breaking news
Srikakulam District Latest News
-
వైభవంగా ఆదిత్యుని కల్యాణం
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా స్వామి వారి కల్యాణ సేవ ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం ఉషా పద్మిని ఛాయా దేవేరులతో శ్రీవారి కల్యాణమూర్తులను అనివెట్టి మండపంలోకి తీసుకొచ్చి కల్యాణం జరిపించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీపశర్మ కల్యాణ సేవ ప్రక్రియ పూర్తి చేశారు. ఈవో ప్రసాద్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆమె నేత్రాలు సజీవం శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని ఏపీహెచ్బీ కాలనీకి చెందిన పి.సుధారాణి (65) మృతిచెందడంతో ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు పి.ఎ.ఉమామహేశ్వరరావు (రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్), కుమారుడు అప్పారావు (అడ్వకేట్), కుమార్తెలు ఎం.శ్యామల కుమారి, టి.కమలకుమారి నిర్ణయించారు. విషయాన్ని రెడ్క్రాస్కు తెలియజేయగా మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ.టెక్నీషియన్ పూతి సుజాత, చిన్నికృష్ణల ద్వారా సుధారాణి కార్నియాలు సేకరించారు. అనంతరం విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు అభినందించారు. నేత్ర దానం చేయాలనుకునేవారు 7842699321 నంబరును సంప్రదించాలని కోరారు. సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు శ్రీకాకుళం పాతబస్టాండ్: సాయుధ దళాల పతాక నిధికి విరాళాలను విరివిగా అందించి మాజీ సైనికుల సంక్షేమానికి తోడ్పాటు అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 6న సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేలిన ఫ్రిజ్ ఇచ్ఛాపురం : పట్టణంలోని ముత్యాలమ్మపేటలో డి.లక్ష్మునాయుడు ఇంట్లో సోమవారం విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా రిఫ్రిజిరేటర్ పేలింది. ఈ ఘటనలో గృహోపకరణాలు, ఇతర వస్తువులు కాలిపోయాయి. స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇంటి సామగ్రితో పాటు కుమార్తె జ్ఞానేశ్వరి కూచిపూడి, తైక్వాండోలో సాధించిన మెడల్స్ కూడా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షలు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. -
ధాన్యం కుప్పకు నిప్పు
మెళియాపుట్టి: జాడుపల్లి గ్రామంలో కలమట సూర్యనారాయణ అనే రైతుకు చెందిన అర ఎకరా ధాన్యం కుప్పకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఆదివారం అర్ధరాత్రి కుప్ప కాలిపోవడం చూసి రైతుకు గ్రామస్తులు సమాచారం అందించడంతో వెళ్లి చూసేసరికే బూడిదైపోయింది. అనంతరం పలాస అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చినా ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్బాబు తెలిపారు. ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 11 నుంచి జిల్లా యువకులకు సీసీటీవీ కెమెరా ఇన్స్టలేషన్లో 13 రోజుల ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని సంస్థ డైరెక్టర్ రామ్జీ సోమవారం తెలిపారు. శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 7993340407, 9553410809 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
తాళ్లవలసకు అధికారుల వరుస
● తాగునీరు వల్ల డయేరియా రాలేదని తేల్చిన వైనం ● కొత్తగా మరో మూడు కేసులు సంతబొమ్మాళి: తాళ్లవలస గ్రామంలో డయేరియాతో ఒక వ్యక్తి మృతి చెందడంతో సోమవారం గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామాన్ని డీఎల్పీ ఐ.వెంకటరమణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శంకర్ బాబు, డీఈ రామకృష్ణ, జిల్లా వైద్యశాఖ చెందిన వైద్యురాలు పి.సుజాత, డిప్యూటీ డీఎంహెచ్ఓ మేరీకేథరిన్ సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. ఆర్డబ్ల్యూఎస్, పీహెచ్సీ సిబ్బంది వేర్వేరుగా తాగునీరు తీసుకుని టెస్టులు చేశారు. రెండు టెస్టుల్లో కూడా నెగిటివ్గా వచ్చిందని తేల్చారు. నీటి వల్ల డయేరియా రాలేదని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యులకు మందు జాగ్రత్తగా మందులను పంపిణీ చేశారు. డయేరియా అదుపులోకి వచ్చేంత వరకు గ్రామంలో మెడికల్ క్యాంపు కొనసాగుతుందని వైద్యాధికారులు తెలిపారు. పీహెచ్సీ సిబ్బందిపై మండిపాటు దండుగోపాలపురం ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వంపై జిల్లా వైద్యాశాఖకు చెందిన పి.సుజాత మండిపడ్డారు. గ్రామాల్లో ఇంత జరుగుతుంటే సమాచారం ఇవ్వరా అంటూ మందలించారు. ఏఎన్ఎం రాధమ్మ, ఆశఽ కార్యకర్త కల్యాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్గా లేకపోతే గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందంటూ ప్రశ్నించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని పీహెచ్సీ డాక్టర్ గంగాధర్ విశ్వనాథంను ఆదేశించారు. రోస్టర్ చాట్ వేయకపోవడం, రిపోర్ట్ ఇవ్వడంతో తీవ్రమైన జాప్యం, ఫోన్లో సకాలంలో స్పందించకపోవడంపై ఎంపీహెచ్ఓ నాగేశ్వరరావు పై మండిపడ్డారు. ఉన్నతాధికారులు వస్తున్నారని తెలిసి కూడా యూనిఫారం వేయపోతే ఎలా అంటూ హెచ్వీ కామేశ్వరిని మందిలించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను సేకరించారు. మరో మూడు కేసులు తాళ్లవలసలో సోమవారం మరో మూడు కేసులు నమోదయ్యాయి. గొల్లపల్లి జగన్నాథరావు, మార్పు అఖిల, వల్లభ తిరుపతిరావు వాంతులు, విరేచనాలతో టెక్కలి జిల్లా పరిషత్లో చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రాథమిక వైద్యం చేసి 108 సహాయంలో తరలించారు. తాగునీరు వల్ల వాంతులు విరేచనాలు కాకపోతే దేని వల్ల వస్తుందో అధికారులే తేల్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాధితులకు తిలక్ పరామర్శ టెక్కలి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ సోమవారం పరామర్శించారు. పూర్తి స్థాయిలో కోలుకునే విధంగా మెరుగైన వైద్యం అందజేయాలని కోరారు. అలాగే తాళ్లవలస గ్రామంలో డయేరియా వ్యాప్తికి గల కారణాలు తెలుసుకుని వ్యాప్తి లేకుండా గ్రామంలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని తిలక్ పేర్కొన్నారు. ఆయనతో పాటు నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, కోటబొమ్మాళి జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, నాయకులు కురమాన బాలకృష్ణ, సత్తారు సత్యం, చిన్ని జోగారావు, బి.రాజేష్ ఉన్నారు. డీఎంహెచ్ఓ ఆరా విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత తాళ్లవలస గ్రామంలో సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి వైద్యసిబ్బందికి తగు సూచనలు అందించారు. -
కలెక్టర్ గ్రీవెన్స్కు 124 అర్జీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్తో కలిసి 124 అర్జీలు స్వీకరించారు. డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్, పలాస ఎయిర్పోర్ట్ ప్రత్యేకాధికారి ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ● గార మండలం శ్రీకూర్మం, మత్స్యలేశంతోపాటు ఆరు గ్రామాల వన సంరక్షణ సమితి పరిధిలో 500 ఎకరాల భూమి ఉందని, ఈ స్థలాన్ని అదాని కంపెనీకి ప్రభుత్వం అప్పగించిందని, ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు విన్నవించారు. స్థానికులకు సమాచారం లేకుండా, ఇటువంటి కేటాయింపులు చేయడం సరికాదని, దీనిపై ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు జెడ్పీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడారు. ● నగరంలోని రాజీవ్ గృహకల్ప, వాంబే కాలనీల నిర్మాణం చేసి చాలా కాలం అయ్యిందని, నిర్వహణ లేక, మరమ్మతులు చేయక శిథిలావస్థకు చేరాయని, తక్షణమే మరమ్మతులు చేయించాలని కాలనీవాసులు కోరారు. -
అసంపూర్తి భవనాలకు నిధులు మంజూరు
కంచిలి : కంచిలిలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ.65 లక్షలు నిధులు మంజూరుకు తక్షణమే జీఓ జారీ చేస్తున్నట్లు రాష్ట్ర గురుకుల సొసైటీ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్కుమార్ వెల్లడించారు. సోమవారం కంచిలి గురుకులంలో ఆయన పర్యటించారు. ఇక్కడి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘చలించదా..?’ అనే శీర్షికన నవంబర్ 21న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించారు. ఇప్పటికే పలువురు అధికారులు పర్యటించి ఆరా తీశారు. తాజాగా నాబార్డు భవనాలు పూర్తి చేయడానికి రూ.35లక్షలు, నాడు–నేడు భవనాలను పూర్తి చేయడానికి రూ.30లక్షలు మంజూరుకు అంచనాలు రూపొందించాలని ఇంజినీరింగ్ శాఖకు ఆదేశించారు. పాడైన డార్మిటరీ స్థానంలో కొత్త డార్మిటరీ నిర్మాణానికి రూ.4.5 కోట్లతో ఎస్టిమేషన్ తయారుచేసి పంపించాలని గురుకుల ప్రిన్సిపాల్ పి.శ్రీనివారావును ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గురుకులాల సమన్వయాధికారి వై.యశోద లక్ష్మి, సిబ్బంది ఉన్నారు. -
ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాదాపుగా అన్నీ టీడీపీ కార్యకర్తలు, వారి ఏజెన్సీలకే ఇవ్వడం వల్ల వారంతా దళారులుగా మారి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని, అటువంటి ఏజెన్సీలను మార్చాలని ఆమదాలవలస వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు కలెక్టర్ గ్రీవెన్స్లో వినతిపత్రం అందించారు. సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు, ఆమదాలవలస మండలాల్లో రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధర రావడం లేదన్నారు. పొందూరు మండలంలోని రాపాక, కృష్ణాపురం వంటి ప్రాంతాల్లో అక్రమ క్వారీలు నిలుపుదల చేయాలని కోరారు. బూర్జ మండలం లక్కపురంలో ఆశా కార్యకర్త పోస్టు అక్రమ భర్తీని అడ్డుకోవాలన్నారు. సరుబుజ్జిలి మండలం పెద్దసవలాపురం సచివాలయంలో పాత స్థలంలోనే కొనసాగించాలని కోరారు. మహిళలకు ఉపాధి శిక్షణ ఎచ్చెర్ల : మండల కేంద్రం ఎచ్చెర్లలోని ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిత కేంద్రం (మహిళా ప్రాంగణం)లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి (ఎపీఎస్ఎస్డీసీ–గుంటూరు) సౌజన్యంతో 18 నుంచి 45 ఏళ్ల మహిళలకు పలు ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ జిల్లా మేనేజర్ రబీకాసామ్యూల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్(60 రోజులు), హ్యండ్ ఎంబ్రాయిడర్(45 రోజులు) కోర్సులకు 8వ తరగతి, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు(90 రోజులు)కు పదో తరగతి చదివి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగల మహిళలు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని, వివరాలకు 8309548067 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు మడపాం విద్యార్థిని
నరసన్నపేట: మడపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని జి.లోకేశ్వరి స్కూల్ గేమ్స్ కబడ్డీ విభాగంలో జాతీ య స్థాయికి ఎంపికై ంది. రాష్ట్ర స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపింది. జనవరి నెలలో విజయవాడలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఏపీ కబడ్డీ టీమ్కు ఎంపికైంది. ఈ మేరకు స్కూల్ హెచ్ఎం యు.భారతి, పీడీ బీ. లక్ష్మణరావు తెలిపారు. అండర్ 14 విభాగంలో జిల్లా కబడ్డీ జట్టుకు కెప్టెన్గా లోకేశ్వరి వ్యవహరించందన్నారు. ‘చంద్రబాబు రైతు ద్రోహి’ సారవకోట: చంద్రబాబు నాయుడు రైతు ద్రోహి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. సోమవారం ఆయన మండలంలోని అలుదు వీబీఆర్ కల్యాణ మండపంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నట్టేట ముంచేసిందన్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకపోవడంతో రై తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మిర్చి, పొగాకు, టమాటా, అరటి తదితర పంటలను రైతులు పండించి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులే నాశనం చేసుకునే దుస్థితి దాపురించిందని తెలిపారు. రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలను ఇప్పటి ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ పరం చేసేందుకు సన్నాహాలు చేస్తుందని, దీని కోసం పార్టీ తరఫున కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామని, దీని ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. 5న ‘మెగా పీటీఎం 3.0’ శ్రీకాకుళం పాతబస్టాండ్: మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్–3.0ను ఈ నెల 5న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తరఫున తల్లిదండ్రులు హాజరై పిల్లల భవిష్యత్తుపై ఉపాధ్యాయులతో ముఖాముఖి చర్చించాలన్నారు. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలు, కళాశాలల్లో ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పారు. -
సెగ తగిలింది మాట మారింది
● మాట మార్చిన ఆమదాలవలస ఎమ్మెల్యే ● ఉద్ధృతమైన పవర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమం ● ఎమ్మెల్యే కూన రవికుమార్ను నిలదీసిన ఆదివాసీలు ● ఊహించని విధంగా నిలదీయడంతో తన ప్రమేయమేదీ లేదని దాటవేత సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆమదాలవలస నియోజకవర్గం వెనకబడిన ప్రాంతం. ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది నా ఆశయం దాని కోసం థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నాను. గడిచిన శాసన సభ్యునిగా ఎన్నికై న దగ్గరి నుంచి నా కోరిక ఇది. అసలు పొల్యూషన్ ఎక్కడ ఉండదు. అన్నిచోట్లా ఉంటుంది. కానీ జాగ్రత్తలు తీసుకుని ప్లాంట్ ఏర్పాటు చేసేలా చూస్తాం. స్యూటిబులిటీ కోసం పరిశీలన జరిగింది. అంతా ఓకే అయితే ప్లాంట్ ఏర్పాటు చేసి తీరుతాను. ఎవరు అడ్డుకున్నా ఆగదు. – ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తరుచూ చెప్పె మాటలివి. వెనుకబడిన ఆమదాలవలస నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యమని ఎన్నో సార్లు కూన చెప్పారు. అసలక్కడ గిరిజనులు ఎక్కడున్నారని అన్నారు. ఆ ప్రాంతంలో సాగు ఎక్కడన్నారు. కాలుష్యానికి తావే లేదని కూడా చాలాసార్లు చెప్పారు. వీటిలో చాలా వాటికి వీడియోలు కూడా ఉన్నాయి. కానీ ఆయన ఇప్పుడొక్కసారిగా మాట మార్చేశారు. సోమవారం పింఛన్లు పంపిణీ చేద్దామని వెళ్లేసరికి అక్కడ గిరిజనులంతా పవర్ ప్లాంట్ నిర్మాణం నిలుపుదల చేస్తే తప్ప పింఛన్లు తీసుకోమని మొండికేసి నిలదీయడంతో తప్పించుకున్న వాడు ధన్యుడు సుమతి అన్నట్టు తానేమీ ప్రతిపాదించలేదని తప్పించుకున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించి మా పొట్టలు కొట్టొద్దని నిలదీసేసరికి ఆ ప్రతిపాదన తనది కాదని ప్రభుత్వంపై తోసేశారు. ప్రభుత్వం ఒకటి, తానొకటి అన్నట్టుగా సమర్థించుకున్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలన్నీ తప్పు అనేలా తేల్చి పారేశారు. జిల్లాలో కూన రవికుమార్ వైఖరి చాలా వివాదాస్పదంగా మారుతోంది. కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ వేధింపుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకు దారితీసింది. ఇసుక అక్రమాలు, ఆయన అనుచరుల దౌర్జన్యం రాష్ట్ర స్థాయిలో సంచలనమైంది. తాజాగా మద్యం కల్తీ చేసిన షాపు యజమాని ఆయన అనుచరుడు కావడంతో చర్చనీయాంశమైంది. చివరికి జెడ్పీలో మంత్రులను, అధికారుల నిలదీసే విధంగా మాట్లాడిన వ్యవహారం రచ్చకు దారితీసింది. ప్రభుత్వ ఉద్యోగులపై నోరు పారేసుకోవడం, పరుషంగా మాట్లాడటం, అక్రమాల్లో ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయంపై ఆరోపణలు రావడం, భూముల ఆక్రమణలో ఆయనపై విమర్శలు రావడం, ఇలా ప్రతీది ఆయన చుట్టూ జరుగుతోంది. చివరికి ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో ఏర్పాటు చేయబోతున్న థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలోను టార్గెట్ అయ్యారు. దానికంతటికీ పవర్ ప్లాంట్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం. తాడోపేడో తేల్చుకునే పనిలో బాధితులు ఆందోళనలు చేస్తున్నా, నిరసన స్వరం విన్పిస్తున్నా ప్రభుత్వం లెక్క చేయకుండా రహస్య సర్వేలు చేయడంతో బాధితులు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వంతో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. గతంలో థర్మల్ పవర్ ప్లాంట్కు సానుకూలంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్ ముందు నిరసనకు దిగారు. తీవ్ర నిరసన స్వరం వినిపించారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు వచ్చిన ఆయన్ని గిరిజనులంతా నిలదీశారు. ఇందులో తన తప్పేమీ లేదని నచ్చ చెప్పుకోవాల్సి వచ్చింది. థర్మల్ రద్దు చేశాకే రండి.. బూర్జ, సరుబుజ్జిలి మండలాల పరిధిలోని అన్నంపేట, బొడ్లపాడు, జంగాలపాడు, మసానపుట్టి, జేవీ పురం, బసిమామిడివలస, వెన్నెలవలస గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దీంతో అన్నిచోట్లా గిరిజనులు ఎమ్మెల్యేను అడ్డుకుని నిలదీశారు. తమ భూములు, తమ బతుకులు లాక్కుని పింఛన్ల పంపిణీ కోసం మా గ్రామాలకు ఎలా వచ్చారని ఎమ్మెల్యేను ప్రశ్నించి పింఛన్లు తీసుకోవడానికి నిరాకరించి నిరసనలు తెలిపారు. థర్మల్ ప్లాంట్ రద్దు చేసి మాత్రమే తమ గ్రామాలకు రావాలన్నారు. భయాందోళనలో గిరిజనులు.. సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. రూ.30వేల కోట్లతో 1500 ఎకరాలకు పైగా 3200 మెగావాట్ల థర్మల్ క్రిటికల్ సూపర్ ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్ను నిర్మించాలని చూస్తోంది. సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో బొడ్లపాడు, జె.విపురం, అనంతగిరిపేట, వెన్నెలవలస 1, వెన్నెలవలస–2, గోపిదేవిపేట, మసానపుట్టి, బూర్జ మానుగూడ, జంగాలపాడులో రెండు విడతల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటైతే సుమారుగా 18 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగం జరగనుండగా, సుమారు 12టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. కోటి 40లక్షల లీటర్ల మేర హైస్పీడ్ డీజిల్ కావాల్సి ఉంటుందని ఆందోళనకారులు చెబుతున్నారు. ప్లాంట్ కోసం భూములను కోల్పోవడమే కాకుండా 20 గ్రామాల మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆందోళనలు ఉద్ధృతమవుతుంటే యు వత ఉపాధి కోసం పవర్ ప్లాంట్ పెట్టి తీరుతామని, అభివృద్ధిని అడ్డుకుంటే అంతు చూస్తామ ని పాలక పక్షం నుంచి బెదిరింపులు వస్తున్నాయి. నాడు జరిగిన సోంపేట, కాకరాపల్లి థర్మల్ ప్లాంట్లు వేరు, అక్కడ పరిస్థితులు వేరు, ప్పుడు ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ వేరు, ఇక్కడ పరిస్థితులు వేరని సమర్థిస్తూ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళనకు లోనయ్యారు. నిరసనలు తెలియజేస్తున్నారు. బహిరంగ సభలు పెట్టి తమ ఆవేదన తెలియజే శారు. నిరసన ర్యాలీలు చేస్తున్నారు. రోజురోజుకి ఉద్యమం ఉద్ధృతమవుతోంది. థర్మల్ దెబ్బ -
శోధించి.. ఛేదించిసీసీఎస్.. దొంగలపాలిట సింహస్వప్నంలా మారుతోంది. 129 కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించింది. –8లో
కంచిలి: కోసిన పంటను యంత్రాల సహాయంతో నూరుస్తున్న రైతులు వజ్రపుకొత్తూరు రూరల్: నిల్వ ఉన్న ధాన్యాన్ని పరిశీలిస్తున్న రైతు సంఘ నాయకులు రణస్థలం: తాళ్లవలసలో వరికుప్పలకు టార్పాలిన్లు కప్పుతున్న రైతులు మబ్బు పట్టిన ఆకాశం రైతు గుండెల్లో గుబులు రేపుతోంది. ప్రతి చినుకు అన్నదాతకు వణుకు పుట్టిస్తోంది. గోనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండడం, ధాన్యం కొనుగోళ్లు నత్త నడకన సాగుతుండడం, తేమ శాతం పెరుగుదలపై ఆందోళన పెరగడంతో కర్షకుడికి ఆఖరికి దళారీలే దిక్కుగా మారుతున్నారు. తక్కువ ధరకై నా ధాన్యం ఇచ్చేద్దామన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అన్నదాతను ప్రకృతి భయపెడుతోంది. పండిన పంట తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతుంటే, వర్షాలతో జాగ్రత్తగా దాచుకోండని పాలకులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రకటనలతో అధికారులు చేతులుదులుపుకుంటే.. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. పైగా తేమ శాతం 17కు మించకుండా ఆరబెట్టుకోవాలని ఉన్నతాధికారులు సెలవిస్తుండడంతో సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. పంట విక్రయించే సమయంలో వాన పడటంతో ధాన్యం తడిసి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ మండకొడిగా సాగుతుండగా దీనికి తోడు వర్షాలు తోడై ధాన్యం తడిసిపోతున్నాయి. ధాన్యంలో తేమ శాతాన్ని తగ్గించేందుకు రైతులు రోడ్లుపైన, చేల వద్ద, కళ్లాల్లోను ఆరబెట్టారు. తాజాగా వర్షా లు పడుతుండటంతో ఆరబెట్టిన ధాన్యం తడుస్తోంది. ఽకొన్నిచోట్ల ధాన్యంపై టార్పాలి న్ కవర్లు కప్పారు. కొందరు రైతులకు టార్పాలిన్లు లేకపోవడంతో అలాగే వదిలేశారు. తేమ శాతం తగ్గాలని ఆరబె ట్టేందుకు సిద్ధమవుతున్న వేళ ఆ ధాన్యం తడవడంతో గగ్గోలు పెడుతున్నారు. చెప్పేదొకటి.. కనిపించేదొకటి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యల్లేవని, రైతులకు సరిపడా సంచులు, లారీలు ఉన్నాయంటూ ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాలో కొనుగోళ్లు కనీసం జరగడం లేదు. నెమ్మదిగా సాగుతున్నాయి. లారీలు కూడా అందుబాటులో ఉండటం లేదు. దీంతో రైతులు ధాన్యం విక్రయించడానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. జిల్లాలోని రైతులకు 80 లక్షల వరకు గోనె సంచెలు కావాలి. వారం రోజుల కిందటి వరకు ఒక్క గోనె సంచి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం 40లక్షల గోనె సంచులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 12లక్షల గోనె సంచులు కొనుగోలు కేంద్రాలకు పంపించామని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఎన్ని రైతుల వద్దకు చేరాయో ఎవరికీ తెలీదు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు 264మిల్లులకు ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేసిన మిల్లులన్నీ ధాన్యం వచ్చేలోపు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలి. ఇప్పటివరకు 188మంది మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చారు. వీరిలో అత్యధికం మూడు నాలుగు రోజుల్లో ఇచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో ఏడు వేల వరకు టార్పాలిన్లు అవసరం ఉండగా, గత ఏడాదికి చెందిన 3వేల టార్పాలిన్లతో పాటు మరో 1200 టార్పాలిన్లు సిద్ధం చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇవి కూడా రైతుల వద్దకు వెళ్లలేదు. కేంద్రాల్లో ఉన్నాయని చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. నరసన్నపేట: పోతయ్యవలస కూడలి వద్ద రోడ్డుపై ఉన్న ధాన్యం నిల్వలను పరిశీలిస్తున్న రైతు (ఇన్సెట్లో) దేవాది సర్వీసు రోడ్డులో తడిచిన ధాన్యాన్ని చూపుతున్న రైతు గతంలో ఇలా.. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ముందుకు రావడం లేదు. క్షేత్రస్థాయికి వెళ్లి రైతులతో ఎవరూ మాట్లాడలేదు. గత ప్రభుత్వంలో వర్షాలు వచ్చినప్పుడు ప్రభుత్వమే నేరుగా రైతుల వద్దకు వెళ్లి, అక్కడికక్కడే ఆన్లైన్ చేసి, ట్రక్షీట్ జనరేట్ చేసి కొనుగోలు చేసేది. రైతులకు నష్టమనే మాట ఉండేది కాదు. కానీ చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. వర్షాలకు భద్రంగా దాచుకోవాలన్న సూచనలు తప్ప రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వంపై నమ్మకం లేక, వర్షాలకు పంటను కాపాడుకోలేక దళారులకు తక్కువ ధరకు విక్రయించుకోక తప్పడం లేదు. నెమ్మదిగా కొనుగోళ్లు జిల్లాలో 406 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా సోమవారం ఉదయానికి 230 కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెరిచారు. వర్షాల నేపథ్యంలో సాయంత్రానికి మరో 73 కేంద్రాలు తెరిచారు. అక్టోబర్కే చాలా చోట్ల కోతలు జరిగి, ధాన్యం విక్రయానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కొనుగోళ్లు చేయలేదు. అక్టోబర్ 13న పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లాకొచ్చి సమీక్ష నిర్వహించి, తక్షణమే కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ, ఆయన చెప్పిన మాటలు దాదాపు 50 రోజులు దాటినా కార్యరూపం దాల్చలేదు. మొత్తానికి రైతుల వద్ద 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో ఉండగా, ప్రభుత్వం లక్ష్యం 6.50లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇంతవరకు 48,905మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అవస్థలు పడుతున్న అన్నదాతలు భయాందోళనకు గురి చేస్తున్న వర్షాలు ధాన్యం దాచుకోవడానికి నానా కష్టాలు సర్కారు నిర్లక్ష్యంతో నెమ్మదిగా కొనుగోళ్లు తేమ శాతం పెరుగుతుందని ఆందోళన -
కలెక్టర్ గ్రీవెన్స్కు.. కలెక్టర్ గ్రీవెన్స్కు 124 వినతులు వచ్చాయి. కలెక్టర్ వినతులు స్వీకరించారు. –8లో
ఇదీ పరిస్థితిరైతులకు కావాల్సిన గోనె సంచులు 80 లక్షలు వారం క్రితం వరకు ఒక్క సంచీ ఇవ్వలేదు. ఏర్పాటు చేయాల్సిన కొనుగోలు కేంద్రాలు 406 సోమవారం నాటికి తెరిచినవి 303రైతుల వద్ద అందుబాటులో ఉన్న ధాన్యం 9 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వ లక్ష్యం 6.50లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు కొనుగోలు 48,905 మెట్రిక్ టన్నులు -
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
● జిల్లా వ్యవసాయ అధికారి కె.త్రినాథస్వామి జలుమూరు: వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, కళ్లాలకు చేరిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో కప్పుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కె.త్రినాథస్వామి అన్నారు. ఆయన సోమవారం చల్లవానిపేట, లింగాలవలస, జలుమూరులో పర్యటించి రైతులతో మాట్లాడారు. వరికుప్పల్లోకి వర్షం నీరు దిగకుండా చూసుకోవాలన్నారు. తడిచిన వాటిపై ఉప్పు ద్రావణం వేయాలన్నారు. చల్లవానిపేట మిల్లులో తనిఖీ చేసి నాణ్య త, తేమ శాతం పరిశీలించారు. కొందరు రైతులు మాట్లాడుతూ మిల్లర్లు వారి సొంత మీటర్లు ద్వారా తేమ శాతం చూస్తున్నారని ఈయన దృష్టికి తెచ్చారు. బస్తాకు అదనం ధాన్యం తీసుకుంటే చర్యలు తప్పవన్నారు. -
కనుల విందు..!
కాలు కదిపితే..ఇచ్ఛాపురం రూరల్: జానపద కళలకు పుట్టినిల్లు మన పల్లెలు. రోజంతా శారీరక శ్రమతో సాయంత్రం ఇళ్లకు చేరిన ప్రజలకు ఈ కళలే ఆట విడుపు. సాంప్రదాయ కళలుగా భావించే పండారి భజనలు, కోయ నృత్యాలు, చిడతల భజన, అంజాట, కోలాటంకు ఒకప్పుడు విశేష ఆదరణ లభించేది. మారుతున్న కాలంతో పాటు ఇవి కూడా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం క్రమేపీ వీటికి మరలా ఆదరణ పెరుగుతోంది. పండగలు, గణేష్, నవరాత్రులు, గ్రామ దేవత ఉత్సవాలు సందర్భంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుండడం, వాటికి జనాదరణ పెరుగుతుండడం శుభ పరిణామంగా భావిస్తున్నారు. ముఖ్యంగా కోలాటం నృత్యానికి ఈ మధ్య కాలంలో విశేష ఆదరణ లభిస్తోంది. పండగలు, జాతరలు వస్తే చాలు గ్రామాల్లో కోలాటం సందడి కనిపిస్తోంది. ఆధునిక పాటలకు కోలాటం నృత్యాలు తోడై కనులవిందు చేస్తున్నాయి. ఇటీవల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ నృత్యాల వైపు మహిళలతో పాటు చిన్నారులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ప్రతీ మండలంలోనూ నాలుగైదు వరకు కోలాట బృందాలు ఏర్పడుతున్నాయంటే పల్లెల్లో కోలాటానికి ఎంత ప్రాచూర్యం లభిస్తుందో ఇట్టే చెప్పవచ్చు. గురువుల వద్ద శిక్షణ సినిమాలు, ఇబ్బడిముబ్బడిగా పెరిగిన టీవీ చానెళ్లు, వాటిలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను ప్రతిరోజూ తిలకించే పల్లె వాసుల్లో ఏదో తెలియని వెలితి కనిపిస్తోంది. ప్రత్యామ్నాయంగా కనుమరుగువుతున్న కొన్ని కళలపై మక్కువ పెరిగింది. దీంతో వీటిని ప్రోత్సాహించే దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా పండగలు, అమ్మవారి ఉత్సవాలు, నందన్న ఉత్సవాలు తదితర సందర్భాల్లో కోలాటం ప్రదర్శించేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో కొంతమంది పెద్దలు సాంప్రదాయ కళలకు సానబెడుతున్నారు. కొత్త తరానికి వాటిని పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం సాయంత్రం వేళల్లో మహిళలు, బాలికలు కోలాటం నేర్చుకోవడంలో నిమగ్నమవుతున్నారు. కోలాటం గురువుల వద్ద శిక్షణ తీసుకుంటున్నారు.ఇప్పటికే నాకు వందలాది మంది బాలబాలికలకు పండారి చెక్క భజనలో శిక్షణ ఇచ్చిన అనుభవం ఉంది. ప్రస్తుతం మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా కోలాటం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత కల్పించేందుకు కంకణం కట్టుకున్నాను. ఐదేళ్లలో తొమ్మిది కోలాటం బృందాలు, పది వరకు పాండురంగ నృత్య కళా బృందాలను తయారు చేయడం జరిగింది. ఉత్సాహవంతులు నన్ను సంప్రదిస్తే వారికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. – తిప్పన ధనుంజయరెడ్డి, నంది అవార్డు గ్రహీత, టి.బరంపురం, ఇచ్ఛాపురం మండలం మా ఊర్లో మేమంతా కోలాటం నేర్చుకుంటున్నాం. కోలాటం నేర్చుకునేందుకు నా భర్తతో పాటు అత్త, మామయ్య, పిల్లలు ప్రోత్సాహిస్తున్నారు. ఇంట్లో పనులు ముగించి ప్రతిరోజూ సాయంత్రం 2 గంటల పాటు కోలాటం నేర్చుకుంటున్నాను. ఏడాది క్రితం నేర్చుకున్న మా బృందం తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధానంలో ప్రదర్శించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. – లండ సుశీల, బొడ్డఖాళి గ్రామం, ఇచ్ఛాపురం మండలం ఒకవైపు చదువుకుంటూనే ప్రతిరోజు రాత్రి సమయాల్లో మా ఊర్లో కోలాటం నేర్చుకుంటున్నాను. దేవుడి పాటలకు కోలాటం చేస్తుంటే అందరూ నన్ను ప్రశంసిస్తుంటారు. కోలాటం నేర్చుకోవడం వలన మానసిక ప్రశాంతతతో పాటు మంచి వ్యాయామం లభిస్తోంది. – దుర్గాశి హారతిరెడ్డి, హరిపురం, ఇచ్ఛాపురం మండలం -
గ్రంథాలయాలు..!
