ఆటలు ఆడుకుంటారా
జిల్లా కేంద్రంలో డయేరియా వ్యాపించి నగరమంతా అట్టుడికిపోతుంటే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, గొండు శంకర్లు విజయవాడలో కబడ్డీ ఆడుకోవడం సిగ్గుచేటు. కలుషిత నీరు తాగి మనుషులు చనిపోతే వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం సరికాదు. డయేరియాని కంట్రోల్ చెయ్యడం చేతకాక సహజ మరణాలు అని చెప్పడం విడ్డూరం. కనీసం మున్సిపాలిటీ డాక్టర్లు రాలేదని స్థానికులు బండబూతులు తిడుతున్నారంటే ప్రజారోగ్యం పట్ల కూటమి పాలకులకు ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోంది.
– సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి


