breaking news
Srikakulam District Latest News
-
అంతా అస్తవ్యస్తం
● జిల్లా కేంద్రంలో అదుపులోకి రాని డయేరియా ● అధికారులపై ఒత్తిడిశ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థలో అంతా అస్తవ్యస్తంగా తయారైంది. అధికారులు హడావుడి చేస్తున్నా డయేరియా వ్యాధి మాత్రం అదుపులోకి రావడం లేదు. ప్రతిరోజు నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో మూడు, నాలుగు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అధికారులు ఇప్పుడు కాలువలు తీయించడం, ట్యాంకులు శుభ్రం చేయించడం వంటి చర్యలు చేపడుతున్నారు. డయేరియా ప్రబలడానికి కమిషనరే కారణమంటూ 14 రోజులు మాత్రమే బాధ్యతలు నిర్వహించిన కూర్మారావును సస్పెండ్ చేసిన అధికారులు అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత వాటర్ వర్క్స్ డీఈని కూడా సస్పెండ్ చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఓ శానిటరీ ఇన్ స్పెక్టర్ను విధుల నుంచి తొలగించారు. దీనిపై పారిశుద్ధ్య కార్మికులు మండిపడుతూ సమ్మె దిశగా ఆలోచన చేస్తుండగా.. వారిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. దీన్ని కార్మికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపాన పాపారావు అనే శానిటరీ ఇన్స్పెక్టర్ ఆందోళనకు గురై ఆస్పత్రి పాలై ఆదివారం డిశ్చార్జి అయ్యారు. -
పట్టించుకోని ప్రభుత్వం
ఇచ్ఛాపురం రైతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు గాలి హామీలు ఇవ్వడం తప్ప పనులు చేయడం లేదు. – దక్కత నూకయ్యరెడ్డి, రైతు సంఘ నాయకుడు, ఇచ్ఛాపురం మండలం సీఎం హామీకే పత్తా లేదు 2024 నవంబర్ 1న ఈదుపురం గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్ఛాపురం రైతాంగాన్ని ఆదుకున్నట్లు, ఆదుకోబోతున్నట్లు అబద్ధపు హామీ ఇచ్చి వెళ్లిపోయారు. అటు గ్రోయిన్స్ నిర్మాణాలు గానీ, ఇటు ఈదుపురం ఎత్తిపోతల పథకం మరమ్మతు చేయలేదు. – డాక్టర్ పూడి కిరణ్కుమార్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇచ్ఛాపురం నియోజకవర్గం -
ఇండియన్ రైల్వే ఉన్నత హోదాలో పూడి హరిప్రసాద్
కవిటి: ఇండియన్ రైల్వేస్లో విశాఖపట్నం కేంద్రంగా ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్ట్ రైల్వేజోన్ ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా కవిటి ఉద్దానంకు చెందిన పూడి హరిప్రసాద్ సోమవారం విశాఖపట్నంలోని రైల్వే జోనల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కవిటి ఉద్దానం ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇంతటి పెద్ద హోదా లభించడంపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విశ్రాంత ఉద్యోగి పిరియా రాజారావు అల్లుడు డాక్టర్ పూడి హరిప్రసాద్(ఐఆర్ఏఎస్) 1994 బ్యాచ్ సివిల్ సర్వీసెస్లో ఉత్తీర్ణత పొందారు. మాజీ ఎమ్మెల్యే పిరియా సా యిరాజ్ బావ అయిన హరిప్రసాద్ తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభం నుంచే పలు ఉన్నత పదవులను అలంకరించారు. 8న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8వ తేదీన జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. మహిళా దినోత్సవాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కృష్ణదాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సాధికారత అంటే వైఎస్సార్, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన మాత్రమే గుర్తుకొస్తుందన్నారు. మహిళా భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్, పోలీస్ స్టేషన్లను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మహిళలకు రక్షణ కరువు జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా మహిళలకు మొండిచేయి చూప డం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల దివ్యభారతి, ఉపాధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, చల్ల అలివేలు మంగ, సుగుణ, ధర్మాన రామ్మనోహర్ నాయుడు, అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ.. కూటమి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మహిళలు అదృశ్యమవుతున్నారని గగ్గోలు పెట్టిన పవన్ కల్యాణ్, ఇప్పుడు అధికారంలో ఉండి వారిని ఎందుకు ఇళ్లకు చేర్చడం లేదని నిలదీశారు. సమావేశంలో పి.సుగుణారెడ్డి, టి.కామేశ్వరి, గుంట జ్యోతి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎచ్చెర్లలోని డాక్టర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన అడ్డగోలు నియామకాలు వెంటనే రద్దు చేయాలని, వాటి స్థానంలో నోటిఫికేషన్ వేసి రోస్టరు, మెరిట్ ఆధారంగా అర్హులకు ఉద్యోగాలు కల్పించాలని, ఇలాంటి విధానాల వల్ల విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ముంజేటి కృష్ణమూర్తి, శ్రీకాకుళం నియోజకవర్గ ఎస్సీసెల్ నాయకులు యజ్జల గురుమూర్తి, జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షులు రౌతు శంకర్, ఎచ్చెర్ల ఎస్సీ సెల్ నాయకులు బి.శశిభూషణ్, టెక్కలి ఎంపీపీ ప్రతినిధి దళిత యువజన నాయకులు ఆట్ల రాహుల్ కుమార్లు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్లలోని యూనివర్సిటీలో ఈ మధ్యకాలంలో సుమారు 40 మందిని వివిధ రకాల ఉద్యోగాల్లో వేశారని, ఈ నియామకాలు ఏ ప్రాతిపదికన జరిగాయో తెలీదని తెలిపారు. అక్రమ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి, ఆ నియామకాలను రద్దు పరచి, నోటిఫికేషన్ వేసి, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో నియామకాలను చేపట్టాలని వారు కోరారు. -
ఏబీసీడబ్ల్యూపై మరోసారి ఏసీబీ దాడి
శ్రీకాకుళం క్రైమ్: వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారిగా (ఏబీసీడబ్ల్యూ) సోంపేటలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న గడ్డి బాలముకుందరావు అవినీతిపై ఏసీబీ అధికారులు సోమ వారం మరోమారు దాడులు చేశారు. జిల్లాకేంద్రంలోని డీసీసీబీ కాలనీలో ఉన్న ఆయన నివాసగృహంతో పాటు చాపురం–3, ఇలిసిపురం–చినబజారు వద్దనున్న బంధువుల ఇళ్లల్లోనూ సోదా లు జరిపారు. జిల్లా ఏసీబీ డీఎస్పీ కెంబూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాల్లో రాజాం, శ్రీకాకుళం, కొత్తవలస సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 4 స్థిరాస్తులు (శ్రీకాకుళం పట్టణంలో భవనం సహా), సుమారు 322 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.75 కిలోల వెండి, నగదు, ఒక మారుతీ సెలెరియా కారు, రెండు ద్విచక్రవాహనాలు, విలువైన గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న కంచిలి బీసీ వసతిగృహంలో ఆయనపై విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణల మీద దాడులు చేశారు. అప్పట్లో రూ.1,84,070 డబ్బు దొరకడంతో పాటు ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. డీబీసీడబ్ల్యూపైనా ఆరోపణలు..? ఈ మొత్తం ఎపిసోడ్పై జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారిపైనా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో ఉద్యోగ విరమణ చేయనున్న ఏబీసీడబ్ల్యూ బాలగోవిందరావు జనవరి నుంచి ఏప్రిల్ వరకు సెలవు కోరు తూ దరఖాస్తు జిల్లా అధికారికి పెట్టుకున్నారు. దానికి ఆమె సెలవు మంజూరు, పింఛన్కు సంబంధించి ప్రపోజల్స్ పూర్తిగా చేసి ఇవ్వాలంటే సోంపేట డివిజన్ వసతిగృహాల విద్యార్థుల మెస్బిల్లులు మంజూరు చేసినందుకు రావాల్సిన మా మూళ్లు కలెక్ట్చేసి తీసుకురావాలని కోరినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వసంతోత్సవం అంటారు
హిందూ సంప్రదాయంలో ఈ ఉత్సవాన్ని వసంతోత్సవంగా పిలుస్తారు. మూడు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు కామదహనోత్సవం, రెండో రోజు పడియా సందర్భంగా సముద్ర స్నానాలు చేస్తారు. మూడో రోజున స్వామివారిని తోటలోని డోలో మండపంలో ఉంచి ఊయలలో ఊపుతూ డోలోత్సవం నిర్వహిస్తాం. – ఇప్పిలి శంకరశర్మ, ప్రధాన అర్చకులు, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం కళ్లకు, చర్మానికి ఎలాంటి ప్రమాదం రాకుండా సహజ రంగులు వాడాలి. రసాయన రంగుల వల్ల కళ్లలో రంగు పడితే ఎరుపుగా అయి కళ్లలో నీరుకారుతుంది. అలాగే చర్మ వ్యాధులు వస్తాయి. జాగ్రత్తలు పాటించాలి. – ఎంఆర్కే దాస్, ఆఫ్తాలమిక్ ఆఫీసర్ హోలీలో కొంత మంది రసాయన రంగులు వినియోగిస్తుంటారు. ఇది చర్మానికి ఎంతో ప్రమాదకరం. ముఖ్యంగా చిన్న పిల్లల చర్మంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. చర్మం అలర్జీలు ఉన్నవారు వీలైనంత మేరకు రంగులు పడకుండా దూరంగా ఉండాలి. – ఆర్.జ్యోతి, చర్మవ్యాధి నిపుణులు, జిల్లా ఆస్పత్రి, టెక్కలి ● -
విద్యుత్ షాక్తో గుర్తు తెలియని యువకుడు మృతి
టెక్కలి రూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల పాఠశాల ప్రహరీ వద్ద సోమవారం గుర్తు తెలియని యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రహరీ లోపలి భాగంలో గోడ కంటే ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైర్ను గోడపైకి ఎక్కి పట్టుకోవడంతో విద్యుత్ షాక్కు గురైనట్లు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాము ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వివరాలు తెలియరాలేదని, సుమారు 38 ఏళ్లు ఉంటాయన్నారు. ఆచూకీ తెలిసిన వారు తమకు తెలియజేయాలని కోరారు. అనంతరం మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పశువులు పట్టివేత రణస్థలం: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు 5 బొలేరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 14 పశువులను జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి పట్టుకొని కేసు నమోదు చేశారు. -
హోరెత్తిపోవాలి
● మార్కెట్లో రంగుల విక్రయాలు ● దేవాలయాల్లో డోలోత్సవాలు ● రంగులతో జాగ్రత్త తప్పనిసరి శ్రీకాకుళం కల్చరల్: హోలీ సమయం ఆసన్నమైంది. ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజున హోలీ పండగను జరుపుకుంటారు. అయితే ఈ నెల 3న హోలీ పడినా ఆ రోజు చంద్రగ్రహణం కావడంతో హోలీని మార్వాడీలు 4న జరుపుకుంటున్నారు. కొంతమంది మంగళవారమే చేసుకుంటారు. ఈ రంగుల పండుగ ఎంతటి ఆనందదాయకమో.. అంతటి అపాయం కూడా. రంగుల ఎంపిక నుంచి ర సాయనాల వరకు అన్నీ జాగ్రత్తగా చూసు కుని ఆ తర్వాతే సంబరం జరుపుకోవాలి. ● రక్తచందనం, ఎర్రమందారం, టమాటా, క్యారెట్లతో ఎర్రరంగు తయారు చేయవచ్చు. ● గోరింటాకుతో ఆకుపచ్చని రంగు తయారు చేయవచ్చు. ● పసుపు కొమ్ములను దంచి నీళ్లలో నానబెట్టి పసుపు రంగు చేసుకోవచ్చు. ● మోదుగపూలను నీటిలో నానబెట్టి రంగులను తయారు చేస్తారు. ● గోగుపూలతో బోలెడంత ఎర్రరంగు తయరు చేసుకోవచ్చు. దేవాలయాల్లో వసంతోత్సవం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా పలు దేవాలయాల్లో వసంతోత్సవం పేరుతో స్వామికి డోలోత్సవాలను నిర్వహించనున్నారు. దేశంలోనే ఏకై క దేవాలయమైన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో డోలోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముందు రోజు కామదహనోత్సవం నిర్వహిస్తారు. అనంతరం పడియ సందర్బంగా సముద్ర స్నానాలు చేస్తారు. ఈ సందర్భంగా ఉషా, ఛాయా, పద్మినీ సమేత శ్రీసూర్యనారాయణ స్వామిని రోడ్డు పక్కనున్న డోలో మండపంలో ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనమిస్తారు. చంద్ర గ్రహణం కారణంగా 3వ తేదీన ఉదయం 10గంటలలోపు నిర్వహిస్తున్నారు. మార్వాడీల హోలీ.. జిల్లా కేంద్రంలో దాదాపు 150 మార్వాడీ కుటుంబాల వారు ఉన్నారు. వీరు రాజస్థాని మిలన్ మంచ్ ఆధ్వర్యంలో హోలీ నిర్వహిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం ముందురోజు రాత్రి న్యూకాలనీలోని బాలాజీ అపార్టు మెంటు వద్ద హోలికా పూజలు చేస్తారు. అతిపెద్ద నెగడు వేసి దాని చుట్టు తిరుగుతూ పాటలు పాడతారు. ఉదయం ఎస్ఆర్ఎంటి కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి, ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకుంటారు. హోలీలో సహజమైన రంగులు మాత్రమే వాడాలి. రసాయన రంగులు వాడి ప్రమాదం తెచ్చుకోవద్దు. ప్రమాదకరమైన రంగుల వల్ల కళ్లకు ఎలాంటి హాని జరగకుండా సన్ గ్లాసెస్ ధరించాలి. హోలీ రంగులలో ఉపయోగించే క్రోమియం, సీసం రసాయనాలు క్యాన్సర్ కారకాలు. హోలీ వేడుకల వల్ల గాలిలోకి రంగుల సూక్ష్మ కణాలు చేరుతాయి. దాని వల్ల మనకు తుమ్ములు, దగ్గు వచ్చి శ్వాశకోస సంబంధ ఇబ్బందులు వస్తాయి. రంగులు పూసుకునేటప్పుడు కళ్లు, పెదాలు మూసుకోవాలి. హోలీ ఆడాక గోరు వెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. -
డోలోత్సవానికి వేళాయె..!
● మూడు రోజుల పాటు కూర్మనాథుని డోలోత్సవాలు ● నేటి రాత్రి కామ దహనోత్సవం ● అధిక సంఖ్యలో దర్శించుకోనున్న భక్తులుగార: ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథాలయంలో మంగళవారం నుంచి డోలోత్సవాలు ప్రారంభమవ్వనున్నాయి. తొలిరోజు రాత్రి 10 గంటల నుంచి కామ దహనోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఏటా పాల్గుణ మాస త్రయోదశి నాడు మాఘ నక్షత్రంలో జరిగే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఉంచి మేళతాళాలతో తిరువీధి నిర్వహిస్తారు. అనంతరం గ్రామ సమీపంలోని కామ దహన మంటపం వద్ద కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మనసులోని చెడు ఆలోచనలు పటాపంచలవుతాయని, మంచి కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. కామ దహనోత్సవం ముగిసిన తర్వాత బుధవారం వేకువజాము నుంచి సమీప ఎస్.మత్స్యలేశం తీరంలో భక్తులు పవిత్ర స్నానాలచరిస్తారు. మరలా ఆలయంలోని శ్వేత పుష్కరిణిలో పవిత్ర స్నానాలాచరిస్తారు. గురువారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి మూర్తులను మేళతాళాలతో ఊరేగించి, గ్రామదేవత ఆలయం సమీపంలోని డోలో మంటపం వద్దకు తీసుకెళ్లి ఉత్తరాభిముఖంగా స్వామిని వేంజేసింపజేసి బుక్కాభర్గుండతో పూజలు చేస్తారు. ఈ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఇదీ చరిత్ర.. విష్ణుమూర్తి దశావతారాల్లో రెండో అవతారం తాబేలు(కూర్మం) రూపం. ఇక్కడ మూలవిరాట్ను బ్రహ్మ ప్రతిష్టించారని, రాత్రి వేళల్లో దేవతల నిత్యార్చన, పగలు మానవ అర్చనలు జరుగుతుంటాయని చెబుతారు. ఆలయం ఎదురుగానున్న శ్వేత పుష్కరిణి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో తవ్వగా.. అందులో గరుడ వాహనంపై ఉన్న లక్ష్మీదేవి విగ్రహం లభ్యమై ఆలయంలో కూర్మనాయకిగా కొలువుంది. ఈ ఆలయం కృతయుగంలో నిర్మితమవ్వగా.. 11వ శతాబ్ధంలో రామానుజాచార్యులు తన దిగ్విజయ యాత్ర సందర్భంగా దీన్ని వైష్ణవ క్షేత్రంగా మార్చారని, ఈ విజయానికి చిహ్నంగా పశ్చిమాన విజయ స్థూపాన్ని నిర్మించారని ప్రతీతి. ఈ క్షేత్రాన్ని ఎనిమిదో శతాబ్ధంలో ఆదిశంకరాచార్యులు సందర్శించి స్వామివారికి సాలగ్రామాన్ని సమర్పించారు. 11వ శతాబ్ధంలో రామానుజాచార్యుల సందర్శన, 13వ శతాబ్ధంలో మద్వాచార్యులు శ్రీనరహరితీర్థుల క్షేత్రాన్ని సందర్శించి సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను బహుకరించారు. 1512వ సంవత్సరంలో చైతన్య మహాప్రభువులు క్షేత్రాన్ని సందర్శించారు. ఈ దేవాలయం అపురూప శిల్పకళతో ఉంటుంది. 108 రాతి స్తంభాలు ఒకదానితో ఇంకొకటి పోలిక ఉండవు. 600 ఏళ్లనాటి ఆకుపసర చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటాయి. పితృమోక్ష క్షేత్రం క్షేత్రం ఆవరణలోని శ్వేత పుష్కరిణిలో చనిపోయిన పెద్దల అస్తికలను కలిపితే ముక్తి లభిస్తుందని ఒక నమ్మకం. ఇందులో కలిపిన మానవ అస్తికలు కొద్ది రోజుల్లో శిలలుగా మారుతాయని భావిస్తారు. మానవుల కోర్కెలు దహించి, స్వామివారిని చేరే అద్భుత ఘట్టమైన కామదహనోత్సవంలో భక్తులు పాల్గొని, సముద్ర స్నానాలాచరించి, స్వామివారిని ఉత్తరాభిముఖంగా దర్శిస్తే ముక్తి లభిస్తుందని క్షేత్ర ప్రాశస్త్యం. మూడు రోజుల ఉత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలి. – సీహెచ్ సీతారామనృసింహాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు, శ్రీకూర్మనాథాలయం మూడు రోజుల పాటు నిర్వహించే ఈ డోలోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఉచిత క్యూలైన్ను ఆలయం వెనుక వైపు నుంచి ఏర్పాటు చేశాం. ప్రత్యేక దర్శనం వద్ద అదనపు క్యూలైన్లు ఏర్పాటు జరిగింది. లడ్డూ, పులిహోర ప్రసాదాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. – టి.వాసుదేవరావు, ఆలయ ఈవో, శ్రీకూర్మనాథాలయం -
ఆక్రమణలు గుర్తింపు
సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ పంచాయతీ పాలనాయుడుపేటలో ఎల్పీ నంబర్ 324, 325లో వేసిన లే–అవుట్లో ఆక్రమణలను రెవెన్యూ, పంచాయతీ అధికారులు గుర్తించారు. రియల్ దందా అనే శీర్షికతో ఆదివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు సోమవారం మండల సర్వేయర్ సుభాష్ ఆధ్వర్యంలో లే అవుట్ను పరిశీలించి సర్వే చేశారు. గ్రామ కంఠంకు సంబంధించి 7 సెంట్లు, వంశధార కాలువకు సంబంధించి 2 సెంట్లు కలిపి మొత్తం 9 సెంట్లు ఆక్రమణలకు గురైనట్లు తేల్చారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని మార్కింగ్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉప్పాడ ఉమాపతి, విలేజ్ సర్వేయర్ త్రిమూర్తులు ఉన్నారు. కాగా ఎల్పీ నంబర్ 324, 325లో భూములు కోర్టు పరిధిలో ఉన్నాయని, దీనిపై క్రయ, విక్రయాలు చేయకూడదని పీజీఆర్ఎస్లో కె.కుసుమారెడ్డి ఫిర్యాదు చేశారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
పొందూరు: త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న సైన్స్ సమగ్ర మహోత్సవ్–2026 పోటీలకు జిల్లా నుంచి పొందూరు కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పాత్రుని ఐశ్వర్య రూపొందించిన ‘ఫార్మర్స్ ఫ్రెండ్లీ లైఫ్ సేవర్స్ స్టిక్’ ప్రాజెక్టు ఎంపికై ందని ప్రిన్సిపాల్ ఎస్.లలిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో విద్యార్థినిని అధ్యాపక సిబ్బంది అభినందించారు. కౌలు రైతులను పట్టించుకోవడం లేదు సరుబుజ్జిలి: కౌలు రైతుల సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు ఆరోపించారు. మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో కౌలు రైతు సంఘం జిల్లా మహాసభలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు కార్డులు అందించడం ఇంతవరకు ఆచరణలో పెట్టలేదన్నారు. జిల్లాలో 30 శాతం మంది కౌలు రైతులు ఉన్నా.. వారికోసం పట్టించుకున్నవారే కరువయ్యారని ఆవేదనవ వ్యక్తం చేశారు. కౌలు కార్డులకు రుణాలు, అన్నదాత సుఖీభవ అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. సమావేశంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్రావు, జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, సీఐటీయూ మండల శాఖ కార్యదర్శి అదపాక రాజేష్, తదితరులు పాల్గొన్నారు. యువకుడిని కాపాడిన మైరెన్ పోలీసులు మందస: మండలంలోని రట్టి గ్రామంలో వల్లభనారాయణ స్వామి డోలోత్సవ యాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సోంపేట పట్టణంలోని గాంధీ నగర్కి చెందిన యువకుడు ఆర్థి వాసుదేవ్ తన స్నేహితులతో కలిసి సోమవారం సముద్ర స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న బారువ మైరెన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై యువకుడిని రక్షించి, ప్రథమ చికిత్స అందించి.. 108 వాహనంలో హరిపురం పీహెచ్సీకి తరలించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని బారువ మైరెన్ సీఐ రమేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ కోదండరావు, హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు, కానిస్టేబుల్ సంఘమేశ్వరరావు, హరిప్రసాద్ రాజు, హోమ్ గార్డ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి బల ప్రదర్శన పోటీలు
సారవకోట: మండలంలోని వడ్డినవలస గ్రామంలో త్రినాథస్వామి ఆలయ 69వ వార్షికోత్సవంలో భాగంగా జిల్లాస్థాయి బలప్రదర్శన పోటీలు నిర్వహించారు. 80 కిలోల విసురుగుండు పోటీల్లో ఒప్పంగి గ్రామానికి చెందిన గేదెల సత్యనారాయణ ప్రథమ, గేదెల రమణ ద్వితీయ బహుమతి పొందారు. అలాగే 100 కిలోల తీత సంగిడి పోటీల్లో గేదెల సత్యనారాయణ ప్రథమ, ఆవల గోవిందరావు ద్వితీయ బహుమతులు పొందారు. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ఆవల గోవిందరావు, ముద్దాడ తరుణ్ కుమార్లు ఇద్దరు 160 కిలోలు ఎత్తడంతో ఇద్దరికీ ప్రథమ స్థానం, బిల్లాడ యోగేశ్వరరావును ద్వితీయ స్థానానికి ఎంపిక చేశారు. అలాగే బాలికల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆడవరానికి చెందిన గుజ్జల వర్షిత 103 కిలోలు ఎత్తి ప్రథమ స్థానం, 95 కిలోలు ఎత్తి దూబ హేమశ్రీ ద్వితీయ స్థానంలో నిలిచారు. 203 కిలోల ఈడ్పు గుండు పోటీల్లో ఆవల గోవిందరావు ప్రథమ స్థానం సాధించారు. -
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 99 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీదారుల నుంచి వచ్చే వినతులను త్వరిగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలకు క్షేత్రస్థాయిలో అధికారులు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని, ప్రతి అర్జీదారుడికి సంతృప్తికరమైన సమాధానం అందాలని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 99 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 22 అర్జీలు రాగా, పంచాయతీ రాజ్ శాఖకు 19, సెర్ప్ విభాగంలో 13, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో 10 వినతులు అందాయి. అలాగే జలవనరుల శాఖ, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖలకు సంబంధించి చెరో 4 అర్జీలు రాగా, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగంలో 3 ఫిర్యాదులు అందాయి. ఆర్టీసీ, సర్వే సెటిల్మెంట్స్, బీసీ సంక్షేమం, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖలపై రెండేసి చొప్పున వినతులు వచ్చాయి. వీటితో పాటు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఎన్టీఆర్ వైద్య సేవ, కాలుష్య నియంత్రణ మండలి సహా మొత్తం 22 విభాగాలకు చెందిన సమస్యలను ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యలపై అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే గ్రీవెన్స్ హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రెవెన్యూ క్లినిక్ వద్ద జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. మండలాల వారీగా ఏర్పాటు చేసిన డెస్క్ల వద్దకు వెళ్లి, అక్కడ ఉన్న దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల అర్జీలను స్వయంగా పరిశీలించారు. అక్కడికక్కడే రెవెన్యూ సిబ్బందితో కలిసి చర్చించి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. భయానక పరిస్థితులు నెలకొన్నాయి శ్రీకాకుళం నుంచి ఎచ్చెర్ల మండలంలోని పొన్నాడకు వెళ్లే రోడ్డులో వంతెన వద్ద ఇటీవల భయానక పరిస్థితులు నెలకొన్నాయని కొంగరాం, ముద్దాడ, వెంకన్నగారిపేట తదితర గ్రామాలకు చెందిన ప్రజలు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. పొన్నాడ తర్వాత సుమారుగా పది గ్రామాలు ఉన్నాయని, వారంతా పగలు, రాత్రి ఆ మార్గం గుండానే ప్రయాణాలు చేస్తుంటారని తెలిపారు. ఇటీవల ఆ బిడ్జి సమీపంలో హత్యలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన అధికారులు స్పందించి ప్రజల భద్రతపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
కూటమిది ఈవెంట్ల ప్రభుత్వం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కూటమి ప్రభుత్వంలో రైతు సదస్సులు, విద్యా సదస్సులు నిర్వహించరు గానీ ఈవెంట్లకు మాత్రం రూ.కోట్లు ఖర్చు చేస్తారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) దుంపల లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా ఈవెంట్ కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. డీఎస్సీ–2024కి ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే క్రమంలో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగే ఈవెంట్లకు అయ్యే ఖర్చు సగటున రూ.20 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఉంటోందన్నారు. ఇలా అనేక విధాలుగా ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిధులను వ్యవసాయ రంగానికి లేదా విద్యా రంగానికి లేదా మెడికల్ కళాశాలల అభివృద్ధి కోసం ఖర్చుచేస్తే అన్నివర్గాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇలానే పాలన సాగిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
● ఇద్దరికి గాయాలు సారవకోట: మండలంలో అలుదు గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 326–ఏ పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల మండలం కొయ్యాం గ్రామానికి చెందిన మజ్జి నరేంద్ర (24) మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలంలోని కొయ్యాం నుంచి పెళ్లి కబుర్లు చెప్పేందుకు సారవకోట వైపు ద్విచక్ర వాహనంపై మజ్జి నరేంద్ర, మజ్జి అప్పలనాయుడు వెళ్తున్నారు. అదే సమయంలో పాతపట్నం మండలంలోని సీది నుంచి ఆటోలో గేదెల వరలక్ష్మి, ఆటో డ్రైవర్ కృష్ణ సారవకోట మండలంలోని వడ్డినవలస వెళ్తున్నారు. అలుదు గ్రామం రెల్లివీధి సమీపంలో జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొనడంతో మజ్జి నరేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే మజ్జి అప్పలనాయుడుతో పాటు ఆటోలో ఉన్న వరలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో నరేంద్ర, అప్పలనాయుడు, వరలక్ష్మిలను 108 వాహనంలో నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. నరేంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ఖాళీ స్థలం.. కనిపిస్తే వదలం..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పలాస నియోజకవర్గంలో ఆక్రమణలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. భూదందాతో కొందరు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు, వాగులు, కాలువలు, గోర్జ, చెరు వులని చూడకుండా కబ్జా చేసేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఇష్టారీతిన ఆక్రమించేసి, చదును చేసి అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు. నియోజకవర్గ కేంద్రమైన పలాస, కాశీబుగ్గలోనే కాకుండా మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో కూడా ప్రభుత్వ భూములను వదలడం లేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పాగా వేసేస్తున్నారు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. కళ్ల ముందే చెరువులు, కాలువలు, గెడ్డలు కబ్జాకు గురవుతుంటే చోద్యం చూస్తున్నారు. అధికారులు ఇలాగే కళ్లు మూసుకుంటే కొండ వూరు పంచాయతీ పరిధిలోకి వచ్చే పగడాల చెరువు, నారాయణపురం నుంచి పెద్ద బొడ్డపాడు వరకు ఉన్న ఎర్రగెడ్డ పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే మూడింతల చెరువు గర్భం కబ్జాకు గురైంది. మిగతాది ఆక్రమించే పనిలో అక్రమార్కులు పడ్డారు. ఖాళీగా కనిపిస్తే చాలు ఆక్రమణ పలాస నియోజకవర్గంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడ భూముల ధరలు బంగారం ధరల్లా రోజురోజుకి పెరిగిపోతున్నా యి. దీంతో అక్రమార్కుల కన్ను ఖాళీ భూములపై పడింది. ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ కబ్జా చేసేస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో అత్యధికంగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురైన వాటిలో పలాస నియోజకవర్గం అగ్రగామిగా నిలిచింది. రోజురోజుకీ ఆక్రమణలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములను కబ్జా కోరులు కబళించేస్తున్నారు. సా గుకు, వ్యాపారాలకు ఆ ఆక్రమణలను వేదికగా చేసుకుంటున్నారు. ఇక్కడ వందలాది ఎకరాలు అక్రమ లావాదేవీల ద్వారా చేతులు మారిపోయా యి. దాదాపు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఆక్రమణలే కనిపిస్తున్నాయి. ఆ మూడు గ్రామాల వారే.. సర్వే నంబర్ 364పరిధిలో గల పగడాల చెరువు 29.86ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికే 20ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. తొలుత గట్టు తొలగించేసి మొక్కలు వేసేశారు. ఆ తర్వాత చెరువు గర్భంలోకి ప్రవేశించారు. తుంభవానిపేట, కొల్లిపాడు, కొండ వూరుకు చెందిన 17మంది పెద్దలు ఆక్రమించేశారు. ఆక్రమిత భూముల్లో కొబ్బరి మొక్కలు వేసుకుని సాగు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆక్రమించిన చెరువు భూములను విక్రయాలకు కూడా పెట్టేశారు. ఇప్పటికే కొందరి చేతులు మారిపోయాయి. సెంటు రూ. 25వేల నుంచి రూ. 30వేల వరకు ఉంది. ఈ లెక్కన ఎకరా రూ. 30లక్షల వరకు ధర పలుకుతోంది. ఎర్రగెడ్డను సైతం వదలని అక్రమార్కులు వజ్రపుకొత్తూరు మండలం నారాయణపురం నుంచి గర్తంవానిపేట మీదుగా పెద్దబొడ్డపాడు వరకు 5కిలో మీటర్ల మేర ఉన్న ఎర్రగెడ్డను ఆక్రమణదారులు వదల్లేదు. ఐదు గ్రామాలకు చెందిన 40మంది వరకు గెడ్డను ఆక్రమించారు. ఎర్రగెడ్డపైన వంశధార 5ఎల్ఆర్ కాలువ ఉండగా, దిగువ వైపు ఎర్రగెడ్డ ఉంటుంది. ఈ గెడ్డనే కాదు ఆనుకుని ఉన్న అటవీ భూములను, కొండ పోరంబోకు భూములను కూడా ఆక్రమించారు. పలాస నియోజకవర్గంలో ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములు చెరువులు, గెడ్డలు, కాలువ, కొండలు, వాగుల కబ్జా దర్జాగా చదును చేసి అనుభవంలోకి తెచ్చుకుంటున్న అక్రమార్కులు ఆక్రమణలతో కనుమరుగవుతున్న వజ్రపుకొత్తూరు మండలంలోని పగడాల చెరువు, ఎర్రగెడ్డ -
నిలిచిపోయిన బియ్యం లారీలు
పలాస: పలాస మండలం లొద్దబద్ర గ్రామం వేర్ హౌస్ గోడౌన్ వద్ద గత మూడు రోజులుగా బియ్యం లారీలు నిలిచిపోయాయి. అన్లోడింగ్ కోసం లారీ డ్రైవర్లు అక్కడే నిద్రాహారాలు మాని కాచుకుని ఉన్నారు. కొంతమంది లారీలను అక్క డే విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. వారం రోజుల కిందట జిల్లాలోని వివిధ మిల్లర్లకు శ్రీకాకుళం ఎఫ్సీఐ డీఎం నుంచి వారికి ఆర్డరు కాపీలు అందాయి. పలాస మండలం లొద్దబద్ర తీసుకొని వెళ్లమని తెలియజేశారు. దీంతో నరసన్నపేట, టె క్కలి, నందిగాం, పలాస, సోంపేట, కోటబొ మ్మాళి తదితర ప్రాంతాల నుంచి బియ్యం లారీ లు గత నెల 26 నుంచి క్యూకట్టాయి. మొదటి రోజు కొన్ని లారీలు ఆన్లోడింగ్ చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో అక్కడ ఉన్న లారీల బియ్యాన్ని దించవద్దని అక్కడ సిబ్బందికి ఆదేశాలు రావడంతో అన్ లోడింగ్ను ఆపేశారు. దీంతో అప్పటి నుంచి మూడు రోజుల నుంచి అక్కడే లారీలతో బియ్యం ఉంటున్నాయి. ప్రస్తుతం ఆదివారానికి 35 లారీల బియ్యం ఉన్నాయి. బయట రోడ్డు మీద కూడా మరో పది వరకు ఉన్నాయి. తప్పని పరిస్థితిలో ఆ బియ్యం లారీలు వెనక్కి వెళ్లలేక, అక్కడ దించలేక డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. లారీలు అక్కడ నిలిచిపోవడంతో రోజుకు రూ.10వేలు నష్టం అవుతోందని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రికి చెందిన లారీ డ్రైవరు యాకూబ్ మాట్లాడుతూ మూడు రోజులుగా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చిందని, వంట చేసుకొని తింటున్నామని, కనీసం మంచి నీరు కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై పలాస వేర్ హౌస్ గొడౌన్ మేనేజరు శ్రీనివాసరావును వివరణ కోరగా తమకు ఇంకా విజయవాడ నుంచి ఆర్డరు కాపీ రావాల్సి ఉందని, అది వస్తే ఈ సమ స్య పరిష్కారం అవుతుందని తెలిపారు. -
సైబర్ సెక్యూరిటీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
పాతపట్నం: పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి కౌసిక్ వికాస్ యోజన 4.0 ద్వారా సైబర్ సెక్యూరిటీ కోర్సుకు ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.చక్రపతి ఆదివారం తెలిపారు. సైబర్ సెక్యూరిటీ కోర్సు మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 7వ తేదీలోగా సర్టిఫికెట్తో పాటు ఆధార్ కార్డు, ధ్రువీకరణ పత్రాలతో పాతపట్నం డిగ్రీ కళాశాలలో ఉన్న స్కిల్ హబ్ సెంటర్ను సంప్రదించాలని, 9553292734 నంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు. జిల్లా స్థాయి ఇంటర్ క్లబ్ స్కేటింగ్ పోటీలు పలాస: పలాసలో జిల్లా స్థాయి ఇంటర్ క్లబ్ స్కేటింగ్ పోటీలు ఆదివారం జరిగాయి. ఈ పోటీలను మున్సిపల్ కమిషనర్ ఇ.శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ స్కేటింగ్ వల్ల ఏకాగ్రత శక్తి పెరుగుతుందన్నారు. ఈ క్రీడాకారులు జాతీ య స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో స్కేటింగ్ క్లబ్ నిర్వాహకులు టి.వి ప్రవీణ్, షన్మఖ,కోచ్లు పాల్గొన్నారు. రేపు ఆలయాల మూసివేత అరసవల్లి: కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయా న్ని ఈ నెల 3న మూసివేస్తున్నట్లుగా ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ సంయుక్తంగా ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగుతున్న నేపథ్యంలో ఆదిత్యుని ఆలయంలో మంగళవారం ఉద యం నిత్యార్చన, బాలభోగం అనంతరం ఉద యం 9.30 గంటల నుంచి ఆలయ తలుపులు మూసివేయనున్నట్లుగా వివరించారు. గ్రహణానంతరం సంప్రోక్షణ, శుద్ధి తదితర ప్రక్రి యల అనంతరం అంటే బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి తిరిగి సర్వదర్శనాలు మొదలవుతాయని వారు తెలియజేశారు. భక్తులు గ్రహణ నియమాలు పాటించి, విడుపు అనంతరం ఆదిత్యుడిని దర్శించుకోవాలని శంకరశర్మ సూచించారు. 3న శ్రీకూర్మనాథాలయం మూసివేత గార: మూడో తేదీన పౌర్ణమిలో చంద్రగ్రహణం కారణంగా ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీకూర్మనాథాలయం ఉదయం 11 గంటల నుంచి మూసివేస్తున్నామని ఆలయ ఈఓ టి.వాసుదేవరావు అన్నారు. మంగళవారం ఉదయం దర్శనాలు అనంతరం మూసివేసి సాయంత్రం 7. 30 గంటల నుంచి సంప్రోక్షణ జరుగుతుందన్నారు. రెండు గంటల తర్వాత భక్తులకు దర్శనాలు ఉంటాయని తెలిపారు. శ్రీముఖలింగంలోనూ ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. ప్రశాంతంగా ప్రవేశ పరీక్షలు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్వంలో 5, ఇంటర్మీడియెట్ తరగతుల్లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 2026–2027 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం జిల్లా నందు గల 9 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. 5వ తరగతి ప్రవేశ పరీక్షకు (09 పరీక్షా కేంద్రాలు) 887 మంది దరఖాస్తు చేసుకోగా 756 మంది హాజర య్యారు. 131 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియెట్ ప్రవేశ పరీక్షకు జనరల్ కి (09 పరీక్షా కేంద్రాలు) 1201 మంది దరఖాస్తు చేసుకోగా 1093 మంది హాజరుకాగా, 108 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియెట్ (ఐఐటీ, నీట్) ప్రవేశ పరీక్షకు (09 పరీక్షా కేంద్రాలు) 768 మంది దరఖాస్తు చేసుకోగా 689 మంది హాజ రు కాగా, 79 మంది గైర్హాజరయ్యారు. జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా సమన్వయాధికారి వై.యశోద లక్ష్మి పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. -
పారిశుద్ధ్య పనుల పరిశీలన
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరును స్వయంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మేధర వీధి, మార్కెట్ ఏరియా, ఇప్పిలి వీధి, చిన్న బజార్, పరిసర ప్రాంతాల్లో ఆదివారం విస్త్రృతంగా పర్యటించారు. డయేరియాను పూర్తి గా అరికట్టేందుకు 20 ప్రత్యేక టీమ్స్తో పర్యవేక్షణ జరుగుతుందని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కొంతమంది వ్యాపారులు చికెన్ షాపులను తెరవడంపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బందికి, ప్రజలకి మధ్య సమన్వయం ఉండాలనీ, వ్యర్థాలను సేకరించేందుకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు సహకరించా లని వర్తకులను, ప్రజలను కోరారు. ఆవులు తిరిగే ప్రదేశంలో పేడ కనిపించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో డయేరియా బాధితుల సంఖ్య నిలకడగా ఉందని, భయపడాల్సిన పని లేదని కలెక్టర్ తెలిపారు. పర్యటనలో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కబ్జా కోరల్లో పగడాల చెరువు
వజ్రపుకొత్తూరు మండలం కొండ వూరు బౌండరీ పరిధిలోకి వచ్చే పగడాల చెరువు విస్తీర్ణం 29.86 ఎకరాలు ఉంటే అందులో 20ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. చెరువు, గుట్టలతో పాటు గర్భమంతా ఆక్రమించేశారు. దాదాపు 200 మంది రైతులకు చెందిన 150 ఎకరాల వరకు ఆయకట్టుగా ఉండే పగడాల చెరువును కళ్ల ముందే రోజురోజుకి కబ్జా చేసేస్తున్నారు. చెరువు సరిహద్దుకు ఆనుకుని జిరాయితీ పొ లాలు ఉండటంతో వాటి ముసుగులో గట్లపై మొక్కలు వేస్తూ అలా చెరువు గర్భంలో చొరబడి ఆక్రమించేశారు. చెరువుకు ఉత్తర, పడమర, దక్షిణ వైపు గట్లు ఏకంగా కనుమరుగయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద గట్లు వేసేందుకు ప్రయత్నిస్తుంటే ఆక్రమణదారులు అడ్డుకునేంతవరకు వెళ్లిపోయారు. -
మందుగుండు సామగ్రి స్వాధీనం
శ్రీకాకుళం రూరల్: మండల పరిధి సింగుపురం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన గల ఓ భవనంలో క్వారీ రాళ్లకు వాడే మందుగుండు సామగ్రిని శ్రీకాకుళం రూరల్ పోలీసులు ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు రూరల్ ఎస్ఐ రాము, సిబ్బందితో కలిసి మాకుమ్మడిగా దాడులు చేసి వంజరాపు రామారావు అనే వ్యక్తి ఇంటిలో నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ సామగ్రిని క్వారీ రాళ్లు పేల్చేందుకు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వివరించారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిలో లిక్విడ్ స్టిక్స్ 5 బాక్సులు, ఆర్డినరీ డిటో నేటర్స్ 15 బాక్సులు, ఫ్యూజ్వైర్ 5 కట్టలు, కొండ ఒత్తులు 50 మీటర్లు ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. ఈ సామగ్రిని లైసెన్స్డ్ షాపులకు తరలిస్తున్నట్లు తెలిపారు. -
ఇక నివేదన సక్రమంగా..
