్ లో టాపర్ని అయినా నాకు ఉద్యోగం ఇవ్వలేదు. అడిగితే సమాధానం చెప్పడం లేదు. మెరిట్ లిస్టు ఇవ్వకపోవడం వల్ల నాలా అభ్యర్థులంతా నష్టపోయారు. – కె.అనిల్కుమార్, డీఎస్సీ బాధితుడు -
జూన్ 1న దగా డీఎస్సీ విజయవంతం చేయండి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కూటమి ప్రభుత్వం నిరుపేదలు మొదలుకుని నిరుద్యోగ యువత వరకు అందరినీ దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళంలో పెద్దపాడు ధర్మాన ప్రసాదరావు క్యాంప్ కార్యాలయంలో పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులతో సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ జూన్ 1వ తేదీన నిర్వహించనున్న దగా డీఎస్సీ కార్యక్రమం విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వ రూప్, రాష్ట్ర కార్యదర్శి, పలాస నియోజకవర్గ పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ముత్తా విజయ్కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ, బీసీ వి భాగం జిల్లా అధ్యక్షులు మార్పు అశోక్ చక్రవర్తిలతో పాటు నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొన్నారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ శ్రీకాకుళం పాతబస్టాండ్: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని దగా డీఎస్సీ అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన అనంతరం మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలపై ఏడాదిగా పీఈటీలు పోరాటం చేస్తున్నార ని గుర్తు చేశారు. డీఎస్సీ పద్ధతిగా నిర్వహించలేదని, అన్ని స్థాయిల్లోనూ అక్రమాలు జరిగాయని ఆ రోపించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు వెన్నుపోటు పేరుతో ప్రజల్లోకి వెళ్తామని, జూన్ 4వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని పే ర్కొన్నారు. మహానాడు అంతా జగన్ నామస్మరణతోనే గడిచిందని చురకలు అంటించారు. -
రైతు బేల చూపులు
రొయ్య నేల చూపులు..● నష్టాల్లో ఆక్వా రైతులు ● ఆదుకోవాలని వేడుకోలు ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. రొయ్యల మేత, మెడిసిన్ ధరలు పెరిగిన రొయ్యల ధర మాత్రం తగ్గుతోంది. అదనపు పెట్టుబడితో నష్టాలు బాట పడుతున్నాం. – రాంబాబు, ఆక్వారైతు, మూలపేటరొయ్యల మేత రేట్లు, మెడిసిన్ రేట్లు, ఇతర సా మగ్రి రేట్లు పెరిగినా రొయ్యల ధర మాత్రం ఎప్పటికీ పెరగడం లేదు. కష్టాలు, నష్టాలే మిగు లుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. – రవికుమార్, ఆక్వా రైతు, సీతానగరంసంతబొమ్మాళి: రొయ్య ధర పతనంలో ఆక్వా రైతు లు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఒడిదొడుకుల ను ఎదుర్కొంటూ సాగు చేస్తున్న రైతులకు మాత్రం కష్టనష్టాలు తప్పడం లేదు. ఆక్వా సాగులో పెట్టుబడులు రూ.లక్షల్లో ఉండగా లాభాలు మాత్రం రావడం లేదని అంటున్నారు. మరో వైపు రొయ్యల మేత, మెడిసిన్ ధరలు పెరుగుతున్నా రొయ్యల ధర లు తగ్గడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలో నౌపడ, సీతానగరం, సెలగపేట, మర్రిపా డు, భావనసాడు, మూలపేట, కె.లింగూడు, సున్నాపల్లి, వడ్డీతాంద్ర, పోతునాయుడుపేట, యామలపే ట, జగన్నాథపురం, ఉమిలాడ, ఆర్హెచ్పురం, మలగాం, కొల్లిపాడు, మరువాడ, మేఘవరం తదితర గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల్లో ఆక్వా సాగును చేపడుతున్నారు. ప్రారంభంలో ఆక్వా సాగు ఆశాజనకంగా ఉన్నా తర్వాత పరిస్థితులు మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రొయ్యల మేత కిలోకు నాలుగు రూపాయిలు చొప్పన పెంచిన తయారీ సంస్థలు మరోసారి పెంచడానికి సిద్ధమ వుతుడడంపై ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు పెరుగుతుంటే.. రొయ్యల ధర మాత్రం నేల చూపు చూస్తోంది. 100 కౌంటు రొయ్య ధర రూ. 260లునుంచి రూ. 230కు దిగజారింది. 15 ఏళ్ల కిందట మేత బస్తా రూ. 850లు ఉంటే 100 కౌంటు కిలో రొయ్య ధర రూ. 260 నుంచి రూ. 230లు మధ్యన ఉండేది. ఇప్పుడు అదే మేత బస్తా రూ. 2500లు నుంచి రూ. 2700లకు పెరిగింది. 100 కౌంటు ధర మాత్రం రూ. 210 నుంచి రూ. 230లు మధ్యన ఉంది. రొయ్య మేత, మెడిసిన్ ధరలు అమాంతంగా పెరగడం రొయ్యల ధర మాత్రం పాతాళానికి పడిపోవడం రైతులు ఆందోళ న చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
టీచర్లపై ఒత్తిడి తగదు
శ్రీకాకుళం: మండు వేసవిలో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అడ్మిషన్ డ్రైవ్ పేరుతో ఒత్తిడి చేయడం తగదని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేష న్ జిల్లా గౌరవాధ్యక్షులు పేడాడ కృష్ణారావు తెలిపారు. డీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం శ్రీకాకుళం పెన్షనర్స్ భవన్లో శుక్రవారం జరిగింది. పాఠశాలలకు సెలవులు ఇచ్చినప్పటి నుంచి ఎంతో నిబద్ధతతో ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయ సిబ్బంది అడ్మిషన్ల కోసం సాయశక్తులా కృషి చేస్తున్నారని, అయినప్ప టికీ టార్గెట్ పూర్తి చేయాలని, ప్రైవేటు పాఠశాలల నుంచి పిల్లలను చేర్పించాలని ప్ర తిరోజూ ఒత్తిడి చేస్తూ ఇబ్బందులకు గురి చేయ డం తగదని అన్నారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పూజారి హరిప్రసన్న మాట్లాడుతూ టెన్త్ మూల్యాంకనానికి సంబంధించి రెమ్యూనరేషన్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆమదాలవలస: ఆమదాలవలస మండలంలో తోటాడ, అక్కివరం రెవెన్యూ గ్రామాల్లో కొత్తరోడ్డు సమీపంలో గల విలువైన బావాజీ మఠం భూములపై వైఎస్సార్సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ లోకాయుక్తను ఆశ్రయించారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈ భూములను అన్యాక్రాంతం చేసి ఆయన అనుచరులతో అక్రమ లే అవుట్లు వేసి వాటికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిమెంట్ సీసీ రోడ్లు, కాలువలు నిర్మించి భూ ములను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కర్నూలులో ఏపీ లోకాయుక్తకు గురువారం ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం తెలిపారు. కూన రవికుమార్ తన అనుచరులతో ఆ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని, ఇప్పటికే ఆ భూములపై కోర్టులో పలు వివాదాలు నడుస్తున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు చింతాడ రవికుమార్ తెలిపారు. జస్టిస్ పి.లక్ష్మారెడ్డి చాంబర్లో ఈ ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. లోకాయుక్తను ఆశ్రయించడంతో నిజా నిజాలు బహిర్గతం అవుతాయని, దీంతో అక్రమార్కులకు చెక్ పడుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: మరో రెండు రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటర్మీడియెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులను మరో ఐదు రోజులు పొడిగించింది. వాస్తవానికి నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జూనియర్ కళాశాలలు జూన్ ఒకటో తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పబ్లిక్ పరీక్షలు జూన్ 5వ తేదీ వరకు జరుగుతుండటంతో ఇంటర్బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇటీవల బక్రీద్ కారణంగా ఈనెల 28న జరగాల్సిన పరీక్షలను జూన్ 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. దీంతో 6వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ ఆదేశాలు అ న్ని ప్రభుత్వ యాజమాన్య, ఎయిడెడ్, ప్రైవేట్, కోఆపరేటివ్ జూనియర్ కాలేజీలన్నింటికీ వర్తిస్తాయని ఇంటర్బోర్డు పేరొంది. -
శ్రీకాకుళం
శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026మెరిట్ లిస్టు ఎందుకు విడుదల చేయలేదు.. సాక్షాత్తు పరీక్ష రాసిన ఉద్యోగార్థి ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోవడం లేదు.. డేటా డిలీట్ చేయాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘బేరాల’ సంభాషణలపై వివరణ ఎందుకు ఇవ్వడం లేదు.. యువత గళమెత్తింది. ప్రశ్నించడం తమ హక్కంటూ సర్కారు డొల్లతనాన్ని ఎలుగెత్తి చూపింది. డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై దుమ్మెత్తిపోసింది. వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఈ ప్రశ్నలను సూటిగా సంధించింది. -
ఇలా అయితే ఎలా..?
● నగరంలోని రోడ్డుపై చెత్త ఉండడంతో కలెక్టర్ ఆగ్రహం ● ఎంహెచ్వోకు చార్జి మెమో జారీ ● శానిటరీ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్కు ఆదేశాలు శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి డాక్టర్ సుధీర్కు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చార్జి మెమో జారీ చేశారు. శుక్రవారం జిల్లాలోని వేరొక ప్రాంతానికి కలెక్టర్ తన వాహనంలో వెళ్తున్నారు. నగరంలోని అరంగ వీధికి వెళ్లేసరికి రోడ్డు పక్కన ఉన్న చెత్తను చూసి తన వాహనాన్ని నిలుపు దల చేశారు. అక్కడినుంచే ఎంహెచ్వోకు ఫోన్ చేసి రమ్మని పిలిచారు. అక్కడ చెత్తని చూపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అప్పటికే తన జేబులో ఉన్న చార్జ్ మెమోను అందజేశారు. కలెక్టర్ వార్డులోకి వచ్చిన విషయం తెలుసుకొని ఆ ప్రాంత శానిటరీ ఇన్స్పెక్టర్ కావ్య అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో కమిషనర్ కూడా వచ్చారు. కావ్యను పరిస్థితి ఇలా ఉండడానికి కారణమేమిటని ప్రశ్నించారు. ఉదయమే తాను శుభ్రం చేయించానని.. రెండు రోజుల క్రితం వరకు ఇక్కడ డస్ట్బిన్ ఉండేదని దానిని తొలగించారని చెప్పారు. ఉదయం శుభ్రం చేయిస్తే ఇంత చెత్త ఇక్కడ ఎందుకు ఉంటుందంటూ కలెక్టర్ నేరుగా తన చేతితో అక్కడ ఉన్న చెత్తను ఓ పేపర్లోనికి చూపించారు. డస్ట్ బిన్ ఎందుకు తొలగించారంటూ మండిపడుతూ శానిటరీ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాలని కమిషనర్ కుర్మారావుకు ఆదేశించారు. నాలుగు నెలల్లో నాలుగో సారి ఎంహెచ్వో సుధీర్కు గడిచిన నాలుగు నెలల్లో సంజాయిషీ నోటీసులు జారీ చేయడం ఇది నాలుగోసారి. నగరంలో డయేరియా ప్రబలినప్పుడు కమిషనర్ను అకారణంగా సస్పెండ్ చేయగా, ఎంహెచ్వోకు మెమో జారీ చేశారు. ఆ తర్వాత అధికారులు విచారణ జరిపి మరోసారి నోటీసులు ఇచ్చి డయేరియా ప్రబలడానికి కారణంపై వివరణ కోరారు. దీనికి సమాధానం ఇవ్వగా అప్పట్లో నగరపాలక సంస్థ పర్యవేక్షణాధికారిగా నియమితులైన జేసీ ఎంహెచ్వో ఇచ్చిన వివరణకు సంతప్తి చెందలేదని పేర్కొంటూ పూర్తి ఆధారాలతో వివరణ ఇవ్వాలని నోటీసును జారీ చేశారు. ఈ మూడు నోటీసులకు ఆయనే ఏం సమాధానం చెప్పారో తెలియనప్పటికీ ఎంహెచ్వోపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా కలెక్టరే నేరుగా చార్జి మెమో జారీ చేయడం విశేషం. దీనిపై ఎంహెచ్వో ఎటువంటి వివరణ ఇస్తారో.. అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. డన్బిన్ల తొలగింపు నగరంలోని పలు ప్రాంతాల్లో డస్ట్బిన్లను ఎంహెచ్వో ఇటీవల తొలగింపజేశారు. దీనిపై పలువురు ఆయనను కలిసి డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని కోరగా కలెక్టర్ తొలగించాలని ఆదేశించారని.. డస్ట్బిన్ రహిత నగరంగా శ్రీకాకుళం తీర్చిదిద్దాలని కలెక్టర్ యోచిస్తున్నారని చెప్తూ వచ్చారు. అయితే శుక్రవారం జరిగిన ఘటనలో కలెక్టరే డస్ట్ బిన్ ఎందుకు తొలగించారని ప్రశ్నించడంతో కావాలనే ఎంహెచ్వో కొన్ని ప్రాంతాల్లో డస్ట్బిన్లు తొలగించారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ శుక్రవారం ఉదయం నగరంలోని ఒకచోటకు సొంత పనిమీద వెళ్లారు. ఆ సమయంలోనే కొన్నిచోట్ల చెత్తను చూశారు. దీనిపై ఎక్కడా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. తిరిగి పలాస వెళ్తున్న క్రమంలో చెత్త ఉన్నచోట ఆగి ఎంహెచ్వోను పిలిచి చార్జి మెమో అందజేశారు. ముందుగానే చెత్తను పరిశీలించడం, తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటే చార్జీ మెమో జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి, మెమోను తన కార్యాలయంలోనే సిద్ధం చేసుకొని వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా కలెక్టర్ చెత్త ఉన్నచోట ఆగి చేతితో చెత్త ఎత్తుతున్న సమయంలో నగరపాలక సంస్థ అధికారులు గానీ.. మరెవరు గానీ లేకపోగా, అక్కడ ఒక ఇన్ఫ్లూయన్సర్ ఉండడంతో విషయం వెలుగులోకి వచ్చింది. -
ఉద్దానంలో విధ్వంసం వద్దు
● ఎయిర్పోర్టు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి ● బాధిత రైతుల ఆవేదన వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని చెట్లుతో కోనసీమను తలపించే ఉద్దాన ప్రాంతంలో అభివృద్ధి పేరిట విధ్వంసం చేయడానికి ప్రభుత్వం తలపెట్టిన ఎయిర్ పోర్టు ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలని బాధిత రైతులు కోరారు. మండలంలోని బాధిత గ్రామమైన వంకులూరులో శుక్రవారం సాయంత్రం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో భూ సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణం జరిగితే పిల్లల భవిష్యత్ బాగుంటుందని, పనుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. దీంతో ఈ సమావేశానికి హాజరైన రైతులు కలెక్టర్ వద్ద తమ గోడును విన్నవించుకున్నారు. ఎన్నో ఏళ్లగా ఈ ప్రాంతాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, నేడు ఎయిర్పోర్టు కోసం ఈ భూములు ఇస్తే సర్వం కోల్పోయి వీధిన పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని.. అయితే విధ్వంసాన్ని కోరుకోవడం లేదని తెల్చి చెప్పారు. నిత్యం ఆహ్లాదకంగా ఉండే ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణం చేపడితే పర్యావరణానికి ముప్పు కలుగుతుందన్నారు. అనంతరం ఎయిర్పోర్టు ప్రతిపాదన రద్దు చేసుకోవాలని కోరుతూ బర్రివానిపేట గ్రామ బాలాజీ సేవా సంఘం, వంకులూరు గ్రామ శ్రీఆదిబలిజ సంఘ నాయకులు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, పలాస ఆర్డీవో అప్పలరాజు, తహసీల్దార్ సీతారామయ్య, డీటీ శ్రావణ్, రైతులు జోగి అప్పారావు, లండ రామస్వామీ, జోగి పురుషోత్తం, వల్లభరావు, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎం.గంగువాడలో రైతులతో సమావేశం మందస: మండలంలోని ఎం.గంగువాడ గ్రామంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కార్గో ఎయిర్పోర్టు గురించి బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టుకు తమ భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. పచ్చని ఉద్దానంలో ఎయిర్ పోర్టు కట్టి తమ పొట్టలు కొట్టవద్దని కోరారు. కాగా ఎయిర్పోర్టు బాధిత గ్రామాలైన భేతాళపురం, బీడిమి, తెలగ గంగువాడ, రట్టి గ్రామాల రైతులు కలెక్ట్రు వస్తారని వినతులతో ఎదురు చేశారు. కానీ ఆయన రాకపోవడంతో నిరాశ చెందారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.వేణుగోపాల్, ఆర్డీవో అప్పలరాజు, డిప్యూటీ తహసీల్దార్ కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
లెక్కల వేట.. అబాకస్ బాట..!
●వేసవిలో నేర్చుకుంటున్న విద్యార్థులు శ్రీకాకుళం కల్చరల్: చిన్నారులు ఎటువంటి విషయానైనా ఆటల రూపంలో నేర్చుకునేందుకు శ్రద్ధ చూపుతారు. సంఖ్యా శాస్త్రంలోని ప్రాథమిక విధానాలైన కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం చేయడాన్ని ఆటల రూపంలో నేర్పుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఈ విధంగా లెక్కలు నేర్పించేందుకు ‘అబాకస్’ వేసవి క్లాసులకు పంపుతున్నారు. అబాకస్ నిర్మాణం అబాకస్ అనేది ఒక దీర్ఘ చతురస్రాకారపు చెక్క లేదా ప్లాస్టిక్ చట్రం. ఈ చట్రంలో నిలువుగా సమాంతర కడ్డీలు ఉంటాయి. ఈ కడ్డీల గుండా కదిలే పూసలు ఉంటాయి. ఈ పూసలను పైకి, కిందకి జరపడం ద్వారా లెక్కలు చేస్తారు. దీనిలో ఒక అడ్డంగా ఉంచబడిన దండం లంబంగా ఉండి పూసలను రెండు వర్గాలుగా చేస్తుంది. నిలువుగా ఉన్న తీగలు స్థాన విలువలను, దశాంశ స్థానాలను తెలుపుతాయి. దీనిలో పూర్తిగా కుడివైపు గల నిలువు వరుస ఒకట్లో స్థానమును, దానికి పక్కనున్న స్థానం పదుల స్థానమును ఇలా స్థాన విలువలను తెలుపుతాయి. పిల్లల్లో గణిత సామర్థ్యం, ఏకాగ్రత, వేగవంతమైన మానసిక గణనలను మెరుగుపరచడానికి ఇది విస్తృతంగా ఉపయోగించబడుతుంది. -
గాదె వెంకటరెడ్డి మృతికి సంతాపం
నరసన్నపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి గా పనిచేసిన గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంతాపం వ్యక్తం చేశా రు. దీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలకు విశేష సేవలందించారని, ఆయన మృతి తీరని లోటని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఇచ్ఛాపురం: ఏపీ పీజీసెట్ 2026 ఫలితాల్లో తెలుగు విభాగంలో పట్టణానికి చెందిన తెన్నేటి శ్రీనిజ శర్మ సత్తాచాటింది. 82 మార్కులతో స్టేట్ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఈమె పట్టణంలోని ప్రముఖ పురోహితుడిగా అందరి కీ సుపరిచితులైన తెన్నేటి తేజేశ్వర శర్మ కుమా ర్తె కావడంతో అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ పీజీసెట్–2026 ఫలితాల్లో నౌపడకు చెందిన అంపలాం సుచిత్ర ప్రతిభ కనబర్చారు. బోటనీ సబ్జెక్టులో 59 మా ర్కులు సాధించడం ద్వారా 169వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈమెను పలువురు అభినందించారు. గార: జిల్లా జైలు సూపరింటెండెంట్గా జి.మధుబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన విజయనగరం జైలు డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తూ శ్రీకాకుళం జిల్లా జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్గా పనిచేసేవారు. అడిషనల్ సూపరింటెండెంట్గా పదోన్నతి రావడంతో జిల్లా జైలు సూపరింటెండెంట్గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బుసాబద్ర గ్రామానికి చెందిన ఉపాధి హామీ వేతన దారురాలు పల్లి మహాలక్ష్మి (50) శుక్రవారం వడదెబ్బతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహాలక్ష్మి శుక్రవారం ఉదయం గ్రామంలోని ఉపాధి పనికి వెళ్లారు. పని ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. సాయంత్రం పని సమయానికి కుటుంబ సభ్యులు నిద్ర లేపినా లేవలేదు. చూస్తే ఆమె చనిపోయారు. ఆమె మృతితో కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమెకు భర్త శ్యామ్ సుందర్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పలాస: మండలంలో కొబ్బరిచెట్లూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సోంపేట మండలం తాళ భద్ర గ్రామానికి చెందిన సాయికుమార్ హరిపు రం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. వెను క నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడ ఉన్నవారు 108కి సమాచారం ఇవ్వగా వారు వెంటనే వచ్చి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రున్ని తీసుకొని వెళ్లి మెరుగైన వైద్యం అందించారు. కాశీబుగ్గ సీఐ రామకృష్ణను వివరణ కోరగా తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు. -
‘భూ ఆక్రమణలను అడ్డుకోండి’
పొందూరు: ఆరు దశాబ్దాలుగా శ్మశానవాటికగా వినియోగిస్తున్న భూమిని గ్రామంలో ఇంతవరకు తాము చూడని వ్యక్తి ఆక్రమించుకోవడానికి చూస్తున్నాడని, తమ గ్రామ యువకులపై కేసులు పెట్టి వేధిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు ఆర్.సీతారాంకు జోగ న్నపేటకు చెందిన మహిళలు విన్నవించుకున్నారు. కమిషన్కు వచ్చిన ఫిర్యాదు మేరకు సీతారాం శుక్రవారం జోగన్నపేటలో సంబంధిత భూములను పరిశీలించారు. జోగన్నపేట గ్రామానికి చెందిన ఎన్.రవీంద్రబాబు సర్వేనంబర్ 407–1, 402–6 సర్వే నంబర్లలో ఆరు ఎకరాలు భూముల వివాదంపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. సుమారు ఆరు దశాబ్దాలుగా లేని భూములు ఇప్పుడెలా వచ్చాయ ని వందలాది మంది మహిళలు అధికారులతో పా టు ఫిర్యాదుదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 407–1 సర్వే నంబరు భూములపై కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందని, న్యాయపరంగా పరిష్కరిస్తామని సీతారాం హామీనిచ్చారు. తమకు తక్షణమే న్యా యం జరగాలని స్థానికులు అధికారుల వాహనాల ను అడ్డుకున్నారు. ఎస్ఐ సత్యనారాయణ గ్రామస్తులతో మాట్లాడి శాంతింపజేశారు. కమిషన్ సభ్యుడు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లడంతో మహిళలు అక్కడకు చేరుకున్నారు. అధికారులు లేకపోవడంతో నిరసన తెలిపారు. -
ప్రభుత్వ భూమి కబ్జా
సంతబొమ్మాళి: మూలపేట పోర్టుతో నౌపడలో భూములకు విలువ పెరగడంతో ప్రభుత్వ స్థలం కనబడితే చాలు వెంటనే అధికార పార్టీ నాయకులు కబ్జా చేసేస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. తాజాగా మండలంలోని నౌపడ నుంచి వెంకటాపురం వెళ్లే ఆర్అండ్బీ రోడ్డుకు ఆనుకొని నౌపడ పోలీస్స్టేషన్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక టీడీపీ నాయకుడు ఆక్రమణ చేశారు. సర్వే నంబర్ 386లో రోడ్డుకు అనుకుని ఉన్న సుమారు 6 సెంట్ల ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆక్రమించిన స్థలం చుట్టూ పొడవైన కర్రలు పాతాడు. ఆక్రమించిన భూమి విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.50 లక్షల వరకు ఉంటుంది. పట్టించుకోని అధికారులు ఈ స్థలం పక్క నుంచే ప్రతిరోజూ అధికారులు రాకపోకలు సాగిస్తున్నా తమకేమి పట్టనట్లు వ్యవహరించారు. దీంతో ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించారు. ఆక్రమణలు తొలగించాలని అధికారులు పలుమార్లు చెప్పినా సదరు టీడీపీ నాయకుడు పట్టించుకోలేదు. అది తమ ఆధీనంలో ఉన్న భూమి అని, దీనికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని అధికారులకు చెబుతున్నాడు. అయితే పత్రాలు చూపించమని అధికారులు అడిగితే సదరు టీడీపీ నేత ఇవ్వకపోవడం కొసమెరుపు. అందువలన ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి యు.ఉమాపతిని అడగగా ఆక్రమించినది ప్రభుత్వ భూమి అని, ఆక్రమణలు తొలగించాలని పలుమార్లు చెప్పడం జరిగిందన్నారు. తొలగించకపోవడంతో శుక్రవారం నోటీసులు ఇచ్చామని తెలియజేశారు. -
విజయన్ నివాసంపై దాడులు దారుణం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కేరళ మాజీ సీఎం, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ నివాసంపై ఈడీ దాడులు చేయడాన్ని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళం అంబేడ్కర్ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ చేతిలో రాజకీయ సాధనంగా ఉన్న ఈడీతో విజయన్ను అప్రతిష్ట పాలు చేయాలనే దుర్బుద్ధితో దాడులకు పూనుకుందని విమర్శించారు. రాజకీయ ప్రత్యార్థులను వేటాడేందుకు కేంద్ర ఏజెన్సీలను వాడుకుంటున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేరళలోనూ అదే కుట్ర చేసిందని విమర్శించారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు జి.సింహాచలం, పోలాకి ప్రసాద్, సీహెచ్ అమ్మన్నాయుడు, అల్లు సత్యనారాయణ, ఎస్.సూరీడమ్మ, కొత్తకోట అప్పారావు, ఎం.గోవర్దన్రావు, ఎం.ఆదినారాయణమూర్తి, అల్లు సోమశేఖర్, బూర్లు సింహాచలం, ఎం.గణేష్, ఆర్.ప్రకాష్, ఎస్.నగేష్, జానీ, జ్యోతేశ్వరరావు, వాసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నమెంట్ విజేత పెద్దపాడు గార: తాళ్లవలస గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన అసిరితల్లి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతగా ‘పెద్దపాడు’ జట్టు నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్స్లో శ్రీకూర్మం జట్టుపై విజయం సాధించింది. 12 రోజులుగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో మొత్తం 42 జట్లు పాల్గొనగా, మ్యాచ్లన్నీ హోరాహోరీగా జరిగాయి. విజేతలకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల గార జోనల్ కన్వీనర్ బి.సింహాచలం మాస్టారు, బీసీవై పార్టీ అధ్యక్షుడు పానిని ప్రసాద్ చేతుల మీదుగా ట్రోఫీ, రూ.25 వేలు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు. మ్యాన్ ఆఫ్ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా దుంగ శ్రీను ఎంపికయ్యాడు. కార్యక్రమంలో టి.పమిడయ్య, కె.జగ్గారావు, కె.శేఖర్, కె.రాజారా వు, టి.లచ్చన్న, కలగ ఢిల్లీశ్వరరావు, కరగాన రమణ, నిర్వాహకులు టి.గణ, ఎస్.శ్రీను, ఏ.దుర్గాప్రసాద్, గ్రామ యువత పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఫ్లడ్లైట్లు శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నూతనంగా నిర్మించిన క్రికెట్ నెట్స్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. జిల్లా క్రికెట్ సంఘం రూ.17లక్షల నిధులను వెచ్చించిన ఈ నెట్స్ ఫ్లడ్లైట్ల వెలుతురులో ఆకర్షిస్తోంది. ఇందులోకి పశువులు, ఇతరులు/అపరిచితులు లోపలకు ప్రవేశించుకుండా రక్షణగా ఇనుప కంచె సైతం అమర్చారు. ప్రస్తుతం రక్షణ వలయంలో క్రీడా కారులు ముమ్మర సాధన చేస్తున్నారు. జెడ్సీఎస్ ప్రతినిధులు, కోచ్లు పర్యవేక్షిస్తున్నారు. -
గంజాయి రవాణా గుట్టురట్టు
● వేర్వేరు ఘటనల్లో 36 కేజీల గంజాయితో నలుగురు అరెస్ట్ ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ ఆవరణలో పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా 22 కేజీల 500 గ్రాముల గంజాయితో మహారాష్ట్ర రాష్ట్రం జల్నాకు చెందిన రాహుల్విష్ణు ఇంగ్లే అనే వ్యక్తి పట్టుబడినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిందితుడు ఇంగ్లేకు.. జల్నా గ్రామంలో గంజాయి వ్యాపారం చేసే సురేష్ కై లాష్ఠాకూర్తో పరిచయం ఏర్పడింది. అతని వద్ద కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీర్చలేకపోవడంతో వ్యాపారి సూచించినట్లు గంజాయి అందజేస్తే రాకపోకల ఖర్చులు పోగా కేజీ గంజాయికి వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఒడిశాకు చెందిన రాజేష్ నిందితుడు ఇంగ్లేకు గంజాయిని అందజేశాడు. దానిని తీసుకొని ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ గుండా మహారాష్ట్రకు వెళ్లేందుకు సిద్ధమవ్వగా రైల్వేస్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. గంజాయి పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పట్టణ పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు సీఐ పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టణ ఎస్సై ముకుందరావు, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్టు పొందూరు: పొందూరు రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు మహిళల నుంచి పొందూరు పోలీసులు 5 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం జేఆర్పురం సీఐ ఎం.అవతారం, పొందూరు ఎస్సై వి.సత్యనారాయణలు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఎస్సీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పొందూరు ఎస్సైకు వచ్చిన సమాచారంతో పొందూరు రైల్వేస్టేషన్కు గురువారం పోలీసు సిబ్బంది చేరుకున్నారు. స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలను గుర్తించి వారి సామాన్లు తనిఖీ చేశారు. వారి వద్ద 5 కేజీల గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. మహిళలను విచారించగా మహారాష్ట్రకు చెందిన మంగళ దీపకజాదూ, మనోబై సంపత్తిలుగా గుర్తించారు. వీరిద్దరూ ఒడిశా రాష్ట్రం ఛత్రపూర్లో రాజేష్ అనే వ్యక్తి వద్ద రూ.25 వేలకు ఐదు కేజీల గంజాయి కొనుగోలు చేశారు. మహారాష్ట్ర చేరుకునేందుకు శ్రీకాకుళం స్టేషన్లో కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సి ఉంది. పొరపాటున శ్రీకాకుళం అనుకుని పొందూరులో రైలు దిగిపోయారు. దీంతో ఇద్దరూ పట్టుబడ్డారు. పొందూరు డీటీ రాధాకృష్ణ, వీఆర్వోలు సమక్షంలో మహిళలను పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. గంజాయి పట్టుకున్న ఎస్సైను సీఐ అవవతారం అభినందించారు. స్కూటీపై గంజాయి తరలిస్తూ.. ఇచ్ఛాపురం రూరల్: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. గురువారం నిందితుడిని విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. రూరల్ ఎస్ఐ ఆర్.జనార్దనరావు గురువారం మధ్యాహ్నం ఎం.తోటూరు రైల్వే క్రాసింగ్ వద్ద తనిఖీలు చేపడుతుండగా ఒడిశాకు చెందిన లికు బెహరా అనే వ్యక్తి స్కూటీపై 8.430 కేజీల గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే బెహరాను అదుపులోకి తీసుకొని గంజాయి, స్కూటీ, సెల్ ఫోన్ను స్వాఽధీనపరచుకున్నారు. విచారణలో ఒడిశా రాష్ట్రం ఖందమాల్ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి రైల్వే మార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించారని తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు మత్తు పదార్థాలు, గంజాయిని తరలిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ ఆర్.జనార్దనరావు పాల్గొన్నారు. పొందూరు: పట్టుబడిన మహిళలతో పోలీసులు ఇచ్ఛాపురం: వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు -
పారదర్శకంగా క్రికెట్ ఎంపికలు చేపట్టాలి
శ్రీకాకుళం న్యూకాలనీ :జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా ఎంపికలు చేపట్టాలని క్రికెట్ క్రీడాకారుల తల్లిదండ్రులు కోరారు. జిల్లా క్రికెట్ సంఘం కీలకంగా చక్రం తిప్పుతున్న ఓ వ్యక్తి ఇప్పటికై నా మారాలని.. మారకుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. బుధవారం శ్రీకాకుళం నగరంలోని ఓ హోటల్లో జిల్లా పేరెంట్స్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ సమావేశం ఏర్పాటుచేశారు. ముందుగా జిల్లా స్థాయి పేరెంట్స్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. జిల్లా క్రికెట్ సంఘం జిల్లా తరఫున ఎంపిక చేయబడే జట్టును పూర్తిగా ఈ జిల్లాలో ఉంటూ.. సాధన చేస్తున్నటువంటి క్రీడాకారులతో భర్తీ చేయాలని, ఈ జట్టును మాత్రమే పైస్థాయి పోటీలకు ఆడించడానికి పంపించాలని కోరారు. ఇతర జిల్లాల నుంచి ఎవరైనా వచ్చి.. శ్రీకాకుళం జిల్లాకి రిప్రజెంట్ చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. కొందరు ఏకంగా ఆధార్ కార్డులను శ్రీకాకుళం జిల్లాకి మార్చి ప్రాతినిధ్యం వహించాలని చూస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్, ఎస్పీకి అభ్యర్థన పత్రం ఇవ్వాలని తీర్మానించారు. -
నేరేడు ఫలం.. పోషకాలు పుష్కలం
శ్రీకాకుళం కల్చరల్ : మార్కెట్లో నేరేడు పండ్లకు భలేగిరాకీ ఏర్పడింది. ఈ సీజన్లో లభించే అద్భు తమైన ఆరోగ్యకరమైన పండు కావడంతో కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని రక్షించడం, బరువు తగ్గడంలో సహాయపడటంలో నేరేడు పండు ముందంజలో ఉంటోంది. ఇవీ ప్రయోజనాలు.. నేరేడు పండు మధుమేహ నియంత్రణలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే జంబోలిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ బాధితులకు సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచి, మలబద్ధకం, విరేచనాలు వంటి ఉదర సమస్యలను నివారిస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. విటమిన్–సి, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ పెరిగి రక్తహీనత తగ్గుతుంది. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి చర్మం కాంతివంతంగా మారుతుంది. క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. అయితే, నేరేడు పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు.పాలు తాగిన వెంటనే వీటిని తీసుకోవడం మంచిది కాదు. -
మండుటెండలోనూ ‘బడి పిలుస్తోంది’
హిరమండలంలో బడి పిలుస్తోంది ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు హిరమండలం: ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించినా ఉపాధ్యాయులకు మాత్రం సెలవులు లేవు. మండుటెండల్లోనూ ప్రతి రోజూ ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని విద్యాశాఖ హెచ్చరిస్తోంది. మండు వేసవిలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు సూచిస్తున్న ప్రభుత్వం ఉదయం పది నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తోంది. తమకు మాత్రం వేళాపాళా లేకుండా బడిపిలుస్తోంది ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించడం ఏమిటని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పిల్లల్ని చేర్పించాల్సిందే.. ప్రతి ఉపాధ్యాయుడు తమ పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలని టీచర్–విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా ఈ సంఖ్య లేకపోతే ఆ ఉపాధ్యాయుడిని వేరొక స్కూలుకు పంపుతామని ఇప్పటినుంచే విద్యాశాఖాధికారులు ఒత్తిడి పెడుతున్నారు. పాఠశాలల్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలలను సమీప స్కూల్లో విలీనం చేస్తారని, ఆ పోస్టులు సైతం రద్దయ్యే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తుండటంతో ఉపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మహిళా ఉపాధ్యాయులు, రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న టీచర్లను సైతం బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొనాలని ఒత్తిడి చేస్తుండడంతో మండుటెండలో తిరిగి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను బడుల్లో చేర్పించాలని ఉపాధ్యాయులకు టార్గెట్లు లేకుంటే పోస్టులు రద్దవుతాయని హెచ్చరికలు -
టీడీపీ మహిళా నేతపై తెలుగు తమ్ముడు దాడి
● ఎస్ఎంపురంలో సంధ్య గణపతిరావు చౌదరి కారుపై రాళ్ల దాడి ● పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటున్న బాధిత టీడీపీ నాయకురాలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : విజయనగరం జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సంధ్య గణపతిరావు చౌదరిపై అదే పార్టీకి చెందిన నాగులు అనే వ్యక్తి దాడికి పాల్పడ్డారు. ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురం గ్రామంలో ఒకరిని పరామర్శించేందుకు వెళ్లి వస్తుండగా సంధ్య ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి చేశారు. ఆ సమయంలో సంధ్య అనుచరులు రావడంతో అక్కడి నుంచి ఉడాయించిన నాగులు మరో టీడీపీ నేత ఇంటిలోకి వెళ్లి దాక్కున్నాడు. తనపై జరగిన దాడిపై సంధ్య గణపతిరావు చౌదరి పో లీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించలేదని సంధ్య గణపతిరావు ఆరోపించారు. పోలీసు వ్యవస్థ ఇలా తయారైందేంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడం ఆందోళనకరమన్నారు. ‘భూములు పోతాయంటే పోరాటం తప్పదు’ సోంపేట: కవిటి మండలం శిలగాం గ్రామం వద్ద ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సుమారు 21 ఎకరాల ఉద్యాన శాఖ విలువైన భూములను బడాబాబులకు అప్పగిస్తే పోరాటం తప్పదని మహాత్మా జ్యోతిరావు పూలే రాష్ట్ర బీసీ సంఘం హెచ్చరించింది. గురువారం సోంపేట పట్టణంలోని విజయదుర్గ ఆలయం వద్ద రాష్ట్ర సంఘ అధ్యక్షుడు బీన ఢిల్లీరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఉద్దానమంతా కిడ్నీ వ్యా ధితో సతమతమవుతోందని, ఇలాంటి చోట వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సింది పోయి కాలుష్యం పెంచే కర్మాగారాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. కోట్లాది రూపాయల విలువైన శిలగాం వద్ద గల ఉద్యాన శాఖ భూములను పప్పు బెల్లాల మాదిరిగా కార్పొరేట్లకు పంచి పెడితే పోరాటం తప్పదన్నారు. ‘ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’ శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ప్రభు త్వం పరిష్కరించాలని ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు తిరుపతిరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళంలోని ఈయూ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ గౌరవాధ్యక్షులు టి.తిరుపతిరావు ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలపై మాట్లాడారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఔట్సోర్సింగ్ కార్మికులకు రూ. 26,000 వేతనం ఇవ్వాలని, జీతాలు సకాలంలో ఇవ్వా లని డిమాండ్ చేశారు. జిల్లాకు చేరిన ఇంటర్ పుస్తకాలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పాఠ్యపుస్తకాలు చేరాయి. అయితే వీటిని తీసుకెళ్లడానికి మాత్రం ప్రభు త్వ యాజమాన్య విద్యాసంస్థలు అష్టకష్టాలు పడుతున్నాయి. గత ఏడాది పాఠ్యపుస్తకాల పంపిణీలో ఏర్పడిన లొసుగుల నుంచి ఇంటర్మీడియెట్ విద్య డైరెక్టరేట్ కార్యాలయం తేరుకుంది. ఈ విద్యా సంవత్సరం కాస్త ముందుగానే పాఠ్యపుస్తకాలను చేరవేసినప్పటికీ.. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంలో లోపభూయిష్టత కనిపించిందని విశ్రాంత విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఆయా విద్యా సంస్థల అధికారులు, సిబ్బంది పరీక్షల నిర్వహణ లో నిమగ్నమై ఉన్నారు. దీంతో పుస్తకాలు తీసుకెళ్లలేకపోతున్నారు. గతంలో మండల కేంద్రాలకే నేరుగా పాఠ్యపుస్తకాలను పంపించేవారు. పెద్దగా ఖర్చు అయ్యేదికాదు. ప్రస్తుతానికి పా ఠ్య పుస్తకాలు మాత్రమే వచ్చాయి. నోట్బుక్స్ గానీ, బ్యాగులు గానీ రాకపోవడం చర్చనీయాంశమవుతోంది. -
టెక్కలిలో 25 కిలోల వెండి చోరీ
టెక్కలి: టెక్కలి పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో వెంకటేశ్వర కాలనీలో ఓ ఇంట్లో దుండగులు చోరీకు పాల్పడ్డారు. కాలనీకు చెందిన బొరిగి లక్ష్మినారాయణ కుటుంబం కొన్ని రోజులుగా స్థానికంగా లేకపోవడంతో మాటు వేసిన దుండగులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ప్రవేశించి 25 కిలోల వెండి, సుమారు 4 తులాల బంగారం, కొంత మొత్తంలో నగదు పట్టుకుపోయారు. గురువారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు బెంగళూరులో తన కుమారుడి వద్ద ఉన్నటువంటి యజమానికి సమాచారం అందజేశారు. ఇదే సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ రాము సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రైమ్ ఏఎస్పీ పి.శ్రీనివాసరావు నేతృత్వంలో క్లూస్టీమ్ ఆధారాలు సేకరించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పంటలకు మద్దతు ధర పెంచాలి
రణస్థలం: వ్యవసాయానికి పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా పంటలు మద్దతు ధరలు పెంచాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెలమల రమణ, ఏపీ రైతు సంఘం నాయకులు మజ్జి రమణ డిమాండ్ చేశారు. వ్యవసాయ పంటల మద్ధతు ధరలు నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ఖండిస్తూ కొండములగాం గ్రామంలో కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ పంటల మద్ధతు ధరల జీవో కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర రూ.2400 ఉండగా కేవలం పది రూపాయలు పెంచి రూ.2410 నిర్ణయించడం, వరికి క్వింటాలుకు రూ.2441గా నిర్ణయించడం రైతులకు అన్యాయం చేయడమేనని అన్నారు. 13 రకాల పంటలకు అతి తక్కువ ధరలు నిర్ణయించడం దారుణమన్నారు. ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగాయని, సాగు ఖర్చులు పెరిగాయని దానికి తగినట్లు మద్ధతు ధర పెంచలేదని విమర్శించారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా, రసాయనిక ఎరువుల ధరలు మాత్రం 50 కిలోల బస్తాపై రూ.350 వరకు పెంచడం దుర్మార్గమన్నారు. యుద్ధం సాకుతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం పేద ప్రజలపైన, చిన్న, సన్నకారు రైతులపైన భారం మోపడమేనని అన్నారు. డాక్టర్ స్వామినాథన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని, రసాయనిక ఎరువుల ధరలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ని రామినాయుడు, దన్నాన సూర్యనారయణ, పి.అప్పలరాము తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఊపిరి పదిలం
● భక్తిశ్రద్ధలతో బక్రీద్జిల్లా కేంద్రంలోని జామియా మసీదులో ముస్లింలు గురువారం బక్రీద్ను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మత పెద్ద ఇమాం వహాబ్ ఆధ్వర్యంలో నమాజు కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు –శ్రీకాకుళం కల్చరల్● అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ ఇచ్చిన నాగార్జున నందిగాం: నందిగాంకు చెందిన బంగారు నాగార్జున (38) బ్రెయిన్ డెడ్తో మృతి చెంది మరో ఐదుగురికి అవయవ దానంతో ప్రాణం పోశారు. వివరాలను పరిశీలిస్తే.. నందిగాంకు చెందిన నాగార్జున మైక్ సెట్లు, లైటింగ్, డీజేలు అద్దెకు ఇస్తూ జీవనం సాగించేవాడు. మూడు రోజుల క్రితం పనిచేస్తూ ఒక్కసారిగా పడిపోవడంతో తోటివారు స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యు డు పరిశీలించి పరిస్థితి తీవ్రత దృష్ట్యా రాగోలు జెమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వివిధ పరీక్షలు చేసిన వైద్యులు బ్రెయిన్డెడ్గా గుర్తించారు. దీంతో జీవన్దాన్ వారు నాగార్జున కుటుంబ సభ్యులకు అవయవ దానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. దీంతో నాగార్జున నుంచి లివర్, రెండు కిడ్నీలు, రెండు ఊపిరితిత్తులు, కార్నియా సేకరించి ఊపిరితిత్తులను హైదరాబాద్, ఒక కిడ్నీ విశాఖపట్నం, మరో కిడ్నీ, లివర్, కార్ని యాని శ్రీకాకుళం తరలించి మరో ఐదుగురికి ప్రాణదానం చేశారు. అంతటి శోకంలోనూ అవయవదానంకు అంగీకరించిన నాగార్జున తల్లిదండ్రులు తులసయ్య, బోడెమ్మ, భార్య దివ్య, తమ్ముడు చంటిను పలువురు కొనియాడారు. మృతుడికి ఆరో తరగతి చదువుతున్న ఒక కుమారుడు ఉన్నాడు. అయితే నిత్యం మైక్సెట్, డీజేలతో సందడిగా ఉండే నాగార్జున మృతిలో నందిగాంలో తీవ్ర విషాదం నెలకొంది. -
చిన్న విషయాలకే.. చితికిపోతున్నారు!