సమస్యలకు నిలయాలు..● సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ● అరకొర వసతులతో అవస్థలు ● సెస్ బకాయిలు రూ.35 కోట్లు శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో గ్రంథాలయాలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. పాఠకుల తాకిడి బాగానే ఉన్నా వసతుల లేమితో నిరుద్యోగులు వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. నిధుల లేమితో పాటు నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఇబ్బందిగా మారుతోంది. జిల్లాలో 45 గ్రంథాలయాలు, బుక్డిపో సెంటర్ల 100, విలేజ్ లైబ్రేరీలు 5 ఉన్నాయి. వీటిలో కేవలం రికార్డు అసిస్టెంట్లు ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఆఫీస్ అసిస్టెంట్లు 19 మంది ఉండాల్సి ఉండగా.. కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 104 పోస్టులకు గానూ 83 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న అన్ని గ్రంథాలయాలకూ సొంత భవనాలు ఉన్నప్పటికీ.. కొత్తూరు, కోటబొమ్మాళి లైబ్రేరీలకు మాత్రం సొంత భవనాలు లేవు. గ్రంథాలయాలకు అధికంగా దినపత్రికలు, మ్యాగజైన్లు, పోటీ పరీక్షల పుస్తకాలు చదవడానికి నిరుద్యోగ పాఠకులు వస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ అభ్యర్థులు గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. సెస్ బకాయిల పరిస్థితి గ్రంథాలయాల అభివృద్ధి కోసం ఇంటి పన్నులో 8 శాతం సెస్ను స్థానిక సంస్థలు వసూలు చేస్తుంటారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు సెస్ రూపంలో అందించాల్సిన బకాయిలు సమయానుకూలంగా జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నాయి. దీని ప్రభావం గ్రంథాలయాల అభివృద్ధిపై పరోక్షంగా పడుతోంది. పంచాయతీల నుంచి రావాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. జిల్లా గ్రంథాలయానికి దాదాపు రూ.35 కోట్ల వరకూ సెస్ బకాయిలు రావాల్సి ఉంది. 2020 నుంచి దాదాపుగా ఐదేళ్ల కాలానికి గాను ఈ సెస్ బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు పేరుకుపోవడంతో గ్రంథాలయాల నిర్వహణ మరింత భారంగా మారుతోంది. ఈ సెస్ బకాయిలు విడుదలైతే తప్ప నిర్వహణ గాడిన పడే అవకాశాలు కనిపించడం లేదు. వసతులు లేక తిప్పలు ఉదయం నుంచి గ్రంథాలయానికి అంకితం అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు సరిపడా సౌకర్యాలు ఉండడం లేదు. అలాగే మరుగుదొడ్లు సరిగా లేక యువతులు ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు కొలువు కోసం సన్నద్ధమయ్యే వారికి అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో వాటిని కొనుక్కోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రచురించే మేగజైన్లు సైతం అందుబాటులో ఉంచకపోవడంతో వారు నిరుత్సాహపడుతున్నారు. పలు సందర్భాల్లో దాతల ప్రోత్సాహంతో సమకూరుతున్న పుస్తకాలు, స్టడీ ప్యాడ్లు వంటి వాటి వలన నిరుద్యోగులకు కొంత ఊరట లభిస్తోంది. గత ఐదేళ్లుగా సెస్ బకాయిలు పేరుకుపోయాయి. సెస్ బకాయిలను చెల్లించి గ్రంథాలయాలను ఆదుకోవాలి. సెస్ బకాయిల విషయాన్ని ఈవోపీఆర్డీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. బకాయిలను సకాలంలో చెల్లించకపోవడం వలన గ్రంథాలయాల నిర్వహణ భారంగా మారుతోంది. – వీవీజీఎస్ శంకరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి(ఎఫ్ఏసీ) -
ఇద్దరు వ్యక్తులు అరెస్టు
పలాస: ద్విచక్ర వాహనాలు, ఇతర దొంగతనాలకు సంబంధించిన కేసుల్లో ఇద్దరు వ్యక్తులను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కాశీబుగ్గ ఇన్చార్జి డీఎస్పీ లక్ష్మణరావు కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో ఆదివారం వివరాలు వెల్లడించారు. అరైస్టెన వ్యక్తుల్లో ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీ దుప్పలవలస గ్రామానికి చెందిన బూషర లక్ష్మణరావు, శ్రీకాకుళం టౌను పరిధిలోని గుజరాతీపేటకు చెందిన పిండ్రాల చిన్నిలు ఉన్నారు. వీరు అక్టోబరు 4వ తేదీన కాశీబుగ్గ టౌన్లోని మోర్ సూపర్ మార్కెట్కు ఎదురుగా పార్కింగ్ చేసిన పల్సర్ బైక్ను దొంగిలించారు. అలాగే అక్టోబర్ 12న కాశీబుగ్గ ఆంధ్రాబ్యాంకు వీధిలో ఒక ఇంటి వరండాలో ఉన్న మరో పల్సర్ బైక్ను కూడా దొంగలించి పట్టుకుపోయారు. అక్టోబరు 15న కాశీబుగ్గ టౌన్ చిన్న తిరుపతి ఆలయం వద్ద పార్కింగ్ చేసిన మరో ద్విచక్ర వాహనాన్ని దొంగలించారు. అలాగే కాశీబుగ్గలోని అన్నా క్యాంటిన్ వద్దనున్న స్కూటీని కూడా కొట్టేశారు. అదేవిధంగా శ్రీకాకుళం, బొబ్బిలి ప్రాంతాల్లో కూడా పలు దొంగతనాల కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని డీఎస్పీ వెల్లడించారు. కాశీబుగ్గలో దొంగలించిన ఒక బైక్లో పలాస నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తుండగా కాశీబుగ్గ పోలీసు వారిని గుర్తించి పట్టుకొని అరెస్టు చేశారన్నారు. వారు దొంగిలించిన బైకులను, 3 సెల్ఫోన్లను రికవరీ చేశామన్నారు. వీరిని అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. సమావేశంలో కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
సారవకోట: మండలంలోని చిన్నగుజ్జువాడ గ్రామానికి సమీపంలో ఆదివారం ట్రాక్టర్ బోల్తాపడి అలుదు గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బల్లా లక్ష్మణరావు (33) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేళవలస నుంచి సారవకోట మీదుగా కొమ్ముసరియాపల్లి వైపు వెళ్తున్న ట్రాక్టర్ గ్రామానికి సమీపంలో ఉన్న మలుపు దగ్గర అదుపు తప్పి పక్కనే ఉన్న పొలంలో పడిపోయింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ క్రింద ఉండి మృతి చెందాడు. స్ధానికులు స్పందించి ట్రాక్టర్ను తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ అనిల్కుమార్ పరిశీలించి శవ పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం తరలించారు. మృతుడికి భార్య నీలవేణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పడవ బోల్తాపడి మత్స్యకారుడు మృతి శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పక్కలపేట గ్రామానికి చెందిన గనగళ్ల తోటయ్య (57) చేపల వేటకు వెళ్లి ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సముద్రంలో వేట చేస్తుండగా ఒక్కసారిగా తెప్ప బోల్తా పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లావేరులో పురిల్లు దగ్ధం
రణస్థలం: లావేరు గ్రామానికి చెందిన నడుపూరి ఏసురత్నం పురిల్లు అదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. వెంటనే గుర్తించిన బాధితులు రణస్థలం అగ్నిమాపక వాహనానికి సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిళ్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గురువు శ్రీకాకుళం: నగరంలోని దాసరి క్రాంతి భవన్లో ఎస్వీ రమణమూర్తి అధ్యక్షతన ఎస్టీయూ వార్షిక కౌన్సిల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. జిల్లా అధ్యక్షుడిగా పేడాడ ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శిగా గురువు శ్రీనివాసరావు, ఆర్థిక కార్యదర్శిగా కంచరాన తేజేశ్వరరావులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి డి.శ్యామ్ వ్యవహరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడిచినా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని వాపోయారు. అనంతరం సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని, 12వ పీఆర్సీ వెంటనే ప్రకటించాలని తీర్మానించారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీకాకుళం క్రైమ్: కోటబొమ్మాళిలోని ఎత్తురాళ్లపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్కు చెందిన నలుగురు మృత్యువాత పడినప్పటికీ ఇటు పోలీసులు తీరుగానీ, అటు వాహనదారుల తీరుగానీ మారడం లేదు. ఎప్పటిలాగే రోడ్లపైనే గంటల తరబడి వాహనాలు నిలిపివేస్తున్నారు. ఎత్తురాళ్లపాడు ఘటన జరిగాక కూడా జిల్లాలో ప్రమాదాలు పెరిగాయి. ఆమదాలవలస ఫ్లై ఓవర్ వంతెన వద్ద కొబ్బరికాయల లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం ప్రమాదంలో కొడుకు ముందే కన్నతల్లి మృత్యువాత పడింది. పలాస మండలం గరుడఖండి పాత జాతీయ రహదారిపై ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కవిటి మండలం ఆర్.కరాపాడు టోల్గేట్ వద్ద దాబాలో పనిచేస్తున్న వ్యక్తిని భారీ వాహనం ఢీకొట్టి మృత్యువాత పడ్డాడు. కేవలం నవంబర్ నెలలోనే 16 మందికి పైగా చనిపోయారు. ఈ పరిస్థితుల్లో రోడ్లపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఈ మేరకు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థులకు హిందీపై అభిరుచి పెరగాలి శ్రీకాకుళం: విద్యార్థులకు హిందీ సబ్జెక్టుపై అభిరుచి పెంచేందుకు హిందీ ప్రతిభా పరీక్షలను నిర్వహిస్తున్నామని హిందీ మంచ్ గౌరవాధ్యక్షుడు దొంతం పార్వతీశం అన్నారు. శ్రీకాకుళంలో 80 ఫీట్ రోడ్లోని బీకేఎస్ జూనియర్ కళాశాలలో హిందీ మంచ్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ హిందీ సిలబస్పై హిందీ సేవా సదన్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందీ ప్రతిభా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభా పరీక్షలను నిర్వహించి, విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు, పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయి టాపర్స్కు మెడల్స్, నగదు బహుమతులను ప్రదానం చేయనున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో విశేష ప్రతిభ కనబరిచిన టాపర్స్కు హిందీ ప్రతిభా రత్న అవార్డుతో సన్మానం చేయనున్నట్లు తెలిపారు. టాలెంట్ టెస్ట్కు ఉత్తరాంధ్ర జిల్లాల సంయోజక్గా కోనే శ్రీధర్ను నియమించామన్నారు. సమావేశంలో కె.సత్యం, ఆర్.రామారావు, ఎస్.రాధ తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
మెళియాపుట్టి: ఎవరూ లేని సమయం చూసి తాళాలు వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన సంఘటన ఆదివారం పెద్దమడి గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు జినగ చంద్రావతి గ్రామంలోని తన ఇంటి ముందు చిన్న పాన్షాప్ పెట్టుకుని జీవిస్తోంది. ఈమె భర్త చాలాక్రితం మృతి చెందారు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు అవ్వడంతో శ్రీకాకుళంలో నివాసముంటున్నారు. చంద్రావతి పెట్టుకున్న పాన్షాప్లో వ్యాపారం సరిగాలేక పదిరోజుల క్రితం శ్రీకాకుళం వెళ్లింది. ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే గేట్కు వేసిన తాళాలు వేసినట్లే ఉండి.. ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోని బీరువా తెరిచి రూ.5000ల నగదు, రెండు జతల చెవి పోగులు, పుస్తెలు దొంగలు దోచుకెళ్లారు. వెంటనే ఆమె మెళియాపుట్టి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఇంటిని పరిశీలించారు. -
తెలుగు సాహిత్యానికి వెలుగు జాడ గురజాడ
శ్రీకాకుళం కల్చరల్: తెలుగు సాహిత్యానికి వెలుగు జాడ గురజాడ అప్పారావు అని ప్రజా సాహితీ సంపాదకుడు పీఎస్ నాగరాజు అన్నారు. శ్రీకాకుళం నగరంలో జన సాహితీ ఆధ్వర్యంలో చావలి శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన గురజాడ అప్పారావు వర్ధంతి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలుగు భాష, తెలుగు ప్రజలు ఉన్నంతకాలం ఆయన రచనలు సజీవంగా ఉంటాయని పేర్కొన్నారు. జన సాహితీ సభ్యుడు కె.బాలకృష్ణ గురజాడ రాసిన దేశభక్తి గేయం దేశమును ప్రేమించుమన్నా గేయాన్ని రాగయుక్తంగా ఆలపించారు. జనసాహితీ సభ్యుడు ఎల్.నరేష్ గురజాడ తాత్వికతపై మాట్లాడారు. పదాలు మళ్లీ ఊపందుకున్నాయి అనే అల కవితను పూజారి సూర్యనారాయణ ఆలపించారు. గురజాడ రచనల నేపథ్యంలో వర్తమాన కాల పరిస్థితులను ఎస్.భాస్కరరావు వివరించారు. జనసాహితీ జిల్లా కార్యదర్శి పి.మోహనరావు కళా అభిరుచి అనే అంశంపై మధురవాణి పాత్రను విశ్లేషణ చేశారు. గురజాడ అప్పారావు మరణించిన సందర్భంలో అతని కుమారునికి గిడుగు రామ్మూర్తి రాసిన లేఖను తమ్మినేని సూర్యనారాయణ చదివి వినిపించారు. సమావేశంలో సాహిత్య అభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం
శ్రీకాకుళం అర్బన్: నగరంలోని ఏపీ ఎన్జీవో కార్యాలయంలో ఏపీ హియరింగ్ హ్యాండీక్యాప్డ్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవంగా ఆదివారం జరిగింది. ఈ ఎన్నికలకు ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా కోశాధికారి బడగల పూర్ణచంద్రరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా.. సైన్ లాంగ్వేజ్ ఇంటర్ర్పిటర్ నర్మజ సహకారం అందించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఉద్యోగస్తులంతా సంఘటితంగా ఉండి సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. సంఘ ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. నూతన కార్యవర్గం ఏపీహెచ్హెచ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా యు.ప్రసాద్ (సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్), కార్యదర్శిగా జి.రవిశంకర్ నాగ్ (రిమ్స్ శ్రీకాకుళం), ఉపాధ్యక్షులుగా ఎ.అశోక్ కుమార్ (ఓఎస్ బీసీ వెల్ఫేర్), జి.శ్రీనివాసరావు (ఓఎస్ ఐసీడీసీ శ్రీకాకుళం), ఆర్గనైజేషన్ సెక్రటరీగా కె.తరుణ్ కుమార్ (టైపిస్ట్ కలెక్టరేట్ శ్రీకాకుళం), కోశాధికారిగా ఎస్.సాయికృష్ణ (టైపిస్ట్ ఎంపీడీవో కార్యాలయం ఎల్ఎన్పేట), జాయింట్ సెక్రటరీగా కె.వి.గౌతమ్ (పీఎస్వీఐ డిజిటల్ అసిస్టెంట్ గ్రామ పంచాయతీ టెక్కలి), ఉమెన్ సెక్రటరీగా ఎన్.దివ్యశ్రీ (ఎల్డీసీ, పీహెచ్సీ ఆమదాలవలస), ఎగ్జిక్యూటివ్ ఈసీ మెంబర్ ఉమెన్ జి.లక్ష్మి(కుక్, గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ శ్రీకాకుళం), ఈసీ మెంబర్1, 2గా ఎ.త్రినాథరావు (ఆఫీస్ సబార్డినేట్, కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ ఆమదాలవలస), ఎం.బాలరాజు (ఓఎస్ ఎంపీడీవో ఆఫీస్ సారవకోట) ఎంపికయ్యారు. -
యువ కళాకారుడి హత్య దారుణం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): గంజాయి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వివిధ కళారూపాలతో ప్రజలను చైతన్య పరుస్తున్న యువ కళాకారుడు పెంచలయ్యను హత్య చేయడం దారుణమని సాంస్కృతిక ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో అంబేడ్కర్ కూడలి వద్ద ఆదివారం ఆయన మృతికి నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి ముఠా ఒక పథకం ప్రకారం ప్రజా నాట్యమండలి కళాకారుడు, డీవైఎఫ్ఐ మాజీ నాయకుడిని హత్య చేశాయన్నారు. హత్య కారకులను గుర్తించి, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో ఇటీవల కాలంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి సంస్కృతికి వ్యతిరేకంగా ఆయన ప్రజలను చైతన్య పరచడానికి అనేక కళారూపాలను రూపొందించి ప్రదర్శించాడు. పోలీస్ శాఖ సహకారంతో కూడా కొన్ని కార్యక్రమాలు చేశాడు. గంజాయి మానడంటూ స్థానికంగా ప్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారని, ఇది స్థానిక గంజాయి ముఠాకు ఏమాత్రం నచ్చలేదన్నారు. దీంతో కొంతకాలంగా ఆయన కదలికలపై నిఘా వేసి హత్య చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్య ముఠాలను పసిగట్టి నివారించడంలో వైఫల్యం చెందిందని, పోలీసు నిఘా వ్యవస్థకు ఉద్యమాలను అణచివేయడంపై ఉన్న శ్రద్ధ మాదక ద్రవ్యాల ముఠాలను నిర్మూలించడంలో లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు బి.కృష్ణమూర్తి, పి.తేజేశ్వరావు, కె.నాగమణి, పి.ప్రసాదరావు, ఎ.లక్ష్మి, ఆర్.ప్రకాశరావు, ఎం.గోవర్దనరావు, ఎ.సత్యం, ఎం.ఆదినారాయణమూర్తి, ఎన్.రమణ, పి.ఖగేష్, పి.సుధాకర్, కేధారేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకూర్మనాథాలయ ఈఓగా వాసుదేవరావు
గార: ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మం శ్రీకూర్మనాథాలయ ఆలయ కార్యనిర్వహణాధికారిగా తలగాన వాసుదేవరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. పాతపట్నం నీలమణిదుర్గ ఆలయం, స్థానిక మూడు దేవాలయాల ఈఓ గా, మెళియాపుట్టి రాధాగోవిందస్వామి ఆలయం ఈఓగా పనిచేస్తూనే అదనంగా ఇక్కడ ఈఓ బాధ్యతలను దేవదాయ ధర్మాదాయశాఖ అప్పగించింది. ఇప్పటివరకు పనిచేసిన కోట నరసింహనాయుడు బదిలీపై మాతృశాఖ అయిన రాష్ట్ర పురావస్తుశాఖకు వెళ్లారు. ‘ఉద్యోగోన్నతి పొందకుండా మిగిలిపోయాం’ శ్రీకాకుళం పాతబస్టాండ్ : గడిచిన 13 ఏళ్లుగా ఉద్యోగోన్నతి పొందని వీఆర్వోల బ్యాచ్లుగా 2012, 2014 బ్యాచ్లు మిగిలిపోయాయని ఇది చాలా బాధాకరమని ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంస్థ వీఆర్వో అసోసియేషన్ అధ్యక్షులు డబ్బీరు రాజేష్కుమార్ అన్నారు. ఆదివారం అసోసియేషన్ సభ్యులతో నగరంలో సమావేశం నిర్వహించారు. 90 మంది వీఆర్వోలు సీనియర్ అసిస్టెంట్ స్కేల్ దాటారని, ఉద్యోగోన్నతి వన్టైం సెటిల్మెంట్గా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆర్థికభారం ఉండదని, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉండదన్నారు. ఇంద్ర ఏసీ బస్సు చార్జీలు తగ్గింపు శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం నుంచి విజయవాడ మార్గంలో తిరిగే ఇంద్రా ఎ/సి బస్సు చార్జీలు తగ్గింపును డిసెంబరు నెల 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ తెలిపారు. శ్రీకాకుళం–విజయవాడ మార్గంలో నడిపే ఇంద్రా ఎ/సి బస్సుల చార్జీలు 20 శాతం మేర తగ్గించినట్లు పేర్కొన్నారు. ఈ తగ్గింపు 1 డిసెంబరు నుంచి 31 డిసెంబరు వరకు అమ లులో ఉంటుందన్నారు. ప్రస్తుత చార్జీ రూ. 928 నుంచి కొత్తగా నిర్ణయించిన ధర రూ.743 అవుతుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి ప్రతి రోజు సాయంత్రం 6గంటలకు (సర్వీసు నంబర్ 2967), విజయవాడ నుంచి ప్రతి రోజు రాత్రి 7.15 గంటలకు (2968) బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. దూరప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీసుల వలయంలో చెల్లూరి నారాయణ..? ● సోషల్ మీడియా ప్రచారంతో ఉలిక్కిపడిన ఉద్దానం వజ్రపుకొత్తూరు రూరల్: బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు చెల్లూరి నారాయణ అలియాస్ సురేష్ పోలీసులు వలయంలో ఉన్నట్లు వస్తున్న వార్తలతో ఉద్దానం మరో మారు ఉలిక్కిపడింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మావోయిస్టు పార్టీ ఏఓబీ కార్యదర్శిగా చెల్లూరి నారాయణ వ్యవహరిస్తున్నారు. 1989లో మా వోయిస్టుగా చేరినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నారాయణరావుపై ప్రభుత్వం రూ. 20 లక్షల రివార్డు సైతం ప్రకటించింది. అయితే కేంద్ర హోంశాఖ అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్లో భాగంగా గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఆంధ్రా–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో నారాయణ రావు కేంద్ర బలగాల చేతికి చిక్కినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే శనివారం రాత్రి, ఆదివారం ఉదయం ఇంటెలిజెన్స్, పోలీసులు బాతుపురం వచ్చి గ్రామ పెద్దలు, నారాయణరావు కుటుంబ సభ్యులతో మాట్లాడి నారాయణరావును సరెండర్ చేయాలని కోరినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన మె ట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు నారాయణరావు ఎక్కడ ఎలా ఉన్నాడోననే చర్చ జోరుగా సాగుతోంది. -
వణుకుతున్న తాళ్లవలస
● గ్రామంలో ప్రబలుతున్న డయేరియా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా ప్రబలుతోంది. ఊరిలో 800 మంది జనాభా ఉన్నారు. పారిశుద్ధ్య లోపం, తాగునీరు కలుషితం కావడం వల్ల డయేరియా వ్యాప్తి చెందిందని స్థానికులు చెబుతున్నారు. సమీప పొలాల్లోని బావి వద్ద నుంచి మోటార్లతో గ్రామంలోని ఇళ్ల వద్దకు పైపులైన్లు ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఆ నీటిని తాగి ఆదివారం గ్రామంలో చాలా మంది వాంతులు, విరేచనాలతో టెక్కలి జిల్లా ఆస్ప త్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మార్పు చిన్నారావు(65)అనే వ్యక్తి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గున్మ రుద్రమ్మ, సీపాన కొండయ్య చికిత్స పొందుతుండగా గున్న పాపారవు, చల్ల రాములు మరికొందరు ఇళ్లకు వెళ్లిపోయారు. కారణాలివేనా..? ● గ్రామానికి సంబంధించి ఇంటింటికీ కుళాయి ఉ న్నప్పటికీ కుళాయిలకు తాగునీరు వచ్చే బోరు మా త్రం గ్రామం శివారులోని పంట పొలాల్లో ఉంది. ● ప్రస్తుతానికి పంటల సీజన్ కావడంతో పొలాలకు వాడే ఎరువులు, క్రిమిసంహారక మందులు ఆ నీటిలో కలుస్తున్నాయనే అనుమానం ఉంది. ● ఊరిలోనూ పారిశుద్ధ్య పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. ● మురుగునీటి కాలువల్లో పూడికలు తీయలేదు. పారిశుద్ధ్య కార్మికులు వారానికి రెండు రోజులు మాత్రమే వస్తున్నారు. ● ఓ వ్యక్తి చనిపోయాడని తెలిశాక వైద్య సిబ్బంది వచ్చారు. ముందస్త జాగ్రత్త చర్యలేవీ చేపట్టలేదు. టెక్కలి రూరల్ (సంతబొమ్మాళి) -
పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలి
బూర్జ: థర్మల్ విద్యుత్ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు తక్షణమే రద్దు చేయాలని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, మండల గిరిజన ఆదివాసీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో గల అన్నంపేట పంచాయతీ తిమడాం గ్రామంలో ఆదివారం థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్ దొర, కార్యదర్శి సవరసింహాచలం, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ, ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సవర లక్ష్మణరావు, సవర సింగయ్య, సవర భూగన్న, సవర మనోజ్, సవర తోటయ్య, కల్లేపల్లి సూర్యనారాయణ, కల్లేపల్లి మోహనరావు, సతివాడ బాలరాజు, కల్లేపల్లి దుర్గారావు, కల్లేపల్లి రమణ, పలువురు ఆదివాసీలు, తదితర్లు పాల్గొన్నారు. -
శిక్షల్లో కొన్ని..
మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు గణాంకాలు ఇలా.. జిల్లాలో రహదారి భద్రతను మెరుగుపర్చడం, ప్రమాదాలను తగ్గించడం, బహిరంగంగా మద్యం సేవించి పబ్లిక్ న్యూసెన్సు చేసే వారిని అరికట్టే దిశగా కఠిన చర్యలు చేపట్టినట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు 2025 ఏడాదికిగాను ఇప్పటివరకు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులకు సంబంధించి గణాంకాలను ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేశారు. 17,509 నేరారోపణ రుజువై జైలు శిక్ష పడిన కేసులు 28 వీటిల్లో 2 నెలలు ఒక కేసు, 45 రోజులు ఒక కేసు, నెల రోజులు 8 కేసులు, 20 రోజులు 4 కేసులు, 10 రోజులు 2 కేసులు, 7 రోజులు 11 కేసులు, 2 రోజులు ఒక కేసులో శిక్షలు పడ్డాయి. న్యాయస్థానం విధించిన మొత్తం జరిమానా (డిస్పోజల్)లు : జైలుకు పంపుతున్నాం.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జైలుకు పంపుతున్నాం. ఎన్ని రోజులు శిక్ష అన్నది ముద్దాయి చేసే న్యూసె న్సు, న్యాయమూర్తి విచక్షణాధికారాన్ని బట్టి ఆధార పడి ఉంటుంది. పోలీసుల ప్రమేయమేమీ ఉండదు. జిల్లాలో అన్ని చోట్లా కేసులు కడుతున్నాం. జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే ప్రయత్నంలో వాహనదారులపై కేసులు కట్టి అధికంగా చలానాలు విధిస్తున్నాం. విధుల్లో ఉన్న సిబ్బందిపై తిరగబడిన వారిపై కఠిన చర్యలుంటాయి. అలాంటివారిపై జాలి ఉండదు. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం 8,594 అన్ని కేసులకు మొత్తం జరిమానా సొమ్ము : రూ. 38,16,555 రూ. 10 వేలు జరిమానాకు గురైన కేసులు 113 అడుగుకో బెల్టు షాపు, మలుపునకో మద్యం షాపుతో ఊళ్లు నిత్యం మత్తులో జోగుతున్నాయి. సర్కారు వారి సంపద సృష్టి కోసం సామాన్యులు సమిధలైపోతున్నారు. పొద్దంతా కష్టపడి వచ్చిన కూలి డబ్బును బెల్టుషాపు గల్లా పెట్టెలో పోసి ఓ సామాన్యుడు పోలీసులకు దొరికిపోతున్నాడు. విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యంపై నుంచి దృష్టి మరల్చలేక మరో సగటు జీవి కటకటాలపాలవుతున్నాడు. పూటుగా తాగి పోలీసులకు దొరికిపోతున్న మందుబాబులు సంపాదనలో సగం డబ్బును మద్యం షాపులకు మిగిలిన డబ్బును జరిమానాలకు కట్టేసి ఇంటికి ఖాళీ జేబులు చూపిస్తున్నారు. పైగా పోలీసులతోనే తగువులకు దిగుతున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : ఇరవై ఎనిమిది మందికి జైలు శిక్ష.. వీరంతా మద్యం తాగి పోలీసులకు దొరికిన వారే. 113 కేసుల్లో రూ.10వేల చొప్పున జరిమానా. వీరు కూ డా మద్యం ప్రియులే. ప్రభుత్వం ప్రతి మలుపులోనూ మద్యం దొరికేలా ‘జాగ్రత్తలు’ తీసుకోవడంతో మందుబాబులు అటు ఒళ్లు గుల్ల చేసుకుంటూ ఇటు జేబులకు కూడా చిల్లు పెట్టుకుంటున్నారు. కూటమి పాలనలో మద్యం విచ్చలవిడిగా దొరుకు తోంది. ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న బెల్టుషాపులే అందుకు నిదర్శనం. ప్రైవేటు లైసెన్సు దుకాణాల్లోనే కాక ఉదయం 6 గంటల నుంచే కొన్ని చోట్ల బార్లు తెరవడం, గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ బెల్టుషాపులు వెలియడంతో మందుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాగిన మత్తులో దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు జరిగిన వైనాలు ఎన్నో వెలుగు చూశాయి. అంతేకాక రహదారి నియమనిబంధనలు ఉల్లంఘించి మితి మీరిన వేగంతో ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసులెవరైనా తనిఖీ చేస్తే వీరి హంగామా మామూలుగా ఉండడం లేదు. ఒకటో పట్టణం.. ఒకటో నంబర్ జిల్లావ్యాప్తంగా చూసుకుంటే సగానికి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో శిక్షలు పడింది శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోనే. ఇక్కడ గంజాయి బ్యాచ్లు, మందుబాబులు నిత్యం గొడవలు, దొ మ్మీలు చేస్తూ నిత్యం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడి ఎస్ఐ ఎం.హరికృష్ణ 19 మందికి పైగా మందుబాబులను ఓపెన్ డ్రింకింగ్ పేరిట కేసులను కట్టి జైలుకు పంపి కట్టడి చేశారు. 2 రోజులు, వారం, 14, 15, 20, నెల, 45 రోజులు ఇలా మందుబాబులు చేసే న్యూసెన్సు బట్టి న్యాయమూర్తి శివరామకృష్ణ జైలు శిక్షలు ఖరారుచేశారు. టూటౌన్లో సీఐ ఈశ్వరరావు నలుగురిపై ఓపెన్ డ్రంక్ కేసులు కట్టి జైలుకు పంపారు. ఇక ట్రాఫిక్ పీఎస్ పోలీసులైతే 354 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కట్టి ఆరుగురిని జైలుకు పంపారు. పూటుగా తాగి పోలీసులకు చిక్కుతున్న మందుబాబులు తనిఖీ చేసే లోపే హడావుడి చేస్తున్న వైనం న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్న పోలీసులు విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యమే కారణం మద్యం సేవించి వాహనం నడిపినందుకు టెక్కలి పీఎస్ పరిధిలో నమోదైన 10 కేసుల్లో కొల్లి సీతయ్య, రాజు చౌదరి, కొర్నాన దుర్యోధన, మట్ట మోహనరావు, అంబటి జోగారావు, సిర్ల ప్రసాద్, తెంబూరు సోమేశ్వరరావు, సన పల రామారావు, కొమటూరు భాస్కరరావు, దుప్పలపూడి శంకరరావులకు కోర్టు ఒక్కొక్కరికీ రూ. 10 వేలు జరిమానా విధించింది. అంతకుముందు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన పసుపురెడ్డి నరేష్, అట్టాడ నాగరాజులకు ఇలాంటి శిక్షే అమలు చేశారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వన్వే ఉల్లంఘన– ప్రమాదకర డ్రైవింగ్తో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ను ఈడ్చుకెళ్లిన ఎన్ని శ్రీనివాసరావుకు 7 రోజులు జైలు శిక్ష పడింది. ఇటీవల చినబరాటం వీధిలో మద్యం సేవించి హల్ చల్ చేసిన పాత నేరస్తుడు జొన్నా రవికుమార్కు 30 రోజులు జైలు శిక్ష పడింది. వాంబేకాలనీ రోడ్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ముంజేటి రవిమోహన్కు నెల రోజుల జైలు శిక్ష పడింది. అరసవల్లి మిల్లు జంక్షన్ వద్ద బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి ప్రజలను ఇబ్బందిపెట్టినందుకు కాగన గణే ష్కు నెల రోజుల జైలు శిక్ష పడింది. కాశీబుగ్గ హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసరావు విధులకు ఆటంకపరిచి దాడిచేసిన కేసులో బోసి రాంబాబు అనే వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష పడింది. -
ఆమదాలవలస ఎమ్మెల్యేను అరెస్టు చేయాల్సిందే
● కల్తీ మద్యం సొమ్ములతో టీడీపీ నాయకుల జల్సాలు ● విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మండిపాటుఆమదాలవలస: కల్తీ మద్యం కేసులో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ డిమాండ్ చేశారు. ఆమదాలవలస వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడా రు. తమ నియోజకవర్గంలో ఇసుక, భూములతో అక్రమంగా ఆర్జిస్తున్న ఎమ్మెల్యే ఇప్పుడు కల్తీ మద్యం అమ్మకాలకు తెగబడుతున్నారని విమర్శించారు. ఆయన అనుచరులే నియోజకవర్గంలో సు మారు 16 వైన్షాప్లు దక్కించుకున్నారని తెలిపారు. 16 మద్యం దుకాణాల పరిధిలో వందల సంఖ్యలో బెల్టుషాపులు నడిపిస్తున్నారని విమర్శించారు. ఇటీవల సరుబుజ్జ్జిలిలో కల్తీ మద్యంతో పట్టుపడిన వైన్షాప్ యజమాని పైడి ముఖలింగం (అలియాస్ నూకరాజు) కూనకు అత్యంత ఆదాయాన్ని చ్చే అనుచరుడని తెలిపారు. ఆ దుకాణంలో జరుగుతున్న కల్తీ మద్యం కేసును ఆ యజమానిపైకి రాకుండా అందులో పనిచేసే సిబ్బందితో చీకటి ఒప్పందాలు చేసుకొని అరెస్ట్ చేయించడం దారుణమని, కూన రవి పేరు బయటకు రాకుండా ఉండేందుకే ఇలా చేశారని ఆరోపించారు. కూన రవికుమార్ పాత్ర పూర్తిగా ఉందని సమగ్రమైన దర్యాప్తును ఉన్నతాధికారులు చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం సొమ్ముతో జల్సాలు కల్తీ మద్యం సొమ్ములతో ఇటీవల ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ప్రస్తుతం పట్టుపడిన వైన్స్ షాప్ యజమాని పైడి ముఖలింగం(అలియాస్ నూకరాజు) మరికొంతమంది గోవాలోని ట్రిప్ కి వెళ్లారని రవికుమార్ వెల్లడించారు. అక్కడ వారు చేసిన నిర్వాకాలను ఫొటోలతో సహా చూపించారు. వారు విలాసాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. కూనకు పూర్తి అనుచరుడు అయిన షా ప్ యజమాని అటు మంత్రి అచ్చెనాయుడుకూ సన్నిహితుడిగా మెలుగుతున్నాడని చెప్పారు. వారి ఫొటోలను కూడా చూపించారు. వీరందరిపై విచారణ జరిపి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, పార్టీ జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, పార్టీ వివిధ విభాగాల ముఖ్య కార్యవర్గ సభ్యులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, సరుబుజ్జ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, ఆమదాలవలస పట్టణ పార్టీ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, బూర్జ మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, పార్టీ నాయకులు రామ్మోహన్రావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
శివ శివా..
● శ్రీముఖలింగంలో దుర్గంధం ● సెప్టిక్ ట్యాంక్ పగిలి వ్యర్థాలు బయటకు వస్తున్న వైనం త్వరలో బాగు చేస్తాం విషయం మా దృష్టికి వచ్చింది. సెప్టిక్ ట్యాంక్ నూతనంగా నిర్మాణం చేయడానికి టెండర్లు పిలిచాం. త్వరలో పనులు చేసి సమస్య పరిష్కరిస్తాం. – కె.మూర్తి, కన్జర్వేటివ్ అసిస్టెంట్ నానా అవస్థలు ఎంతో పవిత్ర దేవాలయం శ్రీముఖలింగం. ఇదే నెలలో ఇక్కడకు రెండు సార్లు వచ్చాం. సీ్త్రలు, చిన్నపిల్లలతో మరుగుదొడ్లు లేక నానా అవస్థలు పడ్డాం. – అప్పల నాయడు, బెజ్జిపురంజలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం దేవాలయంలో పారిశుద్ధ్య నిర్వహణ పరమ అధ్వానంగా కనిపిస్తోంది. మరుగుదొడ్లు సెప్టిక్ ట్యాంక్ పగిలి వ్యర్థాలు బయటకు రావడంతో దుర్గంధం వెదజల్లుతోంది. క్షేత్రానికి రోజూ వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొంత మంది భక్తులు స్వామి సన్నిధిలో రోజంతా గడుపుతారు. ఇదే సమయంలో చాలా వరకూ మరుగుదొడ్లు వినియోగిస్తారు. ఈ దుర్గంధం వల్ల వారంతా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి మరమ్మతులు కూడా చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
సభ్యుల సూచనలకు విలువనిచ్చి పనిచేయండి
అరసవల్లి: జెడ్పీటీసీ సభ్యుల సూచనలకు విలువ ఇవ్వాలని, ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకోవద్దని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. శనివారం సాయంత్రం నిర్వహించిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాలకు పలువురు ముఖ్య కమిటీల సభ్యులు హాజరు కాగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ విజయ మాట్లాడుతూ క్షేత్ర సా యిలో స్థానిక సంస్థల పాలకుల సూచనలను అధికారులు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని, స్పందించని అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే కూన రవి మాట్లాడుతూ గతంలో పనిచేసిన చాలావరకు పనులకు బిల్లులను ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టారని, ముఖ్యంగా ఉపాధిహామీ పనులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. 2012లో రూ.9 లక్షల బిల్లులు ఇప్పటివరకు రాకపోతే ఆ కాంట్రాక్టర్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 6,3,5 స్థాయీ సంఘాలు వాయిదా పడినట్లుగా అఽధికారులు ప్రకటించారు. మిగిలిన స్థాయీ సంఘాల సమావేశాలకు జెడ్పీ చైర్పర్సన్ విజయ అధ్యక్షత వహించి పూర్తి చేశారు. కార్యక్రమంలో పలువురు శాఖాఽధికారులు పాల్గొన్నారు. -
యమకంకరలు
పలాస: పలాస మండలంలో గత కొన్ని నెలలుగా అక్ర మ కంకర తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు తవ్వకాలు కొనసాగుతున్నాయి. కేదారిపురం, గంగువాడ, లొద్దబద్ర పరిసర ప్రాంతాల్లోని కొండలు అక్రమార్కులకు అడ్డాగా మారా యి. అలాగే ఇటీవల రామకృష్ణాపురం వద్ద గల ఉజ్జిడి మెట్టను కూడా కొల్లగొడుతున్నారు. ఈ కంకరంతా మున్సిపాలిటీ, మండలంలోని రియల్ ఎస్టేటు వెంచర్లకు తరలిస్తున్నారు. అయినా సంబంధిత రెవెన్యూ, మైన్స్ అధికారులకు చీమ కుట్టినట్టయినా లేకపోవడం విశేషం. ఇంత వరకు ఒక్క ట్రాక్టర్ను గానీ, జేసీబీని గానీ సీజ్ చేయకపోవడం అధికారుల పనితనాన్ని చూపిస్తోంది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అక్రమ తవ్వకాల విషయంలో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో తప్పని పరిస్థితిలో పలాస రెవెన్యూ అధికారులు సిబ్బంది, మైన్స్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల కంబిరిగాం, లొద్దబద్ర తదితర ప్రాంతాల్లో కూడా మైన్స్ అధికారులు పర్యటించి పరిశీలించారు. ఆ తర్వాత దానిపై ఏం చర్యలు తీసుకున్నారంటే తగిన సమాధానాలు లభించడం లేదు. తాజాగా శనివారం కూ డా పలాస మండలం రామకృష్ణాపురం వద్ద గల ఉజ్జిడి మెట్టను పరిశీలించారు. వారితో స్థానిక వీఆర్ఓ నౌషద్ అల్లా ఒక్కరు మాత్రమే ఉన్నారు. అక్కడకి వెళ్లి చూసిన వారికి ఈ మెట్ట ఏమైపోయిందని స్థానికులకు ఆశ్చర్యం కలుగుతోంది. వెళ్లిన అధికారులకు కూడా కొండ తవ్విన ఆనవాలు, తరలిపోయిన కంకర కళ్లకు కట్టినట్టు కనిపించింది. ఎంత కంకర తవ్వుకుపోయారనేది పరిశీలించి ప్రభుత్వానికి వెళ్లాల్సిన ఆదాయాన్ని వారి నుంచే వసూలు చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
గంజాయి హాట్స్పాట్లపై ఉక్కుపాదం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు అధికారులు గుర్తించిన 65 హాట్స్పాట్ల వద్ద సీసీ కెమెరాలను తక్షణమే ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కెమెరాల ఏర్పాటు బాధ్యతను స్థానిక సంస్థలు తీసుకోవాలని చెప్పారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలసి కలెక్టర్ మాట్లాడుతూ జి ల్లాలోని 16 మండలాల్లో గంజాయి కార్యకలాపాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న మొత్తం 65 హాట్స్పా ట్లను అధికారులు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు కేవలం 32 ప్రాంతాల నుంచి మా త్రమే కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని, కేవలం 3 మాత్రమే ఏర్పాటు చేశారని ఎస్పీ నివేదించినట్లు తెలిపారు. గంజాయి విక్రయం, నిషేధంపై ప్రజల సహకారం కీలకమని ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. చీకటిగా ఉన్న ప్రాంతాల్లో వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయా లని డీపీఓ, మున్సిపల్ కమిషనర్లను కోరారు. రహదారుల భద్రతపై జరిగిన సమీక్షలో శ్రీకాకుళం నవభారత జంక్షన్–బైపాస్ జంక్షన్ వద్ద పాదచారుల భద్రత కోసం వెంటనే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం చేయాలని ఎస్పీ కోరారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ప్రైవేట్ బస్సులు నిలపకుండా కేసులు నమోదు చేయాలని, రోడ్లపై ఇష్టానుసారం వాహనాలు పార్క్ చేసినా, జాతీయ రహదారిపై చెత్త వేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఏపీ రాష్ట్ర అథ్లెటిక్స్ బృందానికి కోచ్, మేనేజర్లుగా సిక్కోలు వాసులు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా స్కూల్గేమ్స్ అండర్–14 బాలబాలికల అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు కోచ్, మేనేజర్లుగా శ్రీకాకుళం వాసులకు అరుదైన అవకాశం ల భించింది. మధ్య ప్రదేశ్లోని ఇండోర్ వేదికగా డిసెంబర్ ఒకటి నుంచి 4 వరకు ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలబాలికల బృందానికి కోచ్, మేనేజర్లగా జిల్లాకు చెందిన నలుగురు వ్యా యామ ఉపాధ్యాయులు(ఎస్ఏపీఈ) నియా మకమయ్యారు. నియామకమైన వారిలో బాడాన నారాయణరావు (పీడీ–జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాకిపల్లి, టెక్కలి మండలం), నడిమింటి నాగరాజు (పీడీ–జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యామలపేట, సంతబొ మ్మాళి మండలం), పీరుకట్ల సునీత (పీడీ– జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బ్రాహ్మణతర్ల, పల్సా మండలం), సయ్యద్ సౌజన్ (జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల ఈదుపురం, ఇచ్ఛాపురం మండలం) ఉన్నారు. వీరు నలుగురు ఈ పోటీ ల కోసం శనివారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్గేమ్స్ అథ్లెటి క్స్ అండర్–14 బాలబాలికల బృందంతో కలిసి ఇండోర్ చేరుకోనున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబరు 13న జాతీయ లోక్ అదాలత్ జరగనున్న విషయం విదితమే. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కుటుంబ, ఆస్తి వివాదాలు, చిన్న క్రిమినల్, ట్రాఫిక్, కాంపౌండ్ కేసుల వంటి రాజీ సాధ్యమైనవి ముందుగా గుర్తించాలన్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా సున్నితమైన, అతి సున్నితమైన గ్రామాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, సమాచారాన్ని సిద్ధం చేయాలని, జనాభా వివరాలు, కమ్యూనిటీ ప్రదేశాలు, ముఖ్య ప్రాంతాలు, గొడవలు జరిగే ప్రాంతాలపై కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, డి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు కళ్లద్దాల పంపిణీ శ్రీకాకుళం క్రైమ్ : సిబ్బంది కంటి ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డి యాంటీ–గ్లేర్ కళ్లద్దాలను పంపిణీ చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కంప్యూటర్ కానిస్టేబుళ్లు, ఐటీకోర్, డీసీఆర్బీ, కార్యాలయ సిబ్బందికి వందకు పైగా కళ్లద్దాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, ఏఓ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
●పదే పదే అదే తప్పు
కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లుపాడు సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాంతంలో ప్రమాదకరంగా నిలిపివేసిన వాహనాలు ఆ దారిపై రక్తపు మరకలు ఇంకా తొలగలేదు. ఆ కుటుంబాల్లో ఆర్తనాదాలు ఇంకా ఆగలేదు. ఆ ఘోర ప్రమాదం చూసిన వారికి కలిగిన భయం ఇంకా తగ్గలేదు. అయినా వాహన చోదకుల నిర్లక్ష్య వైఖరి మాత్రం మారలేదు. ఎక్కడైతే నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయో, ఎక్కడైతే వారి రక్తంతో రోడ్డు తడిచిందో, ఎక్కడైతే వాహనం మృత్యు శకటంగా మారిందో.. సరిగ్గా అదే చోట మళ్లీ లారీలు ప్రమాదకరంగా పార్కింగ్ చేయడం శనివారం కనిపించింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇలాంటి విరుద్ధ దృశ్యాలు కనిపిస్తూ వారి చిత్తశుద్ధిని వెక్కిరిస్తున్నాయి. – టెక్కలి -
థర్మల్ ప్రతులు దగ్ధం
బూర్జ: థర్మల్ విద్యుత్ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు తక్షణమే రద్దు చేయాలని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, మండల గిరిజన ఆదివాసీలు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మండలంలో గల అన్నంపేట పంచాయతీ అడ్డూరిపేట గ్రామంలో శనివారం థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కోశాధికారి అత్తులూరి రవికాంత్, అధ్యక్షుడు సురేష్ దొర, కార్యదర్శి సవరసింహాచలం ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ, ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సవర మిన్నారావు, లక్ష్మణరావు, రామలింగం, కుర్మయ్య, ధర్మారావు, నాగేశ్వరరావు, సింగయ్య పాల్గొన్నారు. -
జగనన్న కాలనీలపై వివక్ష ఎందుకు..?
నరసన్నపేట: జగనన్న కాలనీల్లో నివసిస్తున్న ప్రజలపై ప్రభుత్వం ఇంత వివక్ష చూపడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూ టీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ము పంచాయతీ పరిధిలోని గడ్డెయ్యపేట వద్ద జగనన్న కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించడాని కి శనివారం వెళ్లిన కృష్ణదాస్కు కాలనీ వాసులు తమ సమస్యలు వివరించారు. మంచి నీరు రావ డం లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కాలనీ వాసులు మరణిస్తే దహనం చేసుకోవడానికి స్థలం లేదని తెలిపారు. అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. దీనిపై కృష్ణదాస్ స్పందిస్తూ ప్రభుత్వ తీరును తప్పబట్టారు. జగనన్న కాలనీలో నివసిస్తు న్న వారిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాలనీల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. -
పోలీసులు వదిలేశారు
వ్యాపారి పట్టించాడు..శ్రీకాకుళం క్రైమ్/నరసన్నపేట: రెండు తెలుగు రాష్ట్రాల్లో 30కు పైగా చోరీలు చేసిన పేరు మోసిన గజదొంగ. రద్దీ ప్రాంతాల్లోని దుకాణాల్లో రాత్రి సమయాన షట్టర్లు ఎత్తి దోచేయడం, ఉదయం దుకాణాల రద్దీ సమ యాల్లో యజమాని దృష్టి మరల్చి కౌంటర్లో లటక్కున నగదు తీసి పరారవ్వడం ఇతగాడి స్టైల్. జిల్లాలో ఇటీవల వరుస చోరీలు చేస్తున్నాడు. తాజాగా నరసన్నపేట కేంద్రంగా ఓ వ్యాపారి దుకాణంలో పట్టపగలు చోరీ చేసేందుకు ఎగబడి అదే వ్యాపారి కంటపడ్డాడు. అప్రమత్తమైన ఆ వ్యాపారి దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. కట్ చేస్తే పోలీసుల చెర నుంచి దొంగ పరారయ్యాడు. స్థానికులు, వ్యాపారులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. బుడితి గ్రామానికి చెందిన గురువెల్లి అప్పలనాయుడికి 18 ఏళ్ల నుంచే చోరకళ అబ్బింది. ఆయన ఉండేది ప్రకాశం జిల్లాలో. హైదరాబా ద్, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో నే కాక మన జిల్లాలోను చోరీలు చేశాడు. ఇటీవల న రసన్నపేట పోలీసుల కళ్లు గప్పి దాదాపు 5 చోరీలు చేయగా మొత్తంగా జిల్లాలో 10కు పైగా చేశాడు. వ్యాపారి అప్రమత్తమై.. వారం రోజుల కిందట నరసన్నపేటలో పండ్లు, సిమెంట్, ఐరన్షాపు నడుపుతున్న ఓ వ్యాపారి చూస్తుండగానే కౌంటర్లో చేయిపెట్టి కొంత నగదు దోచేయబోయాడు. వ్యాపారి అప్రమత్తమై పట్టుకున్నాడు. వ్యాపారివి గత కొంతకాలంగా రూ. 20 లక్షల వరకు నగదు చోరీ కావడంతో గట్టిగా నిలదీయడంతో నాలుగు సార్లు షాపునకు దొంగతనానికి వచ్చానని ఒప్పుకోవడం.. సోషల్ మీడియాలో సంబంధిత వీడియో వైరల్ అవ్వడం జరిగింది. తర్వాత వ్యాపారి పోలీసులకు ఫోన్ చేసి అప్పలనాయుడిని అప్పగించారు. విచారణ నిమిత్తం నరసన్నపేట పీఎస్కు పోలీసులు తీసుకెళ్లారు. ఈనెల 27న పోలీసులు నిద్రమత్తులో ఉండగా కన్నుగప్పి అప్పలనాయుడు పరారయ్యాడు. వెళ్తూ వెళ్తూ అదే స్టేషన్కు చెందిన ఓ కానిస్టేబుల్ ద్విచక్రవాహనాన్ని సైతం పట్టుకుపోయినట్లు స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. నరసన్నపేట పోలీసుల నిర్లక్ష్యానికి తోడు వారి బండినే దొంగ పట్టుకుపోవడంతో పోలీసులకు భలే ఝలక్ ఇచ్చాడంటూ అంతా నవ్వుకుంటున్నారు. -
సర్వర్ డౌన్.. రైతుల ఆందోళన
నరసన్నపేట: నరసన్నపేట మండలంలో శనివారం ఒక్క బస్తా ధాన్యం కూడా మిల్లులకు పంపడం వీలు కాలేదు. ఉదయం నుంచి వాహనాల్లో ధాన్యం లోడ్ చేసుకొని ట్రక్ షీట్ కోసం రైతులు పడిగాపులు పడినా సాయంత్రం వరకూ పని కాలేదు. దీంతో ధాన్యం లోడు చేసిన ట్రాక్టర్లు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. దీంతో అటు రైతులు ఇటు వాహన డ్రైవర్లు అష్టకష్టాలు పడ్డారు. చిన్నకరగాం రైతు సేవా కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ‘శుక్రవారం నుంచి షెడ్యూలింగ్ కేసం, ట్రక్ షీట్ జనరేట్ కోసం వస్తున్నాం.. ఇప్పటికీ పని కాలేదు. లోడు చేసిన ధాన్యం వాహనాల్లోనే రెండు రోజులుగా ఉంది. రైతులకు ఏమిటీ దుస్థితి..’ అని కంబకాయ, చిన్నకరగాం, పెద్ద కరగాం, జమ్ము, తామరాపల్లి, సత్యవరం, కోమర్తిలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం నుంచి యాప్ ఆపసోపాలు పడుతుంది. పగలంతా కలిపి 30 నిమిషాలు అయినా పనిచేయలేదని సమాచారం. ధాన్యం 110 బస్తాలు సిద్ధం చేశాను. వాహనం సిద్ధమైంది. రైతు సేవా కేంద్రంలో షెడ్యూల్ ఇస్తే ట్రక్ షీట్ జనరేట్ అవుతుంది. అది పట్టుకొని మిల్లుకు వెల్లాలి. ఈ ట్రక్ షీట్ జనరేట్ కావడం లేదు. అసలు యాప్ ఓపెన్ కావడం లేదు. రైతుల కష్టాలు ప్రభుత్వాలకు పట్టవా. – పంగ వెంకటరమణ, చిన్నకరగాం -
క్యూబిటెక్తో ఆదిత్య కళాశాల ఎంవోయూ
టెక్కలి: హైదరాబాద్కు చెందిన స్మార్ట్ సొల్యూషన్ సంస్థ క్యూబిటెక్తో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ మేరకు శనివారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా క్యూబిటెక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు పృథ్వీ పిన్నాకతో కలిసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆధునిక పరిశోధన, స్మార్ట్ సొల్యూషన్ అభివృద్ధి రంగాల్లో విద్యా పరిశ్రమల సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికే ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు వెల్లడించారు. అనంతరం సంస్థ సహ వ్యవస్థాపకుడు పృథ్వీ పిన్నాక మాట్లాడుతూ.. క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు, స్మార్ట్ టెక్నాలజీలపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, అలాగే పరిశ్రమల ఆధారిత నైపుణ్యాభివృద్ధి సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, సాంకేతిక వర్క్షాప్లు, అధ్యాపకులకు ఎఫ్డీపీలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్ అవకాశాల విస్తరణ, ఆధునిక సిమ్యులేటర్లు, పరిశోధనా ప్రయోగశాలల సదుపాయాల వినియోగం తదితర అంశాలకు సంబంధించి ఈ ఎంవోయూ చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, ప్రిన్సిపాల్ ఏ.ఎస్.శ్రీనివాసరావు, అసోసియేట్ డీన్ బి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం పద్ధతి..?
● సచివాలయాల ఏఎన్ఎంల పదోన్నతుల్లో ఎస్టీలకు అన్యాయం అరసవల్లి: గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి తొలిసారిగా గ్రేడ్–3 ఏఎన్ఎం పోస్టులను నియమించారు. అయితే ఈ పోస్టుల్లో ఉన్నవారికి గ్రేడ్–2 ఏఎన్ఎంలుగా పదోన్నతులు కల్పిస్తున్న తీరు పలు అనుమానాలకు గురి చేస్తోందని జిల్లా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా గ్రేడ్–3 ఏఎన్ఎంలు పదోన్నతులు కల్పించాలంటూ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే పదోన్నతులను కల్పిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఇష్టానుసారంగా పదోన్నతులు కల్పిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి పదోన్నతులు కల్పిస్తున్న విధానంలో లోపాలున్నాయని ఎస్టీ ప్రతినిధులు తప్పుపట్టారు. దీనిపై శనివారం ఉదయం నుంచి పలువురు ఎస్టీ కేటగిరికి చెందిన ఏఎన్ఎంలు సంఘ ప్రతినిధులతో కలిసి డీఎంహెచ్వో డాక్టర్ కె.అనితను కలిసేందుకు ప్రయత్నించారు. కలవడం కుదరకపోవడంతో చివరికి శనివారం సాయంత్రం కార్యాలయ ఏవో బాబూరావుకు వినతిపత్రాన్ని అందజేసి వెనుదిరిగారు. పదోన్నతులు కల్పిస్తే కచ్చితంగా ఎస్టీలకు 6 శాతం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాప్తికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా పదోన్నతులకు అర్హతలున్న 154 పోస్టుల్లో.. ఎస్టీ కేటగిరికి కనీసంగా 9 పోస్టులకు పదోన్నతులు కల్పించాల్సి ఉంది. కానీ జిల్లావ్యాప్తంగా రిజర్వేషన్ ప్రాప్తికి ఒక్క పోస్టుకు కూడా పదోన్నతి ఇవ్వలేదు సరికదా.. జనరల్ కేటగిరిగా నాలుగు పోస్టులకు పదోన్నతులు కల్పించి మమ అనిపించారు. అందువలన ఇప్పటికై నా జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు ఈ అంశంపై పునః పరిశీలించి కొత్త నియామకాలకు కొత్త సైకిల్ రోస్టర్ను అమలు చేసి ఎస్టీలకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే ఈ అక్రమాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని జిల్లా ఆదివాసి సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ బైదిలాపురం సింహాచలం హెచ్చరించారు. -
ఇదేం సహకారం?