● ‘సాక్షి’ కథనానికి స్పందించిన అధికారులు అరసవల్లి: ‘సాక్షి’ కథనానికి ఆలయ అధికారులు స్పందించారు. స్వామికి ప్రసాదాల నివేదన సక్రమమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుమారు రెండున్నరేళ్ల నుంచి బ్రాహ్మణ వంట పంతుల నియామకాన్ని చేపట్టకుండా ప్రసాదాల నివేదన లేకుండానే జరుగుతున్న అపచారానికి ఎట్టకేలకు చెక్ పడింది. లడ్డూ, పులిహోరలను తయారు చేసి ఆదిత్యుని మూలవిరాట్టుకు తొలిగా నివేదించకుండానే... ప్రసాదాల పేరిట విక్రయిస్తూ భక్తుల మ నోభావాలతో ఆటలాడుకున్న వైనాన్ని ‘ప్రసాదమా...అపచారమా...’ పేరిట ‘సాక్షి’లో గత నెల 26న గురువారం కథనం ప్రచురితమైంది. దీనిపై హింధూ ధర్మ పరిరక్షణ సమితి, అర్చక, పురోహిత సంఘాల ప్రతినిధులు తీవ్రంగా స్పందించి దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు ఈ కథనం క్లిప్పింగ్స్ను వాట్పాప్ ద్వారా పంపించారు. దీంతో ఉన్న తాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ఆలయంలో బ్రాహ్మణ వంట పంతులు తాతావారి సోమేశ్వర శర్మను నియమించా రు. ఈ మేరకు ఆయన ఆలయ నిబంధనల మేరకు ఆచారాలకు తగ్గట్టుగా ఆదివారం ఉదయం నుంచి వండిన పులిహోర, లడ్డూలను ఉదయం 6 గంటలకే గర్భాలయంలోని ఆదిత్యునికి నివేదించి, అనంతరం ప్రసాదాలుగా భక్తులకు విక్రయాలు ప్రారంభించారు. అలాగే భక్తులకు దర్శనానంతరం ఇస్తున్న నిత్యాన్నప్రసాదాలను కూడా ఆయనే స్వయంగా తయారు చేసి వాటిని కూడా స్వామికి నివేదించారు. -
పరిస్థితి దారుణం
మొక్కజొన్న రైతు పరిస్థితి దారుణం. కనీస మద్దతు ధర దక్కలేదు. గత ప్రభుత్వం అయితే రూ.2400 మద్దతు ధర ప్రకటించి రైతుల నుంచి కొనుగోలు చేసింది. కానీ టీడీపీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేయలేదు. అందుకే దళారులకు రూ.1700కు విక్రయించుకుంటున్న పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో బాగుండేది. ఇప్పుడే తీరని అన్యాయం జరుగుతోంది. మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. – కొవగాపు నవీన్, రైతు, తాయిమాంబాపురం శ్రమకు తగిన ఫలితం లేదు.. తక్కువ రోజుల్లో పంట అందుబాటులోకి వస్తుందని భావించి మొక్కజొన్న వేసుకున్నాం. ఆరుగాలం కష్టపడి పంటను సాగుచేస్తే గిట్టుబా టు లేదు. మద్దతు ధర అయితే ప్రకటిస్తున్నారు. కానీ కొనుగోలు చేసిన వారు కరువవుతున్నారు. ఇప్పటికై నా మార్కెటింగ్, రవాణా కల్పించాలి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి. – ఎల్.శ్రీనివాసరావు, రైతు, కిట్టాలపాడు -
గట్టి చేతలు!
చిట్టి చేతులు..● చిన్ననాటి నుంచే సమాజ సేవ ● పీఎంశ్రీ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు ● సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా శిక్షణ ● పాఠశాలల్లో మెరుగుపడనున్న సౌకర్యాలు హిరమండలం: నూతన విద్యావిధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పాఠశాలలను ఏర్పాటుచేసింది. సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు సమాజ సేవా కార్యక్రమాలను చేపడుతోంది. దీనిలో భాగంగా ప్రతి పీఎంశ్రీ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటుచేస్తున్నారు. సేవాభావంతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాల పెంపు, సమాజంలో నడవడిక తదితర రంగాల్లో విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 81 పీఎంశ్రీ పాఠశాలలను ఎంపికచేసి ఆన్లైన్లో నమోదుచేశారు. తొలి విడతలో ఎంపికై న 32, రెండో విడతలో ఎంపికై న 3 పాఠశాలలకు నిధులు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూర్చుతుంది. ఇప్పటివరకూ ఆ రెండు విడతల్లో రూ.4.2 కోట్లు నిధులు వెచ్చించినట్టు తెలుస్తోంది. అయితే ఎందుకో మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో పాఠశాలల ఎంపిక జరగలేదు. ఇప్పుడు ఏడో విడతలో మాత్రం ఏకంగా 81 పాఠశాలలను ఎంపిక చేసినట్టు సమాచారం. తొలి రెండు విడతల్లో ఎంపిక చేసిన 35 పాఠశాలల్లో పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. దేశభక్తి పెంచేలా.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 35 పాఠశాలలకు సంబంధించి స్కౌట్స్ అండ్ గైడ్స్ను ఇప్పటికే ఏర్పాటుచేశారు. ఇందుకుగాను ఒక్కో పాఠశాలకు రూ.50 వేలు వంతున కేటాయించారు. పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చారు. ఇందుకు రూ.5 వేలు కేటాయించారు. ఉపాధ్యాయులు నేర్చుకున్న అంశాలను, మెలకువలను విద్యార్థులతో చేయిస్తారు. ఇప్పటికే దాదాపు 800 మంది విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్లో చేరారు. ఈ విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటడంతో పాటు సంరక్షించే బాధ్యతలను తీసుకుంటారు. దేవాలయాల వార్షికోత్సవాలు, వివిధ వేడుకల సమయంలో వచ్చే భక్తులను క్యూలైన్లో వెళ్లేలా పర్యవేక్షిస్తారు. తాగునీరు, మజ్జిగ, ప్రసాదాలను పంపిణీ చేస్తారు. స్వాతంత్ర దినోత్సవాలు, రిపబ్లిక్డే వేడుకల్లో భాగస్థులవుతారు. అయితే ప్రాథమిక స్థాయి నుంచే సేవ, దేశభక్తి అలవరచడానికి ఇవి ఎంతగానో దోహదం చేస్తాయంటున్నారు వ్యక్తిత్వ నిపుణులు. కేంద్ర ప్రభుత్వం ఏటా మరిన్ని పాఠశాలలను పీఎంశ్రీకు ఎంపిక చేసేందుకు సన్నాహాలు చేయడం శుభ పరిణామం. సమగ్ర వసతులు.. పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రధానంగా క్రీడాంశాలకు ప్రాధాన్యమిస్తారు. క్రీడా కోర్టులు, రన్నింగ్ ట్రాక్లతో పాటు మైదానాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇంకుడు గుంతలు, కిచెన్ గార్డులు, ఉద్యానాలు, రక్షణ కంచెలను ఏర్పాటుచేస్తున్నారు. తరగతి గదులకు సంబంధించి ర్యాంపుల నిర్మాణం చేపడుతున్నారు. ప్రయోగశాలలో పరికరాలు, గ్రంథాలయాల్లో పుస్తకాలు ఏర్పాటుచేస్తున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్కు విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. యూనిఫాం అందిస్తున్నారు. దివ్యాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటుచేస్తున్నారు. పాఠశాల నిర్వహణకు సైతం ప్రత్యేక నిధుల కేటాయింపు జరుగుతోంది. విద్యార్థి దశలోనే వ్యక్తిత్వ వికాసం కలిగించాలన్నది పీఎంశ్రీ పాఠశాలల లక్ష్యం. దేశభక్తి, సమాజ సేవను ప్రాథమిక స్థాయిలో అలవరచాలి. తద్వారా నాయకత్వ లక్షణాలు సైతం అలవడుతాయి. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఇవి ఎంతగానో దోహదపడుతాయి. – కె.రాంబాబు ఎంఈఓ, హిరమండలం -
హిందీ ప్రతిభారత్న పురస్కారాల ప్రదానం
రణస్థలం: హిందీ సేవాసదన్ (అనంతపురం) ఆధ్వర్యంలో గత నెల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన హిందీ టాలెంట్ టెస్ట్ జిల్లా స్థాయి విద్యార్థుల ఉత్తరాంధ్ర స్థాయి అభినందన సభ ఆదివారం రణస్థలం భాష్యం స్కూల్ ఆవరణలో నిర్వహించారు. కేంద్రం ఆర్థికశాఖ హిందీ సలహా మండలి సభ్యుడు కోనే శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర సహకార, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖల హిందీ సలహా మండలి సభ్యుడు ఎస్.గైబువల్లి హాజరై ఉత్తరాంధ్ర స్థాయిలో ఆరు జిల్లాల టాపర్లకు ప్రతిభారత్న పురస్కారాలు ప్రదానం చేశారు. 60 మందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. హిందీ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు, ఏపీ హిందీ ప్రఽచార సభ రాష్ట్ర అధ్యక్షుడు సి.ఎల్.నాయుడు, భాష్యం పాఠశాల ప్రిన్సిపాల్ ఏ.ఈశ్వరరావు, సూర్య హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ యశ్వంత్, ఎం.వి.మల్లేశ్వరరావు, హిందీ మంచ్ నాయకులు బాడ మంజుల, రామారావు, హిందీ మంచ్ విజయనగరం జిల్లా గౌరవాధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, విశాఖ జిల్లా కన్వీనర్ మహేంద్రనాథ్, పాడేరు జిల్లా ప్రతినిధి శెట్టి సూరిబాబు, వివిధ జిల్లాల ప్రతినిధులు ఎస్టీపీ శిరీష, ప్రభాకర్, చిన్నాదేవి, ఉమారాణి, ప్రభావతి, పద్మానాభరాజు, ఎస్.సంతోషి పాల్గొన్నారు. -
పాపయ్య చెరువులో మట్టి అక్రమ తరలింపు
నరసన్నపేట: గొట్టిపల్లి రెవెన్యూ పరిధిలోని వంశధార మెయిన్ చానెల్కు ఆనుకొని ఉన్న పాపయ్య చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా జేసీబీలతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టిని రూ. 600 నుంచి రూ. 800 లకు విక్రయిస్తున్నారు. ఈ చెరువుకు ఆనుకొని వంద ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. చెరువు గట్టు మట్టిని కూడా తరలిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. ఆగని దోపిడీ ఇచ్ఛాపురం: బాహుదాలో ఇసుక దోపిడీ ఆగడం లేదు. పట్టణంలో బాహుదా నదిలోని వంతెనలకు సమీప ప్రాంతాల నుంచి ఇసుకను తోడేస్తున్నారు. ఇసుకను రెవెన్యూ కార్యాలయం పోలీస్స్టేషన్ మీదుగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. రెవెన్యూ సిబ్బంది హెచ్చరిక బోర్డులు పెడుతున్నారు గానీ ఇసుకపై పర్యవేక్షణ చేయడం లేదు. -
ప్రభుత్వానివన్నీ ఆర్భాటపు ప్రకటనలే
మందస : నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది తప్ప నిధులు కేటాయించి నిర్మాణ పనులు పూర్తి చేయడం లేదని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజాశర్మ అన్నారు. హరిపురంలోని మార్పు గ్రంథాలయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ మట్ట ఖగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజాశర్మ మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్టు పేరిట రైతుల భూముల తీసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయని, భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఖగేశ్వరరావు మాట్లాడుతు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వంశధార డివిజనల్ సాధన కమిటీ అధ్యక్షుడు మార్పు మన్మధరావు మాట్లాడుతూ ఇచ్ఛాపురం వరకు రైతులకు సాగునీరు అందించాలని, చెరువులు, గెడ్డలు బాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో లండ బాబూరావు, హడ్డి మాస్టారు, జయరాం మల్యా, ఈశ్వరరావు, కొమరాం వాసు, ఎం.గణపతి, దిలీప్కుమార్, వడ్డీ గోపాలకృష్ణ, గణేష్, లక్ష్మీనారాయణ, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
అరాచకాలకు వంతెన
శ్రీకాకుళం క్రైమ్ : అభివృద్ధికి చిరునామాగా నిలిచిపోతుందన్న ఉద్దేశంతో నిర్మించిన పొన్నాడ వంతెనను కొందరు మందుబాబులు తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. నగరంతో అనుసంధానం కోసం కట్టిన ఈ వంతెనను అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. ఇటు శ్రీకాకుళం నగరానికి, అటు ఎచ్చెర్ల మండల పరిధి గ్రామాలకు పొన్నాడ వంతెనే దారి. వంతెనకు ఆవల, ఈవల.. ఎటు చూసినా 3 కిలోమీటర్ల పరిధిలోనే మత్తుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం సాయంత్రం నగరానికి చెందిన వ్యక్తి పొన్నాడ రాజీవ్గారితోటలోని నిర్మానుష్య ప్రాంతంలో హత్యకు గురికావడం తెలిసిందే.. వంతెనకు ఇవతల.. శ్రీకాకుళం నగరం పొన్నాడ వంతెన ఆరంభ శ్రీరామ మందిరం కూడలి నుంచి ఇటువైపుగా కలెక్టర్ బంగ్లా, వాంబేకాలనీ, 80 ఫీట్రోడ్డు, కేపీహెచ్బీ, కృష్ణాపార్కు, అఫీషియల్ కాలనీలతో పాటు, అటువైపుగా మంగువారితోట, గూనపాలెం, దమ్మలవీధి తదితర ప్రాంతాల్లో మత్తుబాబుల వీరంగం అధికమైంది. విచ్చలవిడిగా గంజాయి, మద్యం మత్తులో యువకులు నాలుగైదు బ్యాచ్లుగా విడిపోయి పేట్రేగిపోతున్నారు. స్పోర్ట్స్ బైక్లపై వేగంగా వెళ్తూ భయపెడుతుంటారు. రాత్రి 9 గంటలు దాటిందంటే ఇటుగా రావడానికి ఎవరైనా భయపడతారు. అనేకమార్లు దాడులు సైతం జరిగాయి. ఇటీవల వాంబే కాలనీ రాజీవ్ గృహకల్పలోని ఓ గదిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ గదిని కొంతమంది యువకులు అద్దెగా తీసుకుని గంజాయి వంటి మత్తు పదార్థాల క్రయ విక్రయాలకు వాడుతున్నట్లు స్థానికుల నుంచి ఆరోపణలు వచ్చాయి. పొన్నాడ వంతెన చక్కటి సుందర ప్రదేశం. సాయంత్రం వేళ సేద తీరడానికి అనువుగా ఉంటుంది. అదే ఆసరాగా చేసుకున్న కూటమి ప్రభుత్వం నాయకులు సైతం సమీపంలోనే బార్అండ్ రెస్టారెంట్లు, వైన్షాఫులకు అనుమతులు ఇచ్చారు. బ్రిడ్జికి ఆవల రెండు దాబాలు కూడా ఉన్నాయి. వంతెన అవతలివైపు తోటలను మందుబాబులు అడ్డగా మార్చుకున్నారు. బ్రిడ్జి మీద కెమెరాలు పెట్టడంతో తోటల్లోకి వెళ్లిపోతున్నారు. ఎచ్చెర్ల స్టేషన్ పరిధి గ్రామాలైన పెద్ద కొంగరాం, ముద్దాడ, చిన్నకొంగరాం, వెంకన్నగారిపేట మీదుగా తోటపాలెం మార్గంలోని నీలగిరి, మామిడి, జీడి తోటల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లోకి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారు. కొంతమంది కళాశాలల అమ్మాయిలతో సైతం మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో వస్తుంటారని స్థానికులంటున్నారు. కొన్ని ఘటనలు.. ●శుక్రవారం ఇదే ప్రాంతంలో హత్య జరిగింది. ●దాదాపు నెలన్నర క్రితం ఆంజనేయస్వామి టెంపుల్ సమీపంలో ఓ వ్యక్తిని కత్తితో పొడిచేశారు. ●బ్రిడ్జి దాటాక పీడీ కన్వన్షన్ హాల్ వెనుక నగరానికి చెందిన ఓ వ్యక్తిని ఏడాది క్రితం కాల్చారని, అదే కన్వర్షన్ హాల్ సమీప మెకానిక్ షెడ్ పక్కన పొలాల్లో ఆరునెలల క్రితం కొందరు తాగి ఘర్షణ పడి కొంగరాం గ్రామానికి చెందిన మరో వ్యక్తి మరణానికి కారణమయ్యారని గ్రామస్తులు అప్పట్లో ఆరోపించారు. ●శుక్రవారం హత్య జరిగిన ప్రదేశానికి 100 అడుగుల దూరంలో ఉన్న ఎస్ఎంపురం పీఎసీఎస్ బహుళ ప్రయోజన సౌకర్య గోదాం వెనక వైపు ఓ వ్యక్తి పురుగు మందు తాగేశాడు. ●ఇక్కడికి సమీపంలోనే 2023 ఆగస్టు 15న ఓ యువతి అనుమానాస్పదంగా మృతిచెందిందని, ఎక్కడెక్కడో చంపేసి ఇక్కడ పడేస్తుంటారని, ఎక్కడెక్కడివారో ఇక్కడ మత్తులో జోగి హత్యలు, దాడులకు ఎగబడుతున్నారని, ఈ మార్గాల్లో వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేయడం గమనార్హం. కొంగరాం– తోటపాలెం దారిలో రాకపోకలు సాగిస్తున్న విద్యార్థినులు -
చందాలు వేసుకుని రోడ్డు పనులు
ఎచ్చెర్ల : తోటపాలేం పంచాయతీ డోలవానిపేటలో గ్రామస్తులు చందాలు వేసుకుని రోడ్డు బాగుచేసుకుంటున్నారు. ఇక్కడ జాతీయ రహదారి నుంచి డోలవానిపేటకు సుమారు కిలోమీటరు మేర రహదారి ఉంది. పొలాల మధ్యలో రోడ్డు ఉండటంతో రహదారి కాస్త పొలం గట్టుగా మారింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు మొదలయ్యాయి. గతంలో రోడ్డు పనులను ప్రారంభించి నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు ఇంటికి వెయ్యి రూపాయులు చొప్పున చందాలు వేసి ప్రొక్లెయిన్తో రోడ్డు చదును పనులు చేపడుతున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామానికి పక్కా రహదారి నిర్మాణం చేపట్టాలని వారంతా కోరుతున్నారు. -
సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): బీపీఎస్, ఎల్ఆర్ఎస్లకు సంబంధించి ఎల్టీపీలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వెల్ఫేర్ అసోషియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ హారికా ప్రసాద్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర 4వ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీపీఎంఎస్ వెబ్సైట్లో సివిల్ 2.0పై వస్తున్న సమస్యలు సైతం పరిష్కరించాలని కోరారు. ఎల్టీపీలకు ఇన్సూరెన్స్ చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఎల్టీపీలు కలసికట్టుగా ఉండాలన్నారు. సంఘ యూట్యూబ్ చానెల్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, సెక్రటరీ బాకి సురేష్, స్టేట్ ఈసీ మెంబర్ వాండ్రంగి శ్రీనివాసరావు, స్టేట్ చైర్మన్ ఎం.కుమారమంగళం, ప్రెసిడెంట్ ఎస్.రాంబాబు, సెక్రటరీ ఎం.లక్ష్మణ్, ట్రెజరర్ ఐ.ఆదినారాయణ, ఎక్స్ అఫీషియో సభ్యులు నాగ శ్రీనివాస్, చాపరపు శ్రీనివాస్, మదన్ గోపాల్, విజయరామకృష్ణ, శ్రీకాకుళం జిల్లా ఇంజనీర్లు కామేశ్వరరావు, ఈశ్వరరావు, శశికాంత్, రాహుల్, సందీప్, ఎ.శ్రీనివాస్, రవి, కిరణ్, బరాటం రమేష్ పాల్గొన్నారు. -
బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర
శ్రీకాకుళం అర్బన్: బ్యాంకింగ్ వంటి ప్రభుత్వరంగ సంస్థలను అదాని, అంబాని వంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే కేంద్రప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు ఆరోపించారు. శ్రీకాకుళంలోని ఓ ప్రవేటు అతిథిగృహంలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయిస్ కో–ఆర్డినేషన్ కమిటీ, పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీల ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐబీఈఏకు ఆంధ్రప్రదేశ్లో 40వేల సభ్యత్వం ఉందన్నారు. బ్యాంక్ ఉద్యోగులకు ఐదురోజుల పనిదినాలు వంటి సమస్యలపై పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ కామ్రేడ్ టి.రవీంద్రనాథ్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఉదయ్కుమార్, సెంట్రల్ కమిటీ మెంబర్ కమలాకర్, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గమిదే.. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా గిరిధర్ నాయక్, సెక్రటరీగా బి.శ్రీనివాసులు, డిప్యూటీ సెక్రటర గా కామరాజు, ఉపాధ్యక్షులుగా జి.చంద్రమౌలి, ఎం.కిరణ్, జి.రమేష్, ఏ.సూర్య, జాయింట్ సెక్రటరీలుగా కె.రామకృష్ణ, జి.గోవిందరావు, ఎస్.రవికుమార్, బి.గిరిప్రసాద్, కె.హరినాథ్, రాజు, టి.స్వప్న, ఆర్.శ్రావణి, ఎస్.రాజేష్, కోశాధికారిగా పి.ఉపేంద్ర, జాయింట్ ట్రెజరర్గా బి.మౌలి, కమిటీ సభ్యులుగా జి.సూర్యారావు, బి.లోహిదాసు, పి.అన్నాజీరావు, ఎం.రామ్ప్రసాద్, ఎ.దినమణి, డి.సంధ్యారాణి, బి.వినోద్, బి.చంద్రభూషణరావు, జె.సింహాచలం, ఎన్.రమణ, ఎం.మనోజ్, వి.మురళి, ఎం. ఎంకె. రాజు, స్నేహ తదితరులు ఎన్నికయ్యారు. -
రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య కో–చైర్మన్గా బగాది
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది, జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బగాది రామమోహనరావు రాష్ట్ర సమాఖ్య కో–చైర్మన్గా నియమితులయ్యారు. ఆదివారం విజయవాడలోని అంబేడ్కర్ భవనంలో జరిగిన సమాఖ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. బగాది ఎంపిక పట్ల వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హర్షం వ్యక్తం సేశారు. పూర్తిస్థాయిలో వైద్యసిబ్బందిని నియమించాలి పలాస: పలాస కిడ్నీ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ డిమాండ్ చేశారు. పలాస కిడ్నీ ఆసుపత్రిని ఆదివారం సందర్శించారు. సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ నిపుణుల సహకారంతో కిడ్నీ వ్యాధిపై పరిశోధన జరగాలన్నారు. రీసెర్చ్ సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలన్నారు. 59 వైద్యులకు గాను 18 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారని చెప్పారు. కిడ్నీ రోగులతో పాటు సహాయకులకు కూడా భోజనం అందించాలని కోరారు. 200 పడకలకు గాను 100 పడకలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం విచారకరమని చెప్పారు. ఆస్పత్రికి బస్సు పాయింట్ దూరంగా ఉందని, ఎలక్ట్రికల్ వాహనం సమకూర్చాలని కోరారు. కార్యక్రమంలో వేదిక నాయకులు పి.ధర్మారావు, కె.మణికుమార్, ఎన్.గణపతి పాల్గొన్నారు. పోరాటాలతోనే సమస్యల పరిష్కారం జి.సిగడాం : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీసీపీఎస్ఈఏ జిల్లా నాయకులు మొయ్యి జనార్దన్నాయుడు, మక్క సురేష్ అన్నారు. ఆదివారం జి.సిగడాంలో వారు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ విధానం అమలయ్యేవరకు పోరాటం ఆగదన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సభ్యులు బాలి రామారావు, సామంతుల సత్యనారాయణ, జాడ వెంకటరమణ, శ్రీనివాస్ పట్నాయక్, వల్లూరు రమణ, జోగిదొర తవిటిరాజు పాల్గొన్నారు. మాజీ సైనికులకు సత్కారం శ్రీకాకుళం కల్చరల్: మాజీ సైనికులు సమాజానికి ముందుకురావాలని జిల్లా మాజీ సైనికుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇటీవల రథసప్తమి నాడు అరసవల్లిలో భక్తుల సేవలో పాల్గొన్న మాజీ సైనికులకు, వీర నారీమణులకు చైర్మన్, విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వి.సూర్యనారాయణ, ట్రెజరర్ ఎం.సింహాచలం తదితరులు పాల్గొన్నారు. శ్రీకూర్మంలో భక్తుల రద్దీ గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మంలో కూర్మనాథున్ని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకులు సీహెచ్.సీతారామనృసింహాచార్యులు ఆధ్వర్యంలో వేకువ జామున స్వామికి పంచామృతాభిషేకం, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈఓ టి.వాసుదేవరావు భక్తుల క్యూలైన్ పర్యవేక్షించారు, -
నాణ్యమైన వైద్యసేవలందించాలి
శ్రీకాకుళం: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. జిల్లాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆర్థిక సహకారంతో ఆస్పత్రుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను గుర్తించి ఫౌండేషన్ డైరెక్టర్ సత్తి శ్రీనివాసరావును విజయవాడలోని మంత్రి కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రెడ్డీస్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలానే లేబర్ రూమ్, ఫార్మసీ, వార్డ్, ల్యాబరేటరీ గార్డెన్లకు అత్యాధునిక సదుపాయలు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ బద్దెల సురేష్ పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత టెక్కలి రూరల్: స్థానిక జగతిమెట్ట సమీపంలో శనివారం ఉదయం అక్రమంగా పశువులను తరలిస్తున్న నాలుగు బొలేరో వ్యాన్లను టెక్కలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచిలి సమీప ప్రాంతాల నుంచి సంతలకు తరలిస్తుండగా సమాచారం అందుకున్న టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా 4 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వాటిలో మూడు వాహనాల్లో మొత్తం 14 గేదెలతో పాటుగా ఒక బొలేరో వాహనంలో 4 ఆవులు ఉన్నాయి. వాహనాలను టెక్కలి స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. పశువులను గోశాలకు తరలించనున్నట్లు తెలిపారు. ఇత్తడి సామగ్రి చోరీపై ఫిర్యాదు టెక్కలి రూరల్: మండంలోని తలగాం గ్రామానికి చెందిన హనుమంతు విద్యాసాగర్ అనే వ్యక్తి తన ఇంట్లో ఉంచిన సామగ్రి కనిపించడం లేదని టెక్కలి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. విద్యాసాగర్ తెలంగాణలోని భద్రాచలంలో పేపర్ బోర్డులో టెక్నికల్ అడ్వైజరుగా పనిచేస్తున్నారు. అయన ఈనెల 27వ తేదీన తన సొంత గ్రామమైన తలగాంలోని ఇంటికి వచ్చారు. అనంతరం స్టోర్ రూమ్కి వెళ్లి చూడగా అందులో ఉంచిన సుమారు 100 కేజీల ఇత్తడి సామగ్రితో పాటు 3 గ్రాముల బంగారు కాసులు కన్పించడం లేదని తెలిపాడు. ఈ మేరకు సామగ్రి చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైతుల వివరాలను నమోదు చేయాలి ● డీపీఎం పూజారి సత్యనారాయణ ఆమదాలవలస: ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో కృషి మేపర్ పోర్టల్కు అనుసంధానం కోసం రైతుల వివరాలను ‘ఉర్వి’ యాప్లో నమోదు చేయాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పూజారి సత్యనారాయణ సూచించారు. మండలంలోని చీమలవలస గ్రామంలో నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ ప్రక్రియను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డేటా ఎంట్రీ ప్రక్రియ ఐసీటీఎన్ఎఫ్ఏ శివకృష్ణ పర్యవేక్షణలో కొనసాగుతోందని చెప్పారు. చీమలవలస, కట్యాచార్యులపేట, వంజంగి, జొన్నవలస, దూసి, కలివరం పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో సీడీఎఫ్ సురేష్ ఆధ్వర్యంలో వివరాల నమోదు ప్రక్రియను ట్రైనీ ఐసీఆర్పీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది రైతుల భూ వివరాలను ఖచ్చితంగా జియోట్యాగ్ చేసి, రైతుల ఫొటోలను కూడా అప్లోడ్ చేస్తున్నారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ, ఫీల్డ్ స్థాయిలో సిబ్బంది సమన్వయంతో పర్యవేక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
డయేరియా కట్టడిలో ప్రభుత్వం విఫలం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న మెడికల్ మాఫియా ప్రజల జీవించే హక్కుపై పరోక్షంగా దాడి చేస్తోందని, నాణ్యత లేని బోగస్ మందులు విచ్చలవిడిగా మార్కెట్లో ప్రవేశించి వేలాదిమంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో విస్తృతంగా వ్యాపిస్తున్న డయేరియా కేసులను కట్టడి చేయడంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందన్నారు. శనివారం సీపీఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు అవసరం లేని టెస్టులు, శస్త్ర చికిత్సలు సూచిస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొత్స సంతోష్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, సీపీఐ నాయ కులు చిక్కాల గోవిందరావు, పైడి గోవిందరా వు, ఏఐవైఎఫ్ నాయకులు ఆర్.అరవింద్, వై. వేణు, వసంతరావు, తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం: ‘ప్రజారోగ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సిన వారు ఎందుకు విఫలమవుతున్నారు? ఎవరు చేయాల్సిన పనులు వారు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది..’అంటూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వార్డు ఎమినిటీ స్ సెక్రటరీలు, పబ్లిక్ హెల్త్ అధికారులు, శాని టరీ ఇన్స్పెక్టర్లతో కలెక్టర్, ఎమ్మెల్యే గొండు శంకర్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచినీటి సరఫరా వ్యవస్థలో లోపాలు, అక్రమ పైపులైన్ కనెక్షన్ల విషయంలో అధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. పారి శుధ్య నిర్వహణలో వైఫల్యాలు కనిపిస్తున్నాయని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడం వల్లే డయేరియా వంటి సమస్యలు తీవ్రమవుతున్నా యని అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో నిర్ల క్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ పైపులైన్ల లీకేజీలు, మురుగునీటి కాలువల పూడికతీత పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బొడ్డేపల్లి రాము తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో అమృత్భారత్ రైల్వేస్టేషన్ కింద నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని రైల్వేశాఖ ఏడీఆర్ఎం కె.రామారావు కాంట్రాక్టర్లను హెచ్చరించారు. రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనుల ను శనివారం పరిశీలించారు. స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ బి.జనార్దనరావు, ఏడీ ఈఎన్ వి.ఎస్.మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డుపై విద్యార్థుల నిరసన
ఆమదాలవలస: మండలంలోని దన్నానపేట గ్రామం వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అలికాం – బత్తిలి ప్రధాన రహదారిపై శనివారం బైఠాయించి నిరసన తెలపడంతో కొద్దిసేపు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ప్రతిరోజూ కళాశాలకు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు విపరీతమైన రద్దీతో వస్తుండడంతో ఆర్టీసీ డ్రైవర్లు స్టేజీల వద్ద ఆపకుండా వెళ్లిపోతున్నారని వాపోయారు. దీంతో సమయానికి కళాశాలకు చేరుకోలేక చదువుకు ఆటంకం కలుగుతోందన్నారు. కళాశాల ముగిసిన తర్వాత కూడా హిరమండలం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సులు, అలాగే శ్రీకాకుళం నుంచి హిరమండలం వైపు వెళ్లే బస్సులు కళాశాల స్టేజీ వద్ద ఆగకపోవడంతో ప్రైవేట్ ఆటోలు, ఇతర వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలిసిన ఆమదాలవలస ఎస్ఐ సనపల బాలరాజు సిబ్బందితో అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. జిల్లా ఆర్టీసీ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. -
క
నగరంలో తాజా పరిస్థితిప్రభావిత ప్రాంతాలు దమ్మల వీధి, కాకి వీధి, మంగువారితోట, గుడి వీధి మొత్తం కేసులు 190 ప్రభావిత ప్రాంతాల నుంచి 05 వివిధ ఆసుపత్రుల్లో చికిత్స 87 డిశ్చార్జిలు 103 నగర వ్యాప్తంగా (ప్రభావిత + సాధారణ వీధులు కలిపి) శనివారం నమోదైన కొత్త కేసులు: ప్రస్తుతం చికిత్స 51 ●పట్టుబడిన మాదకద్రవ్యాల శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పట్టుబడిన మాదకద్రవ్యాలను (ఎన్డీపీఎస్) అత్యంత భద్రంగా నిల్వ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా శనివారం వంశధార పాత క్వార్టర్స్లోని భవనాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, ఏఎస్పీ శ్రీనివాసరావు కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇకపై స్వాధీనం చేసుకున్న గంజాయి, ఇతర డ్రగ్స్ను భద్రపరిచేందుకు వీలుగా ఒక భవనాన్ని గుర్తించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవనం చుట్టూ అత్యున్నత స్థాయి భద్రత ఉండాలని, రాత్రి వేళల్లో కూడా పరిసరాలన్నీ స్పష్టంగా కనిపించేలా ఫ్లడ్ లైట్లను అమర్చాలని ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీపీఎస్ కేసుల్లో పట్టుబడిన మాదకద్రవ్యాలను కోర్టు విచారణ పూర్తయ్యే వరకు, డిస్పోజల్ కమిటీ నిర్ణయం తీసుకునే వరకు సురక్షితంగా ఉంచడం కీలకమన్నా రు. కార్యక్రమంలో పలువురు రెవెన్యూ, పోలీస్, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు. ●ఘనంగా ప్రపంచ టైలర్స్ డే శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని చిన్నబజారు జంక్షన్ వద్ద స్టైలెక్స్ టైలర్స్ ఆధ్వర్యంలో ప్రపంచ టైల ర్స్ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా విలియం హావే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు టైలర్లు మాట్లాడుతూ రెడీమేడ్ దుస్తులు ఎక్కువ కావడంతో.. టైలర్లకు పండగ రోజుల్లో కూడా పనులు లేక ఇబ్బంది పడుతున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో గుంటముక్కల పాపారావు, శ్రీనివాస్ పంట, లిబర్టీ రమణ, రాజు, వేణు, భోగేశ్వరరావు, బాబూరావు, గణేష్, ఏ వన్ రాజు టైలర్, రోజీ టైలర్ తిరుమల పాల్గొన్నారు.●పోస్టాఫీసుల్లో శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలో 19 తపాలా కేంద్రాల్లో పూర్తిస్థాయి ఆధార్ సేవలు లభిస్తున్నాయని పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు శనివారం తెలిపారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, టెక్కలి ప్రధాన కార్యాలయాలతో పాటు రాజాం, పొందూరు, ఎస్.ఆర్.పురం, జె.ఆర్.పురం, అరసవల్లి, గార, హిరమండలం, కొత్తూరు, నరసన్నపేట, కోటబొమ్మాళి, కాశీబుగ్గ, పలాస, సోంపేట, మందస, ఇచ్ఛాపురం, గుజరాతిపేట సబ్ పోస్టాఫీసుల్లో ఈ సేవలు లభిస్తాయని వివరించారు. కొత్త ఆధార్ నమోదుతో పాటు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ వంటి వివరాల్లో మార్పులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. బయోమెట్రిక్ అప్డేట్ (ఫోటో, వేలిముద్రలు, ఐరిస్), పిల్లల తప్పని సరి ఆధార్ నవీకరణ, డాక్యుమెంట్ అప్డేట్ వంటి సదుపాయాలు అన్ని వయసుల వారికి అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ●లీగల్ ఎయిడ్ క్లినిక్లతో శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో లీగల్ ఎయిడ్ క్లినిక్ల ద్వారా న్యాయపరమైన సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రశాంతి వృద్ధాశ్రమం, ఎంపీఆర్ న్యాయ కళాశాలలోని లీగల్ ఎయిడ్ క్లినిక్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ చాలామంది చిన్నపాటి సమస్యలను పెద్దగా భావించి న్యాయస్థానాల సహాయాన్ని పొందడానికి ముందుకు రారని, అలాంటి వారికి లీగల్ ఎయిడ్ క్లినిక్లు అండగా నిలుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, ఎంపీఆర్ న్యాయ కళాశాల కళాశాల ప్రిన్సిపాల్ కె.మోసే తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని నానుబాలవీధిలో విజయగణపతి ఆలయం వద్ద శనివారం 5008 పెన్నులతో పూజలు చేశారు. ఆదివారం ఉదయం 8.30 నుంచి 11గంటల వరకూ విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేస్తామని అర్చకులు పెంట శ్రీధర్శర్మ, పెంట సూరనగేష్శర్మ తెలిపారు. -
‘రియల్’ దందా..!
