breaking news
Srikakulam District Latest News
-
కన్నబాబుకు మాజీ స్పీకర్ తమ్మినేని పరామర్శ
ఆమదాలవలస: మాజీ మంత్రి కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ ఇటీవల మృతి చెందారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం సోమవారం కాకినాడలోని కన్నబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మృతితో కుటుంబానికి మాత్రమే కాకుండా, పరిసర ప్రాంతాలకు కూడా తీరని లోటు ఏర్పడిందన్నారు. పరామర్శలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, పార్టీ కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, రాష్ట్ర ఇంటిలెక్చువల్ కార్యదర్శి రామకృష్ణరావు, జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావు, రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శి అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, రణస్థలం ఎంపీపీ పిన్నింటి సాయి, బూర్జ ఎంపీపీ కర్నేన నాగేశ్వరరావు, బూర్జ జెడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, టెక్కలి వైఎస్సార్సీపీ నాయకులు, న్యాయవాది సింగుపురం మోహనరావు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ముత్తా విజయ్, బొడ్డేపల్లి నారాయణరావు, జల్లు బలరాం నాయుడు, చింతాడ సూర్యనారాయణ, గుమ్మడి రాంబాబు, పొందూరు మండల నాయకులు పప్పల రమేష్, మామిడి కిరణ్, మామిడి శ్రీను, బెండి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ గ్రీవెన్స్కు 64 వినతులు
కవిటి: జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు ఫిర్యాదు చేస్తున్న నారాయణస్వామి ఆక్రమణలపై చర్యలు తీసుకోండి కవిటి: మండలంలోని గొర్లెపాడు పంచాయతీలో భూ ఆక్రమణలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ భూముల్ని రక్షించే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సాలిన నారాయణస్వామి కోరారు. ఈ మేరకు కలెక్టర్ గ్రీవెన్స్లో సోమవారం ఫిర్యాదు చేశారు. గొర్లెపాడు పంచాయతీ పరిధిలోని చాలా వరకు ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, సంతలు ఆక్రమణలకు గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఒక ఆర్మీ జవాన్ భూములు కూడా అన్యాక్రాంతం అయినట్లు పేర్కొన్నారు. ఆక్రమణకు గురైన భూములపై గతంలో ఎన్నోసార్లు అధికారులకు తెలియజేసినప్పటికీ, ఎటువంటి చర్యలను చేపట్టడం లేదని తెలియజేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సరైన న్యాయం చేయలేని పక్షంలో ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. వాస్తవానికి ఇదే భూ ఆక్రమణలపై గతంలో సాక్షి పత్రికలో సైతం కథనాలు వెలువడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ దృష్టికి తీసుకొచ్చారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా పలు శాఖలకు చెందిన అధికారులు మొత్తం 64 ఫిర్యాదులు స్వీకరించారు. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 21, సెర్ప్కు 13, పంచాయతీరాజ్, విద్యుత్ పంపిణీ సంస్థలకు తలో 5, నీటి వనరులకు 3, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖలకు తలో 2 చొప్పున ఫిర్యాదులు అందాయి. మిగతా శాఖలకు ఒక్కొక్క ఫిర్యాదు చొప్పున నమోదైంది. ఈ పీజీఆర్ఎస్లో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పలు వినతులు పరిశీలిస్తే... రాష్ట్ర ప్రభుత్వం మండలాల పునర్విభజన చేయనున్న నేపథ్యంలో లావేరు మండలం మురపాక గ్రామం మండల కేంద్రంగా ప్రత్యేక మండలాన్ని ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశారు. అలాగే లావేరు మండలం బుడుమూరు గ్రామానికి చెందిన ప్రజలు కూడా పీజీఆర్ఎస్లో బుడుమూరు మండల కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని వినతి అందజేశారు. నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన బడ్డి జోగారావు శతశాతం దివ్యాంగుడు. దీంతో ఆయనకు రూ.15 వేల పింఛను ఇప్పించాలని కోరారు. అలాగే రణస్థలం మండలానికి చెందిన దివ్యాంగుడు కొయ్య దుర్గాప్రసాద్ తనకు పింఛన్ ఇప్పించాలని కోరారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ తెలప్పరేడు వద్ద రహదారిపై మద్యం షాపును ఏర్పాటు చేశారు. ఈ షాపు వలన స్థానికులకు ఇబ్బందులు వస్తున్నాయని, అక్కడ నుంచి వేరే చోటుకు ఈ మద్యం షాపును తొలగించాలని ఆ గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, గోవిందరావు తదితరులు కోరారు. శ్రీకాకుళం మండలం బలగ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్–1లో సబ్ డివిజన్1, 4ల్లో ఉన్న ప్రభుత్వ భూమి వరదగట్టు (కోనేరు) దురాక్రమణలకు గురైందని, స్థానిక వీఆర్వో, సచివాలయం సర్వేయర్ కలిసి మండల రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ గ్రామానికి చెందిన బోనెల చిరంజీవి ఫిర్యాదు చేశారు. -
సెల్ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం
● ప్రేమ పెళ్లికి నిరాకరించినట్లు ఆవేదన శ్రీకాకుళం క్రైమ్: పెళ్లికి యువతి నిరాకరించిందనే కారణంతో ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు సెల్ఫోన్ టవర్ ఎక్కిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం వేకువజామున 3.30 గంటల సమయంలో శ్రీకాకుళం నగరంలోని పాత దీప మహాల్ సమీప టవర్ మీదకు ఒక యువకుడు అవలీలగా ఎక్కాడు. ఉదయమయ్యేసరికి అటుగా వెళ్లే ప్రజలు గమనించారు. ల్యాప్టాప్ పట్టుకుని సిగ్నల్స్ దొరకక అక్కడ కూర్చుని ఉన్నాడని అనుకున్నారు. అయితే ఎంతకీ దిగకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటాడేమోనన్న ఆందోళనతో ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణకు సమాచారమిచ్చారు. సరిగ్గా ఉదయం 8 గంటలకు అగ్నిమాపక కార్యాలయానికి కూడా కాల్ వెళ్లింది. అంతే క్షణాల్లో ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 8.45 గంటలకు ఎస్ఐ హరికృష్ణ చొరవతో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ పూర్తి చేసి యువకుడిని కిందికి దించగలిగారు. ఇదీ విషయం... పొందూరు మండలంలోని కింతలి గ్రామానికి చెందిన విభూది శివకుమార్ (30) అనే యువకుడు ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్కు చెందిన ఒక యువతిని గత ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాని.. ప్రేమకు అంగీకరించిన యువతి వివాహానికి నిరాకరించిందని పోలీసుల వద్ద చెప్పాడు. దీనికి కారణం వారి పెద్దలేనని.. భరించలేకే ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని పేర్కొన్నాడు. ఈ ఘటనపై ఎస్ఐ ఎం.హరికృష్ణ మాట్లాడుతూ గ్రామ పెద్దలు, తల్లిదండ్రుల సమక్షంలో చట్ట పరిధిలో ఇటువంటి వ్యవహారం పరిష్కరించుకోవాలని సూచించారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే చట్టప్రకారం తాము న్యాయం చేస్తామని యువకుడికి హామీ ఇచ్చి రిమ్స్కు పంపించారు. జిల్లా అగ్నిమాపక సహాయాధికారి శ్రీనుబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
పెళ్లీడొచ్చింది... లక్ష్యం ఏమైంది..!
● నిరుపయోగంగా బాలికా సంరక్షణ పథకం ● బాండ్లు ఉన్నా నిధులు అందని వైనం ● మార్గదర్శకాలు లేకపోవడంతో అధికారుల మౌనం హిరమండలం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టిన బాలికా సంరక్షణ పథకం అమలుపై అయోమయం నెలకొంది. బాలికల తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు అప్పట్లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఎవరికై నా బాలిక ఉంటే వారికి పాసుపుస్తకం జారీ చేసి 21 ఏళ్లు నిండాక నగదు చెల్లించాలని పథకంలో భాగంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేసి పేద కుటుంబంలో ఒక్కరే బాలిక ఉంటే 20 ఏళ్లు వచ్చిన తర్వాత వివాహ ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఇస్తామని, ఇద్దరుంటే ఒక్కొక్కరికీ రూ.30 వేలు చొప్పున అందజేస్తామని ప్రకటించింది. అందుకుగాను అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అర్హులను ఎంపిక చేసి ఎల్ఐసీ బాండ్లు జారీ చేసింది. అయితే నిబంధనల మేరకు పేర్లు నమోదు చేసుకుని అప్పట్లో బాండ్లు పొందినవారికి, ప్రస్తుతం 20 ఏళ్లు పూర్తవుతున్నా నేటికీ డబ్బులు అందకపోవడంతో పలువురు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆది నుంచి గందరగోళమే ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన ఈ పథకం పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఈ పథకం అమలు తీరు ప్రారంభం నుంచి అయోమయంగానే ఉండేది. బాండ్లు జారీ అయ్యాక తొలుత లబ్ధిదారులు ఎవరికి వారే డౌన్లోడ్ చేసుకోవాలని ఆదేశించారు. కొన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో మాత్రమే ఈ ప్రక్రియ జరిగింది. బాండ్లు అందడంలో పలు ఆటంకాలు ఏర్పడ్డాయి. 2005 నుంచి 2007 సంవత్సరాల్లో బాండ్లు పొందిన 4,880 మందికి మెచ్యూరిటీ తేదీ పూర్తయ్యి చాలాకాలమవుతున్నా ఇప్పటికీ స్పష్టత లేదు. ఎల్ఐసీ జారీ చేసిన బాండ్లును నగదుగా ఎలా మార్చుకోవాలో ఎవరికీ తెలియక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 2007 తర్వాత ఈ పథకం గురించి సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో లబ్ధిదారులకు ఎలా బదులివ్వాలనేది అధికారులకూ తెలియడం లేదు. లబ్ధిదారులు బాండ్లును ఎలా పొందాలో ప్రాజెక్టుల వారీగా తెలియజేస్తాం. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గడువు ముగిసిన బాండ్లును నగదుగా ఎలా మార్చుకోవాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – ఐ.విమల, ఐసీడీఎస్ పీడీ శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 41,821 మందిని అర్హులుగా అప్పట్లో అధికారులు గుర్తించారు. వీరిలో 26,935 మందికి గతంలో బాండ్లు అందించినట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో చాలామంది లబ్ధిదారుల ఆడపిల్లలు ఇప్పుడు పెళ్లీడుకొచ్చారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట ఉన్నబాండ్ పత్రాలు తీసుకుని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదిస్తున్నారు. అయినా వారి నుంచి సరైన సమాధానం ఉండటం లేదు. డబ్బులు చెల్లింపునకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని చెబుతున్నారు. -
ఆక్రమణల చెరలో ‘పోర్టుల్యాండ్’..?
● పట్టనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ సిబ్బంది ● గాలికొదిలేసిన పోర్టు అథారిటీపోలాకి: ఒకప్పుడు వెలుగు వెలిగిన కళింగపట్నం ఓడరేవు ఆ తర్వాత కాలంలో నౌకల రవాణా నిలిచిపోవడంతో సదరు ఓడరేవుకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మండలంలో ప్రస్తుతం నిరుపయోగంగా కేవలం రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే మిగిలిపోయిన పోర్ట్ల్యాండ్పై కొందరి కన్నుపడింది. అంపలాం పంచాయతీ పరిధి నందిగాం రెవెన్యూలో సర్వే నంబర్–77లో 31.45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూములు ఇప్పుడు విలువైనవిగా మారడంతో కొందరు పెద్దలు అక్కడ గ్రద్దల అవతారం ఎత్తారు. గతంలో టీడీపీ హయాంలో(2014–19 మధ్యలో) అక్కడ మత్స్యకారుల విశ్రాంతి భవనం, వలలు, చేపలు నిల్వ గోదాముల నిర్మాణం చేపట్టిన సందర్భంలో సైతం పోర్టు అథారిటీస్ నుంచి ఎలాంటి క్లియరెన్స్లు ఇవ్వకపోయినా, అప్పటి నాయకత్వం ముందుకు వెళ్లడం వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా గత నాలుగేళ్ల నుంచి ఈ భూముల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు సైతం నిర్వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. వేరే ప్రభుత్వ సర్వే నంబరుతో వర్క్ ఐడీ క్రియేట్ చేసి పోర్టు భూముల్లో ఉపాధి పనులు చేపడుతూ ప్రజావేదిక ఆడిటింగ్ సమయంలో మేనేజ్ చేస్తూ వస్తున్నారన్న ఆరోపణలు వున్నాయి. హక్కులు కల్పించాలని వినతి పోర్ట్ల్యాండ్ మొత్తం తమకే చెందుతుందని హక్కులు కల్పించాలని కోరుతూ ఇటీవల ఒక వ్యక్తి పోలాకి రెవెన్యూ కార్యాలయానికి వినతిపత్రం అందించిన నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. వినతి పత్రం వెనుక ఉన్నది ఎవరు అనే విషయంపై కూటమి పార్టీల నాయకుల్లో అంతర్గత చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మరోపక్క పోర్టు భూముల్లో ఇప్పటికే ప్రైవేటు కార్యకలాపాలు జరుగుతున్నాయని సర్వే నిర్వహించి భూముల వివరాలు, వాస్తవ విస్తీర్ణంపై హద్దులతో సైతం ప్రజలకు తెలియజేయాలని మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ సిబ్బంది మాత్రం ఆక్రమణలపై ఎందుకో నిద్ర నటిస్తోంది. మరోపక్క తమ హక్కులను సైతం పోర్టు అథారిటీస్ గాలికొదిలేసింది. కనీసం తమ భూముల్లో ఫెన్సింగ్ వేసి భవిష్యత్ అవసరాలకు వినియోగించుకునే ఆలోచన కూడా చేయడం లేదు. ఇదే కొనసాగితే రూ.కోట్లు విలువ చేసే పోర్టుల్యాండ్లో అక్రమార్కులు లంగరు వేసే పరిస్థితి మరెంత దూరంలో లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో పోర్టుల్యాండ్ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. నందిగాం రెవెన్యూలో ఎస్ఎల్ఆర్లో ఫోర్టు అథారిటీస్కు 31.45 ఎకరాల భూములు ఉన్నట్లు వివరాలు ఉన్నాయి. ఆక్రమణలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. పోర్టు అథారిటీస్ వారు వచ్చి హద్దులు కోరితే చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. – పి.శ్రీనివాసరావు, తహసీల్దార్, పోలాకి -
పఽథకం ప్రకారమే రాజశేఖర్ హత్య
● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ● ఆగస్టులో కత్తి కొనుగోలు చేసిన నిందితుడుజి.సిగడాం: స్నేహితుడి చేతిలో గత నెల 24న హత్యకు గురై, చికిత్స పొందుతూ గెడ్డకంచరాం గ్రామానికి చెందిన పుక్కళ్ల రాజశేఖర్ మృతి చెందిన కేసులో ముద్దాయి దమరసింగి గొల్లబాబు అలియాస్ శంకర్ను పోలీసులు సోమవారం అరెస్టు చేసి పొందూరు కోర్టుకు తరలించారు. ముద్దాయికి రిమాండ్ నిమిత్తం శ్రీకాకుళం జైలుకు తరలించారు. స్థానిక పోలీసుస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఆర్పురం సీఐ ఎం.అవతారం కేసు వివరాలు వెల్లడించారు. ఇంటి నుంచి కత్తి తీసుకొచ్చి మండలంలోని గెడ్డకంచరాం – బాతువ కూడలి వద్ద పుక్కళ్ల రాజశేఖర్ (35)ను గొబ్బూరు గ్రామానికి చెందిన దమరసింగి గొల్లబాబు(శంకర్) పథకం ప్రకారమే హత్య చేశాడని సీఐ తెలిపారు. గెడ్డ కంచరాం గ్రామంలో తోటి స్నేహితుడు మేసీ్త్ర అప్పన్న ఇంట్లో ఒక శుభ కార్యానికి రాజశేఖర్, శంకర్ అనే వ్యక్తితో కలిసి వెళ్లాడు. అక్కడ స్నేహితుడు ఇచ్చిన మద్యం సేవించారు. ముద్దాయి గొల్లబాబు ఆలస్యంగా వెళ్లి మద్యం అడగగా.. వారు అప్పటికే మద్యం అంతా తాగేశామని చెప్పడంతో మద్యం విషయంలో ఇద్దరూ గొడవకు దిగారు. ఈ గొడవను అవకాశంగా తీసుకుని ముద్దాయి శంకర్ తన ఇంటి వద్ద భద్రపరుచుకున్న కత్తిని తీసుకొచ్చి రాజశేఖర్కు ఫోన్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేయకపోవడంతో లక్ష్మణ్ అనే వ్యక్తికి ఫోన్చేసి రాజశేఖర్ ఎక్కడ ఉన్నాడని అడిగాడు. అయితే గొడవలు వద్దని లక్ష్మణ్ సూచించాడు. అనంతరం మృతుడు రాజశేఖర్, లక్ష్మణలు నడిచి వస్తుండగా గెడ్డకంచరాం గ్రామ కూడలి వద్ద మృతుడు రాజశేఖర్, ముద్దాయి గొల్లబాబు ఘర్షణ పడ్డారు. ఈ సమయంలో రాజశేఖర్ కడుపులో పదునైన కత్తితో గొల్లబాబు పొడిచాడు. దీంతో వెంటనే లక్ష్మణ్ తన బైక్తో జి.సిగడాం ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో శ్రీకాకళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆగస్టు 25న మృతి చెందాడు. మృతుడు భార్య హరిప్రియ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మారణాయుధాలు స్వాధీనం మృతుడు రాజశేఖర్తో గత కొన్ని రోజులుగా ముద్దాయి శంకర్కు గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆగస్టు నెలలోనే హత్య చేసేందుకు ఆన్లైన్ ద్వారా పదునైన కత్తిని కొనుగోలు చేశాడు. దీంతో హత్యకు ఉపయోగించిన కత్తిని ఎస్ఐ మధుసూదనరావు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది సహకారంతో ముద్దాయి ఇంటి చుట్టూ తనికీ చేశారు. హత్య జరిగిన వారం రోజుల్లోనే ముద్దాయితో పాటు ఆయుధాలను సేకరించి, సోమవారం అరెస్టు చేసి కోర్టులో హజరు పరచడంపై జేఆర్పురం సీఐ ఎం.అవతారం జి.సిగడాం ఎస్ఐ వై.మధుసూదనరావును అభినందించారు. -
మంచం పట్టిన చింతలగార
టెక్కలి రూరల్: మండలంలోని చింతలగార గ్రామంలో గత కొద్ది రోజులుగా జ్వరాలు విజృంభి స్తున్నాయి. గ్రామంలో సుమారు 30 మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. అందువల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని చెబుతున్నారు. గ్రామవాసులు టెక్కలి ప్రభుత్వాస్పత్రితో పాటు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రోగులతో కిటకిట టెక్కలి: ప్రస్తుతం వ్యాధులు ముసురుతున్న నేపథ్యంలో టెక్కలి జిల్లా ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. మరో వైపు గ్రామాల్లో సరైన ఫీవర్ సర్వే లు లేకపోవడంతో ప్రతి ఇంట్లో జ్వర పీడితులు అవస్థలు పడుతున్నారు. టెక్కలి జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం రోజుకు 500 కు పైగా ఓపీ నమోదు కాగా వాటిలో సగానికి పైగా జ్వర పీడితులు ఉండడం గమనార్హం. జ్వరాల బారిన పడినవారిలో అధిక సంఖ్యలో పీడితులు ప్రైవేట్ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. -
నిరంకుశం
● ఎరువు అడిగితే దరువు! నిజం చెబితే నిర్బంధం.. నినాదం వినిపిస్తే నిరంకుశత్వం.. హామీలు గుర్తు చేస్తే ఆంక్షలు.. కూటమి ప్రభుత్వపు తీరు ఇది. గుండెలు అవిసేలా అన్నదాతలు ఎరువుల కోసం అడుగుతుంటే సర్కారు చెవికెక్కడం లేదు. ఎండనక, వాననక గంటల తరబడి క్యూలో రైతులు నిలబడుతుంటే ప్రభుత్వం కంటికి కనిపించడం లేదు. ఆఖరికి రైతు సమస్యపై వినతి పత్రం ఇస్తామన్నా.. తీసుకోవడానికి కూడా పాలకులకు మనస్కరించడం లేదు. ఎరువుల కొరతపై సోమవారం రైతులతో కలిసి వైఎస్సార్సీపీ నాయకులు చేపట్టిన ఆందోళనను ప్రభుత్వం ఖాకీల సాయంతో అణచివేయాలనుకుంది.అన్నదాతపై సర్కారుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరించింది. రైతుల కోసం శాంతియుతంగా నిరసన తెలియజేద్దామని వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులను నిర్దాక్షిణ్యంగా అడ్డుకుంది. హౌస్ అరెస్టులు, ఎక్కడికక్కడ అడ్డుకోవడం, అరెస్టులు చేసి పోలీసు స్టేషన్ల కు తరలిస్తూ ప్రశ్నించే హక్కును కాలరాసింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్సార్సీపీ రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. మొద్దునిద్ర లో ఉన్న ప్రభుత్వం దిగి రావాలని, యూరియాతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అన్ని రకాలుగా విఫలమైన వ్యవసా య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. మడపాంలో దాసన్నకు అడ్డగింత మడపాం టోల్గేట్ దగ్గర పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్తో పాటు వస్తున్న నరసన్నపేట నియోజకవర్గ కేడర్ను పోలీసులు అడ్డుకున్నారు. రైతుల పక్షాన నిలబడటానికి స్వేచ్ఛ లేదా అంటూ ధర్మాన కృష్ణదాస్ గట్టిగా అడగడంతో ఆయన వెహికల్ మాత్రమే వదిలారు. మిగతా వారికి ఆంక్షలతో అడ్డుకట్ట వేశారు. రోడ్డుపై కిరణ్ బైఠాయింపు రణస్థలంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్తో పాటు నియోజకవర్గ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళంలో జరిగే నిరసన కార్య క్రమానికి వెళ్లవద్దని ఆంక్షలు విధించారు. రైతుల సమస్యలపై నిరసన చేస్తుంటే అడ్డుకోవడమేంటని గొర్లె కిరణ్కుమార్ ప్రతిఘటించినా పోలీసులు వదల్లేదు. దీంతో రహదారిపైనే కేడర్తో కలిసి బైఠాయించారు. ఆమదాలవలసలో ఉద్రిక్తత.. నిరసన కార్యక్రమానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ను తన కార్యాలయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. అక్కడ కూడా అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ముందుకెళ్లేందుకు యత్నించిన రవికుమార్ను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల తీరును తప్పు పట్టి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని పొందూరు, ఆమదాలవలస, సరుబుజ్జిలి తదితర మండలాల నుంచి శ్రీకాకుళంలోకి నిరసన కోసం వచ్చే వారందరినీ పోలీసులు అడ్డుకున్నారు. వేరే పనుల కోసం వస్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. శ్రీకాకుళమంతా ఆంక్షలే.. వైఎస్సార్సీపీ చేపట్టిన రైతు సమస్యలపై నిరసన కార్యక్రమం జరగకుండా శ్రీకాకుళం నగరమంతా పోలీసులు ఆంక్షలు విధించారు. 80 అడుగుల రో డ్డు ఎంట్రన్స్ దగ్గర, వాంబే కాలనీ దగ్గర, పొన్నాడ బ్రిడ్జికి వెళ్లే రోడ్, సెవెన్ రోడ్ జంక్షన్, జెడ్పీ దగ్గర, సంతోషిమాత గుడి, కంపోస్టు కాలనీ ఏరియా వద్ద పోలీసులు దిగ్బంధం చేశారు. ఎవరినీ రానివ్వలే దు. దీంతో సాధారణ జనాలు కూడా ఇబ్బందులు పడ్డారు. రైతుల సమస్య కోసం నిరసన చేస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రజలు వాపోయిన పరిస్థితులు కనిపించాయి. జ్యోతిరావుపూలే విగ్ర హం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లను తీసేసి, అక్క డున్న వారందరినీ స్టేషన్కు తరలించేశారు. గేదెల పురుషోత్తం, చిట్టి జనార్ధన్, మార్పు పృథ్వీతో మరికొంతమందిని వన్టౌన్ పోలీసు స్టేషన్కు తీసుకెళ్లిపోయారు. మిల్లు జంక్షన్ దగ్గర ముంజేటి కృష్ణ మూర్తి, బాలకృష్ణ, పీస గోపి, పీసీ శ్రీహరి, జిల్లా పరిషత్ దగ్గర నినాదాలు చేశారని అంధవరపు సూరిబాబు, కరిమి రాజేశ్వరరావు, బొడ్డేపల్లి పద్మజ, జయదేవ్, కణితి కృష్ణారావును అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. అంతకుముందు రా ష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ఎంవీ స్వరూ ప్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంవీ పద్మావతి, ఎంపీపీ గొండు రఘును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ నాయకులు వెనక్కి తగ్గలేదు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా రైతు సమస్యలపై అధికారులకు వినతి పత్రం ఇచ్చే వెళ్లారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను కలిసిన వారిలో పార్లమెంట్ పరిశీలకులు కుంభా రవిబాబు, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, తూర్పు కాపు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, పోలినాటి వెలమ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎస్సీ విభా గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి, యువ నాయకుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు రౌతు శంకరరావు, వైఎస్సార్సీపీ నాయకురాలు కామేశ్వరి, యువజన విభాగం సంయుక్త కార్యదర్శి నక్క రామరాజు, అల్లు లక్ష్మీనారాయణ, చిట్టి రవి, గద్దిబోయిన కృష్ణయాదవ్, వెంకటరమణి, ప్రసాద్, పీస గోపి, పీస శ్రీహరి తదితరులు ఉన్నారు. అన్నదాతల సమస్యలపై నినదించిన వైఎస్సార్సీపీ శ్రేణులపై ఆంక్షలు నిరసన చేపట్టకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలు, అరెస్టులు రోడ్లపై బైఠాయించిన రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఇబ్బందులు పెట్టినా ఎరువు సమస్యలపై అధికారులకు నేతల విన్నపం -
వైఎస్సార్ వర్ధంతిలో భాగస్వాములు కండి
నరసన్నపేట: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని మంగళవారం పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చా రు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు వైఎస్సార్కు రుణపడి ఉంటారని కృష్ణదాస్ అన్నారు. ఆయన విగ్రహాల వద్ద నివాళులర్పించాలని సూచించారు.వానలపై యంత్రాంగం అప్రమత్తంశ్రీకాకుళం పాతబస్టాండ్: ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో దీని ప్రభావం కారణంగా జిల్లాలో సోమ వారం నుంచి విస్తారంగా వర్షాలు మొదల య్యాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను అప్రమత్తం చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండా లని ఆదేశించారు. కాలువలు, చెరువులను పర్యవేక్షించాలని సూచించారు. రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మరింత జగత్తగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.వర్షాలపై టెలీ కాన్ఫరెన్స్శ్రీకాకుళం పాతబస్టాండ్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో జిల్లాలో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. సో మవారం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 1, 2 మోస్తరు నుంచి భారీ వర్షాలు, సెప్టెంబర్ 3, 4 తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సెప్టెంబర్ 5 అల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం ఉత్తరాంధ్ర తీర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.‘జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు’శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 2025 ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు జిల్లాలో వరి, ఇత ర పంటలు కలిపి 3,73,000 ఎకరాల విస్తీర్ణంలో సాగు జరిగిందని ఆయన వివరించారు. ఈ సాగుకు గాను మొదటి, రెండో విడతలలో కలిపి 20,481 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైందని అన్నారు. అయితే రైతుసేవా కేంద్రాలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 11,443 మె ట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల ద్వారా 12,393 మెట్రిక్ టన్నులు కలిపి, మొత్తం 23,836 మెట్రి క్ టన్నుల యూరియా ఇప్పటివరకు రైతులకు సరఫరా చేసినట్లు కలెక్టర్ వివరించారు. అదనంగా స్పీక్ కంపెనీ ద్వారా శ్రీకాకుళం రోడ్డు రైలు హెడ్ వద్దకు 589 మెట్రిక్ టన్నులు సరఫరా అవుతున్నాయని చెప్పారు. -
కొత్తూరు, హిరమండలం ఎస్ఐలకు వీఆర్
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని కొత్తూరు సర్కిల్ పరిధిలో కొత్తూరు, హిరమండలం ఎస్ఐలను జిల్లా పోలీసు కార్యాల యానికి వీఆర్ అటాచ్ చేస్తూ అధికారులు ఆదివా రం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఎస్ఐలు మహ్మద్ అమీర్ అలీ, మహ్మద్ యాసిన్లను వీఆర్ అటాచ్డ్ స్పెషల్ బ్రాంచికి బదిలీ చేశారు. కొత్తూరు ఎస్ఐ మహ్మద్ అమీర్ అలీ ఇదే నెలలో మండలంలోని శోభనాపురం గ్రామానికి చెందిన ఓ యువకుడిని స్టేషన్కు పిలిపించి విచక్షణారహితంగా కొట్టడంతో యువకుని బంధువులు, కుటుంబ సభ్యులు ఎస్పీ మహేశ్వరరెడ్డికి నేరుగా వెళ్లి ఫిర్యా దు చేసిన సంగతి తెలిసిందే. యువకుడు వెంకటరమణ అదే గ్రామంలో కొండపై భారీ పేలుళ్లతో క్వారీ నడుపుతున్న వారిని ప్రశ్నించడం, అక్కడ వాగ్వాదం జరగడం, ఆపై స్టేషన్కు పిలిపించి పోలీసులు కొట్టడం పాఠకులకు విదితమే. హిరమండలం ఎస్ఐ మహ్మద్ యాసిన్ మండలంలో ఇటీవల వినాయక చవితి ఉత్సవాల్లో రెండు వర్గాలు కొట్టుకునే కేసులోను, ఇతర పరిపాలన పరమైన అంశాల్లో నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పు చేస్తే చర్యలు తప్పవు.. ఎస్పీ మహేశ్వరరెడ్డి తమ విభాగంలో ఎవరైనా తప్పు చేసినట్లు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడడం లేదు. ఇటీవలి కాలంలో గార ఎస్ఐ జనార్ధనరా వు, ఇచ్ఛాపురం రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు, జి.సిగడాం ఎస్ఐ మధుసూదనరావులను వీఆర్కు పంపగా.. రౌడీషీటర్లతో కలాపాలు సాగించారని శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ రాముపై శాఖాపరంగా విచారణ జరిపారు. జి.సిగ డాం ఎస్ఐ మధుసూదనరావు డీఆర్వలస గ్రామంలో శనీశ్వర ఆలయంలోని నవగ్రహ విగ్రహాలు ధ్వంసం చేసిన కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించార నే కారణంతో వీఆర్కు పంపినా తిరిగి అదే కేసును ఛేదించడంతో ఇప్పుడు అదే మండలానికి ఎస్ఐగా కొనసాగుతున్నారు. జిల్లాలో మరో ముగ్గురు ఎస్ఐలు, ఇద్దరు సీఐల పైన వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారి వద్ద చిట్టా ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. -
నేడు యూరియా కొరతపై ర్యాలీ
నరసన్నపేట: జిల్లాలో యూరియా కొరతపై రైతులకు మద్దతుగా సోమవారం శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని నాలుగు నియోజకవర్గా ల రైతులతో ర్యాలీ కార్యక్రమం ఉందని, దీన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఉద యం 10 గంటలకు శ్రీకాకుళంలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి జిల్లా పరిషత్ సమావేశ మందిరం వరకూ ర్యాలీ ఉంటుందని తెలిపా రు. శ్రీకాకుళం, నరసన్నపేట, ఎచ్చెర్ల, ఆమదాలవలస నియోజకవర్గాలకు చెందిన రైతు సోద రులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొనాలని కోరారు. ఈ మేరకు ఆదివారం రాత్రి కృష్ణదాస్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇచ్ఛాపురం రూరల్: సాగునీరు లేక నారుమడులు, నాట్లు ఎండిపోతున్న దశలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు నీటితో నిండిపోయాయి. ఈ వర్షం కొబ్బరి తోటలకు ఎంతగానో మేలు చేసిందని కొబ్బరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రసుత్తం కురిసిన వర్షం వల్ల నాట్లకు చీడ,పీడలు తొలగిపోతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇచ్ఛాపురం రూరల్: ఈదుపురంలో జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వాస్పత్రి ఉన్నప్పటికీ వైద్యాధికారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. దీంతో స్థానికులకు అవస్థలు తప్పడం లేదు. ఫలితంగా రోగులు ప్రైవేటు వైద్యులు, ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ప్రతి వీధిలో జ్వర పీడితులు కనిపిస్తున్నారు. శ్రీకాకుళం అర్బన్: క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందని తపాలాశాఖ సూపరింటెండెంట్ వండాన హరిబాబు అన్నారు. పోస్టల్ డివిజన్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలోని ప్రధాన తపాలాశాఖ కార్యాలయం వద్దన ఉన్న మున్సిపల్ మైదానంలో ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ఒత్తిడి స్థాయిని తగ్గించడంలో, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఆగస్టు 29 నుంచి పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రతిరోజు ఒక గంట మైదానంలో ఆడండి’ అనే థీమ్తో ఫిట్ ఇండియా కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. మూడు రోజులు గా ఫిట్నెస్ ప్రతిజ్ఞ, విద్యార్థులతో చర్చలు వంటి కార్యక్రమాలు చేపట్టి ఈ ఆదివారం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో సైకిల్ ర్యాలీ తో కార్యక్రమాలను ముగించినట్లు తెలిపారు. -
సమస్యలతో సతమతం
ఎచ్చెర్ల : ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీని కూటమి పాలకులు గాలికొదిలేశారు. మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఎవరు ముందుకు వస్తే ఎవరినెత్తిన భారం పడుతుందోనని కూటమి పాలకులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక్కడ ప్రతి ఏడాది మహిళా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనుగుణంగా మహిళా వసతి గృహాలు లేవు. ప్రస్తుతానికి రెండు వసతి గృహాలు అవసరమున్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు విద్యుత్, మైదానం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. పాలకమండలి సమావేశాలకు మోక్షమెప్పుడో? వర్శిటీ పాలకమండలి సమావేశాలను ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారి కూడా సమావేశాలను నిర్వహించలేదు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతి ఇవ్వాలి. ఇప్పటి వరకూ ఈ సమావేశాలకు ఎటువంటి ఆదేశాలను ఉన్నత విద్యామండలి జారీ చేయకపోవటంతో సమావేశాలు నిర్వహించలేదు. పాలక మండలి సమావేశం జరిగితే వర్శిటీ సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలను చేపట్టేందుకు ఆస్కారముంటుంది. వేధిస్తున్న విద్యుత్, వసతి సమస్యలు.. వర్సిటీలో ముఖ్యంగా విద్యుత్, వసతి సమస్యలు వేధిస్తున్నాయి. విద్యార్థినులకు రెండు వసతి గృహాలు అవసరం కాగా కనీసం ఒక్కటైనా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వర్శిటీకు ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా లైన్ లేదు. ఎచ్చెర్లలో కరెంట్ పోతే వర్శిటీలో కూడా విద్యుత్ ఉండటం లేదు. దీంతో కంప్యూటర్లు కోర్సు చదివే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఆన్లైన్ పరీక్షలను నిర్వహించడానికి కూడా వీలులేకుండా పోతోంది. అందుకే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. 11 కె.వి.స్మాల్ సబ్స్టేషన్ను వర్శిటీలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అప్పట్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఉన్న కళావెంకటరావు ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చినా ఆ తర్వాత మర్చిపోయారు. విద్యార్థులకు సరిపడా మైదానం లేదు. ట్రాక్, పోల్స్ లేవు. ఆటలు ఆడుకునేందుకు వీలుగా మైదానం లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. ముఖం చాటేస్తున్న స్థానిక నేతలు.. అంబేద్కర్ వర్శిటీలో చేపడుతున్న కార్యక్రమాలకు స్థానికుల నాయకులకు ఆహ్వానం పంపిస్తున్నా వారు గైర్హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ సమావేశాలకు హాజరైతే వర్శిటీ సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తారని, వాటిని పరిష్కరించాల్సి వస్తుందని హాజరుకావడం లేదని సమాచారం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్థానిక నేతలు వర్శిటీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరై సమస్యలను పరిష్కరించే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. -
ఒకే మాట.. ఒక్కటే విగ్రహం
● తిప్పనపుట్టుగలో ఒక్కటే విగ్రహం ● ఐకమత్యంగా వినాయక చవితి ● 57 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ ఇచ్ఛాపురం రూరల్: వీధికో విగ్రహం.. వాడకో మండపం కొలువుదీరుతున్న రోజుల్లో 57 ఏళ్లుగా ఆ ఊరి వారు ఒకే మాటపై నిలబడ్డారు. ఒక్కటే విగ్రహాన్ని పెట్టి ఐకమత్యంగా పూజలు చేస్తున్నారు. ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు చెందిన గ్రామం తిప్పనపుట్టుగ. పేరుకే రెండు మండలాల గ్రామస్తులు. గ్రామం ఒక్కటే కావడంతో అందరూ కలిసికట్టుగా కార్యక్రమాలు చేస్తూ తమలో ఐక్యతను చాటుకుంటుంటా రు. పన్నెండువందల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 57 ఏళ్ల కిందట పెద్దలు నిర్ణయించిన విధంగానే స్థానిక బస్టాండ్ మర్రిచెట్టు కింద వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా రెండు మండలాలకు చెందిన ప్రజలు కలసి ఈ విగ్రహం వద్దే పూజలు నిర్వహిస్తా రు. మండపం వద్ద డీజేలు, నృత్యాలు కాకుండా సామూహిక కుంకుమ పూజలు, భజనలు, మండల స్థాయిలో కబడ్డీ, క్విజ్ పోటీలు, కోలాటాలు, రేలారే లా వంటి జానపద నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు వారం రోజుల పాటు నిర్వహిస్తుంటారు. ఊరంతా నారీకేళ, కదళీ ఫలాలు ఉద్దానం ప్రాంతం కావడంతో ఈ గ్రామానికి చెందిన రైతులు వినాయక చవితి ఉత్సవానికి బహుమతిగా ప్రతి ఒక్క కొబ్బరి రైతు ఒక్కో కొబ్బరి గెలను, తమ తోటల్లో పండించే అరటి గెలను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. వీటిని గ్రామ పొడుగునా రెండు వైపులా అలంకరించడం ఇక్కడ ప్రత్యేకత. విగ్రహం నిమజ్జనం అనంతరం కొబ్బరి కాయలు, అరటి గెలతో ఒకే ప్రాంతానికి చేర్చి వీటితో పాటు లడ్డూను వేలం వేస్తారు. ఆ మొత్తాన్ని అన్నదానం, వచ్చే ఏడాది చవితి ఉత్సవాలకు వినియోగిస్తారు.గ్రామస్తులంతా కలసిమెలసి ఉండాలన్న ఉద్దేశంతో నా చిన్నతనంలో గ్రామ పెద్దలు గ్రామంలో ఒకే వినాయక విగ్రహం ఉండాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నాం. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. – తిప్పన దాలయ్యరెడ్డి, గ్రామ పెద్ద, తిప్పనపుట్టుగ గ్రామంలో వినాయక చవితి వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తాం. మండలాలు రెండైనా.. గ్రామం ఒక్కటే కావడంతో అందరం కలసి మెలసిగా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటాం. ఒకరిని ఒకరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతాం. గ్రామంలో నిర్వహించే పండగలను కూడా అలాగే నిర్వహిస్తుంటాం. – డాక్టర్ రత్నాల తారకేశ్వరరావు, పూజా కమిటీ సభ్యుడు, తిప్పనపుట్టుగ -
శ్రీముఖలింగంలో ఏకాదశ రుద్రపారాయణం
జలుమూరు: లోక కల్యాణం కోసమే శ్రీముఖలింగంలో ఏకాదశ రుద్రపారాయణం నిర్వహించామని సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు అన్నారు. ఆదివారం శ్రీముఖలింగంలో ఏకాదశ రుద్రపారాయణంలో పాల్గొని మాట్లాడారు. మానవాళికి ప్రేమ, సేవా మార్గాలును దశా దిశ నిర్దేశం చేసిన సాయి అందరిలోనూ ఉన్నాడన్నారు. మానవ సేవయే మాధవసేవ అని తలచి సాయి చేసిన సేవలు, లీలలు కొనియాడారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, ప్రతినిధులు కస్తూరి భాస్కర్ ప్రసాద్, తోట అరుణ, రాఘవరావు, విశ్వనాథరెడ్డి, జె.శాంతి, దుర్గాప్రసాద్, శ్రీదేవి, కిషోర్, గౌతమ్సాయి ఫణీంధ్ర, జిల్లా రైస్ ఇన్చార్జ్ పైడిశెట్టి వెంకటరమణ, సర్పంచ్ టి.సతీష్కుమార్, ఎంపీటీసీ కె.హరిప్రసాద్, గ్రామపెద్దలు బి.వి.రమణ, అర్చకులు నాయుడుగారి రాజశేఖర్, వెంకటాచలం, భక్తులు పాల్గొన్నారు.శ్రీముఖలింగంలో సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఏకాదశ రుద్రపారాయణం వివాదంగా మారింది. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో బాబా పాదుకలు గర్భగుడిలో శివుని మూలవిరాట్టు స్వయం భూ లింగం వద్ద పెట్టడంతో పలువురు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వాంతర్యామి అయిన ఆ దేవదేవుడి లింగం వద్ద పాదుకలు ఎలా పెడతారని అర్చకులతో వాగ్వాదానికి దిగారు. మరికొందరు ఈఓ వాసుదేవరావును ప్రశ్నించారు. దీనిపై ఈఓ స్పందిస్తూ వివరణ కోరగా రుద్రపారాయణం నిర్వహిస్తామని సత్యసాయి భక్తులు అడిగితే అనుమతి ఇచ్చామని, ఇలా పాదుకలు గర్భగుడిలో పెడతారని తెలియదన్నారు. కొందరు బాబాభక్తులు అత్యుత్సాహంతో పాదుకులు లోపల పెట్టడం తప్పేనని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే పాదుకలు తొలగించామని తెలిపారు. కాగా, ఈ వివాదంపై ఆలయ అర్చకులు, ఈఓ నిర్లక్ష్య వైఖరిపై గ్రామానికి చెందిన భక్తులు కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. -
సర్కారు బడిలో కంప్యూటర్ ల్యాబ్
● పూర్వ విద్యార్థి ఔదార్యం గార: తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో రూ.1.50 లక్షలతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి స్ఫూర్తిగా నిలిచారు పూర్వ విద్యార్థి బొంది రమణ. గార మండలం కె.మత్స్యలేశం ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్కు అదే గ్రామానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి రమణ ఆరు కంప్యూటర్లతో పాటు ఫర్నిచర్ను ఏర్పాటు చేయగా ఆదివారం సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, సమగ్ర శిక్ష ఏపీసీ శశిభూషణ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా సర్కారు బడిలో చదివే విద్యార్థుల కోసం ల్యాబ్ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. దాత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ చైతన్య, సర్పంచ్ బుడ్డా లలిత ఎర్రన్న, సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, హెచ్ఎం టి.సుధీర్కుమార్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ లక్ష్మీ, మైలిపిల్లి సూర్యనారాయణ, తులసీరావు తదితరులు పాల్గొన్నారు. -
మహిళ అనుమానాస్పద మృతి
ఆమదాలవలస: పురపాలక సంఘం పరిధిలోని 12వ వార్డు చంద్రయ్యపేట వీధిలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీపాన రమణమ్మ (42) అనే మహిళ భర్త సింహాచలంతో కలిసి చంద్రయ్యపేటవీధిలో నివాసముంటోంది. సింహాచలం వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో శనివారం ఉదయం విధులకు వెళ్లిపోయారు. ప్రతిరోజూ స్థానికులతో కలిసి ఈవినింగ్ వాక్కు వెళ్లే రమణమ్మ శనివారం రాకపోవడంతో ఆమె భర్తకు సమాచారం అందించారు. అతను స్కూల్ నుంచి ఇంట్లోకి వెళ్లి చూడగా మంచం పక్కన గచ్చుపై విగతజీవిగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్సై సనపల బాలరాజు తెలిపారు. రమణమ్మ బ్రెయిన్ స్ట్రోక్తోనే మృతి చెందినట్లు పోస్టుమార్టంలో నిర్ధారించినట్టు విశ్వసనీయ సమాచారం. -
సెంచూరియన్ యూనివర్సిటీతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం
కొరాపుట్/పర్లాకిమిడి: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో సెంచూరియన్ యూనివర్సిటీ చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తర ప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యా బొరేటరీ వర్సిటీల మధ్య ఈ నెల 29న ఎంఓయూ కుదిరింది. లక్నోలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా పరిశోధనాత్మక, న్యాయ సంబంధిత, సాంకేతిక అంశాల్లో రెండు సంస్థలు పరస్పరం సహకారం అందించుకుంటాయి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ డీఐజీ రాజీవ్ కృష్ణతో సెంచూరియన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ముక్తికాంత్ మిశ్రా సమాలోచనలు చేశారు. డీఐజీ మాట్లాడుతూ ఈ రెండు సంస్థల కల యిక పరిశోధన రంగంలో నూతన మార్పులు తీసుకువస్తుందని తెలిపారు. సెంచూరియన్ వర్సిటీ ప్రెసిడెంట్ ముక్తి కాంత్ మిశ్రా మాట్లాడుతూ తాము 2016లోనే గుజరాత్ ఫోరెన్సిక్ విభాగంతో పనిచేశామని, ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో ఫోరెన్సిక్ సేవలు సమాజానికి ఉపయోగపడతాయన్నా రు. ఈ ఒప్పందంపై ఉత్తర్ ప్రదేశ్ ఏడీఐజీ నవీన్ ఆరోరా, సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ సుప్రియ పట్నాయిక్ సంతకాలు చేశా రు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ లక్నో లోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్కి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్, సెంచూరియన్ యూనివర్సిటీ అంతర్జాతీయ, ప్రభు త్వ సంబంధాల డైరెక్టర్ మెనాలిసా ఘోష్, డాక్టర్ రీనా, సి.జమాతానీ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర కార్యక్రమాల సంచాలకుడిగా సునీల్ శర్మ
శ్రీకాకుళం కల్చరల్: సేవ్ టెంపుల్స్ భారత్ రాష్ట్ర కార్యక్రమాల సంచాలకుడిగా నగరానికి చెందిన తెన్నేటి సునీల్ శర్మను నియమితులయ్యారు. ఈమేరకు విశాఖలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో సునీల్ శర్మకు అధ్యక్షుడు కేశినేని శ్రీనివాస్ (గజల్) నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ, గోరక్షణ, మఠాలు, పీఠాలు, సాధువులు, సంతుల పరిరక్షణకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆపదలో అండగా.. కంచిలి: సోంపేట పట్టణానికి చెందిన పొట్నూ రు సాయిరోహిత్ కాలేయం పాడవ్వడంతో శస్త్రచికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కంచిలి పట్టణ కళింగ కోమటి సంఘం సభ్యులు రూ.1,65,211 సాయాన్ని ఆదివారం అందించారు. అంతకుముందు కూడా కొంత మొత్తాన్ని అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో సాయిరోహిత్ తల్లిదండ్రులు, సంఘ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. చెట్టుకొమ్మ విరిగిపడి ట్రాఫిక్కు అంతరాయం జలుమూరు: సురవరం పంచాయతీ దొంపాక వద్ద ఆదివారం వేకువజామున ఎల్.కె.రోడ్డుపై మర్రి చెట్టుకొమ్మ విరిగిపడటంతో ఉదయం పది గంటల వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. గతంలో కూడా ఇదే రోడ్డు మీద ఓ చెట్టు కొమ్మ విరగడంతో అప్పుడు కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. తరచూ ఇదే చెట్టు నుంచి కొమ్మలు పడటంతో వాహన చోదుకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ రోడ్డు మీదుగా వందలాది ద్విచక్ర వాహనాలు, పాదచారులు, పొలం పనులకు వెళ్లే రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. సత్ప్రవర్తనతో మెలగాలి శ్రీకాకుళం క్రైమ్ : రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని.. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, ఇరత ఆర్థిక లావాదేవీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ హెచ్చరించారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పేకాట, బెట్టింగ్, గంజాయి సేవనం, క్రయ విక్రయాలు, బహిరంగంగా మద్యం సేవించి న్యూసెన్సు చేయడం, వినాయక ఉత్సవాల్లో వర్గ విభేదాలు సృష్టించి అల్లర్లకు పాల్పడటం వంటివి తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆనందరావుకు సత్కారం టెక్కలి: వసతి గృహం సంక్షేమాధికారిగా సత్తారు ఆనందరావు చేసిన సేవలు ఎనలేనివని వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమాధికారి టి.త్రినాథరావు కొనియాడారు. సంతబొమ్మాళి మండలం నౌపడ వసతి గృహం సంక్షేమాధికారిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన సత్తారు ఆనందరావు, అరుణకుమారి దంపతులను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఓవైపు వసతి గృహం సంక్షేమానికి కృషి చేస్తూ మరో వైపు అసోషియేషన్ బాధ్యతల్లో కీలకంగా పనిచేస్తూ అందరి మన్ననలను పొందిన వ్యక్తి ఆనందరావు అని కొనియాడారు. అనంతరం ఆనందరావు, అరుణకుమారి దంపతులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో వసతి గృహం సంక్షేమాధికారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.గురువులు, వార్డెన్లు డి.రామారావు, గ్రామపెద్దలు కె.విష్ణుమూర్తి, వి.కృష్ణారావు, కెప్టెన్ ఎం.మన్మధరావు, ఎస్.కరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘యూపీహెచ్సీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి’
శ్రీకాకుళం అర్బన్: అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని యూ పీహెచ్సీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సింహాచలం కోరారు. శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎంప్లాయీస్ యూనియన్ శ్రీకాకుళం జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన యూపీహెచ్సీ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సింహాచలం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో యూపీహెచ్సీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు మెరుగైన వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎఫ్ఆర్ఎస్ యాప్లో ఉన్న సాంకేతిక సమస్యలు పరిష్కారం చేయకుండా చిరు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తాం అంటూ ఆదే శాలు జారీ చేయడాన్ని ఖండించారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలిగా బి.మాలతి, వర్కింగ్ ప్రెసిడెంట్గా డీఎస్ సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా జి.సూర్య ప్రవీణ్, కోశాధికారిగా పి. ఉపేంద్ర, వర్కింగ్ ఉమెన్స్ వింగ్ అధ్యక్షురాలిగా జి.కల్యాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా టి.లక్ష్మి, జాయింట్ సెక్రెటరీగా బి.శ్రీనివాసరావు తదితరులు ఎంపికయ్యారు. -
వ్యాపారి అదృశ్యంపై ఫిర్యాదు
నరసన్నపేట: స్థానిక లక్ష్మున్నపేటకు చెందిన వ్యాపారి వెంకట పార్వతీశం గుప్త అదృశ్యమయ్యారు. ఆగస్టు 26న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని సోదరుడు మన్మధరావు నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గుప్త అదృశ్యం వెనుక పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుప్తా బంగారు ఆభరణాలు ఒక చోట నుంచి మరొక చోటకు తరలిస్తుండటం, వ్యాపారులకు ఇస్తుండటం, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుండంతో పాటు లక్షల్లో లావాదేవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మంగళవారం తన కారులో స్థానిక పురుషోత్తంనగర్కు చెందిన కారు డ్రైవర్తో కలిసి విశాఖ వెళ్లగా.. డ్రైవర్ ఆ రాత్రే ఇంటికి చేరుకున్నారని, గుప్తా మాత్రం రాలేదని సమాచారం. సోదరుడు ఫోన్ చేస్తే వేరే వ్యక్తి లిఫ్ట్ చేసి తనకు బస్సులో ఫోన్ దొరికిందని చెప్పారు. ఆయన చెప్పిన చోటకు వెళ్లి ఫోన్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కేసు నమోదు చేశామని, విశాఖ పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. శ్రీకాకుళం కల్చరల్: యువ రచయితల వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కవితా పొటీల్లో విజేతల వివరాలను వేదిక అధ్యక్షులు తంగి యర్రమ్మ ఆదివారం ప్రకటించారు. గుణుపు శార్వాణి (పాతపట్నం) ప్రథమ, తలగాపు ధనుంజయ (పలాస) ద్వితీయ, ముట్నూరు బాల సుబ్రహ్మణ్యం (ఎల్ఎన్పేట) తృతీయ బహుమతికి ఎంపికయ్యారని తెలిపారు. కూన రంగనాయకులు, కాపురెడ్డి శ్రీనివాస్లకు కన్సొలేషన్ బహమతులు వచ్చాయని చెప్పారు. వీరికి త్వరలోనే బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. డాక్టర్ పిలకా శాంతమ్మ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ తులాల సవరమ్మలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. -
జాప్యమెందుకో?