హిరమండలం: చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కీలకమైన సహకార శాఖ ద్వారా రైతులకు మెరుగైన సేవలందించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో లక్ష్యం నీరుగారిపోతోంది. ముఖ్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన పథకాలు, నిర్మాణాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా, అనాలో చితంగా వ్యవహరిస్తోంది. రైతులు పండించే పంట లు, వ్యవసాయ ఉత్పత్తులు సంరక్షించేందుకుగాను గత ప్రభుత్వం పీఏసీఎస్ల ఆధ్వర్యంలో గోదాము ల నిర్మాణం చేపట్టింది. వాటిని ప్రారంభించడంలో ప్రస్తుత సర్కారు తీవ్ర అలసత్వం వహిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సాగుకు పెద్దపీ ట వేస్తూ జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 25 గోదాముల నిర్మాణానికి పూనుకుంది. అప్పట్లో 18 గోదాముల నిర్మాణం పూర్తయ్యింది. ఐదు గోదాములు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. మరో రెండింటికి స్థల సమస్య కారణంగా ప్రారంభం కాలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరవుతున్నా గోదాముల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పూర్తయిన వాటి సేవలను ప్రారంభించలేదు. పెండింగ్లో ఉన్న వాటి పనులు పూర్తిచేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే పాలకవర్గాల మార్పుపై ఉన్న శ్రద్ధ గోదాముల నిర్మాణంపై లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములకు ఒక్కోదానికి రూ.40 లక్షలు, 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న వాటికి రూ.70 లక్షల చొప్పున కేటాయించారు. ఈ లెక్కన రూ.12 కోట్లు వరకూ ఖర్చు చేశారు. కానీ సేవలను అందుబాటులో తేవడంలో మాత్రం సహకార శాఖ పూర్తిగా విఫలమైంది. 2019కు ముందు కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో సహకార వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్న విమర్శ ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని గాడిన పెట్టింది. డీసీసీబీ లావాదేవీలను మరింత పెంచగలిగింది. అన్ని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరీకరణ చేసింది. జిల్లాలో 37 పీఏసీఎస్ల పరిధిలో సభ్యులుగా ఉన్న 1,01,671 మంది రైతులు వివిధ రూపాల్లో లబ్ధి పొందారు. తొలుత ఎటువంటి రుసుం లేకుండానే ఈ సంఘాల ద్వారా రుణాలు, ఎరువులను రైతులు పొందేవారు. పంట ఉత్పత్తులు విక్రయించాక తిరిగి రుణాలు చెల్లించేవారు. కొద్దిరోజుల తర్వాత సభ్యత్వ రుసుం కింద రూ.10 మాత్రమే వసూలు చేసేవారు. సంఘ సభ్యులుగా చేర్చుకునేవారు. ప్రాంతీయ వ్యవసాయ కో ఆపరేటివ్ బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పీఏసీఎస్లలో సభ్యత్వం తగ్గిపోయింది. ఓ చిన్నపాటి బ్యాంకు అకౌంట్ల మాదిరిగా కూడా లేదు. దీనికి సభ్యత్వ రుసుం పెరగడమే ప్రధాన కారణం. ప్రస్తుతం రూ.300 సభ్యత్వ రుసుంగా నిర్ణయించారు. దీంతో రైతులు ముందుకురాని పరిస్థితి. ఇప్పటికై నా పాలకులు స్పందించి పీఏసీఎస్లను బలోపేతం చేయడంతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఆ 23 గోదాములను అందుబాటులో తేవాలని రైతులు కోరుతున్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన బహుళ ప్రయోజన సౌకర్య గోదాములు ప్రభుత్వం అందుబాటులో కి తీసుకురావాలి. రైతులు పండించిన ధాన్యాన్ని గోదాములలో ఉంచేలా ప్రభు త్వం చర్యలు తీసుకోవాలి. – కరణం శివరాం, రైతు, పిండ్రువాడ, హిరమండలం మండలం జిల్లాలో 25 గోదాములు మంజూరు కాగా 23 చోట్ల నిర్మాణం పూర్తయ్యింది. వాటిని ప్రారంభించాలని ఉన్నతాధికారులకు విన్నవించాం. ఆదేశాలు వచ్చాక త్వరలో ప్రారంభించి సేవలు అందుబాటులోకి తెస్తాం. – కె.మురళీకృష్ణమూర్తి, డివిజనల్ సహకార శాఖ అధికారి, టెక్కలి -
మోసం గురూ..!
కొత్తరకం..● బంగారం ఆశచూపుతూ మోసం చేస్తున్న వ్యక్తులు ● ఆన్లైన్లో వివరాలతో ఫోన్కాల్స్ ● అప్రమత్తంగా ఉండాలని సూచనలు టెక్కలి రూరల్: ఇటీవల కాలంలో కొత్త తరహా మోసాలు అధికమైపోతున్నాయి. చాలామంది వ్యాపారులను టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. గత కొద్ది నెలలుగా ఇటువంటి మోసాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనిలో ప్రధానంగా బంగారం ఆశ చూపుతూ వస్తున్న ఫోన్కాల్ మోసాలు ఒక రకమైతే.. వ్యాపారుల బలహీనతను ఆధారంగా చేసుకుని చేస్తున్న మోసాలు మరోరకం. మన సమాచారమే ఆయుధం చాలా మంది వ్యాపారులు తమ వ్యాపారం అభివృద్ధి కోసం ఆన్లైన్లో తమ వ్యాపారం పేరు, ఫోన్ నంబర్ నమోదు చేసుకుంటారు. అయితే వాటిని ఆధారంగా చేసుకుని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ముందుగా మన నంబర్కు ఫోన్చేసి బాగా తెలిసిన వ్యక్తి వలే మాట్లాడుతారు. మనతో పరిచయం పెంచుకుని తర్వాత వారు చెప్పాల్సిన విషయం గూర్చి చెబుతారు. నేను కేరళ వద్ద రామేశ్వరంలో పనిచేస్తున్నాను. అక్కడ జేసీబీతో మట్టి తీస్తుండగా 20, 30 అడుగుల లోతులో ఒక మట్టికుండలో బంగారం దొరికిందని చెబుతారు. సుమారు 2, 3 కేజీలు ఉంటుందని.. ఎవరికీ తెలియకుండా తెచ్చామని చెబుతూ సమాచారం ఇస్తారు. అయితే దానిపై మనం ఆసక్తిగా ఉన్నట్లు వారు గ్రహిస్తే వీడియో కాల్ చేసి బంగారం చూపిస్తారు. అనంతరం మనకు నమ్మకం కలిగిందని గ్రహించాక బంగారం ఎవరికి తెలియకుండా తీసుకురావాలంటే కొంత మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతుందని చెబుతూ కొంత మొత్తంలో డబ్బులు వేయమని కోరుతారు. అది నమ్మి డబ్బులు వేసినట్లు అయితే మోసపోయినట్లే. డబ్బులు పంపితే అంతే... అదేవిధంగా ఇటీవల కాలంలో టెక్కలిలో పలు చికెన్ షాపులకు ఫోన్చేసి మీది పలానా చికెన్ షాపు కదా.. నేను ఒక టీచర్ను అని చెబుతారు. సాయంత్రం తమ స్కూల్లో ఫంక్షన్ ఉందని చెప్పి.. 50 కేజీల చికెన్ కావాలి కొట్టి ఉంచేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. అక్కడికి కొంత సమయానికి మళ్లీ ఫోన్చేసి సార్ నేను ఒక దగ్గర ఉన్నాను నా ఫోన్ పే అవ్వడం లేదు. కావున రూ.5 వేలు నేను ఒక నంబర్ చెబుతాను.. దానికి ఫోన్పే చేస్తే వచ్చేటప్పుడు మీకు మొత్తం డబ్బులు కలిపి ఇస్తానని చెబుతూ మోసానికి పాల్పడుతున్నారు. ఒకవేళ వారు చెప్పినట్లు డబ్బులు వేసినట్లయితే అక్కడికి కొంత సమయానికి ఆ నంబర్ మరి పని చేయకుండా పోతుంది. అలాగే చాలా హోటల్స్లో సైతం ఈ తరహాలోనే భోజనాలు పార్సిల్ చేయాలని చెబుతూ మోసం చేస్తున్నారు. అదేవిధంగా టైల్స్ షాపులకు ఫోన్చేసి నేను ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్ని అని చెప్పి మోసం చేస్తున్నారు. లేడీస్ కార్నర్ షాపులకు ఫోన్లు చేసి పండగ సమయం కావడంతో కొత్త మోడల్స్ గాజులు వచ్చాయని.. కొన్ని రకాల మోడల్స్ వాట్సాప్ చేసి అతి తక్కువ రేటుకు ఇస్తామని చెబుతూ కొంత మొత్తం డబ్బులు వేయాలంటారు. మిగిలిన మొత్తం స్టాక్ తీసుకొచ్చాక ఇవ్వాలని చెబుతూ మోసానికి పాల్పడుతున్నారు. ఇలా చాలామంది మోసాలకు గురై తమ డబ్బులను పోగొట్టుకుంటున్నారు. అయితే వారు మోసపోయామని చెబితే వారి పరువు పోతుందని పోలీసులకు సైతం ఫిర్యాదు చేయలేని పరిస్థితిలో వ్యాపారులు ఉండిపోతున్నారు. -
ప్రభుత్వ విద్య, వైద్యంపై యువకుడి వినూత్న నిరసన
కొత్తూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తు న్న విద్య, వైద్య రంగాల అమలు తీరుకు నిరసనగా కొత్తూరు మండలం కలిగాం గ్రామానికి చెందిన యువకుడు పొన్నాడ హేమసుందరరావు కొత్తూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపాడు. ప్రజలు చెల్లించిన డబ్బుతో నడుస్తున్న ప్రభుత్వ బడుల్లో ఎమ్మెల్యేలు, మంత్రు లు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను చదివించినప్పు డే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు వైద్యం పొందితేనే అందరికీ నాణ్యమైన వైద్య అందుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే పర్య వేక్షణ లోపిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ప్రైవేటీ కరణ చేయడం వల్ల పేదలకు వైద్య విద్యతో పాటు వైద్యం అందకుండాపోతుందన్నారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా ప్రతి రోజూ ఒక గంట పాటు కొత్తూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తానన్నారు. -
‘తోటపల్లి కాలువ, ఉప కాలువలు ఆధునికీకరించాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: తోటపల్లి కాలువ, ఉపకాలువలను ఆధునికీకరించాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావుకు కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, రైతులు, ఆయకట్టుదారులు రాబో యే సాగు కాలంలో పనులు పూర్తవుతాయని ఆశతో ఉన్నారని, శివారు భూములకు నీరు అందేలా పనులు చేయించాలని కోరారు. 2026 సీజన్లో మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. -
బీసీల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అంటరానితనం, అసమానతలు వంటి వాటిని రూపుమాపి బీసీల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావుపూలే అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) దుంపల లక్ష్మణరావు అన్నారు. మహిళలకు సమాన హక్కులు, విద్య కావాలని, సమాజంలో తారతమ్యాలను పారదోలేందుకు కృషి చేసిన వ్యక్తి పూలే అని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీకాకుళంలోని ఓ ప్రవేటు నివాస గృహంలో శుక్రవారం నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పైడి రామకృష్ణారావు, పూజారి నిత్యానందం, హనుమంతు రామారావు, మెండ సింహాచలం, కెల్లి వెంకటేష్, తిర్లంగి లోకనాధం, మెట్ట దివాకర్, బాడాన ఈశ్వరరావు, పొన్నాడ సత్యం,బిర్లంగి రామ్మోహన్, దుంపల గోవిందరావు పాల్గొన్నారు. -
పది మందికి జరిమానా
నందిగాం: మద్యం తాగి వాహనం నడిపి నందిగాం మండల పరిధిలో పట్టుబడిన పది మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున టెక్కలి కోర్టు జరిమానా విధించిందని ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన వారిపై సెక్షన్ 185 మెటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి శుక్రవారం టెక్కలి జేఎంఎఫ్సీ కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.పదివేలు జరిమానా లేదా 10 రోజులు జైలు శిక్ష అని జడ్జి తీర్పు ఇచ్చారని ఎస్ఐ తెలిపారు. రైతును నట్టేట ముంచుతున్నారు ● ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపాటు నరసన్నపేట: బాబు సర్కారు అన్ని రకాలుగా రైతులను నష్టపరుస్తోందని, పంటను సకాలంలో కొనుగోలు చేయకుండా దగాకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పండిన ధా న్యం అమ్ముకోవడానికి అనేక ఆంక్షలు పెడుతోందన్నారు. చంద్రబాబు నిజస్వరూపం చూ పుతున్నారని అన్నారు. టమాటా, ఉల్లి, అరటి, మిరప పంటలకు మద్దతు ధర కల్పించలేక పోయిన ప్రభుత్వం ఇప్పుడు వరి ధాన్యం అ మ్మకాల వద్దకు వచ్చే సరికి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. సక్రమంగా ధాన్యం కొనుగో లు చేయక దళారులకు అమ్ముకొనే విధంగా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కొనుగో లు కేంద్రాల ఏర్పాటు, ఏజెన్సీల నియామకంలో కూడా రాజకీయం చేస్తూ రైతులకు కష్టాలకు గురి చేస్తుందన్నారు. రైతులకు నచ్చిన చోట ధాన్యం అమ్ముకోవచ్చని అంటూ కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన రైతులను పట్టించుకోవడం లేదని, షెడ్యూల్ ఇవ్వడం లేదని, ట్రక్ షీట్ జనరేట్ చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వ మని అన్నారు. గోనె సంచులు కూడా ఇవ్వలేకపోతున్నారని, రైతులు బయట కొనుగోలు చేసి నష్టపోతున్నారని అన్నారు. తేమ శాతం పేరుతో, ధాన్యం నాణ్యత పేరుతో దళారులు రైతులను మోసం చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకుండా వెనకేసుకు వస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు ఆదుకోవాలని, ధాన్యం అమ్మకాల విషయంలో పూర్తిగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతుల పక్షాన ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. స మావేశంలో నరసన్నపేట, పోలాకి మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు. అరసవల్లి రథసప్తమి ఇక ‘సప్తాహ సూర్య పర్వం’ ● కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పాతబస్టాండ్: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి మహోత్సవం ఈసారి ఏడు రోజుల పాటు (జనవరి 19 నుంచి 25 వరకు) అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు శుక్రవారం కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏడు రోజుల పాటు దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రతి రోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించాలని, ఇందుకోసం ప్రధాన అర్చకులతో సంప్రదించాలని మంత్రి సూచించారు. ఆన్లైన్ టికెట్లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఉప రాష్ట్రపతి ఏదో ఒక రోజు ఉత్సవానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. వాహనాలపై స్పెషల్ డ్రైవ్ శ్రీకాకుళం రూరల్: జిల్లాలో గల స్కూల్, కాలేజ్లకు చెందిన పలు వాహనాలపై విజయవాడ రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు శుక్రవారం నుంచి డిసెంబర్ 4వరకూ జిల్లా వ్యాప్తంగా స్పెషల్డ్రైవ్ చేస్తున్నట్లు ఉపరవాణాశాఖాధికారి విజయసారధి తెలిపారు. అందులో భాగంగా శుక్రవారం ఒక్కరోజే 41 వాహనాలను తనిఖీలు చేసి నోటీసులు అందించినట్లు తెలిపారు. -
గ్రామీణ ప్రాంతాల్లో బరితెగింపు
జిల్లాలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని షాపుల్లోనే కల్తీ మద్యం దందా నడుస్తోంది. పల్లెల్లో అంత గుర్తించే అవకాశం ఉండదనే ఉద్దేశంతో అక్రమార్కులు కూడా కల్తీ మద్యం విక్రయిస్తున్నారు. షాపుల్లోను, అద్దె ఇళ్లల్లోనే కల్తీ డెన్లు నిర్వహిస్తున్నారు. ఎక్కువగా బెల్ట్షాపులకు కల్తీ మద్యాన్ని పంపిస్తున్నారు. కంపెనీల నుంచి వచ్చిన బాటిల్స్ను అధునాతన పరికరాలతో తెరిచి, కల్తీ చేసి, సీల్ చేసేస్తున్నారు. ఒకవైపు కౌంటర్లో ఎంఆర్పీకి మించి విక్రయాలు చేపడుతుండగా, మరోవైపు పర్మిట్, బెల్ట్షాపులను నిర్వహిస్తున్నారు. ఇంకా చాలడం లేదంటూ మద్యం కల్తీకి బరితెగిస్తున్నారు. -
చంద్రబాబు మాటలేమయ్యాయి..?
● సంధ్యారాణిని మంత్రి పదవి నుంచి వెంటనే తప్పించాలి ● వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి బాధిత మహిళకు అండగా ఉండాల్సింది పోయి, బాధించిన వాడికి అండగా నిలవడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. మంత్రి కుమారుడు పృథ్వీ, పీఏ మీద ఎస్పీకి మూడు పేజీల ఫిర్యాదు ఇచ్చినా కనీస చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. ఆడబిడ్డ మీద ఎవరైనా చెయ్యి వేస్తే అదే చివరి రోజు అవుతుందని చెప్పిన సీఎం చంద్రబాబు మాటలేమయ్యాయని ప్రశ్నించారు. ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తాం.. తోలుతీస్తామన్న డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ గొంతు మూగబోయిందా అని ప్రశ్నించారు. సహచర మంత్రి పీఏ ఇలా చేస్తే హోం మంత్రి మహిళగా ఏం చేస్తోందని నిలదీశారు. సత్యసాయి జిల్లాలో అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగానికి రిజైన్ చేయాలని టీడీపీ నేత లు ఒత్తిడి చేశారని, ఆమైపె దాడిచేసి కొట్టిన విషయాన్ని ఆమె సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసిన సంగతి బయటకు వచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. శ్రీకాకుళంలో ఆమె శుక్రవారం సాక్షితో మాట్లాడారు. బాధించే వారంతా టీడీపీ నేతలేనని, టీడీపీ తెలుగు దండుపాల్యం పార్టీలా మారిందని మండిపడ్డారు. హోంమంత్రి పక్క రాష్ట్రానికి వెళ్లి డైలాగులు చెప్పడం కాదని, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించే చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్పీకి రాసిన ఫిర్యాదులో బాధిత మహిళ స్పష్టంగా ఆరోపణలు చేశారని, మంత్రి కొడుకు పృథ్వీ, ఇతర పెద్ద నాయకుల వద్దకు కామ వాంఛ తీర్చడానికి పంపించమన్న దురాలోచన నుంచి రక్షణ కల్పించాలని కోరిందని అన్నారు. ఇంత జరుగుతున్నా ఆ పీఏను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఆమెను మంత్రి పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని, మంత్రి పీఏని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా రాప్తాడులో అంగన్వాడీ ఆయా వేధింపులకు గురైతే పట్టించుకోలేదని, 14 ఏళ్ల బాలికపై 14 మంది గ్యాంగ్రేప్ చేస్తే ఆ విషయాన్ని బయటకు రాకుండా చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 18 నెలల్లో మహిళలపై జరిగిన క్రైమ్రేట్ 4శాతం పెరిగిందని, మహిళలపై జరిగిన రేప్లు 9శాతం పెరిగాయన్నా రు. మద్యం, గంజాయి, డ్రగ్స్ వాడకం కూడా 21 శాతం పెరిగిందని తెలిపారు. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేని అసమర్థ సీఎం చంద్రబాబునాయు డు, హోం మినిస్టర్ అనిత నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. -
నన్నొదిలి వెళ్లిపోయావా..
తన కళ్లెదుటే తల్లి మృతిచెందడంతో ఆ కుమారుడు తల్లడిల్లిపోయాడు. తాను లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ ‘నన్ను వదిలి వెళ్లిపోయావా..’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. రక్షించండంటూ అటువైపుగా రాకపోకలు సాగించిన ప్రతిఒక్కరినీ వేడుకున్నాడు. ఈ హృదయ విదారకర ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. అమ్మా.. ● కుమారుడి కళ్లెదుటే తల్లి మృతి ● షుగర్ టెస్టులకు తీసుకెళ్తుండగా స్కూటీని ఢీకొట్టిన లారీ ● కొల్లివలసలో విషాదఛాయలు తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న కుమారుడు మణికంఠ, (ఇన్సెట్లో) భానుమతి(ఫైల్) ఆమదాలవలస/బూర్జ: ఆమదాలవలస పట్టణ శివారులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రాంతంలో ఇండ్రస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి చెందగా కుమారుడికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్జ మండలం కొల్లివలస గ్రామానికి చెందిన నున్నగొప్పల మణికంఠ తన తల్లి భానుమతి (50)ని షుగర్ టెస్టుల నిమిత్తం శ్రీకాకుళం తీసుకెళ్లేందుకు స్కూటీపై బయలుదేరారు. ఫ్లై ఓవర్ దిగువకు చేరుకునే సమయంలో శ్రీకాకుళం వైపు నుంచి పాలకొండ వైపు కొబ్బరికాయల లోడుతో వెళుతున్న లారీ అతివేగంతో ఓవర్ టేక్ చేసి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో భానుమతి అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడు మణికంఠకు తీవ్ర గాయాలపాలయ్యాడు. తల్లడిల్లిన కుమారుడు.. కళ్ల ముందే కన్నతల్లి రక్తపుమడుగులో కొట్టుకుంటూ ప్రాణాలు విడుస్తుంటే ఏమీ చేయలేని స్థితిలో మణికంఠ తల్లడిల్లుతూ చేస్తున్న రోదనలు మిన్నంటాయి. తాను లేవలేని స్థితిలో ఉన్నప్పటికి లేవాలని ప్రయత్నిస్తూ రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపుతూ వారి సహాయం కోరడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న ఆమదాలవలస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందడంతో వారికి సమాచారం అందించారు. అనంతరం రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మణికంఠను చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొల్లివలసలో విషాదఛాయలు.. రోడ్డు ప్రమాదంలో భానుమతి మృతి చెందడంతో స్వగ్రామం కొల్లివలసలో విషాదఛాయలు అలముకున్నాయి. భానుమతికి భర్త కొండలరావు, కుమారుడు మణికంఠ ఉన్నారు. కుమార్తెకు వివాహం అయ్యింది. చింతాడ రవికుమార్ పరామర్శ.. విషయం తెలుసుకున్న ఆమదాలవలస వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు, స్థానికులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. భానుమతి మృతికి సంతాపం తెలుపుతూ ఆమె భర్త, వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు కొండలరావుతో మాట్లాడి ఓదార్చారు. -
టెక్కలి డివిజన్కు నందిగాం
● అభ్యంతరాలుంటే తెలపాలి : కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం, నందిగాం మండలాన్ని ప్రస్తుతం ఉన్న పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలి రెవెన్యూ డివిజన్కు మారుస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రాథమిక నోటిఫికేషన్ (జీవోఆర్టీ.1490) జారీ చేశారు. ఈ ప్రతిపాదనపై ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే, గెజిట్ ప్రచురణ అయిన తేదీ (27.11.2025) నుంచి 30 రోజుల్లోపు రాతపూర్వకంగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటిన కంబకాయ యువకుడు నరసన్నపేట: కంబకాయకు చెందిన పాగోటి సతీష్ అంతర్జాతీయ స్థాయిలో థాయ్లాండ్లోని పటాయ్ పట్టణంలో జరిగిన బాడీబిల్డింగ్ పోటీ ల్లో సత్తా చాటి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నాడు. 27 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకూ యునైటెడ్ వరల్డ్ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్(యూడబ్ల్యూఎస్ఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో ఆసియా స్థాయి లో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జరిగిన పోటీలో సతీష్ ప్రతిభ చూపి మూడో స్థానంలో నిలిచారు. సుమారు 20 దేశాల నుంచి 18 మంది పోటీల్లో పాల్గొనగా తనకు కాంస్య పతకం దక్కిందని ఆయన తెలిపారు. దీనిపై సర్పంచ్ పాగోటి కుసుమ కుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాగోటి ఉమామహేశ్వరి సతీష్కు అభినందనలు తెలిపారు. బాడీ బిల్డింగ్ పోటీల్లో సాధించిన కాంస్య పతకంతో సతీష్ -
10వ తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
శ్రీకాకుళం: జిల్లాలో గల అన్ని యా జమాన్యాల పాఠశాలలకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ డిసెంబర్ 6వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు శుక్రవారం తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా చెల్లించడానికి డిసెంబర్ 6 వరకు గడువు ఉందని, రూ.50లు ఆలస్య రుసుంతో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు, రూ.200లు రుసుంతో డిసెంబర్ 10 నుంచి 12వ తేదీ వరకు, రూ.500లు అపరాధ రుసుంతో డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు చెల్లించాలని, ప్రధానోపాధ్యాయులు వెబ్ సైట్లో తమ స్కూల్ లాగిన్లో విద్యార్థి వివరాలు ధ్రువీకరణ చేసి, ఫీజు చెల్లించాలని డీఈఓ తెలిపారు. -
● మృతురాలి కుటుంబానికి చెక్ అందజేత
ఇటీవల కాశీబుగ్గ–పలాస వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన తొక్కి సలాటలో తొమ్మిది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు అండగా నిలబడేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మృతుల కుటుంబానికి రూ.రెండు లక్షలు చొప్పున సహాయం అందజేశారు. అందులో భాగంగా సంఘటనలో మృతి చెందిన ఒడిశా రాష్ట్రం గుడ్డిభద్ర గ్రామానికి చెందిన రంగాల రూప ఉరఫ్ జ్యోతి కుటుంబానికి సైతం ఆర్థిక సాయం అందించేందుకు వైఎస్సార్ సీపీ ముందుకు వచ్చింది. ఒడిశాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ మృతురాలి తండ్రి ఢిల్లేశుకు శుక్రవారం రెండు లక్షల రూపాయల చెక్ను అందజేసింది. దీంతో ఒడిశా వాసులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన సహాయానికి మురిసిపోయారు. చెక్ అందించిన వారి జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, ఇచ్ఛాపురం ఎంపీపీ బోర పుష్ప, ఒడిశా పాత్రపురం బ్లాక్ చైర్మన్ వై.మోహనరావు, కంచిటి జెట్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, లొద్దపుట్టి ఎంపీటీసీ సభ్యులు పిట్ట హేమలత, ఆశి మంథాకిని, కొఠారీ సర్పంచ్ దుక్క ధనలక్ష్మీ, శ్రీరామ్రెడ్డి, ఒడిశా గ్రామ పెద్దలు మద్ది భోజరాజు, పంది రఘుమోహనరావు, రోకళ్ల ధర్మరాజు, కె.పరుశురాం తదితరులు పాల్గొన్నారు. –ఇచ్ఛాపురం రూరల్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కవిటి : ఆర్.కరాపాడు టోల్గేట్ సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పంచారామ్ (28) అనే వ్యక్తి మృతిచెందాడు. కవిటి ఎస్ఐ వి.రవివర్మ తెలిపిన వివరాల ప్రకారం.. హైవేపై ఉన్న రాజస్థాన్ డాబాలో పంచారామ్ వంట మనిషిగా పని చేస్తున్నాడు. పని పూర్తయ్యాక రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో నడుచుకుంటూ వస్తుండగా భారీ వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన పంచారామ్ను ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్సులో తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ నుంచి జారిపడి మహిళకు గాయాలు ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండల కేంద్రం సమీపంలోని శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం బెలమాం గ్రామానికి చెంది న బెండు సూర్యకుమారి గాయాలపాలయ్యా రు. ఈమ తన సోదరుడు కర్రి సత్తిరెడ్డి ద్విచక్ర వాహనంపై పొందూరు నుంచి బెలమాం వెళ్తుండగా ఎచ్చెర సమీపంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద బండి నుంచి కిందకు జారిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. తల వెనుకభాగంలో గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. నందిగాం: బడగాంలో పాము కాటుకు గురై చికిత్స పొందుతున్న రైతు బమ్మిడి వైకుంఠరావు(49) గురువారం మృతి చెందాడు. గత నెల 22న పొలంలో పనిచేస్తుండగా వైకుంఠరావుకు నాగుపాము కా టు వేసింది. గ్రామస్తులు 108 ద్వారా టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కో సం శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. నిరుపేద కావడంతో వైకుంఠరావుకు వైద్య చికిత్స నిమిత్తం గ్రామస్తులు రూ.లక్ష సేకరించి ఆర్ధిక సాయం చేశారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వైకుంఠరావుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి
● కమిటీ దృష్టికి వచ్చిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి ● రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ అంచనాల కమిటీ శ్రీకాకుళం చేరుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గతంలో కలసి ఉన్న జిల్లా, ప్రస్తుత జిల్లా అధికారులతో 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అంచనాలపై సమీక్షించింది. కలెక్టర్ ఖర్చుల వివరాలు వివరించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదనరావు ఈ ఆర్థిక సంవత్సరాల్లో పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను శాసన మండలి సభ్యులు డాక్టర్ వీవీ సూర్యనారాయణ రాజు పెనుమత్స అడగ్గా డీడీ ఆ వివరాలు అందజేశారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి బాలికల వసతి గృహాలపై ఆరా తీశారు. బాలికల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ చెప్పగా ప్రతి విద్యార్థి ప్రొ ఫైల్ ఉందని, రిజిస్టర్లో అన్నీ నమోదు చేస్తున్నామ ని డీడీ తెలిపారు. కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ కలెక్టర్ సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ డీడీ అన్నాయ్ దొర జిల్లాలో ఉన్న గిరిజన హాస్టళ్ల గురించి వివరించారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ హాస్టళ్లలో మరుగుదొడ్లపై ప్రశ్నించారు. డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ గ్రామీణాభివృద్ధి శాఖలో అమలు చేస్తున్న పథకాలను వివరించా రు. కొత్త విధానంలో ఎన్ని గ్రూపులు రుణాలు పొందాయని కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు అడగ్గా 12 వందల కోట్లు ఇచ్చినట్లు పీడీ చెప్పారు. పింఛన్లు కాకుండా ఇంకా ఏవైనా ఉన్నాయా అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అడుగగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పీడీ వివరించారు. వన్స్టాప్ సెంటర్లపై కూడా వరుదు కల్యాణి ప్రశ్నించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ కింద పాతపట్నం, శ్రీకాకుళం, టెక్కలి నియోజకవర్గంలో కొన్ని పనులు రద్దు జరిగిందని, రద్దు అయిన పనుల పునరుద్ధరణకు కమిటీ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పలాస కిడ్నీ ఆస్పత్రిపైనా వరుదు కల్యాణి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ నష్టం జిల్లాలో ఎంత జరిగిందని కమిటీ సభ్యులు వరుదు కల్యాణి అడుగగా 1627 హెక్టార్లని జేడీ చెప్పారు. ఎంత మంది రైతులు ఇన్సూరెన్సు చేయించారని అడుగగా 55,634 మందికి చేయించినట్లు వ్యవసాయ శాఖ జేడీ చెప్పారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ, సీపీఓ లక్ష్మీ ప్రసన్న, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కృష్ణమూర్తి, ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, మత్స్య శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ, పీఆర్ ఎస్ఈ వీరన్నాయుడు, కమిటీతో పాటు రాష్ట్ర శాసన సభ డిప్యూటీ సెక్రటరీ కె.రాజా కుమార్, అసిస్టెంట్ సెక్రటరీ వి.బిక్షం, సెక్షన్ ఆఫీసర్ టి. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా, అథ్లెటిక్స్ ఫెడ రేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా అస్మిత అథ్లెటిక్స్ లీగ్–2025 పేరిట నిర్వహించిన క్రీడా పోటీలు శుక్రవారం ఉదయం మొదలై సాయంత్రం వరకు కొనసాగాయి. అండర్–14, 16 విభాగాల్లో మాత్రమే బాలికలకు ఈ పోటీలను నిర్వహించా రు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణులకు పత కాలు, బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. అంతకుముందు జరిగిన ఈపోటీల ప్రారంబోత్సవ సమావేశంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అథ్లెటిక్స్లో యువ టాలెంట్ను గుర్తించేందుకు కేంద్ర ప్రభు త్వం ఆదేశాల మేరకు అస్మిత అథ్లెటిక్స్ లీగ్ పేరిట పోటీల ను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతిభావంతులను గుర్తించి తదుపరి పోటీలకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో పి. సుందరరావు, ఏపీ అథ్లెటిక్స్ టెక్నికల్ కమిటీ చైర్మన్ కె.హరి బాబు, కె.మాధవరావు, పరిశీలకులు జమీల్, డీఎస్డీఓ ఎ.మహేష్బాబు, శ్రీనివాసరావు, మురళి, ఆనంద్, పురుషోత్తం, పీడీలు, పీఈటీలు, టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొన్నారు. -
● జగపతిబాబు సందడి
మేం రైతులం కాదా? అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతుల ఖాతాలో డబ్బు లు జమ చేస్తారన్నారు. మా గ్రామంలో మాత్రం ఏ రైతుకూ డబ్బులు జమకాలేదు. మేం రైతులం కాదా? – బొల్లు జమ్మినాయుడు, రైతు, సేతుభీమవరం నమ్మించి ముంచేశారు కూటమి నాయకుల మాటలు నమ్మి మోసపోయాం. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఏటా రూ.13,500 రైతు భరోసా పథకం కింద నిధులు జమ చేసేవారు. చంద్రబాబునాయుడు పాలనలో ఒక పైసా కూడా జమకాలేదు. – సాకాబత్తుల రమణ, రైతు, సేతుభీమవరం రైతులంటే చిన్న చూపు అన్నదాత సుఖీభవ పథకంతోపాటు ప్రభుత్వం మంజూరు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు అందడం లేదు. జగనన్న హయాంలో మాకు రైతు భరోసా పథకం వచ్చింది. రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపు. – బొల్లు రమేష్, రైతు, సేతుభీమవరం మోసపోయాం గతంలో రైతులకు ఏటా రూ.13,500 ఇచ్చేవారు. చంద్రబాబు ప్రతి రైతుకు రూ.20 వేల ఇస్తామని హామీ ఇవ్వడంతో ఓట్లు వేసి మోసపోయాం. – సాకాబత్తుల అప్పారావు, రైతు, సేతుభీమవరం -
మిల్లర్లకు కొమ్ముకాయవద్దు
● అధికారులకు స్పష్టం చేసిన కంబకాయ రైతులు నరసన్నపేట : ‘ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయాలి. మిల్లర్లకు కొమ్ము కాయవద్దు.. రైతులకు సహకారం అందించండి..’ అంటూ కంబకాయ గ్రామ రైతులు ముక్తకంఠంతో కోరారు. మిల్లర్లు చేస్తున్న దోపిడీ.. రైతులకు కలుగుతున్న నష్టాలపై గురువారం సాక్షిలో కథనాలు రావడంతో అధికారులు ఉరుకులు.. పరుగులు తీశారు. సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా వివరణ కోరడంతో ఉదయానికే ఆర్డీఓ సాయి ప్రత్యూష నరసన్నపేటలో వివాదానికి కారణమైన రైస్మిల్లుకు వెళ్లి ఆరా తీశారు. రైతులకు ఇబ్బంది కలిగించ వద్దని మిల్లర్లకు సూచించారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సాయంత్రం ఈ వ్యవహరంపై సీఎంఓ కార్యాలయం నుంచి వివరణ కోరగా తహసీల్దార్ టి.సత్యనారాయణ, సివిల్ సప్లయ్ డీటీ రామకృష్ణ, శ్రీకాకుళం సివిల్ సప్లయ్ కార్యాలయ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ హరిశంకర్.. కంబకాయ వెళ్లి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారుల తీరును రైతులు తీవ్రంగా దుయ్యబట్టారు. బుధవారమే తమకు న్యాయం చేస్తే ఇంత వరకూ వచ్చేదికాదన్నారు. మిల్లర్లకు వంత పాడవద్దని.. ఏ మాత్రం అవకాశం ఉన్నా రైతులకు అండగా ఉండాలని కోరారు. అనంతరం గ్రామంలో పండిన ధాన్యం శాంపిల్స్ను తీసుకువచ్చి నాణ్యతను పరిశీలించారు. నాణ్యత బాగున్నట్లు అధికారులు గుర్తించారని రైతులు అప్పలనాయుడు, పాగోటి భరద్వాజ్ తెలిపారు. 82 కేజీలు ఇవ్వడానికి రైతులు సిద్ధపడగా.. ఈమేరకు మిల్లర్లుకు ఒప్పించాలని, అంతకంటే అదనంగా తీసుకోవద్దని కోరారు. అధికారులు దీనిపై హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. మిల్లర్లతో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. -
జిల్లాకు వర్షసూచన
శ్రీకాకుళం పాతబస్టాండ్ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫాన్గా మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. బియ్యం బదులుగా రాగులు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని రేషన్కార్డు లబ్ధిదారులకు డిసెంబర్ కోటాలో బియ్యం బదులుగా మూడు కిలోలు వరకు రాగులు పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం వెల్లడించారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రతి రేషన్ డిపోలో ఏర్పాట్లు పూర్తయ్యాయని, లబ్ధిదారులు రేషన్ కార్డులతో వెళ్లి రాగులు తీసుకోవాలని కోరారు. ధాన్యలక్ష్మిగా నీలమణి అవలింగి నీలమణి అమ్మవారిని మార్గశిర మాస మొదటి గురువారం పురస్కరించుకుని ధాన్యలక్ష్మిగా అలంకరించారు. అర్చకు లు భాస్కర ఆచారి ఆధ్వర్యంలో విశేష పూజ లు, అభిషేకాలు నిర్వహించారు. – సారవకోట జిల్లాకు చేరిన శాసనసభ అంచనాల కమిటీ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ అంచనాల కమిటీ 2024–25 రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం జిల్లాకు చేరుకుంది. కమిటీ చైర్మన్ వేగుళ్లు జోగేశ్వరరావు(ఎమ్మెల్యే), డాక్టర్ వి.వి.సూర్యనారాయణరాజు పెనుమత్స(ఎమ్మెల్సీ), వరుదు కళ్యాణి (ఎమ్మెల్సీ) ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర శాసన సభ డిప్యూటీ సెక్రటరీ కె.రాజాకుమార్, అసిస్టెంట్ సెక్రటరీ వి.బిక్షం, సెక్షన్ ఆఫీసర్ టి.చిరంజీవి ఉన్నారు. వీరికి ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి కె.సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డ్వామా పీడీ సుధాకర్, తహసీల్దార్లు గణపతిరావు, శ్రీనివాసరావు స్వాగతం పలికారు. కాగా, కమిటీ సభ్యులు శుక్రవారం ఉదయం అరసవల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మంలోని కూర్మనాథ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ధాన్యం సేకరణపై సమీక్ష శ్రీకాకుళం పాతబస్టాండ్ : వర్షసూచన నేపథ్యంలో ధాన్యం సేకరణ వేగవంతం ఏయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, సంక్షేమ వసతి గృహాలు, ఆర్టీజీఎస్, ప్రజా సానుకూల దృక్పథం తదితర అంశాలపై కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని అవయవదానం రణస్థలం: లావేరు మండలం గోవిందపురం పంచాయతీ ఇజ్జాడపాలెం గ్రామానికి చెందిన ఇజ్జాడ ధనలక్ష్మి(17) మరణంలోనూ సజీవంగా నిలిచింది. బాలిక ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో బుధవారం మరణించింది. తల్లిదండ్రులు ఇజ్జాడ రాము, సాయిలు తీవ్ర విషాదంలోనూ ముందుకొచ్చి తమ కుమార్తె అవయవాలను దానం చేయాలని నిర్ణయించారు. కిడ్నీ, గుండె దానం చేసి మరో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపారు. జెమ్స్ ఆస్పత్రి నుంచి రోడ్డు మార్గాన గ్రీన్ చానల్ ద్వారా విశాఖ విమానాశ్రయానికి అవయవాలు చేరుకున్నాయి. ప్రత్యేక అంబులెన్స్ ద్వారా విమానాశ్రయానికి చేరుకున్న వీటిని వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి గ్రీన్ చానల్ ద్వారా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
జవహర్ నవోదయం విద్యా ఉషోదయం
●డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష ●ఎంపికై నవారికి అత్యుత్తమ విద్య ●గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు సరుబుజ్జిలి: గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో జిల్లాలోని సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో, 32 ఎకరాల విస్తీర్ణంలో నవోదయ విద్యాలయం 1988లో ప్రారంభించారు. ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు(తమిళనాడు మినహా), 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 660 జేఎన్వీ కేంద్రాలు విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 కేంద్రాలు ఉన్నాయి. వెన్నెలవలస విద్యాలయంలో విభిన్నమైన బోధన పద్ధతి, వసతి, విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు నాయకత్వ లక్ష్యణాలను పెంపొందించడం, స్వచ్ఛమైన వాతావరణం వంటి ప్రత్యేకతలతో దేశంలోనే ఖ్యాతి గడించింది. ఈ కేంద్రంలో సీబీఎస్ఈ విధానంలో ప్రస్తుతం 6 నుంచి 12 తరగతుల వరకు 416 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బాల, బాలికలకు 6 నుంచి 8 తరగతులు, 9 నుంచి 12 తరగతులకు 4 వేర్వేరుగా బ్లాకుల్లో వసతి సౌకర్యం కల్పిస్తారు. ఈ నాలుగు బ్లాక్ల పేర్లు ఆరావలి(రాజస్థాన్), నీలగిరి(తమిళనాడు), ఉదయగిరి(ఒడిశా), శివాలిక్(పంజాబ్–హర్యానా) దేశంలోని నాలుగు దిక్కుల పర్వతాలతో ఉండడం విశేషం. దీనికి అనుగుణంగానే ఎంపిక చేయబడిన కొంతమంది విద్యార్థులు దేశంలోని మిగతా జేఎన్వీలకు వెళ్లి తొమ్మిదో తరగతిలో ఏడాది పాటు విద్యానభ్యసిస్తారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని గౌతమబుద్ధ నగర్ విద్యార్థులు ఏటా 23 మంది ఇక్కడి వస్తుంటారు. దీనివల్ల సోదరభావం అభివృద్ధి చెందడమే కాకుండా బాల్యంలోనే దేశంలోని వివిధ ప్రాంతాలపై అవగాహన కలుగుతుంది. మారుతున్న పోటీ ప్రపంచంతో పాటు ఇక్కడి విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా శిక్షణ అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు 40 కంప్యూటర్లు, ల్యాబ్టాప్ల ద్వారా విద్యార్థులు రోజువారీ అభ్యాసం అవ్వడంతో పాటు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉండడంతో ప్రపంచంతో అనుసంధానం అవుతారు. దీనితో పాటు డిజిటల్ తరగతులు, నిష్టాతులైన అధ్యాపకులు, ల్యాబ్ విద్యార్థుల సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు దోహదపడుతుంది. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కూడా చక్కగా మాట్లాడగలగడం ఇక్కడి విద్యార్థుల అదనపు బలం. జిల్లాలో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతాల విద్యార్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లు పట్టణ ప్రాంతాలకు కేటాయిస్తారు. మొత్తం సీట్లలో 1/3 వంతు సీట్లు బాలికలకు కేటాయిస్తారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5, దివ్యాంగులకు 3 శాతం సీట్లు రిజర్వ్ చేయబడతాయి. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ప్రాతిపదికన ఎంపికలు జరుగుతాయి. రెండు గంటల వ్యవధిలో పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. 100 మార్కులకు విద్యార్థి చదువుతున్న మాధ్యమంలో ప్రశ్నాపత్రం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ 50 మార్కులు, అర్థమెటిక్ 25 మార్కులు, లాంగ్వేజ్ టెస్ట్కు 25 మార్కులు కేటాయిస్తారు. మొత్తం 2 గంటల సమయంలో 3 విభాగాలకు సమాధానాలు రాయాలి. వీటిలో 5వ తరగతికి సంబంధించి గణిత పరీక్షలో అంకెలు, సంఖ్యా పద్ధతి, భిన్నాలు మరియు మేథాశక్తికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఓఎంఆర్ సీట్లలో మాత్రమే బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్నుతో సమాధానాలు రాయాలి. విద్యార్థులు ప్రస్తుతం ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతిలో చదువుతూ ఉండాలి. నవోదయ విద్యాలయంలో ఆరో తరగతితో మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఒక్కో విద్యాలయానికి 80 సీట్లు కేటాయిస్తారు. ఒకసారి ప్రవేశం పొందిన విద్యార్థులు 12వ తరగతి(ఇంటర్) వరకు విద్యాభ్యాసం చేయవచ్చు. 8వ తరగతి వరకు విద్యార్థి మాతృభాషలో బోధన ఉంటుంది. తర్వాత ఆంగ్లంలో బోధనలు ఉంటాయి. ఇంటర్ పరీక్షలకు సీబీఎస్ఈ సిలబస్లో హాజరు కావాలి. 6వ తరగతి ప్రవేశ పరీక్ష అంతా పారదర్శకంగా నిర్వహిస్తాము. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందవద్దు. ప్రవేశ పరీక్ష కోసం 7,239 మంది దరఖాస్తులు చేశారు. డిసెంబర్ 13న జిల్లాలోని 32 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రశ్నాపత్రం తయారీ, విద్యార్థుల ఎంపిక అంతా సీబీఎస్ఈ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతిభ ఉన్నవారికి తప్పక సీటు లభిస్తుంది. ఒత్తిడి లేకుండా పరీక్షలుకు సిద్ధమవ్వాలి. – బి.బేతనసామి, ఇన్చార్జి ప్రిన్సిపాల్, వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయం -
వేడుక వేళ విషాదం
● గృహ ప్రవేశానికి వచ్చి అనంత లోకాలకు.. ● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం ● మరొకరి పరిస్థితి విషమం పలాస/వజ్రపుకొత్తూరు రూరల్/పాతపట్నం: పలాస మండలం గరుడఖండి పాత జాతీయ రహదారిపై గురువా రం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం మండలం సరాళి గ్రామానికి చెందిన యువకుడు తలగాపు భీమారావు(27), ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా మహేంద్రగౌడ్ గ్రామానికి చెందిన సుశాంత్ పైకో (25) దుర్మరణం పాలయ్యారు. వీరభద్రాపురం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి తలగాపు వేణు తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. భీమారావు, వేణు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఒడిశాకు చెందిన సుశాంత్ మరో బైక్పై ఎదురెదురుగా వస్తూ గరుడఖండి రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద పరస్పరం ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. గాయపడిన వేణును పలాస ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం రిమ్స్కు తరలించారు. ఆనందంగా గడిపి.. సరాళికి చెందిన భీమారావు విశాఖపట్నంలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం తండ్రి శాంతారావు మృతి చెందడంతో తాతగారి గ్రామం సరాళిలో స్థిరపడ్డారు. సొంత గ్రామమైన వీరభద్రపురంలో బంధువులతో కలిసి ఇటీవల ఇల్లు నిర్మించారు. గురువారం గృహప్రవేశం కోసం విశాఖపట్నం నుంచి వచ్చిన భీమారావు విందు అనంతరం బంధువులు, స్నేహితులతో సరదాగా గడిపాడు. తర్వాత పెట్రోల్ కోసం సోదరుడి వరసైన తలగాపు వేణుతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లారు. ఇంతలో ఘోరం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. భీమారావుకు తల్లి లక్ష్మీ, సోదరుడు ఉన్నారు. ఘటనా స్థలాన్ని కాశీబుగ్గ పోలీసులు పరిశీలించారు. కాశీబుగ్గ ఎస్ఐ నర్సింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
30 మందికి డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతులు
అరసవల్లి: గ్రామ సచివాలయాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా మండల జీఎస్డబ్ల్యూఎస్ అధికారులుగా జిల్లాలో 30 మందికి అడహక్ పదోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలో 30 మండలాల్లో ప్రత్యేకంగా డిప్యూటీ ఎంపీడీఓ హోదాతో ఫస్ట్ లెవల్ గెజిటెడ్ ఆఫీసర్లుగా పంచాయతీరాజ్ శాఖకు చెందిన సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించారు. ఈఓపీఆర్డీ పోస్టును ఇటీవలే డిప్యూటీ ఎంపీడీవోలుగా మార్పు చేసిన సంగతి విదితమే. తాజాగా అదే హోదాతో మండల జీఎస్డబ్ల్యూఎస్ అధికారులుగా సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పి స్తూ కొత్త స్థానాలను కేటాయించారు. పదోన్నతలు పొందిన వారిలో మాసపు సంతోష్కుమా ర్ (సారవకోట), డి.అప్పన్న (పొందూరు), జి.తులసీదాస్ (శ్రీకాకుళం), కె.వి.వి.జగన్నాథరావు (గార), కె.అనూరాధ (ఎచ్చెర్ల), బి.కృష్ణారావు (పాతపట్నం), జి.వెంకటరావు (కొత్తూరు), హెచ్.ఉమాపతి (నందిగాం), ఎస్.రామ్మోహనరావు (ఆమదాలవలస), ఎం.నారాయణమ్మ (లావేరు), వి.అప్పయ్య (మెళియాపుట్టి) , పి. వి.ఎన్.మూర్తి (జలుమూరు), పల్లి ద్రాక్షాయణి (నరసన్నపేట), జి.త్రినాథరావు (టెక్కలి), ఎం.శాంతకుమారి (సోంపేట), పి.వెంకట మురళి (జి.సిగడాం), ఎల్.లక్ష్మణమూర్తి (కంచిలి), సీహెచ్.లక్ష్మణరావు (సంతబొమ్మాళి), ఎస్.ఉమాపతి (పలాస), ఎం.భాస్కరరావు (బూర్జ), జె.ఝాన్సీలక్ష్మి (రణస్థలం), టి.వి. లీలారాజు (కోటబొమ్మాళి), ఎ.మృత్యుంజయ రావు (సరుబుజ్జిలి), పి.ప్రజ్ఞ శిరీష (హిరమండలం), జి.సంధ్యారాణి (పోలాకి), జి.అప్పలనాయుడు (ఎల్ఎన్పేట), ఎం.రాజేష్ (ఇచ్ఛాపురం), బి.వి.ఎస్.రెడ్డి (కవిటి), ఎ.శ్రీనివాసరావు (వజ్రపుకొత్తూరు), ఎల్.వి.నాగకుమార్ (మందస) ఉన్నారు. -
పేదింటి యువతికి పెళ్లి కానుక
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని బలరాంపురం గ్రామానికి చెందిన జ్యోతిర్మయి అనే యువతికి శ్రీకాకుళం నగరానికి చెందిన సప్తగిరి జ్యూయలర్స్ అధినేత గంగు వెంకటరావు కల్యాణ మస్తు పేరిట రెండు తులాల బంగారం, పావుకేజీ వెండి వస్తువులను గురువారం అందజేశారు. ఏడాది క్రితం శ్రీకాకుళంలోని సప్తగిరి జ్యూయలర్స్ షాపులో తీసిన లక్కీ డ్రాలో జ్యోతిర్మయి కల్యాణ మస్తు స్కీమ్లో ఎంపిక కావడంతో ఆమెకు సర్టిఫికెట్ అందజేశారు. ప్రస్తుతం జ్యోతిర్మయికి గురువారం వివాహం కావడంతో సప్తగిరి షాపు యజమాని ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు, గ్రామపెద్దలు సమక్షంలో కల్యాణమస్తు కింద ఆభరణాలు అందించారు. -
గంజాయి అడ్డాలు..!