● క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత ● చిన్న వయసులోనే ముగించేస్తున్న జీవితాలు ● వారం వ్యవధిలో జిల్లాలో 10 మంది ఆత్మహత్య ● ప్రతి సమస్యకూ పరిష్కారం ఉందంటున్న మానసిక నిపుణులు శ్రీకాకుళం క్రైమ్/టెక్కలి: జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది.. అయితే కొందరు ప్రతి చిన్న విషయానికీ అతిగా ఆలోచిస్తూ చావే పరిష్కారంగా విలువైన జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తున్నారు.. క్షణికావేశంలో చేస్తున్న ఇటువంటి మరణాల వలన వారి కుటుంబాలు నడిరోడ్డున పడుతున్నాయి.. ప్రస్తుతం వివిధ రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్న ఎంతో మంది మేధావులు ఒకప్పుడు ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నాకే ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. అటువంటి వారి జీవిత చరిత్రలను ప్రతి రోజూ చూస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఒంటరి తనంగా తీసుకునే నిర్ణయాలతో నిండు జీవితాలను కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో ఈ తరహా ఘటనలు అధికమవున్నాయి. ముఖ్యంగా యువత చిన్న విషయాల కే ‘చితి’కిపోతున్నారు. ఈ తరుణంలో ఎటువంటి సమస్య ఎదురైనా ఒక్క క్షణం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల ఘటనలు.. ● ఈ ఏడాది ఏప్రిల్ 10న జేఆర్ పురంలో నాగవరపు వీరబాబు (39) మతిస్థిమితం సరిగ్గా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే తన ఇంటిని మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు పోలీసులు సమక్షంలో కూల్చేశారని పలాస సూదికొండ కాలనీకి చెందిన దళిత మహిళ ఏప్రిల్ 10న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ● మే 14న ఆమదాలవలస మండలం గాజులకొల్లివలసలో తల్లితో గొడవపడి రాజేష్, గార మండలం గిడిపేటలో భార్య మద్యం తాగొద్దన్నందుకు కర్రి త్రినాధరావు చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించారు. సారవకోట మండలం కురిడిలో భాస్కరరావు గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● మే 10న సారవకోటలో కుటుంబ కలహాలతో కలుపు మందు తాగి తిరుపతి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ● మే 5న వజ్రపుకొత్తూరు మండలం చిన్న పల్లివూరుకు చెందిన గర్తం ఇందు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ● టెక్కలి తలగాంకు చెందిన వీరఘట్టం అనూష మే 4న ఆత్మహత్య చేసుకుంది. ● మే4న జి.సిగడాంలో తన భర్త హోంగార్డు శ్యామ లరావు మద్యానికి, బెట్టింగ్లకు బానిసై బంగారాన్ని అమ్మేయడంతో భార్య ఉరి వేసుకుంది. ● మే 1న టెక్కలి ఆంధ్రావీధిలో డి.రామకృష్ణ తన భార్యపై దాడి చేసి ఆపై కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ● ఏప్రిల్ 12న బూర్జ మండలానికి చెందిన చుక్కర తవుడు అనే రైతు అకాల వర్షాలకు పంటలు నాశనమవ్వడంతో గడ్డి మందు తాగి బలవణ్మరణానికి గురయ్యాడు. ● అప్పు ఇస్తే తిరిగి అవతలివారే కేసు పెట్టడంతో మనస్తాపానికి గురై ఏప్రిల్ 11న పాతపట్నం చిన లోగిడికి చెందిన ఆటో డ్రైవర్ దయానిధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో డ్రైవరు ఆత్మహత్య పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని జయరామచంద్రపురం గ్రామానికి చెందిన పూడి చిన్నబాబు(31) బుధవారం రాత్రి గ్రామ శివారులో ఉన్న టేకుతోటలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నబాబు తాళబద్ర గ్రామ సంబరాలకు స్నేహితుడు శేఖర్తో కలిసి వెళ్లాడు. అక్కడ మద్యం సేవిస్తూ ఇద్దరు గొడవ పడ్డారు. శేఖర్ చిన్నబాబుపై చేయికోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. అప్పుడే అతను తాను చనిపోతానని చెప్పాడు. చెప్పిన ప్రకారం మద్యం మత్తులో ఉన్న చిన్నబాబు అదే రోజు రాత్రి తన ఇంటికి వెళ్లకుండా ఊరు శివారులో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాశీబుగ్గ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కౌన్సెలింగ్ అవసరం.. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినపుడు స్నేహితులు, కుటుంబ సభ్యులు, లేకపోతే మానసిక వైద్య నిపుణుల కౌన్సెలింగ్ అవసరం పడుతుంది. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని కచ్చితంగా దూరం పెట్టవచ్చు. మనిషి సైకాలజీ ప్రకారం.. ఎంతటి పెద్ద సమస్యకై నా కచ్చితంగా సమాధానం ఉంటుంది. ఒక్క క్షణం ఆలోచిస్తే కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. – నిర్మల్ అలెగ్జాండర్, మానసిక వైద్య నిపుణుడు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, టెక్కలి -
వరుసగా వాహనాలు ఢీ
● రణస్థలం వద్ద స్తంభించిన ట్రాఫిక్ రణస్థలం: రణస్థలం ఫ్లై ఓవర్ పనులు వాహనచోదకులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు ముందు వెళుతున్న క్రేన్ను అధిగమించే ప్రయత్నంలో క్రేన్ చివర భాగం బస్సుకు తగిలింది. దీంతో బస్సు అద్దం పగిలిపోయి ప్రయాణికులు కేకలు వేశారు. వెనుకనే వస్తున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ కారు ఇసుక లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోయినా కారుకు, ప్రైవేటు బస్సు దెబ్బతిన్నాయి. ఈ రెండు ప్రమాదాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది. హైవే సెక్యూరిటి, స్థానిక పోలీసులు వచ్చి వాహనాలను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. -
చెత్త మిగిల్చాయి
సీఎం టూర్.. పారిశుద్ధ్యం పూర్! కోట్లు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి పర్యటన జిల్లాకు మేలు చేయాల్సింది పోయి కొత్త తలనొప్పులు తీసుకువచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నరసన్నపేటలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనతో ప్రజలకు ఇబ్బందులు, ప్రభుత్వానికి ఖర్చులు, పార్టీకి పబ్లిసిటీ తప్ప ఇంకేమీ మిగల్లేదు. స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర ప్రొగ్రామ్ అక్కరకు రాలేదు సరికదా కొత్త సమస్యలను సృష్టించింది. ఆయన పర్యటన కోసం చేసిన హడావుడి ఆ తర్వాత లేకపోవడంతో పరిస్థితులు దయనీయంగా తయారయ్యాయి. పారిశుద్ధ్యం నిర్వహణ పక్కన పెడితే ఆయన పర్యటన కోసం కొత్త కర్ర చెరువు వద్ద వేసిన చెత్త కొత్త ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. అటు అధికారులు, ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సంతతోట ఎదురుగా ఉన్న ప్రాంతం తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. డంపింగ్ యార్డ్గా కొత్త కర్ర చెరువు.. ● సీఎం చంద్రబాబు పర్యటన కోసం నరసన్నపేటలో వార్డుకి 10 మంది చొప్పున 20 వార్డుల్లో 200 మందితో వారం రోజుల పాటు చెత్త, వ్యర్థ పదార్ధాలను జేసీబీ, ట్రాక్టర్లతో ఎత్తి సంత తోట ఎదురుగా ఉన్న కొత్త కర్ర చెరువు వద్ద డంప్ చేశారు. ● నరసన్నపేటలో డంపింగ్ యార్డు ఉన్నప్పటికీ సీ ఎం పర్యటన కోసం సమయం సరిపోదని దగ్గరలో ఉన్న కొత్త కర్ర చెరువు వద్ద రోడ్డుపై వేసేశారు. ● సీఎం పర్యటన ముగియగానే అక్కడున్న చెత్తను ఎత్తేస్తామని చెప్పారు. ● కానీ, రెండు వారాలు అవుతున్నా అక్కడ వేసిన చెత్తను తరలించలేదు. దీంతో దుర్గంధంగా తయారైంది. అటువైపు వెళ్లే వారంతా ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. సమీపంలో ఉన్న నివాసితులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సంపద కేంద్రం వద్దనైతే.. సీఎం సందర్శన కోసం చెత్త నుంచి సంపద కేంద్రంలో అప్పటికప్పుడు రూ. 60లక్షలతో హంగులు సమకూర్చి ఆర్బాటం చేశారు. చంద్రబాబు వెళ్లిపోగానే సంపద కేంద్రాన్ని గాలికొదిలేశారు. చంద్రబాబు ఫొటో, వీడియో షూట్ చేసిన కార్యక్రమంగా మిగిలిపోయిందే తప్ప వర్కింగ్లో తీసుకొచ్చిన పరిస్థితి లేదు. ‘చెత్త శుద్ధి ఇదేనా అని ‘సాక్షి’లో కథ నం వచ్చాక సంపద కేంద్రానికి తాళాలు తీశారు. కానీ,చంద్రబాబు చెప్పినట్టు సంపద సృష్టించే చర్య లు మొదలు కాలేదు. 2018లో ఎలాగైతే ఉత్సవ విగ్రహంగా వదిలేశారో.. ఈసారి కూడా అదే ధోరణి కనబరుస్తున్నారు. తమకు పబ్లిసిటీ తప్ప ఆచరణ ముఖ్యం కాదని మరోసారి చాటి చెప్పారు. రూ.కోట్లు ఖర్చు.. ప్రజలకు ఇబ్బందులు చంద్రబాబు కార్యక్రమానికి జనాలు తరలింపు, ఇతర త్రా ఖర్చులైతే రూ.కోట్లలో అయ్యాయి. ప్రజా ధనం ఖాళీ అయిపోయింది. ఇక చంద్రబాబు వస్తున్నారని సమీపంలో ఉన్నషాపులను మూసివేసి,వర్తకులు ఇబ్బం దులు పెట్టారు. పోనీ, ఇంత చేసి నా నరసన్నపేటకు ఏదైనా మేలు జరిగిందా? అంటే ఏమీ లేదు. అమలు చేయని పాత హామీలు ఇచ్చి చంద్రబాబు వెళ్లిపోయారు. ఆయన వెళ్లాక ప్రజలకు కష్టాలు మిగిల్చారు. నరసన్నపేట ప్రజలకు చెత్త ఇబ్బందులు రూ. కోట్లలో ఖర్చు ...ప్రజా ధనం ఖాళీ ఒక్క మేలు జరగని పరిస్థితి సీఎం పర్యటన కోసం ఊరి చెత్త అంతా కొత్త కర్ర చెరువు వద్ద డంపింగ్ తీవ్ర దుర్గంధంగా మారిన పరిసర ప్రాంతాలు -
పింఛనో రామచంద్రా..!
హిరమండలం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా కొత్త పింఛన్ల మంజూరుపై నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు అందజేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ ఊసెత్తడం లేదు. అర్హులైన వేలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టు తిరుగుతున్నా చంద్రబాబు సర్కార్ కనికరించడం లేదు. దాదాపు రెండేళ్లుగా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకపోవడంతో అనేక మంది ఆపసోపాలు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పక్కాగా పింఛన్లు అందించేవారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా వలంటీర్లు దరఖాస్తు పూర్తి చేసి, సచివాలయాల్లో ఇస్తే పింఛన్లు మంజూరయ్యేవి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగింది. కానీ నేడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. దీంతో గత ప్రభుత్వంలో సాధ్యమైనది ఇప్పుడు ఎందుకు సాధ్యం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి... జిల్లాలో 50 ఏళ్లు వయస్సు దాటినవారు సుమారు 1,45,440 మంది ఉన్నారు. 60 ఏళ్లు దాటినవారు, వితంతువులు, దివ్యాంగులు కూడా దాదాపు 20 వేల మందికి పైగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లపై రోజుకో మాటతో కాలం గడుపుతోంది. దీంతో ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిరమండలం సచివాలయం చెప్పులు అరిగేలా తిరుగుతున్నా నా భర్త దాదాపు పది నెలలు క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. జీవనోపాధి కోసం కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. సచివాలయానికి కాళ్లరిగేలా తిరుగుతున్నా పింఛన్కు దరఖాస్తు తీసుకోవడం లేదు. కుటుంబ పోషణ కష్టమవుతోంది. దీన స్థితిలో ఉన్న మాపై ప్రభుత్వానికి కనికరం కలగడం లేదు. – మద్దిలి దేవి, తంప గ్రామం, హిరమండలం ఏడాదిన్నరగా ఎదురుచూపులు ఏడాదిన్నర క్రితం నా భర్త చనిపోయాడు. కూటమి ప్రభుత్వం వస్తే తనలాంటి వితంతువులకు వెంటనే పింఛన్ ఇస్తామన్నారు. ఒకటిన్నర సంవత్సరంగా సచివాలయానికి తిరుగుతున్నా.. కొత్త పింఛన్ మంజూరు చేయడం లేదు. ఉత్తర్వులు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. తక్షణమే పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి. – ముద్దాడ కనకమ్మ, హిరమండలం ఉన్నవాటిని తొలగించడం దారుణం కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలను గాలికి వదిలేశారు. అర్హులకు పింఛన్లు ఇవ్వకపోగా.. ఉన్న పింఛన్లు కూడా తొలగించే పనిలో బిజీగా ఉన్నారు. అనర్హత పేరుతో చాలామందిని పింఛన్ అర్హత జాబితా నుంచి తొలగించారు. దీంతో వారంతా ప్రస్తుతం జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. – మీసాల వెంకట రామకృష్ణ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, హిరమండలం -
కోటపాలెంలో పూరిళ్లు దగ్ధం
రణస్థలం: మండలంలో కోటపాలెం పంచాయతీలోని యాతవీధిలో మంగళవారం అర్థరాత్రి నాలుగు పూరిళ్లు అగ్నికి అహుతయ్యాయి. స్థానికులు, అగ్నిమాపక ఎస్ఐ డి.హేమసుందర్ తెలిపిన వివరాల మేరకు.. కాకర ఎరకయ్య, సీతారాములు, లక్ష్మణ, అసిరియ్య పూరిళ్లు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాయి. స్థానికులు నీళ్లతో అర్పినా అప్పటికే సగం కాలిపోయాయి. అగ్నిమాపక వాహనం వచ్చి మిగతా మంటలు ఆర్పివేశారు. ఇంట్లో బీరువాలు, సామగ్రి, విలువైన పత్రాలు బుడిదయ్యాయని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా అగ్ని ప్రమాద బాధితులను వైఎస్సార్సీపీ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు పిన్నింటి సాయికుమార్ పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. పక్కా ఇళ్లు మంజూరు చేయాలని తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్ను కోరారు. ఆయనతో పాటు జెడ్పీటీసీ టొంపల సీతారాం, నాయకులు మహంతి చిన రామునాయుడు, చిల్ల వెంకటరెడ్డి, సుంకరి కిషోర్ కుమార్, గొర్లె జగదీష్, మహంతి పెదరామినాయుడు, జోగ శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. -
ల్యాబ్ లైసెన్సు ఇప్పిస్తానంటూ మోసంపై ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్: ల్యాబ్ లైసెన్సు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకొని మోసం చేసిన శ్రీనిధి డాక్టర్స్ ప్లాజా మేనేజర్ బొడ్డేపల్లి సుధీర్పై డాక్టర్సు ప్లాజా యజమానులు డాక్టర్ జన్ని రమ్య, డాక్టర్ నాగేంద్రబాబులు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం బొడ్డేపల్లి సుధీర్కు ల్యాబ్ లైసెన్సు కోసం మార్చి 6, 2024 ఫోన్ పే ద్వారా రూ.3.20 లక్షలు, నెల రోజుల వ్యవధిలో ఎక్యూప్మెంట్ కోసం మరో రూ.6 లక్షలు చెల్లించారు. అయితే ఇప్పటివరకు లైసెన్సు, పరికరాలు రాకపోవడంతో అతన్ని నిలదీసినా స్పందన లేకపోవడంతో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విద్యుత్ షాక్తో గాయాలు టెక్కలి: స్థానిక శ్రీనివాసానగర్లో ఒక విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తున్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కిషోర్ విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. విద్యుత్ సిబ్బంది పర్యవేక్షణలో మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో గాయపడిన యువకుడిని పట్టణంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన ఎలక్ట్రీషియన్కు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
అసమానతలు ఉన్నంతవరకు ఉద్యమాలు ఆగవు
● బొడ్డపాడులో ఘనంగా అమరవీరుల స్మారక సభ పలాస: సమాజంలో అసమానతలు ఉన్నంతవరకు విప్లవోద్యమాలు ఉంటాయని, వాటిని ఎవరూ అరికట్టలేరని వివిధ విప్లవ ప్రజా సంఘాల నాయకులు అన్నారు. నాటి నక్జలబరి, శ్రీకాకుళ సాయుధ పోరాటాలు భవిష్యత్ తరానికి అవసరమని, వాటి స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలు కొనసాగుతాయని తెలిపారు. మండలంలో బొడ్డపాడులోని జిల్లా అమరవీరుల స్మారక మందిరంలో బుధవారం 37వ అమరవీరుల స్మారక సభ నిర్వహించారు. స్మారక సభ నిర్వాహక కమిటీ కన్వీనర్ పోతనపల్లి కుసుమ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పోలా ఈశ్వరరావు, లిబరేషన్ రాష్ట్ర కమిటీ నాయకులు డి.హరనాథ్, జనశక్తి జిల్లా కార్యదర్శి కోనేరు రమేష్ తదితరులు మాట్లాడుతూ.. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని, ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, ప్రజల జీవన వ్యవస్థ సంక్షోభంలో పడిందన్నారు. అంతకుముందు అరుణ పతాకాన్ని అమరజీవి పోతనపల్లి పారమ్మ జీవిత సహచరుడు జోగి కోదండరావు, జయక్క కుమారుడు మల్లేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం అరుణోదయ కళాకారులు ఓ అరుణ పతాకమా అనే పాటను పాడి వినిపించారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు తామాడ సన్యాసిరావు, మద్దిల రామారావు, కొర్రాయి నీలకంఠం, మురిపింటి గంగయ్య, సొర్ర రామారావు, జయలక్ష్మి, విరసం రాష్ట్ర కార్యదర్శి రివేరా తదితరులు పాల్గొన్నారు. -
కందుకూరి విగ్రహం ఆవిష్కరణ
శ్రీకాకుళం అర్బన్: నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీ మందిరం స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల స్మృతివనంలో తెలుగు రచయితల వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, రఘుపాత్రుని వెంకటరమణమూర్తి పర్యవేక్షణలో ప్రముఖ విద్యావేత్తలు సురంగి మోహన్రావు, బలివాడ మల్లేశ్వరరావు, బరాటం లక్ష్మణరావుతో పాటు తెరవే బృందం సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడాచారాలతో కునారిల్లుతున్న సమాజ గతిని వితంతు పునర్వివాహం జరిపించి మలుపు తిప్పిన సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు అన్నారు. బాల్య వివాహాలను వ్యతిరేకించడంతో పాటు సీ్త్ర విద్యను ప్రోత్సహించిన మహనీయుడని పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోసం వివేకవర్ధిని అనే పత్రికను స్థాపించి వరకట్నం వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడిగా నిలిచిన కందుకూరి స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా ఉంటుందని కొనియాడారు. కార్యక్రమంలో తెరవే ప్రతినిధులు వాడాడ శ్రీనివాసరావు, డాక్టర్ కోమలరావు, డాక్టర్ నిక్కు అప్పన్న, ఇద్ది పాపయ్య, సోడవరం ఈశ్వరరావు, తలగాన లింగరాజు, చదువుల చలపతిరావు, కుప్పిలి త్రినాథరావు, బి.మోహన్గాంధీ, కనుగుల సత్యం, వావిలపల్లి రాజారావు, గాంధీ మందిర ప్రతినిధులు కొంక్యాన వేణుగోపాల్, పొన్నాడ రవికుమార్, మెట్ట అనంతంభట్లు, గుత్తు చిన్నారావు, పందిరి అప్పారావు, జి.నాగేశ్వరరావు, బీకే జయలక్ష్మి, శాస్త్రి పాల్గొన్నారు. -
గడువులోగా పనులు పూర్తి చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ పనులను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాంప్లెక్స్ ప్రధాన ద్వారం పనులు, విశాలమైన పార్కింగ్ ఏరియా, పాదచారుల కోసం ఏర్పాటు చేస్తున్న టైల్స్ పనులను ఆయన నిశితంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, కాంప్లెక్స్ ఆవరణలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన వాలుతో నేరుగా డ్రెయిన్లలోకి వెళ్లేలా శాశ్వత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాహనదారుల సౌకర్యార్థం విశాలమైన పార్కింగ్ ఏరియాను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహన డ్రైవర్ల కోసం పార్కింగ్ ఆవరణలోనే ప్రత్యేక విశ్రాంతి గదులు, ఆధునిక కేఫెటేరియాతో పాటు ప్రత్యేకంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను సూచించారు. -
సీఎం చంద్రబాబు జిల్లాకు చేసిన మేలేంటి..?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు జిల్లాకు చేసిన మేలేంటని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పి.తేజేశ్వరరావులు ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో అచ్చెన్నాయుడు చేస్తున్న అభివృద్ధి ఎరజ్రెండా ఉద్యమాలను అడ్డుకోవడమేనా అని ప్రశ్నించారు. ఎరజ్రెండా ఎల్లప్పుడూ శ్రమజీవుల పక్షాన ఉంటుందని తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా విధ్వంసకర ప్రాజెక్టులతో జిల్లాని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సముద్ర తీర ప్రాంతమంతా రేర్ ఎర్త్ మినరల్స్ కోసమే అప్పజెప్పడం ద్వారా సముద్ర తీరం తవ్వకాలకు గురై పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందన్నారు. పంట భూములు ఉప్పునీటి భూములుగా మారిపోయి వ్యవసాయం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం విస్మరించి వేలాది మంది మత్స్యకారులను వేటకు దూరం చేయడం సరికాదన్నారు. కార్గో ఎయిర్పోర్టు పేరుతో లక్షలాది చెట్లను నరికి ఉద్దానాన్ని ఎందుకు విధ్వంసాన్ని చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఒక్క పైసా కూడా నిధులు కేటాయించకుండా అభివృద్ధి కోసం మాట్లాడుతారా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా జిల్లాకు మేలుచేసే పనులు చేపట్టాలని సూచించారు. -
తప్పిన పెను ప్రమాదం
జి.సిగడాం: మండలంలోని పెంట గ్రామంలో పొగిరి అరుణకుమారి ఇంట్లో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో ఉన్న ఫ్రిజ్, ఇన్వర్టర్, బియ్యంతో పాటు వివిధ రకాల సామగ్రి కాలిబూడిదయ్యాయి. దీంతో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిళ్లిందని బాధితురాలు బోరున విలపించింది. ఇంట్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో గ్రామస్తులు పరుగులు తీసి మంటలను అదుపు చేశారు. ప్రమాదం సమాచారం తెలుసుకొని మాజీ సర్పంచ్ పున్నాన అక్కలనాయుడు, ఎంపీటీసీ మక్క శ్రీనివాసరావు, విశ్రాంత మేనేజర్ మక్క పెద్ద అప్పలనాయుడు, పున్నాన శ్రీనివాసరావు, మక్క గురినాయుడులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. పిడుగుపాటుకు మహిళ మృతి జి.సిగడాం: మండలంలోని జాడ గ్రామంలో పిడుగుపాటుకు మహిళ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం సాయంత్రం గ్రామానికి చెందిన కోరాడ కళావతి(40) పొలంలో గొర్రెలు కాస్తుండగా ఒక్కసారిగా పిడుగుపాటు సంభవించింది. దీంతో కళావతి తీవ్రగాయాలు పాలయ్యింది. వెంటనే 108 వాహనంలో రాజాం అస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, భర్త ఉన్నారు. అలాగే రెండు గొర్రెలు చనిపోయాయి. బుధవారం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెలిచేటి సందీప్కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్రైస్తవ హక్కులు కాపాడాలి సరుబుజ్జిలి: క్రైస్తవులు, దళిత హక్కులకు భంగం కలగకుండా రక్షణ కల్పించాలని క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి ఫౌండర్ వైఎస్ చిన్నారావు, ప్రతినిధులు ప్రత్తిపాటి ప్రసాదరావు, పీటర్ కామేశ్వరరావు, రవికుమార్ కోరారు. ఛలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కేజీ బాలకృష్ణన్ను బుధవారం ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందించారు. రాజ్యాంగపరంగా కల్పించినటువంటి సంక్షేమం, హక్కులు రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విన్నవించారు. హక్కుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చైర్మన్ హమీ ఇచ్చారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి టెక్కలి: స్థానిక పెద్దబ్రాహ్మణ వీధిలో విద్యుత్ షాక్కు గురై దూపాన కామేశ్వర్రెడ్డి (63) అనే వ్యక్తి బుధవారం మృతి చెందారు. ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగిలి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈయన మృతికి బీజేపీ మండల అధ్యక్షుడు జర్జాన రామ్జీతో పాటు పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. వడదెబ్బతో వృద్ధుడు మృతి సోంపేట: పలాసపురం గ్రామానికి చెందిన సింహాచలం పాిణిగ్రాహి(65) వడదెబ్బతో బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో ఉక్కపోతతో చనిపోయినట్లు పేర్కొన్నారు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
బాక్సింగ్ క్రీడాకారులు జిల్లాకు గర్వకారణం
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంనకు చెందిన బాక్సింగ్ క్రీడాకారులు జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్నారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్బాబు కొనియాడారు. ఇటీవలి విశాఖపట్నంలో జరిగిన శాప్లీగ్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 12 పతకాలతో సత్తాచాటారు. వీటిలో మూడు బంగారు, ఏడు రజత, మరో రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులను బుధవారం స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో డీఎస్డీవో అభినందించారు. వీరిని తీర్చిదిద్దుతున్న డీఎస్ఏ బాక్సింగ్ కోచ్ ఉమామహేశ్వరరావును ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బలగ అనంత లక్ష్మణ్దేవ్ (అను), బి.సీతారాం, వంగా మహేష్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
ధ్యానంతో ప్రశాంతత
గార: పోలీసు అధికారులు, సిబ్బందిలో మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం ఏకాగ్రత పెంపొందించేందుకు ధ్యాన సాధన ఉపయోగపడుతుందని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అన్నారు. శ్రీకాకుళం నగర పరిధిలోని ఓ ఫంక్షన్లో హాలులో ఏర్పాటు చేసిన ధ్యాన కార్యక్రమం బుధవారంతో ముగిసింది. జిల్లాలో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం, శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్లతో పాటు ఈగల్, ఇంటెలిజెన్సు విభాగాల అధికారులు, సిబ్బందికి ధ్యానం, శ్వాస వ్యాయామాలపై హార్ట్ ఫుల్నెస్ సంస్థ నిపుణులు అవగాహన కల్పించారు. ధ్యానం ద్వారా ఆలోచన శక్తి పెరగడంతో పాటు విధి నిర్వహణలో ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. పింఛన్ల పంపిణీపై సమీక్ష శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో పెన్షన్ల పంపిణీ శతశాతం జరగాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలతో పింఛన్ల పంపిణీపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంపిణీలో ఆలస్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయాల సంక్షేమ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రమాబాయి జీవితం స్ఫూర్తిదాయకం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సతీమణి రమాబాయి జీవితం స్ఫూర్తిదాయకమని ఏఐఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను, శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాల జేఏసీ అధ్యక్షుడు డా.కంఠ వేణు, జేఏసీ నేతలు బడే కామరాజు, రాయి వేణుగోపాల్, బోనేల రమేష్లు అన్నారు. ప్రజల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు అంబేడ్కర్ అయితే.. ఆయన సాధించిన విజయాలకి అన్నివిధాలుగా అండగా నిలిచిన ధీర వనిత రమాబాయి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని కలెక్టర్ కార్యాలయం రోడ్డులో ఉన్న పూలే పార్క్లో తైక్వాండో శ్రీను ఏర్పాటు చేసిన రమాబాయి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమె వర్ధంతి సందర్భంగా బుధవారం నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఐఎం, దళిత, బహుజన జేఏసీ నాయకులు కొత్తూరు సత్యనారాయణ, పెయ్యల చంటి, అబ్బాస్, రాహుల్, గజ్జల తేజ, సంతు తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిని గాలికొదిలేశారు!
