Srikakulam District News
-
బంగారం దొంగతనం చేసిన వ్యక్తి అరెస్టు
మందస: మండలంలోని హరిపురం గ్రామ పెద్దవీధికి చెందిన పొట్టి శాంతి ఇంట్లో ఇటీవల 20 గ్రాముల బంగారం దొంగతనం జరిగింది. ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కేసుని విచారణ చేసిన పోలీసులు నిందుతుడిని సోమవారం పట్టుకున్నారు. నిందితుడు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. నిందితుడు ఉమాకాంత్ బిస్వల్(శంకర్) హరిపురంలోని శ్రీలక్ష్మీ స్వీట్ షాప్లో కూలీపని చేసుకుంటున్నాడు. అదే షాపులో పొట్టి శాంతి కూడా పని చేస్తుండగా, ప్రతిరోజు మాదిరిగానే ఇంటికి తాళం వేసి తన హ్యాండ్ బ్యాగులో వేసుకొని షాపునకు వచ్చింది. నిందితుడు శంకర్ ఆమె బ్యాగ్లో ఉన్న తాళం చెవిని తీసి శాంతి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను పట్టపగలే దొంగలించాడు. దీనిపై ఆమె ఈనెల 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందుతుడిని పట్టుకున్నారు. సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి సోంపేట కోర్టుకు తరలించారు. -
ఖచ్చితమైన గణాంకాలే దేశ ప్రగతికి పునాది
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: దేశ భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు, ప్రభుత్వ వనరుల శాసీ్త్రయ పంపిణీకి అత్యంత ఖచ్చితమైన జన గణాంకాలే ప్రాతిపదిక అని కలెక్టర్, ప్రిన్సిపాల్ సెన్సస్ అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భారత జన గణన–2027కు సంబంధించి ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పదేళ్లకొకసారి నిర్వహించే ఈ మహత్తర ప్రక్రియలో ఫీల్డ్ ట్రైనర్ల బాధ్యత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మార్చి 1, 2027ను సూచిక తేదీగా తీసుకుని నిర్వహించే ఈ గణనలో ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు కూడా తావులేకుండా, క్షేత్రస్థాయిలో వాస్తవ గణాంకాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. సమర్దవంతమైన డేటా సేకరణ ద్వారానే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన పథకాలు రూపొందించడం సాధ్యమవుతుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, సెన్సస్ జాయింట్ డైరెక్టర్ బి.వి.ఎల్.సాయి శేఖర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ అధికారి శివ కుమార్, మాస్టర్ ట్రైనర్లు శేషగిరి, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఓటర్ల జాబితాపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నగరంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వైఎస్సార్సీపీ బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో బూత్ కమిటీ విభాగం విస్త్రృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ బాధ్యతగా వ్యవహరిస్తేనే విజయం మన సొంతమవుతుందన్నారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు కుంబా రవిబాబు మాట్లాడుతూ బూత్ లెవెల్ కమిటీలు చాలా జాగ్రత్తగా పనిచేయాలని, లేకుంటే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించడం అధికార పార్టీ నాయకులకు చాలా సులువని, అధికారులంతా వారికే సహకరిస్తారు కాబట్టి తొలగింపు పెద్ద పని కాదన్నారు. కాబట్టి వైఎస్సార్సీపీ బూత్ కమిటీలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, బూత్ కమిటీల జిల్లా అధ్యక్షుడు దోమ మన్మథరావు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, నియోజకవర్గ సమన్వయకర్తలు పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, కళింగ వైశ్యకుల రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, అంబటి శ్రీనివాస్రావు, కరిమి రాజేశ్వరరావు, చల్ల శ్రీను, నర్తు నరేంద్రయాదవ్, చల్ల శ్రీను, మూకళ్ల తాతబాబు, బొడ్డేపల్లి రమేష్, పూర్ణసాగర్, రవిచంద్ర, విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారానికి చర్యలు
● ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ ● పీజీఆర్ఎస్లో 149 అర్జీలు స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో 149 అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖ 30, పంచాయతీ రాజ్ 17, వ్యవసాయ శాఖ 16, పేదరిక నిర్మూలన సంస్థ 13, మున్సిపల్ కార్పొరేషన్ 11, ఏపీఈపీడీసీఎల్ 11, సర్వే 9, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 5, రూరల్ డవలప్మెంట్ 5, అటవీ శాఖ 2, ఆర్డబ్ల్యూఎస్ 5 తదితర శాఖల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, జి.జయదేవి తదితరులు పాల్గొన్నారు. వినతులు పరిశీలిస్తే... ● ఏనేటి కోండ్స్ కులాన్ని ఎస్టీ కులంలో చేర్చారని.. అందువలన తమకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రంను రెవెన్యూ అధికారులు అందజేయాలని కోరుతూ విద్యార్థులు, యువత పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశారు. 20 ఏళ్లుగా ఈ కులానికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయుడం లేదని తెలిపారు. దీనివలన యువత ఉద్యోగ, ఉపాధికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఫిర్యాదు చేయడానికి వచ్చినవారిలో ఒక విద్యార్థిని మూర్చపోయింది. ● తనకు కళాకారుల పింఛన్ పునరుద్ధరించాలని సరుబుజ్జిలి మండలంలోని పెద్ద సవలాపురం గ్రామ పంచాయతీకి చెందిన కోరాడ అప్పారావు కోరారు. ● శ్రీకాకుళం మండలం రాగోలు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ రిజర్వు ప్రాంతాలు, లే అవుట్ రిజర్వు ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని పూజారి నాగేశ్వరరావు కోరారు. ● బీసీ, ఎస్టీ, ఎస్టీ హక్కుల చట్టాలను ప్రభుత్వ అధికారులు కఠినంగా అమలు చేయాలని, అందరికీ సామాజిక న్యాయం దక్కాలని భారత్ చైతన్య యువజన పార్టీ ప్రతినిధులు పీజీఆర్ఎస్లో వినతి పత్రంను అందజేశారు. -
సనాతన ధర్మ ప్రచారం కోసం..
కంచిలి: భారత దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం ప్రచారం చేసేందుకు ఇద్దరు యువకులు ఉపక్రమించారు. ఒకరు సైకిల్తోను, మరొకరు స్కేటింగ్ చేస్తూ తిరుగుతున్నారు. సైక్లింగ్ చేసే అశుతోష్ పాండే ఈ ఏడాది జనవరి 20వ తేదీన బీహార్ రాష్ట్ర పరిధి శివాం జిల్లా నుంచి బయల్దేరి నేపాల్ బోర్డర్ వరకు వెళ్లి, మళ్లీ దక్షిణ భారతదేశం వైపు వచ్చారు. సైకిల్ వినియోగిస్తే డబ్బులు ఆదా కావడంతోపాటు వాహనాల ద్వారా వచ్చే పొల్యూషన్ తగ్గుతుందని, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు. స్కేటర్ రాజా ఛార్దమ్ యాత్ర చేస్తూ 12 శక్తిపీఠాలను దర్శనం చేస్తూ ఆల్ ఇండియా టూర్ చేస్తున్నట్లు తెలిపారు. వీరు ఇప్పటి వరకు 2500 కిలోమీటర్లు ప్రయాణించారు. మొత్తం 15వేల కిలోమీటర్లు ప్రయాణిస్తామని తెలిపారు. వీరిద్దరూ వేర్వేరుగా వీళ్ల ఆల్ ఇండియా యాత్రలు చేపడుతూ, కంచిలి వచ్చేటప్పుడు ఒక్కచోట కలిశారు. వీరికి కంచిలికి చెందిన వ్యాపారి సంజయ్ కుమార్ శర్మ ఆదివారం రాత్రి ఆతిథ్యం కల్పించి సత్కరించారు. -
ఎస్పీ గ్రీవెన్సుకు 55 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక (గ్రీవెన్సు)నకు బాధితుల నుంచి 55 ఫిర్యాదులందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఫిర్యాదులు స్వీకరించి బాధితులకు సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కోత కోసేశారు తమ వరిపంట పొలాన్ని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కోత కోసేశారని, ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సంతబొమ్మాళి మండలం కొల్లిపాడుకు చెందిన జి.ద్రౌపది తరపున ఆమె కుమారుడు, వికలాంగుడైన మురళి ఎస్పీ గ్రీవెన్సులో సోమవారం ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
ఉలిక్కిపడ్డ నరసన్నపేట
● పట్టపగలే చైన్ స్నాచింగ్ నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలో పట్టపగలు జనసంచారం అధికంగా ఉన్నచోట ఒక మహిళ మెడలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా పట్టణంలోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న జగన్నాథపురానికి చెందిన కాల్ల పద్మ విధులు ముగించుకొని తోటి టీచర్స్తో కలిసి ఇంటికి వెళ్తోంది. ఈ సమయంలో బండి వీధి వద్ద ఒక షాపింగ్ మాల్ వద్దకు వచ్చేసరికి శిథిల ప్రభుత్వ షాపుల వైపు నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మెడలో ఉన్న చైన్ను లాక్కొని వెళ్లిపోయారు. దీంతో పద్మ రోడ్డుపై పడిపోగా చుట్టుపక్కల వాళ్లు తేరుకొని, ద్విచక్ర వాహనాన్ని వెంబడించే ప్రయత్నం చేయగా సత్యవరం జంక్షన్ వైపు అత్యంత వేగంగా పరారయ్యారు. కాగా పద్మను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ తన మెడలో రెండు పావు తులాల పుస్తెలతో పాటు బంగారు గొలుసు ఉందని తెలిపారు. కాగా ఈ సంఘటనపై వెంటనే స్పందించిన నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ దర్యాప్తు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాధితురాలు పద్మ నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్ఐ గణేష్ -
నల్ల రిబ్బన్లతో నిరసన
మందస: బిడిమి గ్రామంలో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొమర వాసు ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బిడిమి గ్రామంలో ప్రజలు, రైతులు నల్ల రిబ్బన్లతో సమావేశంలో పాల్గొని నిరసన తెలిపారు. గత 18 నెలలుగా కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నామన్నారు. సర్పంచ్ ధర్మారావు మాట్లాడుతు కొంతమంది వ్యక్తులు శ్రీకాకుళం కలెక్టరేట్ వెళ్లి భూములు ఇవ్వడానికి ఈ ప్రాంతం ప్రజలు సిద్దంగా ఉన్నారని ప్రచారాన్ని చేస్తున్నారని,కానీ అది పూర్తిగా అసత్యమని అన్నారు. కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లతో నిరసన చేస్తున్న రైతులు -
కుటుంబం సామాజిక బహిష్కరణ
రణస్థలం: రణస్థలం మండలంలోని కొండములగాం గ్రామంలో బైరెడ్డి తవుడు కుటుంబ సభ్యులను సామాజిక బహిష్కరణ చేస్తున్నట్లు ఆదివారం ఉదయం గ్రామ పెద్దలు తీర్మానం చేయడం, ఆ కుటుంబానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని రాత్రి సమయంలో దండోరా వేయడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఘటనను ఖండిస్తూ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రెసిడెంట్ కె.గౌరినాయుడు, బైరెడ్డి కుటుంబ సభ్యులు జేఆర్ పోలీసులకు, డిప్యూటీ ఎంపీడీఓలకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వారు తెలిపిన వివరాల మేరకు.. కొండములగాం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 57/15లో 10 సెంట్లు భూమి ఉంది. ఆ భూ మిపై అన్ని పత్రాలు ఉన్నాయి. కోర్టు తమకు అనుకూలంగా స్టే ఇచ్చిందని, అయినా దీనిపై తమ కుటుంబానికి ముడిపెట్టి తమను సామాజిక బహిష్కరణ చేయడం ఎంత వరకు న్యాయ మని బాధితులు ప్రశ్నించారు. దీనిపై దండోరా వేయించడం బాధ కలుగుతోందన్నారు. బంధు వుల వద్ద తలెత్తుకోలేకపోతున్నామని తెలిపారు. గ్రామ పెద్దలపై తగు చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. -
మా కన్నీరు చూడండి
హిరమండలం: వంశధార అధికారుల అనాలోచిత నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారాయి. ప్రస్తుతం బ్యారేజీలో నీటిని స్థిరీకరించకుండా దిగువకు విడిచిపెడుతున్నారు. దీంతో ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటిని విడిచిపెట్టాలని సోమవారం రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. గొట్టా బ్యారేజీపై రైతులు బైఠాయించడంతో అటు పాతపట్నం, ఇటు శ్రీముఖలింగం, మరోవైపు హిరమండలం నుంచి వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. రైతులు మాట్లాడుతూ ఇటీవల బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడిచిపెడితే ఆందోళన చేశామని, నెలాఖరు వరకు నీటిని ఎడమ ప్రధాన కాలువ ద్వారా అందించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించామన్నారు. అయినా మళ్లీ నీటిని కిందకు విడిచి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ గా పెట్టుబడి పెట్టి, ఆరుగాలం శ్రమించి సాగు చేశామని, తీరా పంట చేతికి అందివస్తున్న వేళ నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఈ విషయంలో కలెక్టర్, మంత్రులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
ఎస్టీ కమిషన్ చైర్మన్కు వినతుల వెల్లువ
మెళియాపుట్టి: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్లా బొజ్జిరెడ్డి సోమవారం మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో ఆయన సభ నిర్వహించారు. మందస, మెళియాపుట్టి, పాతపట్నం, మందస, నందిగాం, టెక్కలి, కొత్తూరు, హిరమండలం తదితర మండలాల్లోని గ్రా మాలకు చెందిన గిరిజనులు వారి సమస్యలపై వినతులు అందించారు. వినతిపత్రాలపై ఆయన స్పందిస్తూ.. పరిష్కారం చేస్తామన్నారు. బొజ్జి రెడ్డి వస్తుండగా దీనబంధుపురం కూడలి వద్ద పలువురు గిరిజనులు గ్రానైట్ ఫ్యాక్టరీల వల్ల ఇబ్బంది పడుతున్నామని ఆయనకు తెలిపారు. అయితే కారు దిగకుండా దూరంగా చూసి వెనుదిరుగుతున్న సమయంలో గ్రానైట్ వ్యర్థాల వల్ల కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని చూడాలని వారు కోరారు. దానికి ఆయన బదులిస్తూ వినతి పత్రాల రూపంలో రాసివ్వాలని, సమయం లేదని చెప్పి వెనుదిరిగారు. -
ఇదేం పనితీరు..?
సోంపేట: కొర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కొర్లాం గ్రామస్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొర్లాం గ్రామానికి చెందిన దున్న కృష్ణారావు ఆదివారం రాత్రి పొలానికి వెళ్లగా విష కీటకం కరిచినట్లు గుర్తించారు. వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా ప్రభుత్వ ఆస్పత్రిలో అయితే మందులు ఉచితంగా ఇస్తారని సూచించారు. వెంటనే బాధితుడు కొర్లాం ప్రాథమిక ఆరో గ్య కేంద్రానికి వెళ్లారు. అయితే ఆస్పత్రిలో తలుపులు వేసి ఉండడం గమనార్హం. చాలాసేపు కేకలు వేసినా, డోర్ కొట్టినా సిబ్బంది తలుపు తీయలేదని బాధితుడు ఆరోపించారు. నొప్పి తీవ్రంగా ఉండడంతో హరిపురం ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఏడాదిగా పూర్తిస్థాయి వైద్యుడు లేక ఆస్పత్రిలో సేవలు అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి వైద్యుడు భాస్కరరావు స్పందిస్తూ.. ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు. ● ఆపద సమయంలో ప్రభుత్వాస్పత్రిలో అందని సేవలు ● ఇబ్బంది పడ్డ బాధితుడు -
అస్త్రంగా మూలపేట
శ్రీకాకుళం30న చలో మూలపేట విజయవంతం చేయండి మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026దాడిచేద్దాం ముప్పేటశ్రీకాకుళం (పీఎన్ కాలనీ): దశాబ్దాలుగా సిక్కోలు కల గంటున్న మూలపేట పోర్టును సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, పోర్టు నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి రూ.3400కోట్లు నిధులు మంజూరు చేసి సుమారు 74 శాతం పనులు పూర్తిచేశారని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. మిగిలిన పనులు పూర్తి చేస్తే ఆ క్రెడిట్ ఎక్కడ జగన్మోహన్రెడ్డి ఖాతాలో పడిపోతుందనే అక్కసుతో టీడీపీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు పనులు చేపట్టకుండా తాత్సారం చేస్తున్నార ని వారు మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన సోమవారం జిల్లా కేంద్రంలో ‘మన మూలపేటకు పోదాం పదండి’ పేరిట సన్నాహక సమావేశం జరిగింది. ఈ నెల 30న చలో మూలపేటను విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అదీప్రాజు, తూర్పుకాపు, కళింగవైశ్య, వెలమ కుల రాష్ట్ర బీసీ విభాగం నాయకులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, అంబటి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్రకార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవీ స్వరూప్, రాష్ట్రకార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, పార్టీ మహిళావిభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, ఎస్ఈసీ మెంబర్లు చల్ల శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, ధర్మాన రామ్మనోహర్నాయుడు, తమ్మినేని చిరంజీవినాగ్, కరిమి రాజేశ్వరరావు, పిన్నింటి సాయి, ఉలాల భారతిదివ్య, చల్ల రవికుమార్, పొన్నాడ రుషి, ముంజేటి కృష్ణమూర్తి, మార్పు పృధ్వి, ముత్తా విజయ్కుమార్, ప్రత్తి అన్వేష్, గంట్యాడ రమేష్, బొడ్డేపల్లి రమేష్, బూడి అనురాధ, గేదెల పురుషోత్తం, మండవల్లి రవి, కోణార్క్ శ్రీను, సనపల నారాయణరావు, బుక్కూరు ఉమామహేశ్వరరావు, రౌతు శంకరరావు, తంగుడు నాగేశ్వరరావు, అంధవరపు రమేష్, డాక్టర్ నిమ్మన దాస్, చిట్టి జనార్ధనరావు, మూకళ్ల తాతబాబు, పీస శ్రీహరి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు అశోక్చక్రవర్తి, గద్దిబోయిన కృష్ణయాదవ్, టి.కామేశ్వరిలతో పాటు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అసమర్థ ప్రభుత్వమిది శ్రీకాకుళం ఉద్యమాల పురిటి గడ్డ. మూలపేట పోర్టు నిర్మాణానికి వైఎస్సార్సీపీ శ్రీకారం చుడితే మిగిలిన పనులు పూర్తిచేయడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం టీడీపీది. అప్పట్లో ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు శంకుస్థాపనకు హెలికాప్టర్లో నేను వచ్చి తిరిగి వెళ్తుండగా వైఎస్ జగన్ ఒక్కసారి హెలికాప్టర్ వెనక్కి తిప్పి మూలపేట పోర్టు పనులు చూసి వెళ్దామన్నారు. ఈ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడులు ఉన్నా ఒక్క అభివృద్ధి పని చేయలేదు. – బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి రామన్న అచ్చెన్నలకు అడిగే దమ్ము లేదు పోర్టు నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు తెచ్చి పనులన్నీ దాదాపు పూర్తి చేస్తే ఆ మిగిలిన పని పూర్తి చేయడం టీడీపీ నేతలకు చేత కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు జిల్లా అభివృద్ధికి నిధులు అడిగే దమ్ము లేదు. అరసవల్లి ఇంద్రపుష్కరిణి పనులకు మేం శంకుస్థాపన చేస్తే..