● గ్రానైట్ క్వారీలే ● కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఇలాకాలో తరచూ పట్టుబడుతున్న వైనం ● గ్రానైట్ పరిశ్రమల్లో పని చేస్తున్న ఇతర రాష్ట్రీయుల ద్వారా సరఫరా దృష్టిపెడతాం.. టెక్కలి నుంచి నరసన్నపేట వరకు ఉన్న కర్మాగారాలపై దృష్టిపెడతాం.క్వారీలు, ముఖ్య కేంద్రాల వద్ద తనిఖీలు చేపడతాం. గంజాయి విషయంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. – డి.లక్ష్మణరావు, డీఎస్పీ, టెక్కలిశ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు ఇలాకాలో గంజాయి అక్రమ రవా ణా విస్తరిస్తోంది. అచ్చెన్న సొంత నియోజకవ ర్గంలో కోటబొమ్మాళి, నిమ్మాడ కూడలి కేంద్రాలుగా అధిక సంఖ్యలో ఉన్న గ్రానైట్ కటింగ్ పాలిషింగ్ పరిశ్రమలతో పాటు, గ్రానైట్ రాళ్ల తవ్వక పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. గంజాయి క్రయవిక్రయాల్లో వీరి పాత్ర ఉన్నట్లు పలు కేసులు రుజువు కావడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వారిపైనే అనుమానం.. కోటబొమ్మాళి, నిమ్మాడ ప్రాంతాల్లో దాదాపు 100కు పైగా గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ పరిశ్రమలే కాక గ్రానైట్ రాళ్లు తవ్వే క్వారీలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో సుమారు వెయ్యి మందికి పైగా కార్మి కులు పనిచేస్తున్నారు. వీరిలో ఒడిశా, రాజస్థాన్, ఇతర రాష్ట్రాలకు చెందినవారు దాదాపు 500 మంది ఉన్నారు. స్వస్థలాల నుంచి రైళ్లు, బస్సుల్లోనూ రాకపోకలు సాగిస్తుంటారు. బరంపురం రోడ్డు వద్ద రైలెక్కి హరిశ్చంద్రపురం, తిలారు వద్ద సాధారణ డీఎంయూ బళ్లపై వస్తుంటారు. వీరిలో కొందరు 5 కిలోల నుంచి 10 కిలోల లోపు గంజాయిని తెచ్చి నేరుగా కర్మాగారాలకు, స్థానిక కార్మికులతో పాటు రాజస్థానీయులకు అందిస్తుంటారని సమాచారం. అక్కడి నుంచి జర్జంగి, పెద్దబమ్మిడి, నిమ్మాడ కూడలి కేంద్రాలుగా చేసుకుని చీకటి సమయాల్లో గంజాయి క్రయ విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదీ నిఘా..? ప్రధానంగా ఉండే పాతపట్నం, ఇచ్ఛాపురం–పురుషోత్తపురం, పైడిభీమవరం చెక్పోస్టులతో పాటు డైనమి క్ చెక్పోస్టులు పోలీసులు ఏర్పాటు చేసినా గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఏడాది కాలంగా కోటబొమ్మాళిలో పదికి పైగా గంజాయి కేసులు నమోదు కాగా వారిలో ఒడిశా వారి పాత్రే ఎక్కువ. జి ల్లాలో ఈ ఏడాది 1200కిలోలకు పైగా గంజాయిప ట్టుబడింది. పట్టుబడిన వారిలో ఒడిశా వారే ఎక్కువ.మార్గాలివే.. వీరంతా రాత్రి వేళల్లో లూప్లైన్ మార్గాలు ఎంచుకుని వస్తున్నారన్నది సమాచారం. పలాస : గొప్పిలి, రెంటికోట, గారబంద. మందస : తాళ్లగురంటి, సిరిపురం, సాబకోట, బుడార్సింగి, బీవైపురం, గొప్పిలి రోడ్డు జంక్షన్. బెండిగేట్: టెక్కలిపట్నం, చాపర, పి.పద్మాపురం ఒడిశా సుంకి చెక్పోస్టు : పార్వతీపురం మన్యంజిల్లా సాలూరు, రాజాం, చిలకపా లెం (పొందూరు రోడ్డు మీదుగా) -
ఓటర్ల జాబితా తయారు చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రానున్న పంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారు చేయాలని, ఆర్వో ఇందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ఓటర్ల సమ్మరీపై ఆర్వోలు, ఏఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి, క్లయిములపై ఆయన సమీక్షించారు. బూత్ స్థాయి సిబ్బంది తో సమావేశంలో నిర్వహించి, ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో, ఎస్డీసీలు తదితరులు పాల్గొన్నారు. -
ఏమి సేతుము బాబూ!
● సేతుభీమవరంలో రైతులకు వర్తించని అన్నదాత సుఖీభవ ● ఇనాం భూములు, కౌలురైతుల పేరిట పథకానికి దూరం చేసిన చంద్రబాబు సర్కారు ● వైఎస్సార్సీపీ పాలనలో రైతుభరోసా అందిందంటున్న గ్రామస్తులు ● కలెక్టరేట్ వద్ద ధర్నాకు సమాయత్తం జి.సిగడాం: నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచేశారని జి.సిగడాం మండలం సేతుభీమవరం గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. ఇనాం భూములు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయకపోవడంతో గ్రామంలో 150 మంది రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇనాం, కౌలు రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేశారని, ఐదేళ్లూ సకాలంలో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారని గుర్తు చేస్తున్నారు. అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకని బాధిత రైతులంతా ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ త్వరలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని చెబుతున్నారు. అధికారులు మాత్రం తమకు ఆదేశాలురాలేదంటూ చేతులు దులుపుకొంటున్నారు. ఇదీ పరిస్థితి.. చంద్రబాబు ప్రభుత్వం రెండు విడతలు చొప్పున అన్నదాత సుఖీభవ పథకం– పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుకు రూ.14 వేలు చొప్పున విడుదల చేసింది. కానీ సేతుభీమవరం గ్రామంలో రైతులకు ఒక్క రూపాయి కూడా జమకాలేదని గ్రామానికి చెందిన బొల్లు జమ్మినాయుడు, బొల్లు కూర్మినాయుడు, పోగతోక రాంబాబు, పైల ఆదినారాయణ, పైల త్రినాథరావు, బొల్లు రమణ, సాకాబత్తుల గోపాలరావు, మావిడి అప్పారావు, కె.సురేష్, కె.అప్పారావు, సాకాబత్తుల శ్రీరాములు, కుదిరెళ్లు అప్పారావు, సాకాబత్తుల లక్ష్మణరావు తదితర 150 మంది గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించినా ఫలితం లేకపోయిందన్నారు. జగనన్న హయాంలో.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామంలోని ఇనాం, కౌలు రైతులు 150 మందికీ ప్రతి ఏటా రూ.13,500 చొప్పున ఠంఛన్గా జమ చేసేవారు. జగనన్న పాలనలో గ్రామంలో సుమారు 1.10 కోట్ల రూపాయల మేర రైతులు లబ్ధి పొందారు. అవసరమైన ఎరువులు రైతుల ఇంటికే చేర్చేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ఇబ్బందులే తప్ప ఎటువంటి సంక్షేమం అందలేదని రైతులు మండిపడుతున్నారు. అప్పుడే బాగుంది.. వైఎస్సార్ సీపీ పాలనలో మా గ్రామ రైతులంతా ఆనందంగా జీవించాం. రైతు భరోసాతోపాటు పలు సంక్షేమ పథకాలు అందేవి. పంటలు బాగా పండించుకుని మద్దతు ధరకు అమ్మేవాళ్లం. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ రెండు విడతలూ ఇవ్వలేదు. – పైల దుర్గారావు, రైతు, సేతు భీమవరం మంత్రికి విన్నవించినా.. పథకాలు అందడంలేదని మంత్రి నారా లోకేష్ వద్దకు వెళ్లి వినతిపత్రం అందించాం. అయినా పరిష్కారం కాలేదు. మా కార్యకర్తలకే న్యాయం చేయలేకపోతున్నాం. – సాకాబత్తుల శ్రీరాములు, సేతుభీమవరం ఫలితం లేదు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో గ్రామస్తులకు అన్ని సంక్షేమ పథకాలు ఇంటికే చేరేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక 150 మంది రైతులకు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ డబ్బులు పడలేదు. అధికారులకు వినతులు ఇచ్చినా ఫలితం రాలేదు. – తొత్తడి రామారావు, సర్పంచ్, సేతుభీమవరం -
గుంతలో పడి మూగజీవి మృతి
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని గరుడభద్ర ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఉన్న గుంతలో గురువారం పాడి ఆవు ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. ఒక టవర్ కోసం ప్రైవేట్ వ్యక్తులు గుంతలు తవ్వి విడిచిపెట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మర్రిపాడు గ్రామానికి చెందిన పాడిౖ రెతు గూడ భాస్కరరావు జీవనాధారమైన సుమారు రూ.90 వేలు విలువ గల పాడి ఆవు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ నాయకుడు గూడ ఈశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. రోడ్డు పక్కన తవ్వి వదిలేసిన గుంతలను వెంటనే పూడ్చాలని కోరారు. -
సిక్కోలు లఘు చిత్రోత్సవం లోగో ఆవిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం పట్టణానికి చెందిన మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ, పీకే ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సిక్కోలు లఘు చిత్రోత్సవం – 2025 లోగోను శ్రీకాకుళం నెహ్రు యువకేంద్రం డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ ఉజ్వల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం యువత క్రియేటివిటీ టాలెంట్ను నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశమన్నారు. ఈ లోగో శ్రీకాకుళం సంస్కృతి సంప్రదాయా లు, కళలు ప్రతిబింబించే విధంగా చిత్రీకరించి న ఆర్ట్ డైరెక్టర్ మణిపాత్రుని నాగేశ్వరరావుని అభినందిస్తూ ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహ కులు ప్రసాద్, కుమారి, కీర్తి, అభిరామ్, సంజు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్స రం చదువుతున్న అంబటి గణేష్ రగ్బీ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికై న ట్లు కళాశాల ప్రిన్సిపాల్ టి.హేమసుందర్ తెలిపారు. ఇటీవల కర్నూలు జిల్లాలోని ఆదర్శ విద్యా మందిర్ క్రీడా మైదానంలో జరిగిన 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్లో అండర్–19 బాలుర విభాగంలో శ్రీకాకుళం జిల్లా తృతీయ స్థానం సాధించింది. ఈ జట్టులో పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులుఎ.గణేష్, బి.ప్రసా ద్, పి.వంశీ, ఎస్.అయ్యప్పలు ఉండ డం అభి నందనీయమని ప్రిన్సిపాల్ అన్నారు. వీరిలో గణేష్ జాతీయ పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. గురువారం విద్యార్థులను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. ఎచ్చెర్ల: ఖేల్ ఇండియా జాతీయ క్రీడా పోటీలు వెయిట్ లిప్టింగ్ విభాగంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ క్రీడాకారిణి గుజ్జల వర్షిత కాంస్య పతకం సాధించింది. ఈనెల 24వ తేదీ నుంచి రాజస్థాన్లోని బికనరీలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళా కేటగిరి 69 కేజీల విభాగంలో వర్షితకు గురువారం కాంస్యం వరించింది. ఈ విజయంపై వర్సిటీ వీసీ ఆచార్య కేఆర్ రజనీ, రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య, స్పోర్ట్స్ డీన్ డా.పి.రవికుమార్లు అభినందనలు తెలిపారు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ధర్మశాలలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్ప్రదేశ్లో జరిగిన అఖిల భారత మహిళల వెయిట్ లిప్టింగ్ పోటీల్లో కూడా బీఆర్ఏయూ తరుపున పాల్గొని రజత పతకం సాధించింది. -
బాధితులకు త్వరితగతిన నష్ట పరిహారం చెల్లించండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రోడ్డు ప్రమాదాల కేసుల్లో బాధితులకు త్వరితగతిన నష్ట పరిహారం చెల్లించా లని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, స్థానిక న్యాయ సేవా సదన్ కోర్టు ఆవరణలో పోలీసు అధికారులతో యాక్సిడెంట్ కేసుల్లో బాధితులపై గురువారం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితుల క్లెయిమ్లను త్వ రితగతిన చెల్లించుటకు మార్గాలను గురించి విశ్లేషించి సమీక్షించారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో బాధితుడికి సాయం చేయకపోవడం, నిర్లక్ష్యంగా వదిలి వెళ్లిపోవడం సరికాదన్నారు. అలాంటి వారిని విడవరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూ టీ కలెక్టర్ పద్మావతి, ఆర్డీవో కార్యాలయం నుంచి ఆర్.ఈశ్వరమ్మ, డిప్యూటీ తహసీల్దార్ డీఎం నాగేంద్ర ప్రసాద్, ట్రాఫిక్ పోలీసు సీఐ వి.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్వోలపై దుర్భాషలు
పలాస: మండలంలోని కంబిరిగాం రెవెన్యూ పరిధి లో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న స్థలాల్లో వెంచర్లు వేస్తున్న పలాసకు చెందిన రియల్ ఎస్టేటు వ్యాపారి కోరాడ శ్రీనివాసరావుపై కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేయాలని ముగ్గురు వీఆర్వోలు గురువారం ఫిర్యాదు చేశారు. దీంతో పరిశీలించి కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. కంబిరిగాంకు చెందిన ఒక వ్యక్తి తన పొలాలను శ్రీనివాసరావుకు విక్రయించాడు. రూ.కోట్ల విలువైన ఆ భూములను అతను కొనుగో లు చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. అందులో ఎత్తుపల్లాలను చదును చేయడానికి ఆ పక్కనే ఉన్న కొండను అక్రమంగా తవ్వి అనధికారికంగా కంకరను తరలించాడు. ఈ విషయంపై మైన్స్ అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో వారు ఇటీవల వచ్చి పరిశీలించారు. అనంతరం వారు సంబంధిత వ్యక్తి శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేశారు. నోటీసులపై వీరంగం ఆ నోటీసులను పట్టుకొని పలాస మండలానికి చెందిన కంబిరిగాం వీఆర్వో బి.వెంకటరావు, లక్ష్మీపు రం వీఆర్వో బి.వెంకటరమణ, చినంచల వీఆర్వో చంద్రమోహన్లు కలిసి రియల్ ఎస్టేటు వ్యాపారి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమయంలో అతను లేకపోవడంతో అతని భార్య వద్ద నుంచి అతడి ఫోన్ నంబర్ తీసుకొని కాల్ చేశారు. దీంతో ఆయన ఫోన్లో వీఆర్వోలపై విరుచుకుపడ్డా డు. నానా దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా ఆ వెంటనే పలాస తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వీరంగం చేశాడు. నోటీసులు ఇవ్వడానికి మీరెవ్వరంటూ తహసీల్దార్తో సైతం అమర్యాదగా మాట్లాడాడు. దీంతో తహసీల్దార్ టి.కల్యాణ చక్రవర్తి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కాశీబుగ్గ పోలీసులు అక్కడికి వెళ్లి శ్రీనివాసరావును అక్కడ నుంచి తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత వీఆర్వోల సంఘం తరుపున ఆ సంఘం నాయకు లు కొర్ల శ్రావణ్కుమార్, పైల సంతోష్, ఖగేశ్వరరా వు, అప్పలస్వామి, ప్రసాద్ తదితరులు స్టేషన్కు వెళ్లి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే బుధవారం రాత్రి ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. గురువారం కూ డా వెళ్లి మళ్లీ పోలీసులను కలిశారు. అప్పటికే స్టేషన్లో ఉన్న కాశీబుగ్గ ఎస్ఐ నర్సింహమూర్తి వారికి సమాధానం చెబుతూ.. సీఐ ప్రస్తుతం లేరని పరిశీలించి కేసు నమోదు చేస్తామని చెప్పారు. -
రైతుల కోసం మాట్లాడే అర్హత టీడీపీకి లేదు
ఆమదాలవలస: రైతుల కోసం మాట్లాడే అర్హత టీడీ పీకి లేదని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రస్తు తం చేస్తున్న రైతన్న కోసం కార్యక్రమం బూటకమ ని అన్నారు. అది రైతులను మోసం చేయడానికేనని మండిపడ్డారు. ఏడాదికి రూ.20,000లు రైతు భరో సా ఇస్తానని చెప్పి.. ఈ రెండు సీజన్లకు రూ. 40,000లు ఇవ్వాల్సింది పోయి, రూ.5,000లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం రైతుల ను నానా ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలులో ఎన్ని అక్రమాలు, వివక్షలు చూపుతారోనని రైతులు భయపడుతున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, సరుబుజ్జిలి జెడ్పీటీసీ సభ్యుడు సురవరపు నాగేశ్వరరావు, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి గురువుబెల్లి శ్రీనివాసరావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, ఆమదాలవలస మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, నాయకులు బద్రి రామారావు, కోవిలాపు చంద్రశేఖర్, అత్తులూరి రవికాంత్, కూన రామకృష్ణ, కృష్ణారావు, హేమంత్, ప్రసాద్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
జెమ్స్ ఆస్పత్రి జిల్లాకే తలమానికం
శ్రీకాకుళం రూరల్: రాగోలులోని జెమ్స్ ఆస్పత్రి జిల్లాకే తలమానికమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జెమ్స్లో యుగ్మా 25వ వార్షికో త్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాల్లో భాగంగా కొన్ని కేసులను జెమ్స్కు రిఫర్ చేయడం, వారు త్వరగా కోలుకోవ డం శుభపరిణామన్నారు. జెమ్స్లో వైద్యం బాగుందని, పేద ప్రజలకు మరిన్ని సేవలందివ్వాలని కోరారు. ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు జగపతిబాబు మాట్లాడుతూ.. అవయవ దానానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో తాను కిమ్స్లోనే చికిత్స చేసుకున్నానని వెల్లడించారు. ఆస్పత్రి వర్గాలు ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్, ఎన్.ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల్లో అలజడి
● తుఫాన్ హెచ్చరికలతో ఆందోళన ● ఈ ఏడాది వృథాగా మారిన 56 రోజులు ● ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆకలి కేకలుఇచ్ఛాపురం రూరల్: వరుస తుఫాన్లు గంగపుత్రులను వణికిస్తున్నాయి. రోజుల తరబడి వేటకు వెళ్లలేని దుస్థితిని కల్పిస్తున్నాయి. కుటుంబ పోషణను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. ప్రభుత్వం సైతం పట్టించుకోకపోవడంతో మత్స్యకారులు పస్తులతో కాలం గడపాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఈ ఏడాది దాదాపు ఐదు సార్లు అల్పపీడనం, వాయుగుండాలు, తుఫాన్లు రావడంతో జిల్లాలోని మత్స్యకారులు దాదాపు 56 రోజుల పాటు వేటకు దూరమయ్యారు. తాజాగా మరో తుఫాను ముంచుకొస్తుందంటూ వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో ఐదు రోజుల పాటు మళ్లీ వేటకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మత్స్యసంపద అంతంత మాత్రమే. తర్వాత ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల సంతోనోత్పత్తి సమయం కావడంతో 61 రోజుల పాటు వేటకు ప్రభుత్వం విరామం ప్రకటించింది. దీంతో దాదాపు ఆరు నెలలు పాటు మత్స్యకారులకు అరకొరగా వేట సాగింది. ఇక జూన్ నుంచి నవంబర్ వరకు వరుస తుఫాన్లు రావడంతో మత్స్యకారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ధరలు పతనం.. కొన్ని నెలలుగా సముద్రంలో చేపల వేట సజావుగా సాగక అల్లాడిపోతున్న మత్స్యకారులకు కార్తీక మాసం గుదిబండగా మారింది. జిల్లాలో దొరికే మత్స్య సంపదను అధిక ధరలకు కొనుగోలు చేసే ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల వ్యాపారులు కార్తీక మాసం పేరుతో ముఖం చాటేశారు. దీంతో కిలో రూ.120 నుంచి రూ.180 పలికే చేపలను రూ.50, రూ.60లకు అమ్ముకోవాల్సి వచ్చింది. కాస్తో కూస్తో వలకు చేరిన కవ్వళ్లతో వ్యాపారం చేద్దామనుకున్న సమయంలో మోంథా తుఫాన్ పుణ్యమాని సుమారు రూ.30లక్షలు ఎండు చేపలు వర్షార్పణం అయ్యాయి. నవంబర్లో వేల రూపాయలు ఆదాయం కల్పించే ఖరీదైన కోనేం చేపలు కూడా వలకు పడటం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ అల్లకల్లోలం.. తాజాగా తుఫాన్ హెచ్చరికతో మత్స్యకారులు ఆందోళనకు గురౌతున్నారు. బోట్లను ఒడ్డుకు చేర్చుకోవడం, వలలను సంరక్షించుకోవడం చేస్తున్నారు. ఇప్పటికే మోంఽథా తుఫాన్తో చితికిపోయిన మత్స్యకారులు మరో హెచ్చరికతో బెంబేలెత్తిపోతున్నారు. కనీసం రెండు నాటికల్ మైళ్ల దూరం కూడా వెళ్లలేక వెనుదిరుగుతున్నారు. ఈ ఏడాదిలో సముద్రంపై వలలను వదులుతూ వాటిని మళ్లీ తిరిగి లాక్కుంటూ రోజంతా శ్రమ పడుతూ రోజుకి రూ.4వేలు నష్టపోతున్నామే కానీ, తగిన ఆదాయం రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. గతంలో ఇలా లేదు.. మునుపెన్నడూ ఈ గతి చూడలేదు. వలకు పదేసి కోనేములు పడే సీజన్ ఇది. ఇప్పుడు ఒక్క కోనేం చేప కూడా పడటం నేదు. కవ్వళ్లు మాత్రం దొరుకుతున్నాయి. దీంతో ఉసూరుమంటూ ఒడ్డుకు తిరిగి వచ్చేస్తున్నారు. నాలుగైదు నెలలుగా గాలులు, వర్షాలతో ఇబ్బందులు పడుతున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే జీవనం కష్టమే. – మాగుపిల్లి మోహనరావు, మత్స్యకారుడు, డొంకూరు ఏడాదిగా అవస్థలే.. వరుస విపత్తులతో సముద్రంలో వేట సజావుగా సాగడం లేదు. ఈ ఏడాదిలో చాలా సార్లు తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు రావడంతో వేట లేక పస్తులుండాల్సి వస్తోంది. ఒకవేళ సముద్రంలోకి వెళ్లినా బోటు ఒక్కచోట ఆగకపోవడంతో చేపలు వలకు చిక్కడం లేదు. చివరకు పర(ఉప్పుటేరు)లో దొరికే చూపలతో పొట్టపోసుకుంటున్నాం. మొన్నటి వరకు కార్తీక మాసం అని చేపలు బేరం తగ్గిపోగా, ఇప్పుడు అస్సలు చేపలు దొరకడమే గగనంగా మారింది. ప్రభుత్వం ఎలాంటి సాయం కూడా చేయడం లేదు. – బుడ్డ జగ్గయ్య, మత్స్యకారుడు, డొంకూరు -
గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పాత్రపూర్ గ్రామానికి సంజుక్తదాస్ అనే మహిళ తన భర్తతో కలిసి సూరత్లో ఉండేది. అక్కడ గంజాయి వ్యాపారం చేస్తున్న తన భర్త స్నేహితుడు రంజాన్ ప్రదాన్, గంజాయి సమకూర్చే కునిపండాతో పరిచయమేర్పడింది. కొద్దిరోజుల తర్వాత భర్త మరణించడంతో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో పాత్రపూర్ గ్రామానికి చెందిన లోకనాథ్ ప్రదాన్తో కలిసి ఒడిశా నుంచి 29 కేజీల గంజాయి కొనుగోలు చేసి సూరత్ తరలించడానికి ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కు బుధవారం చేరుకున్నారు. స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు గంజాయితో వీరిరువురు పట్టుబడ్డారు. గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో పట్టణ పోలీస్స్టేషన్ ఇన్చార్జి కవిటి ఎస్సై రవివర్మ, సిబ్బంది పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: కార్మికవర్గాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే ఐక్యపోరాటాలు ఉద్ధృతం చేస్తామని అఖిలపక్ష కార్మిక, రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. కార్మిక హక్కులు కాలరాసే నాలుగు లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. రైతులు పండించే అన్ని పంటలకు కొనుగోలుతో మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలని కోరుతూ లేబర్ కోడ్లు నోటిఫికేషన్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లా డుతూ కార్మికవర్గం ప్రాణత్యాగాలతో సాధించుకున్న కార్మికచట్టాలను నిర్వీర్యం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లనుగా మార్చి దేశవ్యాప్తంగా అమలుచేయడానికి నవంబర్ 21న ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమని మండిపడ్డారు. పర్మినెంట్, కాంట్రాక్టు పద్ధతి స్థానంలో పరిమితకాల ఉద్యోగం పద్ధతి తెచ్చారని దుయ్యబట్టారు. కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కనీస సభ్యు ల సంఖ్యను పెంచడం, నిరసనలు ధర్నాలు నిర్వహించడానికి అనుమతులను తప్పనిసరి చేయడం తగదన్నారు. 2017లో ప్రధానమంత్రి ఇచ్చిన ‘రైతుల ఆదాయం రెట్టింపు’ హామీ పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సీహెచ్.అమ్మన్నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.మోహనరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పొందూరు చంద్రరావు, పోలాకి ప్రసాదరావు, సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ తాండ్ర ప్రకాష్, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు చిక్కాల గోవిందరావు, ఐఎఫ్టీయూ నాయకులు ఎస్.కృష్ణవేణి, ఏపీ మెడికల్ సేల్స్ – రిప్రెజెంటేటివ్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దేవాది వాసుదేవరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ కిసాన్ కాంగ్రెస్ నాయకులు సనపల అన్నాజీరావు, ఉద్యోగ, కార్మిక, రైతు సంఘాల నాయకులు ఆర్.ప్రకాషరావు, ఎం.గోవర్దనరావు, ఎన్.బలరాం, డి.యుగంధర్, కళ్యాణపు అప్పలరాజు, ఎం.ఆదినారాయణమూర్తి, సీహెచ్ చంద్రశేఖర్, పి.జగ్గారావు, టి.నందోడు పాల్గొన్నారు. -
మూడు కేటగిరీలుగా భజన మందిర నిర్మాణాలు
అరసవల్లి: తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ నిధులతో జిల్లాలో మత్స్యకార, బీసీ, ఎస్సీ ఎస్టీ తదితర బలహీన వర్గాల పంచాయతీ, కాలనీల్లో గుడి లేని ప్రాంతాల్లో కొత్తగా భజన మందిరాల నిర్మాణానికి నిధులు మంజూరుకు మార్గదర్శకాలను విడుదలయ్యాయని జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ బి.ఆర్.వి.వి.ప్రసాద్ పట్నాయక్ ప్రకటించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మూడు వర్గాలుగా భజన నిర్మాణాలు జరిపేందుకు టీటీడీ నిర్ణయించిందని వివరించారు. ఆయా ప్రదేశాల్లో ప్రభుత్వానికి చెందిన లేదా ఎవరైనా అంగీకారంలో ఇచ్చిన ప్రైవేటు భూములనైనా (యజమాని బాండ్ పేపర్ అగ్రిమెంట్తో) ఈ భజన మందిరాల నిర్మాణాలకు వినియోగించవచ్చునని పేర్కొన్నారు. స్థల పరిశీలన అనంతరం అర్హత ఉన్న చోటే నిర్మాణాలకు ఆమోదం లభిస్తుందన్నారు. మందిరాల మంజూరు అంశాలన్నీ దేవదాయ శాఖ ద్వారానే జరుగుతాయని, తమ ప్రాంతాల్లో భజన మందిరాలను నిర్మించదలచిన వారు కమిటీగా ఏర్పడి స్వీయ ధృవపత్రాలతో పాటు ఆయా స్థలాల హద్దుల వివరాలను టీటీడీ ఫార్మాట్ దరఖాస్తులో పొందుపరిచి జిల్లా దేవదాయ శాఖాధికారి కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. టైప్–ఎ కింద 5 సెంట్ల భూమి ఉన్న చోట భజన మందిరాలకు రూ.10 లక్షలు, టైప్–బి కింద 10 సెంట్ల విస్తీర్ణంలో నిర్మాణానికి రూ.15 లక్షలు, 10 సెంట్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణానికి రూ.20 లక్షల వరకు అంచనా వ్యయంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులను మంజూరవుతాయని వివరించారు. దరకాస్తులను పరిశీలించి, స్థలాల పరిశీలన బాధ్యతలన్నీ దేవదాయ శాఖ ఇంజినీర్లు, ఇన్సెస్పెక్టర్ల ఆధ్వర్యంలో పూర్తయ్యాక అర్హులను గుర్తించి పూర్తి వివరాలను రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించనున్నామని ప్రసాద్ పట్నాయక్ వివరించారు. -
ఏఎన్ఎంల ధర్నా
అరసవల్లి: సచివాలయాల్లో పనిచేస్తున్న వైద్యశాఖ గ్రేడ్–3 ఏఎన్ఎంలకు పదోన్నతులు కల్పించాలంటూ ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఏఎన్ఎంల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డీఎంహెచ్వో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధి రంగమ్మ మాట్లాడుతూ పొరుగు జిల్లాల్లో గ్రేడ్–3 ఏఎన్ఎంలకు పదోన్నతులు కల్పించే ప్రక్రియలు పూర్తయ్యాయని, శ్రీకాకుళంలో మాత్రం అధికారులకు చలనం లేదని..ఇప్పటికై నా ఏఎన్ఎంల ఆవేదనను అర్ధం చేసుకుని పదోన్నతులు కల్పించాలని కోరారు. విద్యుత్ షాక్తో వలస కూలీ మృతి రణస్థలం: లావేరు మండలం గుమ్మడం పంచాయతీ వాళ్లెపేట గ్రామానికి చెందిన వాళ్లె కన్నంనాయుడు(38) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నంనాయుడు బతుకు తెరువు కోసం చిలకలూరిపేట టౌన్లో పనిచేస్తుండగా ఈ నెల 25న విద్యుత్ షాక్కు గురయ్యాడు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అదే రోజు రాత్రి 10.30 గంటల సమయంలో మృతి చెందాడు. కన్నంనాయుడుకు భార్య ఆదిలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడాది క్రితం తండ్రి రాముడు చని పోవడం, తల్లి అనారోగ్యంతో ఇంట్లోనే ఉండటం, కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటున్న తరుణంలో ఇలా జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి వజ్రపుకొత్తూరు : పూండి రైల్వేస్టేషన్లో సమీపంలో బుధవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. 30 నుంచి 35 ఏళ్లు వయస్సు కలిగి లైట్ బ్లూ కలర్ జీన్ ఫ్యాంటు, జిప్ ఉన్న ఫుల్ హ్యాండ్స్ టీ షర్టు ధరించి ఉన్నాడు. తల భాగం పూర్తిగా ఛిద్రమైంది. ఈ మేరకు స్టేషన్ మాస్టర్ పలాస జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలాస జీఆర్పీ ఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు టెక్కలి: టెక్కలి నియోజకవర్గంలో పలు ఆలయాల అభివృద్ధికి సీజీఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు, టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జునస్వామి ఆలయం అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. -
వ్యక్తి మృతి కేసులో ఐదుగురి అరెస్టు
టెక్కలి రూరల్: గోపినాథపురంలో సమీపంలో ఈ నెల 23వ తేదీ రాత్రి కొమనపల్లి పద్మనాభం(26) మృతి చెందిన కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పద్మనాభంను గోపినాథపురం సమీపంలో కొంత మంది వ్యక్తులు దాడిచేసి చంపేశారని అతని తల్లి 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోపినాథపురం గ్రామానికి చెందిన చితారు చంద్రశేఖర్, ధవళ నర్సింగరావు, ధవళ రాంబాబు, దుప్పట్ల మల్లేశ్వరరావు, ధవళ రామరాజులతో పాటు మరికొంత మంది వ్యక్తులు ముందస్తు ప్రణాళికతో పద్మనాభంను ఇనుపరాడ్లు, కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు చికిత్స పొందుతూ రిమ్స్లో మృతిచెందాడు. పద్మనాభంకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఎవరిపై పడితే వారిపై దాడి చేసి గాయపరిచేవాడు. ఇతడితో ఎప్పటికై నా ప్రమాదం ఉందని భావించి నిందితులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
నూతన భవనంలోకి వర్సిటీ కార్యాలయాలు
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్సిటీలో సుమారు రూ.38 కోట్ల నిధులతో జీ ప్లస్ 4 సముదాయంగా నిర్మించిన డాక్టర్ ఎన్టీఆర్ నూతన పరిపాలనా భవనాన్ని వైస్ చాన్సలర్ కె.ఆర్ రజనీ, ఉన్నతాధికారులు, పాలకమండలి సభ్యులతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన భవనం ప్రారంభంతో వర్సిటీకి పాలనా పరమైన వసతి సమస్య దాదాపుగా తీరినట్లయ్యిందని తెలిపారు. గత వీసీలు కె.రామ్జీ, ఎన్.వెంకటరావు కృషికి తోడు ప్రస్తుత వర్శిటీ ఉన్నతాధికారులు, అవిశ్రాంత ప్రయత్నంతో భవన నిర్మాణం పూర్తయ్యిందన్నారు. ప్రోటోకాల్ విషయమై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ అవన్నీ సమసిపోయాయనిచెప్పారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం, జాతీయ లా డే కార్యక్రమంలో వీసీ మాట్లాడారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ఈసీ సభ్యులు కె.చక్రపతి, ప్రిన్సిపాల్స్ ఎం.అనూరాధ, కె.స్వప్నవాహిని, సీహెచ్ రాజశేఖరరావు, కె.సామ్రాజ్యలక్ష్మీ, భవనం ఆర్కిటెక్చర్ రాదేశ్యాం, సీపీడబ్ల్యూడీ ఏఈ శ్రీనివాస్, జి.పద్మారావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు న్యాయ విభాగం అధ్యాపకులు జ్ఞాపికలను వీసీ అందించి అభినందించారు. కాగా రాజ్యాంగ దినోత్సవం పురష్కరించుకుని వర్శిటీలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రజాప్రతినిధులు గైర్హాజరు భవనం ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఈఆర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు ఆహ్వానం అందినా ఎవరూ రాకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో వర్సిటీ అధికారులే ప్రారంభించేశారు. ప్రజాప్రతినిధులు వర్సిటీని సందర్శిస్తే ఇక్కడ సమస్యలు వారికి తెలుస్తాయని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించవచ్చని చెబుతున్నారు. అయితే ప్రజాప్రతినిధులు మాత్రం మొదటి నుంచీ గైర్హాజరవుతునే ఉన్నారు. -
ప్రజాస్వామ్యానికి మూలస్తంభం రాజ్యాంగం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): భారత రాజ్యాంగం కేవలం చట్టపరమైన పత్రం కాదని మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిదని కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఈఈ బి.కరుశ్రీ అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన్ దివాస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పీఎన్కాలనీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం ఆత్మపరిశీలన చేసుకునే రోజు అని పేర్కొన్నారు. హక్కులు, విధులు నాణేనికి రెండు దిశలు వంటివని చెప్పారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది పాల్గొన్నారు. -
పచ్చని ఉద్దానంలో కార్గో చిచ్చు పెట్టొద్దు
వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దానాన్ని నమ్ముకొని ఏళ్ల తరబడి జీవనోపాధి సాగిస్తున్న ఈ ప్రాంతంలో ప్రభుత్వాలు కార్గో చిచ్చు పెట్టి తమ జీవితాలను రోడ్డుపాలు చేయవద్దని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాటంలో భాగంగా ఈ నెల 21 నుంచి సాగుతున్న నల్లబ్యాడ్జిలతో నిరసన కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా చీపురపల్లి పంచాయతీ సంతోష్నగర్లో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 21న మహాధర్నా పేరున రైతులతో కలిసి పలాస ఆర్డీఓకి తమ గోడు వినిపించాలన్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. పాలకులు ఇదే పంథా కొనసాగిస్తే ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు, బాధితులు పాల్గొన్నారు. సాగునీటి కాలువలో పడి వ్యక్తి మృతి శ్రీకాకుళం రూరల్: పెదపాడు పంచాయతీ ముద్దాడపేటకు చెందిన ముద్దాడ తారకేశ్వరరావు (40) బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు సాగునీటి కాలువలో పడి మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. -
మిల్లర్ల ఇష్టారాజ్యం
● అదనంగా ధాన్యం ఇవ్వాల్సిందేనంటూ హుకుం ● అధికారులకు ఫిర్యాదు చేసినా వెరవని మిల్లర్లు నరసన్నపేట: ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కంబకాయకు చెందిన రైతు సెరిశిల్ల సింహాచలం కంబకాయ కొనుగోలు కేంద్రం ద్వారా బుధవారం 50 బస్తాల ధాన్యం ఉదయం 9 గంటలకు నరసన్నపేటలోని బాలాజీ రైస్మిల్లుకు తీసుకువెళ్లాడు. ధాన్యం పరిశీలించిన మిల్లరు నాణ్యత బాగులేదు 80 కేజీల బస్తాకు అదనంగా 6 కిలోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బస్తాకు ఆరు కిలోలు అంటే 50 బస్తాలకు 300 కిలోలు మిల్లరు అప్పనంగా అడగడంతో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక సివిల్ సప్లై డీటీ రామకృష్ణకు సమాచారం ఇచ్చారు. ఈయన వచ్చి మిల్లర్తో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. అక్క డి నుంచి రైతు ధాన్యం పట్టుకొని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ టి.సత్యనారాయణకు విషయం తెలియజేశారు. తానేమీ చేయలేనని ఆయన చేతులెత్తేశారు. దీంతో చేసేదేమీ లేక రైతు ధాన్యాన్ని తిరిగి ఇంటికి తీసుకొని వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కంబకాయకు చెందిన రైతులు తంగి రవీంద్ర, పాగోటి అప్పలనాయుడు మాట్లాడుతూ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని కోరారు. ప్రతి బస్తాకు రెండు కిలోలు అదనంగా తీసుకుంటున్నారని, ఇది కాకుండా మరో నాలుగైదు కిలోలు నాణ్యత పేరున తీసుకుంటున్నారని తెలిపారు. కొందరు రైతులు చేసేదేమీ లేక ఇచ్చేస్తుండగా కొంత మంది రైతులు ఎదురు తిరిగినా ఫలితం లేకుండా పోతుంది. బస్తాకు 2 కిలోలు అదనంగా ఇస్తే మండలంలో రైతులు ఈ సీజన్కు రూ. 2.5 కోట్లు మేర నష్ట పోయే అవకాశముంది. -
విలువలతో కూడిన విద్య అవసరం
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విద్యార్థులతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: విద్యార్థులకు విలువలతో కూడిన విద్య నేర్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉపాధ్యాయులకు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన సమావేశమయ్యారు. ఆమదాలవలస జెడ్పీహెచ్ స్కూల్ కొర్లకోట నుంచి కిల్లి సంధ్య, కాగితాపల్లి నుంచి సురవరపు ఝాన్సీ, కొత్త స్నా నం నుంచి కె.స్నేహ, శ్రీముఖలింగం నుంచి ఆర్. భాగ్యశ్రీ, రొంపివలస నుంచి ఆర్.అభినయ్, ఎల్.ఎన్.పేట నుంచి ఎన్.వర్ష, 10వ తరగతి చదువుతున్న వారిలో ఎం.హారిక, పైడిబీమవరం, ఆర్.వెన్నెల, ఏపీఎంఎస్ సోంపేట, తామాడ హనీ, గరుడభద్ర, అలాగే 9వ తరగతి విద్యార్థులు, వి.ఢిల్లీశ్వరి, ఎంజేపీఏపీ స్కూల్ హయాతినగరం, బి.అనూష, గార, జెడ్పీ హైస్కూల్, ఎన్. జాహ్నవి, కురుడు, కొత్త బొమ్మాళి, ఎన్.జ్ఞానేశ్వరి జెడ్పీ హైస్కూల్ ఆకాశలక్కవరంతో పాటు వారి తల్లిదండ్రులతో కలెక్టర్ మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు. నిరంతరం కృషి చేస్తే చక్కటి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. తన విద్యాభ్యాసం నుంచి కలెక్టర్ అయ్యే వరకు ప్రయాణాన్ని వారితో పంచుకున్నారు. సెల్ఫోన్ బారి నుంచి తల్లిదండ్రులే రక్షించాలని సూచించారు. స్కూళ్ల గురించి ఆరా తీస్తూ గరుడభద్ర జెడ్పీ హైస్కూల్కు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. -
ప్రాణవాయువు నిలిపివేశారు
● నరసన్నపేట ఆస్పత్రిలో మూలకు చేరిన ఆక్సిజన్ ప్లాంట్ నరసన్నపేట: నరసన్నపేటలోని ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ మూలకు చేరింది. రోగులకు ప్రయోజనకరంగా ఉంటూ వారి ప్రాణాలను కాపాడుతుందనే సదుద్దేశంతో గత ప్రభుత్వ కా లంలో రూ. 60 లక్షలు వెచ్చించి ఈ ఆక్సిజన్ ప్లాంట్ను నిర్మించారు. కోవిడ్ లాంటి మహమ్మారి మరోసారి వస్తే రోగులకు ఆక్సిజన్ సమస్యలు ఉత్పన్నం కాకూడదనే భావంతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను అప్పట్లో నిర్మించింది. వార్డుల్లో కూడా ప్రత్యేక పైప్ లైన్లు వేశారు. ప్రభుత్వం మారడంతో ఈ ప్లాంట్ నిర్వహణను పూర్తిగా అధికారులు వదిలేశారు. ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్లను అవసరం రీత్యా ఆస్పత్రి వర్గాలు కొంటున్నాయి. దీంతో అదనపు ఖర్చుగా మారుతోంది. నరసన్నపేటలో ఆక్సిజన్ ప్లాంట్లో కంప్రెషర్లు మరమ్మతులకు గురి కావడంతోనే ఇది మూల పడిందని తెలుస్తోంది. ఆస్పత్రిలో మూలకు చేరిన ఆక్సిజన్ ప్లాంట్ -
గుండెలు పగిలే వేదన
● సెప్టిక్ ట్యాంకులో పడి ఐదేళ్ల చిన్నారి మృతి టెక్కలి రూరల్: కాసేపు పొలమారితేనే విలవిలలాడిపోతాం. అలాంటిది ఐదేళ్ల అబ్బాయి ఊపిరాడక ఎంత వేదన అనుభవించాడో. ఆపత్కాలంలో తల్లిని ఎంతగా తలచుకున్నాడో. తండ్రి వస్తాడని ఎంతగా ఎదురు చూశాడో..? ఐదేళ్ల వయసులోనే ఆయుష్షు తీరిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రుల గుండెలు ఎంతగా తల్లడిల్లిపోయాయో. స్థానిక మండపొలం కాలనీకి చెందిన కొంకి భవ్యాన్ (5) అనే చిన్నారి బుధవారం సెప్టిక్ ట్యాంకులో పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండపొలం కాలనీకి చెందిన కొంకి హరిబాబు, మంగల చిన్న కుమారుడు భవ్యాన్. ఈ చిన్నారి ఒక ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. అయితే బుధవారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఇంటికి దగ్గరలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు వెళ్లి ఆడుకుంటుండగా.. సెప్టిక్ ట్యాంక్ పై రేకు కప్పి ఉండటంతో దానిపైకి వెళ్లి ఒక్కసారిగా కిందకు జారి పడిపోయా డు. బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అంతా గాలించారు. కాసేపయ్యాక సెప్టిక్ ట్యాంకులో పడి ఉన్న బాలుడిని గుర్తించారు. అనంతరం అతడిని బయటకు తీసి హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..
● అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి ● రామేశ్వరంలో ఘటన ● మరో నలుగురికి గాయాలు ● అందరూ పలాస వాసులే పలాస: అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన పలాస మండలం పెదంచల, వీరరామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో నలుగురు భక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దగ్గరలో రామచంద్రపురం వద్ద గల మెడికల్ కళాశాల పక్కన జరిగింది. ఈ సంఘటన తెలియడంతో గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారం రోజుల కిందట పలాస మండలం పెదంచల నుంచి ఇల్లాకుల నవీన్, వీరరామచంద్రపురం గ్రామానికి చెందిన పైడి సాయి, గుంట రాజు, పైడి తారకేశ్వరరావు, పైడి గణపతి, తమ్మి నేని గణేష్లు అయ్యప్ప మాలలో భాగంగా శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి ఎర్టిగా న్యూమోడల్ కార్లో బయల్దేరారు. మొక్కులు తీర్చుకొని తిరిగి వస్తుండగా రామేశ్వరం వద్ద వీరి కారు ఒక లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. అందులో ఉన్న వీరరామచంద్రపురం గ్రామానికి చెందిన పైడి సాయి(25), పెదంచల గ్రామానికి చెందిన ఇల్లాకుల నవీన్(27) అక్కడికక్కడే మృతి చెందారు. వీరరామచంద్రపురానికి చెందిన గుంట రాజు, పై డి తారకేశ్వరరావు, పైడి గణపతి, తమ్మినేని గణేశ్ తీవ్రగా యాలపాలయ్యారు. అక్కడి వారు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు, గ్రామస్తులు రామేశ్వరం బయల్దేరి వెళ్లారు. చనిపోయిన వారిలో ఇల్లాకుల నవీన్ తండ్రి తారకేశ్వరరావు ఎప్పుడో మృతి చెందగా తల్లి ఆశ వర్కర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. -
వణికిస్తున్న స్క్రబ్ టైఫస్
● జిల్లాలో ఎనిమిది మందికి వ్యాధి ● ఓ శిశువుకు కూడా సోకడంతో ఆందోళన ఆందోళన వద్దు తగ్గిపోతుంది జిల్లాలో ఈ వ్యాధిపై ఎలాంటి ఆందోళన వద్దు. లార్వల్ మైట్స్ అనే పురుగుల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. అయితే స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకిన వారికి డోక్సిసైక్లిక్, ఎజిత్రామైసిన్ మందులను వినియోగిస్తే కచ్చితంగా వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. ఇప్పటికే ఈ మేరకు వైద్యులకు సూచనలు ఇచ్చాం. – డాక్టర్ కల్యాణ్బాబు, జిల్లా ఆసుపత్రుల సర్వీసుల కోఆర్డినేటర్ తగు చర్యలు చేపట్టాం స్క్రబ్ టైఫస్ వ్యాధిని జిల్లాలోని హిరమండలంలో గుర్తించాం. ఎనిమిది మంది బాధితులు, ఒక శిశువు కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వ్యాధి సోకిన రోగుల పట్ల అన్ని చర్యలూ చేపడుతున్నాం. వ్యాధి లక్షణాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నాం. – కె.అనిత, డీఎంహెచ్ఓ అరసవల్లి: స్క్రబ్ టైఫస్.. జిల్లాను కలవరపరుస్తున్న వ్యాధి. వాతావరణంలో మార్పులతో పా టు దూరపు ప్రయాణాలు చేసి వచ్చిన వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండడం ఆందోళనకరంగా మారింది. జిల్లాలో దాదాపు ఎనిమిది మంది ఈ వ్యాధి బారిన పడినట్లు సమాచారం. ఓ శిశువుకు కూడా వ్యాధి సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అధికారికంగా వ్యాధి గురించి సమాచారాన్ని ఎవరూ బయటకు ఇవ్వడం లేదు. చాలా మంది చికిత్స కోసం విశాఖకు పరుగులు తీస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాధి లక్షణాలివే.. ● లార్వల్ మైట్స్ అనే పురుగులు కుట్టడం వల్ల ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది. ● చర్మం ఎరుపెక్కి దద్దుర్లు వస్తుంటాయి. ● ఈ వ్యాధి సోకిన తర్వాత దగ్గు, జ్వరం, జలుబు, నీరసం లక్షణాలు కనిపిస్తాయి. ● కొందరికి ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో పాటు జ్వర తీవ్రత పెరిగిపోవడం, ఊపిరితిత్తుల సమస్యలు, రక్తం గడ్డకట్టడం, పచ్చకామెర్లు వంటి ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదాలున్నాయి. ● మెదడుపై ప్రభావం చూపకముందే ఈ వ్యాధి సోకిన వారిని వైద్యుల పరిశీలనలో ఉంచడం మంచిది. పెరుగుతున్న కేసులు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలు మండలాల్లో వారం రోజుల్లోనే ఏడు కేసులు నమోదు కావడంతో పాటు ఓ తొమ్మిది నెలల శిశువు కూడా ఈ వ్యాధి సోకడం ఆందోళనకరంగా మారింది. -
రాజ్యాంగ స్ఫూర్తితోనే వైఎస్సార్ సీపీ పాలన
● ఇప్పుడు రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం తప్ప భారత రాజ్యాంగం లేదు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): బడుగు బలహీన వర్గాల కోసం అవిశ్రాంతంగా శ్రమించిన బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రపంచంలో అన్ని రాజ్యాంగాల కంటే అ త్యంత బలమైనది భారత రాజ్యాంగమని అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడు తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక భారత రాజ్యాంగం అమలుకావడం లేదని రె డ్బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే వైఎస్సార్సీపీ హయాంలో పాలన జరిగిందని, పేదరికం, వివక్ష, వంటి సమస్య లు రాజ్యాంగం మార్గదర్శకత్వంతోనే అధిగమించారన్నారు. ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపైనా దౌర్జన్యాలు, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ పాలనంతా భ్రష్టు పట్టించారన్నారు. ఇప్పటిౖకైనా కళ్లు తెరిచి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుని సంక్షేమ ఫలాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పొన్నాడ రుషి, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణ మాట్లాడుతూ టీడీపీ పాలనంతా రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో విజయవాడలో ఏర్పాటుచేసిన అంబేడ్కర్ పార్కు నిర్వ హణ గాలికొదిలేసి, ఉద్యోగులకి జీతాల్వికుండా నాశనం చేశారని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచేలా చేస్తే దళిత జాతి చూస్తూ ఊరుకోదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డా రు. దళితుల ఓట్లు కావాలే తప్ప దళితుల సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుకి అవసరం లేదన్నారు. కా ర్యక్రమంలో వైఎస్సార్సీపీ కళింగవైశ్యకుల రాష్ట్ర అ ధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పార్టీ వెలమకు ల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, కాళింగకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆరంగి మురళి, కూరాకుల, పొందర కుల రాష్ట్ర అధ్యక్షులు రాజాపు అప్పన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దుంపల లక్ష్మణరావు, కార్యవర్గసభ్యులు గొండు కృష్ణమూర్తి, గ్రీవెన్స్సెల్ జిల్లా అధ్యక్షులు రౌతు శంకరరావు, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి సనపల నారాయణరావు, ఎస్సీ విభాగం నాయకులు యజ్జల గురుమూర్తి, నీలాపు ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. -
కష్టాలు.. నష్టాలు
రైతన్నపై ముప్పేట దాడి అదనపు డిమాండ్ మిల్లర్లు 84 కేజీలు అడుగున్నారు. అదనంగా ఇవ్వక పో తే ధాన్యం అన్లోడ్ చేయడం లేదు. బాగా నష్టపోతున్నాం. అధికారులకు తెలియచేసినా చర్యలు తీసుకోవడం లేదు. ట్రక్షీట్ కోసం కూడా రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. – పాగోటి గోవిందరావు, కంబకాయ రైతు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అన్నదాతకు అన్ని వైపుల నుంచి కష్టాలు ఎదురవుతున్నాయి. ఒకవైపు వర్షాల హెచ్చరికలు, మరోవైపు విక్రయాలకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు వెరసి రైతులు నష్టపోతున్నారు. ప్రస్తు తం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు గందరగోళంగా ఉన్నాయి. వాస్తవానికి కొనుగోళ్లకు ముందే రైతులకు గోనె సంచులు సరఫరా చేయాలి. ఒకవేళ ప్రభుత్వం సరఫరా చేయకపోతే గోనె సంచీకి ఇంత ఇస్తామని లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ, జిల్లాలో ఇంతవరకు గోనె సంచెలపై స్పష్టతే ఇవ్వలేదు. దీంతో జిల్లాలో ఏ ఒక్క రైతుకు గోనె సంచులు అందని పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా ఉన్న కొనుగోలు కేంద్రాల సిబ్బంది మాత్రం గోనె సంచి సమర్పించుకుంటే ఒక్కో దానికి రూ. 9.58పైసలు ఇస్తామని చెబుతున్నారు. కానీ ఆ ధరకు గోనె సంచులు దొరికే పరిస్థితి లేదు. ప్యాక్ చేస్తే మిల్లు వరకై నా భద్రంగా ఉండే సంచులు కావాలంటే మార్కెట్లో రూ.16 ఽఅవుతుంది. అంటే ఒక్కో గోనె సంచిపై రూ.6.50వరకు అదనపు భారం పడుతోంది. నత్తను మరిపిస్తున్న కొనుగోళ్లు ఖరీఫ్ పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాల హెచ్చరికలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలో 50 శాతానికి పైగా కోతలు అయిపోయాయి. ఇప్పుడా ధాన్యమంతా రోడ్లుపైన, కళ్లా ల్లోను, పొలాల్లోనూ ఉంది. వర్షాలు పడితే రైతులకు కన్నీళ్లే. జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తుందే తప్ప యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం లేదు. కనీసం మిల్లుల నుంచి బ్యాంకు గ్యారెంటీలే ఇంతవరకు తీసుకోలేకపోయింది. 264 మిల్లులకు గాను 82 మిల్లర్లు మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చా యి. మిగతా 182మంది బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వ లేదు. దీంతో రైతుకు దళారే దిక్కుగా మారాడు. టార్పాలిన్లు ఇవ్వని దుస్థితి వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో పండిన పంటను రైతు భద్రంగా దాచుకోవడానికి ప్రభుత్వం టార్పాలిన్లు ఇవ్వాలి. కూటమి ప్రభు త్వం ఈ విషయాన్ని కూడా మరిచిపోయింది. అసలు టార్పాలిన్లు ప్రొక్యూర్ చేసిందో లేదో కూడా తెలియదు. వీటి కొనుగోలు కూడా రైతులకు అదనపు భారంగా మారనుంది. అదనపు దోపిడీ మిల్లుల వద్ద అదనపు దోపిడీ జరుగుతోంది. అసలే ట్యాగ్ చేసిన వాహనాలు అందుబాటులో ఉండకపోవడంతో సొంత ఖర్చులతో వాహనాలను పెట్టు కుని ట్యాగ్ చేసిన మిల్లులకు రైతులు ధాన్యం తరలిస్తున్నారు. అక్కడ గంటలు, రోజుల తరబడి అన్లోడ్ చేయడం లేదు. ఎంత ఆలస్యం జరిగితే అంత అదనపు ట్రాన్స్పోర్టు చార్జీ రైతులపై పడుతోంది. ఇదే నష్టం అనుకుంటే మిల్లుల వద్ద 80 కిలోల బస్తాకు అదనంగా 4నుంచి 6కిలోలు అడుగుతున్నారు. ధాన్యం తడిగా ఉన్నాయని, క్వాలిటీ లేదని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే ఆ రైతులకు సంబంధించిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం లే దు. దాని వల్ల కూడా ట్రాన్స్పోర్టు చార్జీ పెరిగిపోతోంది. గోనె సంచులు ఇవ్వని ప్రభుత్వం కనీసం టార్పాలిన్లు సమకూర్చని దుస్థితి సొంతంగా కొనుగోలు చేసుకోవడంతో రైతులకు తప్పని భారం అందుబాటులో ఉండని జియో ట్యాగ్ వాహనాలు మిల్లుల వద్ద అదనపు దోపిడీ -
రాష్ట్ర హ్యాండ్బాల్ పోటీల విజేతగా శ్రీకాకుళం
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అండర్–19 బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీల ఫైనల్స్లో బాలుర విభాగంలో కడప జిల్లా, బాలికల విభాగంలో శ్రీకాకుళం జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి. మూడు రోజుల పాటు పోటీలు ఆద్యంతం హోరాహోరీగా పోటీలు జరిగాయి. చివరిరోజు సెమీ ఫైనల్స్లో బాలుర విభాగంలో కడప, చిత్తూరు, వైజాగ్, కర్నూలు జట్లు, బాలికల విభాగంలో శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జట్లు పోటీ పడ్డాయి. ఫైనల్స్కు బాలుర విభాగంలో కడప, చిత్తూరు జట్లు, బాలికల విభాగంలో శ్రీకాకుళం, గుంటూరు జట్లు చేరుకున్నాయి. బాలుర విభాగంలో చిత్తూరు జట్టు గట్టి పోటీ ఇచ్చినా చివరికి కడప జట్టు విజేతగా నిలిచింది. కడప 8 పాయింట్లు, చిత్తూరు 5 పాయింట్లు సాధించాయి. మూడో స్థానానికి వైజాగ్, కర్నూలు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా జరగగా చివరికి వైజాగ్ 11 పాయింట్లతో మూడో స్థానం, కర్నూలు 9 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. బాలికల విభాగంలో జరిగిన ఫైనల్ పోటీలో శ్రీకాకుళం, గుంటూరు జట్లు తలపడగా రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. 6 పాయింట్లతో శ్రీకాకుళం జట్టు విజేతగా, గుంటూరు జట్టు 4 పాయింట్లతో రన్నర్ గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కృష్ణా జట్టు 7 పాయింట్లతో మూడవ స్థానంలో, వైజాగ్ జట్టు 5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాయి. విజేతలకు పతకాలు, ట్రోఫీ అందజేశారు. -
పేద విద్యార్థులపై ఎందుకంత కక్ష?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రధానాంశాలైన పేదలకు విద్య, వైద్యం సక్రమంగా అందించగలిగి ప్రభుత్వానిదే సుపరిపాలనవుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దుంపల లక్ష్మణరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.42వేల కోట్లు, వసతి దీవెన కింద రూ.2వేల కోట్లు బకాయిపడ్డారని మండిపడ్డారు. పెరిగిన ధరలకు అనుగునంగా హాస్టల్ విద్యార్థులకు మెస్చార్జీలు రూ.3వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి రూ.3వేలు ఇస్తామని చెప్పి యువతను మోసగించారన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ కమిటీ వేయాలన్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీఇవ్వకపోవడం అన్యాయమన్నారు. మద్దతు ధర రూ.1890 ప్రకటించినా పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ ఏడాది 91లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని దాంట్లో 6.50లోల మెట్రిక్ టన్నులు ప్రభుత్వమే కొనాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన వస్తోందన్నారు. రాజధాని అమరావతి, తెలుగుతమ్ముళ్లు జేబుల నింపడంలో ఉన్న శ్రద్ధ ఇతర అంశాలపై లేదన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన సనపల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభోత్సవానికి రాజకీయ అడ్డంకులు
వర్సిటీలో నిర్మించిన నూతన భవనంసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో నూతన భవనం ప్రారంభోత్సవానికి కూటమి నేతలు రాజకీయ అడ్డంకులు సృష్టిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో (ఏడాదిన్నర క్రితం) భవనం నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీనిపై వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రారంభోత్సవం చేయమని వర్సిటీ ఉన్నతాధికారులు కోరినా దాటవేస్తూ వస్తున్నారు. రూ.38 కోట్లతో కట్టిన భవనం ప్రారంభానికి నోచుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. ఎట్టకేలకు వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ప్రోటోకాల్ పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులకు విద్యాశాఖ మంత్రి లోకేష్కు ఫోన్ చేసి బిల్డింగ్ ప్రారంభోత్సవాన్ని ఆపాలంటూ ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో భవనం ప్రారంభోత్సవంపై ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారులు సతమతమవుతున్నారు. -
మూడు చక్రాలే మృత్యువాయె..
● ట్రైసైకిల్ ప్రమాదంలో దివ్యాంగుడు మృతి పలాస : మందస మండలం కొర్రాయి గేటు సమీపంలో మూడు చక్రాల వాహనం ప్రమాదవశాత్తు పల్టీ కొట్టడంతో దివ్యాంగుడు మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం వీరగున్నమ్మపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఎర్ర సింహాచలం (43) తన ట్రైసైకిల్పై కొర్రాయి గేటు వైపు వెళ్తుండగా వైటీసీ వద్ద ఎగుడు మలుపు వద్ద బోల్తాపడ్డాడు. అదే బండి కింద చిక్కుకొని దుర్మరణం పాలయ్యాడు. సింహాచలంకు భార్యాపిల్లలు ఉన్నారు. మందస ఎస్ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండల కేంద్రం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బలగ ప్రాంతానికి చెందిన ఇంజరాపు రవికుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. శ్రీకాకుళం నుంచి సాలూరు గ్రామానికి వెళ్తుండగా బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో రిమ్స్కు తరలించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలకు ‘మాయాజాలం’ కవిటి : వచ్చే ఏడాది జనవరి 1, 2, 3, 4వ తేదీలలో వరంగల్లో జరగనున్న ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలకు కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన ‘మాయాజాలం’ నాటిక ఎంపికై నట్లు కళాకారులు మంగళవారం తెలిపారు. అప్పాజోస్యుల–విష్ణుభొట్ల–కందాళం ఫౌండేషన్–సహృదయం నాటక కళా పరిషత్ ఆధ్వర్వంలో ఈ పోటీలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మహిళలపై దాడులు అరికడదాం అరసవల్లి: మహిళలు హింసకు గురికాకుండా కృషి చేద్దామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా సూచనల మేరకు స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద మంగళవారం మహిళలపై హింస నిర్మూలనకు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరిస్తూ వారికి గల చట్టాలను అవగాహన కల్పించాలన్నారు. మహిళల హక్కులను వివరించి వాటిని ఉపయోగించుకొని తమకు తామే రక్షణ పొందాలన్నారు. మహిళలకు ఎటువంటి రుసుము లేకుండా న్యాయవాదిని నియమించడం, కేసు పరిష్కరించడంలోనూ న్యాయ సేవాధికార సంస్థ ముందుండి పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా డీఎంహెచ్ఓ కె.అనిత, మహిళా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ ఐ.విమల, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇప్పిలి 102వ జయంతి వేడుకలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ వంశపారంపర్య అర్చక ప్రధానులు దివంగత ఇప్పిలి జోగారావు 102వ జయంతి వేడుకలు ఈ నెల 26 నుంచి 29 వరకు శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్లో జరగనున్నాయి. రెండేళ్ల క్రితం జోగారావు గారి శతజయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించిన ఇప్పిలి కుటుంబసభ్యులు.. కుమారుడు సూర్యదేవాలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలోని శ్రీసుమిత్ర కళాసమితి, ఆరామ ద్రావిడ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ● 26న సాయంత్రం 5.30 గంటలకు కేరళకు చెందిన విష్ణుదేవ్ నంబూద్రిచే సుస్వర గానామృతం, 27న కేరళ సోదరులుగా పేరొందిన ఆర్.కన్నన్, ఆర్.ఆనంద్లచే నాదస్వర విన్యాసం, 28న వీణావిద్వాంసులు ఫణి నారాయణచే తంత్రీనాద వినోదం, 29న చైన్నె కళాకారిణి సుచిత్ర బాలసుబ్రమణియంచే సుచిత్రా గాత్ర సౌరభం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటల కార్యక్రమాలు మొదలవుతాయని నిర్వాహకులు ప్రకటించారు. 8 నెలల గర్భిణి మృతి కంచిలి: ఎనిమిది నెలల గర్భిణి మృతిచెందిన ఘటన కంచిలి మండలం అర్జునాపురంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఇచ్ఛాపురం మండలం మండపల్లి గ్రామానికి చెందిన కాయ ధనలక్ష్మి(26) ప్రసవం కోసం కంచిలి మండలం అర్జునాపురంలోని కన్నవారింటికి వచ్చింది. సోమవారం రాత్రి పురిటి నొప్పులు తాళలేక మృతిచెందింది. ఫిట్స్ రావడం వల్లే మృతిచెందినట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా, ధనలక్ష్మికి ఇచ్ఛాపురం మండపల్లి గ్రామానికి చెందిన కాయ శివతో ఈ ఏడాది మార్చి 7న వివాహమైంది. ఇంతలోనే మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అధికారుల తీరు సరికాదు నరసన్నపేట : బొరిగివలసకు మంగళవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ వచ్చినా ప్రజాప్రతినిధులకు అధికారులు సమాచారం ఇవ్వకపోవడంపై సర్పంచ్ బగ్గు విష్ణమ్మ, ఎంపీటీసీ జగదీశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. జేసీ వస్తారనే సమాచారం గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉండగా, అధికార పార్టీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి రైతన్నా మీ కోసం కార్యక్రమం నిర్వహించడాన్ని తప్పుబట్టారు. సచివాలయ సిబ్బంది పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తున్నారని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. సర్పంచ్, ఎంపీటీసీని అవమానించినట్లుగా భావిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం ముమ్మరంగా వస్తున్నా.. ధాన్యం రావడం లేదని, అందుకే కొనుగోళ్లు ప్రారంభించలేదని జేసీకి సచివాలయ సిబ్బంది చెప్పడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం వెళ్తే ప్రాణంపోయింది ● అబుదాబిలో దొంకూరు యువకుడు మృతి ఇచ్ఛాపురం రూరల్: తీర ప్రాంతానికి చెందిన మత్స్యకార యువకుడు అబుదాబిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామానికి చెందిన బడే భాస్కరరావు(22) ఏడాదిన్నర క్రితం జీవనోపాధి కోసం వెల్డింగ్ హెల్పర్గా వెళ్లాడు. అక్కడే పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భాస్కరరావు ఆత్మహత్య చేసుకున్నాడంటూ కంపెనీ ఎండీ మంగళవారం సాయంత్రం ఫోన్లో సమాచారం అందివ్వడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఒక్కగానొక్క కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ తండ్రి రామ్మూర్తి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదని, ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని తల్లి భాగ్యశ్రీ విలపిస్తోంది. అబుదాబి పోలీసులు మరణాన్ని నమోదు చేసినప్పటికీ కారణాలు ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. యువకుడి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు కుటుంబ సభ్యులు స్థానిక రాజకీయ నాయకులు, అధికారుల సహకారంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలయంలో చోరీ పలాస: తర్లాకోట గ్రామంలోని కాటమ్మతల్లి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఆలయం తలుపులు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హుండీలో కానుకలు పట్టుకుపోయారు. ఆలయ పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి అక్రమ రవాణా
హత్య కేసులో పెరోల్పై వచ్చి..● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ● 20 కేజీల గంజాయి స్వాదీనం నరసన్నపేట : ఒడిశా నుంచి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న షేక్ రియాజ్ అహ్మద్ను నరసన్నపేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మడపాం టోల్గేట్ వద్ద ఎస్ఐ–2 శేఖరరావు సిబ్బంది సోదాలు నిర్వహిస్తుండగా ఓ బస్సులో ప్రయాణిస్తున్న అహ్మద్ను అనుమానంతో ప్రశ్నించారు. అతని వద్ద సోదా చేయగా 20.860 కేజీల గంజాయిని గుర్తించినట్లు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఫోన్ సీజ్ చేశామన్నారు. మైసూర్లోని మొహాల్లాకు చెందిన షేక్ రియాజ్ అహ్మద్కు వ్యసనాలకు బానిసై నేర చరిత్ర కలిగి ఉన్నాడు. 2010లో దర్వడా జైల్లో ఉండగానే తోటి ఖైదీని హత్య చేశాడు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తుండగా కుటుంబ సభ్యులు ఇతనికి వివాహం చేయడానికి పెరోల్ కావాలని దరఖాస్తు చేసుకోగా నవంబర్ 5న బయటకు వచ్చాడు. రానున్న జనవరి 3 వరకూ పెరోల్ గడువు ఉంది. జైల్లో ఉన్నప్పుడు గంజాయి అక్రమ రవాణా చేసే వారితో ఏర్పడిన స్నేహంతో బయటకు రాగానే గంజాయి అక్రమ రవాణాకు దిగాడు. బరంపురం ప్రాంతానికి చెందిన హిమాన్స్ శేఖర్ మాహిజా అనే వ్యక్తి నుంచి గంజాయిని లక్ష రూపాయలకు కొనుగోలు చేసి హుబ్బాలికి చెందిన ముజిమల్ అక్తర్, అక్రమ్ హలాభావి(పుచ్చు)లకు విక్రయించేందుకు తీసుకెళ్తుండగా మడపాం టోల్గేట్ వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు. -
మాక్ అసెంబ్లీ ఎంపికల్లో రాజకీయ జోక్యం!
● జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అన్యాయం ● రాజకీయనేతల సిఫార్సులకు తలొగ్గారంటూ విమర్శలు శ్రీకాకుళం : విద్యార్థుల్లో రాజ్యాంగం, హక్కులపై అవగాహన పెంచేందుకు, రాజకీయాలపై ఆసక్తి కలిగించేందుకు మాక్ అసెంబ్లీ నిర్వహించాలని జిల్లా విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున విద్యార్థులను ఎంపిక చేయాలని, ఇందుకుగాను కొన్ని పోటీలను నిర్వహించాలని సూచించింది. జిల్లా స్థాయిలో ఈ మేరకు పోటీలను నిర్వహించి నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి కొద్ది రోజుల క్రితం నివేదించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలుగా పేర్కొంటూ జాబితాలను రాష్ట్రస్థాయికి పంపించారు. ఇందులో ప్రథమ స్థానంలో నిలిచిన వారిని రాష్ట్రస్థాయిలో ఎంపిక చేస్తారని అందరూ భావించగా, ఉపాధ్యాయులు విద్యార్థులు సైతం ఇదే నమ్మకంతో ఉన్నారు. అయితే రెండు రోజుల క్రితం జిల్లాకు వచ్చిన జాబితాని చూసి అంతా అవాక్కయ్యారు. నియోజకవర్గానికి ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం జాబితా పంపించింది. ఇందులో ప్రథమ స్థానం సాధించిన వారికి కాకుండా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్న వారిని ఎంపిక చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై కొందరు దృష్టిసారించి వాకబు చేయగా రాజకీయ నేతలు జోక్యంతో ఇలా జరిగిందని తెలుసుకొని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ప్రతిభ గల వారిని ఎంపిక చేయకుండా ఈ విధంగా రాజకీయ సిఫార్సులతో ఎంపికలు చేసేటప్పుడు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం దేనికని నిలదీస్తున్నారు. ఇటువంటి పోటీలు ఏమి లేకుండానే తమకు ఇష్టం ఉన్నవారిని ఎంపిక చేసుకొని రాష్ట్రస్థాయిలో జరిగే మాక్ అసెంబ్లీకి తీసుకు వెళ్లవచ్చు కదా అన్న ప్రశ్న పలు వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కాగా, జాబితాలో ఎంపికై న వారికి త్వరలోనే అమరావతిలో మాక్ అసెంబ్లీని నిర్వహిస్తారు. ఇందులో విద్యార్థులే ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ వా రి జిల్లాలోని ప్రాంతాల్లోని సమస్యలపై మాట్లాడా ల్సి ఉంటుంది. ఇటువంటి అవకాశాన్ని కోల్పోయిన ప్రతి భ కలిగిన విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. మాకు తెలియదు.. జిల్లాస్థాయిలో ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి నివేదించాం. రాష్ట్రస్థాయిలో ఏ ప్రాతిపదికన ఎంపికలు జరిగాయో మాకు తెలియదు. ఈ విషయంపై జిల్లాస్థాయిలో మాకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదు. – రవిబాబు, జిల్లా విద్యాశాఖాధికారి -
ఒకటో తరగతికి 8 పేజీలా?
శ్రీకాకుళం : ఇటీవల జరిగిన సమ్మెటివ్ పరీక్షల్లో ఒకటి రెండు తరగతులు చదువుతున్న చిన్నారులకు ప్రశ్నపత్రంగా 8 పేజీల బుక్లెట్ను ఇవ్వడాన్ని ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. 6,7 ఏళ్ల వయసున్న వీరికి ఈ ప్రశ్నపత్రాన్ని నింపడం తలకుమించిన భారమని, ఇటువంటి ఆలోచనలు రాష్ట్రస్థాయిలో ఉన్నవారికి ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నపత్రాన్ని దిద్దడానికే ఒక్కో ఉపాధ్యాయునికి 15 నిమిషాలకు పైగా పడుతోందని, అటువంటిది చిన్నారులు రెండున్నర గంటల్లో 8 పేజీల ప్రశ్నపత్రానికి జవాబులు ఎలా రాయగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. గతంలో వీరికి 50 మార్కులకు పరీక్ష నిర్వహించే వారని ఇప్పుడు దానిని కూడా కాదని 80 మార్కులకు ప్రశ్నల రూపంలోనూ, మిగిలిన 20 మార్కులు అసైన్మెంట్ రూపంలోనూ నిర్వహించడాన్ని ఉపాధ్యాయ వర్గాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తప్పుపడుతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. -
నిరసనలు.. నినాదాలు.. నిర్బంధాలు
● థర్మల్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ ర్యాలీ భగ్నం ● అడుగడుగునా మోహరించిన పోలీసులు ● అడవి బిడ్డల వేషధారణలతో బాధితుల నిరసనలు సరుబుజ్జిలి: థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా వెన్నెలవలస నుంచి సరుబుజ్జిలి జంక్షన్ వరకు నిర్వహించ తలపెట్టిన చలో సరుబుజ్జిలి ర్యాలీ కార్యక్రమాన్ని మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నా అడ్డుకోవడమేంటని పోరాట కమిటీ నాయకులు పోలీసులను ప్రశ్నించారు. అయినా ర్యాలీకి వారు అంగీకరించకపోవడంతో రహదారిపై నిరసనలు తెలిపారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో 340 మంది పోలీసులు థర్మల్ ప్రతిపాదిత ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాలను చుట్టుముట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి గిరిజన ప్రాంతాలైన అడ్డూరిపేట, వెన్నెలవలస, మసానపుట్టి బొడ్లపాడు, జంగాలస గ్రామాల్లో పోలీసు పహారా ఏర్పాటు చేసి జనాలు ర్యాలీ కార్యక్రమాలకు హాజరుకాకుండా దిగ్బంధనం చేశారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని చెప్పి విల్లులు, బాణా లు ధరించిన గిరిజనులు నిరసనలు తెలిపారు. ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వపోవడంతో సరుబుజ్జిలి జంక్షన్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పోరాట కమిటీ నాయకులు వినతిపత్రం అందించారు. నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు అణచివేతలు, నిర్బంధాలతో ఉద్యమాలు ఆగిన చరిత్ర ఎక్కడా లేదని థర్మల్ వ్యతిరేక పోరాటకమిటీ కన్వీనర్ వాబ యోగి, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు స్పష్టం చేశారు. చలో సరుబుజ్జిలి ర్యాలీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డగించడంతో నిరసనలు తెలిపి, అనంతరం వెన్నెవలస వద్ద విలేకరులతో మాట్లాడారు. కార్పొరేట్ శక్తుల చేతు ల్లో సుమారు 5వేల ఎకరాల భూములను తాకట్టుపెట్టి సరుబుజ్జిలి, బూర్జ మండలాలను బూడిద చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. కేంద్ర, రాష్ట్రమంత్రులతోపాటు, స్థానిక ఎమ్మెల్యేకు ప్రజలపై ప్రేమ ఉంటే థర్మల్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదన రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా చేపడుతున్న నిరసనలు అడ్డగించడంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని జిల్లా ప్రగతిశీల మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి స్పష్టం చేశారు. -
రోడ్డు ప్రమాదాల కట్టడికి చర్యలు
● ‘సాక్షి’ కథనాలపై స్పందించిన పోలీసు శాఖ ● ఎస్పీ ఆదేశాలతో చర్యలకు ఉపక్రమించిన యంత్రాంగం శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన సంగతి విదితమే. ఈ కథనాలకు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి స్పందించారు. రోడ్డు ప్రమాదాల కట్టడికి తీసుకోవాల్సిన ప్రణాళికలపై కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్తో ప్రత్యేకంగా మంగళవారం మాట్లాడారు. అన్ని విభాగాల సమన్వయంతో.. పోలీస్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఆర్అండ్బీ, రోడ్డు రవాణా, పంచాయతీరాజ్, మెడికల్ అండ్ హెల్త్, విద్యాశాఖ, 108 సర్వీసెస్, ఐఆర్ఏడీ విభాగాల అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రమాదాల విశ్లేషణ, ఎ మర్జెన్సీ, రెస్పాన్స్ సమయం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్పుల అమలుకు సమగ్ర కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు ఎస్పీ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేయడమే కాకుండా ఆచరణలోనూ చేసి చూపించారు. జిల్లావ్యాప్తంగా నో పార్కింగ్లో ఉన్న వాహనాలను పోలీసులతో తీయించడమే కాక, వేకువజామునుంచే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు ఫేష్ వాష్ చేయించారు. ప్రమాదాల నివారణకు చేపట్టనున్న చర్యలివే.. ● ప్రధాన చెక్పోస్టులు, టోల్ప్లాజాల వద్ద ప్రతిరోజూ ఒంటిగంట నుంచి వేకువజాము 5 గంటల వరకు వాహనదారులను ఆపి చల్లని నీటితో ముఖం కడిగించి (ఫేస్వాష్) కొంత సమయం సేద తీరాక రవాణాకు అనుమతించడం. ● ‘నో పార్కింగ్’ జోన్లలో వాహనాలు నిలిపితే తక్షణమే హైవే మొబైల్ వాహనాలు అక్కడకు చేరి వాటిని పంపివేయాలి. పార్కింగ్కు నిర్దేశించిన ప్రదేశాల్లో వాహనాలు పెట్టుకునేందుకు సూచనలివ్వాలి. ● ప్రతి ప్రమాద జోన్, ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లలో స్పీడ్–లిమిట్, ప్రమాద హెచ్చరిక బోర్డులు, డ్రైవర్లకు సూచనలు ఉండే పెద్ద బోర్డులు అమర్చుతారు. బహిరంగ ప్రదేశాల్లో వాహనాల మళ్లింపు, కూడళ్లు తెలిపే పోస్ట్ల ద్వారా వీక్షకుల దృష్టికి తీసుకువస్తారు. ● తరచూ ప్రమాద ప్రదేశాలను బ్లాక్స్పాట్ ప్రాంతాలుగా గుర్తించి డ్రోన్ కెమెరాలు, సర్వేలైన్స్ ఆధారంగా నివారణ చర్యలు చేపట్టడం. ● ట్రాఫిక్–ఇంజినీరింగ్–ఆడిట్ నిర్వహించి ట్రాఫిక్ డివైజర్లు, స్పీడ్బ్రేకర్లు, రేడియం స్టిక్కర్లు, డ్రమ్స్, కచ్చితమైన సిగ్నల్స్ అమరిక, అవసరమైతే కొత్త పోటింగ్ లేదా రూట్ రీ అలైన్మెంట్ సూచించడం. ● హైరిస్క్ రూట్లలో 24 గంటల పర్యవేక్షణ కొనసాగుతుంది. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రధాన మార్గాలు, ఎన్హెచ్–16, బస్కాంప్లెక్సు, రైల్వే స్టేషన్ మార్గాలు, పుణ్యక్షేత్రాలు, నగరాల్లోని రద్దీ రోడ్లలో ట్రాఫిక్ నియంత్రణ. ● డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, ఓవర్ స్పీడింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, సీట్ బెల్టు పెట్టుకోకపోవడం వంటి ఉల్లంఘనలపై రోజువారీ ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి చలానాలు విధించడం. ● హైవేల్లో అతివేగంగా ప్రయాణిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక మొబైల్ పెట్రోల్ టీమ్ నియమించడం, ప్రమాదాలు జరిగే సమయాల్లో రోడ్డు సేఫ్టీ వాహనాలు, సిబ్బంది చేరి సహాయక చర్యలు అందివ్వడం. సూచనలిస్తున్న పోలీసులుఫేస్ వాష్ చేయిస్తున్న దృశ్యం -
పైవాడే కరుణించాలి..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పొలాల్లో ఎదిగిన పైరు కోతకు సిద్ధంగా ఉంది. పల్లెల్లో కోసిన చేను నూర్పుకు సిద్ధమైంది. నూర్చిన ధాన్యం కొనుగోలు కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి కీలక దశలో మేఘ సందేశం అన్నదాతలను కలవరపరుస్తోంది. వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో రైతుల గుండెల్లో గుబులు రేగుతోంది. దీంతో పాటు సేన్యార్ తుఫాన్ ప్రభావం కూడా ఉండవచ్చనని హెచ్చరికలు ఉండటంతో కలవరపడుతున్నారు. ఇప్పటికే వాయుగుండం, మోంథా తుఫాన్తో కొంత నష్టపోయారు. ఈసారి వర్షాలు ఏం చేస్తాయోనని భయ పడుతున్నారు. వెన్నులో వణుకు.. ఖరీఫ్ పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాల హెచ్చరికలు అన్నదాత వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. కొన్నిచోట్ల నూర్పులు పూర్తవ్వగా, మరికొన్ని చోట్ల కంకులు పొలాల్లో ఉన్నాయి. కొన్నిచోట్ల యుద్ధ ప్రాతిపదికన పోగులేస్తుండగా, కొన్నిచోట్ల టార్పాలిన్లు కప్పి భద్రపరుచుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరవాలని చాలా రోజులుగా రైతులు కోరుతున్నా నామమాత్రంగానే ప్రారంభించారు. 6లక్షల 50వేల మెట్రిక్ టన్నులు మేర కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1638 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందంటే పరిస్థితి ఎలా ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కర్షకుల్లో కలవరం పంట చేతికి వచ్చినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నూర్పులు పూర్తయిన ధాన్యాన్ని రహదారి పక్కనే పోగేసి టార్పాలిన్లతో కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం తాత్సారం చేస్తూనే ఉంది. జిల్లాలో 4లక్షల 9వేల 951ఎకరాలు ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇప్పటికే చాలా వరకు కోతలు కోశారు. వీటిలో కొన్ని చోట్ల పనలు మీద ఉండగా, మరికొన్నిచోట్ల కుప్పలు వేసి నూర్పిళ్లు చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల యంత్రాలతో కోసిన వరి పంట ధాన్యాన్ని రహదారుల అంచులపై, పొలాల గట్లపై, ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చేతికందే సమయంలో పంట ఎక్కడ దెబ్బ తింటుందోనని కర్షకులు కలవరపడుతున్నారు. కోత పూర్తయిన పంట అంతా ప్రస్తుతం ఆరబోసి ఉంచారు. ఎంతవేగంగా కొనుగోలు చేస్తే అంత వేగంగా ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదు. చిత్తశుద్ధి ఉందా..? జిల్లాలో 406 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని యంత్రాంగం ప్రకటించింది. మోంథా తుఫాన్ సమయానికే కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా చేయలేదు. తాజాగా కొన్ని కేంద్రాలు తెరిచారు. అవి కూడా సక్రమంగా నడవడం లేదు. రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు మిల్లులను ట్యాగ్ చేశారు. కానీ, ఆ మిల్లుల నుంచి ఇప్పటివరకు బ్యాంకు గ్యారెంటీలు తీసుకోలేదు. జిల్లాలో 264మిల్లులు ఉండగా, ఇంతవరకు 49 మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాయి. అంటే మిగతావి ప్రస్తుతం కొనుగోలు చేయలేవు. ఇంతవరకు కొనుగోలు చేసిన ధాన్యంకు సంబంధించి రూ.3.67కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉండగా రైతులకు పైసా కూడా ఇవ్వలేదు. 24 గంటలు, 48 గంటల్లో చెల్లింపులు వంటివన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. అన్నదాతకు కునుకు కరవు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 50 శాతానికి పైగా కోతలు పూర్తయ్యాయి. వాటిలో 30శాతం వరకు కుప్పలు రూపంలో పూర్తవగా, మరో 20శాతం పనలు రూపంలో పంట పొలాల్లోనే ఉన్నాయి. మరో 50శాతం వరకు పంట కోతకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో వర్షాలు పడతాయని హెచ్చరికలు ఉండటంతో రైతులు భయపడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా, గాలులు వీచ్చినా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పంటను కాపాడుకోలేమని భావిస్తున్న రైతులంతా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వరకు వేచి చూడకుండా దళారులకు తక్కువకు విక్రయిస్తున్నారు. 80 కిలోల బస్తాను రూ. 1300కు అమ్ముకుంటున్న దుస్థితి నెలకొంది. జిల్లాలో వరి సాగైన విస్తీర్ణం 4,09,951 ఎకరాలు ధాన్యం దిగుబడి అంచనా 11,23,187 మెట్రిక్ టన్నులు స్థానిక ధాన్యం వినియోగం 2,24,637 మెట్రిక్ టన్నులు మార్కెట్కు వచ్చే అవకాశం ఉన్న ధాన్యం 8,98,550 మెట్రిక్ టన్నులు మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసే లక్ష్యం 6,50,000 మెట్రిక్ టన్నులు జిల్లాలో ఏర్పాటు చేస్తామన్న వరి కొనుగోలు కేంద్రాల సంఖ్య 406 ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు ట్యాగ్ చేసిన మిల్లులు 264 ఇప్పటివరకు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించిన మిల్లులు 49 ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం 1638 మెట్రిక్ టన్నులు జనరేట్ చేసిన బిల్లుల మొత్తం రూ. 3.67కోట్లు రైతులకు చెల్లించిన సొమ్ము సున్నా వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన పండిన పంటను దాచుకోవడానికి ఆపసోపాలు నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లు రైతులు మొత్తుకుంటున్నా పట్టించుకోని పాలకులు -
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం
నరసన్నపేట: రాజ్యాంగ దినోత్సవాన్ని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కృష్ణదాస్ తెలిపారు. నియోజకవర్గ కేంద్రాల్లోనూ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కమిటీలు నియమించండి వైఎస్సార్సీపీకి చెందిన నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీలన్నీ పూర్తి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీ నాటికి పార్టీ ప్రధాన కమిటీతోపాటు అనుబంధ సంఘాల కమిటీలు పూర్తి చేసి, పార్టీకి సమాచారం అందించాలన్నారు. కమిటీ డిజిటలైజేషన్ ప్రక్రి య కూడా పూర్తిచేయాలన్నారు. సంక్రాంతి నాటికి ప్రతి కమిటీ సభ్యునికి పార్టీ అధిష్టానం గుర్తింపు కార్డు ఇస్తుందని తెలిపారు. ప్రతి కమిటీ సభ్యునికి చెందిన రెండు ఫొటోలు, ఓటరు కార్డును జతచేయాలన్నారు. ఒకే పదవి ఇవ్వాలని, ఒక కమిటీలో పేరు వేస్తే ఆ పేరు మరో కమిటీలో వేయవద్దన్నారు. కమిటీ సభ్యుల వాట్సాప్ నంబర్ విధిగా పొందుపరచాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఆయా సమన్వయకర్తలు దృష్టి పెట్టి పూర్తి చేయించాలని సూచించారు. సీపీఐ నేతల గృహ నిర్బంధం పలాస: ఆమదాలవలస సమీపంలోని వెన్నెలవలసలో థర్మల్ పవర్ప్లాంట్కు వ్యతిరేకంగా తలపెట్టిన చలో సరుబుజ్జిలి కార్యక్రమానికి వెళ్తున్న సీపీఐ కార్యదర్శి చాపర వెంకటరమణ, జిల్లా కార్యదర్శి బొత్స సంతోష్ కుమార్లను మంగళవారం ఉదయం 5గంటలకు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇలాంటి చర్యలను ప్రజలు ఖండించాలని అభ్యుదయ రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతాడ కృష్ణారావు, ప్రజాసంఘాల ఐక్య వేదిక జిల్లా నాయకుడు పేడాడ కృష్ణారావు కోరారు. ఆంధ్రా కబడ్డీ టీమ్ కెప్టెన్గా చంద్రలేఖ శ్రీకాకుళం న్యూకాలనీ, టెక్కలి రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్జూనియర్స్ బాలికల జట్టు కబడ్డీ టీమ్ కెప్టెన్గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన క్రీడాకారిణి చంద్రలేఖ ఎంపికయ్యారు. హరియాణాలోని సోనీపాట్ వేదికగా ఈనెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ జరగనున్న ప్రతిష్టాత్మక జాతీయ సబ్జూనియర్స్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీలో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు నాయకత్వం వహించే బాధ్యతను చంద్రలేఖకు అప్పగిస్తూ ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. చంద్రలేఖ జిల్లాలోని కోటబొమ్మాళి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఈమె ఎంపికపై జిల్లా కబడ్డీ అసోసియేషన్ నాయకులతో పాటు పాఠశాల హెచ్ఎం డి.గోవిందరావు, ఎస్ఎంసీ చైర్మన్ బోయిన వెంకటరమణ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
ధాన్యం కొనుగోలు వేగంగా జరగాలి: జేసీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా జరగాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలుపై మాట్లాడుతూ, కొన్ని ప్రాంతాల్లో ప్రక్రియ మందకొడిగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా జలుమూరులో కనీసం ఒక్క ట్రక్ షీట్, ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) కూడా జెనరేట్ కాకపోవడంపై ఆయన ఆరా తీశారు. పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల) పరిధిలో ధాన్యం సేకరణ డల్గా ఉందని, తక్షణమే పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. రెండు రోజుల తర్వాత కూడా పనితీరు మెరుగుపడకపోతే ఆ కొనుగోలు కేంద్రాలన్ని రద్దు చేయడానికి వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం, వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో ప్రజా సానుకూల దృక్పథం విషయంలో ర్యాంకులు మెరుగు పరచుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులకు సూచించారు. ‘అన్న క్యాంటీన్’ల పనితీరులో ప్రస్తుతం 18వ ర్యాంకులో ఉన్నామని తెలిపారు. ఆర్టీసీ విభాగం 8వ ర్యాంకు నుంచి నంబర్ 1 స్థానానికి చేరుకునేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అమలులో రాష్ట్రంలో జిల్లా 5వ స్థానంలో ఉన్నప్పటికీ, సరుబుజ్జిలి వంటి ప్రాంతాలు వెనుకబడి ఉండడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలియజేశారు. గ్రీవెన్స్ ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత లేదని, ఎండార్స్మెంట్ అప్లోడ్ చేయడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్లో 127 వినతులు స్వీకారం శ్రీకాకుళం పాతబస్టాండ్: పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలను అధికారులంతా సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో ప్రజల నుంచి 127 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ ఫిర్యాదునూ శ్రద్ధతో పరిశీలించి, ప్రజలకు సంతప్తి కలిగేవిధంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వహించవద్దని స్పష్టం చేశారు. ఈ వారం ఫిర్యాదుల్లో రెవెన్యూ శాఖ – 41, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ – 16, వ్యవసాయ శాఖ – 15, పంచాయతీ రాజ్ – 7, ల్యాండ్ రికార్ుడ్స, ఏపీఈపీడీసీఎల్, హౌసింగ్ శాఖలకు సంబంధించి 5 చొప్పున ఫిర్యాదులు అందాయి. రూరల్ డవలప్మెంట్, గ్రామ వలంటీర్లు, సచివాలయాలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సమగ్ర శిక్ష, సంక్షేమ శాఖలు, ఆరోగ్య శాఖ, ఏపీ స్కిల్ డవలప్మెంట్ వంటి మొత్తం 26 వేర్వేరు శాఖల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కొన్ని వినతులు పరిశీలిస్తే... ● ధాన్యం కొనుగోలు కేంద్రాలు టీడీపీ కార్యకర్తలకు అప్పగించడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస నియోజవకర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు ఖండాపు గోవిందరావు, కొంచాడ రాము, గండెవలస పృథ్వీ తదితరులు ఉన్నారు.● గనగళ్లవానిపేట పంచాయతీలోని నర్సయ్యపేట మత్స్యకార గ్రామంలో సముద్రానికి వెళ్లే దారిలో సోలార్ లైట్లు వేయాలని మైలపల్లి నర్సింగరావు కోరారు. ● టెక్కలి రెవెన్యూ డివిజన్లో కేలీ, నాణ్యత లేని విత్తనాలు వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నష్టాలకు సంబంధిత విత్తన కంపెనీలు, ప్రభుత్వం బాధ్యత వహించాలని రైతులు బీన డిల్లీరావు, బతకల సీతమ్మ, నక్క జోగారావు తదితరులు కోరారు. ● ప్రభుత్వం చేపట్టనున్న జనాభా లెక్కల్లో బీసీ జనాభాను జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి ఆ ప్రాప్తికి జన గణన చేయాలని, రాజ్యాధికారం, రిజర్వేషన్లు వంటివి ఈ కుల గణన ఆధారంగా ఉండాలని బీసీ సంఘ నాయకులు రాయలరాము, రాజమహంతి భానుచందర్, జీవీ రమణమూర్తి, సీహెచ్ రమేష్ తదితరులు కోరారు. -
యువతకు శిక్షణ
● శ్రీకాకుళం ఐటీఐ శిక్షణా కేంద్రంలో స్వల్పకాలిక కోర్సులు ● అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, సైబరీ సెక్యూరిటీ, మీడియా అనలిస్ట్ కోర్సులు అందజేత ● మూడు నెలల శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు ● ఈ నెల 29తో గడువు పూర్తి ఉపాధే లక్ష్యంగా.. శ్రీకాకుళంలోని డీఎల్టీసీ శిక్షణా కేంద్రం శ్రీకాకుళం న్యూకాలనీ: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, డిమాండ్ ఉన్న రంగాల్లో శిక్షణ అందించేందుకు పారిశ్రామిక శిక్షణా సంస్థలు నడుంబిగించాయి. స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ అందించి త్వరితగతిన అవకాశాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేశాయి. దీనిలో భాగంగా అర్హులైన నిరుద్యోగ యువతీ యువకుల నుంచి సంబంధిత అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డీఎల్టీసీ శిక్షణా కేంద్రంలో.. శ్రీకాకుళం నగరంలోని బలగ హాస్పిటల్ జంక్షన్లో ఉన్న డీఎల్టీసీ ఐటీఐ శిక్షణా కేంద్రంలో స్వల్పకాలిక శిక్షణా కోర్సులను అందిస్తున్నారు. డీఎల్టీసీలో ఏర్పాటుచేసిన స్కిల్ హబ్లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) 4.0 లో భాగంగా అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్మీడియా ఎనలిస్ట్ (కంప్యూటర్ స్కిల్స్) కోర్సుల్లో శిక్షణ పొందేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులు చేయడానికి ఈ నెల 29 గడువు ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు. విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, రెండు పాస్ఫొటోలతో డీఎల్టీసీలో సంప్రదించాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాలకు 70957 31303 నంబర్ను సంప్రదించాలన్నారు. స్వల్పకాలిక కోర్సులివే.. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్: ఎలక్ట్రీషియన్గా నిలదొక్కుకునేవారి కోసం ఈ కోర్సును డిజైన్ చేశారు. కోర్సు కాలవ్యవధి 3 నెలలు. కనీస విద్యార్హత 10వ తరగతి. వయస్సు 10 నుంచి 30 ఏళ్లు. కంప్యూటర్ స్కిల్స్: ప్రస్తుత తరుణంలో అత్యంత డిమాండ్ ఉన్న సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనలిస్ట్ పేరిట కంప్యూటర్ స్కిల్స్ను అందించేందుకు కోర్సును రూపొందించారు. కోర్సు కాలవ్యవధి 3 నెలలు. ఇంటర్, డిగ్రీ, డిప్లమో ఆపై అర్హతలు కలిగినవారు ఎవరైనా చేరవచ్చు. యువతకు గొప్ప అవకాశం స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సు. గొప్ప డిమాండ్ ఉన్న రెండు కోర్సుల్లో డీఎల్టీసీ స్కిల్ హబ్ ద్వారా పీఎంకేవీవైలో భాగంగా శిక్షణ అందించాలని నిర్ణయించాం. ఈ నెల 29లోగా ఆసక్తి కలిగినవారు దరఖాస్తులు చేసుకోవాలి. – వై.రామ్మోహన్రావు, డీఎల్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్, శ్రీకాకుళం -
వరించాలంటే సిరి.. జాగ్రత్తలు తప్పనిసరి..!
● జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా వరికోతలు ● యాజమాన్య పద్ధతులు పాటించాలని అధికారుల సూచనలు ఆమదాలవలస: జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నూర్పులు చేపడుతున్నారు. తుఫాన్ సూచనలు ఉండడంతో ముందుగా ధాన్యాన్ని ఇంటికి తరలించి భద్రపరుచుకోవాలని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విధిగా యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచిదని, కష్టానికి తగిన ఆదాయం రావాలంటే జాగ్రత్తలు తీసుకోక తప్పదని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. వరిసాగుతో పాటు పంటకోత, నూర్పిడిలోనూ మెలకువలు పాటించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. ప్రధానంగా రైతులకు అందుబాటులో ఉన్న రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ పరిశోధన స్థానం, కేవీకే శాస్త్రవేత్తల వద్ద సలహాలు తీసుకోవాలని వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.చిట్టిబాబు సూచిస్తున్నారు. ఇలా చేయాలి... వరికంకుల్లో 80 నుంచి 90 శాతం గింజలు పసుపు రంగులోకి మారుతున్నప్పడే పంటను కోయాలి. ఈ దశలో ధాన్యం గింజల్లో 18 నుంచి 24 వరకు తేమశాతం ఉంటుంది. పూర్తిగా ఎండిపోయే వరకు వరిపంట కోయకుండా వదిలేస్తే రెక్కరాల్చడం వల్ల గింజ దిగుబడి తగ్గిపోతుంది. ధాన్యం గింజలపై పగుళ్లు వస్తాయి. పగిలిన ధాన్యాన్ని మిల్లులో ఆడించేటప్పుడు బియ్యం శాతం తగ్గి నూకల శాతం ఎక్కువ ఉంటుంది. వరిపంటను కోసిన తర్వాత తేమ శాతాన్ని తగ్గించడానికి వరి పనలను 4 నుంచి 5 రోజులు పంటభూమిలోనే ఆరనివ్వాలి. కోసిన పరి పనలను కిందకు మీదకు తిరగబెడితే సమానంగా ఎండుతుంది. పనలు కోసిన తర్వాత వర్షం కురిస్తే 5 శాతం ఉప్పును పనలపై జల్లితే ధాన్యం రంగు మారదు. వరిపంట పూతకు వచ్చిన తర్వాత 30 రోజుల్లో కోత దశకు చేరుకుంటుంది. పంట పూర్తిగా పండకుండా కోత కోస్తే ధాన్యంలో పచ్చి గింజలు ఎక్కువగా ఉంటాయి. వరికంకిలోని చివర గింజలు పూర్తిగా తోడుకాకుండా ధాన్యం సన్నగా ఉండి పొట్ట తెలుపు రంగులో ఉంటాయి. దీనివల్ల ధాన్యం దిగుబడి తగ్గి నూక, తవుడు శాతం ఎక్కువగా ఉంటుంది. పండిన వరిపంటను యంత్రం ద్వారా నూర్చడం వలన మట్టిబెడ్డలు, చెత్త, దుమ్ము వంటివి ధాన్యంలో ఉండవు. నూర్పు చేసిన ధాన్యాన్ని ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు ఆరబెట్టకూడదు. తేమ పూర్తిగా తగ్గి మిల్లు ఆడించేటప్పుడు నూకలు ఎక్కువగా వస్తాయి. పాటించాల్సిన మెలకువలు ● నూర్చిన ధాన్యంలో 14 శాతం కన్నా తక్కువగా తేమ ఉండేలా చూసుకోవాలి. ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉంటే బూజు పట్టడం, రంగు మారడంతో పాటు కీటకాలు ఆశిస్తాయి. ● ఎక్కువ నిల్వ ఉంచాల్సి వస్తే కీటకాలు ఆశించకుండా పొగబెట్టాలి ● ధాన్యాన్ని పొడి సంచుల్లో వేయడంతో పాటు గోడలు, నేలపై తేమ పీల్చకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. ● ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వచేస్తే రంగు మారుతాయి. ● రైతులు సకాలంలో అమ్మడం లేదా మరపెట్టడం చేయాలి. ● రైతు సేవా కేంద్రాలను సంప్రదించి విక్రయాలకు సంబంధించిన ట్రక్ షీట్ పొంది, సంబంధిత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలి. ఆరుగాలం కష్టపడి వరిని పండించే రైతుల పంటకోత, కుప్పలు పెట్టడం, నూర్పు సమయంలో జాగ్రత్తలు పాటించాలి. పండిన వరిపంటను సకాలంలో కోయాలి. నూర్పు చేసే ధాన్యంలో 14 శాతం కన్నా తేమ తక్కువ ఉండేలా చూసుకోవాలి . ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచరాదు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి. – డాక్టర్ జి.చిట్టిబాబు, సీనియర్ శాస్త్రవేత్త, ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన స్థానం -
పేలు మందు తాగి ఆత్మహత్య
గార: మనుమరాలి శుభకార్యం తాత చేతుల మీదుగా జరగాలని అమ్మమ్మ పట్టుబట్టగా.. తన దగ్గర డబ్బుల్లేవన్న సమాధానంతో మద్యానికి బానిసయ్యావని, డబ్బులు తగలబెడుతున్నావని భార్య తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని వత్సవలస పంచాయతీ పేర్లవానిపేట గ్రామానికి చెందిన కొమర నారాయణస్వామి (62) సీమెన్ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి సుమారు పదినెలలైంది. దాచుకున్న డబ్బులతో రోజూ మద్యం తాగడంతో ఇంటి దగ్గర తరచూ గొడవలు జరిగేవి. నారాయణస్వామి పెద్ద కూతురు విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఉండగా, మనుమరాలు ఇటీవలే రజస్వల అయ్యింది. విందు భోజనం కోసం అల్లుడు, కూతురు చెప్పారని, తాతగారి తరుపున బంగారం, దుస్తులు పెట్టాలని భార్య సత్యమ్మ చెప్పగా, నా దగ్గర డబ్బుల్లేవని నారాయణస్వామి అన్నారు. దీంతో భార్య తీవ్రంగా మందలించగా మనస్తాపం చెందిన నారాయణస్వామి శనివారం సాయంత్రం విశాఖపట్నం వెళ్లేందుకు అద్దె కారులో బయలుదేరారు. ఆదివారం జరగాల్సిన విందు భోజనాలకు వెళ్తుండగా నాతవలస బ్రిడ్జి సమీపంలో తీవ్రమైన కడుపునొప్పి వస్తుందని చెప్పారు. దీంతో ఏమయ్యిందని అడగగా కారు ఎక్కేముందు పేలు మందు తాగేసానని చెప్పాడు. దీంతో అదే కారులో విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరిలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. భార్య సత్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ తెలుగు చంద్రమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ముగ్గురు కుమార్తెలుండగా, అందరికీ పెళ్లిళ్లు జరిగాయి. ● అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త ● మాట్లాడడానికి తీసుకెళ్లి హత్య చేసిన వైనంసంతబొమ్మాళి: మండలంలోని నౌపడలో గుర్తు తెలియని వివాహిత మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ లక్ష్మణరావు నౌపడ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. టెక్కలి మండలం కొండభీంపురం గ్రామానికి చెందిన దాసరి బాలకృష్ణతో, నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన కొనారి పుష్పలతకు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ దంపతుల మధ్య గత మూడు సంవత్సరాలుగా కలహాలు తలెత్తాయి. బాలకృష్ణ వ్యసనాలకు బానిసై భార్య పుష్పలతను అనుమానిస్తూ పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటూ తరచూ గొడవ పడేవాడు. దీంతో భార్య పుష్పలత గ్రామ పెద్దలను సంప్రదించి భర్తపై ఫిర్యాదు చేయగా, గ్రామ పెద్దలు భర్తను మందలించి సరిగ్గా కాపురం చేసుకోవాలని సూచించారు. పెద్దలకు ఫిర్యాదు చేయడంతో అందరి ఎదుట తన భార్య అవమానించిందని భావించి అమైపె బాలకృష్ణ కక్ష పెంచుకొని చంపడానికి నిర్ణయించుకున్నాడు. భర్త పెట్టిన బాధలను భరించలేక పుష్పలత తన పిల్లలను తీసుకుని వెళ్లిపోయి కన్నవారి ఇంట్లో ఉంచి, నందిగాం గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటోంది. భర్తపై మెయింటెనెన్స్ కేసు కూడా భార్య వేసింది. భార్యను చంపడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న బాలకృష్ణకు ఈలోగా ఈనెల 20వ తేదీన భార్య పుష్పలత ఫోన్చేసి పిల్లలు గురించి మాట్లాడాలని చెప్పింది. బాలకృష్ణ ఇదే అవకాశంగా భావించి భార్య పుష్పలతను టెక్కలిలో కలుసుకున్నాడు. ఎవరు లేనిచోట మాట్లాడుకుందామని నమ్మించి అతని ద్విచక్ర వాహనంపై భార్య పుష్పలతను ఎక్కించుకొని నౌపడ మూడురోడ్లు జంక్షన్ సమీపంలో ఉన్న ముళ్ల పొదల వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మాట్లాడుతున్నట్లు నటించి తనతో తీసుకొచ్చిన వెదురు కర్రతో తల, ముఖంపై బలంగా కొట్టి చంపేశాడు. ఆ తర్వాత అమె సెల్ఫోన్, కర్రను ముళ్లపొదల్లో దాచిపెట్టి వెళ్లిపోయాడు. నౌపడ వీఆర్వో డి.జోగారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాసరి బాలకృష్ణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఆయనతో పాటు టెక్కలి రూరల్ సీఐ శ్రీనివాసరావు, నౌపడ ఎస్ఐ నారాయణస్వామి ఉన్నారు. -
ఈఈగా రాజకీయ ఆఫర్
శ్రీకాకుళం● డీఈఈగా రిటైర్● పడగ విప్పి.. బుసలు కొట్టి ● సమగ్ర శిక్షా ఇంజినీరింగ్ విభాగంలో అక్రమ నియామకం ● డీఈఈ కేడర్లో రిటైరైన ఇంజినీర్ను ఈఈ పోస్టులో నియామకం ● అడ్డగోలు నియామకం అంటున్న అధికార వర్గాలు ● చక్రం తిప్పిన సీఎంఓ అధికారి సోదరుడు ● టెండర్లను గుట్టుగా నిర్వహించి, కాంట్రాక్ట్లు కొట్టేశారని ఆరోపణలు మంగళవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమగ్ర శిక్షా అభియాన్లో రాజకీయ జోక్యం మితిమీరుతోంది. ఏకంగా సీఎంఓ స్థాయి అధికారులు సైతం కలగజేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందులో జరిగే కార్యకలాపాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సైతం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నియోజకవర్గాల్లో తమకు తెలియకుండానే వ్యవహారాలు నడిచిపోతున్నాయని అంతర్మథనం చెందుతున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ) అదనపు భవన నిర్మాణ కాంట్రాక్ట్లను ఉన్నత స్థాయిలో వ్యూహాత్మక టెండర్ల ద్వారా కొందరు వ్యక్తులకు కట్టబెట్టారని లోకల్గా చర్చ నడుస్తోంది. ఇటీవల ఆ ఎమ్మెల్యేలంతా ఒకచోట సమావేశమై జరిగిన తంతును అంతర్గతంగా చర్చించుకున్నారు. తాజాగా అదే శాఖలో అడ్డగోలు నియామకం జరిగింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) హోదాలో రిటైరైన వ్యక్తిని ఏకంగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) హోదాలో నియమించారు. దాని వెనక కూడా ఉన్నత స్థాయి వ్యక్తుల జోక్యం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇదంతా తమకు నచ్చిన విధంగా బిల్లులు డ్రా చేసుకోవడానికి అమలు చేసిన ప్లాన్గా తెలుస్తోంది. కీలక అధికారి సోదరుడి కోటరీకే.. జిల్లాకు చెందిన వ్యక్తి సీఎంఓలో కీలక అధికారిగా ఉన్నారు. ఆ కీలక అధికారి సోదరుడు జిల్లాలో క్లాస్–1 కాంట్రాక్టర్గా కొనసాగుతున్నారు. ఆ కాంట్రాక్టర్కు కొంతమంది కోటరీ కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరందరికీ సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలోని కేజీబీవీల ఆదనపు భవనాల కాంట్రాక్ట్లు దక్కాయి. పాతపట్నం, నరసన్నపేట, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో అదనపు భవనాల నిర్మాణ కాంట్రాక్ట్లు వచ్చాయి. అయితే, ఈ వర్క్ల విషయాలు, జరిగిన టెండర్ల తంతు, కాంట్రాక్ట్ ఒప్పందం తదితర విషయాలేవి స్థానిక ఎమ్మెల్యేలకు తెలియలేదు. పనులు ప్రారంభించేవరకు ఆ ఎమ్మెల్యేలకు తెలియని పరిస్థితి చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్నాక సదరు ఎమ్మెల్యేలంతా కంగుతిన్నారు. నియోజకవర్గంలో మనకు తెలియకుండా పనుల కాంట్రాక్ట్లు ఖరారు చేయడమేంటి? వాటి విషయమే తెలియకుండా గోప్యంగా ఉంచడమేంటి? ఎమ్మెల్యేలను డమ్మీలుగా చేయడమేంటి? కనీసం మమ్మల్ని సంప్రదించకపోవడమేంటి? అని కొందరు ఎమ్మెల్యేలు ఓ చోట సమావేశమై చర్చించుకోవడం కూడా జరిగింది. అధికార పార్టీలో ఇదొక అంతర్గత వివాదమై చర్చకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వ నిధులు కావడం, ఎప్పటికప్పుడు విడుదలయ్యే అవకాశం ఉండటంతో గుట్టుగా రూ.కోట్లు విలువైన కేజీబీవీల కాంట్రాక్ట్లను సీఎంఓలో కీలక అధికారి సోదరుడి కోటరీ కొట్టేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. పథకం ప్రకారం టెండర్లలో కొందరినే పాల్గొనేలా చేసి కాంట్రాక్ట్లు దక్కించుకున్నట్టు వాదనలు ఉన్నాయి. నిర్మాణాలపై అనుమానాలు వాస్తవంగా కేజీబీవీల అదనపు భవనాల నిర్మాణ పనులు నాణ్యతతో జరగడం లేదని తెలుస్తోంది. నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. దీంతో బిల్లులు చెల్లింపుల్లో ఇంజినీరింగ్ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బిల్లుల విషయంలో ఓ ఇంజినీరింగ్ అధికారి కఠినంగా ఉంటున్నారని ఆయనకు సమాంతరంగా అవుట్ సోర్సింగ్ విధానంలో డీఈఈ కేడర్లో రిటైరైన ఇంజినీర్ను ఈఈ పోస్టులో నియమించారు. ఈ నియామకంలో పెద్ద ఎత్తున చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు మంత్రుల వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న వారితో పాటు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న అధికారి ప్రమేయం ఉందని తెలుస్తోంది. అడ్డగోలు నియామకం చేపట్టడమే కాకుండా కఠినంగా ఉన్న ఇంజినీరింగ్ అధికారిని సెలవు పెట్టేసి వెళ్లిపోవాలని ఒత్తిడి కూడా చేస్తున్నారు. అనుకున్న విధంగా ప్లాన్ వర్క్ అవుట్ అయితే నచ్చినట్టుగా బిల్లులు డ్రా చేసుకుని కోటరీ కాంట్రాక్టర్లు కేంద్ర నిధులు మింగేయనున్నారు. విభిన్న ఆభరణాలు.. సరికొత్త ఆఫర్లుఅడ్డగోలు నియామకం.. తాజాగా ఈ పనులు పర్యవేక్షించే సమగ్ర శిక్షా అభియాన్ ఇంజినీరింగ్ విభాగంలో కీలక అధికారి నియామకం కూడా అడ్డగోలుగా జరిగింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ) కేడర్లో రిటైరైన వ్యక్తిని ఏకంగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) కేడర్లో నియమించారు. దీనివెనక ఉన్నత స్థాయి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా రిటైరైన వ్యక్తికి కీలక పోస్టుల్లో నియమించరు. అవసరమైతే అదే కేడర్లో నియమిస్తారు. కానీ, అంతకుమించిన పోస్టులో రిటైరైన వ్యక్తిని నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రిటైరైన వ్యక్తితో నచ్చినట్టు చేసుకోవచ్చని, బిల్లులు ఇష్టారీతిన డ్రా చేసుకోవచ్చన్న ఉద్దేశంతో అడ్డగోలు నియామకం చేశారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా రిటైరైన అధికారిపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో పలు విచారణలు కూడా జరిగినట్టు సమాచారం. అలాంటి అధికారిని ఏరికోరి, కేడర్కు మించి నియమించడం చర్చనీయాంశంగా మారింది. విశేషమేమిటంటే ప్రస్తుతం రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) ఉన్నారు. ఆయన ఉంటూనే కొత్తగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఏకంగా జిల్లా పోస్టులో రిటైరైన ఇంజినీర్ను కేడర్కు మించి నియామకం చేపట్టారు. ఇదంతా అడ్డగోలు వ్యవహారమే. -
గుక్కెడు నీరు.. ఇప్పించలేరా సారూ
● జలుమూరు, సారవకోట వాసుల విజ్ఞప్తి ● నిర్వహణ లోపంతో తాగునీరు అందించలేని వైనం జలుమూరు: నిరంతరం గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం గుక్కెడు మంచినీళ్లు మాత్రం ఇవ్వలేకపోతోందని జలుమూరు, సారవకోట మండలాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. సుమారు ఎనిమిదేళ్ల కిందట అచ్యుతాపురం వద్ద రూ.48 కోట్లతో జల్జీవన్ మిషన్ పథకంలో శ్రీముఖలింగం రక్షిత మంచినీటి పథకం ప్రారంభించారు. పథకం ప్రారంభంలో కొన్ని గ్రామాలకు కొంత వరకూ తాగునీరు అందించారు. కానీ కొద్ది రోజులుగా తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యా యి. జలుమూరు, సారవకోట మండలాల్లో సుమా రు 94 గ్రామాలకు రక్షిత మంచినీరు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. జలుమూరు మండలంలో చాలా వరకూ పంచాయతీలకు ట్యాంక్లు నిర్మాణం జరిగి ఆయా గ్రామాలకు పైపులైన్లు కూడా వేసి అనుసంధానం చేయలేదు. అలాగే సారవకోట మండలం పంచాయతీలకు పైపులైన్లు వేసి రోడ్డు మీద విడిచిపెట్టేశారని, దీంతో తాగునీరు వృధా అవుతోందని ఆయా గ్రామ ప్రజలు చెబుతున్నారు. కొన్ని చోట్ల ట్యాంక్, పైపులైన్ వేసి నిర్వహణ చేయకపోవడంతో నెలకు పది రోజులైనా నీరు రావడం లేదు. దీంతో ఆయా పంచాయతీ ప్రజాప్రతినిధులు గ్రామీణ నీటిసరఫరా అధికారులకు ఫిర్యాదు చేస్తే మరమ్మతులు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. నిర్వహణ లోపమే శాపం గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారుల నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పర్యవేక్షించాల్సిన ఏఈ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడంతో సారవకోట ఏఈని ఇన్చార్జిగా నియమించారు. ఆయన సమావేశాలకు హాజరవుతున్నారు తప్ప సమస్య పరిష్కరించలేకపోతున్నారు. అచ్చుతాపురం వద్ద ఉన్న ఈ రక్షిత పథకం ఆపరేటర్ కూడా ఒకరు లేకపోవడం, కింది స్థాయి సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో తూతూమంత్రంగా సేవలు అందిస్తున్నారు. నెలకు పదిరోజులు కూడా నీరు రాదు నెలకు పది రోజులు కూడా తాగునీరు ఇవ్వరు. ఉదయం అయితే చాలు తాగునీరు కోసం నానా అవస్థలు పడుతున్నాం. – పంచిరెడ్డి పద్మ, మహిళ,లింగాలవలస తాగునీరు అందిస్తాం సిబ్బందితో పర్యవేక్షణ చేసి తాగునీరు అందించేందుకు కృషి చేస్తాం. ట్యాంక్లు అనుసంధానం చేసే చోట చర్యలు తీసుకుంటాం. పైపులు లీక్ అయిన వెంటనే మరమ్మతులు చేస్తున్నాం. సిబ్బంది కొరత అధిగమిస్తాం. – జల్లు సుదర్శన్, డీఈఈ, గ్రామీణ నీటి సరఫరా విభాగం -
ఖాళీ జాగా.. కనిపిస్తే కబ్జా
పలాస: కాశీబుగ్గ సూదికొండ ఎదురుగా పదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం హుద్హుద్ ఇళ్లను నిర్మించింది. ఓ శిలా ఫలకాన్ని ఏర్పాటు చేసి కొంత ఖాళీ స్థలాన్ని కాలనీ వాసుల అవసరార్థం విడిచి పె ట్టారు. ఇంతవరకు వాటిని ప్రారంభించలేదు. ప్రభుత్వం మారడంతో దానిపై అధికారపక్ష నాయకుల కన్ను పడింది. ఇప్పుడు ఆ ఖాళీ స్థలాన్ని కబ్జా చేయడానికి పథకం వేసి రాత్రి పూట పొక్లెయినర్తో చదును చేశారు. శిలాఫలకం ఉన్నా ఎలాంటి భయం లేకుండా ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు. మున్సిపాలిటీ చాలా ఖాళీ స్థలాల పరిస్థితి ఇలాగే ఉంది. -
అజాగ్రత్తగా ఉన్నారో..
● రణస్థలం పైవంతెన పనులతో వాహనాల మళ్లింపు ● జాగ్రత్తగా లేకుంటే ప్రాణాలకే ప్రమాదం స్థానికులు సహకరించాలి రణస్థలం టౌన్లో ఉన్న వ్యాపారులు, స్థానికులు పై–వంతెన పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. సర్వీస్ రోడ్డులో ప్రధాన వాహనాలు విడిచిపెట్టడం వల్ల ఆ రోడ్డుపై ఎవరూ వాహనాలు నిలుపరాదని సూచించారు. అలాగే సర్వీస్ రోడ్డులో అప సవ్య దిశలో వాహనాలు రావటం వలన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే పనులు వేగవంతం అవుతాయి. – రాధాకృష్ణ, ఎస్ఈపీఎల్ ప్రాజెక్టు మేనేజర్ విద్యుత్ దీపాలు వేయాలి రణస్థలం టౌన్లో పైవంతెన పనులు జరిగే ప్రదేశాల్లో విద్యుత్ దీపాలు, ట్రాఫిక్ మళ్లింపు వద్ద రేడియల్ స్టిక్కర్లతో కూడిన స్టాపర్ బోర్డు ఎక్కువగా పెట్టాల్సి ఉంది. అలాగే వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. – పిన్నింటి సత్యంనాయుడు, జేఆర్ పురం రణస్థలం: జాతీయ రహదారుల సంస్థ–16 విస్తరణలో భాగంగా పెండింగ్లో ఉన్న రణస్థలం పై–వంతెన పనులు సాగుతున్నాయి. ఎన్హెచ్ఏఐ విశాఖపట్నం సారథ్యంలో ఎస్ఈపీఎల్ పనులు చేస్తోంది. బంటుపల్లి పరిధిలోని యూబీ పరిశ్రమ దిగువ నుంచి లావేరు మండలంలోని రావివలస దిగువ వరకు 4.2 కిలోమీటర్లు వంతెన నిర్మిస్తున్నారు. పైవంతెన నిర్మాణ పనులు జరిగే ప్రదేశంలో వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. అందువల్ల టౌన్ మధ్యలో 800 మీటర్ల పరిధిలో 25 సింగిల్ స్తంభాలు నిర్మించాల్సి ఉంది. ఈ పనులు చేయాల్సి ఉన్నందున తహసీల్దార్ కూడలి నుంచి పాత పోలీస్ స్టేషన్ వరకు సర్వీస్ రోడ్డులోని వాహనాలను విడిచిపెట్టడానికి సన్నద్ధమయ్యారు. అయి తే సర్వీస్ రోడ్డులో ప్రధాన వాహనాలు విడిచిపెడితే సమస్య వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ రోడ్డులో ఉన్న వ్యాపారులు ఎరువులు, సిమెంట్, ఇతర సామగ్రి దించాలన్నా భారీ వాహనాలు నిలపడం కుదరదు. ఇలాంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోతుంది. అలాగే సర్వీస్ రోడ్డులో ఎదురెదురుగా వాహనాలు వచ్చేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. హెచ్చరిక బోర్డులు తప్పనిసరి రణస్థలం టౌన్లో ట్రాఫిక్ మళ్లింపు వల్ల దూరం నుంచి వచ్చే వాహనాలకు అవగాహన తక్కువ. స్టాపర్ బోర్డులు, వేగ నియంత్రణ, దారి మళ్లింపు బోర్డులు పెట్టాల్సి ఉంది. అలాగే రాత్రి వేళల్లో ముఖ్య కూడలిలో దీపాలు అమర్చాలని స్థానికులు కోరుతున్నారు. -
విని వదిలేస్తున్నారా..?
● పోలీసుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తున్న రోడ్డు ప్రమాదాలు ● సమీక్షలు, సమావేశాల్లో వినినట్టే విని వదిలేస్తున్న అధికారులు ● హైవేల్లో ఎక్కడికక్కడే భారీ వాహనాల పార్కింగ్ శ్రీకాకుళం క్రైమ్ : ‘హైవేల్లో ఘోరంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడే భారీ వాహనాలు నిలిపేస్తున్నారు. టోల్ప్లాజాలు, ముఖ్య కేంద్రాల వద్ద షాపులు వెలియడంతో రోడ్లమీదే వాహనాలు బారులు తీరుతున్నాయి..’ శనివారం మధ్యాహ్నం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో విలేకరులు అన్న మాటలివి. ఆ మాటలు అన్న కొద్ది గంటలకే కోటబొమ్మాళి ఎత్తురాళ్లపాడు వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టి నలుగురు చనిపోయారు. ఈ ఘటన జరగడానికి డ్రైవర్ నిద్రమత్తు ఎంత కారణమో, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయడం కూడా అంతే తప్పు అన్న వాదన వినిపిస్తోంది. నవంబరు నెలలో ఇప్పటికే జిల్లాలో 12 మంది మృత్యువాత పడ్డారు. సూచిస్తున్నా.. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి నేర సమీక్ష సమావేశాల్లోను, రోజువారీ మాట్లాడే సెట్ కాన్ఫరెన్సుల్లో ఎన్నో సలహాలు ఇస్తున్నారు. రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, హైవే పెట్రోలింగ్ వాహనాలు తక్షణమే స్పందించి క్షణాల్లో ఘటనా స్థలికి చేరాలని, స్పీడ్, ర్యాష్, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్, మైనర్ రైడింగ్ చేస్తున్నవారి వాహనాలు ఆపాలని, అర్ధరాత్రి, వేకువజామున వాహన డ్రైవర్లకు ఫేష్వాష్ చేయించాలని, బ్లాక్స్పాట్లు గుర్తించాలని, హైవేపైన, కింద సర్వీస్ రోడ్లపైన, ఫ్లై ఓవర్ల కింద భారీ వాహనాలు పార్కింగ్ చేయకుండా చూడాలని ఎంత మొత్తుకున్నా.. ఎవ్వరూ వినే పరిస్థితిలో లేనట్లే కనిపిస్తోంది. వరుసగా జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనం. అన్ని విభాగాలూ ‘మామూలే’.. ప్రమాదాలు నివారించడంలో అందరికంటే ముందు వరుసలో ఉండాల్సిన పోలీసులు వాహనాలను తనిఖీ చేసేది అంతంతమాత్రమే. అధికంగా కోటబొమ్మాళి, కంచిలి, ఇచ్ఛాపురం హైవేల్లో పోలీసుల తీరు వేరేగా ఉంది. ముఖ్య కూడళ్ల వద్ద షా పుల నుంచి దాబాల వరకు నెలవారీ మామూళ్లు చాలా మామూలు విషయమని అక్కడి వారే చెబుతున్నారు. హైవే అథారిటీ అధికారులు సైతం ఇబ్బడిముబ్బడిగా టోల్ప్లాజాలు వద్ద టీ, టిఫిన్, ఫాస్ట్ఫుడ్, ఇతర వ్యాపార దుకాణాలకు అనుమతులివ్వకుండానే వారు నడుపుకునేందుకు ‘ఒప్పందం’ చేసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. కమర్షియల్ ట్యాక్స్ సిబ్బంది సైతం రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రమాదాలకు ఆస్కారమిలా.. ఎన్హెచ్–16 నుంచి సర్వీస్ రోడ్డులోకి ఎంటర్ అయ్యేటప్పుడు జిల్లాలో చాలా చోట్ల కాంక్రీట్ దిమ్మలు అడ్డంగా ఉంచడం. సర్వీస్ రోడ్డు నుంచి హైవేకి వెళ్లేటప్పుడు అధిక వేగంతో వాహనాలు వెళ్లడం, ఒకే మార్గంలో ఎదురెదురుగా వాహనాలు రావడం. వాహనదారుల మద్యం మత్తు, నిద్రమత్తు, రహదారి నిబంధనలు ఉల్లఘించడం. ఇచ్ఛాపురం నుంచి పైడిభీమవరం వరకు లారీలు సర్వీసు రోడ్లలోనే కాక హైవేల మీద గంటల తరబడి పార్కింగ్ చేయడం, ఫ్లై ఓవర్ల కింద రోజుల తరబడి ఉంచేయడం. హైవే వెంబడి రాత్రి పూట లైట్లు వెలగకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, హెచ్చరిక బోర్డులు అనుకున్న స్థాయిలో లేకపోవడం. బ్లాక్స్పాట్లు గుర్తించేలా ఈ చోట ప్రమాదాలెక్కువ అంటూ సూచిక బోర్డులు లేకపోవడం. ముఖ్యంగా పోలీసులతో పాటు రవా ణాశాఖాధికారులు వాహనాల తనిఖీ స్పెషల్ డ్రైవ్లా చేపట్టకపోవడం. -
ఎస్పీ గ్రీవెన్సుకు 52 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం (గ్రీవెన్స్)నకు బాధితుల నుంచి 52 వినతులు అందాయి. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి వినతులను స్వీకరించి సకాలంలో న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. కొన్ని వినతులు పరిశీలిస్తే... ● గుంటూరుకు చెందిన ప్రత్తిపాటి శివకృష్ణ ప్రసాద్ తన కుమారుడు సృజన్ను తీవ్రంగా కొట్టి వేధించి చనిపోయేటట్లు చేసిన విద్యార్థులను కఠినంగా శిక్షించాలని ఎస్పీ మహేశ్వరరెడ్డిని వేడుకున్నారు. ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో నిత్యం ఇలాంటి ఘటనలే జరుగుతున్నా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని, తమ బిడ్డకు జరిగినట్లు వేరెవరికీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ● శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు మాజీ వీఆర్వో తన భూమి పాసు పుస్తకాలు తీసుకుని ఇవ్వడం లేదని, అడిగితే దౌర్జన్యానికి దిగుతున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● కొత్తూరు మండలం సోమరాజుపురం స్టోన్ క్రషర్ కాంట్రాక్టర్ సతీష్, గ్రామస్తులు కొందరు ఎస్పీ మహేశ్వరరెడ్డిని గ్రీవెన్సులో కలిసి ఫిర్యాదు చేశారు. అన్ని అనుమతులు, గ్రామస్తుల అనుమతితో నడుపుతున్న తమ క్వారీలను ఆపేయాలని, లేదంటే డబ్బులివ్వాలని, తాము హ్యూమన్ రైట్స్ కమిటీలో ఉన్నామని కొత్తూరు ఉప్పరిపేటకు చెందిన జాన్ కటారీ, మరికొందరు బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. -
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం దారుణం
● వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొండు రఘురాం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఖరీఫ్ కోతలు జరుగుతున్నా ఇంతవరకు సక్రమంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొండు రఘురాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యానికి ప్రభుత్వం రూ.1,890లు మద్దతు ధర ప్రకటించినా.. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులకు రూ.1,350లకే అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వ్యవసాయశాఖ మంత్రి ఉన్న జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇతర జిల్లాల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందోనని ఆవేదన వ్యక్తం చేశారు. మోంథా తుఫాన్కి జిల్లావ్యాప్తంగా ప్రాథమికంగా 4 వేల ఎకరాలకు నష్టం కలిగినట్లు అంచనా వేసి, చివరికి 400 ఎకరాలకు ఫైనల్ చేసి అరకొరగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు జాబితాలు సిద్ధం చేయడం దారుణమన్నారు. వంశధార, నారాయణపురం, మడ్డువలస, ఆఫ్షోర్ ప్రాజెక్టులను ప్రభుత్వం గాలికొదిలేసి.. శివారు ఆయకట్టుకి నీరివ్వకుండా రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. నేరడి బ్యారేజీ అడ్డంకులపై ఒడిశా సీఎంతో మాట్లాడేందుకు గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ధర్మాన సోదరులు వెళ్లి దీర్ఘకాల సమస్యకు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు గొర్లె అప్పలనాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గ అధ్యక్షుడు పీస శ్రీహరి, రైతు విభాగం గార మండల అధ్యక్షుడు శిమ్మ ధర్మరాజు, శ్రీకాకుళం మండల అధ్యక్షుడు రావాడ జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య కళాశాల ఎంబీఏ కోర్సుకు ఎన్బీఏ టైర్–1 గుర్తింపు టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎంబీఏ కోర్సుకు ప్రతిష్టాత్మక నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) టైర్–1 గుర్తింపు లభించిందని కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండు విశ్వ విద్యాలయాలతో పాటు ఆదిత్య కళాశాలకు అరుదైన గుర్తింపు లభించినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రమాణాలు, నాణ్యత, పారదర్శకత కలిగిన మేనేజ్మెంట్ విద్యాసంస్థలకు మాత్రమే లభించే ఈ గుర్తింపు ఆదిత్య కళాశాలకు లభించడంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు కృషి ఉందన్నారు. సొసైటీ చైర్మన్ కొంచాడ సోమేశ్వరరావు మాట్లాడుతూ ఎన్బీఏ గుర్తింపు పొందడం అంటే ఆదిత్యలో అందిస్తున్న విద్య జాతీయ ప్రమాణాలకు మించి ఉన్నదని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి ● ఏఐసీసీ సెక్రటరీ సూరత్ సింగ్ ఠాకూర్ శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు ఏఐసీసీ సెక్రటరీ సూరత్సింగ్ ఠాకూర్ తెలిపారు. నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా జిల్లా అధ్యక్షుడి నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తాము శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నామన్నారు. పార్టీలో నిబద్ధతతో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించేందుకు ఏఐసీసీ చర్యలు తీసుకుంటుందన్నారు. పార్టీ జెండా మోసేవారే కాక, గత కొంతకాలంగా పార్టీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇప్పటికే పలువురు నుంచి దరఖాస్తులు అందాయని, ఈనెల 27వ తేదీ వరకు శ్రీకాకుళంలోనే ఉంటూ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ కమిటీ సభ్యులు లెక్కరాజు రామారావు, పాచిపెంట శాంతికుమారి, నాయకులు పేడాడ పరమేశ్వరరావు, అంబటి కృష్ణారావు, సనపల అన్నాజీరావు, రెల్ల సురేష్, గోవింద మల్లిబాబు, బస్వా షణ్ముఖరావు, ఎం.చక్రవర్తిరెడ్డి, లఖినేన నారాయణ, పూడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
తీరంలో సందడే సందడి
గార: జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం మొగదాలపాడులో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. కార్తీకమాసం ముగిసినప్పటికీ పిక్నిక్ కోసం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చారు. సమీప తోట ల్లో భోజనాలు చేశారు. సాయంత్రం వేళ సముద్రంలో స్నానాలు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కళింగపట్నం మైరెన్ స్టేషన్ సీఐ బి.ప్రసాదరావు బందోబస్తు ఏర్పాటు చేశారు. మైరెన్ పోలీసులు, సివిల్ పోలీసులు స్థానిక మత్స్యకార యువతతో సమన్వయం చేసుకొని పర్యవేక్షణ చర్యలు చేపట్టారు. పలువురు పర్యాటకులు శాలిహుండం కొండపై బౌద్ధారామాలను సందర్శించారు. -
ఆదిత్యా నమోస్తుతే..
