breaking news
Srikakulam District News
-
కర్షకులకు కరెంట్ కష్టాలు
● వేధిస్తున్న విద్యుత్ సమస్య ● ఒక ట్రాన్స్ఫార్మర్కు 50 పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ● హెచ్చుతగ్గులతో కాలిపోతున్న మోటార్లు కవిటి : వ్యవసాయం, రైతుల సంక్షేమమే తమ ధ్యేయమంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనకుదరడం లేదు. ఇప్పటికే యూరియా, ఎరువులు పూర్తిస్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు కరెంట్ కష్టాలు సైతం వెంటాడుతున్నాయి. ఉద్దాన ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ బోరు బావులపైనే ఆధారపడి సాగు జరుగుతోంది. కవిటి మండలం పుటియాదళ రెవెన్యూ గ్రామాల్లో రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు పెద్దసమస్యగా మారాయి. ఇక్కడ 276 ఎకరాలు వరిసాగు విస్తీర్ణం ఉంది. ఈ ఏడాది నెలకొన్న ప్రత్యేక పరిస్థితులలో దమ్ముల సీజన్లో మినహాయించి వరినాట్లు వేశాక సరైన వర్షం లేక అన్నదాత బోరుమంటున్నారు. ఇలాంటి సమయంలో అండగా నిలవాల్సిన ఉచిత విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు మొరాయిస్తున్నాయి. మోటార్లు తిరగడం లేదు. దీనికి కారణం ఏంటని ఆరా తీస్తే 100 కేవీ ట్రాన్స్ఫార్మర్పై 51 వరకు కనెక్షన్లు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. దీనివల్ల ఇటీవల 8 మోటార్లు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలక దశలో.. వరిపైరు పొట్టదశకు చేరుకునే క్రమంలో నీరు తప్పక అందాల్సి ఉంది. ఈ సమయంలో మోటార్లు తిరగక రైతుల ఆందోళన చెందుతున్నారు. దీనికి తక్షణ పరిష్కారంగా మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వాస్తవానికి ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని పట్టించుకోకుండా ఇన్ని కనెక్షన్లు ఎందుకు ఇచ్చారంటే ఉద్యోగులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి దృష్టి సారించాలని, లేనిపక్షంలో 250 ఎకరాల్లో వరిపంటకు నష్టం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి ఒకే పంట పండిస్తున్నాం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్మోటార్లు మాకు శ్రీరామరక్ష అనే భావనతో ఉండేవాళ్లం. కానీ ఉన్న ట్రాన్స్ఫార్మర్పై పరిమితికి మించి కనెక్షన్లు ఉండటంతో అసాధారణంగా లోడ్ పెరిగింది. మోటార్లు తిరగడం లేదు. తక్షణం విద్యుత్శాఖ అధికారులు స్పందించి రైతుల్ని ఆదుకోవాలి. – బెందాళం వెంకటేశ్వరరావు, రైతు, కవిటిపుటియాదళలో ఎకరా పైగా వరిపొలం ఉంది. ఈ ఏడాది వర్షాలు సక్రమంగా లేక విద్యుత్ మోటార్లపైనే ఆధారపడుతున్నాం. మా ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఈ సీజన్లో 8 మోటార్లు కాలిపోయాయి. ఎప్పుడు ఎవరి మోటార్ కాలిపోతోందో అనే భయం వెంటాడుతోంది. తక్షణమే లోడ్ను తగ్గించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించే చర్యలు తీసుకోవాలి. – బి.జయరాం, రైతు, రామయ్యపుట్టుగ -
ఉత్సాహంగా సాఫ్ట్ టెన్నిస్ పోటీలు
పాతపట్నం: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, అండర్–17, అండర్–19 బాల, బాలికల సాఫ్ట్ టెన్నిస్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు పాతపట్నం మండలం సూర్యనారాయణపురం గ్రామ సమీపంలోని అక్షర పాఠశాల మైదానంలో ఉత్సాహంగా జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు చెందిన 270 మంది విద్యార్థులు హాజరయ్యారని రాష్ట్ర వ్యాయామ సంఘం అధ్యక్షుడు ఎన్ని శేఖర్బాబు తెలిపారు. కొందరు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈవో సీహెచ్ తిరుపతిరావు, డైరెక్టర్ రియాజ్, ప్రిన్సిపాల్ సుజాత, పీఈటీలు కె.రాజారావు, జె.కృష్ణ, ఎస్.కృష్ణారావు, లోకేశ్వరరావు, డి.లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
థర్మల్ పవర్ ప్లాంట్పై కావాలనే రభస
బూర్జ: నియోజకవర్గం అభివృద్ధికి సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ తెస్తే కొందరు కావాలనే రభస చేస్తున్నారని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కర్నేన దీప అధ్యక్షతన సాధారాణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడ నిర్మాణం చేపడతారో తెలియక ఆదివాసీలను రెచ్చ గొట్టి ప్రతి రోజు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి సర్వే కూడా చేయకుండా అడ్డుకుంటున్నారు చెప్పారు. పవర్ ప్లాంట్తో సుమారు 10 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అనంతరం విద్యాశాఖపై సమీక్షిస్తూ.. మండల ఎంఈఓలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడం లేదని, ఎంఈఓ శ్యామసుందరరావు సమావేశానికి డుమ్మా కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో అందజేయాలన్నారు. ఎంఈఓల నిర్వాహకం వల్లే అల్లేన గ్రామంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జీవోకు విరుద్ధంగా 14 కి.మీ దూరంలో ఉన్న పాలవలస పాఠశాలలో విలీనం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంఈఓలు సెలవులపై వెల్లాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ ఆర్.తిరుపతిరావు, తహసీల్దార్ వై.వి.పద్మావతి, ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణనాయుడు, వైస్ ఎంపీపీలు కరణం కృష్ణమూర్తి నాయుడు, బుడుమూరు సూర్యారావు, పీఏసీఎస్ అధ్యక్షుడు బగాది శ్రీరామ్మూర్తినాయుడు పాల్గొన్నారు. -
దళిత కార్మికుల పొట్ట కొట్టొద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్: టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు చేసి ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోకు భూములిచ్చిన దళిత కార్మికుల పొట్టకొట్టవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు కోరారు. ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలిలో మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరుతూ మంగళవారం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో కార్మికులు, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాకుళం ఆర్అండ్బీ బంగ్లా నుంచి కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ, పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో కొత్తగా టెక్కలిలో మరో డిపో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజలు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీరు అడుగుతున్నారు తప్ప బీరు అడగడం లేదని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో హమాలీ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.బంగార్రాజు, నాయకులు టి.రామారావు, ఎన్.సురేష్, ఎన్.రమణ, బోనెల.రాము, పి.రామారావు, ఎల్.సీతారాం, ముద్దాడ.రాజు, కె.వి రమణ, ఎస్.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
నీట్ పీజీ ఫలితాల్లో మెరిసిన విశాల్
నందిగాం: దేవళభద్ర పంచాయతీ జల్లపల్లికి చెందిన ఆరంగి విశాల్ నీట్ పీజీ ఫలితాల్లో ప్రతిభ కనబరిచాడు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో ఓబీసీ కేటగిరీలో 5136వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 296వ ర్యాంకు సాధించాడు. విశాల్ తండ్రి జానకిరామయ్య బ్యాంకు అధికారి కాగా , తల్లి సరిత గృహిణి. విశాల్ ఎంబీబీఎస్ శ్రీకాకుళం రిమ్స్లో పూర్తి చేశాడు. మారుమూల గ్రామానికి చెందిన విశాల్ పీజీలో ఉత్తమ ర్యాంకు సాధించడం తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్కు చెందిన గజపతి సందీప్ (14) అనే బాలుడు అదృశ్యమైనట్లు మేనత్త కొర్రాయి సుజాత కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. పాఠశాలకు సరిగా వెళ్లకపోవడంతో మందలించామని, ఆ తర్వాత ఈ నెల 14న ఒడిశా రాష్ట్రంలోని తమ స్వగ్రామమైన గజపతి జిల్లా ఒతిసింపూర్ వెళ్లిపోతానని చెప్పి వెళ్లిపోయాడని, అక్కడికి కూడా వెళ్లలేదని తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలి
రణస్థలం: 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, దసరా కానుకగా 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా సభ్యత్వ అభియాన్లో భాగంగా మంగళవారం రణస్థలం మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలన్నారు. జిల్లా పూర్వ అధ్యక్షుడు జి.వెంకటగిరి మాట్లాడుతూ కాంప్లెక్స్ స్థానాల్లో పని చేస్తున్న గణిత, ఆంగ్ల ఉపాధ్యాయులకు, శాశ్వత స్థానాలు కేటాయించే ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి రవి భట్టు మాట్లాడుతూ జూన్లో బదిలీలు పొంది రిలీవర్ లేని కారణంగా అదే స్థానాల్లో ఉన్న ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించేలా తాజా డీఎస్సీ అభ్యర్థులను నియమించాలన్నారు. కార్యక్రమంలో సంఘ మండల అధ్యక్షుడు జి.చిన్ని కృష్ణంనాయుడు, ప్రధాన కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. -
సరికొత్తగా సైన్స్ ఎగ్జిబిషన్ జిల్లా కేంద్రంలో సైన్స్ ఎగ్జిబిషన్ జరగనుంది. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ వేదిక కానుంది. –8లో
కర్షకులకు కరెంటు కష్టాలుకర్షకులను కరెంటు కష్టాలు వేధిస్తున్నాయి. ఒక ట్రాన్స్ఫార్మర్కు 50 కనెక్షన్లు ఉన్నాయి. –8లోజాబులిప్పిస్తామని మోసం శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా వైద్యారోగ్యశాఖలో జాబులిప్పిస్తామని నమ్మించి రూ.8 లక్షలకు టోకరా వేసిన భా ర్యాభర్తలపై మంగళవారం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఎం. హరికృష్ణ తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. 2022 ఫిబ్రవరిలో అదే శాఖలో పనిచేస్తున్న అప్పటి హెల్త్ అసిస్టెంట్ జీవీ నరసింహం అనే వ్యక్తి తురకల సురేష్, ఆయన భార్య, మరో మహిళ రాంబాయికి తప్పుడు జాయినింగ్ రిపోర్టులు ఇచ్చి మో సం చేశాడు. దీనిపై ఇటీవల సురేష్ ఫిర్యాదు చేయడంతో నరసింహం, అతనికి సహకరించిన భార్యలిద్దరిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. సాక్షి పత్రిక ఎడిటర్, పలువురు జర్నలిస్టులపై టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు హేయం. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. కేసుల పేరుతో విచారణకు పిలిపించి గంటల తరబడి ఉంచడం సరికాదు. – మామిడి శ్రీకాంత్, వైఎస్సార్సీపీ తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షుడు -
అంతా గోప్యమే..!
● డీఎస్సీ మెరిట్ కం రోస్టర్ జాబితాపై అభ్యంతరాలు ● తక్కువ మార్కులు వచ్చిన వారికి ఎగువ, ఎక్కువ మార్కులు వచ్చిన వారికి దిగువ స్థానాలు ● న్యాయం చేయాలని వేడుకుంటున్నా పట్టించుకోని వైనం శ్రీకాకుళం: డీఎస్సీ.. అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని అర్థం. ఈ కమిటీకి చైర్మన్గా కలెక్టర్, సభ్యులు గా జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా విద్యాశాఖ అధికారి ఉంటారు. వీరి నేతృత్వంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ జరుగుతుంది. గతంలో ఆఫ్లైన్ విధానంలో డీఎస్సీ నిర్వహించేవారు. ఇప్పుడు దాన్ని ఆన్లైన్ విధానంలోకి మార్చి నిర్వహిస్తున్నారు. సాధారణంగా పరీక్ష నిర్వహించిన తర్వాత మార్కుల ఆధారంగా ఎంపికై న అభ్యర్థుల జాబితాను రాష్ట్రస్థాయిలో విడుదల చేసి జిల్లాకు పంపిస్తారు. అటు తర్వాత జిల్లా స్థాయిలో మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. ఇది పూర్తయిన తర్వాత రోస్టర్ పాయింట్ల ఆధారంగా మెరిట్ కం రోస్టర్ జాబితాను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. అటు తర్వాత అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలలను కేటాయిస్తారు. కానీ కూటమి ప్రభుత్వం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి బదులుగా స్టేట్ సెలక్షన్ కమిటీ విధానాన్ని అవలంబిస్తూ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియను రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తోంది. అక్కడ ఏం జరుగుతుందో జిల్లా విద్యాశాఖకు కూడా తెలియని పరిస్థితి. ఎందరో అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని మొర పెట్టుకుంటున్నా తామేమీ చేయలేమని, రాష్ట్రస్థాయిలోనే సరిదిద్దుతారని చెబుతూ జిల్లా విద్యా శాఖ వర్గాలు చేతులెత్తేస్తున్నాయి. మార్కులు ప్రకటించిన నుంచి తుది జాబితా విడుదలైన వరకు ఒకరి మార్కులు ఒకరికి తెలియకుండా, ఎవరిని ఎంపిక చేశారో పక్క వారికి కూడా తెలియకుండా గోప్యంగా ప్రక్రియను నిర్వహిస్తుండడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తుది జాబితాలో ఎన్నో పొరపాట్లు రాష్ట్రస్థాయిలో సోమవారం విడుదల చేసిన మెరిట్ కం రోస్టర్ జాబితాలో ఎన్నో పొరపాట్లు జరిగాయి. దీనికి సంబంధించి కొందరు అభ్యర్థులు కలెక్టర్కు, జిల్లా విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నా వాటిని రాష్ట్రస్థాయికి నివేదిస్తామని అక్కడ సరిచేస్తారని చెబుతూ వస్తున్నారు. అభ్యర్థులు రాష్ట్రస్థాయికి తెలియజేసేందుకు హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినప్పటికీ అది ఎప్పుడు పని చేస్తుందో తెలియని పరిస్థితి. ఒక వేళ పనిచేసినా సమస్యను నివేదించాక అధికారుల దృష్టికి తీసుకువెళతామని మాత్రమే చెబుతున్నారు తప్ప సమస్య పరిష్కారమైనట్లు ఎలాంటి సమాచారం ఉండటం లేదు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సాంఘిక శాస్త్ర విభాగంలో బిర్లంగి శ్రీదేవి అనే అభ్యర్థి 77.51 మార్కులను, అంపోలు పుణ్యవతి అనే అభ్యర్థి 75.6 మార్కులను, మెట్ట శారద అనే అభ్యర్థి 73.3 మార్కులను సాధించారు. వీరు ముగ్గురూ బీసీ ఏ కేటగిరీకి చెందినవారు. మార్కుల ఆధారంగా చూసుకుంటే శ్రీదేవి ముందుగాను, పుణ్యవతి, శారదలు అటు తర్వాత వరుస క్రమంలోనూ ఉండాల్సి ఉంది. అయితే విడుదలైన జాబితాలో శ్రీదేవి 51వ స్థానంలోనూ, పుణ్యవతి 46వ స్థానంలోనూ, ఉండగా శారద 20వ స్థానంలో ఉన్నారు. శ్రీదేవి గడిచిన రెండు రోజులుగా కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం చేసే వారే కరవయ్యారు. అభ్యర్థులను త్వరలోనే అమరావతికి తీసుకువెళ్లి అక్కడ నియామక పత్రాలు ఇస్తారని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న అందరినీ ఒక చోటకు చేర్చి నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు చెబుతుండగా, జిల్లా స్థాయిలో తప్పును సరిదిద్దకుండా రాష్ట్రస్థాయిలో ఇన్ని వేలమంది హాజరయ్యే సమయంలో తమకు న్యాయం జరగదని శ్రీదేవి ఆందోళనకు గురవుతున్నారు. తనకు ఎక్కువ మార్కులు వచ్చి నా వెనుకకు నెట్టడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందేమోనని బెంగపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని కనిపించిన ప్రతి అధికారిని డీఎస్సీ కమిటీలోని సభ్యులందరినీ వేడుకుంటున్నారు. -
నిరసనలకు దిగిన విద్యుత్ ఉద్యోగులు
అరసవల్లి: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ న్యాయమైన సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల ఉద్యోగ కార్మికులు దశలవారీగా ఆందోళనలకు దిగుతున్నారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి విధులను నిర్వర్తించగా, షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లా కేంద్రంలో సర్కిల్ కార్యాలయం వద్ద భోజన విరామ సమలో ధర్నా నిర్వహించేలా సన్నద్ధమవుతున్నారు. అలాగే ఈ నెల 19,20 తేదీల్లో సర్కిల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలకు దిగనున్నారు. అనంతరం ఈనెల 22న జిల్లా కేంద్రంలో శాంతియుత ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్కు వినతిపత్రా న్ని ఇవ్వడంతో దశలవారీ ఆందోళనలను విర మించనున్నారు. అప్పటికీ సమస్యల పరిష్కారం కాకపోతే తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లుగా జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన నోటీసును సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తికి జేఏసీ చైర్మన్ మహంతి ప్రభాకరరావు, కన్వీనర్ జి.రమేష్కుమార్, ముఖ్య సభ్యులు పీవీఏ నాయు డు, ఎం.శ్రీనివాసరావు, పీవీ రమణ, బీవీ గురునాథరావు, పి.ఉమాశంకర్, టీవీ సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. -
‘ప్రైవేటుపరం చేయడమే అభివృద్ధా..?’
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువస్తే వాటిని ప్రైవేటుపరం చేయడం అన్యాయమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్స్ సెల్ వింగ్ అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 1923 వైజాగ్ ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటు మొదలుకుని 2024 పాడేరులో మెడికల్ కాలేజీ నిర్మాణం వరకు ఒక్క సీటు, ఒక్క కాలేజీని కూడా చంద్రబాబు తీసుకురాలేదని గుర్తు చేశారు. కాన్నీ అన్నీ తానే తెచ్చినట్లు భజన బృందం చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. పీపీపీ మోడ్ అంటే ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడమేనని వివరించారు. చంద్రబాబుకు ప్రతిదాన్ని ప్రైవేటుకు అప్పగించేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు మంచిచేసే ఆలోచన లేదని దుయ్యబట్టారు. ఇన్ని జరుగుతున్నా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మౌనంగా ఉండిపోవడం తగదన్నారు. ఈ 15 నెలల్లో రాష్ట్రంలో ఉల్లి, టమాటా, మామిడి, పొగాకు రైతులు రోడ్డున పడ్డారన్నారు. పోర్టులు, స్కూల్స్ని పూర్తి చేయాలన్న మనసు లేని మనుషులు కూటమి నేతలని మండిపడ్డారు. ఇదే మాదిరిగా పాలన సాగిస్తే వైఎస్సార్సీపీ ఎలాంటి పోరాటాలకై నా వెనకడుగు వేయదని అన్నారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విజిలెన్స్ ఆరా అరసవల్లి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కీలకమైన డెమో విభాగంపై విజిలెన్స్ దృష్టి సారించింది. మంగళవారం సాక్షిలో ప్రచురితమైన ‘తినేస్తున్నాడెమో’ అన్న కథనంపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. ప్రచార విభాగానికి సంబంధించి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం పై తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో వైద్య ఆరోగ్యశాఖ లో డెమో విభాగ అధికారులతో పాటు కీలక అధికారి కూడా అప్రమత్తమయ్యారని తెలు స్తోంది. విజిలెన్స్ రంగ ప్రవేశం అనంతరం నిధులు బుక్కేసినవారిపై ఉద్యోగుల్లో సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవ శకటం, పలు దినోత్సవాలు, వారోత్సవా ల ప్రచార ఫైల్స్లో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందరి సహకారంతో కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలు టెక్కలి: అందరి సహకారంతో కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేద్దామని టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి కోరారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో మహిళలు, పురుషుల కబడ్డి పోటీలు, ప్రత్యేకంగా హెలీ రైడ్, కొత్తమ్మతల్లి విశిష్టత పై లేజర్ షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 24న కొత్తపేట జంక్షన్ నుంచి శోభయాత్ర ఉంటుందని పేర్కొన్నారు. వారణాశిలో హారతి ఇచ్చే విధంగా అమ్మవారికి హారతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్ వద్ద ఏపీటీఎఫ్ ఆందోళనశ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేదని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు, వేతన సవరణలు, కరువు భత్యం మంజూరు జరగడం లేదన్నారు. డీఏ, పీఆర్సీ పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
‘సిమ్’పుల్గా కొట్టేస్తున్నారు
● వణికిస్తున్న ఈ–సిమ్ స్కామ్ ● జిల్లాలో పెరుగుతున్న బాధితుల సంఖ్య అప్రమత్తంగా ఉండాల్సిందే.. నెట్వర్క్ ప్రొవైడర్ అంటూ వచ్చే ఫేక్ మెసేజ్లు, ఏపీకే లింక్లు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకండి. కంపెనీలు ఇలాంటివి పంపవని గ్రహించాలి. హఠాత్తుగా మన సిమ్ నెట్వర్క్ ఆగిపోతే స్కామ్ అని అనుమానించాల్సిందే. వెంటనే సమీ పంలో ఉండే మీ అకౌంట్లున్న బ్యాంకును సంప్రదించి గానీ బ్యాంక్ కస్టమర్కేర్లో గానీ సమస్య నివే దించి అన్నీ ఫ్రీజ్ చేయించాలి. సిమ్ నెట్వర్క్ కంపెనీని కూడా సంప్రదించాలి. – సీహెచ్ వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం సోంపేటలోని ఓ బ్యాంకు మేనేజర్ ఫోన్ సడెన్గా పనిచేయడం మానేసింది. నెట్వర్క్ సిగ్నల్ ఫెయిల్ అని చూపించింది. అక్కడకు కొద్ది గంటల్లోనే తన ఖాతాలో ఉన్న సొమ్ము మాయమైంది. ఐదు రోజుల్లో దాదాపు రూ. 22 లక్షల వరకు మాయమయ్యాయి. కాశీబుగ్గలో సైతం ఓ బ్యాంకు మేనేజరే తన ఫోన్కొచ్చిన లింక్ క్లిక్ చేశారు. అక్కడికి ఒక రోజు ఆగాక తన సిమ్ బ్లాక్ అయ్యింది. సిమ్ కంపెనీ నెట్వర్క్ ప్రొవైడర్ వద్దకు వెళ్తే ఎం–ఆధార్లో ఆయన బయోమెట్రిక్ లాక్ అయ్యిందని తెలిసింది. వారం రోజుల్లో దాదాపు రూ.14 లక్షల సొమ్ము పోయింది. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో కొత్త తరహా స్కామ్ వెలుగు చూస్తోంది. ‘ఈ–సిమ్’ స్కామ్పై కొద్ది రోజుల్లోనే జిల్లాలో 15కుపైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో కొందరు పోలీసులను ఆశ్రయిస్తుండగా..మరికొందరు భయపడి మిన్నకుండిపోతున్నారు. మోసపోయిన అందరి సిబిల్ స్కోర్ బాగుండటం విశేషం. అసలు ఏంటీ ఈ–సిమ్..? ● ఈ–సిమ్.. అంటే ఎలక్ట్రానిక్ సిమ్. ఫీచర్లు ఎక్కువ ఉండే ఐఫోన్ ఇతరత్రా ఫోన్లలో ఈ–సిమ్లనే వాడుతారు. ● మన ఫోన్లో ఉండే సాధారణ సిమ్ల స్థానంలోనే ఈ–సిమ్ యాక్టివేషన్ అంటూ వాట్సాప్, ఇన్స్ర్ట్రాగామ్, ఇతర మాధ్యమాల ద్వారా నేరస్తులు ఓ లింక్ పంపుతారు. ● ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే సైబర్ నేరస్తుల మెయిల్ ఐడీకి మన సిమ్ నంబర్ లింక్ అవు తుంది. ఓటీపీ వస్తుంది చెప్పండంటూ తక్షణమే వారి నుంచి ఫోన్ వస్తుంది. ● ఓటీపీ చెప్పిన వెంటనే మన ఫోన్లో ఉన్న ఫిజికల్ సిమ్ వారి ఫోన్లో ఉండే ఈ–సిమ్ నంబర్గా యాక్టివేట్ అయిపోతుంది. కొన్నిసార్లు ఓటీపీ అవసరం లేకుండానే ఇదంతా జరుగుతుంది. ● ఈ–సిమ్గా యాక్టివేట్ అయ్యాక మన వద్ద ఉండే సిమ్ నెట్వర్క్ ఆగిపోతుంది. ఫోన్ నంబర్తో లింక్ అయ్యే ఆధార్ కార్డు ఉంటుంది కాబ ట్టి ఎం.ఆధార్ యాప్లోకి వెళ్లి ఓటీపీల ద్వారా బయోమెట్రిక్ లాగిన్ ఓపెన్ చేసి మన ఆధార్ నంబర్ను లాక్ చేసేస్తారు. సమాచారమంతా వారి గుప్పిట్లోకే.. ఒక్కసారి ఈ–సిమ్ యాక్టివేట్ అయితే సమాచారం అంతా వారి గుప్పిట్లోకి వెళ్లిపోతుంది. బ్యాంకు లావాదేవీల ఓటీపీలన్నీ వారికే వెళ్తాయి. వారికి ఇక పాస్వర్డులు, ఏటీఎం కార్డు వివరాల అవసరం ఉండదు. సులభంగా బాధితుల ఖాతాల నుంచి సొ మ్మును లాగేస్తారు. మోసం గ్రహించి నెట్వర్క్ ప్రొవెడర్ వద్దకు వెళ్తే వారం రోజులకు గానీ పని అవ్వదు. ఈలోగా ఖాతా ఖాళీ చేసేస్తారు. -
పక్కా చీటింగ్
అసలే ఎరువులు తక్కువ. ఇస్తున్న చీటీలు ఎక్కువ. ఎంతమందికని ఇవ్వగలం. నాయకులు, డిపార్ట్మెంట్ ఒత్తిళ్లు ఉన్నాయి. వ్యాపారులం ఏం చేయగలం. ఎవరిని ఏం అనలేకపోతున్నాం. – ప్రైవేటు ఎరువుల వ్యాపారి గోడు మొన్నటి వరకు యూరియా కోసం ఒత్తిడి చేసేవారు. దాచి ఇవ్వాలని ఆదేశించేవారు. ఇవ్వకపోతే బెదిరించేవారు. మాట వినకపోతే కక్ష సాధించేవారు. ఇప్పుడే మో స్లిప్పుల కోసం ఒత్తిడి చేస్తున్నారు. తమ వారికే స్లిప్పులు ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. ఒక్కో స్లిప్పులో చెప్పినన్ని బస్తాలు రాయాలని ఒత్తిళ్లు పడలేకపోతున్నాం. – విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ల మనోవేదనిది జగన్ ఉన్నప్పుడు బాగానే ఇచ్చారు. సెక్రటరీలు తెచ్చేవారు. కార్డులు ఒట్టుకెళ్లి విడిపించుకునేవారిమి. ఇప్పుడు జనాల్ని తినేస్తున్నాడు బాబు. రోడ్డు పాలు చేస్తున్నాడు. అంబలి, గంజి లేకుండా చచ్చిపోతున్నాం. స్లిప్పులు తెమ్మంటున్నారు. స్లిప్పు లు తేనిచ్చి.. లైన్లలో తోసేస్తున్నారు. – ఓ మహిళా రైతు ఆవేదన ఇది సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : యూరియా పంపిణీలో అధికా రికంగానే ‘చీటి’ంగ్ జరుగుతోంది. ఎరువుల కోసం ముందస్తుగా పంపిణీ చేస్తున్న చీటీలను తమ వారికే ఇచ్చేలా అధికార పార్టీ నాయకులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వీరి ఒత్తిళ్లు పడలేక సచివాలయ సిబ్బంది వేదనకు గురవుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులందరికీ యూరి యా దొరికేది. ఈ–క్రాప్లో వివరాలు నమోదు చేసుకుని దాని ప్రకారం ఎరువులు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ–క్రాప్ జరగడం లేదు. సాగుపై ఎవరికీ కనీస అంచనా కూడా లేదు. దీంతో కూటమి ప్రభుత్వంలో యూరియా బస్తా దొరికితే చాలు అదే పదివేలు అన్న చందంగా పరిస్థితి మారింది. ఆర్ఎస్కేల్లో, పీఏసీఎస్లలో అధికార పార్టీ నాయకులే యూరియా బస్తాలు పట్టుకుపోతున్నా రని ఏకంగా విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లే(వీఏఏ) వాపోతున్నారు. ఉద్యోగులే రోడ్డెక్కడంతో కలెక్టర్ ఆధ్వర్యంలో కొత్తరకమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రైతు సేవాకేంద్రాలు, ప్రైవేటు దుకాణాలకు వచ్చిన యూరియాను నేరుగా అమ్మకుండా తహసీల్దార్, వ్యవసాయ శాఖాధికారి సంయుక్తంగా సంతకాలు చేసిన చీటీలను పట్టుకెళితేనే యూరి యా ఇవ్వాలని అటు రైతు సేవా కేంద్రాలకు, ఇటు డీలర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఆ చీటీలను పంపిణీ చేసే బాధ్యత సచివాలయాల్లో వీఏఏలకు అప్పగించారు. మళ్లీ అదే పరిస్థితి విధానం మార్చినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఈ చీటీలను తమవారికే ఇచ్చేలా టీడీపీ నాయకులు ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారు. నచ్చినంత యూరియా కావాలని రాయించుకుంటున్నారు. ముఖ్యంగా సాగు చేయని వారు, కౌలుకు ఇచ్చిన రైతుల పేర్లతో చీటీలను రాయించుకుంటున్నారు. అంతేకాకుండా ఒకే ఇంట్లో ఉన్న నలుగురైదుగురిపైన కూడా రాయించుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీఏఏల దగ్గర చీటీలు రాయించుకోవడమే కాకుండా తమ వాళ్లు తీసుకొచ్చిన చీటీలకే ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాపారులపై కూడా ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో సామాన్య రైతుల కు యూరియా దొరకడం గగనమైపోయింది. ఇరకాటంలో వ్యవసాయశాఖ సిబ్బంది.. అటు కూటమి నాయకుల ఒత్తిళ్లకు తట్టుకోలేక, ఇ టు అన్నదాతల బాధలు చూడలేక వ్యవసాయశాఖ సిబ్బంది ఇరకాటంలో పడ్డారు. మనకెందుకులే అని కొంతమంది వీఏఏలు వచ్చినవారందరికీ సీట్లు ఇ చ్చి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ప్రైవేటు వర్తకుల వద్ద చీటీలు ఎక్కువ, యూరియా తక్కువ అన్నట్లు ఉంది పరిస్థితి. అక్కడ కూడా మళ్లీ అధికార పార్టీ నాయకులే చీటీలు చూపించి యూరియాను కొట్టేస్తున్నారు. చిలక్కొట్టుడు.. మే, జూన్, జూలై నెలల్లో ప్రైవేటు డీలర్ల దగ్గర యూరియా కొనుగోలు చేసిన రైతుల వివరాలు వీఏఏల వద్ద లేవు. దీంతో చాలా మంది మళ్లీ యూరియా కోసం వస్తున్నారు. దీనికి తోడు అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారం చీటీలను పట్టుకెళ్లిపోతున్నారు. ఈ చీటీలతో ప్రైవేటు డీలరు వద్ద ఎంఆర్పీ ధరకే యూరియా బస్తాలు కొట్టేసి బ్లాక్లో రూ.400, రూ.500అంతకంటే ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల గ్రామాల్లో దళారీలకు అప్పగించి బహిరంగంగానే అధిక ధరలకు యూరియా అమ్మకాలు చేపట్టిన సందర్భాలపై రైతులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల చేతికే యూరియా చీటీలు కొనసాగుతున్న మరో అధికారిక దోపిడీ వీఏఏలపై ఆగని ఒత్తిళ్లు తమ వాళ్లకే చీటీలు ఇవ్వాలని అధికార పార్టీ నాయకుల హుకుం -
● పాఠశాలను తరలిస్తే సహించేది లేదు
బూర్జ: మండలంలోని అల్లెన గ్రామ ఎంపీయూపీ పాఠశాలను గ్రామంలోనే కొనసాగించాలని, వేరే పాఠశాలకు తరలిస్తే సహించేది లేదని గ్రామ సర్పంచ్ జడ్డు మహేష్తో పాటు పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. దీంతో ఎంఈవోలు ఎన్.శ్యామసుందరరావు, బి.ధనుంజయరావు కలగజేసుకొని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో డీఈవో ఎ.రవిబాబు, డిప్యూటి డీఈవో ఆర్.విజయకుమార్లు వచ్చి గ్రామస్తులకు నచ్చజెప్పారు. పాఠశాలను గ్రామంలో కొనసాగిస్తామని, వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులంతా ఆందోళన విరమించి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ మురపాక శంకరరావు, సరుబుజ్జిలి పోలీసుస్టేషన్ ఎస్ఐ బి.హైమావతి తదితరులు పాల్గొన్నారు. -
బహు భాషా కోవిదుడు రోణంకి
టెక్కలి: బహు భాషా కోవిదుడు రోణంకి అప్పలస్వామి అని సాహిత్య సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు, పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. సోమవారం టెక్కలిలో రోణంకి అప్పలస్వామి 116వ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కవులకు మార్గదర్శకుడు రోణంకి అప్పలస్వామి అని వక్తలు పేర్కొన్నారు. తెలుగు భాషలోని నవలలను ఫ్రెంచ్ భాషలోకి అనువదించడంతో పాటు ఫ్రెంచ్, జర్మనీ, లాటిన్ వంటి భాషల్లో సాహిత్య సంపదను ఖండాంతరాలకు చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి రోణంకి అప్పలస్వామి అని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో జీవి రెడ్డి, సీహెచ్ ప్రభాకరరావు, గుంట లీలావరప్రసాద్, కె.ధనుంజయరావు, ఎస్.వెంకటఅనిల్, బి.అయ్యబాబు, ఆర్.రామచంద్రరావు, డీఏ స్టాలిన్, కె.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
థర్మల్ ప్లాంట్ వద్దంటే వద్దు
బూర్జ: బూర్జ, సరుబుజ్జిలి రెండు మండలాల్లో కూటమి ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన థర్మల్ క్రిటికల్ సూపర్ ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా ఆదివాసీలు ఆందోళనలు చేస్తున్నారు. రెండు మండలాల్లో గిరిజన గ్రామాలైన గోపిదేవిపేట, మసానపుట్టి, బూర్జ మానుగూడ, జంగాలపాడు, బొడ్లపాడు, జేవీ పురం, అనంతగిరిపేట, సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస 1, వెన్నెలవలస 2 తో పాటు 27 గిరిజన గ్రామాల ప్రజలు థర్మల్ ప్లాంట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండు మండలాల్లో సుమారు 1600 ఎకరాల్లో 3200 మెగా వాట్ల విద్యుత్ తయారీకి ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. కానీ అతి ప్రమాదకరమైన ఈ ప్లాంట్ తమ ప్రాంతంలో వద్దే వద్దని గిరిజనులు అంటున్నారు. ప్లాంట్కు వ్యతిరేకంగా భారీగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తోటి గిరిజన గ్రామాల్లో పర్యటించి అవగాహన కల్పిస్తున్నారు. సర్వేలు, బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలని, ఆదివాసీల బతుకులు నాశనం చేయవద్దని కోరుతున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం గానీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఒప్పుకోం. ఈ ప్లాంట్ వస్తే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంటుంది. దాదాపు 20 కిలోమీటర్లు రేడియేషన్ సమస్య ఉంటుంది. గిరిజనులమంతా ఏకతాటిపై ఉంటాం. – బాడంగి సురేష్ దొర, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎదురించి తీరుతాం మాకు తాతల నుంచి వచ్చిన పోడు వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నాం. మా బతుకులు నాశనం చేయొద్దు. – సవర సింహాచలం, అడ్డూరిపేట, బూర్జ నెత్తిన బొగ్గుల కుంపటి వద్దు పవర్ ప్లాంట్ పేరుతో ప్రజల నెత్తిన బొగ్గుల కుంపటి పెట్టవద్దు. ఉద్యోగాలు వస్తాయని జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సోంపేట, కాకరాపల్లిలో పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా ఎందుకు ప్రజలు ఎదురు తిరిగారో చెప్పాలి. – వాబ యోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు థర్మల్ విద్యుత్ ప్లాంట్కు వ్యతిరేకంగా ఆదివాసీల పోరాటం పనులు ఆపకపోతే ఉద్యమ బాట తప్పదని హెచ్చరిక సర్వేలు, బలవంతపు భూసేకరణ వద్దని విన్నపం -
దందా..!
ఫిట్నెస్ పేరుతో శ్రీకాకుళం రూరల్: నగర పరిధిలోని కిమ్స్ రహదారి, జిల్లా వ్యవసాయ కార్యాలయానికి అనుసరించి ఇటీవల ఏర్పాటు చేసిన ఆర్టీఏ కార్యాలయానికి అనుబంధంగా నడుస్తున్న ఫిట్నెస్ సెంటర్ (గవర్నమెంట్ అప్రువుడ్ ఆటోమేటిడ్ టెస్టింగ్ స్టేషన్)లో అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రతీ వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలనే ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి తొక్కి ఆయా వాహనాలకు కమీషన్లు తీసుకుంటూ సర్టిఫికెట్లు అందిస్తున్నారు. ముక్కుపిండి వసూళ్లు జిల్లాలోని ట్రాన్స్పోర్టు, నాన్ ట్రాన్పోర్టు వాహనాలకు సంబంధించి ఇక్కడ నుంచే ఫిట్నెస్ సర్టిఫికెట్ను జారీ చేస్తారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం కారు, బస్సు, ఆటో, లారీ ఏ వాహనమైనా ప్రభుత్వానికి కట్టాల్సిన చలానా కేవలం రూ.1,000 నుంచి రూ.2,000ల లోపు ఉంటుంది. కానీ ఇక్కడ ఏజెంట్లకు మాత్రం ఆయా వాహనాలకు సుమారు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు కమీషన్ ముట్టజెప్తేనే లోపలికి అనుమతి ఇస్తారు. లేదంటే వాటిని గేటు నుంచి వెనక్కి పంపేస్తారు. పొరపాటున ఎవరైనా రికమెండేషన్ ద్వారా కేవలం ప్రభుత్వ చలానా మాత్రమే తీసి టెస్టింగ్కు పంపిస్తే మాత్రం, లేనిపోని కారణాలు చెప్పి ఫిట్నెస్ ఫెయిల్ చేసిన సందర్భాలు కూడా కోకొల్లలు. గంటల కొద్దీ నిరీక్షణ కొన్నేళ్ల క్రితం వరకు ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలంటే క్షణాల్లోనే ఇచ్చేవారు. ఆయా వాహనాలకు సంబంధించిన కాగితాలు చూసి ఆర్టీఏ సిబ్బంది వాహనాన్ని డ్రైవింగ్ చేసి పంపేవారు. కానీ ప్రస్తుతం ఫిట్నెస్ కేంద్రంలో ఏదైనా వాహనం లోపలికి వెళ్తే మాత్రం గంటల కొద్దీ నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఉదయం వెళ్లిన బండ్లు సాయంత్రానికే తిరిగి వస్తాయి. దీంతో సహనం కోల్పోతున్న వాహన డ్రైవర్లు ఫిట్నెస్ కేంద్ర సిబ్బందితో వాగ్వివాదం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతా ఏజెంట్ల సమక్షంలోనే... గత ప్రభుత్వంలో ఆర్టీఏ పనులు వాహన్ యాప్లో, స్థానిక సచివాలయంలోనూ త్వరితగతిన జరిగేవి. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఏజెంట్లతోనే అంతా కమీషన్ పద్ధతిలో ఫిట్నెస్ కేంద్రంలో జరగడం గమనార్హం. ప్రతీ ఫైల్కు ఒక్కో రేటు పెట్టి ఆ రేటును ఏజెంట్లకు ముట్టజెప్పితేనే బండికి ఫిట్నెస్ అందిస్తారు. ఇంత వ్యవహారం జరుగుతున్నా నియంత్రించాల్సిన ఆర్టీఏ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తనట్లు ఉంటున్నారని వాహన డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ ఇస్తేనే సర్టిఫికెట్ మంజూరు ఒక్కో వాహనానికి ఒక్కో రేటు ఫిక్స్ అంతా ఏజెంట్లుతోనే నడుస్తున్న వైనం పట్టించుకోని ఆర్టీఏ అధికారులు అదనంగా రూ.3 వేలు నేను ఎస్పీ కార్పొరేషన్ ద్వారా కారు లోను తీసుకున్నాను. నాది టాక్సీబోర్డు. రెండు రోజులు క్రితం ఫిట్నెస్ చేయించాను. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చలానా రూ.1,000లు తీశారు. కానీ ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు చేయడానికి అదనంగా మరో రూ.3 వేలు కేంద్రంలోని సిబ్బందికి ముట్టజెప్పాల్సి వచ్చింది. – టి.శ్రీనివాసరావు, పొందూరు మా చేతిలో ఏమీ లేదు ఒకప్పుడు వాహనానికి ఫిట్నెస్లు మా ఆర్టీఏ పరిధిలో ఉండేవి. ఇప్పుడు అంతా ప్రైవేటుపరం అయ్యింది. దీంతో మా చేతిలో ఏమీ ఉండడం లేదు. వాహన ఫిట్నెస్కు సంబంధించి చాలా మంది డ్రైవర్లు, వాహన యజమానుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని చేరవేశాం. – ఎ.విజయసారథి, ఉప రవాణా శాఖాధికారి, శ్రీకాకుళం -
గంజాయి తెగులు..!