స్పోర్ట్స్ కోటా అమల్లో.. ● ఇంజినీరింగ్, ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లలో కానరాని కోటా ● శాప్ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం ● ప్రభుత్వం స్పందించాలని క్రీడాసంఘాల విజ్ఞప్తి శ్రీకాకుళం న్యూకాలనీ: స్పోర్ట్స్ కోటా అమలు రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనుక్కి అన్న చందంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాను పక్కాగా అమలు చేస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కాక వందలాది మంది క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఇంజినీరింగ్, ట్రిపుల్ ఐటీ క్లాసులు మొదలైపోయాయి. అయినా, స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ కావాల్సిన సీట్లను సంబంధిత శాఖాధికారులు జాప్యం చేస్తుండటంతో విద్యార్థులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలో పదుల సంఖ్యలో క్రీడాకారులు.. విద్యార్థులు ఎంసెట్, ట్రిపుల్ఐటీ సీట్ల రేసులో ఉన్నారు. వీరంతా ఇప్పటికే వివిధ క్రీడాంశాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించి జిల్లా కీర్తిని చాటిచెప్పారు. పతకాలు సాధించి సత్తాచాటారు. అయితే ఉన్నత చదువుల్లో అమలు కావాల్సిన స్పోర్ట్స్కోటాను అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో విద్యాసంవత్సరం కోల్పోయే పరిస్థితులు దాపరించాయి. డీఎస్సీపైనే ఫోకస్.. స్పోర్ట్స్ కోటా భర్తీ చేపట్టాలని ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)కు ఆదేశించింది. అయితే శాప్ అధికారులు కేవలం డీఎస్సీ ఉద్యోగాలపై మాత్రమే ప్రస్తుతం ఫోకస్ చేస్తున్నారు. మిగిలిన ఉన్నత, ప్రొఫెషనల్, వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాల సందర్భంగా స్పోర్ట్స్కోటా ద్వారా విద్యార్థుల భర్తీని విస్మరించారు. దీంతో ఎంసెట్, ట్రిపుల్ ఐటీ వంటి ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు నష్టపోతున్నారు. ఇప్పటికై న ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని జిల్లాలోని క్రీడా విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్పోర్ట్స్ కోటా భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని ఒలింపిక్ సంఘ నాయకులు, క్రీడాసంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
రిమ్స్లో కొరవడిన నిఘా!
● 650 పడకలకే సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఒప్పందం ● ఆస్పత్రిలో ఉన్న పడకల సంఖ్య 930 ● పర్యవేక్షణ లేక తరచూ దొంగతనాలు శ్రీకాకుళం : నగరంలోని రిమ్స్ సర్వజన ఆస్పత్రిలో నిఘా కొరవడుతోంది. నిత్యం ఏదో ఒక వార్డులో రోగులు, రోగుల సహాయకులకు సంబంధించిన సెల్ఫోన్లు, డబ్బులు, మోటారు సైకిళ్లు చోరీకి గురికావడం పరిపాటిగా మారింది. దొంగతనాలకు సంబంధించి ఔట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో కొందరు రోగులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కూడా పాఠకులకు తెలిసిందే. తాజాగా జరిగిన ఓ సంఘటన ప్రమాదవశాత్తు జరిగినట్లు చెబుతున్న అది కూడా ఆత్మహత్య అని రిమ్స్ వర్గాల నుంచే వినిపిస్తోంది. కారణం ఏదైనప్పటికీ నిఘా కొరవడంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇదేం లెక్క? రిమ్స్ సర్వజన ఆసుపత్రి 930 పడకల స్థాయిలో ఉన్నప్పటికీ రాష్ట్రస్థాయిలో జరిగిన సెక్యూరిటీ ఒప్పందం మాత్రం 650కు మాత్రమే జరిగింది. రాష్ట్రస్థాయిలో ఉన్న లెక్కల ప్రకారం ఈ ఒప్పందం జరిగినట్లు కొందరు రిమ్స్ అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తొలుత 650 పడకలకు సెక్యూరిటీ ఒప్పందం జరిగినా అటు తర్వాత మరో వంద పడకలకు పెంచుతూ కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకున్నారు. ఈ లెక్కన రాష్ట్రస్థాయిలో 750 పడకలకు లెక్కలు ఉండాలి. ఇందుకు భిన్నంగా 650 పడకలకే లెక్కలు ఉన్నట్లు చెబుతూ ఆ మేరకే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 2024 ఎన్నికల సమయంలో రిమ్స్ పడకల స్థాయి 930కి చేరింది. ఈ కారణంగానే అప్పట్లో 930 స్థాయికి సెక్యూరిటీని పెంచలేకపోయారు. అటు తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం 930కి కాకపోయినా గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు 750 పడకలకు కూడా సెక్యూరిటీ ఒప్పందాన్ని కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యవేక్షణ గాలికి.. రిమ్స్లో నిఘా సిబ్బంది సక్రమంగా పర్యవేక్షణ చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పడకల స్థాయి కంటే సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ వారితో సైతం సక్రమంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోలేకపోతున్నారు. నిఘాను పర్యవేక్షించాల్సిన అధికారి తరచూ విధులకు గైర్హాజరవుతుండటంతో ఇటువంటి పరిస్థితి నెలకొంది. పర్యవేక్షణ అధికారి తన జాబ్ జార్టును వదిలి ఇతర రిమ్స్ అధికారుల విధుల్లో తలదూర్చడానికి ప్రాధాన్యత ఇస్తుంటారని రిమ్స్ వైద్యులే బహిరంగంగా చెబుతున్నారు ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి సక్రమంగా నిఘా అమలయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
ఎరువుల సరఫరా ఏకపక్షం
● కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ● రైతన్నకు తప్పని ఎరువు కష్టాలు ఆమదాలవలస రూరల్: అన్నదాతకు అందాల్సిన ఎరువులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎరువుల సరఫరా ఏకపక్షంగా జరుగుతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి ఎరువులు చేరడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే పూర్తిగా ఎరువులు అందే పరిస్థితి ఏర్పడింది. దీనిపై జిల్లా అధికారులు కూ డా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. తొలిదశలో రైతు సేవా కేంద్రాల ద్వారా కొంత సరఫరా చేసినా ఆ తర్వాత మొత్తం ఎరువులు వ్యాపారులకు అందించటంతో ఎరువు కరువుగా మారింది. గగ్గోలు పుట్టిస్తున్న ధరలు ఎరువుల వ్యాపారులు అధికార పార్టీ నాయకులు అండదండలతో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న సంగతి చాలా చోట్ల బయటపడింది. ఒక యూరియా బస్తాపై రూ. 100 నుంచి రూ.150 వరకు అదనంగా తీసుకుంటున్నారు. కాంప్లెక్స్ ఎరువులపైనా ఇదే స్థాయిలో దోపిడీ జరుగు తోంది. ముఖ్యంగా ఆమదాలవలసలో రైల్వేగూడ్స్ షెడ్ ఉండటం, ఇందుకు దగ్గరలో గోదాంలు కూడా ఉన్నందున వ్యాపారుల వ్యాపారం మూడుపువ్వు లు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఇంత అక్రమాలు జరుగుతున్నా ఇక్కడ అధికారులు కనీసం తనిఖీ చేసేందుౖకైనా ముందుకు రావడం లేదు. నిఘా విభాగం సైతం నిద్ర నటిస్తోంది. తప్పని నిరీక్షణ బూర్జ: మండలంలో గల నీలాదేవిపురం (నీలంపేట) గ్రామ రైతు సేవా కేంద్రానికి ప్రభుత్వం నుంచి శనివారం 222 బస్తాల యూరియా వచ్చింది. నీలాదేవిపురంతో పాటు వావాం, ఉవ్వపేట, బూర్జ నుంచి రైతులు రావడంతో తోపులాట జరిగింది. అధికారులు పోలీసు సహాయం కోరడంతో ఎస్ఐ ఎం.ప్రవల్లిక సిబ్బందితో రైతులను క్యూలో నిలబెట్టారు. -
బార్లకు ముగిసిన డ్రా
● ఐదు బార్లకు లైసెన్సులు కేటాయింపు ● దరఖాస్తులు ఎక్కువగా పడక వెలవెలబోయిన అంబేడ్కర్ ఆడిటోరియం శ్రీకాకుళం క్రైమ్ : ఎకై ్సజ్ శాఖ బార్ పాలసీలో భాగంగా జిల్లాలో ఐదు బార్లకు లాటరీ పద్ధతిన లైసెన్సుదారులను అధికారులు నిర్ణయించారు. శనివారం ఉదయం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలతో డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో టోకెన్ డ్రా పద్ధతిన లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత విభాగం నుంచి జిల్లా డిప్యూటీ కమిషనర్ దోసకాయల శ్రీకాంత్రెడ్డి, జిల్లా ఎ కై ్సజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం కార్పొరేషన్, పలాస–కాశీబుగ్గ, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో జనరల్ కేటగిరీలో 17 బార్లకు గాను, రిజర్వ్ కేటగిరీలో (గీతకులాలవారికి) 2 బార్లకు గాను దరఖాస్తులు కోరగా 22 దరఖాస్తులే వచ్చాయన్నారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురంలో ఒక్క దరఖాస్తు కూడా పడకపోగా, శ్రీకాకుళంలో 3 జనరల్ కేటగిరీ, ఒక రిజర్వ్ కేటగిరీ (శ్రీశయన)కి, పలాస–కాశీబుగ్గలో ఒక రిజర్వ్ (సొండి) కేటగిరీకి దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ విధంగా చూసుకుంటే శ్రీకాకుళంలో 16 దరఖాస్తులు రాగా, పలాసలో ఆరు వచ్చాయని, ఒకే వ్యక్తి నాలుగు దరఖాస్తులు వేసిన సందర్భాలు రెండు చోట్ల ఎదురయ్యాయన్నారు. వెలవెలబోయిన ఆడిటోరియం.. బార్ల లైసెన్సు డ్రాలో దరఖాస్తుదారులకంటే ఎకై ్సజ్ సిబ్బందే ఎక్కువ ఉండటం గమనార్హం. కూటమి పార్టీలకు చెందిన మ ద్యం సిండికేట్ ముందస్తుగా వేసుకున్న ప్రణాళికతోనే టెండర్లు వేయలేదని పలువురు చర్చించుకుంటున్నారు. అందుకే ఆమదాలవలస, ఇచ్ఛాపురం, కాశీబుగ్గల్లో జనరల్లో ఒక్క అప్లికేషన్ కూడా రాలేదన్నారు. పడని వాటికి తర్వాత మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని అధికారులు చెబు తున్నా టీడీపీ నాయకులు టెండర్లు వేయకుండానే తక్కువ డిపాజిట్లతో దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. -
రుషికొండపై చేసిన విమర్శలు గుర్తున్నాయా..?
నరసన్నపేట: ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, విశాఖ వచ్చిన కూటమి నాయకులు మరోసారి దీన్ని రుజువు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ను విభాగాలుగా విభజించి ప్రైవేటీకరణ చేస్తున్నారని, దీనిపై కూటమి నాయకులు స్పందించలేదని తెలిపారు. స్టీల్ప్లాంట్పై ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన నాయకులు ఇప్పుడు పెదవి విప్పాలన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ఎప్పుడూ ఒకే విధానంపై ఉందని గుర్తు చేశారు. ఆనాడే అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశామన్నారు. విశాఖ ప్రజలు కూటమి నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రుషికొండ భవనాలపై విషం కక్కిన నాయకులు ఇప్పుడు వాటిని వాడుకోవడానికి పోటీ పడుతున్నారని తెలిపారు. అప్పట్లో జగన్ ప్యాలెస్ అంటూ దుష్ప్రచారం చేసి, ఇప్పుడు భవనాల వద్ద ఫొటోలు దిగుతున్నారని విమర్శించారు. జగన్ ప్యాలెస్ అన్న నాయకులు జీఓలో ఎందుకు అలా పెట్టలేదని ప్రశ్నించారు. కూటమి నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు. -
యూరియా కోసం పాట్లు
పలాస: పలాస మండలం టెక్కలిపట్నం గ్రామ సచివాలయం వద్ద రైతులు శనివారం యూరియా కోసం ఎగబడ్డారు. ఒక రైతుకు ఒకే బస్తా ఇస్తుండటంతో రైతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలాస ఎ.డి.ఎ రామారావును వివరణ కోరగా పలాస డివిజన్కు మొత్తం 19 టన్నుల యూరియా వచ్చిందని, సగానికి పైగా ఇప్పటికే అందజేశామన్నారు. ఒక ఎకరాకు అరబస్తా మాత్రమే ఇస్తున్నామని, రెండు దఫాలుగా ఒక బస్తా ఇస్తున్నామని ఇది ప్రభుత్వం నిబంధన అని చెప్పారు. టెక్కలిపట్నం గ్రామ సచివాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు -
అనుపోత్సవాలకు పటిష్ట భద్రత
శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో 2072 వినాయకుని మండపాల్లో ఆన్లైన్ సింగిల్ విండో పద్ధతి అనుమతులతో ప్రజలు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని డీఎస్పీ సీహెచ్ వివేకానంద శనివారం తెలిపారు. వినాయక విగ్రహ ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం నగరంలో పెద్ద విగ్రహాలున్న సుమారు 25 మండపాల్లో సీసీ కెమెరాల నిఘా ఉందన్నారు. ఈ నెల 31న డివిజన్ పరిధిలో 400 విగ్రహాలు అనుపోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, వచ్చే నెల 2న 275, 4న 425, తొమ్మిదో రోజైన 6న 500 విగ్రహాలు, 8న 50 వరకు అనుపునకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. మద్యం సేవించి ఊరేగింపులో న్యూసెన్సు సృష్టించేవారిపై ప్రత్యేక దృష్టిపెట్టామని, గతేడాది వినాయక ఉత్సవాల్లో అల్లర్లు చేసేవారిపై ఇప్పటికే బైండోవర్లు కట్టామని, వారితో పటు ఇటీవల గొడవల్లో ఉన్నవారిపై షీట్లు తెరిచామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో మండపాలకు అనుమతించలేదన్నారు. -
రిజిస్టర్ పోస్ట్కు బ్రేక్
● స్పీడ్ పోస్టులో విలీనం చేస్తూ ఉత్తర్వులు ● 171 ఏళ్ల బంధానికి స్వస్తిపలుకుతూ పోస్టల్ శాఖ నిర్ణయం ● సెప్టెంబరు 1 నుంచి అమలు హిరమండలం: అత్యంత పురాతన ప్రభుత్వరంగ సంస్థ పోస్టల్. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో ప్రారంభమైన ఈ తపాలా వ్యవస్థ ఇప్పటికీ పటిష్టంగా కొనసాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త పుంతలు తొక్కుతోంది. సంస్కరణల్లో భాగంగా ‘రిజిస్టర్ పోస్టు’ సర్వీసుకు స్వస్తి పలికింది. సుమారు 171 ఏళ్లు సేవలందిస్తున్న రిజిస్టర్ పోస్టు సర్వీసును ఈ నెల 30తో నిలిపివేశారు. దీనిని స్పీడ్ పోస్టులో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1 నుంచి స్పీడ్ పోస్టు విధానం మాత్రమే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు జిల్లాలో 3 ప్రధాన, 64 ఉప, 507 బ్రాంచ్ పోస్టాఫీసులకు ఆదేశాలు వచ్చాయి. ప్రధాన సమాచార వ్యవస్థగా.. మూడు దశాబ్దాల కిందట వరకూ బంధుమిత్రులకు కబురు పంపాలన్నా.. ముఖ్యమైన పత్రాలు చేరవేయాలన్నా పోస్టుకార్డు లేదా రిజిస్టర్ పోస్టు మాత్రమే ప్రధాన ఆశ్రయంగా ఉండేది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ లేని కాలంలో ప్రజలతో పోస్టల్కు విడదీయరాని బంధం ఉండేది. ప్రభుత్వ శాఖలపరంగా అన్నిరకాల ఉత్తర ప్రత్యుత్తరాలు రిజిస్టర్ పోస్టు ద్వారా నడిచేవి. ఎందుకంటే దీనికి డెలివరీ ప్రూఫ్ ఉంటుంది. ఏదైనా కోర్టు నోటీసులు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నోటీసులు అందుకున్న తరువాత అవతలి వ్యక్తికి అందినట్టు రశీదు పొందడం రిజిస్టర్ పోస్టు ప్రత్యేకత. ఇది చట్టపరంగా చాలా ఉపయోగపడుతుంది. ప్రధానంగా లీగల్ నోటీసులు, ఉద్యోగ నియామకాల అపాయింట్మెంట్ లెటర్లు, బ్యాంకింగ్ సంబంధిత పత్రాలు వంటి వాటిని పంపడానికి ఇవి ఎంతో ఉపయోగంగా ఉండేవి. సంస్కరణలో భాగంగానే.. పోస్టల్ శాఖలో అనేక మార్పులు సంతరించుకుంటున్నాయి. దేశీయ పోస్టల్ సేవలను క్రమబద్ధీకరించడం, పనితీరు మెరుగుపరచడం, ట్రాకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవడంలో భాగమే ఈ విలీనమంటున్నాయి పోస్టల్ వర్గాలు. స్పీడ్పోస్టు వేగవంతమైన డెలివరీకి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్పుడు రిజిస్టర్ పోస్టును స్పీడ్ పోస్టులో విలీనం చేయడం వల్ల డెలివరీలు మరింత వేగవంతం అవుతాయి. ముఖ్యంగా స్పీడ్ పోస్టు ద్వారా పంపించిన పార్సిల్, పత్రాలు ఎక్కడ? ఏ స్టేజ్లో ఉన్నాయి? అన్న స్టేటస్ చాలా సులువుగా తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో ఎప్పటికప్పుడు వివరాలు పొందవచ్చు. ఈ సౌకర్యం రిజిస్టర్ పోస్టులో లేదు. తాజాగా ఒకే సేవ ఉండడం వల్ల పోస్టల్ శాఖకు పని చాలా సులువు అవుతుంది. అయితే రిజస్టర్ పోస్ట్తో పోల్చుకుంటే స్పీడ్ పోస్టుకు చార్జీలు ఎక్కువే. రిజిస్టర్ పోస్టు కనీస చార్జీ రూ.26 ఉంటే స్పీడ్ పోస్టు చార్జీ రూ.41 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్టు స్పీడ్ పోస్టులో విలీనం కావడం వాస్తవమే. సెప్టెంబరు 1 నుంచి ఈ విలీనం అమల్లోకి రానుంది. అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని పోస్టల్ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ప్రజలకు వేగవంతమైన సేవలందించేందుకే పోస్టల్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. –జె.వెంకటేష్, పోస్టుమాస్టర్, పాతపట్నం పోస్టాఫీసు -
ప్రతికూలతలు అధిగమిస్తేనే ‘వికసిత్ భారత్’
ఎచ్చెర్ల : సమాజంలో ఎదురయ్యే సవాళ్లు, ప్రతికూలతలు, సంక్షోభాలు ఎదుర్కొన్నప్పుడే వికసిత్ భారత్ వంటి లక్ష్యాలను చేరుకోగలమని థామ్సన్ రివర్ యూనివర్శిటీకి చెందిన స్కూల్ ఆఫ్ సోషల్వర్క్, హ్యూమన్ సైన్స్ విభాగ అధ్యాపకులు డాక్టర్ బాలనిక్కు (కెనడా) అభిప్రాయపడ్డారు. బీఆర్ఏయూ విద్యా విభాగం ఆధ్వర్యంలో ‘ఆచరణలో స్థితిస్థాపకత.. వికసిత్ బారత్–2047 కోసం సంబంధిత సంఘాల నిర్మాణం, విద్యార్థుల భాగస్వామ్యం’ అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక వర్క్షాప్లో ఆయన ప్రసంగించారు. యువతరం నిర్దేశిత లక్ష్యాలను కలిగి ఉండి ఆశావాహ దృక్పథంతో ముందుకుసాగి దేశ అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. వైస్ చాన్సలర్ ఆచార్య కె.ఆర్ రజని మాట్లాడుతూ మేధో సంపత్తి, ప్రగతిదాయక ఆలోచనపరులు విదేశాలకు వెళ్లకుండా భారత్లోనే సేవచేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యా విభాగం సమన్వయకర్త, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ జేఎల్ సంధ్యారాణి పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వర్శిటీ రెక్టార్ ఆచార్య బి.అడ్డయ్య, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అనురాధ, ఎస్వో కె.సామ్రాజ్యలక్ష్మీ, అధ్యాపకులు హెచ్.సుబ్రహ్మణ్యం, ఎన్.శ్రీనివాసరావు, ఎన్.వి.స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు మోసకారి
సరుబుజ్జిలి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిక హామీలు తుంగలోకి తొక్కి ప్రజలను మోసగించారని వైఎస్సార్సీపీ విజయనగం జిల్లా పార్లమెంటరీ పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ(కేవీజీ) ధ్వజమెత్తారు. సరుబుజ్జిలి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం పర్యటించిన అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. రైతన్నలు బస్తా ఎరువు కోసం గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడి సొమ్మసిల్లిపడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. జిల్లాకేంద్రాల నుంచి లారీల ద్వారా వచ్చిన ఎరువులను కూటమి నేతలు అడ్డదారుల్లో తరలించి కార్యకర్తలకు అందిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితి లేదన్నారు. స్థానిక వ్యవసాయాధికారి ఎరువుల వ్యాపారులు, కూటమి నేతలకు కొమ్ముకాస్తూ రైతన్నలను తీవ్ర బ్బందులకు గురిచేస్తున్నారని, పనితీరు మార్చుకోవాలన్నారు. -
అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు..
టెక్కలి రూరల్: స్థానిక అక్కపు వీధికి చెందిన మోనింగి శ్రీనివాసరావు(42) శనివారం తన ఇంటి సమీపంలోని రాతి బావిలో శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శ్రీనివాసరావుకు భార్య స్వాతి, ఇద్దరు పిల్లలు. మసాల పౌడర్ల వ్యాపారం చేస్తుండేవాడు. మూడు రోజుల క్రితం పెళ్లిరోజు రావడంతో బయటకు వెళ్దామని భార్య చెప్పింది. అందుకు ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన శ్రీనివాసరావు గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుంటుబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం శ్రీనివాసరావు ఇంటి సమీపంలో ఉన్న బావి వద్ద వ్యక్తి మృతదేహం తేలడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాము బావిలో మృతదేహాన్ని బయటకు తీయించగా మృతుడు శ్రీనివాసరావుగా గుర్తించారు. శ్రీనివాసరావు తండ్రి మోనింగి ప్రభాకరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెరువులో పడి విద్యార్థిని మృతి మెళియాపుట్టి : దీనబంధుపురం పంచాయతీ గేదెలపోలూరు గ్రామానికి చెందిన 4వ తరగతి విద్యార్థిని చెరువులో పడి మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం ఒంటి పూట బడి నిర్వహించడంతో సవర రెజీనా(9) గ్రామంలోని చెరువులోకి స్నానానికి దిగింది. ఆ సమయంలో ఏం జరిగిందో గానీ మునిగిపోయి చనిపోయింది. పోలీసులు గ్రామానికి చేరుకున్నప్పటికే మృతదేహం పూడ్చేశారు. ఫిర్యాదులు ఏమీ వద్దని వారించి గిరిజనులు పట్టుబట్టి పోలీసులను వెనక్కి పంపినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. దుబాయ్లో కాగువాడ వాసి మృతి పాతపట్నం : దుబాయ్(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో ఓ కంపెనీలో వెల్డర్గా ఉద్యోగం చేస్తున్న పాతపట్నం మండలం కాగువాడ వస్త్రపురి కాలనీకి చెందిన మొగల్ హుస్సేన్ సాహెబ్ (44) శనివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. ఈ మేరకు భార్య సుల్తాన్ బేగం మొగల్కు, కుటుంబ సభ్యులు కంపెనీ నిర్వాహకులు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వదేశం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సాహెబ్కు భార్య, కుమారుడు ఆల్తాఫ్ మొగల్ ఉన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీలో రిటైరైన, చనిపోయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్ క్యాష్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. శనివారం శ్రీకాకుళంలోని రెవెన్యూ భవన్లో ఈయూ జిల్లా అధ్యక్షుడు జి.త్రినాథ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్డు ఉద్యోగులకు వైద్యసౌకర్యాలు, ఆర్టీసీ ఆసుపత్రుల్లో మందులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 11వ పీఆర్సీ బకాయిలు, ఎన్నికల హామీ మేరకు ఐఆర్ ప్రకటించి 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పి.భానుమూర్తి మాట్లాడుతూ సీ్త్రశక్తి ఉచిత బస్సు పధకం విజయవంతం కావాలంటే కనీసం 3000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, 10 వేల పోస్టులను భర్తీ చేయాలని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.నానాజీ, ఏపీజేఏసీ అమరావతి శ్రీకాకుళం జిల్లా కంచరాన శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి సీపాన వెంకటరమణ, జోనల్ అధ్యక్షులు కె.జే.శుభాకర్, జోనల్ కార్యదర్శి బాసూరి కృష్టమూర్తి, కోశాధికారి జి.తాతాలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కె.దశరథుడు (టెక్కలి డిపో), జిల్లా కార్యదర్శిగా గూనాపు త్రినాథ్ (శ్రీకాకుళం–1 డిపో), వర్కింగ్ ప్రెసిడెంట్గా బి.టి.వి.శ్రీనివాస్ (పలాస), చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా బత్తిన అప్పారావు (శ్రీకాకుళం– 2 డిపో), కోశాధికారిగా పి.వి.ఆర్.లలితకుమారి (శ్రీకాకుళం–1 డిపో), జాయింట్ సెక్రటరీగా బి.మురళిమోహన్, ప్రచార కార్యదర్శిగా వై.కె.కుమార్, ఉపాధ్యక్షుడిగా ఎస్.జోగారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా డి.వనజాక్షి, ఎం.సురేష్, అసిస్టెంట్ సెక్రటరీలుగా వి.డి.రావు, సి.ఎస్.కుమార్ తదితరులు నియమితులయ్యారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈయూ నాయకులు కె.బాబూరావు, ఎస్వి రమణ, కె.గోవిందరా తదితరులు పాల్గొన్నారు. -
సహకార బ్యాంకులో నియామకాలు పూర్తి
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్లో ఖాళీల భర్తీ ప్రక్రియ శనివారంతో పూర్తయినట్లు డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఎంపికై న ఉద్యోగులకు శనివారం నియామక పత్రాలను అందజేశారు. డీసీసీబీలో 19 అసిస్టెంట్ మేనేజర్లు, 35 స్టాఫ్ అసిస్టెంట్ల నియామకం కోసం ఈ ఏడాది జనవరి 8న నోటిఫికేషన్ విడుదలైందని పేర్కొన్నారు. మే 5, 11వ తేదీలలో పరీక్షలు నిర్వహించగా 18 మంది అసిస్టెంట్ మేనేజర్లుగానూ, 31 మంది స్టాఫ్ అసిస్టెంట్లుగా అర్హత సాధించారని తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం జిల్లాలో పలు డీసీసీబీ బ్యాంక్లలో ఖాళీగా ఉన్న చోట్ల జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చామన్నారు. బ్యాంక్ వ్యాపారం ప్రస్తుతం రూ.2610 కోట్లుగా ఉందని, వచ్చే మార్చి నెలాఖరు నాటికి రూ.3500 కోట్లకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంక్ సీఈవో డి.సత్యనారాయణ, జీఎం ఎస్విఎస్ జగదీష్, డీజీఎం ఎస్.రమేష్, మేనేజర్ దశరథ పాల్గొన్నారు. -
అవస్థలు డబుల్!
అండర్ పాసేజ్లు ఎవరి కోసం నిర్మించారో అర్ధం కావడం లేదు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన వీటి వల్ల కష్టాలు రెట్టింపయ్యాయి. వర్షం పడిన ప్రతిసారి రోజుల తరబడి చిక్కాలవలస వద్ద రాకపోకలు నిలిచిపోతున్నాయి. తప్పని పరిస్థితుల్లో వాహనాలను రైల్వే ట్రాక్ పైనుంచే తీసుకెళ్లాల్సి వస్తోంది. రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు. – ఎం. లక్ష్మునాయుడు, చిక్కాలవలస వర్షం పడిన ప్రతిసారీ ఇబ్బందులు పడుతున్నాం. వాహనాలు నడపలేకపోతున్నాం. ఇరువైపులా రాకపోకలు నిలిచిపోతున్నాయి. అయినా రైల్వే శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజలను ఇలా కష్టాలకు వదిలేయడం అన్యాయం. మంత్రి రామ్మోహన్నాయుడు స్పందించి రైల్వే అధికారులతో మాట్లాడి నీరు నిల్వ లేకుండా చూడాలి. – కింతలి విశ్వనాథం, దాసరివానిపేట నరసన్నపేట : కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది రైల్వే అండర్ పాసేజ్ల పరిస్థితి. రైల్వే క్రాసింగ్ల వద్ద వాహనచోదకుల నిరీక్షణకు తెరదించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ అండర్ పాసేజ్లు ఇప్పుడు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాలు పడేటప్పుడు నీటితో నిండిపోయి రాకపోకలకు వీలు లేకుండా చేస్తున్నాయి. ఇదీ పరిస్థితి.. రైల్వే క్రాసింగ్ల వద్ద వాహనదారుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా అండర్ పాసేజ్లు నిర్మించింది. కొన్ని గంటల వ్యవధిలోనే అండర్ పాసేజ్లు నిర్మించామంటూ గొప్పగా చెప్పుకున్నారు. వీటిని నిర్మించేందుకు వారి ఆలోచన ఒకలా ఉంటే క్షేత్రస్థాయిలో ఇక్కడ ప్రజలు, వాహనదారులు పడుతున్న అవస్థలు మరోలా ఉన్నాయి. అండర్ పాసేజ్లు నిర్మాణం పూర్తయితే కష్టాలు తొలుగుతాయి అని వాహనదారులు ఆశించారు. అందుకు భిన్నంగా అవస్థలు మరింత పెరిగాయి. ‘అప్పడే బాగుండేది.. గేటు వేస్తే కొద్ది నిమిషాలు వేచి ఉండేవారం.. గేటు తీసి ఉంటే యథావిదిగా వెళ్లిపోయే వాళ్లం. ఇప్పుడలా కాదు. వర్షా కాలం వచ్చిందంటే రోజుల తరబడి అండర్ పాసేజ్లో నీరు నిలిచిపోయి రాకపోకలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి..’ అంటూ పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిన్న వర్షం పడినా అండర్ పాసేజ్ల వద్ద నీరు నాలుగైదు అడుగుల మేర నిలిచిపోతోంది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్థంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. 15 రోజుల క్రితం పడ్డ వర్షానికి నాలుగు రోజులు రాకపోకలు నిలిచిపోగా వారం క్రితం పడ్డ వర్షానికి మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. అండర్పాసేజ్ల్లో చేరిన నీరు తొలగించేందుకు, నీరు చేరకుండా ఉండేందుకు రైల్వే శాఖ చేపట్టిన చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నాలుగు అడుగుల మేర నీరు.. నరసన్నపేట మండలంలో ఆర్అండ్బీ రహదారిపై నడగాం, చిక్కాలవలస, కంబకాయల వద్ద, పంచాయతీరాజ్ రహదారిపై దాసరివానిపేట వద్ద అండర్ పాసేజ్లు నిర్మించారు. నడగాం, దాసరివానిపేట, చిక్కాలవలసల వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. వర్షం నీరు నాలుగైదు అడుగుల మేర నిలిచిపోతోంది. దీంతో రోజుల తరబడి రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఇప్పటికై నా రైల్వే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దాసరివానిపేట రైల్వే క్రాసింగ్ వద్ద నిర్మించిన అండర్ పాసేజ్ అసంపూర్తిగా ఉంది. పైన రేకులు(రూఫ్) వేయలేదు. దీనిని నిర్మించే ముందు గ్రామస్తులకు రైల్వే శాఖ పలు హామీలు ఇచ్చింది. దాసరివానిపేట నుంచి ఉర్లాం రైల్వే స్టేషన్ వరకూ రోడ్డు వేస్తామని, పోలాకి చానల్కు డ్రైన్ నిర్మించి అండర్ పాసేజ్లో నీరు లేకుండా చేస్తామని చెప్పినా కార్యరూపం దాల్చలేదు. కష్టాలు రెట్టింపయ్యాయంటున్న వాహనచోదకులు రైల్వే అండర్ పాసేజ్లలో నిలిచిపోతున్న వర్షపు నీరు రోజుల తరబడిన స్తంభించిపోతున్న వాహనాల రాకపోకలు పట్టించుకోని రైల్వే అధికారులు -
రసాభాసగా మున్సిపల్ సమావేశం
● అధికారుల వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల వాకౌట్ పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. పోలీసు పహారా మధ్య మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఈ సమావేశం నుంచి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. గత సమావేశంలో తెలిపిన అంశాలపై తగిన వివరణ ఇవ్వకుండా ఎలా ఈ సమావేశమవుతారని మున్సిపల్ వైస్ చైర్మన్ మీసాల సురేష్బాబు, కౌన్సిలర్లు దుర్గాప్రసాద్ పండా, బెల్లాల శ్రీనివాసరావు, పప్పల ప్రసాదరెడ్డి, పిచ్చుక అజయ్, కర్రి మాధవరావు, సవర సోమేశ్వరరావు, బోర చంద్రకళ, దున్న నిర్మల, శార్వాన గీతరవి, దువ్వాడ సత్యవతి, అంబటి మాధురి, పోతనపల్లి ఉమాకుమారి, బల్ల రేవతి, కోఆప్సన్ సభ్యుడు బమ్మిడి సంతోస్కుమార్ తదితరులు ప్రశ్నించారు. తగిన సమాధానం రాకపోవడంతో వారంతా పోడియం ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. అయినప్పటకీ కమిషనర్ ఎన్.రామారావు నుంచి తగిన సమాధానం రాకపోవడంతో బయటకు వెళ్లి బైఠాయించారు. అప్పటికే సభలో 8మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. సమావేశానికి ముందుగా ఈ విషయం తెలియక ముగ్గురు వైఎస్సార్ సీపీ సభ్యులు శిస్టు బృందావతి, జోగి సతీస్కుమార్, బోనెల చంద్రమ్మలు రిజిస్టరు పుస్తకంపై సంతకాలు చేశారు. దీంతో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారని కోరం సరిపోయిందని కమిషనరు సమావేశం తూతూమంత్రంగా ముగించేశారు. 37 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్టు తీర్మానాలు చేసుకున్నారు. వార్డుల్లో తమకు సంబంధం లేకుండా పనులు జరగుతున్నాయని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నిమజ్జనం..జరభద్రం!