అరసవల్లి : అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో మార్గశిర ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. అంతరాలయంలో భక్తుల గోత్రనామాలతో పూజలు చేసేలా ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తగు చర్యలు చేపట్టారు. వివిధ దర్శనాల రూపంలో రూ.4,55,800, విరాళాల రూపంలో రూ.64,700, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.2.47 లక్షల మేరకు ఆదాయం లభించినట్టు ఈవో వివరించారు. కాగా భక్తుల సమాచారం కోసం ఏర్పాటుచేసిన సమాచార కేంద్రం నిర్వహణ తీరుపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. భక్తులతో దురుసుగా ప్రవర్తించిన కారణంగా సంబంధిత సిబ్బందిపై ఆలయ ఈవోకు ఫిర్యాదులు అందాయి. ఉమ్మడి హక్కుల సాధనకు కృషి శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని రెవెన్యూ సర్వీసుల సంఘం, రెవెన్యూ ఉద్యోగులందరూ వారి ప్రత్యేకతను కనబర్చుతూ మిగిలిన జిల్లా లకు ఆదర్శంగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ రెవె న్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపి జేఏసి అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఇదే పంథాను అనుసరిస్తూ భవిష్యత్లో విధి నిర్వహణలో ఐకమత్యాన్ని చూపుతూ ప్రజలకు చేరువవుతూ రెవెన్యూ శాఖ ఔన్నత్యాన్ని పెంచి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని కోరారు. శ్రీకాకుళం నగరంలో రెవెన్యూ అతిథి గృహ సమావేశ మందిరంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమం చేయడం ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన లక్ష్యం కాదని, సమస్యల పరిష్కారం ప్రధాన ధ్యేయమని అన్నారు. రానున్న 2026 ఫిబ్రవరి 5వ తేదీన రాష్ట్ర ఏపీ జేఏసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపి.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. -
కొత్త వాహనం కొన్నామని..
నరసన్నపేట: కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రానికీ తేరుకోలేక పోయారు. కళ్ల ముందే భర్తల ను కోల్పోయిన మహిళలు, తండ్రిని, పిల్లనిచ్చిన మామను కోల్పోయిన డ్రైవర్ శోక సంద్రంలో మునిగిపోయారు. వ్యవసాయం చేస్తూ ఉన్నంతలో గౌరవంగా జీవిస్తున్న సునీల్ సింగ్ పటేల్ ఈ మధ్యనే వాహనం కొనుగోలు చేశారు. దీంతో కుటుంబ సభ్యులను అందరినీ తీసుకొని పుణ్య క్షేత్రాల సందర్శనకు బయల్దేరారు. మధ్యప్రదేశ్లోని కాండవ జిల్లా నితన్ గావ్కు చెందిన వీరందరూ ఈ నెల 10న పుణ్య క్షేత్రాల సందర్శనకు బయలు దేరారు. పూరీలో జగన్నాథుని దర్శనం తరువాత తిరుపతి, శ్రీశైలం, కన్యాకుమారి, రామేశ్వరం వెళ్లాల్సి ఉంది. ఈ లోగా ఇక్కడ ప్రమాదానికి గురయ్యారు. స్పందించిన ఆర్ఎస్ఎస్ ప్రమాదంపై ఆర్ఎస్ఎస్ మధ్య ప్రదేశ్కు చెందిన వారి ద్వారా సమాచారం తెలుసుకున్న స్థానిక ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు చింతు పాపారావు, నానాజీ గాడ్గేలు బాధితులకు సహాయం చేశారు. ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారు. అలాగే మధ్య ప్రదేశ్ సీఎంఓ కార్యాలయం నుంచి కలెక్టర్కు సమాచారం రావడంతో ఆయన జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కళ్యాణ్ బాబుకు పంపి బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. -
రెప్పపాటులో ప్రమాదం
ప్రమాదంరెప్పపాటులో నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒక్క క్షణంలో వారి బతుకులు తెల్లారిపోయాయి. చిమ్మచీకటి, గాఢ నిద్ర, నిబంధనలు పాటించని నిర్లిప్తత కలగలిపి దారిని నెత్తుటి చారగా మార్చేశాయి. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు సమీపంలో తుఫాన్ వ్యాన్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఘటనలో నలుగురు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. వీరంతా ఒకటే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. పుణ్యక్షేత్రాల సందర్శనం కోసం బయల్దేరిన వీరి ప్రయాణం సిక్కోలులోనే ముగిసిపోయింది.టెక్కలి/టెక్కలిరూరల్/నరసన్నపేట:కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని తుఫాన్ వ్యాన్ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులంతా మధ్యప్రదేశ్కు చెందిన వారు. సరిగ్గా ఆదివారం వేకువ జామున 2.30 గంటల సమయంలో సంఘటన జరగడంతో సమాచారం మేరకు రూరల్ సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్ఐ వి.సత్యనారాయణతో పాటు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మృత దేహాలను వ్యాన్ నుంచి బయటకు తీశారు. గాయపడిన వారికి సపర్యలు చేశారు. అనంతరం ట్రాఫిక్ను క్లి యర్ చేశారు. అయితే లారీ డ్రైవర్ భయంతో పరా రై తర్వాత పోలీసులకు చిక్కాడు. ఘటనలో మృతి చెందిన వారిని కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రికి తరలించగా, గాయపడిన వారిని నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడ నుంచి జిల్లా కేంద్రానికి తరలించారు. అనంతరం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన వివరాలను తెలుసుకున్నారు.బాధితులు వీరే..మధ్య ప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ దగ్గర కాండవ జిల్లా నితిన్గావ్ గ్రామం నుంచి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ఈ నెల 10న పుణ్యక్షేత్రాల సందర్శనకు తుఫాన్ వ్యాన్లో బయల్దేరారు. కాశీ దర్శనం అనంతరం పూరీ చేరుకున్నారు. అక్కడి నుంచి శనివారం సాయంత్రం బయల్దేరారు. శ్రీశైలం, తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి ప్రాంతాల సందర్శనకు వెళ్తుండగా, కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లుపాడు సమీపంలో జాతీయ రహదారిలో ఆగి ఉ న్న లారీని బలంగా ఢీ కొనడంతో భోరోసింగ్ పవర్ (60), విజయసింగ్ తోమర్ (65), ఉషిర్ సింగ్ (62), సంతోషి బాయ్ (62) అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్ సునీల్ పటేల్, సంతోషి భాయి(మృతి చెందిన భోరోసింగ్ పవర్ భార్య) సీమన్ భాయి (మృతి చెందిన ఉషిర్ సింగ్ భార్య), చీరా బాయి, సావిత్రి బాయి, శకుంతల బాయి (మృతి చెందిన విజయసింగ్ తోమర్ భార్య), తోమర్ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. మృత దేహాలను కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రికి తరలించగా, గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.ఆగి ఉన్న లారీని ఢీ కొన్న తుఫాన్ వాహనంనలుగురు మృతి, ఆరుగురికి గాయాలుకోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు సమీపంలో సంఘటనబాధితులంతా మధ్యప్రదేశ్లో ఒకే కుటుంబానికి చెందిన వారుదైవదర్శనాల్లో భాగంగా పూరీ నుంచి శ్రీశైలం వెళ్తుండగా సంఘటన -
చంద్రన్నా.. ఎవరి కోసం?
సాయం చేయడంలోనూ అశ్రద్ధ అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వమే రూ.20వేలు ఇస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశారు. తర్వాత రైతుల సంఖ్య తగ్గించేశారు. కేంద్రంతో కలిపి రూ.20వేలు ఇస్తామని మాట కూడా మార్చేశారు. దాదాపు 43 వేల మందికి ఈ పథకం ఎగ్గొట్టేశారు. ఇక ఉచిత పంటల భీమా, సున్నావడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ పథకాలను గాలికొదిలేసింది. ఇప్పుడు కూడా జిల్లాలో నరసన్నపేట నియోజకవర్గంలో తప్ప ఎక్కడా ధాన్యం కొనుగోలు చేయలేదు. 264 మిల్లర్లు ఉండగా కేవలం 30మంది మాత్రమే బ్యాంకు గ్యారంటీలు ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మొదటి ఏడాది అన్నదాత సుఖీభవలో కోత, నష్టపోయిన పంటపైనా ఆంక్షల మో త, విత్తనాల నుంచి ఎరువుల వరకు రైతన్నకు వెక్కిరింత, సున్నావడ్డీ, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ అన్నీ ఎత్తివేత, ధాన్యం కొను గోలులోనూ విపరీతమైన అశ్రద్ధ.. 18 నెలల పాలనలో చంద్రబాబు సర్కా రు సాధించిన ఘనతలివి. ప్రజల కళ్ల ముందు ఇంత విధ్వంసం జరిగినా ప్రభుత్వం మాత్రం ‘రైతన్నా...మీకోసం’ అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పనిలో చూపించలే ని చిత్తశుద్ధిని ప్రచారంలో చూపిస్తోంది. రైతన్నకు తిప్పలే.. గత ఏడాది ధాన్యం కొనుగోలులో అంతులేని అక్రమాలు జరిగాయన్నది అందరినీ తెలిసిన సత్యమే. రికార్డుల్లో లెక్కలు చూపించి ధాన్యాన్ని కళ్లాల్లోనే వదిలేశారు. చివరికి రైతులకు దళారులే దిక్కుగా మారారు. ఈ ఏడాది ఖరీఫ్లో రైతులకు విత్తనాలే దొరకలేదు. విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కిన పరిస్థితులు ఉన్నాయి. ఎరువుల కోసమైతే ఇక చెప్పనక్కర్లేదు. ఎరువుల కోసం గొడవలు జరగ్గా, చాలీచాలనీ ఎరువులను పంపిణీ చేయలేమంటూ వ్యవసాయ శాఖ ఉద్యోగులు ఏకంగా ఆందోళన చేశారు. యూరియా విషయంలోనూ అంతే. ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన యూరియాపై రాజకీయ నాయకుల పెత్తనం ఎక్కువ కావడంతో అది కూడా పక్కదారి పట్టింది. దీంతో రైతులు అధిక ధరలకు, ఒడిశా వెళ్లి కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది. పంట నష్టంపైనా ఆంక్షలు అల్పపీడనం, తుఫాన్ల ధాటికి జిల్లాలో పెద్ద ఎత్తున పంటలకు ముప్పు వాటిల్లింది. మోంథా తుఫాన్తో మరింత నష్టం జరిగింది. కానీ, ప్రభుత్వం 33శాతం కంటే తక్కువ నష్టం ఉందని చాలా నష్టాన్ని జాబితాలో నుంచి తీసేసింది. జిల్లాలో 12,500 ఎకరాలకు పైగా పంట నేలకొరగడమే కాకుండా ముంపునకు గురవ్వగా ఎన్యుమరేషన్ పూర్తి చేసేసరికి జిల్లాలో 4,205 ఎకరాల్లోని పంట మాత్రమే నష్టం వాటిల్లినట్టు యంత్రాంగం నిర్ధారించింది. హెక్టార్కు రూ. 25వేలు చొప్పున జిల్లా నష్టాన్ని లెక్కించింది. ఇక, పత్తి, మొక్కజొన్న, ఉద్యానవన పంటల నష్టాలకై తే అతీగతి లేదు. వైఎస్ జగన్ హయాంలో.. జిల్లాలో రైతుల కోసం 642 రైతుభరోసా కేంద్రాలు, ఏడు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు నిర్మించారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 87,158 మంది రైతులకు గాను రూ 85.14 కోట్లు అందజేశారు. ఎరువులు వంటివి ఇంటికే అందించారు. వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద 505 ట్రాక్టర్లు, మల్టిపుల్క్రాప్ ట్రెసర్స్, పాడిరేపర్స్, రోటావెటర్స్, 57 క్లస్టర్లలో వరి కంబైన్డ్ హార్వెస్టర్స్ వంటివి అందించారు. పాడి రైతులకు సంచార వైద్య సేవలు అందజేశారు.‘రైతన్నా.. మీకోసం’ అంటున్న చంద్రబాబు సర్కారు 18 నెలల కాలంలో అన్నదాతను ఆదుకోని వైనం చేసిందేమీ లేకున్నా ప్రచార ఆర్భాటం ఆఖరికి పంట నష్టంపైనా ఆంక్షలు ప్రభుత్వ వైఖరిపై విస్తుపోతున్న సిక్కోలు వాసులు -
ధర ఎగ్బాకుతోంది
మార్కెట్లో గుడ్డు రిటైల్ ధర రూ.7.50 నుంచి రూ.8.50 వరకు విక్రయిస్తున్నారు. కోడి గుడ్డు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. కార్తీకం ముగిసినా ఇప్పటికీ ధర మాత్రం కిందకు రావడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో కోడి గుడ్డు ధర రూ.7 పలుకుతోంది. 30 గుడ్లు ఉండే ట్రే ధర రూ.180 నుంచి ప్రస్తుతం రూ.200కు చేరింది. పాఠశాలలు, వసతి గృహాల్లో నిర్వాహకులకు మరింత భారమవుతోంది. –టెక్కలి7.00ధర (రూ.లలో) 6.756.50 -
తనిఖీల పేర్లతో వసూళ్లు
వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు మండలం రెవెన్యూ శాఖలో వసూళ్ల పర్వం కలకలం రేపుతోంది. రేషన్ సరుకుల పంపిణీ (ఎఫ్పీ) షాపు తనిఖీల సందర్భంగా రూ.1500 ఇవ్వాల్సిందేనని అధికారి డిమాండ్ చేస్తుండడంతో ఓ వీఆర్ఏ ద్వారా ఈ వసూళ్లు చేపడుతున్నారు. దీంతో డీలర్లు లబోదిబోమంటున్నారు. మొన్ననే దసరా మామూళ్లు అంటే షాపునకు రూ.200 చొప్పున ఇచ్చామని, ఇప్పుడే మో మళ్లీ తుఫాన్ సరుకుల తనిఖీతో రూ.1500 అడిగితే తాము ఎక్కడి నుంచి తేవాలని డీలర్లు వా పోతున్నారు. మోంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను రేషన్ డీలర్లకు పంపిణీ చేశారు. వీటి తనిఖీల్లో రెవెన్యూ అధికారులు వసూళ్ల పర్వానికి తెర తీశారు. ఈ తంతు మొత్తం వజ్రపుకొ త్తూరు రేషన్ డీలర్ల వాట్సాప్ గ్రూపుల్లో చర్చకు దారి తీసి బయటకు పొక్కింది. గత ఏడాది కాలంగా ఉప తహసీల్దార్, తహసీల్దార్, వీఆర్ఓల మధ్య కోల్డ్వార్ నడుస్తుండగా తాజాగా ఉప తహసీల్దార్ మురళీకృష్ణకు కొత్తూరు కు బదిలీ జరిగింది. మరోపక్క కొంత మంది రేషన్ డీలర్లే అధికారుల ప్రాపకం కోసం డీలర్ల నుంచి వసూలు చేసి అందిస్తున్నట్లు చర్చ గుప్పుమంది. మ్యుటేషన్, పట్టాదారు పాస్ పుస్తకం, పోతీ కేసు లు, రియల్ ఎస్టేట్, నాలా, డెత్, బర్త్ (ఎల్ఆర్బీడీ) లకు రూ.5వేలు నుంచి రూ.10 వేలు వరకు వసూ ళ్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పైగా పైసలు ముడితే తప్ప ఇక్కడ కార్యాలయంలో ఫైలు కదలదని నగరంపల్లి, గుళ్లపాడుకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వజ్రపు కొత్తూరు తహసీల్దార్ డీవీ సీతారామయ్యను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. సీఎస్డీటీ కె.రామారావును వివరణ కోరగా వసూళ్ల విషయం తన దృష్టికి రాలేదని, తాను కొన్ని, తహసీల్దార్ కొన్ని షాపులను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. రేషన్ డీలర్ల వాట్సాప్ గ్రూపులో జరిగిన సంభాషణ రేషన్ డిపోను తనిఖీ చేస్తున్న రెవెన్యూ అధికారులు -
ఎంపీపీగా విధులు చేపట్టిన చిరంజీవి
ఎచ్చెర్ల: ఫరీదుపేటకు చెందిన మొదలవలస చిరంజీవి ఎచ్చెర్ల ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి.. హైకోర్టు ఆదేశాలతో రద్దు కావడంతో ఈనెల 21న విడుదలైన విషయం విదితమే. ఆయన యథావిధిగా శనివారం ఉదయం మండల పరిషత్కు వచ్చి ఎంపీపీ చాంబర్లో ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్త్తలను కలుసుకుని మండలంలోని అభివృద్ధి పనులకు సంబంధించి పలు సమస్యలపై చర్చించారు. శ్రీకాకుళం: జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్గా పప్పల వేణుగోపాలరావు శనివారం బాధ్యత లు స్వీకరించా రు. మాతృ శాఖ కు బదిలీ అయిన సంపతిరావు శశిభూషణ్ నుంచి అయన శనివారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులను పరిచ యం చేసుకుని ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను ఆయన ఛాంబర్లో వేణుగోపాలరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : ఆంధ్రా–ఒడిశా బోర్డర్లో మావోల కదలికలపై పూర్తి పోలీసు నిఘా పెట్టామని, జిల్లాలో అయితే నక్సల్స్ ప్రభావం ప్రస్తుతానికి లేదని ఎస్పీ మహేశ్వరరెడ్డి అన్నా రు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులతో ఎస్పీ మాట్లాడుతూ.. నక్సలిజం ఐడియాలజీతో ఉన్నవారిపై, కొత్తగా ప్రవేశించేవారిపై ఇప్పటికే నిఘా పెట్టామన్నారు. మావోలే లక్ష్యంగా ఉన్న రాజకీయ, ఇతర వీఐపీలకు ఇప్పటికే అవగాహన కల్పించామన్నా రు. నేషనల్ హైవేలో ప్రమాదాలు జరుగుతు న్నాయని, టోల్గేట్లు, అండర్పాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిల వద్ద అధికంగా ట్రాఫిక్ అంతరాయం, షాపులు వెలుస్తుండటాన్ని విలేకరులు ప్రస్తావించగా.. నేషనల్ హైవే, ఆర్అండ్బీ, మున్సి పాలిటీ వాళ్లతో మాట్లాడామని నిబంధనలు అనుసరించి చర్యలుంటాయన్నారు. జిల్లాలో ఇప్పటికి 87 బ్లాక్స్పాట్లు గుర్తించగా హైవేలో 52 ఉన్నాయన్నారు. ఎక్కువగా ఉదయం 3 నుంచి 7 గంటల్లోపు, సాయంత్రం 3 గంటల నుంచి 6 లోపు ప్రమాదాలవుతున్నాయని, వీటిలో ద్విచక్రవాహనాల ప్రమాదాలే అధికమన్నారు. గార ఎస్బీఐ బ్యాంకులో తనఖా బంగా రం మాయం కేసుకు సంబంధించి విచారణ దాదాపు పూర్తికావస్తుందని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: అస్మిత అథ్లెటిక్స్ మీట్ బాలికల పోటీలు వాయిదా పడ్డాయి. శ్రీకాకు ళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఈ నెల 23న జరగాల్సిన పోటీలను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసినట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి తెలిపారు. అథ్లెటిక్స్లో అండర్–14, అండర్–16 విభాగాల్లో ప్రతిభ కలిగిన బాలిక లను గుర్తించేందుకు ఈ పోటీలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. పోటీల వాయిదా విషయాన్ని క్రీడాకారిణిలు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్లు, అథ్లెట్స్ తల్లిదండ్రులు గుర్తించాలని కోరారు. -
ఏంబ్యాగున్నాయని..
మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు ఇచ్చిన కిట్లో బ్యాగులు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయి. విద్యా సంవత్సరం మధ్యలోనే బ్యాగులు చిరిగిపోతున్నాయి. కొంత మంది పేద విద్యార్థులు అవే బ్యాగుల్ని కుట్టుకుంటూ బడికి వెళ్తున్నారు. బ్యాగులు చూసి తోటి విద్యార్థుల హేళనకు గురవుతున్నారు. – బోర పుష్ప, ఎంపీపీ, ఇచ్ఛాపురం ఇచ్ఛాపురం రూరల్: కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు విద్యా సంవత్సరం మధ్యలోనే చిరిగిపోతున్నాయి. బ్యాగుల్లో పుస్తకాలు పెట్టుకోవాలంటే ఎక్కడ జారి పడిపోతాయోనని భయపడాల్సి వస్తోందని విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో పాఠశాలలు పునః ప్రారంభం కాగా, జూలైలో విద్యార్థులకు ఎనిమిది వస్తువులతో కూడిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లు పేరుతో బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, బెల్టులు, బూట్లు, రెండు జతల సాక్షులు, యూనిఫాం క్లాత్, డిక్షనరీతో పాటు సంచులు ఇచ్చారు. ఇందులో బూట్లు అందరికీ సరిపడకపోవడంతో ఇచ్చిన బూట్లు ఇంటి వద్దనే విడిచి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన బూట్లు బడికి వేసుకువస్తున్నారు. జిల్లాలో ఉన్న 2,632 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ఒక లక్షా 59వేల 648 మంది విద్యార్థులకు బ్యాగులు ఇచ్చారు. ఇచ్చి న బ్యాగులు పైన పటారం...లోన లొటారం మాదిరిగా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇచ్చిన బ్యాగులు నాసిరకంగా ఉండటంతో జిప్లు ఊడిపోవడంతో పాటు పైనా, కిందా, తగిలించుకునే కుచ్చుల వద్ద చిరిగిపోతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు పుస్తకాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వారి బ్యాగులు మూడునాళ్ల ముచ్చటగానే మిగి లిపోతున్నాయి. చిరిగిపోయిన బ్యాగుల్ని సూది దారంతో కుట్టుకుంటూ బడికి వస్తుంటే తోటి విద్యార్థులు హేళన చేస్తున్నారని కొంత మంది విద్యార్థులు వాపోతున్నారు. దీంతో కొత్త బ్యాగులు కొనక తప్పడం లేదు. బ్యాగులు చిరిగిపోవడంతో మార్కెట్లో కొనుక్కున్న బ్యాగులతో విద్యార్థులు -
శత వత్సరం.. సేవా సమాహారం
● సత్యసాయి శతవర్ష జయంతి ఉత్సవాలకు సిద్ధం ● పలు చోట్ల సేవా కార్యక్రమాలు బాబా మార్గాన్ని భక్తులు అనుసరిస్తున్నారు. సర్వమానవాళి శ్రేయస్సు కోసం సత్యసాయి చెప్పిన సూక్తులను గుండెల్లో పెట్టుకుని శత వర్ష సంబరాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. సేవే దైవంగా భావించి సత్యసాయి వందో జయంతి నాడు జిల్లావ్యాప్తంగా ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నేడు సత్యసాయి జయంతి సందర్భంగా పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శనివారం కూడా కొన్ని సేవా కార్యక్రమాలు జరిగాయి. – శ్రీకాకుళం కల్చరల్ శ్రీకాకుళం న్యూకాలనీ సత్యసాయి సమితి ఆధ్వర్యంలో 100 కిలోల కేక్ను కటింగ్.. పెద్దమందిరంలో కేక్ కట్చేసేందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, కలెక్ట ర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరవుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు తెలిపా రు. నారాయణ సేవలో భాగంగా 60మందికి క్యా రేజీల పంపిణీ, మహాప్రసాద వితరణ, సినీ గా యని అయాన్ ప్రణతి చే ‘భక్తి సంగీత విభావరి, ఝాలా ఉత్సవంతో ముగుస్తుందని తెలిపారు. న్యూకాలనీలోనూ నారాయణ సేవ కింద 120 మందికి క్యారేజీలు పంపిణీ చేస్తున్నారు. పీఎన్కాలని సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో కూడా ప్రభాత నగర సంకీర్తన, మహా ప్రసాద వితరణ, బుడుమూరు లక్ష్మీప్రసాదరావు దంపతుల సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తారు. ప్రముఖ వైద్యులు అన్నెపు శశిధర్ ఆధ్వర్యంలో జరిగే వైద్యశిబిరానికి ముఖ్య అతి థిగా డాక్టర్ సీపాన గోపి హాజరు కానున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని సత్యం శివం సుందరం మందిరంలోనూ మహాప్రసాద వితరణ, భక్తి సంగీత విభావరి ఊయల ఉత్సవం, బాలవికాస్ పిల్లలతో కేక్ కటింగ్ జరుగుతాయి. జెడ్పీ ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ లోని సాయి మందిరంలో మహానగర సంకీర్తన, కేక్ కటింగ్, సత్యసాయి లక్షార్చన, మహా ప్రసా ద వితరణ, సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శన, ఊయల ఉత్సవం జరుగుతాయి. కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న సాయి గణేష్ మందిరంలో జ్ఞాన యజ్ఞం, మహానారాయణ సేవ, ఆధ్యాత్మిక ప్రసంగం, కేక్ సమర్పణ, ఝాలా ఉత్సవం జరుగుతాయి. -
అక్కడి అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి
శ్రీకాకుళం కల్చరల్: వివాహాల విషయంలో దేశాల హద్దులు కూడా చెరిగిపోతున్నాయి. శ్రీకాకుళానికి చెందిన శ్రీరంగనాథ్ సాహిత్, బెల్జియంకు చెందిన కెమిలీ శనివారం బలగ రోడ్డులోగల శాంతి కన్వెన్షన్ హాల్లో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. సాహిత్ శ్రీకాకుళంలో పుట్టి ఇక్కడే చదువుకొని కంప్యూటర్ ఇంజినీర్గా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. తాను పనిచేస్తున్న కంపెనీ ద్వారా లండన్ దేశానికి వెళ్లగా అక్కడ బెల్జియంకు చెందిన కెమిలీ పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకువచ్చింది. ఇరు కుటుంబాల వారు పెళ్లికి సమ్మతించడంతో ఈ అరుదైన పెళ్లికి శ్రీకాకుళం వేదికగా నిలిచింది. వరుడి తల్లి తిరునగరి పద్మావతి హిందీ టీచర్గా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్నారు. నగరంలోని హయాతినగరంలోని సాయిభవానీ నగర్కాలని మొదటి లైన్లో నివాసం ఉంటున్నారు. -
33 ఏళ్లు.. 218 చోరీలు
● రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ దొంగ దున్న కృష్ణ అరెస్ట్ ● 60 కేసుల్లో శిక్ష పడగా.. ఏడుసార్లు జైలుకు...శ్రీకాకుళం క్రైమ్ : ముప్పై మూడేళ్లుగా దొంగతనాలే వృత్తిగా గడుపుతున్న మోస్ట్ వాంటెడ్ దొంగ దున్న కృష్ణ ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. ఇప్పటికే అతడికి 60 కేసుల్లో శిక్ష పడింది. ఏడుసార్లు జైలుకు వెళ్లాడు. అయినా మారకుండా మళ్లీ మళ్లీ దొంగతనాలే చే స్తుండడం గమనార్హం. మెళియాపుట్టి మండలం చాపరకు చెందిన కృష్ణ ఏకంగా 218 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. శ్రీకాకుళం రూరల్, సీసీఎస్ పోలీసులకు పట్టుబడటంతో శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వివరాలు వెల్లడించారు. కృష్ణ వద్ద చోరీ సొత్తును కొనుగోలు చేసిన నగరంలోని గూనపాలేనికి చెందిన సయ్యిద్ రఫీ (39)ని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. చోరీ సొత్తును పశ్చిమబెంగాల్ సోనాసూర్కు చెందిన అనంత్సన్ఫుల్, తరుణ్మోండల్ ఇచ్చినట్లు కృష్ణ, రఫీలు విచారణలో తెలియజేయడంతో, వారిని అరెస్టు చేసి మిగిలిన సొత్తును రికవరీ చేయాల్సి ఉందన్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణ విశాఖలోని కంచరపాలెంలో చదువుకున్నాడు. వెల్డర్గా పనిచేస్తూ 1993లో సైకిల్ దొంగతనంతో ప్రస్థానం మొదలుపెట్టాడు. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకోవడం, పగలంతా రెక్కీ చేయడం, రాత్రి చోరీకి పాల్పడడం అతడి ప్రత్యేకత. చోరీ సొ త్తుతో జల్సాలు చేయడం అలవాటు చేసుకున్న కృష్ణ తన కుటుంబం మొత్తాన్ని కోల్కతాకు మార్చేశా డు. అక్కడ ఖరీదైన భవంతి నిర్మించాడు. 2015 అక్టోబర్ 29న విజయవాడ సీసీఎస్ పోలీసులు కృష్ణను అరెస్టు చేసి 2.5 కిలోల బంగారం, 15 కిలోల వెండి స్వాధీనం చేసుకోగా, 2018లో విశాఖ పోలీ సులకు కృష్ణ పట్టుబడగా 1135గ్రాములబంగారం, 5.175 కిలోల వెండి, రూ.1.88 లక్షలు దొరికాయి. 2023లో విజయనగరంలో చోరీ కేసుల్లో జైలుకెళ్లిన దున్న కృష్ణను మన జిల్లాలో కేసులుండటంతో శ్రీకాకుళం రూరల్ పోలీసులు అక్కడకు వెళ్లి పీటీ వారెంట్పై అంపోలు జిల్లా జైలుకు తీసుకొచ్చారు. 2024 జనవరిలో బెయిల్ పొంది విడుదలవ్వడం, అనకాపల్లి పోలీసులు కాపుకాయడాన్ని పసిగట్టిన కృష్ణ గోడపైనుంచి దూకేయడం, కాళ్లు విరగడం, ఐదునెలలు విశ్రాంతి అనంతరం సెప్టెంబరు నుంచి మళ్లీ నేరబాట పట్టాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సెల్ఫోన్, ఆధార్, ఇతర ఐడెంటిటీ కార్డులు కృష్ణ వాడడు. తనకు దగ్గరగా ఉండే అందరినీ తన నేరంలో భాగ స్తులను చేస్తాడు. ప్రస్తుతం 18 కేసుల్లో జిల్లాలోని పలువురు నగల వ్యాపారుల వద్ద చోరీ సొత్తును అ మ్మాడని, వారిపైనా చర్యలు త్వరలో తీసుకుంటా మని ఎస్పీ చెప్పారు. శ్రీకాకుళం రూరల్లో 14, రెండో పట్టణ పీఎస్లో 3, ఒకటో పట్టణ పీఎస్లో ఒక చోరీ చేశాడు. సెప్టెంబరు 10న ఎస్బీఐ స్టాఫ్ కాలనీలో వెండి పోవడంతో 13న రాజుల భవాని ఫిర్యాదు చేశారు. విశాఖ కంచరపాలెంలో డీసీ షీట్ కూడా ఉంది. మన జిల్లాలో 18 కేసుల్లో 476 గ్రాముల బంగారం పోయినట్లు ఫిర్యాదుదారులు పేర్కొనగా వాస్తవంగా 362 గ్రాములే పోయిందని, 237 గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అన్నారు. ఓ ఫిర్యాదుదారు 85 గ్రాముల బంగారం పోయిందని ఫిర్యాదు చేశారని, కానీ బిల్లులు లేకపోవడం, నింది తున్ని పట్టుకున్నాక ఆయా దుకాణాల్లో వెరిఫై చేశాక తప్పని తేలిందని ఎస్పీ చెప్పడం గమనార్హం. తప్పుడు ఫిర్యాదుదారులపై న్యాయపరంగా చర్య లు తీసుకుంటామని ఎస్పీ చెప్పడం కొసమెరుపు. వాస్తవానికి బహుమతులు, పాతకాలం బంగారాని కి బిల్లులు ఉండవు. అడిషనల్ ఎస్పీ (క్రైమ్) పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో డీఎస్పీ వివేకానంద, సీసీఎస్ సీఐ ఎస్.సూర్యచంద్రమౌళి, రూరల్ సీఐ పైడపునాయుడులు కేసు ను చాకచక్యంగా ఛేదించారని ఎస్పీ ప్రశంసించారు. ఎస్ఐలు రాము, రాజేష్, బలివాడ గణేష్, మధుసూదనరావు, హెచ్సీ శ్యామ్, కానిస్టేబుళ్లు విజయ్, భాస్కర్, మాధవ్, శ్రీను, హరీష్, ఆలీలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
ఫోన్పేలో ట్రాఫిక్ చలానాల చెల్లింపు
శ్రీకాకుళం క్రైమ్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘిస్తే జరిమానాలు ఇన్నాళ్లూ ఈ–చలానాలు, పోలీసుల యాప్ల ద్వారా కట్టాల్సి వచ్చేది. ఇకపై మన మొబైల్ నుంచే ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా కట్టుకోవచ్చని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలో వాహనదారులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. పోలీసులు విధించిన ఈ–ఛలానాలు వాహనదారులు చెల్లించకపోవడం, అధిక సంఖ్య లో పెండింగ్లోనే ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ స్మార్ట్ఫోన్లో ఫోన్ పే, గూగుల్ పే ఓపెన్ అయ్యాక ఆంధ్రప్రదేశ్ ఈ ఛలాన్ ఆఫర్ కనిపిస్తుందని, క్లిక్ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ అని వస్తుందన్నారు. అక్కడ నేరుగా చెల్లించవచ్చన్నారు. -
కేసుల దర్యాప్తు ముమ్మరం చేయాలి
శ్రీకాకుళం క్రైమ్ : అపరిష్కృతంగా ఉన్న కేసుల దర్యాప్తు ముమ్మరం చేసి ముద్దాయిలను అరెస్టు చేయాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేరసమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. కొత్త చట్టాల అమలు, చార్జిషీట్ దాఖలు, నాన్బెయిల్బుల్ వారెంట్లు, బెయిల్ కౌంటరు దాఖలు, లోక్ అదాల త్ కేసులపై ఆరా తీశారు. కేసుల దర్యాప్తులో వైద్యు లు, ఫోరెన్సిక్ నిపుణులు, నివేదికలు తెప్పించుకోవాలని, ప్రాపర్టీ నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్థులు, జైలు నుంచి విడుదలైన నేరస్థులు, అంతర్రాష్ట్ర గ్యాంగులు, వ్యక్తులపై నిఘా పెంచాలన్నారు. నేర ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక గస్తీ, పెట్రోలింగ్ పెంచాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించాలన్నారు. సైబర్ కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న నగదును చట్టాన్ని అనుసరించి అందేలా చూడాలని, సరిహద్దు చెక్పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, మద్యం, నాటుసారా, గంజాయి అక్రమ రవాణాలను అడ్డుకోవాలన్నారు. అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి
వజ్రపుకొత్తూరు రూరల్: మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే శాంతి చర్చలను జరపాలని, అలాగే బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని సీపీఐ(ఎంఎల్)న్యూడెమొక్రసీ జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. మండలంలో గల మర్రిపాడులో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద శనివారం అమరవీరుల స్మారక సభ కార్యక్రమం నిర్వహించారు. న్యూడెమొక్రసీ జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆపరేషన్ కగార్ పేరుతో జనవరి నుంచి కేవలం 11 నెలల కాలంలోనే 800 మందిని ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారని విమర్శించారు. బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యూ డెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, పౌర హక్కుల సంఘ జిల్లా అధ్యక్షుడు పత్రి దానేష్, అమరవీరుల బంధు మిత్రుల కమిటీ నాయకులు జోగి కోదండరావు, ప్రజా కళా మండలి నాయకులు కొర్రాయి నీలకంఠం, లిబరేషన్ నాయకులు వంకల అప్పయ్య, ప్రజా సంఘ నాయకులు గొరకల బాలకృష్ణ, వీరస్వామి, పి.కుసుమ, బి.ఈశ్వరమ్మ, కృష్ణవేణి, సొర్ర రామారావు తదితరులు ఉన్నారు. -
‘ఉద్దానంలో విధ్వంసం సహించబోము’
వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్ పోర్టు పేరుతో విధ్వంసం సృష్టిస్తే సహించేది లేదని కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు స్పష్టం చేశారు. కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం పాలకులు చేసిన ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని, బలవంతపు భూ సే కరణ ఆపాలని కోరుతూ ఒంకులూరులో శనివారం నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతాన్ని ఏళ్ల తరబడి కీడ్నీ భూతం పట్టి పీడిస్తుంటే, ఇది చాలదన్నంటూ నేడు పాలకులు కార్గో భూతానికి ఉద్దాన ప్రజలను బలి చేసేందుకు ప్రతిపాదన లు తీసుకువచ్చారని మండిపడ్డారు. తమ జీవితాల ను నాశనం చేసే కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతికేరంగా 26వ తేదీ వరకు కార్గో బాధిత గ్రామాల్లో నిరస న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్య క్రమంలో నాయకులు రామస్వామీ, రామారావు, సురేఖ, రైతులు ఉన్నారు. -
జాతీయ చెస్ పోటీలకు డొంకూరు విద్యార్థులు
ఇచ్చాపురం రూరల్: ఇటీవల విశాఖపట్నం వేదికగా బాల బాలికలకు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో డొంకూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపికయ్యారు. అండర్–14 బాలురు విభాగంలో డి. చర ణ్, అండర్–15 విభాగంలో డి.గోకుల్, డి.పృథ్వీ ఎంపికకావడంతో శనివారం ప్రధానోపాధ్యాయురాలు జి.హేమాకుమారి అభినందించారు. ఈ నెల 23 నుంచి 24 విజయవాడ వేదికగా జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో వీరు ప్రాతినిధ్యం వహిస్తా రు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు వజీర్ అహ్మద్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కె.జానకిరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. కవిటి : కవిటి సినిమా హాల్ రోడ్డులోని శ్రీవేంకటేశ్వర డిపార్ట్మెంటల్ స్టోర్స్లో శుక్రవారం చోరీ జరిగింది. ల్యాప్ట్యాప్, సుమారు రూ.50,000 నగదు అపహరణకు గురైందని యజమాని వెంకటరావు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ వి.రవివర్మ పరిశీలించారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ డౌన్లైన్లో తాండ్రాసి మెట్ట సమీపంలో శనివారం రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని ప్రయాణికుడు మృతిచెందినట్లు ఆమదాలవలస జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. మృతుడి వయసు సుమా రు 40 ఏళ్లు ఉంటుందని, నలుపు దుస్తులు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే 9493474582 నంబుకు తెలియజేయా లని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి శవపంచనామాకు తరలించినట్లు తెలిపారు. టెక్కలి రూరల్: పెద్దసాన గ్రామంలో పి.తమ్మయ్యకు చెందిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలి యని వ్యక్తులు శుక్రవారం రాత్రి కాల్చేశారు. రాత్రి ఇంటి ముందు రోడ్డుపై బైక్ ఉంచగా ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు గుర్తించి ఆర్పివేశారు. అప్పటికే వాహనం పూ ర్తిగా కాలిపోయింది. గుర్తుతెలియని వ్యక్తులు తన బైక్ను కాల్చి ఉంటారని బాధితుడు శని వారం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మందస: బాలిగాం బ్రిడ్జి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఇచ్ఛాపురం మండలం శాసనం గ్రామానికి చెందిన బి.ధర్మారావు(45) బైక్పై వెళ్తుండగా పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు గుడ్లు లోడుతో వెళ్తున్న లారీ బాలిగాం బ్రిడ్జి వద్ద ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ధర్మారావును హైవే అంబులెన్స్లో హరిపురం సీహెచ్సీకి తరలించారు పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలాస: ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా పలా స ఆర్.పి.ఎఫ్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వారి నుంచి వద్ద నుంచి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు జీఆర్పీ ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. రోజు వారీ తనిఖీల్లో భాగంగా పలాస రైల్వే స్టేషన్లో తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీశామని, బ్యాగులు పరిశీలించగా ఒకరి వద్ద 8 కిలోలు, మరొకరి వద్ద 6 కిలోల గంజాయి పట్టుబడిందని చెప్పారు. గిరిధర్జానీ, మరొక రవినాహిక్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. బరంపురం నుంచి ముంబైకు గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించామని ఎస్ఐ తెలిపారు. -
లేబర్కోడ్లు తక్షణమే రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కార్మికవర్గాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఐక్యపోరాటాలు తీవ్రతరం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏఐటీయూసీ నాయకులు చిక్కాల గోవిందరావు, ఇఫ్టూ నాయకులు మామిడి క్రాంతి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ను నోటిఫై చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం శ్రీకాకు ళం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ కార్మికవర్గం ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం బానిసలు గా మార్చేలా లేబర్ కోడ్స్ను తీసుకురావడం దుర్మార్గమైన చర్యగా మండిపడ్డారు. కార్మిక సంఘా న్ని ఏర్పాటు చేసుకోవడానికి కనీస సభ్యుల సంఖ్య ను అమాంతం పెంచివేయడం, నిరసనలు ధర్నా లు నిర్వహించడానికి అనుమతులను తప్పనిసరి చేయడం, కంపెనీ, సంస్థ కార్యాలయానికి కనీసం రెండు కిలోమీటర్ల దూరంలోనే నిరసనలు చేపట్టాల ని షరతులు విధించడం దారుణమన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు సీహెచ్ అమ్మన్నాయుడు, డి.గణేష్, టి.తిరుపతిరా వు, ఆర్.ప్రకాశరావు, సంఘాల నాయకులు ఎం.గోవర్దనరావు, డి.వాసుదేవరావు, జీరు రాము, వై.శ్రీనివాసరావు, ఎన్.బలరాం, ఎల్.రామప్పడు, డి. యుగంధర్, ఎన్.నాగేశ్వరరావు, ఎం.ఆదినారాయణమూర్తి, ఎన్.పార్థసారథి, కె.రవి, బి.సంతోషి, రాజేశ్వరి, పి.మల్లమ్మ, పి.జగ్గారావు పాల్గొన్నారు. -
గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఇచ్ఛాపురం సీఐ మీసాల చిన్నం నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. రైల్వేస్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రా ష్ట్రం గంజాం జిల్లా ఆర్.సువాని గ్రామానికి చెందిన బాబూజీ సుబుద్ధి, మిథెన్ బెహరాలు అనుమానా స్పదంగా కనిపించారు. తనిఖీ చేయగా ఏడు కేజీల గంజాయి గుర్తించా రు. గంజాయి, ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేశారు. గుంతకల్లో గంజాయి వ్యాపారం చేస్తున్న కర్ణాటక కు చెందిన వ్యక్తి తిప్పేస్వామికి గంజాయి అందజేయడానికి వీరు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై ఎం.ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
హైవేపై కారు దగ్ధం
రణస్థలం: పైడిభీమవరం సమీపంలో శుక్రవారం జాతీయ రహదారిపై శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కారులో ఒక్కసారిగా మంట లు చెలరేగాయి. అప్రమత్తమైన కారు యజమాని జి.గౌరినాయుడు వెంటనే బయటకు వచ్చేశారు. ఇంజన్ ఓవర్ హీట్ కావడంతో కారు ముందు భా గంలో మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. స్థానికులు రణస్థలం అగ్నిమాపక అధికారి డి.హేమసుందర్కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఒక్కరే ఉన్నారు. ముందు భాగం పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.3 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. బూర్జ : పెద్దపేట పంచాయతీ మదనాపురం గ్రామానికి చెందిన రైతు నెక్కింటి నాగేశ్వరరావు చెరుకు తోట కాలిపోయింది. బొమ్మిక గ్రామ రోడ్డులో ఉన్న ఐదు ఎకరాల తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాలకొండ అగ్ని మాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. అప్పటికే ఎకరా పంట కాలిపోయింది. పక్కన ఉన్న పొలంలో చెత్తకు అగ్గి పెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు రూ.లక్షా యాభై వేలు నష్టంవాటిల్లినట్లు అంచనా వేశామని పాలకొండ అగ్నిమాపక కేంద్రం ఎస్సై సర్వేశ్వరరావు తెలిపారు. -
రైతుల లెక్కల్లో తేడాలెందుకు..?