● చిక్కోలుకు...● చాపకింద నీరులా విస్తరిస్తున్న వైనం ● ఇతర ప్రాంతాల్లోని యూనివర్సిటీలు, స్టడీ సెంటర్లలో విక్రయం ● ఇటీవల దొరికిన 10 మంది నిందితులు శ్రీకాకుళం క్రైమ్/రణస్థలం: ఒడిశాలో పుట్టిన గంజాయి వనం.. సిక్కోలు జిల్లాలో విస్తరిస్తోంది. ఈ గంజాయి ప్రముఖ యూనివర్సిటీలు, కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లలో చదువుకునే విద్యార్థులే లక్ష్యంగా చేరుతోంది. ఒడిశా సాగుదారుని నుంచి రూ.1,500లు, రూ.2,000ల ధరకు కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో డిమాండ్ ఆధారంగా రూ.50 వేల వరకు అమ్ముతున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. సరదాగా గంజాయి తాగడంతో మొదలవుతున్న జీవితాలు దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు, హత్యాయత్నాలు, హత్యలు చేసే స్థాయికి దిగజారుతున్నాయి. దీంతో అనేక కుటుంబాలు తీవ్ర వేదనకు గురవుతున్నాయి. తాజాగా జేఆర్పురం పోలీసులకు పట్టుబడిన 10 మంది నిందితుల్లో ఐదుగురిని విచారించగా దీని వెనక పెద్ద లింకే ఉందని తెలుస్తోంది. ప్రధానంగా కళాశాలలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్ల వద్ద విద్యార్థులను టార్గెట్గా చేసుకొని భారీ ధరలకు విక్రయాలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. సీఐ ఎం.అవతారం పర్యవేక్షణలో ఎస్ఐ చిరంజీవి ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో.. పట్టుబడిన పదిమంది నిందితుల్లో ఐదుగురు కొనుగోలుదారులు కాగా.. మరో ఐదుగురు కొనుగోలు చేయడంతో పాటు వాటిని సరఫరా చేసేవారిగా ఉన్నారు. అందరూ పాతికేళ్లలోపు యువకులే. వీరిలో ఎచ్చెర్ల మండలం కుశాలపురానికి చెందిన బగాన పవన్కుమార్దే కీలక పాత్ర. ఒడిశా రాష్ట్రం కొరాపూట్ జిల్లా పొత్తంగికి చెందిన గుంత శుక్ర వద్ద కిలో గంజాయి రూ.7 వేల లెక్కన ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి, పట్టుబడిన మిగతా నిందితులతో పాటు తన నెట్వర్క్లో ఉన్నవాళ్లకు సరఫరా చేస్తుంటాడు. గంజాను ప్యాకెట్లుగా విడదీసి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రం బెంగుళూర్ వరకు వ్యాపారం చేసేందుకు కూడా వెళ్తాడు. కిలో రూ.7 వేలకు తనకొచ్చే గంజాయిని రూ.10 వేలు నుంచి రూ.15 వేల వరకు జిల్లాలో అమ్ముతాడు. బెంగుళూర్, హైదరాబాద్ల్లో అయితే రూ. 25 వేలు నుంచి రూ. 30 వేలు వరకు అమ్ముతాడు. ఇతని తర్వాత విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొత్త కొప్పెర్లకు చెందిన ఇనకోటి ముకుంద సహాయకారిగా ముఖ్యపాత్ర పోషిస్తాడు. ఒడిశాకు పవన్తో పాటు వెళ్లడం, మాల్ తీసుకొని వచ్చి వారి గ్రామం, చుట్టుపక్కల గ్రామస్తులకే కాకుండా విజయవాడ వరకు వెళ్లి ముఖ్య ప్రాంతాల్లోని కొన్ని యూనివర్సిటీలు, కళాశాలల విద్యార్థులకు కొందరిని లింక్గా చేసుకుని విక్రయాలు చేస్తాడు. ముగ్గురు మిత్రులు శ్రీకాకుళం పెద్దరెల్లివీధికి చెందిన తుపాకుల అనిల్కుమార్ విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెంలో చదువుకుంటున్నాడు. ఇతను బగాన పవన్ దగ్గర గంజా కొనుక్కొని తాటిచెట్లపాలెంలో ఫ్రెండ్స్కు అమ్ముతుంటాడు. అలాగే ఎచ్చెర్ల సాయినగర్కు చెందిన లక్కవరపుకోట పవన్కుమార్, జోగేంద్రప్రసాద్లు మిత్రులు కావడంతో వారితో కలిసి గంజాయి సేవించడం చేస్తుంటాడు. ఆపై తమ తమ గ్రామాల్లో, వేరే గ్రామాల్లోని ఫ్రెండ్స్కు గంజాను అధిక రేటుకు అమ్ముతుంటారు. ఆ ముగ్గురూ దొరికితే.. అయితే పోలీసుల దర్యాప్తులో పట్టుబడిన నిందితులు మరో ముగ్గురి పాత్రపై గుట్టువిప్పారు. వీరిలో శ్రీకాకుళం నగరానికి చెందిన బగాన సౌమిత్ హైదరాబాద్లో కాంపిటేటివ్ కోర్సుకై కోచింగ్ నిమిత్తం వెళ్లాడని, అక్కడ ఒక ప్రముఖ యూనివర్సిటీలో విద్యార్థులకు గంజాను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఎచ్చెర్లకు చెందిన మరో యువకుడు మొదలవలస సందీప్ బెంగుళూర్లో చదువుతున్నాడని, అక్కడ డిగ్రీ, ఇంజినీరింగ్ చదివే విద్యార్థుల కోచింగ్ సెంటర్ల వద్దకు వెళ్లి గంజా అమ్ముతుంటాడు. వీరిరువురూ అక్కడుండే డిమాండ్ ఆధారంగా కిలో గంజాయిని చిన్న, చిన్న ప్యాకెట్లుగా చేసి సుమారు కిలో రూ.50 వేలు పైబడి అమ్ముతారు. శ్రీకాకుళం ఇంటికి వచ్చినప్పుడు బగాన పవన్కుమార్ వద్ద రెండు కిలోల నుంచి నాలుగు కిలోల వరకు కొనేసి హైదరాబాద్, బెంగుళూర్ పట్టుకుపోతారు. కొన్నిమార్లు ఒడిశా కూడా వెళ్లి కొంటారు. మరో కీలక యువకుడు జోగేంద్రప్రసాద్ బగాన పవన్కుమార్తో కలిసి బెంగుళూర్ తరచూ మాల్ పట్టుకు వెళ్తుంటాడని, ఫ్రెండ్ సర్కిల్తో దూకుడుగా ఉంటూ ఎచ్చెర్ల పరిసరాల్లో గట్టిగా గంజా తాగి హల్చల్ చేస్తుంటాడని చెబుతున్నారు. వీరి ముగ్గురిని పట్టుకుంటే వెనకుండే మరికొన్ని లింక్లు దొరకొచ్చనే భావనలో పోలీసులున్నారు. చిత్ర విచిత్ర పేర్లతో.. గంజాయి విక్రయాలు, కొనుగోళ్లలో వీరిని చిత్ర, విచిత్ర పేరులతో పిలుస్తుంటారు. ఒడిశాకు చెందిన గుంత శుక్ర మారుపేరు భత్రి కాగా, జోగేంద్రప్రసాద్ మారుపేరు డ్యానీ, పట్టుబడిన కొనుగోలుదారుల్లో ఆళ్లవెంకటరావు మారుపేరు కొత్త సైకిల్, సురవరపు ప్రసాద్ మారుపేరు డీజేలుగా చెబుతున్నారు. -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
● జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ● మీకోసంలో 81 అర్జీలు స్వీకరణ ● వెలుగు డీఆర్డీఏ పలాస మండలం బ్రహ్మణతర్ల క్లస్టర్లో పనిచేస్తున్న దళిత కుటుంబానికి చెందిన ఇప్పిలి ధనలక్ష్మిని వజ్రపుకొత్తూరు మండలం ఏపీఎం ప్రసాదరావు వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా 81 అర్జీలను స్వీకరించారు. అర్జీలు స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో ఎల్ఎన్వీ శ్రీధర్రాజ పాల్గొన్నారు. అర్జీలను పరిశీలిస్తే... ● ప్రభుత్వం పేద దళిత కుటుంబాలకు ఉచిత కరెంట్ పథకం ఇస్తున్నప్పటికీ.. విద్యుత్ శాఖ అధికారులు ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా డబ్బులను తీసుకుంటున్నారని గార మండలానికి చెందిన కె.మల్లేశ్వరరావు ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో సుమారుగా 200 దళిత కుటుంబాలు ఉన్నాయని, వారి నుంచి అనధికారికంగా డబ్బులు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ● ఎల్ఎన్పేట మండలంలోని మోదిగవలస గ్రామంలో గ్రామ సరిహద్దులో ఉన్న సుమారు 175 ఎకరాల జిరాయితీ భూమిని రెవెన్యూ అధికారులు రీసర్వేలో గ్రామ కంఠంగా మార్చేశారని ఆ గ్రామానికి చెందిన రైతుల ఫిర్యాదు చేశారు. ● ఎచ్చెర్ల మండలం డి.మత్యలేశంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణం చేయడం జరిగిందని, ఆ గదులు ఉన్న స్థలాన్ని రెవెన్యూ రికార్డుల్లో పాఠశాల స్థలంగా మార్పులు చేయాలని పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు కోరారు. ● జిల్లాలోని రైతులకు సకాలంలో యూరియా తదితర ఎరువులు అందజేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు కోరారు. యూరియాను అధిక ధరలకు కూటమి నాయకులు అమ్ముకుంటున్నారన్నారు. -
ఘనంగా ఇంజినీర్ల దినోత్సవం
అరసవల్లి: స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయం వద్ద పీఆర్ ఇంజినీర్ల సంఘం ఆధ్వర్యంలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకొని ఇంజినీర్ల దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో సుమారు 50 మంది ఇంజినీర్లు, సిబ్బంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ డాక్టర్ పి.జగన్మోహనరావు, పీఆర్ డిప్లమో ఇంజినీర్ల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి, పీఆర్ ఎస్ఈ కె.వీరన్నాయుడు, ఈఈలు ఎస్.రామకృష్ణ, జి.ప్రదీప్కుమార్, జి.రవి, జిల్లా డిప్లమో ఇంజినీర్ల సంఘ ప్రతినిధులు ఎం.పోలినాయుడు, ఎస్.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
సివిల్ సర్వీస్ను కెరీర్గా ఎంచుకోవాలి
ఎచ్చెర్ల: విద్యార్థులు సివిల్ సర్వీస్ను కెరీర్గా ఎంచుకోవాలని జీఎస్టీ పన్నుల విభాగం (విశాఖపట్నం) డిప్యూటీ కమిషనర్ డి.డేవిడ్ అనిల్ కుమార్ సూచించారు. స్థానిక బీఆర్ఏయూ సెమినార్ హాల్లో రీసెర్చ్ ఫారం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫ్రమ్ ప్రొఫెషనల్ టు పాలసీ మేకర్స్ – సివిల్ సర్వీస్ ఏ కెరీర్ ఆప్సన్ అనే అంశంపై ప్రసంగించారు. డిగ్రీ కనీస అర్హత ఉన్నవారు సివిల్ సర్వీస్ పరీక్షను రాసేందుకు అర్హులని పేర్కొన్నారు. సివిల్ సర్వీస్ కెరీర్ ఎంతో ఉన్నతమైన కెరీర్ అని, ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా ప్రజలకు చేరువుగా ఉండవచ్చన్నారు. అనంతరం డేవిడ్ అనిల్ కుమార్ను వీసీ కేఆర్ రజనీ తదితరులు సత్కరించారు. వ్యక్తిపై కేసు నమోదుమెళియాపుట్టి: తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్స్టేషన్లో సోమవారం సాయంత్రం కేసు నమోదయ్యింది. ఎస్ఐ పిన్నింటి రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు.. దీనబంధుపురం గ్రామ పంచాయతీ చింతల పోలూరు గ్రామానికి చెందిన ఒక మహిళ పొలం గట్లపై నుంచి నడిచి వస్తుండగా.. ఎగువ చింతలపోలూరు గ్రామానికి చెందిన సవర రవి అనే వ్యక్తి ఆమైపె అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ ప్రతిఘటించగా ఆమెను కొట్టి గాయపరిచినట్లు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మహిళ ఆత్మహత్య రణస్థలం: మండలంలోని మురపాక పంచాయతీ టి.బి.నగర్ కాలనీకి చెందిన పొట్నూరు వెంకటరత్నం (54) అనే మహిళ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు లావేరు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఉన్నటువంటి గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మృతురాలికి భర్త శ్రీనివాసరావు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఎస్ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆటో ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు శ్రీకాకుళం క్రైమ్: గుర్తు తెలియని ఆటో ఢీకొనడంతో గార మండలం సానివాడకు చెందిన ముద్దాడ అప్పలరాజు (44)కు తీవ్ర గాయాలయ్యాయని ట్రాఫిక్ ఎస్ఐ మెట్ట సుధాకర్ సోమవారం తెలియజేశారు. అప్పలరాజు పెద్దపాడు రామిగెడ్డ సమీప వైన్షాపులో వెయిటర్గా పనిచేస్తున్నాడన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పదిన్నర ప్రాంతంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, అరసవల్లి ఆలయ ఆర్చి సమీప పెట్రోల్ బంక్ వద్ద గార వైపు నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో అప్పలరాజు తలకు, కాళ్లకు బలమైన గాయాలయ్యాయని, వెంటనే 108లో రిమ్స్ ప్రభుత్వాస్పత్రికి తరలించారన్నారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలోనే అప్పలరాజు ఉన్నట్లు వెల్లడించారు. క్షతగాత్రుని సోదరుడు సింహాచలం సోమవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): గాండ్ల తెలుకుల కార్పొరేషన్ ఏర్పాటుకు రాజకీయాలకు అతీతంగా గాండ్ల తెలుకుల సామాజిక వర్గమంతా కృషి చేయాల్సిన అవసరం ఉందని అఖిల గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గ్రోసు సుబ్బారావు పిలుపునిచ్చారు. నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో అఖిల గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశం శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షుడు కొమనాపల్లి లక్ష్మణ్ ప్రసాద్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో అనేక సామాజిక వర్గాలకు కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ, గాండ్ల తెలుకుల సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. తమకన్నా జనాభా తక్కువ కలిగిన సామాజిక వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వామ్యులయ్యారని, తమనెందుకు చిన్నచూపు చూస్తున్నారో చెప్పాలని మండిపడ్డారు. అమరావతిలో త్వరలో గాండ్ల తెలుకుల సామాజికవర్గం శంఖారావం కార్యక్రమం చేపట్టి తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గౌనివాణి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా మధుసూదన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరవ అనంతం, కార్యవర్గ ప్రతినిధులు గిద్దలూరు ప్రభాకర్రావు, గార్లదిన్నె నాగరాజు, బచ్చల పుల్లయ్య, తిరుపతి హరి గోపాల్, అంబటి గురుమూర్తి, డాక్టర్ కల్లేపల్లి కూర్మనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
కొండకు గుండు
● కొండకుంకాంలో అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు ● రెండు రోజులుగా ఇదే తంతు రణస్థలం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు చేస్తున్న అడ్డగోలు గ్రావెల్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. లావేరు మండలంలోని కొండకుంకాం గ్రామంలో సర్వే నంబర్ 1లో 374 ఎకరాల గ్రావెల్ కొండ ఉంది. ఇందులో కొంతమందికి డీ–పట్టాలు మంజూరు చేసి ఉన్నారు. అధికారంలోకి రాగానే ఈ కొండపై కూట మి నాయకుల కన్ను పడింది. ఆదివారం రాత్రి నుంచి పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, జేసీబీతో కొండ గ్రావెల్ను కొల్లగొడుతూనే ఉన్నారు. సోమవారం స్థానికులు మీడియాకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు వెళ్లి చూసే సరికి.. సగం కొండను మాయం చేసేశారు. వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా వాళ్లు అక్కడి దృశ్యాలు చూసి విస్మయం చెందారు. గ్రామ రెవెన్యూ అధికారుల పాత్రపై అనుమానం కొండకుంకాం రెవెన్యూ పరిధికి చెందిన గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ ఇద్దరూ ఒకే రోజు సెలవు పెట్టడంపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో గ్రావెల్ తరలిస్తున్నా పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సోమవారం మధ్యా హ్నం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పైడి హారతి, ఇతర రెవెన్యూ అధికారులు కొండను సందర్శించి వివరాలు సేకరించారు. -
● ‘పాఠశాలల రక్షణ కోసమే రణభేరి’
శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల రక్షణ కోసం, విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ రణభేరి జాతర కార్యక్రమం జరుగుతుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం పలాస కేంద్రంలో బస్టాండ్ దగ్గర రణభేరి కార్యక్రమాన్ని డప్పు మోగించడం ద్వారా ప్రారంభించారు. శ్రీకాకుళంలో యూటీఎఫ్ కార్యాలయం వద్ద ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. టీచర్లకు అదనపు పనులు చెప్పడం సరికాదన్నారు. పిల్లలకు అక్షరం నేర్పించే సమయం కూడా ఇవ్వడం లేదని అన్నారు. పలాసలో పోలీసులు కార్యక్రమానికి విఘాతం కలిగించడం సరికాదన్నారు. ఈ రణభేరి ప్రచార జాత సెప్టెంబర్ 25న గుంటూరు పట్టణంలో ముగుస్తుందని తెలిపారు. -
వలస వెళ్లిన మనిషి తిరిగి రాలేదు
● ఎస్పీ గ్రీవెన్స్ సెల్లో విన్నవించిన మహిళ ● నాలుగేళ్లుగా భర్త జాడ తెలియడం లేదని ఆవేదన ● గ్రీవెన్స్సెల్కు మొత్తం 55 ఫిర్యాదులుశ్రీకాకుళం క్రైమ్ : ప్రతి సోమవారం నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు ఈ వారం ఓ అరుదైన వినతి వచ్చింది. నాలుగేళ్లుగా భర్త జాడ తెలియక నరకయాతన పడుతున్న మహిళ తన పెనిమిటి జాడ కనుక్కుని చెప్పాలని ఎస్పీని వేడుకున్నారు. వలస వెళ్లిన మనిషి నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. వజ్రపుకొత్తూరు మండలం పెద్దబొడ్డపాడు పంచాయతీ కొల్లిపాడుకు చెందిన పుచ్చ అనసూయమ్మ సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్స్సెల్కు హాజరయ్యారు. తన భర్త పుచ్చ కూర్మారావు జాడ నాలుగేళ్లుగా తెలియరావడం లేదని ఆమె ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ముందు మొర పెట్టుకున్నారు. 2014 నుంచి సౌదీఅరేబియాకు తన భర్త వలస వెళ్లే వారని, చివరి సారిగా 2021లో కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలోని దమ్మంలో ఏఎల్–మాష్రిక్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీకి వెళ్లారని, అప్పటి నుంచి ఆయన గురించి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఎంబసీలో కూడా దీనిపై ఫిర్యాదు చేశామన్నారు. పలుమార్లు వజ్రపుకొత్తూరు పోలీస్స్టేషన్కు తిరుగుతున్నా పట్టించుకోలేదని, మీరైనా జాడ కనుగొని చెప్పాలని ఎస్పీ వద్ద బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ● ఈ వారం గ్రీవెన్స్కు 55 ఫిర్యాదులు అందాయి. ● పొందూరు మండలం వీఆర్ గూడేనికి చెందిన సువ్వారి సన్యాసమ్మ తన ఇంటిలో జరిగిన దొంగతనం కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ● తనపై జరిగిన దాడి కేసులో సాక్షులుగా ఉన్న వారిని బెదిరిస్తున్నారని శ్రీముఖలింగానికి చెందిన పూజారి నాయుడు గారి రాజశేఖర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేసినా బైండోవర్ చేయడం లేదని తెలిపారు. ● ఓ ఫైనాన్స్ వ్యాపారి తన చెక్కును దుర్వినియోగం చేసి తన బ్యాంకు ఖాతా నుంచి రూ. 45 వేలు కాజేశాడని, న్యాయం చేయాలంటూ శ్రీకాకుళంలోని బలగకు చెందిన కె.రామారావు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ● శ్రీకాకుళం సబ్డివిజన్కు చెందిన ఓ ఇంజినీరింగ్ యువకుడు ఆన్లైన్ ట్రేడింగ్లో రూ. 15 లక్షలు నష్టపోయానని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. -
సమ్మెకు సన్నద్ధం
తీవ్ర పనిభారం, ఒత్తిళ్లతో పాటు ఇంటింటికీ వెళ్లి విధులు నిర్వర్తించే విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ ప్రతినిధులంతా ప్రభుత్వ పెద్దలకు వినతిపత్రాన్ని అందించారు. ఈ మేరకు 15 రోజుల్లోగా డిమాండ్లు నెరవేర్చకపోతే వచ్చే నెల 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతాం. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నేతలను కూడా కలిసి వారి సలహాసూచనల ప్రకారం ముందుకు వెళ్తాం. – కూన వెంకట సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ -
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పెద్దమడి విద్యార్థులు
మెళియాపుట్టి: జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పెద్దమడి ప్రభుత్వ గురుకుల జూనియర్ కళాశాల నుంచి ఆరుగురు విద్యార్థులు పాల్గొనగా ఇద్దరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు సోమవారం ప్రిన్సిపా ల్ లక్ష్మునాయుడు, వైస్ ప్రిన్సిపాల్ రామానంద్, పీడీ లక్ష్మణమూర్తి తెలిపారు. అండర్ 18 విభాగంలో లాంగ్ జంప్లో ఎం.కృపాసింధు, 110 హడిల్స్ మీటర్లలో బి.గోవింద్ ప్రథమస్ధానంలో నిలిచి అంతర్ రాష్ట్ర క్రీడా పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. -
కేంద్రమంత్రి ప్రజల పక్షమా.. కార్పొరేట్ పక్షమా?
మందస: కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయు డు ప్రజల పక్షమా, కార్పొరేట్ పక్షమా స్పష్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ నిలదీశారు. కార్గో ఎయిర్పోర్టు పేరుతో ప్రజల ఆస్తులను కార్పొ రేట్ ఆస్తులుగా ఎందుకు మార్చడానికి చూస్తున్నారని ప్రశ్నించారు. మందస మండలం బాహడపల్లిలో బలవంతపు భూ సేకరణ ఆపాలని, కార్గో ఎయిర్ పోర్టు రద్దు చేయాలని ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, జోగి అప్పారావు ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ చేశారు. ఢిల్లీలో కార్గో ఎయిర్పోర్టుకు 150 ఎకరాలు మాత్రమే ఉన్నాయని, ఇక్కడ 1400 ఎకరాలు ఎందుకని అడిగా రు. కార్యక్రమంలో పొట్టి ధర్మారావు, హేమంత్ రావు, కుసుమ, కృష్ణారావు, జగన్, బాలకృష్ణ, పరశురాం, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ‘మా ఎరువులు ఎటు పోతున్నాయి..?’ సరుబుజ్జిలి: తమకు రావాల్సిన కోటా ఎరువు లు అందించకుండా ఇతర ప్రాంతాలకు ఎలా తరలిస్తున్నారని పెద్దవెంకటాపురం, చినవెంకటాపురం, పాలవలస, రావివలస గ్రామాలకు చెందిన పలువురు రైతులు సోమవారం రావివలస ఆర్ఎస్కే వద్ద అధికారులను ప్రశ్నించా రు. ఎరువు పంపిణీ సక్రమంగా లేదని రైతులు ఆగ్రహించారు. తమకు నచ్చినవారికి ఇళ్ల వద్దనే టోకెన్లు జారీ చేస్తున్నారని, దీని వల్ల క్యూలో ఉన్న రైతులకు ఒక్క బస్తా కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీలమణి దుర్గ హుండీ ఆదాయం రూ.3.14లక్షలు పాతపట్నం: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణి దుర్గ అమ్మవారి హుండీ కానుకల ద్వారా రూ.3,14,385 లక్షలు ఆదాయం లభించిందని ఆలయ ఈఓ టి.వాసుదేవరావు తెలిపారు. 39 రోజులకు ఈ ఆదాయం వచ్చిందన్నారు. ఆలయ హుండీని సోమవారం లెక్కించామని, టెక్కలి గ్రూపు దేవాలయాల కార్యనిర్వహణాధికారి టీపీ మనస్వి పర్యవేక్షించారన్నారు. కార్యక్రమంలో ఆలయ గుమస్తా సుదర్శన్, శ్రీ వేంకటేశ్వర స్వామి సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
తినేస్తున్నాడెమో..!
అరసవల్లి: అది వైద్యారోగ్య శాఖ. అందులో ఓ విభాగం పేరు డెమో. అంటే జిల్లా మాస్ మీడియా, విస్తరణ విభాగం. అందులో ఓ అధి కారి అంతా తానై వ్యవహరిస్తూ ప్రభుత్వ నిధులు తినేస్తున్నాడేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దినోత్సవాలొస్తే పండుగే జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖకు చెందిన ఏ దినోత్సవ ఏర్పాట్లు, ప్రచార నిర్వహణ అయినా ఈ డెమో విభాగానికి పండగే. వార్షిక బడ్జెట్ కేటాయింపుల ప్రాప్తికి బిల్లులు పెట్టేసి ఎంచక్కా నిధులను మింగేస్తున్నారు. చిన్నపాటి అవగాహన కార్యక్రమా నికై నా కరపత్రాల పంపిణీ, పత్రికల ప్రకటనలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు పేరిట రూ.లక్షల్లో ప్రభుత్వ నిధులు ఆ అధికారి జేబుల్లోకి వెళ్తున్నాయనే ఆరోపణలున్నాయి. శాఖకు సంబంధించిన పలు దినో త్సవాలు, కార్యక్రమాలు జరిగే సందర్భాల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద, సచివాలయాల వద్ద కరపత్రాలను అంటించాలి, బ్యానర్లు పెట్టించాలి. అయితే ఇలాంటి చర్యలేవీ జిల్లాలో కానరావడం లేదు. కానీ బడ్జెట్ కేటాయింపులు మాత్రం జరిగిపోతున్నాయి. ఈ అధికారి తన బృంద సిబ్బంది సహకారంతో తప్పుడు బిల్లులు, నకిలీ బిల్లులు ఫోర్జరీ సంతకాలతో రశీదులు చూపించి బిల్లులు చేయించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన జనాభా దినోత్సవానికి ప్రభుత్వం రూ.లక్ష కేటాయిస్తే వేసక్ట్టమీ ఆపరేషన్లు చేయించుకున్నవారికి ప్రోత్సాహంగా రూ.55 వేలు కేటాయించగా మిగిలిన మొ త్తాన్ని దినోత్సవ ఏర్పాట్లు పేరిట బిల్లులు పెట్టేశా రు. డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి పాత బ్యానర్తోనే పలు ప్రైవేటు నర్సింగ్ విద్యార్థులతో ర్యాలీ చేసి బిల్లులు చేసుకున్నారు. తనిఖీల పేరిట రూ.లక్షల్లో వసూలు జిల్లాలో అన్ని ప్రైవేటు క్లినిక్లు, ల్యాబ్లను ఈ డెమో బృందమే తనిఖీ చేస్తుంది. ఇలా తనిఖీల పేరిట ఒక్కో ఆస్పత్రి, ల్యాబ్ల నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. ఇందులో జిల్లా శాఖకు చెందిన కీలక అఽధికారికి కూడా వాటా ఇస్తుండడంతో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే క్లీన్చిట్ వస్తోంది. బెడ్లను బట్టి ఒక్కో నర్సింగ్ హోం నుంచి సుమా రు రూ.50 వేల వరకు, ల్యాబ్ల నుంచి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. ఐవీఎఫ్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్లయితే అడిగినంత ఇవ్వాల్సిందే. వైద్యారోగ్య శాఖలో అక్రమాలకు కేంద్రంగా ‘డెమో’ విభాగం పలు దినోత్సవాల ప్రచారాల పేరిట దోపిడీ ప్రతి నెలా తనిఖీల పేరిట రూ.లక్షల్లో వసూలు చేస్తున్న విభాగాధికారి -
ఆశలపై నీరు.. రైతన్నకు కన్నీరు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శివారుకు అందని సాగునీరు, పూడికలు తీయని కాలువలు, ఆధునికీకరణకు నోచుకోని ప్రాజెక్టులు.. జిల్లాలో సాగునీటి నిర్వహ ణ తీరు ఇది. పాలకుల నిర్లక్ష్యానికి తోడు సిబ్బంది కొరత కూడా సాగునీటి నిర్వహణకు శాపంలా మారింది. జిల్లాలో సాగునీటి వనరుల సద్వినియోగానికి వైఎస్ రాజశేఖర రెడ్డి వంశధార ఫేజ్–2, స్టేజ్–2 పనులు చేసేందుకు శ్రీకారం చుట్టారు. పనులు వేగంగా జరిగేందుకు బీఆర్ఆర్ వంశధార సర్కిల్, ఇరిగేషన్ సర్కిల్స్ని ఏర్పాటుచేసి దానికి ఎస్ఈలను నియమించారు. వీరు ప్రాజెక్టుల పనులను పరిశీలించడంతో పాటు పలు పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అప్పగించాలి. శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి డివిజన్లలలో ఉండే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డీఈలు, ఏఈలు, జేఈలతో పాటు అటెండర్లు, లస్కర్లను పర్యవేక్షించే బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది. కానీ ఇక్కడ రెగ్యులర్ ప్రాతిపదికన ఎస్ఈ పనిచేయడం అన్నది దాదాపు అసాధ్యమైపోయింది. ఎవరూ పట్టుమని పదిరోజులు కూడా ఉండడం లేదు. నిరంతరం వంశధార సర్కిల్ ఎస్ఈ గది, కుర్చీ ఖాళీగానే దర్శనం ఇస్తుండడం గమనార్హం. సర్కిల్ ఎస్ఈని నియమించరా..? జిల్లాలో వంశధార సర్కిల్ ఎస్ఈగా పనిచేసిన డోల తిరుమలరావును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కక్షసాధింపు చర్యలో భాగంగా వేరే జిల్లాకు బదిలీ చేశారు. ఆ తర్వాత వంశధార సర్కిల్లో డిప్యూటీ ఎస్ఈగా ఉన్న స్వర్ణకుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొన్నాళ్లు విధు లు నిర్వహించిన అనంతరం టెక్కలి నియోజకవర్గానికి చెందిన ఇంజినీర్ తిరుపతిరావును రిటైర్మెంట్కి ముందు మూన్నాళ్ల ముచ్చటగా తీసుకొచ్చారు. ఆయన మేలో రిటైరయ్యారు. ఆ తర్వాత స్వర్ణకుమార్కి మళ్లీ బాధ్యతలు అప్పగించారు. ఆయన టీటీపీఆర్ ఎస్ఈగా పదోన్నతిపై వెళ్లిపోయారు. అయినప్పటికి మళ్లీ వదలకుండా ఆయనకే వంశధా ర ఎస్ఈగా, నార్త్కోస్ట్ సీఈగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. దీంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీ కాకుళం మూడుచోట్ల తిరగలేక మెడికల్ లీవ్పై మూ డు నెలలు వెళ్లిపోయారు. అప్పుడు ఏకంగా రాజమండ్రిలోగల ధవళేశ్వరం ప్రాజెక్టు సర్కిల్ ఎస్ఈగా ఉన్న కర్నా శ్రీనివాసరావుకి అదనపు బాధ్యతలు అప్పగించారు. 350 కిలోమీటర్ల దూరం నుంచి వ చ్చే సరికే సాయంత్రం అయిపోతోంది. పనులు పరిశీలించడం, ఫైల్స్ చూడడం అసాధ్యమైపోతోంది. ఇక్కడ అర్హులే లేరా..? జిల్లాలో ఎంతోమంది సీనియర్ ఇంజినీర్లు ఉన్నా వారందరినీ వదిలేసి ఎక్కడో ఉన్న ధవళేశ్వరం ఈ ఈకి వంశధార ఎస్ఈగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంపై ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం జిల్లా ఇంజినీర్లు మండిపడుతున్నారు. అత్యవసరమైతే కింది స్థాయి సిబ్బంది, కాంట్రాక్టర్లు ఫైల్స్ తీసుకుని ధవళేశ్వరం పరుగులు పెట్టాల్సి వస్తోందని అంటున్నారు. సరైన పర్యవేక్షణ లేక పలాస, వజ్రపుకొత్తూరు, సోంపేట, గార, శ్రీకాకుళం రూరల్ మండలాలకు నీరివ్వ లేకపోతున్నారు. రెగ్యులర్ వంశధార ఎస్ఈని నియమించేదెప్పుడో..? ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ లేక ఇబ్బందులు ఇంజినీర్లు లేక జిల్లా రైతులకు సాగునీరు కరువు -
వైఎస్సార్ సీపీలో భారీగా చేరికలు
● పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం పంచాయతీలో గల దళితులు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, విజయనగరం జిల్లా పార్లమెంటరీ పరిశీలకులు కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ సమక్షంలో ఆదివారం ఆ పార్టీలో చేరారు. మొత్తం 30 కుటుంబాలకు చెందిన 150 మందికి సత్యనారాయణ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. శ్రీకాకుళం నగరంలోని న్యూకాలనీలోగల కేవీజీ సత్యనారాయణ నివాసగృహానికి వచ్చి మరీ వారంతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ కొంచాడ కృష్ణారావు మా ట్లాడుతూ టీడీపీలో గత 35 ఏళ్లుగా ఉన్నా తమను పట్టించుకున్నవారే లేరని, వైఎస్సార్సీపీలోనే తమ కు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో పార్టీలో చేరామన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ సంక్షేమ పథకాలు సైతం ఇవ్వకుండా వివక్ష చూపిస్తోందని తెలిపారు. వైఎస్ జగన్ గెలుపు కోసం కేవీజీ సత్యనారాయణతో కలిసి పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా కేవీజీ సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ మీద ఉన్న నమ్మకంతో చేరిన వారికి ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. రాకోటి శ్రీనివాసరావు,బెలమాన వాసుదేవరావు, నక్క రామారావు, చింతాడ కృష్ణ, ముచ్చ ధనరాజ్, యాగాటి రవి, యాగాటి లక్ష్మి, కొంచాడ అప్పారావు, గుగ్గిల అశిరినాయుడు, బెలమాన గణేష్, మన్నేన పోలయ్య, మన్నేన పాపారావు, లింగాల శంకర్, బొంతల శంకరరావు, పైడి లక్ష్మన్నాయుడు, బగాది రామారావులో పాటు మరికొన్ని కుటుంబాలు చేరాయి. పార్టీలో చేరికలో గ్రామ ఉపసర్పంచ్ పైడి నర్శింహ అప్పారావు పాల్గొన్నారు. -
చదివింది ఎంబీఏ.. చేస్తున్నది దొంగతనం
● ఏటీఎం కార్డులను కొట్టేసి నగదు కాజేసిన ఘనుడి అరెస్టు ● జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న ఎంబీఏ పట్టభద్రుడు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని పలు ఏటీఎం సెంటర్లలో నడి వయస్కులను, వృద్ధులను ఏమా ర్చి ఏటీఎం కార్డులను మార్చేసి నగ దు కొట్టేసిన ఘనుడిని ఎట్టకేలకు శ్రీకాకుళం సీసీఎస్ సీఐ ఎస్ సూర్యచంద్రమౌళి ఆధ్వర్యంలోని సిబ్బంది శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఐదు కేసుల్లో నిందితుడైన నరసన్నపేటకు చెందిన యువకుడు పేడాడ చిన్నబాబును ఆమదాలవలస ఎస్ఐ బాబూరావు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. రిటైర్డు హెడ్కానిస్టేబుల్ను ఏమార్చి.. ప్రస్తుతం పాతపట్నం పోలీస్స్టేషన్లో ఏడీగా ఉన్న హెడ్కానిస్టేబుల్ పేడాడ ధర్మారావు సోదరుడు రామారావు కూడా రిటైర్డ్ హెడ్ కానిస్టేబులే. ఈయనది కొర్లకోట గ్రామం. రామారావు గత నెల 8న ఆమదాలవలస స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచి ఏటీఎం సెంటరు లోపలికి డబ్బు లు తీసేందుకు ఉదయం 10 గంటలకు వెళ్లాడు. పిన్ నంబర్ కొడుతుండగా వెనుకగా ఉన్న చిన్నబాబు చూశాడు. కొంత సొమ్మును డ్రా చేసి లెక్కపెడుతుండగా చిన్నబాబు కావాలనే రామారావుకు తగలడంతో తన కార్డును జారవిడిచాడు. ఏమరపాటులో రామారావును మాటల్లో పెట్టిన చిన్నబా బు కార్డు అందుకున్నట్లు నటించి తన వద్దనున్న మరో ఎస్బీఐ ఏటీఎం కార్డును మార్చేశాడు. అక్కడికి కొద్ది గంటల్లోనే రూ. 40 వేలను మా యం చేశాడు. ఇదే తరహాలో అదే ఏటీఎం మిషన్ వద్ద కుదిరం గ్రామానికి చెందిన బస వ కృష్ణవేణి ఏటీఎం కార్డును మార్చి రూ. 30 వేలు నగదు కాజేశాడు. అంతకుముందే నరసన్నపేటలో రెండు, లావేరు పీఎ స్ పరిధిలో ఓ చోట చోరీలు చేశాడు. విచారణలో దిగిన పోలీసులు.. ఆమదాలవలస సీఐ జె.సత్యనారాయ ణ పర్యవేక్షణలోని ఎస్ఐ బాబూరావు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలను పరిశీలించాక నిందితుడిని పేడాడ చిన్నబాబుగా గుర్తించారు. విశాఖపట్నం పోలీసులకు వాంటెండ్ క్రిమినల్గా ఉన్న చినబాబు గతంలో 25 కేసుల్లో అరైస్టె రిమాండ్కు వెళ్లాడని తెలిసింది. ఎంబీఏ వరకు చదువుకున్న చిన్నబాబు సాంకేతికంగాను, చదువులోనూ తెలివైనవాడని, జల్సాలకు అలవాటు పడి గత పదేళ్లుగా దొంగతనాలు చేస్తూ లెక్కకు మించి కేసుల్లో నింది తుడై కటకటాల్లోకి వెళ్లినట్లు తెలుసుకున్నారు. సీసీఎస్ పోలీసులకు జిల్లా కేంద్రంలోనే అతడు దొరకగా ఆమదాలవలస స్టేషన్కు అప్పగించారు. నిందితు ని వద్ద నుంచి రూ.1.50 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
డబ్బు కాజేశారు
నా కుటుంబంలో ఏడుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారి చదువులు, వివాహం కోసం 2017 సంవత్సరంలో రూ.11 లక్షలు డిపాజిట్ చేశాను. ఇప్పుడు మా ఖాతాలను, బాండ్లను తనిఖీ చేయిస్తే డూప్లికేట్గా గుర్తించారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – చాట్ల లోహిదాస్, ఇచ్ఛాపురం సొమ్ము ఇప్పించాలి ఇండియన్ ఆర్మీలో సేవ చేసి రిటైరైన తర్వాత వచ్చిన సొమ్ముని పోస్టాఫీస్లో భద్రంగా ఉంటుందని దాచుకొంటే దాన్ని కాజేశారు. పోస్టాఫీస్లోనే భద్రత కరువైతే మరెక్కడ దాచుకోవాలి. నష్టపోయిన ఖాతా దారులందరికీ న్యాయం చేయాలి. – ఉప్పాడ జ్యోతిసాయికుమార్, మాజీసైనికుడు వడ్డీతో సహా డబ్బు వస్తుంది ఖాతాదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ స్కామ్కి పాల్పడిన వారి లో ఐదుగురిని సస్పెండ్ చేయడంతో పాటు ఈ కేసుని సీబీఐకి ఆప్పగించడం జరిగింది. పోస్టాఫీస్లో డిపాజిట్ చేసిన ప్రతి ఖాతాదారునికి నియమ నిబంధనలను అనుసరించి వడ్డీతో ప్రతీ పైసా చేరుతుంది. – వి.హరిబాబు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్, శ్రీకాకుళం -
బడ్జెట్ ఖర్చులపై కలెక్టర్ ఆరా
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖలో కీలక అధికారి తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యోగ వర్గాల కలహాలతో పాటు పలు ప్రొగ్రాంల కింద మంజూరైన బడ్జెట్ నిధుల స్వాహా యత్నాలపై ఈనెల 11న ‘సాక్షి’లో ‘కలహాల కాపురం..నిధుల భోజనం’ పేరిట ప్రచురించిన కథనంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ మే రకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పందిస్తూ.. బడ్జెట్ ఖర్చులపై ఆరా తీసినట్లుగా సమాచారం. దీంతో పాటు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగుల వర్గ విబేధాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ కథనం అనంతర పరిణామాలపై కూడా కలెక్టర్ ఆరా తీస్తున్నట్లుగా తెలిసింది. ఈ నెల 11నే జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఆయా ప్రొగ్రాం అధికారులతో సమీక్షించారు. అసలు బడ్జెట్ ఖర్చుల విషయాలు బహిర్గతం కావడంపై ఆమె పలువురిపై అనుమానాలను వ్యక్తం చేశారు. ‘మెడికల్ కాలేజీలపై చర్చ జరగాలి’ పోలాకి (నరసన్నపేట): ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలల నిర్మాణం విషయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గొప్ప సంకల్పంతో ముందుకెళ్తే, ప్రస్తుత సీఎం చంద్రబాబు మాత్రం ప్రైవేటు దళారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశా రు. ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుందన్నారు. దీనిపై అన్ని వర్గాల్లోనూ చర్చ జరగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే మీడియాపై కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మీడియా స్వేచ్ఛను హరిస్తే.. ప్రజల గొంతు మూయించినట్టేనని తెలిపారు. సచివాలయం అద్దాలు ధ్వంసం కొత్తూరు: మెట్టూరు బిట్–2 ఆర్ఆర్ కాలనీ గ్రామ సచివాలయ భవనం అద్దాలను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలుగొట్టారు. ఈ పనిని ఆకతాయిలు చేశారా, లేదా ఎవరైనా దొంగలు చేశారా అన్నది తెలియాల్సి ఉంది. అద్దాలు పగలు గొట్టినట్లు ఆదివారం ఎంపీడీఓ నీరజకు సర్పంచ్ యర్లంకి ధర్మారావు ఫిర్యాదు చేశారు. ఆదివారం పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు ఇంకా ఫిర్యాదు చేయలేదని సర్పంచ్ తెలిపారు. గణతంత్ర పరేడ్కు నేడు ఎంపికలు ఎచ్చెర్ల: జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవం పరేడ్లో పాల్గొనే వలంటీర్ల ఎంపిక సోమవారం బీఆర్ఏయూలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు ఎన్ఎస్ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ జి.వనజ తెలిపారు. ఈ ఎంపికలు ఎన్ఎస్ఎస్ స్టేట్యూత్ అధికారి సైదారమావత్ ఆద్వర్యంలో జరుగుతాయని తెలిపారు. -
కొత్త పీఆర్సీ తక్షణం వేయాలి
● ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ఏపీ ఎన్జీఓ సంఘం నిరంతరం పనిచేస్తోంది ● ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆలపర్తి విద్యాసాగర్ శ్రీకాకుళం అర్బన్: సంఘం నిత్య చైతన్యంతో ఉంటేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించగలమని ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆలపర్తి విద్యాసాగర్ అన్నా రు. ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆదివారం మొదటిసారి శ్రీకాకుళానికి ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వచ్చారు. వీరికి జిల్లా సంఘ నాయకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇప్పటికీ సరిగ్గా అమలు కావ డం లేదని తెలిపారు. తక్షణం కొత్త పీఆర్పీ వేయా లని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు కూడా సరిగ్గా ఆర్థిక ప్రయోజనాలు దక్కడం లేదని తెలిపారు. త్వరలో ఏపీఎన్జీఓ సంఘం తరఫున విజయవాడలో రెండు రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహిస్తామని, అందులో సంఘం విధులు–బాధ్యతలు వివరిస్తామని పేర్కొన్నారు. కొత్త కార్యవర్గాల్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఒకే డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తులకు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. బాధ్యతలు లేని రాష్ట్ర నాయకత్వాలు ఉండవని ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర కార్యదర్శి డీవీ రమణ అన్నారు. సంఘంలోని సభ్యులంతా ఏకతాటిపై నడిచి సభ్య త్వ నమోదు నుంచి కార్యవర్గ ఏర్పాటు వరకూ, అటుపై కార్యాచరణ వరకూ, కూర్పు నుంచి మా ర్పు వరకూ పనిచేయాలన్నారు. గతంలో పనిచేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు స్ఫూర్తితోనే పనిచేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీ ఎన్జీఓ సంఘ నాయకులు చౌ దరి పురుషోత్తమనాయుడు, హనుమంతు సాయి రాం, ఆర్.వేణుగోపాల్, బడగల పూర్ణచంద్రరావు, కంఠ జయరావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. -
అచ్చెన్న అసమర్థత వల్లే ఎరువుల కొరత
● అచ్చెన్నాయుడు అసమర్థతను ఆ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు ● ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ టెక్కలి: ౖరెతుల కష్టాలు తెలియని అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం రాష్ట్రానికి పెద్ద దౌర్భాగ్యమని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడా రు. అచ్చెన్నాయుడు అసమర్థతను ఆ పార్టీ నా యకులే విమర్శిస్తున్నారని తెలిపారు. అదే విషయంపై వార్తలు రాస్తుంటే మీడియాపై అక్రమ కే సులు బనాయిస్తున్నారని తెలిపారు. సంతబొ మ్మాళి మండలం ఆకాశ లక్కవరంలో యూరియా కోసం రైతులు టీడీపీ నాయకులను నిలదీస్తే.. దాన్ని వ్యక్తిగత తగాదాలకు వక్రీకరించి వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి సుగ్గు రామిరెడ్డిపై అక్రమంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం అచ్చెన్నాయుడు చేతకానితనం అని తిలక్ మండిపడ్డారు. ‘సాక్షి’ దినపత్రికలు దహనం చేయడం అప్రజాస్వామ్యమన్నారు. రైతులకు చెందాల్సిన వ్యవసాయ యంత్రాల కొనుగోలులో అవినీతికి పాల్పడిన అచ్చెన్న రైతుల పొట్ట కొట్టారని దుయ్యబట్టారు. రైతు సంక్షేమానికి పాటు పడిన వైఎస్ జగన్ను విమర్శిస్తున్న అచ్చెన్నాయుడును పాతాళానికి పూడ్చి పెట్టడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల్లో 25 శాతం సబ్సిడీ సుమారు రూ.1500 కోట్లు టీడీపీ ప్రభుత్వం ముందుగానే కొట్టేయడంతో ఎరువుల కొరత ఏర్పడిందన్నారు. టెక్కలిలో మంత్రి అనుచరులు ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ రూ.500 నుంచి రూ.600కు అమ్ముకుంటున్నారని, దీనిపై బహిరంగ చర్చకు అచ్చెన్నాయుడు సిద్ధమా అని సవాల్ చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో లేని ఎరువుల కొరత ఇప్పుడెందుకు వచ్చిందన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని, గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి చరిత్ర సృష్టించారని తిలక్ గుర్తు చేశారు. ఆ కళాశాలలను ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నారని తిలక్ దుయ్యబట్టారు. -
దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు
● సిక్కోలు నుంచే తిరుగుబాటు ఆరంభం కావాలి ● వైఎస్సార్సీపీ దళిత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెయ్య వెంకటరమణ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): దళితుల ఓట్లు, సీట్లు మాత్రమే సీఎం చంద్రబాబుకు కావాలని, వారి సంక్షేమం అవసరం లేదని వైఎస్సార్ సీపీ దళిత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెయ్య వెంకటరమణ మండిపడ్డారు. దళితులంటే టీడీపీకి ఎప్పుడు చిన్నచూపేనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా దళితులంతా ఏకతాటిపైకి రావాలని కోరుతూ ఈ నెల 17న వైఎస్సార్సీపీ దళిత విభాగం ఆధ్వర్యంలో విస్తృతస్థ్ధాయి సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో బృందావనంలో జరిగే ఈ సమావేశానికి జిల్లాలోని దళిత యువత, ఉద్యోగ, నిరుద్యోగ, పలు విభాగాల నాయకులతో పాటు దళిత జాతి అంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, అన్ని నియోజకవర్గవర్గాల ఇన్చార్జిలు పాల్గొని దళితులకు అండగా నిలవాలని కోరారు. ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి మాట్లాడుతూ మనిషిగా పుట్టాలనుకునేవాడు దళితుల్లో పుట్టాలనుకుంటారా అని మాట్లాడిన నీచ సంస్కృతి చంద్రబాబుదన్నారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులున్నా దళితులకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు. దళితులకు యూరియా ఇవ్వకుండా కేవలం టీడీపీ నేతలే పంచుకుంటున్నారని దుయ్యబట్టారు. దౌర్జన్యంగా రేషన్డిపోల డీలర్లను తొలగించేశారన్నారు. కూటమి నేతలపై దళితుల తిరుగుబాటు శ్రీకాకుళం జిల్లా నుంచే మొదలవుతుందన్నారు. ప్రతి గ్రామం నుంచి ఈ నెల 17న జరిగే సమావేశానికి హాజరుకావాలని కోరారు. వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి, నియోజకవర్గ ఇన్చార్జి యజ్జల గురుమూర్తిలు మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయకుండా రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేసి దళితుల జీవితాలతో ఆడుకోవడం సరికాదన్నారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ నియోజకవర్గంలోనూ, శ్రీకాకుళం జిల్లాలో సౌమ్య, గతంలో కొరపాన కళ్యాణి అనే ఉద్యోగినులపైనా టీడీపీ నేతలు దాడులు, వేధింపులకు పాల్పడ్డారని గుర్తు చేశారు. వీటిని అరికట్టాలంటే దళితులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ దళిత విభాగం నాయకులు లక్ష్మణరావు, రామినాయుడు, గడ్డయ్య, నీలాపు ముకుందరావు, జలగడుగుల శ్రీనివాస్, నల్లబారికి శ్రీనివాసరావు, త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు. -
వేతన సవరణ కోరుతూ పోస్టుకార్డు ఉద్యమం
శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం 12వ వేతన సవరణ అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ పోస్టు కార్డు ఉద్యమం చేపడుతున్నట్లు ఎస్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్వీ రమణమూర్తి, జి.రమణ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతిభవనంలో శనివారం సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఐదేళ్లకోసారి వేతన సవరణ అమలు చేయాల్సి ఉందని, 11వ వేతన సవరణ గడువు 2023 జూలై 1 నాటికి ముగిసినా ఇప్పటివరకు పీఆర్సీ బకాయిలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కమిటీ వేయకపోవడం విచారకరమన్నారు. కనీసం ఐఆర్ కూడా ప్రకటించలేదన్నారు. పెండింగ్ బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదన్నారు. జిల్లాలో 471 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు దూరప్రాంతాల్లో పనిచేస్తున్నారని, వారికి ఇంటి అద్దె అలవెన్స్ ఇస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సమావేశంలో సంఘ ఆర్థిక కార్యదర్శి పి.రామకృష్ణ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాసరావు, గురువు శ్రీనివాసరావు, డీవీఎన్ పట్నాయక్, ఎస్.రామచంద్రరావు, జి.తిరుమలరావు, ఎం.మురళీధర్, బి.ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఎన్జివో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల రాక
శ్రీకాకుళం అర్బన్: ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణకు జిల్లా కార్యవర్గం ఆదివారం ఆత్మీయ సత్కారం చేయనుందని సంఘ అధ్యక్ష, కార్యదర్శులు హనుమంత్ సాయిరాం, చల్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జెడ్పీ సమావేశ మందిరంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని కోరారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా జెడ్పీ గేట్ నుంచి సమావేశ మందిరం వరకు ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఉద్యోగవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి అవగాహనతో వైద్యం అందించాలి అరసవల్లి:గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితంగా పూర్తి అవగాహనతోనే వైద్యం అందించాలని గ్లోబల్ న్యూరో కేర్ అధినేత డాక్టర్ దేవరెడ్డి గౌతమ్ సూచించారు. వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా శనివారం రెడ్క్రాస్ ఆధ్వర్యంలో గ్లోబల్ న్యూరోకేర్ ఆసుపత్రిలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పల్లెల్లో మితిమీరిన వైద్యం, మందుల వినియోగాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి వారికి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు శిష్టు అనిల్, బండి గౌతమ్, గీతాప్రియదర్శిని, మార్కెటింగ్ హెడ్ సీహెచ్ స్వామి, రెడ్క్రాస్ మేనేజర్ రమణ పాల్గొన్నారు. గంజాయితో ముగ్గురి అరెస్టు ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్ ఆవరణలో 5 కేజీల గంజాయితో ముగ్గురు పట్టుబడ్డారని డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. ఇచ్ఛాపురం సీఐ కార్యాలయం వద్ద శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పట్టణ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు రైల్వేస్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా తమిళనాడుకి చెందిన ముత్తుకుమార్, ఉదయ్కుమార్, ముత్తురామలింగంలు 5 కేజీల గంజాయితో పట్టుబడ్డారు. తమిళనాడు రాష్ట్రం తిరుప్పూరుకు చెందిన గంజాయి వ్యాపారి పాండ్యరాజు సూచన మేరకు ఒడిశా రాష్ట్రం మోహన బ్లాక్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి బస్సు ద్వారా ఇచ్ఛాపురం చేరుకొన్నారు. అనంతరం రైలులో తమిళనాడు వెళ్లేందుకు బయలుదేరగా పోలీసులు పట్టుకున్నారు. వీరిని అరెస్ట్చేసి రిమాండ్కి తరలించారు. వీరి వద్ద నుంచి గంజాయి, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో గంజాయిని విక్రయించిన కుమార్, గంజాయిని తీసుకురావాలని సూచించిన పాండ్యరాజ్పైనా కేసులు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐ మీసాల చిన్నంనాయుడు, ఎస్సై ముకుందరావు, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. గుర్తు తెలియని వృద్ధుడు మృతి రణస్థలం: లావేరు మండలం బొంతుపేట శ్మశానవాటిక వెనుక ఉన్న పొలంలో సుమారు 65 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. మృతదేహం పక్కనే చేతి కర్ర ఉందని, వివరాలు తెలిసిన వారు 63099 90851 నంబరుకు తెలియజేయాలని లావేరు ఎస్సై జి.లక్ష్మణరావు కోరారు. -
మద్యానికి బదులు గడ్డి మందు తాగి..