● మొదలైన గణనాథుని అనుపోత్సవం ● చెరువులు, గెడ్డలు, సముద్రం వద్ద జాగ్రత్తలు తప్పనిసరి ● మద్యానికి దూరంగా ఉండాలంటున్న అధికారులు టెక్కలి : వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలు మొదలయ్యాయి. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అనుపోత్సవంలో పాల్గొనేందుకు యువకులు పోటీపడుతుంటారు. ఈ సమయంలో కొందరు అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నిమజ్జనం సమయంలో మద్యం సేవించి చెరువుల్లో, కాలువల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. పొంచి ఉన్న ప్రమాదం.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దాదాపు అన్ని చెరువులు, సాగు నీటి కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి. ఉపాధి పనులు జరగడంతో చాలావరకు లోతుగా ఉన్నాయి. అది గమనించకుండా రాత్రి సమయాల్లో నిమజ్జనాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సముద్రతీరంలో నిమజ్జనాలు మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. చిన్నారులను చెరువులు, సాగునీటి కాలువలు, సముద్రతీరాల వద్దకు తీసుకువెళ్లకపోవడం ఉత్తమం. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు దృష్టిలో ఉంచుకుని వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలని యువకులకు అధికారులు సూచిస్తున్నారు. ఈ విషయంలో ఆయా ఉత్సవ కమిటీ సభ్యులే భాద్యత వహించాలని ఆదేశాలు చేస్తున్నారు. నిమజ్జనాల్లో కొన్ని రకాల జాగ్రత్త చర్యలు, ఆంక్షలపై టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, సీఐ విజయకుమార్ తదితరులు ఉత్సవ కమిటీ సభ్యులతో ఇటీవల సమావేశం నిర్వహించి సూచనలు అందజేశారు. జాగ్రత్తలు తప్పనిసరి.. ● పోలీసులు సూచించిన మార్గంలోనే నిమజ్జన ఊరేగింపు చేయాలి. విగ్రహాన్ని తరలించే వాహనాల సమాచారం ముందస్తుగా అందజేయాలి. డీజే కు అనుమతి తీసుకోవాలి. ● నిమజ్జనం సమయంలో విద్యుత్ తీగల ప్రభావం లేకుండా చూసుకోవాలి. ● నిమజ్జన ఊరేగింపులో వేషధారణలపై ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ● మద్యం సేవించి నిమజ్జనాల్లో పాల్గొనేవారిపై కఠినమైన చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు ఉన్నాయి ● పోలీసులు గుర్తించిన సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలి. ● నిమజ్జనాల్లో చిన్న పిల్లలు లేకుండా చూసుకోవాలి. అలా చేస్తే చర్యలు.. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మద్యం సేవించి తగాదాలకు పాల్పడినా, నిమజ్జనాల సమయంలో మద్యం సేవించినా చర్యలు చేపడతాం. మద్యానికి దూరంగా ఉంటూ నిమజ్జనాలు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే ఉత్సవ కమిటీ సభ్యులే బాధ్యులవుతారు. – డి.లక్ష్మణరావు, డీఎస్పీ, టెక్కలి -
బస్సులు లేవు.. రైళ్లు రావు!
● ప్రయాణికులకు నరకయాతన ● ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్లలో గంటల తరబడి పడిగాపులు శ్రీకాకుళం అర్బన్/కంచిలి: సరిపడా బస్సులు లేక, సకాలంలో రైళ్లు రాక జిల్లా ప్రయాణికులు శుక్రవారం నరకయాతన అనుభవించారు. విజయనగరం వద్ద గూడ్స్ రైలు ప్రమాదం జరగడంతో అటు విశాఖపట్నం నుంచి వచ్చే రైళ్లు, ఇటు భువనేశ్వర్ నుంచి వచ్చే రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, ఆమదాలవలస తదితర అన్ని బస్స్టేషన్లతో పాటు జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం కాంప్లెక్స్ కూడా ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. దీంతో ఉదయం 9గంటలకు ప్రారంభమైన రద్దీ సాయంత్రం వరకూ కొనసాగింది. వచ్చిన బస్సులు నిండిన వెంటనే వెళ్లిపోవడంతో మిగిలిన ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాశారు. ముఖ్యంగా దూరప్రాంతమైన విశాఖపట్టణం వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. మరోవైపు బరంపురం–విశాఖపట్నం, భువనేశ్వర్–విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లను రద్దు చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సోంపేట రైల్వేస్టేషన్లో ఉదయం 8.26 గంటలకు వచ్చిన ప్రశాంతి ఎక్స్ప్రెస్ 11.30 గంటల వరకు నిలిచిపోయింది. ఆ రైలు కదిలిన తర్వాత అదే ప్లాట్ఫాం మీదకు ఇక్కడ స్టాపేజీ లేని షాలిమర్–వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ వచ్చింది. ఇది కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు నిలిచిపోయింది. ఉదయం 9.20 గంటలకు రావల్సిన కోల్కత్తా– చైన్నె మెయిల్ మధ్యాహ్నం 3–50 గంటలకు వచ్చింది. ఇక భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ ఉదయం 11.45కి రావల్సి ఉండగా.. సాయంత్రం 4.20 గంటలకు వచ్చిందని సోంపేట రైల్వేస్టేషన్ మేనేజర్ సత్యనారాయణ బెహరా తెలిపారు. -
11, 12 తేదీల్లో కళా ఉత్సవం
గార : వమరవల్లి డైట్ కళాశాలలో సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జరగనున్న జిల్లా స్థాయి కళా ఉత్సవం పోటీలను విజయవంతం చేయాలని ఇన్చార్జి డీఈఓ రవిబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం డైట్లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలను వెలికి తీయడమే లక్ష్యంగా పోటీలు జరుగుతున్నాయని చెప్పారు. గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, నృత్యం, నాటకం, సంప్రదాయ కథలు, దృశ్యకళలు వంటి ఆరు అంశాలపై పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన 9, 10, 11, 12 తరగతులకు చెందిన వారు పాల్గొనవచ్చని, ఆసక్తి కలవారు సెప్టెంబర్ 4లోగా 77023 91639 నంబరుకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.గౌరిశంకర్, డీవైఈఓ విజయకుమారి, లెక్చరర్లు వెంకటరావు, సీహెచ్ రమణ తదితరులు పాల్గొన్నారు. -
పీడీలకు పురస్కారాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రతిభా పురస్కారాలను ఐదు పాఠశాలలకు చెందిన పీడీలు అందుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గత విద్యా సంవత్సరంలో (2024–25) వివిధ క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఐదు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అమరావతి వారి ఆదేశాల మేరకు క్రీడాకారుల రాణింపు ఆధారంగా మొదటి ఐదు స్థానాల్లో స్కూల్స్ జాబితాను ఖరారుచేశారు. మొదటి స్థానంలో ఎంజేపీఏపీ శాస్త్రులపేట(244 పాయింట్లు), ద్వితీయ స్థానంలో జెడ్పీహెచ్ స్కూల్ అల్లినగరం (224), తృతీయ స్థానంలో జెడ్పీహెచ్ స్కూల్ ఇప్పిలి (222), నాలుగో స్థానంలో జెడ్పీహెచ్ స్కూల్ పాత్రునివలస (214), ఐదో స్థానంలో జెడ్పీహెచ్ స్కూల్ కేశవరావుపేట (202 పాయింట్లు) నిలిచాయి. వీరికి జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు, ఉప విద్యాధికారులు ఆర్.విజయకుమారి, పి.విలియమ్స్ చేతులమీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, జిల్లా స్కూల్గేమ్స్ కార్యదర్శి బీవీ రమణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు సత్వరం పరిష్కరించాలి: ఎస్పీ
పలాస: పోలీసు స్టేషన్కు వచ్చిన అర్జీలను సత్వరమే పరష్కరించాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి చెప్పారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్లో పాల్గొన్నారు. పలువురి నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని టెక్కలి, కాశీబుగ్గ సబ్డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల కోసం కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. వీటిని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. అర్జీలను స్వీకరించిన తర్వాత వాటిని స్వయంగా పరిశీలించారు. పెండింగ్ కేసులన్నీ తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటప్పారావు, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
దీర్ఘాశిలో చైన్స్నాచింగ్
పోలాకి: దీర్ఘాశి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో దొంగలు హల్చల్ సృష్టించారు. మెండ గడ్డెమ్మ(63) అనే వృద్ధురాలు పశువులకు దాణా పెడుతుండగా వెనక నుంచి వచ్చిన అగంతకుడు బంగారు తాడు (సుమారు పావు తక్కువ మూడు తులాలు) లాక్కొని అక్కడే బైక్పై ఉన్న ఇంకో వ్యక్తి సహాయంతో పరారయ్యారు. తాడు లాగే సమయంలో తన నోటిని గట్టిగా మూసివేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఎస్ఐ రంజిత్ నేతృత్వంలో చైన్స్నాచర్స్ కోసం వేట ముమ్మరం చేశారు. కొందరు అనుమానితులను గుర్తించి విచారిస్తున్నట్లు సమాచారం. నిత్యం రద్దీగా వుండే పోలాకి–నరసన్నపేట రహదారిలో చైన్స్నాచర్లు పరారైనట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కార్మికులకు అండగా.. శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రమదోపిడీకి గురవుతున్న కార్మికులకు కార్మికశాఖ ఉప కార్మిక కమిషనర్ డి.దినేష్కుమార్ అండగా నిలిచారు. ప్రత్యేక తనిఖీలు నిర్వహించి శుక్రవారం కార్మికులకు రూ.45514 వేతనాన్ని యాజమాన్యాల నుంచి వసూలు చేసి డి.డి.రూపంలో తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా డీసీఎల్ మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ ప్రకారం ఆన్లైన్లో తనిఖీ నిర్వహించాలని వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించగా.. అందులో నలుగురు కార్మికుల వేతనాల్లో తేడాల్ని గమనించామన్నారు. సంబంధిత యజమానుల వద్ద నుంచి తేడా వేతనాన్ని రికవరీ చేసి కార్మికులకు అందించామని చెప్పారు. దీంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. చెరువులో పడి వ్యక్తి మృతి టెక్కలి రూరల్: పెద్దరోకళ్లపల్లి పంచాయతీ రామనగరం గ్రామానికి చెందిన బొడ్డు రామన్న (37) అనే వ్యక్తి చెరువులో పడి మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్న తన పొలంలో ఎరువులు వేసిన తర్వాత గ్రామ సమీపంలోని చెరువులో స్నానానికి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో మునిగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు గుర్తించి చెరువులో తేలుతున్న రామన్నను బయటకు తీసి టెక్కలి జిల్లాఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రామన్నకు భార్య లత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు. మా సొమ్ము ఎప్పుడు చెల్లిస్తారు? ఇచ్ఛాపురం: తాము కష్టపడి సంపాదించుకున్న సొమ్మును తిరిగి చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళన తప్పదని ఇచ్ఛాపురం పోస్టాఫీసు వద్ద ఖాతాదారులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం పోస్టాఫీసును పరిశీలించేందుకు వ చ్చిన పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ను కలిసి తమ గోడు వినిపించారు. స్కామ్ జరిగి నెలరోజులైనా పోస్టల్ సిబ్బంది పట్టించుకోకపోవడం తగదని ఖాతాదారులు బాలరాజు, సీహెచ్ లోహిదాస్, శ్రీను తదితరులు వాపోయారు. యువకుడిపై పోక్సో కేసు శ్రీకాకుళం క్రైమ్ : బాలికను మోసగించిన యువకుడిపై శుక్రవారం పోక్సో కేసు నమోదు చేశామని శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్స్టేషన్ సీఐ పి.ఈశ్వరరావు తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని విద్యాధరిపురం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ కుమార్తె ఇంటర్మీడియట్ సగంలో ఆపేసింది. శ్రీకాకుళం నగరంలోని బాకెర్సాహెబ్పేటలో తన అమ్మమ్మ ఇంటికి తరచూ వస్తుండేది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో నగరానికి వచ్చిన బాలిక తన ఫోన్ పనిచేయకపోవడంతో దీపామహాల్ సమీపంలో సెల్ఫోన్ షాపులో ఇచ్చింది. నిర్వాహకుడు వడ్డి శ్యామ్సుందరరావుతో పరిచయం ఏర్పడటంతో గర్భం దాల్చింది. దీంతో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. -
ఆటో, మ్యాక్సీ డ్రైవర్లను ఆదుకోవాలి
రణస్థలం: ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోతున్న ఆటో, మ్యాక్సీ డ్రైవర్లకు భృతి ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూ ఏపీ ఆటో, ట్యాక్సీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.వామనమూర్తి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రణస్థలం రామతీర్థం జంక్షన్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం ధర్నా నిర్వహించి తహసీల్దార్ సనపల కిరణ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు కిరాయి లేక తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఫైనాన్స్ కట్టలేక, అప్పులు తీర్చలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డ్రైవర్లకు భారమైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్సీ, టోల్ ఫీజులు 30శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. విడి భాగాలపై జీఎస్టీ, వ్యాట్, సెస్ పన్నులు రద్దు చేసి డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. చంద్రబాబు ఆధికారంలోని వస్తే బ్యాడ్జీ కలిగిన డ్రైవర్లకు సంవత్సరానికి రూ. 15వేలు ఆర్ధిక సహాయం చేస్తామని, పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, అనారోగ్యంతో చనిపోతే రూ.5లక్షలు, ప్రమాదంలో చనిపోతే 10లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లైసెన్సు కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు ఏటా రూ.25వేలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కె.శివ, సీఐటీయూ నాయకులు వెలమల రమణ, ఎస్.లక్ష్మణరావు, బి.రామకృష్ణ, బొంతు లక్ష్మణరావు, చిరంజీవి, ఎం.రాముడు, జగదీష్, జి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్డీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ క్యాంపస్తో పాటు అనుబంధ కళాశాలల్లో పరిశోధన చేసేందుకు గాను పీహెచ్డీ సీట్లు భర్తీకి శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. బయోటెక్నాలజీ, సోషల్వర్క్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరిపి సంబంధిత ధ్రువపత్రాలను పరిశీలించారు. వర్శిటీ అకడమిక్ అఫైర్స్ డీన్ డాక్టర్ కె.స్వప్నవాహినీ పర్యవేక్షణలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఈ కౌన్సెలింగ్ జరిగింది. రెక్టార్ ఆచార్య బి.అడ్డయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఉదయ్భాస్కర్, డాక్టర్ ఎం.అనూరాధ పాల్గొన్నారు. -
సిక్కోలులో బార్బరిక్ యూనిట్ సందడి
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని కిన్నెర థియేటర్లో ప్రదర్శిస్తున్న ‘బార్బరిక్’ చిత్ర యూనిట్ శుక్రవారం శ్రీకాకుళంలో పర్యటించింది. చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ నటుడు సత్యరాజ్(కట్టప్ప)తో పాటు చిత్ర నటులు సత్యం రాజేష్ తదితరులు విచ్చేసి ప్రేక్షకులతో ముచ్చటించారు. చిత్ర దర్శకులు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ తనది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం సుసరాం గ్రామమని, చిన్నప్పటి నుంచి తనకు సినిమాలంటే ఎంతో ఇష్టమని, ఆ ఇష్టంతోనే దర్శకునిగా మారి బార్బరిక్ చిత్రాన్ని తీశానని తెలిపాడు. సత్యరాజ్(కట్టప్ప) మాట్లాడుతూ శ్రీకాకు ళం రావడం ఇదే తొలిసారని, ఇక్కడి ప్రేక్షకులు ఎంతో మంచివారని, సినిమా బాగుంటే ఎంతగానో ఆదరిస్తారన్నారు. నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ ‘ఊర్లో అందరూ మంచిగున్నార్రా’ అంటూ ప్రేక్షకులను అడిగేసరికి ప్రేక్షకులంతా కేరింతలు, ఈలలు వేశారు. ఇక్కడి ప్రేక్షకుల ఆదరాభిమానాలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ ప్రతినిధులు సురేష్, కిన్నెర థియేటర్ మేనేజర్ వరప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ జయరాం, డిస్ట్రిబ్యూటర్ తేజ తదితరులు ఉన్నారు. -
రైల్వే గేటు మూసివేత నేడు
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వే స్టేషన్ పరిధి ఊసవానిపేట రైల్వే గేటు శనివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మూసి వేయనున్నట్లు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపా రు. ఉర్లాం–శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య ట్రాక్ మరమ్మతులు పనులు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ గేటు మూసి వేస్తున్నామని ఆయ న పేర్కొన్నారు. ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే నరసన్నపేట రోడ్డులో ఈ గేటు ఉండడంతో ముందస్తుగా సమాచారం ఇస్తున్న ట్లు తెలిపారు. ప్రయాణికులు సహకరించి వేరే రహదారుల గుండా ప్రయాణించాలని ఆయన కోరారు. 130 మంది సర్టిఫికెట్ల పరిశీలన శ్రీకాకుళం: డీఎస్సీ నియామక ప్రక్రియలో శుక్రవారం 130 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. తొలి రోజున 403 మంది అభ్యర్థుల పత్రాలు పరిశీలించిన విషయం పాఠకులకు తెలిసిందే. మిగిలిన 140 మందిలో 130 మందికి మాత్ర మే కాల్ లెటర్స్ రావడంతో వారు ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరయ్యారు. ఈ 130 మందిలో ఏడుగురికి పూర్తిస్థాయిలో ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో వాటిని తీసుకొని శనివారం ఉదయం 10 గంటల్లోగా రావాలని అధికారులు సూచించారు. మిగిలిన 126 మందిలో ఇద్దరు ఉద్యోగం చేపట్టేందుకు అయిష్టతను లిఖితపూర్వకంగా తెలియజేశారు. జిల్లా నుంచి పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపాల్ వంటి జోన ల్ స్థాయి పోస్టులకు అర్హత సాధించిన వారికి విశాఖపట్నంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతోంది. జిల్లా నుంచి ఈ పోస్టులకు ఎంతమంది ఎంపికయ్యారు అన్నది కూడా అధికారులు సైతం చెప్పలేకపోతున్నారు. అయితే మొత్తం 543 మందికి కాల్ లెటర్స్ రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 533 మందికి మాత్రమే పత్రాల పరిశీలనలకు పిలుపు వచ్చింది. మిగిలిన వారికి ఎందుకు రాలేదనే సందేహం వ్యక్తమవుతోంది. జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం శనివారం ఉదయంలోగా మిగిలిన పదిమందికి మెసేజ్లు వస్తాయని చెబుతున్నారు. ‘వైఎస్సార్ను స్మరించుకుందాం’ నరసన్నపేట: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని సెప్టెంబర్ 2వ తేదీన పార్టీ శ్రే ణులు ఊరూరా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపు నిచ్చారు. వైఎస్సార్ విగ్రహాల వద్ద ఘనంగా నివాళులర్పించాలన్నారు. పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో పాల్గొనాలని కోరారు. గిడుగు స్వగ్రామంలో ఘనంగా జయంతి వేడుకలు సరుబుజ్జిలి: వ్యావహారిక భాషా పితామహులు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలు ఆయన స్వగ్రామం అగ్రహారం గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి వైఎస్సార్కాంగ్రెస్పార్టీ మండల కన్వీనర్ బెవర మల్లేశ్వరరావు, ఆమదాలవలస మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బెవర కృష్ణవేణి, ఎంఈఓ డి.బాలరాజు పూల మాలలు వేసి అంజలి ఘటించారు. వ్యవహారి క భాషా అమలులో అంతర్జాతీయ స్థాయిలో గిడుగు ప్రఖ్యాతి గడించారని అన్నారు. ‘మా ఊరి పేరు మార్చండి’ మెళియాపుట్టి: తమ ఊరి పేరే తమకు సమస్యగా మారిందని పడ్డ గ్రామ పంచాయితీ పరిధిలోని సానిపాలెం గ్రామానికి చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ పాపారావుకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. గ్రామం పేరు వల్ల అవమానాలు ఎదురవుతున్నాయని, గ్రామానికి రామయ్య పాలెం అని పేరు మార్చాలని కోరారు. -
సర్కారు వైఖరి.. మూడు బడులకు ఉరి
● ప్రభుత్వ విధానాలతో మూతపడిన మూడు పాఠశాలలు ● సొంత ఊరిలో విద్యకు నోచుకోని కౌశల్యాపురం, మహదేవిపురం, నేరడి గ్రామాల పిల్లలు కొత్తూరు: కూటమి ప్రభుత్వ వైఖరి ప్రభుత్వ బడులకు ఉరిగా మారుతోంది. విద్యా శాఖలో ఈ ఏడాది తీసుకువచ్చిన నూతన విద్యావిధానం విద్యార్థులకు శాపంగా మారుతోంది. చిన్నారులు ఉన్న ఊరిలో పాఠశాలలో చదువుకునే భాగ్యానికి దూరమవుతున్నారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులను మరో బడికి పంపించేయడంతో కొత్తూరు మండలంలోని కౌశల్యాపురం, మహదేవిపురం, నేరడి గ్రామాలకు చెందిన మూడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. ఈ ఏడాది ఈ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా జాయిన్ కాకపోవడంతో టీచర్లను మరో పాఠశాలకు నియమించారు. ఈ గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలో ఉన్న మోడల్ ప్రైమరీ పాఠశాలకు పంపించారు. దీంతో ఈ మూడు పాఠశాలల్లో రెండో తరగతి చదువుతున్న ఒక్కో విద్యార్థి మిగిలాడు. ఒక విద్యార్థి కోసం ఒక టీచర్ పని చేస్తున్న తరుణంలో ఎక్కువ మంది పిల్లలు లేరన్న కారణంతో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు వేరే బడికి పంపించారు. దీంతో విద్యార్థులు లేక మూడు పాఠశాలలను మండల విద్యాశాఖ అధికారులు మూసివేశారు. ఊరిలోని బడిలో పిల్లలను చదివించలేకపోతున్నామని ఆయా గ్రామాల ప్రజలు బాధ పడుతున్నారు. గ్రామాల్లో పిల్లలు లేరు మూత పడిన మూడు పాఠశాలల గ్రామాల్లో బడి ఈడు పిల్లలు లేరు. దీంతో ఈ ఏడాది పాఠశాలల్లో విద్యార్థులు చేరకపోవడంతో బడులు మూతపడ్డాయి. రెండో తరగతిలో ఉన్న ఒక్క విద్యార్థిని తల్లిదండ్రులు ఇతర పాఠశాలకు తీసుకువెళ్లడంతో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశాం. – ఎన్.శ్రీనివాసరావు ఎంఈఓ–2, కొత్తూరు మండలం సౌకర్యాలు లేవు మా గ్రామంలో ఉన్న పాఠశాలలో సౌకర్యాలు లేవు. మరుగుదొడ్లు సక్రమంగా పని చేయ డం లేదు. మా పిల్లాడు ఒక్కడు మాత్రమే స్కూల్లో ఉంటే మానసిక వికాసం సరిగా ఉండదు. అందుకే సమీపంలోని కురిగాం పాఠశాలలో చేర్పించాము. – ఒట్టికొట్టు స్వాతి, విద్యార్థి తల్లి, మహదేవి పురం కొత్తూరు మండలం ఐదు తరగతులు నిర్వహించాలి ఒకటి నుంచి ఐదు తరగతులు ఒకే పాఠశాలలో నిర్వహించిప్పుడే పిల్లలంతా ఒకే పాఠశాల లో చదువుతారు. మూడు నుంచి ఐదు తరగతుల వరకు చదువుతున్న పిల్లలను మరో పాఠశాలలో చేర్పించడం వల్ల మిగతా వారు ఉండడం లేదు. – గూనాపు రాజు, విద్యార్థి తల్లి, నేరడి, కొత్తూరు -
బతుకు తల్లకిందులు
● ఆటో బోల్తా పడి విద్యార్థి మృతి ఎచ్చెర్ల: అమ్మను ఆట పట్టిస్తూ సందడిగా గడిపే వయసది. అక్కతో హాయిగా కబుర్లు చెబుతూ ఆనందంగా ఉండే ప్రాయమది. కింద పడి దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోయే శరరీమది. కానీ నడిరోడ్డుపై తిరగబడిన ఆటో.. ఆ పిల్లాడి బతుకును తల్లకిందులు చేసేసింది. ఆ తల్లికి కొడుకును దూరం చేసింది. తమ్ముడి యాతనను కళ్లారా చూసిన అక్కకు జీవితానికి సరిపడా వేదన మిగిల్చింది. దాదాపు పది మంది ప్రయాణికులు ఉన్న ఆటోలో అంతా సురక్షితంగా బయటపడితే.. అతడు మాత్రమే చావుకు బలయ్యాడు. చిల కపాలెం జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిలకపాలెం గ్రామానికి చెందిన కుప్పిలి మనోజ్ (12) అనే విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మనోజ్తో పాటు మరో ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు టీచర్లు అల్లినగరం గ్రామంలోని ఉన్నత పాఠశాలకు ఆటోలో వస్తుండగా చిలకపాలెం జంక్షన్ దాటాక హైవేపై బండి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో మనోజ్ ఆటో కింద ఉండిపోవడంతో బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి అతడిని శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు మనోజ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మనోజ్తో పాటుగా ఆటోలో ఉన్న విద్యార్థులు, టీచర్లు చిన్న గాయాలతో బయటపడ్డారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రిమ్స్కు తీసుకెళ్లారు. అక్క కళ్లెదుటే.. మనోజ్ అక్క దర్శినీ ప్రియ కూడా అదే ఆటోలో ఉంది. తమ్ముడి వేదనను కళ్లారా చూసిన ఆమె ఏం చేయాలో తెలీక నిస్సహాయంగా దిక్కుతోచని స్థితిలో ఏడుస్తుంటే చూసిన వారి కళ్లు చెమ్మగిల్లా యి. మనోజ్ తండ్రి కుప్పిలి ప్రకాష్ చిలకపాలెంలోని మునిపేట వద్ద కార్పెంటరీ పనిచేస్తూ జీవ నం సాగిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు రోజూ ఆటోలోనే స్కూల్కు వెళ్లేవారు. ఇప్పుడు ఆ ప్రయాణమే మనోజ్ ప్రాణం తీయడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మనోజ్ అల్లినగరం ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. అక్క 8వ తరగతి చదువుతోంది. విద్యార్థి మృతి చెందడంతో శుక్రవారం బడికి సెల వు ప్రకటించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పార్ధసారధి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మనోజ్కు నివాళులర్పించారు. ఘటన జరిగిన చోట రద్దీగా ఉంటుందని, ఓ కానిస్టేబుల్ను పెట్టాలని యూటీఎఫ్ నాయకులు ఎస్ఐ సందీప్ను కోరగా ఆయన అంగీకరించారు. -
పరిమితికి మించి ప్రయాణం నేరం
విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలను ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ వేసి మరీ పట్టుకుంటున్నాం. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటోలపై ఈ ఏడాది ఇప్పటివరకు 39 కేసులు నమోదు చేశాం. ఒక్క జూలైలోనే 18 నమోదయ్యాయి. ఇక లేబర్ను తీసుకెళ్లే ఆటోలపైనా నిబంధనలు మీరితే చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు మూడు వేలకు పైగా ఆటోలున్న మన జిల్లాలో ఎప్పటికప్పుడు డ్రైవర్లకు రోడ్డు నియమ నిబంధనలపై కౌన్సిలింగ్ చేస్తున్నాం. – నాగరాజు, సీఐ, ట్రాఫిక్ శ్రీకాకుళం క్రైమ్: తల్లిదండ్రుల ఏమరపాటు, కొందరు డ్రైవర్ల అత్యాశ, అధికారుల అలసత్వం కలగలిపి.. ప్రతి ఉదయం పసి ప్రాణాలకు పరీక్ష ఎదురవుతోంది. భుజాన బండెడు బరువు మోసుకుంటూ బడికి వెళ్లడం కోసం వాహనం ఎక్కే విద్యార్థులకు సురక్షిత ప్రయాణం గగనమైపోతోంది. అయితే వ్యానులో కిక్కిరిసి వెళ్లడమో, లేదంటే ఆటో వెనుక కూర్చుని వెళ్లడమో లేదంటే స్కూలు బస్సులో ఇనుప జాలీల వెనుక నుంచి గాలి తగలని పరిస్థితుల్లో దీనంగా బయటకు చూస్తూ ప్రయాణించడమో జరుగుతోంది. వేగంగా పిల్లలను స్కూల్లో దింపి వేరే సర్వీసుకు వెళ్లిపోవాలనే ఆలోచన ప్రైవేటు వాహనాలకు ఉంటుంది. నిబంధనలను మీరి స్పీడ్ పెంచడం, రాంగ్రూట్ల్లో ఎదురుగా వస్తున్న వాహనాలను పట్టించుకోక పరిగెత్తించడంతో అప్పటికే పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకున్న వాహనాలు ప్ర మాదాలకు గురై పసివారు బలైపోతున్నారు. తాజా గా శుక్రవారం ఉదయం ఎచ్చెర్ల మండలం చిలకపాలెంకు చెందిన ఏడో తరగతి విద్యార్థి ఆటో ప్రమాదంలో మృతిచెందాడు. ప్రైవేటు వాహనాలే గతి.. జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న అనేక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులను చేరవేసేందుకు ప్రైవేటు వాహనాలే దిక్కు. ముఖ్యంగా ఒక కిలోమీటరు నుంచి ఐదు కిలోమీటర్ల లోపు ఉండే స్కూళ్లకు బస్సు సదుపాయం లేక తల్లిదండ్రులు కొందరు ఆటోవాలాలకు, వ్యాన్లకు నెలకు ఇంతిస్తామని సంప్రదించి పెట్టుకుంటున్నారు. ఆటోకు పర్మిట్, ఇన్స్యూరెన్సు, ఫిట్నెస్ పత్రాలు ఉండడంతో పాటు ఆరుగురికి మించి విద్యార్థులు ప్రయాణించకూడదని నిబంధనలున్నా ఎవరూ అ వి పాటించడం లేదు. వ్యాన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తల్లిదండ్రులు కూడా తక్కువ మంది వి ద్యార్థులను తీసుకెళ్లే ఆటోల్లోనే పంపించాలని, అదీ నిర్ణీత సమయంలోగా పంపించాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతే కాక ఆటోడ్రైవర్లు నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. వాహనం వెనుక వేలాడుతూ బడికి వెళ్లేంత ఖర్మ పిల్లాడికి ఏం పట్టింది..? ఊపిరి తీసుకోవడానికి కూడా వీల్లేకుండా కిక్కిరిసి కూర్చోవాల్సిన అవస్థ ఏముంది..? కండీషన్లో ఉందో లేదో తెలీని బండిలో విద్యార్థిని పంపించేంత అజాగ్రత్త ఎందుకు..? ప్రతి ఉదయం చాలా మంది విద్యార్థులు ఈ అవస్థలు పడుతూనే బడికి వెళ్తున్నారు. దురదృష్టవశాత్తు ఏ చిన్న ప్రమాదం జరిగినా బతుకంతా బాధ పడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకముందే తల్లిదండ్రులు మేల్కోవాలని అధికారులు సూచిస్తున్నారు. పిల్లలను బడికి పంపే వాహనాలను ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని కోరుతున్నారు. ప్రతి నిత్యం వాహనాల్లో ప్రమాదకరంగా విద్యార్థుల ప్రయాణాలు తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని అధికారుల సూచనలు పిల్లలను తీసుకెళ్లే వాహనాలు కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనన్న పోలీసులు -
ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించండి
పలాస: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషాకు సన్నిహితుడు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పీరుకట్ల విఠల్రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని తెలుగుదేశం పార్టీ పలాస నియోజకవర్గ అధికార ప్రతినిధి, పెదంచల గ్రామానికి చెందిన తలగాన నరసింహమూర్తి గురువారం కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 26న తాను మద్యం సేవించి పీరుకట్ల విఠల్, పోలాకి పాపారావులను దుర్భాషలాడానని పోలీసు స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేశారని, ఫలితంగా కాశీబుగ్గ పోలీసులు తనను పిలిపించి హెచ్చరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మద్యం తాగే అలవాటు లేదని, నేను వారిని ఎప్పుడూ ఎక్కడా దుర్భాషలాడలేదని స్పష్టం చేశారు. అయినా తనను తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని, భవిష్యత్తులో తన చేతిలో గంజాయో ఏ ఇతర మత్తు పదార్థాలు ఉన్నాయని కూడా కేసు పెట్టవచ్చని సందేహం వ్యక్తం చేశారు. పీరుకట్ల విఠల్రావును నుంచి తనకు రక్షణ కల్పించాల వేడుకున్నాడు. -
మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): విద్యుత్ పోరాటంలో అమరవీరుల స్ఫూర్తితో మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. 2000లో చంద్రబాబు నాయుడు తెచ్చిన విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా విద్యుత్ పెంపుదలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బషీర్బాగ్ కాల్పుల్లో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్రెడ్డి, బాలస్వామికి గురువారం నివాళులర్పించారు. అనంతరం విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినం శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద నిర్వహించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూఅప్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సీపీఎం నాయకులు బి.కృష్ణమూర్తి, కె.మోహనరావు, పి.తేజేశ్వరరావు, ఆర్.ప్రకాష్రావు, ఎం.గోపి, కె.సూరయ్య, పాణి గ్రహి, ఎం.లక్ష్మి, శ్రీదేవి, డి.గణేష్, ఎస్.కృష్ణవేణి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
బురద రోడ్డుపై నడవలేకపోతున్నాం
కొత్తూరు: కుంటిభద్ర జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సిరుసువాడ గ్రామ విద్యార్థులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామం నుంచి కుంటిభద్రకు వెళ్లేందుకు రహదారి బురదగా మారడంతో నడవలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోతుల్లో నీరు నిలిచిపోవడంతో సైకిల్ వెళ్తూ జారిపడుతున్నామని వాపోయారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరాచరు. కాగా, కుంటిభద్ర జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట రుచికరంగా వండటం లేదంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. -
సాంకేతిక విద్యపై పట్టు సాధించాలి
ఎచ్చెర్ల : విద్యార్థులు సాంకేతిక విద్యలో నైపుణ్యతను సాధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీశాఖ మార్గదర్శకత్వంలో అమరావతి క్వాంటం వ్యాలీ హ్యక్థాన్ 2025లో భాగంగా గురువారం ఎచ్చెర్లలోని రాజీవ్గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ(ట్రిపుల్ ఐటీ)లో అంతర్గత హ్యక్థాన్ నిర్వహించింది. క్వాంట్ కీ డిస్ట్రిబ్యూషన్ (బిబి84 ప్రోటోకాల్), క్వాంటం స్టేట్ విజువలైజర్, సూపర్డెన్స్ కోడింగ్ ప్రోటోకాల్ వంటి వినూత్న ప్రాజెక్ట్లను విద్యార్థులు ప్రదర్శించారు. ఇందులో ఎంపికై న బృందాలు అమరావతి క్వాంటం వ్యాలీ హ్యక్థాన్ 2025 తదుపరి రౌండ్లలో శ్రీకాకుళం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించి వారి వినూత్న ఆలోచనలను అభినందించారు. క్వాంట్ సాంకేతికతలతో జాతీయ రక్షణ, నావిగేషన్, సముద్ర పరిశోధనలకు అనుమైన మార్గాలను అన్వేషించడానికి ఆర్జీయూకేటీ ముందడుగు వేయడం అభినందనీయమన్నారు. క్వాంట్ టెక్నాలజీ ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ జాతీయ రక్షణ, నావిగేషన్, సముద్ర అధ్యయనాలకు సంబంధించి క్వాంటం సెన్సింగ్ ఫర్ మైరెన్ అప్లికేషన్ను పరిశోధన, ఆవిష్కరణల కోసం ఎంచుకుందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అండర్ గ్యాడ్యుయేట్ క్వాంటం విద్యను బలోపేతం చేయడానికి క్వాంటం టెక్నాలజీస్లో మైనర్ డిగ్రీని 480 మంది విద్యార్థులు ఎంపిక చేసుకున్నారు. అదనంగా ప్రత్యేక మైనర్ ల్యాబ్లు ఏర్పాటుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టీ)కి ప్రతిపాదన సమర్పించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడీ బాలాజీ తెలిపారు. కార్యక్రమంలో ఏఓ డాక్టర్ ముని రామకృష్ణ, డీన్ డాక్టర్ ఎం.శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి సీహెచ్ వాసు, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, సీఎస్ఈ విభాగాధిపతి వై.రమేష్, పీఆర్ఓ మామిడి షణ్ముఖరావు, సహాయాచార్యులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో రైతు మృతి
వజ్రపుకొత్తూరు రూరల్: గోపాలపురం గ్రామానికి చెందిన రైతు యవ్వారి వైకుంఠరావు (50) గురువారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైకుంఠరావు గురువారం రాత్రి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి మోటారు స్విచ్ ఆన్ చేస్తుండగా షాక్ కొట్టడంతో మృతి చెందారు. కాసేపటికి స్థానిక రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిమజ్జనం.. సురక్షితం..
● భక్తులకు రక్షణగా ‘లైఫ్ సేవింగ్’ బృందం ● అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సేవలు శ్రీకాకుళం న్యూకాలనీ/శ్రీకాకుళం కల్చరల్: గణపతి నిమజ్జనోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర, జాతీయ స్థాయి స్విమ్మర్లతో కూడిన లైఫ్ సేవింగ్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా బృందం తనవంతు సేవ చేస్తోంది. లైఫ్ సేవింగ్ నేషనల్ మెడలిస్ట్ షేక్ సుభాన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రశాంతంగా నిమజ్జనోత్సవాలను చేపడుతున్నారు. శ్రీకాకుళం ఉమారుద్ర కోటేశ్వర ఆలయం వద్ద గణపతి నిమజ్జనాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లైఫ్ సేవింగ్ బృందం నిర్వహిస్తున్నారు. పాలిథిన్ కవర్లు, గోనెసంచులు వేయకుండా భక్తుల చేతనే డస్ట్ బిన్స్లో వేయించి నది కలుషితం కాకుండా చేస్తున్నారు. రెండురోజులు భారీ వర్షాలతో నాగావళి నదికి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. భక్తులు లోనికి రాకుండా రోప్గా ఏర్పడి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుభాన్తోపాటు లైఫ్ సేవింగ్ ప్రతినిధులు స్వామి లక్ష్మణ్, అప్పన్న, రాజేష్, ఈసుశ్రీ, సత్తిరాజు, సహదేవుడు తదితరులు సేవలు అందిస్తున్నారు. గత కొన్నేళ్లగా లైఫ్ సేవింగ్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం సమయంలో భక్తుల సహాయార్ధం సేవలు అందిస్తున్నట్టు స్విమ్మర్లు తెలిపారు. వీరి సేవలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రజాప్రతినిధులు, సంఘ ప్రతినిధులు సైతం ప్రశంసిస్తున్నారు. -
ఎట్టకేలకు కొనసాగింపు ఉత్తర్వులు
సారవకోట: డీఎల్డీఏ చైర్మన్కు సంబంధిత అధికారులు ఎట్టకేలకు ఈ నెల 26న ఉత్తర్వులు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. గత ప్రభుత్వ హయాంలో సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన నక్క తులసీదాస్ను జిల్లా లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్కు 2023 డిసెంబర్ 4న ఏకగ్రీవంగా ఏజెన్సీ సభ్యులు ఎన్నుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పోస్టుల్లోఉన్న వారిని రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొందరు డీఎల్డీఏ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించారు. వీరికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ మన జిల్లాలో కూటమి ప్రభుత్వ పెద్దలు అడ్డుపడటంతో సంబంధిత శాఖాధికారులు కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదు. ఎట్టకేలకు కలెక్టర్ సూచనల మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు అందజేశారు. గురువారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా మబగాంలో ప్రొసీడింగ్ పత్రాలను తులసీదాస్ అందుకున్నారు. -
ఫిషింగ్ హార్బర్ స్థల పరిశీలన
ఎచ్చెర్ల : బుడగట్లపాలెం సముద్రతీర ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని గురువారం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్, ఇంజినీరింగ్ ఫర్ ఫిషరీ (సీఐసీఈఎఫ్) బెంగళూరు బృందం సాధారణ పరిశీలన చేపట్టింది. కాకినాడ వద్ద ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ను తనిఖీకి వచ్చిన వీరు బుడగట్లపాలెం హార్బర్ను కూడా పరిశీలించారు. గతంలో చేసిన ప్రతిపాదనల్లో మార్పులు చేపడుతూ డబ్ల్యూ.ఏపీ.సీవోసీ పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఇక్కడ పనులకు సంబంధించి స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు నూతన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కార్యక్రమంలో సీఐసీఈఎఫ్ డైరెక్టర్ ఎన్.రవిశంకర్, డాక్టర్ బెలియప్ప, ఏపీ మేరీ టైంబోర్డ్ ఎస్ఈ నగేష్, మత్స్యశాఖ డీడీ వై.సత్యనారాయణ, ఏఫ్డీవో రవికుమార్, సర్పంచ్ అల్లుపల్లి రాంబాబు, ఎంఎఫ్సీఎస్ సొసైటీ ప్రెసిడెంట్ సీహెచ్ శ్రీరాములు, వైస్ ప్రెసిడెంట్ యు.అప్పన్న, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త హత్యకేసులో ముగ్గురికి రిమాండ్ శ్రీకాకుళం క్రైమ్ : గతేడాది ఎచ్చెర్ల మండలం ఫరీద్పేటలో వైఎస్సార్సీపీ కార్యకర్త కూన ప్రసాద్ను టీడీపీ మద్దతుదారులు దారి కాచి దాడిచేయడంతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో ఎచ్చెర్ల పోలీసులు ఎఫ్ఐఆర్లో తొమ్మిది మందిని చేర్చి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా మరో ముగ్గురు శీపాన శివకుమార్, కొత్తకోట సాయి, జమ్మి వేణులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎచ్చెర్ల ఎస్ఐ వి.సందీప్ పేర్కొన్నారు. -
ప్రాణాలు పోతున్నాయ్!