పలాస సామాజిక ఆస్పత్రి (సీహెచ్సీ)లో చిన్నపిల్లల వార్డులో ఫ్యాన్లు తిరగకపోవడంతో నవజాత శిశువులు, బాలింతలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గర్భిణులు ప్రసవం అనంతరం ఇదే వార్డులోకి తల్లీబిడ్డలను ఉంచుతారు. అయితే ఈ వార్డులో కొన్ని ఫ్యాన్లు పని చేయకపోవడం, కొన్ని ఫ్యాన్ల నుంచి గాలి సరిగ్గా రాకపోవడంతో బాలింతలు అవస్థలు పడుతున్నారు.దీంతో కొందరు ఇంటి నుంచే ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆస్పత్రులను గాలికొదిలేశారని మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. –వజ్రపుకొత్తూరు రూరల్ -
29,30 తేదీల్లో ఎస్సీ కమిషన్ సభ్యుడి పర్యటన
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ఈ నెల 29, 30 తేదీలలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. 29న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. మధ్యాహ్నం పలు భూ సమస్యలపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టనున్నారు. 30న ఉదయం 10:30 గంటలకు మందస తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. మధ్యాహ్నం భూవివాదాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధితులతో మాట్లాడతారు. వైభవంగా ఆదిత్యుని కల్యాణం అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం ఉదయం కల్యాణ సేవ ఘనంగా నిర్వహించారు. అధిక జ్యేష్ట శుద్ద ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉషా పద్మిని ఛాయాదేవేరులతో సూర్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను కల్యాణమూర్తులుగా అలంకరించి కల్యాణం జరిపించారు. రూ.500 చెల్లించిన భక్త దంపతులకు స్వామి వారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, కల్యాణ తలంబ్రాలు అందజేశారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, అర్చకులు ఇప్పిలి సాందీప్శర్మ పాల్గొన్నారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ నరసన్నపేట: త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్ను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఒకప్రకటనలో కోరారు. దానంచేయడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం పండగ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. శ్రీకాకుళం క్రైమ్: బక్రీద్ పండగ మత సామరస్యానికి, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని.. కుల, మతాలకు అతీతంగా సోదరభావంతో శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మసీదుల వద్ద బందోబస్తు, డ్రోన్స్, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఘనంగా శ్రీముఖలింగేశ్వరుని తిరువీధి జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో బుధవారం సాయంత్రం మధుకేశ్వరుని తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి పల్లకిలో ఆశీనులుగా చేశారు. అనంతరం మంగళవాయిద్యాలు నడు మ ఊరేగింపు నిర్వహించగా భక్తులు హారతులిచ్చారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
అనకొండలు మింగేశాయ్..
కొండపోరంబోకు భూములను జిరాయతీగా మార్చేందుకు ఆర్డీవో ఇచ్చిన నో అబ్జక్షన్ సర్టిఫికెట్సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అసలే అది కొండ పోరంబోకు. గతంలో కొందరికి ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూమి ఇది. అసైన్డ్దారుల పేరున ఉండాల్సిన భూమి ఒక ఆర్డీవో నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారని చూపించి 2011లో జిరాయితీగా మార్చేశారు. దాని ఆధారంగా సెంట్లు లెక్కన విక్రయాలు చేపట్టారు. ఒకే భూమిని నలుగురైదుగురికి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ భూబాగోతమంతా ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలో గ్రామంలో చోటుచేసుకుంది. కొందరు టీడీపీ నేతలు చేసిన నిర్వాకం కారణంగా అసైన్డ్దారులు, కొనుగోలుదారులు తిప్పలు పడుతున్నారు. కొండపోరంబోకు జిరాయితీగా ఎలా మార్చారు? ఒకే భూమిని నలుగురైదుగురికి ఎలా రిజిస్ట్రేషన్ చేశారు అన్నది ప్రస్తుత అధికారులకు అంతుచిక్కడం లేదు. ఎస్ఎంపురంలో ఆక్రమణల చరిత్ర ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలో జరిగినన్ని భూ ఆక్రమణలు ఎక్కడా జరిగి ఉండవేమో. అక్కడున్న కొండలన్నీ కొందరు ఆక్రమించేశారు. కొండ పోరంబోకు కాస్త జిరాయితీ భూముల్లో రికార్డులో మార్పిడి చేయించారు. ఆపైన క్రయ, విక్రయాలు జరిపేశారు. ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ నాయకుల పాత్ర వెలుగు చూస్తూనే ఉంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. జేసీ కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. రికార్డుల్లో అక్రమంగా నమోదు చేసిన పేర్లు, భూమి స్వభావాన్ని సరిచేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక్కడ ఘోరాలు చూసి అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. చివరికి, విద్యాలయాల భూములు కూడా ఆక్రమించేశారు. అసైన్డ్కు నో అబ్జక్షనా..! తాజాగా ఎస్ఎంపురంలోని పాత సర్వే నెంబర్ 112లో కొండపోరంబోకు భూములు ఉన్నాయి. వాటిలో చాలా వరకు పలు విద్యా సంస్థలకు ప్రభుత్వాలు కేటాయించిన దాఖలాలు ఉన్నాయి. ఆ సర్వే నంబరే తర్వాత కాలంలో 630గా మారి, పలు సబ్ డివిజన్లతో కొందరు పేదలకు ప్రభుత్వం అసైన్డు చేసి కేటాయించింది. ఇలా 630–4లో ఎకరా 17సెంట్లు ఒకరికి, 630–5లో 93 సెంట్లు ఒకరికి, 630–7లో 97 సెంట్లు ఒకరికి, 630–8లో 82 సెంట్లు ఒకరికి, 630–9లో 99 సెంట్లు ఒకరికి, 630–10లో 34 సెంట్లు ఒకరికి, 630–11లో 21సెంట్లు చొప్పున ఒకరికి ప్రభుత్వం అసైన్డు భూమిగా ఇచ్చింది. పేదలకు ఇచ్చిన భూములు ఎప్పటికీ ప్రభుత్వ భూములుగానే ఉండాలి. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయిస్తే నిర్దేశిత కాల వ్యవధి తర్వాత విక్రయించుకోవడానికి వీలుగా కలెక్టర్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అటువంటిదేమీ జరగలేదు. పక్కా గా పేద రైతులకిచ్చిన భూమి ఇది. కానీ, 2011లో దాదాపు 6.21 ఎకరాలకు ఓ ఆర్డీవో ఇచ్చిన నో అబ్జక్షన్ సర్టిఫికెట్ చూపించి, జిరాయితీగా మార్చి, ఆ పత్రాలు చూపించి అడ్డగోలుగా విక్రయాలు చేపట్టారు. అసైన్డుదారులకు సంబంధం లేకుండా ఎస్ఎంపురంలోని గణపతి, యుగంధర్, తదితర వ్యక్తులు విక్రయాలు చేపట్టి, రిజిస్ట్రేషన్లు చేసేశారు. సెంటు రూ.80వేలు చొప్పున సొమ్ము చేసుకున్నారు. ఒకే స్థలానికి నాలుగైదు రిజిస్ట్రేషన్లు.. గణపతి, యుగంధర్ తదితర వ్యక్తులు ఆ భూములను సెంట్లు లెక్కన విక్రయాలు చేపట్టడమే కాదు ఒకే భూమిని నలుగురైదుగురికి రిజిస్ట్రేషన్ చేసేశారు. బొడ్డేపల్లి శ్రీనివాసరావు భార్య నాగమణి ...సదరు యుగంధర్ నుంచి సెంటు రూ.80వేలు చొప్పున 11సెంట్లు రూ.8లక్షల 80వేలకు కొనుగోలు చేసి 2015లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఆ పత్రాలు పట్టుకుని భూమిలోకి వెళ్లారు. అదే భూమిపై మరికొందరు తమదంటూ వచ్చారు. దీంతో తనకు అమ్మకం చేసిన యుగంధర్ను అడగ్గా నాగమణిపై కొందరు దాడికి దిగారు. తాజాగా ఆ పత్రాలు పట్టుకుని రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లగా...అదే సమయంలో ఆ భూమికి చెందిన అసలు అసైన్డుదారు వచ్చి.. తనది ఆ భూమి అని పత్రా లతో చూపించడంతో నాగమణి అవాక్కయ్యారు. అదే భూమిని మరికొందరికి 2017, 2018, 2022లో విక్రయించినట్టు తేలడంతో ఆందోళనకు లోనయ్యారు. ఇంత దారుణమా అని ఆమె లబోదిబోమంటున్నారు. విక్రయించిన వ్యక్తి కూడా నాగమణికి బంధువు కావడం విశేషం. తాజాగా, కొండపోరంబోకు భూములను జిరాయితీగా ఎలా మార్చారు? అనే విషయమై కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. తాత్కాలికంగా 22ఎలో పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి. తనకు విక్రయించిన భూమినే మరికొందరికి విక్రయించారంటున్న బొడ్డేపల్లి నాగమణి జిరాయితీగా మారిన కొండపోరంబోకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్తో రికార్డుల మార్పిడి అసైన్డ్ భూములపై రిజిస్ట్రేషన్లు ఒకే భూమి నలుగురైదుగురికి అమ్మకం ఎస్ఎంపురంలో టీడీపీ నాయకుల భూ బాగోతం మోసపోయిన కొనుగోలుదారులు -
బతుకుల్ని బలిచేస్తున్న గంజాయి
ఆర్భాటానికే పోలీసులా..? శ్రీకాకుళం క్రైమ్: గంజాయి మత్తులో జిల్లా యువత చిత్తవుతున్నారు. ఏం చేస్తున్నారో సోయి లేనంతగా ఈ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. ఎదురున్నది సామాన్య ప్రజలా.. పోలీసులా..అన్నది వీరికి అనవసరం.. ఎవరిని కొట్టాలో.. ఎవరిని హత్య చేయాలో.. ఎవరిపై అఘాయిత్యం జరపా లో వారే లక్ష్యంగా కనిపిస్తారు. ఖర్చులకు డబ్బు లు లేకపోతే నిర్మానుష్య మార్గాల్లో రాత్రివేళల్లో ఒంటరిగా వచ్చేవారిని అడ్డగిస్తారు. దారి దోపిడీ లు చేస్తారు. అవసరమైతే నగల కోసం గొంతుక లను సైతం కోయడానికి వెనకాడరు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనడానికి ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలే నిదర్శనం. గంజాయి మత్తు యువత జీవితాన్ని ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతోందనడానికి కొందరి జీవితాలే ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. అమ్మ ఆవేదన.. పదహారేళ్ల నా కుమారుడు బాగా చదివేవాడు. తర్వాత చెడు స్నేహాలు మూలంగా గంజాయి బాట పట్టాడు. పూర్తిగా అదే జీవితం అయిపోయింది. 24 గంటలూ మత్తులో తేలుతూ ఉండేవాడు. ఆలస్యంగా మేము గమనించాం. అప్పటికే పరిస్థితి చేయిజారిపోయింది. డ్రగ్ అడిక్షన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న నా కొడుకును చూసి తట్టుకోలేకపోతున్నా. వాడి జీవితంలో మార్పు అసాధ్యం. వాడి జీవితం అంధకారంగా మారింది. తల్లిదండ్రులకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. అంగడిలో సరుకులా మారిన గంజాయికి మీ పిల్లలు బానిసలు కాకుండా వారిపై దృష్టిపెట్టాలి. వారు ఎటు వెళ్తున్నారో.. ఏం చేస్తున్నారో అనే విషయాలను నిత్యం గమనిస్తేనే మన పిల్లలు మన పరిధిలో ఉంటారు. – రణస్థలంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఓ తల్లి ఆవేదన ఇది.. అరణ్య రోదన.. జిల్లా కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ గ్రామంలో ఓ యువకుడికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రతిభావంతుడైన ఆ యువకుడు క్యారెక్టర్ సర్టిఫికేట్ కోసం పోలీసులను సంప్రదిస్తే అతనిపై అప్పటికే గంజాయి కేసు నమోదై ఉన్నట్లు తేలింది. గంజాయి సేవిస్తున్నట్లు వీడియోలు కలకలం సృష్టించిన ఘటనలో ఆ యువకుడు గతంలో పోలీసులకు చిక్కడంతో కేసు నమోదు చేశారు. సరదా, సందడి కోసం చేసిన ఆ పని యువకుడి జీవితంపై తీరని మచ్చగా మిగిలింది. అద్భుతమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గంజాయి సేవనం వల్ల దూరమైంది. ఆ యువకుడు జీవితం అంధకారబంధురమైంది. ఎవరైతే మాకేంటి..? ● విశాఖ రేంజి ఐజీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని జిల్లా పోలీస్ యంత్రాంగం యావత్తు ఇచ్ఛాపురంలో ‘మాదకద్రవ్యాలు రూపుమాపడంపై అభ్యుదయ సైకిల్ ముగింపు యాత్ర’ కార్యక్రమం భారీ ఎత్తున జరిపారు. జరిగి కొన్ని గంటలైనా కాలేదు.. ఆ కార్యక్రమానికి హాజరై వస్తున్న ఎస్ఐ డి.లోవరాజు, మరో కానిస్టేబుల్ సోంపేటలోని జామి ఎల్లమ్మ దేవాలయం సమీపానికి వచ్చేసరికి ముగ్గురు (వీరిలో యువకులు,బాలురు ఉన్నారు) గంజాయి మత్తులో గొడవపడుతున్నారు. గొడవెందుకుని ఎస్ఐ, కానిస్టేబుల్ ఆపడంతో చేతులతో దాడికి ఎగబడ్డారు. ఇదే అంశంలో ఎస్ఐని వీఆర్కు బదిలీ చేశారు. ● ఇదే సోంపేటలో మత్తులో ఇద్దరు యువకులు ఇంట్లో గొడవ చేస్తుండటంతో కుటుంబీకులే పోలీసులకు సమాచారమిచ్చారు. వారిని తీసుకొస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తోసేయడం.. ఆ తర్వాత ఓ దుకాణాదారునిపై యువకులు దాడి చేస్తుండగా అక్కడే ఉన్న ఏఎస్ఐ సింహాద్రి, కానిస్టేబుళ్లు విజయ్, మురళీలు ప్రేక్షక పాత్ర పోషించారు. సోషల్మీడియాలో సంబంధిత వీడియోలు వైరల్ కావడంతో పోలీసులను ఎస్పీ సస్పెండ్ చేశారు. ● ఈ ఏడాది జనవరిలో జిల్లాకేంద్రంలో ఇద్దరు యువకులపై మరో ముగ్గురు యువకులు మద్యం, గంజాయి మత్తులోనే దాడి చేసి గాయపర్చారని స్థానికులు ఆరోపించారు. కుటుంబం మధ్య జరిగిన వ్యక్తిగత గొడవగా పోలీసులు పేర్కొన్నారు. ● జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఏఎస్ఐ రాత్రి వేళ విధులు ముగించుకుని దమ్మలవీధివైపు వస్తుండగా యువత మత్తులో న్యూసెన్సు చేస్తూ బండిని ఆపడంతో.. ఎందుకు ఆపారని ఏఎస్ఐ అన్నందుకు ఆయనపై దాడి చేశారు. దాడులు ఈ మత్తులోనేనా..? జిల్లాలో కొన్ని దాడులు.. హత్యలు జరిగే విధానాన్ని బట్టి స్థానికులు గంజాయి మత్తులోనే జరిగాయని, ఆరోపణలు ఎదుర్కొన్నవారు గంజాయి అతిగా వాడినవారు కావడంతో ఆ మత్తులోనే దాడులు, హత్యలు చేసి వుంటారని వ్యాఖ్యానించడం గమనార్హం. పోలీసులు మాత్రం మద్యం మత్తులోనే జరిగాయని కేసులను ముగించేయడం విశేషం. ● పాతపట్నంలో పోలీసులకు గంజాయి డెన్ల సమాచారాన్ని ఇచ్చిన ఓ వ్యక్తిని బస్సు దిగుతుండగానే అవే గంజాయి బ్యాచ్లు దాడి చేశాయి. సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామన్న పోలీసులే నేరస్థులకు ఉప్పందించడంతోనే ఇలా జరిగిందన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ● నరసన్నపేట కేంద్రంగా చేసుకుని ఓ వ్యాపారిపై ఇద్దరు యువకులు గంజాయి మత్తులో దాడికి ఎగబడ్డారు. ● జిల్లాకేంద్రంలోని టీడీపీ కార్యాలయానికి చెందిన వ్యక్తి రాత్రి సమయాన మహలక్ష్మినగర్వైపు వెళ్తూ తన మేనల్లుడు మత్తు బ్యాచ్తో వుండటం చూశాడు. వారితో ఎందుకున్నావ్ అన్నందుకు అందులో మత్తులో ఉన్న ఓ వ్యక్తి బండిపై నున్న టీడీపీ వ్యక్తిని తోసేయడంతో తలకు బలమైన గాయమై మృత్యువాత పడ్డాడు. ● జిల్లాకేంద్రంలోని ఓ వివాహితను మద్యం మత్తులో రూమ్కు పిలిపించుకున్న యువకుడు హత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. కాగా యువకుడు మూడు రోజులుగా మత్తు వీడకపోవడం గంజాయి సేవించే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. గంజాయి మత్తుతో యువత బతుకు చిత్తు జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా పల్లెలకూ విస్తరిస్తున్న జాఢ్యం గతంలో లేనంతగా మేం గంజాయిని పట్టుకుంటున్నాం.. లెక్కలేనన్ని కేసులు నమోదు చేస్తున్నాం.. భారీగా గంజాయిని సీజ్ చేస్తున్నాం. సరఫరా, క్రయ, విక్రయదారులను జైళ్లకు పంపిస్తున్నాం.. ఆస్తులను జప్తు చేస్తున్నాం.. అడిక్షన్ సెంటర్లకు సేవించేవారిని పంపిస్తున్నాం..ఇవీ పోలీసులతో కూటమి ప్రభుత్వం ఊదరగొట్టిస్తున్న మాటలు. ఇన్ని చేస్తున్నా జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ఇప్పటికీ ఎందుకు అరికట్టలేకపోతున్నారు..? చెక్పోస్టులు, సరిహద్దులు దాటి రైళ్లు, బస్సులు, టూవీలర్లు, ఇతర వాహనాల ద్వారా అంతర్రాష్ట్ర గంజాయి సరఫరాదారులు ఎలా చొరబడుతున్నారు..? అనే ప్రశ్నలకు సమాధానం కరువైపోతుంది. ఇటీవల కొత్తగా డ్రగ్ డిటెక్షన్ కిట్లను జిల్లావ్యాప్తంగా ఉన్న పీఎస్లకు ఎస్పీ పంపించారు. మూత్ర పరీక్షలు ఆధారంగా నిమిషాల్లో గంజాయి, ఇతర మత్తుపదార్థాల సేవించేవారిని గుర్తించే ఈ కిట్ల ద్వారా శ్రీకాకుళం సబ్ డివిజన్లో ఒక్క రోజే 30 మంది అనుమానితులు పట్టుబడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా అర్ధం చేసుకోవచ్చు. -
రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని జాతీయ రహదారి–16పై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. రహదారి భద్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటు ప్రమాదాలు తగ్గించే లక్ష్యంతో జాతీయ, రాష్ట్ర రహదారులు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్కే సోలార్ టెక్ సొల్యూషన్స్ సంస్థలు 180 ట్రాఫిక్ స్టాపర్స్ (బారికేడ్లు), 25 సోలార్ బ్లింకర్లు సామాజిక బాధ్యతతో జిల్లా పోలీసు శాఖకు అప్పగించారు. వీటిని జిల్లాకేంద్రంతోపాటు ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, కాశీబుగ్గ తదితర ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే కూడళ్లు, మార్కెట్టు ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాలు, ప్రధాన జంక్షన్లు వద్ద ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వీటి ద్వారా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం, వాహనాల పార్కింగ్ను నియంత్రించడం, రహదారులపై అనవసర రద్దీని తగ్గించడం, అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడవచ్చన్నారు. ముఖ్యంగా పాదచారులు, వృద్ధులు, మహిళల భద్రతకు దోహదపడతాయన్నారు. ప్రజలకూ బాధ్యత ఉండాలి.. ప్రమాదాల నియంత్రణలో పోలీసులతో పాటు ప్రజల బాధ్యత కూడా అత్యంత ముఖ్యమని ఎస్పీ స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీటుబెల్టు వినియోగించాలని, మద్యం సేవించి, అతివేగంతో నడపరాదని, మొబైల్ డ్రైవింగ్, ట్రిపుల్, ర్యాష్ రైడింగ్ ప్రమాదకరమని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఉదయ్కుమార్సింగ్, హెచ్ఆర్ మేనేజర్ వి.శేఖర్, చీఫ్ మేనేజర్ ప్రసాద్, యూనియన్ జోనల్ సెక్రటరీ వి.వెంకటరమణ, ఆర్కే సోలార్ టెక్ సొల్యూషన్స్ ప్రతినిధులు ఎం.విజయ్చంద్, ఎ.చైతన్యప్రభు, ట్రాఫిక్ సీఐ వి.రామారావు, సీసీఎస్ సీఐ సూర్యచంద్రమౌళి, ఎస్ఐ మెట్ట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరిణి పనులపై పర్యవేక్షణ కరువు
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులను పర్యవేక్షించే నాథుడే కరువయ్యారు. రాష్ట్ర దేవదాయ శాఖ ఆదేశాల మేరకు రూ.4 కోట్ల (రూ.2 కోట్లు ఆలయ నిధులు, రూ.2 కోట్లు సీజీఎఫ్ నిధులతో) ఇంద్రపుష్కరిణి ఆధునీకరణ అభివృద్ధి కోసం టెండర్లు ఖరారు కావడం విదితమే. అయితే రెండు నెలల నుంచి జరుగుతున్న ఈ పనుల్లో నాణ్యత పరిశీలనకు సంబంధిత దేవదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం లేదు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ కూడా ఇటీవల కాలంలో పలు కారణాలతో సెలవులో వెళ్లిపోతుండటంతో నిర్మాణ పనుల్లో ఏ మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. కనీసం పనులు జరుగుతున్న సమయంలో ఏఈలు గానీ, డీఈలు గానీ మచ్చుకై నా కనిపించడం లేదు. కూటమి నేతల అండదండలతో సబ్ కాంట్రాక్టులు దక్కించుకున్న వారు సైతం అధికారుల వైపు చూడకుండా తమదైన శైలిలో కాంక్రీట్ వర్క్, పుష్కరిణి చుట్టూ ప్రధాన గోడను కూడా నిర్మించేశారు. రూ.4 కోట్లతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టును నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాల్సి ఉండగా..ఇప్పటికి ఎర్త్ వర్కులు మాత్రమే జరుగుతున్నాయి. అయితే మట్టిని కప్పే పనులు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుష్కరిణి అడుగున నింపే మట్టి కూడా ఎలాంటి పర్యవేక్షణ పరీక్షలు లేకుండానే వందలాది లోడ్లతో ట్రిప్పర్లతో కప్పేస్తున్నారు. టెండర్ నిబంధనల ప్రకారం వీటితో పాటు ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలోనే కాంక్రీట్ వర్కులు జరగాల్సి ఉన్నప్పటికీ.. అలాంటి పరిస్థితులు ఇక్కడ కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాణ్యత లోపాలతో పుష్కరిణి నిర్మాణం పూర్తయితే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదనే అభిప్రాయాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. -
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ టైమ్టేబుల్లో మార్పు
శ్రీకాకుళం: అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్లో చిన్న మార్పు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ. రవిబాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మే 28వ తేదీన ప్రభుత్వం బక్రీద్ సెలవుగా ప్రకటించినందున ఆ రోజున జరగాల్సిన ఇంగ్లిష్ పరీక్షను జూన్ 5వ తేదీకి వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ తెలియజేశారని ఆయన తెలిపారు. మే 28వ తేదీన జరగాల్సిన ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ, ఇంటర్ పరీక్షలు కూడా జూన్ 2కు మార్చినట్లు పేర్కొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష జూన్ 2 నుంచి జూన్7కు మార్చారని తెలిపారు. -
బేరమే అర్హత..!
నాయకుడితో బొమ్మనాట సునీల్కుమార్.. వమవరల్లి గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్. వేట అంటే ఏంటో తెలియని ఈయనకు చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకార భృతికి అర్హుడిని చేసింది. వమరవల్లి గ్రామానికి చెందిన సుగ్గు శంకరనారాయణ.. కొన్నేళ్లుగా హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్నాడు. బందరువానిపేట తీరంలో వేటకు వెళ్తున్నాడని పథకం డబ్బులు ఖాతాలో వేశారు. కళింగపట్నం పంచాయతీ సిలగాంకు చెందిన కొల్లి ధనరెడ్డి వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఈయన వేటకు వెళ్తున్నాడని పథకంలో చేర్చారు. పూజారి వెంకటరావు అనే యువకుడు విశాఖపట్నంలో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. వమరవల్లి గ్రామానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. ఈయన కూడా అర్హుడంటూ పథకం వర్తింపజేశారు. గార: బందరువానిపేట క్లస్టర్లో ఈ ఏడాది మత్స్యకార సేవలో పథకం 1181 మందికి ఇచ్చారు. వీరిలో దాదాపు యాభై మంది వరకు అనర్హుల పేర్లను ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాలో చేర్చిందని గ్రామ స్తులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన మత్స్యకా ర సేవలో పథకం అర్హుల జాబితా చూస్తే ఇంటి పేరు లేకుండా కొందరి పేర్లు కనిపించాయి. దీంతో స్థాని కుల అనుమానాలు బలపడ్డాయి. వమరవల్లి గ్రామానికి చెందిన మండల స్థాయి టీడీపీ నాయకుడి సిఫారసుతో వేటకు వెళ్లని వారి పేర్లు నమోదయ్యాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏటా చేపల పునరుత్పత్తి సమయమైన ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజులు సముద్రంలో వేట నిషేధం అమలవుతోంది. ఈ నిషేధం సమయంలో వేటకు వెళ్లలేకుండా ఉండిపోయిన మత్స్యకారులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తోంది. వేటకు వెళ్లిన వారికి మాత్రమే అందాల్సిన నిషేధ భృతి బందరువానిపేటలో అనర్హుల చేతిలోకి వెళ్లింది. బందరువానిపేట తీరంలో వేరే గ్రామానికి చెందిన వారెవ్వరూ వేటకు వెళ్లే పరిస్థితి లేదు. కేవలం ఆ గ్రామానికి చెందిన వారే ఈ తీరం నుంచి వేటకు వెళ్తారు. కూటమి నాయకులు, బోటు యజమాను లతో కుమ్మకై ్క ఏకంగా మత్స్యకారులు కాని వారిని, జిల్లాలో ఉండని వారిని సైతం జాబితాలో చేర్చి నిధులను విడుదల చేసి జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారునికి వచ్చిన రూ.20 వేలులో నీకింత, నాకింత అంటూ పంపకాలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. నిబంధనలు ఇవి.. పథకం ఎంపిక చేసేందుకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న బోటు యజమాని తనతో పాటు మరో ఐదుగురు కళాసీలు (మత్స్యకారులు) పేర్లతో డిక్లరేషన్ ఫారమ్ ఇవ్వాలి. వాటి ఆధారంగా సచివాలయంలో పనిచేస్తున్న విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ బోటును పరిశీలించడంతో పాటు వారి ఆరుగురు వ్యక్తులనూ పరిశీలించాలి. ఇవేమీ జరగకుండా టీడీపీ నాయకుల ఒత్తిడితో ఎన్యుమరేషన్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై మండల మత్స్య అభివృద్ధి అధికారి ఎస్.ముసలినాయుడు వద్ద ప్రస్తావించగా బోటు యజమాని ఇచ్చిన పేర్లు ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. బందరువానిపేటలో వమరవల్లి, కళింగపట్నం గ్రామాల్లోని వేరే కులాలకు చెందిన వారు లబ్ధిదారులుగా ఉన్నారని స్థానిక మత్స్య సహకార సంఘం 26 మంది పేర్లు ఇవ్వడంతో, వారి పేర్లను ఉన్నతాధికారులకు అందించి పథకానికి అనర్హులుగా తేల్చామన్నారు. -
నెలలో ఎట్టా..?
వేగంగా చేస్తాం యాప్రాన్ నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తాం. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నాం. 45 మీటర్ల పొడవు ఉన్న యాప్రాన్కు సంబంధించి తొలి దశలో మొదటి సగం చేస్తాం. రెండో దశలో మిగతాది పూర్తి చేస్తాం. – ఎం.మురళీమోహన్, ఈఈ, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు, మెయింటెనెన్స్ డివిజన్ నరసన్నపేట రెండేళ్లుగా హడావుడి.. గత రెండేళ్లుగా యాప్రాన్ నిర్మాణ పేరుతో హడావుడి నడుస్తుందే తప్ప పనులు మాత్రం జరగడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం దృష్టిపెట్టాలి. యాప్రాన్ పనులు పేరు చెప్పి రబీకి సాగునీరు లేకుండా చేశారు. ఇప్పటివరకూ పనులు ప్రారంభించలేదు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ అనాలోచిత చర్య. – మీసాల భాస్కరరావు, ఆయకట్టు రైతు, భగీరథిపురం -
955 ఫిర్యాదులు.. 680 గుర్తింపు.. 518రికవరీ
● 2026 ఏడాదికి సంబంధించి పోగొట్టుకున్న మొబైళ్లు బాధితులకు అందజేత ● 2023 నుంచి 2,718 ఫోన్లు అప్పగింత ● వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వర రెడ్డి శ్రీకాకుళం క్రైమ్ : అనుకోని పరిస్థితుల్లో ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించడం తమ బాధ్యతని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ ఏడాదిలో బాధితుల నుంచి వచ్చిన 955 ఫిర్యాదులకు గాను 680 ఫోన్లను ట్రేస్ చేశామని రూ. కోటి విలువైన 518 ఫోన్లను అప్పగించామన్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. 2023 నుంచి 2,718 మొబైళ్లు... 2023 నుంచి ఇప్పటివరకు ఇక్కడి పోలీసులు 2718 మొబైళ్లు ఫోన్లను రికవరీ చేశారన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విశ్లేషించి జిల్లాలోనే కాక దూరప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు మళ్లించిన ఫోన్లను కూడా గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో సైబర్ సెల్ నిపుణులు, ఐటీకోర్ బృందాల కృషి ఎనలేనిదన్నారు. 2023లో 518, 2024లో 622, 2025లో 1060, 2026లో 518 ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు. ఫిర్యాదు చేయండిలా. మొబైళ్లను పోగొట్టుకున్న బాధితులు తక్షణమే ఆ పరిధి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పా టు సిఇఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా కూడా ఫోన్ బ్లాక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ వెబ్సైట్లో మొబైల్ వివరాలతో బ్లాకింగ్ రిక్వెస్ట్ నమోదు చేసుకోవాలన్నారు. పోర్టల్ ద్వారా ఫిర్యాదులు, పోలీస్స్టేషన్లలో అందిన సమాచారాన్ని సమన్వయం చేసుకుంటూ జిల్లా సైబర్, ఐటీ కోర్ బృందాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఫోన్లను గుర్తిస్తారన్నారు. ఫోన్ పోగొట్టుకున్న తక్షణమే ఫిర్యాదు చేస్తే 90శాతం దొరికే చాన్స్ ఉంటుందని, పోర్టల్లో బ్లాక్ చేయకపోతే అదే మొబైల్తో సైబర్ కేటుగాళ్లు నేరాలకు పాల్పడే వీలుంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీసీఎస్ సీఐ సూర్యచంద్రమౌళి, సైబర్ సెల్ సిబ్బంది పైలా శరత్చంద్ర, గిరి తదితరులు ఉన్నారు. -
అంపురంలో భూ బాగోతం!
● కోర్టులో కేసున్నా బరితెచించిన అక్రమార్కులు ● ఆక్రమణదారులకు అండగా అధికార పార్టీ నేతలు ● కొరడా ఝుళిపించిన రెవెన్యూ అధికారులు కంచిలి: అంపురం పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకొని వివాదాస్పదంగా ఉన్న భూమిలో కొందరు అక్రమార్కులు ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారు. ఏకంగా హైకోర్టులో వ్యాజ్యం ఉన్న ప్రభుత్వ భూమిలోనే రాళ్లు పాతి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గేట్లు తెరిచారు. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి ఈ వ్యవహారానికి ఒడిగట్టారు. దీనికి కొందరు అఽధికార పార్టీ నేతలు అండగా నిలిచారు. దీనిపై స్థానిక రెవెన్యూ యంత్రాంగం కొరడా ఝులిపించారు. కొద్ది నెలలుగా వివాదంగా ఉన్న ఈ వ్యవహరంపై తాజాగా చోటుచేసుకొన్న పరిణామాలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఎలాగైనా ఆక్రమించాలని.. జాతీయ రహదారికి ఆనుకొని కోట్లాది రూపాయలు చేసే ఈ విలువైన స్థలం పైన కొద్దిరోజులుగా అక్రమార్కుల కన్నుపడింది. కంచిలి మండలం అంపురం రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారి పక్కన సర్వే నంబర్ 116–1బిలో 1.12 ఎకరాల డీ పట్టా భూమిని విచారించిన తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, వెంటనే ఆక్రమణలు తొలగించాలని లోకాయుక్త గత ఏడాది సెప్టెంబరులో తీర్పు వెలువరిచింది. సదరు భూమిపై వివాదాన్ని కొనసాగిస్తూ మరో వ్యక్తి తాను అసలైన వారసుడినంటూ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానంలో వివాదం కొనసాగుతూనే ఉంది. జూన్ 16న దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తులు గానీ, ఇతర వ్యక్తులు గాని ఈ వివాదాస్పద భూమిపై ఎటువంటి వ్యవహారాలు చేయడం కోర్టు ధిక్కారమే అవుతుంది. దీన్ని పక్కన పెట్టి కొందరు అక్రమార్కులు ఇటీవల సదరు భూమిని జేసీబీతో చదును చేయించి ఏకంగా వెంచర్ వేశారు. రాళ్లను కూడా పాతిపెట్టి ప్లాట్లుగా విభజించారు. ఈ బరితెగింపు వ్యవహారానికి మండలానికి చెందిన అధికార పార్టీ నేతలు సూత్రధారులుగా వెనుక ఉంటూ కథ నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టకుండా చూసుకొంటానని అక్రమార్కులకు భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. చేతుల మారుతూ.. వాస్తవానికి కొన్ని దశాబ్దాల క్రితం కంచిలి మండలానికి చెందిన అనుపోజు లక్ష్మి అనే మహిళకు రెవెన్యూశాఖ అంపురం రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకొని 1.12 ఎకరాల మెట్టు భూమికి బీడీఆర్ పట్టా మంజూరు చేశారు. సదరు భూమి పలు క్రయ విక్రయాల ద్వారా చేతులు మారింది. చివరికి కంచిలికి చెందిన ఒక ప్రభుత్వ అధికారి కొనుగోలు చేశారు. తర్వాత ఆయన మరణించారు. ఆ ఉద్యోగి కుటుంబీకులు ఆ స్థలం ముందు భాగంలో షాపులు నిర్మించారు. తర్వాత ఈ స్థలం సమీపంలో ఓ వ్యక్తి షాపు పెట్టడం, తర్వాత మరికొందరు ఆ భూమి హక్కుదారులు తామే అంటూ ముందుకు రావడం వంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. చివరికి ఈ వివాదం లోకాయుక్త వరకు వెళ్లింది. కేసు విచారణ జరిపిన లోకాయుక్త ఈ భూమి క్రయవిక్రయాలు వ్యవహారంలో జరిగిన మొత్తం గలీజును బయటకు తీసింది. 1987లో బీడీఆర్ పట్టా పొందిన అనుపోజు లక్ష్మి ద్వారా జరిపిన భూమి బదిలీలు కావడం గుర్తించారు. తర్వాత బీడీఆర్ పట్టా పొందిన అనుపోజు లక్ష్మిగానీ, ఆమె కుటుంబీకులు గానీ ప్రస్తుతం లేనందున సదరు భూమిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఆక్రమణలు ఉంటే వెంటనే తొలగించాలని లోకాయుక్త జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఈ మేరకు కంచిలి తహశీల్దార్కు ఆదేశాలు వచ్చాయి. ఇక్కడే వివాదం మలుపు తిరిగింది. అంతవరకు లోకాయుక్త విచారణ జోలికి పోని, బీడీఆర్ పట్టా పొందిన అనుపోజు లక్ష్మి ఇంటి పేరుతో ఉన్న ఓ వ్యక్తి హైకోర్టుకు వెళ్లి తానే అసలైన వారసుడిని పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు ఖంగుతున్నారు. ప్రస్తుతం హైకోర్టులో వివాదం కొనసాగుతుండగా మరోవైపు కోట్లాది రూపాయలు విలువైన ఈ భూమిని ఆక్రమించేందుకు కొందరు అక్రమార్కులు అధికార పార్టీ నేతల అండగా నిలవడంతో ఈ స్థలంలో రాళ్లు పాతి రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. ఆక్రమణ అడ్డగింత.. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. అంపురం రెవెన్యూ పరిధిలో జాతీ య రహదారి పక్కన సర్వే నంబర్ 116–1బి లో 1.12 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డబ్ల్యూపీ నంబర్ 27042/2025 వ్యాజ్యం పెండింగ్లో ఉన్నందున ఆక్రమణదారులు శిక్షార్హులు అంటూ కంచిలి తహశీల్దార్ ఎన్.రమేష్కుమార్ బోర్డు పెట్టారు. అక్కడ స్థలంలో పాతిన రాళ్లను పెకిలించి పక్కన పడేశారు. ఆ స్థలాన్ని పూర్తిగా రెవెన్యూశాఖ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ప్రకటించారు. -
జాబుకు దండం!