బూర్జ: మద్యం మత్తులో గడ్డి మందు తాగిన బూర్జ మండలం తోటవాడ పంచాయతీ టి.ఆర్.రాజుపేటకు చెందిన కొంగరాపు ప్రభాకరరావు (45) శనివారం మృతిచెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభాకరరావు మద్యానికి బానిసయ్యాడు. గురువారం వేకువజామున బాటిల్ తేడా గమనించక గడ్డి మందు తాగాడు. శుక్రవారం ఉదయం వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు గమనించి 108 అంబులెన్సులో శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే ప్రభాకరరావుకు భార్య కేసరమ్మ, కూమారుడు దుర్గాప్రసాద్, వివాహమైన కుమార్తె ఉన్నారు. కేసరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.ప్రవళ్లిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాక్సింగ్ క్రీడాకారులకు అభినందనలు
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలిలోని మార్షల్ ఆర్ట్స్ అకాడమికి చెందిన పలువురు బాక్సింగ్ క్రీడాకారులు ఈ నెల 14న విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయం వేదికా జరిగే రాష్ట్రస్థాయి మహిళా కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. వీరిని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జిల్లా చైర్మన్ నటుకుల మోహన్ శనివారం అభినందించారు. రాష్ట్రస్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చీఫ్ కోచ్ వై.హేమంత్కుమార్, కోచ్ డి.హరీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వనరులకు నెలవు ఉద్దానం పలాస: ఉద్దానం ప్రాంతంలో అపారమైన ప్రకృతి వనరులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ చెప్పారు. ‘ఉద్దానం ప్రాంత అభివృద్ధి ,అవకాశాలు, అవరోధాలు’ అనే అంశంపై కాశీబుగ్గలో శనివారం వివిధ ప్రజాసంఘాల నాయకులు, మేధావులతో రౌండు టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక ప్రతినిధి జుత్తు సింహాచలం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అజశర్మ మాట్లాడుతూ చిత్తడి నేలలు, సముద్రతీరం, ఉద్యాన పంటలు, సారవంతమైన భూమి వంటి ప్రకృతి వనరులను కాపాడుకోవాలన్నారు. జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించి, 80కిలోల బస్తాకు రూ.16వేలు చెల్లించాలని, వాటిని రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జీడి బోర్డుతో పాటు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కొబ్బరి బోర్డు, జీడి కొబ్బరి నార సహకార పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యాన పంటలకు ఉచితంగా ఎరువులు, పురుగుల మందులను సరఫరా చేయాలని కోరారు. కిడ్నీ వ్యాధి నిర్మూలనకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వంశధార ప్రాజెక్టు ద్వారా శివారు భూములకు నీరందించాలన్నారు. మత్స్యకారులకు ఉపాధితో పాటు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు కొత్తకోట అప్పారావు, పాలవలస ధర్మారావు, డాక్టర్ మట్ట ఖగేశ్వరరావు, తెప్పల అజయ్కుమార్, కె.హేమారావు చౌదరి, కూన వెంకటరావు, గోపాలకృష్ణ, బద్రి కూర్మారావు, పోతనపల్లి గీతమ్మ, కుత్తు వినోద్, దేవేంద్ర వర్మ, జానకి రామయ్య, కొమర వాసు, బాబూరావు, గణేష్, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. -
తూర్పుకాపుల ఐక్యత చాటిచెప్పాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): తూర్పుకాపుల ఐక్యతను చాటిచెప్పాలని సంఘ నేతలు పిలుపునిచ్చారు. తూర్పుకాపులో ఉద్యోగులుగా ఉంటూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని శనివారం శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన్ భవన్లో సన్మానించారు. సత్కారం అందుకున్న వారిలో రిటైర్డ్ ఎంఈఓ గెడ్డాపు రాజేంద్రప్రసాద్, రిటైర్డ్ హెచ్ఎం దాసరి రామచంద్ర, బోడసింగి ఖగేశ్వరరావు, మెంటాడ సాంబమూర్తి, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బౌరోతు శంకరరావు, హెచ్ఎంలుగా పదోన్నతి పొందిన మక్కా శ్రీనివాసరావు, మీసాల శ్రీనివాసరావు, తలగాన లింగరాజు, కిల్లాన రాంబాబు, రాజాపు శ్రీనివారావు, కర్నేన రమణమూర్తి, గొంటి తిరుపతిరావు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు బాడాన రాజు, శిష్టి వెంకటరావ్, ప్రధానోపాధ్యాయులు చెల్లి వెంకటరమణ, ఉపాధ్యాయుడు లెంక చక్రపాణి, ఉద్యోగ సంఘాల నేత కిల్లారీ నారాయణరావు, వాల్తేటి సత్యనారాయ ణ ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు రాడ కైలాసరావు, శాస పు జోగినాయుడు, వాన కృష్ణచంద్, మామిడి క్రాంతి, గొర్లె వాసుదేవరావు, తూర్పు కాపు ఉద్యోగ సంఘాల నేతలు పడాల తమ్మినాయుడు, వాళ్ళ శ్రీరాములు నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
స్నేహభావం పెంపొందించేందుకు కృషి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రజల మధ్య స్నేహభావం పెంపొందించడమే ఇస్కాఫ్(భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం) లక్ష్యమని సంస్థ ప్రతినిధి మల్లేశ్వరరావు అన్నారు. శనివారం నగరంలోని ఓ కల్యాణ మండపంలో జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోవిట్ యూనియన్ పతనం తర్వాత భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఇస్కాఫ్గా మారిందన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు మాట్లాడుతూ ప్రపంచ శాంతికి తోడ్పడటం, ఆర్థిక సంక్షోభాలను అధిగమించడం, ఇరుగుపొరుగు దేశాలతో స్నేహ పూర్వక సంబంధాలు పెంపొందించేందుకు ఇస్కాఫ్లో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బుడుమూరు శ్రీరామమూర్తి, గౌరవ సలహాదారుడిగా గేదెల ఇందిరా ప్రసాద్, జిల్లా అధ్యక్షుడిగా బుడుమూరు వెంకట సూర్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జి.వి.నాగభూషణరావు, కార్యదర్శిగా గురుగుబెల్లి రాజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులుగా సీపాన రామారావు, టి.కామేశ్వరి, సనపల నారాయణరావు, సాహుకారి నాగేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శులుగా గేదెల లక్ష్మి, టి.తిరుపతిరావు, సాదు కామేశ్వరరావు, దిబ్బ ప్రసాదరావు, కోశాధికారిగా కె.భాస్కరరావు, కార్యవర్గ సభ్యులుగా నాగేశ్వరరావు, ఈశ్వరరావు, చౌదరి సత్యనారాయణ, వడ్డాది విజయకుమార్, కుంచి చిన్నారావు, టి.వి.రమణ, తంగి యర్రమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
హిందీ భాషాభివృద్ధిపై.. నిలువెల్లా నిర్లక్ష్యం
● టీచర్ల భర్తీ, ఇతర అంశాలపై కూటమి సర్కారు నిర్లక్ష్యం ● రాజభాషకు ప్రోత్సాహం కరువు ● నేడు జాతీయ హిందీ దివాస్ ప్రైవేటు స్కూళ్లలో నర్సరీ నుంచే హిందీ బోధన సాగుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో అలా జరగడంలేదు. కనీసం 2, 3వ తరగతుల నుంచైనా హిందీ బోధన మొదలుకావాలి. ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు, హిందీ భాషాపండితులను నియమించాలి. డీఎస్సీ ద్వారా హిందీ పండిట్పోస్టులను పెద్దఎత్తున భర్తీ చేయాలి. – కోనే శ్రీధర్, ఉత్తరాంద్ర సమన్వయకర్త, హిందీ మంచ్ హిందీ భాషాభివృద్ధికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు మరింతగా ప్రోత్సహించాలి. జాతీయ భాషగా హిందీకి తగిన గుర్తింపు ఇప్పటికీ లభించలేదనే చెప్పాలి. హిందీ భాషాభివృద్ధికి ప్రభుత్వాలు తోడ్పాటు అందించకపోతే మా గోడు ఎవరికి చెప్పుకోవాలి. వేలాది మంది హిందీ పట్టభద్రులు పండిట్ ట్రైనింగ్ కోసం నిరీక్షిస్తున్నారు. – కనుగుల సత్యం, జిల్లా అధ్యక్షుడు, హిందీ మంచ్ హిందీ మన దేశ జాతీయ భాష. జాతీయ సమైక్యతను ఇనుమడింపజేసే భాష హిందీయే. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలో హిందీకి 17 సెక్షన్ల తర్వాతే రెండో పోస్టును భర్తీ చేస్తుండటం తగదు. ఇది తీరని అన్యాయం. హిందీ లెక్చరర్లను నియమించాలి. పదోన్నతులతో భర్తీచేయాలి. – ఇమ్మిడిశెట్టి సంతోష్కుమార్, హిందీ ఫోరం జిల్లా కన్వీనర్శ్రీకాకుళం న్యూకాలనీ/శ్రీకాకుళం కల్చరల్: జాతీయ భాష హిందీపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. హిందీ భాషాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడంలేదు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో హిందీతోపాటు లాంగ్వేజ్ టీచర్లను సైతం నియమించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వైఎస్సార్ సీపీ పాలనలో హిందీ భాషాభివృద్ధికి పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. హిందీ సబ్జెక్ట్ టీచర్లు పాఠశాలల్లో ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు. గత డీఎస్సీలో హిందీ పోస్టులను సైతం భారీగా భర్తీ చేశారు. ప్రస్తుతం హిందీ భాష పట్ల, హిందీ ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని పలువురు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి రాజ భాషగా హిందీని ప్రోత్సహించాలని హిందీమంచ్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నేటి నుంచి పక్షోత్సవాలు.. ఈ నెల 14న జాతీయ హిందీ దివాస్ సందర్భంగా.. ఆదివారం నుంచి పక్షోత్సవాలను నిర్వహించేందుకు సన్నద్ధమౌతున్నారు. ఆదివారం నుంచి 28వ తేదీ వరకు 15 రోజులపాటు ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల్లో, ప్రతి జిల్లాలో ఐదు రోజులు పాటు హిందీ దివస్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మంచ్ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కోనే శ్రీధర్ నేతృత్వంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. హిందీ ఫోరం, హిందీ వికాస వేదిక ఆధ్వర్యంలో విద్యార్ధులను హిందీపై ఆసక్తిపెంచేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేలా కసరత్తులు చేశారు. మరోపక్క హిందీ సులేఖన్ పోటీలను పోటీలను నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించారు. హైస్కూళ్లలో హిందీ పండింట్ల సంఖ్యను పెంచాలి. ప్రైవేటు స్కూళ్లలో ఎల్కేజీ నుంచే బోధన మొదలవుతుది. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ప్రాథమికస్థాయి నుంచే కనీసం రెండో తరగతి నుంచే హిందీ బోధన అమలు చేయాలి. ప్రాథమిక స్థాయి నుంచి హైస్కూల్ ప్లస్(జూనియర్ కాలేజీల) స్థాయి వరకు అన్ని పాఠశాలల్లో మిగతా సబ్జెక్టులతో సమానంగా హిందీ పండిట్ పోస్టులను భర్తీ చేయాలి. మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్, జూనియర్ కాలేజీల్లో పీజీటీ హిందీ/లెక్చరర్ పోస్టులను మంజూరు చేయాలి. హిందీ పండిత శిక్షణా కళాశాలలను తక్షణమే ప్రారంభించాలి. వేలాది మంది హిందీ పట్టభద్రులు రాష్ట్రంలో హిందీ పండిట్ ట్రైనింగ్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో హిందీ ద్వితీయ భాషగా హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి. రాబోయే డీఎస్సీలో హిందీ పండిట్ పోస్టుల సంఖ్యను పెంచాలి. 6 నుంచి 10వ తరగతి వరకు హిందీ పాఠ్యపుస్తకాలను సరళంగా మార్చాలి. త్రిభాషా సూత్రాన్ని రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయాలి. 2024–25 విద్యా సంవత్సరానికిగాను ఎల్పీసెట్(భాషా హిందీ ప్రవేశపరీక్ష) ద్వారా హిందీ పండిత శిక్షణ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. -
● సచివాలయంలో ఎరువుల బస్తాలు చోరీ
పాతపట్నం: తెంబూరు గ్రామ సచివాలయంలో శుక్రవారం అర్ధరాత్రి రెండు బస్తాల యూరియాను దొంగతనంగా తీసుకువెళుతుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం తెంబూ రు గ్రామ సచివాలయానికి 220 బస్తాలు రావడంతో సచివాలయంలో యూరియా బస్తాలను సచివాలయం వీఏఏ దింపించారు. శుక్రవారం అర్ధరాత్రి సచివాలయం ఉద్యోగులు తాళాలు తీసి రెండు యూరియా బస్తాలను ఓ వ్యక్తికి ఇచ్చారు. ఆ వ్యక్తి బైక్పై యూరియా తీసుకెళ్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. దీంతో అతడు రెండు యూరియా బస్తాలు అక్కడే వదిలేసి వెళ్లిపాయాడు. ఇలా అర్ధరా త్రి బయట వ్యక్తులు బస్తాలు తీసుకెళ్లడమేంటని రై తులు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ఏఓ కిరణ్వా ణి వద్ద ప్రస్తావించగా తమ దృష్టికి రాలేదన్నారు. -
ఒక్కటే దరఖాస్తు
ఒక్కటంటే ● స్పందన కరువవడంతో బార్లకు మళ్లీ రీ–నోటిఫికేషన్ ● దరఖాస్తు గడువు ఈనెల 17కు పొడిగింపు.. డ్రా 18న శ్రీకాకుళం క్రైమ్ : ప్రైవేటు టెండర్దారుల లైసెన్సు ఫీజులతో ఆదాయం సమకూరుతుందన్న ఆశ.. ప్రభుత్వాన్నే కాదు ఎకై ్సజ్ శాఖకు సైతం షాకులిస్తోంది. బార్లకు టెండరుదారుల నుంచి మూడు సార్లు దరఖాస్తులు కోరినా స్పందన మా త్రం రావడం లేదు. మొదటిసారి 19 బార్లకు రెండుసార్లు నోటిఫికేషన్ విడుదల చేయగా కేవలం ఐదు బార్లకు 22 దరఖాస్తులే వచ్చాయి. మిగతా 14 బార్లకు ఈనెల 15న డ్రా తీస్తారన్నా ఇప్పటికి ఒక్కటంటే ఒక్క దరఖాస్తే (ఇచ్ఛాపురం) చేరడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెల కొంది. ఓ వైపు టీడీపీ పెద్దలు డ్రా జరగకుండానే లోపాయికారీగా తక్కువ సొమ్ముతోనే తమ వాళ్లు షాపులు దక్కించుకోవాలని బలంగా మనసులో పెట్టుకున్నారు. పైకి మాత్రం అధికారులపై దరఖా స్తులు ఎక్కువ పడేటట్లు చూడాలని, మళ్లీ మళ్లీ నోటిఫికేషన్లు ఇవ్వండంటూ ఒత్తిడి తెస్తున్నారు. దాని ఫలితమే ఈనెల 18న డ్రా తీయడానికి ప్రభు త్వం మళ్లీ ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 17 దరఖాస్తులకు స్వీకరణ గడువుగా తేల్చింది. దుకాణాలపై మోజు పడి మరీ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సొంతంగా మద్యం దుకాణాలను నడిపి ప్రైవేటు వ్యాపారుల కడుపు కొట్టిందని ఎన్నికల్లో విమర్శలు ఎక్కుపెట్టిన కూట మి ప్రభుత్వం.. అవే మద్యం దుకాణాలను ప్రైవే టు టెండరుదారులకు కట్టబెట్టాలనుకుంది. ఈ విధానంలో దరఖాస్తు ఫీజు, లైసెన్సు ఫీజుల్లో దండిగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. వ్యాపారులు సైతం దండిగా సంపాదించవచ్చనే ఆశతో లైసె న్సులు పొందేందుకు ఎగబడ్డారు. గత ఏడాది అక్టోబరులో జనరల్ కేటగిరీలో 158 ప్రైవేటు లైసె న్సు దుకాణాలకుగాను 4671 దరఖాస్తులు, గీతకులాలవారికి (రిజర్వ్ కేటగిరీలో) 18 దుకాణాలకు 203 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దుకాణానికి దరఖాస్తు రుసుమే రూ. 2 లక్షలు కాగా మొత్తంగా రూ. 4.06 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఇక లైసెన్సు ఫీజైతే 158 దుకాణాలకు (ఒక్కో దుకాణానికి రెండేళ్లు లీజుకు గాను రూ. 65 లక్షలు) రూ. 102 కోట్ల పైనే రాబడి వచ్చింది. రిజర్వ్ కేటగిరీలో దాదాపు రూ. 6 కోట్లు.. మొత్తం పైన రూ. 108 కోట్ల దక్కించుకుంది. బార్ల లైసెన్సు పొందేందుకు అనాసక్తి.. బార్ల లైసెన్సు పొందేందుకు న్యూట్రల్గా ఉన్న వ్యాపారుల నుంచి అనాసక్తి కనిపిస్తోంది. ముఖ్యంగా దరఖాస్తు ఫీజు, లైసెన్సు ఫీజులకే ప్రభుత్వం కక్కుర్తి పడుతుంది తప్ప మార్జిన్ 20 శాతం పెంచకపోవడం ఓ కారణంగా కనిపిస్తోంది. ఒకవేళ షాపు దక్కించుకున్నా తమ చేతిలో ఉంటుందో.. టీడీపీ నాయకుల సిండికేట్ చేతికి వెళ్తుందో అన్న అనుమానం కూడా మరో కారణంగా తెలుస్తోంది. -
సిక్కోలుకునేదెలా..?
అరసవల్లి: పల్లె పల్లెనా, వీధివీధినా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ గడప తొక్కినా ఒకరిద్దరు జ్వర బాధితులు కనిపిస్తున్నారు. అయితే ఎక్కడా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల చర్యలు కానరావడం లేదు. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్న రోగులను పెద్దగా పట్టించుకోకపోవడంతో అప్పులు చేసి మరీ ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. జ్వరాల తీవ్రత అధికంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా జ్వర బాధిత రోగుల సంఖ్య ను నివేదికల్లో తక్కువగా చూపించాలంటూ.. ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయ కుడు అధికారులకు హుకుం జారీ చేయడం పాలకుల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. ఒంటి నొప్పులు తీవ్రం.. జ్వరాలతో పాటు కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు చాలా తీవ్రంగా ఉండడం ఇప్పుడు జిల్లాలో కనిపిస్తోంది. జిల్లాలో 30 మండలాల్లో సుమారు 6 లక్షల ఇళ్లుంటే కనీసంగా చూసినా పది వేలమందికి పైగా నే జ్వర పీడితులు ఉన్నట్లుగా చెప్పవచ్చు. అయినప్పటికీ జిల్లా వైద్య శాఖ లెక్కల ఆధారంగా చూస్తే ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 31 వరకు కేవలం 31 మాత్రమే మలేరియా కేసులు, 5 మాత్రమే డెంగీ కేసులు, చికెన్గున్యా కేసులు 2 వరకు మాత్రమే నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే వాస్తవ లెక్కల ప్రకారం చూస్తుంటే మలేరియా కేసులు వందకు పైగా ఉన్నాయని, వివిధ రకాల వైరల్ ఫీవర్ల బాధి తులు సుమారు 4 వేల మందికి పైగా ఉన్నట్లుగా సమాచారం. సర్వేలన్నీ గారడీలే.. జిల్లాలో మలేరియా నియంత్రణ విభాగం జ్వరాల శాంపిల్స్ను సేకరించే బాధ్యత నిర్వర్తిస్తుంది. జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు సర్వే అంకెలు పైన పేర్కొన్న విధంగా ఉన్నాయి. అయితే ఈనెల మొదటి వారంలోనే సుమారు 18 వేల శాంపిల్స్ తీసుకుంటే 2 వేల మందికి పైగా జ్వర పీడితులు మంచాన పడినట్లుగా తెలుస్తోంది. ఇక శాంపిల్స్కు దూరంగా ఉన్న వారి లెక్కను అదనంగా చేర్చితే సంఖ్య ఏడెనిమిది వేలకు చేరుకున్నా ఆశ్చర్యం కలగకమానదు. చర్యలేవీ..? జిల్లాలో గత నెల నుంచి నేటి వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమల తీవ్రత అధికమై జ్వరాల బారిన పడిన వారి సంఖ్య వందల్లో ఉంది. అలాగే వర్షాల కారణంగా కాలువల్లో మురుగునీరు రోడ్లపై ప్రవ హిస్తూ పరిసరాల్లో పారిశుద్ధ్యం క్షీణించింది. అయి తే పల్లెల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ఎక్కడా పారిశుద్ధ్య మెరుగు చర్యలు పెద్దగా చేపట్టలేదు. నగరంతో పాటు పలు పట్టణ ప్రాంతాల్లో కాలువల్లో షిల్టు తీసినప్పటికీ తాజా వర్షాలతో మళ్లీ యఽథాస్థితికి చేరాయి. వైద్యశాఖ తరఫున మాత్రం దోమల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా 5 లక్షల వరకు గంబూషియా చేపలను వేయించేలా చర్యలు ప్రారంభించినప్పటికీ అదంతా ప్రచార ఆర్భాటంగా మార్చారు. దీంతో ఇప్పటి వరకు కనీసం లక్ష వరకు కూడా గంబూషియా చేపలను నీటి వనరుల్లో వేయలేకపోయారు. కానరాని సర్వేలు జిల్లాలో వైద్యారోగ్య శాఖ తరఫున క్షేత్ర స్థాయిలోనే జ్వరాలు, సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఇంటింటి సర్వేలు చేపట్టాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో గ్రామ/వార్డు సచివాలయాలతో పాటు ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, హెల్త్ అసిస్టెంట్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి జ్వర పరీక్షలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యశా ఖ చర్యలపై, ప్రజారోగ్యంపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో తాజాగా సీజనల్ వ్యాధుల తీవ్రత అధికమైంది. జిల్లాలో వీధివీధికీ వ్యాపించిన జ్వరాలు తీవ్రంగా ఒంటి నొప్పులు పట్టించుకోని పాలకులు కానరాని సర్వేలు పీహెచ్సీల పరిధిలో నమూనాల సేకరణ జిల్లాలో జ్వరాల వ్యాప్తి నివారణకు గట్టి చర్యలు చేపడుతున్నాం. ఇంటింటికీ ప్రతి 15 రోజులకొకసారి హెల్త్ అసి స్టెంట్, ఏఎన్ఎంల బృందం విజిట్ చేసి శాంపిల్స్ సేకరణ చేపడతారు. ప్రామాణిక పరీక్షల నిర్ధారణ అనంతరం జ్వరాలను గుర్తిస్తాం. అలాగే పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ సర్వేలు చేపడుతున్నాం. మెడికల్ ఆఫీసర్లకు నిత్యం టెలికాన్ఫరెన్స్ ద్వారా సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేస్తున్నాం. – డాక్టర్ కె.అనిత, డీఎంహెచ్ఓ -
డీఈఓగా రవిబాబుకు పూర్తి అదనపు బాధ్యతలు
శ్రీకాకుళం: శ్రీకాకు ళం జిల్లా విద్యాశాఖ అధికారిగా రవిబాబుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డీఈ ఓ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న రవిబాబును ఇప్పటివరకు ఇన్చార్జి డీఈఓగానే కొనసాగించారు. ఈయనకు బీఈడీ డిగ్రీ లేకపోవడంతో పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించలేకపోయారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఫలితాల్లో రవిబాబు ఉత్తీర్ణులు కావడంతో పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించడానికి మార్గం సుగమం కాగా, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. కొత్తమ్మ తల్లి జాతరలో వీడియో పోటీలు శ్రీకాకుళం పాతబస్టాండ్: కోటబొమ్మాళి కొత్త మ్మ తల్లి జాతర ఈ నెల 23 నుంచి 25 వరకు ఘనంగా జరగనుంది. ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా వీడియో పోటీలు నిర్వహించనున్న ట్టు జిల్లా రెవెన్యూ అధికారి మారెళ్ల వెంకటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అమ్మవారి వైభవం, చరిత్ర, గత ఉత్సవాల జ్ఞాపకాలు అన్ని విషయాలను ప్రతిబింబించేలా 3 నుంచి 5 నిమిషాల నిడివి గల వీడి యోలు రూపొందించాలని తెలిపారు. వీటిని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయి కుమార్కి ఈ మెయిల్ drdosrikakulam @apssdc.in ద్వారా ఈనెల 16వ తేదీ లోగా వీడియోలు పంపాలని తెలిపారు. మొదటి ముగ్గురు విజేతలకు రూ.5,000 రూ.3,000,రూ.2,000 నగదు బహుమతులు అందజేయనున్నారని తెలిపారు. ఈ నెల 23న ఉదయం 8–9 గంటలకు ఆలయం వద్ద కర్టెన్ రైజర్ ప్రోగ్రాం, 23, 24 తేదీల్లో జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో గ్రామీణ క్రీడలు, 24న మధ్యాహ్నం 3–5 గంటల వరకు కొత్తపేట జంక్షన్ నుంచి ఆలయం వరకు శోభాయాత్ర, 23–25 తేదీల్లో సాయంత్రం 6–11 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 25న రాత్రి 7–9 గంటల వరకు క్రాకర్స్ షో, జాతర మూడురోజులూ ఎగ్జిబిషన్ స్టాల్స్ అలరించనున్నాయి. హెలికాఫ్టర్ రైడ్ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని, ప్రజలందరూ పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు. -
గంజాయి రవాణా అరికట్టేందుకు చర్యలు
శ్రీకాకుళం క్రైమ్: గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీలను ఆదేశించారు. శుక్రవారం రేంజ్ పరిధిలోని అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో డీఐజీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గంజాయి నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ నేరాల నిరోధక చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు చేశారు. అక్రమ గంజాయి రవాణా వ్యాపారంలో పాల్గొన్న 14 మంది నేరస్తుల ఆస్తులు రూ.10,04,89,621 స్వాధీనం చేసుకోవడాన్ని అభినందించారు. ఇప్పటి వరకు 1,119 మంది గంజాయి నేరస్తుల కదలికలపై షీట్లు తెరిచినట్లు చెప్పారు. అలాగే 51 మంది నిందితులపై పీడీ చట్టం, 80 మందిపై పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం అమలుకు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు. తరచూ గంజాయి రవాణా చేసే 368 మంది, అలాగే గంజాయితో పాటు ఇతర నేరాలలో పాల్గొన్న 370 మందిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. న్యాయస్థానాలు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్లు ఆధారంగా 341 మందిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 20 కేసుల్లో 33 మంది నిందితులకు శిక్షలు పడ్డాయన్నారు. వీరిలో 24 మందికి 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్షలు ఖరారయ్యాయన్నారు. విశాఖపట్నం రేంజ్ పోలీసులు స్టే సేఫ్, నిదాన్, కాజ్, నాట్ గ్రిడ్ యాప్స్ ద్వారా పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడంలో కృషిని అభినందించారు. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలు, మహిళ మిస్సింగ్ కేసులపై సమీక్షించారు. ఇటువంటి కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని చెప్పారు. రేంజ్ పరిధిలోని శాంతి భద్రతల సమస్యలపై చర్చించారు. భవిష్యత్తు కోసం తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
థర్మల్ ప్లాంట్పై సమర శంఖం
● బలవంతపు భూసేకరణ ఆపాలి ● తీర్మానం చేసిన పోరాట అఖిల పక్ష కమిటీ సరుబుజ్జిలి/బూర్జ: థర్మల్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనలు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం తప్పదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు హెచ్చరించారు. మండలంలోని వెన్నెలవలస థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో వారు మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఎకరాల భూమిని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోందని, మన జిల్లాలోనూ పవర్ ప్లాంట్, కార్గో ఎయిర్పోర్టు పేరుతో వేలాది ఎకరాలు కార్పొరేట్లకు అప్పగించేందుకు చూస్తోందని వెల్లడించారు. రైతుల అనుమతులు లేకుండా డ్రోన్ సర్వేలు చేయడం చట్ట వ్యతిరేకమని రైతుకూలీ సంఘం అధ్యక్షుడు వంకల మాధవరావు అన్నారు. థర్మల్ ప్లాంట్ కడితే హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తెచ్చి సాగుభూములను బీడు భూములుగా మారుస్తారని న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశరావు వెల్లడించారు. పవర్ ప్లాంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నేరడి వద్ద బ్యారేజీ కడితే రూ.13వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మో హనరావు వివరించారు. ఆమదాలవలసపై ఎమ్మెల్యే కూన రవికుమార్కు చిత్తశుద్ధి ఉంటే సుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ని మ్మక అప్పన్న డిమాండ్ చేశారు. బలవంతపు భూసేకరణ అడ్డుకుంటామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు కంఠ అప్పలనాయుడు హెచ్చరించారు. అఖిల పక్ష సమావేశానికి అధికారులు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. -
గంజాయితో నవ దంపతులు అరెస్టు
పలాస: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న బీహార్కు చెందిన నవ దంపతులు జూలీ ప్రవీణ్, సాజిత్ అన్సారీలను కాశీబుగ్గ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పలాస జి.ఆర్.పి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ.రవికుమార్ శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రం గాంధీనగర్కు చెందిన సాజిత్ అన్సారీ, బోజ్పూర్ జిల్లాకు చెందిన జూలీ ప్రవీణ్లకు ఇటీవలే వివాహం జరిగింది. పశ్చిమబెంగాల్కు గంజాయి రవాణా చేస్తే అధిక మొత్తంలో డబ్బులు ఇస్తామని మధ్యవర్తులు ఆశ చూపడంతో అక్రమ రవాణాకు అంగీకరించారు. ఈ క్రమంలో పలాస రైల్వే స్టేషన్కు వచ్చిన వీరిని అనుమానించిన ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఎం.మాల్యాద్రి బ్యాగులను పరిశీలించారు. అందులో 40 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందని అంచనా. నిందితులను అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జి.ఆర్.పి స్టేషన్ ఇన్చార్జి ఎం.మధుసూదనరావు కేసు నమోదు చేశారు. నిందితులను విశాఖ జైలుకు తరలించినట్టు రవికుమార్ చెప్పారు. -
నేతల యూరియా మేత!
టీడీపీ నాయకుడు సిమ్మ చంద్రశేఖర్ డబ్బు ఇవ్వకుండా 100 బస్తాలు దాచేయమన్నారు. అప్పటికే రైతులు ఆధార్ కార్డు, వన్బీ, డబ్బులు పట్టుకుని ఉన్నారు. ఈయన డాక్యుమెంట్స్ ఇవ్వలేదు సరికదా రైతులకు యూరియా ఇవ్వవద్దని అన్నారు. కానీ, రైతులకే ఇచ్చాను. దీంతో ఆయనకు ఇవ్వలేదని ఎమ్మెల్యేకు చెప్పి నాకు డిప్యూటేషన్పై వేసేశారు. – ఇదీ కిల్లాం మాకివలసలో విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్కు ఎదురైన పరిణామం నరసన్నపేట పీఏసీఎస్కు వచ్చిన 400బస్తాలు యూరియా టీడీపీ నాయకులే పంచుకున్నారు. ఇతరులెవ్వరికీ ఇవ్వలేదు. ఇలా చేస్తే రైతులు ఏమవ్వాలి. – మండల సమావేశంలో ఎంపీటీసీ ప్రతినిధి కింతలి చలపతిరావు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో యూరియాను టీడీపీ నేతలు హైజా క్ చేస్తున్నారు. యూరియా పంపిణీ విషయంలో విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు (వీఏఏ) ఎంత ఒత్తిళ్లకు గురయ్యారో ఇటీవల జరిగిన సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. డబ్బులు చెల్లించకుండా టీడీపీ నాయకులు దౌర్జన్యంతో యూరియా ఎలా తీసుకెళ్లారో వారు ధర్నా చేసి మరీ వివరించారు. జిల్లాకు 51 వేల మెట్రిక్ టన్నుల వరకు యూరియా అవసరం కాగా 25 వేల మెట్రిక్ టన్నుల లోపే రావడంతో కొరత ఏర్పడింది. వచ్చిన అరకొర యూరియాలో చాలా వరకు టీడీపీ నాయకులు తమ ఇళ్లల్లో దించుకున్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఉన్న యూరియాను సైతం 50, 100, 150 బస్తాలు చొప్పున టీడీపీ నాయకులు దౌర్జన్యంతో తీసుకెళ్లిపోయారు. విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్కు ఫోన్లు చేసి, నేరుగా కలిసి, తమకు ప్రత్యేకంగా బస్తాలు దాచాలని చెప్పారంటే జిల్లాలో ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. నేతల ఒత్తిళ్లకు తలొగ్గి చాలాచోట్ల తలొగ్గాల్సి వచ్చింది. ఎక్కడైతే వ్యతిరేకించారో వారు షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లు, డిప్యుటేషన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకా దారుణమేంటంటే అడ్డగోలుగా తీసుకెళ్లిపోయిన యూరియా బస్తాలకు డబ్బులు కూడా చెల్లించలేదు. ఆ భారాన్ని విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ భరించాల్సి వచ్చింది. అసలే వారికి అరకొర జీతాలు, ఆపైన యూరియా సొమ్ము సొంతంగా చెల్లింపులు వెరసి ఆర్థికంగా నష్టపోయారు. నిదర్శనాలు ఇవే.. ● కరగాం పంచాయతీ టీడీపీ నాయకుడు పంగ బావాజీ మొదట విడతగా 45బస్తాలు టీడీపీ నేతల ఇళ్లకు చేరుతున్న యూరియా యూరియా కోసం విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లపై తీవ్ర ఒత్తిళ్లు తప్పని పరిస్థితుల్లో తలొగ్గిన వీఏఏలు మాట వినని వీఏఏలపై కక్ష సాధింపు చర్యలు డబ్బులు సైతం ఇవ్వకుండా యూరియా బస్తాలు తీసుకెళ్లిపోయిన దుస్థితి మానసికంగా, ఆర్థికంగా క్షోభకు గురవుతున్న విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు తీసుకెళ్లారు. రెండో విడతగా రైతులకు ఇస్తానని మరో 50 బస్తాలు తీసుకెళ్లిపోయారు. వాటిని సొంతానికి వాడుకున్నారు. ఏ రకంగా ఇచ్చారని స్థానిక టీడీపీ కార్యకర్తే వ్యతిరేకించారు. వీవీఏను నిలదీశారు. జాయింట్ డైరెక్టర్ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇచ్చామని విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ సమాధానం ఇచ్చారు. రణస్థలం మండలంలో రావాడ, రణస్థలం పంచాయతీలో యూరియా పూర్తిగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో, వాళ్లకు అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకుండా పంచాయతీలో ఉన్న రైతుల్ని పక్కన పెట్టి పక్క జిల్లా షాపులకు విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి. సంచాం పంచాయతీలో యూరియా పంపిణీ సమయంలో మహిళా విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్పై దుర్భాషలు, పరుషపదజాలం వాడి ఉద్యోగికి తీవ్రమైన మానసిక ఒత్తిడికి కలిగించడం వల్ల ఆ ఉద్యోగి మెడికల్ లీవ్కు వెళ్లే పరిస్థితి వచ్చింది. -
పక్షుల విడిదిలో.. సమస్యల కొలువు
తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రంలో చెట్లపై ఉన్న పక్షులు (ఫైల్) టెక్కలి రూరల్ : ప్రముఖ పర్యాటక స్థలం, విదేశీ పక్షుల విడిది తేలినీలాపురంలో సమస్యలు తిష్ఠవేశాయి. ఏటా శీతాకాలం ఆరంభంలో సైబీరియా దేశం నుంచి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ అనే వలస పక్షులు టెక్కలి మండలం తేలినీలాపురంలోని విదేశీ పక్షుల కేంద్రానికి చేరుకుని సంతానోత్పత్తి చేసుకుని తిరిగి తమ పిల్లలతో కలిసి వెల్లిపోతాయి. ఈ ఈ పర్యాటక కేంద్రం వద్ద చింతచెట్లపై చేసే విన్యాసాలు, కేరింతలు చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా పర్యాటకులు తరలివస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ కేంద్రంలో ఇటు పక్షులకు అటు పర్యాటకులకు అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధాన ఇబ్బందులివే.. ఏటా ఇక్కడి పక్షులను చూసేందుకు వచ్చే వారికి అనేక సమస్యలు స్వాగతిస్తున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. అరకొరగా ఉన్న మరుగుదొడ్లకు తలుపులు విరిగిపోవడంతో నిరుపయోగంగా మారాయి. చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన క్రీడా సామగ్ర సైతం పాడైపోయాయి. పక్షులను చూసేందుకు ఏర్పాటు చేసిన వాచ్ టవర్ నిర్మాణం జరిగి దశాబ్దాలు పూర్తికావడంతో శిథిలావస్థకు చేరుకోవడంతో పర్యాటకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా కింద పడిన పక్షులకు సైతం సరైన సంరక్షణ ఉండటం లేదని స్థానికులు చెబుతున్నారు.ఇటీవల రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రాన్ని సందర్శించి కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అభివృధ్ది చేస్తామని ఇచ్చిన హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయారని, ఇప్పటికై న సంబంధిత అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. తేలినీలాపురంలో కనీస సౌకర్యాలు కరువు శిథిలావస్థకు వాచ్టవర్ మౌలిక వసతులు లేక పర్యాటకుల అవస్థలు -
ఉద్యోగం చేయాలంటే భయమేస్తోంది
● డీఆర్డీఏ పీడీని కలిసిన ఏపీఎంలు శ్రీకాకుళం పాతబస్టాండ్: డీఆర్డీఏ వెలుగులో మండల స్థాయిలో ఏపీఎం క్యాడర్లో ఉద్యోగాలు చేయడం కత్తి మీద సాములా మారిందని, రాజకీయ నాయకులు వారి అనుచరుల నుంచి దాడు లు, ఇబ్బందులు వస్తున్నాయని, రక్షణ కల్పించా లని వెలుగు ఏపీఎంల సంఘం ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ను కలిసి విన్నవించారు. ఇటీవల కొత్తూరు ఏపీఎం ఎ.లలితపై కొత్తూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని తెలిపారు. అధికారుల సూచనలతో సేవలు అందిస్తున్నా రాజకీయ ఒత్తిళ్లు భరించలేకపోతున్నామని తెలిపారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని, అరెస్టు చేసేలా చూడాలని కోరారు. అన్ని పనులు చేస్తు న్నా, కొంతమంది నాయకులు కావాలనే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. కొత్తూరుకు చెందిన వెలుగు సిబ్బందితో రహస్య సమావేశాలు పెడుతున్నారని, దీన్ని నివారించాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో ఏపీఎంల జిల్లా అధ్యక్షుడు సనపల ప్రసాద్, ఏపీఎంలు జాంబవతి, ఉమ, సుశీల, రజిని, లక్ష్మి, విజయకుమారి, లక్ష్మి, గోవిందు, ప్రసాద్, కూర్మారావు, మనోరత్నం, హేమ సుందర్, రాజారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి మందలించాడని..
బూర్జ : సెల్ఫోన్ పోయిందని తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైన బూర్జ గ్రామానికి చెందిన గుడిదాపు మణి(33) ఈ నెల 1న కూల్డ్రింక్లో గడ్డి మందు కలిపి తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు పాలకొండ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మణి గతంలోనూ కుటుంబ కలహాల నేపథ్యంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య లలితకుమారి, రెండేళ్ల కుమారుడు సోహిత్ ఉన్నాడు. తండ్రి అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.ప్రవళ్లిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షాక్తో సచివాలయ ఉద్యోగి మృతి జలుమూరు/టెక్కలి రూరల్: టెక్కలిపాడు సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న మామిడి సురేష్ (34) శుక్రవారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. కోటబొమ్మాళి సబ్ డివిజన్లోని కిష్టుపురం వద్ద విద్యుత్ లైన్కు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలు తొలగిస్తుండగా పక్కనే ఉన్న 11 కె.వి.లైన్ తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రథమ చికిత్స చేసి కోటబొమ్మాళి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సురేష్ స్వగ్రామం పాగోడు. తల్లిదండ్రులు, భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా, సచివాలయం పరిధిలో ఉన్న ఉద్యోగికి వేరే మండలంలో ఎలా డ్యూటీలు వేస్తారని గ్రామ సర్పంచ్ దామ మన్మధరావుతోపాటు కుటుంబ సభ్యులు విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. సురేష్ మృతితో పాగోడులో విషాద ఛాయలు అలముకున్నాయి. -
‘చంద్రబాబుకి గుణపాఠం చెప్పాలి’
ఇచ్ఛాపురం: దళితుల్లో రిజర్వేషన్లు సృష్టించి మాలలకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి గుణపాఠం చెప్పాలని రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వాహకులు, రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్బాబు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెన్న కేశవులు అన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కు శుక్రవారం ఇచ్ఛాపురంలో ముగింపు పలికారు. పట్టణంలో మెయిన్ రోడ్డు నుంచి బస్టాండ్ వరకు యాత్ర నిర్వహించారు. అనంతరం బస్టాండ్ కూడలిలో గల బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. రాష్ట్రంలో 42 లక్షల మంది మాలలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారన్న కక్షతో రాష్ట్రంలో రిజర్వేషన్లను ఏర్పాటుచేసి మాలలకు సామాజికంగాను, ఉద్యోగపరంగా చా లా అన్యాయం చేశారని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సల్లా దేవరాజ్, నూతలపాటి బాబురావు, నగిరి మోహన్రావు, పందిరి లోకేష్, రామారావు, వెంకటరావు, గువ్వాడ దిలీప్, డి.వాసు, బా గ నగేష్, బాగ వేణు, కొప్పల హేమంత్, ప్రియ, తులసీ తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలు నేరం
శ్రీకాకుళం అర్బన్: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి ఐ.విమల అన్నారు. శుక్రవారం నగరంలోని గూనపాలెంలో శాంతినికేతన్ కళాశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాలికలకు చిన్నతనంలోనే వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికై నా బాల్యవివాహాలు జరిగితే 1098కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్.అప్పలరాజు, వార్డు ఇన్చార్జి కొర్ను నాగార్జున ప్రతాప్, సీడీపీఓ నాగరాణి, సూపర్వైజర్లు బి.యోగేశ్వరి, యశోద, పి.సీతామహాలక్ష్మి, కళ్యాణి పాల్గొన్నారు. -
మూడు వేల మెట్రిక్ టన్నుల ఎరువులేవీ?
● సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ ఇచ్ఛాపురం రూరల్: కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు జిల్లాకు మూడు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందజేశామని చెబుతున్నారని, అవి ఎప్పుడు వచ్చాయి.. ఎంత మంది రైతులకు అందజేశారో తెలియజేయాలని జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. శుక్రవారం ఇచ్ఛాపురం ఎంపీపీ బోర పుష్ప అధ్యక్షతన ఎంపీడీఓ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యవసాయాధికారి పి.పి.వి.వి.అజేయ్కుమార్ వ్యవసాయ సమీక్షలో మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు దక్కత ఏకాంబరి కలగజేసుకొని కేంద్ర మంత్రి జిల్లాకు 3వేల టన్నుల ఎరువులు అందజేశారని, ప్రతిపక్షం కావాలనే ఆరోపణలు చేస్తోందన్నారు. మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, సర్పంచ్ పి.రాజశేఖర్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎరువులకు కొరత ఉండేది కాదని, కూటమి ప్రభుత్వంలో మాత్రం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని, ఒడిశాలో వెయ్యికి చొప్పున బస్తా యూరియాను కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్కు సంబంధించి ఇప్పటి వరకు ఈ–క్రాప్ చేయలేదని, పంటలు నష్టపోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీ అందించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని పలువురు సభ్యులు ఆరోపించారు. జెడ్పీ చైర్పర్సన్ విజయ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతుకు ఎరువులు అందించామని, కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద ఆ పార్టీ సానుభూతిపరులకు మాత్రమే అందిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో బాహుదానదిపై సుమారు రూ.20 కోట్లతో కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు, అంచనా విలువలు, ఆమోదం పూర్తయితే కూటమి ప్రభుత్వం రద్దు చేయడం దారుణమన్నారు. ఒడిశాకు చెందిన వ్యక్తులు ఆంధ్రాలో ప్రయోజనం పొందుతున్నారని, అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు సమయపాలన పాటించడం లేదని, పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ఇచ్చే సరుకులను అంగంట్లో అమ్మేస్తున్నారని సభ్యులు దక్కత ఏకాంబరి, దున్న గురుమూర్తిలు ఆరోపించారు. సమావేశంలో ఎంపీడీఓ కె.రామారావు, తహసీల్దార్ ఎన్.వెంకటరావు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
వ్యవసాయ డిప్లమో కోర్సుల ప్రవేశాలకు కౌన్సెలింగ్
ఆమదాలవలస : ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 15వ తేదీన గుంటూరులోని లామ్ ఫారంలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆమదాలవలస మండలం తొగరాం ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీపాన నీలవేణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికార వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు అసలు రిజిస్ట్రేషన్ చేయించుకోని వారు సైతం 10వ తరగతి పాస్ అయి ఉంటే హాజరు కావచ్చున ని తెలిపారు. పూర్తి వివరాలకు 77023 94824 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
యూరియా.. ఇంత నిర్లక్ష్యం ఎందుకయ్యా..?
● వానకు తడిచిపోతున్న యూరియా బస్తాలు ● ఆమదాలవలస రైల్వే గూడ్స్షెడ్ వ్యాగన్ నుంచి వర్షంలోనే లారీలకు లోడ్చేస్తున్న దృశ్యం ● అపరాధ రుసుం భయంతో ప్లాట్ఫాంపైనే నిల్వలు ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని వ్యవసాయ శాఖ అధికారులు ప్లాట్పాంపై వర్షంలో తడుస్తున్న యూరియా నిల్వలు ఆమదాలవలస రూరల్: అసలే యూరియా కొరతతో జిల్లా సతమతమవుతూ ఉంటే వచ్చిన సరుకును కూడా సరిగా సంరక్షించకుండా అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఆమదాలవలస రైల్వే స్టేషన్కు యూరియా నిల్వలు వస్తాయన్న సంగతి తెలిసిందే. ఎన్డీఆర్ సంస్థకు సంబంధించి గురువారం సాయంత్రం ఓ వ్యాగన్ రాగా.. మరో వ్యాగన్ శుక్రవారం ఉదయం వచ్చింది. కానీ శుక్రవారం ఉదయం ఎడ తెరిపి లేని వాన కురవడంతో యూరియా తడిచి ముద్దయ్యింది. వాస్తవంగా రైల్వేగూడ్షెడ్ వ్యాగన్ నుంచి వచ్చిన సరుకులను ఆ వ్యాగన్ పరిమాణాన్ని బట్టి 5–8 గంటల్లోపు ఖాళీ చేయాలి. లేదంటే రైల్వే శాఖకు అపరాధ రుసుం కట్టాలి. అపరాధ రుసుం భయంతో కంపెనీ యజమానులు యూరియాను వర్షంలోనే అన్లోడ్ చేశారు. దీంతో యూరియా తడిచిపోయింది. వ్యవసాయాధికారుల ఆచూకీ కరువు అసలే రైతులు ఎరువుల కోసం నానా ఇబ్బందులు పడుతుంటే.. వ్యవసాయ శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎరువులు ప్రభుత్వానివైనా, ప్రైవేటువైనా వ్యవసాయ శాఖాధికారులు వ్యాగన్ వద్దకు వచ్చి పరిశీలించాలి. వర్షం వచ్చిన సమయంలో వ్యాగన్ నుంచి యూరియా దించేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. ఒక వేళ అన్లోడ్ చేసినా కనీసం టార్పాలిన్లు అయినా కప్పాలి. కానీ శుక్రవారం లోడ్ రాగా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వర్షానికి తడిచిన యూరియా పటుత్వం కోల్పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
కోళ్ల వ్యాన్ బోల్తా
● కోళ్లు తీసుకెళ్లేందుకు ఎగబడిన జనం టెక్కలి రూరల్: స్థానిక జగతిమెట్ట సమీప జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున కోళ్ల లోడు తో వెళ్తున్న వ్యాన్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఒడిశా నుంచి కోళ్ల లోడ్తో టెక్కలి మీదుగా బొబ్బి లి వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్ టెక్కలి సమీప జగతిమెట్ట వద్దకు వచ్చే సరికి టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ అమిర్ భాషాకు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం హైవే సిబ్బంది కోళ్ల వ్యాన్ను పక్కకు తీశారు. వ్యాన్లో దాదాపు 1400 కోళ్లు ఉండగా అందులో సగానికి పైగా మృతిచెందాయి. దీంతో ఆ చనిపోయిన కోళ్ల కోసం చుట్టు పక్కల ప్రాంతాల వారు ఎగబడ్డారు. ఎవరికి దొరికిన కోళ్లను వారు తీసుకెళ్లిపోయారు. మృతి చెందిన కోళ్ల విలువ రూ.లక్షల్లో ఉంటుందని యజమాని తెలిపారు. టమాటా లారీ బోల్తా రణస్థలం: లావేరు మండలంలోని రావివలస సమీపంలో జాతీయ రహదారి–16పై శుక్రవారం తెల్లవారుజామున టమాటా లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్కు గాయాలు కావడంతో 108పై శ్రీకాకుళం తరలించారు. రహదారికి అడ్డంగా లారీ పడిపోవడంతో గంట పాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. -
పలాస డిగ్రీ కళాశాలకు యునిసెఫ్ గుర్తింపు
పలాస: పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్) గుర్తింపు లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరు జె.వెంకటలక్ష్మి చెప్పారు. కళాశాలలో శుక్రవారం జరిగిన స మావేశంలో ఆమె మాట్లాడుతూ 2024–25 విద్యాసంవత్సరంలో లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రొగ్రాంలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభకు గాను ఈ గుర్తింపు లభించిందన్నారు. పలాసను రాష్ట్ర స్థాయిలో పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారని చెప్పారు. ఈ సందర్భంగా ఈ ప్రాజె క్టు కింద ఎంపికై న 30 మంది విద్యార్థులకు ప్రథమ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేసిన డాక్టరు నారాయణ, భరత్ గుప్తా, డాక్టరు సి.కృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గణపతిరావు, ఎంఈఓ శ్రీనివాసరావు, ఆర్.అప్పారావు, జె.శంకర్, జి.గొల్ల, దీపకుమారి అధ్యాపకులు పాల్గొన్నారు. ఎంపీడీఓలుగా పదోన్నతి శ్రీకాకుళం న్యూకాలనీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి, నాణ్యమైన సేవలను అందించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ పేర్కొన్నారు. జెడ్పీ బంగ్లాలో మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో డిప్యూటీ ఎంపీడీఓ/పరిపాలనాధికారులుగా పనిచేస్తున్న పలువురు ఉద్యో గులకు ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో వీరికి నియామక పత్రాలను అందజేశారు. నియామక పత్రాలు అందుకున్నవారిలో జె.ఆనందరావు, (డిప్యూటీ ఎంపీడీఓ, ఎంపీపీ, కోటబొమ్మాళి)ను రాజాం ఎంపీడీఓగా, టి.రాజారావు (డిప్యూటీ ఎంపీడీఓ, ఎంపీపీ నందిగాం)ను వంగర మండలం ఎంపీడీఓగా, ఎస్.వసంతకుమారి (డిప్యూటీ ఎంపీడీఓ, ఎంపీపీ కొత్తూరు)ను భామిని ఎంపీడీఓగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. నూతన అధికారులు జెడ్పీ చైర్పర్సన్ను సత్కరించారు. మంచి సేవ లు అందించి అధికారులు, ప్రజల మన్ననలు అందుకోవాలని ఈ సందర్భంగా పిరియా విజయ ఆకాంక్షించారు. ముగిసిన కళా ఉత్సవం పోటీలు గార: వమరవల్లి డైట్లో గత రెండు రోజులుగా జరిగిన కళా ఉత్సవం–2025 పోటీలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. రెండో రోజు నిర్వహించిన పోటీల్లో థియేటర్ విజిల్ ఆర్ట్స్ విభాగంలో కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్, విజువల్ ఆర్ట్స్ త్రీడీ అండ్ టూడీ విభాగంలో కవిటి హైస్కూల్, ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్ కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ ప్రథమ స్థానంలో నిలిచాయి. వీరికి డిప్యూటీ డీఈఓ ఆర్. విజయకుమారి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గౌరిశంకర్, నోడల్ అధి కారి తడేల వెంకటరావు పాల్గొన్నారు. బకాయిలను తక్షణమే చెల్లించాలి వజ్రపుకొత్తూరు రూరల్: ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చేపడుతున్న నిరసన వారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పెండింగ్లో ఉన్న 4 డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి మెమో నంబర్ 57ను తక్షణమే అమలు చేయాలని, 12వ పీఆర్సీ కమీషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని డిమోండ్ చేశారు. అలాగే ఈహెచ్ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాల ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమీ కమిటీ సెల్ కన్వీనర్ ఎల్.కరుణాకర్, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
పాఠశాల తరలింపుపై నిరసన
బూర్జ: అల్లెన ప్రాథమికోన్నత పాఠశాలను గ్రామంలోనే కొనసాగించాలని, వేరే పాఠశాలలో విలీనం చేయవద్దని కోరుతూ సర్పంచ్ జడ్డు మహేష్, విద్యార్థుల, తల్లిదండ్రులు, గ్రామస్తులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఇంత వరకు ఆన్లైన్లో హాజరు నమోదు చేయకపోవడం తగదన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం సమగ్ర శిక్ష ఏఎంఓ చిగురుపల్లి సుధాకరరావు, సీఎంఓ బొడ్డేపల్లి శ్రీధర్, ఐఈసీఓ గోవిందరావు వద్ద సమస్య వివరించారు. ఇక్కడి 3, 4, 5వ తరగతులను పాలవలస ప్రైమరీ మోడల్ స్కూల్కు, 6, 7, 8వ తరగతులను పాలవలస జెడ్పీ హైస్కూల్కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగావళి నది ఒడ్డున ఉన్న పాలవలస వెళ్లాలంటే సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని, అంతదూరం చిన్నారులు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నిరసన కార్యక్రమంలో సర్పంచ్తో పాటు విద్యాకమిటీ చైర్మన్ మురపాక శంకరరావు, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి శ్రీకాకుళం న్యూకాలనీ: మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.అనిత అన్నారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సీ్త్ర ఆరోగ్యంపై అవగాహన, చికిత్స, వైద్య పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు స్వస్థనారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా ఎన్.సి.డి స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రసూతి సంరక్షణ, తల్లి, పిల్లల రక్షణ కార్డ్, ఇమ్యునైజేషన్, రక్తహీనత స్క్రీనింగ్, రుతు పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు వివరించారు. -
కూటమిలో కొండంత
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమి నేతల మధ్య రాజకీయం రచ్చకెక్కుతోంది. గ్రావెల్ కొండ కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు, అనుచరులు పట్టుబడుతుండడంతో వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. రణస్థలం మండలం సంచాం కొండపై గ్రావెల్ తవ్వకాల విషయంలో గత ఎనిమిది నెలలుగా అంతర్గత పోరు జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా తవ్వకాలు జరిపిన యంత్రాలపై ఓ వర్గం గొడవకు దిగింది. అనుమతులు ఉన్నా స్థానికుల అభ్యంతరాలు ఉన్నాయని, తవ్వకాలు జరపడానికి వీల్లేదని ఎమ్మెల్యే ఎన్ఈఆర్ అనుచరులు పొక్లెయినర్ ధ్వంసం చేసి, అందులో ఉండాల్సిన రెండు బ్యాటరీలు, కొన్ని కేబుళ్లు పీకేయడమే కాకుండా మార్గం మధ్యలో రాకపోకలు సాగకుండా పెద్ద గుంత తీశారంటూ అసలు లీజుదారుడు, సబ్ లీజు దారుడు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రణస్థలం మండలంలోని సంచాం కొండలోని గ్రావెల్ తవ్వకాల కోసం గత కొన్ని నెలలుగా బీజేపీ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు అండ్కో, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అండ్ కో మధ్య వివాదం నలుగుతోంది. సంచాం రెవెన్యూ పరిధిలోని 89/6లో గుండు కై లాష్ పేరున 7 ఎకరాల గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. కై లాష్ పేరు మీద అనుమతులు ఉన్నప్పటికీ వారి బంధువు లంకలపల్లి శంకరరావు నిర్వహణ చేస్తూ వస్తున్నారు. అయితే, లీజు తవ్వకాల నిర్వహణను తమకు ఇవ్వాలని ఎన్ఈఆర్ అండ్కో గత కొంతకాలంగా అడుగుతోంది. కానీ, వారి మధ్య ఆర్థిక పరమైన అంగీకారం కుదరకపోవడంతో వ్యవహరం చెడింది. ఇదే సమయంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సోదరుడి కుమారుడు రాజేష్తో లీజు దారుడికి ఆర్థిక పరమైన ఒప్పందం జరిగింది. గతంలో అనధికార తవ్వకాల వివాదం.. సంచాం కొండపై అక్రమ తవ్వకాలు పరిపాటిగా మారిపోయాయి. అక్కడున్న గ్రావెల్ను అక్రమంగా తరలించుకుని పోతున్నారు. ఇదంతా అనధికారికమే. ఓ ఎమ్మెల్యే రాత్రి పగలు ఇక్కడ తవ్వకాలు జరిపి వందల లోడ్లు తరలించి తన ఇల్లు, స్కూల్ ప్రాంగణాలను సరిచేసుకున్నారు. అప్పట్లో గొడవ కూడా జరిగింది. అక్రమంగా తరలిస్తున్న లారీలను స్థానికులు పట్టుకున్నారు. కానీ పట్టుకున్న వారిని బెదిరించి, వేధింపులకు గురి చేయడంతో అక్రమం కాస్త సక్రమమైంది. ఆ తర్వాత కూడా వేలాది లోడ్లు ఆ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే తరలించారు. తాజాగా అధికారిక తవ్వకాల గొడవ.. కొండపై పొక్లెయిన్, లారీలను పెట్టి బుధవారం పనులు ప్రారంభించారు. రాత్రి 7 గంటలకు వరకు పనులు చేసి, ముగించుకుని పొక్లెయినర్ను కొండపైన వదిలేసి వెళ్లిపోయారు. గురువారం ఉదయం డ్రైవర్ వచ్చి చూసేసరికి పొక్లెయినర్ అద్దాలు పగలగొట్టి ఉన్నాయి. అందులో ఉండాల్సిన రెండు బ్యాటరీలు, కొన్ని కేబుళ్లు కనిపించలేదు. సమాచారం తెలుసుకున్న లీజుదారులు వచ్చి పరిసరాలు పరిశీలించారు. మార్గమధ్యంలో రాకపోకలు సాగకుండా పెద్ద గుంత తీసి ఉందని, పొక్లెయినర్ ధ్వంసం చేశారని ఇదంతా ఎమ్మెల్యే అనుచరులే చేశారని ఆరోపించారు. గొడవ పెద్దది కావడంతో ప్రత్యేక ఎస్టీఎఫ్ బలగాలతో పాటు, జేఆర్ పురం, లావేరు ఎస్ఐలు ఎస్.చిరంజీవి, జి.లక్ష్మణరావు, పోలీస్ సిబ్బంది భారీగా చేరుకున్నారు. కొంత సమయం తర్వాత తహసీల్దార్ వచ్చారు. ఇక్కడ తవ్వకాలకు అనుమతులు ఉన్నా స్థానిక గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తవ్వకాలు జరపరాదని, ఈ అంశంపై గత తహసీల్దార్ ఎన్.ప్రసాదరావు నవంబర్ 2024లో భూగర్భ గనుల శాఖ అధికారులకు లేఖ రాశారని, ఆ లేఖపై ఇంకా ఎలాంటి వివరణ రానందున తవ్వకాలు నిలిపివేయాలని లీజుదారుడికి పోలీసుల సమక్షంలో చెప్పేశారు. ఎన్ఈఆర్ అనుచరులు వర్సెస్ కూన అనుచరులు రణస్థలం మండలం సంచాం కొండపై గ్రావెల్ గొడవ అనుమతుల లీజు కోసం పోరు ఆర్థిక వ్యవహారాల ఒప్పందం మేరకు దక్కించుకున్న కూన రవికుమార్ అండ్ కో తమకు ఇవ్వలేదన్న ఆవేదనలో ఎన్ఈఆర్ అండ్ కో రచ్చకెక్కుతున్న వ్యవహారం -
జాతీయ లోక్ అదాలత్ రేపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 13న జరగనున్న అదాలత్లో రాజీకి అనువైన క్రిమినల్, సివిల్, మోటారు ప్రమాదాలు, ప్రీ లిటిగేషన్ కేసులను ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. కక్షిదారులు ఎలాంటి విభేదాలు లేకుండా సఖ్యతతో సమస్యలను ముగించుకోవాలని సూచించారు. భావోద్వేగాలకు లోనుకాకుండా, సత్ప్రవర్తనతో ముందుకు సాగాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, అందువల్ల ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు కూడా ఉన్నారు.విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి మందస: బుడార్సింగి పంచాయతీ కొరడాలు గ్రామానికి చెందిన సీర రమేష్(35) గురువారం తన ఇంట్లో టేబుల్ ఫ్యాన్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.యువకుడు ఆత్మహత్యఎచ్చెర్ల : ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన సీపాన రామకృష్ణ (27) అలియాస్ రాకీ అనే యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎచ్చెర్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ వరకు చదివిన రామకృష్ణ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు సంస్థ వద్ద సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకున్నారు. తల్లి లక్ష్మీ వ్యవసాయ పనుల నుంచి తిరిగి ఇంటికి వచ్చే సమయానికి కుమారుడు ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించింది. రామకృష్ణ తండ్రి జగన్నాథం పదిహేనేళ్ల క్రితం నుంచి ఇంటినుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. తల్లి అన్నీ తానై కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. రామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తహసీల్దార్ను ప్రశ్నించిన లీజుదారులు..
గ్రావెల్ లీజుకు అనుమతులు ఉన్నా స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఇబ్బంది పెడుతున్నారని లంకలపల్లి శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనం ధ్వంసం చేశారని దీనిపై పోలీసులను ఆశ్రయిస్తామన్నారు. ఇదే కొండలో గత వారం రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా వేలాది గ్రావెల్ లోడ్లు ఎలా తరలించారని, దీని వెనుక ఎవరున్నారని తహసీల్దార్ను ప్రశ్నించారు. అలాగే కూన రవికుమార్ అనుచరుడు సీహెచ్ శ్రీనివాస్ కూడా తహసీల్దార్తో వాగ్వాదం చేశారు. అనుమతులపై అభ్యంతరాలు ఉంటే భూగర్భ గనుల శాఖ ఈనెల 2వ తేదీన రూ. 25వేల సీనరేజీ ఫీజు ఎలా కట్టించుకుందని, సమస్య ఉంటే కట్టించకోరు కదా, ఇదే కొండలో పక్కన అనుమతుల్లేకుండా వేలాది లోడ్లు తరలించారు, వాటిని ఏ అధికారైనా పట్టుకున్నారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంలో కూన రవికుమార్ ఫోన్ చేస్తున్నారు.. చూడండి అని తహసీల్దార్కు చెప్పగా ఈ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయలేమని చెప్పేశారు. -
కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు పటిష్ట భద్రత
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండల కేంద్రంలో గల కొత్తమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలను ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పా టు చేయనున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం అయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్తో కలసి అలయ ప్రాంగణం పరిశీలించారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్కు ప్రత్యేక స్థలం కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, రెవెన్యూ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. ఉత్సాహంగా కళాఉత్సవం పోటీలు గార: వమరవల్లి డైట్లో జిల్లాస్థాయి కళా ఉత్స వం పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యా యి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను గురువారం సమగ్ర శిక్షా ఏపీసీ శశిభూషణరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఏపీసీ శశిభూషణ రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉండే ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ గౌరీ శంకర్ మాట్లాడుతూ జిల్లాస్థాయి విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. తొలిరోజు దాదా పు 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గాత్ర సంగీతంలో వందరాపు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి వెంకటేష్, వాయిద్య సంగీతంలో ముత్యాలపేట స్కూల్ విద్యార్థిని సీహెచ్ వర్షిణి, గ్రూప్ సాంగ్లో టెక్కలి ఎంజేపీ ప్రథమ బహుమతి సాధించారు. కార్యక్రమంలో తాడేల వెంకటరావు, డైట్ లెక్చరర్లు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలి
శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్కాలనీ) : పెరిగిన ఎస్సీ జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాల, రెల్లి, అనుబంధ కులాల వారికి తీవ్ర అన్యాయం జరుగుతున్నందున ప్రభుత్వాలు పునారాలోచన చేయాలని కోరారు. క్రిమిలేయర్ రద్దు చేయాలని, ప్రైవేటు రంగాల్లోనూ ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తింపజేయాలన్నారు. ఈ మేరకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, ఎస్సీ, ఎస్టీ దళిత సంఘాల జేఏసీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్కు వ్యతిరేకంగా శ్రీకాకుళం నగరంలో పాదయాత్ర చేపట్టారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకూ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర పేరుతో చేపట్టిన ఈ పాదయాత్ర శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకూ కొనసాగింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకులు తొల్లిబిల్లి అశోక్బాబు, డాక్టర్ చెన్నకేశవులు తదితరులు అంబేడ్కర్ జంక్షన్ వద్ద రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల అర్పించారు. కార్యక్రమంలో అంబేడ్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను, జిల్లా దళిత సంఘాల జేఏసీ నేతలు కళ్లేపల్లి రామ్గోపాల్, బడియా కామరాజు, కంఠ వేణు, ముంజేటి కృష్ణ, యజ్జల గురుమూర్తి, పొన్నాడ రుషి, దళిత ఉద్యోగుల సంఘ నేతలు ఆర్.వేణుగోపాల్, బోనెల రమేష్ , చల్లా రామారావు, న్యాయవాదులు మురళీకృష్ణ, జె.శ్రీనివాసరావు, పురుషోత్తం రాంబాబు, యడ్ల జానకి, నేతల అప్పారావు, సుంకు రమణ, పెయ్యల చంటి, అరుబారిక రాజు, లక్ష్మణ, రాము, సూర్యనారాయణ, బుడుమూరు రామారావు, పంకు మహేష్, పంకు మురళీ, అబ్బాస్, శంకర్ , భాస్కరరావు, లింగాల మల్లేశరి, శీర రాజేశ్వరి, హారతి పాల్గొన్నారు. -
గంజాయితో ఇద్దరు అరెస్టు
పలాస: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పర్లాకిమిడి నుంచి బస్సులో గంజాయితో వచ్చి కాశీబుగ్గ బస్టాండ్లో బుధవారం దిగారు. అక్కడి నుంచి పలాస రైల్వే స్టేషన్కు వెళ్తుండగా కాశీబుగ్గ ఎస్ఐ నర్సింహమూర్తి అనుమానంతో తనిఖీ చేశారు. అందులో 10.815 కిలోల గంజాయిని గుర్తించడంతో వెంటనే అరెస్టు చేసి గంజాయిని సీజ్ చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు గురువారం విలేకరులకు తెలియజేశారు. అరెస్టయిన వారిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అల్గాపూర్కు చెందిన రోహిత్, ఉన్నా జిల్లాకు చెందిన నూర్ దీన్ ఉన్నారు. వీరు ఒడిశారాష్ట్రం బడగర్త్ బిట్ కాలనీ చెందిన సుమన్ మానిక్ నుంచి గంజాయి తెచ్చారని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ నర్సింహమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
పాముకాటుతో ఇద్దరు మృతి
నరసన్నపేట: నడగాం పంచాయతీ శివరాంపురం గ్రామానికి చెందిన తోలాపి రమణమ్మ (50) పాముకాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నెల 5న ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాత్రి 11 గంటల సమయంలో రమణమ్మకు పాము కరిచింది. కొద్ది సమయం గమనించిన రమణమ్మ కుటుంబ సభ్యులకు చెప్పడంతో నరసన్నపేటలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. భర్త సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. రమణమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమె మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లుకలాపు రవి, నడగాం సర్పంచ్ జల్ల శిల్పా మాధురి సంతాపం వ్యక్తం చేశారు. బసవరాజుపేటలో.. హిరమండలం: ఎల్ఎన్పేట మండలం బసవరాజుపేటకు చెందిన వాన అప్పలనాయుడు (38) గురువారం పాముకాటుకు గురై మృతి చెందాడు. అప్పలనాయుడు గ్రామ సమీపంలోని పొలంలో ఎరువులు వేస్తుండగా పాముకాటు వేసింది. వెంటనే హిరమండలం పీహెచ్సీకి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అప్పలనాయుడుకు భార్య కుమారి, కుమార్తెలు చేతన, చైతన్య ఉన్నారు. -
వ్యవసాయ సిబ్బంది తిరుగుబాటు
జిల్లాలో ఎరువుల కొరత నిజమా.. కాదా..? నిల్వలు ఉన్నాయని నేతలు చెబుతున్న మాట వాస్తవమేనా..? వంటి ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక ఆందోళన సమాధానం చెప్పింది. జిల్లాలో ఎరువుల కొరత తీవ్రమన్న విషయం విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ల ఆందోళనతో బట్ట బయలైపోయింది. ఓ వైపు ఎరువుల కొరత.. మరోవైపు నాయకుల వేధింపులతో విధి నిర్వహణ నరకంగా మారిందని వారంతా రాత్రిపూట కలెక్టర్ ముందు మొర పెట్టుకున్నారు. ఈ పని చేయడం తమ వల్ల కాదంటూ గగ్గోలు పెట్టారు.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎరువుల పంపిణీ నుంచి తమను తప్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు గురువారం కలెక్టరేట్ కార్యాలయా న్ని ముట్టడించారు. రాత్రిపూట కలెక్టర్ కార్యాల యం ముందు బైఠాయించి ధర్నా చేశారు. మేల్, ఫిమేల్ అసిస్టెంట్లు రాత్రి పది దాటినా ఆకలితో అక్కడే ఉండి తమ కష్టాలు చెబుతూ నినాదాలు చే శారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు సొంత జిల్లాలో వ్యవసాయ శాఖకు చెందిన విలేజ్ అసిస్టెంట్ల తిరుగుబాటు సంచలనంగా మారింది.ప్రభుత్వం సరిపడా ఎరువుల సరఫరా చేయనందున ఉద్యోగులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, సరిపడా ఎరువులు పంపిణీ చేయాలని కోరినా పట్టించుకునే వారు లేరన్నారు. రైతు సేవా కేంద్రాల వద్ద రాజకీయ జోక్యం ఎక్కువగా ఉందని, సిబ్బంది విధులకు తీవ్ర ఆటంకం కలుగుతోందన్నారు. నిత్యం పోలీసుల బందోబస్తు ఇస్తున్నా భయంతోనే పనిచేస్తున్నామని, సిబ్బందిలో 50 శా తం మహిళలు ఉన్నారని, వారిలోనూ గర్భిణులు, బాలింతలు అధికంగా ఉన్నారని తెలిపారు. రాత్రి 10, 11గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టడం వల్ల మహిళా ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. రైతు సేవా కేంద్రాల నుంచి ఎరువుల అమ్మకం నగదును మార్కెఫెడ్ అధికారులు వసూలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.ఈ నెల 30లోపు ఖరీఫ్ ఈ–క్రాప్ నమోదు చేయాల్సి ఉందని, అత్యంత కీలకమైన ఈ సమయంలో ఎరువుల పంపిణీ, రికార్డుల నిర్వహణ బాధ్యతలు తలకు మించిన భారంగా మారాయని తెలిపారు. ఎరువుల పంపిణీ రియల్ టైమ్లో జరగాలంటే ఐఎఫ్ఎంఎస్ సేల్స్, డీబీటీ కోసం ఈపాస్ యంత్రాలను సరిపడా సరఫరా చేయాల్సి ఉన్నా చేయలేదన్నారు.రైతు సేవా కేంద్రాల ఉద్యోగులకు ఎరువుల పంపిణీ మాత్రమే కాకుండా ఇతర విధులు కూడా ఉన్నాయని, ఎరువులు లేకపోవడం వల్ల ఇతర బాధ్యతలు ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఆలస్యానికి సిబ్బందిని బాధ్యుల్ని చేస్తూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల్లో పీఏసీఎస్, డీసీఎంఎస్, గిరిజన సంఘాల ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయని, రబీలోనైనా మన జిల్లాలో అలా చేయాలన్నారు. సిబ్బంది ధర్నా అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కొన్ని గంటల సేపు వారితో చర్చించారు. అంతకుముందు తన చాంబర్లో వినతి పత్రం తీసుకున్నారు. కలెక్టర్ ఎంత నచ్చ చెప్పినా ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. రాత్రి 10గంటల దాటే వరకు ఆందోళన కొనసాగింది.100 బస్తాలు దాచేయమన్నాడు..నేను కిల్లాం మాకివలస రైతు సేవా కేంద్రంలో ఎరువుల పంపిణీ చూసేదాన్ని. చంద్రశేఖర్ అనే నాయకుడు డబ్బులు ఇవ్వకుండా 100 బస్తాలు దాచేయమని అన్నాడు. అప్పటికే రైతులు డబ్బులు, ఆధార్, ఇతర డాక్యుమెంట్స్ పట్టుకుని ఉన్నారు. వారిని కాకుండా 100 బస్తాలు ఎలా దాయగలను. ఆయన ల్యాండ్ డాక్యుమెంట్స్ చూపించలేదు. ఆధార్ ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వలేదు. ఏమీ ఇవ్వకుండా కనీసం 60 బస్తాలైనా పక్కన పెట్టి ఇవ్వాలని అన్నారు. కానీ, నేను ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యేకు చెప్పి నన్ను యారబాడుకు డిప్యుటేషన్పై వేసేశారు. నాకు చిన్న బాబు ఉన్నాడు. ఎంతో ఇబ్బందులు పడు తున్నాను. నాకు ఫోన్లు చేసి ఎంతో ఇబ్బంది పెట్టారు.– లావణ్య, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్బూతులు తిడుతున్నారురైతు సేవా కేంద్రం నాలెడ్జ్ సెంటర్గా అని పెట్టారు. ఇప్పుడది ఎరువుల కొట్టులా మారింది. మిగతా జిల్లాల్లో పీఏసీఏస్, డీసీఎంఎస్, గ్రోమోర్ వంటి సంస్థల ద్వారా విక్రయిస్తుంటే...ఇక్కడ మాచేత ఆ పనిచేయిస్తున్నారు. మమ్మల్ని కొందరు బూతులు తిడుతున్నారు. ప్రైవేటు డీలర్లు విక్రయిస్తున్న డేటా కూడా కలెక్ట్ చేసి ఇవ్వమంటున్నారు. దీని వల్ల మేము చేయాల్సిన పనులు పెండింగ్లో పడిపోతున్నాయి. ఎప్పుడో చేయాల్సిన ఈక్రాప్ ఇప్పుడు చేయాల్సి వస్తోంది. ఇక, వీసీలు, ఇతరత్రా సర్వేల పేరుతో తీవ్ర ఒత్తిడి ఉంది.– జి.శరత్కుమార్, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్.ఎరువులు సరిపోవడం లేదుజిల్లాలో విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎరువుల పంపిణీకి రైతు సేవా కేంద్రాలకు ట్యాగ్ చేశారు. తక్కువ ఎరువుల సమయంలో 20, 30మంది రైతులు చుట్టుముట్టి, నానా దుర్భాషలాడుతున్నారు. భయాందోళనతో విధులు నిర్వహిస్తున్నాం.– తేజస్విని, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ -
మహిళలు–పిల్లల సంక్షేమంపై అవగాహన
శ్రీకాకుళం అర్బన్: మహిళలు, పిల్లల భద్రత కోసం చట్టాలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉంటేనే లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందుతాయని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ సాధికారత అధికారి ఐ.విమల అన్నారు. జిల్లాలో సంకల్ప్ పేరిట 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐసీఈఎస్ పీడీ విమల సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మాట్లాడారు. మహిళలు, పిల్లల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చట్టాలపై అధికారులు, ఫ్రంట్లైన్ వర్కర్లకు అవగాహన కల్పించారు. బేటీ బచావో– బేటీ పడావో, పీసీపీఎన్డీటీ యాక్ట్, ఎంటీపీ యాక్ట్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు. జిల్లా ఆట్యా–పాట్యా జట్ల ఎంపిక రేపు శ్రీకాకుళం న్యూకాలనీ: ఆట్యా–పాట్యా జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల జట్ల ఎంపికలను శనివారం నిర్వహిస్తున్నట్టు జిల్లా సంఘ ముఖ్య ప్రతినిధులు కేకే రామిరెడ్డి, శ్యామలరా వు, కె.చిరంజీవి తెలిపారు. టెక్కలి ప్రభుత్వ ఉన్నత మైదానం వేదికగా శనివారం ఉదయం 10 గంటలకు ఈ ఎంపికల ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఇక్కడ ఎంపికైన జిల్లా జట్లను ఈనెల 25 నుంచి పల్నాడు జిల్లా నకరికల్లులోని ఎస్వీవీఆర్ జేపీ హైస్కూల్ వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా చాంపియన్షిప్–2025 పోటీలకు పంపించనున్నట్టు వారు చెప్పారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని, మరిన్ని వివరాలకు 94409 41974 నంబర్ను సంప్రదించాలన్నారు. థర్మల్ సర్వేను అడ్డుకున్న గిరిజనులు సరుబుజ్జిలి: థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకోసం జరుగుతున్న డ్రోన్ సర్వేను వెన్నెలవలస వద్ద గురువారం గిరిజనులు అడ్డుకున్నా రు. వెన్నెలవలస సమీపాన ఏపీజెన్కో డిప్యూ టీ ఈఈ తిప్పాన హరిరెడ్డి, ఏపీశాక్ సైంటిస్ట్ తాతబాబు ఆధ్వర్యంలో డ్రోన్ సర్వే నిర్వహిస్తుండగా పలువురు గిరిజనులు వారి వద్ద ను న్న సర్వే పరికరాల తీసుకొని సర్వేను అడ్డగించారు. దీంతో అఽధికారులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఆమదాలవలస సీఐ సత్యనారాయణ, బూర్జ ఎస్ఐ మొజ్జాడ ప్రవల్లిక ఘటనా స్థలానికి వచ్చి గిరిజనులతో మాట్లాడి పరికరాలను అధికారులకు అప్పగించారు. అధికారు లు సర్వే చేయకుండా వెనుదిరిగారు. మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లే థర్మల్కు వ్యతిరేకంగా పోరాడుతామని గిరిజనులు స్పష్టం చేశారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్, డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.30 వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు గురువారం శ్రీకాకుళం ఆర్అండ్బీ బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించి అనంతరం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐలతో కూడిన సంక్షేమాలు అమలు చేయాలన్నారు. నిరుద్యోగ సమస్య వల్ల అప్పులు చేసి ఆటోలు కొనుక్కుని తిప్పుతున్నారని, ఇప్పుడు బేరాలు తగ్గిపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా ఆటో, వ్యాన్లు నడిపినా పూట గడవడం లేదన్నారు. ఫైనాన్స్ కట్టలేక మాట పడాల్సి వస్తోందన్నారు. డీజిల్, పెట్రోల్పై వ్యాట్, సెస్ ఎత్తివేయాలని కోరారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్వీ ర మణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, కె.సూరయ్య, ఆటో యూనియన్ నాయ కులు ఎం.జగన్నాథం, పి.మోహనరావు, ఎం.కామేశ్వరరావు, ఎం.రామారావు, తమ్మినేని చంద్రునాయుడు పాల్గొన్నారు. -
17న నిరుద్యోగుల ఆవేదన సదస్సు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో నిర్వహించనున్న ‘నిరుద్యోగుల ఆవేదన సదస్సు’ను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళంలోని క్రాంతి భవన్లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు చెల్లించాలని, అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించి అన్ని ప్రాంతాలవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు 70 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్, అధ్యాపకులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు లైబ్రరీ పోస్టులను భర్తీ చేయాలని, ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను అన్ని విభాగాల్లోనూ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వలంటీర్లను కొనసాగిస్తూ విద్యార్హత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీకి అవకాశం కల్పించాలని, పేద నిరుద్యోగ యువతకు ఉచిత స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వేణు, ప్రతినిధులు రామోజీ, కిషోర్, భాస్కర్, మన్మధ, ప్రశాంత్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై మార్కెట్ కమిటీ చైర్మన్ దాడి
జలుమూరు: శ్రీముఖలింగంకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త చింతం రాంబాబుపై జలుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తర్ర బలరాం, సోదరుడు కృష్ణ గురువారం దాడి చేసి గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం.. గతంలో రాంబాబు తన వీధిలో వైఎస్సార్ సీపీ బ్యానర్ కట్టగా బలరాం తొలగించేందుకు ప్రయత్నించాడు. అప్పట్లో అది వివాదంగా మారింది. పాత కక్షల నేపథ్యంలో గురువారం శ్రీముఖలింగంలో వేరే గొడవ జరుగుతుండగా అదే చోటకు వచ్చి తనపై దాడి చేశారని, కర్రతో తలపై బలంగా కొట్టారని రాంబాబు ఆరోపించారు. దీనిపై జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం బుడితి సీహెచ్సీలో చికిత్స తీసుకున్నానని పేర్కొన్నారు. జూలైలో ఇదే మార్కెట్ కమిటీ చైర్మన్ బలరాంతోపాటు మరి కొందరు సామాజిక కార్యకర్త, అర్చకుడు నాయుడుగారి రాజశేఖర్పై కూడా దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పోలీసులు సరిగా వ్యవహరించకపోవడంతో రాజశేఖర్ ఢిల్లీ వెళ్లి మానవ హక్కుల కమిషన్తో పాటు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఇది విచారణలో ఉండగా మళ్లీ ఈ గొడవ జరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాంబాబు ఫిర్యాదుపై జలుమూరు ఎస్.ఐ అశోక్బాబు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.14న జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మధుసూదనరావు, ఎం.సాంబమూర్తి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఉదయం 9 గంటలకు మొదలవుతాయని చెప్పారు. ఎంపికై న క్రీడాకారులను ఈ నెల 27 నుంచి 29 వరకు ఏలూరు జిల్లా అల్లూరి సీతారామరాజు స్టేడియం వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి(అంతర్జిల్లాల) జూనియర్స్ బాలబాలికల అథ్లెటిక్స్ చాంపియన్స్ పోటీలకు పంపించనున్నట్టు పేర్కొన్నారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో జరిగే ఈ ఎంపికలకు 2005 అక్టోబర్ 15 నుంచి 2013 అక్టోబర్ 14 మధ్య జన్మించిన వారు అర్హులని స్పష్టంచేశారు. వివరాలకు 8500271575 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
హత్య చేసి.. బంగారం తాకట్టుపెట్టి..
● వీడిన చంద్రయ్యపేట మహిళ మృతి కేసు మిస్టరీ ● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఆమదాలవలస : పట్టణంలోని చంద్రయ్యపేటలో ఆగస్టు 30న జరిగిన మహిళ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. పోలీసులు చాకచక్యంగా విచారణ జరిపి హత్య కేసుగా నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం ఆమదాలవలస పోలీస్స్టేషన్లో డీఎస్పీ సీహెచ్ వివేకానంద విలేకరులకు వివరాలు వెల్లడించారు. చంద్రయ్యపేటకు చెందిన సీపాన రమణమ్మ (45)కు సరుబుజ్జిలి మండలం సరుబుజ్జిలి పంచాయతీ నందికొండ కాలనీకి చెందిన అడపాక నవీన్తో పరిచయం ఉంది. నవీన్ తరచూ ఆమె ఇంటికి వెళుతూ ఉండేవాడు. ఆగస్టు 30న ఓ యువతిని తీసుకొని రమణమ్మ ఇంటికి వెళ్లాడు. ఆమెను పంపించేసిన తర్వాత రమణమ్మను కూడా బలవంతం చేయగా అందుకు నిరాకరించింది. కోపోద్రుక్తుడైన నవీన్ రమణమ్మ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె ఇంట్లో ఉన్న 98 గ్రాముల బంగారం, 360 గ్రాముల వెండి, రూ.20 వేల నగదు దోచుకుని పారిపోయాడు. కొంత బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి రూ.3 లక్షలు తీసుకొని హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జల్సాలు చేశాడు. మిగతా బంగారం, వెండిని తన ఇంట్లోనే దాచిపెట్టాడు. మరోవైపు, పోలీసులు రమణమ్మ మృతదేహానికి పోస్ట్మార్టం చేయగా ఊపిరి ఆడకపోవడంతో చనిపోయిందని వైద్యులు నిర్ధారించడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. రమణమ్మ మొబైల్ కాల్ డేటా ఆధారంగా నవీన్ కోసం గాలించగా ఆ విషయం నిందితుడికి తెలిసి సరుబుజ్జిలి రెవెన్యూ అధికారి వద్ద లొంగిపోయాడు. ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్న బంగారం, నిందితుడి ఇంటి వద్ద ఉన్న ఆభరణాలు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న సీఐ సత్యనారాయణ, ఎస్ఐ బాలరాజు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
చేనేతకు శాపం!