● ప్రమాదకరంగా ఆఫ్షోర్ కాలువ ● లోతు తెలియక ఈతకు దిగుతున్న యువత ● స్నానానికి వెళ్తూ మృత్యువాత పడుతున్న ప్రజలు ● కానరాని హెచ్చరిక బోర్డులు మెళియాపుట్టి : ఆఫ్షోర్ కాలువ ప్రమాదకరంగా మారింది. రేగులపాడు రిజర్వాయర్కు అనుసంధానంలో భాగంగా మెళియాపుట్టి మండలంలోని పట్టుపురం, జోడూరు, రాజపురం, అచ్చనాపురం తదితర గ్రామాలకు ఆనుకుని ఆఫ్షోర్ కాలువను 2008–09లో తవ్వారు. సుమారు50 అడుగుల లోతున్న ఈ కాలువ మృత్యుకాలువగా మారింది. దీని లోతు తెలియక స్నానాలకు దిగి ఈతరాక ఎంతోమంది మృత్యువాతపడుతున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదు. కాలువ చుట్టుపక్కల ఎక్కడా ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేవు. దీంతో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 2018లో చిన్ననీలాపురం గ్రామానికి చెందిన కొల్లి తారకేశ్వరరావు ఇదే కాలువలో స్నానానికి దిగి మృతిచెందాడు. మూడురోజుల తర్వాత మృతదేహం లభ్యమైంది. 2019 మే 10న మారడికోట గ్రామదేవత ఉత్సవాలకు స్నేహితుని ఇంటికి వచ్చిన హైదరాబాద్ యువకుడు మొహద్దీన్ ఈత సరదాతో కాలువలో దిగి మృత్యువాత పడ్డాడు. తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నా చాలావరకు వెలుగుచూడటం లేదు. కాలువలో నిత్యం నీరు ఉండటంతో తమ మాట వినకుండా యువకులు స్నానాలకు వెళుతున్నారని, దీంతో ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందోనని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. నా పరిస్థితి ఎవరికీ రాకూడదు.. 2018లో నా భర్త తారకేశ్వరరావు ఆఫ్షోర్ కాలువలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. మూడురోజుల పాటు కనిపించకపోవడంతో పిల్లలతో నరకం అనుభవించాను. మూడో రోజు శవమైతేలాడు. నా కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదు. నిత్యం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులు స్నానాలకు కాలువ ప్రదేశానికి వెళుతుంటారు. అధికారులు స్పందించి ఏవైనా సూచికలు ఏర్పాటు చేసి ఉంటే అలా జరిగేది కాదు. – కొల్లి గుణలక్ష్మి, చిన్న నీలాపురం, మెళియాపుట్టి మండలం ప్రాణాలు తీస్తున్న ఈత సరదా.. చాలామంది కాలువలో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. కాలువ ఎంత లోతుందో తెలియక స్నానాలకు దిగుతున్నారు. గ్రామాలకు ఆనుకుని ఉండటంతో పంటపొలాల్లో పనులు చేసుకుని ఇంటికివచ్చే క్రమంలో రైతులు అదే కాలువలో స్నానాలు చేస్తున్నారు. ఏమాత్రం కాలు జారినా ప్రాణాలు దక్కవు. అధికారులు పట్టించుకోవాలి. – సవర సూరయ్య, అచ్చనాపురంత్వరలోనే ఏర్పాటు చేస్తాం పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో కాలువ లోతు నిర్ధారించలేం. అందుకే ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయలేదు. త్వరలోనే ఏర్పాటు చేస్తాం. గ్రామాలలో పర్యటించిన సమయాల్లో సైతం యువతను అప్రమత్తం చేస్తున్నాం. ప్రమాదాలు జరకుండా చర్యలు తీసుకుంటాం – రాజశేఖర్, వంశధార ఈఈ, టెక్కలి -
‘వర్షాలు ఆలస్యం కావడంతో యూరియాకు డిమాండ్’
టెక్కలి: జిల్లాలో వర్షాలు ఆలస్యం కావడంతో యూరియాకు డిమాండ్ పెరిగిందని వ్యవసా య శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు పేర్కొ న్నారు. గురువారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. పూర్తి స్థాయిలో ఎరువులు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం బఫర్ నిల్వగా ఉన్న 500 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందజేయాలన్నారు. జిల్లా అవసరాలకు తగిన విధంగా ఎరువులను తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం నిర్వహించిన గ్రీవెన్స్ విభాగంలో భాగంగా పలు వినతులు స్వీకరించారు. దివ్యాంగులకు పునఃపరిశీలన పేరుతో విచారణ చేపట్టి పింఛన్లు తొలగిస్తున్నారంటూ పలువురు మంత్రికి విన్న వించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. బియ్యం ప్యాకెట్ల తూకాల్లో తేడాలు నరసన్నపేట: బియ్యం ప్యాకెట్ల తూకాల్లో తేడాలు ఉంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వినియోగదారులను వ్యాపారులు మో సం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తూనికలు కొలతల జిల్లా ఇన్స్పెక్టర్ చిన్నమ్మి అన్నా రు. కలెక్టర్కు ఈ మేరకు స్థానికులు ఫిర్యా దులు చేయగా గురువారం నరస్ననపేట, పోలాకి మండలాల్లో తనిఖీలు చేశామని ఒక కేసు నమోదు చేశామని ఆమె తెలిపారు. 26 కిలోల బియ్యం ప్యాకెట్లపై ముద్రించి 25 కిలో లు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. దీనిపై నరసన్నపేట, పోలాకిలో మూడు కేసులు నమోదు చేశామన్నారు. నరసన్నపేటలో తనిఖీలు నిర్వహించగా పలు షాపులు మూసేశారని పేర్కొన్నారు. వరద ముంపులో 600 ఎకరాలు నరసన్నపేట: మండలంలో మూడు రోజుల కిందట కురిసిన వర్షాలకు వరి పంట పొలాలు నీట మునిగాయి. మండలంలోని పలు గ్రా మాల్లో సుమారు 600 ఎకరాల వరకు ముంపునకు గురైంది. సుందరాపురం, చిక్కాలవల స, మామిడి వలస, బొరిగివలస తదితర గ్రామాల్లో ఈ వరి పంట పొలాలు మునిగిపోయాయి. వారం కిందట ఇదే విధంగా మునిగిపోయాయి. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాతపట్నం: మండలంలోని పాతపట్నం పంచాయతీ, కాపు గోపాలపురం గ్రామానికి చెందిన రేగేటి వజ్రమ్మకు చెందిన పూరిల్లు ఇటీవల కురిసిన వానకు కూలిపోయింది. బుధవారం రాత్రి సమయంలో వసంతమ్మ ఇంటిలో లేకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలియజేశారు. ఆ ఇంటిలో ఒక్క వజ్రమ్మ ఉంటుంది. గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. గురువారం గ్రామ రెవెన్యూ అధికారి (వీర్వో) కూలిన పూరిళ్లు పరిశీలించి, వివరాలు నమోదు చేసుకుని, ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తామన్నారు. ప్రభు త్వం ఆదుకోవాలని వజ్రమ్మ వేడుకుంటోంది. -
జాతీయ వాలీబాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన ఇద్దరు వాలీబాల్ క్రీడాకారులు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. గుజరాత్ రాష్ట్రంలోని నడియాడ్ వేదికగా ఈనెల 30 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు జరగనున్న 27వ జాతీయ బధిరుల వాలీబాల్ చాంపియన్షిప్–2025 పోటీలకు జిల్లా నుంచి గుంటుకు సునీల్, సోపేటి గోపీచంద్ ఎంపికయ్యారు. సీనియర్స్ విభాగంలో వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని కోడిరామూర్తి క్రీడామైదానంలో శిక్షణ పొందుతున్న వీరిద్దరూ ఇప్పటికే అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో మెరిశారు. శ్రీకాకుళం నగరంలోని ఇందిరానగర్కాలనీలో నివాసం ఉంటున్న సునీల్ ఇప్పటికే పదుల సంఖ్యలో బధిరుల జాతీయ పోటీలతోపాటు ఆర్జెంటీనా, జపాన్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి సిక్కోలు ఖ్యాతి చెప్పాడు. ఇతని తల్లిదండ్రులు గౌరీపతి, కృష్ణవేణి. రణస్థలం మండలం మహంతిపాలెం గ్రామానికి చెందిన సోపేటి గోపీచంద్ అనేక బధిరుల జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించి అదుర్స్ అనిపించాడు. 2017లో జాతీయ సబ్జూనియర్స్ పోటీల్లో పతకం సాధించాడు. గోపీచంద్ తల్లిదండ్రులు రామారావు, సుశీల. సునీల్, గోపీచంద్ -
వివాదాలే ముద్దు
అభివృద్ధి వద్దుజిల్లాకు ఎమ్మెల్యేల తీరును స్థానికులు ఏవగించుకుంటున్నారు. సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేయడానికి ఎవరైనా భయపడతారు. బాధితులైతే మరింత వెనక్కి తగ్గుతారు. కానీ టీడీపీ అధికారంలో ఉండగా, రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రశ్నించే వారిపైన దాడులు చేసి, కేసులు పెడుతూ వేధిస్తున్న క్రమంలో బాధితులు బయటకు రావడం చర్చనీయాంశంగా మారుతోంది. నేరుగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేస్తున్నారంటే బరితెగింపు పతాక స్థాయికి చేరిందని అర్థమవుతోంది. ఇదేం తీరు..? -
గందరగోళం
● డీఎస్సీ నియామక ప్రక్రియలో ● అభ్యర్థికి తప్ప ఇంకెవరికీ తెలియని మార్కులు, ఎంపిక వివరాలు ● రాష్ట్రస్థాయిలోనే మెరిట్ కమ్ రోస్టర్ జాబితా శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నియామకాల ప్రక్రియకు సంబంధించి చేపడుతున్న విధానా లు గందరగోళంగా మారాయి. గతంలో అభ్యర్థుల మార్కులను ప్రక టిస్తూ మెరిట్ జాబితాను డీఈఓ కార్యాలయం నోటీసు బోర్డులో ఉంచేవారు. అటు తర్వాత మెరిట్ కమ్ రోస్టర్ జాబితాను కూడా నోటీస్ బోర్డులో ఉంచేవారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరించి, తుది జాబితాను విడుదల చేసి ధృవీకరణ పత్రాలు పరిశీలన జరిగేది. ఈ సారి అలాకాకుండా ప్రక్రియ అంతా రా ష్ట్రస్థాయిలోనే జరుపుతున్నారు. బుధవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఎంపికై న అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరవ్వాలని సూచించారు. రాష్ట్రస్థాయిలోనే ప్రక్రియ అంతా చేపట్టడం ఉమ్మడి రాష్ట్రాల చరిత్రలోనే తొలిసారి అని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. దీని వల్ల ఎవరికి ఎన్ని మా ర్కులు వచ్చాయి? మెరిట్ విధానంలో ఏవైనా తప్పు లు జరిగాయా? రాష్ట్ర పాయింట్లలో పొరపాట్లు దొర్లాయా? అనేది పరిశీలించేందుకు అవకాశం లేకుండా పోయిందని ఉపాధ్యా య సంఘాలతో పాటు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకంగా జరగాల్సిన ప్రక్రియను ఇలా గోప్యంగా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభ్యర్థుల సందేహాలను సైతం నివృత్తి చేయలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. 403 మందిలో ఎవరు ఏ పోస్టుకు ఏ పాఠశాలకు ఏ కేటగిరీకి ఎంపికయ్యారో కూడా తెలియ డం లేదు. కొందరు అభ్యర్థులు రెండు నుంచి మూ డు పోస్టులకు ఎంపిక కావడంతో ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం అభ్యర్థుల నుంచి కావాల్సిన పోస్టు వివరాలను తెలుసుకొని ఆ అభ్యర్థి వదులుకున్న పోస్టులకు అటు తర్వాత ర్యాంకుల వారికి కాల్ లెటర్లు పంపిస్తారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అది కూడా తమకు రాష్ట్రస్థాయి నుంచి అందిన మౌఖిక సమాచారం అని వారు చెబుతున్నా రు. ఇందులో వాస్తవం ఎంత అన్నది కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కేజీబీవీ పీఈటీలపై అభ్యర్థుల ఫిర్యాదు జిల్లాలోని కేజీబీవీలో పీఈటీలుగా పనిచేస్తూ డీఎస్సీ నుంచి పీఈటీలుగా ఎంపికైన వారిపై కొందరు అ భ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఎంపిౖకైన పీఈటీలు కేజీబీవీలో పనిచేస్తూనే పీఈటీ శిక్షణ పూర్తి చేసిన ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకున్నారని, రెండు చోట్ల ఒకేసారి చేయడం ఎలా సాధ్యపడిందని వారు జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయికి నివేదిస్తానని డీఈఓ తెలిపారు. తొలి రోజు 403 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో తొలి రోజు గురువారం 403 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. వాటిని రాష్ట్రస్థాయికి ఆన్లైన్ ద్వారా నివేదించారు. అన్ని యాజమాన్యాల పా ఠశాలలకు సంబంధించి మొత్తం 543 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 403 మందికి మాత్రమే కాల్ లెటర్స్ రావడంతో వారంతా పత్రాల పరిశీలనకు వచ్చారు. -
తస్మాత్ జాగ్రత్త..!
● వినాయక మండపాల్లో జాగ్రత్తలు తప్పనిసరి ● వర్షాల నేపథ్యంలో విద్యుత్ షాక్లకు అవకాశం అరసవల్లి: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు మండపాలు ముస్తాబయ్యాయి. సీరియల్ సెట్లు, ఎల్ఈడీ లైట్ల వెలుగులతో మండపాలు ధగధగలాడుతున్నాయి. అయితే ప్రస్తుతం వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం ఆదమర్చినా ప్రాణాపాయం తప్పదని హెచ్చరిస్తున్నారు. ● వర్షాలు కురుస్తున్న క్రమంలో విద్యుత్ పరికరాలు తడవకుండా జాగ్రత్తలు వహించాలి. తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకకూడదు. ● విద్యుత్ లైసెన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్లతోనే అలంకరణ పనులు చేయించాలి. ● మండపాలను విద్యుత్ స్తంభాలకు, ట్రాన్స్ఫార్మర్లకు కనీసం 3 మీటర్ల దూరంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ● విద్యుత్ పరికరాలకు సరైన ఎర్తింగ్ ఉండాలి. ఐఎస్ఐ ప్రమాణాలున్న నాణ్యమైన విద్యుత్ వైర్లు వాడాలి. ● డెకరేషన్ల విషయంలో సీరియల్ సెట్లు గోడ లకు, లోహ వస్తువులకు తగలకుండా అమర్చాలి. ఎల్ఈడీ బల్బులు వాడటంతో తక్కువ విద్యుత్ వినియోగమవుతుంది. ● పరిసరాలన్నీ పొడిగా ఉండేలా చర్యలు చేపట్టాలి. అత్యవసరాలకు సమీపంలోని సచివాలయా ల ఎనర్జీ అసిస్టెంట్లు, విద్యుత్ శాఖ ఏఈలను సంప్రదించాలి. అందని ‘ఉచిత’ ఉత్తర్వులు.. జిల్లాలో వినాయక మండపాల్లో నవరాత్రుల్లో వినియోగించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తుందని, మండపాలకు ఉచిత విద్యుత్ అందించే చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ కాలేదు. విద్యుత్ శాఖ మాత్రం ప్రభుత్వ ప్రకటన ప్రకారం జిల్లా అధికారుల బృందం (పంచాయతీ/మున్సిపాల్టీ, విద్యుత్, పోలీస్ తదితర శాఖలు) అనుమతి ఉన్న వినాయక మండపాల్లో ప్రత్యేక మీటర్లు అమర్చి రీడింగ్ను తీయించుకునేలా చర్యలు చేపట్టింది. ఉచితమనే విధానంపై స్పష్టత వస్తే ఎలాంటి బిల్లులు లేకుండా మండపాలకు విద్యుత్ వినియోగానికి వెసులుబాటు ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో వినాయక మండపాల నిర్వహణకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చవితి వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి మండపాలకు ‘ఉచిత’ విద్యుత్ అవకాశాలుండవనే సంకేతాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రాణాలు ముఖ్యం.. మన ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు అనే విషయాన్ని మరిచిపోవద్దు. గతంలో జిల్లాలో ఇదే సీజన్లో చాలా మంది యువత మృత్యువాత పడ్డారు. అలాంటి దుర్ఘటనలు జరుగకుండా ఉండాలంటూ కచ్చితంగా లైసెన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్స్ మాత్రమే విద్యుత్ అలంకరణ పనులు చేపట్టాలి. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్పై లిఖితపూర్వక ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. – నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఎస్ఈ, శ్రీకాకుళం సర్కిల్ -
దంచికొట్టింది..
శ్రీకాకుళం పాతబస్టాండ్: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మంగళవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 360.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.గార 11.8, ఇచ్ఛాపురం 12.0, జలుమూరు 22.8, పోలాకి 13.4, రణస్థలం 15.2, లావేరు 18.6, కోటబొమ్మాళి 17.6, టెక్కలి 17.6, నరసన్నపేట 18.2, ఎచ్చెర్ల 28.8, సంతబొమ్మాళి 19.6, ఆమదాలవలస 23.0, శ్రీకాకుళం 52.4శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/శ్రీకాకుళం/శ్రీకాకుళం అర్బన్: వాన దంచికొట్టింది. జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సిక్కోలు జల దిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పీఎన్కాలనీ, రైతుబజారు కొత్తరోడ్డు, బలగ, హాస్పిటల్ రోడ్డు, గుజరాతిపేట, ఏపీహెచ్బీకాలనీ, హయాతినగరం, అరసవల్లి ఆదిత్యనగర్కాలనీ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శ్రీకాకుళం, గార, నరసన్నపేట, రణస్థలం, ఎచ్చెర్ల తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించింది. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ జలమయమైంది. లోతట్టు ప్రాంతం కావడంతో వర్షపునీరు, మురుగునీరు చేరడంతో కోనేరును తలపించింది. మోకాలి లోతు నీరు చేరడంతో నాన్స్టాప్ కౌంటర్, కాంప్లెక్స్ పరిసరాలు మొత్తం నీట మునిగాయి. దీంతో ప్రయాణికులు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పెద్దపాడు వద్ద జాతీయ రహదారిపై నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.నేలకొరిగిన విద్యుత్ స్తంభాలుశ్రీకాకుళం రూరల్: రాగోలు పంచాయతీ రాయిపాడు సమీపంలో మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పంచాయతీ సిబ్బంది, విద్యుత్ అధికారులు యుద్ధప్రాతిపదికన స్తంభాలను మార్చారు.భోజనాలు పంపిణీఎచ్చెర్ల: తోటపాలేం సమీపంలో నీలమ్మకాలనీ నీట మునగడంతో కాలనీవాసులకు వీహెచ్పీ అధ్యక్షుడు ఆనందరావు భోజనాలు సిద్ధం చేశారు. ట్రిపుల్ ఐటీ ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సాయంతో భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో ఎన్ఎస్.ఎస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పెద్దింటి ముకుందరావు పాల్గొన్నారు.విద్యుత్ షాక్తో ఆవు మృతిఆమదాలవలస: మునగవలసలో కనమట చిన్నప్పన్న అనే రైతుకు చెందిన ఆవు మేత కోసం వెళ్లగా సెలూన్ షాపు వద్ద విద్యుత్ షాక్కు గురై మృతిచెందింది. ఆవు విలువ సుమారు రూ.30వేలు నుంచి రూ.40 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. -
జీతాలు మహాప్రభో..!
● ట్రిపుల్ ఐటీ కాంట్రాక్టు సిబ్బందికి నేటికీ అందని వైనం ఎచ్చెర్ల: అధికారంలోకి వస్తే ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు అందజేస్తాం. ఇవి ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన మాటలు. అయితే పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఈనెలలో 26వ తేదీ గడిచినా జీతాలు రాక ట్రిపుల్ ఐటీ కాంట్రాక్టు ఉద్యోగులు ఇబ్బంది పడతున్నారు. ఇచ్చే అరకొర వేతనాలను ఇన్ని రోజులు ఇవ్వకుండా ఉంటే పూట గడిచేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో వేతనాలు ఆలస్యమైతే సిబ్బందికి వారి జీతంలో 50 శాతం సొమ్మును అడ్వాన్సుగా చెల్లించేవారు. అలా తీసుకున్న సొమ్మును జీతాలు ఇచ్చేటప్పుడు మినహాయించేవారు. ఇప్పుడు అడ్వాన్సులు కూడా ఇవ్వకపోవడంతో కుటుంబ ఖర్చులకు, ఇతర అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రుణాలు చెల్లించేందుకు అప్పులు కాంట్రాక్టు అధ్యాపకులందరూ ఆర్థిక వెసులుబాటును బట్టి గృహావసరాల కోసం రుణాలు తీసుకుంటారు. బ్యాంకుల్లో చేసిన అప్పులకు క్రెడిట్ కార్డులపై తీసుకున్న వాటికి బ్యాంకు ఖాతాల్లో తప్పనిసరిగా డబ్బులు సిద్ధంగా ఉంచాలి. దీంతో అప్పులు చేసి ఖాతాలో ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈఎంఐలకు సరిపడా నగదు లేకపోతే సిబిల్ స్కోర్ తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు కుటుంబం గడవడానికి, పిల్లల ఫీజులు చెల్లించడానికి అనేక అవసరాలకు డబ్బులు అవసరం కాగా అప్పు చేయాల్సి వస్తోంది. సకాలంలో జీతాలు ఇస్తే ఈ తలనొప్పి ఉండదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. 140 మంది కాంట్రాక్టు ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిలో మెంటార్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గెస్ట్ ఫ్యాకల్టీలు, ల్యాబ్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఐటీ మెంటార్లు పనిచేస్తున్నారు. వీరందరూ కలిపి 140 పైగానే ఉంటారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు యూనివర్సిటీనే నెల ప్రారంభంలోనే వేతనాలను చెల్లించింది. కాంట్రాక్టు ఉద్యోగులకు ఇంతవరకూ వేతనాలు చెల్లించలేదు. అందువలన ఇకనైనా సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. -
విద్యతోనే ఉత్తమ భవిష్యత్
● సెంచూరియన్ వర్సిటీ ఛాన్సలర్ జీఎన్ఎన్ రాజు ఎచ్చెర్ల: విద్యతోనే ప్రతి ఒక్కరికీ ఉత్తమ భవిష్యత్ లభిస్తుందని సెంచూరియన్ వర్సిటీ ఛాన్సలర్, ఆంధ్రా యూనివర్సిటీ పూర్వపు వీసీ ఆచార్య జీఎన్ఎన్ రాజు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ ప్రవేశాలు పొందిన ప్రథమ సంవత్సరం విద్యార్థుల పరిచయ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థి ఉజ్వల భవిష్యత్తు అందుకోవడంలో అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉందన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (గుంటూరు) పూర్వ వీసీ, బీఆర్ఏయూ అంబుడ్స్మెన్ ఆచార్య వి.బాలమోహన్దాస్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నేటి యువతరం మారితేనే కెరియర్ ఉంటుందన్నారు. ట్రిపుల్ ఐటీ (అగర్తల) పూర్వ డైరెక్టర్ ఆచార్య పీఎస్ అవధాని మాట్లాడుతూ విద్యార్థులు సమయపాలన కలిగి ఉండాలని సూచించారు. బీఆర్ఏయూ వీసీ కేఆర్ రజనీ మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడి, అవాంతరాలు తట్టుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య బి.అడ్డయ్య, ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డా.సీహెచ్ రాజశేఖరరావు, ఎం.అనురాధ, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్.ఉదయ్భాస్కర్, ఎస్వో డా.కె.సామ్రాజ్యలక్ష్మీ, ఇంజినీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్ పి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధనలకు
ప్రోత్సాహం..! శ్రీకాకుళం న్యూకాలనీ: పరిశోధనల వైపు పాఠశాల, ఇంటర్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) వారు 9, 10 మరియు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో ప్రోత్సహించడానికి ప్రయాస్ (ప్రమోషకన్ ఆఫ్ రీసెర్చ్ ఆటిట్యూడ్ అమాంగ్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ స్టూడెంట్స్) పథకానికి రూపకల్పన చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ, పీజీ(లీడ్) కళాశాలలోని సెంటర్ ఫర్ అప్లయిడ్ సైన్సెస్ విభాగం (బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ), ఇండిజీనస్ సొసైటీ ఫర్ ప్రుగల్ సైన్స్ ఇన్వెన్సన్ (ఐఎస్ఎఫ్ఎస్ఐ)ల ఉమ్మడిగా సహకారంతో ప్రయాస్ను విద్యార్థులకు చేరువ చేసేందుకు శ్రీకారం చుట్టారు. నైపుణ్యాలను పెంచేలా... పరిశోధనల వైపు ఆకర్షితులుగా ఉన్న విద్యార్థులను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రయాస్ను ఎన్సీఈఆర్టీ తెరపైకి తీసుకొచ్చింది. యువ, జిజ్ఞాస కలిగిన విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడమే ఈ పథకం ఉద్దేశం. పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించేలా చేసేందుకు ఎంపికై న విద్యార్థుల బృందానికి ప్రాజెక్ట్ సన్నద్ధత, రూపకల్పన చేసేందుకుగాను రూ.50 వేలు నగదు ప్రోత్సాహకాన్ని అందజేయనున్నారు. ప్రస్తుత వాస్తవ ప్రపంచంలో ఉన్న సమస్యలను ఆధారంగా చేసుకొని, వాటికి సృజనాత్మక, శాసీ్త్రయ పరిష్కారాలను చూపించే ఆసక్తి గల విద్యార్థులకు ఈ ప్రయాస్ పథకం చక్కని వేదికగా ఉపయోగపడనుంది. 9వ తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. ఆసక్తి గల పాఠశాలలు, కళాశాలల నుంచి ఇద్దరు విద్యార్థులు, ఒక అధ్యాపకుడిని ఒక బృందంగా ఎంపిక చేయనున్నారు. పరిశోధనల వైపు ఆసక్తి కలిగినవారు ఈనెల 28లోగా శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల (లీడ్) కళాశాలను సంప్రదించాలని, మరిన్ని వివరాలకు 85559 11961 నంబర్ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కణితి శ్రీరాములు సూచించారు. ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రయాస్ కార్యక్రమం చాలా గొప్పగా ఉంది. 9, 10 మరియు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ కణితి శ్రీరాములు, ప్రిన్సిపాల్, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల (లీడ్)కాలేజీ పాఠశాల/కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థులు, ఒక అధ్యాపకుడు బృందంగా ఏర్పడాలి. ఒక వినూత్న ఆలోచనతో కళాశాల అప్లయిడ్ సైన్సెస్ విభాగాన్ని సంప్రదించాలి. ఈ బృందాన్ని ప్రోత్సహించడానికి కళాశాల తరుపున సిద్ధంగా ఉన్నాం. ఈనెల 28లోగా కళాశాలను సంప్రదించాలి. – డాక్టర్ రోణంకి హరిత, బయో టెక్నాలజీ సీనియర్ లెక్చరర్, ఐఎస్ఎఫ్ఎస్ఐ కార్యదర్శి యువ, జిజ్ఞాస కలిగిన విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి పెంపొందించడమే ప్రయాస్ పథకం ముఖ్య లక్ష్యం. ప్రస్తుత వాస్తవ ప్రపంచ సమస్యలను ఆధారంగా చేసుకొని, వాటికి సృజనాత్మకత జోడించి, శాసీ్త్రయ పరిష్కారాలను చూపించడం దీని ఉద్దేశం. – డాక్టర్ మధమంచి ప్రదీప్, కళాశాల అప్లయిడ్ సైన్సెస్ హెచ్వోడీ, ఐఎస్ఎఫ్ఎస్ఐ అధ్యక్షుడు -
సౌండ్ సిస్టం పరికరాలు చోరీ
సారవకోట: మండలంలోని అలుదు గ్రామంలో కొలుమూరు చంద్రశేఖర్కు చెందిన రూ.1.20 లక్షలు విలువ చేసే సౌండ్ సిస్టం పరికరాలు చోరీకి గురైయ్యాయి. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. కొన్ని రోజులు క్రితం శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నాడ గ్రామానికి చెందిన ఒక యువకుడు తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని చెప్పి, పని కల్పించి భోజనం, కొంతకూలి ఇస్తే సరిపోతుందని కోరాడు. దీంతో ఆ యువకుడికి పని కల్పించి పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సప్లయర్స్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేసేందుకు చంద్రశేఖర్ తీసుకెళ్లేవాడు. అప్పటినుంచి నమ్మకంగా ఉంటూ పరికరాలు ఉన్నచోటే రాత్రిపూట పడుకునే వాడు. అయితే ఈ నెల 24న ఆ యువకుడితో ఉన్న మరో యువకుడికి మద్యం తాగించాడు. అనంతరం అర్ధరాత్రి తర్వాత గోడౌన్లో ఉన్న సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి రూ.1.20 లక్షలు విలువ కలిగిన సౌండ్ సిస్టం సామగ్రి దొంగిలించుకుని పోయినట్లు ఆయన తెలిపారు. దీనిపై సారవకోట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ఎవరు ‘అధ్యక్షా’..?
శ్రీకాకుళం : జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఎంపికకు కసరత్తు మొదలైంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు శాసనసభ్యుల అభిప్రాయాలను సేకరించేందుకు హోం మంత్రి అనిత మంగళవారం శ్రీకాకుళం వచ్చారు. ఆమె నేతృత్వంలో త్రిసభ్య కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అధ్యక్ష పదవి కోసం చౌదరి బాబ్జీ, మొదలవలస రమేష్, పీరుకట్ల విఠల్, ఆనెపు రామకృష్ణలు దరఖాస్తు చేసుకోగా.. అవకాశమిస్తే ఆ పదవి చేపట్టేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావులు సంసిద్ధత వ్యక్తం చేశారు. మహిళల కోటాలో తన పేరును కూడా పరిశీలించాలని తమ్మినేని సుజాత కోరారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ అభిప్రాయాలను అధిష్టానానికి నివేదిస్తామని తెలిపారు. అనుబంధ విభాగాల అధ్యక్షులపైనా అభిప్రాయాలను సేకరించామని చెప్పారు. ప్రతి విభాగానికి ఇద్దరు నుంచి ముగ్గురు పేర్లను అధిష్టానానికి నివేదిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, మామిడి గోవిందరావు, గౌతు శిరీష, కూన రవికుమార్, బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి, మాదారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.ప్రత్యేకంగా కలిసిన లక్ష్మీదేవి..శ్రీకాకుళం మాజీ శాసన సభ్యురాలు గుండ లక్ష్మీదేవి హోం మంత్రి అనితతో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. హోంమంత్రి ఇటీవల అరసవల్లి వచ్చినప్పుడు కూడా లక్ష్మీదేవి కలిసిన సంగతి తెలిసిందే. అయితే జిల్లా పార్టీ సమావేశాలకు ఆహ్వానం లేకపోవడంతో ఆమె ఇప్పటివరకు ఏ సమావేశంలోనూ పాల్గొనడం లేదని ప్రచారం జరుగుతుండగా, మంగళవారం మాత్రం హోంమంత్రితో సమావేశం కావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
దివ్యాంగుల పింఛన్లు తొలగించడం అన్యాయం
● ఎమ్మెల్సీ నర్తు రామారావు ఇచ్ఛాపురం రూరల్: కూటమి ప్రభుత్వం పింఛన్ల పునః పరిశీలన పేరుతో దివ్యాంగుల పింఛన్లు తొలగించడం అన్యాయమని ఎమ్మెల్సీ నర్తు రామారావు మండిపడ్డారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నాయకులు, గెలిచాక ఒక్క పింఛన్ ఇవ్వలేదు సరికదా.. ఉన్నవాటిని తొలగించి లబ్ధిదారుల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమొత్తారు. జిల్లాలో సుమారు 30 వేల మంది దివ్యాంగులకు అన్యాయం చేశారని, వారంతా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఉద్దేశపూర్వకంగా పింఛన్ల ఏరివేతకు సిద్ధపడిన కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ బాధితుల తరుపున పోరాటం చేస్తుందని తెలియజేశారు. ఆయనతో పాటు మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, బాకి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. -
సత్తాచాటిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
ఎచ్చెర్ల: రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఎచ్చెర్ల ప్రాంగణంలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఈనెల 21వ తేదీ నుంచి 24 వరకు తాడేపల్లిగూడేం, ప్రత్తిపాడుల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగాసనాల పోటీల్లో మూడు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. 14 నుంచి 18 ఏళ్ల వయస్సు కేటగిరీల్లో వివిధ విభాగాల్లో మెడల్స్ సాధించారు. ట్రెడిషనల్ విభాగంలో ఎ.మేఘన ద్వితీయ స్థానం, లెగ్ బ్యాలెన్స్ విభాగంలో ఎన్.జయచంద్ర ద్వితీయ స్థానం, బ్యాక్వార్డ్ బెండింగ్లో పి.కారుణ్య బ్రాంజ్, ఆర్టిస్ట్ పెయిర్లో కె.మేఘన, ఎ.రాధికలు బ్రాంజ్, సూఫియా విభాగంలో ఈ.భరత్సాయి బ్రాంజ్, హ్యాండ్ బ్యాలెన్స్లో బి.జోగేంద్రసాయి బ్రాంజ్ మెడల్స్తో సత్తాచాటారు. దీంతో విద్యార్థులను కళాశాల సిబ్బంది మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో ఎస్వో డాక్టర్ మునిరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, డీన్ డాక్టర్ గేదెల రవి, యోగా విభాగాధిపతి డాక్టర్ ఈశ్వరరావు, యోగా విభాగాధిపతి జి.ఈశ్వరరావు, అధ్యాపకులు కె.అర్చన తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
శ్రీకాకుళం క్రైమ్/కొత్తూరు/హిరమండలం: జిల్లాలోని కొత్తూరు, హిరమండలం మండలాల్లో ఎరువుల దుకాణాల్లో మంగళవారం విజిలెన్స్ తనిఖీలు చేపట్టారు. కొత్తూరులోని మన గ్రోమోర్ సెంటర్లో రికార్డులు సక్రమంగా లేకపోవడంతో 16.95 టన్నుల కాంప్లెక్సు ఎరువుల అమ్మకాల నిలుపుదల చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ బి.ప్రసాదరావు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సతీష్కుమార్, ఏఓలు సంధ్య, స్వర్ణలత, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎర్రన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు అరసవల్లి: జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేస్తున్న పలువురు రికార్డు అసిస్టెంట్లను జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మురపాక జెడ్పీ స్కూల్ రికార్డు అసిస్టెంట్ డి.రమాదేవిని వంగర మండలం ఎంఎస్ఆర్ పురం జెడ్పీ స్కూల్ జూనియర్ అసిస్టెంట్గా, లింగాలవలస రికార్డు అసిస్టెంట్ కె.హేమలతను అమలపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలకు, గోవిందపురం రికార్డు అసిస్టెంట్ పి.జయలక్ష్మిని వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు జెడ్పీ స్కూల్కు, బోరుభద్ర జెడ్పీ స్కూల్ రికార్డు అసిస్టెంట్ ఎ.గోపాలరెడ్డిని సంతబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయానికి, ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట జెడ్పీ స్కూల్ రికార్డు అసిస్టెంట్ కె.పద్మలతను పాతపట్నం పీఆర్ఐ సబ్ డివిజన్ జూనియర్ అసిస్టెంట్గా పదోన్నతులు కల్పిస్తూ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో శ్రీధర్రాజా, సి–సెక్షన్ సూపరింటెండెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు గ్రోమోర్ సెంటర్లో తనిఖీలు -
గణపతి అనుగ్రహం ఉండాలి
నరసన్నపేట : జిల్లా ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా, ప్రతి ఒక్కరిపై ఏడాదంతా గణపతి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. ఆమదాలవలస: విఘ్నాలను తొలగించి వినాయకుడు అందరికీ శుభాలు కలిగించాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆకాంక్షించారు. ఈ మేరకు జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. పలాస: హిందువులు సంప్రదాయబద్ధంగా జరుపుకునే వినాయక చతుర్థి అందరికీ మంచి చేకూర్చాలని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ పలాస నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండపాల వద్ద, విగ్రహాల నిమజ్జనం సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
కన్యాకుమారి.. డైరెక్టర్ మనోడే మరి
● ‘కన్యాకుమారి’ చిత్ర దర్శకుడు సృజన్ సిక్కోలు వాసి ● శ్రీకాకుళం పరిసరాల్లోనే మొత్తం షూటింగ్ శ్రీకాకుళం అందాలను చూపించాం సినిమా షూటింగ్లకు శ్రీకాకుళం జిల్లా చాలా అనుకూలంగా ఉంది. శ్రీకాకుళం చుట్టూనే సినిమా అంతా తీశాం. శ్రీకాకుళం జిల్లాలో పల్లె అందాలను చూపించనున్నాం. హీరోగా శ్రీ చరణ్ , హీరోయిన్గా గీత్ షైనీ నటించారు. ఇక్కడి యువతీ యువకుల మధ్య సాగే ప్రేమకథే ఈ సినిమా. – సృజన్, దర్శకుడు నరసన్నపేట: తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్ధమైన ‘కన్యాకుమారి’ సినిమా డైరెక్టర్, నిర్మాత సృజన్ అట్టాడ మన సిక్కోలు వాసి. మొదటి సినిమా పుష్పక విమానంతో సత్తాచాటిన సృజన్ ద్వితీయ ప్రయత్నంగా కన్యాకుమారిని తెరకెక్కించారు. శాలిహుండం కొండపై వెలసిన వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రథమ పూజ చేసి సినిమా షూటింగ్ ప్రారంభించారు. నరసన్నపేట, పోలాకి మండలాల్లోని కోమర్తి, ఉర్లాం, చింతువానిపేట, లింగాలపాడు, దూకులపాడు, మాకివలస, దేవాది, మడపాం, రాళ్లపాడు, మబగాం, వీఎన్ పురం, శ్రీముఖలింగం గ్రామాల్లోనే దాదాపుగా సినిమా షూటింగ్ చేశారు. అలాగే కళింగ పట్నం తీరంలో కొన్ని షాట్లు తీశారు. శ్రీకాకుళంలోని ఒక వస్త్ర షోరూంలో హీరోయిన్ గీత్ షైనీపై సన్నివేశాలు చిత్రీకరించారు. స్థానిక యాసతోనే హీరో హీరోయిన్ల సంభాషణలు ఉండడం విశేషం. దర్శకుడు అట్టాడ సృజన్ కథా రచయత అట్టాడ అప్పలనాయుడు కుమారుడు. బుధవారం వినాయచవితి సందర్భంగా సినిమా రిలీజ్ చేస్తున్నారు. -
కష్టాల సాగుబడి
గత ప్రభుత్వంలో రైతులకు బాగుండేది గత ప్రభుత్వంలో మా ఊరిలోకి యూరియాను తెచ్చి ఇచ్చేవారు. ఇంకా ఏమైనా మాకు అవసరమైతే టౌన్కి వచ్చి సులభంగా యూరియా తీసుకువెళ్లేవాళ్లం. ఇప్పుడు యూరియా కోసం పడుతున్న బాధలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. డి.సూర్యం, రైతు, టెక్కలి మండలం గతంలో మా ఊరికే యూరియా వచ్చేది.. వైఎస్సార్సీపీ పాలనలో మా ఊరిలోకి యూరియా వచ్చేది. ఇప్పుడు నందిగాం మండలం నుంచి టెక్కలి వచ్చి యూరి యా కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇంత కంటే కష్టాలు రైతులకు ఇంకేం ఉంటాయి. – కె.లక్ష్మి, రైతు, కామధేనువు, నందిగాం మండలం యూరియా లేదంటున్నారు యూరియా కోసం రైతులను ఉసూరుమనిపించడం మంచిది కాదు. తెల్లారి నుంచి కాపలా కాస్తే చివరకు యూరియా లేదని చెబుతున్నారు. – కె.సరస్వతి, రైతు, నందిగాం మండలం వ్యవసాయ మంత్రి సొంత జిల్లాలో రైతులను వదలని సాగు కష్టాలు ఎరువుల కోసం అన్నదాతల పాట్లు ప్రైవేటు దుకాణాల వద్ద తప్పని క్యూలు 1999–2004, 2014–19 పరిస్థితులు పునరావృతం వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతుల ఇంటి వద్దకే విత్తనాలు, ఎరువులు -
తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలోని దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదల పెన్షన్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని, ఇప్పటికే కొంతమంది పింఛన్లు తొలగించారని, మరికొందరికి నోటీసులు అందజేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు ఈ మేర కు వినతి పత్రం అందజేశారు. ఆయనతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, పార్టీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, పార్టీ జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షుడు వెలమల బాలరాజు, పార్టీ జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు రౌతు శంకరరావు, కోటబొమ్మాళి జెడ్పీటీసీ దుబ్బ వెంకటరమణ, ఎంపీపీ రోణంకి ఉమ మల్లయ్య, మండల సంపతి రావు హేమ సుందర రాజు, వైస్ ఎంపీపీ దుక్క రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నాలుగు వేల మంది దివ్యాంగులకు పింఛన్లు దూ రం చేశారని తెలిపారు. 50 ఏళ్లకే పింఛన్ హామీని సైతం మర్చిపోయారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదన్నారు. రీ వెరిఫికేషన్, రీ అసెస్మెంట్ పేరుతో దివ్యాంగులను కష్టపెట్టడం మానవత్వం కాదని, వారిని ఆదుకోవాలని కోరారు. పింఛన్ల భారం తగ్గించుకోవడానికే ప్రభుత్వం ఇన్ని కుట్రలు పన్నుతోందని తెలిపారు. తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలన్నారు. పదేళ్లుగా పింఛన్ పొందుతున్న వారి ఆధారాన్ని దూరం చేయడం దారణ మన్నారు. దివ్యాంగులకు ఇలా అపకారం చేయ డం వల్ల మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పేరాడ తిలక్ అన్నారు. రాజకీయాలు, పింఛన్లు వేర్వేరు విషయాలని, అలా ఆలోచించగలిగేది వైఎస్ జగన్ మాత్రమేనని తెలిపారు. దివ్యాంగులను ఆదుకోవడం మానవత్వం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
10 మంది గంజాయి నిందితులు అరెస్టు
రణస్థలం: గంజాయి క్రయ, విక్రయాలు జరుపుతున్న 10 మంది నిందితులను అరెస్టు చేసినట్లు జేఆర్పురం సీఐ ఎం.అవతారం తెలిపారు. ఈ మేరకు జేఆర్పురం పోలీస్స్టేషన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. రణస్థలం మండలంలోని పైడి భీమవరం భూమాత టౌన్షిప్ వద్ద 22.5 కేజీల గంజాయితో ఐదుగురు నిందితులను జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవితో పాటు సిబ్బంది ఈనెల 24న తొలుత పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. ఆ నలుగురి నిందితులకు గంజాయి అమ్మకాలు, కొనుగోలు జరిపిన, సహకరించిన మరో ఐదుగురు నిందితులను అదుపులోనికి తీసుకున్నామని చెప్పారు. ఒడిశా నుంచి గంజాయి ఈనెల 23వ తేదీన బగాన పవన్ కుమార్, ఇనాకోటి ముకుందాతో కలిసి దినేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఒడిశాలోని కొరాపుట్ దగ్గర ఉన్న పొత్తంగి వెళ్లి గుంత శుక్ర అనే వ్యక్తి దగ్గర 22.5 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. అక్కడ నుంచి గుంత శుక్రకు స్నేహితులను పరిచయం చేస్తానని చెప్పి ముగ్గురు ద్విచక్ర వాహనంపై పైడి భీమవరం వచ్చారు. భూమాత టౌన్ షిప్ వద్ద గంజాయి సేవిస్తూ, తెచ్చిన 22.5 కేజీల 5 ప్యాకెట్లను విభజించి స్నేహితుల ద్వారా అమ్మకాలు జరిపేందుకు పన్నాగం పన్నారు. తుపాకుల అనిల్ కుమార్, లక్కవరపు పవన్ కుమారులు ఇందులో కొంతమొత్తం హైదరాబాద్లోని బాడాన సౌమిత్, బెంగళూరులోని మొదలవలస సందీప్కు అమ్మడానికి తీసుకుని ఉండగా జేఆర్పురం పోలీసులు పట్టుకున్నారు. బగాన పవన్ కుమార్పై గతంలో ఎచ్చెర్లలో గంజాయి కేసు నమోదై ఉంది. అరైస్టెనవారిలో బగాన పవన్ కుమార్, ఇనకోటి ముకంద, గుంత శుక్ర, తుపాకుల అనిల్ కుమార్, లక్కవరపుకోట పవన్ కుమార్, లంకపల్లి దినేష్, ఆళ్ల వెంకటరావు, సురవరపు వరప్రసాద్, బనిశెట్టి భాను వెంకటప్రతాప్, ముడిల మోహన్ వెంకట ప్రతాప్లు ఉన్నారు. -
వనామీకి.. వరుణ గండం..!
