breaking news
Srikakulam District News
-
అందని కిట్లు.. తప్పని పాట్లు
● ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు మొండి చేయి ● జాడ లేని బెల్టులు ● హ్యాండ్ బుక్స్ అందక టీచర్ల అవస్థలు శ్రీకాకుళం: సరుబుజ్జిలి మండలం కాగితాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 8వ తరగతి, మూడు, నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు రాలేదు. బెల్టులు సైతం విద్యార్థులకు ఇవ్వలేదు. విద్యార్థినులకు వేర్వేరు రంగులతో కూడిన నాణ్యత లేని వస్త్రాలను సరఫరా చేశారు ●గార మండలం శ్రీకూర్మంలోని జిల్లా పరిషత్ బాలుర బాలికల ఉన్నత పాఠశాలల్లోని పలువురు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. ఇక్కడి బాలికల ఉన్నత పాఠశాలలో టైప్–4 వసతి గృహం ఈ ఏడాది ప్రారంభం కావడంతో చాలా మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చి ఈ హాస్టల్లో చేరా రు. వీరికి ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు గానీ యూని ఫాంలు గానీ బ్యాగులు కానీ ఇవ్వలేదు ●శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ బాలుర పాఠశా ల ప్రధానోపాధ్యాయులుగా శ్రీకాకుళం ఉప విద్యా శాఖ అధికారి ఉండగా.. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలిగా శ్రీకాకుళం ఎంఈఓ వ్యవహరిస్తున్నారు. ఈ రెండు పాఠశాలల్లో కూడా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. విద్యార్థినీ విద్యార్థులకు ఇచ్చిన బూట్లు వారికి సరిపడిన సైజులో లేకపోవడంతో నడవడానికి కూడా వీలు కావడం లేదు. ●విద్యా సంవత్సరం ప్రారంభమై నెలన్నర దాటుతున్నా పిల్లలకు అందాల్సిన కిట్లు ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 1,53,867 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రైవేటు బ డుల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారిన వారు సైతం ఉన్నారు. కానీ వీరికి పూర్తిస్థాయిలో ప్రభు త్వం కిట్లు ఇవ్వలేదు. విద్యాశాఖ క్యాలెండర్ ప్రకా రం ఆగస్టు మూడో తేదీ నుంచి సమ్మెటివ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ పరీక్షలను వాయిదా వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. విద్యార్థులకే కాకుండా బోధనకు కావాల్సిన పాఠ్యపుస్తకాలను, వర్క్ బుక్లను కూ డా ఇవ్వలేదు. పుస్తకాలతో పాటు యూనిఫారాలు రంగులు మార్చి సరఫరా చేయడం కనిపించింది. బెల్టులు 25 శాతం మందికి మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సన్నబియ్యంతో అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించినా.. అది మూన్నాళ్ల ముచ్చట అయ్యింది. ప్రస్తుతం రేషన్ బియ్యంతో విద్యార్థులకు అన్నాన్ని వడ్డిస్తున్నారు. ప్రభుత్వ పరంగా సన్న బియ్యం సరఫరా కాలేదని, అవి వచ్చేవరకు రేషన్ బియ్యాన్ని సర్దుబాటు చేస్తున్నామని జిల్లా అధికారులు చెబుతుండడం విచారకరం. డొక్కా సీతమ్మ పేరు పెట్టి.. మధ్యాహ్నభోజనాన్ని అధ్వానంగా మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రేపటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె
శ్రీకాకుళం: రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలల్లో ఉన్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి విధులు బహిష్కరించనున్నారు. మూడు ప్రధాన డిమాండ్లతో ఈ సమ్మెను చేయనున్నట్లు జూనియర్ డాక్టర్లు శనివారం తెలిపారు. ఆదివారం అధికారులందరికీ సమ్మె నోటీసును అందించి సోమవారం నుంచి సమ్మె చేయనున్నారు. శ్రీకాకుళం రిమ్స్ మెడికల్ కళాశాలలో మాత్రం మంగళవారం నుంచి సమ్మెలో వీరంతా పాల్గోనున్నారు. ప్రధానంగా స్టైఫండ్ పెంచాలని, ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచకూడదని, వైద్య కళాశాలలో ఇటీవల ఎంఎస్సీ, ఎంఫిల్తో పాటు మరికొన్ని వైద్యేతర పీజీ డిగ్రీ వారిని బోధనకు నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మెను నిర్వహిస్తున్నారు. వైద్య విద్యార్థులకు ఎంఎస్సీ, పీహెచ్డీలు చేసినవారు ఏవిధంగా బోధిస్తారని వారు నిలదీస్తున్నారు. అలాగే ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంచడం వలన తమకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో అన్ని ఖర్చులు పెరిగాయని, దీనికి అనుగుణంగా స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. -
ర్యాలీలు విజయవంతం చేయాలి
నరసన్నపేట: జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీలు నిర్వహించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. డీఎస్సీ–2025లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని, వెన్నుపోటు పార్టీ విధానాలు, యువతకు చేస్తున్న మోసం తదితర అంశాలపై పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. దీంట్లో భాగంగా మండల కేంద్రాల్లో రిలే దీక్షలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. అలాగే సోమవారం ర్యాలీలు కూడా విజయవంతం చేయాలని యువత, నిరుద్యోగులు, డీఎస్సీ బాధితులు అధికంగా పాల్గొనే విధంగా పార్టీ శ్రేణులు చర్యలు తీసుకోవాలన్నారు. సరుబుజ్జిలి: మండలంలోని వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కు సంబంధించి దరఖాస్తు గడువు ఆగస్టు 10 వరకు పెంచినట్లు విద్యాలయం ఇన్చార్జి ప్రిన్సి పాల్ బేతనసామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నవోదయ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టెక్కలి: వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్కు శనివారం మరోమారు టెక్కలి పోలీసులు నోటీసులు అందజేశారు. ఏప్రిల్ 13న టెక్కలి గ్రామ పంచా యతీ ఈవో ఎ.వి.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆదివారం టెక్కలి పోలీస్స్టేషన్కు విచారణ కావాలని నోటీసులో పేర్కొన్నారు. శ్రీకాకుళం: జిల్లాలోని కేజీబీవీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రిన్సిపాల్, సీఆర్టీ, పీజీటీ పో స్టుల భర్తీకి సంబంధించి సబ్జెక్టుల వారీగా 1:3 నిష్పత్తిలో రూపొందించిన తాత్కాలిక మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు ఈనెల 7వ తేదీన ధ్రవపత్రాల పరిశీలన చేపట్టినట్లు సమగ్ర శిక్ష ఈసీపీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే పోస్టులకు తగినంత మంది అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో తదుపరి మెరిట్ క్రమంలో ఉన్న అభ్యర్థులతో 1:10 నిష్పత్తిలో తాత్కాలిక మెరిట్ జాబితాలను రూపొందించి జిల్లా విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అభ్యర్థులు ఈనెల 11వ తేదీన ఉదయం 10 గంటలకు సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయం, ఇందిరానగర్ కాలనీ ఎక్స్టెన్షన్, ఎస్బీఐ రామలక్ష్మణ బ్రాంచ్ వెనుక హాజరవ్వాలని కోరారు. తాత్కాలిక మెరిట్ జాబితాలోని అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్ ప్రతులను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. జలుమూరు: మండలంలోని టెక్కలిపాడు పంచాయతీ గొల్లపేటకు చెందిన పిట్ట అనుష్క (17) పాముకాటుకు గురై శనివారం మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పొలం పనిచేస్తున్న నాన్న మ్మ నీలమ్మకు అనుష్క మధ్యాహ్న భోజనం తీసుకెళ్తుండుగా.. గుర్తు తెలియని పాము కాటు వేసినట్లు గుర్తించారు. దీంతో స్పృహ కోల్పోయిన ఆమెను నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే అప్పటి కే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి తల్లిదండ్రులు సాయమ్మ, అప్పన్నతో పాటు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ప్రస్తుతం నరసన్నపేటలోని ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పోరాటాలతోనే హక్కుల సాధన
జలుమూరు: పోరాటాలతోనే ఆదివాసీల హక్కులు సాధించుకోగలమని తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల సమన్వయకర్త వి.ఎస్.కృష్ణ అన్నారు. మండలంలోని ఎస్టీ మాకివలసలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగీశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం జరిగిన భూ పోరాట విజయోత్సవ సభలో మాట్లాడారు. 1/70 చట్టాన్ని సవరిస్తూ సుప్రీంకోర్టులో గిరిజనేతరులు కేసులు వేస్తుండడం దుర్మార్గమన్నారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన ఐదో షెడ్యూల్ పిసా చట్టం పక్కాగా అమలు చేయాలన్నారు. మాకివలస భూ పోరాటం అత్యంత అరుదైనదిగా అభివర్ణించారు. ఆదివాసీలు ఐక్యతతో ముందుకు వెళ్తే సాధించనది ఏదీ ఉండదని పేర్కొన్నారు. అంతకుముందు నిర్వహించిన థింసా నృత్యం పలువురుని ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీను, అఖిల భారత కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మాధవరావు, వివిధ సంఘాల నాయకులు ఉదయ్ భాస్కర్, కోత ధర్మారావు, కేవీ జగన్నాథరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మోటార్ యాక్ట్ను సవరించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): డ్రైవర్లకు నష్టం చేసే 2023 నూతన మోటార్ యాక్ట్ను సవరించాల ని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్టు వర్క ర్స్ యూనియన్ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం ఎన్జీవో హోమ్లో టి.తిరుపతిరావు అధ్యక్షతన డ్రైవర్ల ప్రథమ మహాసభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా వామనమూర్తి మాట్లాడు తూ.. డీజీల్, పెట్రోల్ ధరల మీద వేసిన వ్యాట్ జీఎస్టీ, సెస్ పన్నులు రద్దు చేయాలని.. జరిమానాలు పెంచే జీవో నంబర్ 21, 31 రద్దు చేయాలన్నారు. ఆటోలు, వ్యాన్లు, కార్లు, జీపులపై ఉన్న పోలీస్ ఆర్టీవో ఈ చలనాలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జరిగే జైల్ భరో కార్యక్రమంలో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నా రు. గౌరవ అధ్యక్షులుగా ఈ.తిరుపతిరావు, కన్వీనర్గా వి.ఎస్.సురేష్, కో–కన్వీనర్గా డి. యోగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా రాము, సూరాల గోపి, రమణమూర్తి, రాజు, సూరిబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కవిటి: మండలంలోని జాడుపుడి జంక్షన్ సమీపంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమా దం తప్పింది. స్థానికులు అందించిన సమాచా రం ప్రకారం.. హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న లాంగ్ లగేజీ లారీని అదేమార్గంలో వెళ్తున్న బొలేరో పికప్ వాహనం ఢీకొంది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో బొలేరో వాహనం టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో వాహనం అదుపుతప్పి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ రూటు మారి డివైడర్ పైకి ఎక్కేసింది. దీంతో లారీపై ఉన్న లగేజీ చెల్లాచెదురుగా పడ్డాయి. రోడ్డును క్లియర్ చేసే క్రమంలో రోడ్డుపై పడిన సామగ్రిని ప్రొక్లెయిన ర్ల సాయంతో తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు వెంటవెంటనే ప్రారంభించా రు. కవిటి పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో వెళ్లి పరిశీలించారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): తెలగ సామాజిక వర్గమంతా ఐక్యతగా ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా తెలగ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. నగరంలోని తెలగ సంక్షేమ భవనంలో జిల్లా అధ్యక్షుడు పిల్లల నీలాద్రిరావు అధ్యక్షతన సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సామాజిక వర్గ అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది నాయకులు చిత్తశుద్ధిగా పనిచేశారని, అయితే ఇంకా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్న తెలగ కులానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రగతి ఫలాలు పూర్తిగా అందడం లేదన్నారు. సంఘ భవనానికి స్థల దాతలైన దివంగత దూస ఆదినారాయణరావు, దూస సరోజిని దంపతులకు నివాళులర్పించారు. స్థల దాత కుమార్తె రజని మరో రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. సమావేశంలో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇండుగు లక్ష్మీనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు దయానంద్ మాస్టారు, విశ్రాంత మెజిస్ట్రేట్ శ్యామ్, నిర్మాణ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరసింహనాయుడు, జి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. హిరమండలం: ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులో నాబార్డు భాగస్వామ్యం అయ్యిందని సీజీఎం గోపా ల్ తెలిపారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు తాగునీటిని అందించేందుకు ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.700 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు నాబార్డు రూ.124 కోట్లు సమకూర్చింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనుల పనితీరును సీజీఎంతో కూడిన అధికారుల బృందం శనివారం పరిశీలించింది. వంశధార రిజర్వాయర్ వద్ద చేపడుతున్న ఇంటెక్ వెల్, పంపు హౌస్, 529 మీటర్ల అప్రోచ్ బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్తో పాటు అక్కడి నిర్మాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీజీఎం గోపాల్ మాట్లాడుతూ పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో కిడ్నీ వ్యాధుల దృష్ట్యా సురక్షిత నీటిని అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకం మంజూరైన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి పథకంలో నాబార్డు భాగస్వామ్యంగా ఉన్నందున ఆనందం వ్యక్తం చేశారు. -
సాఫ్ట్బాల్ను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: సాఫ్ట్బాల్ క్రీడను దేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయి(గ్రామీణ ప్రాంతాల)కి తీసుకెళ్లాలని ఇండియన్ సాఫ్ట్బాల్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ అనోకర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని క్రిస్టల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వేదికగా జరుగుతున్న రెండు రోజుల ఏపీ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ సెమినార్ కమ్ అంపైర్స్ క్లినిక్ కార్యక్రమం శనివారం సాయంత్రం ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి సాఫ్ట్బాల్ సంఘాల ప్రతినిధులు, అంపైర్లు, టెక్నికల్ అఫీషియల్స్, కోచ్లు సుమారు 120 మంది వరకు ఈ సెమినార్కు హాజరయ్యారు. ఏపీ సాఫ్ట్బాల్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కూన రవికుమార్, ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రవీణ్ అనోకర్ మాట్లాడుతూ ప్రస్తుతం సాఫ్ట్బాల్ క్రీడ అత్యంత ఆదరణ పొందుతున్న క్రీడగా గుర్తింపు పొందుతోందని సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో సంఘ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
నోటిఫికేషన్ వెల్లడి
మొద్దు నిద్ర వీడి..డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాల కు విద్యార్థులు ఆన్లైన్లో వెంటనే దరఖాస్తులు చేసుకోవాలి. ఈనెల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులు, సౌకర్యా లు అందుబాటులో ఉన్నాయి. కాలేజీల గుర్తింపుతోపాటు, అక్కడి పరిస్థితులు, వసతులు, సౌకర్యాలు, ఫ్యాకల్టీని పరిగణలోకి తీసుకుని కాలేజీలను వెబ్ ఆప్షన్లో ఎంచుకోవాలి. – డాక్టర్ ఎన్.ఎస్.ఎన్.స్వామి, ప్రిన్సిపాల్, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలశ్రీకాకుళం న్యూకాలనీ: ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం మొద్దునిద్రను వీడింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై.. డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ కోసం మూడున్నర నెలలగా ఎదురుచూస్తూ విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్న విషయం తెలిసిందే. డిగ్రీ నోటిఫికేషన్ కోసం జరుగుతున్న జాప్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు తున్న నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఈ మేరకు 2026–27 కొత్త విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇదిలా ఉండగా 2026–27 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ ప్రవేశాల కాలేజీయేట్ ఎడ్యుకేషన్ వెల్లడించిన మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ విద్యార్థులు రూ.400లు, బీసీ రూ.300లు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.200లు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడున్నర నెలల ఎదురుచూపులు వాస్తవానికి ఉన్నత విద్యా వ్యవస్థపై శీతకన్నేసిన కూటమి ప్రభుత్వం.. డిగ్రీ ప్రవేశాల విషయంలో నూ తన ఉదాశీన వైఖరిని మరోసారి ప్రదర్శించింది. సకల శాఖల మంత్రిగా చలామణీ అవుతున్న నారా లోకేష్ తన విద్యాశాఖను గాలికొదిలేస్తుండ డం వల్ల మూడున్నర నెలలు(100 రోజులు పైబడి)పాటు నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరిగిందని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పాఠశా ల విద్యను అస్తవ్యస్తం చేస్తున్న ప్రభుత్వం.. కళాశా ల విద్య, సాంకేతిక విద్యను కనీసం పట్టించుకుకు న్న పాపాన పోవడం లేదు. ప్రతిపక్షం, విద్యావేత్త లు, విద్యార్థి సంఘాలు, కాలేజీల నుంచి తీవ్రస్థాయిలో డిమాండ్లు, విమర్శలు రావడంతో ఎట్టకేలకు ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో 102 డిగ్రీ కళాశాల లు ఉన్నాయి. వీటిలో 15 ప్రభుత్వ, 87 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 28 వేలు వరకు సీట్లు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు జిల్లా నుంచి 20 వేల వరకు సీట్లు నిండేవి. కానీ గతేడాది ఈ సంఖ్య పది వేలకు పడిపోయింది. కొన్ని ప్రైవేట్ కళాశాల ల్లో ప్రవేశాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ప్రభు త్వ కళాశాలల్లో సైతం గతంలో పోలిస్తే ప్రవేశాలు చాలావరకు తగ్గిపోయాయి. దీంతో కొన్ని సబ్జెక్టుల కాంబినేషన్ కోర్సులు మూసివేసే దిశగా ఉన్నాయి. వీటన్నింటికీ తోడు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను సక్రమంగా అమలు చేయకపోతుండడంతో విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఈనెల 5న నోటిఫికేషన్ వెలువడగా.. 11వ తేదీ వరకు ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తు లు చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు చేపించుకోవాలి. ఆగస్టు 15 నుంచి 19 వరకు ఎంపిక చేసుకునే కాలేజీతోపాటు ఎంచుకున్న కోర్సులకు వెబ్ ఆప్షన్ కు గడువు విధించారు. ఆగస్టు 26వ తేదీన విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుంది. వారి రిజిస్టర్ మొబైల్ నంబర్కు మెసేజ్ వస్తుంది. ఆగస్టు 27వ తేదీ నుంచి క్లాసులు మొదలు కానున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్దేశించిన షెడ్యూ ల్ ప్రకారం విద్యార్థుల ప్రవేశాలు, సీట్ల కేటాయింపులు జరుగుతాయి. ఈ నెల 15 నుంచి 29 వరకు వెబ్ ఆప్షన్స్కు ఛాన్స్ ఉంది. 26వ తేదీన సీట్ల కేటాయింపు, 27వ తేదీన నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. – డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు, ప్రిన్సిపాల్, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల -
ఊసరవెల్లిలా..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల ఉత్తర్వులివి. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులకు గురి చేశారని కేజీబీవీ ప్రిన్సిపాల్గా పనిచేసిన రేజేటి సౌమ్య జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయగా కేసు రిజిస్టర్ చేసింది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ యాక్షన్ టేకెన్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ●పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్గా పనిచేసిన రేజేటి సౌమ్యను ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులకు గురి చేసిన ఘటనలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అప్పట్లో ఎంఎల్సీ అయింది. ఆమె నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. కానీ కేసు పెట్టలేదు. దీంతో బాధితురాలు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశా రు. ఆ ఫిర్యాదుపై విచారణ జరిపి, యాక్షన్ టేకెన్ రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్, ఎస్పీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినా స్పందన లేదు. ●మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో జనాల రద్దీ మధ్య ఇబ్బంది పడుతున్నారని మహి ళా ఎస్ఐ ప్రవళ్లికను జాగ్రత్తగా పక్కకు తీసుకెళ్తే అది నేరంగా పరిగణించారు. అంతటితో ఆగకుండా నాన్బెయిల్ సెక్షన్లు పెట్టేసి, సంబంధం లేని వారందరినీ వేధిస్తున్నారు. ●పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్లో ఒకరు చనిపోతే మర్డర్ కేసు నమోదు చేశారు. కానీ రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకను ఇద్దరు యువకులు కారుతో ఢీ కొట్టిన విషయాన్ని తొలుత పోలీసులు తేలికగా తీసుకున్నారు. మూడు రోజులు గా రాష్ట్ర మంతటా గొల్లుమన్న తరువాత నిందితులపై సీరియస్ సెక్షన్లు నమోదు చేశారు. ●ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ కారు ఢీకొట్టగా ఒకరు చనిపోతే వారిపై కేసు నమోదు కాలే దు. అలాగే పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు కారు ఢీకొట్టడంతో ఒకరు చనిపోగా, నలుగురి గాయాలైతే వారిపైనా కేసు నమోదు కాలేదు. మందస పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్షుడు గార కృష్ణారావు ఆటో ఢీకొట్టడంతో నర్తు వెంకటరమణ అనే వ్యక్తి చనిపోతే అక్కడా కేసు నమోదు కాలేదు. కానీ టీడీపీ ప్రత్యర్థుల వలన దురదృష్టవశాత్తు అటువంటి ప్రమాదాలు జరిగితే మాత్రం హత్య కేసులు నమోదు చేస్తున్నారు. ●పలాస పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిపై పోలీస్ స్టేషన్లోనే టీడీపీ నాయకులు దాడి చేస్తే నో కేస్. ●ఎచ్చెర్లలోని సాక్షి ప్రధాన కార్యాలయంపై కేంద్ర, రాష్ట్రమంత్రుల బంధువు మెండ దాసునాయుడు తదితరులు దాడి చేసి ధ్వంసానికి దిగితే నో కేస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు ఉన్నాయి. చట్టం అందరికీ ఒక్కటి కాదనే ఆందోళన నెలకొంటోంది. వాస్తవానికి చట్టం ముందు అంద రూ సమానమే. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఒకే నిబంధన వర్తించాలి. కానీ క్షేత్రస్థాయి లో అధికార పార్టీ నేతలు, కార్యకర్తల విషయంలో పోలీసులు వ్యవహరించే తీరు ఒకలా.. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు విషయంలో అనుసరించే విధా నం మరోలా ఉంది. ప్రతిపక్ష నేతలు ఆందోళనలు, నిరసనలు చేపడితే మందుస్తు నోటీసులు, నిర్బంధాలు, కేసులు, అరెస్టులతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అదే అధికార పార్టీ నేతల విషయంలో ఉదాసీనంగా ఉంటున్నారు. అక్రమ కేసులతో వేధింపులు పోలీసులు చట్టం ప్రకారం పనిచేయాలి. అధికార పార్టీ జెండా చూసి చట్టం మారకూడదు. కానీ జిల్లా పోలీసు అధికారులు ప్రస్తుతం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు చెప్పినట్టుగానే కేసులుంటున్నాయి. నిందితులుగా ఎవరిని పెట్టా లో అధికార పార్టీ డిసైడ్ చేస్తోంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ లో లేని సీదిరిపై కూడా హత్య కేసు పెట్టారు. వైఎస్ జగన్ పర్యటనలో స్వచ్ఛందంగా జనాలు తండోపతండాలుగా వస్తే నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. -
పెన్షన్ వాలిడేషన్ బిల్లును రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కేంద్ర ప్రభుత్వం పెన్షన్ వాలిడేషన్ బిల్లును వెంటనే రద్దు చేయాలని పెన్షన ర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో బొడ్డేపల్లి జనార్ధనరావు అధ్యక్షతన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రధాన కార్యద ర్శి మణికొండ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ .. ఈపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, కార్మికు లు దాచుకున్న సుమారు రూ.13 లక్షల కోట్ల ఈపీఎఫ్ ఫండ్ను కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం దారాదత్తం చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభు త్వం వెంటనే 12వ పీఆర్సీని నియమించి, 30 శాతం ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు దొంతం పార్వతీశం, కోశాధికారి పి.సుధాకర్, ఉపాధ్యక్షుడు బి.నర సింహరావు, కార్యదర్శులు కె.చంద్రశేఖరరావు, బి. సూర్యనారాయణ, బి.లక్ష్మణరావు, ఎల్.అనంతరా వు, సీహెచ్ శ్రీనివాసరావు, సీహెచ్ సూర్యనారాయ ణ, బి.సూర్యరావు, పి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రవిని కమ్మేసిన చీకటి
శ్రీకాకుళంఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి మూడో రోజుకు చేరాయి. –8లోచీకటి పాలన పరాకాష్టకు చేరింది. అక్రమ అరెస్టుల అరాచకం రాజ్యమేలుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం ముందు చట్టం చట్టుబండలవుతోంది. మొన్నటికి మొన్న రోడ్డు ప్రమాదం కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఇరికించి జైలుపాలు చేసిన పోలీసులు.. ఇప్పుడు వైఎస్సార్సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ను అదేరీతిలో చీకటి మాటున అదుపులోకి తీసుకుని అజ్ఞాత ప్రదేశానికి తరలించారు. తనపై నమోదైన అక్రమ కేసులో న్యాయపరంగా పోరాడాలన్న ఉద్దేశంతో పోలీసులకు లొంగిపోయేందుకు వస్తున్న అతన్ని.. దారిలోనే కాపు కాసి అదుపులోకి తీసుకోవడం వేధింపులకు గురి చేయాలన్న కుట్రకు నిదర్శనం. -
ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
హిరమండలం: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం నుంచి బత్తిలి వెళ్తున్న బస్సు గురువారం రాత్రి పాత హిరమండలంలోని కొత్త గౌడవీధి వద్ద ఒక్కసారిగా అదుపు తప్పింది. వర్షం పడుతున్న సమయంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. మట్టిలో కూరుకుపోయి నిలిచిపోయింది. ఆ సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా కుదుపునకు గురికావడంతో ఆందోళనకు గురయ్యారు. మట్టిలో కూరుకుపోయి నిలిచిపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. శుక్రవారం జేసీబీ సాయంతో గ్రామస్తులు బస్సును గోతి నుంచి బయటకు తీశారు. -
పేరు ‘సమగ్ర’ం.. తీరు అసమగ్రం
● సమగ్ర శిక్ష ప్రాజెక్టులో లెక్కల చిక్కులు ● రెండు నెలలుగా జీతాలు, బిల్లులు చెల్లించలేని దుస్థితి శ్రీకాకుళం: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు ఏర్పాటైన సమగ్ర శిక్ష ప్రాజెక్టు.. అధికారుల నిర్లక్ష్యం వల్ల అసమగ్రంగా తయారైంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఈ ప్రాజెక్టు జిల్లాలో ని పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. ఇలాంటి ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన రాష్ట్ర అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రాజెక్ట్ రెన్యువల్ ఆలస్యమైంది. కేంద్రం ఈ ప్రాజెక్టుకు విడుదల చేసిన నిధులకు సంబంధించిన లెక్కలను ఏటా ఏప్రిల్, మే నెలలో కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుంది. రాష్ట్ర సమగ్ర శిక్షా అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి జూన్ నెలలో కూడా నివేదిక పంపకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టు రెన్యువల్ను నిలుపుదల చేసింది. దేశంలో ఐదు రాష్ట్రాలు రెన్యువల్ కాకుండా ఉండిపోగా అందులో మన రాష్ట్రం కూడా ఉంది. కేంద్ర నిధులు విడుదల కాకపోవడంతో గడిచిన రెండు నెలలుగా సమగ్ర శిక్షలో లావాదేవీలన్నీ నిలిచిపోయాయి. ఉద్యోగులకు జీతాలు, వెండర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జూన్లో పిల్లల ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. జీతాలు పడకపోవడంతో అప్పులు చేసి నెట్టుకురావాల్సి వస్తోంది. పెరిగిన నిత్యావసర ధరలు అనునిత్యం వీరికి పరీక్ష పెడుతున్నాయి. ఎట్టకేలకు జూన్ మూడో వారంలో కేంద్రానికి లెక్కలను చెప్పడంతో సమగ్ర శిక్ష ప్రాజెక్టును మరో ఐదేళ్లకు రెన్యువల్ చేసింది. దీంతో నిధులు విడుదలకు మార్గం సుగమం అయినప్పటికీ కేంద్ర నిధులు విడుదల కాలేదు. దీంతో జూలైలోనూ ఇబ్బందులు తప్పలేదు. -
శివార్
పోలాకి: ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాలు లేకపోవటంతో శివారు కాలువల పరిధిలో సాగునీటి కష్టాలు తప్పటం లేదు. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లతో వంశధార అధికారులు పైనున్న ఆయకట్టుకు నీటితడి అందకుండానే కిందకు తరలించే ప్రయత్నాలు చేయడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అందులోనూ వంశధార సాగునీటి ప్రాజెక్టు తీర్మానాలతో నిర్మాణం చేపట్టిన డ్రాపులు పగలగొట్టి కిందకు నీటిని తరలించడంతో మేఘవరం చానెల్పై రేగుపాడు బూసయ్య డ్రాపు వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. డీఎల్పురం చానెల్, 16ఆర్ (ప్రియాగ్రహారం) తోపాటు దాదాపు 8వేల ఎకరాలు ఆయకట్టుకు సాగునీరు అందించటంలో ఈ డ్రాపు ప్రధానమైంది. అలాంటి డ్రాపును జేసీబీతో వంశధార సిబ్బంది తొలగించటంపై రైతుల్లో ఆగ్ర హం కట్టలు తెంచుకుంది. కేవలం మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోని శివారు గ్రామాలకు నీరందించాలనే అధికారులు పనిచేస్తున్నారని రైతులు ఆరోపణలు చేశారు. ఆయకట్టు పరిధిలోని రైతులు అక్కడకు చేరుకుని డ్రాపు తొలగించిన చోటే తాత్కాలిక ఇనుప రేకుతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుని నీటిని నిలువరించారు. ఈ పరిణామాన్ని వంశధార అధికారులు ఊహించలేదు. దీంతో కిందనున్న రైతుల నుంచి అధికారులపై ఒత్తిడి పెరిగింది. దీంతో పోలాకి తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్ఐ రంజిత్ అక్కడకు చేరుకుని రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. డ్రాపును మళ్లీ నిర్మించేందుకు వంశధార సిబ్బంది హామీ ఇచ్చారని చెప్పటంతో శాంతించారు. -
వర్షాభావంలో ఆరుతడి పంటలే మేలు
కంచిలి: ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలు వేయడమే శ్రేయస్కరమని శ్రీకాకుళం జిల్లా రైతు శిక్షణ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ వెంకటరావు పేర్కొన్నారు. మండలంలోని కొల్లూరు రైతుసేవ కేంద్రం పరిధిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్న మీ కోసం కా ర్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో ఇప్పటికే వరి వేసి ఉన్న పంట పొలాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఆత్మ పథకంలో భా గంగా కొల్లరు గ్రామంలో ఎల్నినో ప్రభావం, పంటల మార్పిడిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్, వ్యవసాయ పరిశోధన స్థానం రాగోలు శాస్త్రవేత్త డాక్టర్ ఉదయబాబు, మండల వ్యవసాయాఽధికారి కొంకేన సురేష్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మెరుగు పేరుతో మోసం
కొత్తూరు: కొత్తూరు మండలం కర్లెమ్మ పంచాయతీ పరిధి అఫీషియల్ కాలనీ కి చెందిన ఓ మహిళ మెరుగు బ్యాచ్ చేతిలో మోసపోయారు. పోలీసు లు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 6వ తేదీన అఫీషియల్ కాలనీకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బంగారం మెరుగు పెడతామని వచ్చారు. కాలనీలోని పొట్నూరు శివకుమారి ఇంటికి వెళ్లి బంగారు ఆభరణాలకు మీ ఇంటి వద్దే, మీ సమక్షంలో మెరుగు పెడతామని చెప్పగా ఆమె ఒప్పకోలేదు. అయినా వారు వినకుండా ఆమెకు నచ్చజెప్పారు. అప్పటికి శివకుమారి ఇంటిలో సామాన్లు సర్దుతు న్నారు. ఓ రాగి బిందెకు వారు మెరుగు పెట్టడంతో.. అది బాగుందని సామాన్లు సర్దుతున్న మనీషా, రాధలకు చెందిన వెండిపట్టీలు మెరుగుకు ఇచ్చారు. అవి బాగా మెరుగు పెట్టడంతో శివకుమారి తన రెండు తులాల బంగారు పుస్తెలతాడు మెరుగు పెట్టాలని దుండగులకు ఇచ్చారు. రాగి బిందెలో పుస్తెలతాడు వేసి కొన్ని రకాల రసాయనాలు వేసి వేడి చేయాలని శివకుమారికి దుండగులు చెప్పారు. తానే వేడి చేస్తానని శివకుమారి చెప్పి తన ఇంటి వంట గదిలోకి రాగి బిందెను తీసుకెళ్లారు. ఆమెతో పాటు దుండగుల్లో ఒక రు వంట గదికి వెళ్లారు. రాగి బిందెలో ఒక రకం పౌడర్ వేయాలని ఆమెకు చెప్పి చాకచక్యంగా ఆమెను వెనక్కి నెట్టి బిందెలో ఉన్న పుస్తెల తాడు తీసుకుని బయటకు వచ్చేశాడు. బిందెలో ఉన్న పుస్తెల తాడును కొంత సమయం అలాగే ఉంచాలని చెప్పి ఇద్దరూ జారుకున్నారు. కాసేపటి తర్వాత ఆమె బిందెను చూడగా అందులో పుస్తెల తాడు లేకపోవడంతో అవాక్కయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు శివకుమారి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు శుక్రవారం స్థానిక ఏఎస్ఐ గోవిందరావు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబరు 5న నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవం (గురుపూజోత్సవం) సందర్భంగా అందించే ‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల’ కోసం అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 8 నుంచి 15 వరకు మాత్రమే సమర్పించాలని తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను స్థానిక మండల విద్యాశాఖ అధికారుల ద్వారా సమర్పించాలని, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను సంబంధిత ఉప విద్యాశాఖ అధికారుల ద్వారా అందజేయాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల జాబితాను ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి వెల్లడించారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ క్రీడామైదానం వేదికగా ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2026 పోటీల్లో పాల్గొనే 76 మంది క్రీడాకారుల జాబితాను ప్రకటించారు. అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 బాలబాలికల వయో విభాగాల్లో జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనే అథ్లెట్స్ ఈనెల 9వ తేదీన రాత్రి 9 గంటలకు తమ లగేజీతోపాటు పత్రాలు, మూడు పాస్ ఫొటోలతో ఆమదాలవలస రైల్వేస్టేషన్ వద్ద సంఘ ప్రతినిధులు కె. మాధవరావు, చల్లా తవిటిరాజుల వద్ద రిపోర్ట్ చేయాలని మధుసూదన్, సాంబమూర్తి కోరా రు. మరిన్ని వివరాలకు 8500271575 నంబర్ ను సంప్రదించాలని వారు సూచించారు. ఆమదాలవలస: వైఎస్సార్సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవిపై నమోదైన కేసు విషయంలో పోలీసుల వైఖరి విస్తు గొలుపు తోంది. విచారణ పేరుతో ఆయన కుటుంబ సభ్యులు, సహచరులు, మహిళలను స్టేషన్కు తరలించి వేధిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను సైతం స్టేషన్కు పిలిపించి గంటల తరబడి నించోబెడుతున్నా రని బాధితులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపా రు. తాజాగా నలుగురిని పోలీసులు అదుపులో కి తీసుకున్నట్లు సమాచారం. జలుమూరు: శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆ దాయం గత రెండు నెలలది శుక్రవారం లెక్కించారు. హుండీలో రూ.2,58,628గా వచ్చినట్లు ఆలయ ఈఓ కె.ఏడు కొండలు తెలిపారు. ఈ లెక్కింపులో ఆలయ చైర్మన్ శివకుమార్ పాడి, మందస ఈఓ ఎస్.నాగేశ్వరరావు, అర్చకులు శేషాద్రి వెంకటాచలం భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశా రు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘డయల్ యువర్ ఎస్పీ – పోలీస్ గ్రీవెన్స్’ కా ర్యక్రమం నిర్వహించి సిబ్బంది, అధికారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మందస: మందస రోడ్డు సమీపంలో గూడ్స్ రైలుకు వెనుక భాగంలో ఉన్న చివరి వ్యాగన్ పట్టాలు తప్పి చక్రం విరిగింది. శుక్రవారం ఉదయం మందస రైల్వే స్టేషన్ బాలిగాం సమీపంలో ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తు న్న గూడ్స్ రైలు వెనుక వ్యాగన్ పట్టాలు తప్పింది. రైల్వే సిబ్బంది అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో రైల్వే ఇంజి నీరింగ్ అధికారులు, సాంకేతిక బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చా రు. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
నరసన్నపేట: స్థానిక మెయిన్ రోడ్డులో పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ ఎదురుగా డివైడర్కు ద్విచక్ర వాహనం ఢీ కొన్న ప్రమాదంలో స్థానిక హ డ్కో కాలనీకి చెందిన గుడ్ల శ్రీనివాసరావు(55) మృతి చెందారు. గురువారం రాత్రి ప్రమాదం జరగ్గా స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలిస్తుండగా మార్గం మధ్యలో 108 వాహనంలో మృతి చెందారు. ఈ ప్రమాదంపై శ్రీనివాసరావు బార్య గుడ్ల శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. శ్రీనివాసరావు మృతిపై వైఎస్సార్ సీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు పొట్నూరు సాయి ప్రసాద్, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు దండి జయప్రకాశ్ సంతాపం వ్యక్తం చేశారు. కంబకాయ వాసి.. నరసన్నపేట: కంబకాయకు చెందిన లింగిబైరి వైకుంఠరావు(19) రోడ్డు ప్రమాదంలో గాయ పడి చికిత్స పొందుతూ కేజీహెచ్లో శుక్రవారం మృతి చెందాడు. కాకినాడ పీఆర్ కళాశాలలో బీఎస్సీ మూ డో సంవత్సరం చదువుతున్న వైకుంఠరావు తన స్నేహితులతో కలసి బొలేరే వాహనంలో ఒక ఫంక్షన్కు జూలై 29న బయల్దేరారు. ప్రయాణంలో వా హనం బోల్తా పడి తలకు బలమైన గాయం కా వడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, హేమలత కన్నీరు మున్నీరయ్యారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని..శ్రీకాకుళం రూరల్: సింగుపురం పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి వద్ద శుక్రవారం వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని పచ్చళ్ల వ్యాపారి చిన్నారి సత్యనారాయణ (74) మృతి చెందారు. పిఠాపురానికి చెందిన సత్యనారాయణ శ్రీకాకుళం నగరంలో పచ్చళ్ల వ్యాపారం నిర్వహిస్తున్నా రు. తీవ్రంగా గాయపడిన ఆయనను 108లో రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. రూరల్ ఎస్ఐ రామారావు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారికి ప్రాణాపాయం.. దాతలపైనే భారం
కవిటి: అతను ఓ రోజు కూలి. ఏ రోజు పని చేస్తే ఆ రోజు కడుపు నిండే పరిస్థితి. కష్ట పడడం కడుపు నింపుకోవడం తప్ప పొదుపు అంటూ లేని దుస్థితి. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు పాము కా టు బారిన పడింది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో ఉంది. కన్న బిడ్డ అలా కదల్లేని స్థితిలో ఉండడం చూసి తండ్రికి కాళ్లు చేతులు ఆడడం లేదు. వివరాల్లోకి వెళితే.. కవిటి మండలం మడియారపుట్టుగకు చెందిన దుక్క రాజు కుమార్తె హారతి పా ము కాటుకు గురైంది. ప్రస్తుతం శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రిలో అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారు. కానీ చికిత్స ఖర్చును భరించే స్థోమత రాజుకు లేదు. రోజు కూలిగా పనిచేస్తున్న తనకు వైద్యం ఖర్చు భరించడం తలకు మించిన భారమవుతోందని, దాతలు స్పందించి తన కూతురి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. సాయం చేయదలచుకున్న వారు 9515977206 నంబర్ను సంప్రదించాలని కోరుతున్నారు. -
పోస్టాఫీసు స్థలం అన్యాక్రాంతంపై చర్యలు
కవిటి : కవిటిలో రూ.కోట్ల విలువ కలిగిన సబ్పోస్టాఫీస్ స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడుకునేందుకు సంబంధిత శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ అంశంపై గురువారం ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించిన సోంపేట సబ్డివిజనల్ పోస్టల్ ఇనస్పెక్టర్ కామేష్చంద్రపాత్రో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కవిటిలో స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆ స్థలంలో నిలుపుదల చేసిన వాహనాలను, వివిధ సామగ్రిని సంబంధిత వ్యక్తులకు చెప్పి తొలగించారు. ఈ స్థలం పోస్టాఫీసు శాఖకు సంబంధించినదని, ఇకపై ప్రైవేట్ వ్యక్తులు ఈ స్థలంలో వాహనాలు నిలుపుదల చేయడం వద్దని తెలిపారు. గేట్ తాళాలు వేయించి జిల్లా అధికారులకు సమాచారం తెలియపర్చనున్నట్టు తెలిపారు. -
భోగాపురంలో ఉద్యోగాల పేరిట మోసం
శ్రీకాకుళం క్రైమ్: భోగాపురం విమానాశ్రయంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికిన ఓ ముఠా వందల మందికి టోకరా వేసేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే 70 మంది యువత వద్ద కొంతమేర వసూలు చేసినట్లు రెండో పట్టణ పోలీసులకు తెలియడంతో రంగప్రవేశం చేశారు. జీటీరోడ్డులోని డీసీసీబీ సమీప ఫంక్షన్ హాల్లో గురువారం ఈ మేరకు ఇంటర్వ్యూలు సైతం జరిగాయి. వివరాల్లోకి వెళ్తే.. రెండు నెల ల వ్యవధిలో నగరానికి చెందిన దాదాపు 300 మందిని జీటీరోడ్డులోని ఫంక్షన్ హాల్కు రప్పించారు. ఒక్కొక్కరికి అడ్మిషన్ ఫీజు రూ. 2 వేలు, ప్రాసెస్ ఫీజు రూ. 10 వేలు, 6 నెలల కోర్సు కింద రూ. 1.60 లక్షల చొప్పున మొత్తం 70 మంది నిరుద్యోగ యువత వద్ద వసూలు చేసినట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలోని ద్వారకానగర్లో కార్యాలయం ఉందని, తీసుకున్న ఫీజులకు రశీదులు ఇస్తామని చెప్పి ఓ మహిళ ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఆమె మాటలు రోజురోజుకీ అనుమానాన్ని పెంచడంతో కొంతమంది నిరుద్యోగులు రెండో పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ పి.ఈశ్వరరావు ఆ నిర్వాహకులను స్టేషన్కు పిలిచి విచారించారు. బాధితుల నుంచి రాతపూర్వక ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసులు నమోదు చేస్తామని సీఐ పి.ఈశ్వరరావు పేర్కొన్నారు. అరసవల్లి: జిల్లాలో సంచలనమైన పైడిభీమవరం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియో గం వ్యవహారంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమించింది. పైడిభీమవరంలో సుమారుగా రూ.7.50 కోట్ల వరకు పంచాయతీ నిధులు దు ర్వినియోగం జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచా యతీ కార్యదర్శి అజయ్ తీవ్ర అనారోగ్యం కా రణంగా రికార్డులను చూపించే పరిస్థితి లేదని ఉన్నతాఽధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఏడుగురు అధికారులతో కూడిన బృందం పంచాయతీకి చెందిన అన్ని రికార్డులను స్వయంగా పరిశీలించి నిధుల వినియోగంపై నివేదిక ఇవ్వనున్నారు. పంచాయతీరాజ్ చీఫ్ ఇంజినీర్ విజయకుమారి, విశాఖ జిల్లా పరిష త్ సీఈఓ నారాయణమూర్తి, జాయింట్ డైరక్టర్ పంచాయతీరాజ్ కమిషనరేట్ ఎన్.రామనాథరెడ్డి, క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ రఘురామిరెడ్డి, క్వాలిటీ కంట్రోల్ డీఈ సత్యన్నారాయణ, డీడీ ఓ (పలాస) ఎం.సతీష్, డీఎల్పీఓ ఏఓ చక్రవర్తి, గ్రేడ్–1 పీడీఓ తిరుపతిరావు, జూనియర్ అసిస్టెంట్ పి.లోకేశ్వరరావు (టెక్కలి) లతో కూడిన బృందం ఏప్రిల్ 01, 2024 నుంచి నేటి వరకు గ్రామ పంచాయతీలో జరిగిన పనులు, నిధుల మంజూరు, వినియోగాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు రికార్డులను వెరిఫికేషన్ చేయనున్నారు. ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి ‘సాక్షి’ వద్ద ధ్రువీకరించారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద నిరంతర నిఘా పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని చెక్పోస్టుల వద్ద నిషేధిత పదార్థాలైన గంజాయి, సారా, మద్యం అక్రమ రవాణ జరగకుండా నిరంతరం నిఘా పెట్టాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుర్జీత్ సింగ్ సిబ్బందికి సూచించారు. పాతపట్నం ఆర్టిసీ కాంప్లెక్స్ సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ను, మెళియాపుట్టి మండలం వసుంధర చెక్పోస్టును, పాతపట్నం ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ను గురువారం సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. పాతపట్నం, వసుంధర చెక్పోస్టులో వాహనాల నంబర్లు పుస్తకం సక్రమంగా నమోదు చేయాలని, సిబ్బంది పనితీరు మెరుగుపడాలన్నారు. పాతపట్నం పరిధిలోని బి కేటగిరిలో ఉన్న బొన్ని, కోణంగి, పూతికగూడ, చాపరాయిగూడ గ్రామాల్లో నాటు సారా అమ్మకాలు పూర్తిస్థాయిలో నిరోధించామని తెలిపారు. ఆర్టీసీ బస్సులో గొడవ టెక్కలి రూరల్: టెక్కలి నుంచి వైజాగ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గురువారం మహిళల మధ్య గొడవ జరిగింది. టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు ఎక్కిన మహిళలు సీటు కోసం గొడవకు దిగారు. దీంతో బస్సులో ఉన్న మిగిలిన ప్ర యాణికులకు ఆటంకం కలుగుతుండటంతో డ్రైవర్ బస్సును నేరుగా టెక్కలి పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ పోలీసులు బస్సులో గొడవ పడుతున్న సుమారు 20 మంది మహిళలను బస్సు నుంచి కిందకు దింపి ఆ బస్సును పంపించేశారు. అనంతరం ఆ మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. -
నిఘా.. దగా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నిఘా ముసుగులో ఓ విభాగం వసూళ్ల దందా సాగిస్తోంది. కీలక నేత సోదరుడు పెత్తనం చెలాయిస్తున్న ఆ విభాగం బరితెగించి ముడుపులు దండుకుంటోంది. నిత్యం ఏదో ఒక రంగానికి చెందిన వ్యాపారుల ముక్కుపిండి వసూలు చేస్తున్న సంబంధిత అధికారులు ప్రస్తుతం ఎరువుల దుకాణాలపై పడ్డారు. ఇప్పుడంతా ఎరువుల సీజన్ కావడంతో ఇదే అదునుగా తీసుకుని ప్రాంతానికి ఒకరిని బ్రోకర్గా పెట్టి వసూలు చేయిస్తున్నారు. అడ్డగోలు బాగోతానికి పెద్ద వ్యాపారులు సహకరిస్తున్నా.. చిన్న వ్యాపారులు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో ఓ నిఘా వ్యవస్థ అక్రమ దందాకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. పర్యవేక్షణ ముసుగులో సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాపారం లెక్కలు తేల్చేస్తాం, లొసుగులు బయటపెడతాం అంటూ బ్లాక్మెయిల్ చేస్తూ వసూళ్ల దందా సాగిస్తున్నారు. సీజనల్ వారీగా వ్యాపారులను దోచుకుంటున్నారు. ధాన్యం సేకరణ సమయంలో మిల్లర్ల నుంచి తవ్వకాలు, రవాణా పేరుతో గ్రానైట్ కంపెనీల నుంచి, నిల్వల పేరుతో వివిధ వ్యాపారుల ద గ్గరి నుంచి, ఆకస్మిక తనిఖీల పేరుతో మరికొందరి నుంచి ముడుపులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎరువుల సీజన్ కావడంతో ఎరువుల వ్యాపారులపై పడ్డారు. జిల్లాలో 270కి పైగా ఎరువుల దుకా ణాలుండగా, ప్రతి దుకాణం నుంచి రూ.10వేలు ఇవ్వాల్సిందే అని హుకుం జారీ చేశారు. దాని కోసం సంబంధిత వ్యాపారుల్లోని ఒకర్ని బ్రోకర్గా పెట్టుకున్నారు. వారి చేత ఆ ప్రాంతంలో ఉన్న వ్యా పారులందరి దగ్గరి నుంచి వసూలు చేయిస్తున్నారు. ఎవరైనా ఇవ్వకపోతే తమ పేరు చెప్పండని సదరు బ్రోకర్లకు చెప్పడంతో చెలరేగిపోతున్నారు. ఆ నిఘా వ్యవస్థ ముసుగులో బ్రోకర్లు కూడా కొంత అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ వసూళ్ల దందాకు పెద్దల అండదండలుండంతో బరి తెగించేశారు. ఆ నిఘా వ్యవస్థపై ఓ కీలక నేత సోదరుడు అజమాయిషీ ఉండటంతో వ్యాపారులు కూడా భ యపడుతున్న పరిస్థితి నెలకొంది. కాదంటే టార్గెట్ చేస్తారేమో అని కక్కలేక, మింగలేక సతమతమవుతున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన వారే చేతు లు చాపుతున్నారు. కంచె చేను మేసినట్టు అవినీతికి పాల్పడుతున్నారు. వ్యాపారమంటే చిన్నా చితక లొసుగులు ఉండొచ్చు. వాటిని పెద్దవిగా చూపించి కొంప ముంచేస్తారేమో అని బడా వ్యాపారులు అడిగినంత ఇచ్చేస్తున్నా.. చిన్న వ్యాపారులు మాత్రం చితికిపోతామని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తు తం పరిస్థితులు అంత అనుకూలంగా లేవని, ఇ లాంటప్పుడు ఎలా ఇవ్వగలమని బయటకు చెప్పుకోలేక.. లోపల దాచుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి ప్రస్తుతం ముడుపుల డ్రైవ్ కొనసాగుతోంది. వసూలు రాయుళ్ల పంట పండుతోంది. టెక్కలి, కోటబొమ్మాళి, ఆమదాలవలస, పలాస, నరసన్నపేట, రణస్థలం,పాతపట్నం తదితర ప్రాంతాల్లో దీనిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. నిఘా నేత్రం ముసుగులో ముడుపుల పర్వం ఎరువుల దుకాణాల నుంచి అడ్డగోలు వసూళ్లు 270 షాపుల నుంచి మామూళ్లు డిమాండ్ ఒక్కో దుకాణానికి రూ. 10వేలు ఫిక్స్ బెంబేలెత్తిపోతున్న చిరు వ్యాపారులు -
మాజీ మంత్రి సీదిరి కోసం పూజలు
మందస: మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు క్షేమంగా ఉండాలని, త్వరితగతిన విడుదల కావాల ని కోరుతూ మండలంలోని గంగువాడ గ్రామ సముద్ర తీరంలో గంగమ్మ తల్లికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాగర మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు పొట్టి ధర్మారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు గంగమ్మ తల్లిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. ఆయనపై పెట్టిన అక్ర మ కేసులో న్యాయం జరిగి మళ్లీ ప్రజాసేవలో పా ల్గొనే అవకాశం కలగాలని మొక్కుకున్నారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు కొమర దేవరాజు, అంబటి ఆనంద్, పార్టీ నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షుడు బత్తిని లక్ష్మణ్, మాజీ సర్పంచ్ కొమర వాసు, గుంటు లోకనాథం, పొట్టి యర్రయ్య, లైసె ట్టి నారాయణ, నల్ల పరుశురాం, దున్న హరికృష్ణ, తెప్పల గున్నయ్య, జుత్తు నారాయణ, జుత్తు భూపతి, మర్ల సంతోష్, గొలుసు చంద్రశేఖర్, పూలరి పీతాంబరం, బత్తిని తేజేశ్వరరావు, తాడల అప్పలస్వామి, కీలు మోహన్రావు, గుంటు కపిల్, సంగారు కృష్ణారావు, పల్లేటి రూపారావు పాల్గొన్నారు. -
● ఎమర్జెన్సీ డ్రగ్ కొరత
టెక్కలి రూరల్: ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ టెక్కలి జిల్లా ఆస్పత్రిలో ఎమర్జెన్సీ డ్రగ్ అందుబాటులో లేదని పలువురు వాపోతున్నారు. ఆయా సం, గుండె నొప్పి వంటి అత్యవసర కేసులకు ఇవ్వాల్సిన హైడ్రోకార్జిన్ అనే ఇంజెక్షన్ అందుబాటులో లేకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు వాటిని రోగి తాలు కా బంధువులు బయట కొనుగోలు చేసి వేయాల్సి న పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. ఇదే విషయమై ఫార్మసి డిపార్ట్మెంట్ వారి వివరణ కోరగా ఆ డ్రగ్ ఎమర్జెన్సీ సమయంలో వాడుతారని తెలిపారు. అయితే ఆ డ్రగ్ సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా లేకపోవడంతో వాటిని లోకల్ పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుందని తెలిపారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ ఎమర్జెన్సీ డ్రగ్ అందుబాటులో లేకపోవడంతో చాలా మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. -
బొండా ఉమా తీరు సరికాదు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మెగా డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వ ర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరంపై బొండా ఉమా దాడి చేయించడం సరికాదని వైఎస్సార్సీపీ బ్రాహ్మణ విభాగం జిల్లా అధ్యక్షుడు గుమ్మా నగేష్ గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న యువత, మహిళల ను దూర్భాషలాడుతూ, బ్రాహ్మణ సంఘ నేతపై కోడిగుడ్లతో దాడి చేయడం దారుణమన్నారు. బొండా ఉమా రాష్ట్రంలోని బ్రాహ్మణులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
గురుకులాల సమస్యలు పరిష్కరించండి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, అంబేడ్కర్ ఇండియా మిషన్ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రాంబాబు, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకుడు రాకోటి రాంబాబు, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకుడు బైరి ధనరాజ్, మాల మహానాడు జిల్లా నాయకుడు ముచ్చ శ్యాంసుందర్లు అన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్యను గురువారం శ్రీకాకుళం నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోజురోజుకూ విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్నాయని, దీనికి ప్రధాన కారణం అధికారుల పర్యవేక్షణ లోపమేనన్నారు. జిల్లాలో 2026 ఫిబ్రవరి 2న పాతపట్నం గురుకులంలో 7వ తరగతి విద్యార్థిని చింతల పూజ మెట్లపై నుంచి పడి మృతి చెందిన ఘటనకు దాదాపు ఏడు నెలలు గడిచినా, సంబంధిత ప్రిన్సిపాల్తో పాటు బాధ్యులపై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అదే ప్రిన్సిపాల్పై కేసు విచారణ కొనసాగుతుండగానే గ్రేడ్–1 ప్రమోషన్ ఇచ్చి శ్రీకాకుళానికి సమీపంలోని పెద్దపాడు గురుకులానికి ప్రిన్సిపాల్గా నియమించడం తప్పు చేసిన వారిని ప్రోత్సహించడమేనన్నారు. ఇది దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు. వెంటనే ఆమెను సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు తీవ్రంగా పడిపోవడానికి జిల్లా కో–ఆర్డినేటర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ, ఆమెను డీసీవో హోదా నుంచి తప్పించి బదిలీ చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గురుకులాల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులకు గత ఏడు నెలలుగా వేతనాలు చెల్లించలేదని, కనీస వేతనాలు అమలు చేయడం లేదని, ఈపీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టు సంస్థలు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుని కార్మికులకు వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని కోరారు. -
15లోగా ఈకేవైసీ చేయించుకోవాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని వివిధ గ్యాస్ కంపెనీలకు సంబంధించిన వినియోగారులు తప్ప నిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని భారత ప్రభు త్వ పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈకేవైసీ ఈనెల 15 తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత గ్యాస్ సంస్థలకు ఆదేశించింది. సకాలంలో ఈకేవైసీ ధ్రువీకరణ పూర్తిచేయకపోతే ఎల్పీజీ సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయచ్చునని పేర్కొన్నారు. వజ్రపుకొత్తూరు రూరల్: వాతావరణ ప్రతి అనుకూ ల పరిస్థితుల ప్రభావంతో ఈఏడాది పంట పూర్తిగా నష్టం వాటిళ్లడంతో శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి కోసంగిపురం జంక్షన్ వద్ద ఉన్న లిబరేషన్ కార్యాలయంలో బుధవారం సీఐటీయూ నాయకు డు ఎన్.గణపతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈనెల 10న జరగనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పి లుపునిచ్చారు. జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, బలవంతపు భూసేకరణ అపాలని కోరా రు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కె.మోహన్రావు, లిబరేషన్ నాయకులు టి.సన్యాసిరావు, న్యూ డెమోక్రసీ నాయకులు జుత్తు వీరస్వామి, పౌర హక్కుల సంఘ నాయకుడు పి.దానేసు, రైతు కూలీ సంఘ జిల్లా నాయకులు జి.బాలకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు మద్దిలి రామారావు, ఎస్.లక్ష్మీ నారాయణ, ఎం.వినోద్ కుమార్, టి.అజయ్ కుమా ర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ లేదని.. ప్రియురాలు రాదని..!
● తండ్రితో వెళ్లిపోయిన ప్రేమించి పెళ్లాడిన యువతి ● తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు శ్రీకాకుళం క్రైమ్: కారు డ్రైవర్గా పనిచేసే ఆ యువకుడు ఒకప్పుడు గంజాయికి బానిస. కానీ ఏడాది క్రితం ప్రేమించిన యువతిని పెళ్లాడడంతో పూర్తిగా మారిపోయాడు. అయితే ఆ యువతి మనసును తండ్రి మార్చివేసి ఇటీవల తీసుకెళ్లిపోవడంతో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి మరలా రాదనే బాధతో చివరికి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండో పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఒక వైద్యుడి వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్న మజ్జి హేమంత్ (24) అనే యువకుడు కెల్లావీధిలో తల్లి కమలతో కలిసి నివసిస్తున్నాడు. మొదట్లో అల్లరచిల్లరగా వ్యసనాలకు లోనై తిరిగిన హేమంత్ ఏడాది క్రి తం బలగలో ఉంటున్న ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి పూర్తిగా మారిపోయాడు. కాగా ప్రేమించి పెళ్లాడి వెళ్లిపోయిందనే కారణంతో యువతితో ఆమె తల్లిదండ్రులు మాట్లాడడం మానేశారు. అయితే నెలక్రితం సదరు యువతి పసగా డ సూర్యనారాయణ జంక్షన్ సమీపంలోని ఒక రియల్ ఎస్టేట్ కార్యాలయంలో పనిచేసేందుకు చేరింది. దీంతో అక్కడికి ఆమె తండ్రి పాపారావు వచ్చి కలుసుకోవడం జరిగింది. అనంతరం నెమ్మదిగా ఆమె మనసు మార్చేసిన తండ్రి తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. దుస్తులు పంపించేయమని మెసేజ్ పెట్టడంతో.. దీంతో హేమంత్ పలుమార్లు తన భార్యకు ఫోన్చేసి రమ్మన్నా ఇదిగో అదిగో అంటూ దాటవేసేది. అయితే గతనెల 29న తన దుస్తులు పంపించేయమని హేమంత్కు మెసేజ్ పెట్టడంతో మరి తన వద్దకు రాదని తట్టుకోలేకపోయాడు. అప్పటినుంచి పూర్తి డిప్రెషనల్లోకి వెళ్లిపోయాడు. బుధవారం రాత్రి తన తల్లి కమలమ్మ సోదరి జోఫ్ణవి ఇంట్లో పడుకోవడానికి వెళ్తుందన్న విషయం తెలుసుకున్న హేమంత్ ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు. గురువారం ఉదయం తల్లి వచ్చి చూసేసరికి ఉరికి వేలాడుతూ కుమారుడు కనిపించడంతో శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెండో పట్టణ ఎస్ఐ–2 బి.హైమావతి ఘటనా స్థలానికి క్లూస్ టీమ్తో చేరకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాబా ఆలయంలో చోరీ
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీ పరిధి వింజాంపాడు గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగినట్లు అలయ అర్చకులు బంకుపల్లి శాస్త్రి గుర్తించారు. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వింజాంపాడు గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి గురువారం ఉదయం ఆలయ అర్చకుడు వెళ్లేసరికి అలయం ముందు ఉన్న రెండు హుండీలు తెరిచి ఉండడం గుర్తించారు. అనంతరం అలయం లోపలికి వెళ్లి చూసేసరికి బాబా విగ్రహం పైనున్న కిరీటం సైతం చోరీకి గురైనట్లు తెలిసింది. దీంతో వెంటనే కోటబొ మ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఇన్చార్జి ఎస్ఐ సింహాచలం ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించా రు. గుర్తు తెలియని వ్యక్తి దుప్పటి కప్పుకుని వచ్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. సుమా రు రూ.40 వేలు విలువ కలిగిన వెండి కిరీటంతో పాటుగా కొంత మొత్తంలో నగదు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అయితే ఇదే గ్రా మంలో వరుసగా చోరీలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. నరసన్నపేట: స్థానిక శ్రీరాంనగర్లో ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లిన బమ్మిడి దేవ కుమార్ గాయప డి స్థానికులకు చిక్కాడు. వివరా ల్లోకి వెళ్తే.. గురువారం వేకువజామున శ్రీరాంనగర్లోని ఒక ఇంట్లో దొంగతనం చేసేందుకు దేవకుమార్ ప్రయత్నించాడు. ఇంతలో ఇంట్లో అలికిడి రావడంతో భయపడి పై అంతస్తు నుంచి కిందికి దూకాడు. పరిగెత్తి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ కాలికి గాయమవ్వడంతో కదలలేకపోయాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఏరి యా ఆస్పత్రిలో అతడికి చికిత్స చేయించారు. కాలికి గాయమైందని కట్టు వేయాలని వైద్యు లు సూచించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నరసన్నపేట ఎస్ఐ బి. గణేష్ తెలిపారు. ఇచ్ఛాపురం: రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా విద్యార్థులున్న పాఠశాలలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు తెలిపారు. స్థానిక పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించా రు. ఈ సందర్భంగా పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గతంకంటే అధికంగా ఉత్తీర్ణత సాదించాలని సూచించారు. మిషన్ మార్చ్ కార్యక్రమంలో ప్రతీ విద్యార్థి తప్పక హాజరై పరీక్షలు రాయాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని లైబ్రరీలు, ల్యాబ్, కిచెన్ షెడ్ల ను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని నిబంధనలకు అనుగుణంగా అందించాలని స్పష్టం చేశారు. ఉపవిద్యాశాఖాధికారి విలియ మ్స్, మండల విద్యాశాఖాధికారి కె.సూర్యారా వు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. సంతబొమ్మాళి: చిరిగిన రూ.500ల నోటు విషయంలో గొడవ జరగడంతో ఒకరు గాయపడిన ఘటన మండలంలో ని మలగాం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధి తులు తెలిపిన వివ రాల మేరకు.. గ్రామానికి చెందిన పది మంది డ్వాక్రా సభ్యుల లోన్ డబ్బులు ప్రతినెలా ఒక సభ్యురాలు కట్టాల్సి ఉంటుంది. జూలై నెలకు సంబంధించి సభ్యురాలు మామిడి పున్నమ్మ వంతు వచ్చింది. దీంతో లోన్ డబ్బులు రూ.20 వేలు తీసుకొని బ్యాంకుకు వెళ్లింది. అయితే అందులో ఒక రూ.500ల నోటు చిరిగిపోవడంతో అధికారులు తిరస్కరించారు. దీంతో తన వద్దనున్న మరొక రూ.500ల నోటును ఇచ్చి లోన్ డబ్బులు కట్టడం జరిగింది. సభ్యుల్లో చిరిగిన రూ.500ల నోటు ఎవరిచ్చారు అనేది చూసుకోలే దు. బ్యాంకుకు వెళ్లిన తర్వాత తెలియడంతో వేరేచోట చిరిగిన రూ.500ల నోటు ఇస్తే రూ. 100లు కమీషన్ తీసుకొని రూ.400లు ఇచ్చార ని మిగతా సభ్యులకు పున్నమ్మ చెప్పింది. దీంతో వచ్చేనెల అదనంగా రూ.10లు చొప్పున ఇస్తామని కొంతమంది సభ్యులు అంగీకరించా రు. అయితే కావాలనే చిరిగిన రూ.500 నోటు ఇచ్చి అందరి మీద వసూలు చేయడం ఏమిట ని ఒక సభ్యురాలు నౌపడ ఆదిలక్ష్మి ప్రతిరోజూ పున్నమ్మతో వాగ్వావాదం చేసేది. ఈ క్రమంలో బూతులు తిట్టుకోవడంతో ఇరువురి మధ్య తగాదా జరిగింది. ఈ తగాదాలో పున్నమ్మ, అమె భర్త అప్పయ్యపై కర్రలతో నౌపడ రాంబాబు, జోగారావు, చిన్నయ్య, అదిలక్ష్మి, రాజు, లక్ష్మిలు దాడి చేశారు. ఈ దాడిలో అప్పయ్య చేయి విరిగిపోయి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో టెక్కలి జిల్లా అస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీనిపై సంతబొమ్మాళి పోలీసు లు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. -
యువతను మోసగించారు
రాష్ట్రంలో దగా డీఎస్సీతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. దీనికి ప్రధాన సూత్రధారుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుమారుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి. డీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాల పై సీబీపీ విచారణ చేయాలి. – పేరాడ తిలక్, పార్టీ టెక్కలి సమన్వయకర్త డీఎస్సీలో జరిగిన అవకతవకలపై తక్షణమే సీబీఐ విచారణ చేపట్టాలి. అర్హులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి. యువతకు మద్దతుగా మా పోరాటం కొనసాగుతుంది. – నర్తు రామారావు, ఎమ్మెల్సీ, సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పార్టీ ఇచ్ఛాపురం సమన్వయకర్త ఏళ్ల తరబడి కష్టపడి చదివిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, డీఎస్సీ నిర్వహణలో తీవ్రమైన అక్రమాలకు పాల్పడటం దారుణం. అర్హులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుంది. నారా లోకేష్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపబోము. – గొర్లె కిరణ్కుమార్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే -
‘రాజీతో సమయం, డబ్బు ఆదా’
శ్రీకాకుళం పాతబస్టాండ్: వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వంలో రాజీ పడటమే అసలైన రాజమార్గమని శ్రీకాకుళం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్ ఎస్ఏ) అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొండబోలు స్పష్టం చేశారు. గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘మధ్యవర్తిత్వం దేశం కోసం–3.0’ అవగాహన ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి డే అండ్ నైట్ కూడలి వరకు భారీ ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా కుటుంబ, వాణిజ్య, ఆస్తి సంబంధిత వివాదాలను అత్యంత గోప్యంగా, తక్కువ ఖర్చుతో, స్వల్ప సమయంలో పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఉచిత న్యాయ సహాయం, మధ్యవర్తిత్వ సేవల సమాచారం కోసం డీఎల్ఎస్ఏ టోల్ ఫ్రీ సంఖ్య 15100 ను 24 గంటలు సంప్రదించవచ్చని పిలుపునిచ్చారు. ర్యాలీ నిర్వహిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు -
వలస మత్స్యకారుడు మృతి
రణస్థలం: కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు వద్ద సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారుడు మూగి నిలేకరి(34) సముద్రంలో మునిగి మృతి చెందినట్లు కొమరవానిపేట గ్రామస్తులు తెలిపారు. ఈ నెల 3వ తేదీన రాత్రి ఒక బోటుపై నుంచి మరో బోటు మారే క్రమంలో ప్రమాదవశాత్తు జారీ సముద్రంలో పడిపోయాడు. గురువారం తెల్లవారు జామున ఒడ్డుకు కొట్టుకు రావడంతో అక్కడ పోలీ సులు కేసు నమోదు చేశారు. మృతుని స్వగ్రామం రణస్థలం మండలంలోని కొచ్చెర్ల పంచాయతీలో గల కొ మరవానిపేట. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో కొమరవానిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
కంచిలి: మండలంలోని జలంత్రకోట జాతీయ రహ దారి కూడలిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు దాసరి చంద్రశేఖర్(58) మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. సోంపేట మండలంలోని బేసి రామచంద్రాపురం పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా చంద్రశేఖర్ విధులు నిర్వహిస్తున్నారు. అతను గురువారం విధు లు ముగించుకొని సోంపేట పట్టణానికి ఏదో పని నిమిత్తం వెళ్లి, తిరిగి జాతీయ రహదారి మీదుగా తన స్వగ్రామం సోంపేట మండలం ఉప్పలాం పంచాయతీ పరిధి డొంకలూరు గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి నిర్వహణ పనులు జరుగుతుండడంతో అక్కడ ఇరుకు మార్గంలో వెళ్తుండగా కుప్పగా వేసిన మెటీరియల్ వలన బండి అదుపుతప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. కానీ అతనికి ఏర్పడిన గాయాలు చూస్తే ఏదో వాహనం శరీర భాగాలకు రాసుకొని వెళ్లడంతో తీవ్రగాయాలు అయినట్లు కన్పిస్తోంది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడికి తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నారు. సోంపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కాశీబుగ్గలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేపడుతున్నట్లు కంచిలి హెచ్సీ జె.రూప్కుమార్ తెలిపారు. చంద్రశేఖర్ మృతితో గ్రామంలో విషాదచాయలు అల ముకున్నాయి. అతనికి భార్య వనిత కుమారి, కుమార్తెలు ఇద్దరు ఉన్నారు. ఇదిలా ఉండగా ఇదే జంక్షన్లో రోడ్డు పక్కన మెటీరియల్ వేయడం వలన సోంపే ట మండలం ఎర్రముక్కాం గ్రామానికి చెందిన ఒక కుటుంబం ప్రమాదానికి గురై స్వల్ప గాయాలపాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ రెండు ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో స్థానికులు ఎన్హెచ్–16 సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. శ్రీకాకుళం క్రైమ్: జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ జంక్షన్ సమీప ఆర్ట్స్ కళాశాల మార్గంలో బుధవారం అర్ధరా త్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. ట్రాఫిక్ సీఐ వి. రామారావు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు మండలం వీఆర్ గూడేంకు చెందిన యారాడ గిరిధర్రావు (55)కు వివాహం జరగకపోవడంతో అతని సోదరుడే బాగోగులు చూసుకుంటున్నాడు. అయితే అతనికి మతిస్థిమితం సరిగా లేకపోతుండడంతో అప్పుడప్పుడూ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోతుంటాడు. ఈక్రమంలో ఈనెల 4వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం బుధవారం రాత్రి ఆర్ట్స్ కళాశాల మార్గంలో రోడ్డు మధ్యలో పడుకునిపోయాడు. సరిగ్గా 11.30 గంటల ప్రాంతంలో ఒక ఫార్మా కంపెనీకి చెందిన బస్సు ఉద్యోగులను దించే క్రమంలో అటువైపుగా వచ్చి డ్రైవర్ గమనించకపోవడంతో గిరిధర్రావు పైనుంచి వెళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడిని కుటుంబీకులు గుర్తించడంతో పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు. -
వరదొస్తే.. వణుకే..!
సగంలోనే నిలిచిన గ్రోయిన్ నిర్మాణ పనులు శ్రీకాకుళం రూరల్: మత్స్యకారుల చిరకాల ఆకాంక్షను కూటమి ప్రభుత్వం చిదిమేసింది. ఎప్పటినుంచో ప్రపోజల్ లో ఉన్న పెదగనగళ్లవానిపేటలోని సముద్రతీరం వెంబడి వస్తున్న నాగావళి నదీ ప్రవాహాన్ని దారి మళ్లించే గ్రోయిన్ నిర్మాణపు పనులు మధ్యలోనే వదిలేసింది. దీంతో మత్స్యకారుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఇసుక తవ్వకాలు, వరదలు, ప్రకృతి విపత్తులు కారణంగా నాగావళి నది ప్రవా హం దిశ మార్చుకొని తీరప్రాంత గ్రామాల వైపు మళ్లుతోంది. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేట్ భూము లు భారీగా కోతకు గురై నదిలో క్రమంగా కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో నది ఎప్పుడు గ్రామాలపై విరుచుకుపడుతోందనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మరోవైపు నదీ ప్రవాహం అడ్డుగా మారడంతో సముద్రంలో చేపల వేటకు వెళ్లలేక పలువు రు మత్స్యకారులు వలస బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అరకొర పనులతో నిధులు వృథా సమస్య తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం చైన్నె నుంచి నిపుణుల కమిటీని రప్పించి పరిశీలించింది. అనంతరం ఎల్ ఆకారంలో శాశ్వత గ్రోయిన్ నిర్మిస్తే నాగావళి ప్రవాహం నేరుగా సముద్రంలోకి మళ్లి సమస్యకు పరిష్కారం లభిస్తుందని కమిటీ పేర్కొంది. దీనికోసం సుమారు రూ.94.50 కోట్ల అంచనా తో ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్ సమక్షంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ద్వారా జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థకు నివేదికను పంపించా రు. అయితే శాశ్వత నిర్మాణాలకు కేంద్రస్థాయిలో నిధులు మంజూరు కాకపోవడంతో.. రాష్ట్ర ప్రభు త్వం తాత్కాలిక గ్రోయిన్ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేసింది. దీన్ని ఇరిగేషన్ శాఖ అధికారు లకు అప్పగించి 270 మీటర్లు పొడవున మూడు విడతలుగా గ్రోయిన్ నిర్మాణ పనులను అంచెలంచెలుగా ప్రారంభించారు. అయితే మంజూరైన నిధుల ఖర్చు అనంతరం పనులు నిలిపివేశారు. దీంతో ఖర్చు చేసిన నిధులన్నీ సముద్ర గర్భంలోనే వృథా అవుతాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా అదనపు నిధులు మంజూరైతేగానీ గ్రోయిన్ నిర్మాణాన్ని పూర్తిచేయలేమంటూ ఇరిగేషన్ అధికారులు మధ్యలోనే వదిలేశారు. ప్రమాదంలో మత్స్యకారులు గ్రోయిన్ నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1.90 కోట్లు ఖర్చు అయ్యాయి. ఈ నిధులతో కొంతమేర ఎల్ సేపును తీసుకొచ్చాం. ఇంతవరకు మాత్రమే మాకు ఆదేశాలు వచ్చాయి. అంతకుమించి పనులు చేయలేము. – సుధాకర్రావు, ఇరిగేషన్ అధికారి, శ్రీకాకుళం గ్రోయిన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తేనే ప్రవాహపు వరదలకు అడ్డుకట్ట వేయవచ్చు. కానీ అధికారు లు మధ్యలోనే పనులు ఆపివేశారు. పొరపాటు న తీవ్రస్థాయిలో వరదలు వస్తే ఉన్న గ్రొయిన్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మా తీర ప్రాంత ప్రజలకు ముప్పు ఏర్పడుతుంది. – తాతారావు, పెదగనగళ్లవానిపేట నదీ ప్రవాహాన్ని శాశ్వతంగా నియంత్రించే పనులు చేపట్టాల్సిన సమయంలో తాత్కాలిక పనులకు పరిమితం కావడంతో సుమారు పదివేల మంది ప్రజల ప్రాణాలు, ఆస్తులు ప్రమాదంలో ఉన్నాయ ని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రవాహం లోతు పెరగడంతో తొమ్మిది మంది వరకు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అందువలన వెంటనే పూర్తిస్థాయిలో గ్రోయి న్ నిర్మాణం పూర్తి చేయాలని తీర ప్రాంత ప్రజలు కోరుతున్నారు. -
‘విధి’ వక్రీకరించి..
● తల్లికి బదులుగా పనికి వెళ్లిన కుమారుడు ● విద్యుదాఘాతంతో మృతి కవిటి: స్థానిక పోలీస్స్టేషన్లో ప్రైవేట్ స్వీపర్గా 17 ఏళ్లుగా పనిచేస్తున్న లిమ్మాయి రుక్మిణికి ఆరోగ్యం బాగోలేదని ఆమె బదులుగా కొడుకు లిమ్మాయి మోహనరావు(39) విధి నిర్వహణకు హాజరు కాగా.. విద్యుత్షాక్ తగిలి మరణించాడు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కవిటి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తల్లి అనారోగ్యం కారణంగా పోలీస్ స్టేషన్ శుభ్ర పరిచేందుకు మోహనరావు వెళ్లాడు. అక్కడ స్టేషన్ గదులను శుభ్రం చేశాడు. ఆ తర్వాత తనకు ఖర్చుల కోసం కొబ్బరికాయలు తీసి అమ్మకం చేసేందుకు స్టేషన్ పరిసరాల్లో ఉన్న కొబ్బరి చెట్టు నుంచి ఇనుప గజంతో కాయలు తీసే ప్రయత్నంలో చెట్టు సమీపంలో వెళుతున్న విద్యుత్ తీగలకు ఆ ఇనుప గజం తాకి షాక్కు గురయ్యాడు. దీంతో అతడిని వెంటనే కవిటి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యంలోనే మోహనరావు మృతిచెందాడని పోలీసులు తెలిపారు. మృతునికి భార్య లిమ్మాయి ప్రమీల, కొడుకు ఉజ్వల్, కూతురు అనూజ ఉన్నారు. చెట్టంత కొడుకు మరణించడంతో తల్లి, భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు కవిటి ఎస్ఐ వి.రవివర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోస్టాఫీస్ స్థలం అన్యాక్రాంతం
● దాత ఇచ్చిన స్థలం వినియోగించని పోస్టల్ శాఖ ● ప్రస్తుతం ఊరికి దూరంగా పోస్టల్ సేవలతో అవస్థలు కవిటి: మండల కేంద్రంలో పోస్టాఫీసు స్థలం అన్యాక్రాంతమవుతోంది. ఆరు దశాబ్దాల క్రితం బెందా ళం పట్టాభి రామయ్య పోస్ట్ ఆఫీస్ భవనం నిర్మా ణం కోసం ఇచ్చిన స్థలం ఆక్రమణకు గురవుతోంది. ఆ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే స్థలం కొంత తగ్గిపోయిందనే వాదన కూడా వినిపిస్తోంది. వాస్తవానికి మండల కేంద్రంలో కవిటి సబ్ పోస్ట్ ఆఫీస్ గ్రామ శివారులోని మండల విద్యా వనరుల కేంద్రం సమీపంలో అద్దె భవనంలో నిర్వహిస్తున్నా రు. ఈ సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో జగతి, శిలగం రాజపురం, బెజ్జిపుట్టుగ, డి.గొనపపుట్టుగ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు నడుస్తున్నాయి. గతంలో కవిటి మెయిన్ రోడ్డు పై ఉన్న పోస్ట్ ఆఫీస్ను గ్రామ శివారున ఉన్న అద్దె భవనానికి మార్చేశారు. దీంతో ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని పోస్టల్ శాఖకు దాత వితరణగా ఇచ్చిన ఆ స్థలంలో ఇప్పటి వరకు సొంత భవనమే నిర్మాణం కాలేదు. ఇప్పుడు ఈ స్థలాన్ని ఆక్రమించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. వెంటనే సొంత భవన నిర్మాణం చేపట్టకుంటే భారీ మూల్యం తప్పదని చర్చ సాగుతోంది. ఈ స్థలాన్ని ఇచ్చిన దాతల వంశీయులు కూడా పోస్టల్ శాఖ భవన నిర్మాణం చేయలేకుంటే ఆ స్థలాన్ని మాకు ఇచ్చేస్తే వేరే శాఖలకు ఇస్తామని చెబుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ కార్యాలయ వర్గాలు పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు దృష్టికి తెలిపి సమస్య తీవ్రతను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. -
నిరుద్యోగులకు కుచ్చుటోపీ
సోంపేట: సోంపేట పరిసర గ్రామాల నిరుద్యోగులకు పట్టణంలో వెలసిన ఓ ప్రైవేటు శిక్షణ కేంద్రం కుచ్చుటోపీ పెట్టింది. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించడానికి శిక్షణ అందజేస్తామ ని నమ్మబలికి సోంపేటలో ఆరు నెలల కిందట బస్టాండు సమీపంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పా టు చేశారు. శిక్షణ కేంద్రంలో వందలాది మంది విద్యార్థులను చేర్చుకున్నారు. రైల్వే, బ్యాంక్, డీఎస్సీ, ఉద్యోగాలతో పాటు ఎంసెట్ ర్యాంకులు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఉద్యోగం ఇచ్చేవరకు శిక్షణ అందజేస్తామని చెప్పి నిరుద్యోగుల వద్ద లక్షల రూపాయలు ఫీజు వసూ లు చేశాడు. అలాగే పట్టణంలో పలు దుకాణాల్లో మౌలిక వసతుల కోసం పలు వస్తువులు, కిరాణా తెచ్చి వారికి నగదు ఇవ్వకుండా బోర్డు తిప్పినట్లు తెలుస్తుంది. రాత్రికి రాత్రి శిక్షణ కేంద్రానికి తాళాలు వేయడంతో శిక్షణకు ఫీజులు కట్టిన విద్యార్థులు, నిరుద్యోగులు ల బోదిబోమంటున్నారు. సుమారు కోటి రూపాయలు వరకు నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మెయిన్ డ్రాప్ కూల్చివేతపై రైతుల ఆందోళన సంతబొమ్మాళి: పాలతలగాం వద్ద వంశధార కాలువలో వేసిన మెయిన్డ్రాప్ పిల్లర్ కూల్చివేతపై రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. మెయిన్డ్రాప్ పిల్లర్ కూల్చివేయడంతో సాగునీరు ఈ ప్రాంతానికి అందదని, సు మారు 1500 ఎకరాలు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు అంటున్నారు. గతంలో వంశధార అధికారులే డ్రాప్ను ఏర్పాటు చేసి ఇప్పుడు అ అధికారులే కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు రైతులు కోరుతున్నారు. దీనిపై వంశధార జేఈ అప్పలరెడ్డిని సంప్రదించగా.. మెయిన్ డ్రాప్ వల్ల దిగువన ఉన్న వేల ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఉందని, దీంతో కూల్చేశామని తెలిపారు. ‘డ్రగ్స్ నియంత్రణకు యుద్ధానికి సిద్ధం’ అరసవల్లి: బంగారు భవిష్యత్ను అంధకారంలో పడేస్తున్న డ్రగ్స్ నిర్మూలనపై యువతే ముందడుగు వేసి యుద్ధానికి సిద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో మై భారత్ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయ న మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ వికాస్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందని వివరించారు. డ్రగ్స్ వినియోగిస్తూ ఎందరో అమాయక యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వినియోగంతో కలిగే అనర్థాలను తెలిసేలా అవగాహన కలిగించేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మత్తు పదార్థాల నియంత్రణ–యువత పాత్రపై జిల్లా స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. పోటీల అనంతరం విజేతలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.సుధ, డీఎల్డీఓ భాస్కరరావు, సెట్శ్రీ సీఈ ఓ అప్పలనాయుడు, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. ‘ప్రజా సానుకూల దృక్పథం పెరగాలి’ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, హాస్టళ్ల నిర్వహణపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వినతిపత్రాల పరిష్కారంలో జాప్యం జరిగితే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని, అందుకే గడువు దాటిన అర్జీల సంఖ్యను సున్నాకి తగ్గించాలన్నారు. హాస్టల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన ఆహారం అందించేలా క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. -
అక్రమ కేసులు
● ఆదరణ చూసి ఓర్వలేకే ఆమదాలవలస: వైఎస్ జగన్ పర్యటనకు వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేకే టీడీపీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఇన్ని కక్ష సాధింపులకు పాల్పడుతున్న నారా లోకేష్ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆమదాలవలస వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ గ్రామం రావికంటిపేటలో ఆయన తల్లి శ్యామలమ్మను, కుటుంబ సభ్యులను బుధవారం వారు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ జిల్లా పర్యటనకు జనం స్వచ్ఛందంగా తరలివచ్చారని, ఎవరూ సమీకరణ చేయలేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ కూడగట్టుకున్న అభిమానానికి నిదర్శనం ఈ జనాలని పేర్కొన్నారు. ఈ జనాలను సాకుగా చూపుతూ చింతాడ రవికుమార్తో సహా సుమారు 20 మంది నాయకులపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయ డం పూర్తిగా రాజకీయ కక్షసాధింపేనని ధర్మాన ఆరోపించారు. ఈ కేసులు పోలీసుల స్వతంత్ర నిర్ణయం కాదని, రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే నమోదు చేశారని విమర్శించారు. విధుల్లో ఉన్న పోలీసులు సైతం అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జర గలేదని చెబుతున్నారని, అయినా కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. శ్రీకాకుళం, రణస్థలం, ఆమదాలవలస ప్రాంతాల్లో జరిగిన చర్యలన్నీ ప్రజల్లో ప్రభుత్వం ఆదరణ కోల్పోతున్నదనే భయానికి నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామ్యంలో కేసులు పెట్టడం, జైళ్లకు పంపించడం ద్వారా ప్రజల అభిమానాన్ని తగ్గించలేరని, అలాంటి చర్యలు బాధితుల పట్ల ప్రజల్లో మరింత సానుభూతి, మద్దతు పెంచుతాయని ధర్మాన అన్నారు. చరిత్రలో పోలీసు వ్యవస్థను రాజకీయ ప్ర యోజనాల కోసం దుర్వినియోగం చేసిన ప్రభుత్వా లు ప్రజల తీర్పు నుంచి తప్పించుకోలేవన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోలీసు శాఖతో ఎలాంటి విభేదాలు లేవని, తమ పోరాటం ప్రజలను మోసం చేశారని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలపైనే తప్ప అధికారులపై కాదన్నారు. వేలాది మంది స్వచ్ఛందంగా రోడ్లపైకి రావడం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతం కాదని, ప్రజలే అంతిమ తీర్పు ఇస్తారని అన్నారు. కేసులు ఎదుర్కొంటున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తుందని ధర్మాన తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత చురుగ్గా ప్రజల్లోకి వెళ్లి జరుగుతున్న పరిణామాలను వివరించాలని పిలుపునిచ్చారు. అక్రమ కేసులు దుర్మార్గం కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్య ల్లో భాగంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తోందని మాజీ ఉపముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న చింతాడ రవికుమార్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ తరహా కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. చట్టపరమైన పోరాటం ద్వారా అక్రమ కేసులను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఆమదాలవలస పార్టీ క్యాడర్ అంతా బలంగా ఉందని, అందరూ చింతాడ రవికుమార్కు మద్దతు తెలపడం చూస్తుంచే చాలా ముచ్చటగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, పార్టీ టెక్కలి, ఇచ్ఛాపురం సమన్వయకర్తల పేరాడ తిలక్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, పార్టీ శ్రీకాకు ళం నియోజకవర్గ పరిశీలకుడు పిన్నింటి సాయి, పార్టీ ముఖ్య నాయకులు కరిమి రాజేశ్వరరావు, మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయరావు, చిట్టి జనార్ధనరావు, ఆరంగి మురళీధర్, గొండు కృష్ణ, నర్తు నరేంద్ర యాదవ్, సురవపరపు నాగేశ్వరరావు, బెజ్జిపురపు రామారా వు, లోలుగు కాంతారావు, చింతాడ శ్యాంప్రసాద్, బెవర మల్లేశ్వరరావు, ఖండాపు గోవిందరావు, పొడుగు శ్రీనివాసరావు, గురుగుబెల్లి శ్రీనివాసరావు, దుంపల శ్యామలరావు పాల్గొన్నారు. -
● స్టేషన్కు పిలిస్తే.. చచ్చిపోతా
ప్రతి రోజూ పోలీసులు స్టేషన్కు పిలుస్తున్నారని ఆవేదనతో ఓ యువకుడు వంద అడుగుల ఎత్తు గల ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి పోలీసులనే బెదిరించాడు. ‘స్టేషన్కు పిలిస్తే నేను చచ్చిపోతా’ అంటూ ఖాకీలకు షాకిచ్చిన ఘటన పోలాకి మండలం బెలమర గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పాలబోయిన శివ దుర్గారావు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నాడని పోలాకి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ కోసం పోలీసులు పలుమార్లు స్టేషన్కు పిలిచారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు బెలమర సచివాల యం పక్కనే ఉన్న ఓవర్హెడ్ ట్యాంక్ ఎక్కి అక్కడ నుంచి దూకి చనిపోతానంటూ బెదిరించాడు. దాదాపు రెండుగంటల తర్వాత పోలాకి ఎస్ఐ రంజిత్ నేతృత్వంలోని పోలీసులు సాహసోపేతంగా యువకుడిని కాపాడారు. కిందకు దిగిన తర్వాత కుటుంబ సభ్యులు, గ్రామపెద్దల సమక్షంలో యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలాకి: -
బాలల భద్రత మన బాధ్యత
● రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వెంటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామస్థాయిలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై గ్రామ కమిటీలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వెంటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత జిల్లా అధికారులతో బుధవారం కమిషన్ సభ్యులు గంగ సూర్యనారాయణ, డాక్టర్ డి.శ్రీనివాసమూర్తిలతో కలిసి ఆయన సమీక్షించా రు. కమిటీలు చురుగ్గా పనిచేసి గ్రామస్థాయి నుంచి రిపోర్టులు తెప్పించుకోవాలని సూచించారు. 1098 బోర్డులు ఎక్కడా లేవని, ఏర్పాటు చేయా లని కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీనివాస మూర్తి కోరారు. సీడీపీఓలు క్షేత్రస్థాయిలో నెలలో 15 రోజులు పర్యటన చేయాలన్నారు. సూపర్వైజర్లు నెలకు 25 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలన్నారు. పోక్సోపై మాట్లాడుతూ చాలా కేసుల్లో నిందితులకు శిక్ష పడడం లేదని, ఈ దిశగా మరింతగా కృషి చేయాలని సూచించారు. మిషన్ వాత్స ల్య ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 18 సంవత్సరాలు నిండే వరకు వాళ్లకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఆ పథకాలు వాళ్లకు అందే విధంగా, లబ్ధిదారులకు ఆ లబ్ధి చేకూరేలా మనమంతా భాగస్వామ్యులం కా వాలని పిలుపునిచ్చారు. మంగళవారం, బుధవారాల్లో చేసిన పర్యటనలో గుర్తించిన లోపాలను రాబోయే రోజుల్లో సరిదిద్దుకోవాలని సూచించారు. కమిషన్ సభ్యులు గంగ సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ జిల్లాలో బడులు, హాస్టళ్లలో సదుపాయాలు పెంచాలన్నారు. డ్రాపౌట్స్, జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లో ఎంత మంది పిల్లలు చదువుతున్నారో జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. రవిబాబు కమిషన్కు వివరించారు. పనిచేయని ఆర్ఓ ప్లాంట్లు సెప్టెంబర్ నాటికి మరమ్మతులు చేపట్టనున్నట్లు వివరించారు. ఇన్చార్జి డీఎంహెచ్ఓ శ్రీకాంత్ జిల్లాలో గల ఆస్పత్రి, సిబ్బంది వివరాలను కమిషన్కు వివరించారు. విద్యార్థుల్లో రక్తహీనత పారద్రోలే విధంగా చర్యలు చేపట్టాలని కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ మూర్తి కోరారు. బాల కార్మికులపైనా ఆరా తీశారు. మంగళవారం సందర్శించిన బీసీ హాస్టల్స్లో మరుగుదొడ్లు పిల్లలకు సరిపోయేవి లేవని, మరుగుదొడ్ల కొరత ఉందని, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్కి లెటర్ పంపిస్తే వారు మంజూరు చేస్తారని సభ్యులు శ్రీనివాస్ మూర్తి తెలిపారు. సంక్షేమ అధికారులు వసతి గృహాల్లో రాత్రి బస చేయాలన్నారు. బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు ప్రసాదరావు మాట్లాడుతూ యూత్ క్లబ్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను కమిషన్ కు వివరించారు. -
ఆమదాలవలసలో లాయర్ల విధుల బహిష్కరణ
ఆమదాలవలస: గత నెల 30వ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విధుల్లో ఉన్న బార్ అసోసియేషన్ సభ్యు లు, లాయర్ దానేటి రామ్మోహన్రావును క్రైమ్ నంబర్ 117/2026 లో నిందితుడిగా ఎ–8 గా చేర్చడం సరికాదని ఆమదాలవలస బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మిబాయి తోపాటు బార్ అసోసియేషన్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా బుధవారం కోర్టు విధులను బహిష్కరించారు. వైఎస్ జగన్ జిల్లా పర్యటనలో మహిళా ఎస్ఐపై అస భ్యంగా ప్రవర్తించిన ఆరోపణలపై కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. ఆయన ఆ సమయంలో కోర్టు విధుల్లో ఉండడాన్ని అందరం గమనించామన్నారు. అందుకే విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు. -
తైక్వాండో పోటీలకు విద్యార్థి ఎంపిక
టెక్కలి రూరల్: స్థానిక ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం విద్యార్థి తమిరి జ్ఞానదీప్ తైక్వాండో సీ.బీ.ఎస్.సీ సౌత్ జోన్ నేషనల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ నర్శిపురం శేఖర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విద్యార్థి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఒరిజిన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఈ నెల 5వ తేదీ నుంచి 8 వరకు జరిగే ఈ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ విద్యార్థి ఎంపికపై తల్లిదండ్రులు భవాని, మురళీ కృష్ణతో పాటు పలువురు అభినందించారు. ఎంపికై న క్రీడాకారుడికి జిల్లా క్రీడాధికారి మహేష్ క్రీడాకిట్ను అందించి అభినందించారు. కాంట్రాక్టు పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ శ్రీకాకుళం: జిల్లాలోని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రిన్సిపాల్, సీఆర్టీ, పీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి సబ్జెక్టుల వారీగా కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్న పోస్టులకు 1:3 నిష్పత్తిలో తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ పి.వేణుగోపాలరావు ఓ ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్లతో ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో హాజరుకావాలని కోరారు. నవోదయ ఖ్యాతి విశ్వవ్యాప్తి సరుబుజ్జిలి: వెన్నెలవలస జవహర్ నవోదయలో చదువుకున్న విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో వివిధ ఉద్యోగాల్లో స్థిరపడి నవోదయను మరింత అగ్రస్థానంలో నిలబెట్టారని విద్యాలయం ఇన్చార్జి ప్రిన్సిపాల్ బేతనసామి తెలిపారు. జవహర్ నవోదయ అవతరణ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులను సత్కరించారు. నవోదయ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలవడం అందరి సహకారంతో జరిగిందని వెల్లడించారు. కార్యక్రమంలో పలువు రు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ‘మధ్యవర్తిత్వంతో కేసులకు త్వరిత పరిష్కారం’ శ్రీకాకుళం పాతబస్టాండ్: కోర్టుల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివాదాలను ఉభయ పక్షాల ఒప్పందంతో వేగంగా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వ విధానం ఎంతో దోహదపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు సునీత కొండబోలు స్పష్టం చేశారు. నేషనల్ లీగల్ స ర్వీ సెస్ అథారిటీ (నల్సా), రాష్ట్ర న్యాయ సే వాధికార సంస్థ (అప్సా) ఆదేశాల మేరకు చేపట్టిన ‘మధ్యవర్తిత్వం దేశం కోసం–3.0’ ప్రచారంలో భాగంగా బుధవారం జిల్లా కో ర్టులో నిర్వహించిన న్యాయవాది మధ్యవర్తుల సామర్థ్య పెంపు శిక్షణ కార్యక్రమంలో ఆమె ఆన్లైన్ ద్వారా పాల్గొని మాట్లాడారు. మధ్యవర్తిత్వ పద్ధతుల ద్వారా కక్షదారులకు ఆర్థిక భా రం, సమయం ఆదా అవుతాయని, వివాదాలు స్నేహపూర్వక వాతావరణంలో ముగిసిపోతా యని పేర్కొన్నారు. కేరళకు చెందిన మాస్టర్ ట్రైనర్ పి.సురేష్ కుమార్ ఆన్లైన్ ద్వారా హా జరై మధ్యవర్తిత్వంలో పాటించాల్సిన మెలకువలు, రాజీ మార్గాల ప్రాముఖ్యతపై న్యాయవాదులకు విస్తృత అవగాహన కల్పించారు. శాకంబరిగా మహాలక్ష్మీ అమ్మవారు శ్రీకాకుళం కల్చరల్: బలగలోని శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో బుధవారం ఆషాడ బహుళ సప్తమి పర్వదినం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారిని విశేష శాకంబరీ అవతారంలో అలంకరించారు. అర్చన ప్రధాన అర్చకులు దేవరకొండ శంకరనారాయణ శర్మ, మణిశర్మ కిరణ్ శర్మల ఆధ్వర్యంలో విశేష కుంకుమార్చన శ్రీ చక్ర నవావరణ వైభవంగా జరిగాయి. -
కలయిక.. కలే ఇంకా!
శ్రీకాకుళంఅరకొర నిధులతో..ఆటల పోటీలకు అరకొర నిధులే ఉన్నాయి. నేటి నుంచి పోటీలు మొదలుకానున్నాయి. –10లో● వంశధార–నాగావళి అనుసంధానంపై నీలినీడలు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● ఆందోళనలో రైతులు గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026హిరమండలం, బూర్జ: వంశధార–నాగావళి అనుసంధానం.. దశాబ్దాలుగా నాయకుల నోట నలుగుతున్న మాట ఇది. ఎన్నికల ముందు వినిపించినంతగా ఎన్నికల తర్వాత ఈ మాట వినిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నా ఈ రెండు నదుల కలయికను సాధ్యం చేసేందుకు ఒక్క అడు గు కూడా వేయలేకపోయింది. ఇక వంశధార–బాహు దా నదుల అనుసంధానం ఊసెత్తడమే మర్చిపోయారు. ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలు ఎండిపోతున్నాయి. నదు ల అనుసంధానం జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎత్తిపోతలదీ అదే పరిస్థితి.. జిల్లాలో జీవనాడులుగా వంశధార, నాగావళి నదులు ఉన్నాయి. ఇప్పటికే వంశధారపై నిర్మించిన గొట్టా బ్యారేజీ జిల్లాలో సగం మండలాలను సస్యశ్యామలం చేస్తోంది. అయితే వంశధార నదిలో వృథా నీటిని ఒడిసిపట్టేందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణానికి తలపెట్టారు. ఒడిశాతో జల వివాదాల నేపథ్యంలో వంశధారలో వరద నీటిని డైవర్షన్ స్కీమ్ ద్వారా రిజర్వాయర్లోకి పంపించి కాలువల ద్వారా నీటిని అందించాలని పరితపించారు. అలా ప్రారంభమైన ఆయన ప్రయత్నాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశా యి. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఒక వైపు ఒడిశాతో జల వివాదాలకు పరిష్కారం చూపుతూనే గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథకం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. ప్రధాన పనులను పూర్తిచేయగలిగారు. కానీ కూటమి వచ్చి రెండేళ్లవుతున్నా ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. విజేతలుగా నిలిచిన క్రీడాకారులతో చుక్కా శ్రీనివాస్, డాక్టర్ గూడేన, కిరణ్, బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు రెవెన్యూ శాఖలో అలజడి నరసన్నపేటలో భూ ఆక్రమణలపై 19 మంది ప్రభుత్వ సిబ్బందిపై చర్యలకు ఉత్తర్వులు దురదృష్టకరం.. నదుల అనుసంధానంపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం దురదృష్టకరం. వంశధార–నాగావళి నదుల అనుసంధానంతో జిల్లాకు ఎంతో మేలు జరుగుతుంది. అయినా ప్రభుత్వం దృష్టిసారించకపోవడం అన్యాయం. ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. – పెనుమజ్జి విష్ణుమూర్తి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, ఎల్ఎన్ పేటకదలిక లేదు.. వంశధార–నాగావళి నదుల అనుసంధానానికి ఎలాంటి ముందడుగు పడలేదు. కనీసం ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. 2017లో కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ నదుల అనుసంధానానికి ప్రతిపాదించింది. కానీ పనులను సకాలంలో ప్రారంభించలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలంటే కచ్చి తంగా మరోసారి టెండర్లు పిలవాలి. గజ్జిలి గెడ్డ వద్ద ఉన్న రోడ్డు కింద నుంచి కాలువ తీసి ఆరు కిలోమీటర్ల మేర మట్టి తవ్వకాలు చేపట్టాలి. 30 స్ట్రక్చర్ల నిర్మాణాలు పూర్తిచేయాలి. ఇందుకుగాను 49.23 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందుకు గాను రూ.8.26 కోట్లు చెల్లించాలి. 7.50 ఎకరాల దేవాదాయ శాఖ భూ సమస్యను పరిష్కరించాలి. అనుసంధానం పనులు పూర్తిచేస్తే ఎల్ఎన్పేట, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో ఐదు వేల ఎకరాలకు, నారాయణపురం ఆనకట్ట ప్రధాన కాలువ కింద ఉన్న 18,527 ఎకరాలను స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది. -
పద్ధతులు సవరించాల్సిందే
● ముదిరిపోతున్న వరి నారు ● యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటకు మేలు ఆమదాలవలస: జిల్లాలో సాధారణ వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కాలువల ద్వారా సాగునీరు అంతంత మా త్రమే అందడం వల్ల వరి నారు ఎండిపోవడంతో పాటు ముదిరిపోతుంది. జిల్లాలో ఆమదాలవలస, రణస్థలం, జి.సిగడాం, పొందూరు, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్, వజ్రపుకొత్తూరు తదితర మండలాల్లో వర్షాభావ పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వరి నాట్లు వేయడం కొద్దిగా ఆలస్యంగా జరుగుతోంది. రాబో యే వారం రోజుల్లో వర్షాధారంగా, సాగునీటి కాలువల ద్వారా సాగునీరు లభ్యమైనప్పుడు ముదురు వరి నారు నాటేటప్పుడు రైతులు తగు యాజమాన్య పద్ధతులు పాటించాలని మండల వ్యవసాయాధికారి మెట్ట మోహనరావు సలహాలు అందించారు. యాజమాన్య పద్ధతులు ●35 నుంచి 50 రోజుల నారు వయసు ఉంటే చదరపు మీటరుకు 44 కుదుళ్లు, 50 నుంచి 65 రోజుల నారు వయస్సు ఉంటే చదరపు మీటరుకు 66 కుదుళ్లు వచ్చేలా వరి మొనలు వేసుకోవాలి. ముదురు నారు నాటితే దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అందువలన నాట్లు తక్కువ లోతులో నాటితే పిలకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ● ముదురు నారు నాటేటప్పుడు నిర్ణీత విస్తీర్ణంలో కుదుళ్ల సంఖ్యను పెంచి కుదురుకు దగ్గర దగ్గర 4 నుంచి 5 మొక్కలు వంతున నాట్లు వేయాలి. ● ముదురు నారు నాటేటప్పుడు సిఫార్సు చేసిన మోతాదు కంటే 25 శాతం పెంచి 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా అంటే 70 శాతం ఆఖరి దమ్ములోనూ ఎకరానికి 50 కిలోల డీఏపీ, 35 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్, మిగతా 30 శాతం 30 కిలోల యూరియా, 15 కిలోల ఫొటాష్ అంకురం దశలో వా డాలి. నత్రజని ఎరువులను బురద పదునులో మాత్రమే సమానంగా వెదజల్లి 36–48 గంటల తరువాత పలుచగా నీరు పెట్టాలి. ● నారు నాటడానికి సిద్ధం చేసేటప్పుడు నారు కట్టల చివర్లు తుంచి నాటాలి. ఇలా చేయడం వల్ల నారులో ఉండే కీటకాలను నియంత్రించవచ్చు. ముఖ్యంగా కాండం తొలుచు పురుగు ఆకు కొనలపై పెట్టిన గుడ్లు నాశనం అవుతాయి. ● నారు నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల వెడల్పున కాలిబాటలు తీయాలి. దీని వల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా తగిలి చీడపీడల ఉద్ధృతి కొంతవరకు అదుపు చేయవచ్చును. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులను వేయడానికి ఇంకా పైరు స్థితిగతులను గమనించడానికి ఈ కాలిబాటలు బాగా ఉపయోగపడతాయి. ఈ కాలిబాటలు నాటే సమయంలోను లేదా నాటిన 5 రోజుల లోపు తీసుకోవాలి. ● నాటిన 15 రోజుల లోపు కార్బోప్యూరాన్ 3జి గుళికలు ఎకరానికి 8 కిలోలు చొప్పున వేసుకుంటే తొలి దశల్లో కాండం తొలుచు పురుగు ఉద్ధృతి నియంత్రించవచ్చు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ
● రైతు నుంచి రూ. 20వేలు లంచం డిమాండ్ ● రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ● రైల్వేట్రాక్పై భారీ సర్పం● మంత్రి రాజీనామా చేయాల్సిందే రణస్థలం: లావేరు మండలంలోని లోపెంట పంచాయతీ గ్రామ రెవెన్యూ అధికారి అరుబారికి మల్లేశ్వరరావు ఒక రైతు నుంచి రూ. 20వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్ గా బుధవారం పట్టుకున్నారు. శ్రీకాకుళం అవినితి నిరోధక శాఖ డీఎస్పీ కెంబూరి సత్యనారాయణరావు తెలిపిన వివరాలు ప్రకారం.. ఎచ్చెర్ల మండలంలోని అజ్జరాం గ్రామానికి చెందిన కొయ్యి సత్యనారాయణ అనే రైతుకు లావేరు మండలంలోని లోపంట, సహాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో భూములు ఉన్నాయి. అతని భూములు మ్యుటేషన్ చేసేందుకు, పట్టాదారు పాసుపుస్తకం జారీ చేసేందుకు వీఆర్ఓ రూ. 20వేలు డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై రెండు రోజుల కిందట రైతు ఏసీబీని సంప్రదించారు. వారి ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం రూ.20వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అలాగే వీఆర్ఓ స్వగ్రామం మురపాకలో తన ఇంటిలో కూ డా సోదాలు నిర్వహించారు. మల్లేశ్వరరావు వీఆర్ఏ నుంచి వీఆర్వోగా ఉద్యోగోన్నతి పొందా డు. 2023 నుంచి లోపెంటలోనే పని చేస్తున్నాడు. అంతకుముందు రణస్థలం మండలంలోని తెప్పలవలసలో వీఆర్వోగా పని చేశారు. ఆ సమయంలో తెప్పలవలస పంచాయతీలో వివాదాస్పద భూము లు సరి చేస్తామని, ప్రభుత్వ భూములు రైతుల పేరున ఎక్కిస్తామని చెప్పి రైతుల నుంచి లక్షల్లో సొ మ్ములు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతులు తిరగబడడంతో కొంతవరకు పెద్దమనుషుల సమక్షంలో సొమ్ములు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రైడ్లో ఏసీబీ సీఐ భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
అరకొర నిధులతో ఆటలు ఎలా..?
శ్రీకాకుళం న్యూకాలనీ: రెండేళ్ల పాటు క్రీడలను గాలికొదిలేసిన ప్రభుత్వం ఎట్టకేలకు మూడో ఏట.. అమరావతి చాంపియన్ షిప్ పేరిట నిర్వహిస్తున్న ఒక అధికారిక క్రీడా పోటీలను నిర్వహించడానికి సన్నద్ధమైంది. కానీ కనీస నిధులు విదల్చకుండా చేతులెత్తేయడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏపీ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ పోటీలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం, శుక్రవారం (ఈనెల 6, 7 తేదీల్లో) జరగనున్న జిల్లా స్థాయి పోటీలకు శ్రీకాకుళం నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం ప్రాంగణం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకుగాను మైదానాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వివిధ క్రీడా కోర్టులను సిద్ధం చేస్తున్నారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎ.మహేష్బాబు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. 2 రోజులు.. 12 క్రీడాంశాలు.. అమరావతి చాంపియన్షిప్ పోటీలు మూడు స్థాయిల్లో జరగనుండగా.. ఇప్పటికే నియోజకవర్గస్థాయి పోటీలు ముగిశాయి. జిల్లా పోటీల్లో విజేత లు లేదా ఎంపిక చేసిన జట్లు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. కబడ్డీ, ఖో–ఖో, వాలీబా ల్, అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్బాల్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, చెస్, హాకీ, వెయిట్లిఫ్టింగ్, యోగా 12 క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు జరగనున్నాయి. అయితే ఈ పోటీల ని ర్వహనకు అవసరమైన నిధుల కేటాయింపు చేయకుండా నామమాత్రపు ఫండ్ కేటాయింపుతో అధికారులు ఆ శాఖాధికారులు తలలుపట్టుకుంటున్నారు. -
టెక్కలిలో..
పార్టీ తరఫున పోరాటాలు కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయిన అన్ని వర్గాల ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల తరఫున పోరాటాలు చేస్తుండడంతో నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేపట్టిన పర్యటనకు అన్ని వర్గాల ప్రజల నుంచి స్పందన రావడంతో అది తట్టుకోలేక అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ విద్యార్థులు, నిరుద్యోగులు, యువత మొత్తం కూటమి మోసాలపై చైతన్యం కావాలి. – చల్లా రవికుమార్, నియోజకవర్గ పరిశీలకుడు, టెక్కలి యువత, నిరుద్యోగులు తిరగబడాలి ఎన్నికల మునుపు యువత, నిరుద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. వారికి చేసిన మోసానికి గుణపాఠంగా తిరుగుబాటు చేయాలి. డీఎస్సీలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. – దువ్వాడ వాణి, జెడ్పీటీసీ, టెక్కలి -
తోడితేనే నీరు.. ఆపితే కన్నీరు
● కొండపేటకు బావి నీరే దిక్కు ● నిరసన తెలిపిన గిరిజనులు సారవకోట: మండలంలోని చిన్నకిట్టాలపాడు పంచాయతీ కొండపేట గిరిజన గ్రామం తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటోంది. ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన సోలార్ మంచినీటి పథకం సరిగ్గా పనిచేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 4 నుంచి రాత్రి 11 వరకు ఆ నీటి కోసం వేచి ఉండాల్సి వస్తోంది. పంచాయతీ ద్వారా నిర్వహించే రక్షిత మంచినీటి పథకం బోరు పూర్తిగా పాడైంది. తాగునీటి సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో మంగళవారం స్థానికులంతా నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న బావి నీరు మాత్రమే దాహం తీరుస్తోందని, ఆ నీరు కూడా అడుగంటి పోయిందని తెలిపారు. -
పాతపట్నంలో..
ప్రజలే ఉద్యమించాలి డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రజలంతా ఉద్యమించాలి. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, లీకేజీ ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. డీఎస్సీలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. టీడీపీ కార్యకర్తలకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కట్టబెట్టారు. ఇక నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ వంటివి ప్రభుత్వానికి గుర్తు లేవు. – రెడ్డి శాంతి, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే -
భోగాపురం ఎయిర్పోర్టు జగన్ ఘనతే
● వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ని ధనుంజయరావు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనతేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ పలాస నియోజకవర్గ పరిశీలకుడు ఎన్ని ధనుంజయరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఎయిర్పోర్టు తామే నిర్మించామని టీడీపీ నాయకులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే 87 శాతం పనులు పూర్తయ్యాయని సాక్షాత్తు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడే చెప్పిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి కావాలనే పట్టుదలతో మౌలిక వసతులు, రన్ వే, టెర్మినల్ పనులను రికార్డు స్థాయిలో శంకుస్థాపన చేసిన రెండేళ్లలోనే 87 శాతం పనులు పూర్తిచేశారన్నారు. సమగ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలనే విజన్తో ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించింది జగన్మోహన్రెడ్డేనని పేర్కొన్నారు. దీనిపై కూటమి నాయకులు ఎన్ని డ్రామాలాడినా వాస్తవాలు ఎంటనేది ప్రజలకు తెలుసు అన్నారు. -
రణస్థలంలో..
మంత్రి రాజీనామా చేయాలి ఏపీ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై నైతిక బాధ్యత వహించి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి. రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే చెల్లించాల్సిన విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను తక్షణమే ఖాతాల్లో జమ చేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రజలు, యువత చైతన్యంతో ముందుకు రావాలి. – గొర్లె కిరణ్కుమార్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే నిరుద్యోగ భృతి ఏదీ..? కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. నేను చాన్నాళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాను. కొత్త నోటిఫికేన్లు ఏవీ రావడం లేదు. ఒక్క రూపాయి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. టీడీపీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. – గురాన భవాని, వల్లభరావుపేట -
పాతపట్నంలో ఆధ్యాత్మిక శోభ
పాతపట్నం: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవమైన పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు మహిళలు భారీగా తరలిరావడంతో నగరంలో మంగళవారం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పలు వీధుల్లో ఆషాఢమాస ఆవేటి వారాల పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగర వాసులు తమ ఇళ్ల నుంచి బయల్దేరి ఘటాలను తీసుకుని ఊరేగింపుగా నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం వరకు మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో వెళ్లారు. మహిళలు అమ్మవారికి ముర్రాటాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం అషాఢ మాసం మొదటి పౌర్ణమి తర్వాత తొలి మంగళవారం ఆవేటి పండుగ నిర్వహించడం ఆనవాయితీ అని ఈవో టి.వాసుదేవరావు, ఆలయ చైర్మన్ అక్కందర సన్యాసిరావులు తెలిపారు. ఎటుంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ కిల్లి వెంకటరావు పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని తండేవలసకు వెళ్లే రహదారిలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోన ఉషారాణి (44) అనే మహిళ మృతి చెందింది. రూరల్ ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల మేరకు.. ఆమదాలవలసలోని గుట్టిముడి గ్రామానికి చెందిన ఉషారాణి స్వీపర్గా ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. సోమవారం రాత్రి డ్యూటీ అనంతరం రాత్రి 9 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన చింతాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం మీదుగా వెళ్తుండుగా.. స్థానిక ఆర్టీవో కార్యాలయం పరిసర ప్రాంతంలో వాహనం అదుపు తప్పడంతో వెనుక కూర్చున్న ఉషారాణి పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో వెంటనే శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం ఆమె మృతి చెందిందని ఎస్ఐ తెలిపారు. మృతురాలి తల్లి గడ్డెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగి ఉన్న ట్యాంకర్ను ఢీకొని... రణస్థలం: మండలంలో పైడిభీమవరం పంచాయతీలోని పారిశ్రామికవాడలో పాలవలస దగ్గర డాక్టర్ రెడ్డీస్ సెజ్ పరిశ్రమ గేటు సమీపంలో ఆగివున్న ట్యాంకర్ను ద్విచక్ర వాహనంతో ఇద్దరు వ్యక్తులు బలంగా ఢీకొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో ద్విచక్ర వాహనంతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతివేగంగా ట్యాంకర్ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వెనుకకూర్చున్న మండలంలోని వెంకటరావుపేట గ్రామానికి చెందిన బూర్లె రమణ(32) అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవింగ్ చేస్తున్న పతివాడపాలెం గ్రామానికి చెందిన పతివాడ రాంబాబుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రమణ మరణ వార్తతో వెంకటరావుపేట గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఘనటపై ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పాముకాటుతో మహిళా రైతు మృతి
రణస్థలం: లావేరు మండలంలోని రాయిలింగారిపేట గ్రామానికి చెందిన గొర్లె భవాని(45) గత నెల 31వ తేదీన వ్యవసాయ పనులకు పొలానికి వెళ్లగా పాటుకాటు వేసింది. దీంతో ఆమెను చికిత్స కోసం రణస్థలం సీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆమె మృతి చెందింది. ఈమెకు భర్త భానోజీరావు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లావేరు ఎస్ఐ వి.సందీప్ కుమార్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కిడ్నీ వ్యాధితో మహిళ మృతి నందిగాం: మండలంలోని దిమ్మిడిజోలకు చెందిన కొల్లి భాగ్యవతి(40) కిడ్నీ వ్యాధితో మృతి చెందింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. భాగ్యవతి గత కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఆరేళ్ల క్రితం ఆమె తల్లి అనసూయమ్మ ఒక కిడ్నీని కుమార్తె భాగ్యవతికి ఇవ్వడంతో కిడ్నీ మార్పిడి చేశారు. భాగ్యవతి భర్త సాంబమూర్తి రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భాగ్యవతి తన ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో కలిసి టెక్కలిలోని సాయిచంద్రనగర్లో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఆమె తీవ్ర ఆయాసంతో అస్వస్థతకు గురి కావడంతో బంధువులు టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. పంద్రాగస్టు వేడుకలకు పక్కా ఏర్పాట్లు శ్రీకాకుళం పాతబస్టాండ్: స్వాతంత్య్ర దినోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన జిల్లా అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా శాఖలు ప్రభుత్వ పథకాల పై శకటాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ సందేశం తయారు చేయాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి చెన్నకేశవరావును ఆదేశించారు. వేదిక ఏర్పాట్లు ఆర్అండ్బీ ఎస్ఈ చూడాలన్నారు. ఉద్యోగంలో ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులకే సర్టిఫికెట్కు ప్రతిపాదించాలన్నారు. అక్రమంగా చెరువు గట్టుపై రహదారి నిర్మాణం ఆమదాలవలస: శ్రీకాకుళం రూరల్ మండలం, ఆమదాలవలస మున్సిపాలిటీ నాదానపురం గ్రామ సమీపంలోని చిట్టివాని చెరువు గట్టుపై ఎటువంటి అనుమతులు లేకుండా రహదారి నిర్మాణ పనులు ఆ గ్రామానికి చెందిన ఒక టీడీపీ కార్యకర్త చేపడుతున్నారని గ్రామానికి చెందిన కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇటీవల చింతాడ గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్ గ్రీవెన్స్లో వినతిపత్రం ఇచ్చారు. చెరువు వెనుక భాగంలో సుమారు 12 ఎకరాల భూమి ఉండడంతో ఆ భూములను రియల్ ఎస్టేట్గా మార్చుకోవడం కోసం అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే అతనికి శ్రీకాకుళం, ఆమదాలవలస ఎమ్మెల్యేల అండదండలు ఉన్నాయని చెబుతున్నట్లు తెలుస్తోంది. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. టిడ్కో కాలనీలో రెచ్చిపోతున్న బైక్ రైడర్లు శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పాత్రునివలస టిడ్కో కాలనీలో పలువురు బైక్ రైడర్లు రెచ్చిపోతున్నారని అదే కాలనీకి చెందిన పలువురు మంగళవారం రాత్రి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో రోడ్లపై బైక్ రైడర్లు పందెలు వేసుకుంటూ ద్విచక్ర వాహనాలతో నానా హంగామా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం చిన్నారులకు బైక్లతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులకు వివరించారు. ఇదే విషయాన్ని బైక్ రైడర్లను ప్రశ్నించగా బూతులు తిడుతూ వాగ్వాదానికి దిగారని తెలిపారు. దీంతో రూరల్ పోలీసులు బైక్ రైడర్లను స్టేషన్కు పిలిపించి నలుగురిపై బైండోవర్ కేసుల నమోదు చేశారు. -
వివాహితపై భర్త, కుటుంబ సభ్యుల దాడి
మెళియాపుట్టి: మండలంలోని చాపర గ్రామానికి చెందిన వివాహిత తమిరి మాధవిపై తన భర్తతోపాటు కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ మేరకు మాధవి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హెచ్సీ ఢిల్లేశ్వరరావు కేసు నమోదు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. చాపరకు చెందిన దారపు ధనుంజయరావు, తమిరి మాధవికి 2010లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. ఇటీవల ధనుంజయరావు ఆర్మీలో పదవీ విరమణ పొందాడు. పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చిన సొమ్ము మొత్తం మాధవి భర్త ధనుంజయ.. అతని అన్న లక్ష్మీనారాయణకు అప్పజెప్పడంతో మాధవి ప్రశ్నించింది. దీంతో ఆమైపె తన భర్తతోపాటు అత్త మామలు, బావ లక్ష్మీనారాయణ దాడికి పాల్పడ్డారు. వివాహం అయిన తర్వాత ఎటువంటి కట్నం, భూమి తీసుకురాలేదు, నీకు ప్రశ్నించే హక్కులేదని నలుగురూ కలిసి దాడి చేశారని తెలిపారు. అదేవిధంగా వరకట్నం తీసుకురావాలి, లేదంటే విడాకులకు అంగీకరించాలని ఒత్తిడికి గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన నలుగురిపై గృహహింస, వరకట్న వేధింపుల కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాల్సిందే
ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి వంటి హామీలను నెరవేర్చలేదు. 2025 ఏప్రిల్ 19న ప్రకటించిన మెగా డీఎస్సీ నిరుద్యోగులకు చీకటి దినం. శాప్ సర్టిఫికెట్తో 421 పోస్టులను స్పోర్ట్స్ కోటాలో కట్టబెట్టారు. కష్టపడి మెరిట్ సాధించిన వారికి అన్యాయం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాల్సిందే. – మెంటాడ స్వరూప్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షుడు మెగా డీఎస్సీ పేరుతో దగా ప్రస్తుత ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో అర్హత కలిగి, మెరిట్ ఉన్న నిరుద్యోగ యువతను దగా చేసింది. డిగ్రీ పూర్తి చేసి, బీఈడీ చేసి టెట్ క్వాలిఫై అయ్యి డీఎస్సీ రాసి మంచి ర్యాంకులు సాధించినవారిని పక్కన పెట్టి రూ. 15 లక్షలకు, రూ. 20 లక్షలకు ఏమీ రాని వారిని స్పోర్ట్స్ కోటాలో ఓ సర్టిఫికెట్ ఆధారంగా పీఈటీ వంటి పోస్టు కాకుండా ఫిజిక్స్, మ్యాఽథ్స్ వంటి కీలక పోస్టులను కట్టబెట్టారు. ఇది చాలా అన్యాయం. – కొమ్ము శ్రీనివాస్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్హత కలిగిన వారికి అన్యాయం రాష్ట్రంలో అర్హత కలిగిన విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ పేరుతో తీరని అన్యాయం చేశారు. గోల్డ్ మెడలిస్టుల ను పక్కనబెట్టి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో పోస్టులు కట్టబెట్టారు. ప్రశ్న పత్రాల నిర్వహణలో ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంకు వచ్చింది. డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందే. – మార్పు పృథ్వీ, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు డీఎస్సీలో అక్రమాలు జరిగాయి కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయి. ఎంతో మంది అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదు. ఎన్నిక ల మునుపు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. – టి.సూర్యం, నిరుద్యోగ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు -
ముగిసిన అప్పలరాజు పోలీసు కస్టడీ విచారణ
వజ్రపుకొత్తూరు రూరల్, శ్రీకాకుళం క్రైమ్: మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కస్టడీ విచారణ ప్రభుత్వ కక్ష సాధింపులకు నిదర్శనంగా సాగింద ని రాజకీయ వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా రు. మంగళవారం ఒక్క రోజు కస్టడీ విచారణ కోసం సీదిరిని కాశీబుగ్గ పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు. సోంపేట సీఐ మంగరాజు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారించా రు. అనంతరం పోలీసుల బలగాల నడుమ ఆరోగ్య వైద్య పరీక్షలకు పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పలాస జూనియర్ సివి ల్ కోర్టుకు హాజరు పరిచి మళ్లీ అంపోలు జైలుకు తరలించారు. అయితే కస్టడీ విచారణ సందర్భంగా కోర్టుకు వెళ్తున్న న్యాయవాదులను అలాగే మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు న్యాయవాదులను కోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అయితే మీడియా ప్రతినిధులను మాత్రం అన్ని చోట్లా అడ్డుకున్నారు. ఉదయం నుంచే కాశీబుగ్గలో పోలీసు బలగా లు మోహరించాయి. కేసును వాదిస్తున్న బాలకృష్ణ మాట్లాడుతూ కోర్టు తీర్పు రాకుండా అడ్డుకునేందుకే పోలీసులు కస్టడీ పిటీషన్ వేశారని, సీదిరి పోలీసులకు సహకరించారని తెలిపారు. బుధవారంతో రిమాండ్ ముగుస్తుందని, తర్వాత పరిణామాలు చూడాలని తెలిపారు. -
ఆలస్యమే చేటు..!
పాముకాటు..హిరమండలం: జిల్లాలో పాముకాట్లు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పాముకాటుకు సంబంధించి విరుగుడు వ్యాక్సిన్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవి సీహెచ్సీల వరకే పరిమితమవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 15 సీహెచ్సీల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటున్నాయి. కానీ 60 వరకు ఉన్న పీహెచ్సీల్లో మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయని అంటున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా.. వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నాలుగు నెలల్లోనే 300 మందికి పాములు కాటు వేసినట్లు సమాచారం. ముఖ్యంగా వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లోనే పాముకాట్లు అధికంగా ఉంటున్నాయి. ఏటా రెండు వేల మందికిపైగా పాముకాటుకు గురవుతున్నారు. అందులో 400 మంది వరకు మృత్యువాత పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే బాధితుల్లో ఎక్కువ మంది రైతులే ఉండడం బాధాకరం. సకాలంలో వైద్యం అందక.. పాముకాటు వేసిన వెంటనే సకాలంలో వైద్యం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. బాధితుల్లో 70 శాతం మంది నాటువైద్యంపై ఆధారపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రాణాలు కాపాడే విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. పాముకాటుకు విరుగుడుగా ఇచ్చే ‘పాలీవెలెంట్ యాంటీ వినమ్’ శాసీ్త్రయంగా నిరూపితమైన మందు. ఈ మందు క్షేత్రస్థాయిలో చాలా ఆస్పత్రుల్లో అందుబాటులో లేదన్న విమర్శలున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో ఉంటున్నా.. అదికూడా మొదటి 5 – 10 డోసుల వరకు ఉంటుంది. అనంతరం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి వెళ్తేనే ఉపశమనం దక్కుతుంది. పాముకాటుకు గురైన బాధితుడికి మూడు గంటల్లోపు శరీరంలో విష తీవ్రత బట్టి యాంటీ వినమ్ డోసులను అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. జిల్లాలో 60 పీహెచ్సీలతోపాటు 108, 104 వాహనాల్లో యాంటీ వినమ్ డోసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి ఉంచితే పాముకాటు మృతులను తగ్గించవచ్చు. Eఈనెల 1న పోలాకి మండలం డోల గ్రామానికి చెందిన దువ్వారపు నారాయణమ్మ అనే మహిళ పాముకాటుతో మృతి చెందింది. పొలంలో పనులు చేస్తుండగా ముల్లు గుచ్చుకున్నట్టు అనిపించింది. అయితే కొద్దిసేపటికే ఆమె అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు నరసన్నపేట సీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నారాయణమ్మ మృతి చెందింది. E ఈనెల 2న ఎల్ఎన్పేట గ్రామానికి చెందిన బలరాం మహంతి పాముకాటుకు గురయ్యారు. అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు స్థానిక పీహెచ్సీకి తరలించారు. వైద్యులు లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం శ్రీకాకుళం తరలించారు. అక్కడ బలరాం సాహు చికిత్స పొందుతున్నాడు. E గత నెల 25న నరసన్నపేట మండలం గొట్టిపల్లి అంపలాంలో పాముకాటుతో తల్లీ, కుమారులు అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో నిద్రిస్తుండగా ఆడంగి శశికిరణ్, తల్లి విజయలక్ష్మిలకు పాముకాటు వేసింది. హుటాహుటిన నరసన్నపేట సీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం హుటాహుటిన శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పాముకాటుకు గురైనవారిని వెంటనే ఆస్పత్రికి తరలించాలి. నాటువైద్యం పేరుతో జాప్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. ప్రభుత్వాస్పత్రుల్లో యాంటీవినమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటాయి. ప్రాథమిక చికిత్స అనంతరం ఆస్పత్రికి వీలైనంత త్వరగా చేరిస్తే ప్రాణాలు కాపాడగలం. – పి.సాయికుమార్ వైద్యాధికారి, హిరమండలం -
ఆందోళనగా ఉంది
నేను 5 ఎకరాల్లో వరి పండిస్తున్నాను. ఒక 50 సెంట్ల విస్తీర్ణంలో విత్తనాలు వేశాను. మొలక రాలేదు. మిగిలిన విస్తీర్ణంలో వెద వేశాను. మొలక వచ్చినా నీరు లేక ఎండిపోతున్నాయి. చాలా ఆందోళనగా ఉంది. కాలువ శివారు భూములు మావి. మా పొలం పక్కనే పల్లం బట్టి ఉంది. అయినా ఏం ప్రయోజనం. నీరు వస్తే కదా.. ఎనిమిదేళ్ల కిందట ఇలా ఇబ్బందులు పడ్డాం. మళ్లీ ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. – రువ్వ వాసు, రైతు మడపాం సాగునీరు ఇవ్వాలి వంశధార నీరు పొలాలకు అందడం లేదు. మాకు అందుబాటులో ఓపెన్ హెడ్ చానల్స్ ఉన్నాయి. వీటిని అధికారులు పూర్తిగా పట్టించుకోవడం లేదు. దీంతో మాలాంటి గ్రామాలకు సాగు నీరు ఇబ్బందిగా ఉంది. – బైరి రాజులు , రైతు, ముద్దాడపేట -
రాష్ట్రంలో బ్యాడ్మింటన్ దినదినాభివృద్ధి
● క్రీడాకారుల్లో స్టాండర్డ్స్ పెరిగాయి ● స్టేట్మీట్కు బాగా ఏర్పాట్లు చేశారు ● ఏపీ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అంకమ్మ చౌదరి శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రంలో బ్యాడ్మింటన్ గేమ్ దినదినాభివృద్ధి సాధిస్తుండడం ఆనందంగా ఉందని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(భాయ్) సంయుక్త కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్(ఏపీబీఏ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.అంకమ్మ చౌదరి అన్నారు. గతంలో పోల్చితే ఏపీ క్రీడాకారుల్లో స్టాండర్డ్స్ పెరిగాయని చెప్పడానికి గర్వంగా ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో జరుగుతున్న ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్–2026 పోటీల పర్యవేక్షణకు హాజరైన ఆయన మంగళవారం ఒక హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. శ్రీకాకుళం ఆతిథ్యం అద్భుతం శ్రీకాకుళంలో ఇప్పటివరకు నాలుగు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగిన విషయాన్ని అంకమ్మ చౌదరి గుర్తు చేశారు. ఇక్కడ జరిగే పోటీలకు బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు మంచి ఏర్పాట్లు, వసతులు, భోజనాలు, సదుపాయాలు కల్పిస్తుంటారని కొనియాడారు. ప్రస్తుతం జరుగుతున్న సీనియర్స్ స్టేట్మీట్కు కూడా రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన క్రీడాకారులు, రిఫరీలు, టెక్నికల్ అఫీషియల్స్కు గొప్ప ఆతిథ్యాన్ని అందిస్తున్నారని అభినందించారు. శ్రీకాకుళం జిల్లాలో మరో మూడు, నాలుగు కోర్టులు ఏర్పాటైన పక్షంలో ఇక్కడ నేషనల్ మీట్ లేదా ర్యాంకింగ్ టోర్నీని నిర్వహించేలా ఖచ్చితంగా అనుమతులు ఇస్తామన్నారు. క్రీడల అభివృద్ధి కోసం దాతలతో పాటు ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్ తదితరులు మాట్లాడుతూ జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి సమష్టిగా కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యనిర్వహక కార్యదర్శి, మీట్ ఆర్గనైజింగ్ కమిటీ ముఖ్య ప్రతినిధి నారాయణశెట్టి వెంకట కిరణ్కుమార్, జిల్లా బ్యాడ్మింటన్ సీఈవో సంపతిరావు సూరిబాబు, ఉపాధ్యక్షుడు గురుగుబెల్లి ప్రసాద్, కంచరాన వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. 17 నుంచి వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఈనెల 17 నుంచి 23 వరకు ఢిల్లీలో జరిగే సీనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు భారతదేశం ఆతిథ్యమిస్తోందని వెల్లడించారు. 2009లో హైదరాబాద్లో జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయమన్నారు. 17 ఏళ్ల తర్వాత మరలా మనదేశం మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తుండడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. -
తూకాల్లో తేడాలను సహించేది లేదు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): దుకాణదారులు తూకాల్లో తేడాలు చేస్తే సహించేది లేదని తూనికలు, కొలతల శాఖ శ్రీకాకుళం ఇన్స్పెక్టర్ బాల రామకృష్ణ హెచ్చరించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చికెన్, చేపలు, మాంసం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు మంగళవారం చేపట్టారు. 10 మంది వ్యాపారస్తులపై కేసులు పెట్టినట్లు తెలిపారు. ముద్రలు లేకుండా కాటాలు ఉపయోగిస్తున్న వ్యాపారులపై 5 కేసులు నమోదు చేశామని తెలియజేశారు. ఎవరైనా వ్యాపారస్తులు తూకాల్లో అక్రమాలకు పాల్పడినా, ముద్రలు లేకుండా కాటాలు ఉపయోగించినా, ముద్రించిన ధరలు కంటే వస్తువులు అధిక ధరలకు అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో టెక్నికల్ అసిస్టెంట్, సిబ్బంది పాల్గొన్నారు. -
టీడీపీ నేతల సూచనలతో అక్రమ కేసులు
శ్రీకాకుళం క్రైమ్ : టీడీపీ నేతల సూ చనలతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు దశలవారీగా అక్రమ కేసులను బనాయిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన నాడు అంపోలు జంక్షన్ ఎన్హెచ్–16 అండర్పాస్ బ్రిడ్జి వద్ద అలజడి చేశారన్న ఆరోపణలతో మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు ధర్మా న రామ్మనోహర్నాయుడు, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ తిలక్లపై 221, 223, 189(1), 121(1), 132, 285 ఆర్/ డబ్ల్యూ, 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరితో పాటు అంబటి శ్రీనివాసరావు, గేదెల పురుషోత్తం, సాయి, ఆర్.శంకరరావు మరికొంతమందిపై కూడా ఇవే సెక్షన్లు బనాయించి కేసులు కట్టారు. వైఎస్ జగన్ పర్యటన రోజు రాత్రే ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్, మరో 20 మందిపై మహిళా ఎస్ఐ ఎం.ప్రవళ్లికను చుట్టుము ట్టి హత్యాప్రయత్నానికి ఒడిగట్టారని ఆరోపి స్తూ వివిధ నాన్బెయిల్బుల్ సెక్షన్ల కింద ఆమదాలవలస పోలీసులు కేసులు కట్టిన సంగ తి తెలిసిందే. ఘటనాస్థలిలో లేనివారిని సైతం ఎఫ్ఐఆర్లో చేర్చారు. టీడీపీ నేతల సూచనలతో ఆ రోజు నుంచి దశలవారీగా పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తూనే ఉన్నారు. పార్టీ ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్కుమార్, మరో 10 మందిపై, జె.ఆర్.పురం స్టేషన్లో 23 మందిపై కేసు కట్టారు. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్రమ కేసులు కడుతున్నట్లు సమాచారం. రాష్ట్రపతికి, గవర్నర్కు ఈ–మెయిల్స్ పంపడంతో.. చింతాడ రవి, 20 మంది కోసం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేసి వస్తున్న ఇద్దరిని సోమవారం రాత్రి రణస్థలం పోలీసులు విచారణ చేశారు. వీరిలో ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయుడు దేశ రాష్ట్రపతికి, మన రాష్ట్ర గవర్నర్కు జరిగిన పరిణామాలపై ఈ–మెయిళ్లు పంపడంతో పోలీసు లు ఉపాధ్యాయునితో పాటు చింతాడ రవి కా రు డ్రైవర్ రామ్మోహన్లను తక్షణమే విడిచిపెట్టారు. మరోవైపు వైఎస్సార్ సీపీకి చెందిన వా రిపై కడుతున్న కేసులు, అరెస్టుల విషయాలు మీడియాకు పొక్కితే సస్పెండ్ చేస్తామని పో లీసు సిబ్బందిని హెచ్చరిస్తుండడం గమనార్హం. -
బాలల సంక్షేమానికి ప్రాధాన్యం
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో ప్రతి ఒక్క చిన్నారి హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి తమ కమిషన్ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలల భద్రత, విద్యా ప్రమాణాలు, వసతి గృహాల్లో సౌకర్యాలపై రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలనలు వేగవంతం చేసినట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా కమిషన్ సభ్యులు గంగా సూర్యనారాయణరాజు, డాక్టర్ పి.నాగమానస, డాక్టర్ శ్రీనివాసమూర్తిలతో కలిసి శ్రీకాకుళం నగరంలోని మావూరివీధి అంగన్వాడీ కేంద్రం, అనంతరం అరసవల్లిలోని శిశు గృహాలను సందర్శించి చిన్నారులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. బాలల హక్కులకు భంగం కలిగినా, సంక్షేమ పథకాల అమలులో అలసత్వం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే సమీక్ష సమావేశానికి అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలతో హాజరుకావాలని, కమిషన్ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ఎస్.సువర్ణ, బాలల రక్షణ అధికారి కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
పోరాటాలకు సిద్ధమవ్వండి
నందిగాం: ఆఫ్షోర్ రిజర్వాయర్ కోసం సమరశీల పోరాటాలకు సన్నద్ధమవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు కోనారి మోహనరావు, జిల్లా కమిటీ సభ్యుడు పి.ప్రసాద్, నంబూరు షణ్ముఖరావులు పిలుపునిచ్చారు. సోమవారం సీపీఎం పార్టీ, ఆఫ్షోర్ రిజర్వాయర్ సాధన పోరాట కమిటీ ప్రతినిధుల బృందం మండలంలోని పెద్దలవునిపల్లి, కంచిఊరు, కామధేనువు గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఎందుకు ఆఫ్షోర్కు నిధులు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అచ్చెన్నాయుడు నిధులు విడుదల చేయించడంలో విఫలం అవుతున్నారని ఆరోపించారు. అచ్చెన్నాయుడికి రైతాంగంపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో ఆఫ్షోర్ రిజర్వాయర్ సాధన పోరాట కమిటీ సభ్యులు పి.ధర్మారావు, వజ్జ సింహాచలం, పిన్నింటి కృష్ణమూర్తి, సాయి, కణితి ధీనబందు, పాపారావు, కిల్లి దుర్వాసులు, వజ్జ విద్యాసాగర్, పినకాన తులసయ్య, సీపీఏం నాయకులు కొల్లి ఎల్లయ్య, హనుమంతు ఈశ్వరరావు, పాలిన సాంబమూర్తి, బగాది వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో యువకుడు మృతి వజ్రపుకొత్తూరు రూరల్: పలాస మండలం సరియాపల్లిలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పెద్ద నారాయణపురం గ్రామానికి చెందిన యువకుడు మురపాక లోకేశ్వరరావు(30) సోమవారం ఉదయం సరియాపల్లిలో విద్యుత్ మోటర్ మరమ్మతుల పనులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే అతడిని 108 వాహనంలో పలాస ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు స్థానిక ఎస్ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా యువకుడి మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. -
కక్ష సాధిస్తే బంగాళాఖాతంలో కలపడం ఖాయం
● కూటమి నాయకులపై మత్స్యకార నాయకుల ధ్వజం వజ్రపుకొత్తూరు రూరల్: మత్స్యకారులు, మత్య్సకార నాయకులను అణచివేసేందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలపడం ఖాయమని మత్య్సకార ఐక్యవేదిక నాయకులు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న కక్షపూరిత రాజకీయ చర్యల్లో భాగంగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు తిర్రి రాజారావు ఆధ్వర్యంలో అప్పలరాజును విడుదల చేయాలని కోరుతూ సోమవారం వజ్రపుకొత్తూరు మండలంలోని గుణుపల్లి తీరంలో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకార కులాన్ని గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో రాజకీయల్లోకి వచ్చిన సీదిరి అప్పలరాజు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. మత్స్యకారులను అణగదొక్కితే ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాల్లా న్యాయ పోరాటాలు చేస్తారని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఎన్నికల హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ వంక రాజు, ఎంపీటీసీ తిర్రి గుణ, తాజా, మాజీ సర్పంచ్ తిర్రి కామేశ్వరి, వైఎస్సార్సీపీ నియోజకవర్గం గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు ఇరోతు హేమంత్, మండల ఉపాధ్యక్షుడు దున్న బాలరాజు, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు కొమర దేవరాజు, అంబటి అనంద్, గూడ ఈశ్వరరావు, వడ్డి కరుణాకర్, బత్తిని లక్ష్మీనారాయణ, చింత హేమరావు, జిల్లా యువజన విభాగం కార్యదర్శి కర్ని శ్రీను, చౌదాల వెంకన్న, తిర్రి లక్ష్మీనారాయణ, సూరాడ మాధవరావు, కోడ నిరంజన్, డొంక విద్యాసాగర్, గొరకల విశ్వనాథం, జోగి అప్పారావు, అర్లి దానేష్, లక్ష్మణ్, సైన కేశవ, దాసరి తిరుపతి, దువ్వాడ ఉమామహేశ్వరరావు, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు జోగి అనంద్ తదితరులు పాల్గొన్నారు. -
రవికుమార్పై కేసులు నమోదు సరికాదు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్పై అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదర్ సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రజాధరణను చూసి ఓర్వలేని తనంతో కూటమి ప్రభుత్వం చింతాడ రవిలాంటి వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు తీవ్ర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన విద్యావంతుడు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న చింతాడ రవికుమార్ నోరు నొక్కేయాలనుకోవడం చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శమని పేర్కొన్నారు. రవికుమార్తో పాటు ఆయన అనుచరులైన 20 మందిపై, అందులో ఆమదాలవలస కోర్టులో విధుల్లో ఉన్న దానేటి రామ్మోహనరావు అనే న్యాయవాదిపైన, ఎక్కడో పంజాబ్లో తన కూతురు వద్ద ఉన్న వ్యక్తిపై తప్పుడు కేసులు బనాయించడం అప్రజాస్వామికమన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష పూరిత చర్యల్లో భాగంగా చట్టాన్ని అక్రమ మార్గంలో వాడుకోవడం మానుకోవాలని హితవు పలికారు. -
ఆదుకోండయ్యా..!
కంచిలి: కుటుంబానికి అండగా ఉండే వ్యక్తి అనారోగ్యం బారిన పడడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయింది. యుక్త వయస్సులోనే అరుదైన వ్యాధి రావడంతో వారి జీవితాల్లో అంధకారం ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. కంచిలి మండలంలోని బూరగాం గ్రామానికి చెందిన ధూపాన మాధవరావు అనే యువకుడికి ‘బోన్మ్యారో’ వ్యాధి సోకింది. సుమారు 5 నెలలు క్రితం దీన్ని వైద్యులు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం రూ.9 లక్షలు వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమస్య నుంచి కోలుకోవాలంటే సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. అంత డబ్బు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఆ కుటుంబం ఆవేదనలో మునిగిపోయింది. దీంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమ పరిస్థితిపై దయతలచి ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే 63008 02750 నంబర్ను సంప్రదించాలని కోరుతున్నారు. కాగా బాధితుడు ధూపాన మాధవరావు హైదరాబాద్లోని ఒక నిర్మాణ కంపెనీలో ఉపాధి కూలీగా పనిచేసేవాడు. ఈ వ్యాధి రావడంతో అక్కడి నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చేశాడు. ● బోన్మ్యారోతో బాధపడుతున్న యువకుడు ● దాతల సాయం కోసం కుటుంబం ఎదురుచూపులు -
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా...
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వల్ల తన కుమారుడికు తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదని అధికారులు చెబుతున్నారని శ్రీకాకుళం నగరం బలగకు చెందిన గేదెల నాగమణి తెలిపారు. రెండేళ్లుగా అన్ని కార్యాలయాల చుట్టు తిరుగుతున్నా, మ్యాపింగ్ సమస్య పరిష్కరం జరగలేదని వాపోయారు. తమ కుటుంబంలో వాళ్ల మరిది కుటుంబం చేరి ఉన్నందున ఈ పథకం వర్తించడం లేదని అధికారులు చెబుతున్నారన్నారు. హౌ హోల్డ్ మ్యాపింగ్ సరిచేయాలని సచివాలయం, మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం, వాళ్ల మరిది కుటుంబానికి రేషన్ కార్డులు వేర్వేరుగా ఉన్నప్పటికీ హౌస్ హోల్డ్లో విడదీయలేదని తెలిపారు. అంతేకాకుండా ఈ కారణం వలన దివ్యాంగుడైన తన భర్తకు పింఛన్ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
● డోరు.. అమర్చరా సారూ..
నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలో ఘోరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మహిళా రోగులు వినియోగించే మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆపరేషన్ చేయించుకున్న మహిళల వార్డుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడం బాధాకరం. ఇటీవల ఆస్పత్రిలో హెచ్డీఎఫ్ ఫండ్స్ రూ. 50 లక్షలకు పైగా వెచ్చించి డాక్టర్ల రూమ్లకు ఏసీలు, ఆస్పత్రి సిబ్బంది గదులకు అదనంగా గాజు డోర్లు వేయించారు. ఇవన్నీ చేసి మరుగుదొడ్లకు తలుపులు బిగించడం మర్చిపోయారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. – నరసన్నపేట -
వికృత రాజకీయాలు
శ్రీకాకుళంబ్యాగ్ పెయిన్విద్యార్థులకు బాధ్యతలతో పాటు బరువులు పెరుగుతున్నాయి. బ్యాగులు మోయలేకపోతున్నారు. –8లోమంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026● రోజురోజుకీ పెరుగుతున్న చంద్రబాబు ప్రభుత్వ కుట్రలు ● కక్షలే పరమావధిగా సాగుతున్న పాలన ● పోలీసు వ్యవస్థను అడ్డంగా పెట్టుకుని కక్షపూరిత రాజకీయం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : చంద్రబాబు ప్రభుత్వం తన వికృత కోణాలను బయటపెడుతోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైఎస్సార్సీపీ నేతలను వేధించడమే పనిగా పెట్టుకుంది. దాని కోసం పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని కక్ష పూరిత రాజకీయాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు, అరెస్టులు తప్ప మరొకటి కనిపించడం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేపట్టిన పనులకు తమ రంగులేసి క్రెడిట్ చోరీకి పాల్పడటం తప్ప చేసిందేమి లేదని జనాలకు అర్థమైంది. సూపర్ సిక్స్ కాస్త సూపర్ మోసంగా మారిపోయింది. సంక్షేమ పథకాలు కనుమరుగైపోతున్నాయి. ఎవరో చేసిన అభివృద్ధి పనులను ప్రచారం చేసుకుని, ప్రత్యేక ఈవెంట్లు చేసుకుని, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. ఆఖరకు ప్రధాన మంత్రి హాజరయ్యే సభలకు సైతం గతి లేని పరిస్థి తుల్లో లేనిపోని ప్రలోభాలు, ఆశలు కల్పించి, దగ్గరుండి బస్సులు పెట్టి, భోజనాలు అందించి తీసుకెళ్తున్న దుస్థితికి చేరిపోయింది. అదే సమయంలో జరిగిన వైఎస్ జగన్ పర్యటనకు స్వచ్ఛందంగా తరలివచ్చిన జనాలను చూసి సర్కారుకు కళ్లు బైర్లు కమ్మాయి. ఈ పరిస్థితులపై జనం దృష్టి మరల్చేందుకు వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడు తూ విష రాజకీయానికి తెరలేపింది. ఇప్పటికే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అక్రమ కేసులో అరెస్టు చేసి ఇబ్బందులు పెడుతోంది. వీరి అరెస్టు ను నిరసిస్తూ జిల్లా అంతా భగ్గుమంటోంది. మత్స్యకార సామాజిక వర్గమైతే మండిపడుతోంది. టీడీపీకి బుద్ధి చెబుతామంటూ హెచ్చరిస్తోంది. అంతటితో ఆగలేదు. తాజాగా ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్తో పాటు 21 మందిపై అక్రమ కేసులు పెట్టింది. మహిళా ఎస్ఐ ప్రవళ్లిక ఆత్మాభిమానం టీడీపీ నాయకులే దెబ్బ తీసి, వైఎస్సార్సీపీ నాయకులు అనుచితంగా వ్యవహరించా రని లేనిపోని సెక్షన్లు నమోదు చేసింది. ఆ కేసులో ఏ–9గా ఉన్న గరుగుబిల్లి తేజేశ్వరరావు తన కుమా ర్తె అడ్మిషన్ కోసం పంజాబ్ వెళ్తే.. ఇక్కడ ఉన్నట్లు అక్రమ కేసు బనాయించింది. తాను పంజాబ్లో ఉన్నానని ఫొటోలు, వీడియోలు, టిక్కెట్లు పెట్టి తప్పుడు కేసు బాగోతం బయటపెట్టారు. అదే విధంగా వైఎస్ జగన్ పర్యటన సమయంలో కోర్టు లో ఉన్న న్యాయవాది దానేటి రామ్మోహన్రావుపై ఏ–8గా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న డాక్యుమెంట్ రైటర్ నాను పాత్రును సురేష్పై ఏ–11గా కేసులు పెట్టిందంటే చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్న మాజీ ఎమ్మె ల్యే గొర్లె కిరణ్కుమార్తో పాటు 23 మందిపై అక్రమ కేసులు బనాయించింది. మరికొందరిపైన కేసులు పెడతామని లీకులిస్తోంది. దీన్ని బట్టి చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను చూసి ఎంత భయపడుతుందో స్పష్టమవుతోంది. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో ప్రతిపక్ష నాయకులను భయపెడితే భయపడే రకం కాదని, మరింత గొంతెత్తుతామని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. ‘న్యాయవాదిని నిందితుడిగా చేర్చడం తగదు’ ఆమదాలవలస: గత నెల 30వ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విధుల్లో ఉన్న బార్ అసోసియేషన్ సభ్యుడు, న్యాయవాది దానేటి రామ్మోహన్రావును పోలీసులు ఎ–8గా చేర్చడం సరికాదని ఆమదాలవలస బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మిబాయి తోపాటు బార్ అసోసియేషన్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు కోర్టు ఆవరణలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అసలు వైఎస్ జగన్ పర్యటనకే వెళ్లని రామ్మోహన్ రావు మహిళా ఎస్ఐతో అనుచితంగా ప్రవర్తించినట్లు కేసు నమోదు చేయడం హేయనీయమన్నారు. న్యాయవాదులను ఇలాంటి బురద జల్లే కేసుల్లో ఇరికించడం వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకువస్తుందని తెలిపారు. దీనిపై రెండు రోజులు పాటు న్యాయవాదులమంతా విధులు బహిష్కరిస్తున్నట్లు వారు వెల్లడించారు. -
ప్రతిరోజూ అర్జీలపై సమీక్షించుకోవాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 187 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: పీజీఆర్ఎస్కు వచ్చే వినతులపై అధికారులు ప్రతిరోజూ సమీక్షించుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రతిరోజూ అర్జీలపై సమీక్ష చేస్తే పెండింగ్లో ఉండవన్నారు. ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంగా 187 అర్జీలు స్వీకరించగా.. వీటిలో రెవెన్యూ 45, పంచాయతీ రాజ్ 23, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 19, స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు 19, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 6, వాటర్ రిసోర్సెస్ ఈఎన్సీ 4, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 8, రూరల్ వాటర్ సప్లయ్ 4, ఏపీఈపీడీసీఎల్ 6, స్కూల్ ఎడ్యుకేషన్ 4, సమగ్ర శిక్ష 3, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 3, రూరల్ డవలప్మెంట్ 2, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2, హోం, ఆర్అండ్బీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, వ్యవసాయం శాఖ, మత్స్యశాఖ తదితర శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి అర్జీ చొప్పున స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ జి.జయదేవి, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహిళా, శిశు సంక్షేమ శాఖకు సంబంధించి తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. పలు వినతులు పరిశీలిస్తే... ● తన దివ్యాంగత శాతాన్ని తగ్గించడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోల్పోతున్నానని శ్రీకాకుళం నగరంలోని కొత్తపేటకు చెందిన బొమ్మాలి పోలినాయుడు గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. తనకు రెండు కాళ్లులేవని, నడవలేని స్థితిలో ఉన్నానని తెలిపారు. తనకు పూర్తస్థాయి దివ్యాంగ ధ్రువపత్రం ఇప్పించాలని కోరారు. ● రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న విద్యుత్ బస్సులు ప్రైవేటు ఆర్గనైజేషన్కి ఇవ్వాలన్న ఆలోచన ఆపాలని, ఈ నిర్వహణ ఆర్టీసీ నిర్వహించాలని ఏపీపీటీడీ(ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు జిల్లాలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల అందరి సంతకాలతో కూడిన వినతిపత్రాలను కలెక్టర్కు అందజేసి ముఖ్యమంత్రికి సమర్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నడపాలనే విధానాన్ని పూర్తిగా విరమించుకొని, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ ద్వారానే విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీ ఉద్యోగులతోనే నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని జేఏసీ ప్రతినిధులు పి.తేజేశ్వరరావు, వై.అయ్యప్ప తదితరులు కోరారు. ● పాతపట్నంలోని ఒక ప్రైవేటు కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన (ఏపీవై) రాష్ట్ర నాయకులు సల్లా శాంతారావు, రాజ్యాంగ పరిరక్షణ సంఘం సభ్యులు పీజీఆర్ఎస్లో కోరారు. అర్హత లేని ఉపాధ్యాయులతో బోధన చేయించడం, అనుమతులు లేని హాస్టళ్లు నిర్వహించడం, విద్యార్థులపై వేధింపులు ఇతర అక్రమాలకు పాల్పడుతున్న ఆ స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలి కోరారు. -
మన యుద్ధం మొదలైంది
● సమష్టి కృషితో వైఎస్ జగన్ పర్యటన విజయవంతం ● మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు జిల్లాకు చంద్రబాబు ఏమైనా చేశారా..? ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని, గత మూడు రాష్ట్ర బడ్జెట్లలో శ్రీకాకుళం జిల్లా కు సంబంధించి ఒక్క పైసా కూడా తీసుకు వచ్చిన దాఖలాలు లేవని ధర్మాన దుమ్మెత్తిపోశారు. ఆల్ ఇండియా అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్ వంటి వారిని తప్పుతోవ పట్టించడంలో చంద్రబాబుకు ఎవ్వరూ సాటిరారన్నారు. ఉత్తరాంధ్రకు భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టును తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని స్పష్టం చేశారు. విమానాశ్రయ నిర్మాణంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్ర ఏంటో ప్రజల కు వివరించాలన్నారు. చంద్రబాబునాయుడు తన పదవీ కాలంలో శ్రీకాకుళం జిల్లాకు చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు గానీ, అభివృద్ధి పనులు ఏమైనా తీసుకొచ్చారా అంటూ ధర్మాన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ప్రతి సమావేశాలు, సభల్లోనూ ప్రకటనలను జారీ చేయడమే తప్ప వాటికి కార్యాచరణ చూపడం లేదన్నారు. శ్రీకాకుళం రూరల్: సమష్టి కృషితో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేశామని మాజీ మంత్రి సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. పెదపాడులోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం కార్యకర్తల అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఆయన మా ట్లాడారు. తెలుగుదేశం పార్టీపై యుద్ధం మొదలుపెట్టామని, మరో మూడేళ్లు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. పార్టీ సమావేశాల్లోనూ, కార్యక్ర మాల్లోనూ ప్రతి నాయకుడు, కార్యకర్త ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలని కార్యకర్తలకు సూచించారు. టీడీపీ దొంగల పార్టీ అని, వారు చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. పార్టీలో పదవులు పొందిన వారు కష్టపడి పనిచేయాలని, అలా చేయకుండా ఉండిపోతే ఆ పదవులు వేరొకరికి అప్పగించాలని నాయ కులకు సూచించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టుపై స్పందించిన నాయకులు, మత్స్యకారులను ఏకతాటిపై తెచ్చిన వారిని అభినందించారు. అధికార పార్టీ చేసిన తప్పులను ప్రశ్నిస్తే పోలీసు వ్యవస్థను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను జైలులో పెట్టడం సర్కారుకు అలవాటుగా మారిందని, మార్పు ఇక్కడి నుంచే మొదలవుతోందన్నారు. ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవిపై లేనిపోని తప్పులను మోపుతూ క్రిమినల్ కేసులు నమోదు చేయడం చాలా అన్యాయమన్నారు. ఈ ప్రభుత్వం దమనకాండ నశించాలంటే ప్రతి నియోజకవర్గంలోనూ, గ్రామ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మండల పార్టీ అధ్యక్షుడు చిట్టి జనార్ధనరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు అంధవరపు సూరిబాబు, ఎంవీ పద్మావతి, ఎన్ని ధనుంజయరావు, అంబటి శ్రీనివాసరావు, చల్లా రవికుమార్, డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, గొండు రఘరామ్, ముంజేటి కృష్ణమూర్తి, గొండు కృష్ణమూర్తి, పీస గోపి, మూకళ్ల తాతబాబు, మండవల్లి రవి, సాధు వైకుంఠరావు, గద్దిబోయిన కృష్ణయాదవ్, పొన్నాడ రుషి, వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు. -
సాయం అందక సతమతం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో తల్లికి వందనం పథకం అందకపోవడంతో అనేక మంది పేద తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. ఈ పథకం కొంతమందికే పరిమితం చేసి, మిగిలిన వారికి వివిధ కారణాలు చూపి నిలిపివేశారు. దీంతో సోమవారం పీజీఆర్ఎస్లో అనేకమంది ఫిర్యాదులు చేశారు. వాటిని పరిశీలిస్తున్న అధికారులు హౌస్హోల్డ్ మ్యాపింగ్ తప్పు, ఆదాయపు పన్ను తదితర కారణాలతో వారిని తిప్పి పంపుతున్నారు. దీనిపై గత రెండు వారాలుగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అయితే ఒక్కటి కూడా పరిష్కారం అయినట్లు లేదు. ఎక్కువగా హౌస్హోల్డ్ మ్యాపింగ్లో లోపాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హులైన పలువురు సంక్షేమ పథకాల లబ్ధికి దూరమవుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను సవరణ చేయలేదు. అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో ఇటీవల వివాహం అయినవారు. వేరే కుటుంబాలుగా ఏర్పడినవారు, పిల్లలు ఉన్నవారు నాలుగేళ్ల క్రితం ఉన్న మ్యాపింగ్లోనే ఉంటున్నారు. జిల్లాలో అనేక మందికి అందని ‘తల్లికి వందనం’ పీజీఆర్ఎస్లో భారీగా ఫిర్యాదులు గత వారం ఫిర్యాదులు పరిష్కారమవ్వని వైనం గతవారం పీజీఆర్ఎస్కు వచ్చాను. అప్పుడు రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. కానీ ఇప్పటికీ పరిష్కారం అవ్వలేదని నందిగాం మండలం దీనబందుపురం గ్రామానికి చెందిన పోలాకి శారద ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిద్దరికీ తల్లికి వందనం పథకం నగదు పడలేదని వాపోయారు. గతేడాది పథకం వచ్చిందని, కానీ ఈ ఏడాది రాలేదని తెలిపింది. తనకు కొడుకు మోక్షిత్ నాలుగో తరగతి, పాప నిత్యశ్రీ రెండో తరగతి చదువుతున్నారని తెలిపారు. వారికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వలన నగదు పడలేదని అధికారులు చెబుతున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు సమస్యను పరిష్కరించి నగదు పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
డీఎస్సీ అక్రమాలకు విద్యాశాఖ మంత్రిదే బాధ్యత
● విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే ● విద్యా దీవెన, వసతి దీవెన వెంటనే చెల్లించాలి ● ఇచ్ఛాపురంలో డీఎస్సీ అక్రమాలపై చర్చా వేదిక ఇచ్ఛాపురం: డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని బస్టాండ్ కూడలి సమీపంలోని గల టౌన్హాల్లో ఆయన ఆధ్వర్యంలో సోమవారం యువత, నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు, వివిధ విభాగాల ప్రతినిధులతో డీఎస్సీ అక్రమా లపై చర్చా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సమన్వయకర్త మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో డీఎస్సీ కన్వీనర్ని పక్కన పెట్టి ప్రశ్న పత్రాల తయారీ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని, ప్రశ్న పత్రాల తయారీ ప్రక్రియను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం, స్పోర్ట్స్ కోటా నియమనిబంధనలు మార్చడం చేశారని తెలిపారు. వీటిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక్కో పోస్టుని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు అమ్ముకుని అర్హులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు చెప్పినట్లు నిరుద్యోగ భృతి, విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించారని, తాము కూడా ఇకపై ఎమ్మెల్యేను ఏకవచనంతోనే పిలుస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీసీ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురా లు ఉలాల భారతిదివ్య, ఎంపీపీలు బోర పుష్ప, పైల దేవదాస్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పా డ నారాయణమ్మ పట్టణ అధ్యక్షుడు ప్రకాశరావు పట్నాయక్, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు కడియాల ప్రకాష్, నర్తు ప్రేమ్కుమార్, తడక జోగారావు, సల్లాదేవరాజు, నర్తు ప్రసాద్, ఆశిపురుషోత్తంరెడ్డి, సారధి, వివేకానంద్, సాలిన గాంధీ, సీతయ్య, ఎండీ షఫీ, కిరణ్బెహర, త్రినాథ్, సాడి జయరామ్, అభి తదితరులు పాల్గొన్నారు. -
బ్యాగ్ పెయిన్..!
● బడి పిల్లలపై బ్యాగుల భారం ● అధిక పుస్తకాలతో వెన్నెముకపై ఒత్తిడి ● నొప్పులతో సతమతమవుతున్న చిన్నారులు ● పట్టించుకోని అధికారులు హిరమండలం: ఆటపాటలతో సాగాల్సిన చిన్నారుల బాల్యం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల పుణ్యమా అని మోయలేని పుస్తకాల భారంతో నలిగిపోతోంది. జిల్లావ్యాప్తంగా 2,612 ప్రభుత్వ, 402 ప్రైవేటు పాఠశాలల్లో కలిపి 2.5 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే చాలా ప్రైవేటు పాఠశాలల్లో 1–5 తరగతులకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలతో పాటు సొంత మెటీరియల్ అంటగడుతున్నారు. అలాగే ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలు ధనార్జనే ధ్యేయంగా ఒలింపియాడ్, జేఈఈ, నీట్ స్టడీ మెటీరియల్ అంటూ భారీగా పుస్తకాలను ఇస్తున్నారు. దీంతో బండెడు పుస్తకాలను బ్యాగులో వేసుకుని నేటితరం బాల్యం నిత్యం నరకయాతన అనుభవిస్తోంది. దాదాపు రెండు నుంచి నాలుగు వరకు అంతస్తుల్లో ఉన్న తరగతి గదులకు మెట్లు మీదుగా చేరలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫలితంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. అమలు కాని ‘స్కూల్ బ్యాగ్ పాలసీ’ విద్యాహక్కు చట్టం–2009 యశ్పాల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం స్కూల్ బ్యాగ్ పాలసీని ఆరేళ్ల క్రితం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం 1, 2 తరగతుల వారికి తెలుగు, ఆంగ్లం, గణితం.. 3, 4, 5 తరగతులైతే ఆ మూడింటికి తోడు పరిసరాల విజ్ఞానం, 6 నుంచి 10 తరగతులైతే ఆరు పుస్తకాలే ఇవ్వాలి. కానీ స్కూల్ బ్యాగ్ పాలసీని ప్రైవేటు పాఠశాలల్లో సక్రమంగా అమలు చేయడం లేదు. వేర్వేరు పేర్లతో అధికంగా పుస్తకాలు కట్టబెడు తున్నారు. దీంతో బాల్యంపై మోయలేని పుస్తకాల భారం పడుతోంది. స్కూల్ బ్యాగ్ పాలసీ ప్రకారం విద్యార్థి శరీర బరువులో 10 శాతానికి మించి స్కూల్ బ్యాగు బరువు ఉండకూడదనేది ప్రాథమిక సూత్రం. అయితే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ర్యాంకుల ఉచ్చు, అదనపు సిలబస్ మార్కెట్ వ్యూహాల వల్ల ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కేస్తున్నారు. ప్రభుత్వాలు జీవోలు జారీ చేయడం, అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేయడం మినహా క్షేత్రస్థాయిలో శాశ్వత పరిష్కారం లభించడం లేదు. పాఠశాల విద్యార్థులు తమ శరీర బరువులో 10 శాతానికి మించి బరువులు మోయడం అత్యంత ప్రమాదకరం. లేత వయస్సులో ఎముకలు, వెన్నెముక పూర్తిగా ఎదుగుదల దశలో ఉంటాయి. అలాంటి సమయంలో ప్రతిరోజూ ఎక్కువ బరువును వీపుపై మోస్తూ బస్సులు, మెట్లు ఎక్కడం వల్ల వెన్నుపూసపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. చిన్న వయస్సులోనే నడుము నొప్పి, మెడ నొప్పి, భుజాల కండరాలు పట్టేయడం వంటి సమస్యలు వస్తాయి. స్కూల్ బ్యాగుల బరువు తక్షణమే తగ్గించకపోతే భావితరం శారీరకంగా బలహీనపడుతుంది. – పి.సాయికుమార్, పీహెచ్సీ వైద్యాధికారి, హిరమండలం -
మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్పై కేసు నమోదు
● జేఆర్పురం స్టేషన్లో 23మంది కేసు ● ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో 11మందిపై కేసులు నమోదు రణస్థలం: ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్తో సహా 23 మంది వైఎస్సార్సీపీ శ్రేణులపై జేఆర్ పురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. గత నెల 30వ తేదిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో రణస్థలం మండల కేంద్రంలో, ఎచ్చెర్ల మండలంలోని కుశాలపురం జంక్షన్ల వద్ద భారీగా జన సమీకరణ చేశారని, ర్యాలీలు నిర్వహించారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో ఈ నెల 2వ తేదీ ఆదివారం అర్ధరాత్రి కేసులు నమోదు చేసినట్లు జేఆర్ పురం ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. అలాగే ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో 11మంది వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు నమోదు చేశామని జేఆర్ పురం సీఐ ఎం.అవతారం తెలిపారు. -
సాగని వేట.. గడవదు పూట
● మత్స్యకారులకు చిక్కని చేప ● నెల రోజులుగానే అరకొర వేట ● పొగురుతో వేట సాగక అవస్థలు పొగురు తొలగించాలి మత్స్యశాఖ అధికారులు పొగురు( ఇసుక మేటలు)తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. లేకపోతే తుపాను అనంతరం కూడా జెట్టీ నుంచి మెకనైజ్డ్ బోట్లు వేటకు వెళ్లలేని పరిస్థితి ఎదురవుతుంది. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన బోట్లు పాడైపోతాయి. వలలు, ఐస్బాక్స్లు, బోట్లు సబ్సిడీపై అందించాలి. – కె.సింహాచలం, మత్స్యకారుడు, మంచినీళ్లపేట చేప చిక్కడం లేదు గత ఏడాది ఈ సీజన్లో అడపా దడపా చేపలను అమ్ముకున్నాం. కానీ ఈ ఏడాది చేప మాత్రం చిక్కడం లేదు. అలలు ఎగసి ప డుతున్నాయి. అలల ధాటికి తీ రం కోతకు గురైంది. వేటలేక పస్తులు ఉంటున్నా. – సీహెచ్ భీమారావు, మత్స్యకారుడు, మంచినీళ్లపేట వజ్రపుకొత్తూరు: గంగ పుత్రులకు నెల రోజులుగా బెంగ పట్టుకుంది. సంద్రంలో వేట సరిగ్గా సాగకపోవడంతో పూట గడవడం లేదు. అటు శ్రీలంక నుంచి ఇటు విశాఖపట్నం వరకు పెద్ద ఎత్తున మర పడవలు గంగపుత్రుల సముద్ర సంపదను ఎత్తుకు పోతున్నా యి. కోస్ట్ గార్డు, ఇతర నిఘా విభాగాలు అటుగా దృష్టి సారించకపోవడంతో అపారమైన మత్స్య సంపద స్థానికులకు అందకుండా పోతోంది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలతో కుస్తీ పట్టి సంద్రంలోకి వెళ్తున్న మత్స్యకారులు ఖాళీ వలలతో ఇంటికి వస్తున్నారు. ఇచ్ఛాపురం నుంచి ఇటు రణస్థలం తీరం వరకు మత్స్యకారులకు ఇదే పరిస్థితి. వేట సాగేది ఎలా..? వేట నిషేధ కాలంలో మర పడవల దొంగ వేట, కర్మాగారాల నుంచి విడుదలయ్యే విష జలాలు, కలుషితమవుతున్న నదీ జలాలు సంద్రంలో కలుస్తుండడం వల్ల చేపల పునరుత్పత్తి తగ్గుతోంది. విష జలాలు, మర పడవల కారణంగా చేపల గుడ్లు వి చ్ఛిన్నమై సంతతి అభివృద్ధి తక్కువైపోతోంది. దీంతో సీజన్లో దొరకాల్సిన రొయ్యిలు, కానాగత్తలు, కవ్వళ్లు, మొరవలు, ట్యూనా, కోనేం, నెత్తళ్లు, మాగ లు తదితర చక్కటి ఆదాయాన్నిచ్చే చేపలు దొరకం లేదు. గత ఏడాది జిల్లాలో దాదాపు 520 టన్నుల వరకు రొయ్యిలు, 1320 టన్నుల వరకు కానాగత్త లు లభించాయి. కానీ నేడు అందులో సగం కూడా రాలేదని మత్స్యకారులు చెబుతున్నారు. గత ఏడాది కోనేం అస్సలు కనిపించకపోగా.. ఈ ఏడాదీ అదే దుస్థితి దాపురించింది. దీంతో వేటపైనే ఆధారపడుతున్న ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థ లం మండలాల పరిధిలోని దాదాపు 27 వేల మంది మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది. కోతకు గురవుతున్న తీరం తుపానులు, సముద్రం కల్లోలంగా ఉన్న సమయాల్లో తీరం పెద్ద ఎత్తున కోతకు గురవుతోంది. ఇది ప్రధానంగా మంచినీళ్లపేట, దేవునల్తాడ, అక్కుపల్లి, గుణుపల్లి, డోకులపాడు తీరాల్లో అలల ధాటికి తీరం కోతకు గురవుతోంది. మంచినీళ్లపేట, నువ్వలరేవు మత్యకారులకు ఏటా పొగురు (తీరంలో ఇసుక మేటలు) జీవన్మరణ సమస్యగా పరిణమించింది. ఏటా రూ.3లక్షలు వరకు ఖర్చు చేస్తున్నా శాశ్వత పరిష్కారం లభించడం లేదు. సముద్ర తీరానికి ఫిషింగ్ జెట్టీకి మధ్య ఇసుక మేటలు పేరుకుపోయి ఉండడంతో మంచినీళ్లపేట ఫిషింగ్ జెట్టీ వద్ద లంగరు వేసి 76 మెకనైజ్డ్ బోట్లకు మరో 100 సంప్రదాయ తెప్పలు వేటకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయాయి. దీని ప్రభావంతో వేటపై ఆధార పడుతున్న సుమారు 350 మంది మత్స్యకారులు 20 రోజులుగా వేట లేక అవస్థలు పడుతున్నారు. అంతంత మాత్రంగా వేట సముద్రంలో గత నెల రోజులుగా జరుగుతున్న వాతావరణ మార్పులు కారణంగా వేట సాగడం లేదని మత్స్యకారులు కొమర సింహాచలం, సీహెచ్ భీమారావు, కొర్లయ్య, దానయ్య, తదితరులు చెబుతున్నారు. చిరిగిన వలలకు మరమ్మతులు చేసుకుంటున్నామని తెలిపారు. మత్స్య సంపద బాగా తగ్గిపోయిందని, సీజన్లో పడాల్సిన చేపలు వలకు చిక్కడం లేదన్నారు. వేట నిషేధం అనంతరం ఏటా ఈ సీజన్లో విలువైన రొయ్యిలు, కానాగత్తలు ఇతర చేపలు వలకు చిక్కాలి. కానీ ఆ పరిస్థితి లేదు. నెలలో రూ. 20వేలు వరకు డీజిల్ ఖర్చు చేసి వేటకు వెళ్లినా మదుపు రావడం లేదని వాపోతున్నారు. దీంతో యువకులు కాండ్లా, గుజరాత్, గోవాతో పాటు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు. -
‘మీడియేషన్ 3.0తో ఇంటి వద్దకే న్యాయం’
శ్రీకాకుళం పాతబస్టాండ్: మీడియేషన్ 3.0తో ప్రజల ఇంటి వద్దకే న్యాయ సేవలు అందుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సునీత కొండబోలు అన్నారు. జిల్లా న్యాయ సేవా సదన్లో ‘మీడియేషన్ 3.0’ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొండబోలు పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న వివాదాలను త్వరితగతిన, ఖర్చు లేకుండా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం అత్యుత్తమ మార్గమన్నారు. మీడియేషన్ 3.0 ద్వారా సామాన్య ప్రజలకు ఇంటి వద్దకే న్యాయం చేరుతుందని తెలిపారు. ప్రజలు తమ వ్యాజ్యాలను కోర్టుకు వెళ్లకుండానే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు జిల్లా న్యాయ సేవా సదన్, శ్రీకాకుళం ను సంప్రదించాలని అధికారులు తెలిపారు. సీనియర్ డివిజన్ అడిషనల్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ మాట్లాడుతూ కోర్టు తీర్పు కంటే రాజీ ద్వారా వచ్చే పరిష్కారం శాశ్వతంగా ఉంటుందని తెలిపారు. ఈ మీడియేషన్లో భాగంగా జిల్లాలోని అన్ని కోర్టుల్లో ప్రత్యేక మధ్యవర్తిత్వ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టెట్కు పక్కా ఏర్పాట్లు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 5 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న ఆన్లైన్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్–2026 నిర్వహణకు జిల్లా యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పరిధిలోని 7 కేంద్రాల్లో మొత్తం 12,593 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ఎచ్చెర్లలోని శ్రీ శివాని కాలేజ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్, నర్సన్నపేటలోని కోర్ టెక్నాలజీస్, టెక్కలిలోని ఐతామ్ కాలేజ్ కేంద్రాలతో పాటు పొరుగు రాష్ట్రమైన ఒడిశాలోని బరంపురం పరిధిలోని స్మిత్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ సెంటర్, ఐవోఎన్ డిజిటల్ జోన్, గవర్నమెంట్ ఐటీఐ కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని వివరించారు. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని, ఉదయం 9:30 గంటల పరీక్షకు 8:30 గంటలకు, మధ్యాహ్నం 2:30 గంటల పరీక్షకు 1:30 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. సందేహాల నివృత్తి కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సహాయ కమిషనర్ జి.చంద్రభూషణ్ 7569633183, సూపరింటెండెంట్ ఎంవీటీ రామనాథం 9490557309, సీనియర్ అసిస్టెంట్ కె.శ్యామలరావు 9494094904 లను సంప్రదించవచ్చని వెల్లడించారు. జిల్లా విద్యా శాఖాధికారి రవిబాబు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్పీ గ్రీవెన్స్కు 61 వినతులు శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్సుకు బాధితుల నుంచి 61 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రాణభయం ఉంది.. రక్షణ కల్పించండి తమ పొలం పక్కన గెడ్డవాగు తోవ ప్రభుత్వం వారిదని తెలిసినా, ఆ మార్గం గుండా రాకూడదని పక్క పొలం రైతు అల్లాడ గోవిందరావు తనపైన, తన కుటుంబంపైన దాడికి పాల్పడ్డాడని లావేరు మండలం కేశవరాయపురం గ్రామానికి చెందిన లంకలాపల్లి రమణ ఎస్పీ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. గతంలో హత్య కేసులో గోవిందరావు ముద్దాయి అయినందున తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. క్రీడలతో మానసిక ఉల్లాసం శ్రీకాకుళం పాతబస్టాండ్: క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి కనబర్చాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సునీత సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ రకాల ఆటల పోటీలను సోమవారం కోర్టు వద్ద ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులు, బార్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
స్పందించిన జిల్లా అధికారులు
ఇచ్ఛాపురం: మున్సిపాలిటీ 15వ వార్డు దాంపేటలో పుట్టుకతోనే 89శాతం అంగవైకల్యం కలిగిన ఎనిమిదేళ్ల శుభం మహరాణ పరిస్థితిపై అధికారులు స్పందించారు. చిన్నారి పరిస్థితిని వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్త సాడి శ్యామ్ ప్రసా ద్ రెడ్డి వెలుగులోకి తీసుకురాగా.. సోమవారం ‘సాక్షి’లో ఈ వార్త ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేర కు ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల ఉపాధ్యాయ సిబ్బంది సోమవారం దివ్యాంగ చిన్నా రి ఇంటికి వచ్చి పూర్తి వివరాలు సేకరించారు. సంబంధిత నివేదిక సిద్ధం చేసి కలెక్టర్కి పంపించారు. మంగళవారం సదరం కోసం రిమ్స్కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థినిని కాపాడిన లోకో పైలెట్ పాతపట్నం: విశాఖపట్నం నుంచి గుణుపూర్ వెళుతున్న రైలు పాతపట్నం రైల్వే స్టేషన్ వచ్చే సమయంలో ఓ విద్యార్థిని సెల్ఫోన్లో మాట్లాడుతూ ట్రాక్పై పడిపోయింది. లోకో పైలెట్ వెంటనే అప్రమత్తమై ట్రైన్ ఆపడంతో విద్యార్థి స్వల్ప గాయాలతో బయటపడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం నుంచి గుణుపూర్ రైలు పాతపట్నం రైల్వే స్టేషన్కు వచ్చే సమయంలో ఎదురుగా పాతపట్నం మహేంద్ర డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం డిగ్రీ చదువుతున్న బురల్ల రామజ్యోతి రైల్వే ప్లాట్ఫారంపై సెల్ ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్పై పడిపోయింది. వెంటనే లోకో పైలెట్ అప్రమత్తమై రైలును నిలిపివేయడంతో విద్యార్థిని స్వల్ప గాయాలతో బయటపడింది. స్థానికులు 108 సాయంతో ఆమెను పాతపట్నం సీహెచ్సీకి తరలించారు. పిడుగు పడి వివాహిత మృతి టెక్కలి రూరల్: కోటబొ మ్మాళి మండలం చిట్టేయవలస పంచాయతీ చవితిపేట గ్రామానికి చెందిన సంపతిరావు సుజాత(40) అనే వివాహిత సోమవారం పిడుగు పడి మృతి చెందారు. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. చవితిపేట గ్రామానికి చెందిన ఎస్.సుజాత తన పొలంలో పనులు చేసేందుకు వెళ్లారు. కలుపు మొక్కలను తీస్తుండగా ఒక్కసారిగా వర్షం పడటంతో ఆమె అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో సమీపంలో పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే పడిపోయింది. సమీపంలో పనిచేస్తున్న తోటి పనివారు ఆమె వద్దకు పరుగున వెళ్లి పరిశీలించగా ఆమె అప్పటికే మృతిచెందినట్లు గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద రోదించారు. విషయం తెలుసుకున్న కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త సింహాచలం, కుమారుడు లక్ష్మణరావు, కుమార్తె త్రివేణి ఉన్నారు. -
సీదిరి విడుదల కావాలంటూ గంగమ్మ తల్లికి పూజలు
వజ్రపుకొత్తూరు: మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు జైలు నుంచి బెయిల్పై త్వరగా విడుదల కావాలంటూ దేవునల్తాడ తీరంలో ఆదివారం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఎంపీటీసీ సభ్యుడు సౌదాల వెంకన్న ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు తిర్రి రాజారావు, సీనియర్ నాయకులు పుక్కళ్ల గురయ్యనాయుడు మహిళలతో కలిసి గంగమ్మ తల్లిని వేడుకున్నారు. డాక్టర్ సీదిరి అప్పలరాజు అక్రమ అరెస్టును ఖండిస్తున్నామంటూ నినాదాలు చేశారు. మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడిని తాము కాపాడుకుంటామని అన్నారు. కార్యక్రమంలో మత్స్యకార ఐక్య వేదిక నాయకులు అడ్వకేట్ కొమర దేవరాజు, అంబటి ఆనంద్, వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు దున్న బాలరాజు, వైస్ ఎంపీపీ వంక రాజు, యువజన విభాగం కార్యదర్శి కర్ని శ్రీను, చింత హేమారావు, గూడ భాస్కరరావు తదితరులు ఉన్నారు. -
దారిద్య్రం
మెళియాపుట్టి: గత ప్రభుత్వం హయాంలో ఐటీడీఏ నిధులు రూ.1.72 కోట్లతో రింపి నుంచి ఆంపురం గ్రామానికి వెళ్లే రహదారి మంజూరైంది. పనులు ప్రారంభం సమయానికి ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది. కానీ ఇప్పటికీ ఆ రహదారి నిర్మాణాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దాంతో రహదారి అస్తవ్యస్తంగా తయారై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఆంపురం గ్రామంలో బందపల్లి గౌరేశు, రంకిణి మల్లేశు, నేలబొంతు నాగేష్, బందపల్లి ఆదిలక్ష్మీ, డొలిబేరు లక్ష్మీ తోపాటు పలువురు గ్రామస్తులు ‘సాక్షి’తో మాట్లాడారు. రహదారి అస్తవ్యస్తంగా తయారై రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో అత్యవసర సమయాల్లో అవస్థలు పడుతున్నామని, పట్టించుకునే వారే కరువయ్యారని తెలిపారు. వెంటనే రహదారి పనులు ప్రారంభించాలని కోరారు. -
అందివచ్చిన కొడుకు.. అనంత లోకాలకు
కొత్తూరు: ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మర ణం పాలైన ఘటన మండలంలోని పారాపురం గ్రామం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు ప్రకారం.. మండలంలోని గురండి గ్రామానికి చెందిన అలికాన ధర్మారావు, సావిత్రి దంపతులకు ముగ్గురు కుమారులు. అందులో మొదటి కుమారుడు ప్రసాద రావు (31) కొత్తూరులో ఉన్న ఏటీఎం నుంచి నగదు తీసుకునేందుకు తన స్వగ్రా మం గురండి నుంచి ఆదివారం బైక్ మీద కొత్తూరు వ చ్చాడు. నగదు తీసుకుని తిరిగి బైక్పై వెళ్తుండగా పారాపురం వద్ద మెట్టూరు నుంచి కొత్తూరు వైపు ఎదురుగా వస్తున్న లారీ ప్రసాదరావు బైక్ను బలంగా ఢీకొంది. దీంతో ప్రసాదరావు సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలేశాడు. స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ కె. వెంకటేష్ సంఘటన స్థలానికి కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలానికి చెందిన లారీ డ్రైవర్ జి.శంకర్ అజాగ్రత్త, అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రసాదరావు శ్రీకాకుళంలో మీ సేవా కేంద్రంలో పనిచేస్తున్నాడు. తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేయగా.. పోలీసులు నచ్చజెప్పారు. -
ఆక్వా రైతులకు అదనపు కష్టం
● వనామీ రొయ్యకు వైట్ స్పాట్ ● విజృంభిస్తున్న తెల్లమచ్చ వ్యాధి ● ప్రత్యేక వాతావరణ పరిస్థితులే కారణం యాజమాన్య పద్ధతులు కీలకం ప్రత్యేక వాతావరణ పరిస్థి తుల్లో రొయ్యల చెరువుల్లో యాజమాన్య పద్ధతులు కీలకం. సాధారణంగా సాగు చేసే విధానం కంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. వ్యాధి సోకిన తర్వాత చికిత్స కాకుండా, ముందే నియంత్రణ పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా రొయ్యపిల్ల విత్తనం ఎంపికలో నాణ్యత పాటించాలి. హేచరీ స్థాయిలో కూడా వ్యాధి సోకి ఆ తర్వాత చెరువు ల్లో వ్యాప్తి చెందే అవకాశం ఉంది. – జి.విద్యాధరరావు, సీనియర్ ఆక్వా టెక్నీషియన్, సై ఆక్వా కంపెనీ -
శ్రీకాకుళం
మేం రైతులం కాదాసర్కారు వైఖరిపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు అందడం లేదంటున్నారు. –8లో● అడుగడుగునా వైఫల్యాలుఅడిగితే వేధింపులు సోమవారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2026‘10న జైలు భరోసా’ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైలు భరో కార్యక్రమం జయప్రదం చేయాలని సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రజా సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. ఆగస్టు 9 క్విట్ ఇండియా దినమని,ఆగస్టు 10న కార్మికులు, రైతులు, సా మాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాలు నిర్ణయించాయని అన్నారు. సమావేశంలో సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి పి. తేజేశ్వరరావు, జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ,ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి చంద్రరావు పోలాకి ప్రసాదరావు పాల్గొన్నారు. జెమ్స్లో అవయవదానం శ్రీకాకుళం రూరల్: గార మండలం సొండిపేట గ్రామానికి చెందిన శ్రీ సత్యసాయి మందిర కన్వీనర్ వెలమల సింహాచలం భార్య అరుణకుమారి అనారోగ్య కార ణంగా ఆదివారం మృతిచెందారు. ఈమెకు చెందిన అవయవాలను కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులను జెమ్స్ ఆస్పత్రికి దానం చేశారు. ఈమెకు సాయిగీత, రేవతి అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అంత విషాదంలోనే అవయవదానికి అంగీకరించిన కుటుంబ సభ్యులను ప్రశంసించారు. అతిథి అధ్యాపకులను ఆదుకునేది ఎవరు? శ్రీకాకుళం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న వారిని ఆదుకునే వారే లేకుండా పోయారు. వీరంతా పన్నెండేళ్లుగా సర్వీసులో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇటీవ ల చేపట్టిన కొన్ని చర్యలు కారణంగా వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో వంద మంది వరకు అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలు, జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు, ఒప్పంద అధ్యాపకులకు రెన్యువల్ చేసి న సందర్భంలో అతిథి అధ్యాపకులు రోడ్డున పడ్డారు. ఇంటర్మీడియెట్లో కూడా ఇలాంటివి జరిగినప్పటికీ అతిథి అధ్యాపకులను ఖాళీ ఉన్న కళాశాలలకు పంపించారు. ఉన్నత విద్యా శాఖ అధికారులు మాత్రం ఆ దిశగా యోచన చేయడం లేదు. ఉన్నత విద్యావంతులైన అతిథి అధ్యాపకులు పలుసార్లు ప్రజాప్రతినిధులను మంత్రులను ఉన్నత విద్యాశాఖ అధికారులను కలసి తమ గోడు విన్నవించినా పట్టించుకునే వారే లేరు. వీరికి చెల్లిస్తున్న గౌరవ వేతనం కూడా చాలా తక్కువ. ఓ క్లాసును బోధిస్తే రూ.400 చెల్లిస్తారు. అయితే ఇది గరిష్టంగా రూ.28 వేలకు పరిమితం చేయడంతో నెలకు అంతకంటే ఎక్కువ జీతం పొందే అవకాశం లేకుండా పోయింది. నెలకు 70 క్లాసులకు మాత్రమే జీతం చెల్లిస్తూ ఉండడం వలన రూ.28లు మాత్రమే జీతంగా పొందుతున్నా రు. ఈ జీతంతోనే ఎలాగోలా నెట్టుకుని వస్తుంటే.. ఇప్పుడు ఏకంగా కొలువులే తీసేస్తుండడంతో వారంతా లబోదిబోమంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : చాప కింద నీరులా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రభు త్వం డైవర్షన్ పాలిటిక్స్ ఎంచుకుంది. ప్రభుత్వ వైఫల్యం కనిపించిన ప్రతిసారీ విపక్ష నేతలపై వేధింపులు మొదలుపెడుతూ తన తప్పిదాలను దాచుకుంటోంది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టు.. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేస్తే ప్రభుత్వ లోపాలన్నీ జనం కళ్లకు కనిపించకుండా పోతాయని అనుకుంటోంది. అందులో భాగంగానే మొన్న సీదిరి అప్పలరాజు తాజాగా చింతాడ రవికుమార్పై కక్ష సాధింపులకు దిగింది. సీదిరి అప్పలరాజు ప్రజల తరఫున ప్రభుత్వా న్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. వైఫల్యాలను సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయన కొడు కు యాక్సిడెంట్ను రాజకీయం చేసి ఆ గొంతును అణచాలని చూశారు. తాజాగా వైఎస్ జగన్ సీదిరిని కలవడానికి జిల్లాకు వచ్చారు. విశాఖ నుంచి శ్రీకాకు ళం వరకు జనం ఆయనకు బ్రహ్మ రథం పట్టారు. ఇది సర్కారుకు కంటగింపుగా మారింది. ఎలాగైనా ఈ హడావుడిని తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది వైఎస్సార్సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్పై కేసులు బనాయించింది. దీని కోసం ఓ మహిళా ఎస్ఐను పావుగా ఉపయోగించుకోవడం విస్తు గొలుపుతోంది. మహిళా ఎస్ఐను ఈ జనం నుంచి పక్కకు సురక్షితంగా వెళ్లాలని సూచించిన వీడియోను చిలువలు పలువ లు చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టింది. కుట్రలు భగ్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఒక్క విషయా న్ని తేటతెల్లం చేసింది. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఆంక్షలు విధించినా జనం నుంచి జగన్ను విడదీయలేరని స్పష్టం చేసింది. జగన్ అడుగు పెట్టగానే ఉత్తరాంధ్ర జనసంద్రంగా మారింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు సాగిన వైఎస్ జగన్ ప్రయాణంలో జన ప్రవాహంతో రహదారులు నిండిపోయాయి. జనమంతా జగన్ వెంటే సాగారు. ఈ పర్యటన ప్రభుత్వానికి గుబులు పుట్టించింది. దీన్ని పక్కదారి పట్టించాలని మహిళా ఎస్ఐ ఉదంతాన్ని వాడుకుంది. ఆమదాలవలస సమన్వయకర్త చింతా డ రవికుమార్ యాక్టివ్గా ఉన్నారు. ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ తీరుపై గట్టిగా ప్రశ్నించడంతో పాటు నిలదీస్తున్నారు. ఇటీవల కాలంలో మిర్తిబట్టి భూ ఆక్రమణలపై కూన రవికుమార్కు సవాల్ విసిరారు. ఆయన చేస్తున్న అక్ర మ దందాను ఆధారాలతో చూపిస్తానని, చర్చకు రావాలని కోరారు. దీంతో కూనపై అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడం, అపూర్వ ఆదరణ లభించడంతో మహిళా ఎస్ఐ ఉదంతాన్ని తీసుకుని రాజకీ యం చేసి, కక్ష సాధింపునకు దిగారు. అక్షర దోషం.. చిన్నారికి శాపం పోలాకి: ఆక్వా రైతులకు అదనపు కష్టాలు ముంచుకువస్తున్నాయి. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల కారణంగా వనామీ రకం రొయ్యలకు వైట్స్పాట్ వ్యాధి సోకి నెలరోజుల వయసులోనే రొయ్యపిల్లలు చనిపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఎల్నినో కారణంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో చెరువుల్లో నీటి ఉష్ణోగ్రతలు పెరిగి ఉప్పుదనంలో మార్పులు ఏర్పడి వ్యాధి తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ వస్తోందని ఆక్వా టెక్నీషియన్స్ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రొయ్యలు ఒత్తిడికి గురై వ్యా ధి నిరోధక శక్తిని కోల్పోతున్నాయి. దీంతో వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్(డబ్ల్యూఎస్ఎస్వి) వేగంగా ప్రబలేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో అటు ఫీడ్ ధరలు పెరిగి, రొయ్యల కొనుగోలు ధరలతో పాటు, విద్యుత్ రాయితీలు తగ్గటంతో ఆక్వారైతులకు తెల్లమచ్చ వ్యాధి అదనపు కష్టంగా త యారైంది. జిల్లాలో సుమారుగా 4200 ఎకరాల్లో సుమారుగా 400 మంది ఆక్వాసాగు చేస్తున్నారు. విపక్ష నేతలపై సాగుతున్న వేధింపుల పర్వం అక్రమ కేసుల్లో అరెస్టు చేసి, జైలుకు పంపించడమే లక్ష్యం మొన్న సీదిరి అప్పలరాజు, నేడు చింతాడ రవికుమార్ పోలీసులను పావుగా వాడుకుంటున్న అధికార పార్టీ వైఎస్ జగన్ పర్యటనకు వచ్చిన ఆదరణ చూడలేక డైవర్షన్ పాలిటిక్స్ మహిళా ఎస్ఐ ప్రవళ్లిక ఆత్మాభిమానం దెబ్బతినేలా టీడీపీ నేతల ప్రెస్మీట్లు అసలు జరిగిందేమిటి.? వైఎస్ జగన్ పర్యటనలో విపరీతమైన జనం రావడంతో ఆ క్రౌడ్ మధ్య మహిళా ఎస్ఐ ప్రవల్లిక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించి, అప్పటికే ఆరోగ్య సమస్యతో ఉన్న ఎస్ఐ ప్రవల్లికను పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో నినాదాల హోరు ఎక్కువగా ఉండటంతో ఆ శబ్ధానికి ఆమె చెవులు మూసుకున్నారు. కానీ చెవు లు మూసుకున్న దృశ్యాలను చూపించి మహిళా ఎస్ఐపై అనుచితంగా వ్యవహరించారని కేసు పెట్టారు. వాస్తవంగా ఆ మహిళా ఎస్ఐ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యవహరించింది టీడీపీ నాయకులే. ప్రెస్మీట్లు పెట్టి అది జరిగింది, ఇది జరిగిందంటూ ఊరువాడా ప్రచారం చేశారు. వాస్తవానికి అదే మహిళా ఎస్ఐపై తోటి పోలీసు సిబ్బంది ఆ రద్దీలో ఇబ్బందికరంగా వ్యవహరించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఇది ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. -
‘స్థానిక ఎన్నికల్లోపు సీపీఎస్ రద్దు చేయాలి’
శ్రీకాకుళం అర్బన్, శ్రీకాకుళం: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ భవనంలో ఏపీసీపీఎస్ఈఏ జిల్లా అధ్యక్షులు చల్ల సింహాచలం అధ్యక్షతన ఆదివారం ఏపీసీపీఎస్ఈఏ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సెప్టెంబర్ 1న గుంటూరులో నిర్వహించనున్న ‘సమర శంఖం’ కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో సీపీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతా మని చెప్పిన ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేద ని విమర్శించారు. ఉద్యోగుల విశ్వాసాన్ని కోల్పోతే ప్రభుత్వాలే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని కరిమి రాజేశ్వరరావు హెచ్చరించారు. విశాఖపట్నం, కడప, అనంతపురంలో నిర్వహించిన ఉద్యమా లను ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొంటూ, సెప్టెంబర్ 1న ‘పెన్షన్ విద్రోహ దినం‘ సందర్భంగా గుంటూరులో జిల్లా కలెక్టరేట్ నుంచి భారీ ర్యాలీ, అనంతరం ‘సమర శంఖం‘ పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
మేం రైతులం కాదా.?
టెక్కలి: యాభై సెంట్లు కంటే ఎక్కువ భూమి ఉంటేనే రైతు.. ఆ రైతుకే యూరియా. ఇదీ ప్రభుత్వ విధానం. ఈ ఏడాది ప్రవేశపెట్టిన యాప్లో 50 సెంట్లు కంటే తక్కువ భూమి ఉన్న రైతులను చూపకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టెక్కలి పీఏసీఎస్ కార్యాలయం వద్ద మేఘవరం పంచాయతీకి చెందిన రైతులకు యూరియా పంపిణీ చేపట్టారు. అయితే 50 సెంట్లు భూమి విస్తీర్ణం కలిగిన రైతులకు ఇదే పరిస్థితి ఎదురైంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు రైతులకు ఎదురు కాలేదు. వాస్తవంగా తక్కువ భూమి ఉన్నా, అధికంగా భూమి ఉన్నా గతంలో యూరియా పంపిణీ చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా పంపిణీ విధానంతో రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందకపోవడంతో పాటు తక్కువ విస్తీర్ణం కలిగిన రైతులకు మొండి చేయి చూపుతున్నారు. ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. అధికారులు ఏమంటున్నారంటే.. సాగులో యూరియా వాడకం తగ్గించే క్రమంలో యాప్ ద్వారా రైతులకు అవసరమైన మేరకు మాత్ర మే యూరియా అందజేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతులను యాప్లో జోడించి ఒకే రైతు పేరుతో నిర్దేశించిన భూమి విస్తీర్ణం పెంచుతూ యూరియాను అందజేసి మిగిలిన వారికి సర్దుకోమని చెబుతున్నామని అధికారులు చెప్పడం విడ్డూరమనిస్తోంది. ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇటీవల జిల్లా అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం సుమారు 83,961 మెట్రిక్ టన్నుల మేరకు అన్ని రకాల ఎరువుల అవసరం ఉంది. అయితే సుమారు 28 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు లెక్క చూపించా రు. వాటిలో యూరియా విషయానికి వస్తే 38,131 మెట్రిక్ టన్నులు యూరియాకు గాను సుమారు 16,513 మెట్రిక్ టన్నులు అందుబాటు లో ఉన్నట్లు వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో మాత్రం యూరియా పంపిణీలో గందరగోళంతో పాటు తక్కువ విస్తీర్ణం కలిగిన రైతులకు యూరియా సర్దుబాటు చేసుకునే విషయంలో అనేక అవస్థలకు గురవుతున్నారు. నాకు 50 సెంట్లు పొలం ఉంది. కౌలుకు కొంతపొలం చేస్తున్నాను. నాకు అరబస్తా యూరియా ఇచ్చారు. నేను కౌలుకు చేస్తున్న యజమానులు అందుబాటులో లేరు. నేను వ్యవసాయం ఎలా చేసేది. – చల్ల హనుమంతురావు, రామచంద్రపురం, ఆమదాలవలస మండలం నాకు అరబస్తా యూరియా ఇచ్చారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి విడ్డూరం చూడలేదు. మా పొలానికి ఎంత యూరియా అవసరం అయితే అంతే కొనుగోలు చేసుకుంటాం కాని ఎక్కువ బస్తాలు తీసుకొని యూరియాని ఏం చేసుకుంటాం. – ఇప్పిలి హేమంతరావు, పొన్నాంపేట, ఆమదాలవలస యూరియా కోసం రైతు లు అనేక తిప్పలు పడుతున్నారు. ఒక్క బస్తా కోసం తెల్లవారి నుంచి క్యూ కడుతున్నారు. తక్కువ భూమి ఉన్న రైతులకు యూరియా ఇవ్వడం లేదు. రైతులను జతకట్టి యూరియా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదు. – కె.రామరాజు, రైతు, యలమంచిలి, కోటబొమ్మాళి మండలం. యూరియా కోసం రైతుల్ని ఇబ్బందులు పెట్టడం సరికాదు. భూమి ఉన్న వారికే సక్రమంగా యూరియా ఇవ్వడం లేదు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. యూరియా కోసం రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. – ఎన్.షణ్ముఖరావు, రైతు సంఘం నాయకుడు, టెక్కలి -
‘సమగ్ర శిక్షా ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి’
శ్రీకాకుళం: రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో 28 జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 23 వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు గత రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, తక్షణమే వారికి జీతాలు చెల్లించాలని ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు ఓ ప్రకటనలో కోరారు. కేజీబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్లు, ఎం ఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంట్లు నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ లు, మెసెంజర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, వీరంతా విద్యా వ్యవస్థలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ రెండు నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. వీఆర్ఓల అడ్హక్ కమిటీ ఎన్నిక శ్రీకాకుళం పాతబస్టాండ్: వీఆర్ఓల శ్రీకాకుళం డివిజన్ అడహక్ అధ్యక్షుడిగా టి.లక్ష్మణరావు ఎన్నికయ్యారు. ఆంధ్రపదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డి.రాజేష్ కుమార్ అధ్యక్షతన శ్రీకాకుళం డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల సమావేశం పట్టణంలోని రెవెన్యూ అతిథి గృహంలో జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ అడహక్ కమిటీని ఎన్నుకు న్నారు. అడహక్ కమిటీ ఉపాధ్యక్షుడిగా బి.సునీల్ కుమార్, బి.శంకర్, పి.జ్యోతి, జనరల్ సెక్రటరీగా జి.వేణుగోపాల్ రెడ్డి, ట్రెజరర్గా ఆర్.భరత్, జాయింట్ సెక్రెటరీలుగా ఎం.గోవింద రావు, పి.శ్రీనివాస రావు, పి.రాజేశ్వరి ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా వై.ఈశ్వర రావు, కె.శ్రీనివాసరావు, కె.ధనలక్ష్మి, పి.రవి కుమార్ ఎన్నికయ్యారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): భోగాపురం ఎయిర్పోర్టు వైభవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషే కారణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, విజయనగరం పార్లమెంటరీ పరిశీలకులు కేవీజీ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశా రు. ఆయా ప్రాంత రైతుల్ని సంతృప్తిపరిచాకే పోర్టు నిర్మాణం చేపడితే సక్సెస్గా పూర్తవుతుందని నమ్మిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని గుర్తు చేశారు. ఆర్అండ్ఆర్, భూసేకరణకు డబ్బులిచ్చింది వైఎస్ జగనేనని తెలిపారు. అన్ని పను లు పూర్తి చేశాక టీడీపీ నాయకులు తామే పనులు చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నా రు. వైఎస్సార్సీపీ హయాంలో 86.6శాతం పనులు పూర్తిచేశామని, మిగిలి ఉన్న 13.4 శాతం పనులు చేయడానికి రెండున్నరేళ్ల సమయం పట్టిందన్నారు. రమణమ్మ నేత్రాలు సజీవం శ్రీకాకుళం కల్చరల్: పట్టణంలోని పీఎన్ కాలనీకి చెందిన మండా రమణమ్మ(88) మృతి చెందగా, ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు పూతి సుజాత, నంది ఉమశంకర్ ద్వారా మృతదేహం నుంచి కార్నియాలను సేకరించారు. వాటిని విశాఖలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా సహకరించిన కుటుంబ సభ్యులకు జిల్లా రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె. దుర్గా శ్రీనివాస్తో పాటు ఇతర సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నేత్రదానం చేయాలనుకునే వారు పి .సుజాత 78426 99321, నంది ఉమా శంకర్ 9701698408 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. శ్రీకాకుళం న్యూకాలనీ: స్వర్గీయ కొన్న చిన్నారావు అథ్లెటిక్స్ మీట్ కన్నులపండువలా సాగింది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సహకారంతో కొన్న చిన్నారావు కుటుంబ సభ్యులు వా సు, మధు వారి మితృబృందం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఆదివారం జరగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కమ్ సెలక్షన్ ట్రయల్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా నలు మూలల నుంచి సుమారు 600 మంది వరకు హాజరైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. అండర్–14, 16, 18, 20 వయో విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు ప్రజాప్రతినిధులు, కొన్న చిన్నారావు కుటుంబ సభ్యులు, అధికారులు, అతిథుల చేతులమీదుగా పతకాలు, ప్రసంశాపత్రాలను అందజేశారు. -
స్నేహితుల కళ్ల ముందే..
● నేలబావిలో దిగి బీటెక్ విద్యార్థి మృతి ● స్నేహితుల దినోత్సవం వేళ విషాదం శ్రీకాకుళం రూరల్: మండలంలోని సింగుపురం పంచాయతీ పరిధిలోని మామిడివలస గ్రామ శివారులో ఉన్న నేలబావిలో ఆదివా రం విషాదం చోటుచేసుకుంది. స్నేహితుల దినోత్సవం రోజున ఆరుగురు స్నేహితులు ఈతకు దిగగా అందులో ఈతరాని ముప్పాన సాయినిఖిల్ (20) నీటిలో మునిగిపోయాడు. మిగిలిన ఐదుగురు సురక్షితంగా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. స్థానికుల సాయంతో నిఖిల్ మృతదేహాన్ని బయటకు తీశారు. పొందూరు మండలంలోని పాండ్రంకి వీధికి చెందిన నిఖిల్ ప్రస్తుతం సింగుపురంలోని తన తాత వాళ్ల ఇంటి వద్ద ఉంటూ.. టెక్కలిలోని ఐతం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా హైస్కూల్ కాలనీలో ఉంటున్న సాయినిఖిల్ ఐదుగురు స్నేహితులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలు సమయంలో మామిడివలసలో గల వ్యవసాయ బావి నీటిలోకి స్నానానికి దిగాడు. ముందుగా తోటి స్నేహితులు ఈత వచ్చా అని అడగ్గా వచ్చు అని చెప్పడంతో చిన్నపాటి థర్మాకోల్ షీట్ను పట్టుకొని ఈతకు వెళ్లారు. ఇంతలో సాయి నిఖిల్ ఉన్నట్టుండి నీటిలో మునిగిపోయాడు. ఎంతకూ రాకపోవడంతో తోటి స్నేహితు లు కంగారు పడుతూ స్థానికులకు సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందిస్తూ బోరుబావిలోని కొంత నీటిని తోడించారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. మృతుడి తల్లి జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
4న వంగపండు సభ
వజ్రపుకొత్తూరు రూరల్: ప్రజా కళల పరిరక్షణ కోసం, ఉత్తరాంధ్ర సంస్కృతిని చాటి చెప్పేందుకు ఈ నెల 4న పల్లిసారథిలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ప్రజా వాగ్గేయకారుడు, ప్రజాకవి వంగపండు ప్రసాద్ స్మారక సభను విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర ప్రజా గొంతుక ప్రతినిధులు, ప్రజా సంఘ నాయకులు, ఉద్దాన కళాకారులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పల్లిసారథిలో ఆదివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగపండు ప్రసాద్ తన రచనలు, పాటలతో సమాజంలో చైతన్యం నింపారని కొనియాడారు. ఆయన ఆశయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు ఉత్తరాంధ్ర సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగపండు సహచరుడు సంజీవ్, కుమారుడు దుష్యంత్, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తితో పాటు ఉత్తరాంధ్ర సాహితీవేత్తలు, కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు హాజరుకానున్నట్లు వారు తెలిపారు. పాముకాటుకు మహిళ మృతి పోలాకి: మండలంలోని డోల గ్రామానికి చెందిన మహిళ దువ్వారపు నారాయణమ్మ(49) పాముకాటుకు గురై చికిత్సపొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు గవరయ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. నారాయణమ్మ శనివారం ఉదయం పొలం పనులకు వెళ్లగా.. అక్కడ పాము కాటు వేసింది. గాట్లను గుర్తించి వెంటనే పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుంచి నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్కు వైద్యులు రిఫర్ చేశారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. -
‘ప్రాచీన కట్టడాల పరిరక్షణ అందరి బాధ్యత’
మందస: మందస ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో బౌద్ధ జైన మతానికి సంబంధించిన ప్రాచీన కట్టడాలను కాంట్రాక్టర్ ధ్వంసం చేసిన చోటనే పునర్నిర్మించాలని, అంతవరకూ పరిరక్షణ కమిటీ సాగిస్తున్న దశల వారీ పోరాటం ఆగదని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. మందసలోని ప్రాచీన కట్టడాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మందస ప్రభుత్వం జూనియర్ కళాశాల సమీ పంలోని బహిరంగ ప్రదేశంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశానికి కమిటీ కన్వీనర్ మామిడి కోదండరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సుమారు 100 మంది ఆహ్వానిత ప్రతినిధులు పాల్గొన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రాచీ న కట్టడాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని గుర్తు చేశారు. ప్రాచీన కట్టడాల విధ్వంసానికి పాల్పడిన వారిపైన చట్టపరమైన చర్యలను తీసుకోవాలన్నారు. కళింగ సీమ రాష్ట్ర సాధన సమితి నాయకులు డాక్టర్ జీవిశ్వరరావు మాట్లాడుతూ పాలకుల అండదండలతో విధ్వంసం సాగడ శోచనీయమన్నారు. -
‘ఆదరణ చూడలేకే అక్రమ కేసులు’
ఆమదాలవలస: జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన ఆదరణ, ఆమదాలవలస నియోజకవర్గంలో చింతాడ రవికుమార్కు పెరుగుతున్న అభిమానం చూడలేక చింతాడ రవిపై అక్రమ కేసులు బనాయించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్ అన్నారు. ఆమదాలవలస పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ఓ మహిళా ఉద్యోగిని బలి చేసిన సంఘటన జిల్లా అంతా తెలుసని, అలాంటిది ఆ యన చింతాడ రవిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. గతంలో పోలీసులు, అధికారులపై కూన రవికుమార్ మాట్లాడిన మాటలు అందరికీ వినిపించారు. గంజాయి.. అంటూ దిగజారుడు మాటలు మాట్లాడుతున్న కూన రవికుమార్ రాజకీయ పతనం మొదలైందన్నారు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిలను ఎలా వేధించారో జనాలకు ఇంకా గుర్తుందని తెలిపారు. జిల్లా ఎస్పీని కూడా కూన కించపరుస్తూ మాట్లాడారని పేర్కొన్నారు. సిన్సియర్గా పనిచేసే మహిళా ఎస్ఐను పావుగా వాడుకోవడం తగదన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు తమ్మినే ని శ్రీరామమూర్తి మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి చింతాడ రవికుమార్ వచ్చారని, ఇలాంటి కేసులకు భయపడేది లేదని అన్నారు. చింతాడ ఎమ్మెల్యే కావడం ఖాయమని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పొందూరు జెడ్పీటీసీ లోలుగు కాంతారావు, మున్సిపాలిటీ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, పార్టీ సరుబుజ్జిలి మండలాధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, పొందూరు మండలాధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, బూర్జ మండలాధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, సరుబుజ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, బూర్జ జెడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, బూర్జ ఎంపీపీ కర్ణం కృష్ణం నాయుడు, నియోజకవర్గ మున్సిపాలిటీ విభాగ అధ్యక్షులు పొదిలాపు తిరుపతిరావు, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు బొడ్డేపల్లి విశ్వేశ్వరరావు, జిల్లా మున్సిపాలిటీ విభాగ కార్యదర్శి గొలివి పురుషోత్తం,పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ విభాగ కార్యదర్శి బద్రి రామారావు, జిల్లా ఉపాధ్యక్షులు కింజరాపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షునిగా కిల్లారి
అరసవల్లి: ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల జిల్లా సంఘ అధ్యక్షునిగా మరోసారి కిల్లారి నారాయణరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కింజరాపు నర్సింహమూర్తితో పాటు 18 మంది సభ్యుల ఎన్నికంతా ఏకగ్రీవమైంది. ఈమేరకు ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నికల అధికారి సీహెచ్ మురళి పరిశీలనలో, గౌరవాధ్యక్షులు బీవీఆర్ ప్ర సాద్ (రాంబాబు)ల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్ని కల ప్రక్రియ అంతా ఏకగ్రీవం కావడం విశేషం. అసోసియేట్ ప్రెసిడెంట్గా పి.నాగేశ్వరరావు, కోశాధికారిగా ఎ.ధర్మారావు, స్టేట్ కౌన్సెలర్లుగా కేఎంకే పట్నాయక్, కె.రామారావు, సిహెచ్టీ నాయుడు, వై.రాజేష్లు ఎన్నికవ్వగా, ఉపాధ్యక్షులుగా ఇ. రఘు, ఎ.అనూరాధ, డి.కిషోర్, జాయింట్ సెక్రట రీలుగా పి.జయమ్మ, బి.రుష్యేశ్వరరావు, బి.భాగ్యలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.శ్రీనివాసరెడ్డి, బిఆర్జి.అరుణ్, పి.మన్మధరావు, జేసీసీ మెంబర్గా ఎస్.అభిషేక్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం జిల్లా సంఘానికి మరోసారి అధ్యక్షునిగా కిల్లారి నారాయణరావుతో పాటు కార్యవర్గ సభ్యులంతా ఎన్నికల అధికారి మురళి ఆధ్వర్యంలో ఎన్నికల నిబంధనల మేరకు ప్రమాణ స్వీకారం చేయించారు. -
బ్యాడ్మింటన్ పోరు.. అదిరెను జోరు
● ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం ● తొలిరోజు క్వాలిఫయింగ్ నిర్వహణ ● నేటి నుంచి మెయిన్ డ్రా పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: బాయ్, ఏపీబీఏ సహకారంతో శ్రీకాకుళం జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా నాలుగు రోజులపాటు జరుగుతున్న ఏ పీ రాష్ట్రస్థాయి (అంతర్జిల్లాల) సీనియర్స్ పురుషులు, మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2026 పోటీలు ఆదివారం ప్రారంభమ య్యాయి. నాలుగు రోజుల ఈ పోటీల్లో భాగంగా తొలిరోజు ఆదివారం క్వాలిఫైయింగ్ రౌండ్స్ పోటీలు నిర్వహించారు. మెయిన్డ్రాకు అర్హత సాధించడానికి నిర్వహించిన ఈ క్వాలిఫైయింగ్ రౌండ్స్ పోరుకు రాష్ట్ర నలుమూలల నుంచి 200 మంది వరకు షట్లర్లు హాజరుకావడం విశేషం. వీరిలో 1:4 నిష్పత్తిలో సుమారు 40 నుంచి 50 మంది మెయిన్డ్రాకు అర్హత సాధించనున్నారని జిల్లా బ్యాడ్మింటన్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, బ్యాడ్మింటన్ జిల్లా సీఈఓ సంపతిరావు సూరిబాబు వెల్లడించారు. నేటి నుంచి మెయిన్డ్రా మొదలు.. తొలిరోజు క్వాలిఫైయింగ్ రౌండ్స్ పోటీలు జరగగా.. సోమవారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు మూడు రోజులపాటు మెయిన్ డ్రా పోటీ లు జరగనున్నాయి. మొత్తం 5 కేటగిరీల్లో అనగా పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ పోటీలను నిర్వహించనున్నారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన (క్రీడాకారులు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృందాన్ని త్వరలో భువనేశ్వర్ వేదికగా జరగనున్న ఆలిండియా నేషనల్స్ సీనియర్స్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేయనున్నట్టు ఏపీబీఏ ఉపాధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్, టోర్నీ మీట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణశెట్టి వెంకట కిరణ్కుమార్ పేర్కొన్నారు. ఈ పోటీలకు చీఫ్ రిఫరీగా అంతర్జాతీయ అంపైర్ జిలానీ భాషా, రిఫరీగా రామకృష్ణయ్య, టెక్నికల్ అఫీషియల్స్గా మరో 40 మంది వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లేనప్పటికీ.. ఈ బ్యాడ్మింటన్ స్టేట్ మీట్కు జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిదులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశారు. -
పరామర్శ
ఆమదాలవలస: మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఆయన స్వగృహంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు శనివారం పరామర్శించారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయనతో పాటు పలాస మున్సిపల్ మాజీ చైర్మన్ బల్ల గిరిబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి బడాన కృష్ణ, జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు అలుగురి పకీర్, జిల్లా బీసీ రైతు సంఘం అధ్యక్షుడు రామినాయుడు, కొత్తకోట ఎంపీటీసీ సురవరపు సింహాచలం, గొంటి ఈశ్వరరావు, పలాస, కోటబొమ్మాళి ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
భోగాపురం ఘనత ముమ్మాటికీ వైఎస్ జగన్దే
● చంద్రబాబుది క్రెడిట్ చోరీ ● 2024 నాటికే 85 శాతం పనులు పూర్తి చేశాం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట: ‘భోగాపురం విమానాశ్రయానికి కొబ్బరికాయ కొట్టింది మేమే.. గుమ్మడి కాయ కొట్టింది మేమే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలే కూటమి హయాంలో ఈ ప్రాజెక్టుకు ఏమీ చేయలేదనే నిజానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఎద్దేవా చేశారు. రెండు రోజులుగా భోగాపురం ఎయిర్ పోర్టుకు సంబంధించి జరుగుతున్న ప్రచారంపై కృష్ణదాస్ స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్నది అంతా క్రెడిట్ చోరీయేనని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల ముందు ఎలాంటి అనుమతులు, భూ సేకరణ పూర్తి కాకుండానే చంద్రబాబు హడావుడిగా శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే సుమారు రూ.1200 కోట్లుతో భూ సేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ 2203 ఎకరాలను నిర్మాణ సంస్థకు అప్పగించి పనులు శరవేగంగా జరిగేందుకు కార్యాచరణ చేపట్టారన్నారు. 2024 నాటికి 85 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు. విమానాశ్రయానికి ఒక రూపు తీసుకువచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రంగులు వేసి ఇదంతా తామే చేశామని టీడీపీ చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. పచ్చ పత్రికలు ఎంతగా తిమ్మిని బమ్మిని చేసేందుకు ప్రయత్నించినా జనాలకు విషయం తెలుసని అన్నారు. ‘టీడీపీ నేతలు క్రెడిట్ చోరీ మానుకోవాలి’ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): భోగాపురం ఎయిర్పోర్టుకు కావాల్సిన భూసేకరణ చేసి ఆయా ప్రాంత రైతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీకోసం రూ.1200 కోట్లుకి పైగా ఇచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమని తూర్పుకాపు బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ అన్నారు. శంకుస్థాపన చేసిన రోజునే వైఎస్ జగన్మోహన్రెడ్డి 2026 నాటికి ఎయిర్పోర్టు ప్రారంభిస్తామని చెప్పా రని, రెండేళ్లలోనే దాదాపుగా 85శాతం పనులు పూర్తిచేసిన ఘనత వైఎస్సార్సీపీదేనని అన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ క్రెడిట్ చోరీ చేయడం మానుకోవాలన్నారు.మామిడి శ్రీకాంత్ -
●పర్యావరణం..
జిల్లా కేంద్రంలోని ఎల్బీఎస్ కాలనీలో ఉన్న శారద, భారతి, పద్మశ్రీ, లిఖిత, స్వాతి, వనజ, తదితర 30 మంది స్నేహితులయ్యారు. వారు యోగా పాటుగా ఎన్నో సమాజ హిత కార్యక్రమాలు చేస్తుంటారు. భర్తను కోల్పోయిన వారికి ఆర్థికంగా ఆదు కోవడం, ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో మొ క్కలు పెంచమని ర్యాలీ నిర్వహించడం, ప్లాస్టిక్ వా డకంపైన అవగాహన ర్యాలీలు చేయడం వారికి నిత్యకృత్యం. బెహరా మనోవికాస కేంద్రంలోని చిన్నారులకు ప్రతినెల వారికి తోచిన సాయం చేస్తుంటారు. ఆలయాల్లో అధికంగా భక్తులు వచ్చే సమయాల్లో క్యూల వద్ద ఉచిత సేవలు అందిస్తారు. -
లారీల నిలిపివేతతో అవస్థలు
కంచిలి: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పో ర్టు ప్రారంభోత్సవం పుణ్యమా అని జాతీయ రహదారిలో రాకపోకలు సాగించే లారీ ఆపరేటర్లు అవస్థలు పడ్డారు. శనివారం వేకువజా ము నుంచి మధ్యాహ్నం వరకు లారీలను పోలీ సులు జాతీయ రహదారిలో నిలిపివేశారు. జిల్లాలో అన్నిచోట్ల హఠాత్తుగా పోలీసులు లారీలను రోడ్డు పక్కన ఆపివేయించారు. దీంతో ఒక పూటంతా లారీ ఆపరేటర్లు అవస్థలు పడా ల్సి వచ్చింది. కనీసం ఎంత సమయం నిలిపివేస్తారో తెలియక ఇబ్బందులు పడ్డారు. ఉద యం కాలకృత్యాలు నుంచి మధ్యాహ్నం భోజ నం చేసే వరకు అంతా అయోమయ పరిస్థితి ఏర్పడింది. టోల్ప్లాజాల వద్ద.. శ్రీకాకుళం క్రైమ్ : ఆమదాలవలస వైఎస్సార్ సీ పీ సమన్వయకర్త చింతాడ రవి, ఆయన అనుచరులు 21 మందిని తక్షణమే అరెస్టు చేయాల ని పోలీసు ఉన్నతాధికార వర్గాల నుంచి ఆమదాలవలస సీఐ సన్యాసినాయుడుకు తీవ్ర ఒత్తి డి వస్తోంది. దీంతో శుక్రవారం పీఎం బందోబస్తు హడావుడిలో జిల్లా పోలీసులు ఓ వైపు ఉంటూనే మరో వైపు ఈ పనిని కూడా భుజాన వేసుకున్నారు. ఈ కేసు విషయమై శుక్రవారం సెల్ఫీ వీడియో విడుదల చేసిన రవి ఎస్ఐ ప్ర వళ్లికపై తాము ఎలాంటి దాడికి పాల్పడలేదని, ఆ విషయం ఆమెకు కూడా తెలుసని.. కావా లనే కేసు నమోదు చేశారని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి ఎస్ఐ సుముఖంగా లేకపోయినా ఒత్తిడి చేసి కేసు పెట్టించడం, చింతాడ రవికి ఈ విషయం ముందుగానే తెలిసిందని నాయకులు భావించ డం వంటివి చర్చనీయాంశమయ్యాయి. పోలీ సుల కాల్డేటా కూడా సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు అదే ఎస్ఐపై పోలీసులు చేయి వేసిన ఫొటో ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో ఆ కానిస్టేబుల్ నుంచి వివరణ కోరినట్లు సమాచారం. అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ సూపరింటెండెంట్గా కె.వెంకటేశ్వరరావు శనివారం బాధ్యతలు చేపట్టారు. సింహాచలం దేవస్థానంలో సూపరింటెండెంట్గా పనిచేస్తూ అరసవల్లికి డిప్యుటేషన్ ప్రాప్తికి అరసవల్లి ఆలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలుసుకుని సూచనలు స్వీకరించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పుష్కరిణి అభివృద్ధి పనులు, అన్నదాన మండపం, ప్రసాదాల విభాగంతో పాటు కేశఖండన శాల తదితర విభాగాల్లో సాధారణ పరిశీలన చేపట్టారు. ఈయన వెంట సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ బాల భాస్కర్ సాయి తదితరులున్నారు. -
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
కంచిలి: ఎల్నినో ప్రభావం వలన తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి పాలడుగు వెంకట సత్యనారాయణ అన్నారు. మండలంలోని బూరగాం గ్రామంలో క్షేత్ర పరిశీలనకు శనివారం విచ్చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. వరికి ప్రత్యామ్నాయంగా నూనె గింజలు, పప్పు ధాన్యాలు సాగు చేయడం ఉత్తమం అన్నారు. దీనిపై కొందరు రైతులు వాటికి ఇచ్చే ఇన్సూరెన్స్ గూర్చి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వై.వి.మురళీకృష్ణ, జిల్లా ఆత్మ పథక సంచాలకులు జగన్మోహన్, ఆముదాలవలస కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.భాగ్యలక్ష్మి, ఆమదాలవలస ఏ.ఆర్.ఎస్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.చిట్టిబాబు, రాగోలు ఏఆర్ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ పి.ఉదయ్బాబు, సోంపేట వ్యవసాయ సహాయ సంచాలకుడు బి.నరసింహమూర్తి, మండల వ్యవసాయాధికారి కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
సై..!
● నేటి నుంచి జిల్లా అథ్లెటిక్స్ పోరు ● కేఆర్ స్టేడియం వేదికగా కొన్న చిన్నారావు మెమోరియల్ పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: దివంగత కొన్న చిన్నారావు మెమోరియల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు సర్వం సిద్ధమైంది. గత 18 ఏళ్లుగా కొన్న చిన్నారావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న స్పోర్ట్స్మీట్ను ఆదివారం నుంచి ప్రారంభించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 400 నుంచి 500 మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సిద్ధమైన కేఆర్ స్టేడియం ఇదిలా ఉండగా పోటీలకు ఆతిథ్యమిస్తున్న శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంను సుందంగా తీర్చిదిద్దారు. మైదానంలో రన్నింగ్ ట్రాక్, ఇతర ఈవెంట్స్ కోర్టులకు తుది మెరుగులు దిద్దారు. చిన్నారావు కుటుంబ సభ్యులు కొన్న వెంకటేశ్వరరావు(వాసు), కొన్న మధుసూదనరావు, ప్రగాడ అశోక్కుమార్, పూడి బాలాదిత్య ఆధ్వర్యంలో నౌపడ విజయ్కుమార్, మెంటాడ సాంబమూర్తి, మాధవరావు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. విజేతలకు పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేయనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 2006 సెప్టెంబర్ 18 నుంచి 2014 సెప్టెంబర్ 17వ తేదీ మధ్య జన్మించి ఉండాలని అథ్లెటిక్స్ సంఘ ప్రతినిధులు సూచిస్తున్నారు.మా తల్లిదండ్రులే మా ఆస్తి. మా నాన్నగారు కొన్న చిన్నారావు మెమోరియల్ పేరిట ప్రతిఏటా స్పోర్ట్స్మీట్ను మా కుటుంబ సభ్యులు, మిత్రబృందం, అథ్లెటిక్స్ సంఘ ప్రతినిధులంతా కలిసి సమష్టిగా నిర్వహిస్తున్నాం. క్రీడాకారులను ప్రభుత్వాలతో పాటు ప్రోత్సాహకులు కూడా ప్రోత్సహించిననాడే వారిలో ఉన్న టాలెంట్ బయటపడుతుంది. – కొన్న వెంకటేశ్వరరావు(వాసు), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ గత 18 ఏళ్లుగా స్పోర్ట్స్ మీట్లను నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న చిన్నారావు కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలుస్తారు. ఈ పోటీల్లో అథ్లెటిక్స్ సంఘం తరుపున నేనూ భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. మీట్ కమ్ సెలక్షన్స్లో విజేతలగా నిలిచిన ప్లేయర్స్ను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తాం. – మెంటాడ సాంబమూర్తి, ఒలింపిక్ అసోసియేషన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
●ఆధ్యాత్మికంగా కలిసి..
ఉద్యోగ సేవల్లో కలసి పనిచేసి, రిటైర్ అయిన తర్వాత కూడా సేవల్లో ఉంటూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ 40 ఏళ్ల స్నేహాన్ని కొనసాగిస్తున్నారు అరసవల్లికి చెందిన విశ్రాంత డిప్యూటీ ఇంజినీ ర్లు ముద్దాడ అప్పలనాయుడు, కుప్పిలి నరసింహమూర్తి. శ్రీకాకుళంలోనే పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. 1979లో అసిస్టెంటు ఇంజినీర్లుగా వృత్తిని ఒకే శాఖలో ప్రారంభించి, డిప్యూటీ ఇంజినీర్లుగా పదవీ విరమణ చేశారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్ర మాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇద్దరూ కలసి 30ఏళ్లకు పైగా అయ్యప్పమాల ధారణలు చేసి శబరిమలకు కలసి వెళుతున్నారు. నగరంలో కృష్ణాపార్కు వద్ద, అరసవల్లిలో షిరిడి సాయిబాబామందిరాన్ని నిర్మించారు. -
6 నుంచి సీపీఐ ప్రచార పాదయాత్ర
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): దేశ సమైక్యత, సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈనెల 6వ తేదీ నుంచి 15 వరకు ప్రచార పాదయాత్రలు చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ తెలిపారు. నగరంలోని క్రాంతి భవన్లో విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లైనా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని దుయ్యబట్టారు. సీబీఐ, ఈడీ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుటోందని మండిపడ్డారు. మద్దతు ధర విషయంలో రైతులపై కనికరం చూపకుండా, గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించకుండా వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి రైతులను కట్టు బానిసలుగా మార్చాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతున్నారని పేర్కొన్నారు. వరుస పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిరంలో రూ.200 కోట్ల దోపిడీ జరిగినా ఎందుకు పట్టుకోలేదని నిలదీశారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం పూర్తి, రాజధాని నిర్మాణం, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం వంటివి ఇంతవరకు సాధించలేకపోయిన అసమర్థ సీఎం అని దుమ్మెత్తిపోశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, వంశధార ఆఫ్షోర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని, కార్గో ఎయిర్పోర్టుకి బలవంతపు భూసేకరణ ఆపాలని కోరారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్లు పాల్గొన్నారు. -
ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసే కుట్రలు
టెక్కలి: జిల్లాలోని వైఎస్సార్సీపీ నాయకులపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసే కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. టెక్కలిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన జిల్లా పర్యటనకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో, కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు. ఎలాగైనా వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు నమోదు చేయాలని మహిళా ఎస్ఐ ప్రవళ్లికను పావుగా వినియోగించుకొని, పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్పై అక్రమంగా కేసులు నమోదు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఐ ప్రవళ్లిక విధులు నిర్వహించే క్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఆమైపె దురుసుగా ప్రవర్తించినట్లు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. సాయంత్రం వరకు జైలు రోడ్లోనే ఆమె సక్రమంగా విధులు నిర్వహించారని గుర్తు చేశారు. అయితే టీడీపీ నాయకులు సోషల్ మీడియా ద్వారా వక్రీకరణ వీడియోలను పోస్టు చేశారని మండిపడ్డారు. ఈ అంశాన్ని రెడ్బుక్ రాజ్యాంగానికి అనుకూలంగా వినియోగించుకొని చింతాడ రవికుమార్పై అక్రమంగా కేసులు నమోదు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ అక్రమాలపై నిరంతరం పోరాటం చేయడంతో చింతాడ రవికుమార్ను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఇదే మాదిరిగా అక్రమంగా కేసులు నమోదు చేశారని వెల్లడించారు. వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లిన తనపై అక్రమంగా కేసులు నమోదు చేయడంతో పాటు పోలీస్స్టేషన్లో నిర్భందించారని తిలక్ గుర్తు చేశారు. కూటమి నాయకులకు రాజకీయంగా తమతో పోరాడే శక్తి లేక ఇటువంటి అక్రమ కేసులను బనాయిస్తున్నారన్నారు. జిల్లాలో ఇటువంటి సంస్కృతి విడనాడాలని, లేకపోతే ఇదేవిధంగా రిపీట్ చేస్తామని హెచ్చరించారు. -
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో రాగి వస్తువులు చోరీ
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని వాకలవలస లింగావలస గ్రామం రహదారి పరిసర ప్రాంతంలో పొలాలకు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లో రాగి తీగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. విద్యుత్ పవర్ ఆఫ్ చేసి అందులోని రాగి వస్తువులను చోరీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో స్థానిక లైన్మెన్ పరిశీలించగా పొలాల గట్లు మీద ట్రాన్స్ఫార్మర్ పడి ఉండడాన్ని గుర్తించారు. శనివారం రూరల్ పోలీస్టేషన్లో ఏఈ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. -
వంశధార కాలువపై ఆక్రమణలు
నందిగాం: మండలంలోని వంశధార ఎడమ ప్రధాన కాలువ గట్టుపై పలుచోట్ల ఆక్రమణలు చోటు చేసుకుంటున్నా అధికారులు వాటివైపు కన్నెత్తి చూడడం లేదు. ముఖ్యంగా పెద్దతామరాపల్లి, గొల్లూరు పరిధిలో ఉన్న గట్టుపై పలువురు ఆక్రమించి గట్టును చదును చేసి కొన్నిచోట్ల వివిధ రకాల మొక్కలు నాటుకుంటున్నారు. అలాగే వాటికి కంచెలు ఏర్పాటు చేసి గట్టుపై వెళ్లే మార్గం లేకుండా చేస్తున్నారు. ఈ ఆక్రమణలు ఇలాగే కొనసాగితే కాలువ గట్టు బలహీనపడే ప్రమాదం ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గట్టు ఆక్రమణలు జరగకుండా, నీరు గట్టుపైకి రాకుండా గొల్లూరు నుంచి పెద్దతామరాపల్లి సూపర్ ప్యాసేజ్ వరకు గట్టుపై రహదారి నిర్మాణం చేశారు. అయితే మరలా ఇటీవల గట్టు ఆక్రమణలకు గురవుతోంది. అందువలన వంశధార అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు పాతపట్నం: మండలంలోని జంతిగూడ గ్రామ సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్ను ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జగ్గిలిబొంతుకు చెందిన ఘంటా కొండలరావు, ఘంటా సంజీవరావు, చింతాడ మురళీలు కలిసి పర్లాకిమిడి (ఒడిశా) నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో జంతిగూడ గ్రామం వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యయి. వెంటనే స్థానికులు పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రి తీసుకెళ్లారు. చింతాడ మురళీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ కె.శ్రీరామమూర్తి తెలిపారు. ముగిసిన ఏకపాత్రాభినయ పోటీలు శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య (నెలవారీ సాంస్కృతిక విభాగ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 322వ నెల కార్యక్రమంలో భాగంగా దివంగత పురుషోత్తం (భైరి) సూర్యనారాయణ మాస్టారు స్మారక రాష్ట్రస్థాయి పౌరాణిక, జానపద, సాంఘిక, పద్య ఏకపాత్రాభినయ పోటీలు శనివారం స్థానిక బాపూజీ కళామందిర్లో ఘనంగా ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ ఏకపాత్రాభినయ ప్రదర్శనలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సాయంత్రం సమాఖ్య అధ్యక్షుడు డా.ఎల్.రామలింగస్వామి అధ్యక్షతన జరిగిన సభలో ప్రముఖ రంగస్థల పౌరాణిక నటులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు, పి.లీలామోహన్ పాల్గొన్నారు. పోటీల్లో ప్రథమ బహుమతి నల్లపాటి అన్నపూర్ణ (చంద్రమతి), ద్వితీయ బహుమతి పుట్టా కృష్ణ (నక్షత్రకుడు), తృతీయ బహుమతి కాతా హరిబాబు (హరిశ్చంద్రుడు) పొందారు. విజేతలకు జ్ఞాపికలతో పాటు నగదు బహుమతులను అందజేశారు. -
ప్రైవేటు సేవలో డీఎంహెచ్ఓ
● నిబంధనలకు పాతర ● గతంలో మీనాక్షి.. ఇప్పుడు శ్రీకాంత్ ● జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు సేవలో 30 మంది వైద్యులు ఈ ప్రైవేటు ఆస్పత్రి బోర్డు చూశారా. డాక్టర్ తాడేల శ్రీకాంత్ నేమ్బోర్డుతో నరసన్న పేట నేషనల్ హైవేలో భారీగా కనిపించేలా ప్రైవేటు ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. అడిషనల్ డీఎంహెచ్ఓ హోదాలో ఉన్న ఈ వైద్యాధికారి ప్రస్తుతం జిల్లా వైద్యారోగ్యశాఖలో ఇన్చార్జి డీఎంహెచ్ఓగా విధుల్లో ఉన్నారు. ఇలాంటి బోర్డులు పెట్టుకుని ఇంత డైరెక్ట్గా జిల్లా స్థాయి అధికారులే నిబంధనలకు పాతర వేస్తుంటే.. ఇక మిగిలిన స్థాయి వైద్యుల సంగతి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అరసవల్లి: ప్రభుత్వ రంగంలో వైద్యులుగా పనిచేస్తున్న వారు కేవలం ప్రభుత్వాస్పత్రుల్లోనే పని చేయాలి. దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక జీఓలు కూడా వెలువరించాయి. గతంలో 1987కి ముందు నియమితులైన వైద్యులను మినహాయిస్తూ.. మిగిలిన వైద్యుల్లో ముఖ్యంగా పరిపాలనా వ్యవహారాలు నిర్వర్తించే వైద్యాధికారులెవ్వరూ ప్రైవేటు ప్రాక్టీస్ చేయరాదంటూ 2006లో స్పష్టమైన జీఓ 119ని విడుదల చేశారు. అలాగే 2022లో కూడా ఇదే నిబంధనలతో జీఓ 450ని విడుదల చేశారు. ఈ జీఓల ప్రాప్తికి వైద్యారోగ్య శాఖలో పరిపాలనాధికారులు నిర్వర్తిస్తున్న వైద్యాధికారులు, సామాజిక, ప్రాంతీయ వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు ఎలాంటి ప్రైవే టు క్లినిక్ల్లో పనిచేయరాదు. వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల కండక్ట్ రూల్స్లో ఇదో కీలక నిబంధనగా పేర్కొన్నారు. కానీ జిల్లాలో వైద్యాధికారులు యథేచ్ఛగా ప్రైవేటుగా ప్రాక్టీసు చేసుకుంటున్నా రు. ప్రభుత్వ ఆస్పత్రుల పనివేళల్లో కూడా వీరు విధులను ఎగ్గొట్టి ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ వేసుకుని వచ్చేసి ఎంచక్కా ప్రైవేటు ఆస్పత్రుల్లో కాసులు సంపాదించుకుంటున్నారు. ప్రైవేటు క్లినిక్ల్లో తమ నేమ్ బోర్డులతోనే స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ప్రత్యేక అలవెన్సులను కూ డా ప్రభుత్వం కేటాయిస్తున్న క్రమంలో ఇలా ప్రైవేటు క్లినిక్ల నిర్వహణ పూర్తిగా నిబంధనలకు విరుద్ధమే. దీనిపై కూటమి ప్రభుత్వం మాత్రం ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంపై జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ముప్పై మంది వైద్యులు జిల్లాలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సీనియర్ వైద్యులుగానూ, వైద్యాధికారులుగా కూడా పనిచేస్తున్న వైద్యులు యథేచ్ఛగా ప్రైవేటు క్లినిక్లను నడుపుతున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి హోదాల్లో గతంలో జిల్లాలో పనిచేసిన బొడ్డేపల్లి మీనాక్షి కూడా డీఎంహెచ్ఓ హోదాలో ఉంటూనే జిల్లా కేంద్రంలో తన ప్రైవేటు గైనిక్ విభాగ ప్రాక్టీస్కు అధిక సమయం కేటాయించేవారనే విమర్శలున్నాయి. అదే కోవలో జిల్లా అడిషినల్ డీఎంహెచ్ఓ హోదాతో పాటు ప్రోగ్రాం ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ తాడేల శ్రీకాంత్..(ప్రస్తుత ఇన్చార్జి డీఎంహెచ్ఓ) కూడా నరసన్నపేటలో ఓ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. అలాగే కీలక ఆరోగ్య సేవలందించాల్సిన ప్రాంతాలైన పాతపట్నం, కోటబొమ్మాళి సీహెచ్సీల్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు కూడా ప్రైవేటు క్లినిక్లకు అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇలా గే జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్షంగా 19 మంది ప్రభుత్వ వైద్యులు, పరోక్షంగా 11 మంది వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తూ ప్రైవేటు క్లినిక్లు నడుపుతున్నారని విశ్వసనీయ సమాచారం. కొందరైతే ఏకంగా శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస తదితర పట్టణాల్లో పెద్ద పెద్ద ఆస్పత్రులు నిర్మించుకుని పెద్ద పెద్ద హోర్డింగ్లో పేర్లతోనే వాటిని నడుపుతున్నారు. వీటి అనుమతులు కూ డా డీఎంహెచ్ఓ కార్యాలయ విభాగమైన డెమో నుంచే పొందుతున్నారు. ఆస్పత్రులను తనిఖీ చేసే అధికారమున్న ఈ విభాగాధికారులు ఇంతవరకు జిల్లాలో ప్రభుత్వ వైద్యుల ప్రాక్టీస్లపై ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీస్ రద్దుపై ప్రభుత్వ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
బ్యాడ్మింటన్ స్టేట్మీట్కు వేళాయె..!
● నేటి నుంచి శ్రీకాకుళంలో బ్యాడ్మింటన్ టోర్నీ ● సీనియర్స్ పురుషులు, మహిళల విభాగాల్లో జరగనున్న పోరు ● ముమ్మరంగా ఏర్పాట్లు శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా మరో బ్యాడ్మింటన్ స్టేట్ మీట్కు రంగం సిద్ధమైంది. భాయ్, ఏపీబీఏ సహకారంతో శ్రీకాకుళం జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం వేదికగా ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి (అంతర్ జిల్లాల) సీనియర్స్ పురుషులు, మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్–2026 పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ జిల్లాల నుంచి హాజరయ్యే షట్లర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహణ కమిటీ ప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీలకు ఆతిథ్యమిస్తున్న స్థానిక శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియంను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. టోర్నీ విజయవంతం కోసం అనేక కమిటీలను నియమించి, వారంతా వారివారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఏర్పాట్లపై జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ ఆర్.రాజేంద్రన్, జిల్లా అధ్యక్షుడు, ఏపీబీఏ ఉపాధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్, చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మెట్ట అశోక్కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి నారాయణశెట్టి వెంకట కిరణ్కుమార్, సీఈవో సంపతిరావు సూరిబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు భైరి దామోదరరావు, మదీనా శైలానీ, ఎంఈ రత్నాజీ, గురుగుబెల్లి ప్రసాద్, మెండ శాంతికుమార్, అనిల్కుమార్ తదితరులు శనివారం సాయంత్రం సమీక్షించారు. నేడు క్వాలిఫైయింగ్ రౌండ్స్ ఈ మెగా బాడ్మింటన్ టోర్నీలో భాగంగా ఆదివారం మొదటి రోజు క్వాలిఫైయింగ్ రౌండ్స్ నిర్వహిస్తుండగా, 3వ తేదీ నుంచి 5 వరకు మూడు రోజులపాటు మెయిన్ డ్రా పోటీలను జరపనున్నారు. మొత్తం 5 కేటగిరీల్లో పోరు కొనసాగనుంది. సీనియర్స్ విభాగంలో పోటీలు కావడంతో ఆద్యాంతం హోరాహోరిగా– ఉత్కంఠగా సాగనుండటం ఖాయమని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు భువనేశ్వర్ వేదికగా త్వరలో జరిగే ఆలిండియా సీనియర్స్ బాడ్మింటన్ టోర్నీకి అర్హత సాధిస్తారని జిల్లా బాడ్మింటన్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లాకు చేరుకున్న షట్లర్లు ఇదిలా ఉండగా ఈ బాడ్మింటన్ స్టేట్ మీట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 13 జిల్లాల నుంచి 156 మంది నేరుగా హాజరవుతుండగా.. వీరితోపాటు మరో 52 మంది వరకు కోచ్ మేనేజర్లు హాజరవుతున్నారు. దాదాపుగా వీరంతా ఇప్పటికే జిల్లాకు చేరుకున్నారు. వీరికి స్థానికంగా హోటళ్లలో బస కల్పిస్తున్నారు. ఇండోర్ స్టేడియం వేదికగా భోజన ఏర్పాట్లు కల్పిస్తున్నారు. అలాగే క్వాలిఫైయింగ్ రౌండ్స్కు హాజరయ్యే క్రీడాకారుల్లో 1:4 నిష్పత్తిలో విజేతలుగా నిలిచిన షట్లర్లు మెయిన్ డ్రాకు అర్హత సాధిస్తారు. జిలానీ భాషా, సంపతిరావు సూరిబాబు రిఫరీలుగా వ్యవహరిస్తుండగా, టెక్నికల్ అఫీషియల్స్గా మరో 30 మంది హాజరవుతున్నారు. ప్రభుత్వ సాయం శూన్యం ఈ స్టేట్ బాడ్మింటన్ స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు రూ.12 లక్షలకు పైగా వెచ్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు అపఖ్యాతి కలగకుండా.. ప్రభుత్వం తరుపున దమ్మిడి సాయం లేకపోయినా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం సాయం అందించగలిగితే క్రీడాకారులకు మరింత ఉన్నతస్థాయిలో వసతులు, సౌకర్యాలు కల్పించడానికి అవకాశం లభిస్తుందని క్రీడావర్గాలు భావిస్తున్నాయి. నేటి నుంచి మొదలయ్యే ఏపీ రాష్ట్రస్థాయి బాడ్మింటన్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. జిల్లా కమిటీ అంతా సమష్టిగా టోర్నీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాం. జిల్లాకు హాజరయ్యే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. అందరూ సహకరించి విజయవంతం చేయాలి. – కిల్లంశెట్టి సాగర్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాకుళం జిల్లాలో బాడ్మింటన్ స్టేట్మీట్ జరుగుతుండడం జిల్లాకు గర్వకారణమనే చెప్పాలి. ఈ టోర్నీకి సుమారు రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాం. ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడా తగ్గకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. పోటీల నిర్వహణకు ప్రభుత్వం నుంచి కూడా సాయం అందించగలిగితే క్రీడాకారులకు మేలు జరుగుతుంది. – నారాయణశెట్టి వెంకట కిరణ్కుమార్, స్టేట్మీట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ -
శ్రీకాకుళం
జిల్లాలో మొత్తం ఓటర్లు ● పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం ● ఆగస్టు 30 వరకు కై ్లములు, అభ్యంతరాల స్వీకరణ ● ముసాయిదా విడుదల ఆకట్టుకున్న ఎయిర్పోర్టు లోగో వజ్రపుకొత్తూరు రూరల్: భోగాపురం ఎయిర్పోర్టు లోగోను పలాస గాంధీనగర్కు చెందిన స్వర్ణ కళాకారుడు కొత్తపల్లి రమేష్ తయారు చేశారు. బంగారం రేకుపై 1.5 సెంటిమీటర్ల ఎత్తు, 1.5 సెంటీమీటర్ల వెడల్పుతో 80 మిల్లీగ్రాములు బంగారం వినియోగించారు.శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 202617,24,896శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘సర్’ ప్రక్రియ తర్వాత ఓటర్ల జాబితా ముసాయిదాను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)–2026 కార్యక్రమంలో భాగంగా జూలై 31 నాటికి సిద్ధం చేసిన ముసా యిదా జాబితాను ప్రచురించినట్లు తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముసా యిదా ఓటర్ల జాబితా ప్రతులను విడుదల చేసి వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,24,896 మంది ఓటర్లు ఉన్నారని, అందులో పురుష ఓటర్లు 8,54,771 మంది కాగా, మహిళా ఓటర్లు 8,70,051 మంది, ఇతరులు 74 మంది ఉన్నారని స్పష్టం చేశారు. సర్వీస్ ఓటర్లు జిల్లా వ్యాప్తంగా 15,983 మంది సర్వీస్ ఓటర్లు ఉండగా పురుషులు 15,386, మహిళలు 597 మంది ఉన్నారు. 59 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు (పురుషులు: 51, మహిళలు: 8) ఉన్నారు. ఇచ్ఛాపురంలో 1,955, పలాసలో 2,945, టెక్కలిలో 2,830, పాతపట్నంలో 1,772, శ్రీకాకుళంలో 1,231, ఆమదాలవలసలో 2,184, ఎచ్చెర్లలో 918, నరసన్నపేటలో 2,148 మంది సర్వీస్ ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్ఆర్ఐ ఓటర్లలో ఇచ్ఛాపురంలో 10, పలాసలో 1, టెక్కలిలో 11, పాతపట్నంలో 5, శ్రీకాకుళంలో 23, ఆముదాలవలసలో 3, ఎచ్చెర్లలో 4, నరసన్నపేటలో 2 మంది ఉన్నారు. ఓటు వివరాలు పరిశీలించుకోవాలి డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ప్రతి ఓటరు తమ పేరు, వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు. పేరు నమోదు కాకపోయినా లేదా ఏవైనా తప్పులు, డూప్లికేట్ నమోదులు, చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్లు ఉంటే సంబంధిత ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ కార్యాలయాలను సంప్రదించి జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఫారం–6, ఫారం–7 లేదా ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా తయారీలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు ఎన్నికల విభాగపు సిబ్బంది పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా.. శ్రీకాకుళం నియోజకవర్గం 2,51,218 మంది ఓటర్లతో మొదటి స్థానంలో నిలవగా, ఆమదాలవలస 1,77,870 మందితో చివరి స్థానంలో ఉంది. నియోజకవర్గాల వారీగా వివరాలు చూస్తే.. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు శ్రీకాకుళం 2,51,218 1,23,861 1,27,336 21 ఇచ్ఛాపురం 2,41,599 1,17,372 1,24,211 16 ఎచ్చెర్ల 2,26,142 1,13,869 1,12,261 12 టెక్కలి 2,17,824 1,08,689 1,09,129 6 పాతపట్నం 2,08,607 1,03,980 1,04,620 7 పలాస 2,01,828 98,523 1,03,297 8 నరసన్నపేట 1,99,808 99,820 99,985 3 ఆమదాలవలస 1,77,870 88,657 89,212 1 -
డీఎస్సీ సర్వం.. అక్రమాల పర్వం
● అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలి ● విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి ● జేసీకి వినతి పత్రం సమర్పించిన వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీకాకుళం పాతబస్టాండ్: మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చిన వారిపై దర్యాప్తు చేయించాలని వైఎస్సార్ సీపీ నాయకులు, యువకులు శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను ఆయన చాంబర్లో కలిసి వినతి పత్రంను అందజేశారు. స్పోర్ట్స్ కోటా కింద 421 ఉపాధ్యాయ పోస్టులకు రాత పరీక్ష లేకుండా క్రీడా ప్రతిభ, సర్టిఫికెట్ల ఆధారంగా ఎంపిక చేశారని, అందుకోసం ప్రత్యేకంగా జీఓలు జారీ చేశారని తెలిపారు. కనీస విద్యార్హ తల టెట్ అర్హత సాధించకున్నా కేవలం కొన్ని సర్టి ఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చేశారని వారు జేసీకి వివరించారు. అక్రమాలకు స్పష్టమైన ఆధారాలు అన్నీ ఉన్నా ప్రభుత్వం తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవడం దారుణమని తెలిపారు. జేసీని కలిసిన వారి లో వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, యువ నాయకులు ధర్మాన రామ్మనోహర్ నాయుడు, ధర్మాన కృష్ణచైతన్య, మార్పు పృథ్వీ, పార్టీ నాయకులు ఎన్ని ధనుంజయ, మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, చల్లా రవికు మార్, పిన్నింటి సాయి, గేదెల పురుషోత్తం, దుంపల రామారావు, రౌతు శంకరరావు ఉన్నారు. అక్రమాల పర్వం ● ప్రశ్న పత్రాల తయారీ ఔట్ సోర్సింగ్కు అప్పగించి లీకేజీకి పునాది వేశారని ఆరోపించారు. ● ఔట్సోర్సింగ్ ఉద్యోగి టాపర్గా నిలవడమే అక్రమాలకు నిదర్శనమని తెలిపారు. ● స్పోర్ట్స్ కోటాలో చాలాసార్లు జీఓలు, నిబంధనలను మార్చారని, మొదట ఇచ్చిన జీఓలు సరైనవే అనుకున్నప్పుడు మళ్లీ వాటిని రద్దు చేస్తూ జీఓలు ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. ● క్రీడా సంఘాలన్నీ టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయని, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికు మార్ అని, జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షు డు లోకేష్ తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్ అని, జూడో నుంచి 39 మందికి, సాఫ్ట్బాల్ నుంచి 38 మందికి సర్టిఫికెట్లు ఇచ్చారని వివరించారు. ● కూటమి అధికారంలోకి వచ్చాక విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ● నిరుద్యోగ భృతి మాటే మరిచారని విమర్శించారు. విద్యార్థులతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు డీఎస్సీ, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి వంటివి విద్యార్థులకు కీలకం. అందులో మోసం చేస్తే పుట్టగతులు ఉండవు. విద్యార్థి ఉద్యమాలతో గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వంపై యువత తిరగబడాలి. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. దీనికి బాధ్యత వహి స్తూవిద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయా లి. డీఎస్సీ స్కామ్, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి సాధనకు 20 రోజులు ఉద్యమాలు చేస్తాం. – పేరాడ తిలక్, వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త -
సిక్కోలులో ‘చైన్నె లవ్స్టోరీ’
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని సరస్వతి థియేటర్లో శుక్రవారం ‘చైన్నె లవ్స్టోరీ చిత్ర యూనిట్’ సందడి చేసింది. చైన్నె లవ్స్టోరీ చిత్రం హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ గౌరీ ప్రియ, దర్శకుడు రవి నంబూరిలతో కూడిన ఈ చిత్ర యూనిట్ సరస్వతి థియేటర్కు చేరుకుని ప్రేక్షకులతో మమేకమయ్యారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ హౌస్ఫుల్ కలెక్షన్లతో ఇంతటి ఘన విజయం చేసిన ప్రే క్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. హీరోయిన్ గౌరీప్రియ మాట్లాడుతూ తాను సిక్కోలు రావడం ఇదే మొదటిసారి అని, మీ ఆదరాభిమానాలు మరువలేనని అన్నారు. -
జీ(వి)తాలు బాగు చేయండి
● కనీసం వేతనాల కోసం కదం తొక్కిన స్కీమ్ వర్కర్లు ● పోలీసు అరెస్టులతో ఉద్రిక్తత ● కలెక్టర్ కార్యాలయం ముట్టడి, పలువురు అరెస్ట్ శ్రీకాకుళం పాతబస్టాండ్: అంగన్వాడీ, ఆశ, తదితర స్కీమ్ వర్కర్లకు రూ.26 వేలు కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ అమలుచేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ లు, ఆశాలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికు లు, స్కూల్ శానిటేషన్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు అధిక సంఖ్యలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా చేశారు. ముందుగా ఆర్అండ్బీ బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా పలువురిని అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్కు తరలించారు. స్కీమ్ వర్కర్లకు ఏడేళ్లుగా వేతనాలు పెంచలేదని, డీఏ కూడా అమలుచేయడం లేదన్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. రాజకీయ వేధింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. యాప్ల వల్ల పనిభారం పెరిగి అంగన్వాడీలు మానసిక ఇబ్బందులకు గురవుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు నష్టం చేకూర్చే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరారు. ఈ సందర్బంగా 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు, వివిధ సంఘాలు నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి, వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.త్రినాథరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఖగేష్ పాల్గొన్నారు. -
జన సమీకరణం
● ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి 35వేల మందిని తరలించడమే లక్ష్యం ● పంచాయతీ కార్యదర్శులకు, వెలుగు గ్రామ సహాయకులకు బాధ్యతలు ● జన సమీకరణ బాధ్యత మేట్లు, డ్వాక్రా సంఘాలకు అప్పగింత ● క్షేత్రస్థాయిలో కనిపించని స్పందన సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అధికారులకు, చిరు ఉద్యోగులకు ప్రాణసంకటంగా మారింది. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, వెలుగు గ్రామ సహాయకులకు పీక మీద కత్తిలా తయారైంది. ప్రధానమంత్రి మోడీ హాజరయ్యే సభ కోసం ఇక్కడి నుంచి జనసమీకరణ చేసి తీసుకెళ్తున్నారు. జనాల్ని ఒప్పించి తీసుకెళ్లడానికి అధికారులు, ఉద్యోగులు ఆపసోపాలు పడుతున్నారు. అదే సమయంలో డ్వాక్రా మహిళలకు, ఉపాధి మేట్లకు, పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 35వేల మందిని తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టింది. తీసుకెళ్లిన దగ్గరి నుంచి భోజనం అందించేవరకు బాధ్యత తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు, వెలుగు గ్రామ సహాయకులకు ఆదేశించింది. కానీ, ప్రజల నుంచి ఆ స్థాయిలో స్పందన లేకపోవడంతో ఏం చేయాలో తలలు పట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు జిల్లాలోని ప్రయాణికులకు కూడా ఈ రోజు కష్టాలు తప్పవు. దాదాపు 150 కిపైగా బస్సులు మోదీ సభకు తరలించడంతో జిల్లాలోని చాలా రోడ్ల బస్సు సర్వీసులు రద్దు కానున్నాయి. జిల్లా నుంచి 35వేల మందిని తీసుకురావాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. వారికి అవసరమైన రవాణా, భోజనం ఇతరత్రా అన్నీ సమకూర్చుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులకే అప్పగించింది. ఈ క్రమంలో జిల్లా నుంచి 150ఆర్టీసీ బస్సులను కేటాయించింది. వాటితో పాటు ప్రైవేటు బస్సులన్నీ ఎయిర్పోర్టుకే ఒత్తిడితో తిప్పుతోంది. ఇవి చాలదన్నట్టు ప్రైవేటు స్కూల్స్కు సెలవులు ఇచ్చి, ఆ బస్సులన్నింటినీ మోదీ సభకు మళ్లించింది. రవాణా శాఖ ద్వారా ఎన్ని చేయాలో అన్నీ చేసింది. దీంతో ప్రయాణికులు ఈ రోజు కష్టాలు పడాల్సిందే. చాలావరకు ప్రయాణాలు వాయిదా వేసుకోక తప్పదు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, పాతపట్నం, హిరమండలం, ఆమదాలవలస, బత్తిలి, టెక్కలి, సారవకోట, నరసన్నపేట, రాజాం, బొబ్బిలి తదితర రూట్లలో ఆర్టీసీ సర్వీసులు తగ్గించేశారు. ఉదాహారణకు ఒక రూట్లో రోజుకి 10 సర్వీసులు తిరిగితే.. ఇప్పుడు ఐదు సర్వీసులే తిరగనున్నాయి. దాని ఫలితంగా ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. పబ్లిక్, ప్రైవేటు బస్సులన్నీ అధికారుల చేతిలో పెట్టుకుని, గ్రామానికో బస్సు చొప్పున జనాలను తరలించేందుకు కేటాయించారు. ఈ బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు, వెలుగు గ్రామ సహాయకులకు అప్పగించారు. జనాల్ని తరలించాలని అధికారులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో స్పందన కనిపించలేదు. బస్సు ఏర్పాటు చేసినా, భోజనాలు పెట్టినా, దారి ఖర్చులు ఇచ్చినా బయలుదేరలేమని చాలా మంది చెప్పడంతో ఇరకాటంలో పడ్డారు. ఒక వైపు కూటమి నాయకుల టార్గెట్లు, మరోవైపు అధికారుల ఒత్తిళ్లు వెరసి జనసమీకరణ, తరలింపు బాధ్యతలతో ఉద్యోగులు, చిరుద్యోగులు తీవ్రంగా సతమతమవుతున్నారు. ఏఎన్ఎంల తరలింపు టెక్కలి: భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనాల తరలింపులో భాగంగా అత్యవసరంగా గ్రామాల్లో వైద్య సేవలను అందజేసే ఏఎన్ఎంలను సైతం తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెక్కలి మండలానికి సంబంధించి సుమారు 20 మంది ఆరోగ్య కార్యకర్తలను భోగాపురం తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రతీ నెలా చిన్న పిల్లలకు అందజేస్తున్న ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 1 మొదటి శనివారం గ్రామాల్లో ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. చిన్నారులకు అందజేయాల్సిన ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని పట్టించుకోకుండా అధికారులు ఆరోగ్య కార్యకర్తలను భోగాపురం తరలించడం విస్మయానికి గురి చేస్తోంది. టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ సైతం బస్సులు లేక వెలవెలబోయింది. -
హైవే.. దారులన్నీ ఆయనవే
రణస్థలం/జి.సిగడాం: వైఎస్ జగన్ రాకతో జాతీయ రహదారి జన రహదారిగా మారిపోయింది. జిల్లా ముఖద్వారమైన పైడిభీమవరం నుంచి కుశాలపురం వరకు భారీ ఎత్తున ప్రజ లు వైఎస్ జగన్ను చూసేందుకు వచ్చారు. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. రణస్థలం యుబీ పరిశ్రమ నుంచి రణస్థలం టౌన్ దారి పొడవునా మహిళలు, యువత వైఎస్ జగన్ను అనుసరించి పరుగులు తీశారు. రణస్థలం, జి.సిగడాం, ఎచ్చెర్ల, లావేరు మండలాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. రహదారి చుట్టుపక్కల మేడలపైకి ఎక్కి అభిమాన నాయకుడిని చూశారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ యువనాయకులురాలు బొత్స అనూష, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లు మాజీ సీఎం జగన్కు పైడిభీమవరంలో స్వాగతం పలికారు. ముఖద్వారం.. కేరింతల మయం శ్రీకాకుళం న్యూకాలనీ/శ్రీకాకుళం అర్బన్/ ఎచ్చెర్ల: శ్రీకాకుళం ముఖద్వారమైన కుశాలపురం–నవభారత్ జంక్షన్ వద్దకు వైఎస్ జగన్ కాన్వాయ్ చేరుకోగానే యువత కేరింతలు, డ్యాన్సుల మధ్య సందడి నెలకొంది. ఎచ్చెర్ల, శ్రీకాకుళం శివారు ప్రాంతాల నుంచి భారీగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు జనం తరలివచ్చి గంటల సమయం నిరీక్షించి తమ అభిమాన నేత ను చూసి పులకించిపోయారు. రహదారిపైనే వైఎస్ జగన్కు మద్దతుగా డ్యాన్స్లు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంపోలు జంక్షన్ వద్ద.. శ్రీకాకుళం పాతబస్టాండ్: వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అంపోలు జైలు వద్దకు వెళ్లే మార్గం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మండుటెండలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వారు కనీసం వంతెన కిందకు కూడా పోలీసులు రానీయలేదు. దీంతో ఒక్కసారిగా వందల్లో ఉన్న ప్రజలు అక్కడ బారికేడ్లను తోసుకుంటూ బ్రిడ్జి కిందకు చేరా రు. అనంతరం అక్కడి నుంచి వాహనాలను అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కంబాల జోగు లు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తదితరులు వైఎస్సార్ సీపీ నాయకుల వాహనాలు అడ్డుకోవడంతో వారు కాలినడకనే వెళ్లారు. ఆఖరకు వైఎస్ జగన్ కాన్వాయ్తో వచ్చిన అంబులెన్స్ను కూడా పది నిమిషాల పాటు వెళ్లనీయలేదు. వైఎస్ జగన్ రాక ఆలస్యమైనా ప్రజలు విసుగు లేకుండా వేచి ఉన్నారు. ధర్మాన నివాసం వద్ద శ్రీకాకుళం రూరల్/ శ్రీకాకుళం: వైఎస్ జగన్ రాక సందర్భంగా శ్రీకాకుళంలోని ధర్మాన నివాసం వద్ద జనాలు పోటెత్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జగన్ రాక కోసం ధర్మాన బంగ్లా పరిసర ప్రాంతాల్లో జనాలు ఎదురు చూశారు. సాయంత్రం వైఎస్జగన్ రావడంతో చూసేందుకు పోటెత్తారు. పోలీసులతో వాగ్వాదం జిల్లా పోలీసులు ఉదయం నుంచే ఆంక్షలు విధించారు. హొటల్ గ్రాండ్ వద్ద, ధర్మాన నివాసం వద్ద సుమారు 20 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 3 గంటలు సమయంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కాన్వాయ్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నా రు. వెంటనే ఆయన దిగారు. పోలీసులతో వాగ్వాదం జరిగింది. సాయంత్రం 3.30 సమయంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి వస్తుండగా ధర్మాన నివాసం వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆమె నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. -
ఆంక్షలను జయించిన అభిమానం
125 కిలోమీటర్ల ప్రయాణ దూరం.. సుమారు ఆరున్నర గంటల సమయం.. మామూలుగా అయితే కారు లాంటి వాహనంలో వెళ్తే రెండున్నర నుంచి మూడు గంటల్లో చేరుకోవచ్చు. అదే ప్రముఖుల కాన్వాయ్లైతే మరింత తొందరగా చేరుకోవచ్చు. కానీ అపారమైన జనాభిమానం కలిగిన నాయకుడు. అడుగడుగునా అభిమాన తరంగాలు ఎగిసిపడుతూ ఆటోమేటిగ్గా బ్రేకులు వేస్తుంటే ప్రయాణంలో ఆలస్యం అనివార్యం అవుతుంది. రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గురువారం ఇదే అనుభవం ఎదురైంది. ఉదయం 11 గంటలకు విశాఖ చేరుకున్న ఆయన అక్కడినుంచి సింహాచలం, అడవివరం మీదుగా జాతీయ రహదారిపై గార మండలంలోని అంపోలు జైలు ఆవరణకు చేరడానికి అక్షరాలా ఆరున్నర గంటలు సమయం పట్టింది. దారిపొడవునా ప్రతి పల్లె, ప్రతి జంక్షన్ వద్ద పార్టీ శ్రేణులు, అంతకుమించి ప్రజలు అభిమాన నేత కోసం గంటలతరబడి నిరీక్షించారు. కాన్వాయ్కి అడ్డుపడి వైఎస్ జగన్ కరస్పర్శ కోసం పోటీ పడ్డారు. ఫలితంగా కాన్వాయ్ స్పీడుకి అభిమాన బ్రేకులు పడ్డాయి. ప్రయాణం నెమ్మదిగా సాగి.. ఆలస్యం అనివార్యమైంది. అయితే వైఎస్ జగన్ను జనం కలవకుండా పోలీసులు భారీగా మోహరించినా.. ఆంక్షలు విధించినా.. అభిమానం వాటన్నింటినీ జయించింది. అభిమాన నేతను అక్కున చేర్చుకుంది. చెట్లు, తుప్పలు, పొలాలకు అడ్డంపడి పరుగులు తీసి మరీ వేలాది ప్రజలు జగన్ కాన్వాయ్ను అనుసరించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/అరసవల్లి: అక్రమ కేసులో అరైస్టె జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు గురువారం జిల్లా కేంద్రానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారి పొడవునా కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం లభించింది. ములాఖత్కు జైలు వద్దకు వెళ్లిన వైఎస్ జగన్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అప్పలరాజుపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని, అతని కుటుంబానికి తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. అంతకుముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ ఎయిర్పోర్టు నుంచి నేరుగా రోడ్డు మార్గంలో రావడంతో దారి పొడవునా ఆయనను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. జగన్ కోసం తరలివచ్చిన జన సునామీ కారణంగా ఎక్కడికక్కడే పర్యటన ఆలస్యమైంది. రణస్థలం, చిలకపాలెం, నవభారత్ జంక్షన్, కొత్త రోడ్డు కూడలి, పెద్దపాడు కూడలి, అంపోలు జంక్షన్ మీదుగా జిల్లా జైలుకు తరలివెళ్లారు. మహిళలు, యువత అధికంగా కనిపించగా.. మత్స్యకారులు అత్యధిక సంఖ్యలో కనిపించడం గమనార్హం. మరో వైపు పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. కేసులు పెడతామని కూడా బెదిరించారు. అయినా వెరవకుండా అభిమాన నాయకుడిని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఎవరినీ నిరాశ పరచకుండా వైఎస్ జగన్ అభివాదం చేస్తూ, కరచాలనాలు అందిస్తూ, వినతులు అందుకుంటూ ముందుకు కదిలారు. ఆ క్రమంలో శ్రీకాకుళం జిల్లా జైలు వద్దకు చేరే సరికి సమయం మించిపోయింది. దీంతో జైలు ఆవరణలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు భార్య శ్రీదేవి, కుమారులు ఆరవ్ వర్మ, అర్నవ్ వర్మ, అప్పలరాజు సోదరుడు త్రినాథరావు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కుయుక్తులను ఎండగట్టారు. ప్రతిపక్ష నాయకులపై చేస్తున్న కుట్రలను సోదాహరణంగా వివరించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి ములాఖత్లో కలిసేందుకు వచ్చిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు సీదిరి శ్రీదేవి, ఆయన తనయుడు ఆరవ్ వర్మ, అర్నవ్ వర్మలతో పాటు బొత్స సత్యనారాయణ, రీజనల్ కో ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, పసుపులేటి బాలరాజు, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, నర్తు రామారావు, కుంభా రవిబాబు, పాలవలస విక్రాంత్, పెనుమత్స సురేష్బాబు, జిల్లా పరిషత్ చైర్మన్లు మజ్జి శ్రీనివాసరావు, పిరియా విజయ, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కంబాల జోగులు, గొర్లె కిరణ్కుమార్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఎంవీ పద్మావతి, పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ హర్షవర్ధన్రెడ్డి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, నియోజకవర్గ సమన్వయ కర్తలు పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, వెలమ కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవీ స్వరూప్, రాష్ట్రకార్యదర్శులు కేవీజీ సత్యనారాయణ, దుంపల లక్ష్మణరావు, ఎన్ని ధ నుంజయరావు, బొడ్డేపల్లి పద్మజ, చల్ల రవికుమార్, ఎస్ఈసి మెంబర్ గొండు కృష్ణమూర్తి, యువనేతలు ధర్మానరామ్మనోహర్నాయుడు, ధర్మాన కృష్ణచైతన్య, కేకే రాజు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతీ దివ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, గొండు రఘురాం, పీస గోపి, తంగుడు జోగారావు, పేడాడ రమణి, మత్య్సకార న్యాయవాది మూగి గురుమూర్తిలతోపాటు అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
నీట్ పేపర్ లీక్ మృతులకు పరిహారం అందించాలి
వజ్రపుకొత్తూరు రూరల్: నీట్ పేపర్ లీక్తో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రవి డిమాండ్ చేశారు. పలాస – కాశీబుగ్గలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ సంఘాలు సంయుక్తంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు బుధవారం నివాళులర్పిస్తూ కాగడాల ప్రదర్శన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తో చెలగాటం ఆడుకుంటున్నాయని మండిపడ్డారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో రాష్ట్రంలో దాదాపుగా 83 వేల మంది విద్యార్థులు నష్టపోయారని, దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు సాయి, సుందర్, వాసు, చంటి, వెంకటరావు, విజయ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
34 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయిని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా సర్దాపూర్ గ్రామానికి చెందిన అనిల్కుమార్ గౌడ, పొలసర జిల్లా డెంగాపదర గ్రామానికి చెందిన మున్నా ప్రదాన్ అనే ఇద్దరు యువకులు ఒడిశాలోని బహరగుడకి చెందిన గంజాయి వ్యాపారి కుంజోజెనా సూచించినట్లు గంజాయి అక్రమ రవాణాకు పూనుకున్నారు. దీంతో మొత్తం 34.290 కేజీల గంజాయిని గుజరాత్ రాష్ట్రంలోని గంగా మహంతికి అందజేయడానికి బరంపురం రైల్వేస్టేషన్కి సోమవారం చేరుకున్నారు. అక్కడ పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉండడంతో వారిరువురు రెండు రోజులపాటు అక్కడే ఉండిపోయారు. అనంతరం బుధవారం ఒడిశా నుంచి బస్లో ఇచ్ఛాపురం చేరుకున్నారు. రైలులో గుజరాత్ వెళ్లడానికి ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కి వస్తుండగా స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు గంజాయితో పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి ఒక సెల్ఫోన్, గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పట్టణ పోలీసులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎం.ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలకాలి
● వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఇటీవల అక్రమంగా అరైస్టెన మత్య్సకార సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుని ములాఖత్గా కలిసేందుకు జిల్లాకు గురువారం వస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలకాలని మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణంలో బుధవారం కృష్ణదాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ విశాఖకు ఉదయం 11 గంటలకు చేరుకొని, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం అంపోలు జైలు వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు వస్తారన్నారు. మత్య్సకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించింది వైఎస్సార్ కుటుంబమేనని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మత్య్సకారుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు జిల్లాలో మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ వంటి అనేక మంచి పనులు చేశామని తెలిపారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడా లేనివిధంగా రోడ్డు యాక్సిడెంట్ను హత్య కేసుగా నమోదు చేసి అప్పలరాజు, ఆయన కుమారుడిని జైల్లో పెట్టడం దారుణమన్నారు. రాజకీయంగా అప్పలరాజుని ఎదుర్కొనే దమ్ములేక అరెస్టుతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కక్ష సాధింపులు చేస్తే చూస్తూ ఊరుకోమని భవిష్యత్లో కూటమి నాయకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సీఈసీ మెంబర్ అందవరపు సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్, మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి, విజయనగరం పార్లమెంట్ పరిశీలకుడు కేవీజీ సత్యనారాయణ, పార్టీ పలాస, శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, పిన్నింటి సాయి, కరిమి రాజేశ్వరరావు, దుంపల లక్ష్మణరావు, ఎస్ఈసీ మెంబర్ గొండు కృష్ణమూర్తి, చల్ల శ్రీను, రౌతు శంకరరావు, హర్షవర్దన్రెడ్డి, పొన్నాడ రుషి, గేదెల పురుషోత్తం, మండవల్లి రవి, ఎంఏ రఫీ, బుక్కూరు ఉమామహేశ్వరరావు, సాధు వైకుంఠరావు, బాన్న నర్శింగరావు, కింజరాపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఐషీఘోష్ అరెస్టుకు యత్నించడం సరికాదు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గేటు ఎదుట నిరసన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.చందు, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి పి.ఖగేష్లు మాట్లాడుతూ నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమానికి ఐషీ ఘోష్ కీలక నాయకత్వం వహించారన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ కోసం, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ కోసం ఆమె నిరంతరం పోరాడారన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ముందుండి పోరాటం చేసిన నాయకురాలిని లక్ష్యంగా చేసుకుని పాత కేసులను తిరిగి తెరపైకి తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం రాజకీయ కక్షసాధింపుగా కనిపిస్తోందని ఆరోపించారు. కేసులతో విద్యార్థుల గొంతును మూసివేయాలని చూసే ప్రయత్నాలు ఎన్నటికీ విజయవంతం కావన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును హరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పోలీసులు చట్టానికి, రాజ్యాంగానికి మాత్రమే విధేయులై పనిచేయాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఎస్ఎఫ్ఐ పోరాటం నిరంతరం కొనసాగుతుంది హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ పి.దివ్య, ఆర్ట్స్ కాలేజీ కమిటీ సభ్యులు ధరణి, శిరీష, దుర్గ భవానీ, హాస్టల్ కమిటీ సభ్యులు దివాకర్, కార్తీక్, అజిత్, విద్యార్థులు తరుణ్, జగదీష్, హేమంత్, జగన్, మురళి, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా
టెక్కలి రూరల్: మండలంలో ఒలియాసాగరం సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద బుధవారం ఒక లగేజీ ఆటో బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. టెక్కలి నుంచి శ్యాంసుందరాపురం వైపు ఐరన్ లోడుతో వెళ్తున్న ఆటో ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డులోకి మలుపు తిరుగున్న సమయంలో, రహదారి పూర్తిగా పాడైపోవడంతో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. పశువుల అక్రమ రవాణా మందస: మండలంలోని బాలిగాం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై బుధవారం ఉదయం అక్రమంగా పశువులు రవాణా చేస్తున్న రెండు వాహనాలను స్థానిక ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ పట్టుకున్నారు. బరంపురం నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న రెండు వాహనాలను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రధాని సభను విజయవంతం చేయాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆగస్టు 1వ తేదీన భోగాపురంలో నిర్వహించనున్న ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబుల సభను విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సభకు వెళ్లే వారికోసం 737 బస్సులు ఏర్పాటు చేశామని, ప్రయాణికులకు ఇచ్ఛాపురం నుంచే వేడివేడిగా టిఫిన్లు అందించేందుకు 19 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆహారం అందలేదనే ఫిర్యాదు రాకుండా హెచ్డీటీలు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఏ రూట్ బస్సు అదే రూట్లో వెళ్లాలని, ఎక్కడా నిలపరాదని పేర్కొన్నారు. మధ్యాహ్నం 35 వేల మందికి 9 పాయింట్లలో భోజనాలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. భోజన కేంద్రాల వద్ద నియోజకవర్గాల పేర్లతో పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప బస్సులను మధ్యలో ఆపవద్దని, బస్సు ఇన్చార్జిలు పూర్తి బాధ్యతలు తీసుకోవాలన్నారు. సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని సూచించారు. ఆగిన మట్టి తరలింపుసంతబొమ్మాళి: మండలంలోని రుంకు హనుమంతుపురం రెవెన్యూ పరిధిలో ఉన్న పెద్ద చెరువులో మట్టిని టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలించడాన్ని రెవెన్యూ అధికారులు నిలుపుదల చేశారు. చెరువు మట్టి కొల్లగొట్టి అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో బుధవారం కథనం ప్రచురితం కావడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ హేమసుందరరావు ఆదేశాల మేరకు స్థానిక వీఆర్వో శంకర్ ఘటనా స్థలానికి వెళ్లి, పెద్ద చెరువులో మట్టి తవ్వకాలను పరిశీలించారు. అనంతరం నిలుపుదల చేశారు. -
వైఎస్ జగన్ హయాంలో..
పాకిస్తాన్ నుంచి జిల్లాకు తీసుకొచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, విదేశాంగ మంత్రితో సంప్రదింపులు చేసి 2020 జనవరి 6న వారందరినీ విడుదల చేయించింది. స్వగ్రామాలకు క్షేమంగా తీసుకొచ్చింది. వారికి ఆర్థికంగా కూడా అండగా నిలిచింది. కోవిడ్లో అండగా.. కోవిడ్లో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసినప్పుడు జిల్లాకు చెందిన మత్స్యకారులు గుజరాత్, చైన్నెతో పాటు ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్నారు. రూ.3కోట్లు ఖర్చు పెట్టి జిల్లాకు చెందిన 5,500 మంది మత్స్యకారులను బోట్లు, 46 బస్సుల ద్వారా తీసుకొచ్చారు. వారందరికీ ప్రత్యేక వసతులు కల్పించి, తక్షణ సాయం కింద రూ.2వేల ఆర్థిక సాయం చేశారు. అభివృద్ధిలో కీలక అడుగులు సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో రూ. 2,949.70కోట్లతో మూలపేట పోర్టు మంజూరు చేశారు. శంకుస్థాపన చేసి పనులు చకచకా సాగించారు. చివరి దశకు తీసుకొచ్చారు. బుడగట్లపాలెంలో రూ.366కోట్లతో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేసి, పనులు ప్రారంభించారు. మంచినీళ్ల పేటలో జెట్టీ పనులకు శ్రీకారం చుట్టారు. వేట నిషేధ కాలంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట రూ.10వేలు చొప్పున ఇచ్చారు. బోట్ల కోసం లీటర్కి రూ.9 చొప్పున డీజిల్ సబ్సిడీ, మూడు చక్రాల మోటార్ సైకిళ్లు ఇచ్చారు. నియోజకవర్గానికొక ఆక్వా ల్యాబ్, 66 మంది సాగర మిత్ర ఉద్యోగులు, గ్రామ సచివాలయాల్లో ఫిషరీస్ అసిస్టెంట్ ఉద్యోగులను ఏర్పాటు చేశారు. పదవుల్లో పెద్దపీట.. మత్స్యకారులను రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేయూతనిచ్చారు. ఆ సామాజిక వర్గానికి చెందిన జుత్తు జగన్నాయకులను ఎమ్మెల్యేను చేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్.. ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి, వైద్యుడైన సీదిరి అప్పలరాజును ఎమ్మెల్యేగా చేయడమే కాకుండా మంత్రి పదవిలో కూర్చొబెట్టారు. మత్స్యకారుల కోసం వైఎస్సార్, వైఎస్ జగన్ అండగా నిలిచి, రాజకీయంగా చేయూతనిచ్చారు. చంద్రబాబు పాలనలో.. పాక్ జైల్లో మగ్గిన మత్స్యకారులు 2018 నవంబర్ 27న చంద్రబాబు ప్రభుత్వంలో గుజరాత్ రాష్ట్రంలో వీరావల్ నుంచి వేటకెళ్లిన ఎచ్చెర్ల మత్స్యకారులు సముద్రంలో దారి తప్పి పాకిస్తాన్ చెరలో చిక్కుకున్నారు. దారితప్పిన మత్స్యకారులపై పాకిస్తాన్.. దేశద్రోహం కేసులు పెట్టి సుదీర్ఘకాలం జైలులో పెట్టింది. 20మంది మత్స్యకారులు పాక్ జైల్లో మగ్గుతుంటే అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. పత్తా లేని టీడీపీ.. కోవిడ్ విజృంభణతో ఒకవైపు ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు బిక్కుబిక్కుమని ఇళ్లల్లో మత్స్యకార కుటుంబాలు బతుకుతున్నాయి. ఇంకో వైపు ఇంటి పెద్దలు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉండిపోయారు. ఆ సమయంలో టీడీపీ కనీసం పట్టించుకోలేదు. తమ ప్రాణాలే ముఖ్యమని పచ్చ నాయకులు ఎవరింట్లో వారు దాక్కున్నారు. ఇక, మత్స్యకారులను ఇంకేం ఆదుకుంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక్క మేలూ జరగలేదు.. మత్స్యకారులను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం ఒక్క మేలూ చేయలేదు. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినా ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదు. ప్రతిసారి భావనపాడు పోర్టు అన్నారే తప్ప దాన్ని అమల్లోకి తేలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అత్యధిక పనులు పూర్తయినప్పటికీ మూలపేట పోర్టును గాలికొదిలేసింది. బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ను పక్కన పెట్టేసింది. మత్స్యకారులకు ఇవ్వాల్సిన వేట విరామ భృతిలో అక్రమాలకు పాల్పడుతోంది. పదవుల్లోనూ దగా.. మత్స్యకార సామాజిక వర్గంలో ఎదుగుతున్న నాయకులను చంద్రబాబు అణగదొక్కుతున్నారు. బలహీన వర్గాలకు చెందిన బలమైన నాయకులను రాజకీయంగా వేధిస్తున్నారు. దానిలో భాగంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అక్రమ అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఓట్ల కోసం వాడుకోవడం తప్ప ఆ సామాజిక వర్గం అభివృద్ధి, సంక్షేమానికి పనిచేయలేదు. సరికదా ఎదుగుతున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. -
మత్స్యకారులంటే ఎందుకంత మంట
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మత్స్యకారులంటే చిన్నచూపు చూడటం.. ఎదిగిన నేతలను అణగదొక్కడం, అక్రమ కేసులు బనాయించడం, పదవుల కేటయింపులో మొండిచెయ్యి చూపడం.. ఇవీ చంద్రబాబు తన పాలనలో మత్స్యకారుల పట్ల వ్యవహరిస్తున్నారు తీరుకు నిదర్శనాలు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ఇందుకు పూర్తి భిన్నం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, విపత్కర పరిస్థితుల్లో ఆపన్న హస్తం అందించడం, పదవుల్లో పెద్దపీట వేయడం వంటి చర్యలతో మత్స్యకారులకు అండగా నిలిచారు. ఎదిగిన నేతలను అణగదొక్కుతున్న చంద్రబాబు అండ్కో మత్స్యకారుల మోసం చేస్తున్న వైనం అక్రమ కేసులు బనాయింపు అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించిన వైఎస్ జగన్ -
పంటల బీమా నమోదు చేసుకోవాలి
వజ్రపుకొత్తూరు: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో ప్రతిరైతూ పంటల బీమా నమోదు చేసుకోవాలని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ జిల్లా పీడీ జగన్మోహనరావు కోరారు. మండలంలోని పాతటెక్కలిలో ఎల్నినో ప్రభావం, పంటల మార్పిడి, మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు బుధవారం అవగాహన కల్పించారు. ఎకరాకు రూ.16లు చెల్లిస్తే రూ.40 వేల వరకు పంటల బీమా వర్తిస్తుందని తెలిపారు. రైతులు స్వల్పకాలిక, మద్యస్థ వరి రకాలు వేసుకోవాలని సూచించారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు అనూష, భాగ్యలక్ష్మి, ఉదయ్బాబులు మాట్లాడుతూ వర్షాభావం ఉన్నందున ప్రతీరైతు నీటి ఎద్దడి నుంచి కాపాడుకునేందుకు వెద, నారు మడులకు 19.19.19 లేదా 13045 మందును వ్యవసాయాధికారుల సూచనతో పిచికారీ చేయాలని సూచించారు. వరిలో కాలిబాటలు తీయడం వల్ల గాలి, వెలుతురు తగిలి తెగుళ్లు సోకకుండా దిగుబడి ఆశించిన మేర వస్తుందన్నారు. ఆగస్టు 15లోపు వర్షాలు కురవకుంటే మెట్టు భూములు ఉన్న రైతులు ప్రత్యామ్నాయ పంటలైన కంది, అపరాల సాగుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. జీడి, కొబ్బరిలో లద్దె పురుగులు ఎక్కువగా ఉన్నపుడు మిడాక్లోరాపిడ్ మందును వాడుకోవాలని స్పష్టం చేశారు. ప్రైవేటు నర్సరీల్లో దొరికే మొక్కలు నాటుకోవద్దని, బాపట్ల పరిశోధన కేంద్రం అందిస్తున్న జీడిమామిడి, కొబ్బరి మొక్కలు నాటుకుంటే అధిక దిగుబడులు వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలాస వ్యవసాయ సహాయ సంచాలకురాలు శారద, మండల వ్యవసాయాధికారి బమ్మిడి ధనుంజయరావు, ఉద్యానవన శాఖ అధికారి శంకర్దాసు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం
మాజీ సీఎం వైఎస్ జగన్ రాక నేడు ● జిల్లా జైలులో మాజీ మంత్రి సీదిరికి పరామర్శ ● జాతీయ రహదారి మీదుగా సాగనున్న పర్యటన ● ఏర్పాట్లపై సమీక్ష చేసిన నేతలు జిల్లాలో కొందరు పోలీసుల వ్యవహార శైలి విస్మయం కలిగిస్తోంది. ఒక్కొక్కరికి ఒక్కో రూల్ అమలు చేయడం విమర్శలకు తావిస్తోంది. –8లోఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయిని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. –8లోగురువారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2026ఽసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి గురువారం జిల్లాకు వస్తున్నారు. అక్రమ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అంపోలులో ఉన్న జైలులో ములాఖత్ ద్వారా కలిసి, పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి.. భోగాపురం, పూసపాటిరేగ, పైడి భీమవరం, రణస్థలం, ఎచ్చెర్ల మీదుగా నవభారత్ జంక్షన్ వద్ద శ్రీకాకుళం నగరంలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి కొత్తరోడ్డు మీదుగా అంపోలు జైలు వద్దకు చేరుకుంటారు. జిల్లాకొస్తున్న జగన్మోహన్రెడ్డిని చూసేందుకు, కలిసేందుకు వేలాదిగా అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. జిల్లాలోని దారులన్నీ శ్రీకాకుళం నగరం, అంపోలు వైపు కలవనున్నాయి. కాగా, జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి నగర శివారులో ఉన్న హోటల్ గ్రాండ్లో వైఎస్ జగన్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, రీజనల్ కో–ఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ హర్షవర్దన్రెడ్డి తదితరులు సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్కుమార్, సమన్వయకర్తలు పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, విజయనగరం జిల్లా పార్లమెంట్ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ, నియోజకవర్గ పరిశీలకులు అంధవరపు సూరిబాబు, దుంపల లక్ష్మణరావు, కరిమి రాజేశ్వరరావు, పిన్నింటి సాయికుమార్, ఎన్ని ధనుంజయ్, తూర్పు కాపు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, ధర్మాన కృష్ణ చైతన్య, గొండు కృష్ణమూర్తి, గేదెల పురుషోత్తం, సీదిరి అప్పలరాజు సోదరుడు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.మాజీ ముఖ్యమంత్రి పర్యటన సాగే మార్గం, భద్రత ఏర్పాట్లు, నాయకుల సమన్వయం, వాహనాల పార్కింగ్ తదితర వాటిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, చర్చించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష చేస్తున్న తలశిల రఘురాం, బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్, గుడివాడ అమర్నాథ్, మజ్జి శ్రీనివాసరావు, హర్షవర్దన్రెడ్డి తదితరులు -
శాకంబరిగా లలితా త్రిపురసుందరి
శ్రీకాకుళం కల్చరల్: తమ్మినాయుడుపేటలోని చంద్రమౌళీశ్వరాలయంలో లలితా త్రిపురసుందరీ దేవిని ఆషాఢ మాసం సందర్భంగా బుధవారం శాకంబరిగా అలంకరించారు. అర్చకులు సురేష్ శర్మ, ధర్మకర్త సాగి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అమ్మవారిని వివిధ కూరగాయలతో అలంకరించగా.. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకున్నారు. నీలమణికి అన్నాభిషేకం సారవకోట: అవలింగిలోని నీలమణి అమ్మవారికి బుధవారం క్వింటా అన్నంతో అభిషేకం నిర్వహించారు. మూడు రోజులుగా జరుగుతున్న ఆషాఢ ఉత్సవాలో భాగంగా అమ్మవారిని ముందుగా వివిధ రకాల కూరగాయలు, డ్రై ప్రూట్స్తో అలంకరించి ఉత్సవ విగ్రహానికి అన్నంతో అభిషేకించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. -
కొండ కాలువ కబ్జా..?
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస మండలం సుబ్బగుడ్డి గ్రామ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ కొండ పోరంబోకు కాలువ కబ్జాకు గురయ్యిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొండపై కురిసే వరద నీరు సహజంగా కాలువ ద్వారా దిగువకు ప్రవహిస్తూ ఎర్ర చెరువులోకి చేరుతుంది. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చే అడవి జంతువుల దాహార్తిని తీర్చడంతో పాటు పంటసాగుకు ఈ చెరువు ఎంతో ఆధారంగా ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే ఈ కాలువను కూటమి నాయకుల అండదండలతో కొంతమంది కబ్జా చేసి, మట్టితో కప్పి పొలాలుగా మార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివలన వరద నీరు ఎర్ర చెరువుకు చేరే అవకాశం ఉండదని, దీంతో పర్యావరణానికి ముప్పుతో పాటు మూగజీవాలకు, పంటలకు నీరు అందని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి కబ్జాలను తొలగించి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు. ఈ విషయంపై తహసీల్దార్ శ్రీదేవి వివరణ కోరగా.. కొండ కాలువ ఆక్రమణ విషయం తమ దృష్టికి రాలేదని, వెంటనే రెవెన్యూ సిబ్బందిని పంపించి క్షేత్రస్థాయిలో విచారణ చేపడతామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. -
దగా పాలనపై దండయాత్ర
మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని గర్జించిన యువత● వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ● డీఎస్సీ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు చేయాలని డిమాండ్ కలెక్టరేట్కు ర్యాలీగా వస్తున్న విద్యార్థులు, పార్టీ శ్రేణులను రోప్లతో అడ్డుకుంటున్న పోలీసులు కదం తొక్కుతూ.. పదం పాడుతూ యువతరం గర్జించింది. డీఎస్సీ అక్రమాల నిగ్గు తేల్చాలని రోడ్డెక్కి నిరసన తెలిపింది. పోలీసుల దిగ్బంధాలను దాటుకుంటూ.. ఆంక్షల సంకెళ్లు ఛేదిస్తూ ధిక్కార నినాదాన్ని సర్కారుకు వినిపించింది. పరీక్షల్లో జరిగిన అక్రమాలనే కాదు.. ఎగ్గొట్టిన నిరుద్యోగ భృతిని, ఆపేసిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వానికి గుర్తు చేసింది. వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామాను ముక్తకంఠంతో కోరింది. శ్రీకాకుళం పాతబస్టాండ్/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని, యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టిందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి లను మర్చిపోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి యువతకు న్యాయం చేయాలని కోరారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును కూడా పోలీసులు అడ్డుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యా రంగంలో వైఫల్యాలకు నిరసనగా వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన ‘విద్యార్థి, యువత ర్యాలీ’ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. పోలీసుల ఆంక్ష లు, దిగ్బంధాలను దాటుకుని జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శ్రీకాకుళం చేరుకున్నారు. మంగళవారం ఉదయం నరసన్నపేటలో పోలీసుల అడ్డంకులను ఛేదించుకుని బయలుదేరిన నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్ రహదారిలో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి ధర్మాన కృష్ణదాస్ నాయకత్వంలో కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రం ఇచ్చేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఎనిమిది నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన జనసందోహంతో కలెక్టరేట్ రహదారి పూర్తిగా కిక్కిరిసిపోయింది. రోడ్డుపై ఉద్రిక్తత కలెక్టరేట్ వైపు ఊరేగింపుగా వెళ్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు ఒక్కసారిగా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య తీవ్ర వా గ్వాదం, తోపులాట చోటుచేసుని ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిరసన ప్రదర్శనలకు ఎలాంటి ముందస్తు ప్రభుత్వ అనుమతి లేదని, చట్టభద్రత దృష్ట్యా సహకరించాలని పోలీసులు కోరగా.. వారి విజ్ఞప్తి మేరకు కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వకుండానే నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపి అక్కడ నుంచి వెనుదిరిగారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయసాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్ కుమార్, సమన్వయకర్తలు పేరాడ తిలక్, శాడి శ్యామ్ ప్రసాద్రెడ్డి, చింతాడ రవికుమార్, పార్టీ సీఈసీ మెంబర్, నరసన్నపేట నియోజకవర్గ పరిశీలకులు అంధవర పు సూరిబాబు, రాష్ట్ర కార్యదర్శులు దుంపల రామారావు, కేవీజీ సత్యనారాయణ, తూర్పుకాపు కుల రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, ఇంటలెక్చువల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి పిల్లల రామకృష్ణ, ఎస్ఈసీ మెంబర్ గొండు కృష్ణమూర్తి, వెలమకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షులు చింతాడ వరుణ్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు అశోక్చక్రవర్తి, శ్రీకాకుళం నియోజకవర్గ పరిశీలకు లు పిన్నింటి సాయి, చల్ల రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ముత్తా విజయ్కుమార్, బొడ్డేపల్లి రమేష్కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతీ దివ్య, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు ఎం.ఏ భేగ్, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్య క్షులు రౌతు శంకరరావు, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు ముంజేటి కృష్ణమూర్తి, క్రిష్టియన్, మైనార్టీ విభాగం నాయకులు ప్రత్తి అన్వేష్, వైఎస్సార్సీపీ నాయుకులు సాధు వైకుంఠరావు, మండవల్లి రవి, అంధవరపు రమేష్, గొండు రఘురాం, సీదిరి త్రినాఽథరావు, గంట్యాడ రమేష్, వైవీ శ్రీధర్, కోత సతీష్, నక్క రామరాజు, భరద్వాజ్, సనపల నారాయణరావు, నర్తు నరేంద్రయాదవ్, పీస శ్రీహరి, మూకళ్ళ తాతబాబు, చిట్టి జనార్ధన,టి. కామేశ్వరి, సీహెచ్ భాస్కరరావు, ఎండ రమేష్, చింతాడ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
● రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
రణస్థలం: భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేసేలా ముందుగానే సమాచారం అందించి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని, ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ లాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. మండలంలోని సంచాం గ్రామంలో జరిగిన రీ సర్వేను ఆయన పరిశీలించారు. రైతులతో ముఖాముఖిగా సమావేశమై రీ సర్వే ప్రక్రియపై వారి అభి ప్రాయాలు, ఎదురవుతున్న సమస్యలు, భూ హద్దుల నిర్ధారణ, రికార్డుల కచ్చితత్వం, మ్యాప్ల సవరణ, భూ వివాదాల పరిష్కారం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ సర్వే పూర్తి చేయాలని సూచించారు. ఈ తనిఖీలో సహాయ సంచాలకులు ఎం.జోషిలా, శ్రీకాకుళం, టెక్కలి డివిజన్ సర్వే ఇన్స్పెక్టర్లు దుర్గాప్రసాద్, చంద్రశేఖర్, రణస్థలం తహశీల్దార్ సనపల కిరణ్ కుమార్, మండల సర్వేయర్ ఎస్. రవి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
నారుపోసినా.. నీరులేక..!
రాపాక – దల్లవలస గ్రామాల మధ్యలో వరినారు కోసం బకెట్లతో నీరు తెస్తున్న దృశ్యం కోటిపల్లి – గూడెం గ్రామాల మధ్యలో వరినారుకు తాగునీరు పెడుతున్న రైతు వరుణుడి కోసం వేయి కళ్లతో చూస్తున్న అన్నదాతకు తీవ్ర నిరాశే మిగిలుతోంది. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఇప్పటివరకు వర్షాలు ముఖం చాటేయడంతో వరినారు మడుల్లోనే ఎండిపోతోంది. దీంతో కంటికి రెప్పలా కాపాడుకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. నారును కాపాడుకునేందుకు బోర్లు, బావుల చుట్టూ రైతులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుదూర ప్రాంతాల నుంచి నీటిని తీసుకొచ్చి నారుకు పోస్తున్నారు. ఇటీవల కొద్దిపాటి మబ్బులు వస్తుండడంతో ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోతే ఈ ఏడాది నష్టాలు తప్పవని వాపోతున్నారు. – జి.సిగడాం(పొందూరు) -
అర్హులకు అన్యాయం
డీఎస్సీలో నిజమైన అర్హులకు అన్యాయం జరిగింది. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మా ర్చారు. ఎలాంటి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు లేకుండా 421 మందికి డీఎస్సీ ఉద్యోగాలు ఇవ్వడం అన్యాయం. డీఎస్సీ పారదర్శకంగా ఉంటుందని నమ్మిన నిరుద్యోగులకు తీవ్ర ఆవేదన మిగిల్చారు. – ఎంవీ స్వరూప్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీబీఐతో దర్యాప్తు చేయాలి డీఎస్సీ పేపర్లు తయారు చేసిన వారికే స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడం విచిత్రం. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయాలి. అర్హులకు న్యాయం జరగాలి. – మార్పు పృథ్వీ, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వానిదే బాధ్యత డీఎస్సీ మోసాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి. నిరుద్యోగులను, యువతను మోసం చేసిన ఏ ప్రభుత్వమూ నిలబడలేదు. – ధర్మాన రామ్మనోహర్ నాయుడు, పార్టీ యువ నాయుడు మోసగించడం అలవాటే చంద్రబాబు ప్రభుత్వానికి విద్యార్థులు, నిరుద్యోగులను మోసగించడం అలవాటైపోయింది. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక అక్రమాలను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం సరికాదు. – ధర్మాన కృష్ణ చైతన్య, పోలాకి జెడ్పీటీసీ -
వృద్ధురాలికి మాజీ సైనికుల చేయూత
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని జిల్లా పరిషత్ దగ్గర కంపోస్ట్ కాలనీ ద్వారకా నగర్లో నివాసముంటున్న వృద్ధురాలు సూరాలమ్మకు మాజీ సైనికులు చేయూతనందించారు. ఆమె కోసం ఒక ఇంటిని నియమించి డీఎస్పీ సీహెచ్ వివేకానంద చేతులమీదుగా మంగళవారం ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకు చెందిన మాజీ సైనికుడు కాకర్ల నర్సింగ్ వృద్ధురాలి ఇబ్బందులు తెలుసుకొని చలించిపోయాడు. దీంతో అతని మన సిక్కోలు సైనికుడు ఇన్స్ట్రాగామ్ అకౌంట్ ద్వారా సాయం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు మాజీ సైనికులు, దాతలు విరాళాలు అందించారు. ఈవిధంగా సేకరించిన విరాళాలతో వృద్ధురాలికి ఒక తాత్కాలిక గృహం నిర్మించి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ చైర్మన్, విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు, లయన్ నటుకుల మోహన్, పైడి మురళీధరరావు, సనపల రామకృష్ణ, ఎం.సింహాచలం, పైడి రామారావు, పి.చిన్నరావు, పి.వెంకటేశ్వరరావు, టి.శ్రీను, బి.శంకరరావు, దుర్గా భవానీ వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కింతాడ సంతోష్ పాల్గొన్నారు. సరుబుజ్జిలి: సరుబుజ్జిలి జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నందికొండ కాలనీకి చెందిన ఫైర్స్టేషన్ ఏఎస్ఐ గుజ్జల అప్పలరాజు మంగళవారం తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పలరాజు ఎప్పటిలాగే ఆమదాలవలస ఫైర్స్టేషన్లో విధులు ముగించుకొని తన ఇంటికి మంగళవారం వెళ్తున్నారు. అదే సమయంలో శ్రీకాకుళం నుంచి కొత్తూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సరుబుజ్జిలి జంక్షన్లో ఢీకొంది. ఈ ప్రమాదంలో అప్పలస్వామికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108లో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కొత్తూరు: స్థానిక పీఏసీఎస్ వద్ద ఎరువులు కోసం రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఏపీసీఎస్కు 400 బస్తాల డీఏపీని వ్యవసాయ శాఖ కేటాయించింది. కేటాయించిన డీఏపీని మంగళవారం పీఏసీఎస్ సిబ్బంది రైతులకు యాప్ ద్వారా విక్రయించారు. ముందుగా డీఏపీ కొనుగోలు కోసం వచ్చిన రైతులకు వరుస క్రమంలో టోకెన్లు ఇచ్చారు. అయితే కొంతమంది మంది రైతులకు సాయంత్రం వరకు ఉన్నా ఎరువులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దీంతో రైతులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ ఆందోళన చేపట్టి సొసైటీ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎరువుల విక్రయంపై సొసైటీ అధికారి నాగరాజు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ప్రసాద్ అన్నారు. విక్రయాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు. 300 బస్తాలకు టోకెన్లను రైతులకు ఇచ్చారని, అయితే టోకెన్లు ఇచ్చిన రైతులకు ఎరువులు ఇవ్వకుండా స్టాక్ అయిపోయిందని చెప్పడం సరికాదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎదురుచూసినా డీఏపీ ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ అధికారులు ఇష్టానుసారంగా ఎరువులు విక్రయించారన్నారు. లైన్లో ఉన్నవారికి ఎరువులు ఇవ్వకుండా నచ్చినవారికి ఎరువులు అమ్మకాలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కొత్తూరు, కర్లెమ్మతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు -
అంతా నా ఇష్టం..!
● కలెక్షన్ రాజ్పై పెరుగుతున్న ఆరోపణలు ● కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ అధికార దర్పం ప్రదర్శించారని ఆగ్రహం ● విమర్శలు గుప్పిస్తున్న మెడికల్ ఆఫీసర్లు అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖలో ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్లో కీలకాధికారిగా పనిచేస్తున్న కలెక్షన్ రాజ్.. కేవలం ఓ కాంట్రాక్టు ఉద్యోగే. అయినప్పటికీ డీఎంహెచ్వోకి మించిన అధికార దర్పం ప్రదర్శించాడనే విమర్శలున్నాయి. ఇటీవల వరకు డీఎంహెచ్వోగా పనిచేసిన అధికారి ఇచ్చిన ప్రత్యేక ‘ఆసరా’ ఫలితంగా సదరు కలెక్షన్ రాజ్ హద్దులు మీరి ప్రవర్తించారని మెడికల్ ఆఫీసర్లే విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీల్లో భాగంగా వైద్యశాఖలో చేపట్టాల్సిన పలు నిర్ణయాలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలపై ప్రగతి నివేదికలపై ఏకంగా సదరు కాంట్రాక్టు ఉద్యోగే అంతా తానై వ్యవహరించి జిల్లావ్యాప్తంగా ఉన్న మెడికల్ ఆఫీసర్లు (పీహెచ్సీ డాక్టర్లు), సీనియర్ అసిస్టెంట్లకు కూడా దిశానిర్దేశం చేసే స్థాయికి చేరారు. ఇక్కడితో ఆగకుండా ఏకంగా పీహెచ్సీ డాక్టర్లపై తిట్లదండకాలకు కూడా పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో జిల్లాలో ఈనెల మొదటివారం వరకు కూడా జూమ్ కాన్ఫరెన్స్లు నిర్వహించి మరీ ఆదేశాలు జారీ చేసే స్థితికి చేరారు. డీఎంహెచ్వో ఇచ్చిన చొరవ కారణంగానే సదరు ఎన్హెచ్ఎం అధికారి చేసిన హడావుడిపై మెడికల్ ఆఫీసర్లు నోరుమెదిపే ధైర్యం చేయలేదు. అయితే ఇటీవల డీఎంహెచ్వో బదిలీ కావడంతో ఒక్కసారిగా మెడికల్ ఆఫీసర్లు అంతా ఒక్కటై ఎన్హెచ్ఎం కాంట్రాక్టు అధికారి తీరుపై ధ్వజమెత్తారు. ఈక్రమంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఎన్హెచ్ఎంలో అవకతవకలపై, సదరు కాంట్రాక్టు ఉద్యోగి నిర్వాకంపై ఫిర్యాదులు పంపించారు. దీంతో ఈ అంశం జిల్లా వైద్యశాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. డీడీవో అధికారం నాకొద్దు..! ఎన్హెచ్ఎం, డెమో ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాల ఖర్చులు, నకిలీ బిల్లులను సక్రమం చేసుకునే దిశలో ఆడిట్ బృందానికి ఖర్చులకంటూ జిల్లాలో మొత్తం 100 పీహెచ్సీ, సీహెచ్సీ తదితర వైద్యశాలల నుంచి సుమారు రూ.6 లక్షల వరకు వసూళ్లు చేసిన కలెక్షన్ రాజ్ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో నిబంధనలకు విరుద్దంగా డీడీవో అధికారాలను చెలాయిస్తూ బలిపశువుగా మారిన డిప్యూటీ డెమో ఎర్రన్న తన అధికారాలను వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఆయన ప్రత్యేక నివేదికతో కూడిన వివరణను కూడా ఉన్నతాధికారులకు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే రెగ్యులర్ డీఎంహెచ్వో లేకపోవడంతో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారని కార్యాలయ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా వైద్య శాఖలో అవినీతి అక్రమాలపై నిజానిజాలు నిగ్గుతేలాలంటే ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించాలని వైద్యశాఖ ఉద్యోగులే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. -
భూ మాయ
నకిలీ పత్రాలతో శ్రీకాకుళం క్రైమ్ : నకిలీ పత్రాల ఆధారంగా మూడు కోట్ల విలువైన ప్రభుత్వ రిజర్వ్డ్ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు చూసిన నిందితుల కుట్రను శ్రీకాకుళం రూరల్ పోలీసులు ఛేదించారు. ఇందులో 11 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, వీరిలో తొమ్మిది మందిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సీఐ కె.పైడపునాయుడు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఈ మేరకు సీఐ మీడియా సమావేశం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని ఎస్బీఐ స్టాఫ్ కాలనీ లేఅవుట్లో 11 సెంట్ల ప్రభుత్వ రిజర్వ్డ్ స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు అదే కాలనీలో వాచ్మెన్గా పనిచేసిన గార మండలం కొత్తూరు సిరిగాంకు చెందిన వజ్జ మల్లేషు కుటుంబ సభ్యులు, మరికొందరు వ్యక్తులు పథకం రచించారు. దీనిపై కాలనీ అధ్యక్షుడు పుప్పాల జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ కేవీ సురేష్ దర్యాప్తు కొనసాగించగా అనేక విషయాలు బయటపడ్డాయి. నకిలీ పత్రాల తయారీ ఇలా.. శ్రీకాకుళం తహసీల్దార్, ఇతర రెవెన్యూ అధికారుల పేర్లతో నకిలీ సంతకాలు, నకిలీ అధికారిక ముద్రలు (స్టాంపులు) ఉపయోగించి ఫేక్ ఈ మెయిల్ ఐడీలను క్రియేట్ చేసి తప్పుడు పొజిషన్ సర్టిఫికెట్లు రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సర్టిఫికెట్లో వజ్జ రాజులమ్మ 15 ఏళ్లుగా ఆ స్థలాన్ని స్వాధీనంలో ఉన్నట్లు తప్పుడు వివరాలు నమోదు చేసి ఆ నకిలీ పత్రాన్ని ఆధారంగా చేసుకుని వజ్జ రమణమ్మకు అనుకూలంగా సేల్ డీడ్ తయారు చేసి స్థలాన్ని అక్రమంగా బదిలీ చేసేందుకు యత్నించినట్లు, ఆమదాలవలస మండలానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మొండేటి సురేష్ ఈ ఆక్రమణలో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. వజ్జ నాగరాజు, వజ్జ కల్యాణ్రామ్ తదితరులు ఈ వ్యవహారాన్ని నడిపారని, కొత్తూరు మండలం ఎన్ని రామన్నపేటకు చెందిన తిర్లంగి లక్ష్మణరావు, బమ్మిడి గ్రామానికి చెందిన వంబరవెల్లి శ్రీనివాసరావుల సహకారంతో నకిలీ పత్రాలు తయారు చేసే వ్యక్తులను సంప్రదించి రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని కొంతమొత్తం చెల్లించారన్నారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆమదాలవలస రవికాంతపేటకు చెందిన డాక్యుమెంట్ రైటర్ మోదలవలస వేణుగోపాలరావు, ఇచ్ఛాపురం సబ్రిజిస్ట్రార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ కారాపాటి అనిల్కుమార్, శ్రీకాకుళం మహలక్ష్మి నగర్ కాలనీకి చెందిన మహేష్ స్టిక్కరింగ్ సెంటర్ యజమాని కోసూరు మహేశ్వరరావులు సహకారాన్ని పొందేందుకు యత్నించినట్లు విచారణలో తేలిందన్నారు. వజ్జ రాములమ్మ, వజ్జ మల్లేషులను అరెస్టు చేయాల్సి ఉందని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని సీఐ పైడపునాయుడు వెల్లడించారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ రిజర్వ్డ్ స్థలం ఆక్రమణ నిందితుల గుట్టు రట్టు చేసిన రూరల్ పోలీసులు 11 మంది ప్రమేయం.. 9 మంది అరెస్టు -
ఎమ్మెల్యే అశోక్కు నిరసన సెగ
కంచిలి: ఇచ్చాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బెందాళం అశోక్కు కంచిలిలో నిరసన సెగ తగిలింది. స్థానిక గురుకుల పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవానికి మంగళవారం ఆయన వచ్చి, తిరిగి వెళ్తుండగా మెయిన్రోడ్డులోని ఎస్బీఐ కూడలిలో స్థానికులు ఎమ్మెల్యే వాహనాన్ని ఆపి రోడ్డు సమస్యను వివరించారు. రోడ్డు మరమ్మతులకు గురవ్వడంతో చిన్నపాటి వర్షం కురిసినా గోతుల్లో నీరుచేరి ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఏళ్లు గుడుస్తున్నా ఈ సమస్యపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే అశోక్ బదులిస్తూ త్వరలోనే మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఆర్అండ్బీ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెల్యేను ప్రశ్నించినవారిలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు సునీల్ రాథోడ్, స్థానిక మహిళలు ఉన్నారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్ను ప్రశ్నిస్తున్న స్థానికులు -
శ్రీకాకుళం
ఏమైందో.. ఏమోదంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త చనిపోగా భార్య బతికారు. –8లోజిల్లాకు వైఎస్ జగన్ రాక రేపు ● సబ్జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 7 బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026శ్రీకాకుళం రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. పెదపాడులోని ధర్మాన నివాసంలో మంగళవారం పార్టీ సమన్వయకర్తలతో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీదిరి అప్పలరాజుపై అక్రమ కేసులు బనాయించి శ్రీకాకుళంలో గల సబ్జైల్కు తరలించిన నేపథ్యంలో సీదిరిని ములాఖత్లో వైఎస్ జగన్ కలవనున్నట్లు తెలిపా రు. మత్స్యకార వర్గంపై వైఎస్ జగన్కు అవ్యాజమైన అభిమానం ఉందని, పాకిస్తాన్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను స్వదేశానికి రప్పించి వారికి ధైర్యం, భరోసా కల్పించారని గుర్తు చేశారు. జిల్లాలోని మత్స్యకారులకు శాశ్వత ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సుమారు రూ.300 కోట్లు వ్యయంతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. చంద్రబాబు మాత్రం కక్ష పూరిత రాజకీయాలు చేస్తూ.. విపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుని అంపోలు జైలులో ములాఖత్లో కలవనున్నట్లు పోలీస్ అధికారిక వర్గాలు తెలిపాయి. వారు తెలిపిన షెడ్యూల్ ప్రకారం. 30వ తేదీ ఉదయం 9గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకి బయలుదేరుతారు. 9.30గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 9.45 గంటలకు వియానంలో బయలుదేరి 10.45 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకి చేరుకుంటారు. 11గంటలకు రోడ్డు మార్గంలో ఎయిర్పోర్టు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు అంపోలులోని శ్రీకాకుళం జిల్లా జైలుకి చేరుకుంటారు. 2 నుంచి 3గంటల వరకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో ములాఖత్ అవ్వనున్నారు. 3 గంటలకు జిల్లా జైలు వద్ద నుంచి బయల్దేరి సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకి చేరుకుంటారు. -
ఏమైందో ఏమో..?
రణస్థలం: పురుగుల మందు సేవించి భార్యాభర్తలు బలవన్మరణానికి యత్నించిన ఘటన లావేరు మండలంలో కలకలం సృష్టించింది. లావేరు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలో కోర్టు సమీపంలోని బాయమ్మతోటలో నివాసం ఉంటున్న దవల రామకృష్ణ(62), అతని భార్య శ్రీదేవిలు సోమవారం సాయంత్రం నరసన్నపేట వెళ్తామని చెప్పి ద్విచక్ర వాహనంపై బయ ల్దేరారు. రాత్రి సమయంలో బయట పలు ప్రాంతాలు తిరిగారు. మంగళవారం ఉదయం బయట ఎక్కడో ఎరువుల దుకాణంలో పురుగుల మందు కొనుగోలు చేశారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో తాళ్లవలస రెవెన్యూ పరిధి లావేరు రోడ్డు మార్గంలో రోడ్డు పక్క ద్విచక్ర వాహనం పెట్టి సరుగుడు తోటలోని వెళ్లారు. అక్కడ పురుగులు మందును ఇరువురూ సేవించారు. అనంతరం రామకృష్ణ తొలుత భార్య మెడకు వైరు కట్టి, తనుకూడా కట్టుకుని ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భార్య స్పృహలోకి రావడంతో... కొంత సమయం తర్వాత భార్య స్పృహలోని వచ్చి భర్త విగతజీవిలా పడి ఉండడంతో కుటుంబ సభ్యులకు సాయంత్రం 4 గంటల సమయంలో ఫోన్చేసి సమాచారం ఇచ్చింది. అయితే అప్పటికే భర్త మృతి చెందాడు. ఘటన స్థలానికి 108 వాహనం చేరుకుని భార్య శ్రీదేవిని రణస్థలం సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి లావేరు పోలీసులు, క్లూస్ టీం చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. రామకృష్ణ మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుని కుమారుడు కృష్ణసాయి వివాహం చేసుకుని ప్రకాశం జిల్లా గిద్దలూరులో డెంటిస్ట్గా పని చేస్తున్నాడు. కుమార్తె హర్షిత పూణేలో గైనిక్ డాక్టర్ పనిచేస్తున్నారు. ఈనెల 5వ తేదీన కుమార్తె సీమంతం చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. ఎస్ఐ వి.సందీప్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బలవన్మరణానికి భార్యాభర్తలు యత్నం భర్త మృతి, చికిత్స పొందుతున్న భార్య ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం -
చెరువు మట్టి.. కొల్లగొట్టి..!