● పాలనాయుడుపేటలో అక్రమ లే అవుట్ ● కోర్టు పరిధిలో ఉన్నా అనధికార అమ్మకాలు ● గ్రామకంఠం భూమి ఆక్రమించారని గ్రామస్తుల ఫిర్యాదు సంతబొమ్మాళి: రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరితెగిస్తున్నారు. కోర్టు పరిధిలో ఉందని, గ్రామకంఠం భూమి ఆక్రమించారని వేర్వేరుగా ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో పెట్రేగిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నౌపడ పంచాయతీ పాలనాయుడుపేటలో ఎల్పీ నంబర్ 324, 325లో 80 సెంట్ల భూమిలో లే అవుట్ను వేశారు. ఈ లే అవుట్కు ఎటువంటి పంచాయతీ, రెవెన్యూ అధికారుల అనుమతులు లేకపోయినా.. దర్జాగా రోడ్లువేసి ఫ్లాట్లుగా విభజించి సరిహద్దు రాళ్లను పాతారు. ఈ సర్వే నంబర్పై డిస్ప్యూట్ ఉండడంతో పలువురు కోర్టులో కేసు వేశారు. కోర్టు కాపీతో పాటు భూపత్రాలతో స్పందనలో తహసీల్దార్ హేమసుందర్రావుకు ఫిర్యాదు చేశారు. మరోపక్క గ్రామకంఠం భూమి ఆక్రమించి లేఅవుట్ వేశారని గ్రామానికి చెందిన మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు పిన్నింటి ఎండయ్య రెడ్డి గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సర్వే నంబర్పై ఇన్ని ఫిర్యాదులు ఉన్నా మూలపేట పోర్టును బూచిగా చూపించి లేఅవుట్ను ఫ్లాట్లుగా విభజించి అమ్మకాలు చేపడుతున్నారు. ఈ తతంగం అంతా అధికారులకు తెలిసినా ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందువలన ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ హేమసుందరరావును వివరణ కోరగా లే అవుట్ను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
పలాస జామి జాతరలో.. నకిలీ పాసుల కలకలం
పలాస : పలాస జామి జాతరలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన పాసుల్లో నకిలీవి సైతం చోటు చేసుకున్నాయనే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్షకు పైగా యాత్రికులు, భక్తులు తరలివచ్చిన ఈ యాత్రకు రెండు రకాలు పాసులు ప్రజల్లోకి వెళ్లాయి. ఓ పాసు వెనుక వైపు పచ్చని అక్షరాలు, మరో పాసు వెనుక వైపు నీలం రంగు అక్షరాలు ఉన్నాయి. ఇందులో నీలం రంగు అక్షరాలు ఉన్నవి నకిలీవని గుర్తించి వాటితో వచ్చిన వారిని ఆలయం వద్ద నిర్వాహకులు అడ్డుకున్నారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు బమ్మిడి సంతోష్కుమార్కే ఇదే అనుభవం ఎదురైంది. తనతో పాటు మరికొంతమందికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఈ పాసులు ఇచ్చారని చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో ఫోన్పే చేసి దర్శనం టికెట్ కొనుక్కొని వెళ్లారు. ఆ సమయంలో నిర్వాహకులు రశీదు ఇవ్వకపోవడం గమనార్హం. ఇదే పరిస్థితి చాలామందికి ఎదురైంది. వాస్తవానికి ఒరిజినల్ పాసులకు ఎటువంటి రుసుం లేదు. కానీ, కొందరు నకిలీ పాసులు ముద్రించి సులువుగా దర్శనం అయిపోతుందని చెప్పి అమ్ముకున్నట్లు తెలిసింది. -
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026దిమ్మడిజోలలో వృద్ధ దంపతులపై ఓ వ్యక్తి దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. రామకృష్ణాపురం ఇండస్ట్రీయల్ పార్క్లో ఫ్లాట్ల రేట్లను ప్రభుత్వం పెంచేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో సరఫరా చేసిన మున్సిపల్ తాగునీటిలో ఈ.కోలితో పాటు క్లెబ్సీయల్లా బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు శాంపిల్స్ పరీక్షల్లో తేలింది. ●నగర ప్రజలకు అందించిన మంచినీటి శాంపిల్స్ పరీక్షల్లో రోజుకొక బ్యాక్టీరియా బయటపడుతోంది. దీన్నిబట్టి మున్సిపల్ తాగునీరు ఏ స్థాయిలో కలుషితమైందో అర్ధం చేసుకోవచ్చు. క్లెబ్సియెల్లా బ్యాక్టీరియాతో ఊపిరితిత్తులు, మూత్రనాళం, తీవ్రమైన గాయాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. -
వేణుగోపాలా..
జీవకళ ఉట్టిపడేలా! మెళియాపుట్టిలోని వేణుగోపాల ఆలయం మెళియాపుట్టి: జిల్లాలో అద్భుత శిల్ప కళా సౌందర్యం గల దేవాలయాలలో మెళియాపుట్టిలోని వేణుగోపాలుడి ఆలయం ఒకటి. దైవత్వం, జీవకళ ఉట్టి పడేలా ఇక్కడి విగ్రహాలు చూపరులను కట్టిపడేస్తుంటాయి. 1840లో పర్లాకిమిడి(ఒడిశా) మహారాజు ప్రతాపరుద్రుడి భార్య విష్ణుప్రియ మహారాణి కోరిక మేరకు ఈ ఆలయాన్ని అత్యద్భుతంగా కట్టించారు. గర్భగుడిలో ప్రతిష్టించిన మూలవిరాట్ విగ్రహాలను బృందావనం నుంచి తెప్పించినట్లు పూర్వీకుల కథనం. అప్పట్లో బరంపురం పట్టణానికి సమీపంలోని మతర అనే గ్రామానికి చెందిన శిల్పులతో ఆలయంలోని శిల్పాలను చెక్కించారు. 15 ఏళ్ల పాటు ఆలయ నిర్మాణం కొనసాగింది. మైసూరు నుంచి తెప్పించిన తలుపులు, తుమ్మబంకతో కలిపిన రాళ్లు, ఏనుగులతో తొక్కించి తయారుచేసిన ప్రత్యేక మిశ్రమాన్ని ఆలయ నిర్మాణంలో వినియోగించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. అడుగడుగునా ప్రత్యేకమే.. పర్లాకిమిడి రాజవంశస్తులకు రెండో ఎస్టేట్గా ఉన్న మెళియాపుట్టిలో 50 గ్రామాల నుంచి వచ్చి న ఫలసాయాన్ని ఆలయంలోని 30 గదుల్లో నిల్వ చేసేవారు. అప్పట్లో 42 మంది అర్చకులు, 25 మంది పనివార్లకు జీతాలు చెల్లించేవారు. స్వామివారికి నిత్యధూప, దీప, నైవేద్యాలకు, సామంతులకు ఇక్కడి నుంచే చెల్లింపులు జరిపేవారు. ఆలయ పరిసరాల్లో లభించే సంపంగి పూలు,జామ, మామిడి తదితర పండ్లతో స్వామివారికి అర్చన చేసేవారు. ఆలయం నుంచి పర్లాకిమిడి బృందావన్ ప్యాలెస్గా పిలువబడే రాజు ల ఉద్యానవనానికి సొరంగం ఉండేదని, దాని ద్వారా ఫలసాయం, బంగారు నాణేలు రవాణా చేసేవారని చెబుతుంటారు. ఇప్పటికీ సొరంగ మార్గం ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ ఆలయంలో ప్రస్తుతం ఒక్క అర్చకుడు మాత్రమే ఉన్నారు. ఏటా ఘనంగా డోలోత్సవాలు ఏటా స్వామివారి సన్నిధిలో డోలోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది మార్చి 2 నుంచి జాతర ప్రారంభంకానుంది. పర్లాఖిమిడి రాజవంశీయులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు, మఘా కార్యక్రమం నిర్వహించి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగిస్తారు. -
ఫ్లాట్లపై రేట్ల పెత్తనం..!
పలాస: జిల్లాలో అత్యంత వెనుకబడిన పలాస నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, నిరుద్యోగం తగ్గాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం స్థలం కేటాయించడం జరిగింది. మండలంలోని రామకృష్ణాపురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 167, 168, 179 తదితర చోట్ల సుమారు 60 ఎకరాల భూమి సేకరించారు. అక్కడ ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణం కోసం తగిన చర్యలు తీసుకున్నారు. స్థలం సేకరించిన సమయంలో అక్కడ ఒక స్క్వేర్ మీటర్ ధర రూ.1,426లుగా నిర్ణయించారు. ఆ తర్వాత కొన్ని కారణాలు వల్ల ప్రభుత్వం మారింది. ఇప్పుడు పెద్ద పారిశ్రామికవేత్తలకు రూ.1కే కావాల్సిన భూమి ఇస్తామని చెబుతున్న ఈ కూటమి ప్రభుత్వం, ఇక్కడ మాత్రం అమాంతంగా మూడురెట్లు ధర పెంచేసింది. తాజాగా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ఇండస్ట్రియల్ పార్కులో స్క్వేర్ మీటర్ ధర రూ.4,683లు చేసింది. దీంతో ఒక చిన్న పరిశ్రమదారుడు ఇక్కడ పరిశ్రమ పెట్టుకోవాలంటే కేవలం ఒక ఫ్లాటును రూ.కోటి ఇచ్చి ముందు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ తీరుపై పలువురు నిప్పులు చెరుగుతున్నారు. ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నత సాంకేతిక విద్యనభ్యసించిన నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాంత ప్రజల నుంచి సేకరించిన భూమి పరిశ్రమల కోసం ఫ్లాట్లు వేశాక ఈ ప్రాంత నిరుద్యోగులకు, చిన్న తరహా పరిశ్రమదారులకు ఉపయోగపడాలి. రూ.కోట్లు ఇచ్చి ఫ్లాట్లు కొనేవారు ఇక్కడ లేరు. ప్రభుత్వం ఆలోచించి పేద, మధ్య తరగతి వర్గాలకు ఉపయోగపడేవిధంగా ఉండాలి. – ఎం.వినోద్, పీడీఎస్యూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాస ఆ ప్రాంతంలో జీడి మామిడి ఆధారిత చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలు ఎక్కువ శాతం అద్దె ఫ్యాక్టరీల్లో నడుస్తున్నాయి. కొన్ని చిన్న, చిన్న షెడ్లల్లో ఉన్నాయి. ఇటు వ్యాపారాలు చేసుకోలేక, అటు అద్దెలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి ఈ ఫ్లాట్లు ఉపయోగపడాలి. బడా పారిశ్రామికవేత్తలకు రూ.1కే కావాల్సిన భూమి ఇచ్చినప్పుడు.. ఇక్కడ చిన్న వ్యాపారులకు ఈ విధంగా ధరలు పెంచడం సరికాదు. దీంతో ఇక్కడ పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం ఉంది. – పి.వి.సతీష్, వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, పలాస ఈ పార్కు స్థలాన్ని అడ్డదారుల్లో పెద్దలకు కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వం చూస్తోందని పలాస చిన్న తరహా పరిశ్రమదారుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం స్థలంలో రోడ్లు, మురికి కాలువలు, పార్కులు ఇతర నిర్మాణాలు పోగా.. పరిశ్రమల కోసం మొత్తం 78 ఫ్లాట్లును విభజించారు. ఒక్కో ఫ్లాటు స్థలం కనీసం 2 వేల చదరపు స్క్వేర్ మీటర్లు ఉంటుంది. ఒక స్వ్కేర్ మీటర్ ధర ప్రస్తుతం రూ.4,683లు అంటే సుమారు ఒక ఫ్లాటు కోసం దాదాపు రూ.కోటి ఉండాలి. ఈ ప్రాంతంలోని చిన్న, చిన్న వ్యాపారుల వద్ద అంత ఆర్థిక వెసులుబాటు ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఇండస్ట్రీయల్ పార్కులో ఈవిధంగా ధరలు పెంచడం వల్ల పెద్దలు, బడా వ్యాపారుల చేతికి ప్లాట్లు వెళ్లిపోతాయని స్థానిక యువకులు, చిన్న తరహా పరిశ్రమదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువలన గత ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఫ్లాట్లు కేటాయించి, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు మొదటి ప్రాధాన్యమివ్వాలని కోరుతున్నారు. రామకృష్ణాపురం ఇండస్ట్రియల్ పార్క్లో రేట్లు పెంచేసిన ప్రభుత్వం గత ప్రభుత్వంలో స్క్వేర్ మీటర్ ధర రూ.1,426లు ప్రస్తుతం స్క్వేర్ మీటర్ ధర రూ.4,683లు నిప్పులు చెరుగుతున్న స్థానికులు -
అక్రమ కేసులు రద్దు చేయాలి
సంతబొమ్మాళి : కాకరాపల్లి థర్మల్ ప్లాంట్కు సంబంధించి జీఓ 1108 రద్దు చేయాలని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సంతబొమ్మాళి మండలం పోతునాయుడుపేట వద్ద అమరవీరుల స్మారక స్మృతిచిహ్నం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ థర్మల్ వ్యతిరేక పోరాటంలో ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని కోరారు. తంపరలో భవిష్యత్తులో పారిశ్రామిక పేరిట విధ్వంసక పరిశ్రమలను నెలకొల్పే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటరావు, సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా పోరాట కమిటీ కార్యదర్శితాండ్ర ప్రకాష్, అఖిలభారత రైతుకూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమేష్, ఐఎఫ్యూ జిల్లా నాయకులు సవలాపురపు కృష్ణవేణి, పోరాట కమిటి అధ్యక్షుడు మండపాటి నరసింగరావు, కమిటీ నాయకులు కోత మధు, మండల గన్ను గాయశ్రీ, కగ్గు జగన్నాథం, వడ్డితాండ్ర స్వదేశీ మత్య్సకార సొసైటీ ప్రెసిడెంట్ పద్మనాభం పాల్గొన్నారు. -
●వైద్యం కోసం సంప్రదించండి..
కేసుల తీవ్రత దృష్ట్యా డయేరియా లక్షణాలతో బాధపడితే వెంటనే కిమ్స్, జెమ్స్, మెడికవర్, హెల్త్కేర్, సత్యసాయి డే అండ్నైట్, ఏ ఒన్, సింధూర, రిమ్స్తో పాటు అన్ని ప్రభుత్వ ఆసుప త్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందిస్తామని వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ అవని తెలిపారు. ఎటువంటి సహాయం కావాలన్నా.. 92810 68255 92810 68256 92810 68257 92810 68139ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. -
●రంగంలోకి తనిఖీ బృందాలు
జిల్లాలో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు విశాఖ నుంచి వచ్చిన పుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని హోటల్స్, పాస్ట్ఫుడ్స్ సెంటర్లు, స్వీట్షాపులను తనిఖీ చేస్తున్నారు. నగరంలోని ఓ హోటల్లో ఫుడ్ శాంపిల్స్ తీసి ఇప్పటికే హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. మరికొన్ని హోటల్స్లో 15 ఇన్ఫార్మల్ శాంపిల్స్ తీశారు. లైసెన్సు లేకుండా నడుతున్న 10 హోటళ్లకు 31 నోటీసులు జారీ చేయగా, పరిశుభ్రంగా లేని 15 హోటళ్లకు 32 నోటీసులు జారీ చేశారు. రంగుల్లేకుండా గడువు ముగిసిన వస్తువులు వాడకుండా చర్యలు తీసుకోవాలని హోటళ్లు, షాపుల నిర్వాహకులకు ఆదేశించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీ నారాయణతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కె.లక్ష్మీ, శ్రీరామమూర్తి, ఆనందరావు తదితరులు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు సాగుతున్నాయి. -
వృద్ధ దంపతులపై దాడి
నందిగాం: మండలంలోని దిమ్మడిజోలకు చెందిన వృద్ధ దంపతులపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సలాన మన్మథరావు, రూపావతి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరూ హైదరాబాద్లో ఉంటుండగా వీరు గ్రామంలోనే నివసిస్తున్నారు. అయితే వారి ఇంటి పక్కనే ఉన్న గొర్లె వాసుదేవరావుతో వీరికి చిన్న పాటి గొడవలు ఉండడంతో శనివారం మాటామాటా పెరిగింది. దీంతో వాసుదేవరావు మన్మథరావు తలపై కర్రతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. రక్తం గమనించిన మన్మథరావు భార్య రూపావతి ఎందుకు కొట్టావని వాసుదేవరావును ప్రశ్నించడంతో ఆమె తలపై కూడా కొట్టడంతో తీవ్రగాయాల పాలయ్యంది. అనంతరం గాయాలు పాలైన వృద్ధ దంపతులను గ్రామస్తులు టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స చేసి శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. కాగా వాసుదేవరావు ఇద్దరినీ తీవ్రంగా కొట్టడానికి గల కారణాలు తెలియలేదు. నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీళ్లు కాలుష్యం పాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. పాలు, మంచినీళ్లలో స్వచ్ఛత కొరవడింది. శ్రీకాకుళంలో కలుషిత మంచినీరు, రాజమహేంద్రవరంలో కల్తీ పాలతో చావులు సంభవించడంతో జిల్లా ప్రజానీకం ఉలిక్కిపడుతోంది. కోరలు చాచిన డయేరియా నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రాత్రి, పగలు తేడా లేకుండా సుడిగాలి పర్యటనలు చేసి, ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. లోపాలున్న చోట సిబ్బందిని అప్రమత్తం చేసి, పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. డయేరియా కేసులు విస్తరిస్తున్న వేళ నగరమంతా యంత్రాంగం అప్రమత్తమైంది. మంచినీటి ట్యాంకులతో పాటు ఎక్కడికక్కడ పైపులైన్లు తనిఖీ చేయడమే కాకుండా శానిటేషన్పైనా దృష్టి సారించారు. మురికి కాలువలను స్వయంగా జిల్లా కలెక్టరే పరిశీలిస్తుండటం తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతానికి మున్సిపల్ మంచినీళ్లు తాగొద్దని కోరుతున్నారు. మరోవైపు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీరియస్గా వ్యవహరిస్తున్నారు. విధి నిర్వహణలో అలసత్వం దృష్ట్యా డీఈఈతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకున్నారు. సంబంధం ఉన్న మున్సిపల్ హెల్త్, ఇతర ఇంజనీర్లను వదిలేసి వీరిపై చర్యలు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా ఇష్యూ డైవర్షన్ కోసం చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరంలో కల్తీ పాలతో పలువురు చనిపోవడంతో జిల్లాలో కూడా యంత్రాంగం అప్రమత్తమైంది. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో శ్రీకాకుళం డివిజన్లో మూడు మిల్క్ శాంపిల్స్, టెక్కలి డివిజన్లో 9 శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. పాలులో నీళ్లు, యూరియా, ఆయిల్, ఫార్మాలిన్, పిండి పదార్థాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో శాంపిల్స్ తీశారు. హైదరాబాద్ ల్యాబ్ నుంచి పరీక్షా ఫలితాలు వచ్చాక చర్యలు తీసుకుంటామని ఆహార తనిఖీ అధికారులు చెబుతున్నారు. పాలుపైనే కాకుండా కల్తీ ఆయిల్పైనా దృష్టి సారించారు. శ్రీకాకుళం : డయేరియాపై ప్రజలు ఎలాంటి ఆందో ళన చెందవద్దని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె.పద్మా వతి వెల్లడించారు. శనివారం డయేరియా ప్రభావిత ప్రాంతాలైన దమ్మలవీధి, కాకివీధి, బోడెమ్మ కోవెల తదితర వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతిసారం తగ్గుము ఖం పట్టిందన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాల ని, బయట ఆహార పదార్థాలను తినరాదని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా సర్వజన ఆస్పత్రిని సందర్శించి అతిసార బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆమెతో పాటు జాయింట్ డైరెక్టర్ ఐ.డి.ఎస్.పి డాక్టర్ ఎన్.మల్లేశ్వరి, జిల్లా వైద్యారోగ్యశాఖా ధికారి డాక్టర్ అనిత పాల్గొన్నారు. శ్రీకాకుళం : శ్రీకాకుళం నగరపాలక సంస్థలో నీటి సరఫరా విభాగం డీఈఈగా విధులు నిర్వహిస్తున్న వి.జగన్మోహనరావును సస్పెండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్, ఇన్చార్జి కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా, దమ్మలవీధి సచివాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న ఎన్.శరత్కుమార్ను విధుల నుంచి తొలగించారు. నగరంలో డయేరియా ప్రబలడానికి విధుల్లో వీరు చూపిన నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ ఈ ఉత్తర్వులను వెలువరించారు. వామనమూర్తి అనే శానిటరీ ఇన్స్పెక్టర్తో పాటు షోకాజ్ నోటీసులు అందుకున్న పలువురు సచివాలయ సిబ్బందిపైనా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
కోడలే కొడుకై ంది..
రణస్థలం: అనారోగ్యంలో మృతి చెందిన మామకు కోడలై కొడుకై తలకొరివి పెట్టిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జేఆర్పురం పంచాయతీలోని కాపువీధికి చెందిన కరిమజ్జి రామప్పడు అనే వ్యక్తి విద్యుత్ శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు అప్పన్న 25 ఏళ్ల వయస్సులో విద్యుత్ షాక్తో మరణించారు. రామప్పడు భార్య కూడా అనారోగ్యంతో మరణించారు. అలాగే కొన్ని నెలల క్రితం చిన్న కుమారుడు రాంబాబు ఆకస్మికంగా మృతి చెందాడు. అలాగే తన తొడపుట్టిన తమ్ముడు కరిమజ్జి రామస్వామి ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన మృతి చెందాడు. దీంతో మనోవేదనకు గురైన రామప్పడు మంచం పట్టాడు. కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా తుది శ్వాస విడిచాడు. ఇద్దరు కుమారులు, భార్య, తమ్ముడు మృతి చెందడం తలకొరివి పెట్టేందుకు గ్రామస్తులు తర్జనభర్జన పడ్డారు. దీంతో చిన్న కుమారుడి భార్య ఉమా తప్పనిసరి పరిస్థితుల్లో తలకొరివి పెట్టింది. -
అధికారులను బలి పశువులు చేస్తున్నారు
● వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ టెక్కలి: జిల్లా కేంద్రంలో ఇటీవల నామమాత్రంగా చేసిన వివిధ రకాల పనులకు సంబంధించి అడ్డగోలుగా బిల్లులు పాస్ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్లు అధికారులపై ఒత్తిడి చేశారని, దానికి నిరాకరించడంతో డయేరియా పేరుతో వేటు వేస్తున్నారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ తీవ్రంగా ఆరోపించారు. శనివారం టెక్కలిలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో డయేరియా వ్యాప్తి విషయంలో కొత్తగా విధుల్లోకి వచ్చిన రోణంకి కూర్మనాథ్పై వేటు వేయడం వెనుక మంత్రి, స్థానిక ఎమ్మెల్యేల అవినీతి బాగోతాలు ఉన్నాయన్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన వివిధ రకాల పనుల విషయంలో బిల్లుల మంజూరులో గతంలో పనిచేసిన కమిషనర్పై ఒత్తిడి చేశారని, ఆయన నిరాకరించడంతో పాత కమిషనర్ను హఠాత్తుగా బదిలీ చేశారని ఆరోపించారు. ఆ తర్వాత కమిషనర్గా రోణంకి కూర్మనాథ్ విధుల్లోకి చేరడంతో అతనిపై కూడా బిల్లుల కోసం ఒత్తిడి చేశారని, ఆయన సైతం నిరాకరించడంతో డయేరియా వ్యాప్తి నెపంతో అతనిపై సైతం వేటు వేశారని దుయ్యబట్టారు. ఆ తర్వాత మరో అధికారిని నియమించారని, ఈ నియామకంపై జిల్లావ్యాప్తంగా పలు విమర్శలు వెల్లువెత్తుడంతో మరో అధికారిని నియమించారని పేర్కొన్నారు. అడ్డగోలుగా బిల్లులు మంజూరు చేసే విషయంలో నాయకులు అధికారులను బలి పశువులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
అచ్చెన్నకు ఆటవిడుపు
ప్రజలకు డయేరియా జడుపు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలో డయేరియా మరింత విస్తరిస్తోంది. నగరంలో మిగతా ప్రాంతాలకు పాకింది. చాప కింద నీరులా అనే కంటే అంతకంటే ఎక్కువగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎక్కడ ఏ కేసులున్నాయో కూడా తెలియడం లేదు. అధికారులు కూడా కేసుల విషయాన్ని ధ్రువీకరించడం లేదు. తెలియని మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు నగరమంతా అధికారుల అలర్ట్ అయ్యారు. గత వారం రోజులుగా ప్రబలుతున్న డయేరియా అదుపులోకి రావడం లేదు సరికదా మరింత ఎక్కువవుతోంది. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. మంత్రులూ మీకిది తగునా.. వారం రోజులుగా సొంత జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలి.. ప్రజలు మరణిస్తుంటే దగ్గరుండి పరిస్థితిని చక్క దిద్దాల్సిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాలో అడ్రస్ లేకుండా పోయారు. ఫోన్లతోనే గడిపేస్తున్నారు. డయేరియాతో నగరం అతలాకుతలం అవుతుంటే అమరావతిలో ఆటవిడుపు అంటూ ఆటలాడుకుంటున్నారు. డయేరియా ప్రబలిందని తెలిసినా కూడా జిల్లాకు రాలేదు. రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్న చందంగా అచ్చెన్నాయుడు సేదతీరుతున్నారు. ఒక మంత్రిగా, జిల్లాకు చెందిన నేతగా బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి ప్రజలకు అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా మంత్రే కాదు ఇన్చార్జీ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కూడా అదే తరహాలో వ్యవహరించారు. ఆయన కూడా బాధ్యతగా శ్రీకాకుళం నగరంలో పర్యటించి బాధితులకు అండగా నిలవాల్సింది పోయి చోద్యం చూస్తున్నారు. విస్తరిస్తున్న అతిసార వ్యాధి రోజురోజుకీ పెరుగుతున్న కేసులు కిటకిటలాడుతున్న ఆస్పత్రులు సరిపోని సర్కారు సాయం మంచి నీటి ట్యాంక్లో ఏం లభ్యమైంది..? ఆటవిడుపులో మంత్రి అచ్చెన్నాయుడు నగరానికి నీరు అందించే ఒక ట్యాంక్లో ఏదో జరిగిందని.. మరేదో బయట పడిందని నగరమంతా ప్రచారం జరుగుతోంది. దాని వల్ల మంచి నీళ్లు కలుషితమై ఈ పరిస్థితి ఏర్పడిందని చర్చ నడుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాల్సిన అధికారులు నోరు మెదపడం లేదు. మరో వైపు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విస్తృతంగా నగరమంతా పర్యటిస్తున్నారు. కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్లి పరిశీలించడం వల్ల ఏదో జరుగుతోందనే చర్చతో పాటు ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరణాల నుంచి రోగుల సంఖ్య వరకు అంతా గోప్యంగా ఉంచుతున్నారు. -
ప్రజారోగ్యంతో చెలగాటం
● చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు అధ్వానం ● వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ టెక్కలి: చంద్రబాబు పాలనలో నీళ్లు, పాలు కల్తీతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడు తూ అధికారం చేపట్టినప్పటి నుంచి అడ్డదారిలో ఎలా దోపిడీ చేయాలనే ఆలోచన తప్ప చిత్తశుద్ధిగా ప్రజా సంక్షేమం కోసం పాలన అందజేయడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న ప్రతిసారీ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా అల్లర్లు సృష్టిస్తున్నారని తిలక్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిగా పదవుల ను ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ప్రజలకు అవసరమైన సంక్షేమం కోసం ఆలోచన చేయడం లేదని తిలక్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి లడ్డూ వ్యవహారం, ఇందాపూర్–హెరిటేజ్ ఒప్పందాలపై శాసనమండలిలో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు నిలదీసే క్రమంలో అధికార పార్టీ సభ్యులు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం చంద్రబాబు నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. అమరావతిలో భూ మాఫియా చేస్తున్నారని ఆ విషయం బయటకు తెలియకుండా ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు నిత్యవసరమైన పాలు కల్తీ జరిగి ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, దీనిపై హెరిటేజ్ సంస్థలో ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని తిలక్ నిలదీశారు. కేవలం నామమాత్రంగా కొన్ని డెయిరీల్లో తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలో మంచినీరు సైతం కల్తీ జరిగి డయేరియా విజృంభించి ప్రాణాలు కోల్పోతుంటే, మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం ఆటలు ఆడుకుంటున్నారని తిలక్ ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలో ప్రతి క్షణం డయేరియా నివారణ చర్యల్లో పనిచేయాల్సిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. -
వసతి గృహాల్లో నీరుత్సాహ వైఖరి..
● జిల్లా కేంద్రంలో భయం గుప్పిట్లో హాస్టల్ విద్యార్థులు ● శుద్ధజలం అందక ఇక్కట్లు ● వార్డెన్లతో సమావేశమైనా నిర్వహించని ఉన్నతాధికారులు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలుతుంటే.. హాస్టల్ విద్యార్థులు వణికిపోతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ తమకు శుద్ధమైన తాగునీరు ప్రశ్నార్థకంగానే ఉందని విద్యార్థులు చెబుతున్నారు. సంబంధిత శాఖాధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉండడంతో వసతి గృహ విద్యార్థులు అతిసారం బారిన పడుతున్నారు. శుక్రవారం కొందరు విద్యార్థులకు డయేరియా సోకినట్లు నిర్ధారించారు. జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ పరిధిలో ప్రీ మెట్రిక్లో బాలురు వసతి గృహం ఒకటి ఉంది. కళాశాల పరిధిలో బాలికలకు నాలుగు, బాలురకు రెండు వసతి గృహాలు ఉన్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో కళాశాల స్థాయిలో పురుషులకు రెండు, మహిళలకు మూడు వసతి గృహాలు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ప్రీ మెట్రిక్లో బాలురుకి ఒకటి, కళాశాల మహిళా వసతి గృహాలు రెండు, పురుషుల వసతి గృహాలు రెండు ఉన్నాయి. వీటిలో పాటు గురుకులాలు ఉన్నాయి. తాగునీరు ఉందా..? జిల్లా కేంద్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో తాగునీరు దొరకడం లేదు. దీంతో వారు నగర పాలక సంస్థ కుళాయిలు, బోర్లపైనే ఆధారపడుతున్నారు. అయితే ఇటీవల నగరంలో పైప్లైన్లు లీక్ కావడంతో నీరు స్వచ్ఛత లేకుండాపోయింది. దీంతో నగర వాసులతో పాటు వసతి గృహ విద్యార్థులు కూడా నగర పాలక సంస్థ పంపిణీ చేసిన తాగునీటినే వాడడంతో విద్యార్థులు అస్వస్థతకు గుర య్యారని తెలుస్తోంది. ఆపత్కాలంలోనైనా ట్యాంకర్ల నీటిని వినియోగించాల్సి ఉన్నా వార్డెన్లు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పర్యవేక్షణ లోపం ఈ వసతి గృహాలను పర్యవేక్షించాల్సిన ఆ శాఖ ఉన్నతాధికారిణి కేవలం కార్యాలయం పనులు, వారి సొంత పనులు తప్ప సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు కనీసం వార్డెన్లకు సమావేశం నిర్వహించి తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర వసతులపై మాట్లాడిన సందర్భమూ లేదు. దీంతో బీసీ, ఇతర సంక్షేమ వసతి గృహాల్లో నిర్లక్ష్యం తాండవిస్తోంది. హాస్టల్ పిల్లలు కూడా రోజూ నగరంలో ఇతర పనులకు వెళ్తున్నట్లు సమాచారం. పర్యవేక్షణ లోపం వల్ల పిల్లలు కేటరింగ్ పనులకు వెళ్తున్నా పట్టించుకోవడం లేదు. -
రక్తసంబంధీకులు..!
● సామాజిక దృక్పథం చాటుకుంటున్న విద్యార్థులు ● ఉపాధ్యాయుల స్ఫూర్తితో రెడ్క్రాస్ సభ్యులుగా సేవలు ● 8 ఏళ్లుగా రక్తదాన శిబిరాలు నిర్వహణ శ్రీకాకుళం కల్చరల్: విద్యతో పొందిన జ్ఞానం సమాజానికి ఉపయోగపడితేనే అది నిజమైన విద్య అన్నటువంటి సూక్తిని నగరంలోని పీఎన్ కాలనీలో ఉన్నటువంటి న్యూ సెంట్రల్ స్కూల్ ఉపాధ్యాయులు చాటి చెబుతున్నారు. గత 8 ఏళ్లుగా విద్యార్థులకు సామాజిక దృక్పథం అలవర్చుచుకునేలా బోధన చేస్తున్నారు. వారిచ్చిన స్ఫూర్తితో 473 మంది విద్యార్థులు జూనియర్ రెడ్క్రాస్ సభ్యులుగా సేవలందిస్తున్నారు. వీరంతా ప్రతీ ఏడాది తమ తల్లిదండ్రులను, తమకు తెలిసిన వారిని మోటివేట్ చేస్తూ మరింతగా ముందుకెళ్తున్నారు. పాఠశాల వార్షికోత్సవంలో... పాఠశాల విద్యార్థుల్లో సామాజిక బాధ్యత నేర్పే క్రమంలో ప్రతి ఏడాది మార్చి మొదటి వారంలో జరిగే పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు. దీనిలో భాగంగా రక్తదానంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, భారీస్థాయిలో రక్తపు యూనిట్లు సేకరించి రెడ్క్రాస్ సంస్థకు అందజేస్తారు. రక్తదాన శిబిరాలు ప్రారంభించిన సంవత్సరం నుంచి 95 యూనిట్లు సేకరిస్తే.. గత సంవత్సరం 258 యూనిట్లు రక్తాన్ని సేకరించడం జరిగింది. అంటే ఈ మహా యజ్ఞంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములవుతున్న పరిణామం ఆదర్శనీయం. ఈ ఏడాది కూడా మార్చి 1వ తేదీన స్కూల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. 23 యూనిట్స్ అందించాం స్కూల్లో చదువుతున్న మేము మా ఉపాధ్యాయుల సూచ నల మేరకు ఇప్పటివరకు 23 యూనిట్స్ మా ద్వారా ఇచ్చాం. ఎంతో ఆనందంగా ఉంది. మేము రెడ్క్రాస్లో సభ్యులుగా ఉన్నాం. – పి.జూహిత్రాజ్, జెస్వీ మా ద్వారా 12 యూనిట్లు ఇప్పటివరకు మా ద్వారా 12 యునిట్లు సేకరించాం. రెడ్క్రాస్ సభ్యులుగా మా తల్లిదండ్రులు, మా చుట్టాలకు రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నాం. వారితో రక్తదానం చేయిస్తున్నాం. – బి.కార్తికేయ, రేణు రెహన్షి మేమూ సమాజ సేవలో మా చిన్నతనం నుంచి సేవాభావాన్ని మాలో నింపిన యాజమాన్యానికి ధన్యవాదాలు. మేము కూడా జూనియర్ రెడ్క్రాస్ సభ్యత్వం తీసుకొని ఇప్పటివరకు 8 యూనిట్ల రక్తం సేకరించాము. దీనికి మాకు సంతోషంగా ఉంది. – జె.జస్వంత్, జె.ప్రభాస్ 1న రక్తదాన శిబిరం ఈ ఏడాది కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. గతేడాది చాలా మంది వచ్చి రక్తదానంలో పాల్గొన్నారు. మా విద్యార్థులకు సామాజిక దృక్పథం అవసరమని సూచిస్తున్నాం. దాని ఫలితంగా గతేడాది ఎక్కువ రక్తం యూనిట్లు సేకరణ చేశాం. ఈ ఏడాది కూడా మరలా మార్చి 1వ తేదీన పాఠశాలలో రక్తదాన శిబిరం నిర్వహిస్తాం. – పి.శ్రీకాంత్, న్యూ సెంట్రల్ స్కూల్ డైరెక్టర్ -
చిట్టీల వ్యాపారమే కారణమా..?
● హత్య కేసులో పోలీసుల అదుపులో అనుమానితులు? శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని పొన్నాడ వంతెన సమీప వెంకన్నగారిపేట రాజీవ్గారి తోటలో గురువారం జరిగిన హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఎచ్చెర్ల పరిధిలో ఈ హత్య జరగడంతో విచారణాధికారిగా జేఆర్పురం సీఐ ఎం.అవతారం సమక్షంలోని ఓ బృందంతో పాటు ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో మరో రెండు బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయితే హత్యకు గురైన పైలా మోహన్ చిట్టీల వ్యాపారం చేస్తుంటాడని, ఆ వ్యాపార లావాదేవీల్లో జరిగిన తేడా వలనే ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆ కోణంలో ఇప్పటికే ఇద్దరి అనుమానితులను కాల్డేటా, సీసీ ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో ఒకరిది విశాఖపట్నం కాగా, మరొకరు నగరానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. కారులో నలుగురొచ్చారా..? హత్య జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న వైన్షాపులో నిందితులు మద్యం బాటిళ్లను కొనుగోలు చేశారని, శుక్రవారం రాత్రే నిర్ధారణకొచ్చిన పోలీసుల అక్కడి సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. దాబాలు, బ్రిడ్జివైపు ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. హత్యకు గురైన మోహన్, ఇంటి నుంచి బయల్దేరిన సమయంలో ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారన్నది కాల్డేటా తీయడం.. అప్పటికే పరిశీలించిన సీసీ ఫుటేజీలో కారులో నలుగురు వ్యక్తులు రావడం, వారితో కలిసి మోహన్ వెళ్లడం పోలీసులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ముందుగా వైన్షాపులో మద్యం బాటిళ్లు కొని, తర్వాత సమీప దాబాలో ఫుడ్ కట్టించుకుని తోటలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన వ్యక్తి హిజ్రాల సంఘానికి జిల్లా నాయకునిగా ఉన్నారు. ఎప్పటికప్పుడు వారిలో పోలీసులకు పట్టుబడిన విశాఖ వ్యక్తే ఇక్కడికొచ్చి పార్టీలిస్తున్నట్లు స్థానికంగా అనుకుంటున్నారు. ఆర్థిక లావాదేవీల్లో తేడా కారణంతోనే తుదముట్టించారన్న దిశగానే పోలీసుల దర్యాప్తు సాగుతుందన్నది విశ్వసనీయ సమాచారం. ఘటనా స్థలం పరిశీలన ఎచ్చెర్ల: పైల మోహన్ హత్య జరిగిన సంఘటన స్థలాన్ని డీఎస్పీ వివేకానంద శుక్రవారం ఉదయం పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను సేకరించారు. ఆయనతోపాటు ఎచ్చెర్ల ఎస్ఐ జి.లక్ష్మణరావు ఉన్నారు. -
చేపల ఉత్పత్తులతో అధిక లాభాలు
ఆమదాలవలస: చేపలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీతో అధిక లాభాలు పొందవచ్చునని శాస్త్రవేత్త, శిక్షణా నిపుణులు డాక్టర్ వీరాంజనేయులు, డాక్టర్ కోటేశ్వర్లు సూచించారు. జాతీయ మత్స్య అభివృద్ధి మండలి మరియు కృషి విజ్ఞాన కేంద్రంలో చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై 5 రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. చేపలు, రొయ్యలు పరిశుభ్ర పరిస్థితుల్లో పెంపకాలు చేపడితే వాటి నాణ్యత తక్కువ కాకుండా ఉంటుందని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చేపలను వివిధ రూపాలలో నాణ్యత కోల్పోకుండా మార్కెట్ చేసుకోవడం ద్వారా మత్స్యకారులకు ఆదాయం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ చేపలు మానవ ఆహారంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయన్నారు. నాణ్యతగా వినియోగదారులకు అందించే విధానాన్ని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. -
ఉపాధికి కొత్తరూపు..!
