breaking news
Srikakulam District News
-
చిన్నారులపై అకృత్యాలు అరికట్టాలి
గార: చిన్నారులపై అకృత్యాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గార ఏఎస్ఐ తెలుగు చంద్రమోహన్ అన్నారు. చిన్నారులపై లైంగిక అకృత్యాలు – బాధితుల మానసిక పరిస్థితులుపై శనివారం గార మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల ఉద్యోగులకు ఒక రోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. జిల్లా బాధిత చిన్నారుల సంరక్షణ కేంద్రం (డీఈఐసీ) సైకాలజిస్ట్ డాక్టర్ రెడ్డి రాజ్కుమార్, గార పీహెచ్సీ వైద్యాధికారి రమ్య, కళింగపట్నం పీహెచ్సీ వైద్యాధికారి మౌనిక, ఎంఈఓ–2 పి.వినోదిని తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు శాపం!
టెక్కలి: పదో తరగతి వరకు బాలికోన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థినులు ఇంటర్మీడియెట్ సైతం అక్కడే చదువుకునే విధంగా బాలికా విద్యను ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్లస్ 2 పాఠశాలలను ఏర్పాటు చేశారు. టెన్త్ అనంతరం ఎటువంటి డ్రాపౌట్స్ లేకుండా బాలి కలు ఇంటర్ విద్యను పూర్తి చేయాలనే ఉన్నత లక్ష్యంతో ఈ స్కూళ్లకు రూపకల్పన చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ప్లస్ 2 పాఠశాలలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 2025–26 అకడమిక్ విద్యా సంవత్సరం చివరి దశకు చేరుకున్నా ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అరకొరగా పుస్తకాలను సరఫరా చేశారు. మరికొన్ని పాఠశాలలకు పూర్తిగా పుస్తకాలే సరఫరా చేయకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 మంది సెకెండియర్ విద్యా ర్థినులు చదువుతున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పుస్తకాలు లేకుండా ఎలా పరీక్షలు రాయాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. నేను ఎంపీసీ సెకెండియర్ చదువుతున్నాను. ఇప్పటి వరకు పుస్తకాలు ఇవ్వలేదు. గతంలో చదివిన వారి నుంచి పుస్తకాలు సేకరించి వాటితో సర్దుకుపోతున్నాం. పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. – డి.వర్ష, ఎంపీసీ సెకెండియర్, ప్లస్ 2 పాఠశాల, టెక్కలి ముందు బ్యాచ్ వరకు పుస్తకాలు సరఫరా చేశారు. ఇప్పుడు పుస్తకాలు ఇవ్వలేదు. పాత పుస్తకాలతో అవస్థలు పడుతున్నాం. మరికొద్ది రోజుల్లో పరీక్షలు జరగనున్నాయి. పాఠ్య పుస్తకాలు లేక ఇబ్బందిగా మారింది. – ఎస్.శ్రీజ, ఎంపీసీ సెకెండియర్, టెక్కలి చక్కగా పాఠాలు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు. మా ఉపాధ్యాయుల సహకారంతో పాత విద్యార్థుల దగ్గర నుంచి పుస్తకాలు తీసుకుని తరగతి గదిలో మాత్రమే చదువుతున్నాం. – కె.తేజస్విని, బైపీసీ సెకెండియర్, టెక్కలి బాలికా విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ప్లస్ 2 పాఠశాలల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థినులకు ఇప్పటి వరకు పుస్తకాలు సరఫరా చేయకపోవడం దారుణం. – తమ్మినేని చందనరావు, ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్లస్ 2 స్కూళ్లలో సెకెండియర్ విద్యార్థినులకు అందని పుస్తకాలు మరికొన్ని పాఠశాలలకు అరకొరగా పుస్తకాలు ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం -
రబీలో ఆరుతడే మేలు
శ్రీకాకుళం: రబీలో వరి పంట తప్ప వేరుశనగ, ఇతర పంటలను రైతులు వేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలసి ఆయన నిర్వహించారు. 3 నెలలకు ఒకసారి ఇరిగేషన్ బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించి శాసన సభ్యులను ఆహ్వానించి సంబంధిత అధికారులను పిలవాలన్నారు. ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి గండ్లు గుర్తించాలని సూచించారు. ఫిబ్రవరి నాటికి వంశధార ప్రాజెక్టులో ఉన్న నీరు ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని, బ్యారేజీ పాడైనందున బాగు చేయాల్సి ఉంటుందన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ నాగావళి, వంశధార, నారాయణపురం బ్యారేజీల నుంచి అందిస్తున్న నీటి వివరాలను వివరించారు. వంశధార స్టేజ్–2 భూసేకరణకు సంబంధించి 28 ఎకరాలకు నష్ట పరిహారం ఎంత ఇవ్వాలో అప్లోడ్ చేయాలన్నారు. ఎమ్మెల్యే కూన రవి కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో ఉన్న కాలువల ద్వారా వచ్చే మురుగు నీరు, చెత్త సాగునీటి కాలువల్లోకి రాకుండా చూడాలని కోరారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ ఆఫ్షోర్ రిజర్వాయర్పై ప్రతి మూడు నెలలకు సమీక్ష నిర్వహించాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తే సమస్యలు ఉంటే పరిష్కారం చేయవచ్చన్నారు. సమావేశంలో శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్, వంశధార ప్రాజెక్టు ఛైర్మన్ ఎ. రవీంద్రబాబు, నారాయణపురం ప్రాజెక్టు ఛైర్మన్ సనపల డిల్లీరావు, ఆర్డీఓలు కె. సాయి ప్రత్యూష, కష్ణమూర్తి, వెంకటేష్, వంశధార డిప్యూటీ కలెక్టర్ జి.జయదేవి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో కొందరు అధికారులపై ఎమ్మెల్యే కూన రవి అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఈ పనితీరు అస్సలు బాగోలేదని అన్నారు. -
నేడు ‘పోరుబాట కై త’ కవితా పఠనం
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఈ నెల 7న ఉదయం 10.30 గంటలకు ‘పోరుబాట కైత’ కవితా పఠనం నిర్వహిస్తున్నట్లు సాహితీ స్రవంతి కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్, థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరసనను ప్రతిబింబించేలా కవుల స్పందనను తమ కవిత్వం ద్వారా వినిపించాలని కోరారు. కవులందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు. పోలీసు శిక్షణా కేంద్రం పరిశీలన శ్రీకాకుళం క్రైమ్/శ్రీకాకుళం రూరల్: తండేవలసలోని జిల్లా పోలీసు శిక్షణాకేంద్రాన్ని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి శనివారం సందర్శించారు. ఇటీవల ఎంపికై న స్టైపండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో మైదానం, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, బ్యారెక్స్, మంచినీటి సరఫరా, మెస్, భోజనశాల, స్నానాల గదులు, విద్యుత్తు సదుపాయాలను ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, సీఐలు ఇమ్మాన్యుయెల్ రాజు, పైడపునాయుడు, అవతారం, కృష్ణమూర్తి, ఆర్ఐలు నర్సింహరావు, శంకర్ప్రసాద్ పాల్గొన్నారు. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్ ఇచ్ఛాపురం రూరల్: మండపల్లి పంచాయతీ పూర్వ కార్యదర్శులు గురుమూర్తి, ఎస్.కృష్ణలను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఎంపీడీఓ ఎ.ప్రభాకరరావు శనివారం తెలిపారు. పంచాయతీ పరిపాలనకు సంబంధించి రికార్డులలో తారుమారు, ఆర్థిక వ్యవహారాల్లో తేడాలు రావడంతో జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య వీరిద్దరినీ సస్పెండ్ చేసినట్లు తమకు ఉత్తర్వులు అందాయని పేర్కొన్నారు. పోలీసుల మోహరింపు టెక్కలి: టెక్కలి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సాధారణ సర్వ సభ్య సమావేశానికి పోలీసులు మోహరించారు. ఎంపీపీ ఆట్ల సరోజనమ్మ, ఎంపీడీఓ రేణుక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి సభ్యులు పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడంతో నామమాత్రంగానే సమావేశాన్ని కొనసాగించారు. -
భవిష్యత్తు ప్రణాళికపై శిక్షణ
ఎచ్చెర్ల : స్థానిక సాంకేతిక శిక్షణాభివృద్ధి కేంద్రంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని తొమ్మిది మండలాల వెలుగు సిబ్బందికి భవిష్యత్తు ప్రణాళిక (విజన్ బిల్డింగ్)పై శిక్షణా కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. మండల సమాఖ్య, గ్రామ సంఘాల స్థాయిలో గ్రామాల్లో విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, వ్యవసాయం, మౌళిక సదుపాయాలు, సుస్థిర జీవనోపాధులు, సామాజిక భద్రత, సామర్థ్యాలు పెంపుదల వంటి అంశాలపైన నాలుగు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు టీవోటీలు ఐబీ ఏపీఎం భాగ్యలత, సీబీవో ఏపీఎం రాజారావు తెలిపారు. విజన్ బిల్డింగ్లో తయారుచేసిన ప్రణాళికలను డీఆర్డీఏ ద్వారా సెర్ప్, ఎన్ఆర్ఎల్ఎంలకు ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఎంలు, సీసీలు, ఎల్సీలు, అకౌంటెంట్లు, ఎల్సీ బసవరాజు, నాగరాజు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ విద్యార్థిని అదృశ్యం కంచిలి : మఠం సరియాపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్లో బైపీసీ ఫస్టియర్ విద్యార్థిని అదృశ్యమైంది. శుక్రవారం సాయంత్రం తరగతులు పూర్తయిన తర్వాత పాఠశాల నుంచి తిరిగి హాస్టల్కు రాకుండా, డే స్కాలర్ పిల్లలతో కలిపి ప్రాంగణం బయటకు వెళ్లింది. వెంటనే విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు అన్నిచోట్లా వెతికారు. ఆచూకీ లేకపోవడంతో హాస్టల్ వార్డెన్ పొందూరు రమ్య, విద్యార్థిని తల్లిదండ్రులు శనివారం కంచిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శబరిమలలో జిల్లా భక్తుడు మృతి
గార: కేరళలోని శబరిమల అయ్యప్ప సన్నిధానానికి వెళ్లిన జిల్లాకు చెందిన గురుస్వామి గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ కూటికుప్పలవానిపేటకు చెందిన గురుస్వామి గురుగుబెల్లి వరహానరసింహం (72) అక్టోబర్లో అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులతో కలిసి అయ్యప్ప మాలాధారణ స్వీకరించారు. వారితో పాటు మరో ముగ్గురు భక్తులు ఈ నెల 3న శబరిమల బయలుదేరి వెళ్లారు. శుక్రవారం పంబల నదిలో స్నానమాచారించి శబరిమల కొండకు చేరుకున్నారు. అక్కడ గుండెపోటుకు గురికావడంతో సమీపంలోని ఆసుపత్రికి అంబులెన్సులో తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. వరాహ నరసింహంకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. 1993 నుంచి మాలాధారణ వేస్తూ గురుస్వామిగా పరిసర ప్రాంతాల్లో పేరొందారు. గురుస్వామి మృతి పట్ల జిల్లా అయ్యప్ప భక్తుల సేవా సంఘం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర సంఘం కార్యదర్శి శ్రీరంగం మధుసూదనరావు సంతాపం వ్యక్తం చేశారు. రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు పాతపట్నం: పాతపట్నం సమీపంలోని కాకితోట సమీపంలో రైలు ఢీకొని పాతపట్నం మాదిగవీధికి చెందిన బొమ్మాళి సోమేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం ఉదయం గుణుపూర్ నుంచి పూరీ వెళుతున్న రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్పై పడిపోయిన క్షతగాత్రుడిని స్థానికులు గమనించి 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్ టెక్నీషియన్ కె.ఆపీసు, పైలట్ గోపాలకృష్ణ ప్రథమ చికిత్స అందించి పాతపట్నం సీహెచ్సీకు తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఫోన్ ఎందుకు కొన్నావని మందలించినందుకు..
● జె.ఆర్.పురంలో బాలుడు అదృశ్యం రణస్థలం: ఇంట్లో తెలియకుండా సెల్ఫోన్ కొనుగోలు చేసిన కుమారుడిని తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన దంగుడుబియ్యపు టోనీష్ అనే విద్యార్థి ఇంట్లో నుంచి పారిపోయాడు. జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావేరు మండలం పాత కుంకాం గ్రామానికి చెందిన సతీష్ వృత్తిరీత్యా జె.ఆర్.పురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. కుమారుడు టోనీష్ ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు దాచి సెల్ఫోన్ కొనుక్కున్నాడు. టోనీష్ వద్ద సెల్ ఉందని, తలగడ కింద పెట్టుకుని వాడుతున్నాడని తల్లి గమనించింది. వెంటనే భర్త సతీష్కు చెప్పింది. ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో శనివారం ఉదయం పాఠశాలకు బయలుదేరిన టోనీష్ సైకిల్, బ్యాగ్ ప్రైవేటు స్కూల్ సమీపంలో ఉంచేసి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అన్నిచోట్లా వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి ఆచూకీ తెలిస్తే 9842302369, 9000519420 నంబర్లకు తెలియజేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
చెరువులో పడి వృద్ధుడు మృతి
రణస్థలం: లావేరు మండలం చిగురుకొత్తపల్లి గ్రామానికి చెందిన గిడుతూరి అప్పారావు మతిస్థిమితం లేని కారణంగా చెరువులో పడి మృతి చెందినట్లు లావేరు పోలీసులు తెలిపారు. ఈ నెల 1వ తేది రాత్రి 8గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వృద్ధుడు తిరిగి రాలేదు. శనివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో ఉన్న చెరువు నుంచి దుర్వాసన రావడం, కొద్దిసేపటికే మృతదేహం తేలడంతో పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. గ్రామస్తులు పరిశీలించి గిడుతూరి అప్పారావుగా గుర్తించారు. మృతుడి కుమారుడు గిడుతూరి సూరప్పడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఏఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇదేం తీరు!
● ‘పది’ పరీక్షలపై సర్కారు ఏకపక్ష నిర్ణయాలు ● జిల్లా అధికారులను డమ్మీ చేసేలా నియంతృత్వ పోకడలు ● మండిపడుతున్న ఉపాధ్యాయులు శ్రీకాకుళం : పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ విషయమై ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలపై ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుండటం పట్ల ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. టెన్త్ విద్యార్థులకు 2026 మార్చి 16 నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించడం విదితమే. తాజాగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నిర్వహించిన వెబెక్స్ మీటింగ్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం కేంద్రీకృతంగా నిర్వహించనున్నట్లు చెప్పడం కొత్త సంప్రదాయానికి తెరలేపినట్టు అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వింత పోకడలు ప్రస్తుత విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రదర్శించడం సురక్షిత, పారదర్శకమైన పరీక్షల విధానాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ అక్కడి నుంచే.. జిల్లాస్థాయి, క్షేత్రస్థాయి అధికారులను డమ్మీలుగా చేయడమే ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. వారి అధికారాలను, రూల్స్ ప్రవిన్సులైజేషన్ ద్వారా సంక్రమించిన విధులను, బాధ్యతలను కూడా రాష్ట్రస్థాయి అధికారులు హస్తగతం చేసుకోవడం పని విభజన సంస్కృతిని కాలరాయడమేనని జిల్లా అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆలోచనలు మండల విద్యాశాఖ అధికారుల విధులు, బాధ్యతలను నిర్వీర్యం చేస్తున్నాయి. మండలానికి రెండు లేదా మూడు పరీక్ష కేంద్రాలు ఉంటే ఆ పరీక్షా కేంద్రాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేటు యాజమాన్యాల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అవే కేంద్రాల్లో పరీక్ష రాయవలసి ఉంటుంది. ఇటువంటి సమయాల్లో స్థానిక అధికారులు నిర్ణయాలు తీసుకుంటూ ఇన్విజిలేషన్ డ్యూటీలు, బాధ్యతలు వంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ప్రభుత్వం తాజా ఆలోచనల ప్రకారం పాఠశాల విద్యాశాఖ కేంద్ర కార్యాలయమే నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రస్థాయి అధికారులే ఇన్విజిలేషన్ విధులను కేటాయిస్తే పలుచోట్ల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు బోధించిన పాఠశాల విద్యార్థులు కూడా ఒకే కేంద్రంలో ఉండే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించే అవకాశముంది. మినహాయింపు లేకుంటే ఎలా..? వైద్య అనారోగ్య కారణాలతో మినహాయింపులకు అవకాశం లేకుండా చేస్తే తమ ప్రాణాలను ఫణంగా పెట్టడమేనని ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. ప్రతి జిల్లాలోనూ 10వ తరగతి పరీక్షల నిర్వహణ మూల్యాంకన పత్రాల స్ట్రాంగ్ రూములు, మూల్యాంకన పత్రాలను వేరే జిల్లాలకు పంపించడం ఇతర జిల్లాల నుంచి రాష్ట్రస్థాయి అధికారులు కేటాయించిన జిల్లా నుండి మూల్యాంకన పత్రాలను రిసీవ్ చేసుకోవడం వంటి నిధులు అసిస్టెంట్ కమిషనర్ నిర్వర్తించేవారు. ఈ పోస్టును సైతం లేపేసే కుట్రలకు చంద్రబాబు సర్కారు తెరతీస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత పెంపుకోసం అమలు చేస్తున్న వందరోజుల యాక్షన్ ప్లాన్ సెలవు రోజుల్లోనూ ఉండడం వల్ల విద్యార్థులు మానసిక సంఘర్షణలకు గురవుతున్నారని, వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. -
హోంగార్డుల సంక్షేమానికి కృషి
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు వ్యవస్థలో హోంగార్డులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అన్నారు. తండేవలస జిల్లా పోలీసు శిక్షణాకేంద్రం మైదానంలో శనివారం నిర్వహించిన 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంలో ఎస్పీ పాల్గొన్నారు. ముందుగా పరేడ్ కమాండర్ హోంగార్డు శశిభూషణ్ గౌరవ వందనాన్ని సమర్పించగా రైజింగ్పరేడ్ను ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1962లో కొద్దిమందితో ఏర్పడిన హోంగార్డుల ఆర్గనైజేషన్ జిల్లాలో నేడు 699 మందికి చేరుకుందన్నారు. పండగలు, ట్రాఫిక్ నియంత్రణ, విపత్తుల సహాయక చర్యలు, బందోబస్తు, ఎన్నికలు, ర్యాలీలు, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమన్నారు. వేతనం పెంచే ఆలోచనలో ప్రభుత్వముందని, ఆరోగ్య రక్షణ కోసం హెల్త్ ప్రమాద బీమా, ప్రతినెలా 2 రోజుల విశ్రాంతి సెలవులకు తోడు అత్యవసర పరిస్థితుల్లో సెలవులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, సీఐలు, ఎస్ఐలు, అధికసంఖ్యలో హోంగార్డులు పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ క్యాంపస్ క్రీడాపోటీలు
ఎచ్చెర్ల : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) పరిధిలో నాలుగు క్యాంపస్ల విద్యార్థులకు మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఇంటర్ క్యాంపస్ స్పోర్ట్స్ మీట్ శనివారంతో ముగిసింది. వాలీబాల్ పురుషుల విభాగంలో నూజివీడు ప్రథమ, శ్రీకాకుళం ద్వితీయ స్థానం సాధించింది. మహిళ విభాగంలో శ్రీకాకుళం ప్రథమ, నూజివీడు ద్వితీయ స్థానం సాధించింది. చెస్ పోటీలో శ్రీకాకుళం మహిళల జట్టు విజేతగా నిలిచింది. కార్యక్రమంలో డైరెక్టర్ బాలాజీ, పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, దిలీప్కుమార్, కృష్ణంరాజు, నవీన్, లావణ్య, పీఆర్వో షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసుల్లో నిందితుడు అరెస్టు
టెక్కలి రూరల్: టెక్కలి పరిధిలో పలు చోరీలకు పాల్పడిన యువకుడిని శనివారం టెక్కలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ విజయ్కుమార్ తెలిపారు. టెక్కలి కండ్రవీధికి చెందిన బెనియా జగబందు అలియాస్ పోతురాజు 2024లో ఎన్టీఆర్ కాలనీ, అయ్యప్పనగర్, రేవతిపతి వీధుల్లో దొంగతనం, 2025లో సైనికనగర్కు చెందిన సంపతిరావు అచ్చుతరావు ఇంట్లో చోరీ కేసుల్లో ప్రధాన నిందితుడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం స్థానిక మెళియాపుట్టి ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జగబంధును అదుపులోకి తీసుకున్నారు. 78.205 గ్రాముల బంగారు ఆభరణాలు, 38 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.10వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
కొండకు గుండెకోత
వీఆర్ గూడెం కొండపై గ్రావెల్ బకాసురులు ● అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్న వైనం ● ఎకరాల్లో గ్రావెల్ తవ్వకాలు జరిపి క్రషర్లలో విలీనం ● రోజుకు 200 టిప్పర్లు లోడు రవాణా వీఆర్ గూడెం కొండపై గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్న దృశ్యం పొందూరు: అధికార పార్టీ అండతో కొందరు కొండలకు గుండు కొట్టేస్తున్నారు. గ్రావెల్ కోసం, మట్టి కోసం కొండలను, చెరువులను తవ్వేస్తున్నారు. పొందూరు మండలం అక్రమ క్వారీలకు నిలయమని జిల్లా వాసులకు తెలిసిందే. కానీ గ్రావెల్తోనూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈ గ్రావెల్ రవాణా వల్ల రహదారులు ఛిద్రమై ప్రయాణికులకు ప్రమాదకరంగా మారుతోంది. కొండపై భారీ తవ్వకాలు వీఆర్ గూడెం సమీపాన సుమారు 400 ఎకరాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం గ్రావెల్తో కూడుకున్న కొండలే. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న పైడి కొండ గ్రావెల్తో నిండి ఉంది. వీటిని తమకు అనుకూలంగా మలచుకున్న లోలుగు, వీఆర్ గూడెం, పొందూరు గ్రామాలకు చెందిన అధికార పార్టీ నాయకులు గ్రావెల్ తవ్వకాలతో రెచ్చిపోతున్నారు. పదుల ఎకరాల్లో రోజూ గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. ఒక్క వీఆర్ గూడెం కొండపైనే మూడు నాలుగు ప్రాంతాల్లో గ్రావెల్ తవ్వకాలు చేపడుతూ సుమారు 200 వందల టిప్పర్లు, వంద ట్రాక్టర్లతో జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు రోజూ తరలిస్తున్నారు. కొంత మంది రైల్వే కాంట్రాక్టర్లు, రోడ్డు కాంట్రాక్టర్లు సైతం మట్టిని తరలిస్తున్నారు. రహదారులుగా జీడి తోటలు గ్రావెల్ మాఫియా కారణంగా జీడి మామిడి తోటలు కనుమరుగవుతున్నాయి. గ్రావెల్ తరలించడానికి ఈ తోటల నుంచే రహదారులు వేయడానికి వేల సంఖ్యలో చెట్లను కొట్టేశారు. అడిగిన రైతులను అధికార పార్టీ అండతో బెదిరిస్తున్నారు. కొండలపై ఉన్న సామాజిక అడవులను ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఫారెస్టు అధికారులు సైతం గ్రావెల్ మాఫియాకే వత్తాసు పలుకుతున్నారని జీడి తోటల యజమానులు వ్యక్తం చేస్తున్నారు. గ్రావెల్ తవ్వి క్రషరీల్లో విలీనం వీఆర్గూడెం కొండపై గ్రావెల్ మైనింగ్ చేయడమే కాకుండా, చదును చేస్తున్న స్థలాలను క్రషర్లలో విలీనం చేసుకుంటున్నారు. కొండకు సమీపంలో ఓ టీడీపీ నాయకుడు తన క్రషర్లో సుమారు రెండు ఎకరాల స్థలంలో వేల టిప్పర్ల మట్టిని తరలించడమే కాకుండా సంబంధిత స్థలాన్ని తమ క్రషర్లో విలీనం చేసుకున్నాడు. రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్న భారీ వాహనాల కారణంగా మండలంలోని పొందూరు నుంచి చిలకపాలెం వరకు ఉన్న రాష్ట్ర ప్రధాన రహదారి గుంతల మయంగా తయారైంది. ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే ఏడుగురు ప్రయాణికులు మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. చోద్యం చూస్తున్న అధికారులు మండలంలో భారీ స్థాయిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ రవాణా జరుగుతున్నా తమకెందుకులే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. దీని కారణంగా మాఫి యా వ్యక్తులు అధికార పార్టీకి చెందిన వారేన న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రావెల్ మా ఫియా ఎవరు చేయిస్తున్నారోనని అధికారులు కనీసం చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నా రు. ఈ వాహనాల కారణంగా రోడ్లు మరమ్మతులకు గురవుతున్నా ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా రు. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం వీఆర్ గూడెం, పైడికొండపై గ్రావెల్ తవ్వకాలు జరగడంపై ఫిర్యాదుల వచ్చాయి. పైడికొండ తవ్వకాలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. వీఆర్గూడెం కొండపై భారీ స్థాయిలో జరుగుతుండటంతో మైనింగ్ అధికారులతో పాటు జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. చర్యలు తీసుకుంటాం. – వెంకటేష్ రామానుజుల, తహసీల్దార్, పొందూరు ఈ అక్రమాలతో అధికార పార్టీ నాయకులు భారీగానే దండుకుంటున్నారు. పార్టీ బల మే అండగా భారీ వసూలుకు పాల్పడుతున్నా రు. టిప్పర్కు రూ.600 నుంచి రూ.800లు వసూలు చేస్తుండగా రోజుకు కనీసం 200 టిప్ప ర్లు రెడ్డిపేట, లోలుగు, వీఆర్ గూడెం మీదుగా తరలిస్తున్నారు. ట్రాక్టర్కు రూ.200 వసూలు చేస్తున్నారు. దీంతో గ్రావెల్ మాఫియాకు రోజుకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతుండటంతో కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. వీఆర్గూడెం, పొందూరు పైడికొండపై ఎకరాల మేర తవ్వకాలు సాగుతున్నాయి. -
బెల్టు తీసేదెప్పుడో?
సోంపేట : రాష్ట్రంలో తక్కువ ధరకే మద్యం విక్రయిస్తాం.. బెల్టు షాపులు రూపు మాపుతామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆచరణకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా సోంపేట మండలంలో మద్యం వ్యాపారం మొత్తం సిండికేట్ కనుసన్నల్లోనే నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో బెల్టుషాపుల దందా జోరుగా సాగుతోంది. వైన్ షాపుల్లో విక్రయించాల్సిన 99 రూపాయలు మద్యం బాటిల్ ఒక్కటి కూడా మద్యం దుకాణాల్లో లభించడం లేదని, బెల్టు షాపుల్లో మాత్రం అదే బాటిల్ను రూ.140కు విక్రయిస్తున్నారని మందుబాబులు వాపోతున్నారు. ఏ వీధి చూసినా.. బెల్టు దుకాణాలు నడిపితే చర్యలు తప్పవని అధికారులు ప్రకటనలు గుప్పించడం తప్ప అడ్డుకోవడం లేదు. మద్యం దుకాణాలతో సిండికేటుగా మారి బెల్టు షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మండలంలో సోంపేటలో 4, బారువలో 1, కొర్లాంలో 1 చొప్పున లైసెన్సు దుకాణాలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం వీటిలోనే మద్యం విక్రయాలు జరగాలి. కానీ వీటి పరిధిలో 23 పంచాయతీల్లో సుమారు 200కు పైగా బెల్టు షాపులు అనధికారికంగా నిర్వహిస్తున్నారని ఆయా గ్రామాల మహిళలు వాపోతున్నారు. వీటికితోడు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పలు హోటళ్లు, డాబాల్లో ఎప్పుడు పడితే అప్పుడు విచ్చలవిడిగా మద్యం దొరుకుతోందనే బహిరంగ రహస్యం. వీటిని అరికట్టాల్సిన ఎకై ్సజ్ అధికారులు తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఎప్పుడో ఒకసారి తూతూమంత్రంగా దాడులు నిర్వహించి మమా అనిపించేస్తున్నారు. హైవే పక్కనే బెల్టుషాపులు.. కొర్లాం, పాలవలస జాతీయ రహదారి పక్కనే మద్యం విక్రయాలు కొనసాగుతుండడంతో తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. కొర్లాం జాతీయ రహదారి పక్కన ప్రతి డాబాలో మందు విక్రయాలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దాడులు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో సిండికేట్లు ఆడిందే ఆటగా సాగుతోంది. వీధిన పడుతున్న కుటుంబాలు.. గ్రామాల్లో వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు బెల్టుషాపుల్లో మద్యం అందుబాటులో ఉండటంతో అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కష్టపడి సంపాదించిన సొమ్మునంతా మందుకే ఖర్చు చేస్తున్నారంటూ మహిళలు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకుని బెల్టుదుఖానాలు అదుపు చేయాలాని ప్రజలు కోరుతున్నారు. బెల్టు షాపులు నిర్వహించకుండా చర్యలు చేపడతాం. ఇప్పటికే లైసెన్స్ దుకాణాదారులకు ఆదేశాలు జారీ చేశారు. బెల్లుషాపులు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. రూ.99 బాటిళ్లు తక్కువగా వస్తున్నాయి. – రమణ, ఎకై ్సజ్ సీఐ ఓ బెల్టు షాపు వద్ద మందు తాగుతున్న వ్యక్తి సోంపేట మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ మండల స్థాయి నాయకుల చేతిలోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రామాలకు ఎంత నగదు ఇవ్వాలి, బెల్టు దుకాణాలకు మందు ఎలా సరఫరా చేయాలి.. తదితర విషయాలు వారే చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఎకై ్సజ్ అధికారులు దాడులు జరపకుండా చేస్తున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి యథేచ్ఛగా మద్యం బెల్టుషాపులు పట్టించుకోని ఎకై ్సజ్ అధికారులు రూ.99 బాటిల్ను రూ.140 విక్రయిస్తున్న వైనం -
ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్ జగన్ తీసుకువచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించడం దారుణమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ అన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పేద, బడుగు,బలహీనవర్గాల వారి అభిప్రాయాల్ని సంతకాల రూపంలో సేకరించామని, ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన పత్రాలను ఈ 10వ తేదీన ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాల్లో జిల్లా కేంద్రంలో పార్టీ కా ర్యాలయానికి చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమం ఓ పండుగ వాతావరణంలో జరగాలన్నారు. దీనిపై శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఉన్న సంతకాల పత్రాలను ఓ ప్రత్యేక వాహనంలో కేంద్ర పార్టీ కార్యాలయం తాడేపల్లికి పంపిస్తామని తెలిపారు. ఈ నెల 16వ తేదీన కోటి సంతకాల సేకరణ, ప్రైవేటీకరణ వల్ల నష్టాన్ని తెలియజేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి గవర్నర్కి వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయసాయిరాజ్, మాజీ మంత్రి, పార్టీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు దుంపల లక్ష్మణరావు, కేవీజీ సత్యనారాయణ, ఎస్ఈసీ మెంబర్ గొండు కృష్ణమూర్తి, శ్రీకాకుళం నియోజకవర్గ పరిశీలకులు కరిమి రాజేశ్వరరావు, వెలమ కుల రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, కూరాకుల, పొందర కుల రాష్ట్ర అధ్యక్షుడు రాజాపు అప్పన్న జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, పార్టీ అధికార ప్రతినిధి దుర్యోధన, గ్రీవెన్స్సెల్ జిల్లా అధ్యక్షుడు రౌతు శంకరరావు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వజ్జ వెంకటరావు, కింజరాపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. 13న తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి చేరిక 16న గవర్నర్కి కలిసే కార్యక్రమం భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు తరలిరావాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపు -
విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): విద్యార్థుల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్రావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో రెండు రోజులుగా జరిగిన ఎస్ఎఫ్ఐ 44వ జిల్లా మహాసభలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెప్ని రద్దు చేయాలని, మూసేసిన పాఠశాలలను తెరిపించాలని, సంక్షేమ వసతిగృహాలకు సొంత భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. విద్యా సంస్థలకు వెళ్లేందుకు విద్యార్థి సంఘాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలన్నారు. అనంతరం నూతన కమిటీను ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా డి.చందు, పి.ఖగేష్, జిల్లా గర్ల్స్ కన్వీనర్గా దివ్య, కార్యవర్గ సభ్యులుగా చిన్న దుర్గాప్రసాద్, రాములను ఎన్నుకున్నారు. -
దుకాణాల్లో గంజాయి తనిఖీలు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు ఇలాకాలో గురు, శుక్రవారాల్లో గంజాయి తనిఖీలు విస్తృతంగా జరిగాయి. నిమ్మాడ కూడలి, కోటబొమ్మాళి కేంద్రాలుగా గంజాయి విస్తరిస్తుందన్న వార్తలు గుప్పుమనడంతో ఇటీవల సాక్షిలో వచ్చిన ‘గ్రానైట్ క్వారీలే గంజాయి అడ్డాలు’ కథనానికి ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పందించారు. ఈ మేరకు టెక్కలి డీఎస్పీ దాసరి లక్ష్మణరావుకి గంజాయి సరఫరా, క్రయ, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం సాయంత్రం, శుక్రవారం నిమ్మాడ కూడలి, పెద్దబమ్మిడి, ఎత్తురాళ్లపాడు పరిధిలోని జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కిరాణా షాపుల్లో పోలీసు జాగిలాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అంతేకాక సమీపంలో ఉన్న హరిశ్చంద్రపురం, తిలారు రైల్వే స్టేషన్లే కాక గ్రానైట్ పరిశ్రమలపై ప్రత్యేక నిఘా పెట్టారు. హైవే వెంబడి వాహనాల రాకపోకలపై రాత్రి వేళల్లో పెట్రోల్మొబైల్ వాహనాలతో తనిఖీలు చేశారు. ఇటీవల జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారిపై భారీ వాహనాలను సైతం అధిక సమయం నిలుపుదల చేయకుండా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చర్యలు తీసుకుంటున్నారు. ‘సాక్షి’లో వచ్చిన కథనానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడులు గంజాయి నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. నిమ్మాడ కూడలి, కోటబొమ్మాళి కేంద్రాలుగా పలు షాపుల్లో పోలీసు జాగిలాలతో తనిఖీలు రైల్వేస్టేషన్లు, గ్రానైట్ పరిశ్రమలు, వాహనాలపై ప్రత్యేక నిఘా ‘సాక్షి’లో వచ్చిన కథనంతో ఎస్పీ కీలక ఆదేశాలు -
ఆహారమే ఔషధం కావాలి
శ్రీకాకుళం కల్చరల్: పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ భూమిని, రైతును, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ నెల 9 నుంచి మూడురోజుల పాటు శ్రీకాకుళం అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్, వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బృందావన్ ఫంక్షన్ హాలులో నిర్వహించే సిక్కోలు హరిత మహోత్సవం, శుక్రవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ రసాయనాలు లేని ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఆరోగ్యం, పర్యావరణం, సంప్రదాయం కాపాడుకుందామన్నారు. పీడియాట్రిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ఆహారమే ఔషధం కావాలి, లేకపోతే ఔషధమే ఆహారం అవుతుందని, మహిళలందరూ వంటింట్లో మళ్లీ చిరుధాన్యాల వినియోగం పెంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, యార్లగడ్డ గీతాశ్రీకాంత్, వినోద్కుమార్, విజయకుమార్, సచిత్ర, అన్నపూర్ణ, రవి, ప్రవీణ్, షర్మిళ పాల్గొన్నారు. -
వ్యవసాయ శాఖ పేషీని అవినీతిమయం చేశారు
● మంత్రి అచ్చెన్నాయుడిపై తిలక్ మండిపాటు టెక్కలి: వ్యవసాయం దండగ అని గత టీడీపీ పాలనలో చంద్రబాబు నిర్లక్ష్యంగా మాట్లాడిన సంగతి గుర్తు లేక తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గత వైఎస్సార్సీపీ పాలనలో వ్యవసాయరంగం పూర్తిగా నాశనమైపోయిందంటూ మతిభ్రమించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. శుక్రవారం టెక్కలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే పేషీని అవినీతిమయం చేసిన అచ్చెన్నాయుడు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయరంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పులపై విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయించలేని చేతకాని మంత్రిగా మిగిలిపోతున్నారని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో రైతులకు విత్తనాలు, యూరియా ఇవ్వలేని అసమర్ధత మంత్రిగా మిగిలిపోయారన్నారు. మోంథా తుఫాన్ బాధిత రైతుల్లో ఎంత మందికి పరిహారం ఇచ్చారో బహిరంగంగా చెప్పా లని డిమాండ్ చేశారు. కళ్లాల్లో ధాన్యం నిల్వలతో అమ్మకాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు న్యాయం చేయకుండా మిల్లర్లు, దళారీలకు మద్దతు ఇస్తూ కమీషన్లకు మంత్రి కక్కుర్తి పడుతున్నారని మండిపడ్డారు. స్వాతంత్య్రం అనంతరం ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ బడులకు నాడు–నేడుతో సరికొత్త రూపం ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి పేరెంట్స్ మీటింగ్ అంటూ ఆర్భాటంగా ప్రచారాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. -
మేడం గారూ మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నాం..
వజ్రపుకొత్తూరు: ‘మేడం గారూ.. గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాసిరకం మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నాం.. సాంబారు నీరులా ఉంది. గుడ్లు అరకొరగా పెడుతున్నారు. మా పిల్లల ఆరోగ్యం పాడవుతోంది.’ అంటూ శుక్రవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఎదుట గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులు మొర పెట్టుకున్నారు. ఇటీవల కూడా ఇక్కడి మధ్యాహ్న వంటలు బాగు లేవని విద్యార్థులు చెప్పడంతో తల్లిదండ్రులు వచ్చి వంట నిర్వాహకులను నిలదీశారు. ‘ఇలాగే పెడతాం..మీ దిక్కున చోట చెప్పుకోండి’ అనడంతో ఏమీ చేయలేకపోయారు. కాలేజీ ప్రిన్సిపాల్ రమేష్ పట్నాయక్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు కారి రాజులమ్మ, జానకి, కారి జ్యోతి, ఉమారాణి, సీహెచ్ జగదాంబ ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. మెనూ అమలు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. స్క్రబ్ టైఫస్తో జాగ్రత్త: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని ప్రజలందరూ స్క్రబ్ టైఫస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశా రు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖాధికారులు, జిల్లాలోని ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్లతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఐదు రోజులు పూర్తిగా జ్వరం తగ్గని వారు స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ‘చిగ్గర్ మైట్’ అనే కీటకం కుట్టడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ మనుషులకు సోకుతుందని వివరించారు. ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని, వ్యాధి నిర్ధారణకు సరిపడా కిట్లను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. అయితే, ప్రభుత్వ నిబంధనలకు లోబడే ప్రైవేట్ ల్యాబ్లు పరీక్షల ధరలను నిర్ధారించాలని ఆదేశించారు. ఈ వ్యాధి ముఖ్యంగా పొదలు, గడ్డి, పొలాలు, అడవి ప్రాంతాల్లో ఉండే చిగ్గర్లు కుట్టడం వల్ల వస్తుందని, వ్యవసాయ పనులు చేసేవారు, పశువుల పాకల్లో తిరిగేవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అధిక జ్వరం, తీవ్ర తలనొప్పి, శరీర బలహీనత, వాంతులు ఈ వ్యాధి లక్షణాలుగా ఉంటాయని, కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చ కూడా కనిపించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత చెప్పారు. పొలాలు, పొదల్లో పనిచేసేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలని, చేతులు, కాళ్లపై కీటక నాశక లోషన్ ఉపయోగించాలని సూచించారు. జ్వరం, శరీర బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని పీహెచ్సీ లేదా ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యులను సంప్రదించాలి. సొంతంగా మందులు కొనుగోలు చేయకుండా, వైద్యులు సూచించిన యాంటీ బయాటిక్స్ను సమయానికి తీసుకోవాలని కోరారు. -
పవర్ ప్లాంట్ ఏర్పాటును విరమించుకోవాలి
బూర్జ: థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోకపోతే ప్రతిఘటన తప్పదని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి సవర సింహాచలం హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం అన్నంపేట పంచాయతీ జె.వి.పురం గిరిజన గ్రామంలో పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ప్రతులను దహనం చేశారు. సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పోరాట కమిటీ సభ్యులు సవర నాగేష్, సింగయ్య, సింహాచలం, గోపాలరావు, బుగ్గన్న, తాతయ్య, మోజేష్, కల్లేపల్లి సింహాచలం, సీడ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం
శ్రీకాకుళం కల్చరల్ : శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య నెలవారీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు–2025 జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎల్.సూర్యలింగం లక్ష్మీనరసమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో యడ్లపాడుకు చెందిన మానవతా నాటక సంస్థ ఆధ్వర్యంలో జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో ‘అందరూ మంచివారే కానీ’ నాటికను చక్కగా ప్రదర్శించారు. పన్నాల నరసింహమూర్తి, నారాయణమూర్తి, రామకృష్ణ సోదరుల సౌజన్యంతో విజయవాడకు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో కె.వి.సత్యనారాయణ రచన, వేంపాటి రమేష్ దర్శకత్వంలో ‘క్రతువు’ నాటిక ఆలోచింపజేసింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, విశ్రాంత ఆర్డీఓ పి.ఎం.జె.బాబు, చిట్టి నాగభూషణం, సురంగి మోహనరావు, సమాఖ్య ప్రతినిధులు చిట్టి వెంకటరావు, పన్నాల నర్సింహమూర్తి, ఎల్.రామలింగస్వామి, రామచంద్రదేవ్, కంచరాన అప్పారావు, ఇంజరాపు రమణారావు, బి.ఎ.మోహనరావు, బి.జ్యోతి, సత్యవతి, బి.ఎన్.భూషణ్, మెట్ట వెంకటరావు, పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రథసప్తమి ఏర్పాట్లపై సమీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి సన్నిధిలో జరగనున్న రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లలో ఎటువంటి లోపం ఉండరాదని కలెక్టర్ స్విప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఉత్సవ నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు రోజుల పాటు ఆస్థాన సేవ, తిరువీధి, స్వామి అలంకరణ, లక్షపుష్పార్చన, సూర్య నమస్కారాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎగ్జిబిషన్ స్టాల్స్, ఫుడ్ కోర్టులు, సైనేజ్ బోర్డులు, ఆహ్వానపత్రాల పంపిణీ, పార్కింగ్ ప్రాంతాల నిర్వహణకు సంబంధించి అధికారులను నామినేట్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, డీఆర్ఓ లక్ష్మణమూర్తి, శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, డీఎంహెచ్ఓ అనిత, సుడా ఈఈ సుగుణాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
దాతలే దిక్కు!
● కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సింధునందన్ ● లివర్ మార్పిడికి రూ.25 లక్షలు అవసరం ● దాతల కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు ఎచ్చెర్ల : ఐదేళ్ల వయసులో ఆటపాటలతో సందడి ఉండాల్సిన ఆ ఇల్లు తీవ్ర నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది. కుమారుడు ప్రాణాంతక సమస్యతో బాధపడుతుండటం, చికిత్సకు లక్షల రూపాయలు అవసరం కావడంతో తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామానికి చెందిన దంపతులు రాము, ధనలక్ష్మీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు ఐదేళ్ల సింధు నందన్ కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. వ్యాధి తీవ్రం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ప్రాణం నిలబెట్టడానికి లివర్ మార్పిడి తప్పనిసరి అని, ఇందుకు రూ.25 లక్షలు వరకు ఖర్చు అవుతుందని తేల్చిచెప్పారు. చిన్నారికి త్వరగా చికిత్స చేసి లివర్ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. రోజురోజుకు చిన్నారి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కూలీ పనులను చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తాము ఇంత సొమ్మును ఎలా తీసుకురావాలో తెలియక విలవిల్లాడుతున్నారు. దాతలే స్పందించి తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. -
లకుల గొప్పలు లితుల తిప్పలు
‘బె ల్టు’ తీసేదెప్పుడో..?బెల్టు షాపులు ఎక్కడికక్కడ పుట్టుకువస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. –8లోఆటో ఎక్కి.. బ్యాగ్ కోసేసిజిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆటో ఎక్కి బ్యాగ్ కోసేశారు. –8లోస్పాట్ లైట్● ముఖం చాటేసిన తల్లిదండ్రులు ● మధ్యాహ్నం 2.30కు భోజనాలు ● విద్యార్థులు 187 మంది.. హాజరైన తల్లిదండ్రులు 10మంది భోజనాలు చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్, టీచర్ సమావేశాలకు తల్లిదండ్రులు ముఖం చాటేశారు. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండడం, కార్యక్రమంపై అయిష్టత కలగలిపి సమావేశ ప్రాంగణాల్లో ఖాళీ కుర్చీలు వెక్కిరించాయి. –నరసన్నపేటగార జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు 340 మంది ఉండగా, శుక్రవారం నిర్వహించిన సమావేశానికి కేవలం 40 మంది మాత్రమే విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. సమావేశం సందర్భంగా అంతా ఆకలితో అలమటించారు. సాధారణంగా స్కూల్లో 12.30కు భోజనాలు పెడతారు. కానీ సమావేశం పుణ్యమా అని 2.30కు భోజనాలు వడ్డించడంతో విద్యార్థులే కాకుండా వచ్చిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు పడ్డారు. –గారస్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 187 మంది విద్యార్థులు చదువుతుండగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కు కేవలం 10 మంది మాత్రమే తల్లిదండ్రులు హాజరయ్యారు. అలుదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ ఇతర పాఠశాలలో జరిగిన సమావేశాలకు సైతం తల్లిదండ్రులు అనుకున్న స్థాయిలో హాజరు కాలేదు. –సారవకోట వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే మెగా మీటింగ్స్ పాలనలో దగా.. ప్రసంగాల్లో ధగ దగా విద్యారంగ పథకాలను నీరుగార్చి ఆర్భాటాలకు ప్రాధాన్యం తల్లిదండ్రుల హాజరు అంతంతమాత్రమే -
భారత దివ్యాంగుల త్రోబాల్ జట్టుకు రామకృష్ణ
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన దివ్యాంగ క్రీడాకారుడు బగ్గు రామకృష్ణ చరిత్ర సృష్టించాడు. శ్రీలంక వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ త్రోబాల్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే భారత దివ్యాంగుల పురుషుల జట్టుకు ఎంపికయ్యాడు. బలగలో నివాసం ఉంటున్న రామకృష్ణ చిన్నప్పుడే పోలియోబారిన పడ్డాడు. క్రికెట్తోపాటు త్రోబాల్ గేమ్లోనూ పట్టుసాధించాడు. చైన్నె వేదికగా ఇటీవల జరిగిన జాతీయ త్రోబాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు బంగారు పతకంతో రాణించడంలో రామకృష్ణ కీలకభూమిక పోషించాడు. దీంతో జాతీయ జట్టుకు ఎంపికచేశారు. ఈ సందర్భంగా రామకృష్ణను జిల్లా దివ్యాంగుల క్రీడా సంఘ చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి శుక్రవారం అభినందించి ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో కోచ్ జి.అర్జున్రావురెడ్డి, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. పొందూరులో దొంగలు హల్చల్ పొందూరు: పొందూరు పట్టణంలో గురువారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసిన రెండిళ్లలో చోరీలకు పాల్పడ్డారు. గాంధీనగర్ మొదటి వీధిలో మాడుగుల లక్ష్మి ఇంట్లో తులం బంగారు గొలుసు, రూ.లక్ష నగదు, వెండి వస్తువులు దొంగిలించారు. లక్ష్మి తన భర్త అనారోగ్యం కారణంగా వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు ఇంటి తాళం పగులకొట్టి సొత్తు దోచుకున్నారు. గాంధీనగర్ రెండో వీధిలో ఎచ్చెర్ల పైడి రాజు ఇంట్లో అర తులం బంగారం, ఏడు తులాల వెండి వస్తువులు దొంగిలించారు. పైడిరాజు కుటుంబం విశాఖపట్నంలోని ఓ ఫంక్షన్కు వెళ్లకు ఈ చోరీకి పాల్పడ్డారు. గాంధీనగర్–2లో పేకల లక్ష్మి హైదరాబాద్లోని తన కుమారుడి వద్దకు ఇటీవల వెళ్లారు. ఆమె ఇంటి తాళం సైతం పగలకొట్టి ఉండటంతో బంధువులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె తిరిగి వచ్చాక చోరీ వివరాలు తెలియాల్సి ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై వి.సత్యనారాయణ కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం క్లూస్టీం వెంటి వేలిముద్రలను సేకరించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని వివిధ హోదాల్లో నియమిస్తూ తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా అఫీషియల్ స్పోక్స్పర్సన్గా బర్ల వేణుగోపాలరావు(నరసన్నపేట), జిల్లా వైఎస్సార్ టీఎఫ్ అధ్యక్షుడిగా జల్లు బలరాంనాయుడు(ఆమదాలవలస), నియోజవకర్గాల వారీగా వైఎస్సార్టీఎఫ్ అధ్యక్షులుగా టి.ధర్మారావు(ఇచ్ఛాపురం), లింగాల సంజీవరావు(పాతపట్నం), ముద్దాడ శంకర్(ఎచ్చెర్ల), నిక్కు రాజశేఖరరావు(నరసన్నపేట), పినకాన వైకుంఠరావు(టెక్కలి), దుద్దు ముత్యాలనాయుడు(శ్రీకాకుళం), పంచాది జనార్దనరావు(ఆమదాలవలస)లను నియమించారు. బూరగాంలో లింఫాటిక్ పరీక్షలు కంచిలి: బూరగాం గ్రామంలో లింఫాటిక్ ఫిలేరియాసిస్ సంక్రమణకు సంబంధించిన పరీక్షలు కంచిలి పీహెచ్సీ వైద్యాధికారి టి.హరిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహింరారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ సూచనల మేరకు 20 ఏళ్ల పైబడిన గ్రామస్తులలో రక్త స్మియర్లు సేకరించారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు మురళి, రవి, ఎల్ఎల్హెచ్పీఎస్ నవ్య, ఆశ, ఏఎన్ఎంలు విద్యావతి, పుష్ప లత, సత్యవతి, సరోజిని, లక్ష్మి పాల్గొన్నారు. జాతీయ స్విమ్మింగ్ పోటీలకు కేజీబీవీ విద్యార్థిని ఇచ్ఛాపురం: జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఇచ్ఛాపురం కేజీబీవీ విద్యార్థిని గుమ్మడి శైలజ ఎంపికై నట్లు ఎస్ఓ శిరీష తెలిపారు. ఈ నెల 12 నుంచి 17 వరకు ఢిల్లీలో జరగనున్న స్కూల్గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయురాలు భారతి తెలిపారు. ఈ మేరకు విద్యార్థినికి ఆలయన్స్ క్లబ్ ప్రతినిధులు శుక్రవారం సురంగి రాజా క్రీడామైదానం ఆవరణలో క్రీడా దుస్తులు, రూ.5వేలు సాయం అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జి.ఉమాశంకర్, కార్యదర్శి వెంకటరావు, ప్రతినిధులు నరసింహమూర్తి, బత్తుల వెంకటరమణ పాల్గొన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ రెవెన్యూ సేవకులకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వారికి వీఆర్వో, అటెండర్, డ్రైవర్ వంటి పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, వీఆర్ఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు అల్లు సత్యనారాయణ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.త్రినాథరావు, కె.రమణమూర్తి డిమాండ్ చేశారు. పే స్కేల్ అమలు చేయాలని, నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, పదోన్నతులు కల్పించాలని, నామినీలను వీఆర్ఓలుగా గుర్తించాలని కోరుతూ శుక్రవారం వీఆర్ఓలు శ్రీకాకుళం ఆర్ అండ్ బీ బంగ్లా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీనిర్వహించి కలెక్టరేట్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.వి.లక్ష్మణమూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు ఎన్.సీతప్పడు, డి.అప్పారావు, కె.కృష్ణ, బి.రాములమ్మ, మీనాక్షి, పద్మావతి, పి.అప్పలస్వామి, లోకనాథం, వెంకటరమణ, రామ్మూర్తి, సీహెచ్.లక్ష్మణరావు, ముకుంద, డి.కేశవ, రమణ తదితరులు పాల్గొన్నారు. ‘కార్గో’ నిర్వాసితులకు మెరుగైన పరిహారం వజ్రపుకొత్తూరు: ఉద్దానం తీర ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న కార్గో ఎయిర్పోర్టు నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందిస్తామని, రైతుల పొట్టకొట్టే పరిస్థితి ఉండదని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎయిర్పోర్టు స్పెషల్ ఆఫీసర్ ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం వజ్రపుకొత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో పలాస ఆర్డీఓ జి.వెంకటేష్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మందికి ఉపాది అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోని కార్గో ఎయిర్పోర్టులో 11ది అవుతుందన్నారు. 1200 ఎకరాలు భూ సేకరణకు నిర్ణయించామని, ఇందులో ప్రభుత్వ భూమి 200 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. రైతుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమికి జిరాయితీ భూమితో సమానంగా పరిహారం అందిస్తామన్నారు. గ్రామాలకు ముప్పు లేనందున ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తించదని స్పష్టం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర కన్నా రెండున్న రెట్లు పరిహారం అందిస్తామని, ల్యాండ్ పూలింగ్ పథకం ఎంచుకుంటే విలువైన భూములు ఎయిర్పోర్టు చుట్టూ ఉన్న ఏరియాలో ఇస్తామన్నారు. సమావేశంలో వి.వి.సీతారామ్మూర్తి, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
నేరడి ఊసెత్తలేదు
● ధాన్యం కొనుగోలుపై అచ్చెన్న నోరు మెదపలేదు ● మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సీఎం చంద్రబాబు శుక్రవారం మెగా పేరెంట్, టీచర్ మీటింగ్లో భాగంగా మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని మండలానికి విచ్చేసినా జిల్లాకు పైసా ఉపయోగం లేదని వైఎస్సార్సీపీ మాజీ మంత్రి, డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వరప్రదాయినిగా ఉన్న వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2లో భాగంగా నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం ఒక్క మాట కూడా చెప్పకపోవడం దారుణమన్నారు. ఒడిశాలో బీజేపీ అధికారంలో ఉందని కూటమిలో భాగస్వామిగా ఉన్న సీఎంతో మాట్లాడి నేరడి బ్యారేజీ నిర్మాణంపై ఉన్న సమస్యను పరిష్కరించలేరా అని ప్రశ్నించారు. సీఎంకు శ్రీకాకుళం, మన్యం జిల్లాలపై, ప్రజలపై ఎంత అభిమానం ఉందో తెలుస్తోందన్నారు. నేరడి బ్యారేజీ విషయంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఒడిశా సీఎంతో మాట్లాడి న్యాయపరమైన అడ్డంకులని కొంతవరకు తొలగించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కూట మి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, ఈ ప్రాంతంలో కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టకపోగా, హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రాజెక్టులు ఆపేయడం దారుణమన్నారు. వ్యవసాయాధారిత జిల్లాగా ఉన్న ప్రాంతంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నా ప్రాజెక్టులు, వ్యవసాయం వంటి సమస్యల కోసం ప్రస్తావించడం లేదని విమర్శించారు. ఈ–క్రాప్ సరిగా చేయకపోవడం వల్ల ఎంతోమంది రైతుల వివరాలు సరిగా లేకపోవడంతో ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావడం లేదని, దీన్ని అదునుగా చూసుకుని దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. పేరుకే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అని పెద్దబాబు, చిన్నబాబులే చక్రం తిప్పుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క గింజ కూడా దళారులకు అమ్మకుండా ప్రభుత్వమే అంతా కొనుగోలు చేసిందన్నారు. -
చదువులు పడకేశాయి
● మెగా పేరెంట్స్ డే పేరిట టీచర్లపై ఒత్తిడి ● ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట: బాబు సర్కార్లో చదువులు పడకేశాయని, బడులు మూత బడుతున్నాయని, ఇవన్నీ కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వం మెగా పేరెంట్స్ సమావేశాలు పేరిట హడావుడి చేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమాలు నిర్వహించేందు కు అవసరమైన డబ్బులు ఇవ్వకుండా ఉపా ధ్యాయులే విరాళాలు సేకరించి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం చెప్పడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశాల వల్ల ప్రయోజనం మాట ఎలా ఉన్నా ఉపాధ్యాయు లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని తెలిపా రు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు నాడు–నేడు పేరిట స్కూళ్లను బాగు చేశారని గుర్తు చే శారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని మ ర్చిపోయిందని తెలిపారు. పాఠశాలల్లో మొండి గోడలు కనిపించడం లేదా.. అని ప్ర శ్నించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్కూల్స్లో ఆర్వో ప్లాంట్లు గతంలో ఏర్పాటు చేశామని, ఇప్పుడవన్నీ మూలకు చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పథకాలకు పేర్లు మాత్రమే మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. -
ముక్కు, చెవులు కోసేశారు
● బంగారం దోచుకుని చంపేశారు ● మురపాక వృద్ధురాలి హత్యపై డీఎస్పీ ప్రకటన శ్రీకాకుళం క్రైమ్/రణస్థలం: లావేరు మండలం మురపాక గ్రామంలో వడ్డీ పార్వతి అనే వృద్ధురాలు హత్యకు గురై బుధవారం బావిలో శవమై తేలిన విషయం పాఠకులకు విదితమే. ఆవులు మేపేందుకు కళ్లం వద్దకు వెళ్లిన వృద్ధురాలిని ఓ ప్రాంతంలో చెవులు, ముక్కు కోసి మరీ బంగారం దోచు కున్నారని, మరో ప్రాంతంలో చంపారని, చివరికి నిర్మానుష్య ప్రాంతంలో, పాడుబడిన బావిలో శవాన్ని పడేశారని డీఎస్పీ సీహెచ్ వివేకానంద అన్నారు. ఇంటి నుంచి కళ్లానికి ఒక కిలోమీటరు, అక్కడి నుంచి పాడుబడిన బావికి ఒక కిలోమీటరే దూరమని అంతా అక్కడే జరిగిందన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. సమీపంలో శనగ చేనుందని, శవాన్ని కాల్చేందుకు కూడా ప్రయత్నించి ఉండవచ్చని, పాడుబడిన బావి ఉన్న విషయం ఎవరికీ తెలియకపోవడంతో అక్కడ పడేశారన్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని డీఎస్పీ పరిశీలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పేకాట బాబుల పనేనా..? ఘటన జరిగిన ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుందని, రణస్థలం, శ్రీకాకుళం టౌన్, ఎచ్చెర్ల, లావేరు పరిధి నాలుగైదు బ్యాచ్లు నిత్యం గంజాయి, మ ద్యం సేవిస్తుంటారని స్థానిక సమాచారం. హత్యకు గురైన వృద్ధురాలు సైతం పేకాట ఆడే బ్యాచ్లను రెండు మూడు సార్లు ఆడవద్దని హెచ్చరించినట్లు డీఎస్పీ వివేకానంద విలేకరులకు తెలిపారు. హత్య వెనుక వారి హస్తం ఉందా అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. సింహద్వారం నుంచి ఎటువెళ్లినట్లు.. ఎచ్చెర్ల కేశవరావుపేట జంక్షన్ సమీపంలో బుధవారం శ్రీకాకుళం నగరానికి చెందిన మహిళ మృతదేహం అనుమానాస్పదంగా బయటపడిన విష యం విదితమే. ఈ కేసుపై అన్ని రకాలుగా ఆరా తీస్తున్నామని డీఎస్పీ సీహెచ్ వివేకానంద వెల్లడించారు. సీసీ ఫుటేజీ పరిశీలించగా ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి సింహద్వారం వరకు వెళ్లినట్లే కనిపించిందని తర్వాత ఏ వాహనంలో వెళ్లిందీ, ఎవరితో వెళ్లిందీ అన్న ఆధారాలు దొరకలేదన్నారు. -
మొరాయిస్తున్న యాప్
సారవకోట: ఈ ఏడాది ధాన్యం కొనుగోలులో రైతులు తీవ్రమైన గందరగోళానికి గురవుతున్నారు. ధాన్యంను రైతులు కళ్లాల నుంచి రైస్ మిల్లులకు వాహనాలతో తీసుకురాడానికి ట్రక్ షీట్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. దీనికి కేటాయించి మొబైల్ యాప్ ఎప్పటికప్పుడు సరిగా పనిచేయక పోవడంతో వాహనాలతో మిల్లుల దగ్గరకి తీసుకొచ్చిన రైతులు చాలా సేపు నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో ఆయా మిల్లులు దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. అదీకాక ప్రభుత్వం 80 కిలోల ధాన్యం బస్తాకు రూ.1895 ధర నిర్ణయించగా మిల్లర్లు వారికి నచ్చిన ధర కడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుడితి, అవలింగి, సారవకోట, బొంతు, అలుదు గ్రామాలలో రైస్ మిల్లులుండగా మిల్లర్లు వారికి నచ్చిన ధరలను నిర్ణయించడంతో పాటు రైతుల నుంచి రెండు నుంచి 4 కిలోలు అదనంగా తీసుకుంటున్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. బొంతు గ్రామానికి చెందిన రైతు సారవకోటలో ఉన్న ఒక మిల్లుకు ధాన్యం తీసుకెళ్లగా బస్తాకు రూ.1100 మాత్రమే చెల్లిస్తానని చెప్పడంతో అవాక్కయ్యాడు. -
ఈ తూతూ మంత్రం!
రైతన్నా మీకోసమే ● తుస్సుమన్న ‘రైతన్నా మీకోసం’ ● నామమాత్రంగా జరిపి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ● కాగితాలకే పరిమితమైన క్లస్టర్ వారీ ఇంటరాక్షన్ ● మొక్కుబడిగా సమావేశాలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రైతులకు సరిగా విత్తనాలు ఇవ్వలేదు. యూరియా కనీసం సరఫరా చేయలేదు. బ్లాక్ మార్కెట్లో రైతులు కొనుగోలు చేసేలా కృత్రిమ కొరత సృష్టించారు. బస్తా యూరియా కోసం రైతులు గొడవలు పడ్డారు. చాలీచాలని ఎరువులతో అగ్రికల్చర్ అసిస్టెంట్లు చేతులేత్తేశారు. ఇందులో కూడా టీడీపీ నాయకులు చేతివాటం ప్రదర్శించారు. రైతులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ సిబ్బందే కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. అంతే కాదు వాయుగుండం ఎఫెక్ట్తో నష్టపోయిన పంటను గుర్తించలేదు. మోంథా తుఫాన్ బీభత్సానికి జరిగిన నష్టాన్ని ఆంక్షలు, నిబంధనల పేరుతో లెక్కించలేదు.. ఇన్ని వైఫల్యాలు వెక్కిరిస్తుంటే.. ప్రభుత్వం ‘రైతన్నా మీకోసం’ అంటూ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కానీ రైతు వద్దకు వెళ్తే నిలదీస్తారనుకున్నారేమో అధికార పక్ష నేతలే కార్యక్రమాన్ని తుస్సుమనిపించేశారు. రైతా సేవా కేంద్రాల్లో ప్రతి సారి జరిగే సమావేశాలనే రైతన్నా మీకోసం సమావేశంగా మార్చేసి మమ అనిపించేశారు. రైతులు బిజీగా ఉన్న వేళ.. రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం నానా అవస్థలు పడ్డారు. అల్పపీడనాలు, వాయుగుండం, తుఫాన్లతో పంటకోసే దశలో, చేతికొచ్చిన సమయంలో నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకుంటుందేమో అని ఎదురు చూశారు. 33 శాతం కంటే ఎక్కువ నష్టపోలేదని ముందే అంచనాల నుంచి తీసేశారు. మిగతా కొంత నష్టపోయినట్టుగా గుర్తించినా ఇంతవరకు పరిహారం అందించకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. అన్నదాత సుఖీభవ సాయం కూడా కొందరికే పరిమితం చేశారు. రకరకాల కొర్రీలతో ఇవ్వకపోవడంతో రైతులు మండి పడుతున్నారు. పోనీ, చేతికొచ్చిన పంటైనా సకాలంలో కొనుగోలు చేస్తుందా? అంటే అదీ లేదు. దీంతో ప్రభుత్వం తీరుతో రైతులు చిర్రెత్తిపోతున్నారు. పాలకులు దగ్గరకొస్తే నిలదీద్దామని, నిర్లక్ష్యాన్ని కడిగే పారేద్దామని చూశా రు. కానీ, కూటమి ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరించింది. కోతల దశలో, పంట అమ్ముకునే సమయంలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం నిర్వహించింది. రైతులు బిజీగా ఉంటారని, పెద్దగా ప్రతిఘటన ఉండదని, పెద్దగా రారని, సమయం చూసు కుని కార్యక్రమాన్ని మొక్కుబడిగా పెట్టింది. దీంతో రైతన్నా మీకోసం కార్యక్రమానికి రైతులే కరువయ్యారు. దీంతో అందుబాటులో ఉన్న అనుకూల రైతులతో కార్యక్రమాన్ని కానిచ్చేశారు. అది కూడా అధికారుల నియంత్రణలో ఉండే రైతు సేవా కేంద్రాల్లో నిత్యం జరిగే సమావేశాన్ని రైతన్నా మీకోసం సమావేశంగా మార్చేసి మమ అనిపించేశారు. అధికార పార్టీ నేతలే సీరియస్గా తీసుకోలేదు. నవంబర్ 27డిసెంబర్ 2 -
ఎనిమిది చోరీలు
ముగ్గురు యువకులు.. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని దేవాలయాల్లో రాత్రి పూట చోరీలు చేసిన ముగ్గురు టీనేజీ యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. గార పోలీస్స్టేషన్ పరిధిలో 3, శ్రీకాకుళం రూరల్లో 3, ఒకటో పట్టణంలో 1, నందిగాం పీఎస్ పరిధిలో ఓ చోట కలిపి మొత్తం 8 చోరీల్లో రూ.1.72 లక్షల విలువైన 654.46 గ్రా ముల వెండి, 30 కిలోల కంచు, 2 కిలోల రాగి వస్తువులు వీరు దొంగిలించారు. బుధవారం మధ్యా హ్నం రూరల్ ఎస్ఐ కరక రాముకు ద్విచక్రవాహనంపై యువకులు వెళ్తున్నారన్న సమాచారం రావడంతో అంపోలు ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీద సిబ్బందితో మాటు వేసి పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం డీఎస్పీ సీహెచ్ వివేకానంద విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇవే చోరీలతో సంబంధమున్న మరో యువకుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. పదో తరగతిలో వ్యసనాలు.. మైనర్లుగా చోరీలు.. శ్రీకాకుళం మండలం కల్లేపల్లి పంచాయతీ జాలారిపేటకు చెందిన ఎరుపల్లి అశోక్ (20), గార మండలం బలరాంపురానికి చెందిన చోడిపల్లి వంశీ(20) పదోతరగతి వరకు కలసి చదివారు. చెడు వ్యసనాల బారిన పడ్డారు. చేతి ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో మైనర్గా ఉన్నప్పుడే 2021 నుంచి అశోక్ చోరీలను మార్గంగా ఎంచుకున్నాడు. ఏకంగా 9 చోరీలు చేశాడు. ఆమదాలవలసలో ద్విచక్రవాహనాల చోరీ కేసులో జైలుకు వెళ్లడంతో అక్కడ ఆమదాలవలస తోటాడ గ్రామానికి చెందిన బెండి శివప్రకాష్(22) పరిచయమయ్యాడు. శివప్రకాష్ కూ డా మైనరుగానే ఉన్నప్పుడు 2021లో చోరీలు మొదలుపెట్టి జిల్లాలో ఐదు చోరీలు చేశాడు. జైలు నుంచి జనవరిలో విడుదలైన అశోక్, శివప్రకాష్లు బయట ఉన్న వంశీ, మరో యువకుడితో కలసి చోరీల బాట మళ్లీ పట్టారు. షిరీడీ సాయిబాబా ఆలయంలో చోరీ.. శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దగనగళ్లవానిపేట షిరిడీ సాయిబాబా ఆలయంలో ఈ ఏడాది జూలై 26న గుర్తు తెలియని వ్యక్తులు వెండి కిరీటాలు, ఇత ర వస్తువులు చోరీ చేయడంతో చింతపల్లి గోపాలకృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ ఏఎ స్పీ పి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో సీఐ పైడపునాయుడు, ఎస్ఐ రాము దర్యాప్తు మొదలుపెట్టారు. యువకులపై అనుమానం రావడం బుధవారం పట్టుకున్నారు. గురువారం రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ. 1.71 లక్షల సొత్తు రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఆలయాల్లో దొంగతనం చేస్తున్న ముగ్గురు టీనేజర్ల అరెస్టు పదో తరగతిలోనే వ్యసనాలు.. మైనర్లుగా చోరీలు రూ.1.71 లక్షల విలువైన వెండి, ఇత్తడి, రాగి కంచు వస్తువులు స్వాధీనం -
ప్రియాంకకు ఉద్యోగ నియామక పత్రం అందజేత
● ‘కారుణ్యానికి కష్టమే’ అన్న సాక్షి కథనానికి స్పందించిన సీఎండీ పృథ్వీతేజ్ ● కేంద్ర మంత్రి సిఫారసును పక్కన పెట్టి బాధితురాలికి న్యాయం చేసిన వైనం అరసవల్లి: భర్తను కోల్పోయిన బాధితురాలికి న్యాయం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన రఘుపాత్రుని ప్రియాంకకు విద్యుత్ విజిలెన్స్ విభాగంలోనే రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఇస్తూ నియా మక పత్రాన్ని గురువారం అందజేశారు. ఈ మేర కు గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన ‘కారుణ్యానికి కష్టమే..!’ అన్న కథనంతో విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పృథ్వీతేజ్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కేవీ రామకృష్ణప్రసాద్ స్పందించారు. షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తూ అకాల మరణం చెందిన పోరం విజయ్ శేఖర్ భార్య రఘుపాత్రుని ప్రియాంకకు ఉద్యోగాన్ని వెంటనే ఇవ్వాలంటూ స్థానిక సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తికి గురువారం ఉదయానికే ఆదేశించడంతో అందుకు తగినట్లుగా ఎస్ఈ ఆగమేఘాల మీద ప్రియాంకకు ఉద్యోగ నియామకపత్రాన్ని అందేలా చర్యలు చేపట్టారు. వాస్తవానికి ఈ ఉద్యోగం బాధితురాలు ప్రియాంకకు కాకుండా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సిఫారసు లేఖతో ఉద్యోగాన్ని తమ వారికి ఇప్పించే లా ప్రయత్నించిన విజిలెన్స్ సిబ్బంది ఆటలు సాగలేదు. ‘సాక్షి’లో కథనం రావడంతో విద్యుత్ ఉన్నతాధికారులు సీఎండీ పృథ్వీతేజ్, సీవీఓ రామకృష్ణప్రసాద్లు ఆదేశాల మేరకు కాంట్రాక్టు ఫైల్మీద సంతకాలు చేసి ఆమెకు ఉద్యోగాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు పంపిణీ చేశారు. బాధితుల పక్షాన నిలిచిన ‘సాక్షి’ పత్రికా యాజమాన్యానికి తాను రుణపడి ఉంటానని ప్రియాంక కృతజ్ఞతలు తెలియజేశారు. -
కష్టాలు కొనసాగుతున్నాయి
● యూరియా కోసం రైతులు, మహిళలు పడిగాపులు ● ఊరిలో రైతు సేవా కేంద్రం ఉన్నా నాలుగు కిలోమీటర్ల దూరం రాక రణస్థలం: స్వగ్రామంలో రైతు సేవా కేంద్రం ఉన్నా నాలుగైదు కిలోమీటర్ల దూరం వ్యయ ప్రయాసలతో రైతులు వచ్చి యూరియా బస్తా కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రణస్థలం–1, కొండములగాం, బంటుపల్లి రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్న రైతులు రణస్థలం మండల కేంద్రంలోని రైతు సేవా సహకార బ్యాంక్ (ఎఫ్ఎస్సీఎస్)కు వచ్చి ప్రభుత్వ ధర రూ. 280లు వెచ్చించి ఐదు గంటలకు పైగా పడిగాపులు కాసి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం రైతు లు నానా ఇబ్బందులు పడ్డారు.రబీలోనూ అదే పరి స్థితి పునరావృతమవుతోంది. గురువారం రణస్థ లం ఎఫ్ఎస్సీఎస్ బ్యాంకు వద్ద ఖరీఫ్ దృశ్యమే కనిపించింది. ఊరిలో రైతు సేవా కేంద్రాలు ఉన్న అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర రశీదు తీసుకు ని ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న సహకార బ్యాంకు వద్దకు పంపించారని రైతులు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇంతగా ఇబ్బంది పడలేదని చెబుతున్నారు. ఇప్పటిౖకైనా స్వగ్రామంలో యూరి యా, ఎరువులు అందజేయాలని రైతులు కోరుతున్నారు. గ్రామాల్లో ఇస్తే తోపులాట అవుతుందని ఒక వ్యవసాయ అధికారి చెప్పడం గమనార్హం. -
కొన్ని ఘటనలు..
● సిక్కోలును వణికిస్తున్న మహిళల హత్యోదంతాలు ● రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి ● మహిళలే లక్ష్యంగా దాడులు శ్రీకాకుళం క్రైమ్: జిల్లాలో వరుస హత్యోదంతాలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మహిళలు మృతి చెందడం శాంతిభద్రతలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. నిరంతరం పెట్రోలింగ్, పల్లెల్లో అసాంఘిక శక్తులపై నిఘా, మహిళల భద్రతే లక్ష్యంగా శక్తి యాప్.. ఇలా పోలీసు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనే తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి. పశువుల్ని మేపేందుకు వెళ్లిన వృద్ధురాలు హత్య, ఆస్పత్రికని బయల్దేరిన మహిళ జాతీయ రహదారి పక్కనే శవంగా తేలడం వంటి ఘటనలు 48 గంటల్లో చోటు చేసుకోవడం నిఘా వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. బయటకు వెళ్లాలంటే భయమే.. ప్రశాంత సిక్కోలులో మహిళలపై జరుగుతున్న దాడులు, దారుణాలు కలవరపెడుతున్నాయి. ఓ వైపు జిల్లావ్యాప్తంగా వరికోతలు, నూర్పులు ముమ్మరంగా జరుగుతుండటంతో రైతులంతా పంట పొలాలు, కల్లాల్లో పనులతో బిజీగా గడుపుతున్నారు. ఇటువంటి సమయాల్లో ఇంట్లో నుంచి ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఎక్కడికక్కడ దుకాణాలు, ఊరూరా బెల్టు షాపులు వెలిశాయి. విచ్చలవిడిగా మద్యం దొరకడం, పూటుగా తాగిన మైకంలో దారుణాలకు తెగబడుతుండటం ఒక కారణం కాగా.. యువత గంజాయి మత్తులో పడి దారుణాలకు ఒడిగడుతుండటం మరో కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్ని విజిట్ చేయండి.. ప్రతి రోజూ గ్రామాల్ని విజట్ చేయండి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టండి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపండి. –ఇటీవల జరిగిన రివ్యూలో ఎస్పీ మహేశ్వర రెడ్డి క్షేత్ర స్థాయిలో మాత్రం పోలీసు సిబ్బంది అంతగా పర్యటించడం లేదనేందుకు ఈ రెండు ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. గ్రామాల్ని విజిట్ చేస్తే ఈ రెండు ఘటనలూ జరిగేవే కాదంటున్నారు స్థానికులు. ప్రశ్నార్థకంగా మారిన మహిళల భద్రత ఈ ఏడాది మార్చిలో నరసన్నపేట బొంతలవీధికి చెందిన గున్నమ్మ(85) అనే వృద్ధురాలిని వివస్త్రగా చేసి మరీ కిరాతకంగా హత్య చేశారు. వ్యసనాల బారిన పడిన ఓ బాలుడు వృద్ధురాలు ధరించిన తులం బంగారు ఆభరణాల కోసమే హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. జిల్లా కేంద్రంలోని న్యూకాలనీలో పొందూరుకు చెందిన 52 ఏళ్ల వివాహితను పరిచయమున్న యువకుడే రూమ్కు పిలిపించు కుని మరీ హత్య చేశాడు. మద్యంమత్తులో ఉన్న యువకుడు మహిళ ధరించిన బంగారం దోచు కునేందుకు యత్నించగా ఆమె ప్రతిఘటించడంతో తలగడను ముఖంపై ఊపిరాడకుండా ఉంచి హత్య చేశాడని నిర్ధారించారు. ఆ యువకుడికి విపరీతంగా గంజాయి తాగే అలవాటుందని స్థానికులు చెప్పడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో జిల్లాకేంద్రంలోని బాలాజీనగర్లో వృద్ధురాలిని బెదిరించి చైన్ దొంగిలించారు. కవిటి మండలం వింద్యగిరి సమీపంలో నాలుగురోడ్ల కూడలి వద్ద ఓ మహిళా ఉపాధ్యాయురాలి తలపై రాయితో దాడి చేసి బంగారాన్ని కాజేసే ప్రయత్నం చేశారు. వజ్రపుకొత్తూరు మండలంలో ఓ మహిళను హత్య చేసి బంగారాన్ని దోచుకున్నారు. -
నడిపించే కొడుకుండగా..
● కళ్లు లేకుంటేనేం.. తల్లిదండ్రులకు చూపు లేకపోయినా దారి చూపేందుకు నేనున్నానంటూ ఆ కుమారుడు ముందుకొచ్చాడు. బుధవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతులు దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు దగ్గరుండి తీసుకెళ్లాడు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రజాప్రతినిధుల ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. నగరానికి చెందిన అంధ దంపతులు రాజు, జ్యోతి, వారి కుమారుడు సాల్మన్రాజ్లను ఇక్కడి చిత్రంలో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం -
కారుణ్యానికి కష్టమే!