హడలిపోతున్న అధికారులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో మరో కీలక వికెట్ పడిపోయేది. ముఖ్య నేత టార్చర్ భరించలేక ఏకంగా కీలక ఉద్యోగి దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లిపోయినట్టు సమాచారం. బడానేత తీరుతో విసిగి వేసారిపోయిన ఉద్యోగి.. ఆయన చెప్పినదంతా చేయాలంటే కష్టమని, ఇక్కడ పనిచేయడం కంటే తప్పుకోవడమే మంచిదన్న ఆలోచనకు వచ్చేసి, నాలుగు నెలల సెలవు పెట్టేసి, కార్యాలయం సిబ్బందికి ఫోన్ ఇచ్చేసి వెళ్లిపోయినట్టు తెలిసింది. సమాచారం తెలుసుకున్న బడా నేత మంగళవారం రాత్రి రంగంలోకి దిగి సదరు అధికారిపై ఒత్తిడి తేవడంతో సెలవును రద్దుచేసుకున్నట్టు సమాచారం. ఇదే మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఎందరో బాధితులు.. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో బడా నేత సతాయింపులు భరించలేక అధికారులు వెళ్లిపోవడం కొత్తేమీ కాదు. గతంలో ఇక్కడ మున్సిపల్ ఇంజినీర్లుగా పనిచేసిన దక్షిణామూర్తి, కమలాకర్ ఏకంగా స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) వెళ్లిపోగా, మున్సిపల్ ఇంజినీర్గా పనిచేసిన మరో అధికారి శ్రీనివాసులు కూడా దీర్ఘకాలిక సెలవు పెట్టేసి వెళ్లిపోయారు. మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన పీవీవీడీ ప్రసాదరావు కూడా బడా నేత ఒత్తిళ్లు, ఇబ్బందులు భరించలేక బదిలీపై వెళ్లిపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన వేధింపులే కారణమన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇక్కడితో ఆగుతుందనుకుంటే పొరపాటే. సిటీ ప్లానింగ్లో పనిచేస్తున్న మరో ఇద్దరు కూడా బదిలీ కోసం యత్నిస్తున్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్లో మరో ఇంజినీర్ పి.కమలాకర్ బడా నేత చెప్పిన పనులన్నీ చేయలేక, అడ్డగోలుగా బిల్లులు చెల్లించలేక, నోటి దురుసును తట్టుకోలేక తప్పుకున్నారు. అంతకుముందు దక్షిణామూర్తి, శ్రీనివాస్లు కూ డా అదే రకమైన బాధితులు. ఇక గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన ప్రసాదరావైతే రథసప్తమి వేడుకల కోసం కార్పొరేషన్ నిధులను తోడేస్తున్నారని, తానైతే ఖర్చు పెట్టలేనని చెప్పి హుటాహుటిన బదిలీపై వెళ్లిపోయారు. చెప్పినట్టి చేస్తేనే.. ప్రతీదీ తనకు తెలిసే జరగాలని, ఫైలు కూడా తన దృష్టికి వచ్చాకే కదలాలని, ఎవరినైనా మార్చాల న్నా తన అనుమతితో జరగాలని, ఇలా రక రకాలుగా టార్చర్ చేయడంతో తట్టుకోలేకనే కీలక ఉద్యోగి క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచా రం. కాంట్రాక్టర్లకు బిల్లులకు సంబంధించి, తా త్కాలిక ఉద్యోగుల సీట్ల మార్పు గురించి పేచీ ఏర్పడినట్టు తెలిసింది. ముఖ్యంగా హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద పనిచేసిన ఓ వికలాంగ ఉద్యోగి బాధ లు చూసి కార్పొరేషన్ కార్యాలయానికి తీసుకురావడాన్ని ఆ బడా నేత జీర్ణించుకోలేకపోయారు. అలాగే, ఆరోపణలతో గతంలో బదిలీ అయిన ఓ ఉద్యోగిని వెనక్కి తీసుకురావాలన్న ఒత్తిళ్లను అమలు చేయలేదన్న అక్కసు కూడా కారణమని తెలుస్తోంది. అలాగే, పాలన పరమైన నిర్ణయాల్లో వేలు పెట్టి ఇబ్బంది పెట్టడం, తన అభిప్రాయం మేరకే నడుచుకోవాలన్న ఆంక్షలు కీలక ఉద్యోగిని అంతర్మథనంలో పడేసినట్టు తెలిసింది. ఆత్మాభి మానాన్ని చంపుకుని ఎన్నాళ్లు పనిచేయగలమని సెలవుకు సిద్ధమయ్యారని ప్రచారం. శ్రీకాకుళం నియోజకవర్గంలో పనిచేయడానికి అధికారులు భయపడిపోతున్నారు. బడానేత టార్చర్ భరించలేక హడలెత్తిపోతున్నారు. చెప్పినట్టు చేయాలని నేత హుకుం జారీ చేస్తున్నారు. సూచించినట్టు బిల్లులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆదేశించిన వారి పై చర్యలు తీసుకోవాలని పీకమీద కత్తి మీద పెడుతున్నారు. ఇవన్నీ అధికారులకు ప్రాణ సంకటంగా మారాయి. చర్యలు తీసుకోకపోతే బడా నేత పోరు పడలేకపోతున్నారు. చర్యలు తీసుకుంటే పాలనాపరంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి నోటికి పనిచెబుతున్నారు. కొంతమందైతే ఆ బూతులు భరించలేక ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్పొరేషన్లో బడా నేత టార్చర్ భరించలేక సెలవు పెట్టిన కీలక ఉద్యోగి ఆత్మాభిమానం చంపుకోలేక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం బయటకు పొక్కడంతో రంగంలోకి బడా నేత.. మంగళవారం రాత్రి కార్పొరేషన్లో రసవత్తర పరిణామాలు బడా నేత ఒత్తిడితో సెలవును రద్దు చేసుకున్న కీలక ఉద్యోగి మున్సిపల్ కార్పొరేషన్లో ఆగని వేధింపులు, సతాయింపులు, బూతు పురాణాలు వరుసగా వీఆర్ఎస్, సెలవుపై వెళ్లిపోతున్న మున్సిపల్ అధికారులు రోజురోజుకీ పెరుగుతున్న బడా నేత బాధితులు -
నెలక్రితం పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత
శ్రీకాకుళం క్రైమ్ : దాదాపు నెలక్రితం పోగొట్టుకున్న బ్యాగును ట్రాఫిక్ పోలీసులు ఆధార్కార్డు సహాయంతో ట్రేస్ చేసి జిల్లాకేంద్రానికి చెందిన కొల్లేటి అమూల్యకు సోమవారం అప్పగించారు. అమూల్య సారవకోట మండలంలోని వెంకటాపురం పుట్టింటికి వెళ్లేందుకు ఆటోలో ఆర్టీసీ కాంప్లెక్సుకు బయల్దేరి బ్యాగును మరిచిపోయింది. ఆటోవాలా ఆ బ్యాగును సమీప ట్రాఫిక్ పాయింట్లో అప్పజెప్పడంతో కానిస్టేబుల్ అన్నెపు సత్యనారాయణ అందులో ఉన్న ఆధార్కార్డును చూసి సారవకోట పోలీసులకు సమాచారమివ్వడంతో చిరునామాను బట్టి అమూల్య బ్యాగుగా గుర్తించారు. విద్యుత్ లైన్పై ఒరిగిన టవర్ రణస్థలం: పైడిభీమవరం జాతీయ రహదారి పక్కన ఉన్న బీఎస్ఎన్ఎల్ పాత టవర్ మంగళవారం 33 కేవీ హెచ్టీ విద్యుత్ లైన్పై వాలింది.ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడం, టవర్ కింద పడకుండా వైర్లపై నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి పాతపట్నం: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. పాతపట్నం సీహెచ్సీని మంగళవారం తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, ఓపీ విభాగం, రోగుల వార్డులు, చిన్నపిల్లల వార్డు, బ్లడ్ బ్యాంక్ యూనిట్, రక్త పరీక్షల గదిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సక్రమంగా వైద్య సేవలు అందించి ఆస్పత్రికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డి.లీలాకుమార్, డాక్టర్లు జి.వేణుగోపాల్, జి.అనిత, హెచ్.సునీత, షణ్ముఖరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతిభావంతులకు ప్రోత్సాహం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే భవిష్యత్లో మరిన్ని అద్భుతాలు సాధిస్తారని ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ సురేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడం ఆనందదాయకమన్నారు. ఎస్ఆర్ షాపింగ్ మాల్స్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో చదువుతూ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు రూ.5వేలు, రూ.4వేలు, రూ.3వేలు చొప్పున నగదు బహుమతులు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడమే ఎస్ఆర్ సంస్థ లక్ష్యమన్నారు. అనంతరం తల్లిదండ్రులకు ప్రత్యేకంగా సన్మానించారు.కార్యక్రమంలో ఎస్ఆర్ షాపింగ్మాల్స్ జోనల్ మేనేజర్ వెంకటేశ్వర్, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పేరిట భూముల దోపిడీ
మందస : అభివృద్ధి ముసుగులో కార్పొరేట్లకు రైతుల భూములు కట్టబెట్టడానికి కార్గో ఎయిర్పోర్టు పేరిట పక్కా స్కెచ్ వేశారని రైతు సంఘం నాయకుడు బత్తిన లక్ష్మణ్ మండిపడ్డారు. మందస మండలం హరిపురంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇటీవల జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలకు పలు ప్రశ్నలు సంధించారు. ఉద్దానం ప్రాంత రైతాంగం సమస్యలు మీకు తెలియవా? తరతరాలుగా కొబ్బరి, జీడితోటలపైనే ఆధారపడి బతుకుతున్నామని, అలాంటి భూములను లాక్కుంటే తమ బతుకులు వీధిన పడవా? అని ప్రశ్నించారు. కొబ్బరి చెట్టు ఫలసాయం ఇవ్వాలంటే కనీసం ఏడేళ్లు పడుతుందని, జీడి చెట్టు కాపు కాయాలంటే ఐదేళ్లు పడుతుందని, అలాంటి భూములను లాక్కుంటే కుటుంబ పోషణ ఎలా సాధ్యమన్నారు. జిల్లాలో 12 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయన్నారు. వజ్రపుకొత్తూరు మండలం సీతానగరంలో 1875 ఎకరాలు, పలాస వద్ద 800 ఎకరాలు, భావనపాడులో 5000 ఎకరాలు, మూలపేట వద్ద 1500 ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నా తమ భూములపై కన్ను పడటం వెనుక కార్పొరేట్ కుట్ర దాగుందని ఆరోపించారు. సమావేశంలో దున్న హరికృష్ణ, బెలమర జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
విత్తన ఎంపికే కీలకం
● వరి సాగులో నకిలీలతో జాగ్రత్త ● కొనుగోలులో అప్రమత్తత అవసరం ● నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి ఆమదాలవలస: వ్యవసాయంలో అత్యంత ప్రధానమైనది విత్తన ఎంపిక. ఇది పంట దశ, దిశను మార్చుతుంది. విత్తన ఎంపిక, కొనుగోలులలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అన్నదాతకు తీరని నష్టం తప్పదు. ప్రస్తుతం రైతన్నలు ఖరీఫ్ వరి సాగుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో సుమారు 23,000 హెక్టార్లలో వరి పండించేందుకు సమాయత్తమవుతున్నారు. దుక్కి దున్ని విత్తనాలు చల్లే పనులకు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో వరి విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, విత్తనమే దిగుబడులను నిర్ణయిస్తుందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడి వస్తుందని, లేకుంటే నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రైతులు సొంత విత్తనాలు వాడుతున్నా శుద్ధి చేయడం తప్పనిసరని పేర్కొంటున్నారు. కొనుగోలులో జాగ్రత్త.. ● రైతులు బయట కొనుగోలు చేసే కంటే వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని అధికారులు చెబుతున్నారు. ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను నంబర్, గడువు తేదీ, నికర ధర, కంపెనీ పేరు, డీలర్ సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి. ● గడువు దాటిన విత్తనాలు, లూజు, చిరిగి సంచుల నుంచి వచ్చిన ప్యాకెట్లు కొనుగోలు చేయకూడదు. ● కొనుగోలు చేసిన సరుకును డీలర్ వద్ద తూకం వేయించాలి. ● మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారిని గానీ, శాస్త్రవేత్తలను గానీ సంప్రదించాలి. ● బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. కొనుగోలు చేసిన వెంటనే మొలక శాతాన్ని చూసుకోవాలి. ● చీడ పీడల ఉద్ధృతికి ఏదో రకంగా మందులు పిచికారీ చేస్తుంటారు. అలాకాకుండా శాస్త్రవేత్తల సూచనల మేరకు పురుగు మందులు కొనుగోలు చేయాలి. ● పురుగు మందులు రెండు, మూడింటిని కలిపి వాడకూడదు. వాడిన పురుగు మందు డబ్బాలు, సీసాలు ధ్వంసం చేసి భూమిలో పాతి పెట్టాలి. మెషీన్ కుట్టుతో ఉన్న మందుల బ్యాగులనే వాడాలి. ఒకవేళ బ్యాగుకు చేతి కుట్టు ఉంటే సీసం సీలు ఉందో లేదో గమనించాలి. కంపెనీల ప్రచారంతో మోసపోవద్దు.. పలు మందులు కంపెనీలు ప్రచారంతో రైతులను అయోమయానికి గురిచేస్తుంటాయి. ఖరీదైన ఆకర్షణీయమైన కవర్లలో విత్తలు, ఎరువులను ప్యాకింగ్ చేసి మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇలాంటి విత్తన ప్యాకెట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలపై రసాయన మందులు పిచికారి చేస్తుంటారు. అవి పనిచేయడం లేదని, మరో కంపెనీ మందులు వాడుతుంటారు. దీనివల్ల సాగులో పెట్టుబడులు పెరిగి ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో అప్పులపాలు కావాల్సి వస్తోంది. జాగ్రత్తలు తీసుకోవాలి.. విత్తనాలు, ఎరువుల కొనుగోలు విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు మాత్రమే ఎరువులు, పురుగు మందులను కొనుగోలు చేయాలి. కంపెనీలు ఇచ్చే ఆఫర్లకు ఆశపడొద్దు. ఎరువులు, పురుగు మందుల కొనుగోలు చేసేటప్పుడు రశీదులు తప్పకుండా తీసుకోవాలి. మోతాదుకి మించి వాడొద్దు. సరైన విత్తనాల ఎంపికలపైనే పంట దిగుబడులు ఆధారపడతాయి. – మెట్ట మోహన్రావు, వ్యవసాయాధికారి, ఆమదాలవలస మండలం -
గొట్టా..
హిరమండలం: గొట్టా బ్యారేజీ యాప్రాన్ నిర్మాణ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. జనవరిలో నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ జూన్ సమీపిస్తున్నా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. జూలైలో కాలువల ద్వారా నీటిని విడుదల చేయాల్సి ఉంది. మరోవైపు వర్షాకాలం ప్రారంభం కానుంది. ఈ తరుణంలో పనులు ప్రారంభించకపోవడంతో ఈ ఏడాది యాప్రాన్ నిర్మాణ పనులు పూర్తవుతాయా? లేదా? అన్నది అనుమానమే. దశాబ్దాల కిందట గొట్టా బ్యారేజీ నిర్మాణం జరిగింది. 1977లో నిర్మించిన ఈ ప్రాజెక్టు జిల్లాను సస్యశ్యామలం చేస్తూ వస్తోంది. అయితే బ్యారేజీకి ఆయవు పట్టుగా ముందు భాగంలో యాప్రాన్ (రాతికట్టు) అస్తవ్యస్తంగా మారింది. గేట్ల ద్వారా విడుదలయ్యే నీటి ప్రవాహాన్ని ఇది నియంత్రిస్తుంది. అలాంటి రాతికట్టు అస్తవ్యస్తంగా మారింది. భారీ నీటి ప్రవాహానికి పూర్తిగా దెబ్బతింది. భారీ బండరాళ్లు తేలిపోయి ప్రమాదకరంగా మారింది. దీంతో బ్యారేజీకి ముప్పు తప్పదని నీటిపారుదల శాఖ అధికారులు భావించి ప్రభుత్వానికి నివేదించారు. డ్రాయింగ్స్ సమర్పణలో జాప్యం ఇక్కడ యాప్రాన్ పునర్నిర్మాణానికి గాను జనవరి లో రూ.16.49 కోట్లు మంజూరు చేశారు. కానీ దీని నిర్మాణానికి సంబంధించి డ్రాయింగ్స్ సమర్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చాలా జాప్యం జరిగినట్టు తెలుస్తోంది. దాని ప్రభా వం పనుల ప్రారంభంపై పడింది. ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చిన వెంటనే చీఫ్ ఇంజినీర్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్కు డ్రాయింగ్ అప్రూవల్ పంపాలి. అది మంజూరయ్యాక టెండర్లు ఖరారు చేయాలి. కానీ అలా చేయలేదు. పాత డ్రాయింగ్ ప్రకారం టెండర్లను ఆహ్వానించేశారు. కానీ ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టు యాప్రాన్ నిర్మాణం జరగకపోతే ఇబ్బందులు వస్తావని చెప్పి మళ్లీ కొత్త డ్రాయింగ్తో అప్రూవల్కు పంపారు. ఇదంతా జిల్లా మంత్రి ఆదేశాలతో జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు నాలుగు నెలల సమయం పట్టింది. ఇటీవల పనులు ప్రారంభించారు. మూడు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. కానీ జూలైలో ఖరీఫ్నకు తాగునీరు విడుదల చేయాలి. మరోవైపు వర్షాలు ప్రారంభమైతే యంత్రాలతో పనులు చేయలేని పరిస్థితి ఉంటుంది. పనులు చాలా కష్టం ఈ యాప్రాన్ దాదాపు 45 మీటర్ల పొడవు ఉంటుంది. మధ్యలో భారీ బండరాళ్లు తేలిపోయాయి. వా టిని యంత్రాలతో తొలగించాలి. కాంక్రీటుతో పటి ష్టం చేయాలి. రెండు వరసల్లో ఉన్న బ్లాక్స్ తొలగించి అడ్డుగా గోడ కట్టాలి. మధ్యలో మళ్లీ రాళ్లు పేర్చా లి. ఇదంతా చేసేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. అది కూడా వాతావరణం సహకరిస్తేనే. ఈ పనుల పేరు చెప్పి బ్యారేజీలో ఉన్న నీటిని బయటకు వదిలేశారు. డెడ్ స్టోరేజీకి చేర్చారు. కనీస సమాచారం ఇవ్వకుండా అప్పట్లో అలా చేయడంతో రబీ పంటలు వేసుకున్న వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలు వేసుకొని పెట్టుబడులు పెట్టిన తర్వాత నీటిని వృథాగా కిందకు విడిచిపెట్టడంతో రైతులు ఆందోళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఖరీఫ్కు కూడా యాప్రాన్ నిర్మాణం పేరుతో నీటి విడుదలను జాప్యం చేస్తారన్న అనుమానాలు రైతుల్లో ఉన్నాయి. ఒకవేళ సగం పనులు పూర్తయిన తర్వాత వర్షాలతో నిలిచిపోతే మాత్రం నిధులంతా బూడిదలో పోసిన పన్నీరు కాక తప్పదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గొట్టా బ్యారేజీ యాప్రాన్ నిర్మాణంలో నిర్లక్ష్యం జనవరిలో రూ.16.49 కోట్ల నిధుల విడుదల పనులు మాత్రం మే రెండో వారంలో ప్రారంభం జూలైలో వంశధార నీటి విడుదల సాధ్యమేనా? రానున్నది వర్షాకాలం.. పనులపై నీలినీడలు -
800 లీటర్ల గడ్డి మందు విక్రయాలు నిలుపుదల
నరసన్నపేట: మండలంలో వివిధ పురుగు మందుల షాపుల్లో ఉన్న 800 లీటర్ల పారా క్వాట్ డైక్లోరైడ్ 24 శాతం ఎస్ఎల్, దాని అన్ని ఫార్ములేషన్లపై నిషేధం ఉన్నందున ఈ మందు విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వ్యవసాయాధికారి వై.సూర్యకుమారి తెలిపా రు. వారం రోజులుగా పురుగుల మందుల దుకాణాల్లో తనిఖీలు చేసి 800 లీటర్లు ఉన్నట్లు గుర్తించి ఆయా షాపుల యజమానులకు అమ్మకాల నిలుపుదల ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపా రు. ఈ మేరకు ఆమె తన కార్యాలయంలో మంగళవారం వివరించారు. దీన్ని డీలర్లు అమలు చేయాలని, ఆదేశాలు పాటించక విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తూరు ిసీహెచ్సీ తనిఖీ కొత్తూరు: కొత్తూరు సీహెచ్సీని డీహెచ్ఎస్ విజయలక్ష్మి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీహెచ్సీలో అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది వైద్యం సక్రమంగా అందిస్తున్నప్పటికీ వసతులు కొరవడంతో అవస్థలు పడుతున్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె వైద్యులతో మాట్లాడారు. అదనపు భవన నిర్మాణాలు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సూపరింటెండెంట్ కిశోర్ కుమార్, పలువురు వైద్యసిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీ డ్రైవర్కు వడదెబ్బ మెళియాపుట్టి: మండలకేంద్రంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ రాంబాబు వడదెబ్బకు గురవడంతో బస్సు అదుపు తప్పింది. అయినా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. హిరమండలం నుంచి పలాస వెళ్లే ఆర్టీసీ బస్సు మెళియాపుట్టి గ్రామం వద్దకు వచ్చే సరికి డ్రైవర్కు వడదెబ్బ తగలింది. అయినా ముందు బస్సును అదుపు చేశారు. వెంటనే స్థానికులు ఆయనను స్థానిక పీహెచ్సీకి తరలించారు. బస్సును రెండు గంటల పాటు నిలిపివేశారు. పరిశ్రమ పైపులైన్ తవ్వేశారని రైతులపై ఫిర్యాదు రణస్థలం: పైడిభీమవరం పారిశ్రామికవాడలో వల ఎపీటోరియా పరిశ్రమ వాటర్ పైపులైన్ను స్థానిక రైతులు తవ్వేశారని పోలీసులకు పరిశ్రమ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లగానే స్థానిక రైతులు నీలాపు రమణ, అప్పలరాజు, బావిశెట్టి గోవింద, కాజా కన్నయ్య, నాగరాజు, దంగుడువీపు వెంకటప్పారావు, సతీష్లు తమ భూముల్లో పనులు చేసుకుంటూ ఉండగా పైప్లైన్ జేసీబీకి తగిలి పగిలిందని, తాము పగలగొట్టలేదని వివరించారు. తమ భూముల్లో పైపులు వేసి తిరిగి తమపైనే ఫిర్యాదు చేయ డం సరికాదన్నారు. పైప్లైన్ వేసినప్పుడు ఉపాధి కల్పిస్తామని చెప్పి మాట తప్పారని, ఉపాధి ఇవ్వలేకుంటే తమ భూముల్లో వేసిన పైపులైన్లు తొలగించాలని తెలిపారు. నేడు బొడ్డపాడులో జిల్లా అమరవీరుల స్మారక సభ పలాస: పలాస మండలం బొడ్డపాడు జిల్లా అమరవీరుల స్మారక మందిరం వద్ద బుధవారం ఉదయం జిల్లా అమరవీరుల స్మారక సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం స్మారక మందిరం వద్ద స్మారక కమిటీ నిర్వాహక కమిటీ ప్రతినిధులు విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు. 1969లో జరిగిన శ్రీకాకుళం జిల్లా గిరిజన సాయుధ రైతాంగ పోరాటంలో మొత్తం 360 మంది అశువులు బాసారని తదనంతరం కూడా ఎంతో మంది మృతి చెందారని వారిని స్మరించుకోవడానికి ప్రతి ఏడాది మే 27న అమరవీరుల స్మారక సభను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఉద్దానం ప్రజలంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
ఇదేం పద్ధతి..?
● పంచాయతీ రిజర్వు స్థలంలో టీడీపీ నాయకుడి ఇంటి నిర్మాణం ● అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులపై పోలీసులకు ఫిర్యాదు గార: విలువైన భూములను టీడీపీ నాయకులు ఆక్రమించుకుంటున్న ఘటనలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. మండలంలో శ్రీకూర్మం గ్రామంలోని బస్టాండ్ సమీపంలో సర్వే నంబరు 600లో 0.12 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని పంచాయతీ తీర్మానం ద్వారా గత ప్రభుత్వం శ్రీకూర్మనాథుని దర్శనం కోసం వచ్చే దూరప్రాంత భక్తుల కోసం ఉచిత గదులతో పాటు కల్యాణ మంటపం నిర్మించాలన్న ఆలోచనతో ఢిల్లీకి చెందిన ఆదిలీలా ఫౌండేషన్కు అప్పగించింది. దీనికోసం అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. అప్పట్లో స్థానికుడు రిజర్వు స్థలంలో తనకు కొంత భూమి ఉందని కోర్టుకు వెళ్లగా, ఆ స్థలమంతా పంచాయతీ రిజర్వు స్థలమని తీర్పు వచ్చింది. అయితే అనంతరం ఎన్నికలు రావడంతో ఆదిలీలా ఫౌండేషన్ పనులు ప్రారంభించలేదు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్థలంపై స్థానిక టీడీపీ నాయకుడు పొజిషన్ సర్టిఫికెట్ తెచ్చుకొని నిర్మాణ పనులను మొదలుపెట్టాడు. వీరికి నియోజకవర్గ ఎమ్మెల్యే సహకారం ఉండడంతో అధికారులు కన్నెత్తి చూడడం లేదు. గతేడాది పనులు ప్రారంభించగా సాక్షితో పాటు పలు పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు నోటీసులిచ్చి పనులు నిలిపేశారు. మరలా గత నెల 14వ తేదీన పనులు చేపట్టడంతో స్థానికులు వెళ్లి పనులు ఆపేయాలని చెప్పడం జరిగింది. అయితే ఇటీవల గత రెండు రోజులుగా పనులు చేపట్టడంతో సోమవారం స్థానికులు మరలా వెళ్లి పనులు ఆపమని చెప్పారు. అయితే స్థానికులు తమపై దాడి చేశారంటూ నిర్మాణ దారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ నిర్మాణాలు ఆపమని చెప్పడం కూడా ఈ ప్రభుత్వంలో తప్పేనా అంటూ గ్రామస్తుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. -
ఎందుకీ మౌనం..?
బడా నేత జోక్యమే కారణమా..! సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆమదాలవలస–శ్రీకాకుళం మార్గంలో తోటాడ–అక్కివరం రెవెన్యూ పరిధిలోని బావాజీ మఠం భూములు కళ్ల ముందే ఆక్రమణకు గురవుతున్నాయి. సర్వే నంబర్ 121లో ఉన్న భూములు హారతి కర్పూరంలా కబ్జాలతో కరిగిపోతున్నాయి. భూములు ఎవరివి అన్నదానిపై రకరకాల భాష్యాలు చెబుతున్నా.. నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయని మాత్రం అధికారులే ధ్రువీకరిస్తున్నారు. సెక్షన్ 22–ఎ(1)(ఈ) కింద నాట్ టేకింగ్ ఓవర్ భూములుగా నమోదై ఉన్నాయని, ఆక్రమించడం కుదరదని అధికార వర్గాలు అంటున్నాయి. సమాధానాలన్నీ అధికారుల దగ్గరే ఉన్నాయి. కానీ కబ్జాకు గురవుతున్న భూములను కాపాడే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. నిషేధిత జాబితాలోని భూముల్లో లేఅవుట్, ఆపై లావాదేవీలు, దానికి తోడు ప్రభుత్వ నిధులతో ఆ భూముల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం జరుగుతుంటే చోద్యం చూడటం వెనకున్న రాజకీయ శక్తి ఎవరు? అసలు ఆ భూముల్ని జిల్లా యంత్రాంగం పరిరక్షించలేదా? కలెక్టర్ ఉంటున్న జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న భూముల్లో జరుగుతున్న కబ్జాలను ఆపలేరా? అంటూ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమాలకు రాచ‘బాట’ బావాజీ మఠం భూముల వివాదం రోజురోజుకి తీవ్రమవుతోంది. చినికి చినికి గాలివానగా మారినట్టు ఆక్రమణదారులు ఏకంగా తమవే అని సవాల్ విసురుతుంటే.. అధికారులు మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు. గతంలో ఇదే అధికారులు సర్వే నంబర్ 121లో ఉన్నవన్నీ నిషేధిత భూములే అని ఽధ్రువీకరించడమే కాకుండా కలెక్టరేట్ ప్రజా పరిష్కార వేదికలో ఇచ్చిన ఫిర్యాదుకు లిఖిత పూర్వక సమాచారం కూడా ఇచ్చారు. నాట్ టేకింగ్ ఓవర్ భూములుగా నిర్ధారిస్తూ, ఆ భూముల్లోకి ఎవరు వెళ్లకూడదని, ఆక్రమించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కానీ, వారిచ్చిన నివేదికకు వారే తూట్లు పొడుస్తున్నారు. ఆ సర్వే నంబర్ 121లో తెలుగు తమ్ముళ్లు కొందరు 3.50 ఎకరాల్లో అక్రమంగా లేఅవుట్ వేస్తే పట్టించుకోలేదు. ఆ భూములేవైనా అనుమతి లేకుండా లేఅవుట్ వేస్తే వెంటనే తొలగించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ, అక్రమంగా లేవుట్ వేసిన వారి జోలికే వెళ్లలేదు. అక్కడ జరుగుతున్న బాగోతంపై ప్రేక్షక పాత్ర పోషించి చూస్తున్నారు. అలాగని, వదిలేశారా అంటే కాదు. పక్కనున్న కాలనీలకు ఉపయోగపడుతుందని బూచిగా చూపించి లేవుట్కు లబ్ధి చేకూరేలా రూ.1.45 కోట్ల ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. అంటే, ఆక్రమణదారులకు సహకరిస్తూ రాచబాట వేసినట్టు అయింది. సవాళ్లు, ప్రతి సవాళ్లు అసలే అక్రమ లేవుట్... ఆపై సదరు భూములపై వివాదం, జిల్లా, హైకోర్టుల్లో నడుస్తున్న వ్యాజ్యాలు, అధికారులు సైతం నిషేధిత జాబితాలో ఉన్న భూముల ధ్రువీకరణ.. ఇన్ని ఉన్న భూముల్లో ఉపాధి నిధులతో రోడ్లు, కాలువల నిర్మించడం వెనక కారణమేంటి? వెనకున్నదెవరు? బరి తెగించి, కోట్లాది ఉపాధి నిధులు ఉపయోగించడమేంటి? దీనికి అధికారులు బాధ్యులు కారా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఈ భూములపై సవాళ్లు, ప్రతిసవాళ్లు జరుగుతున్నాయి. బెదిరింపులకు సైతం దిగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే సమయంలో తాజాగా సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్లో ఆ భూముల పర్య వేక్షణకు సంబంధించిన జగన్నాథ స్వామి మఠం ప్రతినిధులు నేరుగా ఫిర్యాదు చేశారు. మఠం భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, మా భూముల్లో లేఅవుట్ వేసి, రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా దీని వెనక బడా వ్యక్తుల ప్రమేయం ఉందని, మఠం భూ ములను కాపాడాలని ఫిర్యాదులో ప్రస్తావించారు. గతంలో బెదిరించిన దాఖలాలు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఆక్రమణలకు గురైన వెంటనే, లే అవుట్ వేస్తున్న సమయంలోనే అడ్డుకుని ఉంటే మరో ఫిర్యాదుకు అవకాశం ఉండేదా? కనీసం అధికారులు ఇప్పుడైనా మౌనం విడిచి, చర్యలకు ఉపక్రమిస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది. బావాజీ మఠం భూములపై చోద్యం చూస్తున్న అఽధికారులు నిషేధిత జాబితాల్లో ఉన్నాయంటున్న అధికార వర్గాలు అక్రమ లేఅవుట్, ఆపై అమ్మకాలు సాగుతున్నా పట్టించుకోని పరిస్థితి కబ్జాదారులకు వంతపాడేలా చర్యలు తాజాగా గ్రీవెన్స్లో మరో ఫిర్యాదు ఆక్రమణల నుంచి మఠం భూములు కాపాడాలంటూ వేడుకోలు -
బెధరగొడుతున్నారు
● మళ్లీ పెరిగిన ఇంధనం ధరలు ● వారంలో నాలుగుసార్లు పెంపు ● తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.117.50 ● డీజిల్ ధర రూ.105.15 ● సగటున లీటరుపై రూ.8 పెంపు ● జిల్లా వాసులపై రోజుకు రూ.16.72 లక్షలు అదనపు భారం శ్రీకాకుళం పాతబస్టాండ్: పాలకులు సగటు జీవిని బెదరగొడుతున్నారు. మళ్లీ మళ్లీ పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి భయం పుట్టిస్తున్నాయి. ముందుగా రూ.3లు పెంచిన కంపెనీలు, తర్వాత మరో 45 పైసలు పెంచాయి. ఇలా వారం రోజుల్లో నాలుగు సార్లుగా సుమారుగా లీటరు డీజిల్, పెట్రోల్లపై రూ.8లు వరకు పెంచారు. ఇలా రోజూ పెంపు జరుగుతోంది. ఇలాంటి ఆపత్కాలంలో కొంత రాయితీ ఇచ్చి కొనుగోలుదారులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసి చోద్యం చూస్తోంది. వారం కిందటి వరకు జిల్లాలో పెట్రోల్ లీటరు ధర రూ.109. 46 పైసలు ఉండేది. ప్రస్తుతం లీటర్ ధరను రూ.117.50కు పెంచారు. అలాగే డీజిల్ లీటరు ధర రూ. 97.26 ఉండేది. దీన్ని రూ.105.15కి పెంచారు. ఇలా రోజువారీ ఈ ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులపై భారీగా భారం పడుతోంది. జిల్లాలో ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలకు చెందిన బంకులు 143 ఉన్నాయి. వీటితో పాటు ప్రైవేటు బంకులు మరో 20 వరకు ఉన్నాయి. సగటున ప్రతి రోజు డీజిల్ 1.10 లక్షల లీటర్ల వరకు జిల్లాలో వినియోగం జరుగుతుంది. ప్రస్తుతం రేటు ప్రకారం లీటరుపై రూ.7.89 పెరిగింది. అంటే సుమారుగా సగటున జిల్లా విని యోగదారులపై రూ.8,67,900లు అదనపు భారం పడుతోంది. అలాగే పెట్రోల్ రోజుకి జిల్లాలో సుమారుగా లక్ష లీటర్లు వినియోగం ఉంటుంది. ప్రస్తుతం లీటరుపై రూ.8.04 పెరిగింది. అంటే సగటున రోజుకి రూ.8,04,000 లు అదనపు భారం పడుతోంది. సగటునా జిల్లాలో రోజుకి డీజిల్, పెట్రోల్ కలిపి వినియోగదారులపై రూ.16,71,900 అదనపు భారం పడుతోంది. చార్జీలు, ఇతర వసతులపై ప్రభావం డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో వాహనాల ద్వారా రవాణా జరిగే వాటిపై ధరల ప్రభావం ఉంటుంది. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలు, నిత్యావసరాలు, వాహన చార్జీలు పెరిగే అవకాశం ఉంది. హామీ ప్రకారం ధరలు తగ్గించాలి యుద్ధం పేరుతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పది రోజుల వ్యవధిలో రూ. 8 వరకూ పెంచింది. ఇది దారుణం. దీని ప్రభావం సామాన్య మధ్య తరగతి కుటుంబాలపై అధికంగా పడుతుంది. ఎన్నికల ముందు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అప్పటి ధరలపై రాద్ధాంతం చేసింది. తాము అధికారంలోకి వచ్చాక తగ్గిస్తామని చెప్పింది. ఆ హామీ నిలబెట్టుకోవాలి. – వైశ్యరాజు కేశవరాజు, మండల పరిషత్ విప్, నరసన్నపేట పెట్రోల్, డీజల్ ధరల్లో తేడాలు ఇలా.. ఇంధనం ఆంధ్రాలో ఒడిశాలో తేడా పెట్రోల్ రూ.117.50 రూ.110.48 రూ.7.00 డీజిల్ రూ.105.15 రూ.102.19 రూ.3.00 -
టీడీపీ.. ఓ వెన్నుపోటు పార్టీ
నరసన్నపేట: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటోందని, దీన్ని తట్టుకోలేక వైఎస్సార్ సీపీని గొడ్డలి పార్టీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వాస్తవానికి టీడీపీ.. ఓ వెన్నుపోటు పార్టీ అని ఎద్దేవా చేశా రు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ను ఆనాడు వైశ్రాయ్ హొటల్లో నీచాతినీచంగా అవమానించడం, చెప్పులతో కొట్టడం మరిచిపోయారా అని సూటిగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఆయనకే వెన్నుపోటు పొడిచి లాక్కోవడం ఎవ రికి తెలీదు అంటూ నిప్పులు చెరిగారు. ‘అధికారం వచ్చాక ఎంతో దారుణంగా పాలన చేస్తున్నారు. ఎంతో మంది వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను తప్పుడు కేసులతో జైల్లో పెట్టారు. మాది గొడ్డలి పార్టీ అంటున్నారు. ఇది మీకు తగదు.’ అని హితవు పలికారు. ప్రతీదీ లెక్క వేసుకుంటూనే ఉన్నామని, వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారనే భయం ఇప్పటి నుంచే టీడీపీ నాయకుల్లో మొదలైందని, అందుకే కువిమర్శలు చేస్తున్నారని అన్నారు. నరసన్నపేటకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ప్రజలను తప్పు దోవ పట్టించేలా ఆయన మాటలు ఉన్నాయన్నారు. మీరెన్ని తప్పుడు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా.. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని కృష్ణదాస్ అన్నారు. ‘అచ్చెన్నా.. నువ్వు కూడా వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని అంటున్నావు. మీ ఇంట్లో జరిగిన వ్యవహరాలు జిల్లా ప్రజలకు తెలీంది కాదు.’ అని కృష్ణదాస్ అన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకులు అంధవరపు సూరిబాబుతదితరులు పాల్గొన్నారు. ● నిప్పులు చెరిగిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
వినతులను సత్వరమే పరిష్కరించాలి
● జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ● పీజీఆర్ఎస్కు 143 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: పీజీఆర్ఎస్కి వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ను సోమవారం నిర్వహించారు. అర్జీదారుల నుంచి మొత్తం 143 వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఎస్డీసీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. పలు వినతులు పరిశీలిస్తే... ● ఆమదాలవలస మండలం తోటాడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 121లో భూములు అన్యాక్రాంతమవ్వకుండా చర్యలు తీసుకోవాలని సదావర్తి మఠం (జగన్నాథ దేవాలయం) సేవకుడు పిట్ట మహేశ్వరరావు కోరారు. ఈ భూములు ప్రభుత్వ జాబితాలో 22–ఏ కింద ఉన్నాయన్నారు. అయితే ఆ భూముల్లో రాజకీయ పలుకుబడితో అక్రమ లేఅవుట్లు వేసి విక్రయిస్తున్నారని, వాటికి అడ్డుకట్ట వేయాలని విన్నవించారు. ● జిల్లాలో అక్రమ మైనింగ్కి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు సోమవారం గ్రీవెన్సులో కోరారు. గార మండలం అంపోలు పంచాయతీ ఎరుకు అంబటివానిపేట గ్రామంలో కూటమి నాయకులు చెరువులో అక్రమ మైనింగ్ చేస్తున్నారని తెలిపారు. ● తనకు రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనుల బిల్లులు చెల్లించాలని సరుబుజ్జిలి మండలం తెలుకిపెంట పంచాయతీ పర్వతాలపేట గ్రామానికి చెందిన బెవర మల్లేశ్వరరావు కోరారు. పనులకు సంబంధించిన బిల్లులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వకుండా పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ తదితరులు ఉన్నారు. ● ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను అక్రమంగా అమ్మేస్తున్నారని ఆ గ్రామానికి చెందిన రైతు ఫిర్యాదు చేశారు. భూములు అన్యాక్రాంతమవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘ప్రజల ప్రగతికే రచన’
శ్రీకాకుళం కల్చరల్: నిజమైన ప్రజాస్వామ్యం, సమానత్వం, శ్రామిక ప్రజల జీవితాల్లో అభివృద్ధి కోసం రచనలు సాగాలని పలువురు వక్తలు అన్నారు. నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో రెండు రోజులుగా జరుగుతున్న జనసాహితీ 13వ మహాసభలు సోమవారంతో ముగిశాయి. జనసాహితీ అధ్యక్షులు కామ్రేడ్ దివి కుమార్ మాట్లాడుతూ కుల వివక్ష, లింగ వివక్ష ఇంకా సమాజం మీద దాడి చేస్తూనే ఉందని అన్నారు. జనసాహితి సహాయ కార్యదర్శి ఓవీవీఎస్ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సాహిత్య సభలో అఖిల భారత ప్రజా సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షులు గౌతమ్ ముఖర్జీ, అరసం నాయకులు చింతాడ కృష్ణారావు, విర సం అధ్యక్షులు అరసవల్లి కృష్ణ, సాహితీ స్రవంతి నాయకులు చీకటి దివాకర్, సీ్త్ర విముక్తి సంఘటన కార్యదర్శి కామ్రేడ్ లక్ష్మి, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ ప్రధాన కార్యదర్శి సురేష్ తమ సందేశాలను అందించారు. ‘పరిశ్రమల ఏర్పాటుకు భూములివ్వండి’ టెక్కలి: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రజ లు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు రావాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు సమీపంలో ఎంఎస్ఎంఈ పార్కు శంకు స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్పరం కాకుండా నిధులు కేటాయించామని అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేరడి బ్యారేజీకు అడ్డంకులు తొలగాయని, రానున్న ఏడాదిన్నర లోగా బ్యారేజీను పూర్తి చేస్తామని తెలిపారు. -
సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల డిమాండ్ చేశారు. రెండు రోజులుగా శ్రీకాకుళంలో జరుగుతున్న జన సమితి రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ సభ్యులతో కలిసి మాట్లాడారు. 12వ పీఆర్సీని 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలని, 11వ పీఆర్సీ సంబంధిత బకాయిలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవలింగారావు మాట్లాడుతూ వెంటనే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలని, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షుడు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ కొప్పల భానుమూర్తి, పూర్వ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాయ సంపాదకుడు ఎస్వీ అనిల్ కుమార్, జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు పి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పక్క రాష్ట్రానికి పరుగులు
● ఒడిశాలో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ పర్లాకిమిడిలో పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు పాతపట్నం సమీపంలోని వెలవెలబోతున్న పెట్రోల్ బంక్ ధర తక్కువే.. ఆంధ్రాలో కంటే ఒడిశాలోని పర్లాకిమిడిలో పె ట్రోల్ ధర తక్కువ. లీటర్ పెట్రోల్కు రూ.7 తక్కువగా ఉంటుంది. అందుకే పర్లాకిమిడి వెళ్లినప్పుడు పెట్రోల్ వేయిస్తాను. – కొరాడ జగదీష్, వాహనదారుడు, పాతపట్నం పాతపట్నం: ఒడిశా సరిహద్దు ప్రాంత వాసులు పెట్రోల్, డీజిల్ కోసం పక్క రాష్ట్రానికి పరుగులు పెడుతున్నారు. కొత్తూరు, మెళియాపుట్టి, పాతపట్నం వాసులు పర్లాకిమిడి వెళ్లి పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రా కంటే ఒడిశాలో తక్కువ ధరకు వస్తుండడంతో అంతా అటే క్యూ కడుతున్నారు. తరచూ ఒడిశాకి వెళ్లలేని కొందరు వాహనదారులు పది లీటర్ల క్యాన్లలో పెట్రోల్, డీజిల్ తీసుకుని వచ్చి ఇంటి వద్ద నిల్వ ఉంచుకుంటున్నారు. -
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
గార: మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో విజిలెన్సు, వ్యవసాయాధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. తూలుగు జంక్షన్లోని శ్రీశివపార్వతి ఎంటర్ప్రైజెస్, శ్రీ వేంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ దుకాణాలను విజిలెన్సు ఎస్ఐ బి.రామారావు, ఏవో డి.పద్మావతిలు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వం ఇటీవల నిషేధించిన పారాక్వాట్ కలుపు మందు 287 లీటర్లు ఉండడంతో వాటి అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. తనిఖీల్లో ఏఈవోలు బి.దుర్గాప్రసాద్, జె.శ్రీదీప్తి తదితరులు పాల్గొన్నారు. -
పట్టాలు ఇవ్వాలని గిరిజనుల ధర్నా
టెక్కలి: ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగ ప్రభాకర్ డిమాండ్ చేశారు. సో మవారం టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎల్ఎన్ పేట మండలానికి చెందిన బెన్నాడిగూడ, కొత్తగూడ, గోలుకొప్ప గ్రామాల గిరిజన రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ గిరిజన రైతులు కొన్ని దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, కార్పొరేట్ కంపెనీలకు ఎకరా భూ మి 99 పైసలకే ఇవ్వడం కాదని, అర్హులైన గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజను లు సాగు చేస్తున్న భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గిరిజనులను కాదని ఇతరులకు అప్పగించాలని చూస్తే ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి రషీద్ అహ్మద్కు వినతిపత్రం అందజేశారు. -
అర్హులకు అందేనా..?