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామాల్లో వలసల నివారణకు ఇదివరకు ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపురేఖలు మారనున్నాయి. ఈ చట్టంలో పలు మార్పులు తీసుకు రావడంతో పాటు పథకం పేరును మారుస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఎన్ఆర్ఈజీఎస్ను వీబీ–జీ రామ్–జీ పథకంగా (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్–గ్రామీణ్) పేరును మార్పు చేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఇక ఈ పథకం ద్వారా వచ్చే నిధుల శాతం కూడా మారనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా నూతన ఉపాధి హామీ చట్టం అమల్లోకి రానుంది. ఇప్పటికే ఈ నూతన చట్టానికి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఏడాదికి 125 రోజుల పనిదినాలు కొత్తగా వస్తున్న వీబీ–జీ రామ్–జీ పథకం ద్వారా కూలీలకు ఏడాదికి 125 రోజులు పని దినాలు కల్పించనున్నారు. గతంలో ఏడాదికి 100 పని దినాలు ఉండేవి. వాటికి అదనంగా 25 రోజులు పెంచారు. ఇక రోజువారీ వేతనం రూ.311ల వరకు అందించనున్నారు. గతంలో పని అడిగితే జాబ్ కార్డు ఉన్న వారందరికీ పని కల్పించేవారు. జాబ్ కార్డు లేని కుటుంబాలకు జాబ్ కార్డును కూడా అందజేసేవారు. ఎంత పనినైనా చేసే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుత నూతన చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీల్లో కూలీల ఆధారంగా బడ్జెట్ కేటాంచనున్నారు. నిర్ణీత సమయంలో ఉపాధి కల్పించకపోతే 15 రోజుల్లో కూలీలకు నిరుద్యోగ భృతి అందించే విధంగా చట్టంలో మార్పులను చేశారు. ఎక్కువ రోజులు పనిచేసేందుకు అవకాశం లేదు. ముందుగా నిర్ణయించిన మేరకే పనులు చేయాల్సి ఉంటుంది. పనికి హాజరైతేనే వేతనాలు కొత్త చట్టంలో నూతన సాంకేతిక విధానంతో కూడిన పర్యవేక్షణ చేయనున్నారు. కూలీల బయోమెట్రిక్, జియో ట్యాగింగ్, రియల్ టైం డాష్ బోర్డులతో సాంకేతికతతో కూడిన పర్యవేక్షణ ఉంటుంది. ఈ సాంకేతిక విధానంలో దొంగ మస్తర్లకు కాలం చెల్లినట్టే. పని చేస్తున్న ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. అక్కడికి వెళ్లి కూలీలు బయోమెట్రిక్ వేస్తేనే హాజరు నమోదు అవుతుంది. దీంతో పాటు ఫొటో, పని ముగిసిన వెంటనే మరోసారి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో పనులకు వస్తేనే వేతనం అందించే విధంగా మార్పులు చేపట్టారు. 10 రోజుల్లోనే వేతనాలు కొత్తచట్టంలో పనులకు హాజరయ్యే కూలీలకు 10 రోజుల్లోనే వేతనాలు ఖాతాలకు జమ చేస్తారు. పనులకు హాజరైన వెంటనే వారి వివరాలు వీబీ–జీ రామ్–జీ నూతన యాప్లో నమోదవుతాయి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్లను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయిస్తే.. కేంద్ర ప్రభుత్వం 60 శాతం మేర నిధులను కేటాయించే విధంగా చట్టంలో మార్పులు చేశారు. రాష్ట్ర వాటా చెల్లిస్తేనే కేంద్రం వాటా నిధులు విడుదల చేస్తారు. అలాగే పనిచేసే చోట మౌలిక వసతులు కల్పించాలి, లేకుంటే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ నుంచి అమల్లోకి... ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన ఉపాధి చట్టం వీబీ–జీ రామ్–జీ అమల్లోకి రానుంది. పెంచిన పనిదినాలతో జిల్లావ్యాప్తంగా 5 లక్షల మంది కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు సకాలంలో చెల్లించే అవకాశం ఉండదని, దీని వలన పని దినాలు ఉన్నా, పనికి వేతనం అందించడంలో ఇబ్బందులు వస్తాయని ప్రజా సంఘాలు, రైతుల కూలీ సంఘాలు ఈ కొత్త చట్టంపై విమర్శలు చేస్తున్నాయి. నేటి నుంచి అవగాహన సదస్సులు నూతన ఉపాధి చట్టం ప్రకారం జిల్లావ్యాప్తంగా శనివారం నుంచి విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్ బి.లవరాజు తెలిపారు. భారత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఆరు వారాల పాటు ‘జన్–సంవాద్’ పేరుతో క్షేత్రస్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వారాల వారీగా కార్యాచరణ మొదటి వారం: మీడియా సమావేశాల ద్వారా అపోహల తొలగింపు. కొత్త చట్టం విశిష్టతపై కరపత్రాల పంపిణీ. రెండో వారం: గ్రామాల్లో ‘హక్కుల రక్షణ ప్రతిజ్ఞ’ కార్యక్రమాలు. మూడో వారం: గ్రామసభల్లో రచ్చబండ కార్యక్రమాలు, గోడ పత్రికల ద్వారా ప్రచారం. నాలుగో వారం: పాఠశాల విద్యార్థులకు పోటీ లు, గాంధీజీ సూక్తులతో అవగాహన ర్యాలీలు. ఐదో వారం: పంచాయతీరాజ్ ప్రతినిధులతో సదస్సులు. ఆరో వారం: కనీసం 100 రోజుల పని పూర్తి చేసిన శ్రామికులకు సన్మానం. పేరు మార్పుచేస్తూ కొత్తచట్టం ఇక నుంచి 125 పనిదినాలు మారనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల శాతం కొత్తచట్టంపై పలువురి విమర్శలు -
సంక్షేమం లేదు.. అభివృద్ధి జరగడం లేదు
● పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాతపట్నం: రాష్ట్రంలో రెండేళ్లుగా ఎటువంటి సంక్షేమం లేదని, అలాగే అభివృద్ధి జరగడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. పాతపట్నంలోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, సంపద సృష్టిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన సీఎం చంద్రబాబు, ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. సంపద సృష్టి మాట దేవుడెరుగు.. అప్పుల్లో మాత్రం కొత్త రికార్డులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 20 నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు, ఇతర సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డీబీటీ పద్ధతిలో ఐదేళ్లలో ఏకంగా రూ.2,73,756 కోట్లు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా అందాయని గుర్తు చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో మెళియాపుట్టి పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు ఉర్లాన బాలరాజు, పార్టీ మండల అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
స్వప్నం.. సాకారం
● తొలి ప్రయత్నంలో 3 బ్యాంకుల్లో ఉద్యోగాలు గార: పట్టుదలే పెట్టుబడిగా.. క్రమశిక్షణే ఆయుధంగా ఓ సాధారణ ఇల్లాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదంటూ రుజువు చేశారు. మండలంలోని జొన్నలపాడుకి చెందిన ఎం.స్వప్న సాధారణ కుటుంబంలో పుట్టి డిగ్రీ వరకు చదువుకున్నారు. పెళ్లయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టి.. ఉద్యోగ సాధనే లక్ష్యంగా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితంగా ఇటీవల విడుదలపై ఐపీబీఎస్ పీవో (బ్యాంకు ఆఫ్ బరోడా), ఆర్ఆర్బీ పీవో (తెలంగాణ గ్రామీణ బ్యాంకు), శుక్రవారం విడుదలైన స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. స్వప్న భర్త సాక్షి దినపత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేస్తుండగా, అత్త, మామలది చేనేత కుటుంబం. ఆమె స్వస్థలం విశాఖపట్నం.స్వప్న -
భారీ ట్యూమర్ తొలగింపు
శ్రీకాకుళం క్రైమ్: అప్పటికే గుండెకు బైపాస్ సర్జరీ జరిగిన 78 ఏళ్ల వృద్ధురాలి పొత్తి కడుపులో పెరిగిన 10 కిలోల బరువున్న భారీ ట్యూమర్ను శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. దీనికి సంబంధించి సర్జికల్ అంకాలజిస్టు డాక్టర్ బమ్మిడి సందీప్ మాట్లాడుతూ రోగిలో ట్యూమర్ పరిమాణం పెద్దదిగా ఉండడంతో పొత్తి కడుపులోని ఇతర అవయవాలపై ఒత్తిడి పెరిగి ప్రాణాపాయం జరిగేదన్నారు. వృద్ధురాలు కావడం, అప్పటికే గుండె బైపాస్ సర్జరీ జరిగి ఉండటంతో మళ్లీ శస్త్ర చికిత్స చేయడం హైరిస్క్గా భావించామని, అయినప్పటికీ బహుళ విభాగాల వైద్య బృందం సమన్వయంతో ట్యూమర్ను తొలగించగలిగామని చెప్పారు. శస్త్ర చికిత్సకు ముందు గుండె పనితీరును పూర్తిగా అంచనా వేసి, ఆపరేషన్ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రస్తుతం గుండె పనితీరు స్థిరంగా ఉందన్నారు. రేపు జిల్లాస్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలుశ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఆర్చరీ అసోసియేషన్, డీఎస్ఏ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్నాయని ఆ సంఘ ప్రధాన కార్యదర్శి లోపింటి చిట్టిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని అరసవల్లి రోడ్డులోని ఆదిత్య ఆర్చరీ అకాడమీ, కొయ్యన కన్నయ్యనగర్ వేదికగా ఎంపిక పోటీలు ఉదయం 10.30 గంటల నుంచి మొదలవుతాయని చెప్పారు. మినీ అండర్ –10, అండర్–13, అండర్ –15, ఇండియన్ రౌండ్, రికర్వే, కాంపౌండ్ విభాగాల్లో క్రీడాకారుల ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. కృష్ణ జిల్లా నూజివీడులో ఈనెల 11వ తేదీన జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపికలను ఇక్కడ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు, నాలుగు పాస్ ఫొటోలు, ఎంట్రీ ఫీజుతో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 94406 77201, 99899 78727 నంబర్లను సంప్రదించాలని సూచించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి బూర్జ: మండలంలోని ఓవీపేట గ్రామానికి చెందిన సాకేటి అమ్మన్నమ్మ (58) విశాఖపట్టణంలోని కేజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. స్థానిక పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 25వ తేదీన సాయంకాలం వర్షం పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో ఆమె వెలుగు కోసం కొవ్వొత్తి వెలిగించింది. వెలిగించిన కొవ్వొత్తి దుస్తులకు అంటుకోవడంతో ప్రమాదంతో ఆమె శరీరం కాలిపోయింది. వెంటనే శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అనంతరం అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్టణంలోని కేజీహెచ్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెకు వివాహమైన కూతురు, కొడుకు ఉన్నారు. ఫిర్యాదు మేరకు స్థానిక ఇన్చార్జి ఎస్ఐ బి.హైమావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య ఇచ్ఛాపురం: పట్టణంలో గత 15 ఏళ్లుగా తాపీమేసీ్త్రగా జీవనం సాగిస్తున్న పైడి డిల్లేశ్వరరావు(50) అప్పుల బాధ తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన డిల్లేశ్వరరావు తాపీమేసీ్త్రగా జీవనం సాగిస్తుండేవాడు. ఇతను స్థానికంగా పనులు చేసుకుంటూ స్వగ్రామంలో ఉంటున్న కుటుంబ సభ్యులకు డబ్బులు పంపేవాడు. ఈ క్రమంలో ఇతని ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసేందుకు కొంతమొత్తంలో పట్టణంలో అప్పులు చేశాడు. తాను చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోవడంతో చేసిన అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భోజనం చేసి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. అనంతరం పట్టణంలోని సురంగిరాజావారి కోట వెనుక భాగంలో ఉన్న తోటలో చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. చెట్టుకి వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సీహెచ్సీకి మృతదేహాన్ని తరలించారు. పట్టణ ఎస్ఐ ముకుందరావు కేసు నమోదు చేశారు. -
ఇవేం పనులు..?
● అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ● కొరవడిన పర్యవేక్షణ ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ను అమృత్ భారత్ రైల్వేస్టేషన్గా ఎంపిక చేసి ఏడాది కాలంగా రూ.కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దీనిలో భాగంగా స్టేషన్ వెనుక భాగంలో గదుల నిర్మాణాలకు పిల్లర్లు వేశారు. అయితే పిల్లర్స్ మధ్యలో నిబంధనల ప్రకారం ఇసుకతో గానీ.. కంకరతో గానీ ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా, స్టేషన్ పక్కనుంచి పారుతున్న మురుగు కాలువలో మట్టిని తీసి వేస్తున్నారు. దీంతో పనులు నాణ్యత దెబ్బతింటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడి కనుసైగలతో నిర్వహిస్తున్న ఈ పనుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారని అంటున్నారు. ఈ పనుల పర్యవేక్షణలో రైల్వే అధికారులు కూడా మంత్రి ఆదేశాలతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భవనం నిర్మాణ సమయంలో పునాది లెవెల్లో ఇలా నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే భవిష్యత్లో భవనాలు కూలే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా లేనివిధంగా కాంట్రాక్టర్కు కాసులు మిగలడంతో పాటు తాబేదారులకు ముడుపులు చెల్లించేందుకు ఇలాంటి మురికి మట్టిని ఫిల్లింగ్ చేసి నాసిరకం పనులు చేస్తున్నట్లు ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఈ పనులపై సమగ్రమైన పరిశీలన జరిపి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు నిర్వహించాలని కోరుతున్నారు. -
రోజుకో ఇన్చార్జి కమిషనర్
శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్గా రోజుకొకరిని మున్సిపల్ శాఖ నియమిస్తోంది. కమిషనర్ను సస్పెండ్ చేసిన తర్వాత వచ్చిన ఉత్తర్వుల్లో మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ను ఇన్చార్జిగా నియమించారు. ఆయన ఆరోగ్యం సరిగా లేదని చెప్పడంతో ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను ఇన్చార్జి కమిషనర్గా నియమించారు. ఆయనకు సహాయకునిగా జీవీఎంసీ కమిషనర్ నల్లనయ్యను నియమిస్తూ శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు జారీ అయిన గంటలోనే దాన్ని రద్దు చేస్తూ జీవీఎంసీలో కమిషనర్గా పనిచేస్తున్న బొడ్డేపల్లి రామును కమిషనర్కు సహాయకునిగా నియమిస్తున్నట్లు మళ్లీ ఉత్తర్వులు వెలువరించింది. రోజుకో పేరుతో ఎందుకంత గందరగోళం సృష్టిస్తున్నారో నగర వాసులకు అర్థం కావడం లేదు. నల్లనయ్యకు శ్రీకాకుళం నగరంపై మంచి పట్టు ఉండడం వల్ల తొలుత ఆయనను నియమించారు. అయితే ఆయన నియామకాన్ని ఎందుకు రద్దు చేశారన్నది అర్థం కావడం లేదు. కొత్తగా ఇన్చార్జి కమిషనర్ సహాయకునిగా వస్తున్న రాము కేవలం పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా వంటి వాటిని మాత్రమే పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. ● శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్కు సహాయకునిగా బొడ్డేపల్లి రాము ● అంతకుముందు నల్లనయ్య పేరిట ఉత్తర్వులు వెలువరించి ఉపసంహరించుకున్న అధికారులు -
● ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని కాకివీధికి చెందిన జంగేటి ఆదిలక్ష్మి(85) మరణించారు. దీంతో ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో కుటుంబ సభ్యులు నేత్రదానం కోసం రెడ్క్రాస్ చైర్మన్ను సంప్రదించారు. మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, పి.చిన్నికృష్ణల ద్వారా ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. ప్రస్తుత కాలంలో నేత్రదానంపై అవగాహన, చైతన్యం ప్రజల్లో పెరుగుతుందని, ఈ విధంగా నేత్రదానం ద్వారా మరొకరికి ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం కలుగుతుందని చైర్మన్ జగన్మోహన్రావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్లు అన్నారు. నేత్రదానం చేయాలనుకునేవారు 78426 99321 నంబర్ను సంప్రదించాలన్నారు. -
నిర్లక్ష్యం ముంచెత్తగా..
శ్రీకాకుళంఆదర్శ పాఠశాలల్లో..ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. –8లో● మురుగుతో మగ్గిపోతున్న జిల్లా కేంద్రం ● దృష్టంతా ఒక ప్రాంతం పైనే.. ● పెరుగుతున్న డయేరియా కేసులు ● రోడ్ల విస్తరణ, కాలువల నిర్మాణాల్ని పర్యవేక్షించని ఇంజినీర్లు ● పంపు హౌస్, ఇన్ఫిల్టర్ల వద్ద అధ్వాన పరిస్థితులు శుక్రవారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కారణం తేలలేదట.. బాధ్యుడు మాత్రం కమిషనరే! ● అధికారుల వింత వాదన శ్రీకాకుళం: నగరంలో డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం నిర్ధారణ కాలేదని అధికారులు, మంత్రులు, శాసన సభ్యులు ప్రకటిస్తూనే బాధ్యుడు మాత్రం కమిషనరే అని భా వించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దమ్మల వీధి పరిసర ప్రాంతాల్లో డయేరియా ప్రబలిందని తొలుత కార్పొరేషన్లోని ఆరోగ్య విభాగానికి సమాచారం వచ్చినప్పటికీ.. వారు సరిగా స్పందించలేదు. ఫలితంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. డయేరియాతో పాటు ఎలాంటి వ్యాధి ప్రబలినా సంబంధిత వార్డు సచివాలయాల ఆరోగ్య సిబ్బంది ద్వారా కార్పొరేషన్లోని ఆరోగ్యాధికారికి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులకు సమాచారం అందుతుంది. వీరు సరిగా స్పందించకపోవడం వల్లనే వ్యాధి ఉద్ధృతమైందని వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో జనం విమర్శిస్తున్నారు. వాస్తవానికి సస్పెండ్ అయిన కమిషనర్ కూర్మారావు గతంలో జిల్లాలో డ్వామా పీడీగా పనిచేసే జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టారు. ఈయన రాష్ట్రస్థాయిలో మంచి స్థాయిలో ఉండగా ఈయనను ఒప్పించి ఇక్కడకు తీసుకువచ్చి చేయని తప్పునకు సస్పెండ్ చేయడాన్ని నగరవాసులు తప్పు పడుతున్నారు. ఇప్పటికే వాట్సాప్ గ్రూపుల ద్వారా అంతర్లీనంగా ఉద్య మం ప్రారంభమైంది. వీటిని ముఖ్యమంత్రికి పంపించాలన్న ఆలోచనలో కూడా పలువురు ఉన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో వెట్టి చాకిరీని పూర్తిగా రూపు మాపే దిశగా అందరం కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. ఆయన గురువారం శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలో వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్ట చేసి నేటికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు సంచార వాహనాన్ని ప్రారంభించారు. అంతకుముందు వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన పోస్టర్లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబుతో కలిసి ఆవిష్కరించారు. రుణం తీసుకున్నందుకు ప్రతిఫలంగా తక్కువ వేత నం లేదా వేతనం లేకుండా బలవంతంగా పనిచేయించడం నేరమన్నారు. చట్టం ప్రకారం వెట్టిచాకిరీ కింద ఉన్న పాత అప్పులన్నీ రద్దు అవుతాయని వివరించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గేదల ఇందిరా ప్రసాద్, ‘నేచర్’ డైరెక్టర్ ఎస్.వికాస్, సిబ్బంది చైతన్య, దుర్గ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు . గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు 1న పరీక్షలు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిధిలో ఏపీఎస్డబ్ల్యూఆర్ఈ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2026–2027 విద్యాసంవత్సరానికి 5వ తరగతి, జూనియర్ ఇంటర్ (జనరల్ –ఐఐటి, నీట్) ప్రవేశ పరీక్షలు మార్చి 1న జరగనున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్ వై.యశోదలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ప్రవేశ పరీక్ష మార్చి 1 ఉదయం 9.30 నుంచి 11 గంటలు వరకు ఉంటుందని, ఇంటర్మీడియట్ (జనరల్) మధ్యాహ్నం 12 గంటల 1.30 వరకు, ఐఐటి/నీట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుందని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హాల్టికెట్లు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఇంటర్మీడియెట్ (జనరల్), ఐఐటీ, నీట్ పరీక్షల కు పరీక్షా కేంద్రాలు ఒకటే ఉంటాయని తెలిపారు. జిల్లాలో గల 5వ తరగతి, జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, తల్లిదండ్రులు గమనించాలని కో రారు. వివరాలకు 9701736862, 83310 05217 నంబర్లను సంప్రదించాలని కోరారు. శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్యం పడకేసింది. ఈ వైఖరే డయేరియా ప్రబలడానికి కారణమైందని నగర వాసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా డయేరియాతో నలుగురు మృతి చెందిన ప్రాంతమైన దమ్మలవీధిలోనే పారిశుద్ధ్య కార్మికులంతా పనిచేస్తున్నారే తప్ప నగరమంతటినీ పట్టించుకోవడం లేదు. శ్రీకాకుళం మున్సిపల్ కా ర్పొరేషన్లో సిబ్బంది సరిపడకపోతే జిల్లాలో ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి శుభ్రం చేసేందుకు అవకాశం ఉంది. అయినప్పటికి అలాంటి ప్రయ త్నం ఏమీ చేయడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్యం, పారిశుద్ధ్యానికే తొలి ప్రాధాన్యత ఉండేది. చెత్త సేకరణ అనేది ఓ డ్రైవ్లా నిరంతరం జరిగేది. కూటమి ప్రభుత్వంలో మాత్రం అవేమీ కానరావడం లేదు. అప్పుడప్పుడు పచ్చదనం–పరిశుభ్రత, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర పేరుతో నేరుగా అధికారుల చేత చెత్తను సేకరించేలా ఫొటోలకు ఫోజులివ్వడం ఆన్లైన్లో అప్లోడ్ చేయడం తర్వాత వదిలేయడం పరిపాటిలా మారింది. చెత్తను రోడ్లపై వేయకుండా, డస్ట్బిన్లలో చెత్త పేరుకుపోకుండా ఉండేందుకు చెత్త సేకరణ వాహనాలను నిరంతరం ఇంటింటికి తిప్పడం వంటివి చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయకుండా వదిలేయడం వల్ల వచ్చిన పర్యవసానమే శ్రీకాకుళం నగరంలో డయేరియా. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ మూడు రకాల డస్ట్ బిన్లు ఇచ్చి, క్లీన్ వెహికల్స్, క్లాప్ వెహికల్స్ పెట్టి ప్రతి రోజూ చెత్త సేకరిస్తే అంతా హేళన చేశారు. అదే సమయంలో కరోనా వస్తే శానిటేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేయడం వల్లే ఎంతో మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు పూడుకుపోయిన కాలువలు, పేరుకుపోతున్న చెత్త వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయి. ఒకేచోట కేంద్రీకృతం దమ్మలవీధిలో డయేరియా ప్రబలడంతో మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పలుమార్లు ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వస్తుండడంతో పారిశుద్ధ్య కార్మికులంతా ఆ ప్రాంతంలోనే కేంద్రీకృతమైపోయారు. అక్కడ తీసిన కాలువలే తీసి, తీసిన చెత్తనే తీసి, వేసిన చోటే బ్లీచింగ్ మళ్లీ మళ్లీ వేసి శుభ్రం చేస్తున్నారు. నగరంలో బలగ, వాంబేకాలనీ, కాకివీధి, దండివీధులతో పాటు మిగిలిన ప్రాంతాల్లో శానిటేషన్ పూర్తిగా గాలికొదిలేశారు. కుళాయి పైపు లైన్ల లీకులు సైతం పట్టించుకోవడం లేదు. దీంతో డయేరియా అనేది మెల్లగా మి గిలిన ప్రాంతాలకు పాకుతోందని నగరంలో చర్చ జరుగుతోంది. దమ్మలవీధి ప్రాంతానికే ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తూ మిగిలిన ప్రాంతాల్లో కుళాయిలు నచ్చిన సమయానికి నచ్చినట్లు ఇస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని నగర వాసులంతా గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికై నా అన్ని ప్రాంతాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇళ్లలో ఉండలేకపోతున్నాం.. కాలువల్లో తీసిన చెత్తను, బురదను రోడ్డుపై వేసి వదిలేయడంతో మళ్లీ అవి కాలువల్లో పడుతున్నాయి. అంతేకాకుండా లోపల ఉన్నదాన్ని తీసి రోడ్డుపై వేసేయడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త కుప్పల చుట్టూ పందులు, కుక్కలు మూగుతున్నాయి. ఎప్పటికప్పుడు చెత్తను తీసుకెళ్తే మా ఆరోగ్యాలు బాగుంటాయి. – ఎం.అప్పలనర్సమ్మ, బలగ, శ్రీకాకుళం నగరం -
పర్యవీక్షణకు ఫలితమిది..
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో పనిచేసేందుకు కావాల్సినంత మంది ఇంజినీర్లు ఉన్నారు. అంతకు మించి శానిటేషన్ పర్యవేక్షణకు, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్లు ఉన్నాయి. శ్రీకాకుళం కార్పొరేషన్లో అందరికీ సురక్షితమైన మంచినీరు అందించేందుకు, పారిశుద్ధ్యాన్ని కాపాడేందుకు పుష్కలంగా అధికారులు ఉన్నా నగరవాసులకు నరకయాతన తప్పడం లేదు. 2025 డిసెంబర్ నెలలో బలగలో ఓ వ్యక్తి డయేరియాతో మృతి చెందాడు. అయినప్పటికి మున్సిపల్ అధికారులు మేలుకోలేదు. వీరి నిర్లక్ష్యమే దమ్మలవీధిలో జరిగిన సంఘటనలో నలు గురి ప్రాణాలు గాల్లో కలిసిపోడానికి కారణమైంది. ప్రభుత్వ ఆస్పత్రిలో అయితే ఒకేచోట లెక్క దొరికిపోతుందన్న ఆలోచనతో రిమ్స్, కిమ్స్, జెమ్స్, సింధూర వంటి ఆస్పత్రుల్లో డయేరియా బాధితుల్ని అడ్మిట్ చేసి లెక్కకు దొరక్కుండా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం కేసుల వివరాలు దాచి పెట్టే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ సుమారు 150కి పైగా కేసులున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకీ మౌనం..? గత పది రోజులుగా కుళాయిల్లోంచి మురుగునీరు వస్తున్నా, స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణం. ఇంజినీరింగ్ విభాగంలో ఎంఈ, డీఈ, వాటర్సప్లై ఏఈలు ఉన్నప్పటికీ వారెవ్వరు పట్టించుకోలేదు. అసలు కుళాయి పైపులైన్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని కాలువల్లో ఉన్న పైపు లైన్లు పర్యవేక్షించిన దాఖలాలు లేవు. ఇంజినీర్లంతా కార్యాలయంలో తమకు కేటాయించిన సీట్లకే పరిమితమవ్వడమే తప్ప క్షేత్రస్థాయిలో పరిశీలన, పర్యవేక్షణ చేసిన సందర్భాలు లేవని నగర వాసులు మండిపడుతున్నారు. నగరంలో రోడ్ల విస్తరణ, కాలువల నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, కుళాయిలు పాడైపోకుండా, వాటిలో మురుగునీరు కలిసిపోకుండా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అసవరం ఉంది. అవేమీ చేయకపోవడం వల్లే కాలువల్లో నీరు కుళా యి పైపు లైన్లలోకి వెళ్లిపోవడంతో డయేరియా వ్యాపించిందని నగరవాసులు మండిపడుతున్నా రు. అంతేకాకుండా పంపుహౌస్, ఇన్ఫిల్టరేషన్ వద్ద పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఆదివారంపేట పంపుహౌస్కి తలుపులు లేకుండా ఓ రేకు అడ్డుపెట్టి ఉంచారు. అక్కడ మిషనరీ విచ్చలవిడిగా పడేశారు. ఇంజినీర్లు ఫుల్.. పర్యవేక్షణ నిల్ ఇంజినీరింగ్ విభాగంలో మున్సిపల్ ఇంజినీర్ (ఎమ్ఈ)–1, డిప్యూటి ఇంజినీర్లు (డీఈలు)– 3, అసిస్టెంట్ ఇంజినీర్లు (ఏఈలు)– 4, ఎమినిటి సెక్రటరీలు– 18మంది ఉన్నారు. కానీ వారంతా గ్రౌండ్లెవల్లో పర్యవేక్షణ మాత్రం చేయడం లేదు. కమీషన్లు వచ్చే పనులపైనే దృష్టి సారించి ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉండే కుళాయిలపైన, మంచినీరు సరఫరా చేయడంపైనా దృష్టి సారించలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు నగరంలో నిరంతరం పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాల్సిన హెల్త్ ఆఫీసర్ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు వందలాది మంది డయేరియా బారిన పడ్డారని నగర వాసులే ఆరోపిస్తున్నారు. ఇంజినీరింగ్, ప్రజారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటనకు ఇటీవల వచ్చిన మున్సిపల్ కమిషనర్ని బలిచేసి సస్పెండ్ చేసిన ప్రభుత్వ తీరుపై అధికార వర్గాలు, సామాన్య ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రజల ప్రాణం తీసింది శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇంజినీరింగ్, శానిటేషన్ సిబ్బంది కావాల్సినంతమంది ఉన్నారు. కానీ పర్యవేక్షణ లోపం వల్లే నగరంలో డయేరియా ప్రబలి నలుగురు మృతి చెందారు. వందలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలి. – టి.తిరుపతిరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి -
మరొకరు మృతి..?
● డయేరియాతో ● అతిసారం అరికట్టేందుకు చర్యలు శ్రీకాకుళం: నగరంలో డయేరియా మృతుల సంఖ్య పెరుగుతోంది. అధికారికంగా మాత్రం ఒకరే డయేరియాతో చనిపోయారని అధికారులు చెబుతున్నారు. తాజాగా మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మరొకరు మృతి చెందారు. కోటేశ్వరరావు అనే 61 ఏళ్ల వ్యక్తి ఆదివారం సాయంత్రం నుంచి మెడికవర్లో చికి త్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆస్పత్రి వర్గాలు మాత్రం కోటేశ్వరరావు డయేరియాతో చనిపోలేదని చెబుతుండ డం గమనార్హం. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధి తో తమ వద్దకు వచ్చాడని కిడ్నీకి మాత్రమే తాము వైద్యం చేస్తుండగా గురువారం గుండెపోటు వచ్చి చనిపోయాడని చెబుతున్నారు. సంబంధిత రోగి రిమ్స్ నుంచి రిఫరై వచ్చినప్పటికీ.. రోగి బంధువులు తమ వద్దకు తీసుకురావడంతో చేర్చుకున్నామని చెబుతున్నారు. రిమ్స్లో డయే రియాతో చేరి చికిత్స పొందినట్లు తమకు రోగి బంధువులు ఎవరూ చెప్పలేదని, తమ ఆస్పత్రికి వచ్చేసరికే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. శ్రీకాకుళం: నగర పాలక సంస్థ పరిధిలో అతిసార వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందని జాయింట్ కలెక్టర్, ఇన్చార్జి కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ము ఖ్యంగా వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న దమ్మ ల వీధి, కాకి వీధి, మంగువారి తోట, మేదర వీధి, గుడి వీధి ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఫాస్ట్ ఫుడ్, మాంసం దుకాణాల వంటి ఆహార వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించా రు. ఈ నిబంధనలను అతిక్రమించి వ్యాపారా లు కొనసాగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పశువుల యజమానులు తమ ఆవులను, ఇతర మూగజీవాలను రోడ్లపైకి వదలకుండా ఇళ్లలోనే ఉంచాలని స్పష్టం చేశారు. ఈ ఆంక్షల ను ధిక్కరించే పశువుల యజమానులపై చట్టప్రకారం జరిమానాలు విధిస్తామన్నారు. జనం కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను, వాటర్ ట్యాంకులను శుభ్రంగా ఉంచుకోవాలని అభ్యర్థించారు. విరేచనాలు, వాంతులు లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలని లేదా కార్పొరేషన్ హెల్ప్ లైన్ నంబర్ 08942–228090 కు కాల్ చేయాలని తెలిపారు. -
‘నీటి పంపిణీ వ్యవస్థ ఆధునికీకరించాలి’
శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో డయేరియా ప్రబలడంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి శ్రీకాకుళం నగరం చేరుకున్న రామ్మోహన్ నాయుడు నగరంలోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సాయంత్రం జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీ సుకోవాలని సూచించారు. మున్సిపల్ శాఖ నుంచి విడుదల కాబోతున్న నిధులు, సుడా నుంచి మంజూరైన రెండు కోట్లతో డ్రెయిన్లు, పారిశుద్ధ్యం నిర్వహించాలన్నారు. నీటి పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించాలన్నారు. దీనికోసం సమగ్ర రిపోర్టును సిద్ధం చేయాలని ఆదేశించారు. -
ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాల్సిందే
● చలో అసెంబ్లీకి పిలుపునిస్తాం ● ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాల విభజనలో ఐటీడీఏను కోల్పోయిన శ్రీకాకుళం జిల్లాకు మెళియాపుట్టి కేంద్రంగా ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్ చేశారు. ఐటీడీఏ ఏర్పాటుపై గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్ఛాపురం నుంచి కొత్తూరు వరకున్న ఆదివాసీల కోసం ఐటీడీఏ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. చంద్రబాబు దీనిపై హామీ ఇచ్చి మర్చిపోయారని విమర్శించారు. అవసరమైతే చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామన్నారు. ధర్నాకు సంఘీభావంగా బహుజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు పాటల తూట ఉదయభాస్కర్, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు పాల్గొన్నారు. -
రుణ లబ్ధిదారులకు శిక్షణ
ఎచ్చెర్ల : ఎచ్చెర్లలోని రూరల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పీఎంఈజీసీ, పీఎంఎఫ్ఎం లబ్ధిదారులకు ఆఫ్లైన్ ఈడీపీ శిక్షణను గురువారం ప్రారంభించారు. 35 మంది లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా లీడ్బ్యాంక్ మేనేజర్ పేడాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ.5 లక్షల లోపు రుణం తీసుకున్న వారు ఐదు రోజులు, అంతకంటే ఎక్కువ తీసుకున్న వారు పది రోజులు శిక్షణలో పాల్గొని ఈడీపీ సర్టిఫికెట్లు పొందాలన్నారు. వాటిని సంబంధిత బ్యాంక్ల్లో సమర్పించాలన్నారు. మార్చి 8లోగా యూనిట్లు గ్రౌండ్చేసి ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ రామ్జీ, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.కిరణ్కుమార్, నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ రమేష్కృష్ణ, డీపీఎంలు, ఏపీఎంలు, బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో కూర్మనాథుని తిరువీధి
గార: డోలోత్సవం ముందు ఫాల్గుణ దశమి పురస్కరించుకొని శ్రీకూర్మనాథుని తిరువీధి ఉత్సవం భక్తిశ్రద్ధలతో గురువారం నిర్వహించారు. సాయంత్రం శ్రీకూర్మనాథాలయం నుంచి రెండు పల్లకీలపై శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, సీతారామ లక్ష్మణులను మాడవీధుల్లో ఊరేగించారు. రావివలస నాయుడు మంటపం వద్ద వేంచిపచేసిన అర్చక బృందం నాయుడు గోత్రనామాలతో ప్రత్యేక పూజలతో పాటు విష్ణుసహస్ర నామ పారాయణం జరిపారు. అనంతరం ఆలయం నుంచి వచ్చిన నైవేద్యాన్ని సమర్పించి, మంగళశాసనాలు జరిపారు. కార్యక్రమంలో ఈఓ టి.వాసుదేవరావు, ఆలయ ప్రధానార్చకులు సీహెచ్. సీతారామనృసింహాచార్యులు, కూర్మినాయుడు, స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు, కిషోర్బాబు భక్తులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు అంగన్వాడీలకు వెంటనే వేతనాలు పెంచాలని, లేకుంటే సమ్మె తప్పదని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ అన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే పార్కు వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరాహార దీక్షలు గురువారం కూడా కొనసాగాయి. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, ఆర్.ప్రకాశరావు, ఎ.రాజు, అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులు పి.లతాదేవి, బి.జ్యోతి, పి.భూలక్ష్మి, బి.సునీత, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
5న కూర్మనాథుని డోలోత్సవం
గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మంలో కూర్మనాథుని డోలోత్సవం మార్చి 3 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఉత్సవాల పోస్టర్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లు ఆవిష్కరించారు. గురువారం మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన డోలోత్సవంలో భక్తులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 3న కామదహనోత్సవం, 4న పడియ, 5న డోలోత్సవం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ టి.వాసుదేవరావు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. -
అసంబద్ధ ఉత్తర్వులు సరిచేయాలి
శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ల నియామక ఉత్తర్వుల్లో అసంబద్ధ విధానాలను సరిచేయాలని డీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు పేడాడ కృష్ణారావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పూజారి హరిప్రసన్న, ఎన్ని వెంకట ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. డివిజన్ పరిధి దాటి కొంతమంది ప్రధానోపాధ్యాయులను నియమించడం, సీనియర్లను విస్మరించి జూనియర్లను నియమించడం, మినహాయింపు అడిగిన వారి బాధలను పట్టించుకోకుండా బలవంతంగా నియమించడం వంటివి సరిచేయాలని కోరారు. ఐచ్చిక సెలవులు, స్థానిక సెలవుల విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారులను కాదని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకోవడం తగదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 28న ఆదిత్యలో రాష్ట్రస్థాయి హ్యాకథాన్ టెక్కలి : టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 28న రాష్ట్ర స్థాయిలో ఐగానిట్ 3.0 రాష్ట్ర స్థాయి హ్యాకథాన్ సాంకేతిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాలేజీ డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల నుంచి సుమారు 150 జట్లు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, డీన్ ప్రసన్నలక్ష్మి, కన్వీనర్ రమేష్నాయుడు, స్వప్నరేఖ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం హిరమండలం: లక్ష్మీనర్సుపేట ఇందిరానగర్ కాలనీలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. మండాది తవిటయ్యకు చెందిన ఇల్లు కాలిపోయింది. నిత్యావసరాలతో పాటు రూ.30 వేల నగదు కాలిపోయింది. తవిటయ్య దంపతులు పొలం పనులకు వెల్లినప్పుడు విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. సర్పంచ్ దివాకర్నాయుడు, వీఆర్వో రమణమ్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాగునీటి నమూనాల సేకరణ గార: శ్రీకాకుళం నగరంలో డయేరియా వ్యాప్తి నేపథ్యంలో నీటి నమూనాల సేకరణను జిల్లా పంచాయతీ అధికారి గోపిబాల గురువారం పరిశీలించారు. మేజర్ పంచాయతీ శ్రీకూర్మంలో వాటర్ ట్యాంకు పరిశుభ్రత, నీటి శాంపిల్స్ సేకరణపై ఆరా తీశారు. ట్యాంకు వద్ద పరిశుభ్రత చేసిన తేదీలను నమోదు చేయాలని, క్లోరినేషన్ పక్కాగా జరగాలన్నారు. ఆయన వెంట ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ చంద్రకళ, పంచాయతీ సెక్రటరీ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన శ్రీకాకుళం: పంచాయతీలను పర్యవేక్షించే డిప్యూటీ ఎంపీడీఓలు సమాచార హక్కు చట్టాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని జెడ్పీ సీఈఓ సత్యనారాయణ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అన్ని మండలాల ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, పరిపాలన అధికారులకు గ్రామ పంచాయతీ అభివృద్ధి పథకం శిక్షణలో భాగంగా సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రజలు స.హ.చట్టం దరఖాస్తులు ఎక్కువగా గ్రామ పంచాయతీలకు పంపిస్తున్నారని, సరైన అవగాహన లేక సమాచారం ఇవ్వడంలో జాప్యం జరిగి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రిసోర్స్ పర్సన్ కొమ్మాజోస్యుల వసంతకుమార్ సమాచార హక్కు చట్టం నిబంధనలు, ఇతర అంశాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి గోపిబాల, జిల్లా పంచాయతీ వనరుల కేంద్ర అధికారి నిశ్చల పాల్గొన్నారు. కాలిపోయిన ఇల్లు -
ఆదర్శ పాఠశాలల్లోకి.. ఆహ్వానం
పాతపట్నం: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియం విద్యను అందించాలని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో సంకల్పించారు. ఆయన మరణానంతరం 2013లో అప్పటి ప్రభుత్వం ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూల్)లను ప్రవేశపెట్టింది. ప్రవేశ పరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తూ అత్యుత్తమ బోధన అందిస్తున్నారు. ఆరో తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు ఇంటర్మీడియెట్ వరకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన సాగిస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్సు ల్యాబ్, డిజిటల్ క్లాస్రూమ్స్, గ్రంథాలయాలు, మరెన్నో సౌకర్యాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.ఇదీ పరిస్థితి..జిల్లాలో 13 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. జి.సిగడాం, పొందూరు, రణస్థలం, ఎచ్చెర్ల, తామాడ, ఓవీపేట, ఈదులవలస, సోంపేట, ఎంఎస్పల్లి, రాజపురం, పురుషోత్తపురం, కరవంజ, పాతపట్నంలోని ఒక్కో పాఠశాలలో 6వ తరగతిలో ఏటా 80 మంది విద్యార్థులకు 6వ తరగతిలో ప్రవేశాలు కల్పించేవారు. గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో అదనంగా 20 సీట్లు పెంచి మొత్తం 100 మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారు.దరఖాస్తు ఇలా..2026 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదివిన వారై ఉండాలి. విద్యార్థులు ఏపీ ఆన్లైన్, ఇంటర్నెట్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాలి. దరఖాస్తుతో పాటు ఆధార్, కులం ఆదాయం సర్టిఫికెట్లు, రేషన్కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, విద్యార్హత సర్టిఫికెట్ను ఆదర్శ పాఠశాలల్లో అందజేయాలి. మార్చి 31లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.రిజర్వేషన్లు ఇలా..15 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 20 శాతం బీసీలకు (7 శాతం బీసీ–ఎ, 10 శాతం బీసీ–బి, ఒక శాతం బీసీ–సీ, 7 శాతం బీసీ–డీ, ఒక శాతం బీసీ–ఈకు సీట్ల కేటాయింపులు ఉంటాయి. దివ్యాంగులకు మూడు శాతం, బాలికలకు 33.33 శాతం సీట్లు కేటాయిస్తారు. నిర్దేశించిన విభాగాల్లో అభ్యర్థులు లేకపోతే ఇతర గ్రూపుల నుంచి సీట్లు భర్తీ చేస్తారు. 50 శాతం సీట్లు ఇతర కులాలకు కేటాయించారు.అధునాతన వసతి గృహాలు..ఏపీ మోడల్ స్కూల్లో చేరిన విద్యార్థినులకు ఆధునాతన వసతి గృహాలను ఏర్పాటు చేశారు. విద్యార్థినులకు మోడరన్ మంచాలు, దుప్పట్లు, బెడ్షీట్లు అందిస్తున్నారు. హాస్టల్లో వంద మంది విద్యార్థినులకు ప్రవేశాలు కల్పిస్తారు. హాస్టల్లో ప్రత్యేక ట్యూటర్లను ఏర్పాటు చేస్తారు. బాలురుకు హాస్టల్ సదుపాయం ఉండదు.ప్రవేశ పరీక్ష ఇలా..ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 12న ఏపీ మోడల్ పాఠశాలలో ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించే దిశగా ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను నెలకొల్పింది. ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశం చక్కని అవకాశంగా విద్యార్థులు, తల్లిదండ్రులు భావిస్తున్నారు. అర్హత ఉన్న వారందరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.– కె.వి.రత్నకుమారి, ప్రిన్సిపాల్, ఏపీ మోడల్ స్కూల్, పాతపట్నం -
ఘనంగా అభయాంజనేయ ఆలయ ప్రతిష్టాపనోత్సవం
ఎచ్చెర్ల : ముద్దాడ గ్రామంలో ముద్దాడ లక్ష్మీశంకర్ కుటుంబం నిర్మించిన అభయాంజనేయస్వామి ఆలయ ప్రతిష్టాపనోత్సవం గురువారం ఘనంగా జరిగింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్లు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ జనరల్ సెక్రటరీ సనపల నారాయణరావు, బీసీ విభాగం జనరల్ సెక్రటరీ జరుగుళ్ల శంకరరావు, పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షుడు నేతింటి నీలమప్పడు, నక్క కృష్ణమూర్తి, శంకర్ పాల్గొన్నారు. -
మేమున్నామని..!