● చెరువుల్లో చేరుతున్న వర్షపు నీరు ● నీటిని తోడే క్రమంలో పోషకాలు కోల్పోతున్న వైనం ● అదనపు ఖర్చు అవుతోందని ఆక్వా రైతు ఆందోళన సోడియం, పొటాషియం, క్లోరైడ్స్ వంటివి రాయితీపై అందిస్తే కొంత ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. మార్కెట్లో ఎకరాకు అయ్యే పోషకాల విలువ దాదాపుగా రూ.2,500 వరకు ఉంది. పంటకాలంలో పరిస్థితులను బట్టి 10 నుంచి 12 సార్లు వాడాల్సి ఉండగా వర్షాకాలం అదనంగా మరో 5 దఫాలుగా వాడుతున్నారు. అయితే సదరు పోషకాలు సబ్సిడీపై అందించాలని ఎప్పటినుండో ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదు. అందువలన ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పోషకాల ఖర్చును గుర్తించి ఆక్వా రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. రొయ్యల ధరల్లో అనేక కారణాలతో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పోషకాల ధరలు మాత్రం ప్రతిఏటా పెరుగుతున్నాయి. గతంతో పోల్చితే పోషకాల వినియోగం ఎక్కువైంది. వర్షాకాలంలో నీటిని బయటకు తోడితే పోషకాలు సైతం మళ్లీ అందించాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఆక్వా అభివృద్ధి కోసం పోషకాలు రాయితీపై అందిస్తే బాగుటుంది. – పల్లి సింహాచలం, ఆక్వా రైతు, డీఎల్పురం ఒకప్పుడు విద్యుత్ లేదా డీజిల్ కోసం పెట్టే ఖర్చుతో చాలా ఇబ్బంది ఉండేది. ప్రభుత్వాలు కల్పించుకుని రాయితీ ఇవ్వడంతో ఆ ఖర్చులు బాగా తగ్గాయి. ఆదే క్రమంలో పోషకాలు, మేతలు, రొయ్య పిల్లలకు సైతం రాయితీలు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తే ఆక్వా మరింత అభివృద్ధి దిశగా అడుగులు పడతాయి. దీంతో ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడే అవకాశం ఉంది. – తిర్లంగి శ్రీనివాసరావు, ఆక్వా రైతు, పిన్నింటిపేట పోలాకి: ఒకప్పుడు రొయ్యల సాగు చేసే ఆక్వా రైతు మీసం మెలేసే పరిస్థితుల నుంచి, ఏరోజుకు ఏరూపంలో కష్టనష్టాలు ఎదురొస్తాయోనని నిత్యం భయపడేస్థాయికి మారింది పరిస్థితి. ఇప్పుడు తాజాగా వర్షాకాలం కావడంతో నూట్రిషన్స్ కొరత రూపంలో కొత్తకష్టం వచ్చిపడింది. జిల్లాలో ఎక్కువగా ఉప్పునీటి వనామీ కల్చర్ సాగు చేస్తున్న రైతులు చెరువుల్లో నీటిని నిల్వచేసే సమయంలో 10 శాతం కనిష్ట స్థాయి నుంచి 30 శాతం గరిష్ట స్థాయి వరకు లవణ శాతాన్ని కొనసాగిస్తారు. అదే క్రమంలో రొయ్యల ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్లు, లిపిడ్లు, కార్బోహైడ్రేట్స్, విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పోషకాలు సైతం ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇటీవల వర్షాలకు చెరువుల్లో వర్షపు నీరు చేరడంతో ఆ నీటిని బయటకు తోడాల్సి వస్తోంది. దీంతో సదరు లవణ శాతంతో పాటు పోషకాలు కూడా బయటకు పోతున్నాయి. ఫలితంగా రొయ్య ఎదుగుదలలో మేతతో సమానంగా అందాల్సిన పోషకాల కొరత ఏర్పడుతోంది. ఈ సమయంలో మళ్లీ ప్రొబయోటిక్స్ మొదలుకుని నూట్రిషన్స్ బ్యాలెన్స్ చేయడం కోసం వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ఒడిదుడుకుల నేపథ్యంలో ధరలు సైతం పతనమైన పరిస్థితుల్లో మళ్లీ పోషకాల కోసం అదనపు ఖర్చులు పెట్టాలంటే తడిసిమోపుడవుతోందని వాపోతున్నారు. సబ్సిడీపై పట్టించుకోని పాలకులు ఆక్వా సాగులో కేవలం పోషకాల కోసం మొత్తం సాగు ఖర్చులో 20 శాతం కేటాయించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పోషకాలు సబ్సిడీపై అందించాలని ఎప్పటినుంచో రొయ్యల రైతులు, సంబంధిత సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రధాన పోషకాలైన మెగ్నీషియం, కాల్సియం, ఆక్వా రైతులు పోషకాల వినియోగంపై ఇంకా అవగాహన పెంచుకోవాల్సి ఉంది. కేవలం అవగాహనతోనే పోషకాల ఖర్చుల్లో నియంత్రణ వస్తుంది. రొయ్యలు లేదా చేపల పెంపకంలో నీరుకూడా దాగి ఉన్న పోషకంగా పరిగణించబడుతుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నీటిని బయటకు తోడాల్సి వచ్చినపుడు అదనపు పోషకాలు అందించక తప్పదు. – డాక్టర్ హెచ్.డిల్లీశ్వరరావు, ఫిషరీస్ అసిస్టెంట్, గుప్పెడుపేట సచివాలయం -
శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో ఉంచాలి
పాతపట్నం నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎల్ఎన్పేట మండలాన్ని శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో ఉంచాలని, పలాస జిల్లాకు పంపించవద్దని ఆ మండలంలోని పలు గ్రామాలకి చెందిన ప్రజలు పీజీఆర్ఎస్లో కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఎల్ఎన్పేట మండలం చాలాకాలం పాటు శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో ఉండేదని, రెవెన్యూ డివిజన్ల విభజనలో ఈ మండలం పాతపట్నం నియోజవకవర్గంతో పాటు టెక్కలి డివిజన్ మార్చారని గుర్తు చేశారు. దీనివలన టెక్కలికి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, అత్యంత సమీపంలో ఉండే శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లోనే ఉంచాలని విన్నవించారు. ఈ మేరకు పలు పంచాయతీలు తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యాచకురాలి మృతి
● ప్రమాదం చూసి తోటి యాచకుడు హఠాన్మరణం జి.సిగడాం: మండలంలోని వాండ్రంగి పంచాయతీ చీడిపేట గ్రామంలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకురాలు బలగ భాగ్యం(50) అక్కడికక్కడే మృతి చెందింది. భాగ్యం మృతిని చూసి తోటి యాచకుడు కె.కోటి అక్కడే కూప్పకూలి మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భాగ్యం, కోటి ఇద్దరూ చీడిపేటలో కలిసి జీవనం సాగిస్తున్నారు. వీరు జీవనోపాధిగా యాచక వృతి చేస్తున్నారు. సోమవారం ఉదయం 4 గంటల సమయంలో భాగ్యం కాలకృత్యాలు తీర్చుకోవడానికి రోడ్డు పక్కకు వెళ్లి ఉంటారని తెలిపారు. అదే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డుపై మృతి చెందింది. భాగ్యంకు ప్రమాదం జరగడం చూసిన తోటి యాచకుడు కోటి(60) నలబై అడుగుల దూరంలోనే కుప్పకూలి మృత్యువాతపడ్డాడు. సమాచారం తెలుసుకుని ఎస్ఐ వై.మధుసూదనరావు, శ్రీకాకుళం క్లూస్ టీమ్, స్థానిక సర్పంచ్ సాకేటి నాగరాజు, పంచాయతీ కార్యదర్శి వడగా గౌరీశంకరావు, వీఆర్వో శివనారాయణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. భాగ్యం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. -
ఎరువులు ఎందుకు లేవు..?
టెక్కలి: జిల్లా రైతులకు అవసరమైన ఎరువుల్లో యూరియాను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎందుకు కేటాయించలేకపోయారని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యుడు ఎన్.షణ్ముఖరావు నిలదీశారు. సోమవారం టెక్కలిలో కమిటీ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఖరీఫ్లో రైతులకు అవసరమైన యూరియా దొరక్కపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 42,200 మెట్రిక్ టన్నులకు పైగా యూరియా అవసరమైనప్పటికీ కేవలం 21,644 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే అందుబాటులో ఉంచారని విమర్శించారు. ఈ విషయంలో మంత్రి విఫలమయ్యారని పేర్కొన్నారు. అవసరమైన యూరియా అందజేయకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని గోవిందరావు హెచ్చరించారు. సమావేశంలో హెచ్.ఈశ్వరరావు, బి.వాసుదేవరావు, పోలయ్య, బి.అప్పారావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
వనామీకి వరుణ గండంవనామీ రొయ్యకు వరుణ గండం పట్టుకుంది. చెరువుల్లో వర్షపు నీరు చేరుతోంది. –8లో
ఫైల్వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు అందించిన గొప్ప సేవలకు నిలువెత్తు సాక్ష్యమిది. జి.సిగడాంలో ఇంటి వద్దకే విత్తనాలు అందజేస్తున్న పరిస్థితి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ముందే ఇండెంట్ తీసుకుని నేరుగా రైతుల ఇంటికే విత్తనాలు సరఫరా చేసిన దృశ్యమిది. 2014–19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టెక్కలిలో ఎరువుల కోసం మండుటెండలో రైతులు నిలబడ్డ దుస్థితి. గంటల తరబడి నిలబడ్డా ఎరువులు దొరికేవా అంటే అదీ లేదు. బ్లాక్లో తరలిపోయిన ఎరువుల కారణంగా రైతులకు అందని పరిస్థితి. -
మట్టిలో దేవుడు
శ్రీకాకుళంకరకట్ట.. కనికట్టువంశధార నదీ తీర గ్రామాల ముంపు ముప్పు ఎదుర్కొంటున్నాయి. కరకట్టల కోసం ఎదురుచూస్తున్నాయి. –8లోమట్టి మహిమాన్వితమవుతోంది. మండపాలకు చేరేందుకు మూషిక వాహనుడి ప్రతిమ ఉవ్విళ్లూరుతోంది. శత కోటి రూపాల్లో, అనంతకోటి అలంకరణలతో దర్శనమిచ్చేందుకు లంబోదరుడి విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. ప్రకృతిలో ప్రకృతిలా కలిసిపోయేలా, గంగమ్మ ఒడికి చేరి గణనాథుడు సేదతీరేలా పర్యావరణ హితంగా ప్రతిమలు రూపుదిద్దుకుంటున్నాయి. నరసన్నపేట: శివ బృంద సభ్యులు మట్టి మేలు తలపెడుతున్నారు. కోల్కతా నుంచి వచ్చిన ఈ బృందం నరసన్నపేటలో మట్టి గణపతి విగ్రహాలు తయారు చేస్తోంది. స్థానిక పైడితల్లి ఆలయం పక్క న ప్రత్యేక శిబిరంలో మట్టితో వినాయక ప్రతిమలు సిద్ధం చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు తయారు చేయమని ప్రోత్సహిస్తున్నా శివ బృందం మాత్రం మట్టి విగ్రహాలనే తయారు చేసి పర్యావరణాన్ని కాపాడుతోంది. ఒండ్రుమట్టి, గడ్డి, చొప్ప గడ్డితో విగ్రహాలను తయారు చేస్తున్నామని అంటు న్నారు. స్థానికంగా సేకరించిన మట్టికి గంగా నది నుంచి తెచ్చిన మట్టిని మిక్స్ చేసి విగ్రహాలు త యారు చేస్తున్నారు. రంగులు కూడా పర్యావరణ హితంగా వినియోగిస్తున్నారు. వాటర్ కలర్స్ వాడుతున్నామని వీటి వల్ల పర్యావరణానికి పూర్తి రక్షణ ఉంటుందని, ఎలాంటి కాలుష్యం వెదజల్లదని తయారీదారు శివ బృంద సభ్యులు చెబుతున్నారు. సోమవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2025 నరసన్నపేట కేంద్రంగా మట్టి గణపతుల తయారీ గంగా నది నుంచి ప్రత్యేకంగా మట్టి సేకరణ చవితి పూర్తి కాగానే దుర్గా, సరస్వతి, గౌరీ దేవి విగ్రహాల తయారీ -
జిల్లాస్థాయి క్విజ్ పోటీలకు ఆహ్వానం
ఇచ్ఛాపురం రూరల్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సవరదేవిపేట(పేటూరు)లో జిల్లాస్థాయి క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆదివారం నిర్వాహకులు తెలిపారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఈ పోటీలను ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ఆసక్తిగల విద్యార్థులు తమ ఎంట్రీలను ఈనెల 28 నాటికి పంపించాలని, పూర్తి వివరాలకు 8501803445, 8688840057 నంబర్లను సంప్రదించాలని కోరారు. బంగాళాఖాతంలో అల్పపీడనం శ్రీకాకుళం పాతబస్టాండ్: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం ఉన్నందు న ఒడిశాతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. రానున్న మూడు రోజులు ఈ ప్రభావం ఉంటుందని, దీనివల్ల తేలికపాటి, ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదులు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. జీపీఎస్ పరికరాల పంపిణీలో చేతివాటం సంతబొమ్మాళి: భావనపాడులో మత్స్యకారులకు అందజేసిన జీపీఎస్ పరికరాల పంపిణీలో చేతివాటం ప్రదర్శించారు. ఈ నెల 21వ తేదీన భావనపాడులో ముందుగా నమోదు చేసుకున్న బోట్లు ఉన్న 88 మంది మత్స్యకారులకు జీపీఎస్ పరికరాలను అధికార పార్టీ నా యకుల సమక్షంలో మత్స్యశాఖ అధికారులు అందజేశారు. ఒక్కో జీపీఎస్ పరికరానికి రూ. 400 చొప్పున రూ. 35,200 కలెక్షన్ చేశారు. డబ్బులు ఇవ్వలేదని కొందరు మత్స్యకారులకు జీపీఎస్ పరికరాలు ఇవ్వడానికి అధికార పార్టీ నాయకులు నిరాకరించారు. దీంతో గత్యంత రం లేక డబ్బులను చెల్లించి పరికరాలను తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కొందరు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఉచితంగా పరికరాలను ఇస్తుంటే ఇక్కడ డబ్బులు తీసుకోవడంపై కొందరు నిలదీశారు. దీనిపై టెక్కలి ఎఫ్డీఓ ధర్మారాజు పాత్రోను అడుగగా ప్రభుత్వం ఉచితంగానే జీపీఎస్ ప రికరాలను అందజేసిందని, అయితే ట్రాన్స్పోర్ట్ లోడింగ్, అన్లోడింగ్, భోజనాలకు బోటుకు రూ.200 చొప్పున వసూలు చేసినట్లు తెలిసిందని అన్నారు. రెండోరోజూ కొనసాగిన విజిలెన్స్ దాడులు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో వరుసగా రెండో రోజు ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడు లు కొనసాగాయి. విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖలు జిల్లాలో ఎనిమిది చోట్ల సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. మన జిల్లాతో పాటు విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లో 15 చోట్ల జరిగాయి. విజయనగరం పట్టణంలో శ్రీమాతా వెంకటేశ్వరరావు అండ్ సన్స్ రికార్డులు సక్రమంగా లేనందున రూ. 2.47 లక్షల విలువైన 4.35 టన్నుల కాంప్లెక్సు ఎరువుల అమ్మకం నిలుపుదలకు సిఫా ర్సు చేశారు. ఉత్సాహంగా జానపద సంబరాలు ఇచ్ఛాపురం: పట్టణంలోని రోటరీ క్లబ్ ఫంక్షన్ హాల్లో జానపద సంబరాలను శ్రీమహతి సాంస్కృతిక కళాసేవాసంస్థ ఆధ్వర్యంలో ఉత్సాహంగా నిర్వహించారు. ప్రపంచ జాన పద దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు జానపద సంబరాలను నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని గాత్ర కళాకారులు, సంగీత వాయిద్య కళాకారులు, కూచిపూడి, భరతనాట్యం, జానపద కళాకారులు, కోలాటం కళాకారులు పాల్గొన్నారు. ఒడిశా కళాకారుల బృందాలు కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జానపద కళలకు ఎనలేని సేవ చేసి జానపద గురువుగా పేరొందిన దుర్గాశి సారధిరెడ్డిని ఘనంగా సత్కరించారు. నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్లో సో మవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవాలంటే 1100కు నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. -
టోల్ప్లాజాల్లో అడ్డగోలు నియామకాలు
● ఎక్స్సర్వీసు కోటాకు తిలోదకాలు శ్రీకాకుళం పాతబస్టాండ్: టోల్ప్లాజాల్లో అడ్డగోలు నియామకాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం నిబంధనలు గాలికి వదిలేసి నియామకాలు చేస్తున్న వైనం విస్మయపరుస్తోంది. ఎక్స్సర్వీసు కోటాను కూడా తుంగలో తొక్కుతున్నారు. జిల్లాకు సంబంధించి 16వ నంబర్ జాతీయ రహదారిపై రెండు టోల్ప్లాజాలు ఉన్నాయి. మడపాం టోల్ప్లాజాలో దాదాపు 109 మంది పనిచేస్తున్నారు. నిబంధనల మేరకు ఇక్కడ 33 శాతం మంది రిటైర్డ్ ఆర్మీ, నేవీ ఉద్యో గులు ఉండాలి. కానీ ప్రస్తుతం 20 శాతం మందే ఉన్నారు. వీరికి డైరెక్ట్ జనరల్ ఆఫ్ రీ సెటిల్మెంటు ప్రకారం జీతాలు చెల్లించాలి. కానీ ఆ విధా నం కూడా అమలు కావడం లేదు. వీరిలో ఇటీవల పది మంది వరకు రిటైరయ్యారు. వీరి స్థానంలో ఎక్స్ సర్వీసు కోటాను ఉపయోగించి వేరేవారిని నియమించాలి. కానీ అలా చేయకపోవడంతో అర్హులు నష్టపోతున్నారు. రోస్టర్ను పక్కన పెట్టి నాయకులు నచ్చిన విధంగా నియామకాలు చేస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే నియమిస్తున్నారని, రోస్టర్ పాటించడం లేదని అక్కడి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాజాల్లో తల్లి–కొడుకు, తండ్రి–కొడుకు, ఇలా ఒకే కుటుంబం నుంచి ఒకే సామాజికవర్గం నుంచి ఉద్యోగాలు పొందడం వెనుక అధికార పార్టీ, సామాజిక వర్గం ప్రాధాన్యతలు పనిచేస్తున్నాయని అంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య లేదని, పూ ర్తిగా నిబంధనలు పాటించేవారని, ఇప్పుడు మాత్రం రాజకీయ సామాజిక పలుబడి ఉన్నవారే టోల్ ప్లాజా ఉద్యోగులుగా చేరుతున్నారని, వాస్తవిక అర్హతలు ఉన్న వారు నష్టపోతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. పార్టీలు, నాయకులు మా రడం సహజమేనని, అయితే ఈ విధానం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైవే అథారిటీస్ ఈ నియామకాలు, టోల్ ప్లాజాల్లో జరుగుతున్న అవినీతి, పెరుగుతున్న సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. -
● ప్రతిమ.. పర్యావరణ హితమే
శ్రీకాకుళం కల్చరల్: మట్టి గణపతిని పూజించాలని, తద్వారా జలవనరులతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమనే అంశంపై పలు సంస్థలు చిన్నారులకు అవగాహన పెంచే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అందుకోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో మట్టిగణపతుల తయారీపై పోటీలను ఆదివారం నిర్వహించాయి. అధిక సంఖ్యలో చిన్నారులు హాజరై వా రి ప్రతిభను ప్రదర్శించారు. హాజరైన అతిథులు పర్యావరణ పరిరక్షణ అంశాన్ని చిన్నారులకు వివరించారు. మట్టిగణపతి ప్రయోజనాన్ని విశదీకరించారు. లాఫింగ్ క్లబ్, షిర్డీ సాయి ఆధ్యాత్మిక ధ్యాన మందిరం సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ఈ పోటీలు శ్రీకాకుళం నగరంలో జరిగాయి. లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు 120 మంది హాజరయ్యారు. షిర్డీ సాయి ధ్యానమందిరం పోటీ ల్లో 108 మంది చిన్నారులు హాజరయ్యారు. -
కన్నబాబుకు పరామర్శ
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ ఇటీవల మృతిచెందిన సంగతి తెలిసిందే. కాకినాడలోని ఆయన కుటుంబాన్ని ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, రాష్ట్ర కళింగవైశ్య కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పోలినాటి వెలమ కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్, ఎన్ని ధనుంజయ తదితరులు పరామర్శించారు. -
● కుబేర గణపతి
శ్రీకాకుళం కల్చరల్: గణపయ్య రూపం తయారీకి కాదేదీ అనర్హం అని నిరూపిస్తున్నారు నగరానికి చెందిన కళాకారుడు దాకోజు లాల్ ప్రసాద్. మూడేళ్లుగా ఏదో ఒక వినూత్న ఆలోచనతో పర్యావరణ హితమైన ప్రచారానికి వీలుగా సిద్ధిగణపయ్యను రూపొందిస్తున్నారు. ఈ ఏడాది కుబేర గణపతిని తయారు చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రతి ఏటా అంపోలు గ్రామస్తుల కోరిక మేర కు ప్రత్యేకంగా గణపతులను తయారు చేసి వారికి అందజేస్తున్నారు. గత రెండేళ్లుగా ఐస్ క్రీమ్ పుల్లలతో ఒకసారి.. చాక్లెట్లతో ఒకసారి పార్వతీ తనయు డి విగ్రహాల్ని తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏమిటీ కుబేర గణపతి... పర్యావరణ హితమైన వస్తువులతో ఈ ఏడాది కూడా గణపయ్యను రూపొందించేందుకు వివిధ ఆలోచనలు చేశాడు లాల్ ప్రసాద్. కరెన్సీతో చేస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని అంపోలు గ్రామకమిటీతో చర్చించారు. వారు సరే అనడంతో పది రోజుల వ్యవధిలో గణపయ్యను సిద్ధం చేశాడు. చిల్లర నాణేలు, కరెన్సీ నోట్లు, థర్మాకోల్ షీట్లతో తన ఇంటివద్దే విగ్రహాన్ని రూపొందించారు. కాయిన్స్ కోసం బ్యాంకులను సంప్రదించి 20 వేల రూపాయల కాయిన్స్ను సిద్ధం చేసుకున్నాడు. ● కాయిన్స్.. కరెన్సీ నోట్లతో విగ్రహం ● 25 వేల నగదుతో పర్యావరణ గణపయ్య ● వరుసగా మూడో ఏడాది విభిన్న రూపం కుబేర గణపతి -
కరకట్ట.. కనికట్టు!
● ముంపునకు గురవుతున్న వంశధార తీర గ్రామాలు ● వర్షమొస్తే వణుకుతున్న నదీ పరివాహక ప్రజలు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం హిరమండలం/సరుబుజ్జిలి: – హిరమండలం మండలం గులుమూరు గ్రామం వంశధార నదిని ఆనుకుని ఉంటుంది. గొట్టా బ్యారేజీకి ముందు కూతవేటు దూరంలో ఉంది. ఎప్పుడు వంశధార ఉప్పొంగినా నీరు గ్రామంపైకి పోటెత్తుతుంది. అక్కడ కరకట్ట లేకపోవడంతో ఏటా వరదల సమయంలో ఆ గ్రామం చిగురుటాకులా వణికిపోతుంది. ● హిరమండలం మండలం పిండ్రువాడ, భగీరథపురం, మహాలక్ష్మీపురం గ్రామాల పరిధిలో పంట పొలాలకు ఏటా వరద ముంపు తప్పడం లేదు. వర్షాలు, వరదల సమయంలో గొట్టా బ్యారేజీ గేట్లు అన్నీ ఎత్తివేస్తారు. ఆ సమయంలో నీరు తీర గ్రామాల పొలాలపై పడుతుంది. ఇసుక మేటలు వేసి పంటలకు తీరని నష్టం కలుగుతుంది. కరకట్టలు లేకపోవడంతో ఏటా పంటలకు నష్టాలు తప్పడం లేదు. ●ఎల్ఎన్పేట మండలంలోని ఎల్ఎన్పేట, మిరియాబిల్లి, వాడవలస, దబ్బపాడు గ్రామాలు వంశధార తీరంలో ఉంటాయి. ఏటా వంశధార తీరం కోతకు గురై ఈ గ్రామాలతో పాటు పంట పొలాల్లోకి వరద నీరు చేరుతుంది. రోజుల తరబడి నిల్వ ఉండిపోతుంది. పంటలకు నష్టం వాటిల్లుతోంది. అదే కరకట్టలు ఉంటే ఈ పరిస్థితి ఉండదు. ఈ సమస్య ఈ రెండు మండలాల్లోనే కాదు.. దాదాపు 10 మండలాల వరకూ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వంశధారకు వరదొస్తే తీర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. నదిలో నీటి మట్టం పెరిగే కొద్దీ ఆయా గ్రామాల ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలు అయిన మోహన, గుణుపూర్ ప్రాంతాల్లో వర్షాలు పడితే నదిలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోతుంది. దీంతో ఎక్కడికక్కడే నదీ తీరం కోతకు గురై సమీప గ్రామాలు, పంట పొలాల్లోకి నీరు చొచ్చుకెళుతుంది. పంట పొలాల్లో ఇసుక మేటలు వేసి ఇబ్బందికరంగా మారుతుంది. వేలాది ఎకరాల పంటలు ఏటా దెబ్బతింటాయి. అయితే ఈ సమస్యకు కరకట్టల నిర్మాణంతో చెక్ చెప్పవచ్చు. కానీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం తీర గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో వంశధార నదీ పరివాహక గ్రామాలుగా కొత్తూరు మండలంలో 14, హిరమండలంలో 10, ఎల్ఎన్పేటలో 3, సరుబుజ్జిలిలో 4, ఆమదాలవలసలో 5, శ్రీకాకుళం రూరల్లో 3, గారలో 4, జలుమూరులో 19, నరసన్నపేటలో 12, పోలాకి మండలంలో 12 గ్రామాలు ఉన్నాయి. ఏటా వర్షాలు, వరదల సమయంలో ఈ గ్రామాలకు భారీగా నష్టం జరుగుతోంది. 2018 ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం కరకట్టలంటూ హడావుడి చేసింది. ఎన్నికల స్టంట్గా మార్చింది. వంశధార నదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొత్తం 4 ఫేజ్లుగా విభజించి పనులు మొదలుపెట్టింది. భామిని, కొత్తూరు, హిరమండలం మండలాల్లో మొదటి ప్యాకేజీ కింద.. ఎల్ఎన్పేట, సరుబుజ్జిలి రెండో ప్యాకేజీ కింద.. ఆమదాలవలస, శ్రీకాకుళం రూరల్, గార మూడో ప్యాకేజీ కింద.. నరసన్నపేట, జలుమూరు, పోలాకి నాలుగో ప్యాకేజీ కింద విభజించారు. తొలి ప్యాకేజీకి సంబంధించి టెండర్లు ఖరారు చేసి కేవలం 10 శాతం పనులు పూర్తిచేసి విడిచిపెట్టారు. ఇంతలో ఎన్నికలు రావడంతో ఆ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వంశధార ఫేజ్–2 రిజర్వాయర్, గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథకం, ఉద్దానం సమగ్ర మంచినీటి పథకాలను ప్రాధాన్యతాంశాలుగా భావించింది. దీంతో టీడీపీ ఆరంభశూరత్వంగా చేపట్టిన కరకట్టల జోలికి వెళ్లలేదు. అయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కరకట్టల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని టీడీపీ కూటమి నేతలు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకూ ఎటువంటి సన్నాహాలు చేయలేదు. దీంతో ఈ ఏడాది కూడా వంశధార తీర గ్రామాల ప్రజలకు ఆందోళనలు తప్పడం లేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పొంచి ఉన్న ముప్పు.. సరుబుజ్జిలి మండలంలోని అగ్రహారం, పాతపాడు, తెలికిపెంట, యరగాం, కాగితాపల్లి, పెదమాలపేట, పెద్దసవలాపురం, చినవెంకటాపురం, పాలవలస, పురుషోత్తపురం, అలమాజీపేట, ఫకీర్పాహెబ్పేట తదితర గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆమదాలవలస మండలం నిమ్మతొర్లాడ, కొరపాం, బెలమాం, లొద్దలపేట, ముద్దాడపేట, కలివరం, తొగరాం, పొందూరు మండలం సింగూరు, బొడ్డేపల్లి, బూర్జ మండలం ఖండ్యాం, గుత్తావల్లి, నారాయణపురం గ్రామాలు నష్టాలు చవిచూస్తున్నాయి. అనుమతులు రావాలి.. ఈ విషయమై కరకట్టల విభాగం ఈఈ వాసుదేవరావు మాట్లాడుతూ కొన్ని సాంకేతిక కారణాలు వలన కరకట్ట పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయని చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు విషయమై అనుమతులు వస్తే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఏటా వంశధార వరద పోటుతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు పనులు ప్రారంభించి పూర్తిచేయాలి. 2019 ఎన్నికల ముందు హడావుడిగా పనులు ప్రారంభించింది. ఇప్పుడు ఆ కరకట్టల నిర్మాణం గురించి పట్టించుకోకపోవడం దారుణం. – ముద్దాడ లక్ష్మణరావు, దబ్బపాడు, ఎల్ఎన్పేట మండలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వంశధార ఫేజ్ 2 రిజర్వాయర్ నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చింది. గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి సైతం చేపట్టింది. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రారంభించిన కరకట్టల నిర్మాణం పూర్తిచేయాల్సిన బాధ్యత ఉంది. – మీసాల భాస్కరరావు, రైతు, భగీరథిపురం, హిరమండలం నదిలో ఏ మాత్రం ప్రవాహం పెరిగినా వరదనీరు గ్రామంలోకి వస్తోంది. దీంతో పంటనష్టం కలుగుతోంది. కరకట్ట నిర్మాణం చేయకపోవడవం వల్ల విలువైన భూములు, ఇళ్లు కోల్పోతున్నాం. ఇప్పటికై నా పాలకులు స్పందించాలి. –బి.మల్లేశ్వరరావు, పాతపాడు, సరుబుజ్జిలి మండలం -
యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ రవాణా
● కరిగిపోతున్న పెద్దకొండ ● పట్టించుకోని అధికారులు సంతబొమ్మాళి: మండలం కేంద్రం సంతబొ మ్మాళిలో తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న పెద్దకొండను అక్రమార్కులు కొల్లగొట్టేస్తున్నారు. యథేచ్చగా గ్రావెల్ను తరలించుపోతున్నారు. రోజుకు వందలాది లోడుల ను ట్రాక్టర్తో రవాణా చేస్తున్నారు. మొదట్లో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు జరిగినా అధికారులు పట్టించుకోకపోవడంతో మరింత బరితెగించారు. జేసీబీతో కొండను తవ్వేస్తూ రోడ్డు నిర్మాణ పనుల పేరిట గ్రావెల్ను పట్టపగలు దర్జాగా అర్అండ్బీ రోడ్డు మీదుగా తరలించుకుపోతున్నారు. ఎటువంటి అనుమతులు లేకపో యినా రవాణా చేస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా రు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో పోర్టు నిర్మాణానికి టిప్పర్ల ద్వారా గ్రావెల్ను తరలించినప్పుడు కొందరు స్థానికులు అడ్డుకోవడంతో నిలిచిపోయింది. ఇప్పుడు కొన్ని రోజులుగా ప్రైవేటు వ్యక్తులు టాక్టర్లు ద్వారా రోజుకు వందల లోడ్లును తరలించుకుపోతున్నా మైన్స్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పెద్దకొండ కరిగిపోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సంతబొమ్మాళి పెద్దకొండ నుంచి గ్రావెల్ తరలింపునకు ఎటువంటి అనుమతులు లేవు. గతంలో రెండు సార్లు చెప్పినా పట్టించుకోకుండా రోడ్డు నిర్మాణం పేరిట తరలించుకుపోతున్నారు. – భాస్కరరావు, వీఆర్వో, సంతబొమ్మాళి -
యువకుడికి కత్తిపోట్లు
జి.సిగడాం : గెడ్డకంచరాం గ్రామంలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గెడ్డకంచరాం గ్రామానికి చెందిన పుక్కల రాజశేఖర్, గొబ్బూరు గ్రామానికి చెందిన దమరసింగి శంకర్(గొల్లాజీ) స్నేహితులు. ఇద్దరూ కలిసే పెయింటింగ్ పనులకు వెళ్తుంటారు. ఆదివారం గెడ్డకంచరాంలో అప్పన్న అనే వ్యక్తి ఇంట్లో జరిగిన శుభకార్యానికి ఇద్దరూ వెళ్లారు. ఈ క్రమంలో మద్యం బాటిల్ విషయమై గొడవ జరిగింది. అనంతరం ఇద్దరూ బయటకు వచ్చేసి బాతువ– గెడ్డకంచరాం కూడలి వద్ద మరోసారి గొడవపడ్డారు. ఈ సమయంలో రాజశేఖర్ కింద పడిపోయాడు. శంకర్ వెంటనే ద్విచక్ర వాహనంలో ఉన్న కత్తి తీసి రాజశేఖర్ కడుపులో పొడిచాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు స్పందించి జి.సిగడాం ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వై.మధుసూదనరావు తెలిపారు. కాపర్ వైర్లు చోరీ నరసన్నపేట: తెలగవలసలో వ్యవసాయ బోర్లకు చెందిన కాపర్ వైర్లు చోరీకి గురయ్యా యి. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్యానల్ బోర్డు నుంచి స్టాటర్కు, స్టాటర్ నుంచి మోటారు వద్దకు వెళ్లే వైర్లు కట్ చేసి పట్టుకుపోయారు. వీటి విలువ రూ.20 వేలు ఉంటుందని అంచనా. కాపర్ వైర్ల చోరీ వల్ల వ్యవసాయ బోర్లు వినియోగించుకోలేకపోతున్నామని బాధి త రైతులు ముద్దాడ నాగేశ్వరరావు, గణేశ్వర రావు, సింహాచలం, భాస్కరరావు, బలరాం, వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉత్సాహంగా సాఫ్ట్బాల్ ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో సాఫ్ట్బాల్ క్రీడను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు అన్నారు. జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీనియర్స్ మహిళల సాఫ్ట్బాల్ ఎంపిక పోటీలు ఆదివారం శ్రీకాకుళం కోడిరామ్మూర్తి క్రీడా మైదానం వేదికగా ఉత్సాహభరితంగా జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు తరలివచ్చి తమ ప్రతిభ నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ మాట్లాడుతూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి వేదికగా ఈ నెల 30, 31 తేదీల్లో జరగనున్న ఏపీ రాష్ట్ర స్థాయి సీనియర్స్ మహిళల సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్–2025 పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ఇక్కడ ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, డీఎస్డీవో డాక్టర్ శ్రీధర్రావు, సబ్ రిజిస్ట్రార్ గురుగుబెల్లి రాజు, జిల్లా పీఈటీ–పీడీ సంఘ అధ్యక్షుడు పి.తవిటయ్య, సహాధ్యక్షుడు మెట్ట తిరుపతిరావు, ఎస్.జీ.ఎఫ్ కార్యదర్శి బీవీ రమణ, హెచ్ఎం కె.హరిబాబు, సాఫ్ట్బాల్ సంఘ ప్రతినిధులు ఎం.ఆనంద్ కిరణ్, అన్నెపు రాజగోపాల్, గురుగుబెల్లి రాజశేఖర్, ఎ.డిల్లేశ్వరరావు, ఆర్కే మహంతి, మల్లేష్, పీడీలు పాల్గొన్నారు. -
రాష్ట్ర పోటీల్లోనూ సత్తాచాటాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సమష్టిగా రాణించి విజయబాహుటా ఎగురవేయాలని ఎచ్చెర్ల ఏఆర్ ఎస్సై గంధం సత్యనారాయణ పేర్కొన్నారు. ఐదేళ్లగా బాల్ బ్యాడ్మింటన్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తు రాష్ట్ర,జాతీయస్థాయిలో పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్నారని కొనిడాయారు. ఈ నెల 29 నుంచి 31 వరకు ప్రకాశం జిల్లా చేవూరు వేదికగా జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే సబ్ జూనియర్స్, సీనియర్స్ బాలబాలికల జట్లకు క్రీడాదుస్తులను ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో గంధం అజయ్ పావని దంపతులు, సంఘ ప్రతినిధులు, కోచ్లు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఆదిత్యా నమోస్తుతే..!
అరసవల్లి: ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి కొలువైన అరసవల్లి ఆదివారం భక్తజనంతో కిటకిటలాడింది. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు తలనీలాలను సమర్పించగా.. మరికొందరు ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో ఈ పూజలు నిర్వహించారు. అంతరాలయంలో భక్తులకు ఉదయం 6 గంటల నుంచే సర్వదర్శనాలకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ అనుమతించారు. అవస్థలపై ఫిర్యాదులు.. దర్శనాల విషయంలో పలువురు భక్తులు ఈఓ కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. కేశఖండన శాలలో టిక్కెట్ల ధరకు మించి వసూళ్లు చేస్తున్నారని చెప్పారు. సూర్యనమస్కారాల పూజల వద్ద ఎక్కువ సమయం కింద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నామని, పీటలు వంటివి ఏర్పాటు చేస్తే అవసరమైన భక్తులకు వీలుగా వినియోగపడతాయనే అంశాన్ని ఈవో దృష్టికి తీసుకువెళ్లారు. ఒక్కొక్కరికి రూ.300 చొప్పున సూర్యనమస్కారాల పూజలకు వసూలు చేస్తున్నారని, దంపతులకు ఒకే టికెట్ను నిర్ణయించాలని కోరారు. వీటిని పరీశీలించి తప్పనిసరిగా అమలు చేస్తామంటూ ఈవో బదులిచ్చారు. కేశఖండన శాలలో అదనపు వసూళ్లు చేస్తున్న క్షురకుల నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తామని చెప్పారు. -
సెప్టెంబర్ 14న అంగన్వాడీ మహాసభలు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సెప్టెంబరు 14న పాతపట్నంలో నిర్వహించనున్న అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ వేతనాల పెంపు, డీఏ, పీఆర్సీ, సంక్షేమ పథకాల వర్తింపు, యాప్ల భారం తగ్గింపు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య, యూనియన్ నాయకులు పి.లతాదేవి, బి.శాంతామణి, కె.వి.హేమలత, బి.సునీత, పొన్నాడ.భూలక్ష్మి, కె.మాధవి, పి.కళావతి, కె.నారాయణమ్మ,, హేమ, ఉమ పాల్గొన్నారు. -
కారును ఢీకొట్టిన ట్రాక్టర్
నరసన్నపేట: మండల కేంద్రం గాంధీనగర్ కూడలిలో పోలాకి వెళ్లే దారిలో ఆదివారం ఉదయం కారును ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ముందుభాగం నుజ్జుగా మారింది. పశువుల అక్రమ రవాణాపై కేసు నమోదు కవిటి: కొజ్జీరియా టోల్ప్లాజా వద్ద పశువుల అక్రమ రవాణాను కవిటి పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం ఒడిశావైపు నుంచి విజయనగరంలోని అలమండ పశువుల సంతకు వెళ్తున్న ఐషర్ వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేయగా 14 దున్నపోతులు, 2 గేదెలు ఉన్నట్టు గుర్తించారు. వీటిని కంచిలి మండలం గొల్లకంచిలికి చెందిన గణప వాసులు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి పశువులను కొత్తవలసలోని హెల్పింగ్హ్యాండ్స్ సంస్థ అప్పగించినట్లు కవిటి ఎస్ఐ వి.రవివర్మ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో హేమశ్రీ ప్రతిభ శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన డి.హేమశ్రీ సత్తాచాటింది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శాప్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని దక్కించుకుంది. హేమశ్రీ స్వస్థలం బూరవెల్లి గ్రామం. డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఇటీవలే ఖేలో ఇండియా మహిళల వెయిట్లిఫ్టింగ్ పోటీల్లోనూ 53 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని సాధించి శభాష్ అనిపించుకుంది. హేమశ్రీ రాణింపు పట్ల డీఎస్డీఓ శ్రీధర్రావు, కోచ్ ఇప్పిలి అప్పన్న, సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. పీడీ–పీఈటీ సంఘానికి రూ.లక్ష వితరణ శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం పీడీ–పీఈటీ సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు, ఒలింపిక్ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అభివృద్ధికి బాసటగా నిలిచారు. నగరంలోని టీపీఎంహెచ్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేసి ఇటీవలి ఉద్యోగ విరమణ చేసిన చేసిన సాంబమూర్తి తనవంతుగా రూ.లక్ష వితరణగా అందజేశారు. ఆదివారం జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ ముఖ్య సలహాదారు పి.సుందరరావు, జిల్లా అధ్యక్షుడు పి.తవిటయ్య, ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నీట్లో బోరుభద్ర విద్యార్థినుల ప్రతిభ సంతబొమ్మాళి: మండలంలోని బోరుభద్రకు చెందిన ముగ్గురు విద్యార్థినులు నీట్ పరీక్ష ఫలితాత్లో సత్తా చాటారు. ఒకే కుటుంబంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మార్పు కోమలి, మార్పు హస్బతో పాటు అదే గ్రామానికి చెందిన వజ్జ యోషిత ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. మార్పు కోమలి, హస్బల తండ్రి శ్రీనివాసరావు విశాఖ పట్నంలో కానిస్టేబుల్గా పనిచేస్తుండగా తల్లి సీత గృహిణి. అలాగే వజ్జ యోషిత తండ్రి నరసయ్య హరిశ్చంద్రపురం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుండగా తల్లి నీరజ గృహిణి. మార్పు కోమలి మార్పు హస్బ వజ్జ యోషిత -
ఆటో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
పొందూరు: గోరింట గ్రామ సమీపంలో ఆటో ఢీకొనడంతో ద్విచక్ర వాహనచోదకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెనుబర్తి ఐఆర్ కాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త మడపాన రాజగోపాల్ ద్విచక్ర వాహనంపై గోరింట వైపు వెళ్తుండగా పొందూరు నుంచి వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజగోపాల్ తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్సులో శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పొందూరు ఎస్సై వి.సత్యనారాయణ కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆస్పత్రికి వెళ్లి రాజగోపాల్ను పరామర్శించారు. ఆయనతో పాటు పెనుబర్తి నాయకులు తమ్మినేని మురళీకృష్ణ, పూర్ణ తదితరులు ఉన్నారు. -
ఇద్దరు బైక్ దొంగలు అరెస్టు
పలాస: గరుడఖండి గ్రామానికి చెందిన కవిటి నిఖిలేశ్, గజపతి జిల్లా కాశీనగరం వాసి తూముల కార్తికేయ అనే ఇద్దరు బైక్ దొంగలను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ వి.వెంకట అప్పారావు శనివారం కాశీబుగ్గ పోలీస్ డివిజనల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిఖిలేశ్, కార్తికేయ శ్రీకాకుళంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి వరకు చదివారు. అనంతరం వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతుండేవారు. విశాఖపట్నంలో ఓ చోరీ కేసులోనూ పట్టుబడ్డారు. ఈ క్రమంలో నిఖిలేష్ మెళియాపుట్టిలోని తన బంధువుల ఇంటి నుంచి వస్తూ టెక్కలిపట్నంలో దాసరి సురేష్ అనే వ్యక్తి బైక్ను చోరీ చేసి పట్టుకుపోయాడు. అలాగే గార మండలానికి చెందిన మెండ వెంకటేశ్వరరావు కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద బైక్ ఉంచగా కార్తికేయ పట్టుకుపోయాడు. రెండు బైకులను విశాఖలో అమ్ముతుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. సమావేశంలో కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ పాల్గొన్నారు. -
ప్రైవేటు బస్సు ఢీకొని యువకుడు మృతి
కంచిలి: మకరాంపురం సమీపంలోని ‘ఆదివారం సంత’ కూడలి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పులకపుట్టుగ గ్రామానికి చెందిన పులక సన్రాజు(24) మృతిచెందాడు. బైక్పై స్వగ్రామం నుంచి జాతీయ రహదారి మీదుగా జాడుపూడి వైపు వెళుతుండగా.. బరంపురం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న శివదేవి ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సన్రాజు కేరళలో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండేవాడు. మూడు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. తండ్రి వాసులు వ్యవసాయం చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. తండ్రి ఫిర్యాదు మేరకు కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బోర్డు నుంచి రోడ్డు వరకు..!