నరసన్నపేట: వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్ల పాటు ప్రతీ పథకం అర్హులకు అందిస్తూ వచ్చారు. పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పథకాలు మంజూరు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారాయి. పచ్చ చొక్కాలకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. టీడీపీ కార్యకర్తలకే పథకాలు ఇవ్వా లని అనధికారంగా కూటమి ప్రతినిధులు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. గడిచిన 23 నెలలుగా ఇదే జరుగుతోంది. ఈ దశలో రైతులకు యంత్ర సాయం పేరిట ప్రభుత్వం సబ్సిడీపై యంత్ర పరికరాలు ఇస్తామని ప్రకటించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రైతులు ఆశగా ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 4,052 మంది రైతులు దరఖాస్తులు చేశారు. ఈనెల 24తో గడువు ముగిసింది. అర్హులకు అందేనా.. పంటకోత, నూర్పిడి పరికరాలు 19, మొక్కల సంరక్షణ పరికరాలు 894, పంట కోత అనంతరం ప్రాసెసింగ్, విలువ జోడించు యంత్రాలు 18, పవర్ టిల్లర్స్ 63, అవశేషాల నిర్వహణ/ఎండుగడ్డి, పశుగ్రాసం పరికరాలు 42, స్వీయ చోదక యంత్రాలు 106, విత్తనాలు నాటడం, మొక్కలు నాటడం, తవ్వే యంత్రాలు 14, ట్రాక్టర్ పవర్ టిల్లర్ నడిచే పరికరాలు 129, ట్రాక్టర్లు 43 మొత్తం 1,328 యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లాకు రూ.4.84 కోట్లు మంజూరు చేశారు. అయితే ఇవన్నీ అర్హులకు అందుతాయా లేదా కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పేవారికే ఇస్తారా అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉపాధి నిధులతో గతేడాది గ్రామాల్లో పశువుల శాలలు మంజూరు చేయగా.. అనేక మంది దరఖాస్తులు చేశారు. అయితే అర్హులకు కాకుండా అన్నీ టీడీపీ వారికే ఇచ్చారు. ఇలా ఏ పథకం అమలు చేసినా వారికే ఇస్తున్నారు. దీంతో తాజాగా వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా అర్హులకు అందుతాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. చేసిన దరఖాస్తులు నిశితంగా పరిశీలించిన అనంతరం.. జేసీ పర్యవేక్షణలో లాటరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారట. ఇక్కడే మతలబు ఉంటుంది అని రైతులు అంటున్నారు. లాటరీ పేరున తమకు నచ్చిన వారికి యంత్ర పరికరాలు మంజూరు చేసుకుంటారని అర్హులకు అందవనే అనుమానం బలపడుతోంది. సన్న, చిన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, మిగిలిన విభాగాల వారికి 40 శాతం రాయితీపై యంత్రాలు మంజూరు చేస్తారు. వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులకు ఎంతో ఉపయోగకరం. వీటిని అర్హులకు ఇవ్వాలి. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పేవారికే ఇవ్వకూడదు. అలాగే కౌలు రైతులనూ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతులకు రైతు భరోసా కూడా అందడం లేదు. కౌలు రైతులకు కార్డులు ఇచ్చి, వారి పంటలను నమోదు చేసి సబ్సిడీ యంత్ర పరికరాలు అందజేయాలి. – వెలమల రమణ, కౌలు రైతు సంక్షేమ సంఘం ప్రతినిధి రైతులు ఎంతో ఆశతో సబ్సిడీ యంత్ర పరికరాల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. అయితే ఈ కూటమి పాలనలో అర్హులకు పథకాలు అందడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం కూడా దానిని పాటించాలి. అర్హులైన రైతులకు యంత్ర సాయం చేయాలి. – కింతలి చలపతి, రైతు, కానుకర్తివానిపేట వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీపై ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఆన్లైన్లో దరఖాస్తులను పరిశీలించి జేసీ పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక చేస్తాం. వచ్చిన దరఖాస్తుల్లో అర్హులకు యంత్ర పరికరాలు ఇస్తాం. – ఎల్వీ మధు, వ్యవసాయ శాఖ ఏడీ, నరసన్నపేట యంత్ర సాయం కోసం ఆశగా నమోదు చేసుకున్న రైతులు లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామంటున్న అధికారులు అధికార పార్టీ వారికే కట్టబెట్టే వ్యూహమని రైతుల అనుమానం ముగిసిన దరఖాస్తుల గడువు ట్రాక్టర్తో పొలం దుక్కి చేస్తున్న రైతు -
జనగణన లెక్కింపు వేగవంతం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో జనగణన గృహ జాబితా లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు జనగణన ఎంతో కీలకమైందని, ప్రతి ఇంటి వివరాలను కచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ప్రజలతో స్నేహపూరిత వాతావరణంలో మెలుగుతూ సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్తున్న సిబ్బందికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించి, సరైన వివరాలు అందించాలని కోరారు. డేటా నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావుండకూడదని, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. -
వీధి మధ్యలో బోర్వెల్
పలాస: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పలాస బజారు వీధికి వెళ్లే రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. అయితే ఆ రోడ్డులోని కొత్వాల్ వీధి మధ్యలో ఒక వ్యక్తి తన సొంత అవసరాల కోసం బోరువెల్ వేయించుకుంటున్నాడు. తన అవసరం కోసం ఎక్కడైనా బోర్వెల్ మున్సిపాలిటీ అధికారుల అనుమతితో వేసుకోవచ్చు. అయితే కోత్వాల్ వీధిలో రోడ్డుకు మధ్యన బోర్వెల్ను సోమవారం వేయించాడు. దీంతో ఆ రోడ్డు పూర్తిగా బ్లాక్ అయింది. రాకపోకలు స్తంభించిపోయాయి. రోడ్డు మధ్యలో బోరు వేయడమేంటని, ఇది ప్రజలకు చాలా ఇబ్బందని మున్సిపల్ కమిషనర్కు చెప్పినా ఆయన కూడా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్డీవోకు వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేశామని, అతను కూడా తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ప్రేమ జంటను రక్షించిన శక్తి టీమ్ ఆమదాలవలస: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రైల్వేట్రాక్పై ఆత్మహత్యకు యత్నించిన ప్రేమ జంటను శక్తి టీమ్ పోలీసులు సమయస్ఫూర్తితో రక్షించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మన్యం జిల్లా పాలకొండ ప్రాంతానికి చెందిన వీరు గత నాలుగు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేసినప్పటికీ.. వారు అంగీకరించకపోవడంతో ఈనెల 19వ తేదీన ఇంటి నుంచి పారిపోయారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చయిపోవడంతో తీవ్ర నిరాశకు గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో సోమవారం ఆమదాలవలస రైల్వే పట్టాలపై నిల్చున్నారు. అదే సమయంలో అక్కడ గస్తీ నిర్వహిస్తున్న శక్తి టీమ్ ఇన్చార్జి ఉమెన్ హెచ్సీ తమ్మినేని అమ్మాజీ, మహిళా కానిస్టేబుల్ ధనలక్ష్మి వారిని గమనించి, వెంటనే అప్రమత్తమై రక్షించారు. అనంతరం పట్టణ పోలీస్స్టేషన్కు తెలియజేసి, ప్రేమ జంటను పాలకొండ పోలీస్స్టేషన్కు తరలించారు. సమయానికి స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన శక్తి టీమ్ సిబ్బందిని జిల్లా పోలీసు యంత్రాంగం అభినందించింది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
టెక్కలి: జాతీయ రహదారి టెక్కలి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలి భూలోకమాత వీధికి చెందిన రిషి, కార్తీక్ అనే ఇద్దరు యువకులు గాయపడ్డారు. జాతీయ రహదారిలో ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకులను శ్రీకాకుళం నుంచి పలాస వైపు వెళ్తున్న కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన యువకులను టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో కార్తీక్కు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి వజ్రపుకొత్తూరు: మండలంలోని పూండి – పలాస రైల్వేస్టేషన్ల మధ్య రైలు ప్రమాదంలో సోమవారం గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. సుమారు 50 నుంచి 55 ఏళ్లు వయస్సు ఉన్న మహిళ ఎగువకు వెళ్లే రైలుమార్గంలో మృతి చెందినట్లు తెలిపారు. శరీరం సన్నగా, జుట్టు తెలుపు రంగులో ఉన్నట్లు పేర్కొన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే 92475 85743 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
గుక్కెడు నీరు.. ఇచ్చేవారు లేరు
బిందెడు నీటిని తెచ్చుకోవడానికి రెండు బిందెల చెమట్లు కార్చాల్సిన పరిస్థితి వస్తే..? ఆర్చుకుపోయిన గొంతును తడిపేందుకు కంట నీరు తప్ప నీటి చుక్క దొరక్కపోతే..? ఓ చేతిలో పసిబిడ్డ మరో చేతిలో బిందెతో కొండ దిగాల్సిన దుస్థితి వస్తే..? అంత దూరం నడిచాక ఖాళీ బావి వెక్కిరిస్తే..? పాలకుల దయ వల్ల స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా సిక్కోలు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. పాతపట్నం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంత వాసులకు వేసవి వస్తే భయం. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సిన దీన స్థితి వారిది. కొత్తూరు మండలంలోని చీపురుపల్లి, పెద్దరాజపురం, చిన్నరాజపురం, దాపాకులగూడ, జెన్నోడు గూడ, దొండమామిడి గూడ, అద్దాయి గూడ, పాండురమానుగూడ, కూడహ గూడ, గ్యాసరగూడ, అడ్డంగి అబలాసింగి వాసులకు ఈ కష్టాలు నిత్యకృత్యమయ్యాయి. గుప్పెడు రేషన్ తీసుకునేందుకు కొండంతా నడిపిస్తున్న సర్కారు.. గుక్కెడు నీటిని కూడా ఇవ్వలేక ఇలా వేధిస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం కొండలెక్కి దిగితేనే నీరు -
రాళ్ల గుట్టలో ఆక్రమణలు
టెక్కలి: జాతీయ రహదారికి ఆనుకుని బొప్పాయిపురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 1–1లోని రాళ్లగుట్టలో సుమారు 5 సెంట్ల ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఆక్రమణలు జరిగినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించినప్పటికీ.. తొలగింపు విషయంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు జోక్యం చేసుకుని అడ్డుపడుతున్నారని తెలుస్తోంది. ఇదే రాళ్లగుట్టకు ఆనుకుని జాతీయ రహదారి వరకు ఇటీవల సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో దీని విలువ పెరగడంతో ఆక్రమణలు మరింత జోరందుకున్నాయి. వీటితో పాటు సమీపంలో సుమారు ఎకరా వరకు డీ–పట్టా స్థలం ఉంది. దీనిని ఎలాగైనా కై వసం చేసుకునేందుకు అధికార పార్టీ కార్యకర్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమేరకు అమ్మకాలు చేపట్టడంతో రూ.లక్షల్లో చేతులు మారినట్లు సమాచారం. కాగా జాతీయ రహదారికి అనుకుని బహిరంగంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటనే సందేహాలు చాలామందిలో నెలకొన్నాయి. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న ఈ స్థలాల్లో ఇప్పుడు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఒక్కసారిగా వీటి విలువ అమాంతంగా పెరిగిపోయింది. దీంతో పంచాయతీ స్థాయిలో ఉన్న అధికార పార్టీ కార్యకర్తల కన్ను పడింది. ఎలాగైనా వాటిని కై వసం చేసుకుని గుట్టుగా అమ్మకాలు చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. అందువలన ఈ ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
సామాన్యులపై ‘పెట్రో’ పిడుగు
● మళ్లీ మళ్లీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు ● అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం హిరమండలం: పెట్రోల్, డీజిల్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజానీకం, రైతులు ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతుంటే.. తాజాగా కేంద్ర ప్రభుత్వం వరుసుగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచుతూ అదనపు భారం మోపుతోంది. ఈనెల 15న లీటర్ పెట్రోల్పై రూ.3.29 పైసలు, డీజిల్పై రూ.3.14 పైసలు పెంచేసింది. మళ్లీ ఈ నెల19న లీటరుకు 95 పైసలు చొప్పున పెంచేసింది. అక్కడితో ఆగకుండా మూడోసారి ఈ నెల 23న లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజల్పై 91పైసాలు పెంచేసి సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచింది. సరుకుల ధరలు ౖపైపెకి.. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధర అన్ని వర్గాలపైనా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా రవాణా ఖర్చులు పెరుగుతాయి. తద్వారా నిత్యావసర సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉంది. బియ్యం, పాలు, కూరగాయలు, నూనె తదితర ధరలు పెరిగితే సామాన్యులు మరింత ఇబ్బంది పడతారు. కాడెద్దులు కరువై రైతులు యంత్రాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ప్రతి యంత్రానికి పెట్రోల్, డీజిల్ ఉపయోగించాల్సిందే. దీంతో పంటల సాగులో రైతులపై ఆర్థిక భారం పడుతుంది. ప్యాసింజర్ ఆటో, జీపులు, కార్లు నడుపుతూ జీవనం సాగించే మధ్య తరగతి కుటుంబాలపైనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని పలువురు కోరుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ మళ్లీ పెంచడం సరికాదు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడంతో అన్ని వర్గాల ప్రజలపైనా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు జీవనం కష్టతరమవుతోంది. పెంచిన ధరలు తగ్గించాలి. – పి.పద్మావతి, యంబరాం, ఎల్ఎన్పేట మండలం -
నచ్చిన క్రీడను కెరీర్గా ఎంచుకోవాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యార్థులు నచ్చిన గేమ్ను ప్యాషన్గా తీసుకోవాలని, అదే క్రీడను కెరీర్గా ఎంచుకోవాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా క్రికెట్ సంఘం(జెడ్సీఎస్) ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఆర్ఐఓ కార్యాలయానికి సమీపంలో అత్యాధునిక హంగులతో రూ.17లక్షల నిధులతో ఏర్పాటుచేసిన ఫ్లడ్లైట్లతో కూడిన క్రికెట్ నెట్స్ను ఆదివారం జెడ్సీఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడాకారులు చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని, రెగ్యులర్గా ప్రాక్టీసు చేయాలని సూచించారు. టోర్నీలు, మ్యాచ్లు ఆడుకునేందుకు అవకాశం కల్పించాలన్న జిల్లా క్రికెట్ సంఘం విజ్ఞప్తి మేరకు ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్లో వసతులుతో తీర్చిదిద్దిన మైదానాన్ని ఉచితంగా వాడుకోవచ్చని హామీ ఇచ్చారు. ఉజ్వలమైన భవిష్యత్తును అందిపుచ్చుకోవాలని సూచించారు. రవికుమార్ మాట్లాడుతు ప్రతిభ కలిగిన క్రీడాకారులకు న్యాయం చేస్తు వారిని అన్ని విధాలా ప్రోత్సహిస్తామన్నారు. జిల్లాలో మూడేళ్లలో జెడ్సీఎస్ సాధించిన ప్రగతి, క్రీడాకారుల విజయాలను మెంటార్ ఇలియాస్ మహ్మద్ వెల్లడించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై.పోలినాయుడు, జిల్లా కార్యదర్శి హసన్రాజా షేక్, ఉపాధ్యక్షుడు టి.బాలమురళీకృష్ణ, కోశాధికారి మదినా శైలానీ, కౌన్సిలర్ డాక్టర్ ఎస్.రవికుమార్, సంయుక్త కార్యదర్శి ఎన్జీ బెనర్జి, సుంకరి కృష్ణకుమార్, కోచ్లు కె.సుదర్శన్, ఎ.ఆనంద్, మహిళా కోచ్లు హారికాప్రసాద్, రమణమ్మ, రవికిరణ్, క్రీడాకారుల తల్లిదండ్రులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఫుట్బాల్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ముని శ్రీనివాసరావు(శ్రీకాకుళం), ప్రధాన కార్యదర్శిగా వేదుల సంతోష్కుమార్ (ఇచ్ఛాపురం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ విస్తృతస్థాయి సమావేశంతోపాటు నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఫుట్బాల్ అసోసియేషన్, శాప్ ప్రతినిధులు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధుల సమక్షంలో అడ్వకేట్ సూరు గోవిందరాజులు (గోపి) ఎన్నికల అధికారిగా వ్యవహరించి.. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేశారు. కార్యక్రమంలో ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు జి.పవన్కుమార్, శేషగిరిరావు, నాని, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, జిల్లా నలుమూలల నుంచి ఫుట్బాల్ క్లబ్ల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లాలో ఫుట్బాల్ క్రీడాభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని, పాఠశాలల్లో ఫుట్బాల్ క్రీడను పీడీ, పీఈటీల సహాయంతో మరింత విస్తృతం చేద్దామని నూతన కార్యవర్గం ప్రతినిధులు స్పష్టం చేశారు. నూతన కార్యవర్గమిదే.. జిల్లా అధ్యక్షుడిగా ముని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా డి.దివాకర్రావు (సుప్రీమ్), వి.సుగుణ్కుమార్, వై.ఎన్.పి.లత, ప్రధాన కార్యదర్శిగా వేదుల సంతోష్కుమార్, కోశాధికారిగా కె.నవీన్కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా దుంగ శ్రీధర్, కె.కోటేశ్వరరావు, ఎ.వెంకటరావు, సీహెచ్ వీరభద్రరావు, ఎం.వి.ఎస్.సాయిసూర్య, ఎ.రేవతిలను ఎన్నుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో కె.నివాస్కుమార్, జె.నాగరత్నం, ఎ.జ్యోత్స్న, కె.భాస్కర్, మోహన్రావులు, జాయింట్ సెక్రటరీగా జి.రాందేవ్ గాంధీ, మాడుగుల రామారావు, తంగి మురళీమోహనరావు, నాయుడులు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తంగి రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004–05 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం నిర్వహించారు. ముందుగా ఆనాటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాక పూర్వ ఉపాధ్యాయులను, స్మేహితులను మరువకుండా ఆత్మీయ కలయిక నిర్వహించడం గొప్ప విషయమన్నారు. విద్యార్థి దశలో ఏర్పడిన స్నేహం చిరకాలం కొనసాగుతుందన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. -
నిమిషంలో పట్టేస్తారు
శ్రీకాకుళం క్రైమ్ : గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలు యువత భవితను నాశనం చేస్తుండటంతో జిల్లాలో ఉన్న అన్ని పోలీస్స్టేషన్లకు అత్యాధునిక డ్రగ్ డిటెక్షన్ కిట్లను అందజేశామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. దీని ద్వారా మత్తుపదార్థాలు సేవించేవారు నిమిషాల్లోనే దొరికిపోతారని ఎస్పీ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్స్టేషన్లకు ఈ కిట్లను పంపిణీ చేశామన్నారు. ఈ కిట్ల ద్వారా మూత్ర నమూనాను పరీక్షించి కేవలం 1 నిమిషం నుంచి 2 నిమిషాల్లోగా మత్తుపదార్థాలు సేవించారా లేదా అన్నది నిర్ధారించవచ్చని, పరీక్షల్లో పాజిటివ్ తేలిన వారికి కౌన్సిలింగ్ తో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, గంజాయి సేవిస్తూ, విక్రయిస్తూ ప ట్టుబడిన వారిపై చర్యలు తప్పవన్నారు. జిల్లాలో ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులను ఎవరైనా గుర్తిస్తే డయల్ 112 లేదా 1972కు సమాచారం అందించాలని వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పట్టుబడిన 30 మంది అనుమానితులు .. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీకాకుళం సబ్డివిజన్ పరిధిలోని డీఎస్పీ సీహెచ్ వివేకానంద పర్య వేక్షణలో వన్టౌన్, టూటౌన్, ఆమదాలవలస, ఎచ్చెర్ల పీఎస్ల పరిధుల్లో 30 మంది అనుమానితులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు డిటెక్షన్ కిట్ల ద్వారా మూత్ర నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు సేవిస్తే దొరకడం గ్యారెంటీ స్టేషన్లకు డ్రగ్ డిటెక్షన్ కిట్ పంపిణీ జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు మొదటిరోజే 30 మంది అనుమానితులు పట్టుబడిన వైనం -
ఆదిత్యుని సన్నిధిలో భక్తుల సందడి
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తుల సందడి కనిపించింది. జ్యేష్ట మాసం రెండో ఆదివారం సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు తలనీలాలను సమర్పించుకుంటే, మరికొందరు 108 సార్లు ప్రదక్షిణలు, సంప్రదాయ పూజలు, వెండి కళ్లు, బంగారు కళ్లు సమర్పించుకున్నారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం చర్యలు చేపట్టారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు, రూ.300 దర్శన టికెట్లతో అంతరాలయ దర్శనాలు కల్పించారు. ఆలయం బయట ఎండ నుంచి రక్షణగా టెంట్లు వేయగా, మంచినీటి కోసం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. అన్నదాన ప్రసాదం కోసం భక్తులు వేచి ఉండక తప్పలేదు.. భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో పలువురికి అన్నదాన ప్రసాదం అందని పరిస్థితి నెలకొంది. -
కారు ఢీకొని వ్యక్తికి గాయాలు
సంతబొమ్మాళి: భావనపాడులో కారు ఢీకొని అదే గ్రామానికి చెందిన తామాడ దానేష్కు గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా కారుతో ఢీకొట్టి కారు ఆపకుండా డ్రైవర్ పరారయ్యాడు. గాయపడిన దానేష్ను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బైక్ ఢీకొని మహిళ దుర్మరణం రణస్థలం: లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం రూరల్ మండలం పుక్కల్లపేట పంచాయతీ మోపసుబందరు గ్రామానికి చెందిన పుక్కల్ల ముత్తమ్మ(43) శుభకార్యంలో వంట పని చేసేందుకు బుడుమూరు వచ్చింది. ఆదివారం సాయంత్రం4.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా రణస్థలం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న ద్విచక్రవాహనం అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో ముత్తమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. బైక్ డ్రైవింగ్ చేస్తున్న లావేరు మండలం తామాడ పంచాయతీ సూర్యనారాయణపురం గ్రామానికి చెందిన నడుమూరి వాసు, ఆమె భార్యకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం రిమ్స్కు తీసుకెళ్లారు. లావేరు ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థి మిత్రకు డీజిల్ మరక!