శ్రీకాకుళం కల్చరల్: స్వచ్ఛంద సంస్థలు అంటే సామాజిక సేవా దృక్పథంతో పనిచేసే లాభాపేక్షలేనివి. ఇందులోని సభ్యులు విద్య, ఆరోగ్యం, పేదరికం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత వంటి రంగాలలో సమాజ అభివృద్ధికి సహాయపడతారు. ఇవి చట్టబద్ధంగా రిజిస్టర్ కాబడి, దాతల విరాళాల ద్వారా కార్యకలాపాలు చేపడుతుంటాయి. ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ అండగా నిలుస్తుంటాయి. వీరి సేవలను గుర్తిస్తూ ఏటా ఫిబ్రవరి 27న ప్రపంచ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం జరుపుతుంటారు. ‘అందరి కలయికతో సమాజ గౌరవాన్ని పునరుద్ధరించడం’ అనేది ఈ ఏడాది వీరి లక్ష్యం.ఉద్దేశ్యం: లాభాపేక్ష రహితంగా, సమాజంలోని స మస్యలను పరిష్కరించడం, పేదలకు సహాయం చేయడం. విద్య, వైద్య సేవలను అందించడంసేవా రంగాలు: విద్య, ఆరోగ్యం, అత్యవసర సేవ లు (విపత్తుల సమయం), పర్యావరణం, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల నిర్వహణ.రిజిస్ట్రేషన్: చాలా సంస్థలు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం, ట్రస్ట్ చట్టం, ఎన్జీవోలుగా రిజిస్టర్ అవుతాయి.నిధులు: ప్రభుత్వ గ్రాంట్లు, వ్యక్తిగత దాతలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా వీటికి నిధులు సమకూరుతాయి.లక్ష్యాలు: విద్య, ఆరోగ్య రంగాలలో మార్పు తీసుకురావడం. స్వచ్ఛంద సేవ ద్వారా నాయకత్వ నైపుణ్యాలు, సామాజిక బాధ్యతలను పెంపొందిస్తారు. విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలుస్తారు.జిల్లాలో వందకుపైగా సంస్థలుజిల్లాలో స్వచ్ఛంద సంస్థలుగా నమోదు చేసుకున్నవి వందకుపైగా ఉన్నాయి. నమోదు కాకుండా సేవలు చేసే వారూ ఉన్నారు. ఎన్నో విపత్కర పరిస్థితులలో ముందుకొచ్చి ఎంతోమంది నిస్సహాయకులకు సేవలు అందిస్తున్నారు. వీరిలో రెడ్క్రాస్, లైన్స్ క్లబ్, రోటరీ సంస్థ, జేసీస్, హర్షవల్లి లయన్స్ క్లబ్ తదితర సంస్థలు ముందంజలో ఉన్నాయి.సమాజ సేవలో..మా సంస్థ ఎల్లప్పుడు సమాజ సేవలో ఉంటుంది. ఎక్కడ ఏ అవసరం ఉన్నా అక్కడ ముందుగా ఉంటాం. సేవే పరమావధిగా భావిస్తుంటాం. – నటుకుల మోహన్, మెంటార్, లైన్స్క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్కృత్రిమ అవయవాలు..క్లబ్ ద్వారా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందిస్తున్నాం. హెచ్ఐవీ బాధితులకు ఎనర్జీ ఫుడ్ ప్యాకెట్లు అందించాం. మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – హారికా ప్రసాద్, హర్షవిల్లి లయన్స్ క్లబ్మహిళా సాధికారతమహిళా సాధికారత, యువత అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్నాం. వారిలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. మహిళలకు కుట్టు మిషన్లు వంటివి పంపిణీ చేస్తున్నాం.– తమ్మినేని ఉషారాణి, ప్రెసిడెంట్, జేసీస్పర్యావరణ పరిరక్షణ..పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు నెరవేరుస్తున్నాం. పలు ప్రాంతాల్లో మొక్కలు నాటడం, మట్టి విగ్రహాలు పంపిణీ వంటి పర్యావరణ హితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.– పొన్నాడ రవికుమార్, పర్యావరణ ఇన్చార్జి, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ -
పలాసలో ఆగని గ్రావెల్ దందా
● రాత్రి పూట తవ్వకాలు ● మాయమవుతున్న కొండలు పలాస: పలాస నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ తవ్వకాల దందా ఆగడం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉంటే అప్పుడు ఇష్టారాజ్యంగా కంకర తవ్వకాలు చేపడుతున్నారు. రూ.కోట్లు విలువైన కంకరను రోజూ వందలాది టిప్పర్లు ద్వారా తరలించుకు పోతున్నారు. తాజాగా పలాస మండలం రామకృష్ణాపురం రెవెన్యూ పరిధిలోని లలితా చారిటబుల్ ట్రస్ట్ వృదా్ధ్శ్రమం వెనుక సర్వే నంబరు 157లో ప్రభుత్వ భూమిలో కంకర తవ్వకాలు చేపడుతున్నారు. ఆ పక్కనే జిల్లాలోనే అతి పెద్దదైన జగనన్న కాలనీ కూడా ఉంది. ప్రస్తుతం కంకర తవ్వుతున్న భూమి కూడా గతంలో జగనన్న కాలనీ కోసం సేకరించిన స్థలమని అక్కడి స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చిన స్థలమని కూడా కొందరు అంటున్నారు. మొత్తానికి స్థలం ఎవరిదైనా ఎటువంటి అనుమతులు లేకుండా కంకర తవ్వకాలను యథేచ్ఛగా సాగిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా మందస మండలం కుంటికోట, రట్టి కొండలు, పలాస మండలం కంబిరిగాం వద్ద కూడా కంకర అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. అధికారులకు ఫిర్యాదులు వెళ్లినప్పుడు మాత్రమే అక్కడికి వెళ్లి తూతూమంత్రంగా చర్యలు చేపట్టి తర్వాత విడిచి పెట్టేస్తున్నారని విమర్శలు వినిస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణ పెంటిభద్ర రెవెన్యూలోని 410 సర్వేలో కంకర తవ్వకాలు చేపట్టిని వారిపై తగిన చర్యలు తీసుకోలేదని, కేవలం కంకర తవ్వకాన్ని ఆపేసి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి అక్రమార్కులపై గట్టి చర్యలు తీసుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
● నేటి నుంచే రట్టి వల్లభ నారాయణుడి యాత్ర
మందస: ఉద్దానం ప్రాంతమైన మందస మండలం రట్టి గ్రామంలో వల్లభనారాయణుడి రట్టియాత్ర ఈ నెల 26 నుంచి మార్చి 3 వరకు ఐదురోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. సింహాచలంలో సింహాద్రి అప్నన్న, రట్టిలో వెలసిన వల్లభనారాయణ స్వామి ఒక్కరేనని ఇక్కడి భక్తుల నమ్మకం. జిల్లాతో పాటు ఒడిశా నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు అంకురార్పణ, 27న పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు, 28న ధ్వజారోహణ, విశేణ హోమాలు, మార్చి 1న తిరువీధి మహోత్సవాలు, 2న స్వామివారికి ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 3న డోలో పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానం, మఘ, కామదానం, కోలసేవ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇక్కడి వివేకానంద యువజన సేవా సంఘం, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలు, యువత ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతో ప్రత్యేకత.. ఆలయ ప్రాంగణంలోని గరుడ స్తంభాన్ని నూతన దంపతులు ఆలింగనం చేసుకుంటే ఉత్తమ సంతానం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. దేవుని సన్నిధి లో ఉన్న తులసికోట వద్ద చాలామంది నేస్తరికం కట్టుకుంటారు. ఈ ప్రాంత ప్రజలు వేర్వేరు చోట్ల పుణ్య క్షేత్రాలు దర్శించి చివరిగా మత్స్యవల్లభనారాయణ స్వామిని దర్శించుకుంటే సంపూర్ణ యాత్ర చేసినట్లు అవుతుందని ప్రగాఢ నమ్మకం. -
విశాఖ డెయిరీలో తనిఖీలు
టెక్కలి: టెక్కలి విశాఖ డెయిరీలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న కల్తీ పాల వ్యవహారంపై స్థానికంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీరాములు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ను సేకరించారు. ఎక్కడైనా ఆహారం కల్తీ జరిగినట్లు తెలిస్తే తక్షణమే సమాచారం అందజేయాలని వెల్లడించారు. అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత మందస: బాలిగాం జంక్షన్ జాతీయ రహదారిపై రెండు వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న పశువులను మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ పట్టుకున్నారు. ఒక బండిలో ఆరు పశువులు, మరో బండిలో ఏడు పశువులు మొత్తం 13 పశువులు పట్టుకుని వాహనాలపై కేసులు నమోదుచేసి గోశాలకు తరలించారు. ఇంటర్ పరీక్షలకు 737 మంది గైర్హాజరు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో 71 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్షల్లో బుధవారం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు సెట్–1తో కూడిన ఇంగ్లిష్ పరీక్ష రాశారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 21,101 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 20,364 (96.51శాతం) మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 737 మంది గైర్హాజరయ్యారు. జిల్లా అధికారులతోపాటు డీఈసీ కమిటీ, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు వేరువేరుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. అయితే జిల్లాలో 71 కేంద్రాలకుగాను బుధవారం 42 కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. సెల్ఫ్ సెంటర్లపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. సీసీ కెమెరాల స్ట్రీమింగ్ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఫస్టియర్ ఇంగ్లిష్ పరీక్ష రోజున జిల్లాలో ఎలాంటి మాల్ప్రాక్టీసు కేసులు నమోదుకాలేదని జిల్లా ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ ధ్రువీకరించారు. -
ప్రసాదమా.. అపచారమా!
అరసవల్లి: ఆలయాల్లో తయారు చేసిన పులిహోర, లడ్డూలను దేవునికి ముందుగా నివేదించిన తర్వాతే అవి ప్రసాదాలుగా భావించి భక్తులు కళ్లకద్దుకుని తీసుకుంటారు.. నలుగురికి పంచుతారు కూడా..! ఇదే హిందూ సంప్రదాయంలో భాగం. కానీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈ విధానం కొన్నాళ్లుగా కనిపించడం లేదు. గతంలో ముందుగా స్వామి వారికి నివేదించి ప్రసాదాల పేరిట విక్రయాలు చేపట్టేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. దేవునికి నివేదించకుండానే విక్రయాలా..! ఆలయాల్లో బ్రాహ్మణ వంట పంతులు కచ్చితంగా దేవునికి ప్రసాదాలను తయారు చేయాల్సి ఉంది. ఈయన ఆధ్వర్యంలోనే దిట్టం ప్రకారం నాణ్యమైన రసవర్గాలతో తయారు చేసిన పులిహోర, లడ్డూలను రోజూ గర్భాలయంలో కొలువైన శ్రీసూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్టుకు నివేదించాల్సి ఉంది. అయితే బ్రాహ్మణ వంట పంతులు నియామకం జరగకపోవడంతో ఇప్పటికే ఆలయ పరిస్థితులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంట పంతులు చేతుల మీదుగా స్వామికి నివేదించిన నివేదనా వస్తువులే ప్రసాదంగా మారుతుంది. వీటిని అప్పటికే సిద్ధమైన తయారి పులిహోర లడ్డూ పూసలో కలుపుతారు. దీంతో మొత్తం ఈ పదార్థాలన్నీ ప్రసాదాలుగా ప్యాకెట్లకు సర్దేసి భక్తులకు విక్రయాలు చేయాల్సి ఉంది. ఇదే విధానం గత ప్రభుత్వ పాలన వరకు అరసవల్లిలో కొనసాగింది. కూటమి ప్రభుత్వం రాగానే శాశ్వత అన్నదాన ప్రసాదాల మండపాలన్నీ కూల్చివేయడంతో ప్రసాదాలను నివేదించే సంప్రదాయం కూడా కనుమరుగైంది. రెండున్నరేళ్ల నుంచి బ్రాహ్మణ వంట పంతులు నియామకాలు జరుగకపోవడంతో తయారు వస్తువులను ప్రసాదాలుగా నివేదించే నాథుడే కరువయ్యాడు. నమూనా విగ్రహానికి నివేదిస్తూ...! ఆలయ వర్గాలు భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా ఉండేలా వైజయంతి ఉత్సవ వేదిక వద్ద అలంకారంగా ఉన్న నమూనా ఆదిత్యుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం వద్ద రోజూ ఇక్కడ తయారు చేసిన పులిహోర, లడ్డూలతో పాటు అన్నం, కూరలను కూడా నివేదించి చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవానికి అసలైన మూలవిరాట్టుకు మాత్రమే ప్రసాదాలు, భోగాన్ని నివేదించాల్సి ఉంది. అలా చేయకపోవడంతో ఇదెక్కడి సంప్రదాయమంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఆలయ అధికారులు బ్రాహ్మణ సామాజిక వంట పంతులును నియమించి ఆయన ద్వారా స్వామి వారికి ప్రసాదాలను తయారు చేయించి నేరుగా స్వామివారి గర్భాలయంలోనే నివేదించి ఆ తర్వాతే ప్రసాదాల విక్రయాలకు సిద్ధం చేయాలని భక్తులు కోరుతున్నారు. అరసవల్లిలో దేవునికి నివేదించకుండానే లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయాలు నమూనా విగ్రహానికి నివేదన చేయడంపై విమర్శలు ఇదేం పద్ధతంటూ భక్తుల మండిపాటు గతంలో ఉన్న విధానానికి స్వస్తి పలికిన వైనం శాశ్వత భవనాల కూల్చివేతతో సంప్రదాయాలకు మంగళం నివేదించకపోతే ఎలా? స్వామికి నివేదించకుండా పులిహోర, లడ్డూలను విక్రయించడం దారుణం. అలా చేస్తే అవి ప్రసాదాలే కాదు. మామూలుగా మనం ఇంట్లో చేసుకునే వస్తువులుగానే చూడాల్సి వస్తుంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవస్థలు పని చేయకూడదు. – శ్రీపతి మురళీరావు, శ్రీకాకుళం -
సారా నిర్మూలనకు కృషి
పాతపట్నం: నాటుసారా నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, సారా రహిత గ్రామాలున్న మండలంగా పాతపట్నం ఎంపికై ందని శ్రీకాకుళం ప్రొహిబిషన్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఒడిశా–ఆంధ్ర చెక్పోస్ట్, మెళియాపుట్టి మండలం వసుంధర చెక్పోస్ట్లను బుధవారం పరిశీలించారు. సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా నుంచి ఆంధ్రకు నాటు సారా, మద్యం రవాణాకు ఆస్కారమున్న ప్రాంతాల్లో తనిఖీలు విస్తృతం చేయాలన్నారు. అనంతరం పాతపట్నంలోని మద్యం షాపును తనిఖీ చేశారు. ఆయనతో పాటు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కె.కృష్ణారావు, ఎస్ఐ శ్రీనివాసరావు ఉన్నారు. -
అంగనాడీల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఎ.పి.అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ అన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే పార్కు వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్–హెల్పర్స్ సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఐసీడీఎస్కు బడ్జెట్, అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని కోరుతూ మార్చి 2న విజయవాడలో జరిగే మహా ధర్నాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షలకు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అమరావతి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, ఎన్.వి రమణ, ఆర్.ప్రకాశరావు, ఎం. గోపి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎన్.హైమావతి, బి.జ్యోతి, కె.మాధవి, పి.భూలక్ష్మి, బి.సునీత, బి.రమణమ్మ, బి.హైమావతి, బి.ఆదిలక్ష్మి, కె.రాధిక, వై.విజయలక్ష్మి, కె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
దేవునల్తాడలో విషాదం
వజ్రపుకొత్తూరు రూరల్: దేవునల్తాడ గ్రామానికి చెందిన వలస కూలి బుడగట్ల మోహన్రావు(46) దుబాయ్లో అనారోగ్యంతో మృతి చెంది 17 రోజుల తర్వాత బుధవారం స్వగ్రామానికి మృతదేహం చేరుకోవడంతో గ్రామం శోకసంద్రంగా మారింది. నాలుగు నెలల క్రితం అదే కుటుంబానికి చెందిన మృతుని సోదరుడు బుడగట్ల చినబాబు సముద్రంలో తెప్ప బోల్తా పడి మృతి చెందారు. పొట్ట చేతపట్టుకొని ఎన్నో ఆశలతో వలసకూలీగా దుబాయ్ వెళ్లిన మోహన్రావు నేడు విగతజీవిగా గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మోహన్రావుకు భార్య ధనలక్ష్మీ, కుమారులు రాజేష్, నితిన్ ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు మృతితో రోడ్డున పడిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కుటుంబానికి సాయంగా లేనని..
● మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని వాంబేకాలనీలో బుధవారం ఉదయం ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. యడగళ్ల పవన్కుమార్ (26) వాంబేకాలనీలోని రాజీవ్ గృహకల్పలో 9వ నెంబరు బ్లాక్లో తల్లి తిరుమలతో కలసి నివాసముంటున్నాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి కూలి పనులకు వెళ్తూ, చీకులు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. పవన్ ఆటో నడుపుతుండగా అతని సోదరుడు నగరంలో ఓ వాటర్ప్లాంట్లో పనిచేస్తున్నాడు. ఆటోకి సరిగా బేరాలు రావడంలేదని, చిన్నపాటి ఉద్యోగముంటే బాగుండేదని, కుటుంబానికి సాయం చేయలేకపోతున్నానని ఇటీవల తల్లి వద్ద పవన్ అనేవాడు. ఆ క్రమంలోనే మంగళవారం స్నేహితుల వద్దకు వెళ్తానని చెప్పి వెళ్లిన పవన్ రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. స్నేహితులు, తెలిసినవారందరికీ వాకబు చేసినా ఫలితం లేదు. బుధవారం ఉదయం అదే వాంబేకాలనీ రాజీవ్గృహకల్ప 17వ బ్లాకులో పవన్.. చీరతో ఉరివేసుకుని ఉండటం స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా పవన్ కొన్ని కేసుల్లో నిందితుడిగా, సస్పెక్ట్ షీట్ సైతం ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. -
రేషన్ డీలర్ల కమీషన్ పెంచాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రేషన్ డీలర్లకు ఇస్తున్న కమీషన్ను పెంచాలని రేషన్ డీలర్లు సంఘం జిల్లా అధ్యక్షుడు వడగ భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి షణ్ముఖరావు కోరారు. ఈ మేరకు బుధవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, జిల్లా పౌర సరఫరాల అధికారి జి.సూర్యప్రకాశరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమీషన్ పెంపు జరగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. షాపు అద్దె, డోర్ డెలివరీ అవుతున్న ఖర్చులు, సహాయకుడికి వేతనం, ఇతర ఖర్చులకు సరిపోవడం లేదన్నారు. ఐ.వి.ఆర్.ఎస్.సర్వేలో రేషన్ డీలర్లకు సంబంధం లేని అంశాలు చెప్పడం వల్ల డీలర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సర్వే ప్రకారం డీలర్లపై చర్యలు తీసుకోవద్దని, అవసరమైతే లబ్ధిదారుల వద్ద నుంచి నేరుగా అభిప్రాయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బి.రవికుమార్, రణస్థలం వెంకటరావు, శిమ్మినాయుడు, రామ్మూర్తినాయుడు, మురళీమోహన్, పోలాకి జగన్, మూర్తి, పలాస మోహనరావు, శ్రీను, రామకృష్ణ, పంచిరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. -
అధికారికంగా ఒకరే..
శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రబలిన అతిసారంపై సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల్లో వస్తున్న అవాస్తవాలను నమ్మవద్దని, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అతిసారం కారణంగా అధికారికంగా ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మిగిలిన మరణాలకు గల ఇతర కారణాలను విశ్లేషిస్తున్నామని, పరిస్థితిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తోందని తెలిపారు. కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు 50కి పైగా వైద్య బందాలు నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. వ్యాధి మూలాలను గుర్తించేందుకు సచివాలయ సిబ్బంది, ఆశా/ఏఎన్ఎంలతో కూడిన బృందాలు ఇంటింటికీ వె ళ్లి సర్వే నిర్వహిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. రోగులకు మంత్రి నారాయణ పరామర్శ శ్రీకాకుళం: శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి కారణం గుర్తించేందుకు రాష్ట్రస్థాయి నుంచి నిపుణుల బృందాన్ని తీసుకువచ్చినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఆయన బుధవారం శ్రీకాకుళంలో పర్యటించి బాధితులను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వ్యాధి ప్రబలడా నికి కారణం నీరు కలుషితం కావడమా.. ఆహారంలో ఎక్కడైనా కల్తీ జరిగిందా అన్నది గుర్తించాల్సి ఉందన్నారు. గురువారానికి వివరాలు తెలుస్తాయన్నారు. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. ఇందులో 19 మంది డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన వారిలో ఇద్దరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఒకరికి మాత్రమే ఎక్స్గ్రేషియా ప్రకటించారని మీడియా ప్రశ్నించగా మరొకరికి సంబంధించి పోస్టుమార్టం నివేదిక వచ్చిన వెంటనే మరణానికి కల కారణాన్ని తెలుసుకొని తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శించారు. నగరంలో అతిసార వ్యాప్తికి కారణమైన పాత తాగునీటి పైపులైన్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థలను యుద్ధప్రాతిపదికన ప్రక్షాళన చేస్తా మని మంత్రి పి.నారాయణ తెలిపారు. సమీక్ష సమా వేశంలో మాట్లాడుతూ నగరంలో డ్రైనేజీ ల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం తక్షణమే రూ. 12 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ. 2 కోట్లను అతిసార ప్రభావిత ప్రాంతాల్లోని కచ్చా డ్రైన్ల పనుల కోసం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. నగరవ్యాప్తంగా ఇంటింటికీ సురక్షిత మంచినీటిని అందించేందుకు రూ. 60 కోట్లతో చేపట్టే పనులను మార్చి నెలలో మొదలు పెడతామని స్పష్టం చేశారు. నిలిచిపోయిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల కోసం రూ. 23 కోట్లు, అమృత్–1 పథకం కింద డ్రైనేజీల నెట్వర్క్ కోసం రూ. 35 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
వ్యాధి వ్యాప్తి ఎలా ఉంది..?
అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం నాటికి 68 కేసులు నమోదైతే బుధవారానికి ఆ కేసులు 102కి చేరుకున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం 162 మంది అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. 10 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ప్రస్తుతం డయేరియా రోగులు ఉన్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. వైద్యం ఇలా..? జిల్లాలో విభృంజిస్తున్న డయేరియా బాధితులకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఉచిత వైద్యం అందించేలా చర్యలు చేపడుతున్నట్లుగా ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అవని (9281068139) తెలియజేశారు. డయేరియా లక్షణాలు కనిపించిన రోగులంతా ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రుల్లో చేరాలని, ఉచిత వైద్యం పొందాలని ఆయన ప్రకటించారు. అలాగే ఈ మేరకు సహాయం కోసం మూడు బృందాలు పనిచేస్తున్నాయని, 9281068255, 9281068256, 9281068257 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. కిమ్స్లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులు -
● నిర్లక్ష్యమే కారణం..
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను వైఎస్సార్ సీపీ నాయకులు బుధవారం ఆయన చాంబర్లో కలిసి విన్నవించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కలెక్టర్తో మాట్లాడుతూ బలగలో డయేరియా వచ్చినప్పుడు ఒకరు చనిపోయారని, అప్పుడే స్పందించి ఉంటే ఇప్పుడు నాలుగు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నారు. వందలాది మంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందన్నారు. దీనికి బాధ్యులైన నగరపాలక సంస్థ హెల్త్ అధికారి, వాటర్ సప్లై అధికారులను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. డయేరియా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. గార తదితర ప్రాంతాల్లో, వంశధార నదీ తీర గ్రామా ల్లో, తీర ప్రాంతాల్లో ఇసుకను మంత్రి లోకేష్ మనషులమంటూ దోచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇన్ఫిల్టరేషన్ బావులు పాడైపోయాయని, బురద నీరు వస్తోందన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో మాజీ మంత్రులతో పాటు పార్టీ నాయకులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ఎంవీ స్వరూప్, చింతాడ వరుణ్, గేదెల పురుషోత్తం, సాధు వైకుంఠరావు, కోణార్క్ శ్రీను, రౌతు శంకరరావు, తదితరులు ఉన్నారు. -
ఆటలు ఆడుకుంటారా
జిల్లా కేంద్రంలో డయేరియా వ్యాపించి నగరమంతా అట్టుడికిపోతుంటే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, గొండు శంకర్లు విజయవాడలో కబడ్డీ ఆడుకోవడం సిగ్గుచేటు. కలుషిత నీరు తాగి మనుషులు చనిపోతే వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం సరికాదు. డయేరియాని కంట్రోల్ చెయ్యడం చేతకాక సహజ మరణాలు అని చెప్పడం విడ్డూరం. కనీసం మున్సిపాలిటీ డాక్టర్లు రాలేదని స్థానికులు బండబూతులు తిడుతున్నారంటే ప్రజారోగ్యం పట్ల కూటమి పాలకులకు ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోంది. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి -
బాధ్యులు ఒకరు.. చర్యలు మరొకరిపై!
● శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్పై సస్పెన్షన్ వేటు ● డయేరియా ఘటనకు బాధ్యుడిని చేస్తూ చర్యలు ● రెండు వారాల కిందటే వచ్చిన అధికారి ● డయేరియాకు బాధ్యులైన అధికారులపై ఉదాసీనత సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలడంతో నగరపాలక కమిషనర్ హనుమంతు కూర్మారావును బాధ్యుడిని చేస్తూ సస్పెన్షన్ వేటు వేశారు. కానీ ఆయన రెండు వారాల కిందటే బాధ్యతలు తీసుకోవడం గమనార్హం. పరిస్థితులు అర్థం చేసుకునేలోగానే ఆయనను బలి చేశారు. తమకు కావాల్సిన వారిని కాపాడుకోవడానికి మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేశారనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది. మంగళవారం రాత్రంతా విధుల్లో ఉన్న కమిషనర్ కూర్మారావు బుధవారం ఉదయం 5.53గంటలకు కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చేసరికి సస్పెన్షన్ ఉత్తర్వులు టేబుల్ మీద ఉన్నాయి. ఆయన స్థానంలో విశాఖపట్నం ఆర్డీ వి.రవీంద్రను ఇన్చార్జిగా నియమించడంతో కూర్మారావు హుటీహుటీన విధుల నుంచి తప్పుకున్నారు. రెండు వారాలు కాకముందే హనుమంతు కూర్మారావు ఫిబ్రవరి 11వ తేదీన కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. విధుల్లోకి వచ్చి రెండు వారాలు కూడా పూర్తి కాలేదు. వచ్చిన దగ్గరి నుంచి కార్పొరేషన్పై అవగాహన పెంచుకుంటున్నారు. వార్డు పర్యట నలు చేస్తున్నారు. ఇంతలో డయేరియా ప్రబలింది. కారణాలు అన్వే షించి, అదుపులోకి తెచ్చేందుకు తనవంతు ప్రయ త్నం చేస్తున్నారు. కానీ ఆయనపై వేటు వేశారు. బాధ్యులు వారు కాదా? డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం తాగునీరు కలుషితమే. ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన వ్యవహారం. దీన్ని పర్యవేక్షించాల్సింది మున్సిప ల్ హెల్త్ ఆఫీసర్. ఆయన పనితీరుపై ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారన్న వాద నలు ఉన్నాయి. తాగునీరు కలుషితమే ప్రధాన కారణమైతే దానికి బాధ్యులైన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలి. ఒకవేళ తాగునీరు కలుషితం కావడానికి పైపులైన్లు కారణమైతే, దానికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇక్కడదేమి చేయకుండా రెండు వారా ల క్రితం వచ్చిన కమిషనర్ కూర్మారావుపై చర్యలు తీసుకుంది. ఇప్పుడిదే నగరంలో చర్చనీయాంశంగా మారింది. అసలైన బాధ్యుల వెనక ఎవరున్నారు..? కమిషనర్ను బలి చేసి, మిగతా అధికారులను కాపాడుతున్నదెవరు? అన్నదానిపై ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది. డయేరియా ప్రబలడానికి కారణమైన శాఖలకు చెందిన అధికారులపై కనీసం చర్యలు తీసుకోకపోవడం వెనక మంత్రుల హస్తం ఉందన్న వాదనలు ఉన్నాయి. సదరు అధికారులకు పెద్దల అండదండలు ఉండటంతో ఇష్టారీతిన వ్యవహరించడమే కాకుండా తనది కాని వాటిలో తల దూర్చి పెత్తనం చెలాయిస్తారన్న ఆరోపణలూ ఉన్నాయి. తాజా చర్యలు ఆ ఆరోపణలకు బలం చేకూర్చాయి. -
ప్రభుత్వానికి మానవత్వం ఉందా..?
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా కేంద్రంలో డయేరియా బాధితులను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి, పార్టీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీదిరి అప్పలరాజు తదితరులు బుధవారం పరామర్శించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలైన దమ్మలవీధి, కండ్రవీధి, గుడివీధి ప్రాంతాల్ని పరిశీలించారు. మృతుల కు టుంబ సభ్యులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. నలుగురుచనిపోతే ఒక్కరే చనిపోయారని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు ప్రజారోగ్యంపై నిర్ల క్ష్యం నశించాలి, మంచినీరు ఇవ్వలేని కూటమి ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దింపాలని నినదించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సూరాడ కన్నబాబు, అల్లుబిల్లి విజయ, హజీభయ్యాలతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ మహిళావిభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, వైఎస్సార్సీపీ తూర్పుకాపు, కళింగవైశ్యకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ఎస్ఈసీ మెంబర్లు చల్ల శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్, డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షులు చింతాడ వరుణ్, గ్రీవెన్స్సెల్ అధ్యక్షులు రౌతు శంకరరావు, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్రకార్యదర్శి పొన్నాడ రుషి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, మైనార్టీసెల్ విభాగం జిల్లా అధ్యక్షులు ఎం.ఏ భేగ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్తా విజయ్కుమార్, యువ జన విభాగం జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ, నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, కోణార్క్ శ్రీనివాసరావు, గద్దిబోయిన శ్రీనివాసయాదవ్, డాక్టర్ శ్రీనివాసపట్నాయక్, మూకళ్ల తాతబాబు, ఎండ రమేష్, తారక్, కింజరాపు రమేష్, భైరి మురళి, అంధవరపు రామారావు, గుడ్ల దామోదరరావు, అలపాన త్రినాధరెడ్డి, వైశ్యరాజు మోహన్లతో పాటు అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. రూ.60 కోట్లు సరదాలకు ఖర్చు చేస్తారా..? 21వ తేదీన డయేరియా మొదలైతే మంగళవారం వరకు నియంత్రణ చర్యలు లేవు. డయేరియా వల్లే తమ కుటుంబ సభ్యులు చనిపోయారని చెబుతుంటే అనారోగ్యం వల్ల చనిపోయారని కూటమి నేతలు చెప్పడం హాస్యాస్పదం. అసలు నీరు కలుషితం కావడానికి కారణమైన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, నీటిసరఫరా విభాగం ఏఈలను సస్పెండ్ చేయాలి. చంద్రబాబుకు దోపిడీ తప్ప మరే ఆలోచన ఉండదు. బలగలో డయేరియా వచ్చినప్పుడు జాగ్రత్త పడి ఉంటే ఇప్పుడు ఈ అవస్థ ఉండేది కాదు. నా హయంలో రూ.40 కోట్లతో నగరమంతా మంచినీరు అందిస్తే దాన్ని కాపాడుకోలేకపోయారు. కోవిడ్ వంటి పరిస్థితుల్లోనూ వైఎస్సార్సీపీ సమర్థంగా పని చేసింది. ఇప్పుడు వందమందికిపైగా డయేరియా బాధితులు ఉన్నారు. వారికి మంచి వైద్యం అందించాలి. మేము అధికారం నుంచి దిగిపోయే నాటికి మున్సిపాలిటీకి రూ.60 కోట్లు ఇస్తే దాన్ని పూర్తిగా సరదాలకు ఖర్చుచేసి పూర్తిగా మున్సిపాలిటీలో డబ్బులు లేకుండా చేసేయడం సిగ్గుచేటు. తాను చెప్పిన వారికే కాంట్రాక్టులు ఇవ్వాలని ఎమ్మెల్యే చెప్పడం సిగ్గుచేటు. మీ పత్రికల్లో రాసే అబద్ధాలు నమ్మే స్థితిలో జనం లేరు. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టారుప్రజారోగ్యం, వైద్య, విద్యను ప్రభుత్వం పక్కన పెట్టేసింది. డయేరియాతో మృతి చెందారని స్వయంగా కుటుంబ సభ్యులే చెబుతుంటే దాన్ని కూటమి నేతలు వక్రీకరిస్తున్నారు. ప్రజలకిచ్చిన హామీలను పక్కనపెట్టేసి కేవలం వేలాది కోట్లు రాజధాని నిర్మాణానికి వెచ్చించడం సరికాదు. నీళ్లు తోడడానికి కోట్లాది రూపాయలు ఖర్చుచేయడం సరికాదు. ప్రశ్నించే వారిపై అక్రమకేసులు బనాయించి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి దారుణమైన పరిస్థితి శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఎన్న డూ లేదు. అధికారులు, కూటమి నేతల నిర్లక్ష్యం వల్లే నలుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. – ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మృతుందరినీ డయేరియా మృతులుగా పరిగణించాలి శ్రీకాకుళం చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరగలేదు ప్రభుత్వ తీరుపై మండిపడిన వైఎస్సార్సీపీ నాయకులు డయేరియా బాధితులకు పరామర్శ -
‘ప్రజల ప్రాణాలతో చెలగాటమా..?’
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి దారుణమని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. రోడ్డు మరమ్మతుల పనులు సక్రమంగా నిర్వహించకపోవడం, తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం, ప్రభుత్వ పరిపాలన లోపాలను బయటపెడుతోందన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వెంటిలేటర్పై ఉన్న రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందాలు పర్యవేక్షణ చేయాలని, అవసరమైతే ఉన్నత స్థాయి నిపుణులను నియమించాలని డిమాండ్ చేశారు. -
ఆటోడ్రైవర్ నిజాయితీ
కంచిలి: మండల కేంద్రం కంచిలికి చెందిన ఆటో డ్రైవర్ గుడియా దుదిష్టి సాహు తన నిజాయితీ చాటుకున్నాడు. ఆటోలో ప్రయాణించిన శకుంతల మజ్జి పొరపాటున మర్చిపోయిన బ్యాగును ఆమె అడ్రస్ కనుక్కొని అందించి ఆదర్శంగా నిలిచాడు. పోగొట్టుకున్న బ్యాగులోరెండు తులాల బంగారం, రూ.5వేలు నగదు ఉన్నాయి. మంగళవారం సోంపేట రైల్వేస్టేషన్లో ఆటో ఎక్కిన ఆమె తన స్వగ్రామం మజ్జిపుట్టుగకు వెళ్లింది. ప్రయాణ హడావిడిలో లగేజీని తనతో తీసుకెళ్లి, నగదు, బంగారం ఉన్న బ్యాగును మరిచిపోయి ఇంటికి వెళ్లిపోయింది. గమనించిన ఆటో డ్రైవర్ సాహు బ్యాగును విడిచిపెట్టిన మహిళ అడ్రస్ను కనుక్కొని ఆమె ఇంటికి వెళ్లి ఇచ్చాడు. రూ.4లక్షలు విలువైన బంగాంర, నగదును తిరిగి తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ను ఆమెతోపాటు గ్రామస్తులు, కంచమ్మతల్లి ఆటో యూనియన్ ప్రతినిధులు అభినందించారు. మాజీ మంత్రులకు పరామర్శ రణస్థలం: మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలోని పలువురు జిల్లా నాయకులు విజయవాడ, గుంటూరులలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల అంబటి రాంబాబు ఇంటిపై రౌడీ మూకలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, టెక్కలి, ఆమదాలవలస ఇన్చార్జిలు పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, రణస్థలం మండల పార్టీ అధ్యక్షుడు గొర్లె శ్రీనివాసరావు, నాయకులు లుకలాపు అనిల్, మంత్రి శ్రీనివాస్ ఉన్నారు. -
సజావుగా సీనియర్ ఇంటర్ పరీక్షలు
● తొలిరోజు 19158 మందికిగాను 318 మంది గైర్హాజరు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో సీనియర్ ఇంటర్ పరీక్షలు మంగళవారం మొదలయ్యాయి. సెట్–2 ప్రశ్నాపత్రంతో తెలుగు, సంస్కృతం, హిందీ, ఒరియా పేపర్లకు పరీక్ష రాశారు. జిల్లా వ్యాప్తంగా 71 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలకు రెండోరోజు జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 19,158 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18840 (98.34) మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 318 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 18057 మందికి 291 మంది, ఒకేషనల్లో 1101 మందికి 27 మంది డుమ్మా కొట్టారు. జిల్లా డీవీఈఓ/ ఆర్ఐఓ రేగ సురేష్కుమార్, డీఈసీ–1 బొమ్మలాట శ్యామ్సుందర్ల బృందం శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, మునసబ్పేటలోని గాయిత్రి జూనియర్ కాలేజ్, ఆ సమీపంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. డీఈసీ–2 సిరిపురం భీమేశ్వరరావు.. టెక్కలి, నందిగాం ప్రాంతాల్లోని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండోరోజు పరీక్షల్లో ఎలాంటి మాల్ప్రాక్టీసు కేసులు నమోదుకాలేని ఆర్ఐఓ సురేష్కుమార్ ధ్రువీకరించారు. -
● మృతుల సంఖ్య ప్రకటనపై అస్పష్టత
శ్రీకాకుళం: నగరంలో డయేరియా బారిన పడి మత్యువాత పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.పది లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించినా అది బాధితులందరికీ అందే అవకాశం లేకుండాపోతోంది. వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో ఆదివారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు వాంతులు విరేచనాలతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. అందులో ఎం.సంతోష్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం చనిపోయారు. అప్పటికి వ్యాధి తీవ్రత గురించి ఇంత హడావుడి లేదు. సోమవారం మధ్యాహ్నం సరికి వ్యాధి ప్రబలినట్లు జిల్లా అధికారుల దృష్టికి వెళ్లడంతో అప్పుడు మాత్రమే బయట ప్రపంచానికి తెలిసింది. సోమవారం ఉదయం మడ్డు లక్ష్మణ అనే వ్య క్తి కూడా వాంతులు విరేచనాలతోనే చనిపోయారు. అప్పటికి కూడా వ్యాధి ప్రబలిన విషయాన్ని గుట్టుగానే ఉంచారు. వ్యాధి తీవ్రత గురించి బయటకు చెప్పాక మండల సురేష్, సదాశివుని నర్సింగరావు మంగళవారం మధ్యాహ్నం మృతిచెందారు. వీరిలో సురేష్ సోమవారం సాయంత్రం నుంచి రిమ్స్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం 11 గంటల సమయంలో మృతిచెందారు. నర్సింగరావు ఓ ప్రైవేటు క్లినిక్ లో చికిత్స పొంది ఇంటి వద్దనే దాన్ని కొనసాగిస్తూ ఉండగా మంగళవారం 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పరిస్థి తి విషమించింది. దీంతో నర్సింగరావును కుటుంబ సభ్యులు జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన అంబులెన్స్ ద్వారానే రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయి తే వీరిలో సురేష్ మాత్రమే డయేరియాతో మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మిగిలిన వారే కారణాలతో చనిపోయారని చెబుతున్నారు. నర్సింగరావు మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే దాన్ని మధ్యలో ఆపిమరీ పోలీసులు, కార్పొరేషన్ అధికారులు మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. అయినా ఆయన పేరు ప్రకటించలేదు. అధికారులు పునరాలోచించి బాధితులకు అందాల్సిన ఎక్స్గ్రేషియా ఇప్పించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఎక్కడ చికిత్స అందజేస్తున్నారు..?
వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు జెమ్స్, కిమ్స్, మెడికవర్, సిందూర, అప్సర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రత దృష్ట్యా ఆరు యూపీహెచ్సీలు, జెమ్స్, కిమ్స్, మెడికవర్ ఆస్పత్రులతో పాటు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. బాధితుల సంఖ్య..? బాధితుల సంఖ్యను అధికారికంగా బయటపెట్టడం లేదు. దాదాపు 68 మందికిపైగా డయేరియా బారిన పడినట్లు సమాచారం. వీరిలో దమ్మల వీధికి చెందిన మడ్డు లక్ష్మణ(61) వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆదివారం చనిపోగా, మానసిక పరిణితి లేని మోణింగి సంతోష్(41) కూడా అదే వాంతులు, విరే చనాలతోనే సోమవారం ఉదయం మరణించారు. మంగళవారం ఒక్కరోజే దమ్మల వీధికి చెందిన ఆటో డ్రైవర్ మండల సురేష్(41) రిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోగా, సదాశివుని నర్సింగరావు(62) అనే వ్యక్తి ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మార్గం మధ్యలో చనిపోయారు. వీరిలో ఆటో డ్రైవర్ సురేష్ ఆదాయమే ఆ కుటుంబానిక ఆధారం. ఆయన చనిపోవడం కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. -
జామి ఎల్లమ్మ తల్లి
కోర్కెలు తీర్చే కల్పవల్లి..● పలాసలో జామి జాతర రేపు ● నేటి రాత్రి కుంకుమ పూజలతో ప్రారంభం ● లక్షలాదిగా తరలిరానున్న భక్తులు పలాస: కోర్కెలు తీర్చె కల్పవల్లిగా, రోగాలు నయం చేసే ధన్వంతరి మాతగా, సంతతి ప్రసాదించే సంతాన లక్ష్మిగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న జామి ఎల్లమ్మ తల్లి జాతర పలాసలో గురువారం జరగనుంది. బుధవారం రాత్రి కుంకుమ పూజలు అనంతరం గురువారం ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. రాత్రి 11 గంటల వరకు జరిగే ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచి ఒడిశా నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. తర్లాకోట జమిందారుల కాలం నుంచి జామి ఎల్లమ్మ జాతర సంప్రదాయబద్ధంగా కొనసాగుతోంది.దీనిలో భాగంగా మంగళవారం పలాస కొల్లకోట వంశీయుల ఆధ్వర్యంలో అగ్ని గుండం నిర్వహించారు. ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉదయం పందిరి రాట వేసి యాత్ర ప్రారంభ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. దేవాలయంలో పూజలు అనంతరం అమ్మవారి జంగిడి ,మేళతాళాలతో పట్టణ పొలిమేర వరకు ఆటపాటలతో వెళ్లి అక్కడినుంచి వాహనంలో తర్లాకోట జమిందారుల ఇంటికి వెళ్లారు. అక్కడ అగ్నిగుండం తొక్కి మొదటి పడి కింద జమిందారుల ఇంటి నుంచి బియ్యం సేకరించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి 9గంటల వరకు అమ్మవారికి పూజలు చేస్తారు. రాత్రి 9గంటల తర్వాత కొల్లకోట వంశీయులు ఆలయంలోనే భోజనాలు పూర్తి చేసి రాత్రి 11 గంటల నుంచి అమ్మవారి ఎదుట పసుపు కొమ్ములతో సిందూరం పండిస్తారు. అనంతరం ఎల్లమ్మ, ఎర్నెమ్మ, పోతురాజు విగ్రహాలతో ఆలయం నుంచి తెల్లవారి వరకు ఊరేగింపు చేపడుతారు. భారీ పోలీసు బందోబస్తు.. జాతర సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో కర్రలతో బారికేడ్లు నిర్మించేవారు. ఈసారి పలాస ప్రభుత్వ ఆసుపత్రి సెంటర్ నుంచి ఆలయం వరకు ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ పర్యవేక్షణలో కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తన సిబ్బందితో ఏర్పాట్లు చేయించారు. ట్రాఫిక్ మళ్లింపు.. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పలాస మొగిలిపాడు నుంచి పలాస లోపలకు వాహనాలు రాకుండా నిషేధం విధించామని డీఎస్పీ తెలిపారు. మొగిలిపాడు నుంచి హైవే మీదుగా కోసంగిపురం కూడలి నుంచి కాశీబుగ్గలోకి పంపిస్తామన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. -
పీఏసీఎస్ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డీసీసీబీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. వీరికి రాజేశ్వరరరావు సంఘీభావం తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తాత్సారం చేయడం తగదన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎర్నేని పాపినాయుడు, మెండ సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి సన్యాసిరావు, కనుగుల రమణ, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. -
బాధిత ప్రాంతాలు..?
నగరంలోని దమ్మల వీధి, కుమ్మరి వీధి, మేదరవీధి, కాకి వీధి, గుడి వీధి, మంగువారి తోట, గోల్కొండ రేవు, మొండేటి వీధి, వాంబే కాలనీ, అరసవల్లి, హౌసింగ్ బోర్డు కాలనీ, ఎల్బీఎస్ కాలనీల నుంచి డయేరియా కేసులు నమోదయ్యాయి. ఎక్కడ కలుషితం జరిగి ఉండవచ్చు..? నగరంలోని మేదరవీధి మెయిన్ రోడ్డు, కాలువలను పునర్నిర్మిస్తుండటంతో భూమి లోపల ఉండే వాటర్ పైప్లైన్లోకి కాలువ నీరు వెళ్లిపోవడం, మురుగునీటి కాలువల్లో తుప్పు పట్టిన పైపులైన్లు ఉండటం, వాటికున్న లీకుల ద్వారా మురుగునీరు పైపులైన్లలోకి వెళ్లడం వల్ల తాగునీరు కలుషితమైంది. ముఖ్యంగా కార్పొరేషన్ కార్యాలయం సర్వీసు ట్యాంక్ నుంచి ఏయే ప్రాంతాలకై తే కుళాయిల ద్వారా నీరు సరఫరా అవుతుందో ఆ ప్రాంతాల ప్రజలు ఎక్కు వగా డయేరియా బారిన పడ్డారు. -
జయక్క జీవితం స్ఫూర్తిదాయకం
పలాస: శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని, నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన వీరనారి పోతనపల్లి జయమ్మ జీవితం విప్లవకారులకు స్ఫూర్తిదాయకమని సి.పి.ఐ.ఎం.ఎల్.న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోలా ఈశ్వరరావు అన్నారు.పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం వద్ద మంగళవారం పోతనపల్లి జయమ్మ 6వ వర్ధంతి సభ నిర్వహించారు. న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పి.ఓ.డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి మాట్లాడుతూ మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని, కులవ్యవస్థ పెరిగిపోయిందని, అన్ని రకాలు దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం అరుణపతాకాన్ని జయమ్మ కుమారుడు మల్లేశ్వరరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దిల మల్లేశ్వరరావు, తామాడ సన్యాసిరావు, పత్తిరి దానేసు, జోగి కోదండరావు, కొర్రాయి నీలకంఠం, సాలిన వీరాస్వామి, పుచ్చ దుర్యోధన, సామాజిక కార్యకర్త పోతనపల్లి అరుణ, కొమర వాసు, గొరకల బాలకృష్ణ, కృష్ణవేణి, పోతనపల్లి కుసుమ, ఈశ్వరమ్మ, సొర్ర రామారావు, కుత్తుం వినోద్, నాగమణి, సార జగన్ తదితరులు పాల్గొన్నారు. -
అన్న ప్రసాదాల అవస్థలు బంద్
● ‘సాక్షి’ కథనంపై స్పందించిన అధికారులు ● అరసవల్లిలో స్టీల్ బెంచీల ఏర్పాటుపై భక్తుల సంతృప్తి అరసవల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి చెందిన శాశ్వత నిత్యాన్నదాన భవనం కూల్చేసిన తర్వాత సుమారు రెండేళ్లుగా నేలపైనే భక్తులు అన్నప్రసాదాలను భుజించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అవస్థలను కళ్లకు కట్టినట్లుగా ‘సాక్షి’లో ఈ నెల 16న ‘అపరిశుభ్రం..అవస్థల మయం..’ శీర్షికన ప్రచురించిన కథనానికి ఆలయ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. పరిశుభ్ర వాతావరణంలో అన్న ప్రసాదాలను అందించే దిశగా అడుగులు వేశారు. స్టీల్ బెంచీలు తయారు చేయించి నేలపై ప్రసాదాల భుజించే అవస్థలకు చెక్ పెట్టారు. దీంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలి నలుగురి మృతి
నీరు తాగిన పాపానికి నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎవరి నిర్లక్ష్యానికి ఫలితమిది..? శుద్ధజలమని తాగితే అదే గరళమై ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ నీటిని కన్నీటిగా మార్చిన పాపం ఎవరిది..? నాయకుల నుంచి అధికారులు నిత్యం తిరిగే జిల్లా కేంద్రమిది.. అయినా ఇంత విపత్తు రావడానికి బాధ్యత ఎవరిది..? సగం నగరం డయేరియాతో వణికితే గానీ పైప్లైన్ పరిస్థితి తెలియలేదు.. ప్ర‘జల’ ప్రాణాలతో చెలగాటమాడిన అలసత్వం ఎవరిది..? -
ప్రభుత్వ వైఫల్యమే డయేరియాకు కారణం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలి పదుల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల పాలవ్వడం కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రహదారి మరమ్మతు పనుల వల్ల తాగునీరు కలుషితం అవుతుందని తెలిసినా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి గా విఫలమైందని ధ్వజమెత్తారు. అధికారులు, పాలకులు క్షేత్రస్థాయి పరిస్థితులను గాలికొదిలేయడం వల్లే నేడు 65మందికిపైగా అమా యక ప్రజలు మంచాన పడ్డారని ఆయన ఆరో పించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై తమకు నమ్మకం లేదని మండిపడ్డారు. తక్షణ మే బాధితులందరికీ మెరుగైన ఉచిత వైద్యం అందించడంతో పాటు, కలుషిత నీరు సరఫరా కావడానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదుపులోనే అతిసారం : కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలోని దమ్మలవీధి, గుడివీధి, మంగువారితోట, కాకి వీధి ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం ప్రస్తుతం అదుపులోనే ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 23న కేసులు వెలుగుచూసిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైందని, వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్, రెవెన్యూ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో ముమ్మర చర్య లు చేపట్టామని పేర్కొన్నారు. ఇప్పటివరకు మొత్తం 52 కేసులు నమోదు కాగా, బాధితులను రిమ్స్, కిమ్స్, జెమ్స్ వంటి ఆస్పత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని వివరించారు. దురదృష్టవశాత్తు ఒకరు మృతి చెందారని, ఐదుగురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని అన్నారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. అతిసార నియంత్రణ చర్యలు పర్యవేక్షించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఏపీఎంఐపీ, మెప్మా పీడీలు, ఉద్యానవన శాఖ ఏడీ, పశు సంవర్ధక శాఖ జేడీలతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. దమ్మలవీధిలో నాలు గు అంబులెన్స్లను నిరంతరం అందుబాటులో ఉంచామని, పరిస్థితి చక్కబడే వరకు వైద్య బృందాలు అక్కడే ఉండి సేవలు అందిస్తాయని స్పష్టం చేశారు. వ్యాధి నివారణకు ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, తప్పనిసరిగా నీటిని కాచి చల్లార్చి తాగాలని కలెక్టర్ సూచించారు. మంగువారితోట, దమ్మలవీధి, గుడివీధి, కాకివీధి ప్రాంతాల్లో వైద్య, శానిటేషన్, ఇంజినీరింగ్, ప్లానింగ్ విభాగాలతో కూడిన సమన్వయ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, అటు మున్సిపల్ నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాగ్ కార్యాలయంలో గ్రూప్–1 అధికారిగా గెడ్డవూరు వాసిమందస: భారత రాష్ట్రపతి ఆమోదంతో విడుదలైన అధికారిక ఉత్తర్వుల మేరకు మందస మండలం దున్నవూరు పంచాయతీ గెడ్డవూరు గ్రామం చెందిన వంక సురేష్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) కార్యాలయంలో ఉన్నత గణాంకాధికారి(గ్రూప్–ఎ)గా పదోన్నతి పొందినట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు ఒక్క టే అందరి జీవితాలను మార్చగలదని అన్నా రు. సురేష్ను కుటుంబ సభ్యులు,గ్రామపెద్దలు, ప్రజలు,స్నేహితులు అభినందించారు. 760 అక్రమ మద్యం సీసాలు డిస్పోజల్ ఆమదాలవలస: శ్రీకాకుళం ఎకై ్సజ్ డీఎస్పీ పి.రామచంద్రకుమార్ సమక్షంలో ఆమదాలవలస సివిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 నుంచి 2026 ఫిబ్రవరి 23 వరకు వివిధ కేసుల్లో పట్టుపడిన 760 అక్రమ మద్యం సీసాలను మంగళవారం ఆమదాలవలస పోలీస్ స్టేషన్లో డిస్పోజల్ చేసినట్లు డీఎస్పీ రామచంద్రకుమార్ తెలిపారు. పలాస: పలాస ఆర్డీఓగా ఆర్.అప్పలరాజును పదోన్నతిపై నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. గతంలో ఇతను కోటబొమ్మాళి తహసీల్ద్రా్గా పనిచేశారు. పలాసలో ఇప్పటివరకు పనిచేసిన ఆర్డీఓ జి.వెంకటేష్ను ప్రభుత్వం బదిలీ చేసింది. -
శాసనసభలో సంతాప తీర్మానం
శ్రీకాకుళం: శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మృతికి శాసనసభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గుండ కుటుంబానికి తీవ్ర అవమానం పేరిట మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని కొందరు సీనియర్ నాయకులు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. పార్టీ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం వెళ్లడంతో మాజీ ప్రజాప్రతినిధుల మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఏడుగురు మాజీ శాసనసభ్యులు మృతికి సంతాప తీర్మానాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రవేశపెట్టారు. సీనియర్ నాయకుడు మృతి చెందడం పట్ల జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు స్పందించకపోయినా ఏదోలా రాష్ట్ర పార్టీ నాయకుల దృష్టికి వెళ్లి ఆ కుటుంబాన్ని గౌరవ పరిచేలా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టడం పట్ల తెలుగుదేశం వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. టెక్నీషియన్ శిక్షణకు ఎంపికలు శ్రీకాకుళం పాతబస్టాండ్: సీడాప్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విసిని స్కిల్ అకాడమీ, డీడీయూ– జీకేవై, యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ నేతృత్వంలో సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నీషియన్, మల్టీ స్కిల్ టెక్నీషియన్, కన్జూమర్ డ్యూరబుల్స్లో శిక్షణ పొందేందుకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పథక సంచాలకుడు పి.కిరణ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25న మందస మండలం కుంటికోటలో యువత శిక్షణ కేంద్రంలో ఉదయం 9.30 గంటలకు ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి కనీస విద్యార్హత కలిగిన 18–35 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవవచ్చన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫాం, శిక్షణ మెటీరియల్, సర్టిఫికెట్ అందిస్తామని, వివరాలకు 9390339833 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
● అందుబాటులో ‘కంట్రోల్ రూమ్’
శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని పలు వీధుల్లో అతిసారం ప్రబలిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. బాధితులకు తక్షణ వైద్య సాయం అందించడం, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించడం కోసం కలెక్టరేట్లో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజ లు 08942–229080 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, ఎవరికై నా సహాయ, సహకారాలు కావాలన్నా ఈ నంబరు ద్వారా సంప్రదించవచ్చని ఆయన కోరారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలైన కాకి వీధి, దమ్మలవీధి, గుడివీధి, మంగువారితోట వాసులు మున్సిపల్ కుళాయిల ద్వారా వచ్చే నీటిని ప్రస్తుతానికి తాగవద్దని, పాత నీటిని పారబోయాలని తెలిపారు. -
ఫిషింగ్ హార్బరు.. గుర్తుందా సారూ!
ఎచ్చెర్ల: స్థలం కేటాయింపు పూర్తయ్యింది. టెండర్లు కూడా ఎప్పుడో పిలిచేశారు. రాతి కట్టడాలు, అంతర్గత రోడ్లు సైతం ప్రారంభించారు. కానీ ఆ తర్వాతి పనులు కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వానికి మనసు రావడం లేదు. బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్పై సర్కారు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఆఖరుకు బడ్జెట్లోనూ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. మత్స్యకారుల్లో వలసలు నిర్మూలించేందుకు, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేసింది. 2023 ఏప్రిల్ 19న పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. భావనపాడు పోర్టు ప్రారంభానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో పనులు ప్రారంభించారు. అప్పటి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, అప్పటి ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ భూమి పూజ నిర్వహించారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. కూటమి వచ్చాక పనులన్నీ నిలిచిపోయాయి. దీనిపై మత్స్యకారులు మండి పడుతున్నారు. అసంపూర్తిగా విడిచిపెట్టిన పనులను పూర్తిచేయాలని కోరుతున్నారు. ఫిషింగ్ హార్బర్కు భూమి పూజకు ముందే రూ. 366 కోట్లు టెండర్ పూర్తిచేశారు. ఈ టెండర్లను విశ్వసముద్ర కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. సర్వే నంబర్ 504–18లో 42 ఎకరాలు ప్రభుత్వ స్థలం కేటాయించారు. ఇక్కడ ప్రారంభించన పనులు 2024 జనవరితో ఈ పనులు నిలిచిపోయాయి. టెండరు దక్కించుకున్న విశ్వసముద్ర సంస్థ హార్బర్లో బస్స్టాండ్, యాక్షన్హాల్, కోల్డ్స్టోరేజ్, మైరెన్ పోలీసుస్టేషన్ ఆయిల్బంక్, ఇంజిన్ బోట్ల మరమ్మతులకు వర్క్షాప్ వంటి విభాగాలతో కూడిన వాటిని నిర్మించేలా పనులను ఆరంభించింది. నెలలు గడుస్తున్నా.. ఏడాదిలో హార్బర్ పనులను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంకా పనులను ప్రారంభించలేదు. 2025 ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుడగట్లపాలెం గ్రామానికి చేరుకుని ఏడాదిలోగా హార్బర్ను పూర్తిచేస్తామని ప్రకటించారు. అంతే కాకుండా వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చెల్లించాల్సిన భరోసా చెక్కులను కూడా ఇక్కడ నుంచే అందజేశారు. దాదాపు 10 నెలలు కావస్తున్నా హార్బర్ పనులు తిరిగి ప్రారంభం కాకపోవడంతో ఇక్కడ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్న కూటమి ప్రభుత్వం హార్బర్ నిర్మాణానికి కనీస చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ అనుబంధ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నప్పటికీ తీర ప్రాంత మత్స్యకారుల సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకుని హార్బర్ పునఃనిర్మాణ పనులను చేపట్టకపోవడం విచారకరం. ఇప్పటికై నా హార్బర్ పనులను పునఃప్రారంభించి గంగ పుత్రుల వలసలు నివారించాలని వారంతా కోరుతున్నారు. ముందుకు సాగని ఫిషింగ్ హార్బర్ పనులు తీవ్ర నిరాశలో మత్స్యకారులు బడ్జెట్లోనూ స్పష్టత ఇవ్వని వైనం మత్స్యకారులకు నిరాశే.. స్థానిక మత్స్యకారులు ఈ ఫిషింగ్ హర్బర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని పది గ్రామాల మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం వీరావల్, సూరత్, తమిళనాడు, మహారాష్ట్ర, వంటి ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్న వారు సైతం ఇక్కడకు వచ్చి పనిచేసుకోవచ్చు. నిర్మాణంలో జాప్యం మత్స్యకారులకు శాపంగా మారుతోంది. వెనుకబడిన మత్స్యకార ప్రాంతం ప్రగతికి గత ప్రభుత్వం కృషి చేస్తే ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. -
సమాజ రుగ్మతలు తొలగించేవి నాటకాలు
శ్రీకాకుళం కల్చరల్: సమాజంలో రుగ్మతలను ఎత్తి చూపి వాటిని తొలగించేందుకు నాటకాలు ఎంతగానో ఉపయోగపడతాయని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్ వేదికగా జరుగుతున్న నాటక పోటీల ముగింపు ఉత్సవం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ప్రతి ఏడాది మంచి నాటక పోటీలను నిర్వహించి, కళను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విద్యా మౌళిక వసతుల డైరెక్టర్ పీఎంజే బాబు, మొదలవలస రమేష్లు మాట్లాడుతూ కళా సేవ ఎంతో ఉత్తమమైనదన్నారు. ఉత్తమ ప్రదర్శన ‘మమ్మల్ని బతికించండి’.. మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీలలో ఆరు నాటికలు ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శనగా విజయవాడ కళాసమితి వారి ‘మమ్మల్ని బతికించండి నాటిక, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ‘సమయం’ నాటిక, ఉత్తమ జ్యూరీగా గుంటూరు వారి ‘తరమెల్లిపోతోంది’ నాటికలు బహుమతులు దక్కించుకున్నాయి. మానాపురం సత్యనారాయణ, గెద్దా వరప్రసాద్, నూర్బాషా ఖాసీంలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అనంతరం బహుమతులు అందజేశారు. అంతకుముందు నిర్వహించిన ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటిక, ‘నిన్ను నీవు గెలుచుకో’ నాటికలు అలరించాయి. కార్యక్రమంలో సుమిత్రా కళాసమితి అధ్యక్ష కార్యదర్శులు ఇప్పిలి శంకర శర్మ, గుత్తు చిన్నారావు, నక్క శంకరరావు, మండవిల్లి రవి, కిల్లా ఫల్గుణరావు, మూర్తి, కె.సురేష్, రాజు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
పాతపట్నం: మండలంలోని ఎ.ఎస్.కవిటి గ్రామానికి చెందిన అంపోలు నాగవేణి గడ్డిమందు తాగి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త అంపోలు తిరుపతిరావు పొలానికి, పిల్లలు పాఠశాలకు వెళ్లిన సమయంలో గడ్డిమందు తాగి తన సోదరికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. వెంటనే ఆమె స్థానికులకు తెలియజేయడంతో ఆటోలో పాతపట్నం సీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించారు. భర్త తిరుపతిరావుతో కుటుంబ తగాదాలే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి గార: జైలులో సత్ప్రవర్తనతో మెలగాలని, శిక్షాకాలం ముగిసిన తర్వాత సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కె.హరిబాబు అన్నారు. సోమవారం అంపోలు జిల్లా జైలును తనిఖీ చేసిన అనంతరం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. ఖైదీల కేసుల పురోగతిని సమీక్షించారు. ఆరోగ్యం పరిస్థితులపై ఆరా తీసి, వంటశాలను తనిఖీ చేసి నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. కార్యక్రమంలో జైలర్ దివాకర్నాయుడు తదితరులు పాల్గొన్నారు. 25న శ్రీకాకుళంలో జాబ్మేళా శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సీడాప్ ఆధ్వర్యంలో ఈ నెల 25న జాబ్మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పథక సంచాలకుడు పి.కిరణ్కుమార్ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. డీ–మార్ట్(హైదరాబాద్), ఫ్యూషన్ ఫైనాన్స్(శ్రీకాకుళం)లో అసోసియేట్, క్యాషియర్, పర్చేజ్ ఆఫీసర్, రిలేషన్షిప్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. 10వ తరగతి ఆపై అర్హత కలిగి, 19 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.16,000 నుంచి రూ.26,000 వరకు వేత నం లభిస్తుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, బయోడేటాతో బుధవారం ఉద యం 9:30 గంటలకు శ్రీకాకుళంలోని నెహ్రూ యువ కేంద్రం వద్దకు హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు 7989744612 నంబర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి శ్రీకాకుళం అర్బన్: అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, ఐసీడీఎస్కు బడ్జెట్లో నిధులు పెంచాలని సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుజరాతీపేటలో ప్రాజెక్టు కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సౌకర్యం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లల్లో ధరలు విపరీతంగా పెరిగినా ఒక్క రూపాయి వేతనం కూడా పెంచలేదన్నారు. బడ్జెట్ కేటాయింపులు సరిపోవన్నారు. 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. మే నెలంతా వేసవి సెలవులు ఇచ్చేలా జీఓ విడుదల చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు ప్రాజెక్టు, జిల్లా స్థాయిల్లో రిలే నిరాహార దీక్షలు, మార్చి 2న విజయవాడలో అలంకార్ సెంటర్ వద్ద మహా ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ వర్కర్లందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దీక్షలకు సీఐటీయూ టౌన్ కో– కన్వీనర్ ఎం.గోవర్దనరావు, సీనియర్ నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి, కె.జ్యోతి, కె.సంధ్య, వై.లీలారత్నకుమారి, కె.పార్వతి, ఎల్.శ్యామల, టి.పుష్పలత, ఇ.అప్పలనర్సమ్మ, ఎల్.రూపవతి, బి.లక్ష్మి, ఎం.వరలక్ష్మి, వి.సంతోషి తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే ‘రెవెన్యూ క్లినిక్’
శ్రీకాకుళం పాతబస్టాండ్ : భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ క్లినిక్లు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ‘రెవెన్యూ క్లినిక్’ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ స్వయంగా పలు అర్జీలు స్వీకరించారు. అనంతరం శాఖల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. క్లినిక్లో మొత్తం 21 శాఖలకు సంబంధించి 127 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ నుంచి 43, సెర్ప్ 31, పంచాయతీరాజ్ 15, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 7, నీటి వనరుల శాఖ 4, విద్యుత్ శాఖ 4, వ్యవసాయం, గనులు, ఇతర ఇంజినీరింగ్ శాఖలకు సంబంధించి పలు వినతులు వచ్చాయి. ● గతంలో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు దివ్యాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు వెంటనే భర్తీచేయాలని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి కోరారు. నియోజకవర్గానికి 25 స్కూటీలు చొప్పున 4375 మందిని లబ్ధిదారులుగా గుర్తించి ఉచితంగా లైసెన్స్ ఇప్పించి అందజేయాలని విన్నవించారు. ● శ్రీముఖలింగేశ్వర క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా లింగోద్భవ ఘట్టంలో ప్రొటోకాల్ పాటించడం లేదని, వీఐపీల పేరిట ఇతరులు విగ్రహాలను తాకుతుండటం శాస్త్ర విరుద్ధమని అర్చకుడు ఎన్.రాజశేఖర్ కోరారు. ● గార మండలం శాలిహుండంలో గతంలో దళితులకు కేటాయించిన భూములను ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటోందని, తమకు న్యాయం చేయాలని పలువురు కోరారు. -
తలశిలకు జిల్లా నాయకుల పరామర్శ
నరసన్నపేట : ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ నాయకుడు తలశిల రఘురాం కుటుంబాన్ని విజయవాడలోని ఆయన నివాసంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు సోమవారం కలిసి పరామర్శించారు. రఘురాం తండ్రి చంద్రశేఖరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో కృష్ణదాస్, ఎచ్చెర్ల, ఆమదాలవలస, టెక్కలి నియోజకవర్గాల సమన్వయకర్తలు గొర్లె కిరణ్కుమార్, చింతాడ రవికుమార్, పేరాడ తిలక్ పరామర్శించారు. వీరి వెంట రణస్థలం మండల పార్టీ అధ్యక్షుడు గొర్లె శ్రీనివాసరావు ఉన్నారు. -
ఆటో బోల్తాపడి పలువురికి గాయాలు
టెక్కలి రూరల్: తలగాం గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ఆటో బోల్తాపడిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నౌపడ ఆర్ఎస్ నుంచి కొంతమంది ప్రయాణికులతో కలిసి ఆటోలో టెక్కలి వైపు వస్తుండగా తలగాం జంక్షన్ వద్ద దామోదరపురం రహదారి మీదుగా ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తులు ఒక్కసారిగా టెక్కలి రోడ్డు పైకి వచ్చారు. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఆటో ఒక్కసారిగా బోల్తాపడింది. ద్విచక్ర వాహనచోదకులు సైతం అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నౌపడకు చెందిన బి.జయరాం, వి.కళ్యాణి, కె.అప్పారావు, భావనపాడుకు చెందిన ఎన్.రాజేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై ఉన్న యరకన్నపేటకు చెందిన సీహెచ్ గవిరీష్, ఐ.లచ్చోడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
అక్రమ మైనింగ్ అరికట్టాలి
● పీజీఆర్ఎస్లో ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఫిర్యాదు శ్రీకాకుళం పాతబస్టాండ్: పొందూరు మండలం వీఆర్గూడెం గ్రామ పరిధిలోని కొండపై ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తున్న అక్రమ క్వారీ నిర్వహణ నిలుపుదల చేయాలని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్, పొందూరు మండల నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందించారు. గ్రావెల్ తవ్వకాలతో పాటు వృక్షాలు నేలకూలుస్తుండటంతో పర్యావరణానికి తీవ్రనష్టం వాటిల్లుతోందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఓటర్ల మార్పులు, చేర్పులు, వార్డుల విభజన ప్రక్రియలో ఆమదాలవలస నియోజకవర్గంలో టీడీపీ నాయకులకు అనుకూలంగా, వారు సూచించిన విధంగానే కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని, దీనివల్ల ఇతర పార్టీల అభ్యర్థులకు ఓటింగ్లో నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సరుబుజ్జిలి మండలం విజయరామపురం పంచాయతీలో అంగన్వాడీ హెల్పర్ను రాజకీయ కక్షతో తొలగించడంతో కోర్టును ఆశ్రయించారని, ఆమెకు అనుకూలంగా ఆదేశాలు జారీ అయినందున, తక్షణమే కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. రైతులకు రబీలో రెండో పంటకు యూరియా అందుబాటులో ఉంచాలని విన్నవించారు. సరుబుజ్జిలి మండలం విజయరామపురం, తెలికిపెంట పంచాయతీల్లో పూర్తి చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో పొందూరు మండల పార్టీ అధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతాడ సత్యప్రసాద్, రాష్ట్ర సోషల్ మీడియా విభాగం కార్యదర్శి బొడ్డేపల్లి వెంకట సత్యం, సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు ఉన్నారు. ఆక్రమణలు అడ్డుకోవాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: నరసన్నపేట మండల ం తామరాపల్లి పంచాయతీ పరిధిలో కోల లక్ష్మణరావు కుమారుడు ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ 3–152, ఎల్పీ నెంబర్ 11లోని సుమారు 11 సెంట్ల ప్రభుత్వ స్థలంలో పక్కా భవనం నిర్మాణం చేస్తున్నాడని, ఇది పూర్తిగా అక్రమమని, ఆ నిర్మాణాలు వెంటనే నిలుపుదల చేయాలని పోలాకి మండల జెడ్పీటీసీ, నరసన్నపేట నియోజకవర్గ నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్య, నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, మరికొందరు నాయకులు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నరసన్నపేట తహసీల్దారుకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని చెప్పారు. అదే విధంగా, నరసన్నపేట పట్టణ పరిధిలో బోయిన నాగయ్య కుమారుడు చంద్రమౌళి రాతికర్ర చెరువు గర్భంలో స్థలం ఆక్రమించి బహుళ అంతస్తు నిర్మాణం చేస్తున్నాడని, ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి, ఇతర అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. ఈ చెరువులోనే ఉల్లాకుల అప్పారావు (కోవెలవీధి) కుమారుడు కృష్ణ అక్రమ నిర్మాణం జరిపేందుకు చూస్తున్నాడని విన్నవించారు. ఈ ఆక్రమణల విషయమై కోర్టులో కేసు నడుస్తున్నా బేఖాతరు చేస్తున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో రాజాపు అప్పన్న, బీసీహెచ్ గుప్తా, బొబ్బాది ఈశ్వరరావు, మల్లేసు, రౌతు శంకరరావు తదితరులు ఉన్నారు. ఎస్ఎంసీ చైర్మన్ సంతకం ఫోర్జరీ రణస్థలం: నారువ హైస్కూల్లో హెచ్ఎం భాస్కరరావు పని తీరు సక్రమంగా లేదని ఎస్ఎంసీ చైర్మన్ నిద్రబంగి ముగతమ్మ గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు చేశారు. ఏకంగా ఎస్ఎంసీ చైర్మన్ సంతకం ఫోర్జరీ చేసి డబ్బులు విత్ డ్రా చేసుకుని సొంత అవసరాలకు వినియోగించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాడు–నేడు పథకంలో మంజూరైన నిర్మాణ సామగ్రి మొత్తాన్ని వ్యాన్తో తీసుకువెళ్లిపోయారని, చెక్కీలు కూడా విద్యార్థులకు ఇవ్వడం లేదన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ నాయకులు జీరు గురునాథరెడ్డి, నిద్రబంగి ఆదినారాయణ తదితరులు ఉన్నారు. -
నేడు ‘డయల్ యువర్ ఈపీడీసీఎల్ సీఎండీ’
సాక్షి, విశాఖపట్నం : డిస్కమ్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో నేడు ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ప్రకటించారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్ పాడేరు, రాజమహేంద్రవరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు 8688400499 ఫోన్ నంబర్ ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చని వెల్లడించారు. విశాఖపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు, హెచ్చుతగ్గులు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్న్స్ఫార్మర్ల మార్పిడి, తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సంస్థ పరిధిలోని 11 జిల్లాల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సీఎండి పృథ్వీతేజ్ విజ్ఞప్తి చేశారు. చైన్నెలో అచ్చుతాపురం వ్యక్తి మృతి పాతపట్నం: పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధి అచ్చుతాపురం గ్రామానికి చెందిన సలాన సోమేశ్వరరావు(41) చైన్నెలో శనివారం ఉదయం సెంట్రింగ్ పనులు చేస్తూ, మూడో అంతస్తు నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ విషయాన్ని చైన్నెలో అతనితో పనిచేసేవారు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ఆదివారం సాయంత్రం మృతదేహం గ్రామానికి తీసుకురావడంతో అంత్యక్రియలు నిర్వహించారు. సోమేశ్వరరావుకు భార్య లక్ష్మి, కుమారుడు సాయిచరణ్లు ఉన్నారు. కారం చల్లి బంగారం చోరీ నందిగాం: చెరువుకు స్నానానికి వెళ్తున్న మహిళ కంట్లో కారం చల్లి మెడలో పుస్తెలతాడు, గొలుసు చోరీ చేసిన ఘటన మండలంలోని నర్సిపురంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నెయ్యిల మహాలక్ష్మి గొడెబందకు స్నానానికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కంట్లో కారం చల్లాడు. అనంతరం మెడలో ఉన్న పుస్తెల తాడు, గొలుసును లాక్కొని వెళ్లిపోయాడు. దీంతో ఏడ్చుకుంటూ గ్రామానికి చేరుకున్న మహలక్ష్మి, విషయం గ్రామస్తులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహాలక్ష్మి భర్త పార్వతీశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సైనికా.. సెలవిక
● అధికార లాంచనాలతో జవాన్ అంత్యక్రియలు నరసన్నపేట: మండలంలోని చిక్కాలవలసకు చెందిన జవాన్ దంత అమృత్కుమార్(41) అంత్యక్రియలు అధికార లాంచనాలతో ఆదివారం చేపట్టారు. గత 20 ఏళ్లుగా సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తున్న అమృత్కుమార్ శుక్రవారం మణిపూర్ వద్ద విధుల్లో ఉండగా గుండెపోటుకు గురై మరణించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. మడపాం టోల్గేట్ వద్దకు మృతదేహం చేరుకోగా అక్కడ నుంచి చిక్కాలవలస వరకు నరసన్నపేటకు చెందిన పారా మిలటరీ అసోసియేషన్ ప్రతినిధులు, మాజీ సైనికులు ర్యాలీగా తీసుకెళ్లారు. పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు. పోలాకి జెడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య అంత్యక్రియల్లో పాల్గొని అమృత్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎస్ఐ బలివాడ గణేష్, ఎస్ఐ–2 శేఖరరావు, వైఎస్సార్సీపీ నాయకులు యాబాజి రమేష్, బొబ్బాది ఈశ్వరరావు, కింతలి చలపతిరావు, మొయ్యి లక్ష్మునాయుడు, సడగాన రవి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
ఇచ్ఛాపురం: రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట గ్రామానికి చెందిన కొండొలోల సాయికుమార్ని పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నం నాయుడు తెలిపారు. స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఆదివారం విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి 9వ తేదీన అప్పన్నపేటలోని ఒక ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి, సుమారు ఒకటిన్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.6,500ల నగదు దొంగలించినట్లు కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆదివారం పట్టణ ఎస్ఐకి వచ్చిన సమాచారం మేరకు స్థానిక రైల్వేస్టేషన్కు పట్టణ పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ఆవరణలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న సాయికుమార్ని పట్టుకొని విచారించారు. ఈ విచారణలో నిందితుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 28 దొంగతనాలు చేసి జైలుకి కూడా వెళ్లినట్లు నిర్దారణ అయ్యింది. నిందితుని వద్దనుంచి స్థానిక స్టేషన్లో నమోదైన కేసుతో పాటు నరసన్నపేట, ఆమదాలవలస, మెళియాపుట్టి, జేఆర్పురం, విజయనగరం–1 టౌన్ స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించిన 48 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ.10,500లు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ ఎస్ఐ ముకుందరావు, క్రైమ్ సిబ్బంది బషీర్ తదితరులు పాల్గొన్నారు. -
లారీని ఢీకొన్న కారు
● ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు మందస: మండలంలోని బాలిగం సమీపంలో ఉన్న ఎన్హెచ్ 16 జాతీయ రహదారిపై శనివారం రాత్రి లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారని ఎస్ఐ కృష్ణప్రసాద్ తెలిపారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న లారీని, ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు అతివేగంతో వస్తున్న కారు డివైడర్ దాటుకొని వెళ్లి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న షేక్ఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి పీయూష్ కుమార్ శ్రీకాకుళంలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అలాగే మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా ఒడిశా రాష్ట్రంలోని కటక్ ప్రాంతానికి చెందినవారని తెలిపారు. -
చిరస్మరణీయుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేసిన దివంగత ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు చిరస్మరణీయుడని కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి(పార్లమెంట్) దుంపల రామారావు(లక్ష్మణరావు) అన్నారు. ఆదివారం బొడ్డేపల్లి వర్ధంతి పురస్కరించుకొని నగరంలోని సింహద్వారం దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసిన మహోన్నత నాయకుడు బొడ్డేపల్లి అని కొనియాడారు. ప్రజా నాయకుడిగా రికార్డు స్థాయిలో పార్లమెంట్కు ఎన్నికై దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా వంశధార నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. రైతుల సంక్షేమం కోసం, సాగునీటి వనరుల కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడి నిధులు తీసుకొచ్చేవారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. -
సామాజిక పురోగతికి పాటుపడాలి
కవిటి: రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన ప్రజల పురోగతికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని వక్తలు అన్నారు. మండలంలో కొత్త కొజ్జీరియా జంక్షన్లోని రెడ్డిక సంఘం భవనం వద్ద ఐక్యతా స్థూపం, యోగి వేమనల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీకాకుళం, పూరీ, గంజాం రెడ్డిక మహాజన పురోభివృద్ధి సంఘం తొలిసారి రిజిస్ట్రేషన్ చేసి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెడ్డిక కుల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వందేళ్ల ప్రయాణంలో విశేష సేవలందించిన దివంగత ఎమ్మెల్యేలు ఆశి నీలాద్రిరెడ్డి, ఉప్పాడ రంగబాబు, లండ కారయ్యరెడ్డి, దక్కత అచ్చుతరామయ్యరెడ్డిలు చిరస్మరణీయులని కొనియాడారు. అనంతరం పలువురిని సన్మానించారు. కార్యక్రమంలో పూరీ, గంజాం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని రెడ్డిక సామాజికవర్గ ప్రజలు పాల్గొన్నారు. పక్కాగా డోలోత్సవం ఏర్పాట్లు గార: మార్చి 3, 4, 5 తేదీల్లో శ్రీకూర్మనాథాలయంలో జరిగే డోలోత్సవం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక గజపతిరాజు సూచించారు. ఆదివారం విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ భవనంలో కూర్మనాథాలయ పాలక మండలి సమావేశం ఈవో టి.వాసుదేవరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా అశోక గజపతిరాజు మాట్లాడుతూ క్యూలైన్లు, ఉత్సవం వేళ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇండిగో సంస్థ సీఎస్ఆర్ నిధులు తొలి విడతగా ఇచ్చిన రూ.3.60 కోట్లతో పుష్కరిణి అభివృద్ధి పనులపై చర్చించారు. అదేవిధంగా అన్నదానం భవనం వద్ద సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తే విద్యుత్ బిల్లును ఆదా చేయవచ్చని నిర్ణయం చేశారు. సమావేశంలో అర్చకులు కిషోర్ బాబు, సభ్యులు కై బాడి కుసుమకుమారి, పల్ల పెంటయ్య, గంట్రేడి సంయుక్త, గొండు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చందు వైద్యానికి జీఎంఆర్ చేయూత జి.సిగడాం: మండల పరిధిలోని డీఆర్వలస(దాలెమ్మ రాజువలస) గ్రామానికి చెందిన నారాయణరావు, భూలక్ష్మి దంపతుల కుమారుడు చందు గత ఐదేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. వైద్యానికి సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని జనవరి 28వ తేదీన ప్రాణ భిక్షపెట్టండి అనే శీర్షికతో సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనానికి జీఎంఆర్ సంస్థ స్పందించింది. చందు వైద్యం నిమిత్తం రూ.3 లక్షల ఆర్థిక సాయం ఆదివారం అందజేసింది. కార్యక్రమంలో సర్పంచ్ కుమరాపు శ్రీనివాసరావు, ఎంపీటీసీ కుమరాపు రమేష్నాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు కుమరాపు రవికుమార్, కుమరాపు పెద్ద శ్రీనివాసరావు, కుమరాపు నాగభూషణరావు, మాజీ సర్పంచ్ కుమరాపు అప్పలనాయుడు, విశ్రాంత వీఆర్వో కుమరాపు సన్యాసినాయుడు, పాండ్రంగి సీతారాం, పాండ్రంగి జానీ, కుమరాపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరింతమంది దాతలు ముందుకు రావాలని కోరారు. చికిత్స పొందుతూ వివాహిత మృతి నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలోని సాయి నగర్కు చెందిన మెండ సీత(55) కాలిన గాయాలతో చికిత్స పొందుతూ రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు. శనివారం దేవుడి వద్ద దీపం వెలిగిస్తున్న సమయంలో హారతి కర్పూరం బిల్లలు శరీరంపై పడడంతో సీత గాయాలకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు నరసన్నపేటలో ప్రథమ చికిత్స చేయించి, అనంతరం రాగోలు జెమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సీత ఆదివారం సాయంత్రం మృతి చెందారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బలివాడ గణేష్ తెలిపారు. -
చిరు వ్యాపారాలకు చిక్కులు..!