ఉపాధ్యాయుడు అంటే తరగతి గదిలో చదువు చెప్పడమే కాకుండా విద్యార్థులు బడికి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లే వరకు బాధ్యత వహిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇచ్ఛాపురం మండలం ఈదుపురం కండ్రావార్డు ఒడియా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాస్ రంజన్ పట్నాయక్. ఈ పాఠశాలలో 130 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల రోడ్డు పక్కనే ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో విద్యార్థుల హాజరు శాతం తగ్గిపోతుండేది. ఈ నేపథ్యంలో హెచ్ఎం ఉదయం 8 గంటలకు, సాయంత్రం బడి విడిచిపెట్టే సమయంలో ఎర్రజెండాను పట్టుకొని వాహనాలకు రెడ్ సిగ్నల్ ఇస్తూ విద్యార్థులకు రక్షణగా నిలుస్తున్నారు. – ఇచ్ఛాపురం రూరల్ -
బ్యాడ్మింటన్ పోటీల విజేతగా విజయనగరం
అరసవల్లి: జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా జరుగుతున్న విద్యుత్ శాఖ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు శనివారంతో ముగిశాయి. తుది ఫలితాల్లో ఓవరాల్ చాంప్గా విజయనగరం సర్కిల్ ఈపీడీసీఎల్ జట్టు నిలిచింది. రెండో స్థానంలో నెల్లూరు ఎస్పీడీసీఎల్, మూడో స్థానంలో జెన్కో ఆర్టీపీఎస్ కృష్ణపట్నం నిలిచాయి. శనివారం శ్రీకాకుళం విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన బహుమతుల ప్రదాన కార్యక్రమంలో తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ డి.చంద్రం, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ టి.వనజ, చీఫ్ జనరల్ మేనేజర్ (ఆర్ఎ) ఎల్.మహేంద్రనాథ్, సీజీఎం (మెటీరియల్స్) పి.శ్రీదేవి, జనరల్ మేనేజర్ కె.సురేఖ తదతరులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రం మాట్లాడుతూ తొలిసారి రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ వడివేలు, స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, జనరల్ సెక్రటరీ, డివిజనల్ ఈఈ పైడి యోగేశ్వరరావు, సెక్రటరీ మహంతి ప్రభాకరరావు, సనపల వెంకటరావు, డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు, ఎస్ఏఓ ఎ.శ్రీనివాసరావు, డీ–1 ఏఈ జె.సురేష్కుమార్, డీ–2 ఏఈ కింజరాపు జయరాం తదితరులు పాల్గొన్నారు. -
ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలి
రణస్థలం : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ఆదాయం కోల్పోయిన డ్రైవర్లకు ప్రత్యమ్నాయ ఉపాధి కల్పించాలని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి డిమాండ్ చేశారు. శనివారం రణస్థలం మండల కేంద్రంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకం కింద ఆటోలు, వ్యానులు, జీపులు, కార్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్న డ్రైవర్లకు జీవనోపాధి కరువై ఆందోళన గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఓలా, ఉబర్ ర్యాపిడో వంటి వాహనాలు ప్రవేశపట్టి డ్రైవర్లకు ఆదాయం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రకటించిన సంవత్సరానికి రూ.15వేలు ఆర్థిక సాయం వెంటనే ఇవ్వాలని, కాంపౌండ్ ఫీజులు పెంచే జీఓలు 21, 31 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారీగా పెంచిన డీజిల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వాహన విడిభాగాల ధరలు, టోల్ గేట్ ఫీజులు 30 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా రూ.10లక్షలు, సహజ మరణానికి చంద్రన్న బీమా రూ.5లక్షలు వెంటనే అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి రూ.1,01,116 నగదును విశాఖపట్నానికి చెందిన కొల్లి తిరునాథరెడ్డి, ఝాన్సీరాణి దంపతులు శనివారం సమర్పించారు. తన తల్లి సత్యవతి జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు దాతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, సూపరింటెండెంట్ వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు. సముద్రపు నాచు పెంపకంపై అవగాహన సోంపేట: సముద్రపు నాచు పెంపకంపై మహిళలు అవగాహన పెంచుకుని అదనపు ఆదాయాన్ని పొందాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోంపేట మండలం గొల్లూరు పంచాయతీ మూల పొలం గ్రామంలో జాతీయ మత్స్య అబివృద్ధి బోర్డు, ఉదయ్ ఆక్వా ఆధ్వర్యంలో సాగు చేస్తున్న సముద్రపు నాచు పెంపకం చెరువులను కల్టెక్టర్ శనివారం పరిశీలించారు. అనంతరం స్థానిక మత్స్యకార మహిళలతో సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్గా మాట్లాడారు. నాచు పెంపకం వల్ల కలిగే ఆదాయంపై ఆరా తీశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్కుమార్, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యత కొత్తూరు: జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నట్లు జిల్లా ఉద్యానవన అధికారి వరప్రసాదరావు తెలిపారు. కొత్తూరు మండలం ఇరపాడులో గొర్లె గౌరినాయుడుకు చెందిన ప్యాక్ హౌస్ను ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడీ శ్రీనివాసరావులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్యాక్ హౌస్లకు ప్రభుత్వం రూ.రెండు లక్షలు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది 18 హౌస్లు నిర్మించిచగా, ఈ ఏడాది 22 నిర్మించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల ఉద్యానవన అధికారి బి.అయింతి పాల్గొన్నారు. డీఈఓను తక్షణమే నియమించాలి శ్రీకాకుళం: జిల్లా విద్యాశాఖ అధికారిని తక్షణమే నియమించాలని డీటీఎఫ్ నాయకులు పూజారి హరిప్రసన్న, పేడాడ కృష్ణారావు శనివారం డిమాండ్ చేశారు. 25 రోజులుగా రెగ్యులర్ డీఈఓను గానీ, పూర్తి అదనపు బాధ్యతలతో డీఈఓను నియమించకపోవడం విచారకరమన్నారు. విద్యా వ్యవస్థ కుంటుపడుతోందని ఫైళ్లు పెండింగ్లో ఉండిపోవడంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆగస్టులో ఇంక్రిమెంట్లకు సంబంధించిన ౖఫైల్పె సంతకాలు లేకపోవడంతో పాత జీతంతోనే బిల్లులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. వీసాలు, పాస్పోర్టులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం కొందరు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారని, అవి కూడా పెండింగ్లో ఉండిపోయాయని తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలి శ్రీకాకుళం అర్బన్: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని జిల్లా ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేశారు. శనివారం శ్రీకాకుళంలోని సరస్వతీ థియేటర్ ఆవరణలో జిల్లా ఎన్టీఆర్ అభిమానులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్, శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు దుంగ శ్రీధర్, శ్రీకాకుళం నగర ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు బుర్రి మధు మాట్లాడుతూ నందమూరి కుటుంబ సభ్యురాలైన నందమూరి షాలిని, జూనియర్ ఎన్టీఆర్లను దుర్భాషలాడినందుకు ఎమ్మెల్యేను తక్షణమే టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పలువురు అభిమానులు పాల్గొన్నారు. -
ప్రకృతి సేద్యానికి సై!
కొత్తూరు: ప్రకృతి విధానంలో వ్యవసాయం చేసే రైతుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సహజంగా లభించే ఆవు పేడ, కషాయాలను పంట సాగుకు వినియోగిస్తూ ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. వీటికి మార్కెట్లో ఆదరణ బాగుండటంతో ప్రకృతి సేద్యం చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. వినియోగదారులకు ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులు అందించడంతో పాటు భూసారం పెంచేందుకు ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదం చేస్తున్నందున ప్రభుత్వాలు సైతం ప్రోత్సాహం అందిస్తున్నారు. జిల్లాలోని 30 మండలాల్లో సుమారు 77 వేలు మంది రైతులు సుమారు లక్ష ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నారు. విస్తృత అవగాహన.. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తరచూ గ్రామాలకు వెళ్లి రైతులతో సమావేశమవుతున్నారు. ప్రకృతి సేద్యం వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు. రసాయిన ఎరువులు, పురుగు మందులు వినియోగించడం వల్ల భూమికి, రైతులకు కలుగుతున్న నష్టాలను తెలియజేస్తున్నారు. అధిక ధరలు పలికే రసాయన ఎరువులకు బదులు తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే జీవామృతం, బీజామృతం, నీమాస్త్రం, మీనామృతం వంటి కషాయాలపై అవగాహన కల్పిస్తున్నారు. వరి నాట్లు వేసే సమయంలో కాలిబాటలు వదలడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. భూమి మరింత సారవంతంగా మారేందుకు పీఎండీఎస్ కిటు (నవధాన్యాలు కిట్లు) సైతం రైతులకు పంపిణీ చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం విధానంలో పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. గత ఖరీఫ్ కంటే ఈ ఏడాది అన్ని రకాల పంటలు కలిపి సుమారు 40 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం సాగు పెంచేందుకు చర్యలు.. ప్రకృతి వ్యవసాయం సాగు పెంచేందుకు పలు రకాలుగా చర్యలు చేపడుతున్నాము. ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న రైతులకు పీడీఎం కిట్లు తక్కువ దరలకు ఇవ్వడం జరిగింది. పలు రకాల కషాయాలు తయారు పై శిక్షణను రైతులకు ఇస్తున్నాము. సాగు విస్తీర్ణం పెంచేందుకు పొలం బడిలో కూడా రైతులకు ప్రకృతి వ్యవసాయం పద్దతులు పై అవగాహన కల్పిస్తున్నాము. ప్రస్తుత సమాజంలో ఆరోగ్య స్పృహ పెరగడంతో ప్రకృతి వ్యవసాయ ఉత్పుత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటోంది. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా పంట ఉత్పత్తులు లభిస్తుండటంతో కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయి. దేశీయ ఆవుపేడతో జీవామృతం సొంతంగా తయారు చేసుకోవచ్చు. బీజామృతం, వేప కషాయాలు, మీన కషాయాల తయారీకి ఖర్చు తక్కువే. రసాయన ఎరువులు బదులుగా పేడ, కుళ్లిన గత్తం వంటివి వాడితే భూమి సారం పెరుగుతుంది. వాన పాములు, ఇతర సూక్ష్మజీవులు పెరిగి జీవ వైవిధ్యం కాపాడతాయి. రసాయన ఎరువులు వాడకపోవడం వల్ల ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులు లభిస్తాయి. పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. కూరగాయలు, పండ్లు రుచిగా ఉంటాయి. వాతావరణంలో కాలుష్యం బాగా తగ్గుతుంది. భూమి సారవంతంగా మారుతుంది. పర్యావరణ సమతుల్యతకు మేలు చేసే పక్షులు, పురుగులు, ఇతర జీవరాశులను సంరక్షించవచ్చు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పంట సాగు చేయ డం వల్ల పంట గిట్టుబాటు గా ఉంటోంది. పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటోంది. దిగుబడులు సైతం ఆశాజనకంగా ఉంటున్నాయి. భూమి సారవంతంగా మారుతుంది. – ఎస్.అప్పారావు, ప్రకృతి వ్యవసాయ రైతు, లబ్బ గ్రామం, కొత్తూరు మండలం ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో వరి పంట సాగు చేశాను. రసాయన ఎరువు లు, పురుగు మందులు వినియోగించకపోవడంతో ఖర్చు తగ్గింది. జీవామృతంతో పాటు ఇతర కషాయాలు పిచికారీ చేయడంతో ఆరోగ్యకరమైన పంట పండింది. – అంపిలి బుచ్చిబాబు, ప్రకృతి వ్యవసాయ రైతు, గూనబద్ర, కొత్తూరు మండలం -
ఎవర్గ్రీన్ కానుక
● పుట్టిన రోజుకో మొక్క నాటుతున్న విద్యార్థులు ● అవలంగిలో బర్త్ డే గార్డెన్ ● 216 మొక్కలు నాటిన విద్యార్థులు హిరమండలం: అవలంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆకుపచ్చని జ్ఞాపకాలు పోగే సుకుంటున్నారు. పుట్టిన రోజు కానుక బతుకంతా కనిపించేలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. స్కూల్లో పుట్టిన రోజు వేడుకలు చేసుకునే సందర్భాల్లో కేక్లు కట్ చేయకుండా ఆ పాఠశాల విద్యార్థులు మొక్కలు నాటుతున్నారు. వాటి సంరక్షణకు శపథం చేస్తున్నారు. ఏడాది పొడవునా వాటి ఆలనాపాలనా చూస్తారు. ఇప్పటివరకూ 216 మొక్కలు నాటారు. నిత్యం వాటి సంరక్షణ చూస్తున్నారు. దీంతో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గ్రీన్ స్కూల్ ప్రొగ్రామ్ కింద అవలంగి పాఠశాలను గుర్తించి అభినందనలు తెలిపింది. సైన్స్ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో.. పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు డొక్కరి ధనుంజయ ఈ మొక్కల పెంపకం అనే యజ్ఞాన్ని ప్రారంభించారు. 2021 జనవరి నెలలో పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించిన ధనుంజయరావు వినూత్న ఆలోచన చేశారు. ఇక నుంచి విద్యార్థుల పుట్టిన రోజుల నాడు మొక్క లు నాటి సంరక్షించాలని తీర్మానం చేశా రు. అప్పటి నుంచి మొక్కలను పెంచడం ప్రారంభించారు. ఇటీవల పాఠశాలను సందర్శించిన విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలల్లో కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని సూచించారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గుర్తించడం ఆనందంగా ఉంది. మొక్క అనేది జీవకోటికి మూలం. చెట్లు వాతావరణ సమతుల్యతకు, మనిషికి ఆక్సిజన్లు ఇస్తాయి. అందుకే విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచి మొక్కల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. – డొక్కర ధనుంజయ, సైన్స్ ఉపాధ్యాయుడు -
శ్రీకాకుళం
ప్రకృతి సేద్యానికి సైప్రకృతి సేద్యానికి రైతులు సై అంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధ్యమవుతాయి. –8లోuuపలాసలో ఇలా.. పలాస: పలాస నియోజకవర్గంలోని మూడు మండలాలు, ఒక మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రైతులు ఎరువుల కోసం నానా పాట్లు పడుతున్నారు. పలా సలో ప్రైవేటు దుకాణాల్లో రైతులకు అవసరమైన ఎరువులు లభించకపోవడంతో ఒడిశా ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు. పలాసలో ప్రైవేటు దుకాణాల్లో రూ.270 ఉండగా ఒడిశా రాష్ట్రంలోని గారబందకు మోటారు బైకుల మీద వెళ్లి ఒక బస్తా యూరియాను అధిక రేటు ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని అల్లుకోల గ్రామానికి చెందిన రైతులు చెబుతున్నారు. వర్షాలు బాగా పడటంతో ఒకే సారి దమ్ములు కావడం, గతంలో వేసిన ఎదలకు కూడా ఎరువులు వేయాల్సి రావడంతో యూరియాతో పాటు డీఏపీ ఎరువు కూడా అవసరం ఉంది. ఈ రెండు రకాల ఎరువులు ఎక్కడా లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాలు గ్రామాల్లో నామమాత్రంగా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘పెన్షన్ల తొలగింపునకు కూటమి కుట్ర’
నరసన్నపేట: దివ్యాంగుల పింఛన్లు తొలగించేందుకు కూటమి రోజుకో కుట్ర పన్నుతోందని, రోజుకో ప్రకటన చేస్తూ దివ్యాంగుల్లో ఆందోళన కలిగిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మా న కృష్ణదాస్ ఆరోపించారు. ఈ మేరకు శనివా రం ఓ ప్రకటన చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని వదిలేసి దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్లు నిలిపివేసేందుకు పన్నాగాలు పన్నుతోందన్నారు. రీ వెరిఫికేషన్, రీ ఎసెస్మెంట్ పేరున మళ్లీ వైద్యుల వద్దకు వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని నోటీసు లు ఇస్తుండడంపై ఆయన మండిపడ్డారు. వైకల్యం 40 శాతం కంటే తగ్గిందన్న సాకుతో పెన్షన్లు తొలగిస్తామనడం మానవత్వానికి విరుద్ధమన్నారు. పదేళ్లకు పైబడి పెన్షన్లు తీసుకుంటున్న వారు ఇప్పుడు అనర్హులు అనడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం కుట్రలు మాని వస్తున్న పెన్షన్లను యథావిధిగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం క్రైమ్ : ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ నివారణ కోసం జిల్లాలో శనివారం ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు ముమ్మరంగా జరిగాయి. రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ హరీష్గుప్తా ఆదేశాల మేరకు శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా, అమలు అధికారి (విజిలెన్స్ ఎస్పీ) బర్ల ప్రసాదరావు తమ బృందాలతో జిల్లాలో ఏడు చోట్ల దాడు లు చేయించడమే కాక పక్క జిల్లాలైన విజయ నగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లో మరో 10 చోట్ల చేయించారు. స్థానిక రెవెన్యూ, పోలీ స్, వ్యవసాయాధికారులతో కలిసి సంయుక్తంగా ఈ దాడులు జరిపారు. జిల్లాలోని గార మండలం శ్రీకూర్మంలో శ్రీ విజయలక్ష్మి ఏజెన్సీ లైసెన్స్ పునరుద్ధరణ చేయకుండా విక్ర యిస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ సుమారు రూ. 7 లక్షల విలువల కలిగిన 28.4 టన్నుల ఎరువులు అమ్మవద్దని సిఫార్సు చేశారు. వజ్రపుకొత్తూరు: పలాస రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటు అత్యవసర మరమ్మతుల దృష్ట్యా ఆదివా రం వేకువజాము రెండు గంటల నుంచి ఉద యం 9 గంటల వరకు ఏడు గంటల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకట న విడుదల చేశారు. ఆ సమయంలో రాకపోక లు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ అంతరాయాన్ని ప్రయాణికులు, వాహనచోదకులు గమనించాలని కోరారు. శ్రీకాకుళం క్రైమ్ : మద్యం బార్ పాలసీలో నిబంధనలు అనుసరించి అనుకున్న దరఖాస్తులు రాకపోతే ఫీజు రూ. 5 లక్షలు తిరిగి వాపసు చేస్తామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు అన్నారు. శనివారం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. లాటరీకి అర్హత సాధించాలంటే కనీసం 4 అప్లికేషన్లు అయినా రావాలనే నిబంధన ఉన్న విషయం తెలిసిందే. లైసెన్సు ఫీజులు ఇలా.. శ్రీకాకుళం కార్పొరేషన్ (11), పలాస మున్సి పాలిటీ (02)ల పరిధి 13 బార్లకు ఏడాదికి రీటైల్ ఎకై ్సజ్ ట్యాక్స్ (లైసెన్సు) ఫీజుగా రూ. 55 లక్షలు, ఆమదాలవలస(02), ఇచ్ఛాపురం(02) మున్సిపాలిటీలకు రూ. 35 లక్షలు ఆరు దఫాలుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తులు ఆన్లైన్, హైబ్రిడ్, ఆఫ్లైన్లో స్వీకరిస్తామని, ఈ నెల 26 సాయంత్రం 5 గంటల వరకు చివరి గడువు అని, ఈనెల 28న జిల్లాకేంద్రంలో అంబేడ్కర్ ఆడిటోరియంలో లాటరీ ప్రక్రియలో డ్రా తీస్తామన్నారు. ఉప కులాలైన శ్రీశయన, సొండి కులస్తులకు శ్రీకాకుళం కార్పొరేషన్, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీకి కేటాయించిన రెండు బార్లకు లైసెన్సు ఫీజు రూ.27.50 లక్షలు కట్టాలని, దరఖాస్తు ఫీజు రూ. 5 లక్షలన్నారు. వీరికి దరఖాస్తు స్వీకరణ గడువు ఈనెల 29 అని, కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 30న లాటరీ తీస్తామన్నారు. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసేవారు జిల్లాలోని భాష్యం స్కూలు సమీప జిల్లా ఎకై ్సజ్ అధికారి కార్యాలయానికి వచ్చి డీపీఈఓ ఆఫీస్ పేరిట చలానా కట్టాలన్నారు. -
uuయూరియా పంపిణీలో పక్షపాతమా..
వైఎస్సార్ సీపీ హయాంలో రైతులను అపురూపంగా చూసుకున్నాం. కూటమి ప్రభుత్వం మాత్రం వారి వర్గీయులకే ఎరువులు ఇస్తోంది. యూరియా పంపిణీలోనూ పక్షపాతం ప్రదర్శిస్తున్నారు. ఇచ్ఛాపురం మండలంలో 16 రైతు సేవా కేంద్రాలకు అందించాల్సిన యూరియాను కేవలం ఐదు కేంద్రాలకే సరఫరా చేసి సొసైటీ ద్వారా కూటమి కార్యకర్తలకే అధిక మొత్తంలో సరఫరా చేశారు. – పిరియా విజయ, జెడ్పీ చైర్ పర్సన్ (ఇచ్ఛాపురం ఎంపీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో..) -
అనుమతులు ఆన్లైన్లోనే..
శ్రీకాకుళం క్రైమ్ : గణనాథుని ఉత్సవాల్లో భాగంగా మండపాలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర పోలీ స్ శాఖ ప్రత్యేకంగా హెచ్టీటీపీఎస్:జిఎఎన్ఈస్హెచ్యుటిఎస్ఎవి.ఎన్ఇటీ అనే ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. శనివారం ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అన్ని రకాల అనుమతులు ఒకేసారి పొందేలా ఉండే ఈ విధానంలో ప్రజలు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ●కమిటీ సభ్యులు ఆధార్, చిరునామాలు, ఫోన్ నంబర్లు, విగ్రహాల ఎత్తు, బరువు, పూజా దినాల సంఖ్య, వినాయక ఊరేగింపు, నిమజ్జన సమయా లు, రూట్మ్యాప్ వివరాలు తెలపాలి. ●నిర్వాహకులు మండపాలు ఉండే ప్రదేశం వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ●నిర్దేశించిన ప్రాంతం, సమయాల్లో మాత్రమే విగ్రహ ఊరేగింపు, నిమజ్జనం చేయాలి. రాత్రి 10 లోపు ముగించాలి. ●మండపాల వద్ద ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు. స్పీకర్లను ఉద యం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే వినియోగించాలి. ●విగ్రహాలకు భద్రతగా కమిటీ సభ్యులు రాత్రిళ్లు మండపాల వద్దనే ఉండాలి. ●మండపాల వద్ద గానీ, ఊరేగింపులో గానీ బాణాసంచా వినియోగించరాదు. ●నిమజ్జన సమయంలో అశ్లీల నృత్యాలు గానీ డీజే శబ్దాలు గానీ ఉండరాదు. ●బలవంతపు చందాలు, వసూళ్లు, దర్శనాల టికెట్లు పెట్టరాదు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఫిర్యాదు చేయడానికి డయల్ 100కు ఫోన్ గానీ 6309990933 నంబర్కు వాట్సాప్ చేయాలి. -
uuరైతు కన్నీరులో కొట్టుకుపోతారు
● సర్కారును దునుమాడిన మాజీ స్పీకర్ తమ్మినేని ● ఎరువుల పరిశీలనకు వెళ్తున్న తమ్మినేనిని అడ్డుకున్న పోలీసులు ఆమదాలవలస : శ్రీకాకుళం రోడ్ ఆమదాలవలస రైల్వే గూడ్స్ గోదాం వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. ఎరువులు రైతులకు సక్రమంగా అందడం లేదని, ఈ గోదాం నుంచి ఎరువులు పక్కదోవ పడుతున్నాయని కొందరు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన తన తనయుడు చిరంజీవి నాగ్తో కలిసి శనివారం రైతులకు న్యాయం చేయాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు తొలుత చిరంజీవి నాగ్ను అడ్డుకున్నారు. అనంతరం పెట్రోల్ బంకు సమీపంలో తమ్మినేని అడ్డుకుని వెనక్కి వెళ్లాలని కోరారు. ఆయన మాత్రం రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో ఆయనను జీపు ఎక్కించి నివాసానికి తరలించి పో లీసులను కాపలాగా ఉంచారు. అనంతరం తమ్మి నేని విలేకరులతో మాట్లాడారు. రైతు కన్నీరు పెడితే ఎవరైనా కొట్టుకుపోతారని అన్నారు. ఆమదాలవలసలో రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా ఎరువులు ఇవ్వలేదన్నారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్యలపై గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. జిల్లావ్యాప్తంగా ఎరువులను ఆమదాలవలస కేంద్రంగా రైల్వే గూడ్స్ గోదాం నుంచి సరఫరా చేస్తారని, రైతు భరోసా కేంద్రాలకు, ఎరువుల డీలర్లకు ఇక్కడి నుంచే సరఫరా జరుగుతున్నప్పటికీ, కూట మి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఎరువుల కొరత జిల్లాలో నెలకొందని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు బొడ్డేపల్లి నారాయణరావు, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పీఎసీఎస్ మాజీ అధ్యక్షుడు గురుగుబెల్లి శ్రీనివాసరావు, ప్రభాకరరావు, చల్ల సింహాచలం, బోర నర్సునాయుడు, తమ్మినేని వేణు, ఎం.వెంకటరమ ణ తదితరులు పాల్గొన్నారు. -
అవినీతికి పాల్పడితే వేటు తప్పదు
అరసవల్లి: జిల్లాలో పోలీస్ శాఖలో చాలా మంది అధికారులపై అవినీతిపై ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వారిపై వేటు తప్పదని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి హెచ్చరించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్షలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తో పాటు ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమీక్షలో జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు, దర్యాప్తు జరుగుతున్న తీరుతెన్నుల పై ఆయన ఆరా తీశారు. జిల్లాలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ గంజాయి కేసులు, సైబర్ మోసాలు నమోదవుతున్నాయని, నియంత్రణకు నిఘా చర్య లు చేపట్టాలన్నారు. స్టేషన్లకు వచ్చిన బాధితులతో మర్యాదపూర్వకంగా మాట్లాడేలా సిబ్బంది వ్యవహరించాలన్నారు. ప్రాపర్టీ నేరాల నియంత్రణకు రాత్రి వేళల్లో గస్తీలు పెంచాలని సూచించారు. ●కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ జిల్లాలో నేరాల సంఖ్యను నియంత్రించేలా శాఖాధికారులు శ్రద్ధ వహించాలని, అలాగే పాఠశాలల్లో, వసతి గృహాల్లో ప్రతి శనివారం విద్యార్థులతో పోలీసులు మమేకమై గుడ్టచ్–బ్యాడ్ టచ్లపై అవగాహన కలిగించేలా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ●జిల్లా ప్రధాన న్యాయమూర్తి అహ్మద్ మౌలానా మాట్లాడుతూ కొత్తగా వచ్చిన చట్టాలపై అవగాహ న పెంచుకోవాలన్నారు. కేసుల దర్యాప్తుల్లో ఎదుర య్యే లీగల్ సమస్యలు, నేరప్రవృత్తి, నేర తరహా వంటి పలు అంశాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో చ ర్చించాలని సూచించారు. ●ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో చాలావరకు నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. జిల్లాలో విజిబుల్ పోలీసింగ్, నైట్ పోలీసింగ్, ట్రా ఫిక్ నియంత్రణకు కూడా పక్కా చర్యలు చేపట్టడంతో శాఖాపరంగా పురోగతి సాధించామన్నారు. -
ఐటెప్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
ఎచ్చెర్ల : నాలుగేళ్ల సమీకృత విద్యా కార్యక్రమం (ఐటెప్) కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ ప్రారంభించారు. మొత్తం 110 సీట్లకు గాను బీఎస్సీ బీఈడీ, కేటగిరీలో 53 సీట్లు, బీఏ బీఈడీలో 27 సీట్లు భర్తీ అయ్యాయి. వర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.అనురాధ పర్యవేక్షణలో అకడమిక్ అఫైర్స్ డీన్ డాక్టర్ కె.స్వప్నవాహిణి, విద్యావిభాగం సమన్వయకర్త డాక్ట ర్ జి.ఎల్.సంధ్యారాణి విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. అసిస్టెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ హెచ్.సుబ్రహ్మణ్యం, సిబ్బంది పాల్గోన్నారు. శనివారం కూడా కౌన్సెలింగ్ కొనసాగనుంది. -
‘మాతా శిశు మరణాలు తగ్గించాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో మాతా,శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు జరిగేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మాకివలస, గుత్తావిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన మాతా మరణాలతో పాటు, చొర్లంగి, గోవిందపురం, నిమ్మాడ, బైదిలాపురం కేంద్రాల్లో చోటుచేసుకున్న శిశు మరణాలపై ఆయన ఆరా తీశారు. మరణాలకు దారితీసిన ప్రాథమిక వైద్య కారణాలపై చర్చించారు. గర్భిణులకు మొదటి త్రైమాసికం నుంచే హిమోగ్లోబిన్, బీపీ, ఇతర ఆరోగ్య పరీక్షలు, ల్యాబ్ టెస్టులు తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది పనివేళల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ అనిత, డీపీహెచ్ఎన్ శైలజ, డీఐఓ రామదాస్, డెమో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రేపు మహిళా సాఫ్ట్బాల్ జట్టు ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: గత కొన్నాళ్లగా శిక్షణ పొందుతున్న మహిళా సాఫ్ట్బాల్ క్రీడాకారిణిలకు శుభవార్త. జిల్లా సీనియర్స్ మహిళల సాఫ్ట్బాల్ జట్టు ఎంపికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 24న శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణం వేదికగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఎంపికల ప్రక్రియను చేపట్టనున్నామని జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్, ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు తెలిపారు ఇక్కడ ఎంపికై న క్రీడాకారులను జిల్లా ప్రాబబుల్స్ జట్లకు ఎంపికచేసి శిక్షణా శిబిరాలను నిర్వహిస్తామని, శిక్షణా శిబిరాల్లో రాణించిన క్రీడాకారులను జిల్లా తుది జట్లకు ఎంపిక చేస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని లయోలా ఇంజనీరింగ్ కళాశాల వేదికగా ఆగస్ట్ 30, 31 తేదీల్లో ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ మహిళల సాఫ్ట్బాల్ చాంపియన్షిప్–2025 పోటీ లు జరగనున్నాయని, జిల్లా నుంచి ఎంపికచేసిన క్రీడాకారులను రాష్ట్రపోటీలకు పంపిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ధ్రువీకరణ పత్రాలు కేఆర్ స్టేడియంలో సాఫ్ట్బాల్ సంఘ కార్యనిర్వహక కార్యదర్శి ఎంవీ రమణకు రిపోర్ట్ చేయాలని, పూర్తి వివరాలకు 94410 11391 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
28న విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినం పేరిట ఈ నెల 28న ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.తులసీదాసు తెలిపారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండని యువగళం పాదయాత్రలో లోకేష్ పిలుపునిచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ స్మార్ట్ మీటర్లు బిగించడం మోసం కాదా అని ప్రశ్నించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని విమర్శించారు. పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ ఎరువులు అందక జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయించి నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో గిరిజన భూములను గిరిజనేతరులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకుంటున్నారని విమర్శించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.మోహన్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా నాయకులు బి.కృష్ణమూర్తి, జి.సింహాచలం, పి.తేజేశ్వరరావు, ఎన్.షణ్ముఖరావు, సీహెచ్.అమ్మన్నాయుడు, ఎస్.లక్ష్మీనారాయణ, పి.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
విరుగుడు కనిబెట్టాల్సిందే..!
మొదట సరదాగానే మొదలవుతుంది. కొన్నాళ్లకు అలవాటుగా మారుతుంది. అలవాటు కాస్తా వ్యసనమైపోతుంది. ఆ వ్యసనమే మనిషిని బానిసగా మార్చేసి ప్రాణాలు సైతం బలికొంటుంది. ఆన్లైన్ బెట్టింగ్ అత్యంత ప్రమాదకారి. జిల్లాలోనూ ఈ మహమ్మారి బారిన పడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చేతిలో స్మార్ట్ఫోన్ ఉండడమే వారి తప్పైపోయింది. ఈ జాడ్యాన్ని వదిలించేందుకు కేంద్రం లోక్సభలో ఇటీవలే ఆన్లైన్ బెట్టింగ్ నేరమనే బిల్లుకు ఆమోదం తెలిపింది. బిల్లుతో పాటు ఈ జాడ్యాన్ని వదిలించే విరుగుడు కూడా కనిబెట్టాల్సిందే.●ఆన్లైన్ బెట్టింగ్ నేరంగా లోకసభలో బిల్లు ●జిల్లాలోనూ కనిపిస్తున్న జాడ్యం●వ్యసనం వదిలించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం ●నిర్వాహకులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. కోటి జరిమానా చెల్లించాలి. కొన్నిసార్లు ఈ రెండు శిక్షలూ అనుభవించాలి. ●మనీ గేమ్లను ప్రచారం చేస్తే (ప్రమోటర్లకు) రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ. 50 లక్షలు జరిమానా ఉంటుంది. ఈ రెండూ విధించే సందర్భాలూ ఉంటాయి. ●నగదు బదిలీలకు సహకరిస్తే మూడేళ్ల జైలు లేదా రూ. కోటి జరిమానా తప్పదు. కొన్ని సందర్భాల్లో రెండింటికీ ఆస్కారముంది. ●నిర్వాహకులు మళ్లీ మళ్లీ పట్టుబడితే 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 2 కోట్ల వరకు జరిమానా కట్టాల్సిందే. ●నిందితులపై నాన్బెయిల్బుల్ కేసులు తప్పవు. వారెంట్ లేకుండానే అరెస్టు చేసి పోలీసులు విచారించవచ్చు. పెను ప్రమాదంలా పరిణమించిన ఆన్లైన్ బెట్టింగ్ను అరికట్టడం సవాల్తో కూడుకున్న వ్యవహారమే. పోలీసులతో పాటు అన్నివర్గాల ప్రజలు ఓ యజ్ఞంలా భావించి భాగస్వాములై అరికట్టాలి. ఆన్లైన్ గేమింగ్ను నేరంగా భావించి, భారీ జరిమానాలు, శిక్షలతో రూపొందించేలా లోక్సభలో బిల్లును ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. – డాక్టర్ ఎం.ప్రదీప్, హెచ్ఓడీ బయోటెక్నాలజీ, ప్రభుత్వ పురుషుల డిగ్రీకళాశాల, శ్రీకాకుళం జిల్లాలో ఎస్పీ పర్యవేక్షణలో ఆన్లైన్ బెట్టింగ్పై ఉక్కుపా దం మోపాం. మేలో జరిగి న ఓ కేసులో 8 మందిని గుర్తించి, 15 మందిని సాక్షు లుగా చేర్చాం. కేంద్ర ప్రభు త్వం లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ బిల్లు–2025 ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. – సీహెచ్ వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్రాయుళ్లు పెరిగిపోతున్నారు. ఇంటి పరిస్థితులు గమనించకుండా, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేకుండా ఇష్టానుసారం పందాలు కాస్తున్నా రు. లక్షలకు లక్షలు అప్పు చేసి నిండా మునిగిపోయి ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఈ ఏడాది మేలో జిల్లా కేంద్రంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలోని టాస్క్ఫోర్స్ పోలీసులు బెట్టింగ్ మాఫియా గుట్టు రట్టు చేశారు. శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల పోలీసులు సుమారు ఎనిమిది నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఇదే కేసులో మరో 15 మంది ఆడినవారిని (బాధితులు) సాక్షులుగా మార్చా రు. న్యాయమూర్తి ఒక్కరోజు రిమాండ్ విధించి బెయిల్ ఇవ్వడంతో వారంతా బయటకు వచ్చేశారు. నేరం రుజువైతే వీరికి దాదాపు ఒక నెల నుంచి ఆరునెలల్లోపు జైలు శిక్ష పడే వీలుంది. లేదంటే మొదటిసారి పట్టుబడితే రూ .500 జరిమానాతో బయటపడతారు. మళ్లీ మళ్లీ పట్టుబడితే రూ. 1 వేయి నుంచి రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతారు. కానీ తాజాగా లోక్సభలో ఓ బిల్లు ఆమోదం పొందింది. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు –2025 ఆచరణలోకి వచ్చిందంటే ఇక ఈ ఆటలు కుదరవు. నిర్వాహకుల కు, నగదు లావాదేవీలు జరిపే బ్యాంకులకు, బుకీలకు, ప్రమోటర్లకు నేరంలో వారి పాత్ర, ప్రా ధాన్యత అనుసరించి రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ. 50 లక్షల నుంచి రూ. 2 కో ట్ల భారీ జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ●గత నెల 16న హిరమండలంలో ఓ యువకుడు ఆన్లైన్ గేమ్స్లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ●శ్రీకాకుళం గారవీధిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బెట్టింగ్ ఆడి రూ. కోటి పోగొట్టుకుని తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ●మార్చిలో పలాస డివిజన్ పరిధిలో ఓ యువకుడు ఆన్లైన్లో అప్పులు వాడి అవి తీర్చలేక సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడు. అతడు మూడేళ్లుగా లోన్ యాప్లు వాడుతూ టార్చర్ భరించలేకపోయాడు. ●ఈ ఏడాది ఏప్రిల్లో సారవకోటకు చెందిన ఇద్దరు సోదరులు ఒకరికి తెలియకుండా మరొకరు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని రూ. లక్షల్లో మోసపోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మృతిచెందారు. ●జలుమూరు మండలంలో ఓ రాజకీయ వేత్త క్రికెట్ బెట్టింగ్ కాస్తూ అధిక వడ్డీలకు అప్పులపాలై దాదాపు రూ. 7 కోట్ల వరకు ఐపీలు పెట్టి పరారయ్యాడు. ఆరునెలలకు గానీ తిరిగి రాలేదు. ●ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్తో పాటు ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్లైన్ లాటరీలు నిషేధం. డబ్బులు పెట్టి ఆన్లైన్లో ఆడే క్రీడలపై నిషేధం అమలవుతుంది. ●ఆన్లైన్ గేమ్లను ప్రచారం చేసే వారూ నేరస్తులవుతారు. గేమ్లో భాగంగా ఒకరి నుంచి మరొకరికి ఆన్లైన్లో నగదు బదిలీలకు వీలు కల్పించే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలను శిక్షిస్తారు. ●ఏ రూపంలో బెట్టింగ్లు నిర్వహించినా, ప్రోత్సహించినా, ప్రచారం చేసినా నేరమే. అంటే కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా చేసినా, సోషల్ మీడియా లేదా పత్రికలు లేదా టీవీల్లో ప్రచారం చేసినా శిక్ష తప్పదు. ●గేమ్ల్లో పాల్గొన్నవారిని (ఆడేవారిని) దోషులు గా కాకుండా బాధితులుగానే పరిగణిస్తారు. -
మూడు గంటల పాటు గేటు బంద్
ఇచ్ఛాపురం రూరల్: కేదారిపురం–పురుషోత్తపురం మధ్యనున్న రైల్వే ఎల్సీ గేట్ను రైల్వే సిబ్బంది మూడు గంటల పాటు మూసివేశారు. ట్రాక్ మరమ్మతుల పేరిట ముందస్తు సమాచారం లేకుండా గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గేట్ మూసి వేయడంతో విద్యార్థులు, ఉద్యోగులతో పాటు వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.‘దివ్యాంగుల పింఛన్లు పునరుద్ధరించాలి’ సోంపేట: రాష్ట్రం ప్రభుత్వం ఇటీవల తొలగించిన దివ్యాంగ పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని దివ్యాంగుల సంఘం హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శులు మల్లారెడ్డి భాస్కర్, దశముఖ రమేష్ డిమాండ్ చేశారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గు రువారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 1458 మంది దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణమన్నారు. మళ్లీ అప్పీలు చేసుకోవాలని దివ్యాంగులను కార్యాలయాల చుట్టూ తిప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇచ్ఛాపురం, పలాస నియోజక వర్గాల్లోని ది వ్యాంగులకు ఉపకరణాలు అందలేదని, ప్రభుత్వం స్పందించి ఉపకరణాలు అందేలా కృషిచేయాలన్నారు. సమావేశంలో పోకల మోహనరావు, ఎం.పీతాంబరం తదితరులు పాల్గొన్నారు.నేడు జిల్లా స్థాయి జానపద పాటల పోటీలువజ్రపుకొత్తూరు రూరల్: ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మందస మండలం బహడపల్లిలో శుక్రవారం జిల్లా స్థాయి సామాజిక జానపద పాటల పోటీలు నిర్వహించనున్నారు. సిక్కోలు జానపద సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో పోటీలను విజయవంతం చేయా లని కళావేదిక అధ్యక్షుడు మామిడి కృష్టారావు, ప్రతినిధి రాపాక ధనరాజు,కార్యదర్శి లబ్బ రుద్రయ్య కోరారు. అలాగే అదే గ్రామంలో ఉ న్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం 2 గంటలకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ పేర్లను అదే రోజు ఉదయం లోగా నమోదు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440861442 ఫోన్ నంబర్ను సంప్రదించాలని వారు సూచించారు.రణస్థలం సబ్స్టేషన్ ఆకస్మిక తనిఖీరణస్థలం: రణస్థలం సబ్ స్టేషన్ను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృథ్వీతేజ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫీడర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సమస్యలు రాకుండా విద్యుత్ అందించాలని సూచించారు. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని తెలిపారు. కమ్మసిగడాం పరిధిలో 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్తగా వేసిన విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరుపై ఆరా తీశారు. నూతనంగా నిర్మిస్తున్న బంటుపల్లి సబ్ స్టేషన్ నిర్మాణ పనులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ పీవీ సూర్య ప్రకాశ్, జిల్లా ఎస్ఈ కృష్ణమూర్తి, డీఈ పైడి యోగేశ్వరరావు, ఈఈ బయ్యంనాయుడు, రణస్థలం ఏడీ ఎం.రాజేష్, ఏఈ జి.తిరుపతిరావు ఉన్నారు.అంతర్ జిల్లా బదిలీలకు పచ్చ జెండాశ్రీకాకుళం: ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు బదిలీ కావాలనుకునే ఉపాధ్యాయులు ఈనెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువరించారు. స్పౌజ్, మ్యూచువల్ కేటగిరీల్లో మాత్రమే బదిలీలు జరుపుతామని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ప్రస్తుతం వా రు పనిచేస్తున్న జిల్లా, బదిలీ కావాల్సిన జిల్లా వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. కొత్త ప్రొఫార్మాలో ఈ వివరాలను పొందుపరిచి డీఎస్సీ ఏపీ ద్వారా ధ్రువీకరించుకోవాలి. వేరొ క జిల్లాకు బదిలీ అయినప్పుడు ప్రస్తుత జి ల్లాలోని సీనియార్టీని కోల్పోయి, అక్కడ చివరి ర్యాంకుల్లో చేరుతారు. ఈ ఏడాది జూలై 31 నాటికి కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. -
గణపతి దేవా.. మా గోడు వినవా..!