● బకాయిల చెల్లింపుల్లో జాప్యం ● ఆప్కో బకాయిలు రూ.1.23 కోట్లు పొందూరు : జిల్లాలోని చేనేత సహకార సంఘాలకు ఆప్కో చెల్లించాల్సిన బకాయిలు విడుదల కాకపోవడంతో చేనేత సొసైటీలతో పాటు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సహకారం సంఘాల నిర్వహణ కష్టతరమవుతోంది. దీంతో సొసైటీలపై ఆధారపడిన చేనేత కుటుంబాలకు సకాలంలో అందాల్సిన మజూరీ డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. జిల్లాలో 36 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 20 వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ చేనేత సహకార సంఘాలన్నీ వస్త్రాలను తయారు చేసి ఆప్కోకు విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం ఆప్కో 14 సహకార సంఘాలకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఆప్కో ఇచ్చిన ఆర్డర్ల మేరకు సాధారణ, ఇతర రకాల వస్త్రాలు తయారవుతున్నాయి. సహకార సంఘాలు ఇచ్చిన వస్త్రాలకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేపట్టాల్సిన ఆప్కో జాప్యం చేయడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. లాభాల్లో ఉన్న సొసైటీలు సైతం బకాయి సొమ్ములు రాకపోవడంతో ఇబ్బందులు పాలవుతున్నాయి. బకాయిలు ఇలా.. ఆప్కో బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో జిల్లాలోని సహకార సంఘాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు ఏడాది నుంచి బకాయిలు చెల్లించాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని శ్రీకాకుళం డివిజన్, విజయనగరం జిల్లాలోని రాజాం డివిజన్ పరిధిలో రూ.1.23 కోట్లు బకాయిలు అందాల్సి ఉంది. పొందూరు సాయిబాచర్యలు తీసుకుంటున్నాం జిల్లాలో చేనేత సహకార సంఘాలకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రెండు రోజుల్లో సొసైటీలకు సంబందించిన ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయనున్నారు. – టి.జనార్ధన, ఆప్కో ఇన్చార్జి డీఎం, శ్రీకాకుళం బా సొసైటీకి రూ.17 లక్షలు, అంపోలు అగస్తేశ్వర సహకార సంఘానికి రూ.18 లక్షలు, లావేరులో సహకార సంఘానికి రూ.19 లక్షలు, తోలాపిలో గౌరీశంకర చేనేత సహకార సంఘానికి రూ.లక్ష, అక్కుపేట సంఘానికి రూ. 2 లక్షలు, సోంపేట సంఘానికి రూ.లక్ష, పెనుబాక విశ్వేశ్వర చేనేత సహకార సంఘానికి రూ.18 లక్షలు, రాజాం శ్రీమల్లికార్జున వీవర్సు సొసైటీకి రూ.17 లక్షలు, సురవరం సంఘానికి రూ.79 వేలు, మామిడిపల్లి సంఘానికి రూ.76 వేలు, పాలకొండ సంఘానికి రూ.7 లక్షలు, బైరిసారంగిపురంలో సంఘానికి రూ.11 వేలు బకాయిలు అందాల్సి ఉంది. -
నల్లబ్యాడ్జీలతో ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన
నరసన్నపేట: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 ప్రకారం అర్హత కలిగిన ఉద్యోగులు, డీఎస్సీ –2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డీఎస్సీ–2003 ఫోరం జిల్లా కో కన్వీనర్ అంబటి లక్ష్మణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పాత తాలూకా కేంద్రం నరసన్నపేటలో శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాడాన రాజు, టి.జనార్దనరావు, రమణ, చిరంజీవి, వాసు, ఉమాశంకర్, సురేష్కుమార్, రజిని, రమేష్, లక్ష్మి, శాంతి, కమలకుమారి, రోజామణి,రామారావు, తవుడు, వాసుదేవరావు, తాతన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ధర్మాన సావిత్రమ్మకు నివాళులు
శ్రీకాకుళం రూరల్/పోలాకి: ధర్మాన సోదరుల మాతృమూర్తి ధర్మాన సావిత్రమ్మ 13వ వర్ధంతి కార్యక్రమం పెదపాడు పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించారు. సావిత్రమ్మ చిత్రపటం వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం షణ్ముఖప్రియ, హరిప్రియ సిస్టర్స్ శాసీ్త్రయ సంగీత కచేరి నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాధరావు, మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, నర్తు రామారావు, జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, వైఎస్సార్ సీపీ యువనాయకులు ధర్మాన రామ్మనోహర్నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, గుండ లక్ష్మీదేవి తదితరులు న్నారు. అంతకుముందు పోలాకి మండలం మబగాంలోని ధర్మాన సావిత్రమ్మ స్మృతివనంలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. కుమారులు కృష్ణదాస్, ప్రసాదరావు, రాందాస్, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
క్వాంటమ్ టెక్నాలజీలో గ్లోబల్ గుర్తింపు
ఎచ్చెర్ల : ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీలో గ్లోబల్ గుర్తింపు లభించింది. ఐబీఎం క్వాంటమ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపునిచ్చి క్విస్కిట్ఫాల్ ఫెస్ట్–2025 నిర్వహించేందుకు శ్రీకాకుళం ట్రిపుల్ఐటీని ఎంపిక చేసింది. ఈ మేరకు డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 1,300 విశ్వవిద్యాలయాల నుంచి కేవలం 55 వర్సిటీలు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నాయని చెప్పారు. యేల్ యూనివర్శిటీ, యూసీఎల్ఏ, ఐఐటీ మద్రాస్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో పాటు ఆంధ్రప్రదేశ్ తరఫున ఆర్జీయూకేటీ ఐఐఐటీ శ్రీకాకుళం ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఫెస్ట్ నిర్వహణ బృందంగా కటం నిఖిల్తేజ, కాశిం, వాలి, దుదేకుల ప్రవీణ్కుమార్, చెరుకూరి జాన్బాబు, చదువుల గుణశ్రీ కిమ్మిడి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ మునిరామకృష్ణ, అకడమిక్స్ డీన్ డాక్టర్ శివరామకృష్ణ, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ డాక్టర్ గేదెల రవి, ఫైనాన్స్ అధికారి డాక్టర్ వాసు, హెచ్ఓడీ రమేష్బాబు, పీఆర్వో షణ్ముఖరావు తదితరులు అభినందించారు. -
వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా కమిటీ నియామకం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా కమిటీని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యక్షులుగా సతివాడ రామినాయుడు(నరసన్నపేట), జడ్యాడ జయరామ్(టెక్కలి), ప్రధాన కార్యదర్శులుగా నీలాపు ముకుందరావు(శ్రీకాకుళం), మురమండల ఉమాశంకర్(ఆమదాలవలస), బలగ గోవిందరావు(పాతపట్నం), మీసాల సురేష్బాబు(పలాస), నూతనపాటి బాబూరావు(ఇచ్ఛాపురం), కార్యదర్శులుగా కోటిపల్లి శ్రీనివాసరావు(నరసన్నపేట), గొండీల సుజాతకుమారి(టెక్కలి), కుందేశీ ప్రియ(ఇచ్ఛాపురం), కంఠ గోవిందరావు(ఆమదాలవలస), కలగాటి జాన్(ఆమదాలవలస), పంకు మోహనరావు(పాతపట్నం), బెలమాన జీవన్రావు(పలాస), వడ్డి జీవకుమార్(ఎచ్చెర్ల), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ముచ్చ జగన్(శ్రీకాకుళం), కుర్మాన జోషఫ్ (శ్రీకాకుళం), ఉంకిలి గోపాలకృష్ణ(నరసన్నపేట), అరమపల్లి రాము(నరసన్నపేట), కూరాకుల సుబ్బారావు(టెక్కలి), చల్ల అప్పలరాజు(టెక్కలి), ముద్దాడ ఈశ్వరరావు(ఆమదాలవలస), రావాడ వెంకటరావు(ఆమదాలవలస), గుడిబండ పోలయ్య(పాతపట్నం), రావాడ లక్ష్మీనారాయణ(పాతపట్నం), యలమల కృష్ణ(ఎచ్చెర్ల), లింగాల లక్ష్మణరావు(ఎచ్చెర్ల), జడ్యాడ దేవానంద(పలాస), పంకు దుర్యోధన(పలాస), లండ కృష్ణారావు(ఇచ్ఛాపురం), కొప్పల హేమంత్కుమార్(ఇచ్ఛాపురం)లను నియమించారు.హెల్త్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం ఎచ్చెర్ల : బొల్లినేని మెడ్ స్కిల్స్ (జెమ్స్ రాగోలు)తో సంయుక్తంగా నిర్వహిస్తున్న హెల్త్ సంబంధిత కోర్సుల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ బి.ఆర్.ఏ.యూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.అనూరాధ గురువారం తెలిపారు. మాస్టర్ ఆఫ్ హెల్త్కేర్ అడ్మినిస్ట్రేటివ్ (రెండేళ్లు, 40సీట్లు), పీజీ డిప్లోమా ఇన్ మెడికల్ రికార్డ్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్(ఏడాది–40సీట్లు) కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ (జనరల్), బీఫార్మశీ, బీఎస్సీ (నర్సింగ్), బీహెచ్ఎంఎస్ లేదా బీఏఎంఎస్, బీఏ, బీకాం కోర్సులు పూర్తిచేసిన 20 నుంచి 35 ఏళ్ల వారు అర్హులని తెలిపారు. ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.వాల్తేరు ఏడీఆర్ఎంగా రామారావుసోంపేట: ఎర్రముక్కాం గ్రామానికి చెందిన కుందు రామారావు వాల్తేరు డివిజన్ ఏడీఆర్ఎంగా పదోన్నతి పొందారు. ఈయన ప్రస్తుతం గుంటూరు విజయవాడ దక్షిణ మధ్యరైల్వేలో డిప్యూటీ చీఫ్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఏడీఆర్ఎంగా పదోన్నతి పొందడంతో గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రైల్వేస్టేషన్ల ఆధునీకరణలో భాగస్వామ్యం అయ్యానని, రైల్వేబోర్డు తరఫున బుల్లెట్ ప్రూఫ్ రైల్ అధ్యయనం కోసం జపాన్ సైతం వెళ్లానని చెప్పారు.అప్పారావు నేత్రాలు సజీవంశ్రీకాకుళం కల్చరల్: నగరంలోని గుడివీధిలో నివాసముంటున్న అంధవరపు అప్పారావు (93) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన మరణానంతరం నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుటుంబసభ్యులు ఎ.రామరాజు, నాగేశ్వరరావులు నేత్రాలను దానం చేసేందుకు ముందుకువచ్చారు. విషయం కె.సత్యనారాయణ ద్వారా రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేయగా, నేత్ర సేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్చార్జి సుజాత, నంది ఉమాశంకర్లు చేరుకుని అప్పారావు కార్నియాలను సేకరించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరుకు సంప్రదించాలని రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, సభ్యులు దుర్గాశ్రీనివాస్ కోరారు. -
సహజ వనరుల దోపిడీకే ఆపరేషన్ కగార్
పలాస: దేశంలో సహజ వనరుల దోపిడీకే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అధికార ప్రతినిధి పి.ప్రసాద్ అన్నారు. మండలంలోని లొత్తూరులో సిక్కోలు పోరాట యోధులు కుమారన్న, సీతారాముల వర్ధంతి సభను బుధవారం నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రప్రకాష్ అధ్యక్షతన జరిగిన సభలో ప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో పర్యావరణాన్ని రక్షిస్తూ అడవులను కాపాడుతున్న ఆదివాసీలను ఆపరేషన్ కగార్ పేరుతో అంతమొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఈ దుర్మార్గమైన చర్యని ప్రజలు ఖండించాలని కోరారు. అడవులను, ఆదివాసీలను కాపాడటానికే కుమారన్న, సీతారాములు తుపాకులు పట్టారని, వారిని కూడా ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ప్రజా ఉద్యమాలను అణిచి పెట్టడానికి పూనుకుంటోందని, కనీసం రైతులకు ఎరువులు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉండడం విచారకరమని మండిపడ్డారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా సహాయక కార్యదర్శి వంకల మాధవరావు, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, సవలాపురం కృష్ణవేణి, గొరకల బాలకృష్ణ, మామిడి భీమారావు, జుత్తు వీరాస్వామి, పోతనపల్లి కుసుమ, బదకల ఈశ్వరమ్మ, ఎం.వినోద్, సొర్ర రామారావు, సార జగన్, సవర బంగ్లాకుమార్, సీమాన్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఏయూ రిజిస్ట్రార్గా అడ్డయ్య
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్గా వర్సిటీ సీనియర్ అధ్యాపకుడు ఆచార్య బి.అడ్డయ్య నియమితులయ్యారు. ఈ మేరకు వర్సిటీ వీసీ ఆచార్య కె.ఆర్.రజని నియామక ఉత్తర్వులు బుధవారం అందజేశారు. ఇప్పటివరకు అడ్డయ్య వర్సిటీ రెక్టార్గా వ్యవహరించడమే కాకుండా, పలుమార్లు ఇన్చార్జి రిజిస్ట్రార్గా సేవలను అందించారు. గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు నరసన్నపేట: స్థానిక మెయిన్ రోడ్డులోని వేంకటేశ్వర థియేటర్ సమీపంలో ఉన్నటువంటి ఎం.పాపారావు ఇంట్లో పెను ప్రమాదం తప్పింది. ఉదయం పాపారావు భార్య కుమారి పాలు మరిగిస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. కొన్ని సెకన్లలోనే మంటలు ఎగసిపడ్డాయి. దీంతో కుమారి భయంతో బయటకు పరుగులు తీసింది. వెంటనే స్థానికులు వచ్చి తడి గోనె సంచులు కప్పి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి, పరిశీలించి తగు సూచనలు చేశారు. కాగా ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదు. నార్త్జోన్ క్రికెట్ టోర్నీలో శ్రీకాకుళం బోణీ శ్రీకాకుళం న్యూకాలనీ: ఏసీఏ నార్త్జోన్ అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీలో శ్రీకాకుళం జట్టు విజయంతో బోణీ కొట్టింది. జిల్లా బ్యాటర్ అబ్దుల్ సమీర్ 112 పరుగుల అజేయ సెంచరీతో, రైటార్మ్ ఆఫ్ స్పిన్నర్ డీవీ శ్రీరామ్ రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 10 వికెట్లతో విజృంభించడంతో ఆతిథ్య విజయనగరంతో సోమవారం నుంచి బుధవారం వరకు జరిగిన మల్టీడేస్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో శ్రీకాకుళం ఘన విజయం సాధించింది. విజయనగరం జిల్లా వేదికగా ఏసీఏ నార్త్జోన్ అంతర్ జిల్లాల త్రీడేస్ (మల్టీడేస్) పురుషుల అండర్–23 క్రికెట్ టోర్నమెంట్ ఇటీవలే మొదలైంది. టోర్నీలో భాగంగా మొదటి మ్యాచ్లో ఆతిథ్య విజయనగరం, శ్రీకాకుళం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విజయనగరం జట్టు తన మొదటి ఇన్నింగ్స్లో 249 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ను ప్రారంభించిన శ్రీకాకుళం జట్టు 148 పరుగుల వద్ద కుప్పకూలింది. 101 పరుగుల ఆధిక్యంతో తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన విజయనగరం జట్టు 164 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 266 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీకాకుళం జట్టు ధాటిగా బ్యాటింగ్చేసి 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. తదుపరి తూర్పుగోదావరితో మ్యాచ్ జరగనుంది. -
హా..స్టళ్లు..!
● పాడుబడిన భవనాలతో అవస్థలు ● కురిగాం, కొత్తూరు వసతి గృహాల్లో చేరని విద్యార్థులు కొత్తూరు: విద్యార్థుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వ ప్రకటనలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేకుండా ఉంది. దీనికి నిదర్శనంగా కొత్తూరు మండలం కురిగాం గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహం, కొత్తూరులోని ఎస్సీ బాలికల వసతి గృహాలను చెప్పుకోవచ్చు. ఈ వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాది వేసవి సెలవుల అనంతరం ఇప్పటివరకు ఈ వసతి గృహాల్లో విద్యార్థులు చేరలేదు. దీంతో ఖాళీ భవనాలు దర్శనమిస్తున్నాయి. భయపెడుతున్న శిథిల భవనాలు కొత్తూరు ఎస్సీ బాలికల వసతి గృహం బాగా పాతబడిపోవడంతో విద్యార్థులు వసతి గృహంలో ఉండేందుకు భయపడుతున్నారు. వర్షాలు వచ్చే సమయంలో ఈ వసతి గృహం ముందు ఉన్న రోడ్డు మీదకు నీరు చేరి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వసతి గృహానికి వెళ్లే రహదారి సైతం అధ్వానంగా ఉంది. అలాగే పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వలన వసతి గృహానికి వచ్చేందుకు విద్యార్థులు ఇష్టపడడం లేదు. అదేవిధంగా కురిగాం వసతి గృహం గదులు బీటలువారి ప్రమాదపుటంచున ఉన్నాయి. ఇక్కడ గదులకు తలుపులు లేవు. వర్షం వస్తే నీరు కారుతోంది. దీంతో ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఫలితంగా రెండు వసతి గృహాల్లో ప్రస్తుతం విద్యార్థులు చేరలేదు. గత విద్యా సంవత్సరంలో కొత్తూరు ఎస్సీ బాలికలు వసతి గృహంలో 18 మంది విద్యార్థులు ఉండేవారు. అయితే వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు రాకపోవడంతో వసతి గృహానికి తాళం వేశారు. కురిగాం వసతి గృహంలో గత విద్యా సంవత్సరంలో 11 మంది విద్యార్థులు ఉండేవారు. సెలవులు తర్వాత విద్యార్థులు మరెవ్వరూ రాలేదు. ఫలితంగా ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఈ రెండు వసతి గృహాలు మూతపడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఈ రెండు వసతి గృహాల్లో నాల్గో తరగతి సిబ్బంది ఒక్కక్కొరు పనిచేస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం కొత్తూరు, కురిగాం ఎస్సీ బాలికల, బాలుర వసతి గృహాల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని వార్డెన్లకు ఆదేశించాము. ఇప్పటికే వార్డెన్లు గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. కురిగాంలో భవనాలు పాడవ్వడంతో వసతి గృహంలో చేరేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. అలాగే కొత్తూరులో వార్డెన్ లేకపోవడంతో పక్కన ఉన్న వార్డెన్కు ఎఫ్ఏసీ ఇవ్వడం వలన అడ్మిషన్లపై దృష్టి సారించలేకపోయారు. విద్యార్థులు వచ్చినట్లయితే వసతి గృహాల్లో చేర్పించుకుంటాము. – శ్యామల, ఏఎస్డబ్ల్యూ, పాతపట్నం -
చేయి తడిపితేనే పనులు..
జిల్లా వైద్యారోగ్య శాఖలో ఇటీవల జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా పనిచేసిన బాలమురళీకృష్ణ నేరుగా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగతి విదితమే. ఈ ఘటన తర్వాత డీఎంహెచ్వో కార్యాలయంలో అంతా సవ్యంగా ఉంటుందని భావించినప్పటికీ.. మళ్లీ యథావిధిగా లంచాల జోరు పెరిగింది. తాజాగా జరిగిన ఏఎన్ఎంల బదిలీల్లో రూ.లక్షల్లో చేతులు మారిన సంగతి విదితమే. తాజాగా వర్గ పోరులతో సామాన్య ఉద్యోగుల సమస్యలు పెండింగ్లో ఉండిపోతున్నాయి. సర్వీస్ రెగ్యులైజేషన్, సరెండర్ లీవులు, మెడికల్ లీవులు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్, ఛైల్డ్ కేర్ లీవులు, మూమెంట్ ఆర్డర్లు తదితర పనుల నిమిత్తం ఇక్కడికి జిల్లా నలుమూలల నుంచి నిత్యం ఉద్యోగులు తమ వినతులను ఇస్తుంటారు. నెలలు గడుస్తున్నా ఫైళ్లకు మోక్షం కలగడం లేదని వాపోతున్నారు. ప్రతి పనికి రూ.5 వేల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఓ రెగ్యులైజేషన్ పెండింగ్ ఉన్న ఓ ఉద్యోగి ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది సరెండర్ లీవుల పేరిట వస్తున్నప్పటికీ ఫైళ్లకు స్థానచలనం లేకుండా పెండింగ్లో ఉంచుతున్నారనే విమర్శలున్నాయి. చేతికి లంచం ఇస్తే.. వెంటనే పనులు అవుతున్నాయని పలువురు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు ఈ శాఖ పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
ప్రభుత్వ బడులను విస్మరిస్తున్నారు
● మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ధ్వజం ● మురికింటిభద్ర పాఠశాల పరిశీలన మెళియాపుట్టి: కూటమి ప్రభుత్వం ప్రభుత్వ బడులను విస్మరిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. మండలంలోని మర్రిపాడు.కె పంచాయతీ పరిధి మురికింటిభద్ర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పాఠశాల భవనం స్లాబ్ ఊడిపడి, తరగతి గదిలోకి వర్షపు నీరు చేరింది. దీంతో అక్కడి పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాల పరిస్థితి చూస్తుంటే విద్యకు కూటమి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత తెలుస్తోందని ఎద్దేవా చేశారు. వర్షం పడితే విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేశామని, కూటమి ప్రభుత్వం పాఠశాలలు, విద్యార్థులపై అవలంభిస్తున్న విధానాలు మార్చుకోవాలని సూచించారు. పాఠశాలలో ఇంత సమస్య ఉన్నా అధికారులు సైతం నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తుండడం బాధాకరమన్నారు. విద్యార్థులతో ముచ్చటించి, వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలోని వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆదినాయుడు, మండల కన్వీనర్ పోలాకి జయమునిరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు బమ్మిడి ఖగేశ్వరరావు, ఉర్లాన బాలరాజు, అలికాన మాధవరావు, పైల హరి, పల్లి యోగి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా వెతలు..!
బూర్జ మండలంలోని బూర్జ, గుత్తావల్లి, పాలవలస, ఏపీపేట గ్రామ రైతు సేవా కేంద్రాల ఆవరణలో ఎరువుల టోకెన్లు కోసం రైతులు గంటలు కొద్ది నిరీక్షిస్తున్నారు. బుధవారం రైతులకు టోకెన్లు అందజేసి గురువారం ఎరువుల అందజేస్తారనే సమాచారంతో రైతులు క్యూలో నిల్చొని టోకెన్లు అందుకున్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయశాఖ ఏవో డి.ఉషారాణి మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం అధైర్యపడవద్దని సూచించారు. అందరికీ విడతల వారీగా ఎరువులు అందజేస్తామన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.– బూర్జ -
మర్యాదపూర్వక భేటీ
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టి కృషితో ముందుకు సాగాలని జగన్మోహన్రెడ్డి సూచించినట్లు రవికుమార్ పేర్కొన్నారు.– ఆమదాలవలస28 పశువులు పట్టివేతరణస్థలం: లావేరు మండలంలోని ఎన్హెచ్–16పై సుభద్రాపురం జంక్షన్లో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వెళ్తున్న రెండు ఐసర్ వ్యాన్లలో తరలిస్తున్న 28 పశువులను(గేదెలను) లావేరు పోలీసులు పట్టుకున్నారు. దీనిపై లావేరు ఎస్ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.ఇద్దరిపై కేసు నమోదుకొత్తూరు : నివగాం గ్రామానికి చెందిన బి.కమలహాసన్, బి.రాజేష్లు వెలుగు కార్యాలయంలోకి వచ్చి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అనుమతి లేకుండా వీడియోలు చిత్రీకరించారని ఏపీఎం లలిత పోలీస్లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇద్దరిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎండీ అమీర్ ఆలీ బుధవారం తెలిపారు. -
ఇద్దరు సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన్
● యూరియా వివరాలు సక్రమంగా తెలియజేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం కంచిలి: పంట సాగు విస్తీర్ణం నమోదులో రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు, సచివాలయ ఉద్యోగుల మధ్య సమన్వయలోపం తలెత్తడంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచిలి మండలం గోకర్ణపురం రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు, అధికారులు, సచివాలయ ఉద్యోగులతో కలిసి గోకర్ణపురం, శాసనాం, వీరనారాయణపురం గ్రామాల్లో ఇంతవరకు సరఫరా చేసిన యూరియా, వాస్తవంగా అవసరమైన యూరియా వివరాలు తెలియజేయాలని రెండు శాఖల అధికారులను వేర్వేరుగా ప్రశ్నించారు. ఈ క్రమంలో వేర్వేరు నివేదికలు చెప్పిన వీఏఏ దిక్కల అన్వేష్, వీఆర్వో జి.వెంకటరమణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు. మండలస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంపై తహశీల్దార్ ఎన్.రమేష్కుమార్, మండల వ్యవసాయాధికారి కె.సురేష్లను మందలించారు. గోకర్ణపురం, శాసనాం సర్పంచ్లు యారడి ఆనందరావు, గుడ్డిపద్ర వేణులు స్థానిక రైతు ప్రతినిధులుగా వ్యవహరించి, ఇక్కడ ఏ మేరకు యూరియా అవసరం అనేది నివేదించడంతో.. త్వరలో 420 బస్తాల యూరియా పంపిస్తామని కలెక్టర్ చెప్పారు. అనంతరం గోకర్ణపురం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కె.అప్పలస్వామి, తహశీల్దార్ ఎన్.రమేష్కుమార్, వ్యవసాయ సహాయ సంచాలకులు టి.భవానీ శంకర్, ఎంపీడీఓ వి.తిరుమలరావు, మండల వ్యవసాయాధికారి కె.సురేష్, ఎంఈఓ ఎస్.శివరాంప్రసాద్, వీఆర్వోలు, వీఏఏలు పాల్గొన్నారు. కాగా, రైతులకు సక్రమంగా యూరియా అందకపోవడం వెనుక గల కారణాలను పక్కన పెట్టి అనవసరంగా ఉద్యోగులను సస్పెండ్ చేయడం ఏంటని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ సస్పెన్షన్లను నిలుపుదల చేయాలని రాజకీయ ఒత్తిళ్లు మొదలైనట్లు తెలుస్తోంది. -
కలెక్టరేట్ వద్ద డ్రైవర్ల ధర్నా నేడు
రణస్థలం: ఉచిత బస్సు పథకం వలన ఉపాధి కోల్పోతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.30 వేలు చెల్లించాలని కోరుతూ, గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు రణస్థలం, కోష్ట, పైడిభీమవరంలో ఆటో డ్రైవర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. అనంతరం ధర్నా కరపత్రాలు ఆవిష్కరించి ప్రచారం నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐలతో కూడిన సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. గొర్రెల కాపరిని ఆదుకోవాలి రణస్థలం: మండలంలోని జేఆర్పురం పంచాయతీ సీతంవలసకు చెందిన గొర్రెల కాపరి పిట్ట రమణకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం చెల్లించాలని ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నాయకుడు కోనంగి నందుడు, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు మద్దాడ రాజశేఖర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తహసీల్దార్ సనపల కిరణ్కుమార్, పశు సంవర్ధక శాఖ జేడీ కె.రాజగోపాల్రావు, ఏడీఏ బి.దుర్గారావులకు బుధవారం వినతిపత్రాలు అందజేశారు. ఇటీవల పైడిభీమవరం సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని రమణకు చెందిన 20 గొర్రెలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన సుమారు రూ.5 లక్షల నష్టం వాటిళ్లిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని విన్నవించుకున్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం
టెక్కలి : వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకులను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఎన్ని ధనుంజయరావు, టెక్కలి నియోజకవర్గానికి చెందిన కెల్లి జగన్నాయకులు, ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన గుమ్మడి రాంబాబులను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమించారు. శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో జిల్లాకు చెందిన పలువురు నాయకులను నియమిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. జన్ని అనిరుద్రుడు(ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ), బందపల్లి రాకేష్(ఎస్టీ సెల్ కార్యదర్శి), హరిబంద్ జన్నీ (నిత్యానంద)(ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ), కొనపల సురేష్(చేనేత విభాగం సెక్రటరీ), కాలేపు శ్రీదేవి(చేనేత విభాగం జాయింట్ సెక్రటరీ), పచ్చిగుళ్ల సాయిరాం(వాణిజ్య విభాగం జాయింట్ సెక్రటరీ), కిల్లి అజయ్కుమార్(ఐటీ విభాగం కార్యదర్శి), అదపాక ఉమాశంకర్(ఐటీ విభాగం జాయింట్ సెక్రటరీ), బంకుపల్లి లోకనాధం శర్మ(ప్రచార విభాగం కార్యదర్శి), తమ్మినేని మురళి(ప్రచార విభాగం కార్యదర్శి), కెళ్ల రామకృష్ణ(ప్రచార విభాగం జాయింట్ సెక్రటరీ), బెండి గాంధీ(ప్రచార విభాగం జాయింట్ సెక్రటరీ), గెళ్లంకి వెంకట్రావు(గ్రీవెన్స్ విభాగం జాయింట్ సెక్రటరీ), నూక సత్యరాజ్(పంచాయతీరాజ్ విభాగం ఉపాధ్యక్షుడు), గురుబెల్లి శ్రీనివాసరావు(పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రటరీ), పూడి నీలాచలం(పంచాయతీరాజ్ విభాగం జాయింట్ సెక్రటరీ), వావిలాపల్లి మురళి(పంచాయతీరాజ్ విభాగం జాయింట్ సెక్రటరీ)లను నియమించారు. -
స్మార్ట్దోపిడీ!
● స్మార్ట్ రేషన్కార్డులకు అథెంటికేషన్ పేరిట దందా ● కార్డుకు రూ.30 నుంచి రూ.50 వరకు వసూళ్లు శ్రీకాకుళం పాతబస్టాండ్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు లబ్ధి చేకూర్చే ఏ కార్యక్రమం చేపట్టినా అందులో ఏదో ఒక రూపంలో డబ్బు సంపాదించే మార్గాన్ని కొందరు టీడీపీ నాయకులు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులను ప్రభుత్వం ఇటీవల లబ్ధిదారులకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. కార్డులను సచివాలయాలు సిబ్బంది, రేషన్షాప్ డీలర్ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఈ సమయంలో కార్డు అథంటికేషన్ చేయించుకోవాలి. దీనికి మూడు రకాల విధానాలను ప్రభుత్వం సూచించింది. ఫేషియల్ యాప్, ఓటీపీ, బయోమెట్రిక్ విధానాల్లో ఏదో ఒక విధానంలో వెరిఫై తప్పనిసరి చేసింది. ఈ సమయంలో లబ్ధిదారుల నుంచి ఒక్కొక్క కార్డుకు రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ దందా గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 6,57,758 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు 6,51,717 స్మార్ట్ కార్డులు విడుదల చేశారు. వీటి పంపిణీ గ్రామాల్లో ముమ్మరంగా జరుగుతుంది. అనేక చోట్ల డీలర్లు డబ్బులు తీసుకుంటున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో డీలర్లకు టీడీపీ నాయకులకు మధ్య విభేదాలు సైతం తలెత్తుతున్నట్లు తెలిసింది. మరికొన్ని చోట్ల స్మార్ట్ కార్డు వసూళ్లు వెనుక డీలర్లతోపాటు స్థానిక కూటమి నాయకులు ఉన్నట్లు సమాచారం. -
గోతిలో దిగబడిన టిప్పర్
● వాహనాల రాకపోకలకు అంతరాయం మెళియాపుట్టి: మెళియాపుట్టి నుంచి పాతపట్నం వెళ్లే ఆల్ ఆంధ్రా రహదారిలో రోడ్డుకి అడ్డంగా టిప్పర్ లారీ దిగబడిపోయింది. పాతపట్నం నుంచి మెళియాపుట్టి వైపు ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ సుందరాడ వచ్చేసరికి, ఇటీవల కురిసిన వర్షాలకు జలజీవన్ మిషన్ పైప్లైన్ల కోసం తవ్విన గోతుల్లో నీరుచేరడంతో చక్రాలు దిగిపోయి కూరుకుపోయింది. దీంతో రాత్రి 7 గంటల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు జేసీబీలు లారీని బయటికి తీయడానికి విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. మరలా ఇసుకంతా వేరే వాహనానికి తరలించి లారీని బయటకు తీశారు. అనంతరం వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. -
14న జిల్లా జూనియర్స్ కబడ్డీ జట్ల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి జూనియర్స్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికలను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్టు జిల్లా కబడ్డీ సంఘ అధ్యక్షుడు నక్క కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సాదు ముసలినాయుడు బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియం సమీపంలో ఉదయం 9 గంటలకు ఎంపికలు మొదలవుతాయని చెప్పారు. 2006 జనవరి 1 తర్వాత జన్మించిన బాలబాలికలు, బాలురు 70 కేజీలులోపు, బాలికలు 65 కేజీల్లోపు వయస్సు ఉండాలని స్పష్టం చేశారు. మ్యాట్పై జరిగే ఈ ఎంపికలకు క్రీడాకారులు షూ ధరించి హాజరుకావాలని కోరారు. ఎంపికై న జిల్లా జట్లను కృష్ణా జిల్లా విజయవాడ వేదికగా జరిగే రాష్ట్రస్థాయి జూనియర్స్ కబడ్డీ చాంపియన్షిప్–2025 పోటీలకు పంపిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి సాదు శ్రీనివాసరావు(9441914214)ను సంప్రదించాలని కోరారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి శ్రీకాకుళం క్రైమ్ : గత రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న మహిళల అదృశ్యం కేసులపై పోలీసు అధికారులు దృష్టి సారించాలని, సాంకేతిక, శక్తి బృందాలు, ఇతర ఆధారాలతో వారిని గుర్తించాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నాన్ బెయిల్బుల్ వారెంట్ల అమలు, హత్య కేసుల్లో పురోగతి సాధించాలన్నారు. ఇరువర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశమున్న కుటుంబ, ఆస్తి వివాదాలు, చిన్న క్రిమినల్ కేసులు, ట్రాఫిక్, ఇతర కాంపౌండ్ కేసులను గుర్తించి లోక్ అదాలత్లో రాజీ అయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ ఆర్ఎం శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీ్త్రశక్తి పథకం (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) అమలు తీరుపై కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంపై మహిళల సూచనలు, సలహాలు, సమస్యలను 9959225603 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. ‘క్వాంటమ్’తో సమూల మార్పులు ఎచ్చెర్ల : క్వాంటమ్ అధ్యయనాలే నేటి వైజ్ఞానిక రంగంలో సమూల మార్పులకు ఊతమిస్తున్నాయని డాక్టర్ బీఆర్ఏయూ వైస్ చాన్సలర్ కె.ఆర్.రజనీ తెలిపారు. ఎచ్చెర్లలోని అంబేడ్కర్ వర్సిటీలో ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ అనే అంశంపై ఫిజిక్స్ విభాగం నిర్వహిస్తున్న మూడు రోజుల ప్రత్యేక ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్వాంటమ్ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలు, అవకాశాలు ఏర్పడతాయన్నారు. నాగార్జున వర్శిటీ పూర్వ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.సంధ్య, ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాడ్యుయేట్ స్టడీస్(బెంగుళూరు) ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.రామ్కుమార్లు మాట్లాడుతూ గణిత, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో పాటు పలు రంగాలకు క్వాంటమ్ కంప్యూటింగ్తో బహుళ ప్రయోజనాలు ఉంటాయన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే క్వాంటమ్ ఏఈ వంటివి వారి ప్రగతిలో కీలకంగా మారాయని చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, పూర్వ రిజిస్ట్రార్ పి.సుజాత, ప్రిన్సిపాల్స్ ఎస్.ఉదయభాస్కర్, సీహెచ్ రాజశేఖరరావు, ఫిజిక్స్ అధ్యాపకులు పి.శివప్రసాద్రెడ్డి, ఎం.సుబ్బారావు, ఎ.గణేష్ బాబు, సుష్మారెడ్డి పాల్గొన్నారు. ఎరువుల కోసం ఆందోళన పడొద్దు శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. బుధవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించి పలువురు రైతుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
నేపాల్ సమాచారం కోసం హెల్ప్లైన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: నేపాల్లో నెలకొన్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర హెల్ప్లైన్ను కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ ఏర్పాటు చేశారు. 9491222122 నంబరుకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. దీనిని పర్యవేక్షించేందుకు ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రత్యేక బృందాన్ని నియమించారు. పారిశ్రామిక ప్రోత్సాహక అధికారి కిరణ్ (9949478989), సీనియర్ సహాయకులు ఎల్.రాజ్యలక్ష్మి (9441022669), సహాయ జిల్లా సమాచార అధికారి బి.విజయ్బాబు (9110769608) బృందం హెల్ప్లైన్కు వచ్చే ప్రతి కాల్ను స్వీకరించి వివరాలు నమోదు చేసుకుంటుంది. సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్కు చేరవేసి సహాయ చర్యలు వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతుంది. థర్మల్ ప్లాంట్ సర్వే అడ్డగింత బూర్జ: ఆదివాసీల జీవితాలతో పాటు పర్యావరణాన్ని నాశనం చేసే క్రిటికల్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని తమ ప్రాంతంలో చేపట్టవద్దంటూ ఆదివాసీలు నినాదాలు చేశారు. బుధవారం బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లోని జేవీ పురం, తిమడాం, జంగాలవలస, బొడ్లపాడు, వెన్నెలవలస గ్రామాల ఆదివాసీలు మూకుమ్మడిగా వచ్చి తిమడాం వద్ద సర్వే బృందాలను అడ్డుకున్నారు. సర్వే చేపట్టవద్దంటూ వారి వద్ద మెటీరియల్ తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆదివాసీలకు నచ్చజెప్పి మెటీరియల్ను తీసుకుని సిబ్బందికి అందజేశారు. ఈసందర్భంగా ఆదివాసీలు మాట్లాడుతూ ప్రాణత్యాగం చేసైనా ప్లాంట్ నిర్మాణం అడ్డుకుంటామని స్పష్టం చేశారు. -
రాష్ట్రంలో దుర్మార్గ పాలన
ప్రజల హక్కులను కాపాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజలకు తెలియజేస్తున్న మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సాక్షి దినపత్రిక ద్వారా ప్రజలకు వివరిస్తుండటాన్ని అధికార పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. దీనిలో భాగంగానే సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రజలే కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు. – సింగుపురం మోహన్రావు, న్యాయవాది -
భవితకు నిచ్చెన..!
● వెల్డింగ్తో ఉపాధికి విస్తృత అవకాశాలు ● జిల్లాలో 250 వరకు శిక్షణ సంస్థలు ● విదేశాల్లో మంచి జీతాలు ● మోసపోవద్దని పోలీసుల సూచన వెల్డింగ్ శిక్షణ..మా శిక్షణ సంస్థలో నైపుణ్యతకు ప్రాధాన్యత ఇస్తాం. విదేశాలకు వెళ్లేందుకు యువతకు సూచనలతో పాటు అక్కడ చట్టాలు, తదితర అంశాలను వివరిస్తాం. స్వయంగా అభ్యర్థులు విశాఖ, ఇచ్ఛాపురం, హైదరాబాద్ ప్రాంతాల్లో ఇంటర్వ్యూలకు హాజరై విదేశాలకు వెళ్లి వస్తున్నారు. నేను పదేళ్లు విదేశాల్లో పనిచేశాను. టిగ్, ఆర్క్, గ్యాస్ కటింగ్లో అనుభవం ఉంది. మా ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో శిక్ష సంస్థ ఏర్పాటు చేశాం. రిజిస్ట్రేషన్ ఉన్న శిక్షణ సంస్థల్లో మాత్రమే శిక్షణ తీసుకోవాలి. మోసాలు బారిన పడకుండా చూసుకోవాలి. సబ్ ఏజెంట్లు, మోసగాళ్లను నమ్మి మోసపోకుండా చూసుకోవాలి. – కర్ని భీమారావు, దుర్గా గణపతి వెల్డింగ్ ఇనిస్టిట్యూట్, పూండి నేను సింగపూర్, మలేషియా, దుబాయ్, బ్యాంకాక్ తదితర దేశాల్లో ఉద్యోగం చేసి వచ్చాను. సొంతంగా శిక్షణ సంస్థ పెటుకున్నాను. దేశీయంగా వివిధ ప్రాజెక్టులు, కంపెనీల్లో నైపుణ్యత కలిగిన యువత కావాలని చాలా సంస్థలు ఎదురు చూస్తున్నాయి. ప్రధానంగా మూలపేట పోర్టు, స్టీల్ప్లాంట్, ఎన్ఎండీసీ, తదితర కంపెనీల్లో ఉద్యోగాలు పొందేందుకు యువత ఆసక్తి కనబరుస్తున్నారు. వెల్డింగ్లో 3జీ, 4జీ, 6జీ, టిగ్, ఆర్క్ వెల్డింగుల్లో శిక్షణ ఇచ్చి సొంతంగా ఉపాధి అవకాశాలు కలిగేలా సూచనలు చేస్తున్నాం. సాంకేతిక విద్యలో స్కిల్ ఉంటే ఎక్కడైనా మంచి పొజిషన్ లభిస్తుంది. – జి.వైరెడ్డి, శిక్షణ సంస్థ యజమాని, దేవునల్తాడ వజ్రపుకొత్తూరు: నేటి యువత అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కొలువులే కాకుండా వెల్డింగ్ రంగంపై కూడా ఆసక్తి పెంచుకుంటున్నారు. సాంప్రదాయ వెల్డింగ్తో పాటు హైటెక్ ఆటోమేటెడ్ పరికరాలను ఉపయోగించే పరిశ్రమలకు ఉపయోగపడే ప్రొఫెషనల్ వెల్డింగ్లోనూ నైపుణ్యం సాధిస్తున్నారు. వెల్డింగ్లో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సొంతంగా వెల్డింగ్ ఇనిస్టిట్యూట్, ఫ్యాబ్రికేషన్లను ప్రారంభించి మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. మరికొంతమంది విదేశాల బాట పడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులతో సమానంగా నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఉత్తమ ఉపాధి అవకాశాలు చేతిలో పని(స్కిల్) ఉంటే ఎలాంటి సంస్థలైనా ఉపాధి కల్పిస్తాయని తెలుసుకుని ఇప్పుడు శిక్షణ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ప్రతిభ ఉన్నవారికి ఉపాధి అవకాశాలు తలుపు తడుతున్నాయి. వెల్డింగ్, ఫిట్టర్, సేఫ్టీ రంగాల్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ రంగాల్లో జీతం నెలకు రూ.3.50 లక్షల వరకు సంపాదించే యువత కూడా ఉద్దానం ప్రాంతంలో ఉన్నారు. రష్యా, ఇటలీ, జపాన్, పోలెండ్ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. దీంతో యువకులు ఈ కోర్సులపై మొగ్గు చూపుతున్నారు. రేపటి బంగారు భవిష్యత్కు బాటలు వేయడానికి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కంచిలి, హరిపురం, పలాస, పూండి, నరసన్నపేట, శ్రీకాకుళం, రూరల్, అర్బన్ ప్రాంతాల్లో దాదాపు 250కి పైగా వెల్డింగ్ ఇనిస్టిట్యూట్లు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నాయి. స్కిల్ ఉన్నవారిని పిలిచి మరీ ఉద్యోగాలు ఇస్తారని తెలుసుకుని యువకులు పోటీతత్వంతో ముందుకు సాగుతున్నారు. వీరికి వెల్డింగ్ రంగం గొడుగు పడుతోంది. సర్టిఫైడ్ కోర్సులకు డిమాండ్ ఉన్నత విద్యను అభ్యసించినవారు సైతం ఉపాధి కోసం సాంకేతిక విద్యను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా వెల్డింగ్, గ్యాస్ కటింగ్లపై శ్రద్ధ చూపిస్తున్నారు. వెల్డింగ్లో సెర్టిఫైడ్ కోర్సులను అభ్యసించి ఇండియాలో స్టీల్ప్లాంట్, ఇతర ప్రాజెక్టుల్లో పాటు విదేశాల్లో సైతం ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించడంలో విశాఖ, శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పూండి ప్రాంతాల్లోని వెల్డింగ్ శిక్షణ కేంద్రాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఆరు నెలలు, ఏడాది పాటు శిక్షణ పొందితే చాలు ఏ సంస్థ అయినా వెల్డర్గా పనిలోకి తీసుకుంటుంది. ఇది నిరుద్యోగులకు వరంగా నిలుస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు ఉద్యోగం సాంపాదించడం కోసం వెల్డింగ్ నేర్చుకుని సింగపూర్, దుబాయ్, అబుదాబి, అమెరికా, ఆస్ట్రేలియా, పోలెండ్, రష్యా, అజర్బైజాన్, కత్తర్, థాయ్లాండ్, బ్యాంకాక్, మలేషియా వెళ్లిన యువకులు జిల్లాలో అనేక మంది ఉన్నారు. అధికంగా యువకులు విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తుండడంతో వారి అవసరాలకు అనుగుణంగా వెల్డింగ్ శిక్షణ సంస్థలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 250 వరకు శిక్షణ సంస్థలు 3జీ, 4జీ, 6జీ, టిగ్, ఆర్క్, మిగ్ వెల్డింగ్లో శిక్షణ అందిస్తున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఇంటర్, ఐటీఐ చేసిన వారిలో ఎక్కువ మంది వెల్డింగ్, ఫిట్టర్, సేఫ్టీ, క్యూసీ రంగంలో ఆసక్తి కనబరుచుకుని ప్రగతికి బాటలు వేసుకుంటున్నారు. ఆటోక్యాడ్ ఇతర సర్టిఫికెట్ కోర్సుల్లో శిక్షణ పొందినవారితో పాటు ఉన్నత విద్యను అభ్యసించినవారు సైతం, టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తుండడంతో వెల్డింగ్కు విశేష ఆదరణ లభిస్తోందని శిక్షణ సంస్థల నిర్వహకులు చెబుతున్నారు. కాగా విదేశీ ఉద్యోగాల మోజులో యువత కొంతమంది ఏజెంట్లు, మధ్యవర్తులను నమ్మి మోసపోతున్నారు. లక్షలాది రూపాయలను వారి చేతిలో పెట్టి టూరిస్టు విసాలతో వెళ్లి అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. గుర్తింపు పొందిన వెల్డింగ్ ఇనిస్టిట్యూట్ అసోసియేషన్లలో నమోదైన సంస్థల్లో మాత్రమే శిక్షణ తీసుకోవాలని పోలీసులు చెబుతున్నా యువత పెడచెవిన పెట్టి ఉద్దానం, తీర ప్రాంత గ్రామాల్లోని విదేశీ ఏజెంట్ల వలలో చిక్కిపోతున్నారు. నకిలీ వీసాలతో పాటు కంపెనీ కాంట్రాక్టు కాపీలు, జీతం, వసతి అలవెన్సులు తదితర విషయాల్లో సైతం మోసాలకు పాల్పడుతుండడంతో విదేశీ ఉద్యోగాల పేరుతో మోసపోయిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. -
చిక్కుముడి!