● ఫుట్పాత్ వ్యాపారాలు తొలగిస్తున్న అధికారులు ● ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీలో ఆర్టీసీ కాంప్లెక్స్ మొదలుకొని పాత జాతీయ రహదారి మీదుగా రోడ్డుకు ఆనుకుని ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు చెందినవారు వివిధ రకాల ఫుట్పాత్ వ్యాపారాలతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. గత కొన్ని దశాబ్ధాలుగా చిన్నపాటి వ్యాపారాలతో జీవనం సాగిస్తూ వచ్చారు. అయితే గత కొద్దిరోజుల నుంచి పట్టణంలో అభివృద్ధి పేరుతో ఫుట్పాత్ వ్యాపారాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో మొదటగా వైఎస్సార్ జంక్షన్ నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి ఫుట్పాత్ వ్యాపారాలను తొలగించారు. పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఫుట్పాత్ వ్యాపారస్తులకు ఆసరాగా ఉన్నటువంటి షెల్టర్ను కూల్చివేశారు. తాజాగా ఆర్టీసీ కాంప్లెక్స్కు ఎదురుగా పాత జాతీయ రహదారికి ఆనుకుని బడ్డీలు ఏర్పాటు చేసుకున్నవారిని సైతం అక్కడ నుంచి వెళ్లగొట్టే చర్యలు చేపట్టారు. దీంతో చిరు వ్యాపారాలతో కుటుంబాలను పోషించుకుంటున్న నిరుపేద కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. అధికార యంత్రాంగం చర్యలపై బాధితులతో కలిసి దశల వారీగా ఉద్యమాలు చేయడానికి ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీధి వ్యాపారాలను ప్రోత్సహించడానికి రుణాలు ఇచ్చిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారు. మారుమూల ప్రాంతంలో స్థలం గుర్తింపు అధికారుల గుర్తింపు ప్రకారం పట్టణంలో సుమారు 250 వరకు వివిధ రకాల ఫుట్పాత్ వ్యాపారస్తులు ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం సుమారు 400లకు పైగా కుటుంబాలు ఫుట్పాత్ వ్యాపారాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తొలగించిన ఫుట్పాత్ వ్యాపారస్తుల కోసం చిన్న బజారులో పశువైద్య కేంద్రానికి పక్కన కొంత స్థలాన్ని పంచాయతీలో ఫుట్పాత్ వ్యాపారాలన్నీ ఒకే దగ్గరకు చేర్చేవిధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ముందుగా చిన్నబజారులో ఇప్పటికే స్థలాన్ని కేటాయించాం. అలాగే కూరగాయల కాంప్లెక్స్లో అద్దె ప్రాతిపదికన దుకాణాలు కేటాయిస్తాం. మిస్సమ్మ బంగ్లా స్థలాన్ని కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – ఏవీ శ్రీనివాస్, పంచాయతీ ఈవో, టెక్కలి పట్టణంలో అభివృద్ధి పేరుతో ఫుట్పాత్ వ్యాపారస్తులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఫుట్పాత్ వ్యాపారాలను తొలగిస్తున్నారు. ఎటువంటి ప్రత్యామ్నాయం చూపడం లేదు. మారుమూల ప్రాంతాల్లో విక్రయాలు సాధ్యం కాదు. బాధితులకు అండగా దశల వారీగా ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. – ఎన్.షణ్ముఖరావు, ప్రజా సంఘాల నాయకుడు, టెక్కలి మంత్రి అచ్చెన్నాయుడి డైరక్షన్లోనే పట్టణంలో ఫుట్పాత్ దుకాణాల తొలగింపు జరుగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ పేద, సామాన్య కుటుంబాలకు ఇటువంటి ఇబ్బందులు తప్పడం లేదు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో దుకాణాల నిర్మాణాలు చేపట్టి పేద, సామాన్య కుటుంబాలకు చెందిన వివిధ రకాల వ్యాపారస్తులకు వాటిని కేటాయించాలి. – సత్తారు సత్యం, వైఎస్సార్సీపీ నాయకుడు, టెక్కలి గుర్తించారు. అయితే ఆ మారుమూల ప్రాంతంలో వ్యాపారాలు జరగవని నిరాకరిస్తూ బాధిత వ్యాపారస్తులు ఆ ప్రదేశానికి వెళ్లడం లేదు. వీటితో పాటు ఇదే ప్రాంతంలో కూరగాయల కాంప్లెక్స్లో కొన్ని దుకాణాలు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, వారి మాటలను నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. -
ఆకట్టుకున్న నాటిక పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక బాపూజీ కళా మందిర్లో శ్రీసుమిత్ర కళా సమితి ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల కళాకారుల దినోత్సవంలో భాగంగా ఆదివారం రెండు నాటికలు ప్రదర్శించారు. గుంటూరు అభినయ ఆర్ట్స్ ఎన్.రవీంద్రరెడ్డి దర్శకత్వంలో ప్రదర్శించిన సమయం నాటిక, పొన్నూరుకు చెందిన శ్రీవిశ్వకళా చైతన్య వేదిక ఆధ్వర్యంలో జీవీ మనోహర్ దర్శకత్వం వహించిన సూక్తం నాటిక ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో ఇప్పిలి శంకర్ శర్మ, గుత్తు చిన్నారావు, మండవల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, నక్క శంకరరావు, కె.సురేష్, కొంక్యాన మురళి తదితరులు పాల్గొన్నారు. అలాగే విజయవాడలోని సంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ‘మమ్మల్ని బతకనివ్వండి’, విశాఖ కేవీ మెమోరియల్ ఆధ్వర్యంలో ‘నిన్ను నీవు గెలుచుకో’ నాటికలు సోమవారం ప్రదర్శింపబడతాయి. -
● జయహో రాజమ్మ తల్లి..
ఉత్తరాంధ్ర భక్తులకు కొంగుబంగారమైన వత్సవలస రాజమ్మ తల్లి (రాజరాజేశ్వరి) దర్శనానికి నాల్గో వారం అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన భక్తులు తమ కుటుంబ సభ్యులతో రాజమ్మ తల్లికి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చారు. శనివారం రాత్రికే వచ్చిన భక్తులు సమీప తోటల్లోనూ, ఆరుబయట బసచేసి రాజరాజేశ్వరి (రాజమ్మతల్లి) పాటు భూలోకమ్మ తల్లికి ఆదివారం ఉదయం మొక్కులు తీర్చుకున్నారు. వేకువ జాము న నుంచే సమీపంలోని సముద్రంలో స్నానాలు ఆచరించారు. కుటుంబ సమేతంగా విచ్చేసి ఇక్కడే వంటలు చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. మూడో వారం శివరాత్రి కావడంతో ఈ వారం అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. బీచ్ వద్ద మైరెన్ పోలీసులు గస్తీ నిర్వహించారు. –గార -
ఎవరిదీ పాపం..?
నాణ్యత లోపం.. పులిహోరలో కుళ్లిపోయిన శనగలు వస్తాయి.. నాణ్యత లేని జీడిపప్పులు పంటి కింద రాయిలా తగుతుంటాయి.. కారణమేంటా అని చూస్తే బ్లాక్లిస్టులో పెట్టిన ఏజెన్సీ నుంచి సరుకులు వస్తుంటాయి.. దిట్టం ప్రకారం వేయాల్సిన దినుసుల్లో లోపాలు కనిపిస్తాయి. అరసవల్లిలో జరుగుతున్న అపచారమిది. అంతా ‘అయిన వాళ్లే’ కావడంతో ఈ వైఖరిపై ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. అధికారుల నుంచి నాయకుల వరకు అందరికీ నిజాలు తెలిసినా చర్యలు తీసుకునే వారు లేకపోవడంతో నాణ్యత లేని పులిహోరనే ప్రసాదంగా భక్తులు కళ్లకద్దుకుంటున్నారు. -
సర్వం సిద్ధం
● ఇంటర్ పరీక్షలకు● నేటి నుంచే పరీక్షలు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం ● పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు ● ప్రత్యేక రూట్లలో బస్ సదుపాయం కల్పన శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ థియరీ పబ్లిక్ పరీక్షలకు ఇంటర్ బోర్డు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. తొలిరోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తెలుగు/సంస్కృతం/హిందీ పేపర్లకు పరీక్ష జరగనుంది. ఇంటర్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి. 8.30 నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోపలికి అనుమతిస్తారు. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు 71 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలు 34, సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ ఒకటి, 36 ప్రైవేటు జూనియర్ కళాశాలలను కేంద్రాలగా ఎంపికచేశారు. 39,838 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు. 31 స్టోరేజ్ పాయింట్లలో ప్రశ్న పత్రాలు.. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకై 71 కేంద్రా లకుగాను అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించారు. జిల్లాకు ఇప్పటికే మూడు సెట్లతో కూడిన ప్రశ్న పత్రాలు చేరగా.. వీటిని 31 స్టోరేజ్ పాయింట్లలో పోలీసు బందోబస్తు నడుమ భద్రపరిచారు. పోలీసు పహారాను ఉంచారు. అన్ని కేంద్రాల్లోను సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. పరీక్ష జరిగే మూడు గంటల సీసీ కెమెరాల విడిధి(సమయాన్ని)ని పెన్డ్రైవ్లో భద్రపరిచి జిల్లా ఆర్ఐఓ కార్యాలయంలో అందజేయా ల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక రూట్లలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా నడుపుతోంది. వసతులన్నీ వైఎస్ జగన్ చలవే.. పరీక్షల ఏర్పాట్లలో అధికారులు మాజీ సీఎం వైఎస్ జగన్ను గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించిన మనబడి నాడు –నేడు కార్యక్రమం ద్వారా వచ్చిన మౌలిక సదుపాయాలు నేడు పిల్లలకు వరంలా మారాయి. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, వసతి కేంద్రాల్లో అదనపు భవనాలు, ఫర్నీచర్ ఉండడంతో పరీక్షలు సజావుగా జరిగిపోతున్నాయి. పరీక్ష కేంద్రంలో హాల్టిక్కెట్ నంబర్లతో సిద్ధంగా ఉన్న ఫర్నీచర్ సీసీ కెమెరాను సరిచేస్తున్న దృశ్యం అంతా సహకరించాలి.. జిల్లాలో నేటి నుంచి మొదలుకానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇంటర్బోర్డు సెక్రటరీ, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు సీఎస్లు, డీఓలతో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. అన్ని మౌ లిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, సిబ్బంది సహకరించి విజయవంతం చేయాలి. – రేగ సురేష్కుమార్, ఇంటర్మీడియెట్ బోర్డు, జిల్లా ఆర్ఐఓ, డీఈసీ కన్వీనర్ -
రుచి పోయింది
మేము ప్రతినెలా అరసవల్లి ఆదిత్యుని దర్శనానికి వస్తుంటాం. ప్రతిసారి 10 నుంచి 15 ప్యాకెట్ల పులిహోర ఇంటికి తీసుకెళ్తుంటాం. అయితే గతంలో ఉన్న రుచి ఇప్పుడు లేదనిపిస్తోంది. పులిహోరలో జీడిపప్పు, శనగ పలుకులు పాడైనవి వస్తున్నాయి. దేవుని ప్రసాదానికి వంకలు పెట్టకూడదని తినేస్తున్నాం. కానీ నిజానికి పులిహోర రుచి పో యింది. నాణ్యమైన సరుకులు వాడడం లేదని తెలిసిపోతోంది. దేవుని ప్రసాదాల్లోనూ అక్రమాలు చేస్తున్న వారికి తగిన శాస్తి తప్పదు. – వజ్రపు భాస్కరరావు, తామరాపల్లి లక్ష్మణరావు, చీపురుపల్లి -
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమో దు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగా కార్య క్రమంలో గానీ లేదా మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్ వెబ్సైట్లో గానీ నమోదు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవాలంటే 1100కు నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. రెవె న్యూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ కూడా సమాంతరంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
అప్డేట్.. క్లిక్ చేస్తే ఔట్
శ్రీకాకుళం క్రైమ్ : ‘మీ బ్యాంకు నుంచి కేవైసీ అప్డేట్ చేయాలనే మెసేజ్ వచ్చిందా..? పాత బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు మర్చిపోయారా..? చెక్కుల క్లియరెన్సు సులువుగా ఒకే రోజులో జరగాలా..? అయితే మీరు చేయాల్సిందల్లా కిందన ఉన్న లింక్లు క్లిక్ చేస్తే చాలు.. కదలకుండా ఇంటి వద్దనుంచే మీరు అన్నీ చేసేసుకోవచ్చు..’ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట జిల్లాలోని పలువురి ఫోన్లకు వాట్సాప్ల ద్వారా నిత్యం వస్తున్న ఫేక్ సందేశాలివి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా క్లిక్ చేసినా మన బ్యాంకు ఖాతాలోని సొమ్ము ఖాళీ అయిపోతుంది. ఇలాంటి ఫేక్ మెసేజ్లు, ఫేక్ లింక్లపై ఖాతాదారులైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు వర్గాలతో పాటు పోలీసులూ హెచ్చరిస్తున్నారు. కేవైసీ అప్డేట్ అంటూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (9930991935 నంబర్) పేరిట.. చింతించకండి.. బ్యాంకింగ్ సేవలను అంతరాయం లేకుండా పొందడంలో సహాయపడుతుంది అంటూ సందేశాలు వస్తాయి. ‘ఆధార్ ఓటీపీ, ఆధార్ ఇ–కేవైసీ, వీడియో కేవైసీ, మీ బ్యాంకు యందు అప్డేట్ చేయబడిన అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రాలను (ఓవీడీ) సమ ర్పించడం.. మరింత సమాచారం కోసం హెచ్టీటీపీఎస్://ఆర్బిఐకెఇహెచ్టిఎహెచ్ఐ.ఆర్బిఐ.ఒఆర్జి.ఇన్/టిఈల్యుజియు/ఇండెక్స్.హెచ్టీఎంఎల్ పై క్లిక్ చేయండి’ అంటూ పంపిస్తారు. పా త బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు మర్చిపోయారా.. తిరిగి పొందడంలో ఆర్బీఐ మీకు సహాయం చేస్తుంది.. మీ లేదా మీ కుటుంబం యొక్క ఖాతా పదిసంవత్సరాలు పైన వాడకుండా ఉంటే అందులో డబ్బులుంటే ఆర్బీఐ యొక్క డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) ఫండ్లో ఉండొచ్చు. అంటూ లింక్ ఇస్తారు. కొద్దిగంటల్లో చెక్కులు క్లియర్ అయ్యి ఖాతాకు జమ అవుతాయి. మీరు చేయాల్సిందల్లా లింక్ను క్లిక్ చేస్తే చాలంటారు. చేశారో.. ఇక మీరు మోసపోయినట్లే. ఫ్రాడ్కు గురైతే.. ఒకవేళ లింక్ క్లిక్ చేసి ఖాతాలో సొమ్ము పోగొట్టుకుంటే సంబంధిత బ్యాంకుకు వెళ్లి అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని, 1930 సైబర్సెల్కు ఫిర్యాదు చేయాలని, దగ్గరలో ఉన్న పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదయ్యేలా చూడాలని పోలీసులంటున్నారు. సైబర్ వెబ్పోర్టల్లో కూడా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఇలా వస్తాయి మెసేజ్లు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట వాట్సాప్ సందేశాలు క్లెయిమ్ చేయని డిపాజిట్లను తనిఖీ చేసేందుకు లింక్ చెక్కుల క్లియరెన్సు సులభతరమంటూ ఫేక్ లింకులు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసు, బ్యాంకు వర్గాలు బ్యాంకు అధికారులు ఏమంటున్నారంటే.. ఏ బ్యాంకు గానీ, రిజర్వ్ బ్యాంకు గానీ కేవైసీ అప్డేట్ చేస్తామంటూ లింక్లు ఎట్టి పరిస్థితు ల్లో పంపదని, అలా పంపిందంటే అదో ఫేక్ మెసేజ్గా పరిగణించాలని, సైబర్ ఫ్రాడ్కు గురయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. ఒకవేళ సంబంధిత బ్యాంకు అధికారిక వెబ్సైట్నుంచి గానీ, అధికారిక కాల్సెంటర్ కస్టమర్ కేర్ నుంచి గానీ మెయిల్, సందేశాలు పంపినా ప్లీజ్ కాంటాక్ట్ నియరెస్ట్ బ్రాంచి అని చెబుతారన్నారు. ఇలాంటి లింక్లు పంపేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదని, దగ్గరలో ఉన్న బ్యాంకు ప్రతినిధులను సంప్రదించాలంటున్నారు. -
24న జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: శాప్ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన జిల్లా స్థాయి సైక్లింగ్ లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎ.మహేష్బాబు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి ఈ పోటీలు మొదలవుతాయని చెప్పా రు. జూనియర్ అండర్–18 విభాగంలో బాలురు, బాలికలకు విడివిడిగా పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా శ్రీకాకుళం జిల్లా నివాసి అయి ఉండాలని స్పష్టంచేశారు. ఆసక్తి గల వారు శాప్ వెబ్సైట్ స్పోర్ట్స్.ఏపీ.జీవోవి.ఇన్ (sports.ap.gov.in)లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇక్కడ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాలబాలికలను ఫిబ్రవరి 28వ తేదీన ఎన్.టి.ఆర్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి సైక్లింగ్ చాంపియన్షిప్ పోటీలకు జిల్లా తరఫున పంపిస్తామని మహేష్బాబు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 93903 52942, 9494814087 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి టెక్కలి: స్మార్ట్ మీటర్లతో నడిరోడ్డున పడనున్న మీటర్ రీడర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని మీటర్ రీడర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు జీరు ప్రేమ్భూషన్రెడ్డి, బి.ఓంకారరావు డిమాండ్ చేశారు. ఆదివారం టెక్కలిలో జిల్లా స్థాయి మీటర్ రీడర్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులతో పాటు తీవ్రంగా నష్టానికి గుర య్యే మీటర్ రీడర్స్ సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో దశల వారీగా ఉద్యమాలు చేసినట్లు పేర్కొన్నారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తామని వెల్లడించారు. స్మార్ట్ మీటర్ల వల్ల జీవనోపాధి కోల్పోతున్న మీటర్ రీడర్స్కు పూర్తి స్థాయిలో ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు పొందర శ్రీనివాస్, దూగాన భాస్కర్, వండాన ప్రసాద్, పి.తులసీదాస్, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా సామూహిక ఉపనయనాలు నరసన్నపేట: స్థానిక వెంకటేశ్వరాలయంలో ఆదివారం సామూహిక ఉపనయనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఒకేసారి 102 మంది యువకులు ఉపనయనాలు వేసుకున్నారు. శివమత వైశ్య యువకులకు గుండుగోల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో సత్యవరాగ్రహారానికి చెందిన రుత్వికులు శా స్త్రోక్తంగా యువకులతో పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. ఉపనయనాలు స్వీకరించిన యువకులు వారి కుటుంబ సభ్యులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం జరగగా దీంట్లో బో యిన వెంకటరమణమూర్తి, పొట్నూరు సాయిబాబా, తంగుడు జోగారావు, రామసోమేశ్వరగుప్త తదితరులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు ఉచిత భోజన వసతులు కల్పించారు. -
‘పీఆర్సీని అమలు చేయాలి’
ఇచ్ఛాపురం: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం వెంటనే ఐఆర్ని ప్రకటించి పీఆర్సీని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) డిమాండ్ చేసింది. స్థానిక మున్సిపల్ బాలికోన్నత పాఠశాల ఆవరణలో ఆపస్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆపస్ సంఘ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు గల ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆపస్ అధ్యక్షుడు శివరామ్ప్రసాద్, ప్రదాన కార్యదర్శి కీలు సోమేశ్వరరావు, కార్యదర్శి చలపతి, బి.శంకరం, సుబ్యమణ్యం, ఆనందరావు, ఎన్.సోమేశ్వరరావు, మహేష్, మన్మధ ప్రదాన్, భవానీశంకర్, నాగరాజు, శరత్, ఏ నాగేశ్వరరావు, సత్యానంద్, వెంకటరమణ, హేమంత్, జ్యోతిమహంకాళి, ధన లక్ష్మి, యశోద, ప్రమోదిని, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ బడ్జెట్ సమావేశం రసాభాస
పలాస : పలాస–కాశీబుగ్గ మున్సిపల్ చివరి బడ్జెట్ సమావేశం శనివారం రసాభాసగా మారింది. మంచినీటి ప్రాజెక్టు తమ హయాంలోనే మున్సిపాలిటీకి వచ్చిందని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, తామే మంచినీటి ప్రాజెక్టు పనులు చేయించి ప్రజలకు నీరు అందించామని టీడీపీ కౌన్సిలర్లు చెప్పడంతో గందరగోళం నెలకొంది. అనంతరం వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు వాకౌటు చేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం బడ్జెట్ సమావేశం నిర్వహించారు. రూ.43,62,83,906 అంచనాతో 2026–27 బడ్జెట్ను ఆమోదించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వైస్ చైర్మన్ మీసాల సురేష్బాబు, కమిషనర్ ఇ.శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు దుర్గా శంకర్ పండా, బోర బుజ్జి, కర్రి మాధవరావు, పప్పల ప్రసాద్, బెల్లాల శ్రీనివాసరావు, సవర సోమేశ్వరరావు, బోర చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
ఆరు కేజీల గంజాయితో వ్యక్తి అరెస్ట్
ఇచ్ఛాపురం : ఆరు కేజీల గంజాయితో ఒడిశాకు చెందిన బిక్రమ్ ఉతాన్సింగ్ను అరెస్ట్ చేసినట్లు ఇచ్ఛాపురం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి పి.దుర్గాప్రసాద్ తెలిపారు. శనివారం స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒడిశాకి చెందిన బిక్రమ్ ఉతాన్సింగ్ ద్విచక్ర వాహనంపై ఆరు కేజీల గంజాయిని తీసుకొస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి 6 కేజీల గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. ఈ దాడుల్లో యాంటీ నార్కోటిక్ ఫోర్స్ బృందం, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. పండ్లతోటలు దగ్ధం బూర్జ: మండలంలోని ఒ.వి.పేట గ్రామంలో రెండు ఎకరాల మామిడితోట, రెండు ఎకరాల జీడితోట, రెండు వరి చేలు కుప్పలు, గడ్డి వాములు దగ్ధమయ్యాయని ఆమదాలవలస అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సుమారు మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేశారు. ప్రమాదానికి కారణాలు తెలియలేదు. శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఆమదాలవలస అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. జీడి మామిడి పూత, పిందె దశలో ఉండగా ప్రమాదం జరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. -
నాటిక పోటీలు ప్రారంభం
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో శ్రీసుమిత్ర కళాసమితి ఆధ్వర్యంలో శనివారం నాటిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బొరివంకకు చెందిన శార్వాణి గిరిజన సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో కేకేఎల్ స్వామి రచన, దర్శకత్వంలో ప్రదర్శించిన ‘మాయాజాలం’ నాటిక ఆద్యంతం అలరించింది. మనిషికన్నా కాలం చాలా శక్తివంతమైనదని తెలియజేస్తూ కాలం ద్వారా జరుగుతున్న మాయాజాలాన్ని ప్రేక్షకుల ముందుంచారు. గుంటూరుకు చెందిన కరణం సురేష్ మెమోరియల్ సంస్థ ఆధ్వర్యంలో బొమ్మిడి రామకృష్ణ రచించి దర్శకత్వం వహించిన ‘తరమెల్లి పోతున్నదో‘ నాటిక ద్వారా ప్రస్తుత సమాజంలో ఆప్యాయతలు కనుమరుగవుతున్న వైనాన్ని వివరించారు. అంతకుముందు నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ కుంచాడ సోమేశ్వరరావు, ఈఈ పి.సుగుణాకరరావు, డాక్టర్ పైడి సింధూరలు మాట్లాడుతూ ప్రపంచ రంగస్థల దినోత్సవం పురస్కరించుకొని ఏటా నాటిక పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సత్యసాయి సంస్థ కన్వీనర్ కంబ మురళీకృష్ణ, ఇప్పిలి శంకర్ శర్మ, గుత్తు చిన్నారావు, మండవల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, నక్క శంకరరావు, కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ‘సమయం, ‘సూక్తం‘ నాటికలు ప్రదర్శించనున్నారు. -
ఊళ్లలో దోచి.. డంపింగ్ యార్డులో దాచి..
● పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ ● డంపింగ్యార్డులో వాహనాలు దాచిన ఘనుడు ● 10 బైక్లు, 8 గ్రాముల బంగారు గొలుసు స్వాధీనంటెక్కలి: టెక్కలి, కోటబొమ్మాళి, నందిగాం, మందస పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్రవాహనాలు, బంగారం దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్న ఒడిశా రాష్ట్రం, గంజాం జిల్లా, అస్కా బ్లాక్, కలశనాథపురం గ్రామానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ మేకల గణేష్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 10 ద్విచక్రవాహనాలు, 8 గ్రాముల బంగా రు గొలుసును స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు వెల్లడించారు. సీఐ ఎ.విజయ్కుమార్తో కలి సి శనివారం టెక్కలి పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. పోలీసుల వివరాలు ప్రకారం.. టెక్కలి జగతిమెట్ట వద్ద శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా, నిందితుడు మేకల గణేష్ తాను చోరీ చేసిన స్కూటీతో వస్తూ పట్టుబడ్డాడని, విచారణ చేయగా టెక్కలి శివారు ప్రాంతంలో లచ్చన్నపేట సమీపంలో డంపింగ్ యార్డులో కొన్ని ద్విచక్ర వాహనాలు దాచి పెట్టి అమ్మకానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో విచారణ చేయగా నిందితుడి వద్ద చోరీ చేసిన 10 బైక్లు, 8 గ్రాముల బంగారు గొలు సు ఉన్నట్లు తెలియడంతో వాటిని స్వాధీనం చేసు కుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఆయనతో పాటు చోరీలకు పాల్పడిన ఒడిశా రాష్ట్రం బుంజు నగర్కు చెందిన రావుల వినోద్ను ఇప్పటికే ఎచ్చెర్ల పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులను చేధించడంతో టెక్కలి సీఐ విజయ్కుమార్తో పాటు సిబ్బంది ఉమామహేశ్వరరావు, గోపాల్, లోకనాథం, చందు తదితరులు చాక చక్యంగా వ్యవహరించారని డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. -
మోగిన మాక్ సైరన్
అది రణస్థలం మండలం సరగడపేట గ్రామంలో శ్రేయాస్ ఇండస్ట్రీస్ ఆవరణ. సమయం శనివారం ఉదయం 11.30. పారిశ్రామిక ప్రాంతంలో క్లోరిన్ తరలిస్తున్న వాహనం బోల్తా పడి విషవాయువులు దట్టంగా వ్యాపిస్తున్నట్లు సైరన్ మోగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పసుపు పచ్చని మేఘంలా వాయువు విస్తరిస్తున్న తరుణంలో అప్పటికే సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రాణాలకు తెగించి రంగంలోనికి దిగాయి. విష వాయువులు పీల్చి అపస్మారక స్థితికి చేరుకున్న బాధితులను అంబులెన్సులో తరలించి సమీపం వైద్య శిబిరానికి తరలిస్తున్నారు. ఇదంతా మాక్డ్రిల్ అని పైడిభీమవరం పారిశ్రామికవాడలోని ఒక్క సరగడపేట గ్రామస్తులకు తప్పా మిగతా గ్రామాల ప్రజలకు తెలియకపోవడంతో ఉలిక్కిపడ్డారు. కొంతసేపటికి విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. కార్యక్రమంలో పరిశ్రమల సంయుక్త తనిఖీ అధికారి శివశంకర్, ఉప ముఖ్య తనిఖీ ఆధికారి బి.రాంబాబు, జిల్లా విపత్తు నిర్వహణ అధికారి రాము, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మోహనరావు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్లు, సత్యనారాయణ, చంద్రశేఖర్, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ గంగాధర్, ఏపీటోరియా హెచ్ఆర్ హెడ్ పి.ఎన్.రావు, సేఫ్టీ హెడ్ సంతోష్, శ్రేయాస్ సీఈవో మనోజ్ శ్రీవాస్తవ్, చీఫ్ సేప్టీ ఆఫీసర్ కన్నారావు, రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు. – రణస్థలం -
71 కేంద్రాలు.. 39,838 మంది విద్యార్థులు
● రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ● నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ● నో సెల్ఫోన్ జోన్లుగా పరీక్ష కేంద్రాలు శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు, కలెక్టర్ సూచనల మేరకు జిల్లా ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ నేతృత్వంలో డీఈసీ కమిటీ సభ్యులు బి.శ్యామ్సుందర్, ఎస్.భీమేశ్వరరావు, ఎస్.అన్నపూర్ణారావు ఇతర అధికా రులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్ల విషయ మై జిల్లా ఆర్ఐఓ సురేష్కుమార్ శనివారం సాయంత్రం సీఎస్లు, డీఓలతో మరోసారి వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. 9 గంటల తర్వాత నిమి షం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు అర్ధగంట ముందుగా చేరుకునేలా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రాలను రాష్ట్రప్రభుత్వం నో సెల్ఫోన్ జోన్లుగా ప్రకటించింది. విద్యార్థులతోపాటు ఇన్విజిలేటర్లు, సీఎస్లు, డీఓలు, కస్టోడియన్లు, స్క్వాడ్ లు, చివరకు తనిఖీలకు వచ్చే అధికారులు సైతం సెల్ఫోన్లు పరీక్ష కేంద్రం వెలుపలే ఉంచాలి. అవసరాల కోసం పరీక్ష కేంద్రానికి ఒకటి చొప్పున కీప్యాడ్ ఫోన్లను, సిమ్లను అధికారులు అందజేశారు. ఈ ఫోన్లు సీఎస్ల పర్యవేక్షణలో ఉండనున్నాయి. జిల్లా లో 71 కేంద్రాల్లో 39,838 మంది ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో ప్రథమ సంవత్స రం 19,850 మంది, ద్వితీయ సంవత్సరం 19,988 మంది ఉన్నారు. జిల్లాకు ఇప్పటికే మూడు సెట్లతో కూడిన ప్రశ్న పత్రాలు చేరగా.. వీటిని 31 స్టోరేజ్ పాయింట్లలో బందోబస్తు నడుమ భద్రపరిచారు. 1480 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. -
సరిహద్దు చెక్పోస్టు తనిఖీ
ఇచ్ఛాపురం: నిషేధిత పదార్థాల అక్రమ రవాణా జరగకుండా చూడాలని శ్రీకాకుళం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి డి. శ్రీకాంత్ రెడ్డి స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సిబ్బందికి సూచించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పురుషోత్తపురం చెక్పోస్ట్ని శ్రీకాకుళం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసులకు చార్జిషీట్లు వేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి పి.దుర్గాప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. -
రిటైర్డ్ సూపరింటెండెంట్పై విచారణ వాయిదా
అరసవల్లి:జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో పలు రకాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ విధుల నుంచి గతేడాది సస్పెండైన రిటైర్డ్ సూపరింటెండెంట్ భాస్కర్కుమార్పై విచారణ ప్రస్తుతానికి వాయిదా పడింది. జిల్లాలో ఏఎన్ఎంల బదిలీల అక్రమాలతో పాటు నకిలీ ఉద్యోగ నియామక పత్రాల జారీ, ఉద్యోగాలిప్పిస్తామంటూ అక్రమ వసూళ్లు తదితర ఆరోపణల కారణంగా ఈయనపై సస్పెన్షన్ అనంతర విచారణ చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. శనివారం ఉదయమే ఈ విచారణ జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఇదిలావుంటే సూపరింటెండెంట్ భాస్కరకుమార్ను పైఆరోపణల కారణంగా గత ఏడాది ఆగష్టు 2న విధుల నుంచి సస్పెండ్ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించిన నేపథ్యంలో వైద్యశాఖ రీజనల్ డైరక్టర్ నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎంతో కీలకమైన ఈ విచారణ జరగకుండా ఉండేలా జిల్లా వైద్యశాఖకు చెందిన కీలకాధికారులు తీవ్ర యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆఖరికి ఈ నెల 21న విచారణ జరిగే సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచుతూ జాగ్రత్త పడ్డారని తెలిసింది. ఎలాగోలా విచారణను తూతూమంత్రంగా ముగిస్తే అనుకూలంగా నివేదిక రాయించి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ మంజూరు అంశాల్లో భాస్కర్కుమార్కు వీలుగా ప్రయత్నాలు చేసేలా ప్రణాళికలు రచించినట్లు సమాచారం. దీని ఫలితంగా కొందరు జేబులు నింపుకొనే పనులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. భాస్కర్కుమార్పై శనివారం జరగాల్సిన విచారణ తాత్కాలికంగా వాయిదా పడిందని, తదుపరి తేదీ త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. -
మహిళలకు ఉచిత శిక్షణ తరగతులు
కంచిలి: కొల్లూరు పంచాయతీ పరిధి సిర్తలి గ్రామానికి చెందిన వివాహిత బొణికల విజయ అలియాస్ దివ్య మనస్తాపంతో శనివారం ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె భర్త వెంకటేష్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి 20వ తేదీ శుక్రవారం స్వగ్రామానికి వచ్చారు. మళ్లీ వారం రోజుల్లో తిరిగి దుబాయ్కి వెళ్లిపోతానని చెప్పడంతో దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. భర్త వలస వెళ్లడం ఇష్టం లేని భార్య ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకు న్నారు. వీరికి పదేళ్ల కుమారుడు భార్గవ్, ఏడేళ్ల కుమార్తె హనీ ఉన్నారు. బూరగాం గ్రామానికి చెందిన మృతురాలి దివ్య తండ్రి కప్ప శాంతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్ఛాపురం రూరల్: ఈదుపురం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు కాలిపోయింది. శనివారం ఉప్పాడ భారతమ్మ ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో తులంన్నర బంగారం, కుమారుడు విదేశాలకు వెళ్లేందుకు తెచ్చుకున్న రూ.లక్ష నగదు బీరువాలో ఉంచడంతో కాలిపోయాయని భారతమ్మ విలపించారు. ఈమె ఇంటికి ఇరువైపులా ఉన్న బర్ల ధర్మరాజు, ఉప్పాడ తారకేశుల ఇళ్లకు కూడా ప్రమాదం వాటిల్లింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.5లక్షలు ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. -
ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు జడ్జి జస్టిస్ హరినాథ్
అరసవల్లి/గార: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ కుటుంబసమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఈఓ కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు వేదమంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి హరిబాబు, ప్రోటోకాల్ న్యాయమూర్తి అనురాగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి హరినాథ్ నూనేపల్లి సతీసమేతంగా శనివారం దర్శించుకున్నారు. అర్చకులు లక్ష్మణాచార్యులు, మురళీకృష్ణమాచార్యులు క్షేత్ర వైభవాన్ని వివరించి స్వామి చిత్రపటాన్ని అందజేశారు. రసాయనం చోరీపై కేసు రణస్థలం: పైడిభీమవరం పారిశ్రామికవాడలోని ఆపీటోరియా పరిశ్రమలో ముగ్గురు వ్యక్తులు రూ.6 లక్షలు విలువైన ఇథైల్ అసిటేట్ రసాయన లిక్విడ్ దొంగిలించినట్లు పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేశారు. ఈ నెల 19న పూణే నుంచి వచ్చిన జూబిలెంట్ ఇంగ్రేవియా ట్యాంకర్ అన్లోడ్ అనంతరం తిరుగు వెళుతున్న సమయంలో మరో స్థలంలో 8235 కిలోల బరువు అద నంగా లోడ్ చేయడంతో ట్యాంకర్ తూకంలో వచ్చిన వ్యత్యాసం వచ్చింది. చోరీ జరిగినట్లు గుర్తించిన పరిశ్రమ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీవి దిగజారుడు రాజకీయాలు కొత్తూరు(పాతపట్నం): శాసనమండలి ప్రతిపక్ష నేత, సీనియర్ బీసీ నాయకుడు బొత్స సత్యనారాయణపై టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. శనివారం కొత్తూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన అగ్రనేత పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చూస్తుంటే, వారికి బీసీలంటే ఎంత చులకన భావం ఉందో అర్ధమవుతోందన్నారు. కూటమి నాయకులు అధికార మదంతో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగడం దారుణమన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ మద్దతుదారులు చేసిన దౌర్జన్యాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఆమెతో పాటు మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు సీహెచ్ సూర్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు జి.ఆనందరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అరసవల్లి: మన ఇళ్లతో పాటు పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా మూడో శనివారం సందర్భంగా డీఎంహెచ్వో కార్యాలయ ఆవరణలో చెత్తను శుభ్రం చేశారు. కార్యక్రమంలో డెమో విభాగాధికారి ఎర్రన్న, హెల్త్ ఎడ్యుకేటర్ విజయలక్ష్మి, మోహిని పాల్గొన్నారు. -
మేల్కోకపోతే ముప్పే!
● ముంచుకొస్తున్న వేసవి నీటిగండం ● కానరాని ముందస్తు ప్రణాళిక ● దయనీయంగా తాగునీటి వనరులు ● తీరప్రాంత గ్రామాల్లోనూ తప్పని ఎద్దడి హిరమండలం: ఈ ఏడాది సంక్రాంతి నుంచే ఎండలు మండ తున్నాయి. వేసవి ప్రారంభంలోనే చుక్కలు కనిపి స్తున్నాయి. అయినా యంత్రాంగం నుంచి ఆ స్థాయి లో సన్నద్ధత కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే పలుచోట్ల నీటి ఎద్దడి ప్రారంభమైంది. ముందస్తు చర్యలు తీసుకోకపోతే వేసవిలో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 3,129 గ్రామాలు ఉన్నాయి. చేతిపంపులు 16,210 ఉండగా.. సమగ్ర మంచినీటి పథకాలు 38, వాటర్ ట్యాంకులు 1280 ఉన్నాయి. నేరుగా పంపింగ్ చేసే పథకాలు 440 కొనసాగుతున్నాయి. అయితే వీటి నిర్వహణ సరిగ్గా లేదు. ఏటా వేసవి ముందస్తుగా క్రాష్ ప్రొగ్రాం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ తూతూమంత్రంగా చేపడుతున్నారన్న విమర్శలున్నాయి. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రాష్ ప్రొగ్రాం విజయవంతం కావాలంటే మండల, పంచాయతీ అధికారు ల మధ్య సరైన సమన్వయం ఉండాలి. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. భూ గర్భ జలాలు అడుగంటే సమయంలో ప్రత్యామ్నాయ మార్గా ల ద్వారా నీరందించే లా ఏర్పాట్లు చేయాలి. కానీ ఇంతవరకూ ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ మూడు నియోజకవర్గాల్లో.. జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు తాగునీరు అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.700 కోట్లతో ఉద్దానం సమగ్ర మంచినీటి పథకాన్ని నిర్మించింది. దాదాపు 95 శాతం పనులు పూర్తికాగా.. ట్రయల్ రన్ వేసి పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తున్నా ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం సేవలను పూర్తిగా అందుబాటులోకి తేలేకపోయారు. మరోవైపు ఫేజ్–2లో భాగంగా పాతపట్నం నియోజకవర్గానికి తాగునీరు అందిస్తామని చెప్పారు. ఆ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతు న్నాయి. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం పేరు తో ఈ మూడు నియోజకవర్గాల్లో తాగునీటి పథకా ల నిర్వహణపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. దీంతో ప్రజలకు వేసవిలో తాగునీటి ఇక్కట్లు తప్పేలా లేవు. వంశధార నది చెంతనే ఆనుకుని ఉన్న హిరమండలం మేజర్ పంచాయతీలో వేసవిలో ఎప్పుడూ నీటికి చింతే. సీజన్ ప్రారంభంలోనే ఇక్కడ దాహం కేకలు వినిపిస్తుంటాయి. ఇటీవలే స్థానికుల దాహార్తి తీర్చేందుకు పంచాయతీ యంత్రాంగం ప్రత్యేక తాగునీటి ట్యాంకర్ను ఏర్పాటుచేశారు. నది చెంతనే ఉండే హిరమండలంలోనే పరిస్థితి ఇలా ఉందంటే జిల్లా వ్యాప్తంగా ఎలా ఉండబోతోందో అర్ధం చేసుకోవచ్చు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా పటిష్ట చర్య లు చేపడుతున్నాం. క్రాష్ ప్రొగ్రాంలో భాగంగా తాగునీటి వనరులను బాగుచేయిస్తాం. ఇందు కు సంబంధించి ప్రణాళిక రూపొందించాం. ఈ విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – శంకరంబాబు, ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఎస్ఈ, శ్రీకాకుళం -
ద్విచక్ర వాహనాలు ఢీ.. తండ్రీకొడుకులకు గాయాలు
● యువకుల మితిమీరిన వేగమే కారణమని భావిస్తున్న పోలీసులు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని చంద్రమహాల్ సమీపంలో కర్ణాటక బ్యాంకు వద్ద శనివారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. రామలక్ష్మణ కూడలి నుంచి మితిమీరిన వేగంతో స్పోర్ట్ బైక్పై వస్తున్న ఇద్దరు యువకులు కుటుంబంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం రాచేరు గ్రామానికి చెందిన గంటా రమేష్ జిల్లాలో ఓ ఇంజినాయిల్ కంపెనీ సేల్స్ రిప్రజింటేటివ్గా పనిచేస్తున్నారు. నగరంలోని ఇందిరానగర్కాలనీలో భార్య, నాలుగేళ్ల కుమారుడు సుశాంత్తో కలిసి నివాసముంటున్నారు. శనివారం భార్య, కుమారుడితో కలిసి వ్యక్తిగత పనినిమిత్తం బయటకొచ్చి ఇంటికి బయల్దేరారు. కర్ణాటక బ్యాంకు వద్ద యూటర్న్ తీసుకుంటుండగా ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశంకు చెందిన సూరాడ అఖిల్, మహేష్లు రామలక్ష్మణకూడలి వైపు నుంచి స్పోర్ట్స్ బైక్పై వస్తూ ఢీకొట్టారు. ఈ ఘటనలో అందరూ చెల్లాచెదురుగా పడ్డారు. చిన్నారి సుశాంత్ తల, కాలికి, తండ్రి రమేష్ కాలికి గాయాలయ్యాయి. అఖిల్ స్పృహతప్పడంతో స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. ట్రాఫిక్ కూడా స్తంభించిడంతో ఎస్ఐ సుధాకర్ ఘటనా స్థలికి చేరి అంబులెన్సులో క్షతగాత్రులను నగరంలో ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ పేర్కొన్నారు. -
ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశా ఖ అధికారి ఎ.రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో గల 13 ఆదర్శ పాఠశాలలలో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఏ మండలంలో ఆదర్శ పాఠశాలలు కలవో ఆ పాఠశాలల్లోనే ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. 2025 – 26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత కలిగిన విద్యార్థులు www.cpe.ap. gov.inapmr.ap.gov.in వెబ్సైట్లో ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రవేశ రుసుం రూ.125 ఓసీ, బీసీ విద్యార్థులకు ప్రవేశ రుసుం రూ.200 చెల్లించాలన్నారు. జలుమూరు: శివరాత్రి ఉత్సవాలు అనంతరం శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ. 4,14,818 వచ్చిన ట్లు ఆలయ ఈఓ కె.ఏడుకొండలు శుక్రవారం తెలిపారు. ఇందులో ప్రత్యేక దర్శనం, కేశఖండన, హుండీవి కలిపి ఆదాయం లెక్కించినట్లు ఆయన తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ చైర్మన్ ప్రసాద్ పాడి, సిబ్బంది, అర్చకులు ఉన్నారు. మెళియాపుట్టి: మండలంలోని చాపర జిల్లా పరిషత్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న జ్ఞానసాయి ఉన్నత ప్రతిభ కనబరచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ శిక్షణకు ఎంపికయ్యాడు. ఎంఈఓలు దేవేంద్రరావు, పద్మనాభరావు విద్యార్థిని స్థానిక ఎమ్మార్సీలో శుక్రవారం సత్కరించారు. ఇటీవల అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ గండికోటలో నిర్వహించిన శిక్షణలో జ్ఞాన సాయి ప్రతిభ కనబరచడం సంతోషకరమని అన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉమ్మడి జిల్లాలోని టెక్కలి, రాజాం, శ్రీకాకుళం (ఎకై ్సజ్ కోర్టు) కేంద్రాల్లో ఖాళీగా ఉన్న రెండో తరగతి ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పోస్టుల భర్తీకి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఎంపికై న వారికి నెలకు రూ.45వేలు గౌరవ వేతనంతో పాటు రూ.5 వేలు వాహన భత్యం కలిపి మొత్తం రూ.50 వేలు వేతనంగా చెల్లించనున్నట్లు తెలిపారు. ఐదేళ్ల అనుభవం ఉన్న న్యాయవాదులు, రిటైర్డ్ జ్యుడీషియల్ అధికారులు గతంలో మేజిస్ట్రేట్ అధికారాలు నిర్వహించి లా డిగ్రీ కలిగిన వి శ్రాంత గెజిటెడ్ అధికారులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 45 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఆసక్తి ఉన్న వారు నిర్ణీత దరఖాస్తు ఫారమ్ను జిల్లా కోర్టు అధికారిక వెబ్సైట్ https://srikakulam. dcourts.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో జతపరిచి, మార్చి 17 సాయంత్రం 5 లోపు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, శ్రీకాకుళం వారికి రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలని కోరారు. -
సర్వేశా.. ప్రజలంటే అంత అలుసా.!
● భూమి రీ సర్వేకు శ్రీకారం చుట్టింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే ● అప్పుడే తొలి విడతలో జిల్లాలో 738 గ్రామాల్లో సర్వే పూర్తి ● నాడు సర్వేపై విషం కక్కిన కూటమి నాయకులు ● నేడు అదే సర్వేను తిరిగి ప్రారంభించిన వైనం శ్రీకాకుళం పాతబస్టాండ్: వైఎస్సార్ సీపీ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేను నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ఉన్నవి లేనివి చెప్పి విషం చిమ్మాయి. అనుకూల మీడియా అండతో అసత్యాలు ప్రచారం చేశా యి. ఇప్పుడు అధికారం దక్కాక.. అదే రీ సర్వేను తిరిగి ప్రారంభించారు. నాడు వైఎస్ జగన్ చేసినది మంచి పనేనని వారే ఇప్పుడు రుజువు చేశారు. నాటి ప్రభుత్వం సరఫరా చేసిన డ్రోన్లు, బేస్ స్టేషన్లు, సర్వే గణన విధానం, ఎల్పీఎం నంబర్లు వంటివి అన్నీ ఫాలో అయిపోతున్నారు. నాడు ఇవే విధానాల ను వ్యతిరేకించి నేడు అవే విధానాలను అవలంబిస్తుండడంతో వారి రెండు నాలుకల ధోరణి బయటపడింది. అధికారులు ఏమంటున్నారు..? జిల్లాలో భూముల రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని, వెబ్ల్యాండ్ రికార్డుల్లో ఉన్న వ్యత్యాసాలను తక్షణమే సరిదిద్దాలని, ప్రస్తుతం జిల్లాలో 4వ దశ రీ–సర్వే 167 గ్రామాల్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫిబ్రవరి 16 నాటికి 24 గ్రామాల్లో సర్వే పూర్తయింది. మిగిలిన 143 గ్రామాల్లో సర్వే పనులను చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 29,953 సర్వే నంబర్లలో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు.ఈ భూములు విస్తీర్ణం 7,709.22 ఎకరాలుగా ఉందని అంచనాలు వేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,74,941 ఎల్పీఎంలలో ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలో.. రాష్ట్రంలో దశాబ్దాలుగా భూములు సర్వేను నోచుకోలేదు. ఎన్నో ఏళ్లుగా భూ తగాదాలు నడుస్తున్నాయి. వీటిని చెక్ చెప్పాలనే ఉద్దేశంతో వైఎస్సార్ సీపీ భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టింది. రైతు మేలు చేయాలని ఎన్నో పథకా లు తీసుకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక భారం ఉన్నా రీ సర్వేను మొదలుపెట్టారు. అప్పట్లోనే 738 గ్రా మాల్లో సర్వే పూర్తి చేశారు. అధికారులకు శిక్షణ తో పాటు కావాల్సిన పరికరాలు అంటే డ్రోన్లు, కంప్యూటర్లు, బేస్ స్టేషన్లు, ఇతర పరికరాలు అందజేశారు. ఆధునిక విధానంలో సర్వే చేయించారు. జిల్లాలో మొత్తం 1465 రెవెన్యూ గ్రామా లు ఉండగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందుగానే 738 రెవెన్యూ గ్రామాల్లో విజయవంతంగా రీ సర్వే పూర్తి చేసింది. 2,54,216 పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా రైతులకు అందజేశారు. -
అందని సహకారం
●రాష్ట్ర వ్యాప్తంగా 36 జీఓ అమలు చేయాలి. ●2019–2024 పీఆర్సీ ఇవ్వాలి.. ఇవ్వలేని పక్షంలో 50 శాతం తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలి. ●రూ.2 లక్షలు గ్రాడ్యూటీ సీలింగ్ ఎత్తివేసి యాక్ట్ ప్రకారం గ్రాడ్యూటీ చెల్లించాలి. ●2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. ●ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 వరకు పెంచాలి. ●సంఘాలు లాభ, నష్టాలతో సంబంధం లేకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి. ●ఒక్కో ఉద్యోగికి రూ.5 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడంతో పాటు రూ.20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఇచ్ఛాపురం రూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో జిల్లాలో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఉన్న 49 పీఏసీఎస్ కార్యాలయాల కు తాళాలు వేయడంతో ప్రతిరోజూ జరిగే సుమారు రూ.6 కోట్ల లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జిల్లాలో ఉన్న వేలాది మంది రైతులు అప్పు లు, విత్తనాలు, ఎరువులు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలు మూతపడటంతో పంట పనులకు అవసరమైన రుణాలు నిలిచిపోయాయి. కష్ట కాలంలో రైతులకు అండగా ఉండే సహకార రంగమే ఇప్పుడు మూగబోయింది. సమ్మె కారణంగా రైతులు ప్రైవేటు దళారుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో అధిక వడ్డీలు, అదనపు భారాలు రైతులపై పడుతున్నాయి. జిల్లాలోని సొసైటీలో పనిచేస్తున్న 155 మంది రెగ్యులర్, 72 మంది పార్ట్టైమ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ నెల 16 నుంచి ఉద్యోగులు విధులకు రావడం లేదు. దీంతో సింగిల్ విండో కా ర్యాలయాలకు తాళాలు పడ్డాయి. ఒక్కో సొసైటీ లో రోజుకు రూ.10 లక్షలకు పైగా లావాదేవీలు జరుగుతుంటాయి. ఇలా రోజుకు రూ.5 కోట్లకు పైగా లావాదేవీలకు బ్రేక్ పడింది. ప్రధానంగా క్రాప్ రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు, రైతులకు ఎరువుల పంపిణీ, వరి ధాన్యం కొనుగోలు, రైతులు స్వల్పకాలిక పంట రుణాలు రెన్యువల్ తదితర సింగిల్ విండో కేంద్రంగానే సాగుతుంటాయి. సిబ్బంది సమ్మెకు దిగడంతో అన్ని పనులకు బ్రేక్ పడింది. సహకార బ్యాంకు ఉద్యోగుల సమస్యలు, న్యా యమైన డిమాండ్లు తీర్చాలంటూ గత ఏడాది డిసెంబర్ 6 నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే విజయవాడ, గుంటూరులో వంటావార్పు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో సోమవారం నుంచి పీఏసీఎస్ కార్యాలయాలకు తాళాలు వేసి నిరవధిక సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పటికీ ప్రభు త్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు వెళ్లేందుకు వెనుకాడబోము. . – గిరిబుచ్చి రంగనాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక సహకార కేంద్రం,శ్రీకాకుళం సమస్యలు ప్రభుత్వం తీర్చే వరకు సొసైటీ తాళాలు తీయడం కుదరదంటూ సి బ్బంది కార్యాలయాలకు తాళాలు వేశారు. అటు ప్రభుత్వం వీరి సమస్యలపై స్పందించడం లేదు. మధ్యలో రైతులు నలిగిపోతున్నారు. రైతు ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. – ఇసురు యాధవరెడ్డి, రైతు సంఘ నాయకుడు, ఇచ్ఛాపురం మండలం -
అపాసుపాలవుతున్నారా..?
శ్రీకాకుళం క్రైమ్ : అరసవల్లి రథసప్తమి సందర్భంగా జరిగిన నకిలీ పాసుల కుంభకోణం విచారణ నత్త నడకన సాగుతోంది. విచారణలో ఆరంభ శూరత్వం చూపి న పోలీసులు రాజకీయ పెద్దల ప్రమేయం తర్వాత దూకుడు పూర్తిగా తగ్గించి అభాసుపాలవుతున్నా రు. పదిరోజుల ముందు సీసీఎస్ స్టేషన్ నుంచి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు కేసు బదిలీ అయ్యాక దర్యాప్తులో పురోగతి ఏ మాత్రం లేదని,రాజకీయ పెద్దల హస్తం ఉండటంతోనే ప్రతిష్టాత్మక కేసులో పోలీసులు మౌనం వహిస్తున్నారని అంతా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం కేసును విచారిస్తున్న ఒకటో ప ట్టణ సీఐ పైడపునాయుడు ఇదే విషయమై ‘సాక్షి’ తో మాట్లాడుతూ కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లభించాకే దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని, ప్రస్తుతం విచారణ దశలోనే ఉందని వ్యాఖ్యానించారు. కొంతమంది కేటుగాళ్లు నకిలీ వీఐపీ, వీవీఐపీ పాసు లు ముద్రించారన్న సమాచారంతో రథసప్తమి మరుసటి రోజే ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులను సమగ్ర విచారణకు ఆదేశించారు. ఒక విధంగా చెప్పాలంటే మరెప్పుడూ ఇలాంటి పరిణామాలు జరగకూడదన్న కోణంలో నకిలీ పాసుల వ్యవహారంలో ఎవరు న్నా వదిలిపెట్టకూడదన్న ఆదేశాలు సైతం ఎస్పీ ఇచ్చారు. దీంతో వారం రోజుల్లోనే నకిలీ పాసు లు ముద్రించారన్న సమాచారం మేరకు పలు ప్రింటింగ్ ప్రెస్సులు, జిరాక్స్సెంటర్ల ప్రతినిధులు, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, రాజకీ య నేతల అనుచరులను స్టేషన్కు పిలిపించి విచారించారు. శ్రీకాకుళంతో పాటు విజయవాడ, రాజమండ్రి, విజయనగరంతో పాటు పలు ప్రాంతాలు వెళ్లి క్షుణ్ణంగా విచారణ జరిపారు. అనుమానితులుగా 13 మందిని గుర్తించిన పోలీసులు వారిలో ఏడుగురి పాత్రపై ఓ నిర్ధారణకు వచ్చారు. ఎవరి పాత్ర ఎంత వరకు ఉందో తెలియజేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక సైతం అందజేశారు. ఈ నెల 7న ఉన్నతాధికారుల ఆదేశాలతో సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసుల చేతిలో ఉన్న కేసును అకస్మాత్తుగా అరసవల్లి దేవాలయ పరిధిలోనున్న ఒకటో పట్టణ స్టేషన్కు బదిలీ చేయడం విస్మయానికి గురిచేసింది. రాజకీయ పెద్దల ఒత్తిళ్లతోనే ఉన్నతాధికారులు సైతం మౌనముద్రలోకి వెళ్లిపోయారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు 12 రోజులవుతున్నా ఇప్పటికీ కేసు విచారణలోనే ఉందని, సరైన క్లూ లభించడం లేదని పోలీసులు అంటున్నారు. పైన పేర్కొన్న అనుమానితులతో పాటు రాజకీయ నాయకుల పరోక్ష ప్రమేయం ఉండటంతోనే ఏమీ చేయలేని స్థితిలో పోలీసులున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పీఏసీఎస్ ఉద్యోగుల రిలే దీక్షలు
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీపీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాథ్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ పీఏసీఎస్ ఉద్యోగు లు తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఎన్ని సార్లు ప్రభుత్వాన్ని కోరినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. ధరలు విపరీతంగా పెరిగినా వేతనాలు పెంచలేదని అన్నారు. దీక్షల్లో ఏపీపీఏసీఎస్ ఉద్యోగుల ఉద్యోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి మెండ సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి సన్యాసిరావు, కనుగుల రమణ, జానకిరామ్, అధిక సంఖ్యలో ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
బంగారం లాంటి మనసు
శ్రీకాకుళం అర్బన్: ఒక చైన్, నాలుగు ఉంగరాలు, ఒక జత చెవి దుద్దులు.. అన్నీ బంగారంవే. మొత్తం కలిపి 5 తులాలు. పోయాయి అనుకున్న ఆభరణాలను ప్రయాణికుడికి సురక్షితంగా అప్పగించి ఆర్టీసీ సిబ్బంది తమ ‘బంగారం’ లాంటి మనసును చాటుకున్నారు. సంతబొమ్మాళి మండలం సీతానగరంనకు చెందిన గుడియా సంతోష్కుమార్ తన కు టుంబ సభ్యులతో సోంపేట నుంచి పలాసకు వెళ్లేందుకు విశాఖ వెళ్లే ఆర్టీసీ బస్సులో శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరారు. దారిలో పనిమీద కు టుంబ సభ్యులతో సహా హరిపురంలోనే దిగిపోయారు. ఆ హడావుడిలో బ్యాగ్ మర్చిపోయారు. కొంతదూరం వెళ్లాక బ్యాగు గుర్తుకు వచ్చింది. దీంతో బస్సులో టికెట్ నంబర్ ఆధారంగా డ్రైవర్ సంతోష్కు ఫోన్ చేసి బ్యాగు విషయం చెప్పారు. ఆయ న అప్రమత్తమై వెతకగా బ్యాగు దొరికింది. దీంతో బ్యాగ్ను భద్రపరచి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఎస్ఎం ఎంపీ రావునకు అందజేశారు. బ్యాగ్ పోగొ ట్టుకున్న గుడియా సంతోష్కుమార్ సాయంత్రం 5 గంటల సమయంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్కు వచ్చి ఎస్ఎం ఎంపీ రావును కలిశారు. బ్యాగ్లో ఉన్న వస్తువులు చెప్పారు. ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు కూడా చూపించారు. ఆ బ్యాగ్ సంతోష్కుమార్దేనని ఎస్ఎం ఎంపీ రావు నిర్ధారణ చేసుకుని ఆ బ్యాగ్ను ఆర్టీసీ సెక్యూరిటీ గార్డుల సమక్షంలో అందజేశారు. దీంతో గుడియా సంతోష్కుమార్ ఆ బస్ డ్రైవర్ బీవీఆర్ సంతోష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
25 ఎకరాల జీడితోట దగ్ధం
సారవకోట: కుమ్మరిగుంట రెవెన్యూ పరిధిలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పద్మాపురం గ్రామానికి చెందిన చౌదరి రత్నాలుకు చెందిన 25 ఎకరాల జీడి తోట దగ్ధమైంది. గ్రామ సమీపంలో ఉన్న సర్వే నంబర్ 143 కొండలో పోడు వ్యవసా యం ద్వారా జీడి సాగు చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో తోట నుంచి మంటలు రావడంతో స్థానికులు రత్నాలు కుమారుడు లక్ష్మినారాయణకు సమాచారమిచ్చారు. ఆయన కోటబొమ్మాళి అగ్నిమాపక కేంద్రానికి సమాచారమివ్వగా సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం జీడి మొక్కలు పిందె దశలో ఉన్నాయని, ఇటీవలే రూ. లక్ష వెచ్చించి తోటను అభివృద్ధి చేశామని, ఇంతలో దగ్ధమైనట్లు వాపోయారు. పంట నష్టం రూ.4 లక్షలు ఉంటుందని అగ్నిమాపక శాఖ సిబ్బంది నివేదిక ఇచ్చారు. -
బొత్సను హేళన చేయడం సరికాదు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): తూర్పుకాపుజాతి అభ్యుదయవాది, మాజీ మంత్రి, శాశన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణపై కిరాక్ ఆర్పీ అనే నటుడు వ్యక్తిగతంగా, వ్యంగంగా మాట్లాడిన విధానం ఆక్షేపనీయమని ఆలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ తీవ్రంగా ఖండించారు. జిల్లా తూర్పుకాపు సంక్షేమ సంఘం కార్యాలయంలో కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే శ్రీకాకుళం జిల్లా వేదికగా తూర్పుకాపుజాతి ఆత్మగౌరవ భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా తూర్పుకాపు జాతిని ఏకతాటిపైకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని సభ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న తూర్పుకాపుజాతి కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం నూతన కార్యాచరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కొబగాపు గౌతమ్ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాలకు, అన్ని మండలాలకు, నూతన కార్యవర్గాలను వెంటనే నియమించాలన్నారు. తూర్పుకాపుల్లో ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో సంఘం జాతీయ గౌరవాధ్యక్షుడు పతివాడ గిరీశ్వరరావు, జాతీయ కార్యదర్శి మామిడి విష్ణుమూర్తి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లుకలాపు సంతోష్, రాష్ట్ర కార్యదర్శి మత్స బుచ్చిబాబు, ఉద్యోగ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడవలస సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణానికి కృషి
పలాస : దేశంలో హిందూ బ్రాహ్మణీయ ఫాసిస్టు భూస్వామ్య సంస్కృతి పెచ్చుమీరుతోందని, దీనికి ప్రత్యామ్నాయంగా శ్రామికవర్గ సంస్కృతి, సాహిత్యం, కళలతో కూడిన విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణం జరగాలని, అందుకు అరుణోదయ సంస్థ కృషి చేయాలని సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ అన్నారు. పలాస మండలం బొడ్డపాడులో శుక్రవారం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. సొర్ర రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సన్నశెట్టి మాట్లాడుతూ అరుణోదయ కళాకారులకు దశ దిశాను నిర్దేశించారు. వివిధ ప్రజాసంఘాల నాయకులు వంకల మాధవరావు, తాండ్ర ప్రకాష్, మామిడి కోదండరావు, ఎం.వినోద్కుమా ర్, గొరకల బాలకృష్ణ, పోతనపల్లి కుసుమ, బదకల ఈశ్వరమ్మ, జుత్తు వీరాస్వామి తమ సందేశాలను వినిపించారు. జిల్లాలో ఎంతో మంది కళాకారులు ఉన్నారని, వారందరిని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ప్రజా కళలను ప్రజలపరం చేయాలని కోరా రు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సొర్ర రామారావు, ప్రధా న కార్యదర్శిగా కె.సోమేశ్వరరావు, కార్యదర్శిగా డి. సింహాచలం, కోశాధికారిగా బొమ్మాళి బాలకృష్ణ, మరో ఆరుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నా రు. సాంస్కృతిక ఉద్యమంలో అనుభవశాలి మా ర్పు మల్లేశ్వరరావును గౌరవ అధ్యక్షునిగా జనరల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రతిజ్ఞ అనంతరం గాయకులు విప్లవ గీతాలతో సమావేశాన్ని ఉత్తేజపరిచారు. -
మీ హాల్టికెట్.. మీరే డౌన్లోడ్ చేసుకోండి
● ఇంటర్బోర్డు వెబ్సైట్తోపాటు వాట్సాప్ ద్వారా పొందే సదుపాయం ● 2024లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం బృహత్తర ఆలోచనకు శ్రీకారం ● ప్రిన్సిపాల్ సంతకం, కళాశాల స్టాంప్ అవసరం లేదు ● 23 నుంచి మొదలుకానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలు శ్రీకాకుళం న్యూకాలనీ: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చి న సంస్కరణలు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఎంతగానో మేలు చేస్తున్నాయి. ఇంటర్ పబ్లిక్ పరీక్షల కు హాజరయ్యేందుకుగాను హాల్టికెట్లకు సంబంధించి తీసుకొచ్చిన బృహత్తర ఆలోచన ముఖ్యంగా కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల విద్యార్థులకు వరంలా మారింది. ఫీజు బకాయిల పేరుతో హాల్ టికెట్ ను కళాశాలల యాజమాన్యాలు నిరాకరించేందుకు వీల్లేకుండా విద్యార్థులే నేరుగా డౌన్లోడ్ చేసుకునే లా ఇంటర్మీడియెట్ బోర్డు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 23 నుంచి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 71 కేంద్రాలను ఏర్పాటు చేశా రు. ఈ పరీక్షలకు 39838 మంది విద్యార్ధులకు హాజరుకానున్నారు. కొన్నిచోట్ల ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్లను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు ఏటా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2024 మార్చిలో జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్షల కు సమయంలో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులే నేరుగా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పబ్లిక్ పరీక్షలకు హాజరుకావచ్చని ఆదేశించడంతో విద్యార్థులకు ఎంతగానో మేలు చేకూర్చింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆలోచనే ప్రస్తుత సర్కారు అమలు చేస్తుంది. విద్యార్థుల హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఉంచింది. ప్రథమ సంవత్సర విద్యార్థులు బీఐఈ.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో లాగిన్ అయి టెన్త్ హాల్ టిక్కెట్ నంబరును నమోదుచేస్తే ఇంటర్ హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెకెండియర్ విద్యార్థులు ప్రథమ సంవత్సర హాల్ టికెట్ నంబ రు, ఆధార్, పుట్టిన తేదీ వివరాలతో హాల్ టికెట్ పొందవచ్చు. ‘వాట్సాప్’ ద్వారా డౌన్లోడ్.. మనమిత్ర వాట్సాప్ ద్వారా సైతం విద్యార్థులు హాల్టికెట్లు పొందవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబరు 9552300009 కు ‘ఏజీ’ అని మెసే జ్ పంపడం ద్వారా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సంతకం లేదా.. నో ప్రాబ్లమ్! ఇంటర్బోర్డు వెబ్సైట్, వాట్సాప్ ద్వారా హాల్ టిక్కెట్లు పొందిన విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలతో పాటు పరీక్షల షెడ్యూల్, సబ్జెక్టుల వివరాలను సరి చూసుకోవాలి. దానిపై ప్రిన్సిపాల్ సంతకం, కళాశాల స్టాంప్ అవసరం లేకుండా నేరుగా పరీక్షలు రాసేందుకు హాజరు కావచ్చు. -
సమగ్ర శిక్షలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం: జిల్లా సమగ్ర శిక్షలో ఐఈ కో–ఆర్డినేటర్, అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఏపీసీ వేణుగోపాలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్గా ఐదు సంవత్సరాలు, లేనిపక్షంలో ఎస్జీటీలుగా ఎనిమిది సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి ఉండాలని, జనవరి 31 నాటికి 55 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. అన్ని పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తప్పనిసరని, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలన్నారు. ఐఈ కోఆర్డినేటర్ పోస్టుకు పీజీతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ కలిగి ఉండాలని చెప్పారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు ఫిబ్రవరి 23 నుంచి 25లోగా సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులు అందజేయవచ్చని చెప్పారు. దరఖాస్తులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు. నరసన్నపేట: చిక్కాలవలసకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ దంత అమృత్కుమార్ (41) గుండెపోటుతో మణి పూర్లో మరణించా రు.ఈయన 20 ఏళ్లుగా మణిపూర్లో జవాన్గా పనిచేస్తున్నారు. విధు లు నిర్వహించి ఇంటికి చేరిన తర్వాత శుక్రవా రం వేకువజామున గుండెపోటుకు గురై మరణించినట్లు తండ్రి సింహాచలం తెలిపారు. అమృత్కుమార్కు భార్య జీవిత, కుమారుడు అర్జున్, కుమార్తె అనన్య ఉన్నారు. శనివారం సాయంత్రానికి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంటుందని బంధువులు తెలిపారు. అమృత్కుమార్ మృతి పట్ల మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పోలాకి జెడ్పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణచైతన్య, ఎంపీపీ ఆరంగి మురళి, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. రణస్థలం: లావేరు మండలం చిన్నయ్యపేట గ్రామానికి చెందిన రెడ్డి రమణ(35) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రమణ భార్య అనారోగ్యంతో బాధపడుతున్నందున ఎచ్చెర్ల మండలం కుప్పిలి మెడికల్ షాపులో మందులు కొనేందుకు బయలుదేరాడు. ఇంతలో ఏం జరిగిందో గానీ లోపెంట పంచాయతీ కరగానిపేట దగ్గరలో రోడ్డుపై విగత జీవిగా పడి ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం 6.15 గంటల సమయంలో స్థానికులు గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రోడ్డుకు తల బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయాడు. తొలుత గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని భావించారు. కొద్ది దూరంలోనే తుప్పల్లో మరో బైక్ను గుర్తించారు. బైక్ స్టార్ట్ కాకపోవడంతో తుప్పల్లో పడేసి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. రమణకు భార్య వసంత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లావేరు ఎస్సై కె.అప్పలసూరి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
శ్రీకాకుళం : గార మండలం బందరువానిపేటకు చెందిన పల్లి పద్మశ్రీ అనే మహిళ గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె రిమ్స్ల చికిత్స పొందుతోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మశ్రీ రెండేళ్ల క్రితం కళింగపట్నంకు చెందిన పుట్నూరు కూర్మారావు వద్ద కొంత బంగారాన్ని కుదువు పెట్టింది. ఎనిమిది లక్షల రూపాయల వరకు బంగారంపై అప్పు తీసుకుంది. మూడు నెలల క్రితం బంగారం విడిపించేందుకు వెళ్లగా, తన వద్ద తాకట్టు పెట్టలేదని అనడంతో గ్రామ పెద్దలను వెంట తీసుకొని కూర్మారావు వద్దకు వెళ్లింది. ఈ సందర్భంగా కూర్మారావు మాట్లాడుతూ తనకు కొంత బంగారం తాకట్టు పెట్టిన మాట వాస్తవమేనని, అయితే దానికి సరిపడా నగదును పద్మశ్రీకి ఇచ్చేశానని చెప్పారు. దీంతో పద్మశ్రీ గార పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు న్యాయం చేయడం లేదన్న కారణంగా కూర్మారావు ఇంటిముందు బైఠాయించింది. అప్పటికి పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో 15 రోజుల క్రితం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగడం లేదని మనస్థాపం చెంది గురువారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు ఆమెను రిమ్స్కు తరలించగా వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఔట్పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి గార పోలీసులకు బదలాయించారు. వివాహిత ఆత్మహత్యాయత్నం పాతపట్నం: కాగువాడ గ్రామానికి చెందిన కర్ర నాగమణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గ్రామస్తులు 108కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ సిబ్బంది చేరుకుని బాధితురాలిని పాతపట్నం సీహెచ్సీకు తరలించారు. అప్పటికే తీవ్రంగా కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. భర్త కర్ర ఈశ్వరరావుతో తగాదాలే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. నాగమణికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ కె.మధుసూదనరావు తెలిపారు. పాతపట్నం: తమిళనాడు రాష్ట్రం చెన్నెకు చెందిన మణికంధన్ అక్రమంగా గంజాయి తరలిస్తుండగా శుక్రవారం అరెస్ట్ చేశామని ఎస్ఐ కె.మధుసూదనరావు తెలిపారు. పాతపట్నం అంతరాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నడుచుకుంటూ వస్తున్న మణికంధన్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశామని, అతని వద్ద 6 కిలోల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్న ట్లు చెప్పారు. ఒడిశా నుంచి పాతపట్నం మీదుగా బస్సుల్లో తమిళనాడు రాష్ట్రం చైన్నె మెరీనా బీచ్కు తరలించే ప్రయత్నంలో పట్టుబడ్డాడని పేర్కొన్నారు. ముద్దాయిని పాతపట్నం కోర్టులో హాజరుపరిచామని ఎస్ఐ తెలిపారు. -
అమ్మ మాటే బాటగా..!
ఇచ్ఛాపురం రూరల్/శ్రీకాకుళం కల్చరల్: ఎన్నో యాసలు.. మరెన్నో పలుకుబడులు.. మాటమాటలో తియ్యదనాలు.. ఇలా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మాతృభాష తెలుగు నేడు దయనీయ పరిస్థితికి చేరుకుంటోంది. మాటకై నా నోచుకోని భాషగా మిగిలిపోతోంది. దీనికి కారణాలు అనేకం. మళ్లీ మన భాష వికసించాలంటే, తెలుగు మాట పదిల పరుచుకోవాలంటే నేటితరానికి ‘తెలుగు నడక’ నేర్పాలి. అమ్మ పదానికి స్వేచ్ఛ కావాలి. ఇందుకోసం జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలు, కవులు, రచయితలు నడుంబిగించారు. తమవంతుగా మాతృ భాష అభివృద్ధికి కృషి చేస్తున్నారు. జిల్లాలో ఎందరో రచయితలు, కవులు, కళాకారులు సిక్కోలు సాహిత్యాన్ని, మాండలికాన్ని తమ కథలు, కవితలు, గజల్స్, పాటల రూపంలో ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. అందులో తెలుగు భాషకు, తెలుగు జాతికి వెలుగు దీపికలై ప్రకాశించిన అతికొద్ది మందిలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి. తెలుగు ప్రజలంతా కలసి ఉండాలని తపిస్తూ తన జీవిత పర్యంతమూ పోరాడిన ధీశాలి. ●‘మాకొద్తీ తెల్ల దొరతనం’ అంటూ సత్యాగ్రహాల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి ‘‘దండాలు దండాలు భారత మాత’’ అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చుసిన కవి గరిమెళ్ల సత్యనారాయణ. నరసన్నపేట దగ్గర్లోని గోనెపాడుకు చెందిన గరిమెళ్ల పరాయి పీడనకు, పాలనకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడి స్పేచ్ఛ, విముక్తి కోసం కలం పట్టి, గళమెత్తిన వ్యక్తి. ●తెలుగు కథా సాహిత్యంలో కాళీపట్నం రామారావు(కారా) మాస్టారుది ఓ ఒరవడి. సరళ భాషా రచయితగా, కథకుడిగా, విమర్శకుడిగా ఆయన శైలి విభిన్నంగా ఉండేది. ఆయన రాసిన ‘యజ్ఞం’ కథకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సిక్కోలు కథా ‘యజ్ఞాన్ని’ సాగించిన కారా మాస్టారు కథ కోసం కథా నిలయాన్నే స్థాపించారు. ●పొందూరుకు చెందిన వాండ్రంగి రామారావు(భావశ్రీ) తెలుగు సినీ రచయితగా, కవిగా, వక్తగా, వ్యాఖ్యాతగా, ఆకాశవాణి ప్రసంగికుడుగా సుపరిచితులు. ‘తెలుగుజాతి నాది’, ‘తెలుగు సంస్కృతి నాది’, ‘నాకు అనేక భాషలు వచ్చినప్పటికీ నేను తెలుగు కవినే’ అని చెప్పేవారు. వీరితో పాటు ఎం.సత్యనారాయణమూర్తి, డాక్టర్ ఎం.వి.రమణారావు, తెప్పల కృష్ణమూర్తి, వాండ్రంగి కొండలరావు, భోగెల ఉమామహేశ్వరరావు, పులఖండం శ్రీనివాసరావు, భమిడిపాటి గౌరీశంకర్, వంటి వారు ఎంతో మంది భాషాభివృద్ధికి కృషి చేశారు. సాహిత్య సంస్థలు.. సాహితీ సంపదకు నిలయమైన శ్రీకాకుళం జిల్లాలో అనేక సంఘాలు, సాహితీ సంస్థలు కొలువుదీరాయి. తెలుగు రచయితల వేదిక(తెరవే), విశ్వసాహితీ, అభ్యుదయ రచయితల వేదిక, సుమిత్ర కళా సమితీ, రాజాం రచయితల వేదిక, అభ్యుదయ రచయితల సంఘం(అరసం), జనజాగృతి సాహితీ సంస్థ, లలిత కళా రంజనీ సంఘం, శ్రీశ్రీ కళావేదిక, ఈవేమన కవితా నిలయం. సాహితీ స్రవంతి, భారతీ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ, సాహితీ కిరణాలు, కళింగసీమ సాహిత్య సంస్థ, గిడుగు రామ్మూర్తి జానపద కళాపీఠం, ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదికలు తెలుగు భాష కోసం తమ వంతు కృషి చేస్తున్నాయి. ఈ సంస్థలు కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, సమావేశాలు, సాహిత్య గోష్టిలతో తెలుగు వెలుగులు నింపుతున్నాయి. శతాధిక కవులున్న సిక్కోలులో కవిత, పద్యం, కథ, మణిపూసలు, గేయాలు, వ్యాసాలు తదితర ప్రక్రియలో తమదైన శైలిలో రచనలు చేయడంతో పాటుగా పుస్తకాలు ముద్రిస్తూ రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుతున్నారు. గిడుగు రామ్మూర్తి తెలుగు భాష జానపథ కళాపీటం నెలకొల్పి ఏటా జాతీయ సాహితీవేత్తలను పరిచయం చేస్తూ వారిచే కవి సమ్మేళనం, తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నాం. సిక్కోలు మాండలికంతో ఉత్తరాంధ్ర జానపథ కళలు, కళింగాంధ్ర జానపథ గేయాలు పుస్తక రూపంలో తెస్తున్నాం. –బద్రి కూర్మారావు, రచయిత, రంగోయి, పలాస విద్యాలయాల్లో బాలబాలికలందరికీ పెద్దబాలశిక్ష పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాలి. వాటిని చదివించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలి. గతంలో ఆర్టీసీ బస్సులపై తెలుగు భాషకు సంబంధించిన నినాదాలు కనిపించేవి. ఇప్పుడు లేవు. తిరిగి వాటిని రాయించాలి. – వాండ్రంగి కొండలరావు, నామ విజ్ఞానవేత్త, పొందూరు