● యథేచ్ఛగా చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు ● మూడు టిప్పర్లతో తరలిస్తున్న వైనం ● పట్టించుకోని అధికారులు సంతబొమ్మాళి: మండలంలో అధికార పార్టీ నాయకులు బరితెగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకపోయినా చెరువు మట్టిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రుంకు హనుమంతుపురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్–1లో 70 ఎకరాల పెద్ద చెరువుపై స్థానిక అధికార పార్టీ నాయకుల కన్నుపడింది. చుట్టుపక్కల లే అవుట్లు పుట్టగొడుగుల మాదిరిగా రావడంతో వీరి పంట పండింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా.. ఎటువంటి అనుమతులు లేకపోయినా పెద్ద చెరువు మట్టిని అమ్ముకోవడానికి సిద్ధమయ్యారు. అనుకున్నదే తడువుగా మంగళవారం పెద్ద చెరువులో మట్టిని తవ్వేందుకు రెండు యంత్రాలను ఏర్పాటు చేసి మూడు టిప్పర్లతో మట్టిని తరలించారు. దూరం ఆధారంగా లోడు మట్టిని రూ.1500ల నుంచి రూ.2 వేలు వరకు అమ్ముతున్నట్లు సమాచారం. ఇలా రోజుకు 100 లోడ్లు వరకు చెరువు మట్టిని తరలించే అవకాశం ఉంది. ఈ తరలించిన మట్టిని లే అవుట్లకు వినియోగిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏమీ తెలియనట్లు వ్యవహరించడంపై గ్రామస్తులు మండి పడుతున్నారు. చెరువులోనే ఉపాధి పనులు ఈ గ్రామానికి సంబంధించి ప్రతీ ఏడాది ఉపాధి పనులను పెద్ద చెరువులోనే కల్పించడం జరుగుతుంది. ఇక్కడ వందల సంఖ్యలో ఉపాధి హామీ వేతనదారులు పనులు చేస్తుంటారు. అలాంటి ఉపాధి హామీ చెరువులో యంత్రాలను వినియోగించి మట్టిని వేరొక చోటకు తరలించడం నిబంధనలకు విరుద్ధం. వాటిని కూడా అధికార పార్టీ నాయకులు ఉల్లంఘించి మట్టిని దర్జాగా అమ్ముకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా దృష్టికి వచ్చింది పెద్ద చెరువులో మట్టిని తరలిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. వెంటనే వీఆర్వో శంకర్ను పంపించాను. మట్టి తరలింపును నిలుపుదల చేయాలని చెప్పాను. – హేమసుందరరావు, తహసీల్దార్, సంతబొమ్మాళి -
ఏమార్చాడిలా..
● టెక్కలిలో మార్ఫింగ్ స్టాంప్ పేపర్ల కలకలం ● ఆన్లైన్ కేంద్రంలో రూ.100 విలువ కలిగిన వెస్ట్ బెంగాల్ స్టాంప్ పేపర్లు స్వాధీనం ● ఆంధ్రప్రదేశ్ పేరును మార్ఫింగ్ చేస్తూ అమ్మకాలు ● పోలీసుల అదుపులో ఆన్లైన్ కేంద్రం నిర్వాహకుడు టెక్కలి: టెక్కలిలో వేరే రాష్ట్రానికి చెందిన పలు నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లపై ఆంధ్రప్రదేశ్ పేరును మార్చి విక్రయిస్తున్న ఓ ఆన్లైన్ కేంద్రం నిర్వాహకుడు పట్టుబడ్డాడు. దీంతో మంగళవారం పట్టణంలో కలకలం రేగింది. టెక్కలిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కొద్ది దూరంలో అంబేడ్కర్ జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గంలో సాయి భవానీ ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు సురేందర్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కోల్కతాకు చెందిన రూ.100 విలువ కలిగిన స్టాంప్ పేపర్ పై ఆంధ్రప్రదేశ్ పేరును మార్ఫింగ్ చేసి అమ్మకాలు చేస్తున్న విష యం బయట పడింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇన్ చార్జి సబ్ రిజిస్ట్రార్ జయమ్మ నేతృత్వంలో ఆన్లైన్ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి 100, 50, 20 రూపాయల విలువ కలిగిన సుమారు 24 స్టాంప్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆన్ లైన్ కేంద్రం నిర్వాహకుడు సురేందర్ను టెక్కలి పోలీ సులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ స్టాంప్ పేపర్పై స్థానికం కాని జె.వైకుంఠరావు అనే వెండర్ పేరుతో మరో విధంగా మార్ఫింగ్ చేశారు. ప్రస్తుతానికి పట్టుబడిన సురేందర్కు గతంలో ఈ–స్టాంప్ అమ్మకాల లైసెన్స్ ఉండేది. అయితే కొన్ని రకాల తప్పిదాలు చేయడంతో ఆ లైసెన్స్ను ప్రస్తుతం నిలిపివేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత కొన్ని నెలలుగా రూ.100 స్టాంప్ పేపర్లు అందుబాటులో లేకపోవడంతో ఇలాంటి మార్ఫింగ్ స్టాంప్ పేపర్లు పుట్టుకొచ్చాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ఇలాంటి స్టాంప్ పేపర్ల ను విక్రయించినట్లు తెలుస్తోంది. ఒక్కో స్టాంప్ పేపర్ను అదనపు ధరలకు విక్రయించినట్లు సమాచారం. ఘటనలపై జిల్లా సబ్ రిజిస్ట్రార్ సంజీవయ్య టెక్కలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితులను తెలుసుకున్నారు. అయితే ఈ స్టాంప్ పేపర్లు మార్ఫింగ్పై స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసే విషయంలో జాప్యం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనపై స్థానిక ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ జయమ్మ మాట్లాడుతూ వెస్ట్బెంగాల్కు చెందిన స్టాంప్ పేపర్లను స్వాధీనం చేసుకున్నామని, ఆయా పేపర్లతో సహా ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. -
‘ఆఫ్షోర్ పూర్తయ్యేది ఎప్పుడు..?’
ఆగస్టు 2 వరకు ఉద్దానం నీటి సరఫరా బంద్ అరసవల్లి: హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా కొత్తగా ప్రెషర్ మెయిన్ పైప్లైన్ ఏర్పాటు చేయనున్న కారణంగా ఈనెల 29 నుంచి వచ్చేనెల 2వ తేది వరకు ఉద్దానం ప్రాంతంలో తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లుగా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శంకర్బాబు తెలియజేశారు. ఈ మేరకు పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లోనూ భద్రతా కారణాల దృష్ట్యా తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నామని, ప్రజలు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. పనులు పూర్తవ్వగానే యథావిధిగా మంచినీటిని సరఫరా చేస్తామని ఆయన ప్రకటించారు. నందిగాం: నందిగాం మండలానికి జీవనాధారమైన ఆఫ్షోర్ రిజర్వాయర్ ఎప్పుడు పూర్తి చేస్తా రో వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యుడు నంబూరు షణ్ముఖరావు ప్రశ్నించారు. సోమవారం సీపీఎం ప్రతినిధుల బృందం ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాంతంలో పర్యటించిన అనంతరం నందిగాంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆఫ్షోర్ పూర్తయితే నందిగాం మండలంలోని 12వేల90 ఎకరాలు, టెక్కలిలో 1820 ఎకరాలు, పలాసలో 6800 ఎకరాలు, మెళియాపుట్టిలో 3890 ఎకరాలకు సాగునీరు అందుతుందని, అలాగే పలాస మున్సిపాలిటీకి తాగునీటి సమస్య తీరుతుందని అన్నారు. చాపర నుంచి రిజర్వాయర్కు 17 కిలోమీటర్ల మేర ఫ్లడ్ ఫ్లో కెనాల్ సగం కూడా పని కాలేదని ఆరోపించారు. వంశధార రిజర్వాయర్, వంశధార– నాగావళి అనుసంధానం ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం లేదన్నారు. -
ఇంకేం అర్హతలు కావాలి..?
● తల్లికి వందనం పథకం రాలేదని పీజీఆర్ఎస్లో తల్లిదండ్రుల విన్నపాలు ● బతికి ఉన్న బాలుడు చనిపోయినట్టు చూపించారని ఆరోపణ శ్రీకాకుళం పాతబస్టాండ్: తల్లికి వందనం పథకం కొందరికే వచ్చిందని, అన్ని అర్హతలు ఉన్నా తమకు సాయం అందలేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం పీజీఆర్ఎస్ను ఆశ్రయించారు. హౌస్హోల్డ్ మ్యాపింగ్ తప్పు, ఇల్లు ఉంది, ఆదా యం ఎక్కువగా ఉంది వంటి కారణాలను చెప్పడంతో తల్లిదండ్రులు నిరాశ వ్యక్తం చేశారు. హౌస్హోల్డ్ మ్యాపింగ్లో లోపాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హులైన పలువురు సంక్షేమ పథకాల లబ్ధికి దూరమవుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను సవరణ చేయలేదు. ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో ఇటీవల వివా హం అయిన వారు, వేరే కుటుంబాలుగా ఏర్పడిన వారు, పిల్లలు ఉన్నవారు నాలుగేళ్ల కిందట ఉన్న మ్యాపింగ్లోనే ఉంటున్నారు. దీంతో వారి వివిధ కారణాలు చెప్పి, ఈ సంక్షేమాన్ని ఎగవేస్తున్నారు. ● ఆమదాలవలస మున్సిపాలిటీ 14వ వార్డు సచివాలయం పరిధికి చెందిన రోణంకి రోహిత్ ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్నాడు. గత ఏడాది ‘తల్లికి వందనం’ పథకం కింద లబ్ధి పొందినప్పటికీ, ఈ ఏడాది పథకం వర్తించలే దు. దీనిపై అధికారులను ఆశ్రయించగా, హౌస్హోల్డ్ మ్యాపింగ్లో విద్యార్థి ఏకంగా ‘మరణించినట్లు’ నమోదు కావడంతో పథకం నిలిచిపోయిందని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యను పరిష్కరించలేదన్నారు. ● శ్రీకాకుళంలోని హయత్నగర్కు చెందిన ఆలాపన దేవి తన ఇద్దరు కుమారులు చైతన్య (6వ తరగతి), హర్షవర్ధన్ (3వ తరగతి) పేర్లపై గత ఏడాది లబ్ధి పొందారు. ఈ ఏడాది కుటుంబ మ్యాపింగ్ తండ్రి పేరుపై నమోదవడంతో పథ కం నిలిచిపోయిందని తెలిపారు. విడిగా నివసిస్తున్నప్పటికీ పథకం అందలేదన్నారు. ● శ్రీకాకుళం నగరంలో నివాసం ఉంటున్న సీహెచ్ ప్రవీణ్ రెండేళ్లుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను మార్చాలని కోరుతూ పలు సార్లు వినతిని పీజీఆర్ఎస్లో పెట్టుకున్నా, ఇప్నటి వరకు చర్యలు లేవు. దీంతో ఈసారి కూడా తల్లికి వందనం పడలేదు. ● పీజీఆర్ఎస్కు ఇంత మంది వచ్చారంటే.. బాధితుల సంఖ్య వేలల్లోనే ఉంటుందని అక్కడ చర్చించుకున్నారు. -
జీడి కార్మికులకు జీవనోపాధి కల్పించాలి
వజ్రపుకొత్తూరు రూరల్: జీడి పరిశ్రమలు సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో పలాస జీడి పరిశ్రమలు 10 రోజులు పాటు బంద్కు పిలుపునిచ్చాయని, బంద్ విరమణ తర్వాత కార్మికులకు జీవనోపాధి కల్పించాలని లేబర్ యూనియన్ సంఘ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి కోరారు. పలాస లేబర్ యూనియన్ సంఘ భవనంలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. జీడి వ్యాపారాలు ఒడిదుడుకుల నేపథ్యంలో ఇండస్ట్రీయల్ ఏరియా పరిధిలో ఉన్న పరిశ్రమలు ఈనెల 25 నుంచి ఆగస్టు 3 వరకు బంద్ ఉంటుందన్నారు. అలాగే పలాస (పీసీఎంఏ) పరిధిలో ఉన్న పరిశ్రమలు ఈనెల 27 నుంచి ఆగస్ట్ 5 వరకు బంద్ పాటిస్తాయని తెలిపారు. ఈ పరిశ్రమల బంద్కు ఇండస్ట్రీయల్ ఏరియా కాష్యూ లేబర్, రైస్ మిల్లర్స్ లేబర్ యూనియన్లు సహకరిస్తాయని పేర్కొన్నారు. కాగా బంద్ ముగిసిన వెంటనే ఫ్యాక్టరీలు తెరిపించి జీడి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. సమావేశంలో యూనియన్ సంఘ ప్రధాన కార్యదర్శి సాన ఈశ్వరరావు, కోశాధికారి కోనారి రాము, గౌరవ అధ్యక్షుడు బొంపల్లి సింహాచలం, సంఘ ఉప కార్యదర్శులు లక్ష్మీనారాయణ, మోహన్, రమణ, అప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఏం జరుగుతోంది..!
● ఆదిత్యాలయంలో అక్రమ విధానాలపై విజిలెన్స్ దృష్టి ● గతంలో నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్ ఉద్యోగికి లబ్ధి ● డిప్యుటేషన్ పూర్తయినా ఉద్యోగికి ఎల్పీసీ ఇవ్వని ప్రస్తుత ఈవో ● ఐదు నెలలుగా జీతాలకు నోచుకోని సదరు ఉద్యోగి అరసవల్లి: దేవదాయ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా రెండేళ్ల ఎరియర్స్తో కూడిన పీఆర్సీని పొందిన ఓ ఆలయ ఉద్యోగికి.. నాలుగైదు నెలలుగా జీతాలు లేకుండా అవస్థ పడేలా గత అక్రమాలు వెంటాడుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ జగన్నాథ స్వామివారి ఆలయానికి చెందిన అటెండర్ శ్రీనివాస్, టెక్కలి రావివలస ఎండల మల్లికార్జున స్వామివారి ఆలయానికి డిప్యుటేషన్ విధానంలో కొన్నేళ్లు విధులు నిర్వర్తించారు. అనంతరం అరసవల్లి ఆదిత్యాలయానికి డిప్యుటేషన్ మీద 2022లో విధుల్లో చేరాడు. అయితే అప్పట్లో పనిచేసిన డిప్యూటీ కమిషనర్/ఈవో చంద్రశేఖర్ నిబంధనలకు విరుద్ధంగా జీవో 888ని అతిక్రమించి డిప్యుటేషన్ మీద పనిచేస్తున్న శ్రీనివాస్కు రెండేళ్ల పెండింగ్ ఎరియర్స్తో కూడిన పీఆర్సీని అమలు చేశారు. దీంతో ఒక్కసారిగా రూ.5.72 లక్షల లబ్ధి చేకూర్చి తర్వాత ఈవో చంద్రశేఖర్ బదిలీపై వెళ్లిపోయాడు. తర్వాత జరిగిన పరిణామాల్లో విధుల్లో చేరిన ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ మాత్రం అటెండర్ శ్రీనివాస్ డిప్యుటేషన్ గడువు ముగిసిందంటూ తిరిగి ఆయనను రావివలస ఆలయానికి వెళ్లిపోవాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్పీసీ ఇవ్వని వైనం అరసవల్లిలో డిప్యుటేషన్ క్యాన్సిల్ కావడంతో యథావిధిగా ముందు పనిచేసిన రావివలస ఎండల మల్లికార్జున స్వామివారి ఆలయానికి అటెండర్ శ్రీనివాస్ను ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ పంపిస్తూ అరసవల్లి నుంచి రిలీవ్ చేసేశారు. ఇది జరిగి సుమారు నాలుగైదు నెలలు గడిచింది. అయితే అరవసల్లిలో పీఆర్సీ పొందిన తర్వాత అటెండర్ శ్రీనివాస్కు అమాంతం జీతం పెరిగినందున.. అంత జీతం రావివలసలో ఇవ్వలేమంటూ అక్కడి ఈవో గురునాథరావు స్పష్టం చేస్తున్నారు. అయితే లాస్ట్ పేమెంట్ సర్టిఫికేట్(ఎల్పీసీ) తెచ్చుకుంటే జీతాల సంగతి తేలిపోతుందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాగా తెర వెనుక కారణమేంటో గానీ అరసవల్లి నుంచి రిలీవ్ చేసినప్పటికీ నేటి వరకు ఎల్పీసీ మాత్రం ఇవ్వకుండా ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ తాత్సారం వహిస్తున్నారు. దీంతో అటెండర్ శ్రీనివాస్ అటు అరసవల్లి నుంచి.. ఇటు రావివలస నుంచి కూడా జీతం పొందలేక అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా దీనివెనక ఆర్థిక లావాదేవిలు జరుగుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్పీసీ ఇవ్వకుండా మళ్లీ అరసవల్లిలో అటెండర్ శ్రీనివాస్ను విధుల్లో చేర్చుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాలేవీ బయట పెట్టకుండానే స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ను సైతం బురిడి కొట్టించి మరీ అనుకూల లెటర్ను కూడా పొందినట్లుగా సమాచారం. ఏది ఏమైనా ఆర్థిక లావాదేవీల నడుమ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటే అధికారులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజిలెన్స్ ఆరా..! సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటినుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది వరకు అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో జరిగిన పలు వివాదాస్పద వ్యవహారాలపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. అప్పట్లో ఇదే ఆలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన కృష్ణమాచార్యులు ఇచ్చిన ఽఆధారపూర్వక ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఇందులో అటెండర్ శ్రీనివాస్ పీఆర్సీ వ్యవహారం కూడా ఉండడం గమనార్హం. అయితే తాజాగా గత నాలుగైదు నెలలుగా శ్రీనివాస్కు జీతాలు ఇవ్వకుండా ఎల్పీసీ ఇవ్వని పరిస్థితులపై కూడా విజిలెన్స్ ఆరా తీస్తోందని సమాచారం. ఆర్థిక లావాదేవిలపై కూడా ఇప్పటికే దృష్టి సారించిందని తెలుస్తోంది. అటెండర్ శ్రీనివాస్కు డిప్యుటేషన్ గడువు ముగిశాక తిరిగి రావివలసలో జాయిన్ కావాలని ఉత్తర్వులు జారీ చేశాం. అయితే ఎల్పీసీ ఇంకా ఇవ్వని విషయం వాస్తవమే. ఆయనకు గతంలో పలు ఆర్థిక లబ్ధి అంశాల్లో రికవరీలు చేయాల్సి ఉందని భావిస్తున్నాం. వాటిని పరిశీలించాక ఎల్పీసీ ఇచ్చేందుకు చర్యలు చేపడతాం. అంతవరకు జీతాల పరిస్థితి తేలదు. – కేఎన్వీడీవీ ప్రసాద్, అరసవల్లి ఆలయ ఈవో -
ఆగస్టు 2న అథ్లెటిక్స్ మీట్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో నిర్వహించే దివంగత కొన్న చిన్నారావు మెమోరియల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు కౌంట్డౌన్ మొదలైంది. కొన్న చిన్నారావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గత 17 ఏళ్ల నుంచి ప్రతిఏటా స్పోర్ట్స్మీట్ను నిర్వహిస్తున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చిన్నారావు కుటుంబ సభ్యులు కొన్న వెంకటేశ్వరరావు(వాసు), కొన్న మధుసూదనరావు, ప్రగాడ అశోక్కుమార్, పూడి బాలాదిత్య ఆధ్వర్యంలో నౌపడ విజయ్కుమార్, మెంటాడ సాంబమూర్తి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ పర్యవేక్షణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిఏటా నిర్వహించే ఈ పోటీలను, ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన నిర్వహించాలని తీర్మానించారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో అథ్లెటిక్స్ సంఘ ప్రతినిధులు, పీడీ, పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. కేఆర్ స్టేడియం వేదికగా.. ఈ పోటీలను శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ఈ అథ్లెటిక్స్ మీట్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ట్రయల్స్లో నాలుగు వయో విభాగాల్లో పోటీలను జరపనున్నారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలను నిర్వహించి విజేతలుగా నిలచినవారికి పతకాలు అందజేయనున్నారు. పోటీలకు హాజరైన క్రీడాకారులు, టెక్నికల్ అఫీషియల్స్, వలంటీర్లు తదితరులకు పోటీలు జరిగే ప్రాంగణం వద్ద అన్ని వసతులతోపాటు భోజన ఏర్పాట్లు సైతం కల్పించనున్నారు. మొదటి స్థానాల్లో నిలిచిన అథ్లెట్స్ త్వరలో తిరుపతి వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి (అంతర్ జిల్లాల) జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు నేరుగా అర్హత సాధించనున్నారు. ఈ పోటీల కోసం గత కొన్నాళ్ల నుంచి అథ్లెటిక్స్ క్రీడాకారులు కఠోర సాధన చేస్తున్నారు. మా నాన్నగారు కొన్న చిన్నారావు జ్ఞాపకార్థం ప్రతిఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా అథ్లెటిక్స్ మీట్ నిర్వహిస్తున్నాం. ఆగస్టు 2వ తేదీన కోడి రామ్మూర్తి స్టేడియం వేదికగా పోటీలను నిర్వహిస్తాం. ఇక్కడ విజేతలుగా నిలిచిన ప్లేయర్స్ను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తాం. – కొన్న మధుసూదనరావు, అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు -
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి గాయాలు
నరసన్నపేట: జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై వై జంక్షన్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక కొత్తవీధిలో నివసిస్తున్న కొనపల రాజశేఖర్ ఈ జంక్షన్ వద్ద ఆటో మొబైల్ షాపు నిర్వహిస్తున్నారు. కస్టమర్కి అవసరమైన వస్తువులు ఇచ్చి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా.. పాతపట్నం ఎల్హెచ్ ఆర్టీసీ బస్సు నరసన్నపేట టౌన్లోకి వస్తూ ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్కు తీవ్రగాయాలు అయ్యాయి. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం, శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ గ్రీవెన్సుకు 70 ఫిర్యాదులు శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వేదిక (గ్రీవెన్సు)లో ప్రజల నుంచి 70 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. భర్తకు భార్య తలకొరివి సోంపేట: మండలంలోని ఎర్రముక్కాం గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు బైపల్లి యాదవరావు (60) సోమవారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందాడు. అతని కుమారుడు కాళీప్రసాద్ కొద్ది నెలల క్రితం బతుకుతెరువు కోసం దుబాయి వెళ్లాడు. దీంతో భార్య తులసమ్మ మానసికస్థితి బాగోలేకున్నా భర్తకు తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. మర్యాదపూర్వక భేటీ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మూడేళ్లకు పైగా పనిచేసిన జూనైద్ అహ్మద్ మౌలానాకు రాజమండ్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన సందర్భంగా ఆయనను జిల్లా బార్ న్యాయవాదులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా మూడేళ్లలో ఆయన చేసిన సేవలపై మాట్లాడారు. ఆయనకు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో న్యాయవాదులు వాన కృష్ణచంద్, పొన్నాడ వెంకటరమణారావు, ఎన్ని సూర్యారావు, తంగి శివప్రసాదరావు, ఇప్పిలి తాత, ఆగూరు ఉమామహేశ్వరరావు, కొమ్ము రమణమూర్తి, మామిడి క్రాంతి, కూన అన్నంనాయుడు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్ని ఢీకొని యువకుడు మృతి
నరసన్నపేట/పోలాకి: స్థానిక బైపాస్ సర్వీసు రోడ్డుపై శ్రీకాకుళం నుంచి జమ్ము వైపునకు వెళ్లే మార్గంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పోలాకి మండలం బెలమర పోలవలసకు చెందిన గేదెల శ్రీకాంత్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆస్పత్రి పనిపై శ్రీకాకుళం వెళ్లి ప్రియాగ్రహారం గ్రామానికి చెందిన స్నేహితుడు తుంగాన సురేష్తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో వాహనం వెనుక కూర్చున్న శ్రీకాంత్ ఎగిరి డివైడర్పై పడగా తలకు తీవ్రగాయమైంది. అధిక రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన చోట ఇసుక ఉండడంతో ద్విచక్ర వాహనం స్కిడ్ అయ్యి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా శ్రీకాంత్కు శ్రీకాకుళం వద్ద మొపసుబందర్కు చెందిన యువతితో గత నెల 21వ తేదీన వివాహం జరిగింది. కాళ్ల పారాణి ఆరక ముందే తన భర్త ఇలా మృతి చెందడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అందివచ్చిన కుమారుడు ఇలా దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు ఆనంద్, విజయలక్ష్మి రోదనలు చూపరులకు కన్నీరు తెప్పిస్తున్నాయి. గ్రామంలోనే కేబుల్ ఆపరేటర్గా శ్రీకాంత్ పనిచేస్తున్నాడు. ప్రమాదంపై నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనం నడుపుతున్న సురేష్తో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. కాగా మృతుని మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతికి ఉన్న ఉంగరం కనిపించడం లేదు. ఈ బంగారు ఆభరణాలు ఏమై ఉంటాయోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. -
‘అబ్దుల్ కలాం సేవలు నిరుపమానం’
కవిటి: దేశానికి అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని అందించి, రాష్ట్రపతిగా, విద్యావేత్తగా బహుముఖ సేవలు అందించిన ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలు నిరుపమానమని అని వక్తలు అన్నారు. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా పెద్ద ఎర్రగోవింద పుట్టుగలో సోమవారం ఆయన చిత్రపటానికి హెచ్ఎం దేవదాస్ బెజ్జిపల్లి, చిన్నారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలాం సేవలను దేవదాస్ చిన్నారులకు వివరించారు. మోకాళ్లపై కూర్చుని నిరసన ఆమదాలవలస: స్టాంపు వెండర్ల పొట్ట కొట్టే ఆలోచనలు మానుకోవాలని, డాక్యుమెంట్ రైటర్లపై అవలంబిస్తున్న మొండి వైఖరి సర్కా రు విడనాడాలని శ్రీకాకుళం జిల్లా స్టాంపు వెండర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బగాది తేజేశ్వరరావు అన్నారు. సోమవారం ఆమదాలవలసలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో చేస్తున్న 8వరోజు పెన్డౌన్ కార్యక్రమంలో భాగంగా డాక్యుమెంట్ రైటర్స్ మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 396 ను వెంటనే రద్దు చేయాలని కోరారు. తప్పని పడిగాపులు హిరమండలం: మండలంలోని కొండరాగోలు రైతుసేవా కేంద్రం వద్ద ఎరువుల కోసం రైతులు సోమవారం అష్టకష్టాలు పడ్డారు. సచివాలయలంలో యూరియా విక్రయిస్తారన్న సమాచారంతో సచివాలయ పరిధిలోని కొంగరాగోలు, ఎగువకొండరాగోలు నడుమ కొండరాగోలు దుర్బలాపురం తదితర గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బస్తా యూరియా కోసం ఆధార్ కార్డు, సెల్ఫోన్లు పట్టుకుని తిరగాలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. జీజీహెచ్ ప్రయోగ శాలకు ఎన్ఏబీఎల్ గుర్తింపు శ్రీకాకుళం: హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షల్లో నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జిజిహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ జి.సౌమిని స్పష్టం చేశారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని హెచ్ఐవీ వైరల్ లోడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి ‘నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్’ (ఎన్ఏబీఎల్) గుర్తింపు లభించినట్లు సోమవారం ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. లక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ బి.ఎస్.ఎస్.విజయశ్రీ, డాక్టర్ బి.రాధిక, టెక్నికల్ ఆఫీసర్ ఎం.స్వప్నతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు, కౌన్సిలర్ల బందానికి ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ ధ్రువపత్రాన్ని ఆమె అందజేశారు. హెచ్ఐవీ, సీడీ–4 పరీక్షల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం ద్వారా రోగులకు మరింత మెరుగైన సంరక్షణ లభిస్తుందని సూచించారు. -
● ఇలా కాపాడుకుంటున్నారు
● వరుణుడి కరుణ కోసం.. వర్షాలు కురవాలని కోరుతూ నీలాదేవిపురం గ్రామంలోని శివాలయంలో సోమవారం జలాభిషేకం నిర్వహించారు. వానలు లేక పొలాలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో గ్రామస్తులంతా కలిసి బిందెలతో నీరు తీసుకువచ్చి శివుడిని అభిషేకించారు. – బూర్జ కక్ష సాధింపులకు పాల్పడుతున్న కూటమి నాయకులకు బుద్ధి ప్రసాదించాలని, అక్రమ కేసులు ఎదుర్కొంటున్న తమ నాయకుడు సీదిరి అప్పలరాజుకు మంచి జరగాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు సోమవారం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పలాస–కాశీబుగ్గలో ఉన్న కోసంగిపురం జంక్షన్ వద్ద గల శివాలయం, రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న రామాలయంలో సోమవారం పార్టీ శ్రేణులు, మహిళలు కలిసి క్షీరాభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. – పలాసచినుకు జాడ లేక పొలాలు బీడు వారుతున్నాయి. బూర్జ మండలంలో దాదాపు 6000 ఎకరాల్లో పంట సాగు నీరు లేక ఎండిపోతోంది. మబ్బులు కాస్తున్నా వాన లేకపోవడంతో రైతులకు నిరాశే ఎదురవుతోంది. చిన్న లంకాం గ్రామంలో మహిళలు నారు రక్షించుకోవడానికి బిందెలతో నీరు పోస్తున్నారు. – బూర్జ -
కలెక్షన్ రాజ్పై ఇంటెలిజెన్స్ ఆరా!
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖలో ఆడిట్ కోసం ఖర్చులను వసూళ్లు చేసిన ‘కలెక్షన్ రాజ్’పై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కలెక్షన్ రాజ్’ కథనంపై వైద్యశాఖ ఉన్నతాధికారులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు సైతం స్పందించారు. జాతీయ ఆరో గ్య మిషన్ (ఎన్హెచ్ఎం)విభాగంలో అధికారు లు, సిబ్బంది కదలికలు, వ్యవహారాలపై నిఘా ఉంచారు. ఆడిట్లో నకిలీ బిల్లులను సక్రమం చేసుకునేందుకు ఖర్చుల పేరిట వసూళ్లకు పాల్పడటంపై క్షేత్ర స్థాయిలో పీహెచ్సీల సిబ్బందితో మాట్లాడి వివరాలను సేకరించారు. అలాగే ఆన్లైన్ ఎవిడెన్స్ కు దొరక్కుండా నేరుగా డబ్బులు తెప్పించుకున్న వ్యవహారంపై కూడా ఆరా తీశారు. సో మవారం పలువురు సిబ్బంది ఎన్హెచ్ఎం వి భాగంతో పాటు డీఎంహెచ్ఓ పరిపాలన వ్యవహారాల విభాగాలను పరిశీలించినట్లుగా తెలుస్తోంది. డీడీఓ అఽధికార బదలాయింపులో కూడా ‘రాజ్’ ముద్ర వైద్యశాఖలో జరిగే కార్యక్రమాల బిల్లులు బొక్కాలంటే ఓ అధికారి తన చేతిలో ఉండాలని ‘రాజ్’ తలిచాడు. అంతే అప్పటి డీఎంహెచ్ఓ సమక్షంలోనే ఎన్హెచ్ఎం కీలక విభాగాధికారి తనదైన శైలిలో డెమో అధికారికి డీడీఓ అధి కారం దక్కేలా పావులు కదిపి సక్సెస్ అయ్యాడు. వాస్తవానికి వైద్య శాఖలో పనిచేస్తున్న స్టేట్ క్యాడర్ గెజిటెడ్ అఽధికారికి దక్కాల్సిన ఈ డీడీఓ అధికారం కాస్తా.. జోనల్ క్యాడర్ గెజిటెడ్ అధికారి అయిన డిప్యూటీ డెమో కె.ఎర్రన్నకు దక్కేలా చేశారు. ఈ విషయంపై ఇంటెలిజెన్స్ అధికారులు సైతం దృష్టి పెట్టినట్లుగా సమాచారం. డీడీఓ అఽధికారాలున్న డిప్యూ టీ డెమో కె.ఎర్రన్నను ఈ అక్రమ వ్యవహారాల్లో దూర్చేసి బలిపశువు చేస్తున్నారనే కోణంలో వైద్యశాఖలో చర్చసాగుతోంది. -
పోలీసుల తీరు ఇంత ఘోరమా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఇంత ఘోరమా.. పోలీసులు కూడా అడ్డగోలు ఫిర్యాదులు చేస్తారా? పోలీసులను చంపుతానని నేను బెదిరించానా? అదెక్కడ? నాపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారా? ఇదెక్కడి పోలీసు వ్యవస్థ? దీన్ని తేలికగా తీసుకోను. పోలీసులపైనే ప్రైవేటు కేసు పెడతాను’ అని వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ అంటున్నారు. ఇలాగే వదిలేస్తే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపేలా ఉన్నారని, ఇప్పటికే న్యాయవాదులతో సంప్రదింపులు చేశానని, పోలీసులపై కేసు పెడతానని ‘సాక్షి’తో చెప్పారు. అసలేం జరిగిందంటే..? ఈనెల 22వ తేదీన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అక్రమ కేసులో పోలీసులు చేసిన అరెస్టును నిరసిస్తూ ఆ రోజు రాత్రి టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ మరికొందరు కాశీబుగ్గలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ను తిలక్తో పాటు మరికొందరు బెదిరించారని ఆ హెడ్ కానిస్టేబుల్ కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో పలు ఆశ్చర్యకరమైన అంశాలు ప్రస్తావించారు. ‘మా నాయకుడిని అరెస్టు చేసి తీసుకు వెళ్తారా, మీ అంతు చూస్తాం’ అంటూ గట్టిగా అరవడమే కాకుండా.. మా విధులను ఆటంకం పరిచి, మమ్మల్ని చంపుతామని బెదిరించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని పలు సెక్షన్లు తిలక్తో పాటు మరికొందరిపై కేసు పెట్టారు. ఆ రోజు రాత్రి అదుపులోకి తీసుకుని మరుసటి రోజు రాత్రి విడిచి పెట్టారు. అయితే ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై తిలక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆరోజు నిరసన ర్యాలీ చేసినప్పుడు ఏ ఒక్క పోలీసూ అడ్డుకోలేదని, తనను అసలు కలవలేదని, తాను చంపుతానని ఎక్కడా బెదిరించలేదని, తప్పుడు ఫిర్యాదు చేశారని అంటున్నారు. అంతేకాకుండా అక్కరెన్స్ రిపోర్టులో తన సంతకం కూడా ఫోర్జరీ చేశారని, వీటిన్నింటిపైన పోలీసులపై ప్రైవేటు కేసు పెడతానని, ఇప్పటికే న్యాయ వాదులతో సంప్రదింపులు చేశానని చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు కాపీ పోలీసులను నేను చంపుతాను అన్నానట? తప్పుడు కేసు పెట్టడానికి ఇంత బరి తెగిస్తారా పోలీసులపై ప్రైవేటు కేసు వేస్తా తీవ్రంగా స్పందించిన వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ న్యాయవాదులతో సంప్రదించినట్లు ప్రకటన -
● నాపై కక్షగట్టారు
పింఛన్ డబ్బులు ఇవ్వకపోవడంతో తన కొడుకు, కోడలు తనపై కక్షగట్టారని శ్రీకాకుళం నగరానికి చెందిన విశ్రాంత కోర్టు ఉద్యోగి పొందూరు లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. తనను ఇంటినుంచి వెళ్లిపోవాలని అంటున్నారని, వారికి ఇంటిని రాసి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆలనాపాలనా చూస్తున్న కూతుళ్లపై శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్స్టేషన్లో అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. తనకు రక్షణతో పాటు తన ఆడ పిల్లలకు రక్షణ కల్పించాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు. -
త్వరితగతిన పరిష్కారం చూపాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 167 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీదారుల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదుకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)ను సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. బాధితులు అందజేసిన వినతిపత్రాలను పరిశీలించి, వాటిని వెంటనే ఆయా శాఖల అధికారులకు అందించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పీజీఆర్ఎస్ ద్వారా దాఖలు చేసిన అర్జీల పరిష్కార ప్రక్రియపై ప్రజలు తమ ఫీడ్బ్యాక్ను నమోదు చేసుకోవాలని కోరారు. పీజీఆర్ఎస్కు మొత్తం 167 వినతులు వచ్చాయి. క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేయాలి ఈ సందర్భంగా కలెక్టర్ పీజీఆర్ఎస్లో పిటిషన్ దాఖలు చేసిన అర్జీదారులు తమకు లభించిన పరిష్కారంపై సంతప్తిగా ఉన్నారో లేదో ప్రత్యేక క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా గానీ, పోర్టల్ లింక్ ద్వారా గానీ అర్జీదారులు తమ ఫీడ్బ్యాక్ను సులభంగా తెలియజేయవచ్చని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత పెంచడం, బాధ్యతారాహిత్యాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ఫీడ్బ్యాక్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. వెదురు పరికరాల అల్లికకు వెదురు బొంగులను ప్రభుత్వం ఇప్పించాలని మేదర కులస్తులు కోరారు. ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అటవీ శాఖ నూతన ఉత్తర్వులతో ఉపాధి కోల్పోతున్నామని, వృత్తిదార్లుకు ప్రాముఖ్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బొంగులు లేకపోవడం వలన బుట్టలు, గంపలు, తట్టలు, చాపలు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే వస్తువులు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువుల తయారీకి ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మేదర సంఘం సభ్యులు దాలినాయుడు, ధర్మారావు తదితరులు కోరారు. కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలస గ్రామానికి చెందిన కోళ్ల నర్సమ్మ భర్త ఎండన్న 2024 మార్చిలో మృతి చెందారు. అనంతరం అతని పెన్షన్ను తనకు మంజూరు చేయాలని నర్సమ్మ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటికీ తనకు పింఛన్ రావడం లేదని ఆమె ఫిర్యాదు చేశారు. ఎంపీడీవో స్థాయిలో ఆమోదం లభించినప్పటికీ ఇప్పటివరకు పెన్షన్ మంజూరు కాలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలి
● నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి ● ఎమ్మెల్సీ నర్తు రామారావుఇచ్ఛాపురం రూరల్: రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలోని ప్రతీ అంశాన్ని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నీట్ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీకేజీల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణపై అనేక ఆరోపణలు వచ్చినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. సీబీఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని వివరాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. -
కొత్త పాపం
పాత బియ్యంపీడీఎస్ బియ్యంతోనే పాపాలు ● జిల్లాలో భారీగా సీఎంఆర్ అవినీతి ● చీపురుపల్లి గోడౌన్లో బయటపడిన పీడీఎస్ బియ్యం ● ఈ బియ్యమంతా మన జిల్లా మిల్లర్లవే ● ప్రజలకు పాత పీడీఎస్ బియ్యమే తిరిగి ఇస్తున్న వైనం బియ్యమంతా పచ్చ పార్టీ మిల్లర్లవే.. పెందుర్తి గోడౌన్కు సీఎంఆర్ ముసుగులో పంపించిన పీడీఎస్ రైస్ పుణ్యం అంతా టీడీపీ నేతలకు చెందిన మిల్లులవే. తాజాగా చీపురుపల్లి గోడౌన్కు కూడా కోటబొమ్మాళి, నరసన్నపేట మండలానికి చెందిన మిల్లర్ల నుంచే సీఎంఆర్ ముసుగులో పీడీఎస్ రైస్ వెళ్లింది. జిల్లాలోని కీలక నేత సోదరుడి అండతో రెచ్చిపోయి ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారు. డిపోల ద్వారా ఇచ్చే రేషన్ బియ్యాన్ని సేకరించి, అదే బియ్యాన్ని సీఎంఆర్ కింద ప్రభుత్వానికి తిరిగి కట్ట బెడుతున్నారు. సీఎంఆర్ ముసుగులో భారీ అవినీతికి పాల్పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలి.. ఆ ధాన్యాన్ని మిల్లులకు పంపించి ఆడించాలి.. అక్కడ ఆడించాక వచ్చిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను ఎఫ్సీఐ, స్టేట్ వేర్ హౌసింగ్, సివిల్ సప్లయిస్, ప్రైవేటు గోడౌన్లకు పంపించాలి. అనంతరం ఆ ధాన్యాన్ని జనాలకు లబ్ధి కింద జిల్లాలకు అందించాలి. ఇదీ పద్ధతి. కానీ ఈ ప్రక్రియలో లోపాలను అదనుగా మార్చుకుని ‘కొందరు’ కోట్లు గడిస్తున్నారు. ప్రజలకు కస్టమ్ మిల్లింగ్ రైస్ కాకుండా పాత పీడీఎస్(పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం) బియ్యమే ఇస్తున్నట్లు అనేక దాఖలాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో పెందుర్తి గోడౌన్లో ఈ తరహా అక్రమాలు వెలుగు చూడగా తాజాగా చీపురుపల్లి మండలం పత్తికాయవలస ఫుడ్ పార్క్లోని వేర్ హౌసింగ్ గోడౌన్ నుంచి వచ్చిన సీఎంఆర్లో కూడా పీడీఎస్ రైస్ను గుర్తించినట్టు సమాచారం. ఆగని అవినీతి దందా.. గోడౌన్లలో స్టాక్ చేసిన సీఎంఆర్ను ప్రభుత్వం పలు అవసరాల కోసం జిల్లాలకు కేటాయిస్తుంది. అయితే జిల్లాల్లో గోడౌన్ల సామర్థ్యం లేక ఈ ఏడాది మే నెలలో పెందుర్తి గోడౌన్లో ఇక్కడి సీఎంఆర్ను స్టాక్ చేశారు. దాదాపు 56 మిల్లుల నుంచి వేలాది మెట్రిక్ టన్నుల సీఎంఆర్లో పీడీఎస్ రైస్ ఉన్నట్టు గుర్తించారు. దీనిపై నోటీసులు జారీ చేసి విచారణ కూడా జరిపారు. హెడ్ ఆఫీస్తో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సివిల్ సప్లయ్ డీఎం స్థాయి అధికారులు తనిఖీ చేశారు. కానీ ఆ విచారణ ఏమైందో, చర్యలేంటో? ఇప్పటివరకు తెలియదు. ఆ బాగోతం తేలనే లేదు.. ఇప్పుడు జూన్లో చీపురుపల్లి మండలం పత్తికాయవలస స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్కు మిల్లర్లు పంపించిన సీఎంఆర్లో కూడా పీడీఎస్ రైస్ ఉన్నట్టు తేలింది. చీపురుపల్లి గోడౌన్లో ఉన్న బియ్యాన్ని విశాఖ జిల్లా అవసరాలకు కేటాయించడంతో.. ఇక్కడి నుంచి అక్కడకు రవాణా చేశారు. పలు ఎంఎమ్ఎల్ పాయింట్ల వద్ద విశాఖపట్నం జిల్లా సివిల్ సప్లయి అధికారులు తనిఖీ చేసిన సందర్భంలో పీడీఎస్ గుట్టు రట్టయ్యింది. పత్తికాయవలస గోడౌన్కు శ్రీకాకుళం జిల్లాలోని 32మిల్లుల నుంచి వేలాది మెట్రిక్ టన్నుల సీఎంఆర్ వెళ్లింది. దాంట్లో దాదాపు పీడీఎస్ రైస్ ఉన్నట్టు సమాచారం. దీనిపై విశాఖ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హెడ్ ఆఫీస్ ఎప్పటిలాగే ఒక బృందాన్ని పంపించి, విచారణ జరిపించింది. దానికి సంబంధించిన నివేదిక హెడ్ ఆఫీస్కు చేరినట్టు తెలిసింది. రూ.కోట్లలో అడ్డగోలు సంపాదన ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని ఆడించి బియ్యంగా ఇచ్చేందుకు మిల్లులకు ప్రత్యేకంగా చార్జీలు ఇస్తోంది. దాంతో పాటు బియ్యంలో మలినాలను, లోప భూయిష్ట ధాన్యాలు, రాళ్లు తొలగించి, ఏకరీతి రూపాన్ని తీసుకొచ్చేందుకు సార్టెక్స్ చార్జీలను కూడా ఇస్తోంది. వాస్తవంగా, మిల్లులకు ఇదే ఆదాయం కావాలి. కానీ, మిల్లర్లకు అది చాలడం లేదు. కోట్లలో కొట్టేద్దామని పక్కదారి పడుతున్నారు. ధాన్యం కొనుగోలు సమయంలోనే పథక రచన చేస్తున్నారు. కొందరు కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చే ధాన్యాన్ని ఆడించగా వచ్చిన బియ్యాన్ని ప్రైవేటు మార్కెట్కు విక్రయించి లబ్ధి పొంది, సీఎంఆర్ కింద బయట మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోలు చేసిన పీడీఎస్ రైస్ను ముట్ట జెబుతున్నారు. మరికొందరు కొనుగోలు కేంద్రాల్లో తప్పుడు వివరాలు నమోదు చేసి, రైతుల నుంచి కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్టు, అవి ట్యాగ్ చేసిన మిల్లులకు చేరినట్టు రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యం వచ్చినట్టుగా చూపించి, ఆ ధాన్యం (లేని ధాన్యం) ఆడించినట్టుగా, పీడీఎస్ రైస్ను ఇచ్చి సీఎంఆర్ ఇచ్చినట్టుగా చూపుతున్నారు. జిల్లాలో ఇదో పెద్ద కుంభకోణంగా మారింది. నిఘా ఎక్కడ? వాస్తవానికై తే, మిల్లుల నుంచి గోడౌన్లకు రవాణా చేసే లారీలకు జియో ట్యాగింగ్ ఉండాలి. వాటిని నిరంతరం ట్రాక్ చేయాలి. గోడౌన్కు చేరిన తర్వాత వివిధ అవసరాల కోసం కేటాయించినప్పుడు జిల్లాకు చెందిన సంబంధిత అధికారి తనిఖీ చేసి పాస్ ఆర్డర్ ఇవ్వాలి. ఇదంతా నామ్ కే వాస్తేగా జరగడంతో మిల్లర్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రజలకు మళ్లీ పాత పీడీఎస్ రైస్నే కొత్త సీఎంఆర్గా చేతుల్లో పెడుతున్నారు.