బాల్యానికి.. ● జిల్లాలో ఆగని బాల్య వివాహాలు ● రాష్ట్రంలో మూడో స్థానం ● చదువుకు దూరమవుతున్న బాలికలు ● జీవితాంతం వెంటాడుతున్న రుగ్మతలు హిరమండలం: బడిబాట పట్టాల్సిన బాలికలు పెళ్లిపీటలెక్కుతున్నారు. తెలిసీ తెలియని వయసులో వారిని మూడుముళ్ల బంధంలో చిక్కుకుంటున్నారు. చదువు, ఆటపాటలతో హాయిగా గడవాల్సిన సమయంలో గర్భం దాల్చుతున్నారు. అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఆర్థిక ఇబ్బందులు, కట్టుబాట్లతో పెద్దలే చిన్నారులకు పెళ్లిచేసి అత్తారింటికి పంపుతున్నారు. జిల్లాలో ప్రధానంగా వలసలు వెళ్లే పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. జిల్లాలో 11 తీర ప్రాంతాల్లో సైతం బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపుగా గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు అనేవి ఒక సంప్రదాయంగా వస్తున్నాయి. అక్కడ కులం కట్టుబాట్లతో ఎక్కవగా చిన్ననాటే పెళ్లిళ్లు జరిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో చాలావరకూ బాల్య వివాహాలు అదుపులోకి వచ్చాయి. అవగాహన ఉన్నవారు తమ పిల్లల విషయంలో చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ, నిరక్షరాస్యులు మాత్రం ఆడపిల్లలను భారంగా పరిగణించి బాల్య వివాహాలు చేసేస్తున్నారు. సమాచారం అందుకుంటున్న అధికారులు 2020–21లో 114, 2021–22లో 68, 2022–23లో 144, 2023–24లో 96, 2024–25లో 28 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. 2025–26కు సంబంధించి 18 బాల్య వివాహాలను అడ్డుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థిక భారంతో.. శ్రీకాకుళం ప్రధానంగా వలసల జిల్లా. చాలా గ్రామాల్లో భార్య, భర్త ఇద్దరూ పనికి వెళితే గానీ పూటగడవని పరిస్థితి. ఈ నేపథ్యంలో పదో తరగతి వరకూ ఆడపిల్లలను చదివించి వెంటనే వివాహాలు జరిపించేస్తున్నారు. ఇలా చేస్తే తమ బాధ్యత తీరిపోతుందని అనుకుంటున్నారే తప్ప.. బాల్య వివాహాలతో తమ పిల్లలను అనారోగ్య కూపంలోకి తోసివేస్తున్నామన్న విషయాన్ని గుర్తించడం లేదు. ఆ జాబితాలో జిల్లా.. రాష్ట్రంలో 45 శాతానికి మించి బాల్య వివాహాలు జరుగుతున్న జిల్లాల్లో శ్రీకాకుళం మూడోస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అందులో 23 శాతం మంది 15 నుంచి 18 సంవత్సరాల్లోపు బాలికలే అమ్మలుగా మారుతున్నారు. బాల్యంలో తల్లులు కావడం అనేది గతంతో పోల్చుకుంటే తగ్గినప్పటికీ.. బాల్య వివాహాలు మాత్రం ఆగకపోడం ఆందోళన కలిగిస్తోందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే స్పష్టం చేసింది. 15 నుంచి 19 ఏల్ల వయసులోపు బాలికలు నిర్దేశిత బరువు కంటే తక్కువగా ఉంటారు. తల్లిగా మారే సమయంలో బాడీ మాస్ ఇండెక్స్ తగ్గడంతో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో బిడ్డ గర్భంలో చనిపోవడం, వైకల్యంతో పుట్టడం, ఆరోగ్యకరమైన ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఫిర్యాదు చేయవచ్చు.. బాల్య వివాహాలు జరిగితే నిర్భయంగా 1098, 100, 181 వంటి టోల్ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలకు సైతం సమాచారం అందించవచ్చు. జిల్లా అధికారులు రంగంలోకి దిగి స్థానిక పోలీసుల సహకారంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహాల నియంత్రణకు ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా కూడా బాల్య వివాహాల సమాచారం చేరవేయవచ్చు. అయితే, ఇటీవల ఫేక్ ఫిర్యాదులు చేస్తుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వ్యవహారాల కారణంగా కొంతమంది తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. నిజంగా బాల్య వివాహం జరుపుతుంటే మాత్రం నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. అధికారులు వచ్చి తప్పకుండా అడ్డుకుంటారు. బాల్య వివాహాలు చట్టపరంగా నేరం. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిపిస్తే ఫిర్యాదు చేయాలి. ఎటువంటి భయం అవసరం లేదు. స్థానిక పోలీసుల రక్షణలోనే విచారణ జరుగుతుంది. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. వారి సమ్మతితోనే వివాహాన్ని నిలుపుదల చేయిస్తాం. బాల్య వివాహాలతో అనారోగ్యం తప్పదు. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. దీనిపై గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం – ఐ.విమల, ఐసీడీఎస్ పీడీ, శ్రీకాకుళం ఎల్ఎన్పేట మండలంలోని ఓ గ్రామంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలికకు తల్లిదండ్రులు వివాహం చేయాలని నిశ్చయించారు. సన్నాహాలు కూడా ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు గ్రామానికి చేరుకొని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చిన్న వయసులో వివాహం జరిపితే కలిగే అనర్థాలను వివరించారు. దీంతో తల్లిదండ్రులు వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. హిరమండలానికి ఓ కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పదో తరగతి చదువుతున్న కుమార్తెకు వివాహం జరపాలని నిర్ణయించారు. బాలికకు పెళ్లి ఇష్టం లేదు. దీంతో స్నేహితుల ద్వారా చైల్డ్లైన్ అధికారులను ఆశ్రయించింది. వారు వచ్చి కౌన్సెలింగ్ ఇవ్వడంతో తల్లిదండ్రులు వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. -
తాయిలాల కోసం తోపులాట
తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలకు ఇచ్చే తాయిలాల కోసం తోపులాట జరిగింది. శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలిలో గల ఎంహెచ్ స్కూల్ మైదానంలో మంగళవారం నిర్వహించిన సీ్త్ర శక్తి కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సభకు వస్తే తాయిలాలు ఇస్తామని చెప్పడంతో మహిళలు తరలివచ్చారు. వారికి జాకెట్ పీస్లు ఇస్తుండటంతో సభలో ఉన్నవాళ్లంతా ఒక్కసారి చేరడంతో తోపులాట జరిగింది. ఈ సమయంలో ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే మిగిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సీ్త్ర శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితప్రయాణం కల్పించామన్నారు. త్వరలోనే ట్రాన్స్జెండర్లకు, మహిళలకు ఉచిత ప్రయాణం కోసం స్మార్ట్కార్డులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పైడిశెట్టి జయంతి, మాదారపు వెంకటేషు తదితరులు పాల్గొన్నారు. -
నదిలో దూకిన బాలుడు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని డేఅండ్నైట్ కొత్త వంతెన పై నుంచి ఓ బాలుడు నాగావళి నదిలో దూకేసిన ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. జిల్లా అగ్నిమాపక సహాయాధికారి శ్రీనుబాబు తెలిపిన వివరా ల్లోకి వెళ్తే.. నగరంలోని రెల్లివీధికి చెందిన బి.రమేష్ అంబేడ్కర్ జంక్షన్ వద్ద పళ్ల రసం దు కాణం నడుపుతున్నారు. ఆయన పెద్ద కుమారుడు ఓ స్కూల్లో నాల్గో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ మాదిరిగానే యూనిఫాం ధ రించి స్కూల్కు వెళ్లిన విద్యార్థి సరిగ్గా ఉదయం 9:15 గంటలకు డేఅండ్నైట్ సమీప కొత్త వంతెన పైనుంచి దూకేశాడు. దీన్ని గమనించిన ఏఆర్ కానిస్టేబుల్ అగ్నిమాపక శాఖకు సమా చారం అందించారు. విద్యార్థి తేలియాడుతూ కనిపించడంతో అటువైపుగా వెళ్తున్న పాలవ్యాపారి తన వద్దనున్న తాడు వేయడం, అప్పటికీ సరిపోకపోవడంతో ఓ జాలరి తన వద్ద నున్న తాడు కలిపి వేయడంతో బాలుడు అందుకున్నాడు. అప్పటికే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సైతం జాలరితో పాటు నదిలోకి దిగి బాలున్ని రక్షించి బయటకు క్షేమంగా తీశారు. ఈలోగా తల్లిదండ్రులు రావడంతో కౌన్సిలింగ్ చేశామని, చిన్న కారణానికే క్షణికావేశంలోనే బాలుడు నదిలో దూకాడని ఏడీఎఫ్ఓ శ్రీనుబాబు పేర్కొనడం విశేషం. అదే మార్గంలో బాలున్ని చూసేందుకు వాహనదారులు అధికంగా ఆగడంతో కాసేపు ట్రాఫిక్ అయ్యింది. -
కుల సంఘాలు సమాజసేవ చేయాలి
నరసన్నపేట: కుల సంఘాలు సమాజ సేవలో ముందుండాలని కళింగ కోమట్లు సంక్షేమ సంఘం జిల్లా ప్రతినిధి, కళింగకోమటి కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంధవరపు సూరిబాబు, మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బోయిన రమేష్ అన్నారు. నరసన్నపేటలోని ఓ కన్వెన్షన్ హాలులో జిల్లా కళింగ కోమట్లు సంక్షేమ సంఘం సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలన్నారు. కళింగ కోమట్లు రాష్ట్ర సంఘం ప్రతినిధి బోయిన గోవిందరాజులు, జిల్లా సంఘం ప్రతినిధి తంగుడు జోగారావు తదితరులు మాట్లాడుతూ కళింగ కోమట్ల అభివృద్ధే ధ్యేయమన్నారు. కాగా, జిల్లా కళింగ కోమట్లు సంక్షేమ సంఘం కార్యవర్గం ఎన్నిక వాయిదా పడింది. ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు జోగారావు తెలిపారు. కార్యవర్గం ఎన్నికకు గోవిందరాజులు అధ్యక్షతన మరో 8 మందితో కూడిన కమిటీని నియమించామని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలి ఇచ్ఛాపురం : విశాఖపట్నం సీతమ్మధారలో మూగబాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్–1 ఉలాల భారతి దివ్య డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నేరస్తులను వెంటనే పట్టుకుని ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. -
హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
ఆమదాలవలస: కొత్తవలస గ్రామానికి చెందిన అరసవెల్లి హరమ్మ హత్య కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ పి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆమదాలవలస పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో హరమ్మ తీవ్రంగా గాయపడిందన్నారు. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ 4వ తేదీన మృతిచెందిందన్నారు. ఈ ఘటనలో కొత్తవలస గ్రామానికి చెందిన దవల లక్ష్మణరావుతోపాటు మరో నలుగురు వ్యక్తులు, ఒక మైనర్పై హత్య కేసు నమోదు చేశామని తెలిపారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న నిందితులు పోలీసులకు దొరక్కుండా పరారయ్యారన్నారు. తదుపరి దర్యాప్తులో ఎస్సై ఎస్.బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు నిందితుల కదలికలపై సమాచారం సేకరించి మంగళవారం కొర్లకోట సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితులను జూనియర్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. మైనర్ నిందితుడిని జువైనెల్ కోర్టు ఎదుట హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సమాజంలో అట్టడుగు వర్గాలకు సత్వర న్యాయం అందించాలంటే ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల మధ్య సమన్వయం అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, సంబంధిత విభాగాల అధికారులతో కలిసి మంగళవారం జిల్లా న్యాయ సేవా సదన్లో సదస్సు నిర్వహించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, అక్రమ రవాణా బాధితులు, ట్రాన్స్జెండర్లు, గిరిజనులు, అసంఘటిత కార్మికులు వంటి వివిధ వర్గాల ప్రయోజనాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విభాగాల అధికారులు తాము అందిస్తున్న పథకాలను వివరించగా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమాజానికి తాము చేస్తున్న సేవలను తెలియజేశారు. కార్యక్రమంలో డీసీపీవో రమణ, ఎల్ఏడీసీ ప్రధాన అధికారి కె.ఆఫీసు పాల్గొన్నారు. వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల ఎచ్చెర్ల : ఏపీ ఈఏపీ సెట్–2025 ప్రవేశ పరీక్షలకు అర్హత సాధించిన బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు బీ–పార్మసీ, ఫార్మాడీ, బీ టెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సాంకేతిక విద్యాశాఖ ఉన్నత విద్యామండలి వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసిందని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, సహాయ కేంద్రం సమన్వయకర్త కె.నారాణరావు మంగళవారం తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్రోసెసింగ్ కోసం ఈ నెల 11 నుంచి 16 వరకూ రుసుము చెల్లించాలని చెప్పారు. ఈ నెల 12 నుంచి 17లోగా ధ్రువపత్రాలు అప్లోడ్ చేసి ఆన్లైన్ పరిశీలన, 13 నుంచి 18 వరకూ కళాశాలల కోర్సుల ఎంపికకు వెబ్ ఆప్షన్లు, 19న వెబ్ ఆప్షన్ల మార్పు, 21న కళాశాలలు, కోర్సుల కేటాయింపు జాబితా వెల్లడించనున్నట్లు వివరించారు. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 23లోగా కళాశాలల్లో రిపోర్టు చేసుకోవాలన్నారు. నిరసన ర్యాలీ విజయవంతం చేయండి శ్రీకాకుళం న్యూకాలనీ: విజయవాడ ధర్నాచౌక్ వద్ద బుధవారం ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరగనున్న శాంతియుత నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర జిల్లాల నాయకుడు జామి శ్రీకాంత్బాబు మంగళవారం పిలుపునిచ్చారు. లైబ్రరీ సైన్స్ నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలన్నదే తమ ఉద్దేశమన్నారు. కొన్ని సంవత్సరాలుగా లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఈ కోర్సు పూర్తిచేసిన వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామక వయస్సు కూడా దాటిపోయి మానసిక సంఘర్షణ, ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. మెరుగైన ఫలితాలే లక్ష్యం పాతపట్నం: ఇంటర్మీడియట్ పరీక్షలలో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని, ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ఉంటుందని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి ఆర్.సురేష్కుమార్ అన్నా రు. మంగళవారం పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని, విద్యార్థులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా చూడాలన్నారు. ఆయనతో పాటు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి దుర్గారావు, ప్రిన్సిపాల్ టి.హేమసుందరరావు, అధ్యాపకులు ఉన్నారు. -
ఆంక్షల సంకెళ్లు
● అన్నదాతలతో కలిసి గర్జించిన వైఎస్సార్సీపీ నేతలు ● గృహ నిర్బంధాలు, అరెస్టులు లెక్కచేయకుండా నిరసన ● ఎరువుల సమస్య తీరే వరకు పోరాటం చేస్తామని హెచ్చరిక అడుగడుగునా ఆంక్షలు.. అడుగు బయట పెట్టనీయకుండా నిర్బంధాలు.. నలుచెరగులా పోలీసు బలగాలు.. అయినా అన్నదాతల నినాదం దిక్కులు పిక్కటిల్లేలా అందరికీ వినిపించింది. వారి ఆందోళన పాలకుల పీఠాలు కదిలే స్థాయిలో జరిగింది. రైతన్నకు జత కలిసిన వైఎస్సార్సీపీ నేతలు ఎరువుల కొరతపై ప్రభుత్వాన్ని దునుమాడారు. నిర్లక్ష్యపు పాలనను అధికారులకు వినతి పత్రాలు అందజేసి మరీ వివరించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్సార్సీపీ మంగళవారం చేపట్టిన అన్నదాత పోరుబాటకు సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. పోలీసు సాయంతో ఆందోళన అణచివేయాలని అనుకుంది. కానీ రైతుల కోసం వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. అన్నదాతలు కలిసి రావడంతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. అడ్డుకున్న పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించారు. ముందు అనుమతి ఇచ్చి.. సోమవారం రాత్రి 9 గంటల వరకు వైఎస్సార్సీపీ అన్నదాత పోరు బాటకు అనుమతులు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. అయితే ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన పిలుపునకు పెద్ద ఎత్తున స్పందన వస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ప్రభుత్వం కుట్రలు పన్నడం ప్రారంభించింది. అనుమతులు తూచ్ అంటూ రద్దు చేసేసింది. కేవలం 15 మందితో మా త్రమే వినతి పత్రం ఇచ్చుకోవాలని, ర్యాలీలు, నిరసనలు నిషేధమని ఆంక్షలు విధించింది. తెల్లారే సరికి ఆటంకాలు సృష్టించింది. నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పో లీసుల బలగాలతో మోహరించింది. కానీ నిర్బంధాలను ఛే దించుకుని వైఎస్సార్సీపీ నేత లు పోరుబాటను విజయ వంతంగా నిర్వహించారు. కాశీబుగ్గలో ఉద్రిక్తత కాశీబుగ్గలో తెల్లవారుజామున నుంచి ఉద్రిక్త పరిస్థి తి చోటు చేసుకుంది. పోలీసుల నిర్బంధాలు దాటుకుని రకరకాల మార్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అన్నదాతలు కాశీబుగ్గ తరలివచ్చారు. కానీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును గృహ నిర్బంధం చేశారు. దీంతో వాగ్వాదం జరి గింది. అనంతరం పోలీసులు కొందరిని బలవంతంగా వాహ నం ఎక్కించి ఆర్డీఓ ఆఫీస్కు తరలించారు. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నాక సీదిరి అప్పలరాజు తో పాటు పార్టీ పార్లమెంట్ పరిశీలకులు కుంభా రవిబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి(పార్లమెంట్) దుంపల రామారావు, రాష్ట్ర కార్యదర్శి(పార్లమెంట్) శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, తదుపరి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు కవిటి మండలంలో వారి ఇళ్ల వద్ద జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు వారి అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. టెక్కలిలో నిర్బంధాలు.. టెక్కలి వైఎస్సార్ జంక్షన్ సమీపంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ను పోలీసులు నిర్బంధించారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని ఆర్డీవో కార్యాలయం వద్దకు వాహనంలో తరలించా రు. దీంతో వైఎస్సార్ జంక్షన్లో కార్యకర్తలు నినాదాలు చేయగా వా రిని అరెస్టు చేశారు. ఆర్డీవో కా ర్యాలయం వద్ద పార్టీ పార్లమెంట్ పరిశీలకులు కుంభా రవిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, సమన్వయకర్త పేరాడ తిలక్ తదితరులు వినతి పత్రం అందజే శారు. అంతకుముందు పాతప ట్నంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిని, మిగతా నాయకుల ను గృహ నిర్బంధం చేశారు. నరసన్నపేటలో ఆంక్షలు నరసన్నపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎంపీపీ ఆరంగి మురళీలతో పాటు పలువురిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ తర్వాత కృష్ణదాస్కు, కుంభా రవిబాబుకు అనుమతి ఇచ్చారు. 11 గంటలకు జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య పార్టీ కార్యాలయానికి రావడంతో నాయకులు, కార్యకర్తలు, రైతులు ఒక్క సారిగా చేరారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద పూల మాల వేసి ధర్నా నిర్వహించారు. అక్కడే కృష్ణ చైతన్యతో రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) కరిమి రాజేశ్వరరావుతో పాటు పలువురు నాయకుల్ని అరెస్టు చేశారు. తర్వాత విడుదలైన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఎచ్చెర్లలో.. రణస్థలం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తున్న మా జీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, రైతులను పోలీసులు అడ్డగించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులను సైతం ఎక్కడికక్కడ నిర్బంధించారు. చివరికి కొద్దిమందితో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఆమదాలవలసలో.. ఆమదాలవలసలో పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ను తొలుత ఆయన ఇంటి వద్ద నిర్బంధించారు. పార్టీ కార్యాలయం వద్ద కూడా పోలీసు లు నిర్బంధించారు. అనంతరం రైతులతో కలిసి త హసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి అందజేశారు. తమ్మినేని ఇంటి వద్ద ఉద్రిక్తత టెక్కలిలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన మాజీ స్పీకర్, పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాంను ఆయన ఇంటి వద్ద పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళంలో అడ్డంకులు శ్రీకాకుళంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు మో హరించారు. వారిని తప్పించుకుని ఆర్డీవో ఆఫీస్కు వచ్చి రాష్ట్ర వెలమ విభాగం అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ జోన్ ప్రెసిడెంట్ గొండు రఘురాం, ధర్మాన రామ్ మనోహర్నాయుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, మాజీ జెడ్పీటీసీ మోకళ్ల తాతబాబు, ఎచ్చెర్ల శ్రీధర్ బాబు వినతి పత్రం అందజేశారు. నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరు ప్రజా ఉద్యమాలను గృహ నిర్బంధాలతో ఆప లేరు. పాలన చేయలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదు. రైతులు గంటల తరబడి యూరియా కోసం వేచి ఉండడం దారుణం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత దుర్భర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ ఎప్పుడూ నిర్లక్ష్యమే.. నాల్గో సారి సీఎంగా గద్దెనెక్కిన చంద్రబాబుకు వ్యవసాయం అన్నా, రైతులన్నా ఎప్పుడూ నిర్లక్ష్యమే. ఒక రోజు వ్యవసాయం దండగ అంటారు. మరో రోజు యూరియా అవసరం లేదంటారు. ఇంకోరోజు కొద్దిగా యూరియా సరిపోతుందంటారు. 15 రోజుల్లో వేయాల్సిన ఎరువు ఇప్పటికీ ఇవ్వకపోతే పంట ఏమైపోతుందోనన్న ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి. యూరియా కేవలం టీడీపీ వాళ్లకే దొరుకుతోంది. మిగిలిన వారు కూడా రైతులే అన్న సంగతి గుర్తించాలి. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రైతుల కన్నీరు గుర్తించాలి ప్రభుత్వం రైతుల కన్నీరు చూడాలి. యూరియా కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. పల్లెల్లో ఎరువు పసుపు కండువా వేసుకున్న వారికే అందుతోంది. సీఎం ఫొటో మాత్రమే చంద్రబాబుది.. అధికారాలు మాత్రం లోకేష్వి. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో లేరో తెలీని పరిస్థితి. ఆ శాఖకు పూర్తిగా తాళాలు వేసేశారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి చంద్రబాబువి చేతకాని మాటలు జిల్లాకు 32 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరంగా కాగా 37 శాతం కూడా పంపిణీ చేయలేదు. రైతులను ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. చంద్రబాబు వ్యవసాయం దండగ అని వ్యాఖ్యానించడం అందరికీ తెలిసిందే. రైతులకు ఎరువులు ఇవ్వలేక చెబుతున్న చేతకాని మాటలివి. – కుంభా రవిబాబు, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు నరసన్నపేటలో రైతు నిరసన -
కదం తొక్కిన జీడి కార్మికులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం మందస జీడి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ నాయకులు, జీడి కార్మిక సంఘ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీడి కార్మికులకు పూర్తిస్థాయి పని దినాలు కల్పించాలని, కాల్చిన పిక్కలు అక్రమ తరలింపు ఆపాలని కోరుతూ శ్రీకాకుళం ఆర్అండ్బీ బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందస జీడి యాజమాన్యాలు కాల్చిన పిక్కలను పరిశ్రమలో పనిచేసిన కార్మికులకు ఇవ్వకుండా అక్రమంగా వేరే ప్రాంతాలకు తరలిస్తుంటే ప్రభుత్వం యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కార్మికులకు పని కల్పించకుండా, లైసెన్సులు లేకుండా ఇతర ప్రాంతాలకు అక్రమ పద్ధతిలో తరలించడం సరికాదన్నారు. కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారని, కనీస వేతనాలు గానీ, పీఎఫ్, ఈఎస్ఐ, అదనపు పనికి అదనపు వేతనం వంటివి అమలు చేయకుండా శ్రమదోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల పోరాటానికి సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, రైస్ మిల్లు కార్మిక సంఘం నాయకులు కె.కేశవరావు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, జిల్లా జీడి కార్మిక సంఘం నాయకులు అల్లు హేమలత, సీహెచ్ చంద్రమ్మ, సీహెచ్ జానకమ్మ, కె.శేషమ్మ, పి.సావిత్రి, జి.బాలమ్మ, కె.కుమారి, కె.శాంతమ్మ, కె.సరస్వతి, బి.భారతి, కె.ధనం, డి.లక్ష్మి, ఎం.దానమ్మ, డి.భారతమ్మ పాల్గొన్నారు. -
అత్యాశతోనే అంతం చేశారు
నరసన్నపేట : అత్యాశకు పోయి సులువుగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితోనే నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి పొట్నూరు వెంకట పార్వతీశం గుప్తాను మోలి అప్పలరాజు, జువ్వాది సంతోష్లు హత్య చేశారని టెక్కలి డీఎస్పీ డి. లక్ష్మణరావు తెలిపారు. గుప్తా వద్ద కాజేసిన కేజీ 33 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామని చెప్పారు. అప్పలరాజులు, జువ్వాది సంతోష్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు. నిందితుల వద్ద బంగారాన్ని కొనుగోలు చేసిన శ్రీకాకుళం నగరానికి చెందిన ఆర్ఎస్ జ్యూయలరీ యజమానిని ఈ కేసులో మరో ముద్దాయిగా గుర్తించామని, ఈయన్ను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. కేసు వివరాలను నరసన్నపేటలో మంగళవారం విలేకరులకు వెల్లడించారు. గెడ్డలో మృతదేహం లభ్యం.. బంగారం వ్యాపారం చేస్తున్న గుప్తా ఆగస్టు 26న తన బొలెరో వాహనంలో డ్రైవర్ సంతోష్తో పాటు విశాఖ వెళ్లారు. నాలుగు రోజులైనా ఇంటికి రాకపోవడంతో గుప్తా సోదరుడు మన్మధరావు నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు. వారం తర్వాత గుప్తా మృతదేహం శ్రీకాకుళం సమీపంలోని రామిగెడ్డ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. శరీరంపై గాయాలు బట్టి హత్య కేసుగా దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ సంతోష్పై అనుమానంతో నిఘా పెట్టి విచారణ చేయగా బంగారం కోసమే గుప్తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. పెద్దపాడు వద్ద ఆదిత్య కార్ వరల్డ్ బిల్డింగ్ యజమాని మోలి అప్పలరాజు షాపులో గుప్తా మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం రామిగెడ్డలో మృతదేహాన్ని పడేశారు. ఆ సమయంలో వర్షాలు అధికంగా పడటంతో మృతదేహం కొట్టుకుపోతుందని భావించారు. ఇంతలో తుప్పలు అడ్డుపడటంతో మృతదేహాన్ని గుప్తా బంధువులు గుర్తించగలిగారు. డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితోనే అప్పలరాజు ఈ హత్యలో పాలుపంచుకుని బంగారంలో అధిక భాగం తీసుకున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అప్పలరాజేనని డీఎస్పీ తెలిపారు. సంతోష్ భార్య ప్రశాంతి, బొరిగివలసకు చెందిన మణిలు కేసులో నిందితులు కాదని వివరించారు. నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, నరసన్నపేట, జలుమూరు, సారవకోట, పోలాకి ఎస్ఐలు సీహెచ్ దుర్గాప్రసాద్, అశోక్బాబు, అనిల్, రంజిత్లు చాకచక్యంగా కేసును దర్యాప్తు చేసి సకాలంలో బంగారాన్ని రికవరీ చేశారని తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం పరిధిలోని పెదపాడు పరిసర ప్రాంతం మైస్టోర్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెండువానిపేట గ్రామానికి చెందిన కింజరాపు గంగరాజు(30) అనే వ్యక్తి ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. విధి నిర్వహణకు వెళ్లి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా, ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న పెదపాడుకు చెందిన ఒక వ్యక్తి ఢీకొన్నాడు. దీంతో గంగరాజు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే స్థానికులు రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడు తండ్రి కింజరాపు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పీడీఎస్ బియ్యం పట్టివేత
పలాస: టెక్కలి నుంచి ఒడిశా ప్రాంతానికి వ్యానులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని కాశీబుగ్గ పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారులకు పోలీసులు దాన్ని అప్పగించారు. దీంతో పలాస సివిల్ సప్లయ్ అధికారి(సీఎస్డీటీ) ఎం.తిరుపతిరావు వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్కలి, కోటబొమ్మాళిలో సేకరించిన ఈ బియ్యాన్ని ఒడిశా రాష్ట్రానికి తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో, కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ తన సిబ్బందితో లక్ష్మీపురం టోల్ గేటు వద్ద పట్టుకొని వాహనాన్ని సీజ్ చేసి తమకు అప్పగించారన్నారు. వాహనంలో మొత్తం 220 బస్తాల్లో సుమారు 10 టన్నుల బియ్యం ఉన్నాయన్నారు. బియ్యాన్ని పలాస ఎంఎల్సీ పాయింటు వద్ద అప్పగించి వాహనాన్ని తిరిగి పోలీసుస్టేషన్కు పంపిస్తామన్నారు. ఈ విషయాన్ని జిల్లా జాయింట్ కలెక్టరుకు చెప్పి తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.జాతీయ పోటీలకు నడగాం విద్యార్థినరసన్నపేట: జాతీయ స్థాయి యోగాసన పోటీలకు మండలంలోని నడగాం గ్రామానికి చెందిన బొత్స మనోహర్నాథ్ ఎంపికయ్యాడు. డిసెంబర్ 27 నుంచి 30వ తేదీ వరకూ రాంచీలో యోగా స్పోర్ట్స్ చాంపియన్–2025 పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో మనోహర్నాథ్ పాల్గోనున్నట్లు తండ్రి కేదారనాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 6, 7వ తేదీల్లో ఏపీ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు తిరుమలలో జరిగాయన్నారు. ఈ పోటీల్లో మనోహర్నాథ్ కాంస్య పతకం సాధించినట్లు వెల్లడించారు. ఈ మేరకు జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ తరుపున పాల్గోనున్నట్లు వివరించారు. కాగా తమ గ్రామానికి చెందిన బాలుడు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై గ్రామానికి చెందిన నాయకులు లుకలాపు రవి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు.ఆటోపై కూలిన తాటి చెట్టురణస్థలం: మండలంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షాలకు రణస్థలం మండల కేంద్రంలోని హైస్కూల్ సమీపంలో రామతీర్థాలు రహదారిపై వెళ్తున్న ఆటోపై తాటిచెట్టు విద్యుత్ వైర్లతో సహా ఆకస్మాత్తుగా కూలిపోయింది. అయితే అదృష్టావశాత్తు ఆటోలో ఉన్న డ్రైవర్తో పాటు అందులో ఉన్న ప్రయాణిలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. వర్షం వలన విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంతా ఉపిరిపీల్చుకున్నారు. -
చిత్తశుద్ధి కొరత
పొలాల్లో ఉండాల్సిన రైతన్నలు క్యూలలో నిలబడుతున్నారు. స్టేషన్లలో ఉండాల్సిన పోలీసులు రైతులకు కాపలా కాస్తున్నారు. ఆర్ఎస్కేలలో ఉండాల్సిన ఎరువులు అధికార పార్టీ నేతల భవంతులకు వెళ్తున్నాయి. సమాధానం చెప్పాల్సిన నాయకులు అసలు కొరతే లేదని చెబుతున్నారు. ఈ ఖరీఫ్కు సర్కారు సాయం లేకుండానే జిల్లాలో వ్యవసాయం జరుగుతోంది. సాగు విస్తీర్ణం మొదలుకుని, ఎరువుల ఇండెంట్ నమోదు వరకు అన్నింటా తీవ్ర నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎరువుల కొరతతో పాటు సర్కారు చిత్తశుద్ధిలోనూ ‘కొరత’ కనిపిస్తోంది.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పొలం పనుల్లో తీరిక లేకుండా గడపాల్సిన అన్నదాతలు క్యూలో నిలబడి బేజారవుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్లో జిల్లాలో 4.07లక్షల ఎకరాల్లో సాగు జరుగుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ వరి పంటే 4లక్షల 15వేలకు పైగా సాగు అవుతున్నట్లు సమాచారం. దీనికి తోడు ఇతర పంటలు ఉండనే ఉన్నాయి. వరికై తే ఎకరాకు 75 కిలోలు, మొక్కజొన్నకు ఎకరాకు 7 నుంచి 8 బస్తాలు, తోట పంటలకు ఎకరాకు 10 నుంచి 12 బస్తాల యూరియా అవస రం ఉంటుంది. ఈ లెక్కన వరికై తే 30 వేల టన్ను లు, మొక్కజొన్నకు 14వేల టన్నులు, వివిధ రకాల తోటలకు మరో 7వేల టన్నులు అవసరం ఉంటుంది. ఇలా జిల్లాకు 51వేల టన్నులు అవసరం ఉంటుంది. కానీ, ప్రభుత్వం ఇంతవరకు 23 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకొచ్చింది. ఇది ఎటూ సరిపోలేదు.ప్రణాళిక ఉందా..?వైఎస్సార్ సీపీ హయాంలో ఏటా 44వేల నుంచి 46వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేసేవారు. రైతుల నుంచి ముందుగా ఇండెంట్ తీసుకునేవారు. ఇప్పుడు ముందస్తు ప్రణాళిక అనేదే లేకుండాపో యింది. సరిపడా యూరియాను తీసుకురావడంలో సర్కారు విఫలమైంది. దానికి తోడు 23వేల మెట్రిక్ టన్నుల యూరియా తీసుకొచ్చినట్టు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ యూరియా కూడా కనిపించడం లేదు. పంపిణీలో రాజకీయం జోక్యం పెరగడంతో పాటు సరుకు బ్లాక్ మార్కెట్కు వెళ్లిపోవడంతో యూరియా దొరకడం లేదు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్తా యూరియా కో సం నానా తిప్పలు పడుతున్నారు. ఇదే అవకాశంగా ప్రైవేటు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రూ. 270కు అమ్మాల్సిన యూరియా బస్తాను ధర పెంచి అమ్ముతున్నారు.వ్యూహం లేకుండా..జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి మూడు జోన్లు ఉన్నాయి. జోన్–1 పరిధిలోని శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో ముందు సాగు ప్రారంభం కానుండటంతో ఇక్కడ యూరియా సరఫరా చేయాలి. దీనికి 15 రోజుల్లో జోన్ 2 పరిధిలోని నరసన్నపేట నుంచి నందిగాం వరకు యూరియా సరఫరా చేయాలి. ఇక్కడికి 15 రోజుల్లో జోన్ 3 పరిధిలోని పలాస, ఇచ్ఛాపురం ఏరియాలకు యూరియా సరఫరా చేయాలి. దీనికోసం ముందు ఎరువుల ఇండెంట్ తీసుకుని పక్కాగా సిద్ధం చేయాలి. కూటమి ప్రభు త్వంలో వ్యూహాత్మక కార్యాచరణ కనిపించలేదు.మాఫియా కుట్రలు...జిల్లాలో ఆరుగురు హోల్ సేల్ డీలర్లు, 360 మంది రిటైలర్లు ఉన్నారు. జూన్ వరకు వచ్చిన యూరియాలో 50 శాతం ప్రభుత్వ సంస్థలకు ఇవ్వగా, మిగతా 50శాతం ప్రైవే టు వ్యాపారులకు ఇచ్చారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు జిల్లాకు 15 మెట్రిక్ టన్నుల యూ రియా వచ్చింది. వాస్తవంగా ఆ సమయానికి సాగు జరగలేదు. దీంతో ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన యూరియాను కూడా ప్రైవేటు వ్యాపారులకే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. జిల్లాలోని అత్యఽధిక మంది డీలర్లు కీలక నేత సోదరుడికి సన్నిహితంగా ఉండటంతో వారు చెప్పిందే వేదంగా నడుస్తోంది. ప్రైవేటుకు అన్ని ఎరువులు వెళ్లిపోయాక ఆ తర్వాత జిల్లాకొచ్చిన యూరియాలో ప్రభుత్వ సంస్థలకు 70శాతం, ప్రైవేటు వ్యాపారులకు 30శాతం కేటాయింపులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన యూరియాపై రాజకీయ నాయకుల పెత్తనం ఎక్కువ కావడంతో అది కూడా పక్కదారి పట్టింది.● తెంబూరులో..తెంబూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో యూరియా వచ్చిందని రైతులకు తెలియటంతో ఒకేసారి రైతు సేవా కేంద్రానికి తెంబూరు, పెద్దలక్ష్మిపురం, రామచంద్రాపురం, వెంకటాపురం, పెద్ద సరియాపల్లి, ద్వారకాపురం రైతులు వచ్చి బారులు తీరారు. దీంతో వ్యవసాయాధికారులు టోకెన్ ద్వారా యూరి యా అందజేసి, మరో రెండు రోజుల్లో 8.5 మెట్రిక్ టన్నులు వస్తుందని సర్దిచెప్పారు. – పాతపట్నంరైతులు బతకొద్దా..?మాకు తగిన శాస్తే జరిగింది. ఉభాలు వేసి 45 రోజులవుతోంది. ఒక్కసారి కూడా ఎరువు వేయలేదు. ఇంకెప్పుడు వేయాలి. రైతులు బతకొద్దా..? – లక్ష్మణరావు, ముసిడిగట్టు● అధికారుల నిలదీతనరసన్నపేటలో సోమవారం యూరియా పంపిణీ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మన గ్రోమోర్ సెంటర్కు యూరియా వచ్చిందని రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 11 గంటల వరకు క్యూలో ఉన్నా ఒక్క బస్తా కూడా లభించలేదు. దీనికి తోడు అధికార పార్టీ వారు వచ్చి చీటీలు తీసుకెళ్లిపోయారు. ఈలోగా గ్రోమోర్ సెంటర్ షట్టర్లు మూసేయడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బయటకు వచ్చిన ఎస్ఐ సీహెచ్ దుర్గప్రసాద్, ఏఓ సూర్యకుమారిలను నిలదీశారు. నరసన్నపేట రైతులకు మాత్రమే ఇక్కడ ఇస్తామని చెప్పగా.. మిగిలిన వారు రైతులు కాదా అని అక్కడున్న వారు ప్రశ్నించారు. –నరసన్నపేట● అన్నదాతల ధర్నాయూరియా కోసం కొత్తూరు రైతులు సోమవారం పడరాని పాట్లు పడుతున్నారు. సోమవారం తెల్లవారుజాము 6 గంటలకే రైతులు మన గ్రోమోర్ సెంటర్కు వచ్చారు. ఏడు గంటల నుంచి యూరియా ఇచ్చారు. కానీ వ్యవసాయ అధికారులు తమకు నచ్చిన వారికి మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. దీంతో గందరగోళం నెలకొంది. సుమారు రూ.1750 ఖరీదు గల పొటాష్ కొంటేనే యూరియా ఇస్తున్నారని కొందరు తెలిపారు. అలికాం–బత్తిలి రోడ్డులో రైతులు ధర్నాకు దిగారు. అధికారులు వెళ్లి యూరియా నిల్వలు ఉన్నాయని వారికి సర్ది చెప్పారు. వారందరినీ స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజి వద్దకు తీసుకు వెళ్లి స్లిప్పులు ఇచ్చి పంపించారు. దీంతో వారు ఆందోళన విరమించారు. గ్రోమోర్ సెంటర్ సిబ్బంది నిర్వాకం వల్ల ఈ ఇబ్బంది వచ్చిందని అధికారులు తెలిపారు. యూరియా పక్కదారి పడుతోందని వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు గండివలస ఆనందరావు ఆరోపించారు. – కొత్తూరు● రైతుల అగచాట్లుకంచిలి మన గ్రోమోర్ కేంద్రం వద్ద రైతులు అగచాట్లు పడ్డారు. ప్రభుత్వం ద్వారా సరపడా ఎరువులు సమయానికి సరఫరా చేయకపోవడంతో, సరఫరా చేసిన కొద్దిపాటి ఎరువుల కోసం రైతుల ఎగబడాల్సిన దుస్థితి ఏర్పడింది. – కంచిలివ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో.. టెక్కలి: వ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా కనిపిస్తోంది. రైతు సేవా కేంద్రాల్లో యూరియా లేకపోవడంతో రైతులంతా ప్రైవేట్ ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సోమవారం కోటబొమ్మాళిలో గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా కోసం రైతులంతా బారులు తీరారు. యూరియా కష్టాలపై మంగళవారం వైఎస్సార్ సీపీ ఆందోళన చేపట్టనున్న నేపథ్యంలో 48 గంటల్లో యూరియా వచ్చేస్తుందని ప్రచారాలు మొదలుపెట్టారు.రైతుర్యాలీపై పోలీసుల ఆంక్షలుటెక్కలిలో వైఎస్సార్సీపీ తలపెట్టిన రైతు ర్యాలీ కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30 వరకు ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు చేయకూడదని ఆంక్షలు విధిస్తూ ప్రకటన జారీ చేశారు.అక్రమ ఎరువులు సీజ్ కంచిలి: డోలగోవిందపురం గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మకాలు చేయడానికి రెండు గోడౌన్లలో నిల్వ చేసిన ఎరువుల్ని విజిలెన్స్ కమిటీ అధికారుల బృందం సోమవా రం సీజ్ చేసింది. అరవసరియాపల్లి గ్రామానికి చెందిన బొండాడ అప్పలస్వామి, బొండాడ తిరుపతి, బొండా డ టొంకాడు అనే వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముతున్నారని వారి స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేశారు. లడ్డుకేశవ పాత్రోకు చెందిన రెండు గోడౌన్లలో నిల్వచేసిన 18 బస్తాల యూరియా, 15.15.15 కాంప్లెక్స్ ఎరువు 17 బస్తాలు, పొటాషియం హ్యూమేట్ 13 బస్తాలు, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ 10 బస్తాలు, 20.20.0 కాంప్లెక్స్ 5 బస్తాలు సీజ్ చేశారు. -
సకాలంలో వినతులు పరిష్కరించాలి
● జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ● పీజీఆర్ఎస్కు 75 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సకాలంలో అధికారులు పరిష్కరించాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా వివిధ శాఖలకు చెందిన 75 వినతులు స్వీకరించారు. వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 23 దరఖాస్తులు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు 16, మున్సిపల్ శాఖకు 5, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెరో 4 దరఖాస్తులు అందాయి. అదేవిధంగా నీటి వనరులు, సర్వే సెటిల్మెంట్స్, వ్యవసాయం, విద్యుత్ పంపిణీ సంస్థలకు చెరో 3 ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రజలు తమ సమస్యలను నేరుగా జేసీ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, డిప్యూటీ కలెక్టర్ (డీఎంపీసీ) టి.వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. వినతులు పరిశీలిస్తే... ఉచిత బస్సు పథకం వలన ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్, డ్రైవర్లకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.30,000ల చొప్పున భృతి ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ ఆటో డ్రైవర్లు వినతిపత్రం అందజేశారు. ఫ్రీ బస్సు పథకం వలన తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర అధిక వడ్డీలకు అప్పులతో ఆటోలను కొనుగోలు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ● సారవకోట మండలం చిన్నకిట్టాలపాడు గ్రామ పంచాయతీ బొంతుగూడ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరారు. ● ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇమామ్లు, మౌఖాన్ల గౌరవ వేతనాలు చెల్లించాలని జిల్లా మైనారిటీ సెల్ కమిటీ ప్రతినిధులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించడం తగదన్నారు. ● తనకు వారసత్వంగా అనుభవ స్వాధీనంలో ఉన్న ఆస్తిని నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కాజేశారని శ్రీకాకుళం మండలం కనుగులవానిపేటకు చెందిన టీడీపీ నాయకుడు ఇప్పిలి వెంకట శివలక్ష్మీ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం మండలం కనుగులవానిపేట రెవెన్యూలోని సర్వే నంబర్ 208/2లో 5.50 ఎకరాలు షెడ్యూల్ ఆస్తికి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, భూ హక్కులు కలిగి ఉన్న ఇప్పిలి వరలక్ష్మి మరణానంతరం, కనుగుల సత్యారావు దౌర్జన్యంగా ఆక్రమించుకొని, హక్కుదారులపై కేసులు బనాయిస్తున్నాడని వాపోయారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. కాగా ఫిర్యాదు చేసిన ఇప్పిలి వెంకట శివలక్ష్మీ ప్రసాద్, ఆక్రమణలకు పాల్పడినవారు టీడీపీకి చెందినవారే కావడం గమనార్హం. బూర్జ మండలంలోని నీలాదేవిపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మోటార్లు పాడైపోయి 5 గ్రామ పంచాయతీల పరిధిలోని 800 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. ఈ విషయంపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో సోమవారం ఫిర్యాదు చేశారు. అలాగే ఆమదాలవలస మండలం పొన్నంపేట గ్రామంలో ఇదివరకే ఒక శ్మశానవాటిక ఉంటుండగా, రాజకీయ కారణాలతో రెండో శ్మశానవాటిక ఏర్పాటు చేయడానికి అధికారుల సన్నాహాలు నిలుపుదల చేయాలన్నారు. పొందూరు మండలంలోని చాలా గ్రామాల్లో రైతులకు ఎరువులు అందలేదని, సక్రమంగా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఆయనతో పాటు పలువురు రైతులు ఉన్నారు. -
అర్జీలు పునరావృతం కాకూడదు
● ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శ్రీకాకుళం క్రైం: బాధితుల నుంచి స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా ముందుగా వృద్ధులు, దివ్యాంగుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి వారి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 52 మంది ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదుల గురించి సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, మోసపూరితమైన, ఆస్తి తగదాలు, కొట్లాట, ఇతరత్రా సమస్యలపై 52 ప్రజా ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. -
అన్నదాత పోరును విజయవంతం చేయండి
నరసన్నపేట: రైతులు ఎరువుల కోసం నానా అవస్థలు పడుతున్నారని కనీసం యూరియా కూడా అందక ఇబ్బందులు పడుతున్నారని వారికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ‘అన్నదాత పోరు’ కార్యక్రమం తలపెట్టిందని, దీన్ని జిల్లాలో విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. గడిచిన నెల రోజులుగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అయినా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని అన్నారు. అందుకే జిల్లాలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. పలాస, టెక్కలిలో ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇవ్వాలని, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్లల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తామని తెలిపారు. -
నలుగురు వ్యక్తులకు రిమాండ్
ఆమదాలవలస: మండలంలోని చిట్టివలస గ్రామానికి చెందిన నవిరి పూర్ణ (22) అనే వివాహిత ఆత్మహత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. చిట్టివలస గ్రామానికి చెందిన నవిరి సింహాచలం, పద్మ దంపతుల కుమార్తె పూర్ణకు పట్టణంలోని ఐజే నాయుడు కాలనీకి చెందిన సాయిపల్లి మధుసూదనరావుతో ఈ ఏడాది ఏప్రిల్లో వివాహమైంది. అయితే పూర్ణను అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించడంతో కన్నవారింటికి చేరుకుంది. అనంతరం మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆత్మహత్యకు కారణమైన భర్త మధుసూదనరావు, మామ లక్ష్మణ, అత్త సరస్వతీ, మరిది ఈశ్వరరావులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు. నలుగురి ముద్దాయిలను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఐ ఎస్.బాలరాజు పాల్గొన్నారు. గంజాయితో నలుగురు అరెస్టు పలాస: ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి నెల్లూరుకు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పలాస రైల్వేస్టేషన్లో ఆదివారం నలుగురు వ్యక్తులను కాశీబుగ్గ పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. వారి నుంచి 6.115 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో సోమవారం తెలియజేశారు. దీంతో నెల్లూరు జిల్లా బుజబుజ గ్రామానికి చెందిన సయ్యద్ సుల్తాన్, బి.అరుణకుమార్, ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి గ్రామానికి చెందిన సాయిక్ జాఫర్, తమిళనాడు రాష్ట్రం అనిస్నగర్కు చెందిన విచిత్రదేవిలపై కేసు నమోదు చేశామన్నారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేసి, పలాస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచామన్నారు. వీరి నుంచి గంజాయితో పాటు ఒక సెల్ఫోను, రూ.1,020ల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. -
23 నుంచి కొత్తమ్మ తల్లి జాతర
శ్రీకాకుళం పాతబస్టాండ్: కోటబొమ్మాళిలో కొలువైన కొత్తమ్మ తల్లి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో ఈ సారి కూడా సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి సమక్షంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, ఉచిత దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని, శోభా యాత్ర, గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్, ఫైర్ వర్క్స్, హెలికాప్టర్ రైడింగ్ సవ్యంగా నిర్వహించాలన్నారు. చిన్నపిల్లలకు పాలు, భక్తులకు మంచినీరు అందించాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమానికి టెక్కలి ఆర్డీవోను ఇన్చార్జిగా నియమించామని, ట్రాఫి క్, లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ బాధ్యతలు టెక్కలి ఎస్డీపీఓకు అప్పగించినట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కింజరాపు హరిప్రసాద్, బోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రిలో రోగుల అవస్థలు టెక్కలి రూరల్: స్థానిక జిల్లా ఆస్పత్రిలో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రికి ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు వస్తుంటారు. అయితే వారు కూర్చునేందుకు సైతం సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కిందే కూర్చుని నిరీక్షించాల్సి వస్తోంది. ఆలయాల్లో గ్రహణ శుద్ధి అరసవల్లి: రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం సోమవారం ఉదయం జిల్లాలో అన్ని ప్రధాన ఆలయాల తలుపులు తెరచుకున్నాయి. అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగంతో పాటు అన్ని ఆలయాల్లో గ్రహణానంతర శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలన్నీ శాస్త్ర ప్రకా రం అక్కడి అర్చకులు జరిపించారు. అరసవల్లిలో సోమవారం వేకువజామున గ్రహణ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. మూలవిరాట్టుకు ప్రత్యేక అభిషేకార్చనలు నిర్వహించి విశేష పూజలు చేశారు. తర్వాత ఉదయం 7.30 గంటలకు ఆలయ ప్రధాన ద్వారాలను తెరిచి భక్తులకు సర్వ దర్శనాలకు అనుమతించారు. ముఖలింగంలో.. జలుమూరు: సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం సోమవారం శ్రీముఖలింగం ఆలయంలో అర్చకులు శుద్ధి, సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఆలయంలోని విగ్రహాలకు గంగ, వంశధార జలాలలతో అభిషేకం చేశారు. శ్రీకూర్మంలో.. గార: శ్రీకూర్మనాథాలయంలో సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉషోదయం పూజలనంతరం భక్తులకు దర్శనం అవకాశం కల్పించారు. -
సెల్ఫోన్లో... రుణ రక్కసి..!
● లోన్ పేరుతో యువతకు యాప్ల వల ● ష్యూరిటీ లేకుండానే అప్పులు ● ఆపై అధిక వడ్డీల కోసం వేధింపులు ● ఆత్మహత్యలకు పాల్పడుతున్న బాధితులు చేతిలో సెల్ఫోన్ ఉంటే చాలు ఎటువంటి ష్యూరిటీ లేకుండానే క్షణాల్లో రుణం పొందవచ్చని ఆశ చూపుతారు. యాప్ డౌన్లోడ్ చేసి క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు. చేతికొచ్చే నగదు ఖర్చు చేసేలోపే యాప్ నిర్వాహకుల నుంచి ఫోన్ల మోత మొదలవుతుంది. వడ్డీ కట్టాలని వేధిస్తూ బూతులతో రెచ్చిపోతారు. కడతామని చెప్పినా.. వాళ్ల కర్కశం ఆగదు. మనకు తెలియకుండా డేటా చోరీ చేసి ఫేక్ నగ్న ఫొటోలను కాంటాక్ట్ లిస్టులో ఉన్నవాళ్లకు పంపే దుశ్చర్యకు పాల్పడతారు. ఇలా ఉక్కిరిబిక్కిరి చేసి మన పరువు తీసే వ్యూహానికి ఒడిగడతారు. వారి ఆగడాలకు బలైపోతున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు. అందుకే రుణ రక్కిసి వలలో చిక్కకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హిరమండలం: పెరుగుతున్న టెక్నాలజీని కొందరు కేటుగాళ్లు ఉపయోగించుకుంటూ అమాయకులకు గాలం వేస్తున్నారు. ష్యూరిటీ లేకుండానే రుణం అని చెప్పి ఆకర్షిస్తున్నారు. అలా ప్రైవేటు యాప్ల ద్వారా రుణం తీసుకున్న తర్వాత అసలు కథ మెదలవుతుంది. తీసుకున్న నగదు కంటే వడ్డీకి వడ్డీ వేసి అధిక మెత్తం కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే ఫేక్ నగ్న వీడియోలు వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్కు దిగుతారు. వారి టార్చర్ తట్టుకోలేక కొందరు లోలోపలే కుంగిపోతుంటే.. మరికొంతమంది ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. అందువలన ప్రైవేటు యాప్స్లో రుణాలు తీసుకుని మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనేకమంది బాధితులు మీ సెల్ఫోన్లో ఒకే ఒక క్లిక్తో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హామీ లేకుండా రుణం పొందండంటూ రుణయాప్ నిర్వహకులు ఇచ్చే ప్రకటనలతో కొందరు వెంటనే డౌన్లోడ్ చేసేస్తున్నారు. ఇదే వారి పాలిట శాపంగా మారుతోంది. ఒక్కసారి యాప్ వలలో చిక్కితే బయటపడడం అసాధ్యం. ఇలా యాప్ల బారిన పడినవారు జిల్లాలో అనేక మంది బాధితులు బయటకు చెప్పుకోలేక మదన పడుతున్నారు. లోన్యాప్స్ నిర్వహకుల వలలో పడి అవస్థలు పడుతున్నారు. మీరు రుణం తీసుకోవడానికి ఎంపికయ్యారంటూ ఫోన్లు చేసి యువతకు వల వేస్తున్నారు. చూద్దామని చెబితే చాలు.. రుణం తీసుకునే వరకు ఫోన్ చేసి, ఏదోవిధంగా ఒప్పించి రుణం తీసుకునేలా చేస్తారు. తీరా లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుంటే చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలి స్మార్ట్ ఫోన్లో మనకు తెలియని యాప్లు కనిపిస్తే వాటి జోలికి వెళ్లవద్దు. అదేవిధంగా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీలు చెప్పమని అడిగినా చెప్పవద్దు. ప్రతీ యాప్ను క్లిక్ చేయకూడదు. క్లిక్ చేశారంటే ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లే. రుణయాప్లో అప్పులు తీసుకుని మెసపోవద్దు. హామీ లేకుండా రుణాలు వస్తున్నాయని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ పడవద్దు. రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లోన్యాప్ నిర్వాహకుల నుంచి ఎటువంటి వేధింపులు వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – సీహెచ్ ప్రసాద్, సీఐ, కొత్తూరు హిరమండలానికి చెందిన ఒక వ్యాపారి కుమారుడు లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు. అయితే అతను సక్రమంగా చెల్లించకపోవడంతో యాప్ నిర్వహకులు గ్రామంలోని ఒకరికి ఫోన్చేసి మీరు ష్యూరిటీ పెట్టారు కదా చెల్లించండని వేధించారు. విసిగిపోయిన ఆయన మీ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాను.. అని గట్టిగా చెప్పడంతో అప్పటినుంచి ఫోన్ కాల్స్ రావడం లేదు. ఇలాంటి బాధితులు గ్రామాల్లో ఎంతోమంది ఉన్నారు. బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. రుణం తీసుకున్న రోజు నుంచే చెల్లింపుల కోసం నిర్వాహకులు తీవ్రంగా ఒత్తిడి చేస్తారు. చెల్లింపులు ఆలస్యమయ్యే కొద్దీ వేధింపులు తీవ్రతరమవుతాయి. రుణ గ్రహీత మైబెల్కు పరువు, ప్రతిష్టకు భంగం కలిగించే పోస్టులతో దుష్ప్రచారాలతో కూడిన సందేశాలు, అభ్యంతరకర ఫొటోలు పంపుతారు. బెదిరింపులను లెక్క చేయకపోతే రుణం తీసుకున్నవారి కుటుంబ సభ్యుల ఫొటోలను మార్పింగ్ చేసి, రుణం పొందిన వారి సెల్ఫోన్లోని కాంటాక్టు నంబర్లకు వాట్సప్కు పంపుతారు. వీరి ఆగడాలు కొందరు బయట చెప్పుకోలేక నలిగిపోతున్నారు. కొందరు యువకులు రుణం తీర్చడానికి కుటుంబ సభ్యులను మోసం చేయడం, చోరీలకు సైతం పాల్పడడం జరుగుతున్నాయి. ముఖ్యంగా యాప్ల నిర్వాహకులు గ్రామీణ ప్రాంతాలపైనే కన్నేశారు. -
ఆర్ట్స్ కాలేజీ టు ఐఎన్ఎస్ఏ..
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ) విజిటింగ్ సైంటిస్ట్గా శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల అప్లయ్డ్ సైన్సెస్ హెచ్ఓడీ డాక్టర్ మదమంచి ప్రదీప్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఐఎన్ఎస్ఏ నుంచి వర్తమానం అందుకున్నారు. న్యూఢిల్లీకి చెందిన ఐఎన్ఎస్ఏ ఏటా కొందరు శాస్త్రవేత్తలు, అధ్యాపకులను దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలైనా ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, నిట్, కేంద్ర విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో కలిసి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. ప్రతిభ అధారంగా విజిటింగ్ సైంటిస్టులను ఎంపిక చేస్తుంది. ఈ క్రమంలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 70 మంది శాస్త్రవేత్తలు, లెక్చరర్లను ఐఎన్ఎస్ఏ ఎంపికచేయగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి చోటు లభించింది. ఆ జాబితాలో ఆర్ట్స్ కళాశాలకు చెందిన అప్లయిడ్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ ప్రదీప్ ఒకరు. ఈయనతో పాటు మైలవరంలోని బోటనీ లెక్చరర్ జి.రాముడుకు అవకాశం లభించింది. తిరుపతిలో ప్రఖ్యాత విద్యాసంస్థ ఐఐఎస్ఈఆర్ వేదికగా నెలరోజుల పాటు పరిశోధన కార్యకలాపాలలో ప్రదీప్ భాగస్వామ్యం కానున్నారు. ప్రదీప్ సారథ్యంలో.. ఇండియన్ అకానమీ ఆఫ్ సైన్సెస్ రిఫ్రెషర్ కోర్సులను 2021, 2022 రెండు సంవత్సరాల్లో నిర్వహించారు. 50 మంది లెక్చరర్లకు కెరీర్ అడ్వాన్స్మ్మెంట్ స్కీమ్ (సీఏఎస్)లను అమలుపర్చగలిగారు. సెర్బ్ యాగ్జిలిలేటెడ్ విజ్ఞాన్ పథకంలో భాగంగా ఏడు రోజులపాటు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రొగ్రాంలు నిర్వహించారు. డీబీటీ సౌజ్యంతో ఎన్నో సెమినార్లు, వర్క్షాప్లు, సైన్స్, అకాడమీల లెక్చరర్ల రీఫ్రీసెస్, డీఎస్టీ ఇన్స్పైర్ క్యాంప్స్, సైన్స్ ఎగ్జిబిషన్లు తదితర యాక్టివిటీలను నిర్వహించారు. కళాశాలకు ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీ కోర్సు మంజూరయ్యేలా చేశారు. యూజీసీ–ఎన్ఎస్క్యూఎఫ్ ద్వారా ఆక్వా కల్చర్పై మూడు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నిర్వహించారు. పీసీఆర్ టెస్టులపై వర్క్షాప్, సర్టిఫికెట్ కోర్సులను అందించారు. డీబీటీ, యూజీసీ, సెర్బ్, రూసా రీసెర్చ్ ప్రాజెక్టులు చేశారు. యూజీ, పీజీ బయోటెక్నాలజీ విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వివిధ కంపెనీలు, లేబరేటరీలు, హాస్పిటల్స్తో ఎంఓయూ కుదుర్చుకున్నారు. మరో ఏడు ఇండియన్ పేటెంట్స్, ఒక జర్మన్ పేటెంట్ను అందుకున్నారు. ఆరు బెక్చాప్టర్స్, స్కోపస్లో ఇండెక్స్లో నమోదైన 15 అంతర్జాతీయ పరిశోధనా పత్రాలను ప్రచురించారు. తాజాగా 9,10, ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులను పరిశోధనలవైపు ఆకర్షితులను చేసేందుకు ‘ప్రయాస్’ పేరిట ప్రత్యేక పథకాన్ని కొనసాగిస్తున్నారు. వీటిన్నింటిని ఆధారంగా చేసుకుని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ) విజిటింగ్ సైంటిస్ట్గా ఎంపికచేశారు. 2022లో సెప్టెంబర్ 5న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు సైతం అందుకున్నారు. ఈయన స్వస్థలం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయ గ్రామం. ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలోని విశాఖ–బి కాలనీలో నివాసముంటున్నారు. తల్లిదండ్రులు నరసింహ, ప్రమీల. కళాశాలలో నిర్విరామంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులు, సెమినార్లు, వర్క్షాప్లు, రిసోర్స్ప్రొగ్రాంలు, ఓరియంటేషన్ కార్యక్రమాలతో విద్యార్థుల ఉన్నతికి, వారి సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తున్న డాక్టర్ ప్రదీప్ కళాశాలకు గర్వకారణంగా నిలుస్తున్నారు. కళాశాలకు ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీ కోర్సు కేటాయింపులో విశేష కృషి చేశారు. –డాక్టర్ శ్రీరాములు, ప్రిన్సిపాల్, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల(పురుషులు) విజిటింగ్ సైంటిస్ట్ పథకం ద్వారా పరిశోధన సామర్థ్యం ఉన్నప్పటికీ అందుకు తగిన అవకాశాలు లేని అధ్యాపకులు, శాస్త్రవేత్తలు పరిశోధన చేయటానికి వీలుపడుతుంది. కార్యక్రమంలో భాగంగా ఔషధ నిరోధక మూర్ఛరోగాలలో జీవ అణు అధ్యయనాలను రీసెర్చ్ చేయనున్నాం. దేశ్యాప్తంగా 70 మంది శాస్త్రవేత్తలు, లెక్చరర్ల జాబితాలో చోటులభించినందుకు సంతోషంగా ఉంది. – డాక్టర్ ప్రదీప్, హెచ్ఓడీ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ విజిటింగ్ సైంటిస్ట్గా డాక్టర్ ప్రదీప్ దేశవ్యాప్తంగా ఎంపికై న శాస్త్రవేత్తలు, లెక్చరర్ల జాబితాలో చోటు జిల్లా నుంచి ఎంపికై న మొదటి వ్యక్తిగా గుర్తింపు -
జీవనాధారం కూల్చేశారు
టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఎంతో మంది ఫుట్పాత్ వ్యాపారులకు ఆసరాగా ఉన్న మహాత్మాగాంధీ కూరగాయల కాంప్లెక్స్ను ఆదివారం కూల్చేశారు. రోడ్డు పక్కన చిన్నపాటి వ్యాపారాల్లో భాగంగా అరటిపళ్లు, ఇతర కూరగాయలు అమ్మకాలు చేసుకునే వారి కోసం 23 ఏళ్ల క్రితం అప్పటి సర్పంచ్ టంకాల పావనిరాణి నేతృత్వంలో ఈ కాంప్లెక్స్ నిర్మాణం చేశారు. అప్పటి నుంచి ఎంతో మంది వీధి విక్రయదారులకు ఈ కాంప్లెక్స్ ఆసరాగా నిలిచింది. ఇప్పుడు దీనిని కూల్చివేయడంతో చిరువ్యాపారులు రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది. -
వేతనం తూచ్..!
● సేవలకు ‘స్కోచ్’ఆంధ్రా, తెలంగాణలో పలు పోటీ పరీక్షలకు తెలుగు, ఎకనామిక్స్ సబ్జెక్ట్లు బోధించడం జరిగింది. బీసీ స్టడీ సర్కిల్స్లో గత పదేళ్లుగా ఎకనామిక్స్తో పాటు తెలుగు సబ్జెక్ట్లో బోధిస్తూ వస్తున్నాం. ఇప్పటివరకు ఎప్పుడూ జీతాల సమస్య లేదు. గ్రూప్–2, డీఎస్సీ శిక్షణ రెమ్యునరేషన్ మాత్రమే జాప్యమవుతూ వచ్చింది. గ్రూప్–2కు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన ప్రిలిమినరీ శిక్షణా రెమ్యునరేషన్ విడుదలైంది. ఈ ప్రభుత్వం వచ్చాక మెయిన్స్కు సంబంధించి జీతాలు విడుదల చేయలేదు. అలాగే, డీఎస్సీ శిక్షణకు సంబంధించి కూడా జీతాలు రాలేదు. స్కోచ్ అవార్డు రావడం సంతోషమే. కానీ, జీతాలు రాకపోతే ఆ ఆనందం కడుపు నింపదు. – జి.రాంబాబు, బీసీ స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీ జిల్లాలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చిన ఫ్యాకల్టీ జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి బిల్లులు పెట్టడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే చెల్లింపులు చేస్తాం. బోధించిన ఫ్యాకల్టీకి తప్పకుండా జీతాలు వస్తాయి. – ఇ.అనురాధ, జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి, శ్రీకాకుళం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గ్రూప్–2, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించింది బీసీ స్టడీ సర్కిల్. ఈ శిక్షణతో అనేక మంది అభ్యర్థులు మంచి ఫలితాలు సాధించగా, ఆ విజయానికి గుర్తింపుగా బీసీ స్టడీ సర్కిల్ సేవలకు గాను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖకు తాజాగా స్కోచ్ అవార్డు లభించింది. ఫ్యాకల్టీ సభ్యులు శ్రమించి, విద్యార్థులను విజయం వైపు నడిపించా రు. అయితే ఈ విజయానికి బలమైన పునాది వేసిన ఫ్యాకల్టీ సభ్యులు మాత్రం నిరాశలో మునిగిపోయారు. నెలల తరబడి బోధించినా ఇప్పటికీ వా రికి జీతాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ కష్టానికి అవార్డు రావడం తమకు గర్వకారణమే గానీ ఆ అవార్డు కడుపు నింపదని వాపోతున్నారు. 270 మంది ఫ్యాకల్టీకి జీతాల్లేవు.. 15 నెలల క్రితం గ్రూప్–2 మెయిన్స్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా 70 మంది ఫ్యాకల్టీతో అభ్యర్థులకు శిక్షణ ఇప్పించింది. ఒక్కో పీరియడ్కి రూ.1000 చొప్పున ఇస్తామని చెప్పింది. దీంతో ఫ్యాకల్టీ అభ్యర్థులకు బోధించడం జరిగింది. వారికి ఇంతవరకు రెమ్యునరేషన్ ఇవ్వలే దు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సర్కిల్స్ ద్వారా 200 మంది ఫ్యాకల్టీ ద్వారా 10 నెలల కిందట డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చారు. ఒక్కో పీరియడ్కి రూ. 600 చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు వారికి జీతాలు విడుదల చేయలేదు. ఫ్యాకల్టీని విస్మరించిన ప్రభుత్వం ప్రతిభకు గుర్తింపుగా ఇటీవల బీసీ స్టడీ సర్కిల్కు స్కోచ్ అవార్డు లభించింది. ఇది సంస్థ ప్రతిష్టను పెంచింది. కానీ స్కోచ్ అవార్డు రావడానికి మూల కారణమైన ఫ్యాకల్టీ సభ్యులు మాత్రం బకాయి వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి బోధించినా ఇప్పటివరకు వారికి జీతాలు అందలే దు. ఉపాధ్యాయులకు వేతనం ఇవ్వకపోతే అది వారిలో విశ్వాసం దెబ్బ తీయడమే అవుతుందని వాపోతున్నారు. మొత్తానికి విద్యార్థుల విజయాల కు గుర్తింపు వచ్చింది. కానీ బోధించిన ఉపాధ్యాయులకు బకాయి వేతనాలే మిగిలాయి. బీసీ స్టడీ సర్కిల్ సేవలకు స్కోచ్ అవార్డు వేతనం కోసం ఎదురు చూపుల్లో ఫ్యాకల్టీ స్కోచ్ అవార్డు తెచ్చిన స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీకి తీవ్ర నిరాశ అవార్డు ప్రభుత్వానికి ప్రతిష్ట ఫ్యాకల్టీకి మాత్రం ఆర్థిక కష్టాలు -
రైతుకు న్యాయం చేయాల్సిందే
● ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ● జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ నర్తు రామారావు సోంపేట : కూటమి ప్రభుత్వం దిగి వచ్చి రైతులకు న్యాయం చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరి యా విజయ, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఎరువుల కష్టాలు తెలియజేసేందుకు ఈ నెల 9న పలాసలో నిర్వహించే అన్నదాత పోరు కార్యక్రమం వాల్పోస్టర్లను ఆదివారం సోంపేటలో పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోని రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. అధికారులకు, నాయకులకు విన్నవిస్తున్నా సమస్య పరిష్కా రం కావడం లేదన్నారు. రైతు సమస్యల పరిష్కా రం కోసం వైఎస్సార్సీపీ ఆదేశాల మేరకు అన్నదా త పోరు కార్యక్రమం రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రైతుల కు ఇలాంటి కష్టాలు లేవని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లో సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని అన్నారు. ప్రభు త్వం దిగివచ్చి రైతులకు న్యాయం చేయడం కోసమే రైతుల తరఫున పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు మాట్లాడుతూ రైతులు అధిక ధరకు యూరియా కొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటే దీనికి ప్రభు త్వ వైఫల్యమే కారణమన్నారు. ప్రభుత్వం గొప్ప లు చెప్పుకోవడం మాని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్తు నరేంద్ర యాదవ్, సాడి శ్యామ్ప్రసాద్ రెడ్డి, పైల దేవదాస్ రెడ్డి, బోర పుష్ప, కడియాల ప్రకాష్, తడక జోగారావు, ఇప్పిలి కృష్ణారావు, పూడి నేతాజి, బతకల మోహనరావు, గుర్రాల శ్రీను, కారింగి మోహ నరా వు, శిలగాన భాస్కరరావు, పాతిర్ల రాజశేఖరరెడ్డి, బుద్దాన శ్రీకృష్ణ, దుర్గాసి దర్మారావు, బెందాళం శోభన్బాబు, కొనపల సురేష్, గుమ్మడి రాందాస్, నర్తు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సృజనాత్మకతకు వేదిక.. విద్యార్థి విజ్ఞాన్ మంథన్
శ్రీకాకుళం: విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (సైన్స్ టాలెంట్ సెర్చ్).. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు నిర్వహించే ప్రతిభా పరీక్ష. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు చదివే విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఇందులో ప్రతిభ కనబరిస్తే డీఆర్డీఓ, ఇస్రో, బీఏఆర్సీ వంటి ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఇంటర్నిషిప్ చేసేందుకు అవకాశం లభిస్తుంది. దీనికి అదనంగా ప్రతినెలా రూ.2000 చొప్పున ఏటా రూ.24 వేలను ప్రోత్సాహకంగా అందిస్తారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో పరీక్ష రాసే సౌలభ్యం ఉంది. పాఠశాల స్థాయిలో ఎంపికై తే రాష్ట్రస్థాయికి తరగతుల వారీగా 150 మందిని ఎంపిక చేసి పంపిస్తారు. అక్కడ ప్రతిభ చూపిన వారికి ఒక్కో తరగతి నుంచి ముగ్గురు చొప్పున ఎంపిక చేసిజాతీయస్థాయిలో జరిగే పరీక్షలకు పంపిస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచేవారికి రూ.5000, రూ.2000, రూ.1000, సర్టిఫికెట్లను అందజేస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి రూ.25 వేల నగదు బహుమతి ఏడాది పాటు ఉపకార వేతనం అందజేస్తారు. జాతీయస్థాయిలో ఎంపికై న విద్యార్థులకు 20 రోజులు పాటు పేరొందిన సంస్థల్లో ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు. ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 28 నుంచి 30 మధ్య ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్ష విద్యార్థులకు ఉపయోగకరం. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడుతుంది. ఉన్నత విద్యకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఇంటర్న్షిప్ వల్ల ఉద్యోగం త్వరగా పొందే అవకాశం కలుగుతుంది. – ఏ.పున్నయ్య, విద్యార్థి విజాన్ మంథన్ జిల్లా కో ఆర్డినేటర్ స్కాలర్షిప్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు అర్హులు ఎంపికై న వారికి నెలకు రూ.2000 చొప్పున ప్రోత్సాహకం సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులకు గడువు -
చినుకు పడితే వణుకే..
కంచిలి/నరసన్నపేట : చిన్నపాటి వర్షమొచ్చినా కంచిలి మెయిన్రోడ్డు చెరువులా మారుతోంది. పూర్తిస్థాయిలో డ్రైనేజీ లేకపోవడం, కొన్నిచోట్ల పూడికలతో నిండిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆదివారం కురిసిన వర్షానికి రోడ్డంతా జలమయం కావడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. నరసన్నపేట మేజరు పంచాయతీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నరసన్నపేటలో భూగర్భ డ్రైనేజ్ స్తంభించడంతో వీధుల్లోకి వర్షం నీరు, మురుగు నీరు వచ్చింది. గడ్డెయ్య చెరువు సమీపంలో శివనగర్ కాలనీ తదితర వీధుల్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
విద్యుత్ షాక్తో ఎలక్ట్రీషియన్ మృతి
జి.సిగడాం: జాడ పంచాయతీ ముక్కపేట గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ తాలాడ వెంకటరావు(40) విద్యుత్ షాక్కు గురై ఆదివారం మృతి చెందాడు. పంట పొలం వద్ద మరమ్మతులు చేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కే సమయంలో షాక్కు గురవ్వడంతో అక్కడికక్కడే మత్యువాతపడ్డాడు. ఇతన జాడ, ముషినివలస, సర్వేశ్వరపురం, ముక్కపేట, రౌతుపేట గ్రామాల్లో ప్రయివేట్గా విద్యుత్ పనులు చేస్తుండేవాడు. వెంకటరావు మరణవార్త వినగానే భార్య ఉమాహేశ్వరి, పిల్లలు యోగీ, ఉపేంద్రలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న జి.సిగడాం ఎస్ఐ వై.మధుసూదనరావు హవెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
50 సెంట్ల భూమి తెమ్మని వేధించేవారు
ఆమదాలవలస: చిట్టివలసలో పురుగు మందు తాగి పూర్ణ అనే గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఆదివారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వివాహిత తల్లిదండ్రులు సింహాచలం, పద్మ మాట్లాడుతూ తమ కుమార్తె పెళ్లి సమయంలో కట్నం కింద రూ.5లక్షల నగదు, ద్విచక్ర వాహనం, రూ.2 లక్షల సారె సమకూర్చినా మరో 50 సెంట్ల భూమి తీసుకురావాలని అత్తింటి వారు నిత్యం వేధించేవారని వాపోయారు. పెళ్లయిన నాలుగు నెలలకే ఇలాంటి పరిస్థితి రావడం దారుణమన్నారు. వరకట్న వేధింపుల కారణంగా తమ కుమార్తె మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుందని వివరించారు. విచారణలో ఎస్సై సనపల బాలరాజు, సర్పంచ్ ప్రతినిధి గుజ్జల లక్ష్మణరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలపై రణభేరి
శ్రీకాకుళం: పాఠశాల విద్యారంగ సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలపై సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు జరిగే యూటీఎఫ్ రణభేరి జాతా విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్నారు. బదిలీలు, ప్రమోషన్లు పూర్తయి మూడు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులు ఇంకా పాత స్థానాల్లో కొనసాగుతున్నారని చెప్పారు. మూడు నెలలుగా ఎంటీఎస్ ఉపాధ్యాయులకు జీతాలు లేవన్నారు. మూడో వంతు ప్రైమరీ పాఠశాలలు సింగిల్ టీచర్లు స్కూల్గా మారిపోయాయని, సగంపైన హై స్కూల్స్ సింగిల్ సబ్జెక్టు టీచర్లుగా తయారయ్యాయని, హైస్కూల్లో పనిచేయాల్సిన స్కూల్ అసిస్టెంట్లను సర్ప్స్ పేరుతో క్లస్టర్ టీచర్లుగా ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్గా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు వినియోగించడం తగదన్నారు. పీఆర్ కమిషన్ వెంటనే నియమించాలని, ఐఆర్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, జిల్లా గౌరవాధ్యక్షుడు కె.వైకుంఠరావు, సహాధ్యక్షులు కె.దాలయ్య, బి.ధనలక్ష్మి, కోశాధికారి బి.రవికుమార్, జిల్లా కార్యదర్శులు పి.సూర్యప్రకాషరావు, టి.వి.టి.భాస్కరరావు, బి.శంకరరావు, ఎం.వి.రమణ, జి.శారద, ఎస్.స్వర్ణకుమారి, బి.గౌరీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
240 లీటర్ల నాటుసారా పట్టివేత
కంచిలి: మండల పరిధిలో సోంపేట ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ ఆధ్వర్యంలో శనివారం జరిపిన తనిఖీల్లో 240 లీటర్ల నాటుసారాను పట్టుకొని నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా నుంచి నాటుసారా రవాణా అవుతోందన్న సమాచారం మేరకు చొట్రాయిపురం బస్టాప్ వద్ద ఒక ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 1,200 నాటుసారా ప్యాకెట్లు(120 లీటర్లు)ను పోలీసులు పట్టుకున్నారు. అలాగే ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని, కంచిలి మండలం కాలాపాని గ్రామానికి చెందిన సవర నాయక్, బూరగాం గ్రామానికి చెందిన కొర్రాయి గోవింద్లను అరెస్టు చేశారు. ఈ నాటుసారా ప్యాకెట్లను బూరగాం గ్రామానికి చెందిన కర్రి మోహిని, రాపాక కృష్ణమూర్తి, గోకర్ణపురం గ్రామానికి చెందిన అయితి దాశరథికి సరఫరా చేస్తున్నట్లు చెప్పడంతో వారి మీద కూడా కేసులు నమోదు చేశారు. దేవిధంగా కంచిలి మండలంలో జలంత్రకోట పాతాళేశ్వరుని గుడి దగ్గర ఒక ద్విచక్ర వాహనాన్ని పట్టుకొని, 120 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నాటుసారాను రవాణా చేస్తున్న కంచిలి మండలం కుంబరినౌగాం గ్రామానికి చెందిన పింకు గౌడ, తలతంపర పంచాయతీ పరిధి కాకర్లపుట్టుగ గ్రామానికి చెందిన కాకర్ల సోమేష్లను అరెస్టు చేశారు. దాడుల్లో పోలీసు సిబ్బంది మార్కారావు, భాను, అరుణ్, ఉమాపతి, గుణాకర్ తదితరులు లు పాల్గొన్నారు. -
పోస్టల్ ఖాతాదారుల ఆందోళన
ఇచ్ఛాపురం: స్థానిక పోస్టాఫీస్లో దాచుకున్న సొమ్ములను వెంటనే చెల్లించాలని ఖాతాదారులంతా ఆందోళనకు దిగారు. ఈ పోస్టాఫీసులో దాచుకొన్న సుమారుగా రూ.3 కోట్ల సొమ్మును ఆన్లైన్ స్కాం కారణంగా బాధితులంతా నష్టపోయిన విషయం జులై నెలలో బాధితులకు తెలిసింది. అయితే ఖాతాదారులు దాచుకొన్న సొమ్మును ఖాతాల్లో పడేటట్లు చూస్తామని జిల్లా పోస్టల్ అధికారులు హామీచ్చారు. కానీ ఇప్పటికీ ఖాతాల్లో నగదు జమ అవ్వకపోవడంతో శనివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సొమ్ములు రెండు వారాల్లోగా చెల్లించకపోతే నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఇదే విషయంమై ఈ కేసును సీబీఐకి ఇవ్వగా ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోస్టల్ జిల్లా అధికారి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖాతాదారులు చాట్ల లోహిదాస్, బాలరాజు, హైమా. కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక రంగంలో నైపుణ్యం పెంచుకోవాలి
టెక్కలి: మారుతున్న కాలంతో పాటు సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల్లో భాగంగా విద్యార్థులతో పాటు అధ్యాపకులు మరింత నైపుణ్యత పెంచుకోవాలని ప్రముఖ కంప్యూటర్ విభాగం సంస్థ క్వాంటమ్ కంప్యూటింగ్ వైస్ ప్రెసిడెంట్ లక్ష ప్రియదర్శి పేర్కొన్నారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలతో శనివారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయిలో సాంకేతిక రంగంలో అత్యంత ఆధునీకరణ సామర్థ్యం పొందిన తమ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందం వలన కళాశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల పురోగతికి మేలు జరుగుతుందన్నారు. క్వాంటం టెక్నాలజీలో విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి శిక్షణా కార్యక్రమాలు, సెమినార్లు, సర్టిఫికేషన్ కోర్సులను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రొడక్ట్ లీడర్ ఎం.చంద్రమౌళి, కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, అధ్యాపకుడు బి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తక్షణమే ఐఆర్ ప్రకటించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హమీ మేరకు తక్షణమే ఐఆర్ను ప్రకటించాలని ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కె.ప్రవల్లికా ప్రియ అన్నారు. ఏపీ జేఏసీ మహిళా విభాగం ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం శ్రీకాకుళంలోని రెవెన్యూ వసతి గృహం సమావేశ మందిరంలో అవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చైల్డ్ కేర్ లీవ్లు కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్చరాలు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం ఆరు నెలలు మాత్రమే ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండేళ్ల పాటు సెలవు ఇవ్వాలని కోరారు. అలాగే తమకు రావాల్సిన నాలుగు డీఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల పే స్లిప్పులు సకాలంలో వచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, సీపీఎస్ను రద్దు చేయాలన్నారు. సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ కె.శ్రీరాములు, ఏపీ జేఏసీ కార్యదర్శి వెంకట రమణ, జి.అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల హక్కులను పరిరక్షించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: చిన్నారుల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా స్పష్టం చేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు భవనంలో జువైనెల్ జస్టిస్ – పిల్లల రక్షణ చట్టాలపై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారుల హక్కుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో కుటుంబం, పాఠశాల, సమాజం కీలక పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో ఒకటో అదనపు జిల్లా జడ్జి పి.భాస్కరరావు, శ్రీకాకుళం కార్యదర్శి కె.హరిబాబు, ప్రిన్సిపాల్ మేజిస్ట్రేట్ (జువైనెల్ జస్టిస్ బోర్డు) కేఎం జమ్రుత్ బేగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ యు.శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య విద్యపై ప్రభుత్వం కుట్రలు
● ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనలు ● యూరియా కోసం రైతుల తిప్పలు కనిపించడం లేదా..? ● మాజీ స్పీకర్ తమ్మినేని మండిపాటు టెక్కలి: డాక్టర్ కావాలనే పేద విద్యార్థుల కలలను నాశనం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ స్పీకర్, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం మండిపడ్డారు. శనివారం టెక్కలి పార్టీ కార్యాలయంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైద్య విద్యను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనలు ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిరుపేద విద్యార్థుల కోసం 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే, వాటిలో 10 కళాశాలలను ప్రైవేట్పరం చేసేందుకు సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టడం దారుణమన్నారు. కొత్త వైద్య కళాశాలల కోసం ఇతర రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తుంటే, మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ సీట్లును రద్దు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మరోవైపు యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు. రైతులు పడుతున్న కష్టాలపై ఈనెల 9న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు అర్థ రహితం యూరియా కోసం రైతులు అవస్థలు పడుతుంటే, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయని పేరాడ తిలక్ మండిపడ్డారు. భోజనాల కోసం ప్లేట్లు పట్టుకుని నిల్చున్నపుడు.. యూరియా కోసం క్యూలో నిలబడలేరా అని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. 15 నెలల కూటమి పాలనలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని దుయ్యబట్టారు. సమావేశంలో టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, కోటబొమ్మాళి జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, పార్టీ మండల కన్వీనర్లు హెచ్.వెంకటేశ్వరరావు, ఎస్.హేమసుందర్రాజు, బి.మోహన్రెడ్డి, టి.పాల్గుణరావు, నాయకులు సత్తారు సత్యం, టి.కిరణ్, అన్నెపు రామారావు, కె.బాలకృష్ణారావు, ఆర్.మల్లయ్య, జి.గురునాథ్యాదవ్, ఎం.అప్పారావు, యర్ర చక్రవర్తి, చిన్ని జోగారావు, కెల్లి గోవింద్, డి.రామకృష్ణారెడ్డి, పి.వెంకట్రావు, కె.అజయ్, పి.రమేష్, ఎన్.భీమారావు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
బూర్జ: అండర్–15 బాలికల బ్యాండ్మింటన్ విభాగంలో బూర్జ మండలం గుత్తావల్లి గ్రామానికి చెందిన బొడ్డేపల్లి చైత్రికా కృష్ణ జాతీయ స్థాయికి ఎంపికయ్యింది. రాజాం జీఎంఆర్ ఐటీ కళాశాలలో శుక్ర, శనివారాల్లో జాతీయ స్థాయి బ్యాండ్మింటన్ ఎంపిక పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఆమె ఎంపికై నట్లు తల్లిదండ్రులు శనివారం తెలియజేశారు. చైత్రిక పాలకొండలోని డీఏవీ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. చైత్రిక గతంలోనూ అండర్–13 బాలికల విభాగంలో జాతీయ ఛాంపియన్–23వ సంవత్సరంలో ఘన విజయం సాధించింది. అదేవిధంగా శాప్ బ్యాండ్మింటన్ పొటీల్లో ఉమ్మడి జిల్లా నుంచి అండర్–11, అండర్–13, అండర్–15 విభాగాల్లో వరుసగా మూడు సంవత్సరాలు ఛాంపియన్గా నిలిచింది. విజయంపై పాఠశాల ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు అభినందించారు. -
కాలువలో పడి వ్యక్తి మృతి
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని వాంబేకాలనీలో కాలువలో పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ శనివారం వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. భార్య, ఇద్దరు పిల్లలతో జొన్నాడ రాజేష్ అనే వ్యక్తి వాంబే కాలనీలో నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో రాజేష్ వినాయకుని ఊరేగింపునకు వెళ్లాడని.. అటునుంచి వచ్చే క్రమంలో రోడ్డుపక్కనే ఉన్న పెద్ద కాలువలో జారిపడిపోయాడన్నారు. ఎవరూ గమనించకపోవడం.. శనివారం ఉదయాన చనిపోయి ఉండడంతో తమకు సమాచారం వచ్చిందన్నారు. మృతదేహాన్ని రిమ్స్కు పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
మఠం భూములు హాంఫట్..!
● బావాజీ మఠం భూముల కబ్జా ● ఆక్రమణదారుల చేతుల్లోకి రూ.కోట్లు విలువైన భూములు ● అక్రమ లే అవుట్లకు అడ్డగోలు అనుమతులు ఇటీవల కబ్జా చేసిన స్థలం చదును చేసిన దృశ్యం ఆమదాలవలస రూరల్: ఆక్రమించుకునే అవకాశమే ఉండాలి గానీ.. ఆకాశాన్ని కూడా వదలరు ఇక్కడి అక్రమార్కులు. వీరి కన్నుపడితే ఎటువంటి భూములైనా మటాస్ కావాల్సిందే. దేవుడి భూములైనా.. ప్రభుత్వ బంజరు భూములైనా అన్యాక్రాంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దర్జాగా దురాక్రమణ చేయడమే కాదు.. అనధికార లే అవుట్లు వేయడంలోనూ ముందుంటారు. మహా నగరాలకు తీసిపోనివిధంగా భవంతుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఆమదాలవలస రూరల్ మండలంలో కబ్జారాయుళ్ల దర్జా ఇది. ఇటీవల తోటాడ గ్రామంలో బావాజీ మఠం భూముల ఆక్రమణలే ఇందుకు నిదర్శనం. ఆగని ఆక్రమణల పర్వం గత కొంతకాలం నుంచి ఆమదాలవలస మండలం తోటాడ గ్రామంలో ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది. అధికారుల కళ్లెదుటే ఈ కబ్జాలు జరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. సర్వే నంబర్ 121లో 199.48 ఎకరాల బావాజీ మఠం భూములు దర్జాగా కబ్జా చేశారు. కొందరు కూటమి నాయకుల అండతో అక్కడ భూదందా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒడిశాకు చెందిన మఠం యజమానులు ఇక్కడ నుంచి వెళ్లిపోవటంతో పాటు వారి వారసులు కూడా ఇక్కడ అందుబాటులో లేరు. దీంతో కబ్జాదారులు ఈ భూములు ఆక్రమించుకొని వ్యాపారం సాగిస్తున్నారు. అలాగే జాతీయ రహదారికి ఆనుకొని కొత్తరోడ్డు వద్ద ఉన్నటువంటి మఠం భూములను సైతం ఆక్రమించారు. అధికారుల చేతివాటం ఇకపోతే ఆక్రమణదారుల అక్రమ లేఅవుట్లకు అనుమతులు అందించడంలో అధికారులు చేతివాటం చూపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వాస్తవానికి ఏదైనా లే అవుట్కు అనుమతి పొందాలంటే అందుకు సంబంధించిన భూపత్రాలు ఉండాలి. అయితే ఇతరులు భూములకు సంబంధించి అక్రమ లే అవుట్లకు అనుమతులు మంజూరు చేశారంటే దీని వెనుక ఎంత చేతివాటం ఉందో అన్న విషయం అర్థమవుతోంది. అక్రమ రిజిస్ట్రేషన్లు వాస్తవంగా మఠం భూములకు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేసే అధికారం లేదు. అయితే సంబంధం లేని సర్వే నంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లతో ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు సహకరిస్తున్నారని పలువురు మాట్లాడుకుంటున్నారు. అలాగే మఠం భూముల్లో వ్యాపార భవనాలు గానీ, అపార్ట్మెంట్లు గానీ నిర్మిస్తే విద్యుత్ సదుపాయం అందించకూడదు. కానీ విద్యుత్ శాఖ అధికారులు అధిక మొత్తంలో అక్రమార్జనకు పాల్పడి అడ్డగోలుగా ట్రాన్ఫార్మర్లు, మీటర్లు అందించినట్లు తెలుస్తోంది. జోరందుకుంటున్న నిర్మాణాలు ఈ స్థలంలో మహా నగరాలను తలపించేవిధంగా అక్రమ నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. ఆక్రమణదారులు ఇతరులకు విక్రయించేందుకు కొందరు అపార్ట్మెంట్ నిర్మాణ గుత్తేదారులకు ఈ స్థలం అప్పగిస్తున్నారు. అంతేకాకుండా కొనుగోలుదారులకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కూడా అందించడం విశేషం. ఏది ఏమైనా వందల ఎకరాల స్థలాన్ని ఆక్రమణదారులు యథేచ్ఛగా దోచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేసి ఈ కబ్జాలకు అడ్డుకట్టు వేయకపోతే మరిన్ని భూములు మాయమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ జగన్ను సీఎం చేయడమే లక్ష్యం
విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన 15 నెలల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, మళ్లీ జగన్ను ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యమని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జోన్–1 మహిళా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే జగన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోడానికి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తీర్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను, ముఖ్యంగా మహిళలను నిట్టనిలువుగా మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ఎన్నికలకు ముందు అప్పటి సీఎం జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తానని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఎప్పుడూ చూడని విధంగా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారన్నారు. కేంద్రం పూర్తి స్థాయిలో యూరియాను సరఫరా చేసినప్పటికీ వాటిని టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్ తరలించారని ఆరోపించారు. మహిళలకు రక్షణ లేదు రాష్ట్రంలో హోం మంత్రిగా మహిళ ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని విచ్చలవిడి చేసేసిందని విమర్శించారు. 80 వేల బెల్టుషాపులు పుట్టుకొచ్చాయని, పర్మిట్ రూమ్లకు కూడా అనుమతులు ఇచ్చేశారని తెలిపారు. మద్యం కారణంగానే మహిళలపై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. అలాగే రాష్ట్రంలో డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతోందని, గంజాయిని హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే పండిస్తున్నారని వివరించారు. వాటిని అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్లీ దేవుడు రావాలని ప్రార్థిస్తున్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. రానున్న మూడేళ్లు ప్రజల తరఫున పోరాటం చేయడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి వైఎస్సార్సీపీ మహిళా విభాగం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, విజయనగరం డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, రాష్ట్ర మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి పాలనపై 15 నెలల్లో ప్రజా వ్యతిరేకత సూపర్ సిక్స్ పేరుతో నయవంచన యూరియా కోసం రైతులు రోడ్లెక్కడం దారుణం రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్, గంజాయితో అఘాయిత్యాలు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణిప్రజలకు రూ.81 వేల కోట్ల బకాయి కూటమి ప్రభుత్వం రైతులకు మొదటి ఏడాది పెట్టుబడి సాయం ఎగ్గొట్టి వెన్నుపోటు పొడిచిందన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఇస్తానని చెప్పి ఒక్కో మహిళకు రూ.22,500 బాకీ పడిందని తెలిపారు. నిరుద్యోగ భృతి రూ.3 వేల కింద ఇప్పటి వరకు రూ.45 వేలు బకాయి ఉందన్నారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వకపోగా కొత్తగా ఒక్కరికి పింఛన్ గానీ, రేషన్ కార్డు గానీ మంజూరు చేయలేదన్నారు. పైగా రాష్ట్రంలో 3 లక్షల మంది అర్హులైన వారి పెన్షన్ తొలగించిందని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. ఇలా మొత్తంగా రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం రూ.81వేల కోట్లు బాకీ పడిందని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి 16 రకాల బస్సులు ఉంటే.. కేవలం 5 రకాల బస్సుల్లో అవకాశం కల్పించారన్నారు. అలాగే ఉచితంగా మూడు సిలిండర్లు అని చెప్పి ఒకటి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. -
తలో మాట.. ఎరువులకు తంటా
జిల్లాలో రైతులు యూరియా కోసం అవస్థలు పడుతుంటే నాయకులు, అధికారులు పరస్పరం విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. యూరియా లేకపోవడం నిజమేనని ఒకరు అంటే.. నిల్వలు ఉన్నాయని మరొకరు అంటున్నారు. కానీ రైతులు మాత్రం ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద గంటల తరబడి నిలబడి తిట్టి పోస్తుండడం నిజం. జిల్లాకు ఎంత ఎరువు అవసరమో, ప్రభుత్వం ఎంత తెప్పించిందో, రైతు చెంతకు ఎంత చేరుతుందో అన్నది చిదంబర రహస్యమైపోయింది. –జలుమూరు, శ్రీకాకుళం పాతబస్టాండ్ యూరియా కొరత ఉంది.. రైతులు అవస్థలు పడుతున్నారు. కొన్ని దేశాల్లో యుద్ధాల వల్ల ఈ సమస్య వచ్చింది. ప్రధానంగా ఏప్రిల్, జూన్ నెలల్లో నిల్వ చేయకపోవడం వల్ల ఈ అవస్థ వచ్చింది. అయినా ప్రభుత్వం యూరి యా కొరతకు ప్రత్యామ్నాయం చూపిస్తోంది. – శనివారం జలుమూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చేసిన వ్యాఖ్యలివి.. -
ఎలుగుబంటి దాడిలో నలుగురికి గాయాలు
మందస,పలాస: మందస మండలం నారాయణపు రం గ్రామంలో ఎలుగుబంటి మరోసారి శనివారం దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. శుక్రవారం నారాయణపురం గ్రామంలోకి ప్రవేశించి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా ఒక వ్యక్తి ఎలుగు దాడిలో గాయాలపాలయ్యాడు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే శనివారం సాయంత్రం కూడా గొరకల పాపారావు, పందిరి గున్నయ్య, లక్ష్మీనారాయణ, మోహనరావులపై దాడి చేసి గాయపర్చింది. దీంతో గ్రామస్తులు ఎలుగును హతమార్చారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణనాయుడు సంఘటన స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. కాశీబుగ్గ నుంచి ముగ్గురు వైద్యులు వచ్చి క్షతగాత్రులను పరిశీలించారు. ప్రస్తుతం వారికి ప్రాణాపాయం లేదని చెప్పారు. పోస్టు మార్టం చేసి తర్వాత ఎలుగుబంటి మృతదేహాన్ని ఖననం చేశారు. ప్రస్తుతం ఎలుగుదాడికి గురైన నలుగురు వ్యక్తులు హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
యూరియా ఉంది
జిల్లాలో రైతులు ఆందోళ న చెందాల్సిన అవసరం లేదు. జిల్లాలో ఈ ఖరీఫ్ కు వరి, ఇతర పంటలు కలిపి 3,73,000 ఎకరాల్లో సాగవుతోంది. ఈ సాగుకు మొదటి, రెండో విడతల్లో కలిపి 20,481 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైంది. అయితే రైతుసేవా కేంద్రాలు, వ్యవసా య సహకార సంఘాల ద్వారా 11,443 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల ద్వారా 12,393 మెట్రి క్ టన్నులు కలిపి, మొత్తం 23,836 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటివరకు రైతులకు సరఫరా చేశాం. ప్రస్తుతం రైతుసేవా కేంద్రాలు, సహకార సంఘాల వద్ద 415.3 మెట్రిక్ టన్ను లు, ప్రైవేట్ డీలర్ల వద్ద 123 మెట్రిక్ టన్నులు, బఫర్లో 561 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 1,099 మెట్రిక్ టన్నుల యూరియా అందుబా టులో ఉంది. – ఈ నెల 1న కలెక్టర్ చెప్పిన మాటలివి.. -
గూగుల్ అంబాసిడర్గా బీఆర్ఏయూ ఈసీఈ విద్యార్థి
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) విభాగానికి చెందిన బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి శతపతి సాయి ప్రదీప్ గ్రామీణ ప్రాంత విద్యా సంస్థల కేటగిరీ నుంచి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్కు స్టూడెంట్ అంబాసిడర్ (జీఎస్ఏ)గా ఎంపికయ్యారు. ఏఐ ద్వారా జెమినీ ఏఐ, గూగుల్ టెక్నాలజీపై స్వల్ప కాలిక అవగాహన, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు సాయిప్రదీప్కు అవకాశం లభిస్తుంది. అలాగే సాంకేతిక సంబంధిత పోటీల నిర్వహణ, దేశవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్ ఇన్నోవేటర్స్కు సంస్థను అనుసంధానం చేయడం, నాయకత్వ లక్షణాలు పెంచుకోవడంపై కూడా దృష్టి సారించవచ్చు. విద్యార్థి ఎంపికపై వర్సిటీ వీసీ ఆర్కే రజినీ, రిజిస్ట్రార్ పి.సుజాత ప్రత్యేకంగా అభినందించారు. గూగుల్ అంబాసిడర్ కిట్ను ఈ సందర్భంగా సాయిప్రదీప్కు అందజేశారు. -
జీరో బిజినెస్..