శ్రీకాకుళం కల్చరల్ : మట్టినే నమ్ముకుని దేవుడి విగ్రహాలు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్న కళాకారులకు పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా సంప్రదాయ మట్టి తో తయారు చేసే వినాయక విగ్రహాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే శ్రీకాకుళం మహిళా కళాశాల రోడ్డు లోని కుమ్మరివీధి, పెద్దమార్కెట్టు వెనుక ఉన్న కుమ్మరివీధి, బలగ ప్రాంతంలో కళాకారులు స్థలా భావ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి వినాయక కమిటీలు ఇక్కడి నుంచి విగ్రహాలను తీసుకెళ్తుంటాయి. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతంలో వర్షాలు సమయంలో ఇబ్బందిపడకుండా విగ్రహాలను భద్రపరిచే అవకాశం లేకపోవడంతో కళాకారులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. వినాయక విగ్రహం తయారు చేసేందుకు అవసరమైన మట్టి, గడ్డి గతంలో ఉచితంగా లభ్యమయ్యేది. ఇప్పుడు వాటి లభ్యత తక్కువ కావడంతో కొను గోలు చేయాల్సి వస్తోందని తయారీదారులు చెబు తున్నారు. ప్రస్తుతం ట్రాక్టరు మట్టి కొనుగోలు చేయాలంటే రూ.2వేలు నుంచి రూ.3వేల వరకు ఖర్చు అవుతోంది. దానిపై గడ్డి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. ఇంకా రంగుల కోసం ఖర్చు కలుపుకొ ని ఒక బొమ్మ తయారీకి రూ.500 నుంచి రూ.3 వేలు వరకు ఖర్చు అవుతోంది. దీనిపై వారు తయా రీ కూలి వేసుకొని అమ్మితే వారు పడిన కష్టానికి నష్టం లేకుండా ఉంటుంది. ఈ సీజన్లో కుటుంబ సభ్యులంతా తయారీలో పాలుపంచుకుంటారు. బొమ్మలు చేసుకోడానికి స్థలం మంజూరు చేయాల ని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వచ్చే ఏడాదైనా ఈ అవకాశం కల్పించాలి. వర్షా లు వస్తే బొమ్మలను కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నాం. టార్పాలిన్ కప్పుకొని, అద్దె ఇళ్లలో ఉంచాల్సి వస్తోంది. – వెంకటరావు, తయారీదారుడు, కుమ్మరివీధి, శ్రీకాకుళం తాతముత్తాల నుంచి బొమ్మలు తయారు చేస్తున్నాం. 30 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాను. ఇంట్లో బొమ్మలు పెట్టడం వల్ల నిద్ర పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ప్రభు త్వం మాకోసం ఈ మూడు నెలలకై నా ఒక చోట షెడ్లు కేటాయిస్తే బాగుంటుంది. – పి.రాజేశ్వరరావు, విగ్రహ తయారీదారుడు, బలగ -
వినాయక మండపం పెడుతున్నారా..?
శ్రీకాకుళం క్రైమ్ : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మండపాలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేకంగా హెచ్టీటీపీఎస్:జిఎఎన్ఈస్హెచ్యూటీఎస్ఎవి.ఎన్ఇటీ అనే ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. గురువారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్ ఎస్హెచ్ఓకు చేరాక పురపాలక, అగ్నిమాపక, విద్యుత్ శాఖల సిబ్బంది ఓ బృందంగా ఏర్పడి ఆ ప్రదేశాన్ని పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారన్నారు. వెబ్సైట్లో అప్లికేషన్ స్టేటస్లో దరఖాస్తుదారుని ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే నో అబ్జక్షన్కు సంబంధించి నిబంధనలతో కూడిన క్యూఆర్కోడ్ డౌన్లోడ్ అవుతుందని, నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తక్షణమే మంజూరవుతుందన్నారు. -
ఆదాయమే పరమావధా..?
● శ్రీముఖలింగంలో సంప్రదాయాలకు విరుద్ధంగా హుండీ ఏర్పాటు ● భక్తులు విన్నవించుకున్నా పట్టించుకోని అధికారులు జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం దక్షిణ కాశీగా పేరొందింది. ఇక్కడ స్వామిని దర్శించుకునేందుకు దేశ నలుమూలలు నుంచి భక్తులు, విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు. అయితే ఎంతో చరిత్ర, విశిష్టత ఉన్న ఉన్న ఈ దేవాలయంలో దేవదాయ శాఖ అనాలోచిత నిర్ణయాలు భక్తుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఆదాయ మే పరమావధిగా ఆలయ అధికారులు వ్యవహరిస్తున్నారని భక్తులు విమర్శిస్తున్నారు. ఎక్కడైనా శైవ దేవాలయాల్లో శివలింగం(స్వామివారు)కి దగ్గరలో కొన్ని అడుగులు దూరంలో నందిని ప్రతిష్టిస్తారు. పూజలు, అభిషేకాలు, దర్శనాలు అర్చనలు తదితరవి నిర్వహించే సమయంలో ముందుగా నందిని పూజించి తర్వాత శివునికి అభిషేకం చేస్తారు. శివునికి నందికి మధ్యలో ఎవరూ అడ్డంగా రాకూడదు. ఇది శాస్త్ర ప్రమాణం. అలాంటిది కేవలం ఆదాయ మే ధ్యేయంగా ప్రధాన దేవాలయంలో స్వామికి నందికి మధ్యలో మూడు చోట్ల నాలుగైదు హుండీలు ఏర్పాటు చేశారు. దీనిపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈఓకు విన్నవించామని, అయినా చర్యలు తీసుకోలేదని విశాఖకు చెందిన ఓ భక్తుడు తెలిపాడు. దీనిపై ఈఓ టి.వాసుదేవరావును వివరణ కోరగా హుండీలు తొలగిస్తానని తెలిపారు. -
మంత్రి అచ్చెన్నను విచారించాల్సిందే..
● మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమదాలవలస: కూటమి పాల న అవినీతికి కేంద్ర బిందువులా మారిందని, కోట్ల రూపాయల స్కాం చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెగబడ్డారని మాజీ స్పీకర్, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ సమయన్వయకర్త తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన గురువారం ఆమదాలవలసలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను దోపిడీకి సాధనాలుగా మలుచుకోవడం సరికాదన్నారు. వ్యవసాయ పరికరాల కొనుగోళ్లలో కమీషన్ల కోసం అధికారులపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని తెలిపారు. ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక ఆగ్రోస్ జీఎం రాజమోహన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడం మంత్రి పేషీలోని అవినీతికి నిదర్శనమని ఆయన అన్నారు. మంత్రి, ఓఎస్డీపై నిఘా సంస్థలు విచారించాలన్నారు. మంత్రిపై ఆరోపణలు చేస్తూ ఓ ఉన్నతాధికారి ప్రభుత్వానికి లేఖ రాయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు. మంత్రి నిర్వాకంతో కూటమి ప్రభుత్వ పరువు బజారులో పడిందన్నారు. సీఎం చంద్రబాబు ఈ విషయంలో తన ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. సంక్షోభంలో సాగు.. రాష్ట్రంలో వ్యవసాయశాఖ తీవ్ర సంక్షోభంలో కూరు కుపోయిందని తమ్మినేని మండిపడ్డారు. వానలు ఆలస్యమయ్యాయని, సాగు ప్రారంభించిన వారికి సరిపడా విత్తనాలు, ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మార్కెట్లో ఎరువులు లభించడం లేదన్నారు. సబ్సిడీతో అందించాల్సిన ఎరువులు కూట మి నేతల ఆధీనంలోని ప్రత్యేక గోడౌన్లకు వెళ్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. పింఛన్దారుల కుదింపు అన్యాయం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,50,000 మంది అర్హులైన వారిని పింఛన్ల జాబితా నుంచి తొలగించారని, ఇది అన్యాయమని అన్నా రు. మానవతా కోణంలో ఆలోచించి, తొలగించిన లబ్ధిదారులందరినీ తిరిగి పింఛన్ల జాబితాలో చేర్చేలా పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. -
రెండు కేజీల గంజాయితో యువకుడు అరెస్టు
ఇచ్ఛాపురం: ఉత్తరప్రదేశ్కి చెందిన అనూజ్కుమార్ రెండు కేజీల గంజాయితో పట్టణ పోలీసులకు పట్టుబడిన ఇచ్ఛాపురం సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. స్థానిక సర్కిల్ పోలీస్ కార్యాలయం ఆవరణంలో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ యువకు డు రేణిగుంటలో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నా డు. ఒడిశాకు చెందిన గంజాయి సరఫరాదారుడు సాగర్తో పరిచయం ఏర్పడింది. రేణిగుంటలోనే గంజాయి వ్యాపారం చేసే అమిత్ జైస్వాల్ అలియా స్ అమిత్చౌదరితో గంజాయి సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 18న అనూజ్ ఒడిశాలో 2.070 కేజీల గంజాయిని కొనుగోలు ఇచ్ఛాపురం చేరుకున్నాడు. అనుమానాస్ప దంగా కనిపించడంతో పోలీసులు తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్కి తరలించా రు. కార్యక్రమంలో పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ఎస్సై రవివర్మ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంట్లోనే తయారీ..
ఈ సీజన్లో ఇంట్లోనే బొమ్మలు తయారు చేస్తుంటారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు దీటుగా ఆకర్షణీయంగా మట్టి బొమ్మలు చేసేందుకు కుమ్మర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నా రు. కొందరు చదువుకున్న యువకులు కూడా ముందుకు వచ్చి వాటిని నేటి తరాన్ని ఆకర్షించేలా బొమ్మలు రూపొందిస్తున్నారు. బొమ్మల తయారీకి షెడ్లు అవసరం ఉంది. విగ్రహాలు పెద్దఎత్తున చేయాల్సి ఉంటుంది. దీంతో అధిక సంఖ్యలో బొమ్మలు తయారు చేసి వర్షానికి తడవకుండా ఉండేందుకు ఇళ్లు తాత్కాలికంగా అద్దెలకు తీసుకుంటారు. మూడు నెలల ముందు నుంచి అద్దెకు తీసుకొని బొమ్మల తయారీ మొదలుపెడతారు. ఏడాదిలో వినా యక చవితికి, దసరా సందర్భంగా బొమ్మలు తయారు చేసి అమ్ముతుంటారు. వాటిని తయా రు చేసేందుకు ప్రత్యేక షెడ్లు వేయించాలని తయారీదారులు కోరుతున్నారు. అవి లేకపోవడంతో తాము ఉంటున్న ఇంట్లోనే ఉంచాల్సి వస్తోందని చెబుతున్నారు. రుణాలు సైతం మంజూరు చేయాలని విన్నవిస్తున్నారు. -
ఒత్తిడిని అధిగమించేందుకే క్రీడలు
అరసవల్లి: విధి నిర్వహణలో ఒత్తిళ్లు ఎదుర్కొంటు న్న విద్యుత్ ఉద్యోగులకు బ్యాడ్మింటన్ పోటీలు ఉపశమనం ఇస్తాయని తూర్పు ప్రాంత విద్యుత్ పంపి ణీ సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ అన్నారు. గురువారం స్థానిక శాంతినగర్ కాలనీలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి విద్యుత్ ఉద్యోగుల బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. అంతకుముందు సర్కిల్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 వరకు జరిగే పోటీలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) టీవీఎస్ సూర్య ప్రకాష్, స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్, సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి, డివిజనల్ ఈఈ పైడి యోగేశ్వరరావు, కార్యదర్శి మహంతి ప్రభాకరరావు, స్పోర్ట్స్ ఆఫీసర్ వడివేళు, డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు, జేఏఈ సనపల వెంకటరావు, జిల్లా విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘ అధ్యక్షు డు ఉంగటి పాపారావు తదితరులు పాల్గొన్నారు. కాగా తొలిరోజు పోటీల్లో ఆతిథ్య శ్రీకాకుళం జట్టు బాపట్లపై గెలుపొంది నెల్లూరు జట్టుతో జరిగిన పోరులో ఓటమి పాలైంది. కాగా, సర్కిల్ కార్యాల యం వద్ద సీఎండీ ఫృథ్వీతేజ్, డైరెక్టర్ సూర్యప్రకాష్ లు మొక్కలు నాటారు. -
సుందరీకరణే ముద్దు
సౌకర్యాలు వద్దు..శ్రీకాకుళం : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది జిల్లా కేంద్రంలోని రిమ్స్ సర్వజన ఆస్పత్రి పరిస్థితి. 930 పడకలతో పెద్దాసుపత్రిగా కొనసాగుతున్నా వాస్తవానికి మాత్రం ఇక్కడ ఉన్నవి 650 మాత్రమే. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో ఈ పడకలు ఏ మూలకూ సరిపోవు. దీంతో పలువురు రోగులు గత్యంతరం లేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆస్పత్రి ఆవరణలో నిర్వహణకు నోచుకోని వందలాది మంచాలు ఉన్నాయి. వీటిని భవనాల టెర్రస్పై, కొన్ని వార్డు గదుల్లో పడేసి వినియోగంలో లేకుండా చేసేశారు. ఇటు రిమ్స్ అధికారులు గానీ, అటు ఇంజినీరింగ్ అధికారులు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. వీటిని జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారుల అనుమతితో పాత సామాన్లుగా విక్రయిస్తే ఆ మొత్తంతో 300కు పైగా మంచాలను కొనుగోలు చేయవచ్చని వైద్యులే చెబుతుండటం గమనార్హం. ఇదేం తీరు.. ఇంజినీరింగ్ అధికారులు సుమారు రూ.12 లక్షలను రిమ్స్ ప్రాంగణంలో సుందరీకరణ పేరిట మొక్కలు నాటడం వంటి పనులకు ఖర్చు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని వెచ్చిస్తే 300 పడకలతో పాటు నిరుపయోగంగా ఉన్న కొత్త హాస్టల్ భవనాలు వినియోగించుకునేందుకు అవసరమైన ఫర్నిచర్ను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే మంత్రి, కలెక్టర్ సుందరీకరణ చేయాలని చెప్పినట్లు ఇంజినీరింగ్ అధికారులు పేర్కొనడం గమనార్హం. రోగులకు అవ సరమైన వాటిని పక్కన పెట్టి సుందరీకరణ కోసం అంచనాల రూపొందించి వాటిని రిమ్స్ అధికారులతో ఆమోదింప చేయడం పట్ల ఆసుపత్రి వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సౌకర్యాల కోసం కాకుండా సుందరీకరణ కోసం రిమ్స్ సూపరింటెండెంట్ ఏ విధంగా అంగీకరించారో అర్థం కావడం లేదని వైద్యులే చెబుతున్నారు. గదులూ కొరతే.. రిమ్స్లో చదువుతున్న ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులకు వసతి సమస్య వేధిస్తోంది. కొత్త భవనాలు నిర్మించినా ఫర్నిచర్ లేదన్న కారణంగా వాటిని రిమ్స్ అధికారులు రెండేళ్లుగా స్వాధీనం చేసుకోవడం లేదు. పలు వార్డు గదుల్లో పాత ఫర్నిచర్ పడేయడం వల్ల అవి కూడా నిరుపయోగంగా మారాయి. చాలా భవనాల్లో గదులను కొందరు ఇతర శాఖల అధికారులు, రిమ్స్లోని కొన్ని విభాగాల ఉద్యోగులు తమ ఆధీనంలో ఉంచుకోవడం కూడా గదుల కొరతకు కారణంగా నిలుస్తోంది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, కుష్టు నివారణ అధికారితో పాటు శానిటేషన్ ,సెక్యూరిటీ ఇలా ఎంతోమంది గదులను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఇదే సమయంలో హెచ్ఆర్ఏను మాత్రం జీతంతో పాటు తీసుకోవడం గమనార్హం. ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి పేద రోగులకు, వైద్య విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. రిమ్స్ లో వింత పరిస్థితి పడకల కొరత ఉన్నా పట్టించుకోని అధికారులు సుందరీకరణ పేరిట మొక్కలు ఏర్పాటు చేస్తున్న వైనం సరిపడా మంచాలు లేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న బాధితులు మంత్రి ఆదేశాల మేరకే.. మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రిమ్స్ ఆవరణను సుందరీకరణగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అందుకోసమే పది లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాం. ఈ అంచనాలకు అడ్మినిస్ట్రేటర్పాటు సూపరింటెండెంట్ ఆమోదించారు. – సత్య ప్రభాకర్, ఈఈ ఏపీహెచ్ఎంహెచ్ఐడీసీ -
బార్లా తెరిచారు!
● మద్యం అమ్మకాలుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాగినోడికి తాగినంత అన్నట్టు కొత్త బార్లతో ముందుకొచ్చింది. జిల్లాలో ఇప్పటికే ఏరులై పారుతున్న మద్యం ప్రవాహం ఇకపై మరింత ఉద్ధృతంగా ప్రవహించనుంది. ఒకవైపు విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి.. మరోవైపు నాటు సారా.. ఎక్కడికక్కడే అందుబాటులోకి వచ్చిన మద్యం వెరసి రాత్రి పూట గొడవలు, న్యూసెన్స్ పెరిగే అవకాశం ఉండటం పోలీసులకు సవాల్గా మారింది. తాగించడమే పనిగా.. కూటమి ప్రభుత్వం మందుబాబులను పూర్తిగా తాగించడమే పనిగా పెట్టుకుంది. ఎంత ఎక్కువగా మత్తులో ముంచితే అంత ఎక్కువ ఆదాయం వస్తుందని భావిస్తోంది. దానికోసం అన్ని రకాల వెసులుబాట్లు కల్పిస్తోంది. ఇప్పటికే జిల్లాలో 176 మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. లైసెన్సు షాపులతో సరిపోదని బెల్ట్షాపులను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే వీధికి ఐదు, పది బెల్ట్షాపులు నడుస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వానికి మద్యం దాహం తీరడం లేదు. లైసెన్స్ షాపుల వద్దే తాగేందుకు ఏర్పాట్లు చేసింది. పర్మిట్ రూమ్లకు అనుమతిచ్చింది. దీంతో లైసెన్సు షాపుల వద్ద మందుబాబుల సందడే సందడి. ఇప్పుడు లైసెన్సు దుకాణాలకు, పర్మిట్ రూమ్లకు, బెల్ట్షాపులకు అనుబంధంగా బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చింది. జిల్లాలో 19 బార్లు ఏర్పాటుకు, వాటికి అనుబంధంగా రెస్టారెంట్లకు క్లియరెన్స్ ఇచ్చింది. శ్రీకాకుళం, పలాస, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాల్టీల్లో అత్యధిక బార్లు ఏర్పాటు కాబోతున్నాయి. అర్ధరాత్రి వరకు మద్యం సరఫరా.. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్య తగ్గిస్తూ వచ్చింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కఠినంగా వ్యవహరించింది. బార్లు కూడా ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకే మూసివేయాలని ఆదేశించింది. కానీ, కూటమి ప్రభుత్వం ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12గంటల వరకూ బార్లు తెరుచుకునేలా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో విచ్చలవిడితనం మరింత పెరిగిపోనుంది. ఇప్పటికే మద్యం దుకాణాల వద్ద గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. దాడులు పెరిగాయి. చాలా చోట్ల మద్యం దుకాణాలు న్యూసెన్స్గా తయారయ్యాయి. ఇక, బెల్ట్షాపుల కారణంగా గ్రామాల్లో చెప్పనక్కర్లేదు. మందుబాబుల జాతరే కనబడుతోంది. పల్లెల ప్రశాంతతకు చిచ్చు పెట్టింది. విచ్చలవిడిగా నాటుసారా.. ఒకవైపు ప్రభుత్వమే మందుబాబుల వద్దకు మద్యం సరఫరా చేస్తుండగా, ఇంకోవైపు ఒడిశా సరిహద్దు ప్రాంతంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాటుసారా కూడా తయారవుతోంది. పలాస, నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాల్లో నాటు సారా ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం కంటే తక్కువ ధరకు దొరకడంతో చాలా మంది ఆకర్షితులవుతున్నారు. వైన్కు వెచ్చించేంత స్థోమత లేని వారంతా నాటుసారా బారిన పడుతున్నారు. గుప్పుమంటున్న గంజాయి.. గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇందుకు నిత్యం దొరుకుతున్న గంజాయి కేసులే నిలువెత్తు సాక్ష్యాలు. విక్రయాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్యాకెట్, లిక్విడ్, చాక్లెట్ రూపంలో విక్రయిస్తున్నారు. ఒడిశా, పాడేరు నుంచి జిల్లాకు ఎక్కువగా గంజాయి దిగుమతి అవుతోంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు రవాణా అవుతోంది. ఇచ్ఛాపురం, పలాస, శ్రీకాకుళం , ఆమదాలవలస, పాతపట్నం తదితర ప్రాంతాల్లో గంజాయి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నట్టు నమోదవుతున్న కేసులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పోలీసులకు కష్టతరమే.. ఒకవైపు గంజాయి, మరోవైపు విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యంతో జిల్లాలో చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణ పడిన వారు ఏ మైకంలో ఉన్నప్పటికీ గంజాయి మత్తు అని చెబితే ఇబ్బంది అని మద్యం ఖాతాలో వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా అటు మద్యం, ఇటు గంజాయితో ఇబ్బందికరంగా తయారైంది. తాజాగా పర్మిట్ రూమ్లు, అర్ధరాత్రి వరకు బార్లు తెరిచి ఉంచే అవకాశం ఇవ్వడంతో విచ్చలవిడితనం మరింత పెరిగిపోవడం ఖాయం. ప్రభుత్వమే అధికారికంగా అర్ధరాత్రి 12గంటల వరకు తాగే అవకాశం ఇవ్వడంతో ఏ సమయంలో ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఆ సమయం వరకు మందుబాబులపై నిఘా పెట్టాలి. లేదంటే మత్తులో ఏ దుశ్చర్యకు పాల్పడతారో చెప్పలేం. మొత్తానికి కూటమి ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీ పోలీసులకు సవాల్గా మారిందనే చెప్పాలి. ఇకపై ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లకు అనుమతి ఇప్పటికే మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్లు విచ్చలవిడిగా బెల్ట్షాపులు జిల్లాలో పెరగనున్న న్యూసెన్స్ పోలీసులకు సవాల్గా కూటమి మద్యం పాలసీ -
రచ్చగా మారిన అచ్చెన్న పేషీ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒకే ఒక్క లేఖ.. మన జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేషీని వేలెత్తి చూపించింది. ఇప్పుడది జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏపీ ఆగ్రోస్ జనరల్ మేనేజర్గా పనిచేసిన రాజమోహన్ ప్రభుత్వానికి రాసిన లేఖతో అచ్చెన్నాయుడు పేషీ అవినీతికి కేంద్రంగా మారిందన్న ఆరోపణలకు తావిచ్చింది. ఇప్పుడంతా ఆయన దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీపైనే చర్చ నడుస్తోంది. ఎవరా ఓఎస్డీ.. ఏంటా కథ.. అని ఆరా తీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.చెప్పిన మాట వినలేదని..వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులు, వ్యవసాయ శాఖ మంత్రి పేషీకి మధ్యవర్తిగా వ్యవహరించాలని ఓఎస్డీ కోరినట్టు ఏపీ ఆగ్రోస్ జనరల్ మేనేజర్ రాజమోహన్ ఏకంగా చీఫ్ సెక్రటరీతో పాటు ఏపీ ఆగ్రోస్ వైస్ చైర్మన్, ఎండీకి లేఖ రాశారు. ఓఎస్డీ చెప్పినట్టు వినలేదన్న అక్కసుతో తనను వేధించినట్టు.. ఆ ఒక్క కారణంతో తనను నెల్లూరుకు బదిలీ చేశారని లేఖలో ప్రస్తావించారు. సెలవుపై వెళ్లడం తప్ప మరో మార్గం కన్పించడం లేదని వెల్లడించారు. తన స్థానంలో కేసులు పెండింగ్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ కేడర్ గల వారిని నియమించారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ లేఖ బయటకు రావడమే తరువాయి.. మంత్రి అచ్చెన్నాయుడిపైన, ఆయన పేషీ పైన, సదరు ఓఎస్డీపైన విస్తృత చర్చ జరుగుతోంది.సూత్రధారిగా..అచ్చెన్నాయుడు మంత్రి అయిన ప్రతీసారి ఓఎస్డీగా, వ్యక్తిగత సిబ్బందిగా ఉన్న ఒక ‘నాయుడు’ పాత్రపైనే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఆయన చేసే ప్రతీ కార్యక్రమంలో వచ్చే ప్రయోజనాలు చివరికి ఎవరికి వెళ్తున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని.. కానీ అన్నింటికీ సూత్రధారి ఆ ఓఎస్డీయే అని మాట్లాడుకుంటున్నారు. జిల్లాలో ఆయన కోసం తెలిసిన ప్రతీ ఒక్కరూ పేషీలో ఏదో చేసే ఉంటాడని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆ ఓఎస్డీపై ఎల్లోమీడియాలో కూడా కథనాలు వచ్చాయని, ఆయన ఎంత బరితెగించకపోతే ఆ మీడియాలో తప్పని పరిస్థితుల్లో కథనాలు ఇచ్చి ఉంటారో అర్ధం చేసుకోవచ్చని, అయినప్పటికీ వెనక్కి తగ్గడం లేదని విస్తృత చర్చ నడుస్తోంది. ఇక, అచ్చెన్నాయుడిపై ఆరోపణలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఈఎస్ఐ స్కామ్ ప్రత్యేకమైనది. -
గీత కులాలకు రెండు బార్లు
శ్రీకాకుళం క్రైమ్ : రాష్ట్ర ప్రభుత్వ నూతన మద్యం పాలసీలో భాగంగా గీత కులాలకు జిల్లాలో రెండు బార్లు కేటాయించనట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు బుధవారం పేర్కొన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరోషన్లో శ్రీశయన కులానికి ఒకటి, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో సొండి కులస్తులకు మరో బార్ కేటాయించినట్లు తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 29లోగా అందించాలని, దరఖాస్తు రుసుం రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలు ఉంటుందని పేర్కొన్నారు. ఏడాది కాలానికి రూ.27.50 లక్షలు లైసెన్సు ఫీజు కట్టాలని, లాటరీ పద్ధతిన ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద డ్రా తీస్తామని తెలిపారు. ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఎచ్చెర్ల : ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఎల్.సుధాకరరావు బుధవారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 26 లోగా ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ పత్రంతో పాటు విద్యార్హతల సర్టిఫికెట్లతో ఈ నెల 27న నిర్దేశిత ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 29న, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 30న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. చిత్తశుద్ధితో పనిచేయండి అరసవల్లి: జిల్లా పరిషత్ యాజమాన్యంలో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. బుధవారం జెడ్పీ బంగ్లా వద్ద పలువురికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. కొండగొర్రి రాహుల్(భామిని మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్), తీడ తేజేశ్వరరావు(జెడ్పీలో జూనియర్ అసిస్టెంట్), సూరవజ్జల రాజ్యలక్ష్మి(హరిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్), వేమూరి నాగమణి(జెడ్పీలో జూనియర్ అసిస్టెంట్)లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో ఎల్.ఎన్.వి.శ్రీధర్, డిప్యూటీ సీఈవో డి.సత్యనారాయణ తదితరులున్నారు. 24న ఇచ్ఛాపురంలో జానపద సంబరాలు ఇచ్ఛాపురం రూరల్: ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మహతీ సాంస్కృతిక కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న జానపద సంబరాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఈదుపురం రామాలయం వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ నెల 24న ఇచ్ఛాపురం రోటరీ క్లబ్ వద్ద జానపదం, కోలాటం, సంబల్పురీ భూం బాగోతం, కోయనృత్యం వంటి ప్రదర్శనలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు రంగాల జానకిరామ్, వ్యవస్థాపక కార్యదర్శి తిప్పన ధనుంజయరెడ్డి, ఉపాధ్యక్షుడు నర్తు గంగయ్య, ప్రచార కార్యదర్శి చలపరాయి వినోద్, కోశాధికారి కొప్పల హేమంత్, కారంగి త్రినాధ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
● శిరస్త్రాణం..
గుబ్బగొడుగుగా వ్యవహరించే తాటాకుల ఛత్రం.. శ్రమజీవులకు శిరస్త్రాణం. ఎండైనా.. వానైనా.. నిరంతరం తలకు ధరించి స్వేదజీవి నిశ్చింతంగా పనిచేసుకునే సౌలభ్యం దీని సొంతం. దీనిని ధరించి మహిళలు రోజూ ఉపాధి పనులకు వెళ్లడం పరిపాటి. పై రెండు చిత్రాలు బుధవారం కనిమెట్ట– రాపాక రూట్లో ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. – పొందూరు నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. రోడ్డు ప్రమాదాలు జరిగే సమయంలో తలకు బలమైన గాయాలు కాకుండా కొంత వరకు నిరోధించవచ్చు. పూర్తిగా పాడై ఉన్న దారుల్లో దీని ప్రయోజనం కచ్చితంగా ఉంటుంది. అటు ప్రమాదాల నివారణతో పాటు దుమ్ము.. ధూళి కళ్లలో పడకుండా కాపాడుకోవచ్చు. -
తాగునీటికి చింత..!
వంశధార చెంత.. కొత్తూరు: తరాలు మారుతున్నా ఆ గ్రామ ప్రజల తలరాత మారడం లేదు. వంశధార నది నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉద్దానం ప్రాంత గ్రామాలకు తాగునీటిని తరలిస్తున్న ఈరోజుల్లో, నది చెంతనే ఉన్నా గొంతెండుతున్న పరిస్థితి వారిది. పాలకుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో గుక్కెడు నీటికోసం చెలమ వైపు చూస్తున్నారు మండలంలోని ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో ఉన్నటువంటి కడుము గ్రామం ప్రజలు. ఈ గ్రామంలో సుమారు 2,500 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ కుళాయిలు ఏర్పాటు చేయకపోవడంతో ఎన్నో ఏళ్లుగా మహిళలు వంశధార నది వద్దకు వెళ్లి చెలమ నీటిని బిందెల్లో తోడుకొని ఇళ్లకు తీసుకొని వెళ్తుంటారు. నదికి వరదలు వచ్చినట్లయితే చెలమ నీటికి సైతం అవకాశం ఉండదు. అటువంటి సమయంలో గ్రామానికి రెండు కి.మీ దూరంలో ఉండే ఒడిశా రాష్ట్రంలోని కిడిగాం గ్రామం బోరు నుంచి తాగునీటిని తీసుకు రావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ బోర్లు నుంచి వచ్చే నీరు తాగేందుకు ఉపయోగపడడం లేదని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెలమ నీటినే తాగడం వలన అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోతున్నా రు. తమ గ్రామానికి సుజల ధార పథకంలో భాగంగా పైప్లైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పట్టించుకోవడం లేదు మా గ్రామానికి తాగునీటి కోసం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఊట నీరు కలుషితమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో ఆ నీరే తాగుతున్నాం. గ్రామంలో ఉన్న బోర్లు నుంచి వస్తున్న నీరు బాగులేకపోవడంతో ఊట నీరే మాకు దిక్కవుతోంది. అధికారులు స్పందించి తాగునీటి ఏర్పాట్లు చేయాలి. – లంక పార్వతి, కడుము గ్రామం, కొత్తూరు మండలం వరదలు వస్తే ఒడిశా వెళ్లాలివర్షాకాలంలో వంశధార నదికి వరద వచ్చినట్లయితే ఊట నీరు ఉండదు. అప్పుడు మా గ్రామం నుంచి ఒడిశా రాష్ట్రం కిడిగాం గ్రామం సమీపంలో ఉన్న బోరు నుంచి తాగునీరు తీసుకొస్తాము. మేము తాగునీటి కోసం పడుతున్న కష్టాలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా మాకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. – బూరాడ స్వాతి, కడుము గ్రామం, కొత్తూరు మండలంచర్యలు తీసుకుంటాం కడుము గ్రామంలో ఇంటింటా కుళాయిలు వేసేందుకు ఉద్దానం ఫేజ్–2 పథకం నుంచి నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు త్వరలో చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. – సాగర్, ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ, కొత్తూరు మండలం రెండు కి.మీ నడుస్తున్నాంగ్రామంలో ఉన్న బోర్లు నుంచి వస్తున్న నీరు తాగేందుకు పనికి రావడం లేదు. దీంతో రానుపోను రెండు కి.మీ నడిచి నది వద్దకు నీటికోసం వస్తాము. వర్షాలు కురుస్తున్నా తాగునీటి కోసం నదికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. – కొల్లారి శ్రీదేవి, కడుము గ్రామం, కొత్తూరు మండలం -
బ్లాక్ మార్కెట్లో ఎరువులు
టెక్కలి: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల వాటాలో 50 శాతం మాత్రమే తీసుకుని మిగిలినది నగదు రూపంలో కూటమి ప్రభుత్వం లాగేసుకుందని వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు. టెక్కలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోటబొమ్మాళి మండలంలో మంత్రి అచ్చెన్నాయుడికి అనుకూలంగా ఉన్న బ్రోకర్ల వద్ద బ్లాక్ మార్కెట్లో ఎలా ఎరువులు దొరుకుతున్నాయో మంత్రి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2018లో తిత్లీ తుఫాన్ సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని అప్పటి మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు హామీ ఇచ్చినా ఇంతవరకు సాయం అందలేదన్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అప్పటి కమీషనర్ అరుణ్కుమార్ స్పందించి జిల్లాకు రూ.83 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారని, అందులో ఒక్క టెక్కలి నియోజకవర్గానికే రూ.39 కోట్లు ఇచ్చారని వివరించారు. దీనిపై కనీస అవగాహన లేక టీడీపీ నాయకులు విమర్శలు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టెక్కలిని జిల్లా కేంద్రంగా మారుస్తానని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి చివరకు రైతులే సొంత డబ్బులతో బీమా కట్టించుకునే పరిస్థితికి తీసుకువచ్చారని దుయ్యబట్టారు. కింజరాపు కుటుంబ పాలనలో టెక్కలిలో ఒక్క శాశ్వతమైన పథకం ఇచ్చారా అని తిలక్ ప్రశ్నించారు. అచ్చెన్నాయుడికి సత్తా ఉంటే ఆఫ్షోర్, విత్తనోత్పత్తి కేంద్రాన్ని పూర్తి చేయాలని, రైతులకు రెండో విడతగా పూర్తి స్థాయిలో ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, సంతబొమ్మాళి జెడ్పీటీసీ పాల వసంత్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు హెచ్.వెంకటేశ్వరరావు, ఎస్.హేమసుందర్రాజు, టి.ఫాల్గుణరావు, బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి జి.గురునాథ్ యాదవ్, నాయకులు కె. అజయ్కుమార్, కె.జీవన్, పి.వైకుంఠరావు, డి. కూర్మారావు, పేడాడ వెంకటరావు పాల్గొన్నారు. టెక్కలి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ -
దేశానికి మోదీనే బ్రాండ్
● ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ శ్రీకాకుళం న్యూకాలనీ: భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే పెద్ద బ్రాండ్ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఏపీ బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శ్రీకాకుళంలో బుధవారం పర్యటించిన మాధవ్కు జిల్లా నాయకులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో పార్టీ శ్రేణులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఉమ్మడిగా పోటీ చేసేవిధంగానే చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ నాయకులంతా పోటీ చేసేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచపటంలో శ్రీకాకుళం జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం, గుర్తింపు ఉందని కొనియాడారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ను సైల్లో మెర్జ్ చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ తరుపున సూచించినట్లు పేర్కొన్నారు. దేశంలో స్టీల్ ప్లాంట్లు కాపాడిన ఘనత బీజేపీదేనని, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని, మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు త్వరితగతిన పూర్తిచేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, ముఖ్య నాయకులు పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, శవ్వాన ఉమామహేశ్వరి, అట్టాడ రవిబాబ్జి, బిర్లంగి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పోక్సో కేసు నమోదు రణస్థలం: మండలంలోని పైడిభీమవరం గ్రామానికి చెందిన బాలికపై ఇప్పిలి సతీష్ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడంతో జేఆర్పురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పైడిభీమవరం హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలిక మంగళవారం రాత్రి ఇంటి వద్ద ఉన్న సమయంలో, కనిమెట్ట గ్రామానికి చెందిన ఇప్పిలి సతీష్ అనే వ్యక్తి మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై ఎస్ఐ ఎస్.చిరంజీవి పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మెళియాపుట్టి: మండలంలోని గోకర్ణపురం గ్రామ పంచాయతీ చినహంస గ్రామానికి చెందిన లండ రామారావు అనే వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. ఒడిశాలోని రాధా సాగరంలో రామారావు గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం మృతదేహం ఒడ్డుకు కొట్టుకురావడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఒడిశా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పర్లాకిమిడి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృత్యువాతపడడంతో భార్య లక్ష్మి రోదనలు మిన్నంటాయి. అక్రమంగా మూగజీవాలు తరలింపు కంచిలి: ఒడిశా రాష్ట్ర పరిధి గొలంత్ర గ్రామం నుంచి విజయనగరం జిల్లా అలమంద సంతలో అమ్మేందుకు తరలిస్తున్న 12 గేదెలను కంచిలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం కంచిలి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వాహనంలో ఈ గేదెలను ఆక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న నలుగురుపైన కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ పి.పారినాయుడు తెలిపారు. ఎచ్చెర్ల: మండలంలోని జరజాం గ్రామ సచివాలయంలో పశుసంవర్ధక సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న తమ్మినేని అయ్యప్ప(సంతోష్కుమార్) జోన్–1 నుంచి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నారు. బుధవారం విజయవాడలోని డైరెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఆ శాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ డి.దామోదరనాయుడు ఈ అవార్డును అందించారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి పలు కీలక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి, పాడి రైతులకు మేలు చేసినందుకు ఈ అవార్డును ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. -
సత్తాచాటిన ప్రజ్ఞామణి
సోంపేట: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) నీట్ పీజీ ఫలితాల్లో సోంపేటకు చెందిన విద్యార్థిని గేదెల ప్రజ్ఞామణి జాతీయ స్థాయిలో 1,039వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఈమె ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది. పీజీ ఫలితాల్లో సత్తా చాట డంతో తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు.బదిలీల సమస్య పక్కదారి పడుతోంది డీటీఎఫ్ నాయకుడు పేడాడ కృష్ణారావుశ్రీకాకుళం: జిల్లాలో ఇటీవల జరిగిన ముగ్గురు కేజీబీవీ ప్రిన్సిపాల్స్ బదిలీల సమస్య పక్కదారి పడుతోందని, రాజకీయ సమస్యగా మారుస్తున్నారని డీటీఎఫ్ నాయకుడు పేడాడ కృష్ణారావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోలుగు కేజీబీవీ నుంచి కంచిలికి బదిలీ అయిన ప్రిన్సిపాల్ సౌమ్య, ఆమదాలవలస నియోజకవర్గ టీడీపీ నాయకుల మధ్య జరుగుతున్న ఆరోపణలతో అసలు విషయం మరుగున పడుతోందన్నారు. జిల్లా అధికారులు, అధికార పార్టీ నాయకులు చెబుతున్నట్లుగా లోలుగు కేజీబీవీ నుంచి కంచిలికి బదిలీ అయిన సౌమ్య అక్రమాలకు పాల్పడితే సుదూర ప్రాంతానికి బదిలీ చేయడం మంచిదేనన్నారు. అయితే కంచిలి కేజీబీవీ ప్రిన్సిపాల్ను జిల్లా కేంద్రం సమీపంలోని కేజీబీవీకి ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందో అధికారులు, అధికార పార్టీ పెద్దలు చెప్పకపోవడం విచారకరమన్నారు. అలాగే గారలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ను పొందూరు ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. సౌమ్య నిజంగానే అవినీతి చేసి ఉంటే, విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టి ఇద్దరిని మాత్రమే బదిలీ చేస్తే సమంజసంగా ఉండేదని, ముగ్గురుని ఎందుకు బదిలీ చేశారో కారణాలను ఎస్ఎస్ఏ అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బదిలీలకు గల కారణాలను వెల్లడించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. -
పొగురు తెచ్చిన చేటు..!