● బడులు తెరిచే నాటికి విద్యార్థులకు కిట్లు ఇవ్వలేమని ప్రకటన ● విద్యా కానుకకు అంతర్జాతీయ పరిణామాలతో ముడిపెట్టిన ప్రభుత్వం యుద్ధానికి ముడిపెట్టడం సరికాదు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విషయంలో ప్రభు త్వం శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకు అందజేస్తున్న విద్యా కాను క కిట్ల విషయంలో అంతర్జాతీ య పరిస్థితులకు ముడిపెట్టడం సరికాదు. ప్రభుత్వ పాఠశాలలు తెరిచేనాటికి కచ్చితంగా పూర్తి స్థాయిలో విద్యా కానుక కిట్లు అందజేయాలి. – టి.చందనరావు, స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి. చంద్రబాబు ఎప్పుడూ నిర్లక్ష్యమే ప్రభుత్వ పాఠశాలలు, అందులో చదువుతున్న పేద, సామాన్య వర్గాలకు చెందిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ నిర్లక్ష్యమే చూపుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయి. అప్పట్లో విద్యా కానుక కిట్లు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే పూర్తి స్థాయిలో కిట్లు అందజేయలేమని చెబుతున్నారు. – ఎం.గణపతిరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు, టెక్కలి. ప్రభుత్వ పాఠశాలలంటే చులకన ప్రభుత్వ పాఠశాలలంటే చంద్రబాబుకు చులకన. విద్యా కానుక కిట్లు పూర్తిగా ఇవ్వలేమని చెబు తూ, అంతర్జాతీయ పరిణామాలను ముడిపెడుతున్నారు. మంత్రులు, అధికార పార్టీ నాయకులకు మాత్రం ఇలాంటి ఆంక్షలు వర్తించవా. తక్షణమే పూర్తి స్థాయిలో విద్యా కానుక కిట్లు అందజేయాలి. – పి.వైకుంఠరావు, వైఎస్సార్ టీఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు, టెక్కలి శ్రీకాకుళం, టెక్కలి: విద్యార్థి మిత్రకు సర్కారు డీజిల్ మరక అంటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందజేస్తున్న ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్ ఒక్కో విద్యార్థికి సుమారు రూ. 2,279 ఖరీదు చేస్తుంది. ఈ కిట్లో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 3 జతల యూనిఫాం, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్ట్ వంటి ప్రాథమిక విద్యా సామగ్రిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. కుట్టుకూలి దీని కి అదనం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పద్ధతిని ప్రవేశపెట్టగా.. ప్రస్తుత ప్రభుత్వం పేరు మార్చి కొనసాగిస్తోంది. ఈ ఏడాది కూడా జూన్ 19వ తేదీన జరగబోవు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ఆర్భాటంగా విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ కూడా షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న ఆయిల్ కొరత కారణంగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి విద్యార్థి మిత్ర పంపిణీ మరింత ఆలస్యం అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. విద్యా శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు ఇది ఒక నెపం మాత్రమేనని వెండార్స్తో కుదుర్చుకున్న ఒప్పందాల్లో తేడా వచ్చిందని, గత ఏడాదితో పోల్చుకుంటే సుమారు రెండు లక్షల 40 వేల మంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలకు దూరమయ్యారని, విద్యార్థుల సంఖ్య ప్రోగ్రెసన్ రూపంలో ఇండెంట్ పెట్టడం, ప్రస్తుతం ఇండెంట్ కంటే రెండున్నర లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, మ్యానుఫ్యాక్చర్స్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇండెంట్ ప్రాప్తికి హిట్ల తయారీ పూర్తయిందని, మొత్తం కిట్లు కొని తీరాల్సిందేనని పట్టు పట్టడంతో రూ.60 కోట్లకుపైగా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇదే అసలు కారణమని విద్యాశాఖలో పనిచేస్తున్న వారే లీకులిస్తున్నారు. గత ప్రభుత్వంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మే నెల మూడోవారా నికే మండల స్టాక్ పాయింట్లకు విద్యా కానుక కిట్లు పూర్తిస్థాయిలో చేరేవి. పాఠశాల పునః ప్రారంభం నాటికి పాఠశాల పాయింటుకు కిట్లు చేరవేసి విద్యారంగ పునర్నిర్మాణంపై నిబద్ధతను చాటుకుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థి మిత్రకు డీజిల్ మరకలు అంటిస్తోంది. -
రోడ్డు చెంతనే తవ్వకాలు
హిరమండలం: వంశధార పనుల పేరుతో కాంట్రాక్టర్లు లోకొండ గిరిజన గ్రామం రహదారిని ధ్వంసం చేస్తున్నారు. ఇటీవల వంశధార ఎత్తిపోతలు, కరకట్టలు, ఇతరత్రా నిర్మాణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కంకర, మట్టి అవసరం. ఇదే అదనుగా లోకొండలో వ్యవసాయ భూములు, ప్రభుత్వ స్థలాల్లో కంకర, మట్టి తవ్వకాలు చేపట్టి తరలిస్తున్నారు. అయితే రహదారి చెంతనే, కల్వర్టుల వద్ద తవ్వకాలు చేపడుతుండడంతో నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. 2022లో ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించారు. అయితే ఇది కేవలం ద్విచక్ర వా హనాలతో పాటు చిన్నపాటి వాహనాలు నడిపేందుకు సామర్థ్యం ఉన్న రోడ్డు మాత్రమే. అయితే రహదారికి ఆనించి మట్టి, కంకర తవ్వకాలతో పూర్తిగా బలహీనం అవుతోంది. ఆపై భారీ వాహనాలు రోడ్డుపై వెళుతుండడంతో పూర్తిగా ధ్వంసం అవుతోంది. ఇదేమని అడుగుతుంటే సంబంధిత కాంట్రాక్టర్లు వంశధార పనుల పేరు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రహదారి మాత్రం దారుణంగా దెబ్బతింటోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని లోకొండ గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వడదెబ్బతో మాజీ ఎంపీటీసీ మృతి గార: అంపోలు గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు అంబటి తౌడు (77) వడదెబ్బతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం తౌడు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంటి వద్దనే అస్వస్థతకు గురయ్యారని, కొద్ది నిమిషాల్లో మృతి చెందారని తెలిపారు. తౌడు మృతిపై వైఎస్సార్ సీపీ స్టేట్ ఎస్ఈసీ మెంబర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, ఎంపీపీ, పార్టీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గొండు రఘురాం, మాజీ సర్పంచ్ గొండు జయరాం సంతాపాన్ని తెలియజేశారు. వజ్రపుకొత్తూరు: మండువేసవిలో చుక్కనీరు దొరక్క చాలా చోట్ల ప్రజలు అల్లాడిపోతుండగా.. మరికొన్నిచోట్ల మాత్రం వృథాగా పోతున్నా పట్టించుకునే నాథుడే లేదు. కొండవూరులో జలజీవన్ మిషన్ ద్వారా పంపిణీ చేస్తున్న శుద్ధ జలాలు వృథా అవుతున్నాయి. రోజూ వందల లీటర్ల నీరు కుళాయిల ద్వారా వృథాగా పోతున్నా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు పట్టించుకోవడం లేదు. పక్కనే ఆ పథకం ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండడంతో నిత్యం కుళాయిలకు నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ట్యాప్లు సక్రమంగా అమర్చక పోవడంతో నీరంతా వృథా అవుతుంది. కేవలం వెయ్యి రూపాయలు ఖర్చు చేసి ట్యాప్లను బాగు చేస్తే నీటి వృథాను అరికట్టవచ్చు. కానీ పట్టించుకునే వారే కరువయ్యారు. -
● రైతులకు మేలు చేయాల్సింది పోయి
వాస్తవానికి ఈ ఉద్యాన క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తే ఇక్కడే నాణ్యమైన కొబ్బరి, అంటుమామిడి, జీడి, సపోట, పనస తదితర మొక్కలు తక్కువ ధరకు రైతులకు అందిచి రైతులకు ఎంతో మేలుచేసే వీలుంది. కొబ్బరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గానీ, రీసెర్చ్ సెంటర్ గానీ, కృషి విజ్ఞాన కేంద్రం గానీ ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. గతంలో ప్రతిపాదనలు, పరిశీలనలు కూడా జరిగాయి. రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ చివరగా ఉన్న ఈ ఏరియాలో ఉద్యాన పంటలకు సంబంధించి ఏ అవసరాలైనా సుదూరం వెళ్లి తీర్చుకోవాల్సి వస్తోంది. మొక్కల దగ్గరి నుంచి సలహాల వరకు ఎక్కడికో వెళ్లాల్సి వస్తోంది. ఆ అవసరాలన్నీ దగ్గరలో తీరేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సింది పోయి ఏకంగా ఆ భూములనే ఉద్యానవన శాఖ నుంచి లాక్కునేందుకు ప్రయత్నించడం విస్తు గొలుతోంది. -
దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
మందస: దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని విభిన్న ప్రతిభావంతుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ అధ్యక్షుడు ఆవుల వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల మోహన్రావు డిమాండ్ చేశారు. ఆదివారం మందసలో జిల్లా కమిటీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ రీ వెరిఫికేషన్ జరిగినా చాలామంది దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు రావడం లేదన్నారు. వివాహంతో సంబంధం లేకుండా అర్హత కలిగిన దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మందస మండల నూతన కమిటీ అధ్యక్షుడు ముంజేటి దేవదాస్, అందాల ఆవేష్, ఉపాధ్యక్షులు జట్టు హేమావతి, ప్రధాన కార్యదర్శి ఫిస్టు ఝాన్సీ, సభ్యులు తెప్పల పాపారావు, మామిడి జానకి, బి.జె.పి కార్యవర్గ సభ్యులు పొందర దుదిష్టి, సింహాచల మహంతి, అడ్డి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒడిశాకు ఇసుక అక్రమ రవాణా పాతపట్నం: ఒడిశాకు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్కులు పట్టపగలే ఆంధ్ర నుంచి ఒడిశాకు ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక తరలించుకుపోతున్నారు. పాతపట్నం, బైదలాపురం మీదుగా పర్లాకిమిడి(ఒడిశా)లోకి ఈ రవాణా జరుగుతోంది. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలోగ్గడంతో పాటు కొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతూ అక్రమ రవాణాను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కువ శాతం టాక్టర్లు ద్వారా ప్రతి రోజు తెల్లవారు జామున 4 గంటల నుంచి రాత్రి 8గంటల అక్రమంగా తరలిస్తున్నారు. హిరమండలం మండలం భగీరథపురం, కొత్తూరు మండలం నివగాం, పొట్నూరు వద్ద వంశధార నదిలో ఇసుకను ట్రాక్టర్లు ద్వారా రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. సముద్రస్నానానికి వెళ్లి వ్యక్తి మృతి సంతబొమ్మాళి: భావనపాడు సముద్రతీరంలో స్నానానికి దిగి టెక్కలికి చెందిన బినాయక్రావు పట్నాయక్ పక్కి(నరేష్)(36) ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. విశాఖపట్నం పెద్దగంట్యాడకు చెందిన నరేష్ జీవనోపాధి కోసం టెక్కలిలో కారు మెకానిక్గా పనిచేస్తూ నివాసం ఉంటున్నాడు. ఆదివారం తోటి స్నేహితులు బెహరా శరత్, కోనారి మణి, నవీన్తో కలిసి భావనపాడు తీరానికి ద్విచక్ర వాహనంపై వచ్చారు. సముద్రంలో స్నానానికి దిగి లోపలకి వెళ్లగా అలల తాకిడికి నరేష్ మునిగిపోయాడు. మైరెన్ పోలీసులు గాలించగా రాత్రి 8 గంటల ప్రాంతంలో మృతదేహం తీరానికి చేరింది. నరేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నౌపడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇక పని సరి!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రైతులకు మేలు చేసే భూములపై పెద్దల కన్ను పడింది. ఉద్దానం ఏరియాలోని ప్రధాన ప్రదర్శన క్షేత్రం భూములను కాజేసేందుకు వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి. ఆ భూములను ఏపీఐఐసీ ద్వారా సేకరించి, ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి, తద్వారా పరిశ్రమల పేరుతో కీలక నేత అనుయాయులకు కట్టబెట్టేందుకు పావులు కదులుతున్నా యి. దానికోసం జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నా రు. మూడు సార్లు వరుసగా గెలిపించిన ఇచ్ఛాపురం నియోజకవర్గ రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఉద్దానం కొబ్బరికి ఎసరు.. కవిటి మండలం రాష్ట్రంలో రెండో కోనసీమగా కొబ్బరిసాగులో గుర్తింపు పొందింది. జిల్లా తలసరి ఆదాయంలో ఉద్దానం కొబ్బరి ముఖ్యభూమిక పో షిస్తోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న కొబ్బరిపంట సాగులో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కొబ్బరి రైతుకు ఆందోళన కలిగించేలా ఉన్నా యి. జిల్లాలో 35,000 హెక్టార్లలో సాగులో ఉండగా కవిటి పరిసర మండలాల్లోనే సుమారు 17,000 హెక్టార్ల వరకు సాగవుతోంది. కొబ్బరి, జీడి రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం పనిచేయడం లేదు. మద్దతు ధర ఇచ్చేలా ప్రయత్నించడం లేదు. కానీ ఆ రైతులకు ఉప యోగపడే ఉద్యాన ప్రదర్శన క్షేత్రం భూములను మాత్రం బదలాయించేందుకు యత్నిస్తోంది. చరిత్రను కనుమరుగు చేసే యత్నం ఉద్యానవన రైతులకు మేలైన రకాల మొక్కలు అందించాలనే లక్ష్యంతో 1994లో కవిటి మండలం శిలగాం సమీపంలో ప్రదర్శన క్షేత్రం(నర్సరీ)ని ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన క్షేత్ర భూములన్నీ ఉద్యానవన శాఖ కంట్రోల్లోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి కొబ్బరి, జీడి, మామిడి, పనస, జామ, సపోట మొక్కలను రైతులకు అందజేస్తూ వస్తోంది. వచ్చిన ఫలసా యాన్ని కూడా వేలం వేసి, ఉద్యానవన శాఖకు ఆదాయం తీసుకొచ్చేది. 20.95 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ ఉద్యాన క్షేత్రంలో 335 కొబ్బరిచెట్లు, 360 జీడిచెట్లు, 405 మామిడిచెట్లు, 30 పనసచెట్లు, 100 జామ చెట్లు, 12 సపోటా చెట్లు ఫలసాయం అందించే విధంగా ఉన్నాయి. తాజాగా ఈ ప్రదర్శనా క్షేత్రం భూములను ఏపీఐఐసీ ద్వారా భూమిని పారిశ్రామికీకరణకు బదలాయించేందుకు గుట్టు చప్పుడు కాకుండా శరవేగంగా పావులు కదులుతున్నాయి. హామీకి భంగం–కొత్త ప్లాన్కు సిద్ధం గతంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడే కోకోనట్ ఫుడ్పార్క్ను ఏర్పాటుకు హామీ ఇచ్చిన విషయం విధితమే. కానీ ఆ వాగ్దానం అమలు చేయలేదు. కానీ, ఇప్పుడా భూములనే ఏకంగా బదలాయించేందుకు ప్రయత్నిస్తోంది. పరిశ్రమల విభాగానికి బదలాయించి తర్వాత దీన్ని గుంపగుత్తగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే దురాలోచన స్పష్టంగానే కనిపిస్తోంది. ఇదే ఉద్యాన క్షేత్రంలో భూగర్భ ఊటబావి కూడా ఉంది. భూగర్భ జలవనరుల శాఖ అధికారులు గతంలో చేయించిన ప్రాప్తికి రెండు చెట్ల విస్తారంగా భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించిన విష యం కూడా అప్పట్లో అధికారుల నివేదికలు సిద్ధం చేశారు. ఈ ప్రదేశాల్లో బోర్లు వేస్తే రోజుకు 2500 లీటర్ల నీరు అందించే వీలుందని అంచనాలు కూడా వేయడం జరిగింది. ఇంతటి ప్రాధాన్యత కల ఉద్యా న కొబ్బరి ప్రదర్శన క్షేత్రాన్ని రైతుల ప్రయోజనాలకు తిలోదకాలిచ్చి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రక్రియ ఇక్కడ రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయదలిస్తే.. ప్రభుత్వం నియోజకవర్గానికొక ఎంఎస్ఎంఈ పా ర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తే ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట మండలాలతో పాటు కవిటి మండలంలోని కరాపాడు టోల్ప్లాజా సమీపంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాటిని సేకరించి, పారిశ్రామికీకరణ కోసం పార్క్లు ఏర్పాటు చేయవచ్చు. వాటిని వదిలేసి నియోజకవర్గ కీలక నేతకు చెందిన వ్యక్తుల కన్ను పడిందని శిలగాం ఉద్యానవన క్షేత్రం భూములను ఏపీఐఐసీకి అప్పగించి, వాటిలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి, తద్వా రా సదరు భూములను కావాల్సిన వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పూరితంగా అడుగులు వేస్తున్నా యి. ఈ 20.95 ఎకరాల స్థలాన్ని ఏపీఐఐసీకి బదలాయింపు ప్రక్రియ పూర్తిచేసి అప్పగించేస్తే దాన్ని 99 ఏళ్లకు ఎకరం రూ.రూపాయి వంతున లీజుకు అందించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనలు ఉన్నాయి. ఉద్యానవన శాఖ భూములు.. ప్రైవేటు వ్యక్తుల పాలు ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అత్యంత శ్రేష్టమైన వ్యవసాయ యోగ్యమైన భూమిని కాజేయాలని చూడడం వెనుక కీలక నేత హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. ఇదిలా ఉండగా కవిటి మండలం రాజపురం సబ్స్టేషన్ వెనుక ఉన్న ప్రదేశంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఇచ్చిన డీపట్టా భూములపై కూడా కన్నేస్తే, అక్కడి రైతులు ఎదురుతిరిగారు. ఇప్పుడు ఆ భూములకు సమీపంలోని శిలగాం సమీపంలోని అత్యంత విలువైన ఉద్యాన క్షేత్రంపై దృష్టి పడడం సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. ఉద్యానవన శాఖ భూములు ప్రైవేటు వ్యక్తుల పాలవ్వడం తప్ప రైతులకు మేలు జరిగేది ఉండదనే వాదనలు ఉన్నాయి. ఉద్దానం ఏరియాలోని ప్రధాన నర్సరీ భూములను ఏపీఐఐసీకి కట్టబెట్టేందుకు యత్నం ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా కావాల్సిన వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు పావులు ఆ దిశగా చక్రం తిప్పుతున్న కీలక నేత 20,95 ఎకరాల క్షేత్రం కనుమరుగయ్యే ప్రమాదం -
సూరీడు భగభగ
● మరో రెండు రోజులు ఇదే పరిస్థితి అంటున్న శాస్త్రవేత్తలు ● జిల్లాలో 40డిగ్రీలకు పైబడిన ఉష్ణోగతలు ఎండ తీవ్రతతో ఆమదాలవలసలో నిర్మానుష్యంగా ఉన్న రహదారిఆమదాలవలస: జిల్లాలో భానుడు భగభగలాడుతూ ప్రతాపం చూపుతున్నాడు. గత 5 రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండగా రెండు రోజుల క్రితం సాయంత్రం సమయంలో వీచిన చల్లగాలులు కాస్త జిల్లా ప్రజలకు ఊరటనిచ్చాయి. అయితే ఆదివారం మళ్లీ జిల్లాలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో 40 డిగ్రీలకు ఉష్ణోగత చేరుకుంది. ఉక్కపోతతో తమ ఇళ్లలో ఉండ లేక, బయట తిరగలేక నానా ఇక్కట్లు పడ్డారు. నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకే వరకు ఎండ తీవ్రత కొనసాగక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. క్యుములోనింబస్ మేఘాల ప్ర భావంతో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకశాలు బలంగా ఉన్నప్పటికీ ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందని తెలిపారు.అలాగే మరో రెండు రోజుల్లో రోహిణీ కార్తెలు రాబోతున్నాయని దీంతో మరింత ఎండ ప్రభావం ఎక్కువ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని వారు చెబుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఉష్ణోగ్రతల ప్రభావం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గత ఏడాది కూడా మే నెలలో ఇన్ని రోజుల పాటు ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. శ్రీకాకుళం, రణస్థలం, పాతపట్నం, ఆమదాలవలస, కొత్తూరు ప్రాంతాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరిగిన తేమశాతం వాతావరణంలో వారం రోజులుగా భారీ మార్పు లు కనిపిస్తున్నాయి. పగటిపూట గాలిలో తేమ శాతం 60–65 మధ్య నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు కూడా 41 డిగ్రీలు దాటుతున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు వడగాలులు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పూట కూడా గాలిలో తేమ శాతం 70–75 మధ్య ఉంటోంది. దీనివల్ల రాత్రి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల పైనే నమోదువుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. -
థైరాయిడ్!
వామ్మో..● జిల్లాలో ఏటా పెరుగుతున్న బాధితుల సంఖ్య ● కీళ్లనొప్పులు, డిప్రెషన్, ఊబకాయంతో సతమతం ● నేడు ప్రపంచ థైరాయిడ్ డే ఇచ్ఛాపురం రూరల్: కొద్దిగా పని చేసినా నిస్సత్తువ ఆవహించడం, చిన్న విషయాలకే కోపం రావడం, ముఖం ఉబ్బుగా కనిపించడం, చర్మం పొడిబారడటం, కీళ్ల నొప్పులు వేధించడం, ఊబకాయం రావడం, అకస్మాత్తుగా సన్నబడటం వంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే ఓసారి పరీక్షించుకోండంటూ వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ప్రతి పది మందిలో ఒకరికి థైరాయిడ్ వ్యాధి వేధిస్తోంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యగా మారి శరీరాన్ని ఛిద్రం చేస్తుంది. ఈ గ్రంథి పనిచేయకపోతే దేహంలోని ఇతర అవయవాల పనితీరు మందగిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై అవగాహన లేక చికిత్సలో జాప్యంతో ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. నేడు వరల్డ్ థైరాయిడ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. ఈ లక్షణాలు కనిపిస్తే.. థైరాయిడ్లో హైపోథైరాయిడిజం (థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం), హైపర్ థైరాయిడిజం (హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం) ప్రధానమైనవి. థైరాయిడ్ నోడ్యూల్స్, గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి వాపు), థైరాయిడ్ క్యాన్సర్ కూడా ఉన్నాయి. అలసట, బరువు పెరడగం, చలి అనుభూతి, జుట్టు రాలడం, నీరసం, డిప్రెషన్, మలబద్ధకం వంటివి హైపోథైరాయిడిజం లక్షణాలు, బరువు తగ్గడం, ఆందోళన, వేగంగా గుండె చప్పుడు, చెమటలు, వణుకు, నిద్రలేమి హైపర్ థైరాయిడిజం లక్షణాలు. గాయిటర్ లేదా నోడ్యూల్స్ ఉన్నవారిలో మెడ వాపు, గొంతులో అసౌకర్యం వంటివి కనిపిస్తాయి. ఇలా కణితి ఉన్న ప్రతి ఒక్కరికీ ఆపరేషన్ అవసరం లేదు. క్యాన్సర్గా మారితేనే ఆపరేషన్ చేయించుకోవాలి. గడ్డలు ఏర్పడ్డ వారిలో 5 శాతం మందిలో మాత్రమే క్యాన్సర్ కణితులు ఉంటాయి. వీరికి మాత్రమే ఆపరేషన్ చేసి కణితి తొలగించాల్సి ఉంటుంది. కారణాలు.. థైరాయిడ్ సమస్యకు కారణాలు అనేకం. సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల హార్మోన్లు అసమతుల్యం అవుతాయి. తద్వారా థైరాయిడ్ వ్యాధి వస్తుంది. హైపోథైరాయిడిజం సాధారణంగా ఆటోఇమ్యూన్ రుగ్మతలు, అయోడిన్ లోపం, థైరాయిడ్ శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీతో గానీ, కొన్ని రకాల మందులతో వస్తుంది. హైపర్ థైరాయిడిజం గ్రేవ్స్ డిసీజ్, థైరాయిడ్ గ్రంథి వాపు వస్తుంది. జన్యు కారణాలు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, గర్భం/ ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పులు కూడా థైరాయిడ్ సమస్యలకు కారణం. అయోడిన్ లోపం గానీ, అధికంగా ఉన్నా దీని బారినపడతారు. నివారణ ఇలా.. థైరాయిడ్ సమస్య వస్తే సమతుల ఆహారం, అయోడిన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు (సీఫుడ్, పాల ఉత్పత్తులు, అయోడైజ్డ్ ఉప్పు) తీసుకోవాలి. వైద్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా సహాయపడతాయి. చికిత్సలో హైపోథైరాయిడిజం కోసం లెవోథైరాక్సిన్ వంటి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, హైపర్ థైరాయిడిజం కోసం యాంటీథైరాయిడ్ మందులు, రేడియో అయోడిన్ థెరపీ, శస్త్రచికిత్స ఉన్నాయి. థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారి శస్త్ర చికిత్స, కిమోథెరపీ గానీ రేడియేషన్ గానీ అవసరం కావచ్చు మహిళల్లోనే అధికం.. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పురుషుల కంటే 58 రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా గర్భం, ప్రసవం తర్వాత, రుతుక్రమం ఆగిన తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో హైపోథైరాయిడిజం, హైపర్థైరాయిడిజం మాతా,శిశు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. జిల్లాలో థైరాయిడ్ బాధితులు అధికంగా ఉండటంతో ప్రతీ పీహెచ్సీలో థైరాయిడ్ పరీక్షలు అందుబాటులో ఉంచాలని రోగులు కోరుతున్నారు. థైరాయిడ్ సమస్య ఉన్న గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు వాడాలి. పుట్టబోయే బిడ్డకు కూడా పరీక్ష చేయించాలి. థైరాయిడ్ ఉందంటే మందులు వాడాలి. లేకపోతే బుద్ధిమాంద్యం వచ్చే అవకాశాలు అధికం. – డాక్టర్ ఎ.రమ్యారెడ్డి, వైద్యాధికారి, ఈదుపురం సమాజంలో 11 శాతం మందిలో హైపోథైరాయిడ్, రెండు శాతం మందిలో హైపర్ థైరాయిడ్ సమస్య ఉంది. ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే ఇబ్బందులు రాకుండా చేయవచ్చు. జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడాలి. – డాక్టర్ దల్లి సురేష్రెడ్డి, ఎండీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, ఇచ్ఛాపురం -
ఆకలి కడుపుల సాహిత్యమే ముఖ్యం
● సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో జనసాహితి 13వ మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జన సాహితి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి.అరుణ ఆహ్వానం మేరకు అఖిల భారత ప్రజా సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి రవిబాబు జనసాహితీ పతాకాన్ని ఆవిష్కరించారు. జనసాహి తి అధ్యక్షులు దివి కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ యు ద్ధం సర్వకాలీనం–శాంతి మధ్య మధ్యలో విరామం అన్న చర్చిల్ మాటలు నేడు వాస్తవంగా తయా రయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కడుపు నిండిన వారి కోసం వచ్చే ప్రేమ సాహిత్యం వేదాంత సాహిత్యం కంటే ఆకలి కడుపుల కోసం రాసిన సాహిత్యం విలువైనదని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘అల్లూరి సీతారామరాజు’ బురక్రథ, ‘యుద్ధం ఓ వినాశనం’ నాటిక, యుద్ధానికి వ్యతిరేకంగా కలకత్తా ముందడుగు సంస్థ వారి ’స్లైడ్షో’, గోర్కి నవల ’అమ్మ’ ఆధారంగా కలకత్తా సౌవిక్ సాంస్కృతిక చక్ర వారి నాటక ప్రదర్శనలు జరిగాయి. సభలో డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి రచించిన ‘సాహిత్య సమాలోచన’ పుస్తకాన్ని జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జన సాహితి ప్రచురించిన ‘మా బాల్యం’ పుస్తకాన్ని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్, ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.వేణుగోపాల్, ‘ఐఎంఎఫ్ అప్పు పతన సంస్కృతి ముప్పు’ పుస్తకాన్ని జనసాహితి రాష్ట్ర కోశాధికారి డాక్టర్ శాంతి కుమార్, ‘తరగతి గది నా ఆచరణ’ పుస్తకాన్ని అంకురం సినిమా దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, ‘సరిహద్దులు ఎరుగని స్వప్నాలు’ అనే పుస్తకాన్ని జన సాహితి రాష్ట్ర నాయకులు డాక్టర్ జీవీ కృష్ణయ్య ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ చేస్తున్న దృశ్యం -
ఇసుక బళ్లు ఆపుతారా.. లేదా..?
శ్రీకాకుళం పాత బస్టాండ్ : దూసి, ముద్దాడ పేట అక్రమ ఇసుక క్వారీల ద్వారా భారీ వాహనాలతో విశాఖపట్నం ఇతర ప్రాంతాలకు వెళుతున్న భారీ ఇసుక వాహనాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాగోలు పంచాయతీ బావాజీ పేట గ్రామ ప్రజలు దూసి–రాగోలు రోడ్డు మధ్యలో ఉన్న బావాజీపేట జంక్షన్ వద్ద శనివారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రెండేళ్లుగా ఇసుక వాహనాలు తిరుగుతుండడంతో దారి ధ్వంసమైందని వారంతా వాపోయారు. పాడైన రోడ్డుకు మరమ్మతులు చేసేందుకు అధికారులు ముందుకు రావడం లేదని తెలిపారు. ఈ ఇసుకతో కోట్లు గడిస్తున్న నాయకులు రోడ్లను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదిసార్లు కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశా మని తెలిపారు. ప్రతి రోజు వందలాది పెద్ద లారీలు ఈ రోడ్డు మీదుగా వెళ్లడం వల్ల ధూళి విపరీతంగా వస్తుందని, రోడ్డంతా గోతులుగా మారిందని వారు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను నిలువరించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, పాడైపోయిన రోడ్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాతో దూసి, ముద్దాడ పేట గ్రామాల నుంచి వస్తున్న ఇసుక లారీలు, ట్రాక్టర్లు రహదారిపై నిలిచిపోయాయి. -
ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: గుజరాతిపేటకు చెందిన సూర సరస్వతమ్మ (72) మృతి చెందడంతో ఆమే నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు ఎస్ఎస్ఆర్కె శ్రీనివాస్, పి.వైకుంఠరావు, కూన భాస్కరరావు నిర్ణయించుకొని నేత్రదాన మోటివేటర్ మల్లా కళ్యాణ్ చక్రవర్తి ద్వారా రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, నంది ఉమాశంకర్ల ద్వారా ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదాతలు 78426 99321 నంబరుకు సంప్రదించాలని వారు కోరారు. మందస పోస్టుమాస్టర్కు అవార్డు మందస: మందస మండల పోస్టుమాస్టర్ దాసరి భాస్కరరావు 2025–26 సంవత్సరంలో శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలో 2,279 పొదుపు ఖాతాలు తెరిపించి ప్రథమ స్థానంలో నిలిచారు. దీంతో ఎక్స్లెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. వృత్తిపై నిబద్ధత, కార్యాచరణ, ప్రజలకు సేవలు అందించడంతో ఈ అవార్డు వరించింది. జిల్లా కేంద్రంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో పోస్టల్ సూపరింటెండెంట్ చేతుల మీదుగా భాస్కరరావు అవార్డుఅందుకున్నారు. కల్వర్టును ఢీకొని వ్యాన్ డ్రైవర్ మృతి టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం జర్జంగి గ్రామ సమీప జాతీయ రహదారిపై శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామానికి చెందిన కేశవరపు చరణ్ సతీష్ నాగేంద్ర(35) తన వ్యాన్లో కటక్ నుంచి పాలకొల్లు వైపు వెళ్తుండగా కోటబొమ్మాళి మండలం జర్జంగి గ్రామ సమీపంలో గరీబుల గెడ్డ వద్దకు వచ్చేసరికి నిద్రలోకి జారుకోవడంతో సమీపంలో ఉన్న కల్వర్టును ఢీకొట్టాడు. ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు స్పందించి కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. కోటబొమ్మాళి పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పురుగుమందు తాగి వృద్ధుడు ఆత్మహత్య బూర్జ: చీడివలస గ్రామానికి చెందిన రామానుజ అప్పారావు(80) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పారావు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మనస్తాపం చెంది ఈ నెల 22న పశువుల శాలలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుమారుడు రామానుజ సింహాద్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎం.ప్రవళ్లిక తెలిపారు. ఉరి వేసుకుని ఆటోడ్రైవర్ ఆత్మహత్య వజ్రపుకొత్తూరు రూరల్: నువ్వలరేవు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బెహరా కేశవ(36) శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన కేవశ ఆటోను నడుపుతూ జీవనోపాధి సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై భార్య బెహరా హిమలతో గొడవపడుతుండేవాడు. ఉదయం 6 గంటల సమయంలో భార్య హిమల స్నానానికి వెళ్లి ఇంటికి వచ్చే సరికి కేశవ ఇంట్లో ఉన్న సిలింగ్ ఫ్యాన్కి ఉరి వేసుకున్నాడు. తల్లి యర్రమ్మ గమనించి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హిమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పొలీసులు తెలిపారు. కేశవకు కుమార్తె జ్యోతి, కుమారుడు ఢిల్లేశ్వరరావు ఉన్నారు. వడదెబ్బతో యాచకుడు మృతి శ్రీకాకుళం క్రైమ్: జిల్లాకేంద్రంలోని డేఅండ్ నైట్ సమీపంలో మెడికల్ సెంటర్ వద్ద ఓ యాచకుడు వడదెబ్బతో శనివారం మృతిచెందాడు. డయల్ 112కి వచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి వెళ్లేసరికి యాచకుడు మృతిచెంది ఉన్నాడని, వడదెబ్బ తగలడంతోనే ఇలా జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఎస్ఐ రామారావు కేసు నమోదు చేశారు. -
చదువుదాం.. ఆటల్లో అదరగొడదాం!
శ్రీకాకుళం న్యూకాలనీ : క్రీడా పాఠశాలల పిలుస్తోంది. చదువుతూ క్రీడల్లో రాణించేందుకు విద్యార్థులకు గొప్ప అవకాశం కల్పిస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 4, 5, 6వ తరగతుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వైఎస్సార్ హయాంలో.. ప్రతిభ కలిగిన పేదవారు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి రాష్ట్రంతోపాటు కడపలో స్పోర్ట్స్ స్కూల్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్పోర్ట్స్ స్కూల్లో చదివిన విద్యార్థులు వివిధ క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న క్రీడాకారులు ఎంతో మంది ప్రతిభ చాటి ఉన్నతస్థాయికి వెళ్లారు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొంది రాణిస్తున్నారు. జూన్ 2 వరకు గడువు.. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను మే 19 నుంచి జూన్ 2వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 75 సీట్లకుగాను 4వ తరగతిలో 40 సీట్లు ఉన్నాయి. బాలురుకు 20, బాలికలకు 20 ఉంటాయి. 5వ తరగతిలో మొత్తం 23 సీట్లకు గాను బాలురు 6, బాలికలు 17 మంది, 8 తరగతిలో 12 సీట్లకుగాను బాలురు 4, బాలికలను 8 మందిని క్రీడా పాఠశాలకు తీసుకుంటారు. ఎవరు అర్హులంటే.. ● 4వ తరగతిలో ప్రవేశానికి మూడవ తరగతి పూర్తి చేసి 8 నుంచి 10 ఏళ్లలోపు ఉండాలి. ● 5వ తరగతి అభ్యర్థులు 4వ తరగతి పూర్తి చేసి 9 నుంచి 11 ఏళ్ల లోపు ఉండాలి. ● 6 తరగతిలో ప్రవేశానికి 5వ తరగతి పూర్తి చేసి 10 నుంచి 12 ఏళ్ల లోపు ఉండాలి. ● తెలుపు రేషన్ కార్డు కలిగి ఉండాలి. షెడ్యూల్ ఇదే.. జిల్లాస్థాయి ఎంపికలు జూన్ 7, 8 తేదీల్లో శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న జాబితాను విడుదల చేస్తారు. జూన్ 11న ఎంపికై న విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలకు సమాచారం అందిస్తారు. జూన్ 14, 15 తేదీల్లో కడపలోని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయి. ఎంపికల్లో జరిగే టెస్టులు ఇవే... క్రీడా పాఠశాల ఎంపికలకు విద్యార్థులకు మొత్తం 9 రకాల టెస్టులను నిర్వహించనున్నారు. ఇందులో ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాండ్ జంప్, వర్టికల్ జంప్, మెడిసిన్ త్రోబాల్, 800 మీటర్ల పరుతో పాటు వివిధ టెస్టులు నిర్వహిస్తారు. క్రీడల్లో ప్రతిభ కలిగిన పేద క్రీడాకారులకు గొప్ప అవకాశమని, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్బాబు సూచిస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం జూన్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం జూన్ 7, 8 తేదీల్లో శ్రీకాకుళంలో జిల్లా స్థాయి ఎంపికలు చదువుతూ క్రీడల్లో రాణించేందుకు గొప్ప అవకాశం -
రేపటి నుంచి సార్వత్రిక ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
శ్రీకాకుళం: జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలతో పాటు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ పరీక్షలకు రెగ్యులర్ సప్లిమెంటరీ విభాగం నుంచి 1,664 మంది, ఓపెన్ స్కూల్ విభాగం నుంచి 1,460 మంది చొప్పున, మొత్తం 3,124 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. టెక్కలి: సంతబొమ్మాళికి చెందిన మాజీ సర్పంచ్ కళింగపట్నం లక్ష్మీ, అప్పారావు దంపతుల కుమారుడు కళింగపట్నం ప్రభుకుమార్ అత్యంత సాహసమైన ఉమ్లింగ్ లా శిఖరాన్ని అధిరోహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. మే 5న ద్విచక్రవాహనంపై మొదలుపెట్టిన ఈ సాహసయాత్ర సుమారు 16 రోజులు కొనసాగింది. చివరగా లడక్ లోని 19,024 ఎత్తులో ఉన్న ఈ శిఖరాన్ని అధిరోహించారు. ఈ సందర్భంగా సంతబొమ్మాళి వాసులతో పాటు పలువురు ప్రభుకుమార్ను అభినందించారు. శ్రీకాకుళం క్రైమ్ : దర్యాప్తు అధికారులు (ఐవోలు), పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (పీపీలు) మధ్య సమన్వయం పెంపొందించి కేసుల దర్యాప్తు, విచారణలను వేగవంతం చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసులతో పాటు పీపీలతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోక్సో కేసుల దర్యాప్తు, అభియోగపత్రాలు (ఛార్జిషీట్లు) దాఖలులో పాటించాల్సిన జాగ్రత్తలు, కోర్టు సమన్లు సకాల అమలు, గ్రేవ్ కేసులు, నాన్బెయిల్బుల్ వారెంట్ల అమలుపై సమీక్షించారు. సైబర్ ఆర్థిక నేరాల్లో బాధితులు కోల్పోయిన నగదును కోర్టుల ఆదేశాల మేరకు తిరిగి పొందేలా చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు ముమ్మరం చేయాలని, హిట్ అండ్ రన్ ప్రమాద కేసుల్లో పురోగతి సాధించి దర్యాప్తు పూర్తిచేయాలన్నారు. పరారీలో ఉన్న ముద్దాయిలను గుర్తించి చార్జిషీటు దాఖలు చేయాలన్నారు. -
సాంఘిక శాస్త్ర సిలబస్ భారం తగ్గించాలి
శ్రీకాకుళం: విద్యార్థుల అభ్యసన స్థాయిని దృష్టిలో పెట్టుకొని సాంఘిక శాస్త్ర సిలబస్ భారం తగ్గించాలని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు, సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ పప్పల వేణుగోపాల్లకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.కేశవరావు, బాడాన రాజు మాట్లాడుతూ ఇతర సబ్జెక్టులతో పోల్చితే అన్ని తరగతులలో విద్యార్థుల పాలిట పెనుభారంగా మారిన సాంఘిక శాస్త్ర సిలబస్ను తగ్గించాలని కోరారు. 6వ తరగతిలో 16 పాఠాలు, 7వ తరగతిలో 22 పాఠాలు, 8వ తరగతిలో 16 పాఠాలు, 9వ తరగతిలో 20 పాఠాలు, 10వ తరగతిలో 22 పాఠాలుతో మొత్తం 2553 పేజీలను ఒకే ఉపాధ్యాయుడు ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. సీబీఎస్ఈ అమలులో ఉన్న రాష్ట్రాలలో సాంఘిక శాస్త్ర బోధనకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండడాన్ని వారు గుర్తు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పబ్లిక్ పరీక్షల బ్లూ ప్రింట్ విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఆర్.అన్నాజీ రావు, సుబ్రహ్మణ్యం, మూర్తి, టి.రమణ, రామారావు, ఈశ్వర రావు, ధనలక్ష్మి, లక్ష్మణ రావు, సుధాకర్, సూర్యనారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల పెన్షన్లకు
రాజకీయ పక్షపాతానికిపచ్చపాతకంపై కోర్టు ఉక్కుపాదంతన మన బేధం చూపకుండా సంక్షేమం అందించడం నాయకుడి లక్షణం. గెలిచాక రాజకీయ భేదాలు పక్కన పెట్టి సామాన్యులకు సేవ చేయడం ప్రజా ప్రతినిధి కర్తవ్యం. కానీ ఇచ్ఛాపురంలో దీనికి వ్యతిరేకంగా జరుగుతోంది. సాక్షాత్తు అక్కడి ఎమ్మెల్యే కొందరి పింఛన్లను ఆపేయాలని ఆదేశించారు. ఆ కాసిన్ని డబ్బులు వారి చేతిలో పడకుండా అడ్డుకున్నారు. కానీ ఆఖరకు న్యాయమే గెలిచింది. హైకోర్టుకు వెళ్లిన బాధితులు తమ పింఛన్లను తిరిగి పునరుద్ధరించుకున్నారు. నా పేరు పేరు దల్లి రామకృష్ణ. మాది మశాఖపురం గ్రామం.మూడేళ్ల క్రితం అనారోగ్యం బారినపడి నరాలు చచ్చుబడటంతో దివ్యాంగుడియ్యాను. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వికలాంగుల పింఛన్ మంజూరైంది. నేను ఇక్కడి వాడినే అయినా ఒడిశాకు చెందిన వాడిని అంటూ స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే అశోక్కు ఫిర్యాదు చేసి పింఛన్ నిలిపివేశారు. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు మా తరఫున న్యాయ పోరాటం చేసి పింఛన్ పునరుద్ధరణకు కృషి చేశారు. నా పేరు బాకి కురమ్మ. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నాకు వితంతు పింఛన్ మంజూరు చేయగా, వైఎస్సార్ సీపీకి ఓటు వేశానన్న నెపంతో ఒడిశాకు చెందిన మహిళా అంటూ టీడీపీ నాయకులు ఎమ్మెల్యే అశోక్కు నాపై ఫిర్యాదుచేసి పింఛన్ ఆపేశారు. మా గ్రామానికి చెందిన నడిరెడ్ల చిరంజీవి, రంగాల జానీ తదితరులు కృషితో కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నా పేరు కన్నిండి మోహినమ్మ. పన్నెండేళ్ల క్రితం నా భర్త మృతి చెందాడు. అప్పటి నుంచి నాకు వితంతు పింఛన్ వస్తోంది. వైఎస్సార్ సీపీకి ఓటు వేశాననే నెపంతో నేను ఒడిశాకు చెందిన మహిళా అంటూ పింఛన్ నిలిపివేశారు. ఆంధ్రా రాష్ట్ర, శ్రీకాకుళం జిల్లా, మశాఖపురం గ్రామవాసిగా అన్ని అర్హతులు చూపించినప్పటికీ అధికారులు కనికరించలేదు. ఇప్పుడు న్యాయం గెలిచింది. ఒంటరి మహిళ పింఛన్ పొందుతున్న నాపేరు అర్తికట్ల లోలమ్మ. నా కుమార్తె చామంతికి పెళ్లిచేసి అత్తారింటికి పంపించాను. అయితే నా కుమార్తె చామంతి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. రాజకీయ కక్షతో నా పింఛన్ ఆపేశారు. దేవుడు ఉన్నాడు, ఒంటరి మహిళైన నన్ను ఆదుకునేందుకు న్యాయం గెలిచింది. ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పేదలే గెలిచారు. రాజకీయ కక్షతో నేతలు వారి పింఛన్లను ఆపేసినా హైకోర్టు వరకు వెళ్లి తమ హక్కును దక్కించుకున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అర్హతల ఆధారంగా ఇచ్ఛాపురం మండలం మశాఖపురం గ్రామానికి చెందిన బాకి కురమ్మ(వితంతువు), దల్లి రామకృష్ణ(దివ్యాంగుడు), ఆశి దాలమ్మ(ఒంటరి మహిళ), కన్నిండి మోహినమ్మ(వితంతువు), అర్తికట్లు లోలమ్మ(ఒంటరి మహిళ)లకు సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేశారు. ఎన్నికల అనంతరం అధికార మార్పు తర్వాత రాజకీయ కారణాలతో వీరంతా వైఎస్సార్సీపీ సానుభూతిపరులు అంటూ స్థానిక సర్పంచ్ వినతి మేరకు అప్పటి ఎంపీడీఓ ఐదుగురు పింఛన్ దారులకు 2024 ఆగస్టు 28న నోటీసులు జారీ చేశారు. అధికారుల చుట్టూ తిరిగి.. పింఛన్లు కోల్పోయిన వారంతా దీనులు. అర్హతా పత్రాలతో పలుమార్లు ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు స్పందించలేదు. అధికారులు కూడా ‘ఎమ్మెల్యే వద్దకు వెళ్లి బతిమాలండి’ అంటూ సలహా ఇచ్చారు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం బాధితులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అనర్హతలను నిర్ధారించే సరైన విచారణ లేకుండానే పింఛన్లు నిలిపివేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టినట్లు సమాచారం. సంక్షేమ పథకాలను రాజకీయ కోణంలో చూడకూడదని, పేదల హక్కులను హరించేలా వ్యవహరించడం సరికాదని అధికారులకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. ఐదు మంది లబ్ధిదారులకు సంబంధించి 12 వారాల్లోగా పెండింగ్ పింఛన్లను చెల్లించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు, ఇచ్ఛాపురం మండలాభివృద్ధి అధికారికి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బెందాళం అశోక్ పేదల పింఛన్లు ఆపడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికలు ముగిసి అధికారం దక్కాక కూడా రాజకీయాలు చేయడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు తీర్పు అధికార పార్టీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ వ్యవహార శైలికి చెంప పెట్టులా మారిందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి మండిపడ్డారు. మశాఖపురం గ్రామానికి చెందిన ఐదు మంది పింఛన్దారులు గతంలో పింఛన్ పొందేవారని తెలుస్తోంది. అన్యాయంగా పింఛన్ తొలగించారంటూ న్యాయం స్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు తీర్పు బాధితులకు అనుకూలంగా వచ్చింది. కోర్టు తీర్పును గౌరవిస్తూ, అమలుపరుస్తాం. అయితే ప్రస్తుత సమస్య నా పరిధిలో లేకపోవడంతో మాపై ఉన్నతాధికారులు సూచనలు మేరకు చర్యలు తీసుకుంటాం. – ఎ.ప్రభాకరరావు, ఎంపీడీఓ, ఇచ్ఛాపురం ‘పింఛన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదని, గౌరవంగా జీవితాన్ని కొనసాగించే సామాజిక భద్రత హక్కు అని, సామాజిక సంక్షేమ పింఛను పథకాల ప్రధాన ఉద్దేశం, నిరుపేదలు, బలహీన తరగతులకు ఆర్థిక ఆసరా కల్పించడమే’ అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘మీరు మీ పింఛన్ అర్హతను తగు ఆధారాలతో 2024 ఆగస్టు 30న హాజరై పత్రాలు సమర్పించాలని, 2024 ఆగస్టు14న స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మీకు నోటీసులు జారీ చేస్తున్నాం’ అంటూ 2024 ఆగస్టు నుంచి పింఛన్లు ఆపేశారు. -
పోటీతత్వం అలవర్చుకోవాలి
వజ్రపుకొత్తూరు: విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలు చేరుకోగలుగుతారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు అన్నారు. పూండిలో శనివారం జరిగిన యువతరం సేవా సమితి ఆరో వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పూండి కేంద్రంగా సమితి ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రతిభకు పట్టాభిషేకం పేరుతో జిల్లాలోని 30 మండలాల్లో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మొదటి రెండు స్థానాల్లో అత్యధిక మార్కులు సాధించిన 68 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో కలిపి సన్మానించారు. రూ.3వేలు, రూ.2వేలు చొప్పున నగదు బహుమతులు అందించారు. ఇటీవల 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు మండల స్థాయిలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా యువతర సేవా సమితి అందించిన సేవలకు గాను పూండి కేంద్రంగా ఉన్న స్పూర్తి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కెంగువ రాంబాబు రూ.1,04,000 చెక్ను యువతరం సేవా సమితికి అందించారు. కార్యక్రమంలో టెక్కలి ఉప విద్యాశాఖాధికారి పి.విలియమ్స్, ఎంఈఓ బి.వి.రమణ, యువతరం సేవా సమితి అధ్యక్షుడు చింత మురళి, స్ఫూర్తి సేవా సమితి అధ్యక్షుడు కెంగువ రాంబాబు, సేవా సమితి ప్రతినిధులు సునీల్, పృథ్వీ, రవి, రమేష్, నిహాల్, అపర్ణ, విఘ్నేష్, పుష్పలత, ఎల్.లత, జి.వెంకటరమణ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
కుదేలైన రైతులు!