గార: చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో 42 వేల మంది రైతులకు అన్నదాత సుఖీభవ అందించకుండా కొర్రీలు వేసిందని, ఈ విషయం జిల్లాలోనే ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు తెలియకపోవడం బాధాకరమని, ఆ లెక్కల్లో ఎందుకు తేడా వచ్చిందో ప్రజలకు తెలియజేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, గార ఎంపీపీ గొండు రఘురాం కోరా రు. ఆయన శుక్రవారం శ్రీకూర్మం జంక్షన్లో విలేకరులతో మాట్లాడారు. ఏడాదికి రూ.20వేలు ఇస్తామ ని హామీ ఇచ్చిన చంద్రబాబు ఒక ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశారని గుర్తు చేశారు. జిల్లాలో 3. 21 లక్షల మంది రైతులుండగా, 2.79 లక్షల మందికే అన్నదాత సుఖీభవ ఇచ్చి మిగతా వారిని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. రైతు భరోసా అనే పేరు మార్చడంపై ఉన్న శ్రద్ధ పథకం అమలులో లోపించిందన్నారు. ఎరువుల కొరత, యాంత్రీకరణ లేకపోవడం, విత్తనాలు అందించలేకపోవడం, రైతు భరోసాలు నిర్వీర్యం చేయడం వంటివి చూస్తుంటే రైతు ఎలా బతుకుతాడనే దిగులు కలుగుతోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే రైతులను ఆదుకున్నారని స్పష్టం చేశారు. సమావేశంలో శ్రీకాకుళం నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు పీస శ్రీహరిరావు, మండల పార్టీ అధ్యక్షుడు పీస గోపి, గార మండల రైతు విభాగం అధ్యక్షుడు శిమ్మ ధర్మరాజు, కొయ్యాన నాగభూషణం, టి.అప్పలరాజు, కాశిన మల్లేసు పాల్గొన్నారు. -
వలస కూలీ అదృశ్యం
కంచిలి: కొత్తంపురం గ్రామానికి చెందిన వలస కూలీ మల్లార్పు సోమయ్య(60) అదృశ్యమయ్యాడు. రెండు నెలల క్రితం బోర్లు వేసే ఫైలింగ్ ఆపరేటర్గా పనిచేసేందుకు సోమయ్య కేరళ వెళ్లాడు. పను లు పూర్తి కావడంతో అక్కడి నుంచి ఈ 15న రైలులో స్వగ్రామానికి బయలుదేరాడు. విజయవాడకు ఆదివారం సాయంత్రం 7 గంటల కు చేరాడు. అప్పటి వరకు భార్య గంగమ్మతో ఫోన్ కాంటాక్ట్లో ఉన్నాడు. సోమవారం ఉద యం 10 గంటలకు సోంపేటలో రైలు దిగాల్సి ఉంది. కానీ రాలేదు. వెంటనే ఫోన్ చేయగా.. స్విచ్ ఆఫ్ వచ్చింది. రైల్వేస్టేషన్లో అదృశ్యమయ్యాడా లేక మరేదైనా సమస్యలో చిక్కుకు న్నాడో తెలియక ఆందోళన చెందుతున్నారు. స్థానిక పోలీసుల్ని ఆశ్రయించగా.. విజయవాడ లో అదృశ్యమయ్యాడు కనుక అక్కడే ఫిర్యాదు చేయాలని చెప్పినట్లు బాధితుని భార్య శుక్రవా రం విలేకరుల ఎదుట వాపోయింది. కవిటి: మాణిక్యపురంలో విద్యుత్ శాఖకు చెంది న రెండు ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. అర్ధరాత్రి వేళ విద్యుత్ లైన్ బ్రేక్ చేసి ట్రాన్స్ఫార్మర్లను నేలకూల్చి అందులో ఉన్న ఖరీదైన కాయిల్స్ను దుండగులు పట్టుకుపోవడం గమనార్హం. కాగా, విద్యుత్శాఖ తరఫున పోలీసుల కు ఎటవంటి ఫిర్యాదు అందలేదు. శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షలకు హాజరుకాబోయే వయసు చాలని విద్యార్థులకు కండోనేషన్ ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు శుక్రవారం తెలిపారు. విద్యార్థి వయసు 2025 ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు నిండకపోతే ప్రధానోపాధ్యాయులు వెబ్సైట్లో తమ స్కూల్ లాగిన్లోకి వెళ్లి వివరాలు నమోదు చేసి ఈ నెల 30లోగా ఫీజు చెల్లించాలన్నారు. -
2.45 గంటలు నిలిచిపోయిన విశాఖ ఎక్స్ప్రెస్
పొందూరు: పొందూరు రైల్వేస్టేషన్లో శుక్రవారం మధ్యాహ్నం విశాఖ ఎక్స్ప్రెస్ రైలు సుమారు 2.45 గంటల సమయం నిలిచిపోయింది. బోగీల్లో, ఇంజిన్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.45 వరకు ఆగిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. వివేక్ ఎక్స్ ప్రెస్ రైలు, ఈఎంయు రైలు, బెంగుళూరు స్పెషల్ రైలు పొందూరులో ఎక్కువ సమయం నిలపాల్సి వచ్చింది. ఎవరూ చైన్ లాగలేదని నిర్ధారించుకున్నాక, విజయనగరం నుంచి రైల్వే ఇంజినీరింగ్ సిబ్బంది వచ్చి సమస్యను గుర్తించి సరిచేయడంతో 4.45 గంటలు తర్వాత ట్రైన్ బయలు దేరింది. కంచిలి: మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో తిష్టవేసిన అసౌకర్యాలను ఏపీఈడబ్ల్యూఐడిసి డైరెక్టర్ పీఎంజే బాబు, శ్రీకాకుళం జిల్లా గురుకులా ల సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మి శుక్రవారం పరిశీలించారు. శాశ్వత ప్రాతిపదికన వసతి నిర్మా ణం కోసం కంచిలి గురుకుల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకొన్నారు. దీంతోపాటు అర్ధంతరంగా ఆగిపోయిన అదనపు తరగతి గదులు నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. పిల్లల భోజనాలు పర్యవేక్షించి, పిల్లలతో కలిసి భోజనాలు చేశారు. వీరితోపాటు ఏపిఇడబ్ల్యూఐడిసి ఏఈ పి.సునీల్ కూడా పాల్గొన్నారు. -
విత్తనాలు, ఎరువులు మాదిరిగా చేస్తే సహించం
ధాన్యం కొనుగోలు విష యంలో రైతులకు అన్యా యం జరిగితే పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. విత్తనా లు, ఎరువులు కోసం రైతులను ఇబ్బందులకు గురిచేసిన విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడైనా లోపాలు జరిగితే రైతుల తరఫున ఉద్యమిస్తాం. ఇప్పటికే రైతులను ఆదుకోలేని మంత్రిగా అచ్చెన్నాయు డు అప్రతిష్ట మూటకట్టుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, టెక్కలి -
ప్రాధాన్యం లేక
టెక్కలి: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం రైతుల పుట్టి ముంచుతోంది. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలోనే ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. మోంథా తుఫాన్ ప్రభావంతో కొంత మేరకు నష్టం వాటిల్లగా మిగిలిన పంటను యంత్రాల ద్వారా కోత కోసి విక్రయించేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. వారి వద్ద ధాన్యం నిల్వలు ఉన్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, ఏ విధంగా అమ్మకాలు చేయాలి అనే విషయాన్ని రైతులకు అవగాహన కల్పించకపోవడం, మళ్లీ తుఫాన్ హెచ్చరికలు ఉండడంతో అన్నదాతలకు దళారులే దిక్కుగా మారుతున్నారు. కొత్తగా వాట్సాప్ సేవలతో ధాన్యం కొనుగోలు చేస్తామని అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో రైతులకు ఆ సేవలపై కనీస అవగాహన కల్పించడం లేదు. కంచిలి: మండలంలో పలు గ్రామాల్లో ఖరీఫ్ వరి కోతలు పూర్తయ్యాయి. మరికొన్ని గ్రామాల్లో కుప్పలూడ్చి, ఇళ్ల వద్దకు చేర్చి, ఆరబెట్టడం కూడా పూర్తయ్యింది. ఇంతలో తుఫాను వస్తుందనే వార్తలు రా వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో బొగాబెణి, కుమ్మరిపేట, దాలేశ్వరం తదితర గ్రామాల్లో వరి కోతలు పూర్తవ్వగా, గొల్లకంచిలి గ్రామంలో కొంత భాగం కోతలు పూర్తయ్యాయి. ఈ దశలో వాతావరణ పరిస్థితులు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయని వాపోతున్నారు. తాము ఇళ్ల వద్దకు చేర్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బొగాబెణి సర్పంచ్ గణప సింహాచలం, చైతులు కుణితి తిరుపతిరావు, తెలుకుల రాజేంద్ర, కుమ్మరి గురునాథ్, తెలుకల దండాసి కోరుతున్నా రు. అధికార యంత్రాంగం వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే నష్టపోయే ప్రమాదం స్పష్టంగా కన్పిస్తోంది. టెక్కలి మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ధాన్యం కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ధాన్యం నిల్వలు ఉన్న రైతులు నేరుగా రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి. – ఎం.కృష్ణమూర్తి, ఆర్డీఓ, టెక్కలి -
‘అంగన్వాడీల విలీనం ఆపాలి’
హిరమండలం: అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం ఆపాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. హిరమండలంలో యూనియన్ సమావేశం నిర్వహించారు. విలీనం పేరుతో అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ ని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమి క విద్యార్థులు తగ్గిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కేంద్రాలను బలోపేతం చేయాల్సి న ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీస్కూ ల్ బలోపేతం చేయాలంటే 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలను కేంద్రాల్లో నమోదయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీస్కూల్ పిల్లలకు తల్లికి వంద నం అమలుచేయాలన్నారు. డిసెంబరు 31 నుంచి జనవరి 4 వరకూ విశాఖలో నిర్వహిస్తున్న సీఐటీ యూ అఖిలభారత మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అద్యక్షుడు సిర్ల ప్రసాద్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష కార్యర్శులు కె.కళ్యాణి, డి.సుదర్శనం, కొత్తూరు ప్రాజెక్టు యూనియన్ నాయకులు కె.లక్ష్మి, కేవీ హేమలత, ఎస్.లక్ష్మి, సరోజినీ తదితరులు పాల్గొన్నారు. -
ఎరుపెక్కిన ఉద్దానం
● మెట్టూరు జోగారావుకు కడసారి వీడ్కోలు ● రెండు రోజుల నిరీక్షణ తర్వాత స్వగ్రామానికి చేరిన పార్థివ దేహం ● విప్లవ వీరుడి చివరి చూపుకోసం భారీగా వచ్చిన ఉద్దానం ప్రజలు ● పోలీసు నిఘా మధ్య అంత్యక్రియలు జోగారావు కనిపించాడు. నినాదాలు చేయకుండా, పిడికిలి బిగించకుండా, తుపాకీ చేతపట్టకుండా ఉద్దానానికి ముప్పై ఏడేళ్ల తర్వాత మళ్లీ కనిపించాడు. ఆఖరి చూపు కోసం బాతుపురం తరలివచ్చిన వారికి చివరి సారి మౌనంగా, నిశ్శబ్దంగా, నిర్జీవంగా కనిపించాడు. రోదనలు, నినాదాలు కలిపి ఊరంతా ఉద్విగ్నమై ఉండగా పోలీసు డేగ కళ్ల మధ్య ఆయన అంత్యక్రియలు జరిగాయి. 37 ఏళ్లు అడవికి అంకితమైపోయి శివసాగర్ సముద్ర తీరం చెంత బూడిదగా మారిపోయాడు. వజ్రపుకొత్తూరు రూరల్: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి వద్ద పోలీసు కాల్పుల్లో మృతి చెందిన మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంక ర్ అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వస్థలంలో జరిగాయి. రెండు రోజుల నిరీక్షణ తర్వాత శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆయన మృతదేహం బాతుపురం గ్రామానికి చేరుకుంది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు భోరున విలపించారు. కామ్రేడ్ శంకర్ మృతదేహం బాతుపురం చేరిందని తెలిసి కడసారి చూపు కోసం ఇత ర జిల్లాలలో పాటు పరిసర ప్రాంతాల నుంచి ప్ర జా సంఘాల నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. దీంతో గ్రామం శోకసంద్రంగా మారింది. ప్రజా సంఘ నాయకులు విప్లవ జెండాను మృతదేహంపై వేసి విప్లవ నినాదాలు చేశారు. అనంతరం గ్రామ, కుటుంబ సంప్రదాయం ప్రకారం జోగారావు అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా విప్లవ జోహా ర్లతో అంతిమ యాత్ర చేపడుతుండగా కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు అడ్డు పడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మీ పోలీసులే జోగారావును పొట్టన పెట్టుకు న్నారు. ఇప్పుడు ప్రశాంతంగా దహనసంస్కారాల కువెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. అడుగడుగునా పోలీసు ఆంక్షలు కామ్రేడ్ మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ అంత్యక్రియలు పోలీసు ఆంక్షల మధ్యనే జరిగాయి. ర్యాలీలు చేయవద్దు, జెండాలు పట్టుకోవద్దు, విప్లవ నినాదాలు చేయవద్దు, ఎలాంటి కళాప్రదర్శనలు చేయకూడదంటూ ఆంక్షలు విధించారు. అంతిమయాత్రను పోలీసులు అడ్డుకోవ డంపై స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సంఘ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో సీఐ వెన క్కు తగ్గి ఎలాంటి ర్యాలీలు చేయకుండా మీ గ్రామ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసుకోవాలని సూచించడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. తాము ఎలాంటి ర్యాలీలు చేపట్టడం లేదని, ఎవరు చనిపోయినా ప్రజలు ఇలానే వ స్తారని చెప్పడంతో అంతిమయాత్రకు సీఐ అను మతి ఇచ్చారు. దీంతో ఉద్దాన ప్రజల నడుమ అంతియ యాత్ర ప్రశాంతంగా ముగిసింది. అక్కుపల్లి శివసాగర్ పరిసర ప్రాంతంలో శంకర్ దహన సంస్కారాలు చేపట్టారు. సోదరుడు మధుసూదన్ తలకొరివి పెట్టారు. ఉద్యమాలు ఆపలేరు బూటకపు ఎన్కౌంటర్లతో ప్రజా ఉద్యమాలు ఆపలేరని పలువురు ప్రజా సంఘాల నాయకులు అన్నారు. కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు అంజమ్మక్క, తాండ్ర ప్రకాష్, వంకల మాధవరావు, దున్న గోవిందరావు, తామాడ సన్యాసిరావు, అరుణ, కృష్ణవేణి, కుసుమ, నాగవేణి, బత్తిరి దానేస్, వీరస్వామి, పుచ్చ దుర్యోధన, బత్తిన ధర్మారావు, లక్ష్మణ్, వైకుంఠరావు, జో గారావు, గణపతి, నీలకంఠ, గీతారాణి తదితరు లు ఉన్నారు.బాతుపురం కన్నీటి సంద్రం -
విప్లవకారుడిగా వెళ్లి.. విగతజీవిగా ఇంటికి
● జోగారావు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి ● మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు ● బాతుపురంలో అంత్యక్రియలు నేడుఇఇవజ్రపుకొత్తూరు రూరల్: పోలీసు తూటాలకు బలైపోయిన మావోయిస్టు మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతదేహం కోసం సొంతూరు వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఉద్యమంలో చేరి 37 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి అల్లూరి సీతారామరా జు జిల్లా మారేడుమిల్లి వద్ద బుధవారం జరిగిన కాల్పుల్లో ప్రాణాలు వదిలిన జోగారావు ఆఖరి చూ పు కోసం ఉద్దానం ఎదురు చూస్తోంది. పీపుల్స్వార్ పార్టీ సిద్ధాంతాలతో ఉద్దాన ప్రాంతంలో ఆ పార్టీ నాయకత్వం బలోపేతానికి అడుగులు వేస్తున్న క్రమంలో అదే పార్టీ నాయకుడు మడ్డు బాబూరావుకు కొరియర్గా జోగారావు పని చేశారు. తర్వాత దశలో 1988లో పార్టీలో చేరి పూర్తిగా ఉద్యమాలు చేస్తూ మావోయిస్టు అగ్రనేతగా మారారు. బాంబులు తయారు చేయడంలో నేర్పరిగా ఎదిగారు. సాంకేతిక పరిజ్ఞానం వంటబట్టించుకోవడంతో టెక్ శంకర్ అనే పేరును సంపాదించారు. చిన్నతనం నుంచి తోటి వారికి సాయం చేసే గుణం ఉన్న జోగారావు అంచెలంచెలుగా మావోయిస్ట్ దళాలలో డిప్యూటీ కమాండర్గా ఎదిగారు. ఆఖరి చూపు కోసం ఎదురుచూపు ఉద్దాన ప్రాంతంలో ప్రాంతంలో పుట్టి 15 ఏళ్ల పా టు బాతుపురం గ్రామంలో తన కుటుంబ సభ్యు లు, బంధువులు, తోటి స్నేహితులతో సరదాగా గడిపిన జోగారావు ఉద్యమాల్లో చేరి నేటికి 37 ఏళ్లవుతోంది. అలనాటి జ్ఞాపకాలను కుటుంబ సభ్యు లు, తోటి స్నేహితులు నేమరు వేసుకుంటున్నారు. ఆయన ఇక లేడు, రాడు అన్న వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శంకర్ను కడసారి చూసేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే బుధవారం ఆయన మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, సామాజిక కార్యక్తలు కొంతమంది శంకర్ మృతదేహం కోసం అదే రోజు సాయంత్రం చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి బయల్దేరారు. గురువారం మృతదేహం అప్పగింత ప్రక్రియ పూర్తయ్యింది. జోగారావు సోదరుడైన మెట్టూరు మధుసూదన్ వైద్య పరీక్షలు చేసి రక్త సంబంధీకులు అని నిర్ధారణ అయ్యాక పోస్టుమార్టం గదికి పంపించినట్లు భోగట్టా. మృతదేహానికి నేడు బాతుపురంలో అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండుసార్లు పోలీసులకు చిక్కి..పీపుల్స్ వార్ పార్టీలో జోగారావు కొరియర్గా పని చేస్తున్న కాలంలో ఉద్దానంలో గ్రనేడ్ పేలడంతో పార్టీకి చెందిన నాయకులు గాయాల పా లయ్యారు. వీరిని విశాఖ ఆస్పత్రికి ఒక ప్రైవేటు వాహనంలో తీసుకొని వెళ్తున్న సందర్భంలో నరసన్నపేట వద్ద జోగారావుతో పాటు మిగిలిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది నెల లు జైలు జీవితం అనుభవించి బెయిల్పై బయటకు వచ్చారు. జోగారావు మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ అప్పగించిన పని మీద నల్లమల అటవీ ప్రాంతానికి వెళ్తున్న జోగారావు విజయవాడ నుంచి తిరుగు ముఖం పట్టాల్సి వచ్చింది. అదే సమయంలో ప్రజా ప్రతినిధిగా ఉన్న ఎం.సుబ్బారాం రెడ్డి హత్య జరగడం, జోగారావు పోలీసులకు చిక్కడం, అతని చేతిలో విజయవాడ కేంద్రం పేపర్ ఉండడంతో సుబ్బ రాం రెడ్డి హత్యలో జోగారావు పాత్ర ఉందని అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఆ కేసులో బెయిల్ పై వచ్చిన తర్వాత జోగారావు నేటి వరకు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోనే ఉన్నారు. జోగారావు మొట్టమొదట చందనగిరి దళంలోను, ఈస్ట్ డివిజన్ ఎల్లవరం దళంలోనూ డిప్యూటీ కమాండర్గా పనిచేశారు. తీవ్ర శోకాన్ని నింపింది భూమికి సూర్య చంద్రులు ఎంత వెలుగో. మావోయిస్ట్ పార్టీ నాయకులు పీడిత ప్రజలకు అంతే వె లుగు. అణగారిన వర్గాలకు, సమస్యలతో సతమ తం అవుతున్న ప్రజలకు మావోయిస్టులు అండగా ఉంటారనే ధైర్యం ఉంటుంది. జోగారావు మృతి ఉద్దాన ప్రాంతంలో తీవ్ర శోకాన్ని నింపింది. – పోతనపల్లి అరుణ, సామాజిక కార్యకర్త సోదరుడిని కోల్పోవడం బాధాకరం రక్తం పంచుకొని పుట్టిన సోదరుడు నేడు పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో కోల్పోవ డం చాలా బాధాకరం. చిన్నతనం నుంచి సేవా గుణం కలిగిన వ్యక్తి. ఆయన మృతి మా కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. – మెట్టూరు మధుసూదన్, శంకర్ సోదరుడు,బాతుపురం భుజాన మోసిన తుపాకీ బరువు.. ఆయనను కుటుంబానికి దూరం చేసింది. ఆ గుండెలో మోసిన శోకపు తీవ్రత.. సొంతూరిని కూడా కాదనుకునేలా చేసింది. ఆ గొంతుకలో పురుడు పోసుకున్న నినాదాల ఆర్థ్రత.. హితులు, చిన్ననాటి స్నేహితుల గురుతులు కూడా చెరిపేసింది. 37 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆ తుపాకీ నేలకొరిగింది. ఆ శోకం రక్తపు ధారగా బయటకు వచ్చింది. ఆ గొంతు శాశ్వతంగా నిశ్శబ్దమైపోయింది. విప్లవకారుడిగా ఊరు వదిలిన మెట్టూరు జోగారావు విగతజీవిగా తిరిగి వచ్చాడు. -
చలో సరుబుజ్జిలి పోస్టర్ ఆవిష్కరణ
సరుబుజ్జిలి: థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో 25న తలపెట్టిన చలో సరుబుజ్జిలి ర్యాలీ కార్యక్రమం పోస్టర్ను పోరాట కమిటీ కన్వీనర్ వాబ యోగి ఆధ్వర్యంలో వెన్నెలవలస గ్రామంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతున్న థర్మల్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనలు విరమించే వరకు పోరాటాలు చేయక తప్పదని వెల్లడించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ క్యార్యదర్శి సవర సింహాచలం, సహాయ కార్యదర్శి సవర ధర్మారావు, కార్యవర్గ సభ్యులు సవర మిన్నారావు, సవర ఆదయ్య, సవర చుక్కడు పాల్గొన్నారు. -
మందుబాబుల హల్చల్
● చలికాలంలో ఇబ్బంది పడుతున్న హాస్టల్ విద్యార్థులు ● చాలీచాలని దుప్పట్లు, తలుపులేని కిటికీలతో ఇబ్బందులు కొత్తూరు: కొత్తూరు ఎస్సీ బాలుర, కడుము బీసీ బాలుర, కారిగూడలోని మినిగురుకులం, గొట్టిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, లబ్బ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలల్లో కటిక నేలపైనే విద్యార్థులు నిద్రిస్తున్నారు. కారిగూడ మినీ గురుకులంలో ఉన్న నాలుగు గదుల్లోనే భోజనాలు చేసి నిద్రిస్తున్నారు. పర్యవేక్షణ శూన్యం జలుమూరు: శ్రీముఖలింగం బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో కొనసాగుతోంది. వసతి గృహం అధికారి బట్న రమణ చుట్టపు చూపుగా వస్తుంటారని ఆరోపణ ఉంది. ఈయన శ్రీముఖలింగం, జలుమూరు బాలురు వసతి గృహాలకు ఇన్చార్జిగా వ్యవహరించగా శ్రీకాకుళంలో పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎలుకల భయాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కరెంటు కోతలు.. కవిటి: రాజపురం, పీకే పాలెం కేంద్రాల్లో బీసీ బాలు ర వసతి గృహాలు ఉన్నాయి. పీకేపాలెంలైన్లో రాత్రి వేళల్లో కరెంట్ కోతలు అప్రకటితంగా ఉంటున్నాయి. దీంతో దోమల బెడద తప్పడం లేదు. దోమల బెడద పాతపట్నం: పాతపట్నంలోని కోర్టు కూడలి వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహం, బాలాజీ నగర్–3 ఉన్న ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహం, సెయింటాన్స్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం, ఎస్టీ బాయ్స్ హస్టల్, బీసీ బా య్స్ హాస్టళ్లలో విద్యార్థులు నేల మీదనే పడుకుంటున్నారు. దోమల బెడద ఉందని, లాబర, బైదలాపురం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు. గదుల్లోకి చలిగాలులు టెక్కలి రూరల్: టెక్కలి ఎస్సీ వసతి గృహంలో చన్నీటి స్నానాలే గతిగా మారాయి. కిటికీలకు తలుపులు లేకపోవడంతో చలి గాలులతో ఇబ్బంది తప్పడం లేదు. ఆదిఆంధ్రవీధిలో ఉన్న గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు తమ సామాన్లు పక్కకు జరిపి నిద్రపోతున్నారు. చల్లటి నీరే గతి సోంపేట: బారువ గ్రామంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులు చన్నీటి స్నానాలు చేస్తున్నారు. ఉదయం మోటారు వేసుకుని ఆ చల్లని నీటితోనే స్నానం చేస్తున్నారు. ఎవరికి వారే.. గార: అంపోలు బీసీ వెల్ఫేర్ హాస్టల్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వార్డెన్ పగలు ఉండి రాత్రి వెళ్లిపోతారని విద్యార్థులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి 9 గంటలకు శ్రీకాంత్ అనే వ్యక్తి ఉండేవారని, ప్రతి రోజూ అంపోలులో ఉన్న సొంతింటికి వెళ్లిపోతారని విద్యార్థులు చెప్పారు. ఇక్కడ చలిలో నేలబారు నిద్రలు కనిపించాయి. శీతగాలి తాకిడి ఎచ్చెర్ల: మురపాకలో విద్యార్థులు నిద్రిస్తున్న ప్రదేశాల్లో ఉన్న కిటికీలు, తలుపులు పాడయ్యాయి. ఫరీదుపేట వసతి గృహంలో రేకుల షెడ్కు కిటికీలకు తలుపులు లేవు. స్థానిక విద్యార్థులు రాత్రిళ్లు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. డి.మత్స్యలేశం వసతి గృహంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆమదాలవలస ఎస్సీ బాలురు వసతి గృహంలో ఉదయాన్నే చలిగాలిలో బోరు వద్ద వణుకుతూ.. చన్నీటి స్నానాలు వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి బీసీ బాలుర వసతి గృహం మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. విద్యార్థులను భయపెట్టి మరీ మందుబాబులు వసతి గృహంలోకి ప్రవేశిస్తున్నారు. విద్యార్థులు స్నానాలు చేసే దగ్గర, బోరు వద్ద బల్బులు లేవు.బాత్ రూమ్, మరుగుదొడ్లకు బల్బులు లేవు. విద్యార్థులు నేలపైనే నిద్రిస్తున్నారు. రాత్రివేళ హాస్టల్ డాబాపై మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. చన్నీటి స్నానాలు ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలో సాంఘిక సంక్షేమ (ఎస్సీ) బాలురు–1, బాలికలు–1, బీసీ బాలురు–1, బాలికలు–1 వసతిగృహాలు ఉన్నాయి. శీతాకాలంలో వీరికి దుప్పట్లు చాలడం లేదు. పరుచుకోవడానికి ఒకటి, కప్పుకోవడానికి మరొకటి వినియోగిస్తున్నారు. అలాగే చన్నీటి స్నానాలు తప్పడం లేదు. నేలపైనే నిద్ర సంతబొమ్మాళి: నౌపడ బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు నేలపైనే నిద్రిస్తున్నారు. అదనపు మరుగుదొడ్ల నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. హాస్టల్ చుట్టూ ముళ్ల చెట్లు పెరిగిపోయి భయంకరంగా కనిపిస్తున్నాయి. తలుపులు అక్కడక్కడా విరిగిపోయి ఉన్నాయి. -
బాలుడి నిజాయితీ
ఇచ్ఛాపురం: పట్టణంలోని గొల్లవీధికి చెందిన రోహి త్ పూరి అనే బాలుడు తనకి దొరికిన సుమారు మూడు లక్షలు విలువైన రెండుతులాల బంగారు చైన్ని తిరిగి బాధితునికి అందజేసి నిజాయితీ చాటుకున్నాడు. స్థానిక మాజీ సైనికోద్యోగి డి.విశ్వ నాథం బుధవారం తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మెడలోని బంగారు చైన్ పోగొట్టుకున్నారు. ఈ చైన్ రోహిత్కి దొరికింది. అప్పటికే చైన్ వెతుక్కుంటూ వస్తున్న విశ్వనాథను రోహిత్ గుర్తించి చైన్ అందజేశాడు. ఈ సందర్భంగా బాలుడి నిజాయితీని మెచ్చిన సైనికోద్యోగి ఎమ్మెల్యే బెందాళం అశోక్ సమక్షంలో గురువారం సన్మానించారు. బాలుడి తండ్రి లోకనాథ్పూరి, కొండా శంకర్రెడ్డి తదితరు లు పాల్గొన్నారు. -
భూతగాదాలో ఇద్దరికి గాయాలు
సారవకోట: గుమ్మపాడు పంచాయతీ అగదల గ్రా మంలో గురువారం భూ తగదాలో ఇరువర్గాలకు చెందిన ఇద్దరు గాయాలపాలైయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బమ్మిడి జయరాంకు చెందిన జిరాయితీ భూమిలో కొంత భాగాన్ని హను మంతు రామకృష్ణ అనే వ్యక్తి కొన్నాళ్లుగా సాగు చేస్తున్నారు. ఈ నెల 17న 70 సెంట్లలో వరి కోత చేపట్టాడు. అదే ప్రాంతంలో బమ్మిడి జయరాం కూడా ఈ నెల 19న 70 సెంట్లలో వరి కోత చేపట్టా డు. గురువారం ఇద్దరూ ఒకే సారి మిగిలిన వరి పంట కోత చేపట్టేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన గొడవకు దిగడంతో జయరాం, నాగభూషణలు గాయపడ్డారు. జయరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనుమంతు రామకృష్ణ, జలజాక్షి, బలగ నాగభూషణలపై కేసు నమోదు చేయగా.. నాగభూషణ ఇచ్చిన ఫిర్యాదుపై బమ్మిడి జయరాంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులను బుడితి సీహెచ్సీ, నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించి అనంతరం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. కాగా, అగదలలో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి వరి పొలంలో ఉన్న బమ్మిడి జయరాంను ఎస్ఐ తన వాహనంలో బుడితి సీహెచ్సీలో చేర్పించి చికిత్స అందించారు. -
ఆపేదే లేదు..!
రామన్నకు సొసైటీ 1980లో కేటాయించగా 2018 బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న టంకాల అర్జున్ రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో అర్జున్ పాలక వర్గం అనుమతి తీసుకోలేదు. రిజిస్ట్రేషన్ చెల్లదని ప్రస్తుతం అధ్యక్షుని హోదాలో ఉన్న చింతు రామారావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిజిస్ట్రార్ కార్యాలయానికి లేఖ రాశారు. సమాచారం రామన్నకు కూడా తెలియజేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకు లు పావులు కదిపి రూ.కోట్లు విలువ చేసే ఈ స్థలంపై కన్నేశారు. సబ్ రిజిస్ట్రార్పై ఒత్తిడి చేసి స్థలాన్ని విజయనగరానికి చెందిన బిల్డర్కు రామన్నతో మార్ట్గేజ్ చేయించారు. దీంతో ఆయన పనులు చేపడుతున్నారని సొసైటీ పాలక వర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
పక్కాగా రథసప్తమి ఏర్పాట్లు
అరసవల్లి: వచ్చే ఏడాది జనవరి 25న రాష్ట్ర పండుగ గా జరుగనున్న రథసప్తమి మహోత్సవాలకు అరసవల్లిలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి సూచించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ఆలయ పరిసరాల ను పరిశీలించారు. డిసెంబర్ నెలాఖరు నాటికి పక్కా క్యూలైన్లు, బార్కేడింగ్ పనులతో పాటు సీసీ కెమెరాలు వంటి భద్రతాచర్యలు కూడా పూర్తి చేయాలని ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్కు సూచించారు. మండపాల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మతో కలిసి చర్చించారు. వీఐపీలను ప్రధాన ద్వారం (రాజగోపురం) నుంచి ప్రవేశం లేకుండా బొంపాడవీధి మీదుగా ఉత్తర ద్వారం నుంచి దర్శనాలకు అనుమతిస్తే దాదాపుగా ఇబ్బందులు తప్పుతాయన్నారు. కేవ లం స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించే వీఐపీలు మాత్రమే ప్రధాన ద్వారం ద్వారం నుంచి అనుమతించి.. తదుపరి ప్రవేశాలను నిలిపివేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వివేకానంద, వార్డు ఇన్చార్జిలు తెలుగు నాగరత్నం, ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావు, గొలివి దాము, రాయిపల్లి అర్జున్, కొయ్యాన రామ్మోహన్, తెలుగు జగదీష్ పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్లో అదరగొట్టండి..!
అమ్మాయిలూ.. హైజంప్ సాధనలో ఓ అథ్లెట్ శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం వేదికగా బాలికల అథ్లెటిక్స్ పోటీల కు రంగం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23న అస్మిత అథ్లెటిక్స్ లీగ్–2025 పేరిట బాలికలకు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలను నిర్వహించాల ని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ పోటీలు మొదలుకానున్నాయి. ఒక్కరోజులోనే పోటీలను ముగించి, మెడల్స్, ప్రశంసాపత్రాలను అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిభ కలిగిన బాలికలను గుర్తించేందుకుగాను ఖేలో ఇండియా, అథ్లెటిక్స్ ఫెడరేషన్ వారి సౌజన్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా, రాష్ట్ర అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి తెలిపారు. పోటీలకు హాజరయ్యే బాలికలు తమ వెంట జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తీసుకురావాలని నిర్వాహకులు కోరారు. పూర్తి వివరాలకు సాంబమూర్తి (సెల్: 8500271575), సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి కె.మాధవరావు (సెల్: 9441570361) నంబర్లను సంప్రదించాలని కోరారు. ●అస్మిత అథ్లెటిక్స్ లీగ్ పోటీలు అండర్–14, అండర్–16 రెండు విభాగాల్లో బాలికలకు వివిధ అథ్లెటిక్స్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. అండర్–14 బాలికలు 2011 డిసెంబర్ 21 నుంచి 2013 డిసెంబర్ 20 తేదీ మధ్య జన్మించి ఉండాలి. అండర్–16 బాలికలు 2009 డిసెంబర్ 21 నుంచి 2011 డిసెంబర్ 20 తేదీ మధ్య జన్మించి ఉండాలి. ●అండర్–14 బాలికలకు: ట్రయాథ్లెన్– ఏ కేటగిరిలో 600 మీటర్ల పరుగు, లాంగ్జంప్, షాట్పుట్. ట్రయాథ్లెన్–బి కేటగిరీలో 60 మీటర్ల పరుగు, లాంగ్జంప్, హైజంప్. ట్రయాథ్లెన్– సి కేటగిరిలో 60 మీటర్ల పరుగు, లాంగ్జంప్, 600 మీటర్ల పరుగు, కిడ్స్ జావెలిన్త్రోలో ఈవెంట్స్ జరుగుతాయి. ●అండర్–16 బాలికలకు: 60 మీటర్ల పరుగు, 600 మీటర్ల పరుగు, లాంగ్జంప్, హైజంప్, షాట్పుట్, డిస్కెస్త్రో, జావెలిన్త్రోలో ఈవెంట్స్ జరుగుతాయి. అస్మిత అథ్లెటిక్స్ లీగ్ పేరి ట నిర్వహించనున్న క్రీడాకారిణుల గుర్తింపు ప్రక్రి య ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. రాణించిన అథ్లెట్స్కు బంగారు భవిష్యత్తు లభించనుంది. జిల్లాలోని యువ అథ్లెట్లు పోటీలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలి. – కొన్న మధుసూదనరావు, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు -
టీడీపీ నేతల బరితెగింపునకు చెక్
రణస్థలం: టీడీపీ నాయకుల బరితెగింపునకు రెవె న్యూ అధికారులు పోలీసుల సమక్షంలో చెక్ పెట్టా రు. లావేరు మండలం కొత్త కుంకాం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 55లో పెద్ద కోనేరు చెరువు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు మడ్డువలస కాలువ వల్ల రెండు పాయలుగా చీలిపోయింది. ఒకవైపు రెండు ఎకరాల పరిధిలో ఉన్న చెరువుపై స్థానిక టీడీపీ నాయకులు కన్నేశారు. జేసీబీలతో పనులు చేసి మరీ కప్పేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రామస్తుల తరఫున ఓ వ్యక్తి కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. చెరువును టీడీపీ నాయకులు కూనపల్లి కిషోర్ కుమార్, బత్తుల గిరిబాబులు ఆక్రమిస్తున్నారని అందులో పేర్కొన్నారు. దీనిపై టీడీపీ నాయకుల బరితెగింపు అనే శీర్షికతో అప్పట్లో సాక్షిలో కథనం ప్రచురితమైంది. వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి చెరువు ఆక్రమణ జరిగినట్లు నిర్ధారించి సంబంధిత వ్యక్తులకు గ్రామ పెద్దల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత పోలీసుల ప్రొటెక్షన్ లేకపోవడంతో పూర్తి స్థాయిలో హద్దులు నిర్ణయించలేకపోయారు. గురువారం లావేరు తహసీల్దార్ జీఎల్ఈ శ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం పోలీసులు సమక్షంలో రెవెన్యూ అధికారులు చెరువు సరిహద్దులు నిర్ధారించారు. ఎవరైనా ఆక్రమణలు చేపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ శ్రీధర్ రెడ్డి, ఆర్ఐ హారతి, ఏఎస్ఐ, గ్రామ రెవెన్యూ అధికారులు ఉన్నారు. -
పట్టపగలే చోరీకి యత్నం
పలాస: కాశీబుగ్గలో పట్టపగలు ఒక ప్రయాణికుడి నుంచి ఐదుగురు వ్యక్తులు బలవంతంగా డబ్బులు లాక్కొనే ప్రయత్నం చేయగా స్థానికులు గమనించి వారికి దేహశుద్ధి చేసి కాశీబుగ్గ పోలీసులకు అప్పగించారు. గురువారం కాశీబుగ్గ ఆటో స్టాండ్ వద్ద ఈ సంఘటన జరిగింది. పూండి పలాస ఆర్టీసీ బస్సులో కృష్ణారావు అనే వ్యక్తి ఎక్కాడు. అతని వద్ద డబ్బులు ఉన్నాయని పసిగట్టిన ఐదుగురు వ్యక్తులు అతని సీటు వెనుకాలే కూర్చున్నారు. కాశీబుగ్గ బస్టాండ్ కృష్ణారావు దిగి ఆటో స్టాండ్ పక్కన మూత్ర విసర్జనకు వెళ్తుండగా అతన్ని కొట్టి జేబులో ఉన్న రూ.20వేలు తీసుకున్నారు. కృష్ణారావు కేకలు వేయడంతో ఆటో డ్రైవర్లు, స్థానికులు వచ్చి వెంబడించారు. ఇద్దరు తప్పించుకోగా ముగ్గురిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం కాశీబుగ్గ పోలీసులకు అప్పగించారు. సీఐ పి.సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెట్టుబడులన్నీ బూటకమే
ఆమదాలవలస: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించామని చెబుతున్న సీఐఐ సదస్సు –2025 లో ప్రకటించిన పెట్టుబడులు, ఎంవోయూలు, ఉద్యోగాల గణాంకాలన్నీ బూటకమేనని వైఎస్సార్ సీపీ యువనేత తమ్మినేని చిరంజీవినాగ్ అన్నారు. గురువారం ఆమదాలవలసలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం 613 సంత కాలు జరిగినట్లు చెబుతోందని, వాటిలో ఎన్ని పూర్తిగా కొత్త పెట్టుబడులు అనే విషయాన్ని తేటతెల్లం చేయాలన్నారు.గత ప్రభుత్వ కాలంలో పూర్తయిన పాత ఒప్పందాల పునరుద్ధరణను చంద్రబా బు సర్కార్ తమ గొప్పగా చెప్పుకోవడం తగదన్నా రు. మొత్తం రూ.13.25 లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయనడాన్ని తప్పుపట్టారు. భారీ పెట్టుబడుల కు అవసరమైన ప్రాజెక్ట్ వివరాలు, లొకేషన్, భూముల కేటాయింపు, ఆమోదాలు ప్రజలకు తెలియజేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. పెట్టుబడి అంటే పేజీ మీద ఉన్న ఎంవోయూ కాదని, అది నేల మీద కనిపించాలన్నారు. నూతన ఒప్పందాలలో భాగంగా ఏర్పాటయ్యే పరి శ్రమలు ద్వారా 1.63 లక్షల ఉద్యోగాలు వస్తాయంటూ చేస్తున్న ప్రచారం ఉత్తిదేనన్నారు. ప్రకటనలు కాకుండా ప్రాజెక్టుల జాబితా,గ్రౌండింగ్ వివరాలు, పెట్టుబడుల ఆధారాలు, ఉద్యోగాలు కల్పన వంటి వి ప్రజలకు చూపించాలన్నారు. శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పాతప ట్నం అసెంబ్లీ నియోజకవర్గ చేతివృత్తుల విభాగం అధ్యక్షుడిగా గుంటు వీరభద్రుడు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం గురువారం ప్రకటన విడుదల చేసింది. -
పఠనాసక్తి పెరిగినప్పుడే పుస్తకాలకు విలువ
శ్రీకాకుళం కల్చరల్ : ప్రతి ఒక్కరిలో రీడింగ్ రివల్యూషన్ వచ్చినప్పుడే పుస్తకం విలువ పెరుగుతుందని సిక్కోలు పుస్తక మహోత్సవం చైర్మన్ డాక్టర్ కె.సుధీర్ అన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ హైస్కూల్ మైదానంలో 10రోజులు గా జరుగుతున్న సిక్కోలు పుస్తక మహోత్సవం ముగింపు సభ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తక మహోత్సవం సభ్యులు అట్టాడ అప్పలనాయుడు, కన్వీనర్ కె.శ్రీనివా స్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, సాహిత్య కమిటీ స భ్యులు బాడాన శ్యామలరావు, కల్చరల్ కమిటీ సభ్యులు సుధాకర్, జె.వి.వి.రాష్ట్ర అధ్యక్షుడు గొంటి గిరిధర్, లక్ష్మయ్యలు మాట్లాడుతూ తొలిసారి ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనకు మంచి స్పందన వచ్చిందన్నారు. అనంతరం చిత్రలేఖనం పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అంతకుముందు నెట్టెం రమణ అధ్యక్షతన చర్చాగోష్టి నిర్వహించారు. విశ్రాంత ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న, రచయత బండి సత్యనారా యణ, రచయతలు శ్రీనివాసరావు, కె.ఉదయకిరణ్, ఎన్.రమణలు ప్రసంగించారు. అనంత రం రచయత్రి పత్తి సుమతి రచించిన డౌన్ డౌన్ డార్వీన్ అట పుస్తకం ఆవిష్కరణ, ఎల్.ఎన్.కొల్లి రచించిన ఎకోస్–ఎంబర్స్ పుస్తకావిష్కరణ జరిగింది. మొయిదశ్రీనివాసరావు రచించిన కరవాక పుస్తకాన్ని పరిచయం చేశారు.