న్యాయం చేయండి... నవంబర్ 17 నుంచి 30 వరకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ నెల 1న విధుల్లో చేరాలని చెప్పారు. కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా సిద్ధం చేశారు. తీరా వెళ్తే..కాంట్రాక్ట్ పేపర్పై సంతకం చేయలేమని, పైన ఒత్తిళ్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగం ఇంకో వ్యక్తికి ఇస్తున్నారని తెలిసింది. ఇది అన్యాయం. – రఘుపాత్రుని ప్రియాంక, బాధితురాలు అరసవల్లి: విద్యుత్ శాఖలో ‘పవర్’ ఉన్నోడిదే రాజ్యంలా మారింది. ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబంలో భార్యకు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగం విషయంలో కొందరు అక్రమార్కులు విషం చిమ్ముతున్నారు. దీనికి ఊతమిస్తున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా సిఫారసు లేఖలు ఇవ్వడంతో బాధితురాలు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం రూరల్ మండలం భైరి విద్యుత్ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తూ పోరం విజయ్ శేఖర్ అనే ఉద్యోగి ఈ ఏడాది మే 23న గుండెపోటుతో మృతి చెందారు. ఐదేళ్ల కుమార్తెతో జీవనం కష్టంగా భావించిన మృతుడి భార్య రఘుపాత్రుని ప్రియాంక.. భర్త పనిచేసిన విద్యుత్ శాఖలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. నేరుగా విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ పృథ్వీతేజ్ వద్ద మొరపెట్టుకుంది. కుటుంబ పరిస్థితులపై స్పందించిన ఆయన.. శ్రీకాకుళం సర్కిల్ కార్యాలయ విజిలెన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న సహాయకుల పోస్టులో నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి కూడా సీఎండీ ఆదేశాల మేరకు గత నెలాఖరున పదవీ విరమణ చేసిన రికార్డు అసిస్టెంట్ ధనలక్ష్మి స్థానంలో ప్రియాంకను నియమించేలా చర్యలు చేపట్టారు. గత నవంబర్ 17 నుంచి 30 వరకు ప్రియాంకకు వర్క్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. డిసెంబర్ 1 నుంచి విధులకు తగినట్లు వర్క్ కాంట్రాక్టును సిద్ధం చేయాలని లేబర్ కాంట్రాక్టర్కు సూచించారు. ఈ మేరకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కూడా సిద్ధమైంది. తీరా ఈ నెల 1న విధుల్లోకి చేరేందుకు విజిలెన్స్ కార్యాలయానికి వెళ్లిన ప్రియాంకకు ఉద్యోగం ఇవ్వడంపై ఇంకా స్పష్టత రాలేదని సిబ్బంది చెప్పడంతో విస్తుపోయింది. ఇదే ఉద్యోగం విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఓ పోలీసు కుటుంబసభ్యునికి ఇప్పిస్తున్నట్లు తెలియడంతో కన్నీటి పర్యంతమైంది. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు సిఫారసు లేఖతో ఓ వ్యక్తి ఉద్యోగంలో చేరేందుకు రంగం సిద్ధం చేశారని బాధితురాలు వివరించింది. దీంతో సీఎండీ ఆదేశాలను సైతం బేఖాతరు చేసినట్లయ్యింది. మరణించిన షిఫ్ట్ ఆపరేటర్ భార్యకు ఉద్యోగమివ్వాలన్న సీఎండీ సీఎండీ ఆదేశాలు బేఖాతరు చేస్తూ కేంద్రమంత్రి సిఫారసుతో మరో వ్యక్తికి ఉద్యోగమిచ్చేలా చర్యలు చక్రం తిప్పుతున్న విద్యుత్ శాఖ విజిలెన్స్ ఉద్యోగి విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతరత్రా సెమీ స్కిల్డ్ ఉద్యోగాలను తమవారికి కట్టబెట్టేలా సర్కిల్ విజిలెన్స్ విభాగంలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న ఓ పోలీసు ఉద్యోగి అంతా తానై వ్యవహారం నడిపిస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి గరిష్టంగా రూ.3 లక్షలకు పైగా వసూలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అక్రమాల వ్యవహారాలను నిగ్గుతేల్చాల్సిన విజిలెన్స్ విభాగంలోనే అక్రమార్కులుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చక్రం తిప్పుతున్న విజిలెన్స్ ఉద్యోగి..! -
పుణ్యక్షేత్రాల జాబితా సిద్ధం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పుణ్యక్షేత్రాల జాబితాను వారం రోజుల్లో సిద్ధం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దేవదాయ శాఖ ఈఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ బంగ్లాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, జాతర వివరాలను సిద్ధం చేయాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి రథసప్తమికి వచ్చే భక్తులు జిల్లాలో ఇతర పుణ్య క్షేత్రాలనూ సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బుడితి వస్తువుల మార్కెటింగ్కు చర్యలు సారవకోట: బుడితిలోని కంచు, ఇత్తడి గృహోపకరణాల మార్కెటింగ్కు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. బుధవారం బుడితిలో లేపాక్షి ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త తరానికి అవసరమైన నూతన గృహోపకరణాలు తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, తహశీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ మోహన్కుమార్, ఈఓపీఆర్డీ అప్పన్న పాల్గొన్నారు. తాళ్లవలస గ్రామస్తులకు రక్త పరీక్షలు సంతబొమ్మాళి: తాళ్లవలసలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో బుధవారం 50 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగిటివ్గా వచ్చిందని దండుగోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గంగాధర్ విశ్వనాథ్ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. డయేరియా పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు వైద్య శిబిరం కొనసాగుతుందన్నారు. లా కోర్సు స్పాట్ అడ్మిషన్లు వాయిదా ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల లా కోర్సులో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 4న జరగాల్సిన స్పాట్ అడ్మిషన్ ప్రక్రియను వాయిదా వేసినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ బి.అడ్డయ్య బుధవారం తెలిపారు. వాస్తవానికి, గురువారం విద్యార్థుల సర్టి ఫికెట్ల పరిశీలన పూర్తిచేయాల్సి ఉందని, అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు చెప్పారు. తదుపరి తేదీ తర్వాత ప్రకటిస్తామని, విద్యార్థులు గమనించాలని కోరారు. ఆరడుగుల ‘ఈల్ ఫిష్’ పోలాకి: గుప్పెడుపేట సముద్ర జలాల్లో వేటకు వెళ్లిన మత్స్యకారులకు బుధవారం ఆరడుగుల పొడవైన అరుదైన ఈల్ఫిష్ చిక్కింది. పాముని పోలి ఉండటంతో మార్కెట్లో అమ్మకానికి తీసుకెళ్లబోమని మత్స్యకారులు తెలిపారు. ఎంగ్విలా అనే శాసీ్త్రయనామం కలిగిన ఈ చేపను కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆహారంగా తీసుకుంటారని ఫిషరీష్ అసిస్టెంట్ హెచ్.ఢిల్లీశ్వరరావు తెలిపారు. -
ఆక్రమణలో ఆదిత్యుని ఇనాం భూములు
● భూముల సర్వేతో వెలుగులోకి ● చేతులు మారిన 35.22 ఎకరాలు అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ఇనాం భూములు ఆక్రమణకు గురయ్యాయి. సర్వీస్ ఇనాం కింద దశాబ్దాల కాలం క్రితం ఇచ్చిన భూములన్నీ ప్రస్తుతం సర్వీసుదారుల వద్ద లేవని, అక్రమంగా క్రయవిక్రయాలు జరిగినట్లు దేవదాయ శాఖ, రెవెన్యూ శాఖ, సర్వే శాఖల సిబ్బంది సంయుక్తంగా గుర్తించారు. సూర్యదేవాలయ ఇనాం సర్వీస్ కింద అప్పట్లో సన్నాయి కళాకారులకు, దివిటి మోపరులకు, కీర్తనల సిబ్బంది, వేదపారాయణదారులకు 35.22 ఎకరాల విస్తీర్ణంలో భూములు కేటాయించారు. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు బుధవారం జిల్లా దేవదాయ శాఖాధికారి/సహాయ కమిషనర్ బి.ఆర్.వి.వి.ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో తహశీల్దార్ గణపతిరావు, సర్వేయర్లు ప్రియ, దుర్గాప్రసాద్ల బృందం మొత్తం 17 సర్వేనంబర్లలో ఉన్న భూములను పరిశీలించారు. అరసవల్లి గ్రామానికి ఆనుకుని ఇనాం భూముల్లో భారీ భవంతులు వెలిశాయని, అపార్ట్మెంట్ల నిర్మాణాలు జరిగాయని, భూములన్నీ సర్వీసుదారుల నుంచి చేతులు మారాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో భూముల ప్రస్తుత పరిస్థితిని నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు. ఈ పరిశీలనలో ఇన్స్పెక్టర్ ప్రసాద్బాబు, పలు ఆలయాల ఈవోలు ప్రభాకరరావు, సర్వేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ బాలసాయి తదితరులు పాల్గొన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అరసవల్లి ఆలయ ఇనాం భూములను పరిశీలించాం. కొన్నిచోట్ల నిర్మాణాలుంటే, మిగిలిన చోట వరిపంటలున్నాయి. ఈ వివరాలను అధికారిక ఫార్మాట్లో సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తాం. తదుపరి మంత్రివర్గ నిర్ణయాల మేరకు చర్యలు చేపడతాం. – ప్రసాద్ పట్నాయక్, జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ -
నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళం నగరంలోని సుందరయ్య భవనంలో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ కోనారి మోహన్రావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై నిర్బంధం ఎత్తివేయాలని.. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రం, సభలు, సమావేశాలు పెట్టుకునే హక్కును కాపాడాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అక్రమ అరెస్టులు ఎందుకు..? వామపక్ష ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ప్రజా ఉద్యమాలపై ఎందుకు నిర్బంధం ప్రయోగిస్తున్నారని జిల్లా మంత్రులను ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్, థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని కోరుతూ ధర్నాకు పిలిపిస్తే అక్రమ అరెస్టులకు ఎందుకు పాల్పడ్డారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతాన్ని అదానికి కట్టబెట్టి.. ఒకవైపున కార్గో ఎయిర్పోర్టు.. ఇంకొక వైపున థర్మల్ పవర్ ప్లాంట్తో జిల్లాలో ఎందుకు విధ్వంసానికి పూనుకుంటున్నారో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు, ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకుడు వాబ యోగి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, పౌర హక్కుల సంఘం నాయకులు కేవీ జగన్నాథం, థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు సవర సింహాచలం, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె.నాగమణి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పోలాకి ప్రసాదరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ తదితరులు పాల్గొన్నారు. -
● ఇండియన్ నేవీలో సేవలందించిన సిక్కోలు నావికులు ● సాగరంలో ఘటనలకు ప్రత్యక్ష సాక్షులు
సాహసమే శ్వాసగా..!సముద్రపు గాలులు శరీరాన్ని బలంగా తాకుతున్నా.. సరిహద్దు రేఖలు కంటికి కనిపించని చోట వారు గస్తీ కాస్తారు. కడలి ఘోషకే ఒళ్లు జలదరించే అనంత జలనిధిలో దేశంలోకి శత్రువు ప్రవేశించకుండా అడ్డుగోడగా నిలుస్తారు. నౌకల్లో కడలి నలువైపులా తిరుగుతూ అనుక్షణం దేశ రక్షణలో తలమునకలై ఉంటారు. వారే మన నావికులు. జిల్లాలోని నావికాదళంలో పనిచేసిన వారు వందల్లో ఉన్నారు. గురువారం నేవీ డే పురస్కరించుకొని మాజీ నావికా దళ ఉద్యోగులను సాక్షి పలకరించింది. – సాక్షి కల్చరల్ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది చాలా పెద్ద విమాన వాహక నౌక. అందులో రెండేళ్ల ఆరుమాసాలు ఉన్నాను. దాని మీద 13 డెక్లు ఉండేవి. వాటిపై యుద్ధ విమానాలు, హెలీకాఫ్టర్లు ఉండేవి. ఆపరేషన్ సమయాల్లో సీఆర్ఏ ఫైరింగ్ చేసేటప్పుడు.. కదులుతున్న నౌక నుంచి టార్గెట్ను ఫైర్ చేయడం చాలా అద్భుతంగా అనిపించేది. షిప్లో న్యూక్లియర్ డిఫెన్స్ కూడా ఉండేది. 15 ఏళ్ల పాటు దేశానికి సేవలు అందించాను. దేశానికి సేవ చేయడం ఒక గొప్ప అనుభూతి. – మల్లిపెద్ది కిరణ్కుమార్, విశ్రాంత నేవీ అధికారి జిల్లా మాజీ సైనికుల సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీన శ్రీకాకుళం నగరంలో నేవీ డే వేడుకలు నిర్వహించనున్నారు.నేవీలో 15 ఏళ్లు సేవలు అందించాను. అందులో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. భయంకరమైన సునామీ సమయంలో బతుకుమీద ఆశపోయింది. మరుసటి రోజు చైన్నెకి షిప్ వచ్చేసరికి పూర్తిగా డెడ్బాడీలు తేలుతున్నాయి. ఆ సమయంలో ఇంటికి ఫోన్ చేసేందుకు శాటిలైట్ ఫోన్ ఉపయోగించాము. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ట్రింకోమలె (శ్రీలంక) వాళ్లకి రైస్, గోధుమ పిండి అందించాము. షిప్లో ఇంగ్లాండ్, జర్మనీ, రష్యా, అండమాన్, నికోబార్ వంటి 20 దేశాలు తిరిగాం. ఐఎన్ఎస్ వాల్సురా (గుజరాత్)లో శిక్షణ ఇచ్చారు. తర్వాత ఇన్కుల్–33 (అండమాన్, నికోబార్), ఐఎన్ఎస్ బీస్ (ముంబాయి), ఐఎన్ఎస్ సుకన్య (విశాఖ), ఐఎన్ఎస్ కొట్టబొమ్మన్ (కన్యాకుమారి) షిప్పుల్లో పనిచేశాను. ప్రస్తుతం ఏపీజీవీబీలో క్యాష్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. – సువ్వారి శ్రీధర్, ఫరీదుపేట, విశ్రాంత ఎలక్ట్రికల్ పెటీ ఆఫీసర్, నేవీ నేను వైద్యుడిగా దేశం కోసం పోరాడుతున్న నావెల్ ఉద్యోగులు ఎంతో మందికి ఆరోగ్య సేవలందించాను. సముద్ర సేతు ఆపరేషన్లో భాగంగా మిడిల్ ఈస్ట్ నుంచి కరోనా సమయంలో ప్రవాస భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకుని రావడం జరిగింది. సెకండ్ వేవ్లో ఆక్సిజన్ సప్లయ్ గొలుసును నిర్వహించేందుకు, ఆక్సిజన్ క్యారియర్ కొరతను నివారించేందుకు సౌత్ఈస్ట్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఆక్సిజన్ క్యారియర్స్ను యుద్ధప్రాతికన మన దేశానికి తీసుకొచ్చాం. 2023 లో తమిళనాడు తీరప్రాంతంలో ఆయిల్ రిగ్లో చిక్కుకున్న ఉద్యోగులను సురక్షితంగా కాపాడాను. అనేక అత్యవసర వైద్య సేవలు నడి సంద్రంలో అందించడం మరిచిపోలేని జ్ఞాపకం. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ సర్వీసులో చేరాను. – డాక్టర్ సతీష్ మెర్రి, విశ్రాంత నేవీ డాక్టర్, తీమర, పాతపట్నం రష్యాలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య తయారీ సమయంలో రెండేళ్లు అక్కడే ఉన్న అనుభూతి మర్చిపోలేనిది. 2004లో టోక్యో వెళ్లే సమయంలో తైఫూన్ తుఫాను సమయంలో సముద్ర అలల మధ్య అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో రెండు రోజులు భయంగా సముద్ర ప్రయాణం సాగింది. 2014లో ట్రోపెక్స్లో భాగంగా 26 రోజుల పాటు ఏకధాటిగా సముద్ర ప్రయాణం చేయడం జరిగింది. ఇవి నాకు ఎదురైన మర్చిపోలేని అనుభవాలు. – పైడి వేణుగోపాలరావు, విశ్రాంత నేవీ అధికారి -
ప్రసవ వేదన..!
ప్రయోజనానికి..● మాతృవందనం నమోదుకు అవస్థలు ● సక్రమంగా పనిచేయని సెల్ఫోన్లు ● ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీ టీచర్లుశ్రీకాకుళం అర్బన్: జిల్లాలో ప్రధానమంత్రి మాతృవందన యోజన(పీఎంఎంపీవై) అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. సర్వర్తో పాటు సెల్ఫోన్లో సాంకేతిక కారణాలతో గర్భిణులు, నవజాత శిశువుల వివరాల నమోదు అరకొరగానే సాగుతోంది. జిల్లాలో నేటి వరకు కేవలం 22,400 మంది లబ్ధిదారులకు మాత్రమే ఎన్రోల్మెంట్ చేశారు. అందులో కేవలం 2,600 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. మిగతా వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరోపక్క పీఎంఎంపీవై నమోదుకు ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో అంగన్వాడీ టీచర్లు తలలు పట్టుకుంటున్నారు. మొదటి కాన్పుకు రూ.5 వేలు మాతృ వందనం పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన మహిళలు గర్భం దాల్చే సమయంలో, బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో పోషకాహారం, మందుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. మొదటి కాన్పు అయితే వారి బ్యాంక్ ఖాతాలో రూ.5 వేలు జమ చేస్తుంది. అందులో భాగంగానే గర్భిణీగా నమోదు చేసుకున్న సమయంలో రూ.1,000లు, బిడ్డ జన్మించినప్పుడు రూ.2 వేలు, బిడ్డకు టీకాలు వేసే సమయంలో మరో రూ.2 వేలు అందిస్తారు. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే మరో రూ.6 వేలు జమ చేస్తారు. అరకొరగానే నమోదు మాతృ వందనం పథకం అమలు కోసం ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని కొందరు సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. వారు మరికొందరి అంగన్వాడీ టీచర్లకు తర్ఫీదు ఇచ్చారు. వారి ద్వారా అంగన్వాడీ సెంటర్లకు చెందిన టీచర్లు తమ వద్ద ఉన్న సెల్ఫోన్లలో యాప్లు డౌన్లోడ్ చేసుకొని లబ్ధిదారుల వివరాలు నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్ఫోన్లతో పాటు తమ వద్ద ఉన్న సెల్ఫోన్ల ద్వారా సైతం వివరాల నమోదు కోసం ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు. సర్వర్తో పాటు సెల్ఫోన్లోని సాంకేతిక కారణాల వలన అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీ సెంటర్లలోని రొటీన్ పనులను పక్కనబెట్టి సెల్ఫోన్లతో కుస్తీ పడుతున్నా గర్భిణులు, నవజాత శిశువుల నమోదు అరకొరగానే జరుగుతోంది. లబ్ధిదారుల ఎదురుచూపు జిల్లాలో పెద్ద సంఖ్యలో గర్భిణులు మాతృ వందనం పథకం కింద అందే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నుంచి వైద్యశాఖ నుంచి సమగ్ర శిశు సంక్షేమ శాఖకు బదలాయించింది. ఇప్పటికే పలు యాప్లతో పనిభారం పెరిగి ఇబ్బందులు పడుతున్నామని, నూతన బాధ్యతలు తలకుమించిన భారం అయ్యాయని అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. సక్రమంగా పనిచేయని సెల్ఫోన్లతో ఉన్న యాప్లకు తోడు మాతృవందన యోజన పథకం కింద అదనంగా వచ్చిన యాప్తో ఎలా వివరాలు నమోదు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 0ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం నమోదు కార్యక్రమం గతంలో హెల్త్ వర్కర్లు చేసేవారు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకు యాప్లో నమోదు చేయమని చెబుతున్నారు. దీనికి సంబంధించిన శిక్షణ ఇవ్వలేదు. సెల్ఫోన్లు ఈ యాప్కు సపోర్ట్ చేయడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుస్తీ పడితే ఒకరిద్దరి వివరాలు నమోదు చేయడం కష్టంగా ఉంది. సూపర్వైజర్లు మాత్రం టీచర్లపై ఒత్తిడి తెస్తున్నారు. యాప్పై వెంటనే శిక్షణ ఇవ్వాలి. సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి. – కె.కల్యాణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద అర్హులైన అందరినీ నమోదు చేస్తున్నాం. యాప్లు సక్రమంగా పనిచేయడం లేదని మా దృష్టికి వచ్చింది. త్వరలోనే కొత్త ఫోన్లు ఇస్తాం. దీంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం అయ్యేందుకు కృషిచేస్తాం. – ఐ.విమల, ఐసీడీఎస్ పీడీ -
సంస్మరణ సభ విజయవంతం చేయండి
పలాస: విప్లవ కవి, శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాట యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి సంస్మరణ సభను విజయవంతం చేయాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు కోరారు. మండలంలోని బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో కరపత్రాలు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొడ్డపాడులో ఈనెల 22వ తేదీన పాణిగ్రాహి సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. సుబ్బారావు పాణిగ్రాహి తన మొత్తం జీవితాన్ని ప్రజల కోసం ధారబోశారన్నారు. కళాకారుడిగా, రచయితగా, వాయిద్యకారుడిగా, ఆటగాడిగా, పాటగాడిగా విభిన్న పాత్రలను పోషించారన్నారు. ప్రజా కళలను కాపాడుకుందాం, ప్రత్యామ్నాయ ప్రజా సాంస్కృతిని స్థాపిద్దాం అనే నినాదాంతో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రజాకళా మండలి జిల్లా అధ్యక్షుడు రాపాక చిరంజీవి, సాలిన కుమార్, బుట్ట శ్రీరాములు, శ్రీకాంత్, ప్రజాకళా మండలి రాష్ట్ర సహాయక కార్యదర్శి కొర్రాయి నీలకంఠం, పీకేఎస్ జిల్లా అధ్యక్షుడు పుచ్చ దుర్యోధనరావు, మద్దిల ధర్మారావు, అమరుల బంధుమిత్రుల కమిటీ నాయకుడు జోగి కోదండరావు, సామాజిక కార్యకర్త పోతనపల్లి అరుణ, లిబరేషన్ నాయకుడు మద్దిల రామారావు, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పోతనపల్లి కుసుమ, అమ్మరామకృష్ణ, కై లాస్, దీపు, మురళి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ఎచ్చెర్ల: ఎచ్చెర్ల పోలీసు క్వార్టర్స్ ఎదురుగా బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అంబేడ్కర్ వర్సిటీ నుంచి శ్రీకాకుళం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు పాలిశెట్టి చందు, చందన గణేష్లు పాత జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బైక్ డ్రైవ్ చేస్తున్న గణేష్కు తీవ్రగాయాలు, వెనుక కూర్చున్న చందు కాలికి గాయమైంది. వీరిద్దరినీ అంబులెన్స్ ద్వారా శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గణేష్ స్వగ్రామం లావేరు మండంలోని పెద్ద లింగాలవలస, చందుది కొత్తురూ మండలంలోని కుడుమ గ్రామంగా తెలిసింది. -
సీఐటీయూ నాయకుడు కొండయ్య మృతి
ఆమదాలవలస: జిల్లా సీఐటీయూ సీనియర్ నాయకుడు మెట్ట కొండయ్య (84) కొంతకాలంగా అనారోగ్యానికి గురై బుధవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన కొండయ్య పట్టణంలోని సహకార చక్కెర కర్మాగారంలో కార్మికుల హక్కుల కోసం దశాబ్ధాల పాటు పోరాటం చేశారు. కొంతకాలం కొత్తవలస గ్రామ పంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. చక్కెర కర్మాగారంలో ఉద్యోగిగా పనిచేసే సమయంలో పట్టణంలోని కొత్తకోట వారి వీధిలో నివాసం ఏర్పాటు చేసుకొని స్థిరపడ్డారు. కొండయ్యకు భార్య రాజేశ్వరి, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొండయ్య భౌతిక దేహంపై సీఐటీయూ జెండాను కప్పి కార్మిక సంఘ, వామపక్ష నేతలు గౌరవ నివాళులర్పించారు. జిల్లా సీనియర్ నాయకులలో ఒకరైన కొండయ్య మృతిపై పలు కార్మిక సంఘాల నాయకులు, వామపక్ష నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
రెవెన్యూ అసోసియేషన్ ఎన్నికలకు సిద్ధం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రెవెన్యూ సర్వీసుల సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైందని సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె.శ్రీరాములు, బి.వి.ఎన్.ఎస్.రాజు తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్ యూనిట్, శ్రీకాకుళం డివిజన్ యూనిట్, టెక్కలి డివిజన్ యూనిట్, పలాస డివిజన్ యూనిట్ల మూడేళ్ల కాల పరిమితి ముగిసినందున 2025 – 2028 సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గం ఎన్నుకునేందుకు బధవారం నోటిఫికేషన్ను విడుదల చేశారు. రెవెన్యూ డివిజన్, కలెక్టర్ యూనిట్ల ఎన్నికలు ఈ నెల 21న జరగనున్నాయని తెలిపారు. ప్రత్యేక అవసరాల పిల్లలపై దృష్టి సారించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎల్ఎస్ఏ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. అంతర్జాతీయ ప్రత్యేక విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని బెహరా మనోవికాస్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ వారి సమస్యలు అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సందర్శనలో భాగంగా హరిబాబు కేంద్రంలోని చిన్నారులందరికీ మిఠాయిలను పంపిణీ చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అడ్వకేట్ జి.ఇందిరాప్రసాద్, సంస్థ నిర్వాహకులు శేఖర్, శ్యామల తదితరులు పాల్గొన్నారు. విస్తృతంగా ఎకై ్సజ్ అధికారుల దాడులు కొత్తూరు: అంధ్ర – ఒడిశా సరిహద్దు గ్రామల్లో రెండు రాష్ట్రాలకు చెందిన ఎకై ్సజ్ అధికారులు బుధవారం విస్తృతంగా దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 6,050 లీటర్ల పులిసిన బెల్లం ఊటలు, 100 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసినట్లు స్థానిక ఎకై ్సజ్ సీఐ కిరణ్మీశ్వరి తెలిపారు. అంధ్ర, ఒడిశా రాష్ట్రాల జాయింట్ రైట్స్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో, ఒడిశా రాష్ట్రం సరిహద్దు గ్రామాలైన కొత్తగూడ, నడుము గూడ గిరిజన గ్రామాల్లో దాడులు చేపట్టారు. దాడుల్లో శ్రీకాకుళం ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ మురళీధర్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన కొత్తూరు, పొందూరు, పాలకొండ, రాజాం, పార్వతీపురం, ఆమదాలవలస, శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్రం గుణుపూర్కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. ట్రక్ షీట్లు జనరేట్ కావడం లేదు సారవకోట: రైతులు కల్లాలు లేకపోవడంతో సమీపంలో ఉన్న మిల్లుల ఆవరణలో ధాన్యం ఆరబెట్టుకుని, అక్కడే మిల్లర్లకు ధాన్యం అందిస్తున్నారని అటువంటి ట్రక్ షీట్లు జనరేట్ కావడం లేదని అవలింగికి చెందిన రైతు బోర ధనుంజయ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దృష్టికి తీసుకెళ్లారు. మండలంలోని బుడితి రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో పలు సమస్యలపై చర్చించారు. ట్రక్షీట్లు జనరేట్ కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది గ్రామాల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేటట్లు చూడాలని కోరారు. కార్యక్రమంలో నిక్కు కృష్ణారావు, బోర శ్రీరామమూర్తి, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. వృద్ధుడి మృతదేహం లభ్యం పాతపట్నం: మండలంలో కోదూరు గ్రామ సమీపంలోని కొండ పక్కన కాపు గోపాలపురం గ్రామానికి చెందిన మతి స్థిమితం లేని వృద్ధుడు తడక లక్ష్మీనారాయణ (84) మృతదేహం లభ్యమైనట్లు ఏఎస్ఐ కె.శ్రీరామమూర్తి బుధవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కాపుగోపాలపురం గ్రామానికి చెందిన వృద్ధుడు తడక లక్ష్మీనారాయణకు మతిస్థిమితం లేదు. ఇంటి నుంచి మూడు రోజులకు ఒకసారి వెళ్లిపోయి, మళ్లీ ఇంటికి రావడం అలవాటుగా ఉండేది. అందులో భాగంగానే నవంబర్ 31వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు బుధవారం కోదూరు గ్రామ సమీపంలోని కొండ వద్ద మృతదేహం గ్రామస్తులు గుర్తించి, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడి కుమారుడు తడక దాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్ఐ తెలిపారు. -
● థర్మల్ పవర్ ప్లాంట్ వద్దు
థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోవాలని, లేకుంటే ప్రతిఘటన తప్పదని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్ దొర, కార్యదర్శి సవర సింహాచలం, పోరాట కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం అన్నంపేట పంచాయతీ జంగాలపాడు గిరిజన గ్రామంలో ప్రతులను దహనం చేశారు. సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లాంట్ నిర్మాణం చేపట్టి తమ బతుకులు బుగ్గిపాలు చేయవద్దన్నారు. నిరసన కార్యక్రమంలో పోరాట కమిటీ సభ్యులు సవర మిన్నారావు, మనోజ్, కూర్మారావు, లక్ష్మణరావు, నాగేశ్వరరావు, రామలింగం తదితరులు పాల్గొన్నారు. – బూర్జ -
కూటమి ప్రభుత్వంలో విద్యారంగం నిర్వీర్యం
● పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కొత్తూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగం నిర్వీర్యమైందని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు. మండలంలోని అడ్డంగి గిరిజన గ్రామంలో విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో పాటు పర్యవేక్షణ కరువైందని దుయ్యబట్టారు. విద్యార్థులు స్క్రబ్ టైఫస్, మలేరియా, డయేరియా తదితర రోగాలబారిన పడి మృత్యువాత పడుతున్నాని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లికి వందనం మొత్తాన్ని మొదటి ఏడాది ఇవ్వకుండా ఎగనామం పెట్టారని, రెండో ఏడాది కూడా సక్రమంగా పథకం అమలు చేయలేదని మండిపడ్డారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీలకు కూటమి ప్రభుత్వం చెల్లించకపోవడంతో, విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు కారణంగా వందలాది ప్రభుత్వ పాఠశాలు మూతపడ్డాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తీరు మార్చుకొని విద్యారంగానికి మేలుచేసే చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గండివలస ఆనందరావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు సవర సువీక, వనము లక్ష్మీనారాయణ, అగతమూడి నాగేశ్వరరావు, సర్పంచ్ అగతమూడి రంజిత్, గంధవరపు నాగేంద్ర, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి గుడబండి పోలయ్య, పార్టీ నాయకులు సవర రమేష్, సవర సింహద్రి తదితరులు పాల్గొన్నారు. -
కనీస వేతనాలు అందజేయాలి
రణస్థలం: ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనాలు అందజేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏపీ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో గత 19 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. ప్రస్తుతం వారికి నెలకి కేవలం రూ.5,745లు మాత్రమే వేతనం ఇస్తున్నారని, అతి తక్కువ వేతనాలతో వారి కుటుంబాలు బతకడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు తీరుతాయని ఫీల్డ్ అసిస్టెంట్లు భావించారని, కానీ గత ఏడాది కాలంలో రాజకీయ వేధింపులతో ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమ తొలగింపులు పెద్ద ఎత్తున జరిగాయని దుయ్యబట్టారు. వారికి నాణ్యమైన కొత్త సెల్ఫోన్లు, 5జీ సీమ్ కార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు పి.బంగారు నాయుడు, కె.రమణ, జి.గణేష్, కె.నాగేశ్వరరావు, వై.రామారావు, వెంకటరమణ తదితరలు పాల్గొన్నారు. -
డయేరియా బాధితులకు మెరుగైన వైద్యసేవలు
సంతబొమ్మాళి: తాళ్లవలస డయేరియా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందజేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. సంతబొమ్మాళి మండలం తాళ్లవలసలో డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి మంగళవారం పరిశీలించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం డయేరియా అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. టెక్కలి కేంద్రం నుంచి ఇంటింటికి కుళాయిలు ద్వారా నీటిని అందించేందుకు ప్రణాళిక రూపొందించామని, దీనికి రూ. 60లక్షలు మంజూరు చేశామన్నారు. తాగునీటిలో ఎటువంటి సమస్య లేదన్నారు. మరింత కచ్చితత్వం కోసం బ్లాడ్ శాంపిల్స్తో పాటు, మంచినీటి నమూనాలను విశాఖపట్నంలోని అత్యాధునిక లేబొరేటరీకి పంపించామన్నారు. డ్రైనేజీ నీరు ఎట్టి పరిస్థితుల్లో చెరువులో కలవకుండా చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించారు. కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ డయేరియా తాగునీటి వల్ల రాలేదని, ఆహారం ఇన్డైజేషన్ వల్ల వాంతులు విరోచనాలు అయ్యాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, డీఎంహెచ్వో కె.అనిత, తహసీల్దార్ హేమసుందర్రావు, ఇన్చార్జీ ఎంపీడీఓ దుంప శ్రీనివాసరావు, పీహెచ్సీ డాక్టర్ గంగాధర్ విశ్వనాధ్ తదితరులు ఉన్నారు. కాగా, గ్రామంలో మంగళవారం మరో డయేరియా కేసు నమోదైంది. గ్రామానికి చెందిన రాజాపు లక్ష్మమ్మ వాంతులు, విరోచనాలు కావడంతో గ్రామంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులోనే పీహెచ్సీ సిబ్బంది వైద్య సేవలు అందించారు. గుడ్లు తినడం వల్ల డయేరియా వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. -
ప్రతి కార్యాలయంలో ఈ–ఆఫీసు తప్పనిసరి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: వచ్చే వారానికల్లా జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ–ఆఫీసు వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన ప్రభుత్వ విభాగాల వారీగా దస్త్రాల పరిష్కారంపై మంగళవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. దస్త్రాల పరిష్కారంలో వేగం పెంచడానికి అధికారులను అ ప్రమత్తం చేసేందుకే ఈ సమీక్ష అని ఆయన తె లిపారు. ఆర్థికాంశాలతో ముడిపడని దస్త్రాల్ని, మరీ సంక్లిష్టమైన అంశమైతే తప్ప, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ–ఆఫీసు దస్త్రాల పరిష్కారంలో వెనుకబడి న ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పలాస ము న్సిపాలిటీలు, ఏపీఎస్ఐడీసీ, జిల్లా రిజిస్ట్రార్ వంటి శాఖలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. సంతబొమ్మాళి మండలం తాళ్లవలసలో జరిగిన ఘటనపై కలెక్టర్ మాట్లాడుతూ, ఆహారం, నీరు, పారిశుద్ధ్యం విషయంలో జిల్లా మొత్తం ఆయా ప్రభుత్వ విభాగాలు అప్రమత్తంగా ఉండాలి అని స్పష్టం చేశారు. ఆహార కల్తీ విభాగానికి చెందిన అధికారులు హోటల్స్, సినిమా హాళ్లు, రోడ్డు సైడ్ ఫుడ్ స్టాళ్ల వద్దకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాలని, వారందరికీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. తనిఖీల పేరుతో వీధి వ్యాపారులను ఇబ్బంది పెట్టరాదని స్పష్టం చేశారు. అలాగే పలు శాఖల ప్రగతి అంశాలపై, ముఖ్యంగా ధాన్యం సేకరణ అంశంలో బ్యాంక్ గ్యారెంటీలు, వాహనాల రిజిస్ట్రేషన్, టార్పా లిన్ల లభ్యతపై చర్చించారు. ఇటీవల వచ్చిన తుఫాను అనంతరం వర్షాల కారణంగా జరిగి న ధాన్యం నష్టం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పారిశుద్ధ్యం విషయంలో ఒక మోడల్ గ్రామాన్ని ఎంపిక చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ తదితర అధికారులు హాజరయ్యారు. -
అంతరాయంతో అవస్థ
● ధాన్యం కొనుగోలు వెబ్సైట్ అంతరాయంతో రైతులకు అవస్థలు ● గంటల కొద్దీ వేచి ఉండాల్సిన దుస్థితి గార: ప్రభుత్వం ఖరీఫ్లో పండిన ధాన్యంను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. వీటి కోసం ఏపీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ పేరిట వెబ్సైట్ను ఏర్పాటు చేసింది. రైతు ఆధార్ ద్వారా అప్పటికే ఈ–క్రాప్లో నమోదు చేసిన వారు వచ్చి ధాన్యం రెడీ అయ్యాయని చెప్పగానే అదే రోజు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం రైతు సేవా కేంద్రాలు, సచివాలయాల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గార మండలంలో 25 పంచాయతీల పరిధిలో 15 సచివాలయాల పరిధిలో 15 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ మంగళవారం ఉదయం 10 గంటలకు వెళ్లిన లింగాలవలస, గొంటి, గార తదితర సచివాలయాల వద్దకు వెళ్లిన రైతులకు ఆన్లైన్లో టెక్నికల్ సమస్యతో వెబ్సైట్ తెరచుకోలేదు. దీంతో మధ్యాహ్నం రెండు వరకు వేచి ఉండి ఇంటికి వెళ్లిపోయారు. జిల్లా అంతటా ఇదే సమస్య ఉందని తెలుస్తోంది. మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత వెబ్సైట్ పనిచేయడం ప్రారంభం కావడంతో వచ్చిన రైతులకు మళ్లీ కబురు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ధాన్యం కొనుగోలు కేంద్రం పోర్టల్లో టెక్నికల్ సమస్య వచ్చింది. తొలుత ఒక కొనుగోలు కేంద్రంలో వచ్చిందని తెలిసి నిపుణులకు సమాచారమిచ్చాం. అన్ని కేంద్రాల్లో ఇదే సమస్య తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదించాం. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత టెక్నికల్ సమస్య తొలగడంతో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది. – మునగవలస చక్రవర్తి, తహసీల్దార్, గార ఉదయం మా సచివాలయం వద్దకు ఆధార్, ధాన్యం శాంపిల్తో వెళ్లాను. అప్పటినుంచి పనిచేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. మిగిలిన వాళ్లకి ఫోన్ ద్వారా చెబుతున్నారు. మధ్యాహ్నం వరకు ఉన్నా పనికాలేదు. నాకు చెందిన 140 ధాన్యం బస్తాలు అమ్మేందుకు వచ్చాను. – పెదలాపు లక్ష్మీనారాయణ, రైతు, లింగాలవలస -
బీడుగా మార్చేస్తారా?
● బ్రూవరీస్ వాటర్ ప్లాంట్ వద్దే వద్దు ● తేల్చిచెప్పిన నగరప్పాలెం రైతులు ● ప్లాంట్ యజమానులు, గ్రామపెద్దలకు మధ్య కుదరని సయోధ్య రణస్థలం: పచ్చని పొలాలను బీడు భూములుగా మార్చే వాటర్ ప్లాంట్ తమ ప్రాంతంలో వద్దే వద్దని రణస్థలం పంచాయతీ నగరప్పాలెం గ్రామస్తులు తేల్చిచెప్పారు. స్థానిక జగనన్న కాలనీ సమీపంలో ఆక్వా బ్రూవరీస్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుపై కొన్నాళ్లుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ వద్దని పంచాయతీ గ్రామపెద్దలు కలెక్టర్ గ్రీవెన్సుతో పాటు మండల స్థాయి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. అనుకూలమైన మరో వర్గం ప్లాంట్ ఏర్పాటు చేసేలా కథ నడుపుతున్నారు. తాజాగా మంగళవారం రెండు వర్గాల గ్రామపెద్దలు, పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు, పంచాయతీ గ్రామస్తుల సమావేశం రసాబాసగా జరిగింది. ప్లాంట్ వద్దే వద్దు.. ప్లాంట్ వల్ల భూగర్భజలాలు అడుగంటిపోయి పొలాలు బీడు భూములుగా మారిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. బోర్లుపై ఆధారపడి ఏటా మూడు పంటలతో సస్యశ్యామలంగా ఉండే తమ పొలాలకు నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటైతే 24 గంటలూ భూగర్భ జలాలు తోడేస్తారని, ప్లాంట్ నుంచి వెలువడే వ్యర్థ జలాలు పొలాల్లోకి విడిచిపెడతారని చెబుతున్నారు. తరతరాలుగా వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకుతున్న తమ జీవితాలు బుగ్గిపాలు అవుతాయని, పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. టెంట్ వేస్తాం.. ప్లాంట్కు అనుకూలమైన వర్గం మాట విని పనులు ప్రారంభిస్తే టెంట్ వేసి నిరసన తెలుపుతామని, అందులో రాజీపడే ప్రసక్తే లేదని రైతులు, గ్రామపెద్దలు పరిశ్రమ యాజమాన్యానికి తేల్చిచెప్పారు. ఈ తరుణంలో అనుకూలమైన వర్గం ప్లాంట్ ఏర్పాటు చేసేలా పావులు కదిపారు. సమీపంలో అధిక భూములున్న వ్యక్తి ప్లాంట్ వల్ల జరిగే నష్టాలను వివరిస్తున్న నేపథ్యంలో అందులో ఓ వ్యక్తి మీ భూములు తాము కొంటామని మాట జారడంతో వ్యతిరేక వర్గానికి చిర్రెత్తుకొచ్చింది. సమావేశం గందరగోళంగా మారింది. ఒకానొక దశలో ప్లాంట్ ఎలా ఏర్పాటు చేస్తారో చూద్దామంటూ మాటల తూటాలు గట్టిగానే పేలాయి. ఇప్పటికే యూబీ పరిశ్రమ నుంచి విడిచిపెట్టి వ్యర్థ జాలాలు సమీప చెరువులోకి వస్తూ భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని గుర్తు చేశారు. అనంతరం గ్రామపెద్దలు సముదాయించి ప్లాంట్ ఏర్పాటు చేయవద్దని, చేస్తే టెంట్ వేసి నిరసన తెలుపుదామని చెప్పి ఎవరికి వారే వెళ్లిపోయారు. -
గురుకుల పాఠశాల తనిఖీ
పాతపట్నం: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల, కళాశాలల అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్కుమార్ అన్నారు. పాతపట్నం మండలం ప్రహరాజపాలెంలోని అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను మంగళవారం గురుకులాల సమన్వయాధికారి వై.యశోదలక్ష్మితో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థుల భోజనం, వంటగది, స్టోర్రూమ్, డార్మిటరీలను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గిరిజనుల బతుకులు బూడిద చేయవద్దు సరుబుజ్జిలి: థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మించి గిరిజనుల బతుకులు బూడిద చేయవద్దని థర్మల్ వ్యతిరేక పోరాటకమిటీ కన్వీనర్ సురేష్దొర, కోశాధికారి అత్తులూరి రవికాంత్ అన్నారు.వెన్నెలవలసలో మంగళవారం థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో థర్మల్ వ్యతిరేక పోస్టర్లను మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులపై ఏమాత్రం ప్రేమ ఉన్న ప్రభుత్వం వెంటనే థర్మల్ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని డిమాండ్చేశారు. కార్యక్రమంలో పోరాట కమిటీ కార్యదర్శి సమర సింహాచలం, పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు. థర్మల్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోవాలి ఆమదాలవలస: సరుబుజ్జిలి, బూర్జ మండలాల ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టిన థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కోనారి మోహనరావు డిమాండ్చేశారు. మంగళవారం ఆమదాలవలస పట్టణంలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం పెన్షన్ల పంపిణీకి సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలోని ఆదివాసీల గ్రామాలకు వెళ్లి ప్లాంట్ ఏర్పాటుపై కాగితాలు ఏమైనా ఉంటే చూపెట్టాలని స్థానికులను అడగడం సిగ్గుచేటన్నారు. ప్లాంట్ నిర్మించబోమని చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపై ఉందన్నారు. ప్లాంట్ నిర్మిస్తున్నట్లు తనకు తెలియదని చెప్పడం కంటే ఈ ప్రాంతంలో నిర్మించడం లేదని చెబితే బాగుండేదన్నారు. ప్రాజెక్టును స్థానికులు వ్యతిరేకిస్తుంటే ఎందుకు ముందుకెళ్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికై నా పాలకులు తీరు మారకపోతే భవిష్యత్తు ఉద్యమానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ వికాస పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, సీపీఐ కార్యదర్శి చాపర సుందర్లాల్, థర్మల్ పోరాట కమిటీ కోశాధికారి అత్తులూరి రవికాంత్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సవర లక్ష్మణరావు, అఖిలభారత యువజన సంఘం అధ్యక్షులు బొత్స సంతోష్కుమార్, థర్మల్ పోరాట కమిటీ సభ్యులు సవర సింహాచలం, కునారి మనోజ్, సవర సింగయ్య ,నగేష్ తదితరులు పాల్గొన్నారు. కుక్కల దాడిలో 40 గొర్రె పిల్లలు మృతి పొందూరు: కొంచాడ గ్రామంలో కుక్కల దాడిలో మంగళవారం సుమారు 40 గొర్రె పిల్లలు మృతి చెందాయి. అన్నదమ్ములు కురమాన రమణ, కురమాన గౌరినాయుడులు తమ శాలలో 40 గొర్రె పిల్లలు ఉంచారు. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా కుక్కల గుంపు చొరబడి దాడిచేసి చంపేశాయి. స్థానికులు వచ్చి తరిమికొట్టేలోపే గొర్రె పిల్లలన్నీ మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. మృతిచెందిన గొర్రె పిల్లలకు పెనుబర్తి పశువైద్యాధికారి హేమంత్ పోస్టుమార్టం నిర్వహించారు. -
పోర్టు వాహనాల అడ్డగింత
● నిర్లక్ష్య డ్రైవింగ్పై గ్రామస్తుల మండిపాటు సంతబొమ్మాళి: మూలపేట పోర్ట్ వాహనాలను గ్రామస్తులు మంగళవారం అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కూర్మనాథపురం రామాలయం ఎదురుగా మూలపేట పోర్టుకు సంబంధించిన వాల్వో టిప్పర్ మెయింటెనెన్స్ కోసం పార్కింగ్ చేశారు. మెయింటెనెన్స్ పని అయిన తర్వాత లిఫ్ట్ డౌన్ చేయకుండా రోడ్డుపైకి రావడంతో విద్యుత్ వైర్ ఇంజిన్కు ట్రాలీకి మధ్య ఉండిపోయింది. అది గమనించిన డ్రైవర్ టిప్పర్ను ముందుకు తీసుకుని వెళ్లడంతో విద్యుత్ హైటెన్షన్ వైర్లు రాపిడీకి గురై పెద్ద శబ్దంతో మంటలు చెలరేగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ శబ్దంతో రోడ్డు మీద ఉన్న వ్యక్తులు పరుగులు తీయగా, ఇంట్లో ఉన్న గ్రామస్తులు, మహిళలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. టిప్పర్కు, ట్రాలీకి మధ్యన ఉన్న వైరును చూసి ఆందోళన చెంది టిప్పర్ కదలకుండా అడ్డుకున్నారు. ఇలా జరగడం ఇది ఐదో సారి అని ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఎంతమంది ప్రాణాలు తీస్తారంటూ మహిళలు, గ్రామస్తులు మండిపడ్డారు. దీంతో ట్రాపిక్కు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న సంతబొమ్మాళి ఎస్ఐ వై.సింహాచలం సంఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. ఇంటిలో విద్యుత్ పరికరాలన్నీ పాడైపోయాయని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వాహనాలను కదలనీయబోమని గంటల తరబడి గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గత్యంతరం లేక పోర్టు హెచ్ఆర్ మేనేజర్ రాఘవరెడ్డి సంఘటన స్థలానికి వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. జరిగిన నష్టాన్ని యాజమాన్యమే భరిస్తుందని హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. -
యూరియా.. మళ్లీ క్యూ కట్టాలయ్యా..