ఇచ్ఛాపురం రూరల్: అల్పపీడనం ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు బూర్జపాడు పంట పొలాలు నీట మునిగిపోయాయి. స్థానిక డొంకూరు ఉప్పుటేరుకు ఆనుకొని ఉన్న పంట పొలాల రైతులకు పొగురు వలన తీవ్ర నష్టం కలిగింది. కురిసిన వర్షాలకు వరద నీరు ఉప్పుటేరు గుండా సముద్రంలో కలవాల్సి ఉండగా.. సముద్రంలో ఉప్పుటేరు కలిసే చోట ఇసుక మేట వేయడంతో వరద నీరు పంట పొలాల్లోకి చొచ్చుకుపోయింది. దీంతో సుమారు 50 ఎకరాల వరకు పంట నీట మునిగిపోయింది. సోమ, మంగళవారం రోజున నాటిన వరినాట్లు వరద ఉద్ధృతికి నీటిపైకి తేలిపోవడంతో రైతులు తలలు పట్టుకున్నారు. ప్రస్తుతం వరినారు ఎక్కడా దొరకని పరిస్థితి ఉండగా.. ఇటువంటి పరిస్థితుల్లో మరల నాట్లు ఎలా వేసేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి డొంకూరు సముద్రం – ఉప్పుటేరు మధ్య ఇసుక మేటలు(పొగురు) తొలగిస్తే పంటలను రక్షించుకోవచ్చని, లేకుంటే వందల ఎకరాలకు నష్టం వాటిళ్లుతుందని వాపోతున్నారు. ముంచెత్తిన వరద నీటిలోనే పంట పొలాలు -
మేలుకోకుంటే నష్టం
ముంచేసిన వర్షం..ఆమదాలవలస: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వ్యవసాయ పొలాల్లో నీరు కనిపిస్తోంది. కాలువల ద్వారా పొలాల్లోకి సాగునీరు చేరింది. అయితే వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే వెద పద్ధతిలో వరి సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంట నీట మునిగితే ఎదుగుదలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.చిట్టిబాబు తెలిపారు. ఈ తరుణంలో వరితోపాటు వివిధ పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు వరి పంట 1.30 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అలాగే మొక్కజొన్న 9,000 హెక్టార్లు, పత్తి పంట 850 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ పంటల్లో జాగ్రత్తలు పాటిస్తే నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. వరి పంటలో... జూన్, జూలై నెలల్లో ముందుగా వెదజల్లిన వరిపంట పిలక దశకు చేరుకుంది. ఇంద్ర(ఎంటీయూ 1061), అమర ఎంటీయూ (1064) వంటి రకాలు కొంతవరకు ముంపును/అధిక నీటిని తట్టుకోగలవు. ● పొలాల నుంచి నీరు బయటకు పోయేలా మార్గాలు ఏర్పాటు చేయాలి. పంట పాక్షికంగా దెబ్బ తిన్నట్లయితే పంటలో ఒత్తుగా ఉన్న పిలకలను తీసి పలుచగా ఉన్నచోట నాటుకోవాలి. అలాగే పంట ఎదుగుదలకు ఎకరాకు 20 – 25 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ వేయాలి. లేదా నానో యూరియా ఎకరానికి అరలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ● పంటమీద తెగుళ్లు రాకుండా ఉండేందుకు కార్బండిజం ఒక గ్రాము లేదా మాంకోజెబ్ రెండు గ్రాము లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● నాట్లు వేసే రైతులకు ఈ వర్షాలు అనుకూలం కాబట్టి 30 నుంచి 35 రోజుల ఆరోగ్యవంతమైన నారు నాటుకోవాలి. నారు ముదిరితే దగ్గర దగ్గరగా కుదురుకు ఎక్కువ పిలకలు ఉండేటట్లు చూసుకోవాలి. ● నాట్లువేసిన వారం రోజులు లోపు తప్పనిసరిగా 50 కిలోల డీఏపీతో పాటు పది కిలోల పొటాష్ ఎరువును వేసుకోవాలి. ● అలాగే నాట్లు వేసిన వారం రోజులకు ప్రతీ రెండు మీటర్లకు 20 సెంటీ మీటర్లు చొప్పన కాలిబాటలు తీయాలి. మొక్కజొన్న పంటలో... జూన్ మాసంలో విత్తుకున్న మొక్కజొన్న పైరు పూత దశలో, జూలై నెలలో విత్తుకున్న పైరు మోకాలు ఎత్తు దశలో ఉంటుంది. – పూత దశలో ఉన్న పైరుకు ఎకరాకు 50 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వేయాలి. ● 25 నుంచి 30 రోజుల వయసున్న పైరులో అంతర కృషి జరిపి, ఎకరాకు ఒక బస్తా యూరియాను పైపాటుగా వేసుకొని, మట్టిని మొక్కల వేర్లుకు ఎగదోయాలి. ● ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు లేత పైరు అధిక తేమను తట్టుకోలేదు. ఈ పరిస్థితిని నివారించుటకు పొలం నుంచి వర్షపు నీటిని మురుగు నీటి కాలువల ద్వారా బయటకు తీయాలి. ● ఎకరాకి 25 కిలోల యూరియా, పది కిలోల పొటాష్ ఎరువులను అదనంగా వేయాలి. పత్తి పంటలో... ప్రత్తి పంట అధిక తేమను తట్టుకోలేదు. ఆకులు మొదట గులాబీ రంగుకు మారి, తర్వాత పూర్తిగా ఎర్రబడి, ఎండిపోయి రాలిపోతాయి. ● పొలంలో కాలువలు తీసుకొని నీటిని బయటకు పంపించాలి. ● నెలరోజులు దాటిన పంట అధిక వర్షాలకు గురైతే, పంట ఎదుగుదలకు ఎకరాకు 25 కిలోలు యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువులను అదనంగా వేయాలి. ● లేదా లీటరు నీటికి 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ మరియు 10 గ్రాముల యూరియా/డీఏపీ కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ● వేరుకుళ్లు తెగులు ఆశించకుండా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములను లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లును తడపాలి పంటల్లో సస్యరక్షణ చర్యలు తప్పనిసరి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు వరి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు -
చోరీకి యత్నించిన మహిళ అరెస్టు
మెళియాపుట్టి: ఈనెల 14వ తేదీన పట్టపగలే ఒక మహిళ చోరీకి ప్రయత్నించడమే కాకుండా.. మరో మహిళపై దాడిచేసి పారిపోయిన ఘటన మండలంలోని పట్టుపురం గ్రామంలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం సాయంత్రం దాడికి పాల్పడిన మహిళను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్స్టేషన్లో పాతపట్నం సీఐ వి.రామారావు, ఎస్ఐ పి.రమేష్ బాబు మీడియాకు వివరాలు బుధవారం వెల్లడించారు. మెళియాపుట్టి మండలంలోని వసుంధర గ్రామానికి చెందిన మనుజ మల్లిక్ అనే 41 ఏళ్ల మహిళ పట్టుపురం గ్రామానికి చెందిన అంబల లచ్చయ్య ఇంట్లో ఈనెల 14వ తేదీన చొరబడింది. అదే సమయంలో లచ్చయ్య భార్య అంబలి కాంచన మెళియాపుట్టి గ్రామంలో ఉన్న సాయిబాబా ఆలయంలో సేవకు వెళ్లి కార్యక్రమం ముగించుకుని ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికే, తలుపు చాటున గుర్తు తెలియని మహిళ (మనుజ మల్లిక్) కాంచన తలపై బలంగా కర్రచెక్కతో కొట్టి పారిపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీనిలో భాగంగా మనుజ మల్లిక్ స్కూటీ, ఆమె వేసుకున్న బుర్ఖా, ఇతర ఆనవాళ్లు సీసీ కెమెరాలో గుర్తించారు. మంగళవారం వసుంధర చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో సీసీటీవీ ఫుటేజీలో గుర్తించిన ద్విచక్ర వాహనం గమనించి ఆమెను పట్టుకున్నారు. దొంగతనానికి వచ్చి, అంతలోనే ఇంటి యజమాని రావడంతో దొరికిపోతానేమోనన్న భయంతో దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పక్కా ప్లాన్తోనే.. ఒడిశాలోని ఖైటడ గ్రామంలో బాధితురాలు, ముద్దాయి మునుజ పక్కపక్క ఇళ్లల్లో కొన్నేళ్లు కలిసి ఉండేవారు అదే క్రమంలో పరిచయం ఏర్పడింది. పలుమార్లు పట్టుపురం వచ్చి అంతా గమనించి దొంగతనానికి పాల్పడింది. మనుజ మల్లిక్ ప్రస్తుతం పర్లాకిమిడిలో బ్యూటీపార్లర్ నడుపుతుంది. అక్కడి ఆర్టీవో కార్యాలయం అధికారులతో చనువు పెంచుకుని పలువురికి లైసెన్సులు చేయిస్తూ ఉంటుంది. ఆమె విలాసాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడుతుందని, ఆమె ఉన్న ఏరియాలోనే దొంగతనాలు జరుగుతున్నాయని, వాటి వెనుక ఈమె హస్తం ఉందని ఒడిశా పోలీసులు సైతం అనుమానిస్తున్నట్లు సమాచారం. వారు కూడా ఈమె కదలికలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. -
జీవనాధారం నీవేనయ్య..!
ఓ బొజ్జ గణపయ్య.. ● విగ్రహాల తయారీనే నమ్ముకున్న కళాకారులు ● స్థానికులతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి రాక ● ట్రెండ్కు తగ్గట్టు రూపుదిద్దుకుంటున్న విగ్రహాలు ● వారం రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు వజ్రపుకొత్తూరు రూరల్ : వినాయక చవితి సందడి మరో వారం రోజుల్లో మొదలుకానుంది. భాద్రపద శుక్లపక్ష చవితి నాడు ప్రారంభమై నవరాత్రులు ఎంతో వైభవంగా జరుపుకునే ఈ ఉత్సవం ఈ నెల 27న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కళాకారులు విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. విగ్రహాలు తయారు చేసే కళను నమ్ముకొని వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఏడాదికి ఒకసారి వచ్చే వినాయక చవితి ఉత్సవాలకు అవసరమైన బొజ్జ గణపయ్య విగ్రహాలను కళాకారులు తయారు చేసి ఏడాదికి సరిపడ ఆదాయాన్ని అర్జించి కుటుంబాన్ని పోషిస్తుంటారు. ప్రధానంగా ఈ సీజన్లో రాజస్థాన్, కోల్కత్తా, రాజమండ్రి తదితర ప్రాంతాలలో పాటు జిల్లాలో ఉన్న పొందూరు, నరసన్నపేట, కోటబొమ్మాళి, కాశీబుగ్గ, హరిపురం తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 200 విగ్రహా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది కళాకారులు, వ్యాపారులు, కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఉత్సవాలకు మూడు నెలల ముందు విగ్రహాల తయారీ కేంద్రాలను ఎంపిక చేసుకొని అవసరమైన ముడి సామగ్రిని లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కోనుగోలు చేసుకొని సేకరించి నిల్వపెట్టుకున్నారు. రెండు నెలల ముందు విగ్రహాలను తయారీ చేయడం ప్రారంభించారు. ఉత్సవానికి సమయం దగ్గర పడటంతో విగ్రహాలకు తుది మెరుపులు దిద్దుతున్నారు. ఏటా ట్రెండింగ్లో ఉన్న వినాయక విగ్రహాలకు ఆదరణ పెరుగుతోంది. పూజా కమిటీ నిర్వాహకుల అభిరుచికి తగ్గట్టుగా రకరకాల ఆకృతిలో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. 2 అడుగుల నుంచి 12 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలను తయారీ చేసి మార్కెట్లో అమ్మకాల కోసం సిద్ధం చేస్తున్నారు. విగ్రహాల మోడల్, సైజ్ బట్టి ఒక్కొక్క విగ్రహాన్ని రూ.2 వేల నుంచి రూ.20 వేల వరకు అమ్మకాలు చేస్తున్నారు. కళాకారులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి విగ్రహాలు తయారీ చేస్తున్నారు. అయితే తాము ఆశించిన స్థాయిలు విగ్రహాలు అమ్ముడుపోతేనే తమ కుటుంబ పోషణకు భరోసా దొరుకుతుందని, లేదంటే నష్టాలు చవిచూడాల్చిన పరిస్థితి ఏర్పడుతుందని కళాకారులు చెబుతున్నారు. -
దబ్బపాడు.. బాహ్య ప్రపంచానికి దూరం
హిరమండలం: ఎల్ఎన్ పేట మండలం దబ్బపాడు గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగి పోయాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడపలవానిగెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో దబ్బపాడు గ్రామ ప్రజలు బయటకు రావడానికి కూడా వీల్లేకుండాపోయింది. ఏటా కడపలవానిగెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో వరద ఉన్న సమయంలో ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఇక్కడ వంతెన నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరయ్యాయి. పనులు కూడా అప్పటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రారంభించారు. కానీ ఆ పనులను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం లేదు. -
uuవంశధారలో పెరిగిన వరద
హిరమండలం: హిరమండలం వంశధార గొట్టా బ్యారేజీ వద్ద మంగళవారం ఉదయానికి వరద నీరు పెరిగింది. ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాతో పాటు రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు వంశధారలో వరద నీరు వచ్చి చేరుతోంది. గొ ట్టా బ్యారేజీ వద్ద గరిష్ట నీటి మట్టం 38.10 మీటర్లు కాగా ప్రస్తుతానికి 38.08 మీటర్ల వరకు నీరు ఉంది. సోమవారం సాయంత్రానికి 10,357 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. మంగళవారం నాటికి 22వేలకు పెరిగింది. వచ్చిన నీటిని 11 గేట్లు 20 సెంటీమీటర్ల మేర పైకి ఎత్తి 20651 క్యూసెక్కులు దిగువకు విడిచిపెట్టినట్లు డీఈ సరస్వతి తెలిపారు. ఎడమ ప్రధా న కాలువ ద్వారా 1430 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు డీఈ తెలిపారు. -
నీరు.. కన్నీరాయె..
రెండున్నరేళ్ల పిల్లాడు.. ఆ నీటి లోపల మునిగిపోతూ అమ్మను ఎంత తలచుకున్నాడో.. నాన్నను ఎంతగా పిలిచాడో. ఊపిరి అందక ఎంత విలవిలలాడిపోయాడో.. ఇంటి పక్కన తీసిన పెంట గొయ్యి ఆ పిల్లాడికి మృత్యు కుహరంలా మారింది. వాన నీటికి నిండిన గోతిలో దాగున్న మృత్యుదేవత చిన్నారిని అమాంతం మింగేసింది. బద్రి గ్రామంలో జరిగిన ఈ విషాద సంఘటనతో ఊరుఊరంతా శోకంలో మునిగిపోయింది. సారవకోట: మండలంలోని బద్రి గ్రామంలో మంగళవారం పెంట గొయ్యిలో పడి ఆ గ్రామానికి చెందిన శిమ్మ లోకేష్ అనే బాలుడు మృతి చెందా డు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివ రాలు ప్రకారం.. బద్రి గ్రామానికి చెందిన శిమ్మ దాలినాయుడు, హేమలతలకు మౌళి, లోకేష్ ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడైన లోకేష్కు 2 ఏళ్ల 4నెలల వయసు ఉంటుంది. మంగళవారం ఉదయం తల్లి హేమలత కుళాయి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లగా ఆమె వెంట బాలుడు కూ డా వెళ్లాడు. ఆ ఇంటి పక్కనే జాతీయ ఉపాధిహా మీ పథకంతో కంపోస్టు ఎరువుల తయారీ కోసం తీసిన పెంట గొయ్యి వాన నీటితో నిండి ఉంది. అమ్మతో వెళ్లిన బాలుడు అటుగా వెళ్లి గోతిలో పడిపోయాడు. దీన్ని ఎవరూ గమనించలేదు. తల్లి నీళ్లు పట్టుకుని కుమారుడి కోసం వెతకగా ఆ గోతిలో మృతదేహం తేలడంతో ఆమె దిగ్భ్రాంతి కి గురయ్యారు. వెంటనే బాలుడిని బయటకు తీ సి బుడితి సీహెచ్సీ తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు అక్కడి సిబ్బంది చెప్పడంతో గుండెలవిసేలా రోదించారు. గంట క్రితం వరకు ఇంటిలో అల్లరి చేస్తూ ఆడిన పిల్లాడు అలా చలనం లేకుండా పడి ఉండడం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 120 పెంట గొయ్యిలను మూడు నెలల కిందట తవ్వించారు. ప్రస్తుతం వర్షాలకు ఈ పెంట గొయ్యిలు నీటితో నిండి ఉన్నాయి. పిల్లలు అటు గా తిరిగేటప్పుడు జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు. పెంట గోతిలో పడి బాలుడి మృతి కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు -
దళితులంటే ఎందుకంత చులకన..?
అంత పిరికి కాదు.. మా అక్కను తీవ్రంగా బాధ పెట్టారు. ఆమె తప్పు లేకపోయినా ఇబ్బంది పెట్టడంతోనే ఆత్మహత్య ఆలోచన చేసింది. మా అమ్మ,నాన్న బాగా చదువుకున్న వారు. సమాజంలో గౌరవం కోసమే సౌమ్య ఉద్యోగం చేస్తోంది. మాకు, మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. మాకు రక్షణ కల్పించాలి. – యువరాజు, సౌమ్య సోదరుడు శ్రీకాకుళం: దళిత సామాజిక వర్గానికి చెందిన పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను వేధించిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఆయన అనుచరుల పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. దళితులన్నా, దళిత మహిళలన్నా చంద్రబాబు అండ్ కోకు చిన్నచూపు అని మండిపడ్డారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సౌమ్యను రిమ్స్లో వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం పరామర్శించారు. సౌమ్యకు న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటా మని భరోసానిచ్చారు.ఈసందర్భంగా మేరుగ నాగా ర్జున మాట్లాడుతూ.. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవలే గుంటూరులో ముస్లిం మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుందని తెలిపారు. ఆర్అండ్బీ ఉద్యోగి కొరప కల్యాణిని మంత్రి అచ్చెన్నాయు డు బూటుకాలితో తన్నారని గుర్తుచేశారు. ఆమదాలవలసలో కోటిపల్లి రాజు అనే వ్యక్తి ఓ చిన్నారిపైన అఘాయిత్యం చేస్తే కేసు కూడా లేదన్నారు. పలాస–కాశీబుగ్గలో ఓ విద్యార్థినిపై దాడి చేస్తే వారిపైనా కేసులు నమోదు చేయలేదన్నారు. పెందుర్తి నియోజకవర్గం జెర్రిపోతులపాలెంలో ఓ మహిళను వివస్త్రను చేస్తే నేషనల్ ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేశాక స్పందించారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో జన సేన ఎమ్మెల్యే దళిత డాక్టర్ని చెంపదెబ్బ కొడితే కేసు లు పెట్టలేదన్నారు. నెల్లూరు జిల్లాలో రాంపుర్లో పల్లెలో వెలివేసి కొడితే వందల మంది ఊరు వదిలి వెళ్లిపోయారన్నారు. నెల్లూరులో మాజీ శాసన సభ్యు డి ఇంటి మీద దాడి చేస్తే అడిగేవారే లేరన్నారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ దళితులను చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ప్రకారం రాష్ట్రం 4వ స్థానంలో ఉంటే ఇప్పుడు అదే సర్వేలో ఒకటి రెండు స్థానాల్లో ఉండటం సిగ్గుచేటన్నారు. సౌమ్యకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని భరోసానిచ్చారు. చంద్రబాబు చోద్యం చూస్తున్నారు వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు మాట్లాడుతూ జరుగుతున్న సంఘటనలపై సీఎం చంద్రబాబునాయుడు చోద్యం చూస్తున్నారే తప్ప ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న సందర్భాలు లేవన్నారు. రాష్ట్రంలో దళిత అధికారులు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సైతం వదలకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న కూ టమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి దళిత, గిరిజన వర్గాల వారంతా సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్ జగన్ దళితులకు అగ్రపీఠం వేశారని, ఏనాడూ చిన్నచూపు చూడలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తమ హయాంలో దళితులకు అన్ని రకాలుగా మేలు చేశామని తెలిపారు. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ ఓ మహిళగా సౌమ్య పరిస్థితి చూ స్తుంటే బాధగా ఉందన్నారు. దళిత మహిళే హోంమంత్రిగా ఉన్నా దళిత మహిళలకు అన్యాయం జరిగితే కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పో యి తిరిగి తప్పుడు ప్రచారాలు చేయడం తగదన్నా రు. కూన రవి తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేయాలని డిమాండ్ చేశారు. సౌమ్యను పరామర్శించిన వారిలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఎంవీ పద్మావతి, వైఎస్సార్సీపీ తూర్పుకాపుకుల రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య కుల రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పోలినాటి వెలమ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, మాజీ అధ్యక్షుడు పొన్నాడ రుషి, గ్రీవెన్స్సెల్ అధ్యక్షుడు రౌతు శంకరరావు, నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, ఎస్సీ సెల్ శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్చార్జి యజ్జల గురుమూర్తి, శ్యామ్ప్రసాద్రెడ్డి, బొడ్డేపల్లి రమేష్, గొండు రఘురాం, వైవీ శ్రీధర్, మూకళ్ల తాతబాబు, పీస గోపి, కంఠ వేణు, బోసు మన్మధరావు, జలగడుగుల శ్రీనివాసరావు, పర్రి రాజారావు, పంకు ప్రసాద్, సురారపు త్రినాథ, యలమల కృష్ణ తదితరులు ఉన్నారు. -
తెంచుకెళ్లిపోతారు!
● వెనకే వస్తారు.. మహిళలు అప్రమత్తంగా ఉండాలి.. ఒంటరిగా మహిళలు నడిచి వెళ్లేటప్పుడు, ప్రయాణించేటప్పుడు చున్నీ గానీ, చీరకొంగు గానీ కప్పుకునే వెళ్లాలి. ఆభరణాలు కనిపించేలా ఉండరాదు. వెనక, ముందు ఎవరు వస్తున్నారన్నది ఎప్పటికప్పుడు గ్రహించాలి. 45 ఏళ్ల పైబడ్డ మహిళలనే చైన్స్నాచర్లు టార్గెట్ చేస్తారు. శ్రీకాకుళం పీఎన్కాలనీయే కాక పలు చోట్ల విద్యుత్ దీపాలు వెలగకపోవడమే కాక సీసీ కెమెరాలు సైతం నివాసగృహాలవారు పెట్టుకోకపోవడంతో దొంగతనాలు జరుగుతున్నాయి. – పి.ఈశ్వరరావు, సీఐ, శ్రీకాకుళం టూటౌన్ శ్రీకాకుళం క్రైమ్ : ఒంటరిగా రోడ్డుపై నడిస్తే భయం.. తోడు లేకుండా పొలానికి వెళ్లాలన్నా వణుకే.. మెడలో బంగారం వేసుకుని బయటకు రావాలంటే సంశయించాల్సిన పరిస్థితి. ఒడిశా గ్యాంగ్ చేతివాటానికి సిక్కోలు వాసులు టార్గెట్ అవుతున్నారు. నిన్న రణస్థలం.. మొన్న బురిడి కంచరాం.. ఇలా హైవే పక్కన ఉన్న గ్రామాలే లక్ష్యంగా గొలుసు చోరులు రెచ్చిపోతున్నారు. ఈ గొలు సు దొంగతనాలకు పాల్పడుతున్నది ఒడిశాకు చెందిన గ్యాంగ్గా ఇప్పటికే పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. గ్యాంగ్కు చెందిన ఇద్దరిపై అనుమా నం ఉన్నట్లు, జిల్లాలో పలు గొలుసు దొంగతనాల్లో వీరి హస్తమున్నట్లు.. వీరికి మరికొందరితో లింకులున్నట్లు అనుమానిస్తున్నారు. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ● ఈ నెల 11న రణస్థలం మండలం అర్జునవలస పంచాయతీ గిడిజాలపేటరహదారిపై ఓ విద్యార్థిని మెడలో చైన్ తెంపి పరారయ్యారు. ● ఈ నెల 8న పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు ఎస్ఎంపురం రోడ్డులో పొలాన్ని చూడటానికి వెళ్తుండగా వెనుకగా వచ్చిన అగంతకుడు మూడు తులాల తాడు తెంపేసి పారిపోయాడు. ● ఈ నెల 4న ఎచ్చెర్ల మండలం ఫరీద్పేట పంచాయతీ వరం కాలనీలో మార్నింగ్ వాక్ చేస్తున్న వరలక్ష్మి మెడలో రెండున్నర తులాల పుస్తెల తాడు తెంపి ఓ వ్యక్తి పరారయ్యాడు. ● గత నెల 15న శ్రీకాకుళం మండలం సింగుపురానికి చెందిన ఓ మహిళ ఏటీఎం సెంటర్లో డబ్బులు తీసుకొని వస్తుండగా ముఖానికి మాస్కులు పెట్టిన వ్యక్తులు నంబర్ ప్లేట్లు లేని ద్విచక్రవాహనంపై వచ్చి 3 తులాల బంగారు తాడు తెంపేసి పరారయ్యారు. జైలు నుంచి విడుదలై.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురానికి చెందిన సుజిత్కుమార్ పాడి, బాలకృష్ణ సాహులు జిల్లాలో నాలుగుచోట్ల పుస్తెల తాడుల చోరీలకు పాల్పడి ఈ ఏడాది జనవరి 10న కొత్తూరు పోలీసులకు చిక్కి జైలుకెళ్లారు. అప్పటికే జిల్లాలో 2016 నుంచి 2024 వరకు 32 నేరాలు చేసిన ఘనత వీరిది. మళ్లీ బెయిల్పై బయటకొచ్చారో లేదో.. ఇదే ఏడాది జూన్లో మెళియాపుట్టి మండలం శేఖరాంపురం గ్రామంలోని పొలం పనుల్లో ఉన్న ఓ మహిళ మెడలో పుస్తెల తాడు తెంపేసి బైక్పై పరారయ్యా రు. అదేరోజు బరంపురంలో సైతం ద్విచక్రవాహనం దొంగిలించారు. నేరాలు చేసి జైలుకెళ్లినా మళ్లీ దర్జాగా బయటకొచ్చి చోరీలు చేస్తుండటం జిల్లావాసులను విస్మయపరుస్తోంది. బ్యాగులను తెంపేస్తారు.. ● గత నెలలో గార మండలం దీపావళి గ్రామానికి చెందిన ఓ మహిళ పలాసకు బస్సులో వెళ్తుండగా అనకాపల్లికి చెందిన ఓ మహిళ బ్యాగు కొట్టేసింది. అందులో నాలుగున్నర తులాల చైన్, తులంన్నర చైన్ నెక్లెస్ ఉన్నాయి. ఈమె పలు చోరీకేసుల్లో నిందితురాలు. ● గత నెలలోనే జేఆర్ పురం మండలకేంద్రంలో వస్త్రదుకాణంలో డ్వాక్రా సభ్యుల వద్ద డబ్బులున్న బ్యాగులను కోసేసి పరారయ్యారు. ● జూన్లో ఆటోల్లో ఎక్కే వృద్ధ దంపతులే లక్ష్యంగా ఎచ్చెర్ల, శ్రీకాకుళం రెండో పట్టణ పీఎస్ల పరిధిలో కొందరు మహిళలు బ్యాగులు కోసేసి పారిపోయారు. అనంతరం వీరిని పట్టుకున్నారు. జిల్లాలో మళ్లీ రెచ్చిపోతున్న గొలుసు దొంగలు నిందితుల్లో చాలా మంది ఒడిశా వాసులే ఒంటరిగా వెళ్లే వారే టార్గెట్ -
‘దళిత మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): పొందూరు కేజీబీవీ నుంచి కంచిలి కేజీబీవీకి ప్రిన్సిపాల్ సౌమ్యను అక్రమంగా బదిలీ చేశారని, ఆమెకు న్యాయం జరిగే వరకూ దళిత సంఘాలు ఐక్యంగా పోరాటం చేస్తాయని పలువురు వక్తలు అన్నారు. స్థానిక అంబేడ్కర్ విజ్ఞాన భవన్లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కొన్ని అసత్య ఆరోపణలతో బదిలీ చేయడమే కాకుండా, అనేక విధాలుగా వేధించినట్లు సౌ మ్య వెల్లడించిన నుంచి ఆమదాలవలస ఎమ్మె ల్యే కూన రవికుమార్ అనుచరులు సోషల్ మీ డియాలో సౌమ్యపైన ఆమె కుటుంబ సభ్యుల పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ మానసిక క్షో భకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. హోం మంత్రి తక్షణం జిల్లాకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల జిల్లా నాయకులు కంఠ వేణు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు రానా శ్రీనివాస్, బొడ్డేపల్లి కృష్ణా, గరికివాడు, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, దళిత ప్రజా సంఘాల జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, బడే కామరాజు, వైఎస్సార్ సీపీ నాయకుడు పొన్నాడ రుషి తదితరులు పాల్గొన్నారు. పడిగాపులే మిగిలాయి నరసన్నపేట: ‘మాకేంటీ బాధలు.. మాపై ఎందుకు ఈ కక్ష.. ఇలా ఎన్నాళ్లు తిరుగుతాం. ఇంకెన్నాళ్లు తిరగాలి..’ అని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకల్యం నిరూపించుకోవడానికి రీ వెరిఫికేషన్ కోసం ప్రభుత్వం నోటీసులు పంపిస్తుండడంతో దివ్యాంగులు శ్రమకోర్చి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతో కష్టపడి ఇంటి నుంచి ఆస్పత్రికి వస్తుంటే.. ‘ఇప్పుడు మీకు వైకల్య శాతం తక్కువగా ఉంది. మీ పింఛన్ కట్ చేస్తున్నాం. మీరు అర్హులైతే ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోండి. మళ్లీ మీకు సదరంకు పిలుస్తాం. అందులో మళ్లీ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. అప్పుడు అర్హులైతే పింఛన్ వస్తుంది’ అని అధికారులు చెబుతున్నారు. మంగళవారం నరసన్నపేట ఎంపీడీఓ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు మడపాం, రావులవలస, సత్యవరం గ్రామాల నుంచి వచ్చారు. కళ్లనీళ్లు పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని నిందించారు. -
సీపీఎస్ రద్దుకు ఉద్యమబాట
శ్రీకాకుళం పాతబస్టాండ్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 1న చేపట్టనున్న ఉద్యోగుల వెన్నుపోటు దినం విజయవంతం చేయాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలో జరగనున్న ఉద్యమానికి సంబంధించి మంగళవారం కలెక్టరేట్ వద్ద పోస్టర్ ఆవిస్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు వెన్నుపోటు పొడించిన దినం సెప్టెంబర్ 1న పురస్కరించుకొని గుంటూరు నాగార్జున యూనివర్సిటీ నుంచి విజయవాడ అంబేడ్కర్ విగ్రహం వరకు నలుపు వస్త్రాలు ధరించి భారీ నిరసన పాదయాత్ర చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ చల్ల సింహాచలం, నగర నాయకులు సూర్య, వంశీ, అనిల్ శ్రీనివాస్ పద్మ ప్రియా తదితరులు పాల్గొన్నారు. -
అభ్యంతరాల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఈ–డివిజనల్ మేనేజర్ పోస్టు రాత పరీక్ష ఆగస్టు 10న నిర్వహించగా.. ఫలితాలు, ప్రొవిజనల్ జాబితా జిల్లా వెబ్సైట్ srikakulam.a p.gov.inలో ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలను ఈ నెల 22లోగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. మార్కులపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా నిర్దేశిత తేదీ సాయంత్రం 5 గంటల లోగా శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారికి నేరుగా తెలియజేయవచ్చని తెలిపారు. రాధాసాగరంలో వ్యక్తి గల్లంతు మెళియాపుట్టి: మండలంలోని గోకర్ణపురం పంచాయతీ చినహంస గ్రామానికి చెందిన లండ రామారావు(49) ఒడిశా రాష్ట్రంలోని రాధాసాగరంలో గల్లంతయ్యాడు. రామారావు సోమవారం సాయంత్రం ముగ్గురు స్నేహితులతో కలిసి చేపలు పట్టడానికి వినియోగించే ఓ చిన్న నాటు పడవలో సాగరంలోకి వెళ్లారు. ప్రమాదవశాత్తూ మునిగిపోవడంతో నలుగురు నీటిలో పడిపోయారు. మిగిలిన ముగ్గురూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా రామారావు గల్లంతయ్యాడు. అయితే ఈ విషయాన్ని గ్రామంలో ఎవరికీ చెప్పలేదు. మంగళవారం ఉదయం విషయం తెలియడంతో గ్రామస్తులు అందించిన సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టారు. చీకటిపడేవరకు గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో గాలింపు నిలిపి వేశారు. ఒడిశా పరిధి కావడంతో గారబంద పోలీసులు కేసు నమోదు చేశారు. లండ రామారావుకు భార్య లక్ష్మీ ఒక కుమారుడు ఉన్నారు. -
యథేచ్ఛగా భూఆక్రమణ!
పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో భూ ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు భూములనే తేడా లేకుండా కబ్జాల పర్వం కొనసాగుతోంది. తాజాగా కాశీబుగ్గలో కోట్ని విజయ్కు చెందిన జిరాయితీ ఖాళీ స్థలంపై ఆక్రమణదారుడి కన్నుపడింది. కాశీబుగ్గ కె.టి.రోడ్డుకు ఆనుకొని ఉన్న రూ.కోట్ల విలువైన ఈ స్థలాన్ని తెలుగు దేశం పార్టీ నాయకుల అండదండలతో తాళాసు నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని బాధితుడు కోట్ని విజయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాత మూత్తాల నుంచి సంక్రమించిన జిరాయితీ భూమిలో నీలాపురం గ్రామానికి చెందిన ఓ కాంట్రాక్టరు ప్రొక్లెయినర్ తెచ్చి పునాదులు తవ్విస్తున్నాడని, దీనిపై ప్రశ్నిస్తే భవనం నిర్మాణం చేయడానికి కాంట్రాక్టు ఇచ్చారని, అందుకే పునాదులు తీస్తున్నానంటు బెదిరిస్తున్నారని లబోదిబోమంటున్నాడు. స్థలం వ్యవహారం కోర్టులో ఉందని, తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని తెలిసి దౌర్జన్యంతో అక్రమంగా నిర్మాణాలు చేయడానికి పూనుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతులు కూడా లేవని, అయినా అధికార పార్టీ అండతో ఈ విధంగా తనకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని విజయ్ వాపోయాడు. పోలీసు స్టేషన్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు బెదిరించాడని, తన భూమిని కాపాడాలని పోలీసులను, మున్సిపల్ అధికారులను వేడుకుంటున్నాడు. -
దళితుల ఐక్యతపై కుట్ర
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎస్సీ వర్గీకరణ పేరిట దళితుల ఐక్యతపై ప్రధాని మోదీ, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డిలు రాజకీయ కుట్ర పన్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.రత్నాకర్ అన్నారు. కులగణన జరగకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా చేపట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రయివేటు హోటల్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాల సామాజికవర్గంపై చంద్రబాబు పగతీర్చుకుంటున్నారని, మాలలకు అన్యాయం జరుగుతున్నా ఈనాటికీ స్పందించలేదన్నారు. ప్రజల తలుచుకుంటే ఏ చట్టాలైన ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందేనన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని తొక్కేస్తుంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం అన్యాయమన్నారు. రిజర్వేషన్లతో లబ్ధి పొందిన మాల ఉద్యోగులు ఇప్పటికైనా కళ్లు తెరిచి తమ పోరాటానికి మద్దతిస్తే మన రిజర్వేషన్లు కాపాడుకోగలుగుతామన్నారు. శాంతియుత పోరాటానికి మనమంతా సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు అలికాన మహేష్కుమార్, యామల కృష్ణ, బొచ్చా శశిభూషణ్రావు, కాకర రవితేజ, కూసి కొండబాబు, నెల్లి సూరిబాబు, నూకరాజు, కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవారి ఆలయాల్లో చోరీ
నందిగాం : నరేంద్రపురంలోని రెయ్యిబోడెమ్మ, భూలోకమాత అమ్మవారి ఆలయాల్లో సోమవారం రాత్రి పూజా సామగ్రి చోరీకి గురైంది. ఈ ఏడాది మార్చి 9న గ్రామ శివారులో గ్రామదేవతల ఆలయాలకు ప్రతిష్టాపన చేశారు. నిత్య పూజలకు అవసరమైన వెండి, ఇత్తడి సామాన్లు సమకూర్చుకున్నారు. సోమవారం సాయంత్రం పూజ కార్యక్రమాలు పూర్తయ్యాక తలుపులు వేసి గ్రామస్తులు వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం వచ్చి చూసే సరికి రెండు ఆలయాల్లో రెండు వెండి శఠగోపాలు, రెండు ఇత్తడి బిందెలు, నాలుగు ఇత్తడి పల్లేలు, నాలుగు దీపస్థంభాలు, రెండు గంటలు, రెండు పూలసజ్జలు చోరీకి గురయ్యాయి. హుండీలో ఉన్న డబ్బులు సైతం పట్టుకుపోయారు. గ్రామస్తులు నందిగాం పోలీసులకు సమాచారం తెలియజేయగా సిబ్బంది వచ్చి పరిశీలించారు. -
లారీ డ్రైవర్కు జైలుశిక్ష
ఎచ్చెర్ల : మద్యం మత్తులో లారీని నడుపుతూ ప్రమాదానికి కారణమైన విజయవాడకు చెందిన డ్రైవర్ నాగరాజుకు జిల్లా సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ 60 రోజుల జైలు శిక్ష విధించారు. ఎచ్చెర్ల మండలం కింతలి మిల్లు జంక్షన్ వద్ద సోమవారం అర్ధరాత్రి విజయవాడ నుంచి వస్తున్న లారీ డ్రైవర్ నాగరాజు రాంగ్రూట్లో డ్రైవ్ చేస్తూ విశాఖ నుంచి ఒడిశా వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒడిశా లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం మత్తులో లారీని నడిపిన డ్రైవర్ నాగరాజుపై కేసు నమోదుచేసి కోర్టుకు తరలించగా 60 రోజులు జైలు శిక్షను విధించారని ఎస్సై సందీప్కుమార్ మంగళవారం తెలిపారు. పోలీసుల అదుపులో నిందితురాలు మెళియాపుట్టి: పట్టుపురంలో కాంచనే అనే మహిళపై దాడి చేసి పారిపోయిన ఘటనలో అనుమానితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పాతపట్నం సీఐ వి.రామారావు తెలిపారు. పూర్తి వివరాలు బుధవారం తెలియజేస్తామన్నారు. రాత్రిపూట యూరియా అమ్మకాలా? నరసన్నపేట: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటైన సొసైటీల్లో చీకటి పడ్డాక యూరియా అమ్మకాలు చేస్తుండటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. నరసన్నపే ట సొసైటీకి మూడు రోజుల కిందట 400 బస్తా ల యూరియా వచ్చింది. ఆదివారం రైతులు అధికంగా చేరడం.. వాగ్వాదం జరగడంతో యూరియా పంపిణీ చేయలేదు. రెండో రోజు కొంత మంది రైతులకు ఒక్కో బస్తా చొప్పున ఇచ్చారు. మిగిలిన యూరియాను మంగళవారం రాత్రి విక్రయాలు చేపట్టారు. ఆటోలు, లగేజి వాహనాల్లో బస్తాలను ఇష్టానుసారంగా సరఫరా చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు ఇవ్వాల్సిన యూరియా పక్కతోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ అధికారులు పూర్తిగా పట్టించుకోకపోవడంతో సొసైటీకి వచ్చిన యూరియా పక్క దారి పట్టిందని, కావాల్సిన వారికి లెక్కకు మించి పంపిణీ చేశారని పలువురు రైతులు అంటున్నారు. ‘కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారు నేడు హాజరుకావాలి’ శ్రీకాకుళం రూరల్: గత డిసెంబర్, జనవరి నెలల్లో ఎచ్చెర్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కానిస్టేబుళ్ల ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరై సివిల్, ఏపీఎస్పీ ఉద్యోగాలకు ఎంపికై న పురుష, మహిళా అభ్యర్థులంతా ఈ నెల 20న బుధవారం శ్రీకాకుళం రూరల్ మండలం తండేంవలసలోని పోలీసు శిక్షణా కేంద్రం (ఆర్టీ ఓ కార్యాలయం దరి) ఉదయం 9 గంటలకల్లా హాజరుకావాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సెలక్షన్ ప్రక్రియలో దరఖాస్తుతో జతపర్చిన అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారితో చేయించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఇటీవలే తీయించిన మూడు పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటోలు, హాజరైన అభ్యర్థి అటస్టేషన్ ఫారం పూర్తి వివరాలతో పాటు గెజిటేడ్ అధికారితో ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని పేర్కొన్నారు. -
స్కాన్ చేస్తే ఇంటి వద్దకే విగ్రహాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజిద్దామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోస్టర్లను మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్ఓ వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి పోస్టర్లు రూపొందించామన్నారు. కాలుష్య మండలి వారు క్యూఆర్ కోడ్ను తయారు చేశారని, కోడ్ని స్కాన్ చేస్తే ఇంటి వద్దకే విగ్రహాలు అందించే ఏర్పాటు చేయనున్నామని ఆమె తెలిపారు. అలానే 26వ తేదీన సూర్యమహల్ జంక్షన్ వద్ద స్టాల్ని ఏర్పాటు చేసి విగ్రహాలు పంపిణీ చేస్తామని తెలిపారు. -
సహాయక చర్యలు వేగవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్ష నష్టాల అంచనా వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమల నివారణకు గంబూషియా చేపలు వదలాలని, నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి క్లోరిన్ టాబ్లెట్లు ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి కార్యాలయాన్ని ఈ నెల 23లోగా శుభ్రం చేసుకోవాలని స్పష్టం చేశారు. పి–4 పథకం అమలులో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలిచిందని తెలిపారు. 64,166 బంగారు కుటుంబాలకు గాను 61,552 కుటుంబాలను దత్తత తీసుకున్నామని, 1,55,804 లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో కూడా జిల్లా మంచి పురోగతి సాధించిందని కలెక్టర్ చెప్పారు. 65,569 ఫిర్యాదులకు గాను 64,074 పరిష్కరించామని, 1,365 మాత్రమే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రజాభిప్రాయ సర్వేలో విద్యుత్, ఇసుక స్టాక్ పాయింట్, ఎకై ్సజ్ శాఖలపై సానుకూల స్పందన వచ్చిందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు బి.పద్మావతి, జయదేవి, ఇతర శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.