నరసన్నపేట: బంగారం వ్యాపారి వెంకట పార్వతీశం గుప్తా హత్య జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఎవరిని నమ్మాలో.. ఎవరిని అనుమానించాలో అర్థం కాని పరిస్థితుల్లో వ్యాపారులు ఉన్నారు. అయితే ఈ సంఘటనకు మూలం వ్యాపారులు జీరో బిజినెస్ చేయడమేనని అందరూ అంటున్నారు. అత్యాశకు పోయి అడ్డదారుల్లో వ్యాపారం చేయడం తగదని అంటున్నారు. నమ్మిన వ్యక్తే పథ కం ప్రకారం ఇతరుల సాయంతో గుప్తాను హత్య చేయడం, శ్రీకాకుళం సమీపంలోని రామిగెడ్డలో మృత దేహాన్ని పడేయడం, హత్య జరిగిన 10 రోజుల తర్వాత మృతదేహాన్ని పోలీసులు గుర్తించడం తెలిసిందే. ఈ సంఘటన బంగారం వ్యాపారుల్లో కనువిప్పు తెస్తుందా అనే దానిపై కూడా చర్చ జరుగుతుంది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం నరసన్నపేటకు చెందిన నారాయణశెట్టి రవీంద్రనాద్ ఠాగూర్, గుడ్ల చంద్రభూషణ గుప్తాలు కూడా ఇదే తరహాలో హత్యకు గురయ్యారు. పర్లాకిమిడితో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో బంగారు ఆభరణాలు సేల్ చేసి మిగిలిన ఆభరణాలు, సేల్ చేయగా వచ్చిన డబ్బుతో నరసన్నపేటకు తిరిగి వస్తుండగా నవతల ఘాటీ వద్ద పర్లాకిమిడికి చెందిన వ్యాపా రులు ఇచ్చిన సమాచారంతో కొందరు దుండగులు అటకాయించి వీరిని హతమార్చి ఆభరణాలు, డ బ్బు తీసుకుపోయారు. మృతదేహాలను బెండి రైల్వే గేటు వద్ద తుప్పల్లో వేసేశారు. రెండు రోజుల తర్వా త సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇదే తరహాలో గుప్తాను చంపేశారని వ్యాపారులు అంటున్నారు. నరసన్నపేటలో రిటైల్ బంగారం షాపులు 64 ఉన్నాయి. హోల్సేల్ షాపులు మరో 12 ఉన్నాయి. జిల్లాలో ఐదారు వందల షాపులు ఉన్నాయి. వీటి ల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారం చేస్తున్న వారు కొందరే. మిగిలిన వారందరూ జీరో బిజినెస్ చేస్తున్నవారే. కోట్లల్లో వ్యాపారం చేస్తున్నా.. వేలల్లో కూడా ట్యాక్స్ కట్టరు. అంతా అక్రమ వ్యాపారమే. ఇటీవల బీఐఎస్ అధికారులు వచ్చి నరసన్నపేటలో తనిఖీలు చేపట్టగా హాల్మార్క్ వ్యవహారం బయ ట పడిన విషయం విదితమే. దీంట్లో భాగంగా గుప్తా కూడా జీరో బిజినెస్కు అలవాటు పడి విశాఖ తదితర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు అక్రమంగా(లెఫ్ట్) బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి గ్రా ముకు కమీషన్ తీసుకుని స్థానికులకు ఆ బిస్కెట్లు అమ్మకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా గడిచిన ఐదారేళ్లుగా ఇదే వ్యాపారంలో ఉన్నాడు. మొదట్లో కొందరు వ్యాపారుల వద్ద ముందుగా డబ్బు తీసుకొనేవాడు. బిస్కెట్స్ తెచ్చి ఆ మొత్తానికి ఇచ్చేవాడట. ఏడాది కిందటి నుంచి ఈయనే పెట్టుబడి పెట్టి బిస్కెట్స్ తేవడం, కమీషన్కు అమ్మకాలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అదే ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. విశాఖకు తరచూ వెళ్లే గుప్తా ఎక్కువగా డ్రైవర్గా సంతోష్నే తీసుకువెళ్లేవాడు. అతని కళ్ల ముందే గుప్తా కోటీశ్వరుడు కావ డం సంతోష్కు కంటగింపుగా మారింది. దీంతో పథకం పన్ని ప్రాణాలు తీశాడు. గుప్తాను హత్య చేసిన వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని, ఎలాంటి ప్రలోభాలకు పోలీసులు గురికావద్దని స్థానిక వ్యాపారులు కోరుతున్నారు. దీంట్లో భాగంగా నరసన్నపేటలో శనివారం బంగారం షాపులు మూసివేశారు. సాయంత్రం కొందరు వర్తకులు పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించి అనంతరం పోలీసు అధికారులను కలిసి హంతకులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. -
లగేజీ ఆటో ఢీకొని వ్యక్తి మృతి
వజ్రపుకొత్తూరు రూరల్: బెండి గేట్–కాశీబుగ్గ పాత జాతీయ రహదారిలో సరియాపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామానికి చెందిన కర్ని వెంకటరమణ (36) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. వెంకటరమణ పలాస మండలం పెదమాకన్నపల్లిలో ఉన్న అత్తారింటికి వెళ్లి బెండి గేట్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వెళ్తున్న లగేజీ ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడి ఎడమ చేయి విరిగిపోగా, తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని 108 వాహనంలో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరమణ గల్ఫ్లో వెల్డర్గా పని చేస్తూ ఆరు నెలల కిందటే ఇంటికి వచ్చాడు. భార్య ద్రాక్షవేణి, కుమారుడు లక్కీ, కుమార్తె ప్రక్షత, తల్లి రాజేశ్వరి ఉన్నారు. వెంకటరమణ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, వివిధ శాఖల కార్మిక రంగ సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఎన్నికల హామీలు అమలు చేయాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ టి.వి.ఫణి పేర్రాజు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం రెవెన్యూ భవన్లో జిల్లా చైర్మన్ ఎస్.శ్రీరాములు అధ్యక్షతన జిల్లా ప్రధాన కార్యదర్శి సీపాన వెంకటరమణ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిల వివరాలను పే స్లిప్పులు, సీఎఫ్ఎంఎస్లో చూపించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐఆర్ ప్రకటించి 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని కోరారు. గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ.అర్లయ్య, క్లాస్–4 ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.మల్లేశ్వరరావు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా మహిళా విభాగం చైర్పర్సన్ కె.ప్రవళ్లిక ప్రియ, పొదిలాపు శ్రీను, వీవీఎన్ రాజు, సీపాన గోవిందరావు, జల్లేపల్లి రామారావు, ఎం.కాళీప్రసాద్ పాల్గొన్నారు. డివిజన్ కమిటీల నియామకం.. ఏపీజేఏసీ అమరావతి సంఘం డివిజన్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీకాకుళం డివిజన్ చైర్మన్గా ఎస్.గణపతిరావు, ప్రధాన కార్యదర్శిగా పి.రాజశేఖర్, టెక్కలి డివిజన్ చైర్మన్గా బి.హేమసుందర్, ప్రధాన కార్యదర్శిగా ఎం.రావు, పలాస డివిజన్ చైర్మన్గా బి.అప్పలస్వామి, ప్రధాన కార్యదర్శిగా పి.కుమార్, మహిళా విభాగం శ్రీకాకుళం సిటీ యూనిట్ చైర్పర్సన్గా డి.అనురాధ, ప్రధాన కార్యదర్శిగా బి.సుభద్ర, శ్రీకాకుళం డివిజన్ చైర్మన్గా డి.వనజాక్షీ, ప్రధాన కార్యదర్శిగా పి.రాజేశ్వరి, టెక్కలి డివిజన్ చైర్మన్గా ఎస్.పవిత్ర, ప్రధాన కార్యదర్శిగా ఎన్.అనూష, పలాస డివిజన్ చైర్మన్గా ఎస్.కరుణమ్మ, ప్రధాన కార్యదర్శిగా బి.ఎస్.రాణిలను ఎన్నుకున్నారు. -
పురుగుమందు తాగి వివాహిత ఆత్మహత్య
ఆమదాలవలస: చిట్టివలస గ్రామానికి చెందిన నవిరి పూర్ణ (22) అనే వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమదాలవలస ఎస్ఐ ఎస్.బాలరాజు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస పట్టణంలోని ఐజేనాయుడు కాలనీకి చెందిన సాయిపల్లి మధుసూదనరావుతో పూర్ణకు నాలుగు నెలలు క్రితం వివాహం జరిగింది. కట్నం కింద రూ.5 లక్షలు, 8 తులాల బంగారం ఇచ్చారు. అయినప్పటికీ భర్త, అత్తమామలు అదనపు కట్నం తేవాలని వేధిస్తుండేవారు. ఈ బాధలు భరించలేక పూర్ణ తన తల్లిదండ్రులు నవిరి సింహాచలం, పద్మలకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లిపోయారు. అనంతరం భర్త, అత్తమామలను పిలిపించి గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అదనపు కట్నం కోరడం తగదని చెప్పగా తాము ఇంకేమీ అడగబోమని భర్త, అత్తమామలు ఒప్పుకున్నారు. దీంతో పూర్ణ అత్తవారి ఇంటికి వెళ్లిపోయింది. మళ్లీ రెండురోజుల భర్త కొట్టడంతో పూర్ణ కన్నవారింటికి వచ్చేసింది. తల్లిదండ్రులతో కలిసి ఆగస్టు 17న భర్త వేధింపులపై ఆమదాలవలస పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఒత్తిడి తట్టుకోలేక సెప్టెంబర్ 2న పూర్ణ ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం పూర్ణ మృతి చెందింది. బాధితురాలి తండ్రి సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్ల వేధింపులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివేకానంద తెలిపారు. పూర్ణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆమదాలవలస: మెట్టక్కివలసలోని కుప్పిలివారివీధికి చెందిన బరాటం తాతయ్యలు(51) అనుమానాస్పదంగా మృతిచెందాడు. శుక్రవా రం ఆమదాలవలస ఎస్ఐ ఎస్.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తాతయ్యలు మూడు రోజులుగా ఇంటికి రాకపోవడంతో భార్య సత్యవతి ఆమదాలవలస పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతలో శుక్రవారం పట్టణంలోని లక్ష్మీనగర్ వీధి శివారులోని శ్మశాన వాటిక షెడ్డులో మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వెళ్లి పరిశీలించగా తన భర్తేనని సత్యవతి నిర్ధారించింది. పోలీసులు అనుమానాస్పదకేసుగా దర్యాప్తు కొనసాగిస్తూ మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి శవపంచనామాకు తరలించారు. దుబాయ్లో చినవంక వాసి అదృశ్యం వజ్రపుకొత్తూరు రూరల్: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తన భర్త సాన రాజేష్ ఆచూకీ తెలియడం లేదని చినవంక గ్రామానికి చెందిన ఢిల్లెమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ 2015లో దుబాయ్ వెళ్లిన తన భర్త 2019 తర్వాత ఆచూకీ లేకుండా పోయారని, పదేళ్లుగా ఎదురుచూస్తున్నా ఫలితం లేకపోయిందని వాపోయింది. కూలి పనులు చేసుకుంటూ కుమార్తెతో కలిసి జీవనం సాగిస్తున్నానని, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి భర్త ఆచూకీ తెలియజేయాలని ఢిల్లెమ్మ వేడుకుంది. శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని ఏపీహెచ్బీ కాలనీలో నివాసముంటున్న తంగుడు నాగమణి(40) అనారోగ్యంతో మృతి చెందారు. మరణానంతరం ఆమె నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుటుంబసభ్యులు టి.వెంకటరావు, కె.కుమారి, బరాటం మల్లేశ్వరరావులు కొల్లు సత్యనారాయణ ద్వారా రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియచేశారు. మగటపల్లి కల్యాణ్ నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్చార్జి సుజాత, నంది ఉమాశంకర్ ద్వారా నాగమణి కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. దాత కుటుంబ సభ్యులను రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గాశ్రీనివాస్లు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరుకు తెలియజేయాలని కోరారు. -
బంగారం కోసమే బలిగొన్నారా?
● వీడిన నరసన్నపేట వ్యాపారి అదృశ్యం మిస్టరీ ● పెదపాడు రామిగెడ్డలో లభ్యమైన మృతదేహం ● పోలీసుల అదుపులో నిందితులు! శ్రీకాకుళం రూరల్: నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి వెంకట పార్వతీశం గుప్తా(45) అదృశ్యం మిస్టరీ ఎట్టకేలకు వీడింది. శ్రీకాకుళం రూరల్ పరిధిలోని పెదపాడు వద్ద రామిగెడ్డలో శుక్రవారం ఉదయం 11 గంటలకు గుప్తా మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. బంగారం కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నరసన్నపేటకు చెందిన గుప్తా బంగారాన్ని హోల్సేల్గా కొనుగోలు చేస్తూ నరసన్నపేటతో పాటు శ్రీకాకుళంలోని పలు షాపులకు విక్రయించేవారు. ఈయన వద్ద డ్రైవర్ సంతోష్ ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. గుప్తా వద్ద బంగారం కాజేయాలనే ఉద్దేశంతో సంతోష్ తన స్నేహితుడు కార్ డెకార్స్ యజమాని రాజుతో కలిసి ప్లాన్ వేశాడు. ఆ రోజు ఏం జరిగిందంటే.. ఆగస్టు 26న విశాఖపట్నంలోని ఓ బంగారం దుకాణం వద్ద కేజీన్నర బంగారాన్ని గుప్తా కొనుగోలు చేశారు. విశాఖపట్నం నుంచి తన కారులో బంగారాన్ని తీసుకొస్తుండగా శ్రీకాకుళంలోకి రాగానే డ్రైవర్ సంతోష్తో పాటు ఆదిత్య డెకార్స్ యజమాని రాజు కలిసి పెదపాడు వద్ద కారుషెడ్లోనే దారుణంగా హత్య చేశారు. ఆగస్టు 26 నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురవడం, కాలువలు, గెడ్డలు గుండా పెదపాడు పరిసర ప్రాంతమంతా అత్యధికంగా నీటి ప్రవాహం ఉండటంతో మృతదేహాన్ని పాత్రునివలస రామిగెడ్డలో పడేశారు. అక్కడి నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి గుర్రపుడెక్కల మధ్యలో మృతదేహం చిక్కుకుపోయింది. గుప్తా వద్ద దోచుకున్న బంగారంలో సంతోష్, రాజులు ఒకరు 60శాతం, మరొకరు 40శాతం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అదృశ్యం ఫిర్యాదుతో.. గుప్తా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు నరసన్నపేట పోలీసులను ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. మృతిచెంది ఉండవచ్చనే సమాచారం మేరకు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్, క్రైం పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి సీఐలు పైడపునాయుడు, శ్రీనివాసరావు, ఎస్ఐ రాము చేరుకుని మృతదేహన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. పోలీసుల అదుపులో నిందితులు! గుప్తాను హత్యచేసిన ఉదంతంలో నరసన్నపేట పోలీసులు డ్రైవర్ సంతోష్, కారు డెకార్స్ యజమాని రాజును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నమే పెదపాడులోని కారు డెకార్స్ను నరసన్నపేట, శ్రీకాకుళం పోలీసులు పరిశీలించారు. హత్య ఎలా చేశారు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు వంటివి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కాగా, కార్ డెకార్స్ యజమాని ఓ టీడీపీ నాయకుడికి దగ్గర బంధువని సమాచారం. -
జె.ఆర్.పురంలో చోరీ
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీ లక్ష్మీనగర్లో డేవిడ్రాజ్ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాస్టర్ శ్యాంకుమార్ కుమారుడు డేవిడ్రాజ్, కోడలు అరుణకుమారి అద్దె ఇంట్లో ఉంటున్నారు. డేవిడ్రాజ్ విశాఖపట్నంలో ఒక ప్రయివేటు కంపెనీలో పని చేస్తూ రెండు రోజులుగా అక్కడే ఉండిపోయారు. కోడలు అరుణకుమారి చీపురుపల్లి మండలం నడిపిల్లిలో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి చీపురుపల్లి మండలం బొండపల్లిలోని కన్నవారింటికి వెళ్లారు. ఇదే అదనుగా గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. డేవిడ్రాజ్ తమ్ముడు శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇంటికి వెళ్లి చూడగా తలుపులు తీసి ఉండటం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మూడు తులాల బంగారం, రెండు లక్షల నగదు, కొన్ని వస్తువులు పోయినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు సేకరిస్తున్న క్లూస్ టీం సభ్యులు -
ఆటో డ్రైవర్ల పొట్టకొట్టిన కూటమి ప్రభుత్వం
కొతూరు : కూటమి ప్రభుత్వం ఆటోడ్రైవర్ల పొట్టకొట్టిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాదరావు అన్నారు. కొత్తూరులో శుక్రవారం ఆటో డ్రైవర్లు నిరసన ర్యారీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయడం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండాపోతోందన్నారు. ఆదాయం లేక వాహన ఈఎంఐలు చెల్లించలేక, పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నారా లోకేష్ గతంలో పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఆటో డ్రైవర్లను అన్ని విధాలా ఆదుకుంటానిని చెప్పి ఇప్పుడు ఉపాధి లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆటో డ్రైవర్లకు ప్రతి నెలా కొంతమొత్తం చెల్లించడంతో పాటు వాహన మిత్ర పథకం ద్వారా ఏటా రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల సంఘం నాయకులు, పెద్ద ఎత్తున డ్రైవర్లు పాల్గొన్నారు. -
కార్పొరేట్ గుప్పిట్లో మెడికల్ కాలేజీలు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మెడికల్ కాలేజీలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్ సీపీ కళింగ కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అందులో పది కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం వల్ల సుమారు 1500 మెడికల్ సీట్లు కోల్పోయే దుస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో విలేజ్ క్లినిక్స్, అర్బన్ హెల్త్ క్లినిక్స్, 3256 రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు ఆసరాగా నిలిచారని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అప్రజాస్వామికం శ్రీకాకుళం రూరల్: రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచన విధానం మేరకు ప్రతి ఇంట్లో ఒకరు డాక్టర్ విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అదే పరంపర కొనసాగిస్తూ 2019లో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మెడికల్ విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రిమ్స్ ప్రిన్సిపాల్గా బాధ్యతల స్వీకరణ శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ ఎస్.అప్పలనాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ధర్మశ్రీ నుంచి బాధ్యతలు చేపట్టారు. అప్పలనాయుడు గతంలో విజయనగరంలో ప్రొఫె సర్గా సేవలందించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతో సమావేశమై కళాశాల వివరాలను తెలుసుకున్నారు. ఎఫ్డీఓకు పదోన్నతి అరసవల్లి: జిల్లా మత్స్యశాఖలోని ఫిష్ సీడ్ ఫామ్లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఎఫ్డీవో)గా విధులు నిర్వర్తిస్తున్న డి.గోపికృష్ణకు విజయవాడ కమిషనరేట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎఫ్డీవోగా సేవలందించిన గోపీకృష్ణకు పదోన్నతి లభించడంపై సిబ్బంది, మత్స్యకారుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. వాస్తవికతకు దగ్గరగా ‘కన్యాకుమారి’ శ్రీకాకుళం అర్బన్: ఉత్తరాంధ్ర వాస్తవికతకు దగ్గరగా కన్యాకుమారి చిత్రం రూపొందించడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని రామలక్ష్మణ కూడలి వద్ద ఓ హోటల్లో శుక్రవారం ‘కన్యాకుమారి’ చిత్రం సక్సెస్ మీట్ను చిత్ర నిర్మాతల్లో ఒకరైన అట్టాడ అప్పలనాయుడు నిర్వహించారు. చిత్రనటులు అగ్గున బాబూరావు, జ్యోతి బత్తుల, గిరిజ శంకర్, తిరుమలరావు, సాహితీవేత్తలు కె.శ్రీనివాస్, ఉదయ్కిరణ్, న్యాయవాది మామిడి క్రాంతి, దాసరి రామచంద్రరావు, డాక్టర్ సతీష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. శ్రీకాకుళం యాస, సంస్కృతి, రైతును హీరోగా చూపడం చిత్రం గొప్పతనమన్నారు. చిత్ర దర్శకుడు అట్టాడ సృజన్కు మంచి భవిష్యత్ ఉందన్నారు. ఈ నెల 17 నుంచి అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, ఆహా ఓటీటీల్లోనూ రిలీజ్ అవుతుందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు వాన కృష్ణచంద్, ఆగూరు ఉమామహేశ్వరరావు, కొమ్ము రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు దర్శన కష్టాలు!
● ఆదిత్యుని సన్నిధిలో కానరాని ‘ప్రత్యేక’ ఏర్పాట్లు ● ఆలయ స్థాయి పెరిగినా తీరు మారని వైనం వీల్చైర్లను వినియోగిస్తున్నాం.. దివ్యాంగుల దర్శనాలకు ప్రస్తుతానికి వీల్చైర్లను వినియోగించి దర్శనాలకు పంపుతున్నాం. రద్దీ సమయాల్లో వీఐపీ మార్గంలోనే పంపిస్తున్నాం. ఇప్పటివరకు శాశ్వత మరుగుదొడ్లు, అన్నదాన మండపాలేవీ నిర్మాణాలు కాలేదు. భవిష్యత్ నిర్మాణాల్లో కచ్చితంగా దివ్యాంగులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లతోనే కొత్త నిర్మాణాలు చేపడతాం. స్టాఫ్ లేకపోవడంతో ప్రత్యేక సిబ్బంది కేటాయింపు సమస్యగా మారింది. – కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ఆలయ ఈవో, అరసవల్లి అరసవల్లి : ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు కొలువుదీరిన అరసవల్లిలో స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన దివ్యాంగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యేక ఏర్పాట్లు కానరాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. సాధారణ రోజులను పక్కన పెడితే ఆదివారం ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆ సమయంలో దివ్యాంగులు క్యూలైన్ల వద్ద నరకయాతన అనుభవిస్తున్నారు. ఇనుప గ్రిల్స్కు ఆనించుకుని నిలబడి కృత్తిమ కాలు (ఆర్టిఫిషియల్ లెగ్)ను అమర్చుకోవడంతో పాటు కేశఖండన శాలలో తలనీలాలను తీయించుకున్న తర్వాత పైపుల వద్ద నిల్చుని స్నానాలకు ఆగచాట్లు పడుతున్నారు. మరుగుదొడ్లలో కూడా దివ్యాంగులకు తగిన ఏర్పాట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయం ముందు వరకు వెళ్తే మాత్రం నాలుగైదు వీల్చైర్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిలో ఆదిత్యుని మహామండపం వరకు మాత్రమే వెళ్లేదుకు అనుమతిస్తున్నారు. దీంతో దూరం నుంచే ఆదిత్యున్ని దర్శించుకుని వెనుదిరగాల్సి వస్తుంది. ఆదిత్యుని ఆలయానికి వార్షిక ఆదాయం రూ.20 కోట్ల వరకు చేరడంతో డిప్యూటీ కమిషనర్ (డీసీ) హోదా పొందిన సంగతి విదితమే. అయినప్పటికీ అంతటి స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంపై స్థానికులు, భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రత్యేక’ ఏర్పాట్లు చేయాలి.. ఆదిత్యాలయానికి దివ్యాంగులు దర్శనాలకు అధికంగా వస్తున్నారు. వీరికి ఆలయంలో తగిన ఏర్పాట్లు లేకపోవడంతో దూరం నుంచి దర్శనం చేసి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇది మినహా మరే ఇతర ఆర్జిత సేవల్లోనూ పాల్గొనే అవకాశాలు లేకుండాపోతున్నాయనే ఆవేదన దివ్యాంగుల్లో వ్యక్తమవుతోంది. ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలకు, కళ్యాణ సేవలకు, తలనీలాల మొక్కులు చెల్లింపులకు, అన్నప్రసాదాల స్వీకరణకు కూడా ఎలాంటి ‘ప్రత్యేక’ ఏర్పాట్లు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఆలయ అధికారులు, పాలకులు దృష్టి సారించి దివ్యాంగులకు ‘ప్రత్యేక’ దర్శనం కల్పించాలని కోరుతున్నారు. ● కాళ్లు, చేతులు కోల్పోయిన వారు, అంధత్వమున్న దివ్యాంగులకు ప్రత్యేక దర్శన మార్గం (క్యూలైన్లు) ఏర్పాటు చేయాలి. ● దివ్యాంగులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించాలి. స్నానాల గదులతో పాటు కింద అంతస్థులోనే వసతి ఉండేలా చూడాలి. ● ఇంద్రపుష్కరిణి సమీపంలోనే తలనీలాల మొక్కులు చెల్లించుకునేందుకు..అక్కడికి సమీపంలోనే దివ్యాంగులు స్నానాలకు వీలుగా తక్కువ ఎత్తులో పైపులైన్లు ఏర్పాట్లు చేయాలి. ● దర్శనానికి వచ్చే మార్గంలో దివ్యాంగులు వచ్చే వాహనాలకు అనుమతివ్వడంతో పాటు ప్రత్యేకంగా ఆలయ సిబ్బందిని కనీసం ఆదివారం నాడైనా డెప్యూట్ చేయాలి. ● ఆర్జిత సేవల్లో దివ్యాంగులు పాల్గొనేలా సౌకర్యాలు కల్పించాలి. కనీసం గంట సమయం పట్టే సూర్యనమస్కారాల పూజల్లో పాల్గొనేందుకు వీలైన సౌకర్యాలు కల్పించాలి. ● ఉదయం ఆలయంలో ఉచిత ప్రసాదాల స్వీకరణకు, మధ్యాహ్నం అన్నప్రసాదాన్ని తీసుకునేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. -
ఆ
నిమిషాలు.. 30ముప్పై నిమిషాలు ఆమదాలవలస స్టేషన్ ఉత్కంఠతో ఊపిరి బిగపట్టి చూసింది. నిత్యం రైల్వే అనౌన్స్మెంట్లతో మార్మోగే ఆ ప్రాంగణం ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులు గమనించింది. సమయానికే స్టేషన్కు వచ్చిన రైలు అక్కడే ఆగిపోవడం, నిమిషాలు గడిచిపోతున్నా కదలకపోవడం, ఓ గర్భిణికి రైలులోనే ప్రసవం జరుగుతోందని స్టేషన్ అంతా తెలియడం, పండంటి ఆడపిల్ల పుట్టిందని సమాచారం రావడం వంటి ఘటనలతో ముప్పై నిమిషాలు మూడు ఘడియల్లా గడిచిపోయాయి. కాసింత జాప్యానికే తిట్టుకునే ప్రయాణికులు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఆలస్యాన్ని అంతగా పట్టించుకోలేదు. ఆమదాలవలస / శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో శుక్రవారం రాత్రి రైలులో ఓ గర్భిణి ప్రసవించారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ అరుణ, రైల్వే ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ పల్ల కీర్తి తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురానికి చెందిన జి.భూలక్ష్మి అనే గర్భిణి తన భర్త జానకిరామ్తో కలిసి విశాఖ వెళ్లేందుకు కోణార్క్ ఎక్స్ప్రెస్లో ఎక్కారు. దారిలో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో ఆమె భర్త రైల్వే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైలును స్టేషన్లో నిలుపుదల చేసి రైల్వే ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ కీర్తికి సమాచారం అందించారు. ఆమె హూటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే నొప్పులు అధికం కావడంతో రైలులోనే ప్రసవంచేశారు. ఆడబిడ్డ జన్మించగా తల్లి గర్భంలో మరో శిశువు ఉన్నట్లు వైద్యురాలు గుర్తించారు. దీంతో వారిని వెంటనే రాగోలు జెమ్స్కు తరలించారు. ఆస్పత్రిలో మరో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. సంఘటనను రైల్వేస్టేషన్లో ప్రయాణికులు అంతా వింతగా గమనించారు. దాదాపు 30 నిమిషాల పాటు రైలును ఆపేశారు. ఆమదాలవలస రైల్వే స్టేషన్లో రైలులోనే ప్రసవం రైల్వే డాక్టర్ చొరవతో తల్లీబిడ్డ క్షేమం జెమ్స్ ఆస్పత్రిలో మరో బిడ్డ జననం -
మెడికల్ కాలేజీలపై కూటమి కుట్ర
● ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఎక్కడ..? ● వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు అట్టర్ ఫ్లాప్ ● ప్రభుత్వ తీరుపై మండిపడిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం న్యూకాలనీ: పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. ఆయన శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పది మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబా బు నిర్ణయించడం దుర్మార్గమని అన్నారు. పీపీపీ విధానం ద్వారా 10 మెడికల్ కాలేజీలను తన వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్రకు తెరతీశారని, తద్వారా వేలకోట్లను దోచుకునేందుకు స్కెచ్ వేశారని దుయ్యబట్టారు. దార్శనికుడు జగన్.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి అనే విషయాన్ని డాక్టర్ సీదిరి గుర్తుచేశారు. గత ప్రభుత్వం హ యాంలోనే రూ.2500 కోట్లు ఖర్చు చేసి, 5 మెడికల్ కాలేజీల భవన నిర్మాణాలు పూర్తయ్యి అడ్మిషన్లు మొదలుపెట్టిన విషయం వాస్తవం కా దా ? అని ప్రశ్నించారు. మరో రూ.6వేలు కోట్లు ఖర్చు చేసి 2025–26, 2026–27 నాటికి మిగిలిన 10 కాలేజీల్లో తరగతులు ప్రారంభించేలా ప్రణాళిక చేశారని, కానీ ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయన్నారు. 15 నెలల్లో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం రూ.6వేల కోట్లు వెచ్చించలేదా అని ప్రశ్నించారు. అక్రమాలపై ప్రశ్ని స్తానని చెప్పిన పవన్ కల్యాణ్ వారి పంచనే చేరి రుషికొండలో వేషాలు వేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు పాలన చీకటి రోజులను తలపిస్తోందన్నారు. ఎవరి లబ్ధి కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు పరం చేసి భీమా విధానంలోకి తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. మంత్రిగా తప్పుకో అచ్చెన్నాయుడు.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయు డు జిల్లా పరువు మంటగలుపుతున్నారని అన్నా రు. యూరియాను సైతం అందజేయలేని దుస్థితి పై కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. పనిచేయడం చేయకాకపోతే వ్యవసాయశాఖ నుంచి తప్పుకో అచ్చెన్నాయుడు అని హితవుపలికారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం పాతపట్నం: గ్రామీణ నిరుద్యోగులకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని ట్రస్ట్ ఇన్చార్జి ఎం.రామమూర్తి శుక్రవారం తెలిపారు. పాతపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న వైటీసీలో నాలుగు నెలల పాటు ఉచితంగా హస్టల్, వసతి సౌకర్యం ఉంటుందని, కంప్యూటర్ బేసిక్, ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లి ష్, పర్సనల్ డెవలప్మెంట్, స్కిల్స్, సోలార్ పీవీ ఇన్స్టాల్ కోర్సులకు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పదో తర గతి పాసై ఉండాలని, 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండాలని, దరఖాస్తు చేసుకోవాలని, 105 సీట్లు మాత్రమే ఉన్నాయని, మరిన్ని వివరాలకు 7416321186 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ట్రస్ట్ ఇన్చార్జి రామమూర్తి కోరారు. -
టీచర్లతోనే బంగారు భవిష్యత్
● జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానో త్సవంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం కల్చరల్/ శ్రీకాకుళం న్యూకాలనీ/ జి.సిగడాం /మెళియాపుట్టి: భావితరాలకు బంగారు భవిష్యత్ ఇవ్వగలిగేది ఒక్క ఉపాధ్యాయుడే అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్లతో పాటు తల్లిదండ్రులు తమ పిల్లలను తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే వారిలో చాలామంది ఆర్థికంగా వెనుకబడిన వారు ఉంటారని వారిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. విద్యార్థులకు టీవీ, సెల్ వాడకంపై నియంత్రణ ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం తాము ఎంతో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు, అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.శశిభూషణరావు, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, డైట్ ప్రిన్సిపాల్ గౌరీశంకర్, సాయిప్రసాద్, బెజ్జిపురం యూత్ క్లబ్ నిర్వాహకులు ప్రసాదరావు పాల్గొన్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డులు అందుకుంటున్న టీచర్లు తిమ్మరాజు నీరజ, బూరవెల్లి విజయభారతి, కూర్మాన అరుణకుమారి, లెక్చరర్ రుంకు జనార్దనరావు -
మూలపేటపై అధికారమదం
అధికార పార్టీకి చెందిన వారేమో యథేచ్ఛగా దాడులకు పాల్పడతారు. ఇష్టం వచ్చిన సమయానికి ఇంటికి వచ్చి మరీ బెదిరిస్తారు. కానీ వీరిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఇంటికొచ్చి కొట్టినా ఏమీ కానట్టే ఖాకీలు వ్యవహరిస్తారు. విపక్ష నాయకుడైతే మాత్రం గల్లా పట్టుకుని స్టేషన్కు తీసుకెళ్లేంత తెగువ చూపిస్తారు. ఎందుకని ప్రశ్నిస్తే దాడి చేయడానికి కూడా వెనుకాడరు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో పరిస్థితి ఇది. ఏ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారో గానీ ఇక్కడ ప్రాథమిక హక్కులకు రక్షణ లేకుండాపోయింది. బుధవారం మూలపేట సర్పంచ్ ఇంటిపై దాడికి ప్రయత్నిస్తున్న టీడీపీ నాయకుడు జీరు భీమారావు తదితరులు సంతబొమ్మాళి: మండలంలోని మూలపేటపై రెడ్ బుక్ రాజ్యాంగం పడగ నీడ పడింది. అందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు అధికార పక్షమైతే ఒకలా, విపక్షమైతే మ రోలా ప్రవర్తిస్తున్నారు. ఈ వైఖరి గ్రామంలో సమస్యలు రేకెత్తిస్తోంది. ఈ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త, సర్పంచ్ తమ్ముడైన జీరు విశ్వనాథంపై నౌపడ ఎస్ఐ నారాయణస్వామి దాడి చేయడంతో గ్రామస్తులంతా పోలీస్స్టేషన్ ముందు గురువారం నిరసన చేపట్టారు. మూలపేట సర్పంచ్ జీరు బాబూరావు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మూలపేట గ్రామానికి చేపల కట్టు వేలంపాట, ఇతర మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థాని క సర్పంచ్ జీరు బాబూరావు ఆధ్వర్యంలో గ్రామానికి వచ్చిన డబ్బులను 12 మంది కమిటీ సభ్యులను ఏర్పాటు చేసి వారి అకౌంట్లో రూ. 32 లక్షలు జమ చేశారు. అలాగే గ్రామానికి చెందిన మరో నలుగురి ఖాతాల్లో రూ. 40లక్షలు జమ చేశారు. గ్రామానికి సంబంధించి ఏవైనా కార్యక్రమాలు జరిగితే ఈ డబ్బు ఖర్చు చేసేవారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి సంబంధించిన డబ్బులు తమకు ఇవ్వాలని టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ సర్పంచ్ జీరు భీమారావు అడిగారు. మీ హయాంలో మీ వద్దనున్న రూ.60లక్షల ఏమయ్యావో చెప్పాలని, ఆ డబ్బు ఊరికి ఇస్తే తమ వద్ద ఉన్న డబ్బులు అప్పగిస్తానని సర్పంచ్ బాబూరావు సమాధానం ఇచ్చారు. దీనిపై వివాదం చెలరేగింది. డబ్బుల కోసం పోలీసుల ద్వారా కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో టీడీపీ నాయకుడు జీరు భీమారావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు బుధవారం సాయంత్రం మూలపేట సర్పంచ్ జీరు బాబూరావు ఇంటికి వెళ్లారు. ఆయన లేకపోవడంతో సర్పంచ్ తండ్రిపై దాడి చేశారు. గ్రామంలో గొడవలు వద్దని విషయం తెలిసినా సర్పంచ్ బాబూరావు మిన్నకుండిపోయారు. కానీ గురువారం టీడీపీ నాయకుల ఒత్తిడితో రొయ్యల చెరువు వద్ద ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్త మంగి రామారావును పోలీస్ స్టేషన్కు తీసుకుని రావడానికి నౌపడ ఎస్ఐ నారాయణస్వామి ప్రయత్నించారు. ఎందు కు తీసుకెళ్తున్నారని ప్రశ్నించిన సర్పంచ్ తమ్ముడు జీరు విశ్వనాథంపైన ఎస్ఐ ఇష్టానుసారం దాడి చేశారు. ముఖం, గుండైపెన చేతులతో దాడి చేసి షర్టు చింపి వేసి అక్కడ ఉన్న మంగి రామారావును పోలీస్స్టేషన్కు తీసుకెళ్లిపోయారు. గాయపడిన జీరు విశ్వనాథం టెక్కలి జిల్లా ఆస్పత్రిలో చేరారు. దీనిపై ఊరుఊరంతా మండిపడింది. మహిళలతో పాటు గ్రామస్తులు పోలీస్స్టేషన్కు వచ్చి నిరసన తెలిపారు. మంగి రామారావును విడిచి పెట్టేంత వరకు వెళ్లబోమని తేల్చి చెప్పారు. విచారించి కొద్దిసేపట్లో విడిచిపెడతామని పోలీసులు చెప్పడంతో సర్పంచ్ జీరు బాబూరావుతో పాటు గ్రామస్తులు వెను తిరిగారు. దీనిపై గ్రామస్తులు టెక్కలి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. నడిరోడ్డుపై నిలదీత గ్రామాల్లో తగాదాలకు కారణమవుతున్న టీడీపీ మండలాధ్యక్షుడు, మూలపేట మాజీ సర్పంచ్ జీరు భీమారావును నౌపడలో నడి రోడ్డుపైన మహిళలు, గ్రామస్తులు నిలదీశారు. మంగి రామారావును పోలీస్ స్టేషన్కు తీసుకుని రావడానికి జీరు భీమారావే కారణమని తెలుసుకున్న గ్రామస్తులు అతని ఇంటికి వెళ్లడానికి బయల్దేరగా.. సమాచారం తెలుసుకున్న జీరు భీమారావు తన ఇంటి నుంచి వేరొక చోటకు వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. అయితే నౌపడ మెయిన్రోడ్డులో ద్విచక్ర వాహనంపై వస్తు న్న జీరు భీమారావుని మహిళలు, గ్రామస్తులు అడ్డుకొని నిలదీశారు. గ్రామానికి సంబంధించిన రూ.రెండు లక్షల నలౖభై వేలు నగదు, 40 సిమెంట్ బస్తాలు 2014లో అప్పుగా తీసుకొని అంతవరకు ఒక్క పైసా కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. వడ్డీతో సహా తక్షణమే చెల్లించాలని అన్నారు. అధికారాన్ని ఉపయోగించి భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మహిళలు, గ్రామస్తులు నిలదీయడంతో భయపడి నౌపడ పోలీస్ స్టేషన్లో దాక్కున్నారు. మూలపేటలో వైఎస్సార్సీపీ కార్యకర్తపై ఎస్ఐ దాడి దాడిని నిరసిస్తూ పోలీస్స్టేషన్ ముందు నిరసన టెక్కలి డీఎస్పీకి ఫిర్యాదు -
రెడ్బుక్ రాజ్యాంగం హద్దు మీరుతోంది
● వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ● టెక్కలి డీఎస్పీ కార్యాలయం ముట్టడి టెక్కలి: రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం టెక్కలి నియోజకవర్గంలో పోలీసులు హద్దు మీరుతున్నారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. సంతబొ మ్మాళి మండలం మూలపేట గ్రామానికి చెందిన జీరు విశ్వనాథంపై నౌపడ ఎస్ఐ నారాయణస్వామి విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని తిలక్ పరామర్శించారు. ఎస్ఐ నారాయణస్వామి తీరును తప్పుబడుతూ మూలపేట గ్రామస్తులంతా టెక్కలి డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం పేరాడ తిలక్తో పాటు వైఎస్సార్సీపీ నాయకులు, మూలపేట గ్రామస్తులు డీఎస్పీ లక్ష్మణరావును కలిసి ఫిర్యాదు చేశారు. నౌపడ ఎస్ఐతో పాటు సీఐ చేస్తున్న విధ్వంసాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలన్నారు. అచ్చెన్నాయుడు చెప్పాడని, మూలపేటలో భీమారావు చెప్పాడని పోలీసులు అన్యాయంగా ప్రవర్తిస్తే సహించేది లేదని తిలక్ అన్నారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనతో పాటు మూలపేట సర్పంచ్ జీరు బాబు రావు, సంతబొమ్మాళి పార్టీ అధ్యక్షుడు బి.మోహన్రెడ్డి, నాయకులు కె.గోవింద్, ఎం.అప్పారావు, దొర, ఎం.నాగభూషణ్ తదితరులు ఉన్నారు. -
చోరీకి గురైన బైకులు స్వాధీనం
పొందూరు: చోరీకి గురైన నాలుగు బైకులను, ఓ లగేజీ ఆటోను టెక్నాలజీ సాయంతో స్వాధీనం చేసుకున్నామని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. పొందూరు పోలీసుస్టేషన్ పరిధిలో చోరీకి గురైన వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని పలు గ్రామాల్లో కార్డన్సెర్చ్ చేస్తున్న సమయంలో తమ బైకులు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. బైక్ను పోగొట్టుకున్న యజమాని ఫోన్కు వచ్చిన మెసేజ్ ఆధారంగా సాంకేతికతను ఉపయోగించుకుని బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం మంగువారి తోటకు చెందిన బొమ్మలాట మోహనరావు, బొమ్మలాట ఢిల్లీశ్వరరావు, తోట శ్రీనివాసరావు, మెండ శివలు వాహనాలు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. వీరిలో బైకు దొంగతనం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మోహనరావు మూడు ద్విచక్రవాహనాలను, ఢిల్వీశ్వరరావు ఒక ద్విచక్రవాహనాన్ని చోరీ చేసినట్లు తెలిపారు. తోట శ్రీనివాసరావు, మెండ శివలు కొత్తూరులో చోరీ చేసిన లగేజి ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇటువంటి చోరీ చేసిన వాహనాలను ఢిల్లీశ్వరరావు కొనుగోలు చేసి విక్రయిస్తుంటాడని తెఇపారు. నాలుగు ద్విచక్రవాహనాలు, లగేజి ఆటోను ఢిల్లీశ్వరరావు నుంచి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ వాహనాలన్నీ పొందూరు మండలం రాపాక గ్రామసుతలకు చెందినవిగా గుర్తించామని చెప్పారు. జైలులో ఉన్న మోహనరావును పూర్తి స్థాయిలో విచారిస్తే మరికొన్ని ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకొనే అవకాశం ఉందన్నారు. చోరీకి గురైన వాహనాల విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని చెప్పారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన ఎస్సై వి.సత్యనారాయణ, సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. డీఎస్పీతో పాటు సీఐ పి.సత్యనారాయణ, ఎస్ఐ వి.సత్యనారాయణ, ట్రైనీ ఎస్ఐ మోహిని, పోలీసు సిబ్బంది ఉన్నారు. సమస్మాత్మకత గ్రామాలపై దృష్టి... నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించినట్లు డీఎస్పీ తెలిపారు. పొందూరు మండలంలో ఇప్పటి నుంచే సమస్యాత్మక గ్రామాలలో సమావేశాలు నిర్వహించి వివాదాలు లేకుండా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈసారి బైండోవర్ కేసులలో చిక్కుకుంటే రూ. 2 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
గంజాయి రవాణా గుట్టురట్టు
పలాస: గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ చెప్పారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా నియోగుడ గ్రామానికి చెందిన అరబింద ఆనంద్, తబరద గ్రామానికి చెందిన మైకీల్ రైతా, సెరంగో గ్రామానికి చెందిన ప్రాతిమా లిమ్మాలను పర్లాకిమిడి మీదుగా పలాస రైల్వే స్టేషన్కు బుధవారం రాగా పలాస రైల్వే స్టేషన్ కూడలి వద్ద పట్టుకుని విచారించారు. వారి వద్ద 16.435 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బైక్, రెండు సెల్ఫోన్లు, రూ.1580 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బైక్పై తరలిస్తుండగా.. ఇచ్ఛాపురం రూరల్: ఒడిశా నుంచి ద్విచక్రవాహనంపై గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. గురువారం ఇచ్ఛాపురం పట్టణ సర్కిల్ కార్యాలయంలో కవిటి ఎస్ఐ వి.రవివర్మతో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కొడల గ్రామానికి చెందిన సాగర్ బెహరా, అతని స్నేహితుడు పీతల గ్రామానికి చెందిన బాలుడు రాజేష్ జెన్నాతో కలిసి గురువారం ఒడిశా నుంచి స్థానిక 16వ నెంబర్ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై 21.030 కేజీల గంజాయిని తరలిస్తుండగా కవిటి పోలీసులు కొజ్జిరియా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు స్వాధీనపరచుకున్నామన్నారు. పలాస చేరుకొని అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా గుజరాత్ రాష్ట్రం సూరత్లో స్పిన్నింగ్ మిల్లులో కూలీగా పనిచేస్తున్న దేవేంద్ర పండికి ఇచ్చేందుకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులకు ఆశపడి గంజాయి వ్యాపారీ సమీర్ సాహూ వద్ద నుంచి గంజాయిని తరలిచేందుకు అంగీకరించినట్లు నిందితులు తెలిపారు.