ఈదురు గాలులు..రణస్థలం: ఎచ్చెర్ల నియోజకవర్గంలో శుక్రవారం వీచిన ఈదురుగాలులు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. అరటి, కొబ్బరి, మొక్కజొన్న, బొప్పాయి పంటలు నేలకొరిగి తీరని నష్టాన్ని మిగిల్చాయి. లావేరు, రణస్థలం మండలాల్లోని గోసాం, వెంకటరావుపేట, నగరప్పాలెం, వల్లభరావుపేట తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో అరటి, బొప్పాయి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. జి.సిగడాం : ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో అకాల వర్షం, ఈదురుగాలులు రైతులను కుదేలు చేశాయి. ఉల్లివలస, ఎల్లయ్యపేట, జాడ, వెంకయ్యపేట, పున్నాం గ్రామాల్లో సుమారు 50 ఎకరాలలో అరటి పంట నేల పాలయ్యింది. ఎకరాకు సుమారు రూ.80 వేలు మదుపులు పెట్టామని, పంట చేతికొస్తున్న సమయంలో ఇటువంటి గాలులు రావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఎచ్చెర్ల : మండలంలో శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు చెట్లు, స్తంభాలు ఒరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, రేకులు విరిగిపడి ఉన్నాయి. దీంతో వీటిని సరిచేయడానికి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎచ్చెర్ల మండల కేంద్రం, విద్యుత్ కార్యాలయం, ఆర్టీవో కార్యాలయానికి వెళ్లిన రహదారిలో, కొయ్యాం రహదారి పొడవునా చెట్లు, స్తంభాలు వైర్లపై కూలిపోయాయి. -
అందుబాటులోకి అధునాతన నెట్స్
● శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో రూ.17 లక్షలతో ఏర్పాటు ● జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నేడు ప్రారంభం శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లాలో క్రికెట్ క్రీడాభివృద్ధికి జిల్లా క్రికెట్ సంఘం వడివడిగా అడుగులు వేస్తోంది. క్రీడాకారులు రాణించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు, వసతులను సమకూర్చే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే మహిళా క్రికెట్ ఉన్నతి కోసం శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో రూ.11లక్షల వ్యయంతో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బాలికలు వేసవి క్రీడా శిక్షణా శిబిరాల పేరిట నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపులో కఠోర సాధన చేస్తున్నారు. పురుషుల కోసం అత్యాధుని సదుపాయాలతో క్రికెట్ నెట్స్ను ఏర్పాటు చేశారు. రూ.17 లక్షల నిధులతో నెట్స్.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఆర్ఐఓ ఆఫీసు, జిల్లా క్రికెట్ సంఘం కార్యాలయానికి ఆనుకుని సుమారు రూ.17 లక్షల నిధులతో అత్యాధునిక హంగులతో క్రికెట్ నెట్స్ను ఏర్పాటు చేశారు. పురుషుల కోసం ఫ్లడ్లైట్ల వెలుతురుతో, అత్యధిక రనప్తో కూడిన నాలుగు వికెట్లను నిర్మించారు. ఇందులో రెండు టర్ఫ్ వికెట్లు, ఒక యాస్ట్రో టర్ప్ వికెట్, మరొక సిమెంట్ వికెట్ కూడా ఉంది. ఇతరులు లోపలికి ప్రవేశించకుండా ఇనుప రాడ్లు, చువ్వలతో కంచెను ఏర్పాటు చేశారు. ఫ్లోరింగ్కు టైల్స్తోపాటు సరికొత్తగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. త్వరలో జిమ్ను కూడా ఏర్పాటు చేయాలని జెడ్సీఎస్ యోచిస్తున్నారు. నేడు క్రీడాకారులకు అందుబాటులోకి.. జిల్లా కేంద్రంలో పురుషుల కోసం ఏర్పాటుచేసిన క్రికెట్ నెట్స్ను క్రీడాకారుల సాధన కోసం అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు నిర్ణయించారు. ఆదివారం మద్యాహ్నం ఈ నెట్స్ ప్రారంభోత్సానికి జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు కూన రవికుమార్తోపాటు జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరరెడ్డి, ఏసీఏ ప్రతినిధులు తదతరులు హాజరుకాన్నట్టు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి హసన్రాజా షేక్, కోశాధికారి మదినీ శైలానీ, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కౌన్సెలర్ డాక్టర్ ఎస్.రవికుమార్ తెలిపారు. త్వరలో శిక్షణకు వచ్చే క్రీడాకారులకు ఐడీ కార్డులు అందిస్తామని చెప్పారు. -
కొబ్బరి ధరహాసం
ఉష్ణోగ్రతల్లో విపరీతమైన మార్పులు.. పడిపోయిన దిగుబడులు.. ఉద్దానాన్ని వీడని చీడ పీడలు.. కలగలిపి కొబ్బరి నీళ్ల ధరలను విపరీతంగా పెంచాయి. శరీరానికి చలువ చేసే బొండాల ధర రోజురోజుకీ పెరుగుతుండడంతో సామాన్యులు తట్టుకోలేకపోతున్నారు. పట్టణాల్లోనైతే లీటర్ కొబ్బరి నీళ్ల రూ.170పైనే పలుకుతోంది. కంచిలి, హిరమండలం: ఎండలు మండే కొద్దీ కొబ్బరి బొండాల ధరలు ఎగబాకుతున్నాయి. ఉత్పత్తి తగ్గి గిరాకీ పెరగడంతో ధర పెరుగుతోంది. జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో అధికంగా కొబ్బరి ఉత్పత్తి అయ్యేవి. ఇప్పుడు రకరకాల చీడపీడలు ఆశించడంతో భారీగా దిగుబడులు పడి పోయాయి. దీంతో కొబ్బరి బొండాలు సైతం బయట ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే దుస్థితి ఏర్పడింది. దీంతో ధరలు ఎగబాగుతున్నాయి. ఈ నెలలో కొబ్బరి బొండాల వినియో గం రెట్టింపైంది. జిల్లాలో 36వేల హెక్టార్లలో కొ బ్బరి పంట సాగువుతున్నప్పటికీ తగిన దిగుబ డులు లేవు. దీంతో ఇక్కడ ఉత్పత్తి అయ్యే కొబ్బ రితోపాటు విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లా ల నుంచి సైతం దిగుమతి చేసుకుంటున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 40 నుంచి 45కి పెరగడంతో కొబ్బరి బొండాల వినియోగం రెట్టింపైంది. రైతుల నుంచి కొబ్బరి బొండాలను దళారులు తక్కువ ధరలకే కొనుగోలు చేసి రిటైల్ వ్యాపారులకు రూ.30 నుంచి రూ.35కు అమ్మకా లు చేపడుతుండటంతో, కాయ సైజును బట్టి రూ.40 నుంచి రూ.50 వరకు రిటైల్ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇక పట్టణాల్లో అయితే కొబ్బరి నీరు బాటిల్లో నింపి అరలీటరు, లీటరు చొప్పు న అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఒక లీటరు కొబ్బరి నీరు రూ.170 వరకు గరిష్టంగా అమ్ముతున్నారు. ఉత్పత్తులు తగ్గడం కూడా.. ఏప్రిల్, మే నెలలో రావాల్సిన బొండాల దిగుబడి ఇప్పుడు రావడం లేదు. తెల్లదోమ తాకిడి పెరగడం, ఉష్ణోగ్రతల్లో మార్పులు వెరసి ఉత్పత్తి తగ్గిపోయింది. కొబ్బరి బొండాలకు ధర పెరిగినా సేకరణ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బ యట ప్రాంతాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నామని వ్యాపారులు అంటున్నారు. కొబ్బరి బొండాల దిగుబడిపై రైతులు దృష్టి పెట్టాలి. సంప్రదాయ సాగు విధానంలో బొండాం తీస్తే చెట్టు దెబ్బతింటుందనే అపోహ రైతుల్లో ఇంకా ఉంది. కొబ్బరి మొక్క సాగుకు అయ్యే ఖర్చుకు తగిన ఆదాయం లేదు. – ఆళ్ల రామభూపతిరెడ్డి, రైతు, చిల్లపేట రాజాం -
చురుగ్గా విద్యుత్ పునరుద్ధరణ పనులు
అరసవల్లి: ఈదురు గాలుల బీభత్సం వల్ల విద్యుత్శాఖ శ్రీకాకుళం డివిజన్లో శనివారం నాటికి కూడా పలు మండలాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. విద్యుత్శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో సరఫరా ఇవ్వలేకపోయారు. పిడుగుల ధాటికి నాలుగు చోట్ల ఇన్సులేటర్లు పేలిపోవడంతో బ్రేక్డౌన్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనికి తోడుగా లోడ్ డిస్పాచ్ సెంటర్ విజయవాడలో తీసుకున్న నిర్ణయం మేరకు శనివారం ఉదయం నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 132 కేవీ ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో విద్యుత్ సరఫరాను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే నిలిపివేశారు. గాలుల ప్రభావిత మండలాలతో పాటు మిగిలిన ప్రాంతాలలో కూడా శనివారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. రణస్థలం, ఎచ్చెర్ల, పొందూరు మండలాలలో ఆపరేషన్ ఈఈ పైడి యోగేశ్వరరావు ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన కొత్త ఇన్సులేటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఫీడర్ల మరమ్మతులను 33కేవీ, 11కేవీ లైన్ల పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. -
ప్రతి ఓటూ కీలకమే
నరసన్నపేట: ఎన్నికల కమిషన్ అధికారికంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం అత్యంత కీలకమని, ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మన ఓట్లు పోయే ప్రమాదం ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ, ఎస్ఐఆర్ జిల్లా పరిశీలకుడు కుంభా రవిబాబు, రాష్ట్ర పరిశీలకులు హర్షవర్దనరెడ్డి అన్నారు. స్థానిక మేఘనా కన్వెన్షన్లో శనివారం నరసన్నపేట నియోజకవర్గం వైఎస్సార్సీపీ బూత్ స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని కుంభా రవిబాబు అన్నారు. బూత్ ఏజెంట్లే ముఖ్యమని హర్షవర్దన్రెడ్డి అన్నారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 2358 పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవెల్ ఏజెంట్లును నియమించుకున్నామని ధర్మాన కృష్ణదాస్ తెలిపా రు. మంచి ఫలితాలు సాధించాలంటే ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాలని తమ్మినేని సూచించారు. -
బాబుగారూ.. ఇదేనా చెత్తశుద్ధి!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : 2018లో టీడీపీ హయాంలో రూ.27లక్షలతో ఈ కేంద్రాన్ని నిర్మించి నానా హడావుడి చేశారు. అప్పట్లోనూ ప్రారంభించాక గాలికొదిలేశారు. దాని నుంచి పైసా ఆదాయం రాలేదు. తాజాగా స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర పేరుతో మళ్లీ అదే కేంద్రానికి రూ.60లక్షలు ఖర్చు పెట్టి హంగులు సమకూర్చారు. అంతటితో ఆగకుండా ఈ నెల 16న సీఎం అక్కడికొచ్చి సందర్శించి ఫొటోలకు పోజులిచ్చారు. అక్కడొక పెద్ద సినిమా సెట్టింగే ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్మికులను రప్పించి, వారితో చంద్రబాబు మాట్లాడి, సినిమాటిక్ తరహాలో తెగ హడావుడి చేశారు. ముందుగా ఏర్పాటు చేసిన పరికరాలు, కార్మికులు, ఇతర సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడి, వారి నుంచి ఏదో తెలుసుకున్నట్టు లైవ్ కవరేజ్లో తెగ పబ్లిసిటీ చేసుకున్నారు. సీఎం వెళ్లారు..తాళం వేశారు హమ్మయ్యా.. చెత్తనుంచి సంపద సృష్టిస్తారని, ఇక ఆదాయం రావడమే తరువాయి అని అంతా భావించారు. కానీ, ఆ ఆనందం, ఆశలు వెంటనే ఆవిరైపోయాయి. చంద్రబాబు ఇలా వెళ్లగానే అలా మూతపడి పోయింది. ఇప్పుడైతే ఏకంగా తాళం వేసి ఉండటంతో సీఎం పర్యటనతో ప్రత్యేకతను సంతరించుకున్న చెత్త నుంచి సంపద కేంద్రం ఏరియా నిర్మానుష్యమైపోయింది. చంద్రబాబు తీరే అంత.. చంద్రబాబు ఏం చేసినా దానికి ప్రచారం కావాలి. దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి. పర్యటన అయ్యాక ప్యాకప్ చేసేయాలి. అటువంటి ఆలోచన ధోరణితోనే కార్యక్రమాలు చేపడతారు. తాత్కాలిక ఆర్భాటం కోసం హడావుడే తప్ప శాశ్వత అభివృద్ధి అనేది ఆయన హిస్టరీలోనే లేదు. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా శ్రీకాకుళం జిల్లాలో ఒక్కటంటే ఒక్కటీ ఆయన చేసిన అభివృద్ధి, వేసిన మార్క్ అనేది లేకపోవడానికి కారణం ఇదే. ఎంత సేపూ ప్రజల డబ్బుతో ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు పనికొచ్చిందేమీ ఉండదు. అనుయాయులు నాలుగు కాసులు సంపాదించుకోవడానికి చేసే పనులే తప్ప ప్రజలకు, జిల్లాకు మేలు చేసేదేమి ఉండదనేది ఇప్పటికి అనేక సార్లు చూశాం. తాజాగా రూ.60 లక్షలతో హంగులు ఏర్పాటు చేసి, పరిశీలన చేసిన చెత్త నుంచి సంపద కేంద్రం కూడా అలాగే తయారైంది. ఈ ఫొటోలో ఉన్నది ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకొచ్చి సందర్శించిన నరసన్నపేటలోని సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రం(చెత్త నుంచి సంపద కేంద్రం). ప్రస్తుతం మూతపడి ఉంది. దాదాపు రూ.60 లక్షలు ఖర్చు పెట్టి చంద్రబాబు పరిశీలన కోసం సుందరంగా తీర్చిదిద్దిన కేంద్రం ఇప్పుడు వెలవెలబోతోంది. ఆయన జిల్లా నుంచి వెళ్లిపోయాక తాళాలు వేసేశారు. చంద్రబాబు హయాంలో ఆర్భాటం ఎలా ఉంటుందో.. పర్యటన ముగిసాక ఏం జరుగుతుందో చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యమిది. పబ్లిసిటీ తప్ప ‘చెత్త’ శుద్ధి లేదనడానికి ఇదొక నిదర్శనం. నరసన్నపేటలో చెత్త సంపద కేంద్రం తాళాలు తీస్తే ఒట్టు సీఎం చంద్రబాబు వెళ్లిపోయాక మూసివేత రూ.60 లక్షలతో పరిశీలన కోసం హంగులు అనుకున్న పబ్లిసిటీ వచ్చాక మూత విస్తుపోతున్న ప్రజలు -
జూనియర్ లైన్మేన్పై దాడి
వజ్రపుకొత్తూరు రూరల్: పల్లిసారధి గ్రామ సచివాలయంలో విద్యుత్ శాఖ జూనియర్ లైన్మేన్ (జేఎల్ఎం)గా విధులు నిర్వర్తిస్తున్న సీమల సింహాచలంపై అదే గ్రామానికి చెందిన రెయ్యి వాసు దాడికి పాల్పడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. పల్లిసారధిలో తన ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్తంభానికి లైట్ వెలగడం లేదన్న విషయమై వాసు గురువారం సచివాలయానికి వెళ్లాడు. అక్కడ గొడవ పడి జూనియర్ లైన్మెన్ సింహాచలంపై కర్రతో తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వెంటనే తోటి సిబ్బంది పలాస ప్రభుత్వ అసుపత్రికి తరలించి వైద్యం అందించారు. బాధితుడి ద్విచక్ర వాహనాన్ని సైతం ధ్వంసం చేసినట్లు తెలిపారు. తనపై దాడికి పాల్పడిన వాసుపై కేసు నమోదు చేయాలని బాధితుడు సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సంతోషిమాత గుడిలో చోరీ
టెక్కలి రూరల్: టెక్కలి నడిబొడ్డున ఉన్న సంతోషిమాత దేవాలయంలో చోరీ జరిగినట్లు అర్చకులు గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా పరిషత్ రోడ్డులో ఉన్న సంతోషిమాత ఆలయం తలుపులకు వేసి ఉన్న తాళాలను గుర్తు తెలియని వ్యక్తులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. మూడు హుండీల్లోని నగదుని దొంగిలించారు. అమ్మవారి మెడలో పుస్తెలను సైతం చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీలు పరిశీలించి క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరించారు. ఆలయ ఈవో మనస్వి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి తరలిరాగా.. చోరీ నేపథ్యంలో పోలీసులు, క్లూస్ టీం వచ్చినంత వరకు భక్తులను గుడిలోకి రానివ్వలేదు. -
అండర్–19 బాలుర హ్యాండ్బాల్ జట్టు ఎంపికలు రేపు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అండర్–19 బాలుర హ్యాండ్బాల జట్టు ఎంపికలను ఆదివారం నిర్వహించనున్నట్టు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సుంకరి కృష్ణకుమార్, ఎమ్మెస్ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోడరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎంపికలు మొదలవుతాయని చెప్పారు. 2006 జనవరి ఒకటి తర్వాత జన్మించిన బాలురు అర్హులని స్పష్టంచేశారు. ఎంపికై న జిల్లా జట్టును ఏపీ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29 వరకు విజయనగరం వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి అండర్–19 బాలుర హ్యాండ్బాల్ చాంపియన్షిప్ పోటీలకు పంపిస్తామని చెప్పారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం/టెన్త్క్లాస్ జిరాక్స్కాపీ, ఆధార్కార్డు, ఏడు పాస్ఫొటోలతో హాజరై సెలక్షన్ కమిటీ చైర్మన్ కె.రవిశేఖర్ను సంప్రదించాలని కోరారు. వివరాలకు 6304042730 నంబర్ను సంప్రదించాలన్నారు. జిల్లా క్రికెట్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులు చాలా మంది ఉన్నారని.. వారిని మరింతగా ప్రోత్సహించి వెలుగులోకి తీసుకొస్తామని జిల్లా క్రికెట్ సంఘం(జెడ్సీఎస్) నూతన అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. జిల్లా క్రికెట్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. జిల్లా కార్యదర్శిగా హసన్రాజా షేక్, ఉపాధ్యక్షుడిగా టి.బాలమురళీకృష్ణ, కోశాధికారిగా మదినా శైలానీ, కౌన్సిలర్గా డాక్టర్ ఎస్.రవికుమార్, సంయుక్త కార్యదర్శిగా ఎన్జీ బెనర్జీ, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నికై నట్టు పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలోని జిల్లా క్రికెట్ సంఘం కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ వారం రోజుల క్రితం జిల్లాలో పాత సంఘం స్థానంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు చెప్పారు. జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ప్రాతినిధ్యం ఉండేలా చూడా ల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం జి.సిగడాం: ఆనందపురం గ్రామానికి చెందిన పొగిరి సత్యం ఈ నెల 4న అదృశ్యమై శుక్రవారం విగతజీవిగా కనిపించాడు. సత్యం ఈ నెల 4 నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఈ నెల 5న ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం వాండ్రంగి–ఆనందపురం గ్రామాల సమీపంలోని మెట్టు ప్రాంతాలో ఉపాధి వేతనదారులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహానికి రాజాం సామాజిక ఆస్పత్రి వైద్యులు కొత్తకోట సీతారామమూర్తి, వీఆర్ఓ గోక వెంకటరమణ సమక్షంలో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబసభ్యులు అప్పగించినట్లు ఎస్ఐ వెలిచేటి సందీప్కుమార్ తెలిపారు. పోక్సోకేసు నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష రణస్థలం: జె.ఆర్.పురం పోలీస్ స్టేషన్ పరిధిలో రామచంద్రపురం గ్రామానికి చెందిన బాలికను మరువాడ పంచాయతీ టెక్కలి గ్రామానికి చెందిన కోనేటి నవీన్ అనే వ్యక్తి ప్రేమపేరుతో వేధించినట్లు 2019లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై బి.అశోక్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తదుపరి ఎస్సై ఈ.శ్రీనివాస్ చార్జ్షీట్ నమోదు ఫైల్ చేశారు. పబ్లిక్ ప్రొసిక్యూటర్ వి.ఎస్.యు.విశాలాక్షి వాదనలు వినిపించారు. నేరం రుజువైనందున ముద్దాయికి రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, ఐదు వేల రూపాయలు జరిమానా, మరో సెక్షన్లో ఏడాది జైలు శిక్ష, ఐదు వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి ఎన్.సునీత తీర్పు వెలువరించినట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. -
పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తు న్న సిబ్బంది సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యమిస్తామని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అన్నారు. డయల్ యువర్ ఎస్పీ (పోలీస్ గ్రీవెన్స్) ఫోన్–ఇన్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న సిబ్బందితో ఫోన్లో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సైట్ ఇంజినీర్ల రెన్యువల్ నిలుపుదల శ్రీకాకుళం: శ్రీకాకుళం సమగ్ర శిక్షలో సైట్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ముగ్గురికి రెన్యువల్ నిలుపుదల చేస్తూ ఎస్పీడీ బి.శ్రీనివాసరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పని చేస్తున్న ఏడుగురు సైట్ ఇంజనీర్లపై పలు ఆరోపణలు రావడం, దీనిపై ఎస్పీడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ సమయంలో కూడా వీరు సహకరించకపోవడం, కొన్ని ఫైళ్లు కనపడకుండా చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ ఏడుగురిని పక్క జిల్లాకు బదిలీ చేసిన విషయం విదితమే. అనంతరం విచారణ చేపట్టిన ఏపీసీ ఈఈలు నివేదికలను సమర్పించారు. వీటిని పరిశీలించిన ఎస్పీడీ.. ఫైళ్ళు మాయం చేయడం, నిధులు దుర్వినియోగం చేయడం వాస్తవమని నిర్ధారించుకొని ఏడుగురిలో ముగ్గురిని రెన్యువల్ చేయకుండా నిలుపుదల చేశారు. వీరిలో ఎన్.పట్టాభిరామారావు బి.చంద్రమౌళి, పెద్దింటి రామానందం ఉన్నారు. మిగిలిన నలుగురు విషయం ప్రస్తావించలేదు. అయితే విచారణ మరింత లోతుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
తల్లిదండ్రులూ ఇలా చేస్తే మేలు..
● మంచి, చెడులను తల్లిదండ్రులు చిన్నతనం నుంచే వివరిస్తుండాలి. ● పిల్లలతో రోజు కనీసం 20 నిమిషాలైనా గడపాలి. ● స్నేహపూర్వకంగా ఉండాలి. ఏదైనా విషయాన్ని ప్రేమతో వివరించాలి. ● సెల్ఫోన్ దుష్ప్రభావాలను నెమ్మదిగా వివరిస్తే వారు వింటారు. ● సెల్ఫోన్ కారణంగా జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయో వివరించాలి. ● ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అవగాహన పెంచాలి. ● మత్తుపదార్థాల వినియోగం.. దుష్ప్రభావాలు వివరించడం తప్పనిసరి. -
ఇంటింటికీ బీఎల్ఓలు
● ఓటర్ల జాబితా సవరణకు ప్రణాళిక ● జూన్ 15 నుంచి జూలై 14 వరకు నిర్వహణ ● సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రచురణ నరసన్నపేట: జిల్లాలో ఓటర్లు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) నిర్వహణకు అధికార యంత్రాగం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకూ నెల రోజుల పాటు 2358 మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి ఓటర్లు నుంచి వివరాలు నమోదు చేయించి తిరిగి సేకరిస్తారు. 2002లో ఉన్న ఓటర్లు జాబితాను 2025లో ఉన్న జాబితాతో మ్యాప్ చేస్తారు. జులై 21న ముసాయిదా ఓటర్లు జాబితాలను విడుదల చేసి మరో సారి అర్హులైన ఓటర్ల నుంచి నమోదు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇదీ షెడ్యూల్.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ నమోదుకు జిల్లా యంత్రాగం ప్రత్యేక షెడ్యూల్ తయారు చేసింది. ● జూన్ 5 నుంచి 14 వరకూ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ● జూన్ 15 నుంచి జూలై 14 వరకూ బీఎల్ఓలు ఇంటింటా పరిశీలన చేసి వివరాలు సేకరిస్తారు. ● జూలై 14న పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపడతారు. ● జూలై 21న ముసాయిదా ఓటర్లు జాబితాలను విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20 వరకూ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు స్వీకరణ, కొత్తగా నమోదుకు అవసరమైన దరఖాస్తులను స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను సెప్టెంబర్ 18 లోగా పరిష్కరిస్తారు. ● ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత 2002 ఓటర్లు జాబితాలతో అనుసంధానం కాని, అనుసంధానంలో వ్యత్యాసాలు ఉన్న వ్యక్తులకు ఓటర్లు నమోదు అధికారి నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు జారీ చేసిన వ్యక్తుల జాబితాలను అసెంబ్లీ నియోజకవర్గం వారీగా విడుదల చేస్తారు. ముసాయిదాలో పేరు ఉన్న వ్యక్తి వివరాలపై సరైన విచారణ జరపకుండా పేరును తొలగించే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సెప్టెంబర్ 18లోగా అన్ని అభ్యంతరాలను పరిష్కరించి, సెప్టెంబర్ 22న తుది ఓటర్లు జాబితా అధికారికంగా ప్రకటిస్తారు. నియోజకవర్గం ఓటర్లు నరసన్నపేట 2,16,960 ఇచ్ఛాపురం 2,73,207 పలాస 2,22,334 టెక్కలి 2,38,716 పాతపట్నం 2,28,375 శ్రీకాకుళం 2,75,843 ఆమదాలవలస 1,90,025 ఎచ్చెర్ల 2,48,566 -
హోటల్లో యువతి ఆత్మహత్య
శ్రీకాకుళం క్రైమ్ : ఆ యువతి మూర్ఛ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతోంది. దాదాపు రూ.10 లక్షలు సమకూరితే గానీ ఆరోగ్యం మెరుగవ్వదని తెలుసుకుంది. తండ్రికి స్థోమత లేకపోవడం, కుటుంబానికి భారమనుకుందో ఏమో.. స్నేహితురాలికి వాట్సాప్ మెసేజ్ ద్వారా తన బాధ పంచుకుంది. శ్రీకాకుళం నగరానికి వచ్చి ఓ హోటల్లో ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి రెండో పట్టణ ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా గుణుపూర్కు చెందిన అభిమన్యు బెహరాకు ఇద్దరు కుమారులు, కుమార్తె కసూర్తి కుమారి బెహరా (23) ఉన్నారు. నిరుపేద కుటుంబం. కస్తూరికి చిన్నప్పటి నుంచీ మూర్ఛవ్యాధి ఉండటంతో ఎప్పుడూ ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. పూర్తిగా నయం కావాలంటే రూ. లక్షలతో కూడుకున్న పని మదనపడేది. స్నేహితురాలి ఊరికని చెప్పి.. ఈ క్రమంలో గురువారం తన స్నేహితురాలి ఊరికి వెళ్తానని తండ్రితో చెప్పింది. ఉదయం 10 గంటలకు గుణుపూర్లో తండ్రి రైలు ఎక్కించారు. కస్తూరి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లకుండా అప్పటికే ఆన్లైన్లో శ్రీకాకుళం విజేత హోటల్లోని రూమ్ను బుక్ చేసుకుని ఆమదాలవలసలో దిగి నగరంలోని హోటల్కు చేరింది. గురువారం మధ్యా హ్నం ఒంటి గంటకు తన స్నేహితురాలికి వాట్సాప్ మెసేజ్ చేసింది. తాను చనిపోతున్నానని, తన అనారోగ్యానికి తండ్రి రూ.10 లక్షలు ఖర్చు పెట్టడం సాధ్యం కాదన్నది ఆ మెసేజ్ సారాంశం. అదే విషయాన్ని కస్తూరి స్నేహితురాలు వెంటనే కస్తూరి తండ్రికి ఫోన్ చేసి చెప్పి మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. అప్పటి నుంచి తండ్రి కస్తూరికి పలుమార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో స్థానికంగా ఉన్న స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళంలో లొకేషన్ చూపిండంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈలోగా అక్కడి వారు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రెండో పట్టణ పోలీసులకు ఫోన్ చేయడంతో హోటల్లో ఫ్యాన్కు ఉరేసుకున్న సమాచారాన్ని చెప్పారు. హుటాహుటిన తల్లిదండ్రులు చేరుకుని బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు తెలిపారు. -
తవ్వకాల్లో తగ్గేదేలే..!
గార : మండల కేంద్రం గార సమీపంలో ఇసుక తవ్వకాలతో వంశధార నదికి గర్భశోకం తప్పడం లేదు. ఇక్కడ తాగునీటి రక్షిత పథకం సమీపంలోనే భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. నదిలోకి పైపులు వేసి రోడ్డు నిర్మించి యంత్రాలతో నేరుగా వాహనాల్లో ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం డీసిల్టేషన్ పేరిట ర్యాంపు ఇస్తే ఏకంగా నది గర్భంలోనే 15 నుంచి 20 అడుగుల మేర ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. గతంలో వరదల సమయంలో ర్యాంపు ఏరియా నుంచి వమరవల్లి, ఆరంగిపేట, తోనంగి వంటి ప్రాంతాలకు వరద నీరు వెళ్లకుండా రూ. 4 కోట్లతో గాబ్రియన్ గోడను నిర్మించారు. ప్రస్తుత తవ్వకాల వల్ల ఈ గోడకు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. గత ప్రభుత్వంలో మత్స్యకార గ్రామాలకు ప్రతీ రోజూ తాగునీరు అందించాలన్న సంకల్పంతో రక్షిత పథకం నిర్మించారు. ఈ ఇన్ఫిల్టరేషన్ బావి సమీపంలోనే ఇసుకను తోడేస్తున్నా అధికారులు కిమ్మనడంలేదు. 500 మీటర్లు వరకు ఎటువంటి తవ్వకాలు జరగకూడదన్న నిబంధనలు తుంగలో తొక్కారు. ఫలితంగా 31 గ్రామాలకు తాగునీరు అందించే రక్షిత నీటి పథకం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. నది తీర ప్రాంతంలో 60 వరకు వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. వాటి పరిధిలో భూగర్భ జలాలకు నష్టం వాటిల్లనుంది. సమీపంలోనే సముద్రం ఉండటంతో ఉప్పునీరు వచ్చి జలాలు కలుషితమవుతాయని ప్రజల్లో ఆందోళన నెలకొంది. గార ఇసుక ర్యాంపుతో నదికి గర్భశోకం 15 నుంచి 20 అడుగుల మేర యంత్రాలతో తవ్వకాలు రక్షిత పథకం సమీపంలో భారీ ఎత్తున తవ్వకాలు -
ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తే ఆంక్షలా?
● నిర్లక్ష్యం వహిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు ● పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మండిపాటు పాతపట్నం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు పనులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. హిరమండలం ప్రాజెక్టు పరిశీలనకు పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పాతపట్నం నియోజకవర్గంలో ఉద్దానం ప్రాజెక్టు పథకం విస్తరణ అమలులో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం వైఖరికి నిరసిస్తూ క్షేత్రస్థాయి పరిశీలనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం హిరమండలంలోని ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును పరిశీలకు, పార్టీ నాయకులతో కలిసి ప్రాజెక్టు పనులు చూడడానికి వెళుతుంటే పోలీసులు అంక్షలు విధించారని, హిరమండలం వెళ్లడానికి అడుగడుగునా ఆంక్షలను విధించి అనుమతించలేదన్నారు. తమను, పార్టీ నాయకులను పోలీసులు వెళ్లకుండా నిలుపుదల చేశారన్నారు. ఉద్దానం ప్రజల గొంతు తడపాల్సిన ప్రాజెక్టులపై రాజకీయం చేయడం తగదని, కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. ఉద్దానం ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంధవరపు వెంకటసురేష్, రాష్ట్ర వైఎస్సార్టీయూసీ జాయింట్ సెక్రటరీ ఇప్పిలి నారాయణరావు, మెళియాపుట్టి, కొత్తూరు పార్టీ మండల అధ్యక్షులు పోలాకి జయమునిరావు, గండివలస ఆనందరావు, పార్టీ నాయకులు మెండ సింహాచలం, దండుగుల రామారావు, మజ్జి రామయ్య, పొత్తడి మురళీ, జి.పోలయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఆటోపై కూలిన చెట్టు
మెళియాపుట్టి: పట్టుపురం–పెద్దలక్ష్మీపురం గ్రామాల మధ్య ఆటోపై ఓ చెట్టు కూలిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా నీలాపురం గ్రామానికి చెందిన వి.లక్ష్మణరావు గారబంద నుంచి చాపర వైపు ఆటోలో ప్రయాణికులతో వస్తున్నాడు. పెద్దలక్ష్మీపురం దాటాక చింతచెట్టు ఒక్కసారిగా ఆటోపై పడింది. డ్రైవర్ గమనించి వెంటనే వెనక్కి వెళ్లడంతో ముందుభాగంపై మాత్రమే చెట్టుకొమ్మలు పడ్డాయి. ఆ సమయంలో ఆటోలో ఓ మహిళ కూర్చుంది. ఆమె వెనుకవైపు కూర్చోవడంతో గాయాలు కాలేదు. డ్రైవర్ లక్ష్మణరావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని జేసీబీతో చెట్టును తొలగించారు. ఓ రైతు చెట్టుకు నిప్పంటించడంతో గత కొద్దిరోజులుగా కాలుతూ శుక్రవారం ఇలా కూలిపోయిందని చెబుతున్నారు. -
పగలు సూర్య ప్రతాపం
● ఒకేరోజు భిన్నవాతావరణం ● పగలంతా భానుడి భగభగలు ● రాత్రి గాలివాన బీభత్సం ● పిడుగులతో బెంబేలెత్తిన జిల్లా వాసులుఆమదాలవలస : భానుడి భగభగలతో జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉక్కపోతతో ఇళ్లలో ఉండలేక, బయట తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం జిల్లాలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకే వరకు ఎండ తీవ్రత కొనసాగక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలు బలంగా ఉన్నప్పటికీ ఎండ తీవ్రత కూడా కొనసాగుతుందని చెబుతున్నారు. ఆర్టీసీ కండక్టర్కు వడదెబ్బ సారవకోట: పాతపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు కండక్టర్ డీఎం రావు శుక్రవారం వడదెబ్బకు గురయ్యారు. సారవకోట దగ్గరకు వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో డ్రైవర్ స్థానిక పీహెచ్సీ వద్ద బస్సు నిలుపుదల చేశారు. డాక్టర్ సుధారాణి ప్రథమ చికిత్స అందించగా అనంతరం శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. సొమ్మసిల్లిన ఉపాధి వేతనదారురాలు మెళియాపుట్టి: మండల కేంద్రం మెళియాపుట్టిలో శుక్రవారం ఉపాధి పని చేస్తుండగా ఎండవేడిమి తట్టుకోలేక సావిత్రి అనే మహిళ పని సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే క్షేత్ర సహాయకుడు స్పందించి బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఉదయం 8 గంటలకే ఉక్కపోతతో పనులు చేయలేకపోతున్నారు. 10 దాటితే బయటికి రావొద్దని హెచ్చరికలున్నా ఉపాధి వేతనదారులకు మాత్రం తప్పడం లేదు. మరోవైపు కొంతమందికి ముఖహాజరు ఇబ్బంది పెట్టడంతో వారు మండుటెండలో గంటలకొద్దీ నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండలు నేపథ్యంలో క్షేత్రసహాయకులు పనులు నిలిపివేస్తే వారికి డిమోషన్లు విధిస్తున్నారు. అందుకే ఎంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా పనులు మాత్రం ఆపడం లేదు. -
విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం..
ఈదురు గాలుల ధాటికి శ్రీకాకుళం డివిజన్లోనే అధిక నష్టం వాటిల్లింది. పొందూరు, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లో సుమారు రూ.25 లక్షల వరకు నష్టం వాటిల్లింది. 26 విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, 4 చోట్ల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 14 చోట్ల వైర్లు తెగిపడ్డాయి. కింతలి, నెలివాడ, మెట్టపేట, పొన్నాడల వద్ద పిడుగులు పడటంతో 33 కేవీ ఇన్సులేటర్లు పేలిపోయాయి. దీంతో రణస్థలం, ఎచ్చెర్ల, పొందూరు మండలాల్లో బ్రేక్డౌన్ డిక్లేర్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు విద్యుత్ సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపడుతున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో పరిస్థితి పూర్వ స్థితికి రాలేదు. విద్యుత్ సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, టెక్నికల్ ఈఈ సురేష్కుమార్, ఆపరేషన్స్ శ్రీకాకుళం ఈఈ పైడి యోగేశ్వరరావు, పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు. -
ప్రమాదమే..!
–8లోరహదారులు రక్తమోడుతున్నాయి. రోడ్డు భద్రతా ప్రమాణాలు లోపభూయిష్టంగా మారడంతో ప్రయాణికులు, వాహనచోదకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు కచ్చితంగా తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి ఇటీవల జరుగుతున్న సంఘటనలు.. కచ్చితంగా పిల్లలపై దృష్టి సారించాలని.. వారి విషయంలో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో తల్లిని చంపిన తనయుడు ఘటన తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తోంది. పిల్లల్ని నేరసామ్రాజ్యం వైపు ఆకర్షితులను చేస్తోన్న సెల్ఫోన్కు దూరంగా ఉంచాలని హెచ్చరి స్తోంది. – శ్రీకాకుళం కల్చరల్/ క్రైమ్ -
కిడ్నీవ్యాధులపై అధ్యయనం
కవిటి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన రెండేళ్ల తర్వాత ఉద్దానం కిడ్నీవ్యాధులపై హైదరాబాద్కు చెందిన సీసీఎంబీ, ఐసీఎంఆర్ల వైద్యబృందాలు శుక్రవారం ఉద్దానం ప్రాంతంలో అధ్యయన పరీక్షలు ప్రారంభించాయి. కిడ్నీవ్యాధుల నిర్మూలన అంశంపై ప్రభుత్వం చేతులెత్తేసిన నేపథ్యంలో వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ నర్తు రామారావు ఇదే సమస్యపై పలుమార్లు శాసనమండలిలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆ చర్యలు ఫలించి నేడు వైద్యపరీక్షల దిశగా ప్రభుత్వం రెండేళ్ల తర్వాత సిద్ధమయింది. ఈ మేరకు హైదరాబాద్లో సీసీఎంబీకి చెందిన డాక్టర్ తంగరాజ్ ,సిబ్బంది, ఐసీఎంఆర్కు చెందిన డాక్టర్ సుధాకర్ల వైద్య బృందం పర్యవేక్షణలో కిడ్నీ వ్యాధి మూలాలు కనుగొనేందుకు హోల్ జీనోమ్ సెక్వెన్సింగ్ కోసం రక్త నమూనాలను సేకరించింది. ప్రతీ పీహెచ్సీ పరిధిలో రక్తనమూనాలను సేకరించారు. సీరంక్రియేటినైన్ 3 కన్నా అధికంగా ఉన్నవారు, 50 ఏళ్లలోపు డయాలసిస్ చేయించుకుంటున్నవారు, డయాలసిస్ బాధితులు ఉన్న కుటుంబంలో ఉన్న ఆరోగ్యవంతులైన వారినుంచి రక్తనమూనాలు సేకరించి.. అధ్యయనం చేసేదిశగా వైద్యబృందం చర్యలు ప్రారంభించింది. -
టీ..కా తాత్పర్యాలు
కాసింత తేయాకు డికాక్షన్.. కాసిన్ని పాలు... కాస్త చక్కెర.. చాలు.. నీరసంగా ఉన్న ఒంటికి సత్తువ వచ్చేస్తుంది. మత్తుగా ఉన్న మెదడుకు ఉత్తేజం కలుగుతుంది. డీలా పడిపోతున్న మనిషికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. దంచిన అల్లం, పొడిగా మారిన యాలక్కాయ జత కలిశాయంటే ఆ ఐదు నిమిషాల తేనీటి పానానికి రససిద్ధి కలిగినట్టే. జేబులో డబ్బుల్లేని రోజుల్లో స్నేహితులతో వన్ బై టూ తాగిన టీ, డబ్బు సంపాదించాక కూడా అదే షాపు బయ ట నిలబడి దర్జాగా తాగిన చాయ్, కబుర్లు చెప్పుకుంటూ ఖాళీ చేసిన తేనీరు.. అన్ని దశ ల్లోనూ అండగా నిలిచిన పానీయమిది. అన్న ట్టు గురువారం ప్రపంచమంతా తేనీటి దినోత్సవం జరుపుకుంది. టీ తాగేందుకు మనకు ఉత్సవాలే కావాలా.. రోజూ టీ ఉత్సవమే కదా అంటున్నారు ఈ సైక్లింగ్ బృంద సభ్యులు. సైక్లింగ్ చేశాక అంతా ఓ చోటకు చేరి ఇలా ‘టీ’..కా తాత్పర్యాలు మాట్లాడుకుంటారు. – శ్రీకాకుళం కల్చరల్ మీటర్ గిరా..గిరా..అరసవల్లి: వేసవిలో జిల్లా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. గత వేసవితో పో ల్చుకుంటే ఈ ఏడాది మే నెలలో విద్యుత్ వినియోగం అమాంతం నాలుగు రెట్లు పెరిగిందని అధికారిక అంచనా. ఈనెల 14న 7.51 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం కాగా.. దాన్ని బ్రేక్ చేస్తూ ఈనెల 18–19 తేదీల్లో ఏకంగా 7.96 మిలియన్ యూనిట్లు (79 లక్షల యూనిట్లు మించి) విద్యుత్ వినియోగం అయినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అప్రకటిత కోతలు, కావాల్సిన డిమాండ్ అందించడం అనే అంశాలపై ఏమాత్రం దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత 20 రోజుల నుంచి పరిస్థితులు చల్లబడకపోవడం విద్యుత్ వినియోగంపై అత్యంత ప్రభావం చూపిస్తోంది. జిల్లాలో నిరక్షరాస్యులు 1.32 లక్షల మంది శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాను శతశాతం అక్షరాస్యత దిశగా తీసుకెళ్లేందుకు అన్ని ప్రభు త్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరే ట్ వేదికగా ’ఉల్లాస్ అక్షర ఆంధ్ర’ అక్షరాస్యతా కార్యక్రమ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు ఎం. వెంకటరమణ సమావేశాన్ని ప్రారంభిస్తూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,32,360 మంది నిరక్షరాస్యులను గుర్తించినట్లు తెలిపారు. వీరిని అక్షరాస్యులుగా మార్చడమే ‘ఉల్లాస్ అక్షర ఆంధ్ర’ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. -
8 ఏళ్లలో ఇదే మొదటిసారి
ఇలాంటి వాతావరణ పరిస్థితులు 8 ఏళ్లలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రత నమోదై గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల పొడి వాతావరణం ఏర్పడుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ● గత రెండు రోజులుగా శ్రీకాకుళంలో 40 డిగ్రీలు, ఆమదాలవలస, నరసన్నపేట, పలాస, కొత్తూరు రణస్థలంలో కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ● టెక్కలి, రణస్థలం, ఇచ్ఛాపురంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు. -
పిల్లలూ.. 3.5 లీటర్ల నీరు తాగాల్సిందే
సిక్కోలుపై సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. సూర్యోదయం నుంచి అస్తమయం వరకు వేడి దాడి చేస్తున్నాడు. దాదాపు 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మరో నాలుగైదు రోజులు ఈ ఉక్కపోత తప్పదని నిపుణులు చెబుతున్నారు. వృద్ధులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను ఆరు బయటకు పంపకూడదని హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందు న పిల్లలను మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4గంటల వరకు బయ టకు వెళ్లనివ్వకుండా చూసుకోవాలి. డీహైడ్రేషన్తో పాటు వడదెబ్బతో ప్రాణాలకు ముప్పు రాకుండా జాగ్రత్తలు వహించాలి. ముందుగా ఈ రోజుల్లో కచ్చితంగా మంచినీటితో పాటు కొబ్బరినీరు, మజ్జిగను దాహం లేకపోయినా ఇవ్వాలి. నిత్యం యూరిన్లో 1.5 లీట ర్లు, చెమటతో ఒక లీటర్, అదనంగా మరో అరలీటర్ బయటకు పోతుంది. దీనికి అదనంగా నీరు తాగాలి. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు సడన్గా వస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. -
దారి పొడవునా.. విధ్వంసపు జాడలు
● వంశధారలో ఇసుక దొంగలు ● అనుమతులు ఉండవు.. నిబంధనలు కానరావు ● నేతల కనుసన్నల్లోనే దందా హిరమండలం: వంశధారలో నీటి జాడలు కనిపించడం లేదు గానీ ఇసుక దొంగల జాడలు మాత్రం దారి పొడవునా కనిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపట్టి నదీ తీర గ్రామాల ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రేవులను అధికారికంగా దక్కించుకున్న వారు ఒకవైపు, దొరికిన దగ్గర దొరికినట్టు మరికొందరు ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు. అధికారుల అండదండలతో రాజకీయ పార్టీల నేతలు నిబంధనలు విస్మరించి వంశధారను గుల్ల చేస్తున్నారు. ప్రధానంగా ‘ఇసుక మేట ల’ తొలగింపు పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ప్రధానంగా కూటమికి చెందిన చోటా నేతలతో బడా నేతలు ఈ పర్వాన్ని కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల పేరుతో.. పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి వంశధార నదిలో రెండు చోట్ల మాత్రమే ఇసుక తవ్వేందుకు అనుమతులు ఉన్నాయి. కొత్తూరు, హిరమండలం మండలాల్లో ఇసుక మేటల తొలగింపు పేరిట ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు. కొత్తూరు మండలంలోని బంకి, హిరమండలానికి సంబంధించి భగీరథపురం వద్ద ఇసుక దందా కొనసాగుతోంది. అయితే అనుమతుల పేరుతో అనధికారికంగానే యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు. ఈ రెండు మండలాల్లో సమీప మార్గాల్లో ఏకంగా నది గర్భానికి రహదారులు నిర్మించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్క పాతపట్నం నియోజకవర్గంలోనే వంశధార నది నుంచి రోజుకు వందలాది ఇసుక లోడ్లు తరలిపోతున్నాయి. ఎక్కడికక్కడే అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీ చేసి కేసులు నమోదు చేయాల్సిన మై నింగ్, రవాణా, పోలీసు, రెవె న్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. అధికారికంగా తవ్వకాలు చేపట్టినా నిబంధనలు తప్పకుండా పాటించాలి. అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండడంతో అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టి ఇసుక తవ్వకాలు, రవాణాను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. -
రెండు విడతల కరువుభత్యం చెల్లించాలి
శ్రీకాకుళం అర్బన్ : బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు, పెన్షనర్లకు రెండు విడతల కరువు భత్యం చెల్లించాలని ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఇన్ బీఎస్ఎన్ఎల్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్స్ ఇన్ బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం శ్రీకాకుళంలోని సంచారభవన్ వద్ద ధర్నా, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ వైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతుండటంతో జీవనం కష్టంగా మారుతోందని, బకాయి డీఏను వెంటనే చెల్లించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో ప్రతినిధులు పోలాకి వెంకటరావు, మాతల గోవర్ధనరావు, బి.సూర్యనారాయణ, బి.ప్రసాదరావు, డి.వెంకటేశ్వరరావు, కె.కామేశ్వరరావు, డబ్ల్యూ మన్మధరావు, పి.మల్లేశ్వరరావు, వి.శ్రీనివాసరావు, ఐకేసీహెచ్ చరణ్, పంచిరెడ్డి రమణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రోజులు జాగ్రత్త
రాబోయే ● వడగాలులు వీచే అవకాశం ఉంది ● ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శ్రీకాకుళం పాతబస్టాండ్: రాబో యే ఐదు రోజులు జిల్లా వాసు లు జాగ్రత్తగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం కోరారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో బూ ర్జ, హిరమండలం, ఎల్ ఎన్ పేట, పాతపట్నం, సారవకోట మండలాల్లో తీవ్ర వడగాలులు, ఆమదాలవలస, జి.సిగడాం, జలుమూరు, కొత్తూరు, సరుబుజ్జిలి మండలాల్లో వడగాలులు ఉండే అవకాశం ఉందన్నారు. 22వ తేదీన హిరమండలం, పాతపట్నం మండలాల్లో వడగాలు లు ఉంటాయన్నారు. డ్వామా పీడీ లవరాజు మాట్లాడుతూ ఉపాధి వేతన దారులు ఉదయం 5.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం ఎండ తగ్గాక పనులు చేయాలన్నారు.5 -
గొట్టిపల్లిలో మొదలైన వైద్యసేవలు
మెళియాపుట్టి: గొట్టపల్లి పరిస్థితిపై అధికారులు స్పందించారు. ఇక్కడ జ్వరాల విజృంభణపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో బుధవారం ఉదయమే ఆరోగ్యశాఖ అధికారులు హుటాహుటిన మందుల బ్యాగులు, రక్త పరీక్షల కిట్లు పట్టుకుని గొట్టిపల్లి గ్రామానికి పరుగులు తీశారు. మొత్తం 50 మందికి ర్యాపిడ్ టెస్టులు చేసినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. అయితే జ్వరాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. తాగునీరు, పారిశుద్ధ్యం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఊరిలో పర్యటించి జ్వర పీడితులతో మాట్లాడారు. -
నాలుగో సెమిస్టర్లో 86 శాతం ఉత్తీర్ణత
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ టి.ఆదిలక్ష్మి, అధ్యాపకులతో కలిసి ప్రిన్సిపాల్ డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు బుధవారం విడుదల చేశారు. బీఏ(ఆనర్స్) 81.40 శాతం, బీకాం(ఆనర్స్) 86.03 శాతం, బీఎస్సీ(ఆనర్స్) 88.48 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. మొత్తమ్మీద 86.14 శాతం ఫలితాలతో రాణించారని ప్రిన్సిపాల్ సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.చిన్నారావు, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పీఎస్ కనకదుర్గ, డీఈఓలు జి.శశికాంత్, బి.శ్రావణి, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు. -
టంకాల దిగ్గువలసలో విషాదం
జి.సిగడాం: టంకాల దిగ్గువలస గ్రామానికి చెందిన వలస కూలీ గూండ్రి రామకృష్ణ (40) ఒడిశాలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రామకృష్ణ కొరాపుట్ జిల్లా లమాతాపుట్ మండలంలో పనుల కోసం వలస వెళ్లాడు. ఈ నెల 17న సెంట్రింగ్ పనులు చేస్తూ జారిపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే విజయనగరం తీసుకొచ్చి ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. రామకృష్ణ మృతిపై కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో ఒడిశా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ కేసునమోదు చేశారు. బుధవారం టంకాల దిగ్గువలస శ్మశాన వాటికలో పూడ్చిన మృతదేహాన్ని వెలిగికి తీశారు. కుటుంబ సభ్యులు, రాజాం సీహెచ్సీ వైద్యులు, వీఆర్ఓ కాయల శ్రీనివాసరావు, లమాతాపుట్ పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. రామకృష్ణకు భార్య పార్వతి, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. పేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రామకృష్ణ(ఫైల్) -
27న జిల్లా అమరవీరుల స్మారక సభ
పలాస: బొడ్డపాడులోని జిల్లా అమరవీరుల స్మారక మందిరంలో ఈ నెల 27న జిల్లా అమరవీరుల స్మారక సభ నిర్వహిస్తున్నట్టు నిర్వాహక కమిటీ కన్వీనర్ పోతనపల్లి కుసుమ తెలిపారు. ఈ మేరకు స్మారక మందిరం వద్ద బుధవారం కరపత్రాలు, వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతాంగ పోరాటం కాలంలో మొదటిసారిగా 1969 మే 27న జరిగిన బూటకపు ఎన్కౌంటరులో అప్పటి సి.పి.ఐ.ఎం.ఎల్ కేంద్రకమిటీ నాయకుడు పంచాది కృష్ణమూర్తితో పాటు బొడ్దపాడు గ్రామానికి చెందిన బైనపల్లి పాపారావు, దున్న గోపాలరావు, నిరంజన్ సాహు, రామచంద్రప్రదానో, శృంగవరపు నరసింహులు తదితరులు అమరులయ్యారని చెప్పారు. వారి జ్ఞాపకార్ధం ప్రతి ఏడాది జిల్లా అమరవవీరులు స్మారక సభలను గత 37ఏళ్లుగా బొడ్డపాడులో నిర్వహిస్తున్నామని వివరించారు. అప్పటి శ్రీకాకుళం పోరాటంలో మొత్తం 360 మందికి పైగా మృతి చెందారని, వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగడమే ఈ సభ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జోగి కోదండరావు, వంకల మాధవరావు, మద్దిల రామారావు, కోనేరు రమేస్, గొరకల బాలకృష్ణ, కుత్తుం ద్యుంతు, సాలీన కుమార్, బుడత బాలరాజు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఆదాయం ఫుల్.. పర్యవేక్షణ నిల్!
● రెండేళ్లుగా నియామకం కాని రెగ్యులర్ జిల్లా రిజిస్ట్రార్ ● పేరుకుపోతున్న కక్షిదారుల సమస్యలు ● వారానికోసారి ఇన్చార్జి డీఆర్ రాక ● పర్యవేక్షణ కరువు ● కానరాని కార్యాలయాల బోర్డులు రెగ్యులర్ రిజిస్ట్రార్ వస్తారు.. రెగ్యులర్ ప్రాతిపదికన జిల్లా రిజిస్ట్రార్ ఓ వారం రోజుల్లో వచ్చే అవకావం ఉంది. ఎక్కడా ఎటువంటి అవినీతి లేకుండా చూస్తాం. క్రయ, విక్రయదారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. కార్యాలయంలో బోర్డులున్నాయి. లేకుంటే ఏర్పాటు చేస్తాం. – టి.ఉపేంద్రరావు, జిల్లా రిజిస్ట్రార్ (ఎఫ్ఏసీ) శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తీసుకొచ్చే శాఖల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఒకటి. ఇంతటి కీలకమైన శాఖకు రెండేళ్లుగా రెగ్యులర్ అధికారి లేకపోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తిగా ముద్ర వేసి రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్న జిల్లా రిజిస్ట్రార్ కిల్లి మన్మధరావును విశాఖకు బదిలీ చేశారు. పోనీ ఎవరినైనా రెగ్యులర్ జిల్లా రిజిస్ట్రార్ను వేశారా అంటే అదీలేదు. డీఐజీగా పనిచేస్తున్న నాగలక్ష్మిని అటు శ్రీకాకుళం డీఆర్గా, పార్వతీపురం మన్యం జిల్లా డీఆర్గా దాదాపుగా 20నెలల పాటు కొనసాగించారు. ఎట్టకేలకు ఫిబ్రవరిలో సబ్ రిజిస్ట్రార్లకు పదోన్నతులు కల్పించి నెల రోజుల్లో రిటైర్మెంట్ అయ్యే సి.కుమారస్వామిని కడప నుంచి ఇక్కడ నియమించారు. ఆయన మార్చి చివరి నాటికి పదవీ విరమణ పొందారు. అనంతరం విశాఖపట్నంలో రెగ్యులర్గా విధులు నిర్వహిస్తున్న టి.ఉపేంద్రరావును ఎఫ్ఏసీ పద్ధతిలో శ్రీకాకుళం వేశారు. ఈయన వారం పది రోజులకు ఒకసారి వస్తుండటంతో ఫైళ్లు, క్రయ విక్రయదారుల సమస్యలు పేరుకుపోతున్నాయి. కోట్లాది రూపాయలు ఆదాయం తెచ్చే ఈ శాఖకు ఉన్నతాధికారులు లేకపోవడంతో సబ్ రిజిస్ట్రార్లను, కార్యాలయాలను పర్యవేక్షించే వారే కరువయ్యారు. అవినీతిని కట్టడి చేసే వారు లేకపోవడంతో ప్రతి రోజూ ఇక్కడ రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వారిదే హవా.. తమ విలువైన భూములు క్రయ, విక్రయాలకు సంబంధించిన సమస్యలు చెబుతామంటే వినే వారే కరువయ్యారని పలువురు గగ్గోలు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో సమస్య వచ్చిన తక్షణమే పరిష్కారం లభించేది. రెగ్యులర్ జిల్లా రిజిస్ట్రార్ ఉండటంతో నిరంతరం కార్యాలయంలో అందుబాటులో ఉండేవారు. సమస్య చెబితే సకాలంలో పరిష్కారమయ్యేది. రెగ్యులర్ జిల్లా రిజిస్ట్రార్లు లేకపోవడంతో కొందరు సబ్ రిజిస్ట్రార్లు, కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ఏకంగా తమకు అనుకూలంగా నకిలీ డాక్యుమెంట్లు పెట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకుని లక్షలాది రూపాయలు క్రయ, విక్రయదారుల వద్ద నుంచి లాగేసి అధికారులతో వాటాలు పంచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఓ సబ్ రిజిస్ట్రార్ వద్దకు డాక్యుమెంట్ వెళ్లడమే తరువాయి.. కొర్రీలు పెట్టి రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆపేస్తున్నారని క్రయ, విక్రయదారులు గగ్గోలు పెడుతున్నారు. ఓ ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు తెచ్చిన డాక్యుమెంట్లను మాత్రమే ఎటువంటి పరిశీలన లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు రిజిస్ట్రేషన్లు అయ్యే డాక్యుమెంట్లు లెక్కకట్టి కిందిస్థాయి ఉద్యోగి సాయంత్రమయ్యే సరికి ఎవరివాటా వారికి చేరవేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తనిఖీ చేసే రెగ్యులర్ అధికారులే లేకపోవడం, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు దృష్టి సారించకపోవడంతో కొందరు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది, రైటర్లదే హవా నడుస్తోందని సమాచారం. బోర్డులేవీ? డబ్బులు దండిగా వస్తున్నా తమ శాఖకు బోర్డులే అవసరం లేదన్నట్లు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, జిల్లా కేంద్రంలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు వ్యవహరిసుత్న్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా కనీసం బోర్డు ఉంటుంది. ఇక్కడ మాత్రం క్రయవిక్రయదారులే వెతుక్కుని వస్తారులే అన్న తీరుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. కొన్నిసార్లు వృద్ధులకు సంబంధించి ఇంటికెళ్లి రిజిస్ట్రేషన్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అవేవీ కానరావడం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మొదటి అంతస్తులో ఉండడంతో నడవలేని వృద్ధుల కోసం వీల్ చైర్ సౌకర్యం అందుబాటులో ఉంచాలి. ఇక్కడ మాత్రం కార్యాలయంలో మూలన ఓ చెత్త కుప్పలో వీల్చైర్ను పడేసి ఉంచారు. కనీసం వేసవి కాలం కావడంలో తాగునీరు కూడా అందుబాటులో ఉంచడం లేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం చొరవ చూపి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేసి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
అసలు అనుమతి ఉందా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో రచ్చ లేపుతున్న బావాజీ మఠం భూముల వివాదం రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇందులో ఓ కీలక నేత ప్రవేశించడంతో అధికార, విపక్షాల మధ్య ఆరోపణల యుద్ధానికి దారితీసింది. సవాల్, ప్రతి సవాల్కు వేదికై ంది. అసలీ భూములు చేతులు మారడానికి అవకాశం ఉందా?అమ్మకానికి పెట్టడానికై నా! కొనుగోలు చేయడానికై నా వీలుందా? అంటే లేదని చెప్పాలి. సదావర్తి కింద ఆ మఠానికి చెందిన ఆలయ పోషణ కోసం కేటాయించిన భూములివి. వీటిని అమ్మడానికి, కొనడానికి ఎవరికీ హక్కులేదు. కానీ మఠానికి చెందిన కొందరు ప్రతినిధులు చేతివాటం ప్రదర్శించి, ఆ భూములను బయట వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేశారు. అలాగని ఒకరికే చేశారా? అంటే కాదు. ఐదుగురు వ్యక్తులపై ఒకే భూమిపై అగ్రిమెంట్ కట్టేశారు. పక్కనున్న సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు కూడా చేసేశారు. ఇప్పుడిది అగ్రిమెంట్ కట్టించుకున్న వ్యక్తుల విభేదాలతో రచ్చకెక్కడం.. ఇదంతా సెటిల్ చేస్తానని ఓ కీలక నేత రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలో కొందరికి అన్యాయం జరిగింది. ఇప్పుడిదే రచ్చ రచ్చ చేస్తోంది. అంతిమ లబ్ధి కోసమేనా? ఆమదాలవలస–శ్రీకాకుళం మార్గంలో తోటాడ–అక్కివరం రెవెన్యూ పరిధిలో బావాజీ మఠం భూములు ఉన్నాయి. సర్వే నంబర్ 121లో దాదాపు 400 ఏళ్ల చరిత్ర గల 199 ఎకరాల భూముల్ని సదావర్తి కింద అప్పట్లో కేటాయించారు. కాల క్రమేణా సాగు నిమిత్తం పలువురు రైతులకు కేటాయించారు. అవి అమ్మడానికి గానీ, కొనడానికి గానీ అవకాశం లేదు. బావాజీ మఠానికి చెందిన ఆలయం నగరంలో ఉంది. దాని పోషణ కోసం ఈ భూముల నుంచి వచ్చే ఫలసాయం, ఇతర ఆదాయాన్ని వినియోగించాలి. ఇప్పుడీ భూముల పర్యవేక్షణ బాధ్యత కూడా బలగకు చెందిన ఒక వ్యక్తికి అప్పగించారు. అందులోని 3ఎకరాలకు పైగా భూమిలో ఇటీవల ఒక లేఅవుట్ వెలిసింది. ఆ లేవుట్కు ఎలాంటి అధికారిక అనుమతుల్లేవు. అంతేకాకుండా అక్రమ లేఅవుట్కు రూ. కోటి 40లక్షల ఉపాధి నిధులతో సీసీ రోడ్లు వేశారు. ఈ రోడ్ల వలన చుట్టు పక్కల ఇళ్లకు కొంత మేలు జరిగినా...ఎక్కువగా ఉపయోగపడేది అక్రమ లేవుట్కే. ఇప్పుడా లేఅవుట్లో ప్లాట్లు చకచకా విక్రయాలు జరిగిపోతున్నాయి. ఎంతో విలువైన స్థలం కావడంతో ఆ మొత్తం లావాదేవీల వెనక ఓ కీలక నేత ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఆ నేతకు దాదాపు 60సెంట్లు మేర అంతిమ లబ్ధి పొందేలా పథక రచన చేశారన్న వాదనలు ఉన్నాయి. అంతకుముందు ఏం జరిగిందంటే.. బావాజీ మఠం ప్రతినిధులు పూరిలో ఉంటారు. వారికి సంబంధించిన పురోహితులు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. కానీ, అధికారమంతా పూరిలో ఉన్న బావాజీ మఠం ప్రతినిధుల చేతుల్లోనే ఉండేది. నగరం పక్కనే విలువైన ఏరియా కావడంతో బావాజీ మఠం భూములపై కొందరు బడా వ్యక్తుల కన్ను పడింది. బావాజీ మఠం ప్రతినిధులను సంప్రదించారు. ఆ ప్రతినిధుల్లో ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరికి సదరు బడా వ్యక్తులకు ఆ భూమిని విక్రయిస్తున్నట్టు అగ్రిమెంట్లు కట్టేశారు. ఒకే భూమిపై ఐదుగురికి అగ్రిమెంట్లు చేశారు. దీంతో మాదంటే మాదని సదరు అగ్రిమెంమఠం ఆలయ పోషణకు ఉండాల్సిన బావాజీ మఠం భూములు వాస్తవంగా అమ్మడానికి లేదు. అలాగని అక్కడ లేఅవుట్ వేయడానికి వీల్లేదు. పోనీ, అనుమతులతో లేఅవుట్ వేశారా? అంటే అదీ లేదు. బావాజీ మఠం ప్రతినిధులు అడ్డగోలుగా చేసిన అగ్రిమెంట్లను పట్టుకుని పక్కనున్న సర్వే నంబర్లతో ఇష్టారీతిన రిజిస్ట్రేషన్లు చేసేసుకుని, ఆ భూమి మాదంటే మాది అని అగ్రిమెంట్ దారులు తిరుగుతున్నారు. వారి తాపత్రాయాన్ని క్యాష్ చేసుకోవడానికి కీలక నేత జోక్యం చేసుకున్నారు. అధికారం అండతో ఆ భూములను ఎలాగైనా ప్రైవేటు వ్యక్తులకు కన్ఫర్మ్ చేసేలా పావులు కదుపుతున్నారు. వాస్తవంగా ఈ భూమి నిషేధిత జాబితాలో ఉంది. అటు ప్రభుత్వానికి ,ఇటు ప్రైవేటు వ్యక్తులకు చెందకుండా మధ్యస్తంగా ఉన్నాయి. వీటిపై జిల్లా కోర్టు నుంచి హైకోర్టు వరకు కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ లేఅవుట్ వేయడం, దాంట్లోని స్థలాలను విక్రయం చేయడం జరుగుతున్నాయి. ఇప్పుడిది జిల్లాలో వివాదాస్పదంగా మారింది. ఓ కీలక నేత రాజకీయ భవిష్యత్పై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తోంది. -
ఏపీఎల్కు ముగ్గురు ఎంపిక
నరసన్నపేట: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలకు నరసన్నపేట క్రికెట్ సబ్సెంటర్కు చెందిన ముగ్గురు క్రికెటర్లు ఎంపికయ్యారు. జూన్ 5 నుంచి కడప, మంగళగిరి, విశాఖల్లో జరగనున్న ఏపీఎల్ పోటీలకు ఎస్డీవీఎన్ ప్రసాద్, మురపాక రోహిత్, గొద్దు తరుణ్సాయిలు ఎంపిక అయ్యారు. వీరు అమరావతి రోయల్స్ తరఫున పోటీల్లో పాల్గొంటారు. ప్రసాద్కు రూ.10 లక్షలు, రోహిత్కు రూ.1.05 లక్షలు, తరుణ్సాయికి రూ.30 వేలుకు కొనుగోలు చేశారు. బుధవారం వీరిని వైఎంసీఏ ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, సబ్సెంటర్ క్రికెట్ కోచ్ శ్రీను తదితరులు సత్కరించారు. పోటీల్లో మంచి ప్రతిభ కనబరచాలని ఆకాక్షించారు. సారాతో ఇద్దరి అరెస్టు కంచిలి: జలంత్రకోట గ్రామంలో సోంపేట ఎకై ్సజ్ సీఐ జి.వి.రమణ ఆధ్వర్యంలో బుధవారం సారా విక్రయాలు, రవాణాపై తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన రత్నాల అనసూయ 100 సారా ప్యాకెట్లు, రత్నాల అర్జున్ 150 సారా ప్యాకెట్లు రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరు రవాణాకు వినియోగించిన ద్విచక్ర వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ సోంపేట కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు. తనిఖీల్లో ఎస్ఐలు జగన్నాథ్, ప్రసాద్, సిబ్బంది భానుప్రసాద్, ఉమాపతి, మార్కారావు పాల్గొన్నారు. తప్పిన పెను ప్రమాదం రణస్థలం: లావేరు మండలం తాళ్లవలస జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. క్షణాల్లోనే వెనక వచ్చిన మరో లారీ సడన్ బ్రేక్ వేయడంతో కారు దగ్గరకు వెళ్లి నిలిచింది. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో వెనుక లారీ డ్రైవర్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. కారులో ఉన్న నలుగురికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లావేరు పోలీసులు ట్రాఫిక్ చక్కదిద్దారు. లారీని ఢీకొట్టిన వ్యాన్ రణస్థలం : రణస్థలం మండల కేంద్రంలోని దన్నానపేట సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం వైపు నుంచి వచ్చిన లారీ కొత్త పెట్రోల్ బంకు వద్ద ఉన్న మలుపు వద్ద యూ టర్న్ చేస్తుండగా అదే రూట్లో అతి వేగంగా వచ్చిన వాటర్ క్యాన్ల ఐసర్ వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. క్రేన్ సహాయంతో డ్రైవర్ను బయటకు తీసి 108 వాహనంలో శ్రీకాకుళం తరలించారు. డ్రైవర్ వివరాలు తెలియా ల్సి ఉంది. జె.ఆర్.పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి టెక్కలికి చెందిన సత్యనారాయణమూర్తి మనుమడు టంకాల తరుణ్ పేరుమీద రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. బుధవారం ఆలయ అర్చకులు ఇప్పిలి మాధవశర్మకు విరాళ నగదును అందించారు. అనంతరం ఆదిత్యున్ని దాతల కుటుంబసభ్యులు దర్శించుకున్నారు.