జి.సిగడాం మండలం నడిమివలస సచివాలయం వద్ద యూరియా కోసం మహిళలు, రైతులు పడిగాపులుఇదీ పరిస్థితి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఖరీఫ్ సీజన్లోనే కాదు రబీ సీజన్లో కూడా యూరియా కోసం రైతుకు పడిగాపులు తప్పడం లేదు. ఖరీఫ్లో రైతుల పడిన కష్టాలు చంద్రబాబు ప్రభుత్వానికి కనిపించలేదేమో. రైతులు ఏమైపోతే మాకేంటి ధోరణిలో రబీలోనూ అదే నిర్లక్ష్యం చూపిస్తోంది. దీంతో యూరియా కోసం రైతులు ఆపసోపాలు పడుతున్నారు. రైతుల అవసరాలను ప్రభుత్వం కనీసం అంచనా వేయడం లేదు. మూస పద్ధతిలో వెళ్లడం తప్ప రైతులకు యూరియా కొరతను తీర్చడంలో చర్యలు తీసుకోలేకపోయింది. రైతులను బాధ పెట్టాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తెల్లవారకముందే రైతు సేవా కేంద్రాల వద్దకు చేరుకుని బారులు తీరి నిలబడుతున్నారు. సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత వేధిస్తూనే ఉంది. తెల్లారి లేచింది మొదలు తిండి తిప్పలు మాని ఎరువుల కోసం క్యూలు కట్టాల్సి వస్తోంది. అయినప్పటికీ యూరియా దొరకని పరిస్థితి నెలకొంటోంది. రబీ సీజన్లోను యూరియా కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సాగు పనులు జోరుగా నడుతున్న తరుణంలో సచివాలయాల ఎదుట రైతులు నిరీక్షిస్తున్నారు. ఒక వైపు ఖరీఫ్లో పండిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొనుగోళ్లు నెమ్మదిగా సాగడం, వాతావరణం ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా దళారులకు విక్రయించుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. పండిన పంటను అమ్ముకోవడం ఒక వైపైతే.. రబీ సాగుకు అవసరమైన యూరియా కోసం మరో వైపు రైతులు అవస్థలు పడాల్సి వస్తోంది. ఎరువులేవీ..? రబీలో జిల్లాలో 70,319 హెక్టార్ల సాగు లక్ష్యంగా ఉంది. ఇందులో ఇప్పటికే 20వేల హెక్టార్లు సాగులోకి వచ్చేసింది. రబీ పంటల కోసం 26వేల మెట్రిక్ టన్నులు యూరియా అవసరమని యంత్రాంగం ప్రతిపాదించింది. ఇందులో 9600 మెట్రిక్ టన్నులు ఇప్పటికే పంపిణీ చేయగా, 3090 మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. యూరియా దొరకడం లేదని, రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని, అది కూడా అందరికీ అందడం లేదని ఎక్కడికక్కడ రిపోర్టు వస్తోంది. వాస్తవంగా ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారో రాష్ట్రమంతా చూసింది. ఒక బస్తా కోసం గొడవలు జరిగాయి. కొట్లాటలకు దారి తీశాయి. చివరికి వ్యవసాయ సిబ్బందిపై దాడి చేసేంత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సాక్షాత్తూ సంబంధిత వ్యవసాయ శాఖ సిబ్బందే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. పరిస్థితు లు బాగోలేవని, యూరియా కోసం రైతుల నుంచి ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యంగాఅగ్రికల్చర్ అసిస్టెంట్లు గగ్గోలు పెట్టారు. వచ్చిన యూరియా కాస్త టీడీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఎక్కడికక్కడ రైతులు ఆందోళనలకు దిగారు. కార్యాలయాలను ముట్టడించేంతవరకు వెళ్లారు. వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో.. ఎంత కాదనుకున్నా మంత్రులు స్వప్రయోజనం చూసుకుంటారన్నది నానుడి. తమ నియోజకవర్గానికి, తమ జిల్లాకు మంచి జరిగే నిర్ణయాలు తీసుకుంటారనేది అందరికీ తెలిసిందే. కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు అలాంటిదేమీ కనిపించడం లేదు. సొంత జిల్లా రైతులకు మేలు చేద్దామన్న ఆలోచన రావడం లేదు. రైతుల కంటే మిగతా రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని చూసైనా నేర్చుకోరా.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రతీది రైతు ఇంటి వద్దకే వచ్చేది. విత్తనాలు, ఎరువుల సరఫరా దగ్గరి నుంచి ధాన్యం కొనుగోళ్లు వరకు రైతుల వద్దనే జరిగేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు ఎంత సాగు చేస్తున్నారో? వారికెంత ఎరువులు అవసరమో? ఈ క్రాప్ ద్వారా ముందే గుర్తించేవారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి వివరాలు తీసుకునేవారు. ఆ మేరకు రైతులకు సరిపడా ఎరువులు నేరుగా ఇంటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేవారు. ఎరువుల కోసం ఎవరినీ అడగాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు మళ్లీ పాత కష్టాలు పునరావృతమయ్యాయి. గొడవలకు పరిస్థితులు దారితీస్తున్నాయి. రైతులను వదలని ఇబ్బందులు ఎరువుల కోసం మళ్లీ పాట్లు వ్యవసాయ మంత్రి సొంత జిల్లాలో తప్పని అవస్థలు సరిపడా యూరియా దొరకని దుస్థితి బారులు తీరి గగ్గోలు పెడుతున్న రైతులు మళ్లీ గొడవలకు దారి తీస్తున్న పరిస్థితులు -
దొంగల హల్చల్
● బూర్జలో ఆరు తులాల బంగారం, 23 తులాల వెండి చోరీ ● టెక్కలి అయ్యప్పనగర్లో 60 తులాల వెండి మాయం బూర్జ/టెక్కలి రూరల్ : జిల్లాలో దొంగలు పడ్డారు. బూర్జ, టెక్కలి అయ్యప్పనగర్లో చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్జ గ్రామానికి చెందిన చెన్నూరు రమేష్ గ్రామంలో టిఫిన్ షాపు నడుపుతున్నారు. శనివారం కుటుంబంతో కలిసి అరకు విహార యాత్రకు వెళ్లారు. టిఫిన్ షాపులో పనిచేస్తున్న సూర్యనారాయణ అనే వ్యక్తి మంగళవారం రమేష్ ఇంటికి వెళ్లిచూడగా తలుపులు తెరిచి ఉండటం గుర్తించి రమేష్కు ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశారు. వెంటనే ఆయన వచ్చి చూడగా బీరువాలో ఆరుంపావు తులాల బంగారం, 23 తులాల వెండి, రూ.లక్ష నగదు చోరీకు గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, క్లూస్ టీమ్ వచ్చి వివరాలు సేకరించారు. ఆమదాలవలస సీఐ పాండ్రంకి సత్యనారాయణ, ఎస్సై ఎం.ప్రవళ్లిక ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు. అయ్యప్పనగర్లో వరుస దొంగతనాలు.. టెక్కలి అయ్యప్పనగర్లో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో కాలనీవాసులు భయాందోళనకు గురౌతున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి వరుస ఇళ్లల్లో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారం వసంతరావు శుక్రవారం మధ్యాహ్నం శుభకార్యానికి వెళ్లి వచ్చే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా సుమారు 60 తులాల వెండి, రూ.లక్ష నగదు, ల్యాప్టాప్ చోరీకి గురైనట్లు గుర్తించారు. అదే రోజు పొరుగు ఇంట్లోకి సైతం దుండగులు చొరబడే ప్రయత్నం చెయ్యగా వృద్ధురాలు కేకలు వేయడంతో పరారయ్యారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వసంతరావు తెలిపారు. -
40 రోజులు
రూ.55.11లక్షలుఅరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో హుండీ కానుకల లెక్కింపులో రూ. 55,11,915 మేరకు ఆదాయం లభించినట్లుగా ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ప్రకటించారు. మంగళవారం ఆలయ అనివెట్టి మండపంలో నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపులో నగదు రూపంలో రూ.50,51,052, చిల్లర రూపంలో రూ.4,60,863 లభించిందని, అలాగే విదేశీ మారక ద్రవ్యంతో పాటు 45 గ్రాముల బంగారం, 992 గ్రాముల వెండి వస్తువులు లభించినట్లుగా ప్రకటించారు. గత 40 రోజుల పాటు హుండీల్లో ఉన్న కానుకలను లెక్కించినట్లుగా ఈఓ తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఇన్స్పెక్టర్ రవికుమార్, ఈఓలు జి.గురునాధరావు,ఎం.సుకన్య, పి.శ్యామలరావు పాల్గొన్నారు. -
కనీసం రూ.15 చెల్లించాలి..
ప్రస్తుత ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి రూ.20 చొప్పున ప్రభుత్వం చెల్లించాలి. కనీసం రూ.15 అయినా ఇవ్వాలి. ధరలకు.. పెంచిన వంట ఖర్చులకూ పొంతన ఉండటం లేదు. – అల్లు మహాలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం గౌరవాధ్యక్షురాలు నిత్యవసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో పైసల్లో పెంపు చేయడం సరికాదు. మా వైపు నుంచి కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలి. – బర్ల బంగారమ్మ, వంట నిర్వాహకురాలు, ఉర్లాం పెరిగిన ధరలకు అనుగుణంగా ఽవంట ఖర్చులు పెంచాలి. కూరగాయలు ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడంతో ఏమీ కొనలేకపోతున్నాం. ప్రభుత్వం తాజాగా పెంచిన ధరలు సరిపోవు. – అమ్మాయమ్మ, వంట నిర్వాహకురాలు, వీఎన్పురం స్కూల్ ● -
ఆర్డీఓ వ్యాఖ్యలు హాస్యాస్పదం
మందస: కార్గో ఎయిర్పోర్టుకు సంబంధించి మందసలో ఆర్డీఓ వెంకటేష్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ చేసే ముందుకు వెళ్లామని పత్రికాముఖంగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, కార్యదర్శి జోగి అప్పారావు అన్నారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ రాంపురం, బిడిమి గంగువాడ, అనకాపల్లి, సంతోష్నగర్ తదితర గ్రామాల్లో ఇప్పటికే రైతులు స్పష్టంగా తమ వైఖరి తెలియజేశారని చెప్పారు. శతశాతం ఉత్తీర్ణత సాధించాలి రణస్థలం: కేజీబీవీలో పది, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యదర్శి(కేజీవీవీ) డి.దేవానంద రెడ్డి అన్నారు. లావేరు మండలం మురపాక కేజీబీవీని మంగళవారం తనిఖీ చేశారు. ఇటీవల క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. మధ్యాహ్న భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్వో సుధ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బకాయి నిధులు తక్షణం చెల్లించాలి
● విద్యా వ్యవస్థలను లోకేష్ భ్రష్టు పట్టించారు ● మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమదాలవలస: రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీగా ఫీజు బకాయిలు పెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి దక్కిందని మాజీ స్పీక ర్, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. ఆమదాలవలసలోని తన స్వగృహంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ను చీకటిగా మారుస్తుందన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అవగాహన లేమితో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డా రు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది క్వార్టర్లకు గాను సుమా రు రూ.7,800 కోట్లు కాలేజీలకు బకాయిలుగా పెండింగ్లో ఉంచారన్నారు. ఎన్నికల సమయంలో నేరుగా కాలేజీలకు ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మొండి చేయి చూ పుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యా లు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, అనేక చోట్ల సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో విద్యాదీవెన కింద రూ.12,609 కోట్లు క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లించడమే కాక, అప్పట్లో టీడీపీ పెట్టిన బకాయిలు కూడా కట్టేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ పాలనలో విద్యాదీవెన, వసతిదీవెన పథకాల కింద మొత్తం రూ.18,663 కోట్లు ఖర్చు చేసి విద్యార్థులకు పూర్తి భరోసా కల్పించారని తమ్మినేని గుర్తు చేశారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా విద్యార్థుల చదువుకు ఎ లాంటి ఇబ్బందులు రాకుండా చూసిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ అని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పాఠశాలల నుంచి ఉన్నత విద్య వరకు మొత్తం వ్యవస్థ కుదేలైందన్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు కాలేజీలు ‘మేము నడపలేము’ అంటూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. వెంటనే రూ.7,800 కోట్లు విడుదల చేయాలని కోరారు. సమావేశంలో తమ్మినేని చిరంజీవినాగ్ ఉన్నారు. -
వైభవంగా ఆదిత్యుని కల్యాణం
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా స్వామి వారి కల్యాణ సేవ ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం ఉషా పద్మిని ఛాయా దేవేరులతో శ్రీవారి కల్యాణమూర్తులను అనివెట్టి మండపంలోకి తీసుకొచ్చి కల్యాణం జరిపించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీపశర్మ కల్యాణ సేవ ప్రక్రియ పూర్తి చేశారు. ఈవో ప్రసాద్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆమె నేత్రాలు సజీవం శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని ఏపీహెచ్బీ కాలనీకి చెందిన పి.సుధారాణి (65) మృతిచెందడంతో ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు పి.ఎ.ఉమామహేశ్వరరావు (రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్), కుమారుడు అప్పారావు (అడ్వకేట్), కుమార్తెలు ఎం.శ్యామల కుమారి, టి.కమలకుమారి నిర్ణయించారు. విషయాన్ని రెడ్క్రాస్కు తెలియజేయగా మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ.టెక్నీషియన్ పూతి సుజాత, చిన్నికృష్ణల ద్వారా సుధారాణి కార్నియాలు సేకరించారు. అనంతరం విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు అభినందించారు. నేత్ర దానం చేయాలనుకునేవారు 7842699321 నంబరును సంప్రదించాలని కోరారు. సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు శ్రీకాకుళం పాతబస్టాండ్: సాయుధ దళాల పతాక నిధికి విరాళాలను విరివిగా అందించి మాజీ సైనికుల సంక్షేమానికి తోడ్పాటు అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 6న సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేలిన ఫ్రిజ్ ఇచ్ఛాపురం : పట్టణంలోని ముత్యాలమ్మపేటలో డి.లక్ష్మునాయుడు ఇంట్లో సోమవారం విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా రిఫ్రిజిరేటర్ పేలింది. ఈ ఘటనలో గృహోపకరణాలు, ఇతర వస్తువులు కాలిపోయాయి. స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇంటి సామగ్రితో పాటు కుమార్తె జ్ఞానేశ్వరి కూచిపూడి, తైక్వాండోలో సాధించిన మెడల్స్ కూడా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షలు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. -
అసంపూర్తి భవనాలకు నిధులు మంజూరు
కంచిలి : కంచిలిలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ.65 లక్షలు నిధులు మంజూరుకు తక్షణమే జీఓ జారీ చేస్తున్నట్లు రాష్ట్ర గురుకుల సొసైటీ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్కుమార్ వెల్లడించారు. సోమవారం కంచిలి గురుకులంలో ఆయన పర్యటించారు. ఇక్కడి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘చలించదా..?’ అనే శీర్షికన నవంబర్ 21న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించారు. ఇప్పటికే పలువురు అధికారులు పర్యటించి ఆరా తీశారు. తాజాగా నాబార్డు భవనాలు పూర్తి చేయడానికి రూ.35లక్షలు, నాడు–నేడు భవనాలను పూర్తి చేయడానికి రూ.30లక్షలు మంజూరుకు అంచనాలు రూపొందించాలని ఇంజినీరింగ్ శాఖకు ఆదేశించారు. పాడైన డార్మిటరీ స్థానంలో కొత్త డార్మిటరీ నిర్మాణానికి రూ.4.5 కోట్లతో ఎస్టిమేషన్ తయారుచేసి పంపించాలని గురుకుల ప్రిన్సిపాల్ పి.శ్రీనివారావును ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గురుకులాల సమన్వయాధికారి వై.యశోద లక్ష్మి, సిబ్బంది ఉన్నారు. -
ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాదాపుగా అన్నీ టీడీపీ కార్యకర్తలు, వారి ఏజెన్సీలకే ఇవ్వడం వల్ల వారంతా దళారులుగా మారి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని, అటువంటి ఏజెన్సీలను మార్చాలని ఆమదాలవలస వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు కలెక్టర్ గ్రీవెన్స్లో వినతిపత్రం అందించారు. సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు, ఆమదాలవలస మండలాల్లో రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధర రావడం లేదన్నారు. పొందూరు మండలంలోని రాపాక, కృష్ణాపురం వంటి ప్రాంతాల్లో అక్రమ క్వారీలు నిలుపుదల చేయాలని కోరారు. బూర్జ మండలం లక్కపురంలో ఆశా కార్యకర్త పోస్టు అక్రమ భర్తీని అడ్డుకోవాలన్నారు. సరుబుజ్జిలి మండలం పెద్దసవలాపురం సచివాలయంలో పాత స్థలంలోనే కొనసాగించాలని కోరారు. మహిళలకు ఉపాధి శిక్షణ ఎచ్చెర్ల : మండల కేంద్రం ఎచ్చెర్లలోని ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిత కేంద్రం (మహిళా ప్రాంగణం)లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి (ఎపీఎస్ఎస్డీసీ–గుంటూరు) సౌజన్యంతో 18 నుంచి 45 ఏళ్ల మహిళలకు పలు ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ జిల్లా మేనేజర్ రబీకాసామ్యూల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్(60 రోజులు), హ్యండ్ ఎంబ్రాయిడర్(45 రోజులు) కోర్సులకు 8వ తరగతి, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు(90 రోజులు)కు పదో తరగతి చదివి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగల మహిళలు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని, వివరాలకు 8309548067 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
కలెక్టర్ గ్రీవెన్స్కు 124 అర్జీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్తో కలిసి 124 అర్జీలు స్వీకరించారు. డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్, పలాస ఎయిర్పోర్ట్ ప్రత్యేకాధికారి ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ● గార మండలం శ్రీకూర్మం, మత్స్యలేశంతోపాటు ఆరు గ్రామాల వన సంరక్షణ సమితి పరిధిలో 500 ఎకరాల భూమి ఉందని, ఈ స్థలాన్ని అదాని కంపెనీకి ప్రభుత్వం అప్పగించిందని, ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు విన్నవించారు. స్థానికులకు సమాచారం లేకుండా, ఇటువంటి కేటాయింపులు చేయడం సరికాదని, దీనిపై ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు జెడ్పీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడారు. ● నగరంలోని రాజీవ్ గృహకల్ప, వాంబే కాలనీల నిర్మాణం చేసి చాలా కాలం అయ్యిందని, నిర్వహణ లేక, మరమ్మతులు చేయక శిథిలావస్థకు చేరాయని, తక్షణమే మరమ్మతులు చేయించాలని కాలనీవాసులు కోరారు. -
ధాన్యం కుప్పకు నిప్పు
మెళియాపుట్టి: జాడుపల్లి గ్రామంలో కలమట సూర్యనారాయణ అనే రైతుకు చెందిన అర ఎకరా ధాన్యం కుప్పకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఆదివారం అర్ధరాత్రి కుప్ప కాలిపోవడం చూసి రైతుకు గ్రామస్తులు సమాచారం అందించడంతో వెళ్లి చూసేసరికే బూడిదైపోయింది. అనంతరం పలాస అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చినా ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్బాబు తెలిపారు. ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 11 నుంచి జిల్లా యువకులకు సీసీటీవీ కెమెరా ఇన్స్టలేషన్లో 13 రోజుల ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని సంస్థ డైరెక్టర్ రామ్జీ సోమవారం తెలిపారు. శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 7993340407, 9553410809 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
తాళ్లవలసకు అధికారుల వరుస
● తాగునీరు వల్ల డయేరియా రాలేదని తేల్చిన వైనం ● కొత్తగా మరో మూడు కేసులు సంతబొమ్మాళి: తాళ్లవలస గ్రామంలో డయేరియాతో ఒక వ్యక్తి మృతి చెందడంతో సోమవారం గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామాన్ని డీఎల్పీ ఐ.వెంకటరమణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శంకర్ బాబు, డీఈ రామకృష్ణ, జిల్లా వైద్యశాఖ చెందిన వైద్యురాలు పి.సుజాత, డిప్యూటీ డీఎంహెచ్ఓ మేరీకేథరిన్ సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. ఆర్డబ్ల్యూఎస్, పీహెచ్సీ సిబ్బంది వేర్వేరుగా తాగునీరు తీసుకుని టెస్టులు చేశారు. రెండు టెస్టుల్లో కూడా నెగిటివ్గా వచ్చిందని తేల్చారు. నీటి వల్ల డయేరియా రాలేదని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యులకు మందు జాగ్రత్తగా మందులను పంపిణీ చేశారు. డయేరియా అదుపులోకి వచ్చేంత వరకు గ్రామంలో మెడికల్ క్యాంపు కొనసాగుతుందని వైద్యాధికారులు తెలిపారు. పీహెచ్సీ సిబ్బందిపై మండిపాటు దండుగోపాలపురం ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వంపై జిల్లా వైద్యాశాఖకు చెందిన పి.సుజాత మండిపడ్డారు. గ్రామాల్లో ఇంత జరుగుతుంటే సమాచారం ఇవ్వరా అంటూ మందలించారు. ఏఎన్ఎం రాధమ్మ, ఆశఽ కార్యకర్త కల్యాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్గా లేకపోతే గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందంటూ ప్రశ్నించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని పీహెచ్సీ డాక్టర్ గంగాధర్ విశ్వనాథంను ఆదేశించారు. రోస్టర్ చాట్ వేయకపోవడం, రిపోర్ట్ ఇవ్వడంతో తీవ్రమైన జాప్యం, ఫోన్లో సకాలంలో స్పందించకపోవడంపై ఎంపీహెచ్ఓ నాగేశ్వరరావు పై మండిపడ్డారు. ఉన్నతాధికారులు వస్తున్నారని తెలిసి కూడా యూనిఫారం వేయపోతే ఎలా అంటూ హెచ్వీ కామేశ్వరిని మందిలించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను సేకరించారు. మరో మూడు కేసులు తాళ్లవలసలో సోమవారం మరో మూడు కేసులు నమోదయ్యాయి. గొల్లపల్లి జగన్నాథరావు, మార్పు అఖిల, వల్లభ తిరుపతిరావు వాంతులు, విరేచనాలతో టెక్కలి జిల్లా పరిషత్లో చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రాథమిక వైద్యం చేసి 108 సహాయంలో తరలించారు. తాగునీరు వల్ల వాంతులు విరేచనాలు కాకపోతే దేని వల్ల వస్తుందో అధికారులే తేల్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాధితులకు తిలక్ పరామర్శ టెక్కలి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ సోమవారం పరామర్శించారు. పూర్తి స్థాయిలో కోలుకునే విధంగా మెరుగైన వైద్యం అందజేయాలని కోరారు. అలాగే తాళ్లవలస గ్రామంలో డయేరియా వ్యాప్తికి గల కారణాలు తెలుసుకుని వ్యాప్తి లేకుండా గ్రామంలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని తిలక్ పేర్కొన్నారు. ఆయనతో పాటు నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, కోటబొమ్మాళి జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, నాయకులు కురమాన బాలకృష్ణ, సత్తారు సత్యం, చిన్ని జోగారావు, బి.రాజేష్ ఉన్నారు. డీఎంహెచ్ఓ ఆరా విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత తాళ్లవలస గ్రామంలో సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి వైద్యసిబ్బందికి తగు సూచనలు అందించారు. -
శోధించి.. ఛేదించిసీసీఎస్.. దొంగలపాలిట సింహస్వప్నంలా మారుతోంది. 129 కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించింది. –8లో
కంచిలి: కోసిన పంటను యంత్రాల సహాయంతో నూరుస్తున్న రైతులు వజ్రపుకొత్తూరు రూరల్: నిల్వ ఉన్న ధాన్యాన్ని పరిశీలిస్తున్న రైతు సంఘ నాయకులు రణస్థలం: తాళ్లవలసలో వరికుప్పలకు టార్పాలిన్లు కప్పుతున్న రైతులు మబ్బు పట్టిన ఆకాశం రైతు గుండెల్లో గుబులు రేపుతోంది. ప్రతి చినుకు అన్నదాతకు వణుకు పుట్టిస్తోంది. గోనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండడం, ధాన్యం కొనుగోళ్లు నత్త నడకన సాగుతుండడం, తేమ శాతం పెరుగుదలపై ఆందోళన పెరగడంతో కర్షకుడికి ఆఖరికి దళారీలే దిక్కుగా మారుతున్నారు. తక్కువ ధరకై నా ధాన్యం ఇచ్చేద్దామన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అన్నదాతను ప్రకృతి భయపెడుతోంది. పండిన పంట తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతుంటే, వర్షాలతో జాగ్రత్తగా దాచుకోండని పాలకులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రకటనలతో అధికారులు చేతులుదులుపుకుంటే.. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. పైగా తేమ శాతం 17కు మించకుండా ఆరబెట్టుకోవాలని ఉన్నతాధికారులు సెలవిస్తుండడంతో సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. పంట విక్రయించే సమయంలో వాన పడటంతో ధాన్యం తడిసి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ మండకొడిగా సాగుతుండగా దీనికి తోడు వర్షాలు తోడై ధాన్యం తడిసిపోతున్నాయి. ధాన్యంలో తేమ శాతాన్ని తగ్గించేందుకు రైతులు రోడ్లుపైన, చేల వద్ద, కళ్లాల్లోను ఆరబెట్టారు. తాజాగా వర్షా లు పడుతుండటంతో ఆరబెట్టిన ధాన్యం తడుస్తోంది. ఽకొన్నిచోట్ల ధాన్యంపై టార్పాలి న్ కవర్లు కప్పారు. కొందరు రైతులకు టార్పాలిన్లు లేకపోవడంతో అలాగే వదిలేశారు. తేమ శాతం తగ్గాలని ఆరబె ట్టేందుకు సిద్ధమవుతున్న వేళ ఆ ధాన్యం తడవడంతో గగ్గోలు పెడుతున్నారు. చెప్పేదొకటి.. కనిపించేదొకటి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యల్లేవని, రైతులకు సరిపడా సంచులు, లారీలు ఉన్నాయంటూ ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాలో కొనుగోళ్లు కనీసం జరగడం లేదు. నెమ్మదిగా సాగుతున్నాయి. లారీలు కూడా అందుబాటులో ఉండటం లేదు. దీంతో రైతులు ధాన్యం విక్రయించడానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. జిల్లాలోని రైతులకు 80 లక్షల వరకు గోనె సంచెలు కావాలి. వారం రోజుల కిందటి వరకు ఒక్క గోనె సంచి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం 40లక్షల గోనె సంచులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 12లక్షల గోనె సంచులు కొనుగోలు కేంద్రాలకు పంపించామని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఎన్ని రైతుల వద్దకు చేరాయో ఎవరికీ తెలీదు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు 264మిల్లులకు ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేసిన మిల్లులన్నీ ధాన్యం వచ్చేలోపు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలి. ఇప్పటివరకు 188మంది మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చారు. వీరిలో అత్యధికం మూడు నాలుగు రోజుల్లో ఇచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో ఏడు వేల వరకు టార్పాలిన్లు అవసరం ఉండగా, గత ఏడాదికి చెందిన 3వేల టార్పాలిన్లతో పాటు మరో 1200 టార్పాలిన్లు సిద్ధం చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇవి కూడా రైతుల వద్దకు వెళ్లలేదు. కేంద్రాల్లో ఉన్నాయని చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. నరసన్నపేట: పోతయ్యవలస కూడలి వద్ద రోడ్డుపై ఉన్న ధాన్యం నిల్వలను పరిశీలిస్తున్న రైతు (ఇన్సెట్లో) దేవాది సర్వీసు రోడ్డులో తడిచిన ధాన్యాన్ని చూపుతున్న రైతు గతంలో ఇలా.. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ముందుకు రావడం లేదు. క్షేత్రస్థాయికి వెళ్లి రైతులతో ఎవరూ మాట్లాడలేదు. గత ప్రభుత్వంలో వర్షాలు వచ్చినప్పుడు ప్రభుత్వమే నేరుగా రైతుల వద్దకు వెళ్లి, అక్కడికక్కడే ఆన్లైన్ చేసి, ట్రక్షీట్ జనరేట్ చేసి కొనుగోలు చేసేది. రైతులకు నష్టమనే మాట ఉండేది కాదు. కానీ చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. వర్షాలకు భద్రంగా దాచుకోవాలన్న సూచనలు తప్ప రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వంపై నమ్మకం లేక, వర్షాలకు పంటను కాపాడుకోలేక దళారులకు తక్కువ ధరకు విక్రయించుకోక తప్పడం లేదు. నెమ్మదిగా కొనుగోళ్లు జిల్లాలో 406 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా సోమవారం ఉదయానికి 230 కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెరిచారు. వర్షాల నేపథ్యంలో సాయంత్రానికి మరో 73 కేంద్రాలు తెరిచారు. అక్టోబర్కే చాలా చోట్ల కోతలు జరిగి, ధాన్యం విక్రయానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కొనుగోళ్లు చేయలేదు. అక్టోబర్ 13న పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లాకొచ్చి సమీక్ష నిర్వహించి, తక్షణమే కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ, ఆయన చెప్పిన మాటలు దాదాపు 50 రోజులు దాటినా కార్యరూపం దాల్చలేదు. మొత్తానికి రైతుల వద్ద 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో ఉండగా, ప్రభుత్వం లక్ష్యం 6.50లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇంతవరకు 48,905మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అవస్థలు పడుతున్న అన్నదాతలు భయాందోళనకు గురి చేస్తున్న వర్షాలు ధాన్యం దాచుకోవడానికి నానా కష్టాలు సర్కారు నిర్లక్ష్యంతో నెమ్మదిగా కొనుగోళ్లు తేమ శాతం పెరుగుతుందని ఆందోళన -
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు మడపాం విద్యార్థిని
నరసన్నపేట: మడపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని జి.లోకేశ్వరి స్కూల్ గేమ్స్ కబడ్డీ విభాగంలో జాతీ య స్థాయికి ఎంపికై ంది. రాష్ట్ర స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపింది. జనవరి నెలలో విజయవాడలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఏపీ కబడ్డీ టీమ్కు ఎంపికైంది. ఈ మేరకు స్కూల్ హెచ్ఎం యు.భారతి, పీడీ బీ. లక్ష్మణరావు తెలిపారు. అండర్ 14 విభాగంలో జిల్లా కబడ్డీ జట్టుకు కెప్టెన్గా లోకేశ్వరి వ్యవహరించందన్నారు. ‘చంద్రబాబు రైతు ద్రోహి’ సారవకోట: చంద్రబాబు నాయుడు రైతు ద్రోహి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. సోమవారం ఆయన మండలంలోని అలుదు వీబీఆర్ కల్యాణ మండపంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నట్టేట ముంచేసిందన్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకపోవడంతో రై తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మిర్చి, పొగాకు, టమాటా, అరటి తదితర పంటలను రైతులు పండించి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులే నాశనం చేసుకునే దుస్థితి దాపురించిందని తెలిపారు. రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలను ఇప్పటి ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ పరం చేసేందుకు సన్నాహాలు చేస్తుందని, దీని కోసం పార్టీ తరఫున కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామని, దీని ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. 5న ‘మెగా పీటీఎం 3.0’ శ్రీకాకుళం పాతబస్టాండ్: మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్–3.0ను ఈ నెల 5న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తరఫున తల్లిదండ్రులు హాజరై పిల్లల భవిష్యత్తుపై ఉపాధ్యాయులతో ముఖాముఖి చర్చించాలన్నారు. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలు, కళాశాలల్లో ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పారు. -
కలెక్టర్ గ్రీవెన్స్కు.. కలెక్టర్ గ్రీవెన్స్కు 124 వినతులు వచ్చాయి. కలెక్టర్ వినతులు స్వీకరించారు. –8లో
ఇదీ పరిస్థితిరైతులకు కావాల్సిన గోనె సంచులు 80 లక్షలు వారం క్రితం వరకు ఒక్క సంచీ ఇవ్వలేదు. ఏర్పాటు చేయాల్సిన కొనుగోలు కేంద్రాలు 406 సోమవారం నాటికి తెరిచినవి 303రైతుల వద్ద అందుబాటులో ఉన్న ధాన్యం 9 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వ లక్ష్యం 6.50లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు కొనుగోలు 48,905 మెట్రిక్ టన్నులు -
సెగ తగిలింది మాట మారింది
● మాట మార్చిన ఆమదాలవలస ఎమ్మెల్యే ● ఉద్ధృతమైన పవర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమం ● ఎమ్మెల్యే కూన రవికుమార్ను నిలదీసిన ఆదివాసీలు ● ఊహించని విధంగా నిలదీయడంతో తన ప్రమేయమేదీ లేదని దాటవేత సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆమదాలవలస నియోజకవర్గం వెనకబడిన ప్రాంతం. ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది నా ఆశయం దాని కోసం థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నాను. గడిచిన శాసన సభ్యునిగా ఎన్నికై న దగ్గరి నుంచి నా కోరిక ఇది. అసలు పొల్యూషన్ ఎక్కడ ఉండదు. అన్నిచోట్లా ఉంటుంది. కానీ జాగ్రత్తలు తీసుకుని ప్లాంట్ ఏర్పాటు చేసేలా చూస్తాం. స్యూటిబులిటీ కోసం పరిశీలన జరిగింది. అంతా ఓకే అయితే ప్లాంట్ ఏర్పాటు చేసి తీరుతాను. ఎవరు అడ్డుకున్నా ఆగదు. – ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తరుచూ చెప్పె మాటలివి. వెనుకబడిన ఆమదాలవలస నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యమని ఎన్నో సార్లు కూన చెప్పారు. అసలక్కడ గిరిజనులు ఎక్కడున్నారని అన్నారు. ఆ ప్రాంతంలో సాగు ఎక్కడన్నారు. కాలుష్యానికి తావే లేదని కూడా చాలాసార్లు చెప్పారు. వీటిలో చాలా వాటికి వీడియోలు కూడా ఉన్నాయి. కానీ ఆయన ఇప్పుడొక్కసారిగా మాట మార్చేశారు. సోమవారం పింఛన్లు పంపిణీ చేద్దామని వెళ్లేసరికి అక్కడ గిరిజనులంతా పవర్ ప్లాంట్ నిర్మాణం నిలుపుదల చేస్తే తప్ప పింఛన్లు తీసుకోమని మొండికేసి నిలదీయడంతో తప్పించుకున్న వాడు ధన్యుడు సుమతి అన్నట్టు తానేమీ ప్రతిపాదించలేదని తప్పించుకున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించి మా పొట్టలు కొట్టొద్దని నిలదీసేసరికి ఆ ప్రతిపాదన తనది కాదని ప్రభుత్వంపై తోసేశారు. ప్రభుత్వం ఒకటి, తానొకటి అన్నట్టుగా సమర్థించుకున్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలన్నీ తప్పు అనేలా తేల్చి పారేశారు. జిల్లాలో కూన రవికుమార్ వైఖరి చాలా వివాదాస్పదంగా మారుతోంది. కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ వేధింపుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకు దారితీసింది. ఇసుక అక్రమాలు, ఆయన అనుచరుల దౌర్జన్యం రాష్ట్ర స్థాయిలో సంచలనమైంది. తాజాగా మద్యం కల్తీ చేసిన షాపు యజమాని ఆయన అనుచరుడు కావడంతో చర్చనీయాంశమైంది. చివరికి జెడ్పీలో మంత్రులను, అధికారుల నిలదీసే విధంగా మాట్లాడిన వ్యవహారం రచ్చకు దారితీసింది. ప్రభుత్వ ఉద్యోగులపై నోరు పారేసుకోవడం, పరుషంగా మాట్లాడటం, అక్రమాల్లో ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయంపై ఆరోపణలు రావడం, భూముల ఆక్రమణలో ఆయనపై విమర్శలు రావడం, ఇలా ప్రతీది ఆయన చుట్టూ జరుగుతోంది. చివరికి ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో ఏర్పాటు చేయబోతున్న థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలోను టార్గెట్ అయ్యారు. దానికంతటికీ పవర్ ప్లాంట్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం. తాడోపేడో తేల్చుకునే పనిలో బాధితులు ఆందోళనలు చేస్తున్నా, నిరసన స్వరం విన్పిస్తున్నా ప్రభుత్వం లెక్క చేయకుండా రహస్య సర్వేలు చేయడంతో బాధితులు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వంతో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. గతంలో థర్మల్ పవర్ ప్లాంట్కు సానుకూలంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్ ముందు నిరసనకు దిగారు. తీవ్ర నిరసన స్వరం వినిపించారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు వచ్చిన ఆయన్ని గిరిజనులంతా నిలదీశారు. ఇందులో తన తప్పేమీ లేదని నచ్చ చెప్పుకోవాల్సి వచ్చింది. థర్మల్ రద్దు చేశాకే రండి.. బూర్జ, సరుబుజ్జిలి మండలాల పరిధిలోని అన్నంపేట, బొడ్లపాడు, జంగాలపాడు, మసానపుట్టి, జేవీ పురం, బసిమామిడివలస, వెన్నెలవలస గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దీంతో అన్నిచోట్లా గిరిజనులు ఎమ్మెల్యేను అడ్డుకుని నిలదీశారు. తమ భూములు, తమ బతుకులు లాక్కుని పింఛన్ల పంపిణీ కోసం మా గ్రామాలకు ఎలా వచ్చారని ఎమ్మెల్యేను ప్రశ్నించి పింఛన్లు తీసుకోవడానికి నిరాకరించి నిరసనలు తెలిపారు. థర్మల్ ప్లాంట్ రద్దు చేసి మాత్రమే తమ గ్రామాలకు రావాలన్నారు. భయాందోళనలో గిరిజనులు.. సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. రూ.30వేల కోట్లతో 1500 ఎకరాలకు పైగా 3200 మెగావాట్ల థర్మల్ క్రిటికల్ సూపర్ ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్ను నిర్మించాలని చూస్తోంది. సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో బొడ్లపాడు, జె.విపురం, అనంతగిరిపేట, వెన్నెలవలస 1, వెన్నెలవలస–2, గోపిదేవిపేట, మసానపుట్టి, బూర్జ మానుగూడ, జంగాలపాడులో రెండు విడతల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటైతే సుమారుగా 18 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగం జరగనుండగా, సుమారు 12టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. కోటి 40లక్షల లీటర్ల మేర హైస్పీడ్ డీజిల్ కావాల్సి ఉంటుందని ఆందోళనకారులు చెబుతున్నారు. ప్లాంట్ కోసం భూములను కోల్పోవడమే కాకుండా 20 గ్రామాల మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆందోళనలు ఉద్ధృతమవుతుంటే యు వత ఉపాధి కోసం పవర్ ప్లాంట్ పెట్టి తీరుతామని, అభివృద్ధిని అడ్డుకుంటే అంతు చూస్తామ ని పాలక పక్షం నుంచి బెదిరింపులు వస్తున్నాయి. నాడు జరిగిన సోంపేట, కాకరాపల్లి థర్మల్ ప్లాంట్లు వేరు, అక్కడ పరిస్థితులు వేరు, ప్పుడు ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ వేరు, ఇక్కడ పరిస్థితులు వేరని సమర్థిస్తూ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళనకు లోనయ్యారు. నిరసనలు తెలియజేస్తున్నారు. బహిరంగ సభలు పెట్టి తమ ఆవేదన తెలియజే శారు. నిరసన ర్యాలీలు చేస్తున్నారు. రోజురోజుకి ఉద్యమం ఉద్ధృతమవుతోంది. థర్మల్ దెబ్బ -
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
● జిల్లా వ్యవసాయ అధికారి కె.త్రినాథస్వామి జలుమూరు: వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, కళ్లాలకు చేరిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో కప్పుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కె.త్రినాథస్వామి అన్నారు. ఆయన సోమవారం చల్లవానిపేట, లింగాలవలస, జలుమూరులో పర్యటించి రైతులతో మాట్లాడారు. వరికుప్పల్లోకి వర్షం నీరు దిగకుండా చూసుకోవాలన్నారు. తడిచిన వాటిపై ఉప్పు ద్రావణం వేయాలన్నారు. చల్లవానిపేట మిల్లులో తనిఖీ చేసి నాణ్య త, తేమ శాతం పరిశీలించారు. కొందరు రైతులు మాట్లాడుతూ మిల్లర్లు వారి సొంత మీటర్లు ద్వారా తేమ శాతం చూస్తున్నారని ఈయన దృష్టికి తెచ్చారు. బస్తాకు అదనం ధాన్యం తీసుకుంటే చర్యలు తప్పవన్నారు. -
కనుల విందు..!
కాలు కదిపితే..ఇచ్ఛాపురం రూరల్: జానపద కళలకు పుట్టినిల్లు మన పల్లెలు. రోజంతా శారీరక శ్రమతో సాయంత్రం ఇళ్లకు చేరిన ప్రజలకు ఈ కళలే ఆట విడుపు. సాంప్రదాయ కళలుగా భావించే పండారి భజనలు, కోయ నృత్యాలు, చిడతల భజన, అంజాట, కోలాటంకు ఒకప్పుడు విశేష ఆదరణ లభించేది. మారుతున్న కాలంతో పాటు ఇవి కూడా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం క్రమేపీ వీటికి మరలా ఆదరణ పెరుగుతోంది. పండగలు, గణేష్, నవరాత్రులు, గ్రామ దేవత ఉత్సవాలు సందర్భంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుండడం, వాటికి జనాదరణ పెరుగుతుండడం శుభ పరిణామంగా భావిస్తున్నారు. ముఖ్యంగా కోలాటం నృత్యానికి ఈ మధ్య కాలంలో విశేష ఆదరణ లభిస్తోంది. పండగలు, జాతరలు వస్తే చాలు గ్రామాల్లో కోలాటం సందడి కనిపిస్తోంది. ఆధునిక పాటలకు కోలాటం నృత్యాలు తోడై కనులవిందు చేస్తున్నాయి. ఇటీవల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ నృత్యాల వైపు మహిళలతో పాటు చిన్నారులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ప్రతీ మండలంలోనూ నాలుగైదు వరకు కోలాట బృందాలు ఏర్పడుతున్నాయంటే పల్లెల్లో కోలాటానికి ఎంత ప్రాచూర్యం లభిస్తుందో ఇట్టే చెప్పవచ్చు. గురువుల వద్ద శిక్షణ సినిమాలు, ఇబ్బడిముబ్బడిగా పెరిగిన టీవీ చానెళ్లు, వాటిలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను ప్రతిరోజూ తిలకించే పల్లె వాసుల్లో ఏదో తెలియని వెలితి కనిపిస్తోంది. ప్రత్యామ్నాయంగా కనుమరుగువుతున్న కొన్ని కళలపై మక్కువ పెరిగింది. దీంతో వీటిని ప్రోత్సాహించే దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా పండగలు, అమ్మవారి ఉత్సవాలు, నందన్న ఉత్సవాలు తదితర సందర్భాల్లో కోలాటం ప్రదర్శించేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో కొంతమంది పెద్దలు సాంప్రదాయ కళలకు సానబెడుతున్నారు. కొత్త తరానికి వాటిని పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం సాయంత్రం వేళల్లో మహిళలు, బాలికలు కోలాటం నేర్చుకోవడంలో నిమగ్నమవుతున్నారు. కోలాటం గురువుల వద్ద శిక్షణ తీసుకుంటున్నారు.ఇప్పటికే నాకు వందలాది మంది బాలబాలికలకు పండారి చెక్క భజనలో శిక్షణ ఇచ్చిన అనుభవం ఉంది. ప్రస్తుతం మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా కోలాటం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత కల్పించేందుకు కంకణం కట్టుకున్నాను. ఐదేళ్లలో తొమ్మిది కోలాటం బృందాలు, పది వరకు పాండురంగ నృత్య కళా బృందాలను తయారు చేయడం జరిగింది. ఉత్సాహవంతులు నన్ను సంప్రదిస్తే వారికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. – తిప్పన ధనుంజయరెడ్డి, నంది అవార్డు గ్రహీత, టి.బరంపురం, ఇచ్ఛాపురం మండలం మా ఊర్లో మేమంతా కోలాటం నేర్చుకుంటున్నాం. కోలాటం నేర్చుకునేందుకు నా భర్తతో పాటు అత్త, మామయ్య, పిల్లలు ప్రోత్సాహిస్తున్నారు. ఇంట్లో పనులు ముగించి ప్రతిరోజూ సాయంత్రం 2 గంటల పాటు కోలాటం నేర్చుకుంటున్నాను. ఏడాది క్రితం నేర్చుకున్న మా బృందం తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధానంలో ప్రదర్శించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. – లండ సుశీల, బొడ్డఖాళి గ్రామం, ఇచ్ఛాపురం మండలం ఒకవైపు చదువుకుంటూనే ప్రతిరోజు రాత్రి సమయాల్లో మా ఊర్లో కోలాటం నేర్చుకుంటున్నాను. దేవుడి పాటలకు కోలాటం చేస్తుంటే అందరూ నన్ను ప్రశంసిస్తుంటారు. కోలాటం నేర్చుకోవడం వలన మానసిక ప్రశాంతతతో పాటు మంచి వ్యాయామం లభిస్తోంది. – దుర్గాశి హారతిరెడ్డి, హరిపురం, ఇచ్ఛాపురం మండలం -
గ్రంథాలయాలు..!
సమస్యలకు నిలయాలు..● సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ● అరకొర వసతులతో అవస్థలు ● సెస్ బకాయిలు రూ.35 కోట్లు శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో గ్రంథాలయాలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. పాఠకుల తాకిడి బాగానే ఉన్నా వసతుల లేమితో నిరుద్యోగులు వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. నిధుల లేమితో పాటు నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఇబ్బందిగా మారుతోంది. జిల్లాలో 45 గ్రంథాలయాలు, బుక్డిపో సెంటర్ల 100, విలేజ్ లైబ్రేరీలు 5 ఉన్నాయి. వీటిలో కేవలం రికార్డు అసిస్టెంట్లు ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఆఫీస్ అసిస్టెంట్లు 19 మంది ఉండాల్సి ఉండగా.. కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 104 పోస్టులకు గానూ 83 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న అన్ని గ్రంథాలయాలకూ సొంత భవనాలు ఉన్నప్పటికీ.. కొత్తూరు, కోటబొమ్మాళి లైబ్రేరీలకు మాత్రం సొంత భవనాలు లేవు. గ్రంథాలయాలకు అధికంగా దినపత్రికలు, మ్యాగజైన్లు, పోటీ పరీక్షల పుస్తకాలు చదవడానికి నిరుద్యోగ పాఠకులు వస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ అభ్యర్థులు గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. సెస్ బకాయిల పరిస్థితి గ్రంథాలయాల అభివృద్ధి కోసం ఇంటి పన్నులో 8 శాతం సెస్ను స్థానిక సంస్థలు వసూలు చేస్తుంటారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు సెస్ రూపంలో అందించాల్సిన బకాయిలు సమయానుకూలంగా జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నాయి. దీని ప్రభావం గ్రంథాలయాల అభివృద్ధిపై పరోక్షంగా పడుతోంది. పంచాయతీల నుంచి రావాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. జిల్లా గ్రంథాలయానికి దాదాపు రూ.35 కోట్ల వరకూ సెస్ బకాయిలు రావాల్సి ఉంది. 2020 నుంచి దాదాపుగా ఐదేళ్ల కాలానికి గాను ఈ సెస్ బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు పేరుకుపోవడంతో గ్రంథాలయాల నిర్వహణ మరింత భారంగా మారుతోంది. ఈ సెస్ బకాయిలు విడుదలైతే తప్ప నిర్వహణ గాడిన పడే అవకాశాలు కనిపించడం లేదు. వసతులు లేక తిప్పలు ఉదయం నుంచి గ్రంథాలయానికి అంకితం అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు సరిపడా సౌకర్యాలు ఉండడం లేదు. అలాగే మరుగుదొడ్లు సరిగా లేక యువతులు ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు కొలువు కోసం సన్నద్ధమయ్యే వారికి అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో వాటిని కొనుక్కోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రచురించే మేగజైన్లు సైతం అందుబాటులో ఉంచకపోవడంతో వారు నిరుత్సాహపడుతున్నారు. పలు సందర్భాల్లో దాతల ప్రోత్సాహంతో సమకూరుతున్న పుస్తకాలు, స్టడీ ప్యాడ్లు వంటి వాటి వలన నిరుద్యోగులకు కొంత ఊరట లభిస్తోంది. గత ఐదేళ్లుగా సెస్ బకాయిలు పేరుకుపోయాయి. సెస్ బకాయిలను చెల్లించి గ్రంథాలయాలను ఆదుకోవాలి. సెస్ బకాయిల విషయాన్ని ఈవోపీఆర్డీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. బకాయిలను సకాలంలో చెల్లించకపోవడం వలన గ్రంథాలయాల నిర్వహణ భారంగా మారుతోంది. – వీవీజీఎస్ శంకరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి(ఎఫ్ఏసీ) -
ఇద్దరు వ్యక్తులు అరెస్టు
పలాస: ద్విచక్ర వాహనాలు, ఇతర దొంగతనాలకు సంబంధించిన కేసుల్లో ఇద్దరు వ్యక్తులను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కాశీబుగ్గ ఇన్చార్జి డీఎస్పీ లక్ష్మణరావు కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో ఆదివారం వివరాలు వెల్లడించారు. అరైస్టెన వ్యక్తుల్లో ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీ దుప్పలవలస గ్రామానికి చెందిన బూషర లక్ష్మణరావు, శ్రీకాకుళం టౌను పరిధిలోని గుజరాతీపేటకు చెందిన పిండ్రాల చిన్నిలు ఉన్నారు. వీరు అక్టోబరు 4వ తేదీన కాశీబుగ్గ టౌన్లోని మోర్ సూపర్ మార్కెట్కు ఎదురుగా పార్కింగ్ చేసిన పల్సర్ బైక్ను దొంగిలించారు. అలాగే అక్టోబర్ 12న కాశీబుగ్గ ఆంధ్రాబ్యాంకు వీధిలో ఒక ఇంటి వరండాలో ఉన్న మరో పల్సర్ బైక్ను కూడా దొంగలించి పట్టుకుపోయారు. అక్టోబరు 15న కాశీబుగ్గ టౌన్ చిన్న తిరుపతి ఆలయం వద్ద పార్కింగ్ చేసిన మరో ద్విచక్ర వాహనాన్ని దొంగలించారు. అలాగే కాశీబుగ్గలోని అన్నా క్యాంటిన్ వద్దనున్న స్కూటీని కూడా కొట్టేశారు. అదేవిధంగా శ్రీకాకుళం, బొబ్బిలి ప్రాంతాల్లో కూడా పలు దొంగతనాల కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని డీఎస్పీ వెల్లడించారు. కాశీబుగ్గలో దొంగలించిన ఒక బైక్లో పలాస నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తుండగా కాశీబుగ్గ పోలీసు వారిని గుర్తించి పట్టుకొని అరెస్టు చేశారన్నారు. వారు దొంగిలించిన బైకులను, 3 సెల్ఫోన్లను రికవరీ చేశామన్నారు. వీరిని అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. సమావేశంలో కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు సాహిత్యానికి వెలుగు జాడ గురజాడ
శ్రీకాకుళం కల్చరల్: తెలుగు సాహిత్యానికి వెలుగు జాడ గురజాడ అప్పారావు అని ప్రజా సాహితీ సంపాదకుడు పీఎస్ నాగరాజు అన్నారు. శ్రీకాకుళం నగరంలో జన సాహితీ ఆధ్వర్యంలో చావలి శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన గురజాడ అప్పారావు వర్ధంతి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలుగు భాష, తెలుగు ప్రజలు ఉన్నంతకాలం ఆయన రచనలు సజీవంగా ఉంటాయని పేర్కొన్నారు. జన సాహితీ సభ్యుడు కె.బాలకృష్ణ గురజాడ రాసిన దేశభక్తి గేయం దేశమును ప్రేమించుమన్నా గేయాన్ని రాగయుక్తంగా ఆలపించారు. జనసాహితీ సభ్యుడు ఎల్.నరేష్ గురజాడ తాత్వికతపై మాట్లాడారు. పదాలు మళ్లీ ఊపందుకున్నాయి అనే అల కవితను పూజారి సూర్యనారాయణ ఆలపించారు. గురజాడ రచనల నేపథ్యంలో వర్తమాన కాల పరిస్థితులను ఎస్.భాస్కరరావు వివరించారు. జనసాహితీ జిల్లా కార్యదర్శి పి.మోహనరావు కళా అభిరుచి అనే అంశంపై మధురవాణి పాత్రను విశ్లేషణ చేశారు. గురజాడ అప్పారావు మరణించిన సందర్భంలో అతని కుమారునికి గిడుగు రామ్మూర్తి రాసిన లేఖను తమ్మినేని సూర్యనారాయణ చదివి వినిపించారు. సమావేశంలో సాహిత్య అభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం
శ్రీకాకుళం అర్బన్: నగరంలోని ఏపీ ఎన్జీవో కార్యాలయంలో ఏపీ హియరింగ్ హ్యాండీక్యాప్డ్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవంగా ఆదివారం జరిగింది. ఈ ఎన్నికలకు ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా కోశాధికారి బడగల పూర్ణచంద్రరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా.. సైన్ లాంగ్వేజ్ ఇంటర్ర్పిటర్ నర్మజ సహకారం అందించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఉద్యోగస్తులంతా సంఘటితంగా ఉండి సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. సంఘ ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. నూతన కార్యవర్గం ఏపీహెచ్హెచ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా యు.ప్రసాద్ (సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్), కార్యదర్శిగా జి.రవిశంకర్ నాగ్ (రిమ్స్ శ్రీకాకుళం), ఉపాధ్యక్షులుగా ఎ.అశోక్ కుమార్ (ఓఎస్ బీసీ వెల్ఫేర్), జి.శ్రీనివాసరావు (ఓఎస్ ఐసీడీసీ శ్రీకాకుళం), ఆర్గనైజేషన్ సెక్రటరీగా కె.తరుణ్ కుమార్ (టైపిస్ట్ కలెక్టరేట్ శ్రీకాకుళం), కోశాధికారిగా ఎస్.సాయికృష్ణ (టైపిస్ట్ ఎంపీడీవో కార్యాలయం ఎల్ఎన్పేట), జాయింట్ సెక్రటరీగా కె.వి.గౌతమ్ (పీఎస్వీఐ డిజిటల్ అసిస్టెంట్ గ్రామ పంచాయతీ టెక్కలి), ఉమెన్ సెక్రటరీగా ఎన్.దివ్యశ్రీ (ఎల్డీసీ, పీహెచ్సీ ఆమదాలవలస), ఎగ్జిక్యూటివ్ ఈసీ మెంబర్ ఉమెన్ జి.లక్ష్మి(కుక్, గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ శ్రీకాకుళం), ఈసీ మెంబర్1, 2గా ఎ.త్రినాథరావు (ఆఫీస్ సబార్డినేట్, కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ ఆమదాలవలస), ఎం.బాలరాజు (ఓఎస్ ఎంపీడీవో ఆఫీస్ సారవకోట) ఎంపికయ్యారు. -
లావేరులో పురిల్లు దగ్ధం
రణస్థలం: లావేరు గ్రామానికి చెందిన నడుపూరి ఏసురత్నం పురిల్లు అదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. వెంటనే గుర్తించిన బాధితులు రణస్థలం అగ్నిమాపక వాహనానికి సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిళ్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గురువు శ్రీకాకుళం: నగరంలోని దాసరి క్రాంతి భవన్లో ఎస్వీ రమణమూర్తి అధ్యక్షతన ఎస్టీయూ వార్షిక కౌన్సిల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. జిల్లా అధ్యక్షుడిగా పేడాడ ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శిగా గురువు శ్రీనివాసరావు, ఆర్థిక కార్యదర్శిగా కంచరాన తేజేశ్వరరావులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి డి.శ్యామ్ వ్యవహరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడిచినా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని వాపోయారు. అనంతరం సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని, 12వ పీఆర్సీ వెంటనే ప్రకటించాలని తీర్మానించారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీకాకుళం క్రైమ్: కోటబొమ్మాళిలోని ఎత్తురాళ్లపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్కు చెందిన నలుగురు మృత్యువాత పడినప్పటికీ ఇటు పోలీసులు తీరుగానీ, అటు వాహనదారుల తీరుగానీ మారడం లేదు. ఎప్పటిలాగే రోడ్లపైనే గంటల తరబడి వాహనాలు నిలిపివేస్తున్నారు. ఎత్తురాళ్లపాడు ఘటన జరిగాక కూడా జిల్లాలో ప్రమాదాలు పెరిగాయి. ఆమదాలవలస ఫ్లై ఓవర్ వంతెన వద్ద కొబ్బరికాయల లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం ప్రమాదంలో కొడుకు ముందే కన్నతల్లి మృత్యువాత పడింది. పలాస మండలం గరుడఖండి పాత జాతీయ రహదారిపై ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కవిటి మండలం ఆర్.కరాపాడు టోల్గేట్ వద్ద దాబాలో పనిచేస్తున్న వ్యక్తిని భారీ వాహనం ఢీకొట్టి మృత్యువాత పడ్డాడు. కేవలం నవంబర్ నెలలోనే 16 మందికి పైగా చనిపోయారు. ఈ పరిస్థితుల్లో రోడ్లపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఈ మేరకు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థులకు హిందీపై అభిరుచి పెరగాలి శ్రీకాకుళం: విద్యార్థులకు హిందీ సబ్జెక్టుపై అభిరుచి పెంచేందుకు హిందీ ప్రతిభా పరీక్షలను నిర్వహిస్తున్నామని హిందీ మంచ్ గౌరవాధ్యక్షుడు దొంతం పార్వతీశం అన్నారు. శ్రీకాకుళంలో 80 ఫీట్ రోడ్లోని బీకేఎస్ జూనియర్ కళాశాలలో హిందీ మంచ్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ హిందీ సిలబస్పై హిందీ సేవా సదన్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందీ ప్రతిభా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభా పరీక్షలను నిర్వహించి, విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు, పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయి టాపర్స్కు మెడల్స్, నగదు బహుమతులను ప్రదానం చేయనున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో విశేష ప్రతిభ కనబరిచిన టాపర్స్కు హిందీ ప్రతిభా రత్న అవార్డుతో సన్మానం చేయనున్నట్లు తెలిపారు. టాలెంట్ టెస్ట్కు ఉత్తరాంధ్ర జిల్లాల సంయోజక్గా కోనే శ్రీధర్ను నియమించామన్నారు. సమావేశంలో కె.సత్యం, ఆర్.రామారావు, ఎస్.రాధ తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
మెళియాపుట్టి: ఎవరూ లేని సమయం చూసి తాళాలు వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన సంఘటన ఆదివారం పెద్దమడి గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు జినగ చంద్రావతి గ్రామంలోని తన ఇంటి ముందు చిన్న పాన్షాప్ పెట్టుకుని జీవిస్తోంది. ఈమె భర్త చాలాక్రితం మృతి చెందారు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు అవ్వడంతో శ్రీకాకుళంలో నివాసముంటున్నారు. చంద్రావతి పెట్టుకున్న పాన్షాప్లో వ్యాపారం సరిగాలేక పదిరోజుల క్రితం శ్రీకాకుళం వెళ్లింది. ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే గేట్కు వేసిన తాళాలు వేసినట్లే ఉండి.. ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోని బీరువా తెరిచి రూ.5000ల నగదు, రెండు జతల చెవి పోగులు, పుస్తెలు దొంగలు దోచుకెళ్లారు. వెంటనే ఆమె మెళియాపుట్టి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఇంటిని పరిశీలించారు. -
యువ కళాకారుడి హత్య దారుణం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): గంజాయి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వివిధ కళారూపాలతో ప్రజలను చైతన్య పరుస్తున్న యువ కళాకారుడు పెంచలయ్యను హత్య చేయడం దారుణమని సాంస్కృతిక ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో అంబేడ్కర్ కూడలి వద్ద ఆదివారం ఆయన మృతికి నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి ముఠా ఒక పథకం ప్రకారం ప్రజా నాట్యమండలి కళాకారుడు, డీవైఎఫ్ఐ మాజీ నాయకుడిని హత్య చేశాయన్నారు. హత్య కారకులను గుర్తించి, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో ఇటీవల కాలంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి సంస్కృతికి వ్యతిరేకంగా ఆయన ప్రజలను చైతన్య పరచడానికి అనేక కళారూపాలను రూపొందించి ప్రదర్శించాడు. పోలీస్ శాఖ సహకారంతో కూడా కొన్ని కార్యక్రమాలు చేశాడు. గంజాయి మానడంటూ స్థానికంగా ప్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారని, ఇది స్థానిక గంజాయి ముఠాకు ఏమాత్రం నచ్చలేదన్నారు. దీంతో కొంతకాలంగా ఆయన కదలికలపై నిఘా వేసి హత్య చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్య ముఠాలను పసిగట్టి నివారించడంలో వైఫల్యం చెందిందని, పోలీసు నిఘా వ్యవస్థకు ఉద్యమాలను అణచివేయడంపై ఉన్న శ్రద్ధ మాదక ద్రవ్యాల ముఠాలను నిర్మూలించడంలో లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు బి.కృష్ణమూర్తి, పి.తేజేశ్వరావు, కె.నాగమణి, పి.ప్రసాదరావు, ఎ.లక్ష్మి, ఆర్.ప్రకాశరావు, ఎం.గోవర్దనరావు, ఎ.సత్యం, ఎం.ఆదినారాయణమూర్తి, ఎన్.రమణ, పి.ఖగేష్, పి.సుధాకర్, కేధారేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
సారవకోట: మండలంలోని చిన్నగుజ్జువాడ గ్రామానికి సమీపంలో ఆదివారం ట్రాక్టర్ బోల్తాపడి అలుదు గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బల్లా లక్ష్మణరావు (33) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేళవలస నుంచి సారవకోట మీదుగా కొమ్ముసరియాపల్లి వైపు వెళ్తున్న ట్రాక్టర్ గ్రామానికి సమీపంలో ఉన్న మలుపు దగ్గర అదుపు తప్పి పక్కనే ఉన్న పొలంలో పడిపోయింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ క్రింద ఉండి మృతి చెందాడు. స్ధానికులు స్పందించి ట్రాక్టర్ను తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ అనిల్కుమార్ పరిశీలించి శవ పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం తరలించారు. మృతుడికి భార్య నీలవేణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పడవ బోల్తాపడి మత్స్యకారుడు మృతి శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పక్కలపేట గ్రామానికి చెందిన గనగళ్ల తోటయ్య (57) చేపల వేటకు వెళ్లి ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సముద్రంలో వేట చేస్తుండగా ఒక్కసారిగా తెప్ప బోల్తా పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శిక్షల్లో కొన్ని..
మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు గణాంకాలు ఇలా.. జిల్లాలో రహదారి భద్రతను మెరుగుపర్చడం, ప్రమాదాలను తగ్గించడం, బహిరంగంగా మద్యం సేవించి పబ్లిక్ న్యూసెన్సు చేసే వారిని అరికట్టే దిశగా కఠిన చర్యలు చేపట్టినట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు 2025 ఏడాదికిగాను ఇప్పటివరకు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులకు సంబంధించి గణాంకాలను ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేశారు. 17,509 నేరారోపణ రుజువై జైలు శిక్ష పడిన కేసులు 28 వీటిల్లో 2 నెలలు ఒక కేసు, 45 రోజులు ఒక కేసు, నెల రోజులు 8 కేసులు, 20 రోజులు 4 కేసులు, 10 రోజులు 2 కేసులు, 7 రోజులు 11 కేసులు, 2 రోజులు ఒక కేసులో శిక్షలు పడ్డాయి. న్యాయస్థానం విధించిన మొత్తం జరిమానా (డిస్పోజల్)లు : జైలుకు పంపుతున్నాం.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జైలుకు పంపుతున్నాం. ఎన్ని రోజులు శిక్ష అన్నది ముద్దాయి చేసే న్యూసె న్సు, న్యాయమూర్తి విచక్షణాధికారాన్ని బట్టి ఆధార పడి ఉంటుంది. పోలీసుల ప్రమేయమేమీ ఉండదు. జిల్లాలో అన్ని చోట్లా కేసులు కడుతున్నాం. జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే ప్రయత్నంలో వాహనదారులపై కేసులు కట్టి అధికంగా చలానాలు విధిస్తున్నాం. విధుల్లో ఉన్న సిబ్బందిపై తిరగబడిన వారిపై కఠిన చర్యలుంటాయి. అలాంటివారిపై జాలి ఉండదు. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం 8,594 అన్ని కేసులకు మొత్తం జరిమానా సొమ్ము : రూ. 38,16,555 రూ. 10 వేలు జరిమానాకు గురైన కేసులు 113 అడుగుకో బెల్టు షాపు, మలుపునకో మద్యం షాపుతో ఊళ్లు నిత్యం మత్తులో జోగుతున్నాయి. సర్కారు వారి సంపద సృష్టి కోసం సామాన్యులు సమిధలైపోతున్నారు. పొద్దంతా కష్టపడి వచ్చిన కూలి డబ్బును బెల్టుషాపు గల్లా పెట్టెలో పోసి ఓ సామాన్యుడు పోలీసులకు దొరికిపోతున్నాడు. విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యంపై నుంచి దృష్టి మరల్చలేక మరో సగటు జీవి కటకటాలపాలవుతున్నాడు. పూటుగా తాగి పోలీసులకు దొరికిపోతున్న మందుబాబులు సంపాదనలో సగం డబ్బును మద్యం షాపులకు మిగిలిన డబ్బును జరిమానాలకు కట్టేసి ఇంటికి ఖాళీ జేబులు చూపిస్తున్నారు. పైగా పోలీసులతోనే తగువులకు దిగుతున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : ఇరవై ఎనిమిది మందికి జైలు శిక్ష.. వీరంతా మద్యం తాగి పోలీసులకు దొరికిన వారే. 113 కేసుల్లో రూ.10వేల చొప్పున జరిమానా. వీరు కూ డా మద్యం ప్రియులే. ప్రభుత్వం ప్రతి మలుపులోనూ మద్యం దొరికేలా ‘జాగ్రత్తలు’ తీసుకోవడంతో మందుబాబులు అటు ఒళ్లు గుల్ల చేసుకుంటూ ఇటు జేబులకు కూడా చిల్లు పెట్టుకుంటున్నారు. కూటమి పాలనలో మద్యం విచ్చలవిడిగా దొరుకు తోంది. ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న బెల్టుషాపులే అందుకు నిదర్శనం. ప్రైవేటు లైసెన్సు దుకాణాల్లోనే కాక ఉదయం 6 గంటల నుంచే కొన్ని చోట్ల బార్లు తెరవడం, గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ బెల్టుషాపులు వెలియడంతో మందుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాగిన మత్తులో దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు జరిగిన వైనాలు ఎన్నో వెలుగు చూశాయి. అంతేకాక రహదారి నియమనిబంధనలు ఉల్లంఘించి మితి మీరిన వేగంతో ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసులెవరైనా తనిఖీ చేస్తే వీరి హంగామా మామూలుగా ఉండడం లేదు. ఒకటో పట్టణం.. ఒకటో నంబర్ జిల్లావ్యాప్తంగా చూసుకుంటే సగానికి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో శిక్షలు పడింది శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోనే. ఇక్కడ గంజాయి బ్యాచ్లు, మందుబాబులు నిత్యం గొడవలు, దొ మ్మీలు చేస్తూ నిత్యం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడి ఎస్ఐ ఎం.హరికృష్ణ 19 మందికి పైగా మందుబాబులను ఓపెన్ డ్రింకింగ్ పేరిట కేసులను కట్టి జైలుకు పంపి కట్టడి చేశారు. 2 రోజులు, వారం, 14, 15, 20, నెల, 45 రోజులు ఇలా మందుబాబులు చేసే న్యూసెన్సు బట్టి న్యాయమూర్తి శివరామకృష్ణ జైలు శిక్షలు ఖరారుచేశారు. టూటౌన్లో సీఐ ఈశ్వరరావు నలుగురిపై ఓపెన్ డ్రంక్ కేసులు కట్టి జైలుకు పంపారు. ఇక ట్రాఫిక్ పీఎస్ పోలీసులైతే 354 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కట్టి ఆరుగురిని జైలుకు పంపారు. పూటుగా తాగి పోలీసులకు చిక్కుతున్న మందుబాబులు తనిఖీ చేసే లోపే హడావుడి చేస్తున్న వైనం న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్న పోలీసులు విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యమే కారణం మద్యం సేవించి వాహనం నడిపినందుకు టెక్కలి పీఎస్ పరిధిలో నమోదైన 10 కేసుల్లో కొల్లి సీతయ్య, రాజు చౌదరి, కొర్నాన దుర్యోధన, మట్ట మోహనరావు, అంబటి జోగారావు, సిర్ల ప్రసాద్, తెంబూరు సోమేశ్వరరావు, సన పల రామారావు, కొమటూరు భాస్కరరావు, దుప్పలపూడి శంకరరావులకు కోర్టు ఒక్కొక్కరికీ రూ. 10 వేలు జరిమానా విధించింది. అంతకుముందు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన పసుపురెడ్డి నరేష్, అట్టాడ నాగరాజులకు ఇలాంటి శిక్షే అమలు చేశారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వన్వే ఉల్లంఘన– ప్రమాదకర డ్రైవింగ్తో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ను ఈడ్చుకెళ్లిన ఎన్ని శ్రీనివాసరావుకు 7 రోజులు జైలు శిక్ష పడింది. ఇటీవల చినబరాటం వీధిలో మద్యం సేవించి హల్ చల్ చేసిన పాత నేరస్తుడు జొన్నా రవికుమార్కు 30 రోజులు జైలు శిక్ష పడింది. వాంబేకాలనీ రోడ్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ముంజేటి రవిమోహన్కు నెల రోజుల జైలు శిక్ష పడింది. అరసవల్లి మిల్లు జంక్షన్ వద్ద బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి ప్రజలను ఇబ్బందిపెట్టినందుకు కాగన గణే ష్కు నెల రోజుల జైలు శిక్ష పడింది. కాశీబుగ్గ హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసరావు విధులకు ఆటంకపరిచి దాడిచేసిన కేసులో బోసి రాంబాబు అనే వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష పడింది. -
వణుకుతున్న తాళ్లవలస
● గ్రామంలో ప్రబలుతున్న డయేరియా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా ప్రబలుతోంది. ఊరిలో 800 మంది జనాభా ఉన్నారు. పారిశుద్ధ్య లోపం, తాగునీరు కలుషితం కావడం వల్ల డయేరియా వ్యాప్తి చెందిందని స్థానికులు చెబుతున్నారు. సమీప పొలాల్లోని బావి వద్ద నుంచి మోటార్లతో గ్రామంలోని ఇళ్ల వద్దకు పైపులైన్లు ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఆ నీటిని తాగి ఆదివారం గ్రామంలో చాలా మంది వాంతులు, విరేచనాలతో టెక్కలి జిల్లా ఆస్ప త్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మార్పు చిన్నారావు(65)అనే వ్యక్తి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గున్మ రుద్రమ్మ, సీపాన కొండయ్య చికిత్స పొందుతుండగా గున్న పాపారవు, చల్ల రాములు మరికొందరు ఇళ్లకు వెళ్లిపోయారు. కారణాలివేనా..? ● గ్రామానికి సంబంధించి ఇంటింటికీ కుళాయి ఉ న్నప్పటికీ కుళాయిలకు తాగునీరు వచ్చే బోరు మా త్రం గ్రామం శివారులోని పంట పొలాల్లో ఉంది. ● ప్రస్తుతానికి పంటల సీజన్ కావడంతో పొలాలకు వాడే ఎరువులు, క్రిమిసంహారక మందులు ఆ నీటిలో కలుస్తున్నాయనే అనుమానం ఉంది. ● ఊరిలోనూ పారిశుద్ధ్య పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. ● మురుగునీటి కాలువల్లో పూడికలు తీయలేదు. పారిశుద్ధ్య కార్మికులు వారానికి రెండు రోజులు మాత్రమే వస్తున్నారు. ● ఓ వ్యక్తి చనిపోయాడని తెలిశాక వైద్య సిబ్బంది వచ్చారు. ముందస్త జాగ్రత్త చర్యలేవీ చేపట్టలేదు. టెక్కలి రూరల్ (సంతబొమ్మాళి) -
ఆమదాలవలస ఎమ్మెల్యేను అరెస్టు చేయాల్సిందే
● కల్తీ మద్యం సొమ్ములతో టీడీపీ నాయకుల జల్సాలు ● విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మండిపాటుఆమదాలవలస: కల్తీ మద్యం కేసులో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ డిమాండ్ చేశారు. ఆమదాలవలస వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడా రు. తమ నియోజకవర్గంలో ఇసుక, భూములతో అక్రమంగా ఆర్జిస్తున్న ఎమ్మెల్యే ఇప్పుడు కల్తీ మద్యం అమ్మకాలకు తెగబడుతున్నారని విమర్శించారు. ఆయన అనుచరులే నియోజకవర్గంలో సు మారు 16 వైన్షాప్లు దక్కించుకున్నారని తెలిపారు. 16 మద్యం దుకాణాల పరిధిలో వందల సంఖ్యలో బెల్టుషాపులు నడిపిస్తున్నారని విమర్శించారు. ఇటీవల సరుబుజ్జ్జిలిలో కల్తీ మద్యంతో పట్టుపడిన వైన్షాప్ యజమాని పైడి ముఖలింగం (అలియాస్ నూకరాజు) కూనకు అత్యంత ఆదాయాన్ని చ్చే అనుచరుడని తెలిపారు. ఆ దుకాణంలో జరుగుతున్న కల్తీ మద్యం కేసును ఆ యజమానిపైకి రాకుండా అందులో పనిచేసే సిబ్బందితో చీకటి ఒప్పందాలు చేసుకొని అరెస్ట్ చేయించడం దారుణమని, కూన రవి పేరు బయటకు రాకుండా ఉండేందుకే ఇలా చేశారని ఆరోపించారు. కూన రవికుమార్ పాత్ర పూర్తిగా ఉందని సమగ్రమైన దర్యాప్తును ఉన్నతాధికారులు చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం సొమ్ముతో జల్సాలు కల్తీ మద్యం సొమ్ములతో ఇటీవల ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ప్రస్తుతం పట్టుపడిన వైన్స్ షాప్ యజమాని పైడి ముఖలింగం(అలియాస్ నూకరాజు) మరికొంతమంది గోవాలోని ట్రిప్ కి వెళ్లారని రవికుమార్ వెల్లడించారు. అక్కడ వారు చేసిన నిర్వాకాలను ఫొటోలతో సహా చూపించారు. వారు విలాసాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. కూనకు పూర్తి అనుచరుడు అయిన షా ప్ యజమాని అటు మంత్రి అచ్చెనాయుడుకూ సన్నిహితుడిగా మెలుగుతున్నాడని చెప్పారు. వారి ఫొటోలను కూడా చూపించారు. వీరందరిపై విచారణ జరిపి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, పార్టీ జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, పార్టీ వివిధ విభాగాల ముఖ్య కార్యవర్గ సభ్యులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, సరుబుజ్జ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, ఆమదాలవలస పట్టణ పార్టీ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, బూర్జ మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, పార్టీ నాయకులు రామ్మోహన్రావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
శ్రీకూర్మనాథాలయ ఈఓగా వాసుదేవరావు
గార: ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మం శ్రీకూర్మనాథాలయ ఆలయ కార్యనిర్వహణాధికారిగా తలగాన వాసుదేవరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. పాతపట్నం నీలమణిదుర్గ ఆలయం, స్థానిక మూడు దేవాలయాల ఈఓ గా, మెళియాపుట్టి రాధాగోవిందస్వామి ఆలయం ఈఓగా పనిచేస్తూనే అదనంగా ఇక్కడ ఈఓ బాధ్యతలను దేవదాయ ధర్మాదాయశాఖ అప్పగించింది. ఇప్పటివరకు పనిచేసిన కోట నరసింహనాయుడు బదిలీపై మాతృశాఖ అయిన రాష్ట్ర పురావస్తుశాఖకు వెళ్లారు. ‘ఉద్యోగోన్నతి పొందకుండా మిగిలిపోయాం’ శ్రీకాకుళం పాతబస్టాండ్ : గడిచిన 13 ఏళ్లుగా ఉద్యోగోన్నతి పొందని వీఆర్వోల బ్యాచ్లుగా 2012, 2014 బ్యాచ్లు మిగిలిపోయాయని ఇది చాలా బాధాకరమని ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంస్థ వీఆర్వో అసోసియేషన్ అధ్యక్షులు డబ్బీరు రాజేష్కుమార్ అన్నారు. ఆదివారం అసోసియేషన్ సభ్యులతో నగరంలో సమావేశం నిర్వహించారు. 90 మంది వీఆర్వోలు సీనియర్ అసిస్టెంట్ స్కేల్ దాటారని, ఉద్యోగోన్నతి వన్టైం సెటిల్మెంట్గా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆర్థికభారం ఉండదని, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉండదన్నారు. ఇంద్ర ఏసీ బస్సు చార్జీలు తగ్గింపు శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం నుంచి విజయవాడ మార్గంలో తిరిగే ఇంద్రా ఎ/సి బస్సు చార్జీలు తగ్గింపును డిసెంబరు నెల 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ తెలిపారు. శ్రీకాకుళం–విజయవాడ మార్గంలో నడిపే ఇంద్రా ఎ/సి బస్సుల చార్జీలు 20 శాతం మేర తగ్గించినట్లు పేర్కొన్నారు. ఈ తగ్గింపు 1 డిసెంబరు నుంచి 31 డిసెంబరు వరకు అమ లులో ఉంటుందన్నారు. ప్రస్తుత చార్జీ రూ. 928 నుంచి కొత్తగా నిర్ణయించిన ధర రూ.743 అవుతుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి ప్రతి రోజు సాయంత్రం 6గంటలకు (సర్వీసు నంబర్ 2967), విజయవాడ నుంచి ప్రతి రోజు రాత్రి 7.15 గంటలకు (2968) బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. దూరప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీసుల వలయంలో చెల్లూరి నారాయణ..? ● సోషల్ మీడియా ప్రచారంతో ఉలిక్కిపడిన ఉద్దానం వజ్రపుకొత్తూరు రూరల్: బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు చెల్లూరి నారాయణ అలియాస్ సురేష్ పోలీసులు వలయంలో ఉన్నట్లు వస్తున్న వార్తలతో ఉద్దానం మరో మారు ఉలిక్కిపడింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మావోయిస్టు పార్టీ ఏఓబీ కార్యదర్శిగా చెల్లూరి నారాయణ వ్యవహరిస్తున్నారు. 1989లో మా వోయిస్టుగా చేరినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నారాయణరావుపై ప్రభుత్వం రూ. 20 లక్షల రివార్డు సైతం ప్రకటించింది. అయితే కేంద్ర హోంశాఖ అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్లో భాగంగా గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఆంధ్రా–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో నారాయణ రావు కేంద్ర బలగాల చేతికి చిక్కినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే శనివారం రాత్రి, ఆదివారం ఉదయం ఇంటెలిజెన్స్, పోలీసులు బాతుపురం వచ్చి గ్రామ పెద్దలు, నారాయణరావు కుటుంబ సభ్యులతో మాట్లాడి నారాయణరావును సరెండర్ చేయాలని కోరినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన మె ట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు నారాయణరావు ఎక్కడ ఎలా ఉన్నాడోననే చర్చ జోరుగా సాగుతోంది. -
పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలి
బూర్జ: థర్మల్ విద్యుత్ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు తక్షణమే రద్దు చేయాలని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, మండల గిరిజన ఆదివాసీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో గల అన్నంపేట పంచాయతీ తిమడాం గ్రామంలో ఆదివారం థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్ దొర, కార్యదర్శి సవరసింహాచలం, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ, ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సవర లక్ష్మణరావు, సవర సింగయ్య, సవర భూగన్న, సవర మనోజ్, సవర తోటయ్య, కల్లేపల్లి సూర్యనారాయణ, కల్లేపల్లి మోహనరావు, సతివాడ బాలరాజు, కల్లేపల్లి దుర్గారావు, కల్లేపల్లి రమణ, పలువురు ఆదివాసీలు, తదితర్లు పాల్గొన్నారు. -
శివ శివా..
● శ్రీముఖలింగంలో దుర్గంధం ● సెప్టిక్ ట్యాంక్ పగిలి వ్యర్థాలు బయటకు వస్తున్న వైనం త్వరలో బాగు చేస్తాం విషయం మా దృష్టికి వచ్చింది. సెప్టిక్ ట్యాంక్ నూతనంగా నిర్మాణం చేయడానికి టెండర్లు పిలిచాం. త్వరలో పనులు చేసి సమస్య పరిష్కరిస్తాం. – కె.మూర్తి, కన్జర్వేటివ్ అసిస్టెంట్ నానా అవస్థలు ఎంతో పవిత్ర దేవాలయం శ్రీముఖలింగం. ఇదే నెలలో ఇక్కడకు రెండు సార్లు వచ్చాం. సీ్త్రలు, చిన్నపిల్లలతో మరుగుదొడ్లు లేక నానా అవస్థలు పడ్డాం. – అప్పల నాయడు, బెజ్జిపురంజలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం దేవాలయంలో పారిశుద్ధ్య నిర్వహణ పరమ అధ్వానంగా కనిపిస్తోంది. మరుగుదొడ్లు సెప్టిక్ ట్యాంక్ పగిలి వ్యర్థాలు బయటకు రావడంతో దుర్గంధం వెదజల్లుతోంది. క్షేత్రానికి రోజూ వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొంత మంది భక్తులు స్వామి సన్నిధిలో రోజంతా గడుపుతారు. ఇదే సమయంలో చాలా వరకూ మరుగుదొడ్లు వినియోగిస్తారు. ఈ దుర్గంధం వల్ల వారంతా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి మరమ్మతులు కూడా చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
సభ్యుల సూచనలకు విలువనిచ్చి పనిచేయండి
అరసవల్లి: జెడ్పీటీసీ సభ్యుల సూచనలకు విలువ ఇవ్వాలని, ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకోవద్దని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. శనివారం సాయంత్రం నిర్వహించిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాలకు పలువురు ముఖ్య కమిటీల సభ్యులు హాజరు కాగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ విజయ మాట్లాడుతూ క్షేత్ర సా యిలో స్థానిక సంస్థల పాలకుల సూచనలను అధికారులు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని, స్పందించని అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే కూన రవి మాట్లాడుతూ గతంలో పనిచేసిన చాలావరకు పనులకు బిల్లులను ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టారని, ముఖ్యంగా ఉపాధిహామీ పనులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. 2012లో రూ.9 లక్షల బిల్లులు ఇప్పటివరకు రాకపోతే ఆ కాంట్రాక్టర్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 6,3,5 స్థాయీ సంఘాలు వాయిదా పడినట్లుగా అఽధికారులు ప్రకటించారు. మిగిలిన స్థాయీ సంఘాల సమావేశాలకు జెడ్పీ చైర్పర్సన్ విజయ అధ్యక్షత వహించి పూర్తి చేశారు. కార్యక్రమంలో పలువురు శాఖాఽధికారులు పాల్గొన్నారు. -
ఏపీ రాష్ట్ర అథ్లెటిక్స్ బృందానికి కోచ్, మేనేజర్లుగా సిక్కోలు వాసులు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా స్కూల్గేమ్స్ అండర్–14 బాలబాలికల అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు కోచ్, మేనేజర్లుగా శ్రీకాకుళం వాసులకు అరుదైన అవకాశం ల భించింది. మధ్య ప్రదేశ్లోని ఇండోర్ వేదికగా డిసెంబర్ ఒకటి నుంచి 4 వరకు ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలబాలికల బృందానికి కోచ్, మేనేజర్లగా జిల్లాకు చెందిన నలుగురు వ్యా యామ ఉపాధ్యాయులు(ఎస్ఏపీఈ) నియా మకమయ్యారు. నియామకమైన వారిలో బాడాన నారాయణరావు (పీడీ–జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాకిపల్లి, టెక్కలి మండలం), నడిమింటి నాగరాజు (పీడీ–జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యామలపేట, సంతబొ మ్మాళి మండలం), పీరుకట్ల సునీత (పీడీ– జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బ్రాహ్మణతర్ల, పల్సా మండలం), సయ్యద్ సౌజన్ (జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల ఈదుపురం, ఇచ్ఛాపురం మండలం) ఉన్నారు. వీరు నలుగురు ఈ పోటీ ల కోసం శనివారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్గేమ్స్ అథ్లెటి క్స్ అండర్–14 బాలబాలికల బృందంతో కలిసి ఇండోర్ చేరుకోనున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబరు 13న జాతీయ లోక్ అదాలత్ జరగనున్న విషయం విదితమే. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కుటుంబ, ఆస్తి వివాదాలు, చిన్న క్రిమినల్, ట్రాఫిక్, కాంపౌండ్ కేసుల వంటి రాజీ సాధ్యమైనవి ముందుగా గుర్తించాలన్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా సున్నితమైన, అతి సున్నితమైన గ్రామాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, సమాచారాన్ని సిద్ధం చేయాలని, జనాభా వివరాలు, కమ్యూనిటీ ప్రదేశాలు, ముఖ్య ప్రాంతాలు, గొడవలు జరిగే ప్రాంతాలపై కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, డి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు కళ్లద్దాల పంపిణీ శ్రీకాకుళం క్రైమ్ : సిబ్బంది కంటి ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డి యాంటీ–గ్లేర్ కళ్లద్దాలను పంపిణీ చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కంప్యూటర్ కానిస్టేబుళ్లు, ఐటీకోర్, డీసీఆర్బీ, కార్యాలయ సిబ్బందికి వందకు పైగా కళ్లద్దాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, ఏఓ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
థర్మల్ ప్రతులు దగ్ధం
బూర్జ: థర్మల్ విద్యుత్ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు తక్షణమే రద్దు చేయాలని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, మండల గిరిజన ఆదివాసీలు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మండలంలో గల అన్నంపేట పంచాయతీ అడ్డూరిపేట గ్రామంలో శనివారం థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కోశాధికారి అత్తులూరి రవికాంత్, అధ్యక్షుడు సురేష్ దొర, కార్యదర్శి సవరసింహాచలం ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ, ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సవర మిన్నారావు, లక్ష్మణరావు, రామలింగం, కుర్మయ్య, ధర్మారావు, నాగేశ్వరరావు, సింగయ్య పాల్గొన్నారు. -
గంజాయి హాట్స్పాట్లపై ఉక్కుపాదం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు అధికారులు గుర్తించిన 65 హాట్స్పాట్ల వద్ద సీసీ కెమెరాలను తక్షణమే ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కెమెరాల ఏర్పాటు బాధ్యతను స్థానిక సంస్థలు తీసుకోవాలని చెప్పారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలసి కలెక్టర్ మాట్లాడుతూ జి ల్లాలోని 16 మండలాల్లో గంజాయి కార్యకలాపాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న మొత్తం 65 హాట్స్పా ట్లను అధికారులు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు కేవలం 32 ప్రాంతాల నుంచి మా త్రమే కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని, కేవలం 3 మాత్రమే ఏర్పాటు చేశారని ఎస్పీ నివేదించినట్లు తెలిపారు. గంజాయి విక్రయం, నిషేధంపై ప్రజల సహకారం కీలకమని ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. చీకటిగా ఉన్న ప్రాంతాల్లో వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయా లని డీపీఓ, మున్సిపల్ కమిషనర్లను కోరారు. రహదారుల భద్రతపై జరిగిన సమీక్షలో శ్రీకాకుళం నవభారత జంక్షన్–బైపాస్ జంక్షన్ వద్ద పాదచారుల భద్రత కోసం వెంటనే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం చేయాలని ఎస్పీ కోరారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ప్రైవేట్ బస్సులు నిలపకుండా కేసులు నమోదు చేయాలని, రోడ్లపై ఇష్టానుసారం వాహనాలు పార్క్ చేసినా, జాతీయ రహదారిపై చెత్త వేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
యమకంకరలు
పలాస: పలాస మండలంలో గత కొన్ని నెలలుగా అక్ర మ కంకర తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు తవ్వకాలు కొనసాగుతున్నాయి. కేదారిపురం, గంగువాడ, లొద్దబద్ర పరిసర ప్రాంతాల్లోని కొండలు అక్రమార్కులకు అడ్డాగా మారా యి. అలాగే ఇటీవల రామకృష్ణాపురం వద్ద గల ఉజ్జిడి మెట్టను కూడా కొల్లగొడుతున్నారు. ఈ కంకరంతా మున్సిపాలిటీ, మండలంలోని రియల్ ఎస్టేటు వెంచర్లకు తరలిస్తున్నారు. అయినా సంబంధిత రెవెన్యూ, మైన్స్ అధికారులకు చీమ కుట్టినట్టయినా లేకపోవడం విశేషం. ఇంత వరకు ఒక్క ట్రాక్టర్ను గానీ, జేసీబీని గానీ సీజ్ చేయకపోవడం అధికారుల పనితనాన్ని చూపిస్తోంది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అక్రమ తవ్వకాల విషయంలో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో తప్పని పరిస్థితిలో పలాస రెవెన్యూ అధికారులు సిబ్బంది, మైన్స్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల కంబిరిగాం, లొద్దబద్ర తదితర ప్రాంతాల్లో కూడా మైన్స్ అధికారులు పర్యటించి పరిశీలించారు. ఆ తర్వాత దానిపై ఏం చర్యలు తీసుకున్నారంటే తగిన సమాధానాలు లభించడం లేదు. తాజాగా శనివారం కూ డా పలాస మండలం రామకృష్ణాపురం వద్ద గల ఉజ్జిడి మెట్టను పరిశీలించారు. వారితో స్థానిక వీఆర్ఓ నౌషద్ అల్లా ఒక్కరు మాత్రమే ఉన్నారు. అక్కడకి వెళ్లి చూసిన వారికి ఈ మెట్ట ఏమైపోయిందని స్థానికులకు ఆశ్చర్యం కలుగుతోంది. వెళ్లిన అధికారులకు కూడా కొండ తవ్విన ఆనవాలు, తరలిపోయిన కంకర కళ్లకు కట్టినట్టు కనిపించింది. ఎంత కంకర తవ్వుకుపోయారనేది పరిశీలించి ప్రభుత్వానికి వెళ్లాల్సిన ఆదాయాన్ని వారి నుంచే వసూలు చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
●పదే పదే అదే తప్పు
కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లుపాడు సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాంతంలో ప్రమాదకరంగా నిలిపివేసిన వాహనాలు ఆ దారిపై రక్తపు మరకలు ఇంకా తొలగలేదు. ఆ కుటుంబాల్లో ఆర్తనాదాలు ఇంకా ఆగలేదు. ఆ ఘోర ప్రమాదం చూసిన వారికి కలిగిన భయం ఇంకా తగ్గలేదు. అయినా వాహన చోదకుల నిర్లక్ష్య వైఖరి మాత్రం మారలేదు. ఎక్కడైతే నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయో, ఎక్కడైతే వారి రక్తంతో రోడ్డు తడిచిందో, ఎక్కడైతే వాహనం మృత్యు శకటంగా మారిందో.. సరిగ్గా అదే చోట మళ్లీ లారీలు ప్రమాదకరంగా పార్కింగ్ చేయడం శనివారం కనిపించింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇలాంటి విరుద్ధ దృశ్యాలు కనిపిస్తూ వారి చిత్తశుద్ధిని వెక్కిరిస్తున్నాయి. – టెక్కలి -
జగనన్న కాలనీలపై వివక్ష ఎందుకు..?
నరసన్నపేట: జగనన్న కాలనీల్లో నివసిస్తున్న ప్రజలపై ప్రభుత్వం ఇంత వివక్ష చూపడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూ టీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ము పంచాయతీ పరిధిలోని గడ్డెయ్యపేట వద్ద జగనన్న కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించడాని కి శనివారం వెళ్లిన కృష్ణదాస్కు కాలనీ వాసులు తమ సమస్యలు వివరించారు. మంచి నీరు రావ డం లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కాలనీ వాసులు మరణిస్తే దహనం చేసుకోవడానికి స్థలం లేదని తెలిపారు. అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. దీనిపై కృష్ణదాస్ స్పందిస్తూ ప్రభుత్వ తీరును తప్పబట్టారు. జగనన్న కాలనీలో నివసిస్తు న్న వారిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాలనీల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. -
పోలీసులు వదిలేశారు
వ్యాపారి పట్టించాడు..శ్రీకాకుళం క్రైమ్/నరసన్నపేట: రెండు తెలుగు రాష్ట్రాల్లో 30కు పైగా చోరీలు చేసిన పేరు మోసిన గజదొంగ. రద్దీ ప్రాంతాల్లోని దుకాణాల్లో రాత్రి సమయాన షట్టర్లు ఎత్తి దోచేయడం, ఉదయం దుకాణాల రద్దీ సమ యాల్లో యజమాని దృష్టి మరల్చి కౌంటర్లో లటక్కున నగదు తీసి పరారవ్వడం ఇతగాడి స్టైల్. జిల్లాలో ఇటీవల వరుస చోరీలు చేస్తున్నాడు. తాజాగా నరసన్నపేట కేంద్రంగా ఓ వ్యాపారి దుకాణంలో పట్టపగలు చోరీ చేసేందుకు ఎగబడి అదే వ్యాపారి కంటపడ్డాడు. అప్రమత్తమైన ఆ వ్యాపారి దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. కట్ చేస్తే పోలీసుల చెర నుంచి దొంగ పరారయ్యాడు. స్థానికులు, వ్యాపారులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. బుడితి గ్రామానికి చెందిన గురువెల్లి అప్పలనాయుడికి 18 ఏళ్ల నుంచే చోరకళ అబ్బింది. ఆయన ఉండేది ప్రకాశం జిల్లాలో. హైదరాబా ద్, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో నే కాక మన జిల్లాలోను చోరీలు చేశాడు. ఇటీవల న రసన్నపేట పోలీసుల కళ్లు గప్పి దాదాపు 5 చోరీలు చేయగా మొత్తంగా జిల్లాలో 10కు పైగా చేశాడు. వ్యాపారి అప్రమత్తమై.. వారం రోజుల కిందట నరసన్నపేటలో పండ్లు, సిమెంట్, ఐరన్షాపు నడుపుతున్న ఓ వ్యాపారి చూస్తుండగానే కౌంటర్లో చేయిపెట్టి కొంత నగదు దోచేయబోయాడు. వ్యాపారి అప్రమత్తమై పట్టుకున్నాడు. వ్యాపారివి గత కొంతకాలంగా రూ. 20 లక్షల వరకు నగదు చోరీ కావడంతో గట్టిగా నిలదీయడంతో నాలుగు సార్లు షాపునకు దొంగతనానికి వచ్చానని ఒప్పుకోవడం.. సోషల్ మీడియాలో సంబంధిత వీడియో వైరల్ అవ్వడం జరిగింది. తర్వాత వ్యాపారి పోలీసులకు ఫోన్ చేసి అప్పలనాయుడిని అప్పగించారు. విచారణ నిమిత్తం నరసన్నపేట పీఎస్కు పోలీసులు తీసుకెళ్లారు. ఈనెల 27న పోలీసులు నిద్రమత్తులో ఉండగా కన్నుగప్పి అప్పలనాయుడు పరారయ్యాడు. వెళ్తూ వెళ్తూ అదే స్టేషన్కు చెందిన ఓ కానిస్టేబుల్ ద్విచక్రవాహనాన్ని సైతం పట్టుకుపోయినట్లు స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. నరసన్నపేట పోలీసుల నిర్లక్ష్యానికి తోడు వారి బండినే దొంగ పట్టుకుపోవడంతో పోలీసులకు భలే ఝలక్ ఇచ్చాడంటూ అంతా నవ్వుకుంటున్నారు. -
మోసం గురూ..!
కొత్తరకం..● బంగారం ఆశచూపుతూ మోసం చేస్తున్న వ్యక్తులు ● ఆన్లైన్లో వివరాలతో ఫోన్కాల్స్ ● అప్రమత్తంగా ఉండాలని సూచనలు టెక్కలి రూరల్: ఇటీవల కాలంలో కొత్త తరహా మోసాలు అధికమైపోతున్నాయి. చాలామంది వ్యాపారులను టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. గత కొద్ది నెలలుగా ఇటువంటి మోసాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనిలో ప్రధానంగా బంగారం ఆశ చూపుతూ వస్తున్న ఫోన్కాల్ మోసాలు ఒక రకమైతే.. వ్యాపారుల బలహీనతను ఆధారంగా చేసుకుని చేస్తున్న మోసాలు మరోరకం. మన సమాచారమే ఆయుధం చాలా మంది వ్యాపారులు తమ వ్యాపారం అభివృద్ధి కోసం ఆన్లైన్లో తమ వ్యాపారం పేరు, ఫోన్ నంబర్ నమోదు చేసుకుంటారు. అయితే వాటిని ఆధారంగా చేసుకుని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ముందుగా మన నంబర్కు ఫోన్చేసి బాగా తెలిసిన వ్యక్తి వలే మాట్లాడుతారు. మనతో పరిచయం పెంచుకుని తర్వాత వారు చెప్పాల్సిన విషయం గూర్చి చెబుతారు. నేను కేరళ వద్ద రామేశ్వరంలో పనిచేస్తున్నాను. అక్కడ జేసీబీతో మట్టి తీస్తుండగా 20, 30 అడుగుల లోతులో ఒక మట్టికుండలో బంగారం దొరికిందని చెబుతారు. సుమారు 2, 3 కేజీలు ఉంటుందని.. ఎవరికీ తెలియకుండా తెచ్చామని చెబుతూ సమాచారం ఇస్తారు. అయితే దానిపై మనం ఆసక్తిగా ఉన్నట్లు వారు గ్రహిస్తే వీడియో కాల్ చేసి బంగారం చూపిస్తారు. అనంతరం మనకు నమ్మకం కలిగిందని గ్రహించాక బంగారం ఎవరికి తెలియకుండా తీసుకురావాలంటే కొంత మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతుందని చెబుతూ కొంత మొత్తంలో డబ్బులు వేయమని కోరుతారు. అది నమ్మి డబ్బులు వేసినట్లు అయితే మోసపోయినట్లే. డబ్బులు పంపితే అంతే... అదేవిధంగా ఇటీవల కాలంలో టెక్కలిలో పలు చికెన్ షాపులకు ఫోన్చేసి మీది పలానా చికెన్ షాపు కదా.. నేను ఒక టీచర్ను అని చెబుతారు. సాయంత్రం తమ స్కూల్లో ఫంక్షన్ ఉందని చెప్పి.. 50 కేజీల చికెన్ కావాలి కొట్టి ఉంచేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. అక్కడికి కొంత సమయానికి మళ్లీ ఫోన్చేసి సార్ నేను ఒక దగ్గర ఉన్నాను నా ఫోన్ పే అవ్వడం లేదు. కావున రూ.5 వేలు నేను ఒక నంబర్ చెబుతాను.. దానికి ఫోన్పే చేస్తే వచ్చేటప్పుడు మీకు మొత్తం డబ్బులు కలిపి ఇస్తానని చెబుతూ మోసానికి పాల్పడుతున్నారు. ఒకవేళ వారు చెప్పినట్లు డబ్బులు వేసినట్లయితే అక్కడికి కొంత సమయానికి ఆ నంబర్ మరి పని చేయకుండా పోతుంది. అలాగే చాలా హోటల్స్లో సైతం ఈ తరహాలోనే భోజనాలు పార్సిల్ చేయాలని చెబుతూ మోసం చేస్తున్నారు. అదేవిధంగా టైల్స్ షాపులకు ఫోన్చేసి నేను ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్ని అని చెప్పి మోసం చేస్తున్నారు. లేడీస్ కార్నర్ షాపులకు ఫోన్లు చేసి పండగ సమయం కావడంతో కొత్త మోడల్స్ గాజులు వచ్చాయని.. కొన్ని రకాల మోడల్స్ వాట్సాప్ చేసి అతి తక్కువ రేటుకు ఇస్తామని చెబుతూ కొంత మొత్తం డబ్బులు వేయాలంటారు. మిగిలిన మొత్తం స్టాక్ తీసుకొచ్చాక ఇవ్వాలని చెబుతూ మోసానికి పాల్పడుతున్నారు. ఇలా చాలామంది మోసాలకు గురై తమ డబ్బులను పోగొట్టుకుంటున్నారు. అయితే వారు మోసపోయామని చెబితే వారి పరువు పోతుందని పోలీసులకు సైతం ఫిర్యాదు చేయలేని పరిస్థితిలో వ్యాపారులు ఉండిపోతున్నారు. -
సర్వర్ డౌన్.. రైతుల ఆందోళన
నరసన్నపేట: నరసన్నపేట మండలంలో శనివారం ఒక్క బస్తా ధాన్యం కూడా మిల్లులకు పంపడం వీలు కాలేదు. ఉదయం నుంచి వాహనాల్లో ధాన్యం లోడ్ చేసుకొని ట్రక్ షీట్ కోసం రైతులు పడిగాపులు పడినా సాయంత్రం వరకూ పని కాలేదు. దీంతో ధాన్యం లోడు చేసిన ట్రాక్టర్లు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. దీంతో అటు రైతులు ఇటు వాహన డ్రైవర్లు అష్టకష్టాలు పడ్డారు. చిన్నకరగాం రైతు సేవా కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ‘శుక్రవారం నుంచి షెడ్యూలింగ్ కేసం, ట్రక్ షీట్ జనరేట్ కోసం వస్తున్నాం.. ఇప్పటికీ పని కాలేదు. లోడు చేసిన ధాన్యం వాహనాల్లోనే రెండు రోజులుగా ఉంది. రైతులకు ఏమిటీ దుస్థితి..’ అని కంబకాయ, చిన్నకరగాం, పెద్ద కరగాం, జమ్ము, తామరాపల్లి, సత్యవరం, కోమర్తిలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం నుంచి యాప్ ఆపసోపాలు పడుతుంది. పగలంతా కలిపి 30 నిమిషాలు అయినా పనిచేయలేదని సమాచారం. ధాన్యం 110 బస్తాలు సిద్ధం చేశాను. వాహనం సిద్ధమైంది. రైతు సేవా కేంద్రంలో షెడ్యూల్ ఇస్తే ట్రక్ షీట్ జనరేట్ అవుతుంది. అది పట్టుకొని మిల్లుకు వెల్లాలి. ఈ ట్రక్ షీట్ జనరేట్ కావడం లేదు. అసలు యాప్ ఓపెన్ కావడం లేదు. రైతుల కష్టాలు ప్రభుత్వాలకు పట్టవా. – పంగ వెంకటరమణ, చిన్నకరగాం -
క్యూబిటెక్తో ఆదిత్య కళాశాల ఎంవోయూ
టెక్కలి: హైదరాబాద్కు చెందిన స్మార్ట్ సొల్యూషన్ సంస్థ క్యూబిటెక్తో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ మేరకు శనివారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా క్యూబిటెక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు పృథ్వీ పిన్నాకతో కలిసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆధునిక పరిశోధన, స్మార్ట్ సొల్యూషన్ అభివృద్ధి రంగాల్లో విద్యా పరిశ్రమల సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికే ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు వెల్లడించారు. అనంతరం సంస్థ సహ వ్యవస్థాపకుడు పృథ్వీ పిన్నాక మాట్లాడుతూ.. క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు, స్మార్ట్ టెక్నాలజీలపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, అలాగే పరిశ్రమల ఆధారిత నైపుణ్యాభివృద్ధి సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, సాంకేతిక వర్క్షాప్లు, అధ్యాపకులకు ఎఫ్డీపీలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్ అవకాశాల విస్తరణ, ఆధునిక సిమ్యులేటర్లు, పరిశోధనా ప్రయోగశాలల సదుపాయాల వినియోగం తదితర అంశాలకు సంబంధించి ఈ ఎంవోయూ చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, ప్రిన్సిపాల్ ఏ.ఎస్.శ్రీనివాసరావు, అసోసియేట్ డీన్ బి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం సహకారం?
హిరమండలం: చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కీలకమైన సహకార శాఖ ద్వారా రైతులకు మెరుగైన సేవలందించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో లక్ష్యం నీరుగారిపోతోంది. ముఖ్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన పథకాలు, నిర్మాణాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా, అనాలో చితంగా వ్యవహరిస్తోంది. రైతులు పండించే పంట లు, వ్యవసాయ ఉత్పత్తులు సంరక్షించేందుకుగాను గత ప్రభుత్వం పీఏసీఎస్ల ఆధ్వర్యంలో గోదాము ల నిర్మాణం చేపట్టింది. వాటిని ప్రారంభించడంలో ప్రస్తుత సర్కారు తీవ్ర అలసత్వం వహిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సాగుకు పెద్దపీ ట వేస్తూ జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 25 గోదాముల నిర్మాణానికి పూనుకుంది. అప్పట్లో 18 గోదాముల నిర్మాణం పూర్తయ్యింది. ఐదు గోదాములు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. మరో రెండింటికి స్థల సమస్య కారణంగా ప్రారంభం కాలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరవుతున్నా గోదాముల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పూర్తయిన వాటి సేవలను ప్రారంభించలేదు. పెండింగ్లో ఉన్న వాటి పనులు పూర్తిచేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే పాలకవర్గాల మార్పుపై ఉన్న శ్రద్ధ గోదాముల నిర్మాణంపై లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములకు ఒక్కోదానికి రూ.40 లక్షలు, 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న వాటికి రూ.70 లక్షల చొప్పున కేటాయించారు. ఈ లెక్కన రూ.12 కోట్లు వరకూ ఖర్చు చేశారు. కానీ సేవలను అందుబాటులో తేవడంలో మాత్రం సహకార శాఖ పూర్తిగా విఫలమైంది. 2019కు ముందు కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో సహకార వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్న విమర్శ ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని గాడిన పెట్టింది. డీసీసీబీ లావాదేవీలను మరింత పెంచగలిగింది. అన్ని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరీకరణ చేసింది. జిల్లాలో 37 పీఏసీఎస్ల పరిధిలో సభ్యులుగా ఉన్న 1,01,671 మంది రైతులు వివిధ రూపాల్లో లబ్ధి పొందారు. తొలుత ఎటువంటి రుసుం లేకుండానే ఈ సంఘాల ద్వారా రుణాలు, ఎరువులను రైతులు పొందేవారు. పంట ఉత్పత్తులు విక్రయించాక తిరిగి రుణాలు చెల్లించేవారు. కొద్దిరోజుల తర్వాత సభ్యత్వ రుసుం కింద రూ.10 మాత్రమే వసూలు చేసేవారు. సంఘ సభ్యులుగా చేర్చుకునేవారు. ప్రాంతీయ వ్యవసాయ కో ఆపరేటివ్ బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పీఏసీఎస్లలో సభ్యత్వం తగ్గిపోయింది. ఓ చిన్నపాటి బ్యాంకు అకౌంట్ల మాదిరిగా కూడా లేదు. దీనికి సభ్యత్వ రుసుం పెరగడమే ప్రధాన కారణం. ప్రస్తుతం రూ.300 సభ్యత్వ రుసుంగా నిర్ణయించారు. దీంతో రైతులు ముందుకురాని పరిస్థితి. ఇప్పటికై నా పాలకులు స్పందించి పీఏసీఎస్లను బలోపేతం చేయడంతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఆ 23 గోదాములను అందుబాటులో తేవాలని రైతులు కోరుతున్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన బహుళ ప్రయోజన సౌకర్య గోదాములు ప్రభుత్వం అందుబాటులో కి తీసుకురావాలి. రైతులు పండించిన ధాన్యాన్ని గోదాములలో ఉంచేలా ప్రభు త్వం చర్యలు తీసుకోవాలి. – కరణం శివరాం, రైతు, పిండ్రువాడ, హిరమండలం మండలం జిల్లాలో 25 గోదాములు మంజూరు కాగా 23 చోట్ల నిర్మాణం పూర్తయ్యింది. వాటిని ప్రారంభించాలని ఉన్నతాధికారులకు విన్నవించాం. ఆదేశాలు వచ్చాక త్వరలో ప్రారంభించి సేవలు అందుబాటులోకి తెస్తాం. – కె.మురళీకృష్ణమూర్తి, డివిజనల్ సహకార శాఖ అధికారి, టెక్కలి -
ఇదేం పద్ధతి..?
● సచివాలయాల ఏఎన్ఎంల పదోన్నతుల్లో ఎస్టీలకు అన్యాయం అరసవల్లి: గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి తొలిసారిగా గ్రేడ్–3 ఏఎన్ఎం పోస్టులను నియమించారు. అయితే ఈ పోస్టుల్లో ఉన్నవారికి గ్రేడ్–2 ఏఎన్ఎంలుగా పదోన్నతులు కల్పిస్తున్న తీరు పలు అనుమానాలకు గురి చేస్తోందని జిల్లా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా గ్రేడ్–3 ఏఎన్ఎంలు పదోన్నతులు కల్పించాలంటూ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే పదోన్నతులను కల్పిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఇష్టానుసారంగా పదోన్నతులు కల్పిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి పదోన్నతులు కల్పిస్తున్న విధానంలో లోపాలున్నాయని ఎస్టీ ప్రతినిధులు తప్పుపట్టారు. దీనిపై శనివారం ఉదయం నుంచి పలువురు ఎస్టీ కేటగిరికి చెందిన ఏఎన్ఎంలు సంఘ ప్రతినిధులతో కలిసి డీఎంహెచ్వో డాక్టర్ కె.అనితను కలిసేందుకు ప్రయత్నించారు. కలవడం కుదరకపోవడంతో చివరికి శనివారం సాయంత్రం కార్యాలయ ఏవో బాబూరావుకు వినతిపత్రాన్ని అందజేసి వెనుదిరిగారు. పదోన్నతులు కల్పిస్తే కచ్చితంగా ఎస్టీలకు 6 శాతం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాప్తికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా పదోన్నతులకు అర్హతలున్న 154 పోస్టుల్లో.. ఎస్టీ కేటగిరికి కనీసంగా 9 పోస్టులకు పదోన్నతులు కల్పించాల్సి ఉంది. కానీ జిల్లావ్యాప్తంగా రిజర్వేషన్ ప్రాప్తికి ఒక్క పోస్టుకు కూడా పదోన్నతి ఇవ్వలేదు సరికదా.. జనరల్ కేటగిరిగా నాలుగు పోస్టులకు పదోన్నతులు కల్పించి మమ అనిపించారు. అందువలన ఇప్పటికై నా జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు ఈ అంశంపై పునః పరిశీలించి కొత్త నియామకాలకు కొత్త సైకిల్ రోస్టర్ను అమలు చేసి ఎస్టీలకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే ఈ అక్రమాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని జిల్లా ఆదివాసి సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ బైదిలాపురం సింహాచలం హెచ్చరించారు. -
బీసీల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అంటరానితనం, అసమానతలు వంటి వాటిని రూపుమాపి బీసీల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావుపూలే అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) దుంపల లక్ష్మణరావు అన్నారు. మహిళలకు సమాన హక్కులు, విద్య కావాలని, సమాజంలో తారతమ్యాలను పారదోలేందుకు కృషి చేసిన వ్యక్తి పూలే అని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీకాకుళంలోని ఓ ప్రవేటు నివాస గృహంలో శుక్రవారం నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పైడి రామకృష్ణారావు, పూజారి నిత్యానందం, హనుమంతు రామారావు, మెండ సింహాచలం, కెల్లి వెంకటేష్, తిర్లంగి లోకనాధం, మెట్ట దివాకర్, బాడాన ఈశ్వరరావు, పొన్నాడ సత్యం,బిర్లంగి రామ్మోహన్, దుంపల గోవిందరావు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్య, వైద్యంపై యువకుడి వినూత్న నిరసన
కొత్తూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తు న్న విద్య, వైద్య రంగాల అమలు తీరుకు నిరసనగా కొత్తూరు మండలం కలిగాం గ్రామానికి చెందిన యువకుడు పొన్నాడ హేమసుందరరావు కొత్తూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపాడు. ప్రజలు చెల్లించిన డబ్బుతో నడుస్తున్న ప్రభుత్వ బడుల్లో ఎమ్మెల్యేలు, మంత్రు లు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను చదివించినప్పు డే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు వైద్యం పొందితేనే అందరికీ నాణ్యమైన వైద్య అందుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే పర్య వేక్షణ లోపిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ప్రైవేటీ కరణ చేయడం వల్ల పేదలకు వైద్య విద్యతో పాటు వైద్యం అందకుండాపోతుందన్నారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా ప్రతి రోజూ ఒక గంట పాటు కొత్తూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తానన్నారు. -
టెక్కలి డివిజన్కు నందిగాం
● అభ్యంతరాలుంటే తెలపాలి : కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం, నందిగాం మండలాన్ని ప్రస్తుతం ఉన్న పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలి రెవెన్యూ డివిజన్కు మారుస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రాథమిక నోటిఫికేషన్ (జీవోఆర్టీ.1490) జారీ చేశారు. ఈ ప్రతిపాదనపై ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే, గెజిట్ ప్రచురణ అయిన తేదీ (27.11.2025) నుంచి 30 రోజుల్లోపు రాతపూర్వకంగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటిన కంబకాయ యువకుడు నరసన్నపేట: కంబకాయకు చెందిన పాగోటి సతీష్ అంతర్జాతీయ స్థాయిలో థాయ్లాండ్లోని పటాయ్ పట్టణంలో జరిగిన బాడీబిల్డింగ్ పోటీ ల్లో సత్తా చాటి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నాడు. 27 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకూ యునైటెడ్ వరల్డ్ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్(యూడబ్ల్యూఎస్ఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో ఆసియా స్థాయి లో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జరిగిన పోటీలో సతీష్ ప్రతిభ చూపి మూడో స్థానంలో నిలిచారు. సుమారు 20 దేశాల నుంచి 18 మంది పోటీల్లో పాల్గొనగా తనకు కాంస్య పతకం దక్కిందని ఆయన తెలిపారు. దీనిపై సర్పంచ్ పాగోటి కుసుమ కుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాగోటి ఉమామహేశ్వరి సతీష్కు అభినందనలు తెలిపారు. బాడీ బిల్డింగ్ పోటీల్లో సాధించిన కాంస్య పతకంతో సతీష్ -
● మృతురాలి కుటుంబానికి చెక్ అందజేత
ఇటీవల కాశీబుగ్గ–పలాస వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన తొక్కి సలాటలో తొమ్మిది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు అండగా నిలబడేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మృతుల కుటుంబానికి రూ.రెండు లక్షలు చొప్పున సహాయం అందజేశారు. అందులో భాగంగా సంఘటనలో మృతి చెందిన ఒడిశా రాష్ట్రం గుడ్డిభద్ర గ్రామానికి చెందిన రంగాల రూప ఉరఫ్ జ్యోతి కుటుంబానికి సైతం ఆర్థిక సాయం అందించేందుకు వైఎస్సార్ సీపీ ముందుకు వచ్చింది. ఒడిశాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ మృతురాలి తండ్రి ఢిల్లేశుకు శుక్రవారం రెండు లక్షల రూపాయల చెక్ను అందజేసింది. దీంతో ఒడిశా వాసులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన సహాయానికి మురిసిపోయారు. చెక్ అందించిన వారి జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, ఇచ్ఛాపురం ఎంపీపీ బోర పుష్ప, ఒడిశా పాత్రపురం బ్లాక్ చైర్మన్ వై.మోహనరావు, కంచిటి జెట్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, లొద్దపుట్టి ఎంపీటీసీ సభ్యులు పిట్ట హేమలత, ఆశి మంథాకిని, కొఠారీ సర్పంచ్ దుక్క ధనలక్ష్మీ, శ్రీరామ్రెడ్డి, ఒడిశా గ్రామ పెద్దలు మద్ది భోజరాజు, పంది రఘుమోహనరావు, రోకళ్ల ధర్మరాజు, కె.పరుశురాం తదితరులు పాల్గొన్నారు. –ఇచ్ఛాపురం రూరల్ -
నన్నొదిలి వెళ్లిపోయావా..
తన కళ్లెదుటే తల్లి మృతిచెందడంతో ఆ కుమారుడు తల్లడిల్లిపోయాడు. తాను లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ ‘నన్ను వదిలి వెళ్లిపోయావా..’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. రక్షించండంటూ అటువైపుగా రాకపోకలు సాగించిన ప్రతిఒక్కరినీ వేడుకున్నాడు. ఈ హృదయ విదారకర ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. అమ్మా.. ● కుమారుడి కళ్లెదుటే తల్లి మృతి ● షుగర్ టెస్టులకు తీసుకెళ్తుండగా స్కూటీని ఢీకొట్టిన లారీ ● కొల్లివలసలో విషాదఛాయలు తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న కుమారుడు మణికంఠ, (ఇన్సెట్లో) భానుమతి(ఫైల్) ఆమదాలవలస/బూర్జ: ఆమదాలవలస పట్టణ శివారులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రాంతంలో ఇండ్రస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి చెందగా కుమారుడికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్జ మండలం కొల్లివలస గ్రామానికి చెందిన నున్నగొప్పల మణికంఠ తన తల్లి భానుమతి (50)ని షుగర్ టెస్టుల నిమిత్తం శ్రీకాకుళం తీసుకెళ్లేందుకు స్కూటీపై బయలుదేరారు. ఫ్లై ఓవర్ దిగువకు చేరుకునే సమయంలో శ్రీకాకుళం వైపు నుంచి పాలకొండ వైపు కొబ్బరికాయల లోడుతో వెళుతున్న లారీ అతివేగంతో ఓవర్ టేక్ చేసి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో భానుమతి అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడు మణికంఠకు తీవ్ర గాయాలపాలయ్యాడు. తల్లడిల్లిన కుమారుడు.. కళ్ల ముందే కన్నతల్లి రక్తపుమడుగులో కొట్టుకుంటూ ప్రాణాలు విడుస్తుంటే ఏమీ చేయలేని స్థితిలో మణికంఠ తల్లడిల్లుతూ చేస్తున్న రోదనలు మిన్నంటాయి. తాను లేవలేని స్థితిలో ఉన్నప్పటికి లేవాలని ప్రయత్నిస్తూ రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపుతూ వారి సహాయం కోరడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న ఆమదాలవలస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందడంతో వారికి సమాచారం అందించారు. అనంతరం రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మణికంఠను చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొల్లివలసలో విషాదఛాయలు.. రోడ్డు ప్రమాదంలో భానుమతి మృతి చెందడంతో స్వగ్రామం కొల్లివలసలో విషాదఛాయలు అలముకున్నాయి. భానుమతికి భర్త కొండలరావు, కుమారుడు మణికంఠ ఉన్నారు. కుమార్తెకు వివాహం అయ్యింది. చింతాడ రవికుమార్ పరామర్శ.. విషయం తెలుసుకున్న ఆమదాలవలస వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు, స్థానికులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. భానుమతి మృతికి సంతాపం తెలుపుతూ ఆమె భర్త, వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు కొండలరావుతో మాట్లాడి ఓదార్చారు. -
10వ తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
శ్రీకాకుళం: జిల్లాలో గల అన్ని యా జమాన్యాల పాఠశాలలకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ డిసెంబర్ 6వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు శుక్రవారం తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా చెల్లించడానికి డిసెంబర్ 6 వరకు గడువు ఉందని, రూ.50లు ఆలస్య రుసుంతో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు, రూ.200లు రుసుంతో డిసెంబర్ 10 నుంచి 12వ తేదీ వరకు, రూ.500లు అపరాధ రుసుంతో డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు చెల్లించాలని, ప్రధానోపాధ్యాయులు వెబ్ సైట్లో తమ స్కూల్ లాగిన్లో విద్యార్థి వివరాలు ధ్రువీకరణ చేసి, ఫీజు చెల్లించాలని డీఈఓ తెలిపారు. -
చంద్రబాబు మాటలేమయ్యాయి..?
● సంధ్యారాణిని మంత్రి పదవి నుంచి వెంటనే తప్పించాలి ● వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి బాధిత మహిళకు అండగా ఉండాల్సింది పోయి, బాధించిన వాడికి అండగా నిలవడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. మంత్రి కుమారుడు పృథ్వీ, పీఏ మీద ఎస్పీకి మూడు పేజీల ఫిర్యాదు ఇచ్చినా కనీస చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. ఆడబిడ్డ మీద ఎవరైనా చెయ్యి వేస్తే అదే చివరి రోజు అవుతుందని చెప్పిన సీఎం చంద్రబాబు మాటలేమయ్యాయని ప్రశ్నించారు. ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తాం.. తోలుతీస్తామన్న డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ గొంతు మూగబోయిందా అని ప్రశ్నించారు. సహచర మంత్రి పీఏ ఇలా చేస్తే హోం మంత్రి మహిళగా ఏం చేస్తోందని నిలదీశారు. సత్యసాయి జిల్లాలో అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగానికి రిజైన్ చేయాలని టీడీపీ నేత లు ఒత్తిడి చేశారని, ఆమైపె దాడిచేసి కొట్టిన విషయాన్ని ఆమె సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసిన సంగతి బయటకు వచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. శ్రీకాకుళంలో ఆమె శుక్రవారం సాక్షితో మాట్లాడారు. బాధించే వారంతా టీడీపీ నేతలేనని, టీడీపీ తెలుగు దండుపాల్యం పార్టీలా మారిందని మండిపడ్డారు. హోంమంత్రి పక్క రాష్ట్రానికి వెళ్లి డైలాగులు చెప్పడం కాదని, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించే చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్పీకి రాసిన ఫిర్యాదులో బాధిత మహిళ స్పష్టంగా ఆరోపణలు చేశారని, మంత్రి కొడుకు పృథ్వీ, ఇతర పెద్ద నాయకుల వద్దకు కామ వాంఛ తీర్చడానికి పంపించమన్న దురాలోచన నుంచి రక్షణ కల్పించాలని కోరిందని అన్నారు. ఇంత జరుగుతున్నా ఆ పీఏను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఆమెను మంత్రి పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని, మంత్రి పీఏని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా రాప్తాడులో అంగన్వాడీ ఆయా వేధింపులకు గురైతే పట్టించుకోలేదని, 14 ఏళ్ల బాలికపై 14 మంది గ్యాంగ్రేప్ చేస్తే ఆ విషయాన్ని బయటకు రాకుండా చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 18 నెలల్లో మహిళలపై జరిగిన క్రైమ్రేట్ 4శాతం పెరిగిందని, మహిళలపై జరిగిన రేప్లు 9శాతం పెరిగాయన్నా రు. మద్యం, గంజాయి, డ్రగ్స్ వాడకం కూడా 21 శాతం పెరిగిందని తెలిపారు. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేని అసమర్థ సీఎం చంద్రబాబునాయు డు, హోం మినిస్టర్ అనిత నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. -
పది మందికి జరిమానా
నందిగాం: మద్యం తాగి వాహనం నడిపి నందిగాం మండల పరిధిలో పట్టుబడిన పది మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున టెక్కలి కోర్టు జరిమానా విధించిందని ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన వారిపై సెక్షన్ 185 మెటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి శుక్రవారం టెక్కలి జేఎంఎఫ్సీ కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.పదివేలు జరిమానా లేదా 10 రోజులు జైలు శిక్ష అని జడ్జి తీర్పు ఇచ్చారని ఎస్ఐ తెలిపారు. రైతును నట్టేట ముంచుతున్నారు ● ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపాటు నరసన్నపేట: బాబు సర్కారు అన్ని రకాలుగా రైతులను నష్టపరుస్తోందని, పంటను సకాలంలో కొనుగోలు చేయకుండా దగాకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పండిన ధా న్యం అమ్ముకోవడానికి అనేక ఆంక్షలు పెడుతోందన్నారు. చంద్రబాబు నిజస్వరూపం చూ పుతున్నారని అన్నారు. టమాటా, ఉల్లి, అరటి, మిరప పంటలకు మద్దతు ధర కల్పించలేక పోయిన ప్రభుత్వం ఇప్పుడు వరి ధాన్యం అ మ్మకాల వద్దకు వచ్చే సరికి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. సక్రమంగా ధాన్యం కొనుగో లు చేయక దళారులకు అమ్ముకొనే విధంగా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కొనుగో లు కేంద్రాల ఏర్పాటు, ఏజెన్సీల నియామకంలో కూడా రాజకీయం చేస్తూ రైతులకు కష్టాలకు గురి చేస్తుందన్నారు. రైతులకు నచ్చిన చోట ధాన్యం అమ్ముకోవచ్చని అంటూ కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన రైతులను పట్టించుకోవడం లేదని, షెడ్యూల్ ఇవ్వడం లేదని, ట్రక్ షీట్ జనరేట్ చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వ మని అన్నారు. గోనె సంచులు కూడా ఇవ్వలేకపోతున్నారని, రైతులు బయట కొనుగోలు చేసి నష్టపోతున్నారని అన్నారు. తేమ శాతం పేరుతో, ధాన్యం నాణ్యత పేరుతో దళారులు రైతులను మోసం చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకుండా వెనకేసుకు వస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు ఆదుకోవాలని, ధాన్యం అమ్మకాల విషయంలో పూర్తిగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతుల పక్షాన ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. స మావేశంలో నరసన్నపేట, పోలాకి మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు. అరసవల్లి రథసప్తమి ఇక ‘సప్తాహ సూర్య పర్వం’ ● కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పాతబస్టాండ్: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి మహోత్సవం ఈసారి ఏడు రోజుల పాటు (జనవరి 19 నుంచి 25 వరకు) అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు శుక్రవారం కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏడు రోజుల పాటు దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రతి రోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించాలని, ఇందుకోసం ప్రధాన అర్చకులతో సంప్రదించాలని మంత్రి సూచించారు. ఆన్లైన్ టికెట్లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఉప రాష్ట్రపతి ఏదో ఒక రోజు ఉత్సవానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. వాహనాలపై స్పెషల్ డ్రైవ్ శ్రీకాకుళం రూరల్: జిల్లాలో గల స్కూల్, కాలేజ్లకు చెందిన పలు వాహనాలపై విజయవాడ రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు శుక్రవారం నుంచి డిసెంబర్ 4వరకూ జిల్లా వ్యాప్తంగా స్పెషల్డ్రైవ్ చేస్తున్నట్లు ఉపరవాణాశాఖాధికారి విజయసారధి తెలిపారు. అందులో భాగంగా శుక్రవారం ఒక్కరోజే 41 వాహనాలను తనిఖీలు చేసి నోటీసులు అందించినట్లు తెలిపారు. -
‘తోటపల్లి కాలువ, ఉప కాలువలు ఆధునికీకరించాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: తోటపల్లి కాలువ, ఉపకాలువలను ఆధునికీకరించాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావుకు కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, రైతులు, ఆయకట్టుదారులు రాబో యే సాగు కాలంలో పనులు పూర్తవుతాయని ఆశతో ఉన్నారని, శివారు భూములకు నీరు అందేలా పనులు చేయించాలని కోరారు. 2026 సీజన్లో మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. -
రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి
● కమిటీ దృష్టికి వచ్చిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి ● రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ అంచనాల కమిటీ శ్రీకాకుళం చేరుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గతంలో కలసి ఉన్న జిల్లా, ప్రస్తుత జిల్లా అధికారులతో 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అంచనాలపై సమీక్షించింది. కలెక్టర్ ఖర్చుల వివరాలు వివరించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదనరావు ఈ ఆర్థిక సంవత్సరాల్లో పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను శాసన మండలి సభ్యులు డాక్టర్ వీవీ సూర్యనారాయణ రాజు పెనుమత్స అడగ్గా డీడీ ఆ వివరాలు అందజేశారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి బాలికల వసతి గృహాలపై ఆరా తీశారు. బాలికల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ చెప్పగా ప్రతి విద్యార్థి ప్రొ ఫైల్ ఉందని, రిజిస్టర్లో అన్నీ నమోదు చేస్తున్నామ ని డీడీ తెలిపారు. కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ కలెక్టర్ సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ డీడీ అన్నాయ్ దొర జిల్లాలో ఉన్న గిరిజన హాస్టళ్ల గురించి వివరించారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ హాస్టళ్లలో మరుగుదొడ్లపై ప్రశ్నించారు. డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ గ్రామీణాభివృద్ధి శాఖలో అమలు చేస్తున్న పథకాలను వివరించా రు. కొత్త విధానంలో ఎన్ని గ్రూపులు రుణాలు పొందాయని కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు అడగ్గా 12 వందల కోట్లు ఇచ్చినట్లు పీడీ చెప్పారు. పింఛన్లు కాకుండా ఇంకా ఏవైనా ఉన్నాయా అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అడుగగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పీడీ వివరించారు. వన్స్టాప్ సెంటర్లపై కూడా వరుదు కల్యాణి ప్రశ్నించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ కింద పాతపట్నం, శ్రీకాకుళం, టెక్కలి నియోజకవర్గంలో కొన్ని పనులు రద్దు జరిగిందని, రద్దు అయిన పనుల పునరుద్ధరణకు కమిటీ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పలాస కిడ్నీ ఆస్పత్రిపైనా వరుదు కల్యాణి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ నష్టం జిల్లాలో ఎంత జరిగిందని కమిటీ సభ్యులు వరుదు కల్యాణి అడుగగా 1627 హెక్టార్లని జేడీ చెప్పారు. ఎంత మంది రైతులు ఇన్సూరెన్సు చేయించారని అడుగగా 55,634 మందికి చేయించినట్లు వ్యవసాయ శాఖ జేడీ చెప్పారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ, సీపీఓ లక్ష్మీ ప్రసన్న, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కృష్ణమూర్తి, ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, మత్స్య శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ, పీఆర్ ఎస్ఈ వీరన్నాయుడు, కమిటీతో పాటు రాష్ట్ర శాసన సభ డిప్యూటీ సెక్రటరీ కె.రాజా కుమార్, అసిస్టెంట్ సెక్రటరీ వి.బిక్షం, సెక్షన్ ఆఫీసర్ టి. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ ప్రాంతాల్లో బరితెగింపు
జిల్లాలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని షాపుల్లోనే కల్తీ మద్యం దందా నడుస్తోంది. పల్లెల్లో అంత గుర్తించే అవకాశం ఉండదనే ఉద్దేశంతో అక్రమార్కులు కూడా కల్తీ మద్యం విక్రయిస్తున్నారు. షాపుల్లోను, అద్దె ఇళ్లల్లోనే కల్తీ డెన్లు నిర్వహిస్తున్నారు. ఎక్కువగా బెల్ట్షాపులకు కల్తీ మద్యాన్ని పంపిస్తున్నారు. కంపెనీల నుంచి వచ్చిన బాటిల్స్ను అధునాతన పరికరాలతో తెరిచి, కల్తీ చేసి, సీల్ చేసేస్తున్నారు. ఒకవైపు కౌంటర్లో ఎంఆర్పీకి మించి విక్రయాలు చేపడుతుండగా, మరోవైపు పర్మిట్, బెల్ట్షాపులను నిర్వహిస్తున్నారు. ఇంకా చాలడం లేదంటూ మద్యం కల్తీకి బరితెగిస్తున్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా, అథ్లెటిక్స్ ఫెడ రేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా అస్మిత అథ్లెటిక్స్ లీగ్–2025 పేరిట నిర్వహించిన క్రీడా పోటీలు శుక్రవారం ఉదయం మొదలై సాయంత్రం వరకు కొనసాగాయి. అండర్–14, 16 విభాగాల్లో మాత్రమే బాలికలకు ఈ పోటీలను నిర్వహించా రు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణులకు పత కాలు, బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. అంతకుముందు జరిగిన ఈపోటీల ప్రారంబోత్సవ సమావేశంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అథ్లెటిక్స్లో యువ టాలెంట్ను గుర్తించేందుకు కేంద్ర ప్రభు త్వం ఆదేశాల మేరకు అస్మిత అథ్లెటిక్స్ లీగ్ పేరిట పోటీల ను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతిభావంతులను గుర్తించి తదుపరి పోటీలకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో పి. సుందరరావు, ఏపీ అథ్లెటిక్స్ టెక్నికల్ కమిటీ చైర్మన్ కె.హరి బాబు, కె.మాధవరావు, పరిశీలకులు జమీల్, డీఎస్డీఓ ఎ.మహేష్బాబు, శ్రీనివాసరావు, మురళి, ఆనంద్, పురుషోత్తం, పీడీలు, పీఈటీలు, టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితా తయారు చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రానున్న పంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారు చేయాలని, ఆర్వో ఇందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ఓటర్ల సమ్మరీపై ఆర్వోలు, ఏఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి, క్లయిములపై ఆయన సమీక్షించారు. బూత్ స్థాయి సిబ్బంది తో సమావేశంలో నిర్వహించి, ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో, ఎస్డీసీలు తదితరులు పాల్గొన్నారు. -
ఏమి సేతుము బాబూ!
● సేతుభీమవరంలో రైతులకు వర్తించని అన్నదాత సుఖీభవ ● ఇనాం భూములు, కౌలురైతుల పేరిట పథకానికి దూరం చేసిన చంద్రబాబు సర్కారు ● వైఎస్సార్సీపీ పాలనలో రైతుభరోసా అందిందంటున్న గ్రామస్తులు ● కలెక్టరేట్ వద్ద ధర్నాకు సమాయత్తం జి.సిగడాం: నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచేశారని జి.సిగడాం మండలం సేతుభీమవరం గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. ఇనాం భూములు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయకపోవడంతో గ్రామంలో 150 మంది రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇనాం, కౌలు రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేశారని, ఐదేళ్లూ సకాలంలో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారని గుర్తు చేస్తున్నారు. అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకని బాధిత రైతులంతా ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ త్వరలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని చెబుతున్నారు. అధికారులు మాత్రం తమకు ఆదేశాలురాలేదంటూ చేతులు దులుపుకొంటున్నారు. ఇదీ పరిస్థితి.. చంద్రబాబు ప్రభుత్వం రెండు విడతలు చొప్పున అన్నదాత సుఖీభవ పథకం– పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుకు రూ.14 వేలు చొప్పున విడుదల చేసింది. కానీ సేతుభీమవరం గ్రామంలో రైతులకు ఒక్క రూపాయి కూడా జమకాలేదని గ్రామానికి చెందిన బొల్లు జమ్మినాయుడు, బొల్లు కూర్మినాయుడు, పోగతోక రాంబాబు, పైల ఆదినారాయణ, పైల త్రినాథరావు, బొల్లు రమణ, సాకాబత్తుల గోపాలరావు, మావిడి అప్పారావు, కె.సురేష్, కె.అప్పారావు, సాకాబత్తుల శ్రీరాములు, కుదిరెళ్లు అప్పారావు, సాకాబత్తుల లక్ష్మణరావు తదితర 150 మంది గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించినా ఫలితం లేకపోయిందన్నారు. జగనన్న హయాంలో.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామంలోని ఇనాం, కౌలు రైతులు 150 మందికీ ప్రతి ఏటా రూ.13,500 చొప్పున ఠంఛన్గా జమ చేసేవారు. జగనన్న పాలనలో గ్రామంలో సుమారు 1.10 కోట్ల రూపాయల మేర రైతులు లబ్ధి పొందారు. అవసరమైన ఎరువులు రైతుల ఇంటికే చేర్చేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ఇబ్బందులే తప్ప ఎటువంటి సంక్షేమం అందలేదని రైతులు మండిపడుతున్నారు. అప్పుడే బాగుంది.. వైఎస్సార్ సీపీ పాలనలో మా గ్రామ రైతులంతా ఆనందంగా జీవించాం. రైతు భరోసాతోపాటు పలు సంక్షేమ పథకాలు అందేవి. పంటలు బాగా పండించుకుని మద్దతు ధరకు అమ్మేవాళ్లం. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ రెండు విడతలూ ఇవ్వలేదు. – పైల దుర్గారావు, రైతు, సేతు భీమవరం మంత్రికి విన్నవించినా.. పథకాలు అందడంలేదని మంత్రి నారా లోకేష్ వద్దకు వెళ్లి వినతిపత్రం అందించాం. అయినా పరిష్కారం కాలేదు. మా కార్యకర్తలకే న్యాయం చేయలేకపోతున్నాం. – సాకాబత్తుల శ్రీరాములు, సేతుభీమవరం ఫలితం లేదు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో గ్రామస్తులకు అన్ని సంక్షేమ పథకాలు ఇంటికే చేరేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక 150 మంది రైతులకు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ డబ్బులు పడలేదు. అధికారులకు వినతులు ఇచ్చినా ఫలితం రాలేదు. – తొత్తడి రామారావు, సర్పంచ్, సేతుభీమవరం -
పేదింటి యువతికి పెళ్లి కానుక
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని బలరాంపురం గ్రామానికి చెందిన జ్యోతిర్మయి అనే యువతికి శ్రీకాకుళం నగరానికి చెందిన సప్తగిరి జ్యూయలర్స్ అధినేత గంగు వెంకటరావు కల్యాణ మస్తు పేరిట రెండు తులాల బంగారం, పావుకేజీ వెండి వస్తువులను గురువారం అందజేశారు. ఏడాది క్రితం శ్రీకాకుళంలోని సప్తగిరి జ్యూయలర్స్ షాపులో తీసిన లక్కీ డ్రాలో జ్యోతిర్మయి కల్యాణ మస్తు స్కీమ్లో ఎంపిక కావడంతో ఆమెకు సర్టిఫికెట్ అందజేశారు. ప్రస్తుతం జ్యోతిర్మయికి గురువారం వివాహం కావడంతో సప్తగిరి షాపు యజమాని ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు, గ్రామపెద్దలు సమక్షంలో కల్యాణమస్తు కింద ఆభరణాలు అందించారు. -
జవహర్ నవోదయం విద్యా ఉషోదయం
●డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష ●ఎంపికై నవారికి అత్యుత్తమ విద్య ●గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు సరుబుజ్జిలి: గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో జిల్లాలోని సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో, 32 ఎకరాల విస్తీర్ణంలో నవోదయ విద్యాలయం 1988లో ప్రారంభించారు. ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు(తమిళనాడు మినహా), 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 660 జేఎన్వీ కేంద్రాలు విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 కేంద్రాలు ఉన్నాయి. వెన్నెలవలస విద్యాలయంలో విభిన్నమైన బోధన పద్ధతి, వసతి, విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు నాయకత్వ లక్ష్యణాలను పెంపొందించడం, స్వచ్ఛమైన వాతావరణం వంటి ప్రత్యేకతలతో దేశంలోనే ఖ్యాతి గడించింది. ఈ కేంద్రంలో సీబీఎస్ఈ విధానంలో ప్రస్తుతం 6 నుంచి 12 తరగతుల వరకు 416 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బాల, బాలికలకు 6 నుంచి 8 తరగతులు, 9 నుంచి 12 తరగతులకు 4 వేర్వేరుగా బ్లాకుల్లో వసతి సౌకర్యం కల్పిస్తారు. ఈ నాలుగు బ్లాక్ల పేర్లు ఆరావలి(రాజస్థాన్), నీలగిరి(తమిళనాడు), ఉదయగిరి(ఒడిశా), శివాలిక్(పంజాబ్–హర్యానా) దేశంలోని నాలుగు దిక్కుల పర్వతాలతో ఉండడం విశేషం. దీనికి అనుగుణంగానే ఎంపిక చేయబడిన కొంతమంది విద్యార్థులు దేశంలోని మిగతా జేఎన్వీలకు వెళ్లి తొమ్మిదో తరగతిలో ఏడాది పాటు విద్యానభ్యసిస్తారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని గౌతమబుద్ధ నగర్ విద్యార్థులు ఏటా 23 మంది ఇక్కడి వస్తుంటారు. దీనివల్ల సోదరభావం అభివృద్ధి చెందడమే కాకుండా బాల్యంలోనే దేశంలోని వివిధ ప్రాంతాలపై అవగాహన కలుగుతుంది. మారుతున్న పోటీ ప్రపంచంతో పాటు ఇక్కడి విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా శిక్షణ అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు 40 కంప్యూటర్లు, ల్యాబ్టాప్ల ద్వారా విద్యార్థులు రోజువారీ అభ్యాసం అవ్వడంతో పాటు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉండడంతో ప్రపంచంతో అనుసంధానం అవుతారు. దీనితో పాటు డిజిటల్ తరగతులు, నిష్టాతులైన అధ్యాపకులు, ల్యాబ్ విద్యార్థుల సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు దోహదపడుతుంది. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కూడా చక్కగా మాట్లాడగలగడం ఇక్కడి విద్యార్థుల అదనపు బలం. జిల్లాలో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతాల విద్యార్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లు పట్టణ ప్రాంతాలకు కేటాయిస్తారు. మొత్తం సీట్లలో 1/3 వంతు సీట్లు బాలికలకు కేటాయిస్తారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5, దివ్యాంగులకు 3 శాతం సీట్లు రిజర్వ్ చేయబడతాయి. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ప్రాతిపదికన ఎంపికలు జరుగుతాయి. రెండు గంటల వ్యవధిలో పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. 100 మార్కులకు విద్యార్థి చదువుతున్న మాధ్యమంలో ప్రశ్నాపత్రం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ 50 మార్కులు, అర్థమెటిక్ 25 మార్కులు, లాంగ్వేజ్ టెస్ట్కు 25 మార్కులు కేటాయిస్తారు. మొత్తం 2 గంటల సమయంలో 3 విభాగాలకు సమాధానాలు రాయాలి. వీటిలో 5వ తరగతికి సంబంధించి గణిత పరీక్షలో అంకెలు, సంఖ్యా పద్ధతి, భిన్నాలు మరియు మేథాశక్తికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఓఎంఆర్ సీట్లలో మాత్రమే బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్నుతో సమాధానాలు రాయాలి. విద్యార్థులు ప్రస్తుతం ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతిలో చదువుతూ ఉండాలి. నవోదయ విద్యాలయంలో ఆరో తరగతితో మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఒక్కో విద్యాలయానికి 80 సీట్లు కేటాయిస్తారు. ఒకసారి ప్రవేశం పొందిన విద్యార్థులు 12వ తరగతి(ఇంటర్) వరకు విద్యాభ్యాసం చేయవచ్చు. 8వ తరగతి వరకు విద్యార్థి మాతృభాషలో బోధన ఉంటుంది. తర్వాత ఆంగ్లంలో బోధనలు ఉంటాయి. ఇంటర్ పరీక్షలకు సీబీఎస్ఈ సిలబస్లో హాజరు కావాలి. 6వ తరగతి ప్రవేశ పరీక్ష అంతా పారదర్శకంగా నిర్వహిస్తాము. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందవద్దు. ప్రవేశ పరీక్ష కోసం 7,239 మంది దరఖాస్తులు చేశారు. డిసెంబర్ 13న జిల్లాలోని 32 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రశ్నాపత్రం తయారీ, విద్యార్థుల ఎంపిక అంతా సీబీఎస్ఈ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతిభ ఉన్నవారికి తప్పక సీటు లభిస్తుంది. ఒత్తిడి లేకుండా పరీక్షలుకు సిద్ధమవ్వాలి. – బి.బేతనసామి, ఇన్చార్జి ప్రిన్సిపాల్, వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయం -
జిల్లాకు వర్షసూచన
శ్రీకాకుళం పాతబస్టాండ్ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫాన్గా మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. బియ్యం బదులుగా రాగులు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని రేషన్కార్డు లబ్ధిదారులకు డిసెంబర్ కోటాలో బియ్యం బదులుగా మూడు కిలోలు వరకు రాగులు పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం వెల్లడించారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రతి రేషన్ డిపోలో ఏర్పాట్లు పూర్తయ్యాయని, లబ్ధిదారులు రేషన్ కార్డులతో వెళ్లి రాగులు తీసుకోవాలని కోరారు. ధాన్యలక్ష్మిగా నీలమణి అవలింగి నీలమణి అమ్మవారిని మార్గశిర మాస మొదటి గురువారం పురస్కరించుకుని ధాన్యలక్ష్మిగా అలంకరించారు. అర్చకు లు భాస్కర ఆచారి ఆధ్వర్యంలో విశేష పూజ లు, అభిషేకాలు నిర్వహించారు. – సారవకోట జిల్లాకు చేరిన శాసనసభ అంచనాల కమిటీ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ అంచనాల కమిటీ 2024–25 రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం జిల్లాకు చేరుకుంది. కమిటీ చైర్మన్ వేగుళ్లు జోగేశ్వరరావు(ఎమ్మెల్యే), డాక్టర్ వి.వి.సూర్యనారాయణరాజు పెనుమత్స(ఎమ్మెల్సీ), వరుదు కళ్యాణి (ఎమ్మెల్సీ) ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర శాసన సభ డిప్యూటీ సెక్రటరీ కె.రాజాకుమార్, అసిస్టెంట్ సెక్రటరీ వి.బిక్షం, సెక్షన్ ఆఫీసర్ టి.చిరంజీవి ఉన్నారు. వీరికి ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి కె.సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డ్వామా పీడీ సుధాకర్, తహసీల్దార్లు గణపతిరావు, శ్రీనివాసరావు స్వాగతం పలికారు. కాగా, కమిటీ సభ్యులు శుక్రవారం ఉదయం అరసవల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మంలోని కూర్మనాథ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ధాన్యం సేకరణపై సమీక్ష శ్రీకాకుళం పాతబస్టాండ్ : వర్షసూచన నేపథ్యంలో ధాన్యం సేకరణ వేగవంతం ఏయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, సంక్షేమ వసతి గృహాలు, ఆర్టీజీఎస్, ప్రజా సానుకూల దృక్పథం తదితర అంశాలపై కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని అవయవదానం రణస్థలం: లావేరు మండలం గోవిందపురం పంచాయతీ ఇజ్జాడపాలెం గ్రామానికి చెందిన ఇజ్జాడ ధనలక్ష్మి(17) మరణంలోనూ సజీవంగా నిలిచింది. బాలిక ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో బుధవారం మరణించింది. తల్లిదండ్రులు ఇజ్జాడ రాము, సాయిలు తీవ్ర విషాదంలోనూ ముందుకొచ్చి తమ కుమార్తె అవయవాలను దానం చేయాలని నిర్ణయించారు. కిడ్నీ, గుండె దానం చేసి మరో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపారు. జెమ్స్ ఆస్పత్రి నుంచి రోడ్డు మార్గాన గ్రీన్ చానల్ ద్వారా విశాఖ విమానాశ్రయానికి అవయవాలు చేరుకున్నాయి. ప్రత్యేక అంబులెన్స్ ద్వారా విమానాశ్రయానికి చేరుకున్న వీటిని వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి గ్రీన్ చానల్ ద్వారా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
● జగపతిబాబు సందడి
మేం రైతులం కాదా? అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతుల ఖాతాలో డబ్బు లు జమ చేస్తారన్నారు. మా గ్రామంలో మాత్రం ఏ రైతుకూ డబ్బులు జమకాలేదు. మేం రైతులం కాదా? – బొల్లు జమ్మినాయుడు, రైతు, సేతుభీమవరం నమ్మించి ముంచేశారు కూటమి నాయకుల మాటలు నమ్మి మోసపోయాం. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఏటా రూ.13,500 రైతు భరోసా పథకం కింద నిధులు జమ చేసేవారు. చంద్రబాబునాయుడు పాలనలో ఒక పైసా కూడా జమకాలేదు. – సాకాబత్తుల రమణ, రైతు, సేతుభీమవరం రైతులంటే చిన్న చూపు అన్నదాత సుఖీభవ పథకంతోపాటు ప్రభుత్వం మంజూరు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు అందడం లేదు. జగనన్న హయాంలో మాకు రైతు భరోసా పథకం వచ్చింది. రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపు. – బొల్లు రమేష్, రైతు, సేతుభీమవరం మోసపోయాం గతంలో రైతులకు ఏటా రూ.13,500 ఇచ్చేవారు. చంద్రబాబు ప్రతి రైతుకు రూ.20 వేల ఇస్తామని హామీ ఇవ్వడంతో ఓట్లు వేసి మోసపోయాం. – సాకాబత్తుల అప్పారావు, రైతు, సేతుభీమవరం -
వేడుక వేళ విషాదం
● గృహ ప్రవేశానికి వచ్చి అనంత లోకాలకు.. ● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం ● మరొకరి పరిస్థితి విషమం పలాస/వజ్రపుకొత్తూరు రూరల్/పాతపట్నం: పలాస మండలం గరుడఖండి పాత జాతీయ రహదారిపై గురువా రం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం మండలం సరాళి గ్రామానికి చెందిన యువకుడు తలగాపు భీమారావు(27), ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా మహేంద్రగౌడ్ గ్రామానికి చెందిన సుశాంత్ పైకో (25) దుర్మరణం పాలయ్యారు. వీరభద్రాపురం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి తలగాపు వేణు తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. భీమారావు, వేణు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఒడిశాకు చెందిన సుశాంత్ మరో బైక్పై ఎదురెదురుగా వస్తూ గరుడఖండి రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద పరస్పరం ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. గాయపడిన వేణును పలాస ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం రిమ్స్కు తరలించారు. ఆనందంగా గడిపి.. సరాళికి చెందిన భీమారావు విశాఖపట్నంలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం తండ్రి శాంతారావు మృతి చెందడంతో తాతగారి గ్రామం సరాళిలో స్థిరపడ్డారు. సొంత గ్రామమైన వీరభద్రపురంలో బంధువులతో కలిసి ఇటీవల ఇల్లు నిర్మించారు. గురువారం గృహప్రవేశం కోసం విశాఖపట్నం నుంచి వచ్చిన భీమారావు విందు అనంతరం బంధువులు, స్నేహితులతో సరదాగా గడిపాడు. తర్వాత పెట్రోల్ కోసం సోదరుడి వరసైన తలగాపు వేణుతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లారు. ఇంతలో ఘోరం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. భీమారావుకు తల్లి లక్ష్మీ, సోదరుడు ఉన్నారు. ఘటనా స్థలాన్ని కాశీబుగ్గ పోలీసులు పరిశీలించారు. కాశీబుగ్గ ఎస్ఐ నర్సింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మిల్లర్లకు కొమ్ముకాయవద్దు
● అధికారులకు స్పష్టం చేసిన కంబకాయ రైతులు నరసన్నపేట : ‘ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయాలి. మిల్లర్లకు కొమ్ము కాయవద్దు.. రైతులకు సహకారం అందించండి..’ అంటూ కంబకాయ గ్రామ రైతులు ముక్తకంఠంతో కోరారు. మిల్లర్లు చేస్తున్న దోపిడీ.. రైతులకు కలుగుతున్న నష్టాలపై గురువారం సాక్షిలో కథనాలు రావడంతో అధికారులు ఉరుకులు.. పరుగులు తీశారు. సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా వివరణ కోరడంతో ఉదయానికే ఆర్డీఓ సాయి ప్రత్యూష నరసన్నపేటలో వివాదానికి కారణమైన రైస్మిల్లుకు వెళ్లి ఆరా తీశారు. రైతులకు ఇబ్బంది కలిగించ వద్దని మిల్లర్లకు సూచించారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సాయంత్రం ఈ వ్యవహరంపై సీఎంఓ కార్యాలయం నుంచి వివరణ కోరగా తహసీల్దార్ టి.సత్యనారాయణ, సివిల్ సప్లయ్ డీటీ రామకృష్ణ, శ్రీకాకుళం సివిల్ సప్లయ్ కార్యాలయ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ హరిశంకర్.. కంబకాయ వెళ్లి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారుల తీరును రైతులు తీవ్రంగా దుయ్యబట్టారు. బుధవారమే తమకు న్యాయం చేస్తే ఇంత వరకూ వచ్చేదికాదన్నారు. మిల్లర్లకు వంత పాడవద్దని.. ఏ మాత్రం అవకాశం ఉన్నా రైతులకు అండగా ఉండాలని కోరారు. అనంతరం గ్రామంలో పండిన ధాన్యం శాంపిల్స్ను తీసుకువచ్చి నాణ్యతను పరిశీలించారు. నాణ్యత బాగున్నట్లు అధికారులు గుర్తించారని రైతులు అప్పలనాయుడు, పాగోటి భరద్వాజ్ తెలిపారు. 82 కేజీలు ఇవ్వడానికి రైతులు సిద్ధపడగా.. ఈమేరకు మిల్లర్లుకు ఒప్పించాలని, అంతకంటే అదనంగా తీసుకోవద్దని కోరారు. అధికారులు దీనిపై హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. మిల్లర్లతో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. -
గుంతలో పడి మూగజీవి మృతి
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని గరుడభద్ర ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఉన్న గుంతలో గురువారం పాడి ఆవు ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. ఒక టవర్ కోసం ప్రైవేట్ వ్యక్తులు గుంతలు తవ్వి విడిచిపెట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మర్రిపాడు గ్రామానికి చెందిన పాడిౖ రెతు గూడ భాస్కరరావు జీవనాధారమైన సుమారు రూ.90 వేలు విలువ గల పాడి ఆవు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ నాయకుడు గూడ ఈశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. రోడ్డు పక్కన తవ్వి వదిలేసిన గుంతలను వెంటనే పూడ్చాలని కోరారు. -
30 మందికి డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతులు
అరసవల్లి: గ్రామ సచివాలయాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా మండల జీఎస్డబ్ల్యూఎస్ అధికారులుగా జిల్లాలో 30 మందికి అడహక్ పదోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలో 30 మండలాల్లో ప్రత్యేకంగా డిప్యూటీ ఎంపీడీఓ హోదాతో ఫస్ట్ లెవల్ గెజిటెడ్ ఆఫీసర్లుగా పంచాయతీరాజ్ శాఖకు చెందిన సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించారు. ఈఓపీఆర్డీ పోస్టును ఇటీవలే డిప్యూటీ ఎంపీడీవోలుగా మార్పు చేసిన సంగతి విదితమే. తాజాగా అదే హోదాతో మండల జీఎస్డబ్ల్యూఎస్ అధికారులుగా సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పి స్తూ కొత్త స్థానాలను కేటాయించారు. పదోన్నతలు పొందిన వారిలో మాసపు సంతోష్కుమా ర్ (సారవకోట), డి.అప్పన్న (పొందూరు), జి.తులసీదాస్ (శ్రీకాకుళం), కె.వి.వి.జగన్నాథరావు (గార), కె.అనూరాధ (ఎచ్చెర్ల), బి.కృష్ణారావు (పాతపట్నం), జి.వెంకటరావు (కొత్తూరు), హెచ్.ఉమాపతి (నందిగాం), ఎస్.రామ్మోహనరావు (ఆమదాలవలస), ఎం.నారాయణమ్మ (లావేరు), వి.అప్పయ్య (మెళియాపుట్టి) , పి. వి.ఎన్.మూర్తి (జలుమూరు), పల్లి ద్రాక్షాయణి (నరసన్నపేట), జి.త్రినాథరావు (టెక్కలి), ఎం.శాంతకుమారి (సోంపేట), పి.వెంకట మురళి (జి.సిగడాం), ఎల్.లక్ష్మణమూర్తి (కంచిలి), సీహెచ్.లక్ష్మణరావు (సంతబొమ్మాళి), ఎస్.ఉమాపతి (పలాస), ఎం.భాస్కరరావు (బూర్జ), జె.ఝాన్సీలక్ష్మి (రణస్థలం), టి.వి. లీలారాజు (కోటబొమ్మాళి), ఎ.మృత్యుంజయ రావు (సరుబుజ్జిలి), పి.ప్రజ్ఞ శిరీష (హిరమండలం), జి.సంధ్యారాణి (పోలాకి), జి.అప్పలనాయుడు (ఎల్ఎన్పేట), ఎం.రాజేష్ (ఇచ్ఛాపురం), బి.వి.ఎస్.రెడ్డి (కవిటి), ఎ.శ్రీనివాసరావు (వజ్రపుకొత్తూరు), ఎల్.వి.నాగకుమార్ (మందస) ఉన్నారు. -
గంజాయి అడ్డాలు..!
● గ్రానైట్ క్వారీలే ● కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఇలాకాలో తరచూ పట్టుబడుతున్న వైనం ● గ్రానైట్ పరిశ్రమల్లో పని చేస్తున్న ఇతర రాష్ట్రీయుల ద్వారా సరఫరా దృష్టిపెడతాం.. టెక్కలి నుంచి నరసన్నపేట వరకు ఉన్న కర్మాగారాలపై దృష్టిపెడతాం.క్వారీలు, ముఖ్య కేంద్రాల వద్ద తనిఖీలు చేపడతాం. గంజాయి విషయంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. – డి.లక్ష్మణరావు, డీఎస్పీ, టెక్కలిశ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు ఇలాకాలో గంజాయి అక్రమ రవా ణా విస్తరిస్తోంది. అచ్చెన్న సొంత నియోజకవ ర్గంలో కోటబొమ్మాళి, నిమ్మాడ కూడలి కేంద్రాలుగా అధిక సంఖ్యలో ఉన్న గ్రానైట్ కటింగ్ పాలిషింగ్ పరిశ్రమలతో పాటు, గ్రానైట్ రాళ్ల తవ్వక పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. గంజాయి క్రయవిక్రయాల్లో వీరి పాత్ర ఉన్నట్లు పలు కేసులు రుజువు కావడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వారిపైనే అనుమానం.. కోటబొమ్మాళి, నిమ్మాడ ప్రాంతాల్లో దాదాపు 100కు పైగా గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ పరిశ్రమలే కాక గ్రానైట్ రాళ్లు తవ్వే క్వారీలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో సుమారు వెయ్యి మందికి పైగా కార్మి కులు పనిచేస్తున్నారు. వీరిలో ఒడిశా, రాజస్థాన్, ఇతర రాష్ట్రాలకు చెందినవారు దాదాపు 500 మంది ఉన్నారు. స్వస్థలాల నుంచి రైళ్లు, బస్సుల్లోనూ రాకపోకలు సాగిస్తుంటారు. బరంపురం రోడ్డు వద్ద రైలెక్కి హరిశ్చంద్రపురం, తిలారు వద్ద సాధారణ డీఎంయూ బళ్లపై వస్తుంటారు. వీరిలో కొందరు 5 కిలోల నుంచి 10 కిలోల లోపు గంజాయిని తెచ్చి నేరుగా కర్మాగారాలకు, స్థానిక కార్మికులతో పాటు రాజస్థానీయులకు అందిస్తుంటారని సమాచారం. అక్కడి నుంచి జర్జంగి, పెద్దబమ్మిడి, నిమ్మాడ కూడలి కేంద్రాలుగా చేసుకుని చీకటి సమయాల్లో గంజాయి క్రయ విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదీ నిఘా..? ప్రధానంగా ఉండే పాతపట్నం, ఇచ్ఛాపురం–పురుషోత్తపురం, పైడిభీమవరం చెక్పోస్టులతో పాటు డైనమి క్ చెక్పోస్టులు పోలీసులు ఏర్పాటు చేసినా గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఏడాది కాలంగా కోటబొమ్మాళిలో పదికి పైగా గంజాయి కేసులు నమోదు కాగా వారిలో ఒడిశా వారి పాత్రే ఎక్కువ. జి ల్లాలో ఈ ఏడాది 1200కిలోలకు పైగా గంజాయిప ట్టుబడింది. పట్టుబడిన వారిలో ఒడిశా వారే ఎక్కువ.మార్గాలివే.. వీరంతా రాత్రి వేళల్లో లూప్లైన్ మార్గాలు ఎంచుకుని వస్తున్నారన్నది సమాచారం. పలాస : గొప్పిలి, రెంటికోట, గారబంద. మందస : తాళ్లగురంటి, సిరిపురం, సాబకోట, బుడార్సింగి, బీవైపురం, గొప్పిలి రోడ్డు జంక్షన్. బెండిగేట్: టెక్కలిపట్నం, చాపర, పి.పద్మాపురం ఒడిశా సుంకి చెక్పోస్టు : పార్వతీపురం మన్యంజిల్లా సాలూరు, రాజాం, చిలకపా లెం (పొందూరు రోడ్డు మీదుగా) -
సిక్కోలు లఘు చిత్రోత్సవం లోగో ఆవిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం పట్టణానికి చెందిన మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ, పీకే ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సిక్కోలు లఘు చిత్రోత్సవం – 2025 లోగోను శ్రీకాకుళం నెహ్రు యువకేంద్రం డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ ఉజ్వల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం యువత క్రియేటివిటీ టాలెంట్ను నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశమన్నారు. ఈ లోగో శ్రీకాకుళం సంస్కృతి సంప్రదాయా లు, కళలు ప్రతిబింబించే విధంగా చిత్రీకరించి న ఆర్ట్ డైరెక్టర్ మణిపాత్రుని నాగేశ్వరరావుని అభినందిస్తూ ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహ కులు ప్రసాద్, కుమారి, కీర్తి, అభిరామ్, సంజు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్స రం చదువుతున్న అంబటి గణేష్ రగ్బీ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికై న ట్లు కళాశాల ప్రిన్సిపాల్ టి.హేమసుందర్ తెలిపారు. ఇటీవల కర్నూలు జిల్లాలోని ఆదర్శ విద్యా మందిర్ క్రీడా మైదానంలో జరిగిన 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్లో అండర్–19 బాలుర విభాగంలో శ్రీకాకుళం జిల్లా తృతీయ స్థానం సాధించింది. ఈ జట్టులో పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులుఎ.గణేష్, బి.ప్రసా ద్, పి.వంశీ, ఎస్.అయ్యప్పలు ఉండ డం అభి నందనీయమని ప్రిన్సిపాల్ అన్నారు. వీరిలో గణేష్ జాతీయ పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. గురువారం విద్యార్థులను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. ఎచ్చెర్ల: ఖేల్ ఇండియా జాతీయ క్రీడా పోటీలు వెయిట్ లిప్టింగ్ విభాగంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ క్రీడాకారిణి గుజ్జల వర్షిత కాంస్య పతకం సాధించింది. ఈనెల 24వ తేదీ నుంచి రాజస్థాన్లోని బికనరీలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళా కేటగిరి 69 కేజీల విభాగంలో వర్షితకు గురువారం కాంస్యం వరించింది. ఈ విజయంపై వర్సిటీ వీసీ ఆచార్య కేఆర్ రజనీ, రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య, స్పోర్ట్స్ డీన్ డా.పి.రవికుమార్లు అభినందనలు తెలిపారు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ధర్మశాలలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్ప్రదేశ్లో జరిగిన అఖిల భారత మహిళల వెయిట్ లిప్టింగ్ పోటీల్లో కూడా బీఆర్ఏయూ తరుపున పాల్గొని రజత పతకం సాధించింది. -
రైతుల కోసం మాట్లాడే అర్హత టీడీపీకి లేదు
ఆమదాలవలస: రైతుల కోసం మాట్లాడే అర్హత టీడీ పీకి లేదని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రస్తు తం చేస్తున్న రైతన్న కోసం కార్యక్రమం బూటకమ ని అన్నారు. అది రైతులను మోసం చేయడానికేనని మండిపడ్డారు. ఏడాదికి రూ.20,000లు రైతు భరో సా ఇస్తానని చెప్పి.. ఈ రెండు సీజన్లకు రూ. 40,000లు ఇవ్వాల్సింది పోయి, రూ.5,000లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం రైతుల ను నానా ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలులో ఎన్ని అక్రమాలు, వివక్షలు చూపుతారోనని రైతులు భయపడుతున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, సరుబుజ్జిలి జెడ్పీటీసీ సభ్యుడు సురవరపు నాగేశ్వరరావు, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి గురువుబెల్లి శ్రీనివాసరావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, ఆమదాలవలస మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, నాయకులు బద్రి రామారావు, కోవిలాపు చంద్రశేఖర్, అత్తులూరి రవికాంత్, కూన రామకృష్ణ, కృష్ణారావు, హేమంత్, ప్రసాద్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
జెమ్స్ ఆస్పత్రి జిల్లాకే తలమానికం
శ్రీకాకుళం రూరల్: రాగోలులోని జెమ్స్ ఆస్పత్రి జిల్లాకే తలమానికమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జెమ్స్లో యుగ్మా 25వ వార్షికో త్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాల్లో భాగంగా కొన్ని కేసులను జెమ్స్కు రిఫర్ చేయడం, వారు త్వరగా కోలుకోవ డం శుభపరిణామన్నారు. జెమ్స్లో వైద్యం బాగుందని, పేద ప్రజలకు మరిన్ని సేవలందివ్వాలని కోరారు. ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు జగపతిబాబు మాట్లాడుతూ.. అవయవ దానానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో తాను కిమ్స్లోనే చికిత్స చేసుకున్నానని వెల్లడించారు. ఆస్పత్రి వర్గాలు ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్, ఎన్.ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్వోలపై దుర్భాషలు
పలాస: మండలంలోని కంబిరిగాం రెవెన్యూ పరిధి లో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న స్థలాల్లో వెంచర్లు వేస్తున్న పలాసకు చెందిన రియల్ ఎస్టేటు వ్యాపారి కోరాడ శ్రీనివాసరావుపై కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేయాలని ముగ్గురు వీఆర్వోలు గురువారం ఫిర్యాదు చేశారు. దీంతో పరిశీలించి కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. కంబిరిగాంకు చెందిన ఒక వ్యక్తి తన పొలాలను శ్రీనివాసరావుకు విక్రయించాడు. రూ.కోట్ల విలువైన ఆ భూములను అతను కొనుగో లు చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. అందులో ఎత్తుపల్లాలను చదును చేయడానికి ఆ పక్కనే ఉన్న కొండను అక్రమంగా తవ్వి అనధికారికంగా కంకరను తరలించాడు. ఈ విషయంపై మైన్స్ అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో వారు ఇటీవల వచ్చి పరిశీలించారు. అనంతరం వారు సంబంధిత వ్యక్తి శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేశారు. నోటీసులపై వీరంగం ఆ నోటీసులను పట్టుకొని పలాస మండలానికి చెందిన కంబిరిగాం వీఆర్వో బి.వెంకటరావు, లక్ష్మీపు రం వీఆర్వో బి.వెంకటరమణ, చినంచల వీఆర్వో చంద్రమోహన్లు కలిసి రియల్ ఎస్టేటు వ్యాపారి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమయంలో అతను లేకపోవడంతో అతని భార్య వద్ద నుంచి అతడి ఫోన్ నంబర్ తీసుకొని కాల్ చేశారు. దీంతో ఆయన ఫోన్లో వీఆర్వోలపై విరుచుకుపడ్డా డు. నానా దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా ఆ వెంటనే పలాస తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వీరంగం చేశాడు. నోటీసులు ఇవ్వడానికి మీరెవ్వరంటూ తహసీల్దార్తో సైతం అమర్యాదగా మాట్లాడాడు. దీంతో తహసీల్దార్ టి.కల్యాణ చక్రవర్తి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కాశీబుగ్గ పోలీసులు అక్కడికి వెళ్లి శ్రీనివాసరావును అక్కడ నుంచి తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత వీఆర్వోల సంఘం తరుపున ఆ సంఘం నాయకు లు కొర్ల శ్రావణ్కుమార్, పైల సంతోష్, ఖగేశ్వరరా వు, అప్పలస్వామి, ప్రసాద్ తదితరులు స్టేషన్కు వెళ్లి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే బుధవారం రాత్రి ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. గురువారం కూ డా వెళ్లి మళ్లీ పోలీసులను కలిశారు. అప్పటికే స్టేషన్లో ఉన్న కాశీబుగ్గ ఎస్ఐ నర్సింహమూర్తి వారికి సమాధానం చెబుతూ.. సీఐ ప్రస్తుతం లేరని పరిశీలించి కేసు నమోదు చేస్తామని చెప్పారు. -
బాధితులకు త్వరితగతిన నష్ట పరిహారం చెల్లించండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రోడ్డు ప్రమాదాల కేసుల్లో బాధితులకు త్వరితగతిన నష్ట పరిహారం చెల్లించా లని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, స్థానిక న్యాయ సేవా సదన్ కోర్టు ఆవరణలో పోలీసు అధికారులతో యాక్సిడెంట్ కేసుల్లో బాధితులపై గురువారం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితుల క్లెయిమ్లను త్వ రితగతిన చెల్లించుటకు మార్గాలను గురించి విశ్లేషించి సమీక్షించారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో బాధితుడికి సాయం చేయకపోవడం, నిర్లక్ష్యంగా వదిలి వెళ్లిపోవడం సరికాదన్నారు. అలాంటి వారిని విడవరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూ టీ కలెక్టర్ పద్మావతి, ఆర్డీవో కార్యాలయం నుంచి ఆర్.ఈశ్వరమ్మ, డిప్యూటీ తహసీల్దార్ డీఎం నాగేంద్ర ప్రసాద్, ట్రాఫిక్ పోలీసు సీఐ వి.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి మృతి కేసులో ఐదుగురి అరెస్టు
టెక్కలి రూరల్: గోపినాథపురంలో సమీపంలో ఈ నెల 23వ తేదీ రాత్రి కొమనపల్లి పద్మనాభం(26) మృతి చెందిన కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పద్మనాభంను గోపినాథపురం సమీపంలో కొంత మంది వ్యక్తులు దాడిచేసి చంపేశారని అతని తల్లి 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోపినాథపురం గ్రామానికి చెందిన చితారు చంద్రశేఖర్, ధవళ నర్సింగరావు, ధవళ రాంబాబు, దుప్పట్ల మల్లేశ్వరరావు, ధవళ రామరాజులతో పాటు మరికొంత మంది వ్యక్తులు ముందస్తు ప్రణాళికతో పద్మనాభంను ఇనుపరాడ్లు, కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు చికిత్స పొందుతూ రిమ్స్లో మృతిచెందాడు. పద్మనాభంకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఎవరిపై పడితే వారిపై దాడి చేసి గాయపరిచేవాడు. ఇతడితో ఎప్పటికై నా ప్రమాదం ఉందని భావించి నిందితులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: కార్మికవర్గాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే ఐక్యపోరాటాలు ఉద్ధృతం చేస్తామని అఖిలపక్ష కార్మిక, రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. కార్మిక హక్కులు కాలరాసే నాలుగు లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. రైతులు పండించే అన్ని పంటలకు కొనుగోలుతో మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలని కోరుతూ లేబర్ కోడ్లు నోటిఫికేషన్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లా డుతూ కార్మికవర్గం ప్రాణత్యాగాలతో సాధించుకున్న కార్మికచట్టాలను నిర్వీర్యం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లనుగా మార్చి దేశవ్యాప్తంగా అమలుచేయడానికి నవంబర్ 21న ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమని మండిపడ్డారు. పర్మినెంట్, కాంట్రాక్టు పద్ధతి స్థానంలో పరిమితకాల ఉద్యోగం పద్ధతి తెచ్చారని దుయ్యబట్టారు. కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కనీస సభ్యు ల సంఖ్యను పెంచడం, నిరసనలు ధర్నాలు నిర్వహించడానికి అనుమతులను తప్పనిసరి చేయడం తగదన్నారు. 2017లో ప్రధానమంత్రి ఇచ్చిన ‘రైతుల ఆదాయం రెట్టింపు’ హామీ పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సీహెచ్.అమ్మన్నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.మోహనరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పొందూరు చంద్రరావు, పోలాకి ప్రసాదరావు, సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ తాండ్ర ప్రకాష్, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు చిక్కాల గోవిందరావు, ఐఎఫ్టీయూ నాయకులు ఎస్.కృష్ణవేణి, ఏపీ మెడికల్ సేల్స్ – రిప్రెజెంటేటివ్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దేవాది వాసుదేవరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ కిసాన్ కాంగ్రెస్ నాయకులు సనపల అన్నాజీరావు, ఉద్యోగ, కార్మిక, రైతు సంఘాల నాయకులు ఆర్.ప్రకాషరావు, ఎం.గోవర్దనరావు, ఎన్.బలరాం, డి.యుగంధర్, కళ్యాణపు అప్పలరాజు, ఎం.ఆదినారాయణమూర్తి, సీహెచ్ చంద్రశేఖర్, పి.జగ్గారావు, టి.నందోడు పాల్గొన్నారు. -
పచ్చని ఉద్దానంలో కార్గో చిచ్చు పెట్టొద్దు
వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దానాన్ని నమ్ముకొని ఏళ్ల తరబడి జీవనోపాధి సాగిస్తున్న ఈ ప్రాంతంలో ప్రభుత్వాలు కార్గో చిచ్చు పెట్టి తమ జీవితాలను రోడ్డుపాలు చేయవద్దని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాటంలో భాగంగా ఈ నెల 21 నుంచి సాగుతున్న నల్లబ్యాడ్జిలతో నిరసన కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా చీపురపల్లి పంచాయతీ సంతోష్నగర్లో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 21న మహాధర్నా పేరున రైతులతో కలిసి పలాస ఆర్డీఓకి తమ గోడు వినిపించాలన్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. పాలకులు ఇదే పంథా కొనసాగిస్తే ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు, బాధితులు పాల్గొన్నారు. సాగునీటి కాలువలో పడి వ్యక్తి మృతి శ్రీకాకుళం రూరల్: పెదపాడు పంచాయతీ ముద్దాడపేటకు చెందిన ముద్దాడ తారకేశ్వరరావు (40) బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు సాగునీటి కాలువలో పడి మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. -
ఏఎన్ఎంల ధర్నా
అరసవల్లి: సచివాలయాల్లో పనిచేస్తున్న వైద్యశాఖ గ్రేడ్–3 ఏఎన్ఎంలకు పదోన్నతులు కల్పించాలంటూ ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఏఎన్ఎంల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డీఎంహెచ్వో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధి రంగమ్మ మాట్లాడుతూ పొరుగు జిల్లాల్లో గ్రేడ్–3 ఏఎన్ఎంలకు పదోన్నతులు కల్పించే ప్రక్రియలు పూర్తయ్యాయని, శ్రీకాకుళంలో మాత్రం అధికారులకు చలనం లేదని..ఇప్పటికై నా ఏఎన్ఎంల ఆవేదనను అర్ధం చేసుకుని పదోన్నతులు కల్పించాలని కోరారు. విద్యుత్ షాక్తో వలస కూలీ మృతి రణస్థలం: లావేరు మండలం గుమ్మడం పంచాయతీ వాళ్లెపేట గ్రామానికి చెందిన వాళ్లె కన్నంనాయుడు(38) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నంనాయుడు బతుకు తెరువు కోసం చిలకలూరిపేట టౌన్లో పనిచేస్తుండగా ఈ నెల 25న విద్యుత్ షాక్కు గురయ్యాడు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అదే రోజు రాత్రి 10.30 గంటల సమయంలో మృతి చెందాడు. కన్నంనాయుడుకు భార్య ఆదిలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడాది క్రితం తండ్రి రాముడు చని పోవడం, తల్లి అనారోగ్యంతో ఇంట్లోనే ఉండటం, కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటున్న తరుణంలో ఇలా జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి వజ్రపుకొత్తూరు : పూండి రైల్వేస్టేషన్లో సమీపంలో బుధవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. 30 నుంచి 35 ఏళ్లు వయస్సు కలిగి లైట్ బ్లూ కలర్ జీన్ ఫ్యాంటు, జిప్ ఉన్న ఫుల్ హ్యాండ్స్ టీ షర్టు ధరించి ఉన్నాడు. తల భాగం పూర్తిగా ఛిద్రమైంది. ఈ మేరకు స్టేషన్ మాస్టర్ పలాస జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలాస జీఆర్పీ ఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు టెక్కలి: టెక్కలి నియోజకవర్గంలో పలు ఆలయాల అభివృద్ధికి సీజీఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు, టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జునస్వామి ఆలయం అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. -
మత్స్యకారుల్లో అలజడి
● తుఫాన్ హెచ్చరికలతో ఆందోళన ● ఈ ఏడాది వృథాగా మారిన 56 రోజులు ● ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆకలి కేకలుఇచ్ఛాపురం రూరల్: వరుస తుఫాన్లు గంగపుత్రులను వణికిస్తున్నాయి. రోజుల తరబడి వేటకు వెళ్లలేని దుస్థితిని కల్పిస్తున్నాయి. కుటుంబ పోషణను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. ప్రభుత్వం సైతం పట్టించుకోకపోవడంతో మత్స్యకారులు పస్తులతో కాలం గడపాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఈ ఏడాది దాదాపు ఐదు సార్లు అల్పపీడనం, వాయుగుండాలు, తుఫాన్లు రావడంతో జిల్లాలోని మత్స్యకారులు దాదాపు 56 రోజుల పాటు వేటకు దూరమయ్యారు. తాజాగా మరో తుఫాను ముంచుకొస్తుందంటూ వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో ఐదు రోజుల పాటు మళ్లీ వేటకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మత్స్యసంపద అంతంత మాత్రమే. తర్వాత ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల సంతోనోత్పత్తి సమయం కావడంతో 61 రోజుల పాటు వేటకు ప్రభుత్వం విరామం ప్రకటించింది. దీంతో దాదాపు ఆరు నెలలు పాటు మత్స్యకారులకు అరకొరగా వేట సాగింది. ఇక జూన్ నుంచి నవంబర్ వరకు వరుస తుఫాన్లు రావడంతో మత్స్యకారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ధరలు పతనం.. కొన్ని నెలలుగా సముద్రంలో చేపల వేట సజావుగా సాగక అల్లాడిపోతున్న మత్స్యకారులకు కార్తీక మాసం గుదిబండగా మారింది. జిల్లాలో దొరికే మత్స్య సంపదను అధిక ధరలకు కొనుగోలు చేసే ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల వ్యాపారులు కార్తీక మాసం పేరుతో ముఖం చాటేశారు. దీంతో కిలో రూ.120 నుంచి రూ.180 పలికే చేపలను రూ.50, రూ.60లకు అమ్ముకోవాల్సి వచ్చింది. కాస్తో కూస్తో వలకు చేరిన కవ్వళ్లతో వ్యాపారం చేద్దామనుకున్న సమయంలో మోంథా తుఫాన్ పుణ్యమాని సుమారు రూ.30లక్షలు ఎండు చేపలు వర్షార్పణం అయ్యాయి. నవంబర్లో వేల రూపాయలు ఆదాయం కల్పించే ఖరీదైన కోనేం చేపలు కూడా వలకు పడటం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ అల్లకల్లోలం.. తాజాగా తుఫాన్ హెచ్చరికతో మత్స్యకారులు ఆందోళనకు గురౌతున్నారు. బోట్లను ఒడ్డుకు చేర్చుకోవడం, వలలను సంరక్షించుకోవడం చేస్తున్నారు. ఇప్పటికే మోంఽథా తుఫాన్తో చితికిపోయిన మత్స్యకారులు మరో హెచ్చరికతో బెంబేలెత్తిపోతున్నారు. కనీసం రెండు నాటికల్ మైళ్ల దూరం కూడా వెళ్లలేక వెనుదిరుగుతున్నారు. ఈ ఏడాదిలో సముద్రంపై వలలను వదులుతూ వాటిని మళ్లీ తిరిగి లాక్కుంటూ రోజంతా శ్రమ పడుతూ రోజుకి రూ.4వేలు నష్టపోతున్నామే కానీ, తగిన ఆదాయం రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. గతంలో ఇలా లేదు.. మునుపెన్నడూ ఈ గతి చూడలేదు. వలకు పదేసి కోనేములు పడే సీజన్ ఇది. ఇప్పుడు ఒక్క కోనేం చేప కూడా పడటం నేదు. కవ్వళ్లు మాత్రం దొరుకుతున్నాయి. దీంతో ఉసూరుమంటూ ఒడ్డుకు తిరిగి వచ్చేస్తున్నారు. నాలుగైదు నెలలుగా గాలులు, వర్షాలతో ఇబ్బందులు పడుతున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే జీవనం కష్టమే. – మాగుపిల్లి మోహనరావు, మత్స్యకారుడు, డొంకూరు ఏడాదిగా అవస్థలే.. వరుస విపత్తులతో సముద్రంలో వేట సజావుగా సాగడం లేదు. ఈ ఏడాదిలో చాలా సార్లు తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు రావడంతో వేట లేక పస్తులుండాల్సి వస్తోంది. ఒకవేళ సముద్రంలోకి వెళ్లినా బోటు ఒక్కచోట ఆగకపోవడంతో చేపలు వలకు చిక్కడం లేదు. చివరకు పర(ఉప్పుటేరు)లో దొరికే చూపలతో పొట్టపోసుకుంటున్నాం. మొన్నటి వరకు కార్తీక మాసం అని చేపలు బేరం తగ్గిపోగా, ఇప్పుడు అస్సలు చేపలు దొరకడమే గగనంగా మారింది. ప్రభుత్వం ఎలాంటి సాయం కూడా చేయడం లేదు. – బుడ్డ జగ్గయ్య, మత్స్యకారుడు, డొంకూరు -
గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పాత్రపూర్ గ్రామానికి సంజుక్తదాస్ అనే మహిళ తన భర్తతో కలిసి సూరత్లో ఉండేది. అక్కడ గంజాయి వ్యాపారం చేస్తున్న తన భర్త స్నేహితుడు రంజాన్ ప్రదాన్, గంజాయి సమకూర్చే కునిపండాతో పరిచయమేర్పడింది. కొద్దిరోజుల తర్వాత భర్త మరణించడంతో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో పాత్రపూర్ గ్రామానికి చెందిన లోకనాథ్ ప్రదాన్తో కలిసి ఒడిశా నుంచి 29 కేజీల గంజాయి కొనుగోలు చేసి సూరత్ తరలించడానికి ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కు బుధవారం చేరుకున్నారు. స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు గంజాయితో వీరిరువురు పట్టుబడ్డారు. గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో పట్టణ పోలీస్స్టేషన్ ఇన్చార్జి కవిటి ఎస్సై రవివర్మ, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యానికి మూలస్తంభం రాజ్యాంగం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): భారత రాజ్యాంగం కేవలం చట్టపరమైన పత్రం కాదని మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిదని కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఈఈ బి.కరుశ్రీ అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన్ దివాస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పీఎన్కాలనీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం ఆత్మపరిశీలన చేసుకునే రోజు అని పేర్కొన్నారు. హక్కులు, విధులు నాణేనికి రెండు దిశలు వంటివని చెప్పారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది పాల్గొన్నారు. -
మూడు కేటగిరీలుగా భజన మందిర నిర్మాణాలు
అరసవల్లి: తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ నిధులతో జిల్లాలో మత్స్యకార, బీసీ, ఎస్సీ ఎస్టీ తదితర బలహీన వర్గాల పంచాయతీ, కాలనీల్లో గుడి లేని ప్రాంతాల్లో కొత్తగా భజన మందిరాల నిర్మాణానికి నిధులు మంజూరుకు మార్గదర్శకాలను విడుదలయ్యాయని జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ బి.ఆర్.వి.వి.ప్రసాద్ పట్నాయక్ ప్రకటించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మూడు వర్గాలుగా భజన నిర్మాణాలు జరిపేందుకు టీటీడీ నిర్ణయించిందని వివరించారు. ఆయా ప్రదేశాల్లో ప్రభుత్వానికి చెందిన లేదా ఎవరైనా అంగీకారంలో ఇచ్చిన ప్రైవేటు భూములనైనా (యజమాని బాండ్ పేపర్ అగ్రిమెంట్తో) ఈ భజన మందిరాల నిర్మాణాలకు వినియోగించవచ్చునని పేర్కొన్నారు. స్థల పరిశీలన అనంతరం అర్హత ఉన్న చోటే నిర్మాణాలకు ఆమోదం లభిస్తుందన్నారు. మందిరాల మంజూరు అంశాలన్నీ దేవదాయ శాఖ ద్వారానే జరుగుతాయని, తమ ప్రాంతాల్లో భజన మందిరాలను నిర్మించదలచిన వారు కమిటీగా ఏర్పడి స్వీయ ధృవపత్రాలతో పాటు ఆయా స్థలాల హద్దుల వివరాలను టీటీడీ ఫార్మాట్ దరఖాస్తులో పొందుపరిచి జిల్లా దేవదాయ శాఖాధికారి కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. టైప్–ఎ కింద 5 సెంట్ల భూమి ఉన్న చోట భజన మందిరాలకు రూ.10 లక్షలు, టైప్–బి కింద 10 సెంట్ల విస్తీర్ణంలో నిర్మాణానికి రూ.15 లక్షలు, 10 సెంట్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణానికి రూ.20 లక్షల వరకు అంచనా వ్యయంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులను మంజూరవుతాయని వివరించారు. దరకాస్తులను పరిశీలించి, స్థలాల పరిశీలన బాధ్యతలన్నీ దేవదాయ శాఖ ఇంజినీర్లు, ఇన్సెస్పెక్టర్ల ఆధ్వర్యంలో పూర్తయ్యాక అర్హులను గుర్తించి పూర్తి వివరాలను రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించనున్నామని ప్రసాద్ పట్నాయక్ వివరించారు. -
నూతన భవనంలోకి వర్సిటీ కార్యాలయాలు
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్సిటీలో సుమారు రూ.38 కోట్ల నిధులతో జీ ప్లస్ 4 సముదాయంగా నిర్మించిన డాక్టర్ ఎన్టీఆర్ నూతన పరిపాలనా భవనాన్ని వైస్ చాన్సలర్ కె.ఆర్ రజనీ, ఉన్నతాధికారులు, పాలకమండలి సభ్యులతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన భవనం ప్రారంభంతో వర్సిటీకి పాలనా పరమైన వసతి సమస్య దాదాపుగా తీరినట్లయ్యిందని తెలిపారు. గత వీసీలు కె.రామ్జీ, ఎన్.వెంకటరావు కృషికి తోడు ప్రస్తుత వర్శిటీ ఉన్నతాధికారులు, అవిశ్రాంత ప్రయత్నంతో భవన నిర్మాణం పూర్తయ్యిందన్నారు. ప్రోటోకాల్ విషయమై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ అవన్నీ సమసిపోయాయనిచెప్పారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం, జాతీయ లా డే కార్యక్రమంలో వీసీ మాట్లాడారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ఈసీ సభ్యులు కె.చక్రపతి, ప్రిన్సిపాల్స్ ఎం.అనూరాధ, కె.స్వప్నవాహిని, సీహెచ్ రాజశేఖరరావు, కె.సామ్రాజ్యలక్ష్మీ, భవనం ఆర్కిటెక్చర్ రాదేశ్యాం, సీపీడబ్ల్యూడీ ఏఈ శ్రీనివాస్, జి.పద్మారావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు న్యాయ విభాగం అధ్యాపకులు జ్ఞాపికలను వీసీ అందించి అభినందించారు. కాగా రాజ్యాంగ దినోత్సవం పురష్కరించుకుని వర్శిటీలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రజాప్రతినిధులు గైర్హాజరు భవనం ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఈఆర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు ఆహ్వానం అందినా ఎవరూ రాకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో వర్సిటీ అధికారులే ప్రారంభించేశారు. ప్రజాప్రతినిధులు వర్సిటీని సందర్శిస్తే ఇక్కడ సమస్యలు వారికి తెలుస్తాయని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించవచ్చని చెబుతున్నారు. అయితే ప్రజాప్రతినిధులు మాత్రం మొదటి నుంచీ గైర్హాజరవుతునే ఉన్నారు. -
రాజ్యాంగ స్ఫూర్తితోనే వైఎస్సార్ సీపీ పాలన
● ఇప్పుడు రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం తప్ప భారత రాజ్యాంగం లేదు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): బడుగు బలహీన వర్గాల కోసం అవిశ్రాంతంగా శ్రమించిన బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రపంచంలో అన్ని రాజ్యాంగాల కంటే అ త్యంత బలమైనది భారత రాజ్యాంగమని అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడు తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక భారత రాజ్యాంగం అమలుకావడం లేదని రె డ్బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే వైఎస్సార్సీపీ హయాంలో పాలన జరిగిందని, పేదరికం, వివక్ష, వంటి సమస్య లు రాజ్యాంగం మార్గదర్శకత్వంతోనే అధిగమించారన్నారు. ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపైనా దౌర్జన్యాలు, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ పాలనంతా భ్రష్టు పట్టించారన్నారు. ఇప్పటిౖకైనా కళ్లు తెరిచి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుని సంక్షేమ ఫలాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పొన్నాడ రుషి, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణ మాట్లాడుతూ టీడీపీ పాలనంతా రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో విజయవాడలో ఏర్పాటుచేసిన అంబేడ్కర్ పార్కు నిర్వ హణ గాలికొదిలేసి, ఉద్యోగులకి జీతాల్వికుండా నాశనం చేశారని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచేలా చేస్తే దళిత జాతి చూస్తూ ఊరుకోదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డా రు. దళితుల ఓట్లు కావాలే తప్ప దళితుల సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుకి అవసరం లేదన్నారు. కా ర్యక్రమంలో వైఎస్సార్సీపీ కళింగవైశ్యకుల రాష్ట్ర అ ధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పార్టీ వెలమకు ల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, కాళింగకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆరంగి మురళి, కూరాకుల, పొందర కుల రాష్ట్ర అధ్యక్షులు రాజాపు అప్పన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దుంపల లక్ష్మణరావు, కార్యవర్గసభ్యులు గొండు కృష్ణమూర్తి, గ్రీవెన్స్సెల్ జిల్లా అధ్యక్షులు రౌతు శంకరరావు, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి సనపల నారాయణరావు, ఎస్సీ విభాగం నాయకులు యజ్జల గురుమూర్తి, నీలాపు ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. -
వణికిస్తున్న స్క్రబ్ టైఫస్
● జిల్లాలో ఎనిమిది మందికి వ్యాధి ● ఓ శిశువుకు కూడా సోకడంతో ఆందోళన ఆందోళన వద్దు తగ్గిపోతుంది జిల్లాలో ఈ వ్యాధిపై ఎలాంటి ఆందోళన వద్దు. లార్వల్ మైట్స్ అనే పురుగుల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. అయితే స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకిన వారికి డోక్సిసైక్లిక్, ఎజిత్రామైసిన్ మందులను వినియోగిస్తే కచ్చితంగా వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. ఇప్పటికే ఈ మేరకు వైద్యులకు సూచనలు ఇచ్చాం. – డాక్టర్ కల్యాణ్బాబు, జిల్లా ఆసుపత్రుల సర్వీసుల కోఆర్డినేటర్ తగు చర్యలు చేపట్టాం స్క్రబ్ టైఫస్ వ్యాధిని జిల్లాలోని హిరమండలంలో గుర్తించాం. ఎనిమిది మంది బాధితులు, ఒక శిశువు కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వ్యాధి సోకిన రోగుల పట్ల అన్ని చర్యలూ చేపడుతున్నాం. వ్యాధి లక్షణాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నాం. – కె.అనిత, డీఎంహెచ్ఓ అరసవల్లి: స్క్రబ్ టైఫస్.. జిల్లాను కలవరపరుస్తున్న వ్యాధి. వాతావరణంలో మార్పులతో పా టు దూరపు ప్రయాణాలు చేసి వచ్చిన వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండడం ఆందోళనకరంగా మారింది. జిల్లాలో దాదాపు ఎనిమిది మంది ఈ వ్యాధి బారిన పడినట్లు సమాచారం. ఓ శిశువుకు కూడా వ్యాధి సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అధికారికంగా వ్యాధి గురించి సమాచారాన్ని ఎవరూ బయటకు ఇవ్వడం లేదు. చాలా మంది చికిత్స కోసం విశాఖకు పరుగులు తీస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాధి లక్షణాలివే.. ● లార్వల్ మైట్స్ అనే పురుగులు కుట్టడం వల్ల ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది. ● చర్మం ఎరుపెక్కి దద్దుర్లు వస్తుంటాయి. ● ఈ వ్యాధి సోకిన తర్వాత దగ్గు, జ్వరం, జలుబు, నీరసం లక్షణాలు కనిపిస్తాయి. ● కొందరికి ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో పాటు జ్వర తీవ్రత పెరిగిపోవడం, ఊపిరితిత్తుల సమస్యలు, రక్తం గడ్డకట్టడం, పచ్చకామెర్లు వంటి ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదాలున్నాయి. ● మెదడుపై ప్రభావం చూపకముందే ఈ వ్యాధి సోకిన వారిని వైద్యుల పరిశీలనలో ఉంచడం మంచిది. పెరుగుతున్న కేసులు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలు మండలాల్లో వారం రోజుల్లోనే ఏడు కేసులు నమోదు కావడంతో పాటు ఓ తొమ్మిది నెలల శిశువు కూడా ఈ వ్యాధి సోకడం ఆందోళనకరంగా మారింది. -
గుండెలు పగిలే వేదన
● సెప్టిక్ ట్యాంకులో పడి ఐదేళ్ల చిన్నారి మృతి టెక్కలి రూరల్: కాసేపు పొలమారితేనే విలవిలలాడిపోతాం. అలాంటిది ఐదేళ్ల అబ్బాయి ఊపిరాడక ఎంత వేదన అనుభవించాడో. ఆపత్కాలంలో తల్లిని ఎంతగా తలచుకున్నాడో. తండ్రి వస్తాడని ఎంతగా ఎదురు చూశాడో..? ఐదేళ్ల వయసులోనే ఆయుష్షు తీరిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రుల గుండెలు ఎంతగా తల్లడిల్లిపోయాయో. స్థానిక మండపొలం కాలనీకి చెందిన కొంకి భవ్యాన్ (5) అనే చిన్నారి బుధవారం సెప్టిక్ ట్యాంకులో పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండపొలం కాలనీకి చెందిన కొంకి హరిబాబు, మంగల చిన్న కుమారుడు భవ్యాన్. ఈ చిన్నారి ఒక ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. అయితే బుధవారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఇంటికి దగ్గరలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు వెళ్లి ఆడుకుంటుండగా.. సెప్టిక్ ట్యాంక్ పై రేకు కప్పి ఉండటంతో దానిపైకి వెళ్లి ఒక్కసారిగా కిందకు జారి పడిపోయా డు. బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అంతా గాలించారు. కాసేపయ్యాక సెప్టిక్ ట్యాంకులో పడి ఉన్న బాలుడిని గుర్తించారు. అనంతరం అతడిని బయటకు తీసి హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. -
మిల్లర్ల ఇష్టారాజ్యం
● అదనంగా ధాన్యం ఇవ్వాల్సిందేనంటూ హుకుం ● అధికారులకు ఫిర్యాదు చేసినా వెరవని మిల్లర్లు నరసన్నపేట: ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కంబకాయకు చెందిన రైతు సెరిశిల్ల సింహాచలం కంబకాయ కొనుగోలు కేంద్రం ద్వారా బుధవారం 50 బస్తాల ధాన్యం ఉదయం 9 గంటలకు నరసన్నపేటలోని బాలాజీ రైస్మిల్లుకు తీసుకువెళ్లాడు. ధాన్యం పరిశీలించిన మిల్లరు నాణ్యత బాగులేదు 80 కేజీల బస్తాకు అదనంగా 6 కిలోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బస్తాకు ఆరు కిలోలు అంటే 50 బస్తాలకు 300 కిలోలు మిల్లరు అప్పనంగా అడగడంతో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక సివిల్ సప్లై డీటీ రామకృష్ణకు సమాచారం ఇచ్చారు. ఈయన వచ్చి మిల్లర్తో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. అక్క డి నుంచి రైతు ధాన్యం పట్టుకొని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ టి.సత్యనారాయణకు విషయం తెలియజేశారు. తానేమీ చేయలేనని ఆయన చేతులెత్తేశారు. దీంతో చేసేదేమీ లేక రైతు ధాన్యాన్ని తిరిగి ఇంటికి తీసుకొని వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కంబకాయకు చెందిన రైతులు తంగి రవీంద్ర, పాగోటి అప్పలనాయుడు మాట్లాడుతూ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని కోరారు. ప్రతి బస్తాకు రెండు కిలోలు అదనంగా తీసుకుంటున్నారని, ఇది కాకుండా మరో నాలుగైదు కిలోలు నాణ్యత పేరున తీసుకుంటున్నారని తెలిపారు. కొందరు రైతులు చేసేదేమీ లేక ఇచ్చేస్తుండగా కొంత మంది రైతులు ఎదురు తిరిగినా ఫలితం లేకుండా పోతుంది. బస్తాకు 2 కిలోలు అదనంగా ఇస్తే మండలంలో రైతులు ఈ సీజన్కు రూ. 2.5 కోట్లు మేర నష్ట పోయే అవకాశముంది. -
కష్టాలు.. నష్టాలు
రైతన్నపై ముప్పేట దాడి అదనపు డిమాండ్ మిల్లర్లు 84 కేజీలు అడుగున్నారు. అదనంగా ఇవ్వక పో తే ధాన్యం అన్లోడ్ చేయడం లేదు. బాగా నష్టపోతున్నాం. అధికారులకు తెలియచేసినా చర్యలు తీసుకోవడం లేదు. ట్రక్షీట్ కోసం కూడా రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. – పాగోటి గోవిందరావు, కంబకాయ రైతు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అన్నదాతకు అన్ని వైపుల నుంచి కష్టాలు ఎదురవుతున్నాయి. ఒకవైపు వర్షాల హెచ్చరికలు, మరోవైపు విక్రయాలకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు వెరసి రైతులు నష్టపోతున్నారు. ప్రస్తు తం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు గందరగోళంగా ఉన్నాయి. వాస్తవానికి కొనుగోళ్లకు ముందే రైతులకు గోనె సంచులు సరఫరా చేయాలి. ఒకవేళ ప్రభుత్వం సరఫరా చేయకపోతే గోనె సంచీకి ఇంత ఇస్తామని లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ, జిల్లాలో ఇంతవరకు గోనె సంచెలపై స్పష్టతే ఇవ్వలేదు. దీంతో జిల్లాలో ఏ ఒక్క రైతుకు గోనె సంచులు అందని పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా ఉన్న కొనుగోలు కేంద్రాల సిబ్బంది మాత్రం గోనె సంచి సమర్పించుకుంటే ఒక్కో దానికి రూ. 9.58పైసలు ఇస్తామని చెబుతున్నారు. కానీ ఆ ధరకు గోనె సంచులు దొరికే పరిస్థితి లేదు. ప్యాక్ చేస్తే మిల్లు వరకై నా భద్రంగా ఉండే సంచులు కావాలంటే మార్కెట్లో రూ.16 ఽఅవుతుంది. అంటే ఒక్కో గోనె సంచిపై రూ.6.50వరకు అదనపు భారం పడుతోంది. నత్తను మరిపిస్తున్న కొనుగోళ్లు ఖరీఫ్ పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాల హెచ్చరికలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలో 50 శాతానికి పైగా కోతలు అయిపోయాయి. ఇప్పుడా ధాన్యమంతా రోడ్లుపైన, కళ్లా ల్లోను, పొలాల్లోనూ ఉంది. వర్షాలు పడితే రైతులకు కన్నీళ్లే. జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తుందే తప్ప యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం లేదు. కనీసం మిల్లుల నుంచి బ్యాంకు గ్యారెంటీలే ఇంతవరకు తీసుకోలేకపోయింది. 264 మిల్లులకు గాను 82 మిల్లర్లు మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చా యి. మిగతా 182మంది బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వ లేదు. దీంతో రైతుకు దళారే దిక్కుగా మారాడు. టార్పాలిన్లు ఇవ్వని దుస్థితి వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో పండిన పంటను రైతు భద్రంగా దాచుకోవడానికి ప్రభుత్వం టార్పాలిన్లు ఇవ్వాలి. కూటమి ప్రభు త్వం ఈ విషయాన్ని కూడా మరిచిపోయింది. అసలు టార్పాలిన్లు ప్రొక్యూర్ చేసిందో లేదో కూడా తెలియదు. వీటి కొనుగోలు కూడా రైతులకు అదనపు భారంగా మారనుంది. అదనపు దోపిడీ మిల్లుల వద్ద అదనపు దోపిడీ జరుగుతోంది. అసలే ట్యాగ్ చేసిన వాహనాలు అందుబాటులో ఉండకపోవడంతో సొంత ఖర్చులతో వాహనాలను పెట్టు కుని ట్యాగ్ చేసిన మిల్లులకు రైతులు ధాన్యం తరలిస్తున్నారు. అక్కడ గంటలు, రోజుల తరబడి అన్లోడ్ చేయడం లేదు. ఎంత ఆలస్యం జరిగితే అంత అదనపు ట్రాన్స్పోర్టు చార్జీ రైతులపై పడుతోంది. ఇదే నష్టం అనుకుంటే మిల్లుల వద్ద 80 కిలోల బస్తాకు అదనంగా 4నుంచి 6కిలోలు అడుగుతున్నారు. ధాన్యం తడిగా ఉన్నాయని, క్వాలిటీ లేదని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే ఆ రైతులకు సంబంధించిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం లే దు. దాని వల్ల కూడా ట్రాన్స్పోర్టు చార్జీ పెరిగిపోతోంది. గోనె సంచులు ఇవ్వని ప్రభుత్వం కనీసం టార్పాలిన్లు సమకూర్చని దుస్థితి సొంతంగా కొనుగోలు చేసుకోవడంతో రైతులకు తప్పని భారం అందుబాటులో ఉండని జియో ట్యాగ్ వాహనాలు మిల్లుల వద్ద అదనపు దోపిడీ -
విలువలతో కూడిన విద్య అవసరం
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విద్యార్థులతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: విద్యార్థులకు విలువలతో కూడిన విద్య నేర్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉపాధ్యాయులకు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన సమావేశమయ్యారు. ఆమదాలవలస జెడ్పీహెచ్ స్కూల్ కొర్లకోట నుంచి కిల్లి సంధ్య, కాగితాపల్లి నుంచి సురవరపు ఝాన్సీ, కొత్త స్నా నం నుంచి కె.స్నేహ, శ్రీముఖలింగం నుంచి ఆర్. భాగ్యశ్రీ, రొంపివలస నుంచి ఆర్.అభినయ్, ఎల్.ఎన్.పేట నుంచి ఎన్.వర్ష, 10వ తరగతి చదువుతున్న వారిలో ఎం.హారిక, పైడిబీమవరం, ఆర్.వెన్నెల, ఏపీఎంఎస్ సోంపేట, తామాడ హనీ, గరుడభద్ర, అలాగే 9వ తరగతి విద్యార్థులు, వి.ఢిల్లీశ్వరి, ఎంజేపీఏపీ స్కూల్ హయాతినగరం, బి.అనూష, గార, జెడ్పీ హైస్కూల్, ఎన్. జాహ్నవి, కురుడు, కొత్త బొమ్మాళి, ఎన్.జ్ఞానేశ్వరి జెడ్పీ హైస్కూల్ ఆకాశలక్కవరంతో పాటు వారి తల్లిదండ్రులతో కలెక్టర్ మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు. నిరంతరం కృషి చేస్తే చక్కటి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. తన విద్యాభ్యాసం నుంచి కలెక్టర్ అయ్యే వరకు ప్రయాణాన్ని వారితో పంచుకున్నారు. సెల్ఫోన్ బారి నుంచి తల్లిదండ్రులే రక్షించాలని సూచించారు. స్కూళ్ల గురించి ఆరా తీస్తూ గరుడభద్ర జెడ్పీ హైస్కూల్కు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. -
ప్రాణవాయువు నిలిపివేశారు
● నరసన్నపేట ఆస్పత్రిలో మూలకు చేరిన ఆక్సిజన్ ప్లాంట్ నరసన్నపేట: నరసన్నపేటలోని ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ మూలకు చేరింది. రోగులకు ప్రయోజనకరంగా ఉంటూ వారి ప్రాణాలను కాపాడుతుందనే సదుద్దేశంతో గత ప్రభుత్వ కా లంలో రూ. 60 లక్షలు వెచ్చించి ఈ ఆక్సిజన్ ప్లాంట్ను నిర్మించారు. కోవిడ్ లాంటి మహమ్మారి మరోసారి వస్తే రోగులకు ఆక్సిజన్ సమస్యలు ఉత్పన్నం కాకూడదనే భావంతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను అప్పట్లో నిర్మించింది. వార్డుల్లో కూడా ప్రత్యేక పైప్ లైన్లు వేశారు. ప్రభుత్వం మారడంతో ఈ ప్లాంట్ నిర్వహణను పూర్తిగా అధికారులు వదిలేశారు. ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్లను అవసరం రీత్యా ఆస్పత్రి వర్గాలు కొంటున్నాయి. దీంతో అదనపు ఖర్చుగా మారుతోంది. నరసన్నపేటలో ఆక్సిజన్ ప్లాంట్లో కంప్రెషర్లు మరమ్మతులకు గురి కావడంతోనే ఇది మూల పడిందని తెలుస్తోంది. ఆస్పత్రిలో మూలకు చేరిన ఆక్సిజన్ ప్లాంట్ -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..
● అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి ● రామేశ్వరంలో ఘటన ● మరో నలుగురికి గాయాలు ● అందరూ పలాస వాసులే పలాస: అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన పలాస మండలం పెదంచల, వీరరామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో నలుగురు భక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దగ్గరలో రామచంద్రపురం వద్ద గల మెడికల్ కళాశాల పక్కన జరిగింది. ఈ సంఘటన తెలియడంతో గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారం రోజుల కిందట పలాస మండలం పెదంచల నుంచి ఇల్లాకుల నవీన్, వీరరామచంద్రపురం గ్రామానికి చెందిన పైడి సాయి, గుంట రాజు, పైడి తారకేశ్వరరావు, పైడి గణపతి, తమ్మి నేని గణేష్లు అయ్యప్ప మాలలో భాగంగా శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి ఎర్టిగా న్యూమోడల్ కార్లో బయల్దేరారు. మొక్కులు తీర్చుకొని తిరిగి వస్తుండగా రామేశ్వరం వద్ద వీరి కారు ఒక లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. అందులో ఉన్న వీరరామచంద్రపురం గ్రామానికి చెందిన పైడి సాయి(25), పెదంచల గ్రామానికి చెందిన ఇల్లాకుల నవీన్(27) అక్కడికక్కడే మృతి చెందారు. వీరరామచంద్రపురానికి చెందిన గుంట రాజు, పై డి తారకేశ్వరరావు, పైడి గణపతి, తమ్మినేని గణేశ్ తీవ్రగా యాలపాలయ్యారు. అక్కడి వారు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు, గ్రామస్తులు రామేశ్వరం బయల్దేరి వెళ్లారు. చనిపోయిన వారిలో ఇల్లాకుల నవీన్ తండ్రి తారకేశ్వరరావు ఎప్పుడో మృతి చెందగా తల్లి ఆశ వర్కర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. -
మూడు చక్రాలే మృత్యువాయె..
● ట్రైసైకిల్ ప్రమాదంలో దివ్యాంగుడు మృతి పలాస : మందస మండలం కొర్రాయి గేటు సమీపంలో మూడు చక్రాల వాహనం ప్రమాదవశాత్తు పల్టీ కొట్టడంతో దివ్యాంగుడు మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం వీరగున్నమ్మపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఎర్ర సింహాచలం (43) తన ట్రైసైకిల్పై కొర్రాయి గేటు వైపు వెళ్తుండగా వైటీసీ వద్ద ఎగుడు మలుపు వద్ద బోల్తాపడ్డాడు. అదే బండి కింద చిక్కుకొని దుర్మరణం పాలయ్యాడు. సింహాచలంకు భార్యాపిల్లలు ఉన్నారు. మందస ఎస్ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్ర హ్యాండ్బాల్ పోటీల విజేతగా శ్రీకాకుళం
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అండర్–19 బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీల ఫైనల్స్లో బాలుర విభాగంలో కడప జిల్లా, బాలికల విభాగంలో శ్రీకాకుళం జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి. మూడు రోజుల పాటు పోటీలు ఆద్యంతం హోరాహోరీగా పోటీలు జరిగాయి. చివరిరోజు సెమీ ఫైనల్స్లో బాలుర విభాగంలో కడప, చిత్తూరు, వైజాగ్, కర్నూలు జట్లు, బాలికల విభాగంలో శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జట్లు పోటీ పడ్డాయి. ఫైనల్స్కు బాలుర విభాగంలో కడప, చిత్తూరు జట్లు, బాలికల విభాగంలో శ్రీకాకుళం, గుంటూరు జట్లు చేరుకున్నాయి. బాలుర విభాగంలో చిత్తూరు జట్టు గట్టి పోటీ ఇచ్చినా చివరికి కడప జట్టు విజేతగా నిలిచింది. కడప 8 పాయింట్లు, చిత్తూరు 5 పాయింట్లు సాధించాయి. మూడో స్థానానికి వైజాగ్, కర్నూలు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా జరగగా చివరికి వైజాగ్ 11 పాయింట్లతో మూడో స్థానం, కర్నూలు 9 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. బాలికల విభాగంలో జరిగిన ఫైనల్ పోటీలో శ్రీకాకుళం, గుంటూరు జట్లు తలపడగా రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. 6 పాయింట్లతో శ్రీకాకుళం జట్టు విజేతగా, గుంటూరు జట్టు 4 పాయింట్లతో రన్నర్ గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కృష్ణా జట్టు 7 పాయింట్లతో మూడవ స్థానంలో, వైజాగ్ జట్టు 5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాయి. విజేతలకు పతకాలు, ట్రోఫీ అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండల కేంద్రం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బలగ ప్రాంతానికి చెందిన ఇంజరాపు రవికుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. శ్రీకాకుళం నుంచి సాలూరు గ్రామానికి వెళ్తుండగా బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో రిమ్స్కు తరలించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలకు ‘మాయాజాలం’ కవిటి : వచ్చే ఏడాది జనవరి 1, 2, 3, 4వ తేదీలలో వరంగల్లో జరగనున్న ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలకు కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన ‘మాయాజాలం’ నాటిక ఎంపికై నట్లు కళాకారులు మంగళవారం తెలిపారు. అప్పాజోస్యుల–విష్ణుభొట్ల–కందాళం ఫౌండేషన్–సహృదయం నాటక కళా పరిషత్ ఆధ్వర్వంలో ఈ పోటీలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మహిళలపై దాడులు అరికడదాం అరసవల్లి: మహిళలు హింసకు గురికాకుండా కృషి చేద్దామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా సూచనల మేరకు స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద మంగళవారం మహిళలపై హింస నిర్మూలనకు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరిస్తూ వారికి గల చట్టాలను అవగాహన కల్పించాలన్నారు. మహిళల హక్కులను వివరించి వాటిని ఉపయోగించుకొని తమకు తామే రక్షణ పొందాలన్నారు. మహిళలకు ఎటువంటి రుసుము లేకుండా న్యాయవాదిని నియమించడం, కేసు పరిష్కరించడంలోనూ న్యాయ సేవాధికార సంస్థ ముందుండి పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా డీఎంహెచ్ఓ కె.అనిత, మహిళా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ ఐ.విమల, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
గంజాయి అక్రమ రవాణా
హత్య కేసులో పెరోల్పై వచ్చి..● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ● 20 కేజీల గంజాయి స్వాదీనం నరసన్నపేట : ఒడిశా నుంచి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న షేక్ రియాజ్ అహ్మద్ను నరసన్నపేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మడపాం టోల్గేట్ వద్ద ఎస్ఐ–2 శేఖరరావు సిబ్బంది సోదాలు నిర్వహిస్తుండగా ఓ బస్సులో ప్రయాణిస్తున్న అహ్మద్ను అనుమానంతో ప్రశ్నించారు. అతని వద్ద సోదా చేయగా 20.860 కేజీల గంజాయిని గుర్తించినట్లు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఫోన్ సీజ్ చేశామన్నారు. మైసూర్లోని మొహాల్లాకు చెందిన షేక్ రియాజ్ అహ్మద్కు వ్యసనాలకు బానిసై నేర చరిత్ర కలిగి ఉన్నాడు. 2010లో దర్వడా జైల్లో ఉండగానే తోటి ఖైదీని హత్య చేశాడు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తుండగా కుటుంబ సభ్యులు ఇతనికి వివాహం చేయడానికి పెరోల్ కావాలని దరఖాస్తు చేసుకోగా నవంబర్ 5న బయటకు వచ్చాడు. రానున్న జనవరి 3 వరకూ పెరోల్ గడువు ఉంది. జైల్లో ఉన్నప్పుడు గంజాయి అక్రమ రవాణా చేసే వారితో ఏర్పడిన స్నేహంతో బయటకు రాగానే గంజాయి అక్రమ రవాణాకు దిగాడు. బరంపురం ప్రాంతానికి చెందిన హిమాన్స్ శేఖర్ మాహిజా అనే వ్యక్తి నుంచి గంజాయిని లక్ష రూపాయలకు కొనుగోలు చేసి హుబ్బాలికి చెందిన ముజిమల్ అక్తర్, అక్రమ్ హలాభావి(పుచ్చు)లకు విక్రయించేందుకు తీసుకెళ్తుండగా మడపాం టోల్గేట్ వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు.