శిలాఫలకాలపై పేర్లు మార్చి మళ్లీ అవే పనులకు కొబ్బరికాయలు కొట్టారు. ఒడిశా, ఆంధ్రాలో కూటమి పార్టీలే ఉన్నా నేరడిపై చర్చే జరగడం లేదు. బస్టాప్లు, సోలార్ లైట్లపై పేర్లు రాసుకుంటే అభివృద్ధి కాదు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే ప్రాజెక్టులు కట్టాలి. ఈ ఏడాది బడ్జెట్లో వంశధార, నేరడిలకు పైసా వెచ్చించలేదు. మూలపేట పోర్టు నిర్మాణంలో నాటి మంత్రి సీదిరి కీలక పాత్ర పోషించారు. రానున్న రోజుల్లో వంశధార ప్రాజెక్టు, బుడగట్లపాలెం, కలెక్టరేట్లను సందర్శించి పనులు చేయాలని ప్రశ్నిద్దాం. ఏం చేయకపోయినా జనం ఓట్లు వేస్తున్నారనేదే టీడీపీ నేతల ధీమా. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి సన్నాహక సమావేశంలో పార్టీనేతల పిలుపు ఉద్యమాల పురిటి గడ్డ శ్రీకాకుళం: బూడి ముత్యాలనాయుడు ఏం చేయకపోయినా ఓట్లు వేస్తున్నారనే టీడీపీ ధీమా: ధర్మాన ప్రసాదరావు రాబోయే ఎన్నికల్లో మూలపేట పోర్టుని అస్త్రంగా వాడాలి: ధర్మాన కృష్ణదాస్ పోర్టుతో ప్రపంచంతో కనెక్టివిటీ: కుంభా రవిబాబు అపర భగీరథుడు జగన్మోహన్రెడ్డి: సీదిరి అప్పలరాజు ఇదే మన అస్త్రం వలసల నివారణకు, ఉద్యో గ, ఉపాధి అవకాశాలకు మూలపేట పోర్టు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వైఎస్ జగన్ ఈ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుడితే.. కూటమి పాలకులు దాన్ని పూర్తిచేయకపోవడం అన్యాయం. రాబోయే ఎన్నికల్లో మూలపేట పోర్టుని అస్త్రంగా వాడుకుని వైఎస్సార్సీపీ విజయానికి బాటలు వేద్దాం. పది వేల మందితో పోర్టును సందర్శిద్దాం. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
‘బలవంతపు భూసేకరణ వద్దు’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లాలో బలవంతపు భూసేకరణ ఆపాలని, ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, జీడికి గిట్టుబాటు ధర ఇవ్వాలని, జీడి బోర్డు ఏర్పాటు చేయాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ఎన్నికల హామీలు అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్రతీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, విలువైన బీచ్ శాండ్ను కార్పొరేట్కు అప్పగించే ప్రయత్నం మానుకోవాలని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. భావనపాడు ఫిషింగ్ హార్బర్, బుడగట్లపాలెంలో జెట్టీ నేటికీ పూర్తికాలేదని గుర్తు చేశారు. జీడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ జిల్లాలో ఐటీ డీఏ లేకపోవడం వల్ల గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, గిరిజన భూములు గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. -
రాజకీయం సుడాల్సిందే..!
● నిధులు సుడావి.. ప్రారంభోత్సవాలు టీడీపీ నేతలవి ● జిల్లా కేంద్రంలో కార్గిల్ పార్క్, రామలక్ష్మణ నుంచి పెద్దపాడు రోడ్డు పనులు ప్రారంభం ● కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రారంభించిన వైనం ● సుడా చైర్మన్ లేని సమయంలో ప్రారంభంపై మండిపడుతున్న జనసేన శ్రేణులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జనసేనను తెలుగు తమ్ముళ్లు పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో వారికంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పొత్తు ధర్మం అన్నది పాటించడమే లేదు. ఎన్నికల వరకే వారి అవసరం, ఆ తర్వాత అనవసరం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పనులు చేయడం, కమీషన్లు కొట్టేయడం, పూర్తయిన పనులు ప్రారంభించడం అంతా తెలుగుదేశం పార్టీ నేతలే చేస్తున్నారని జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. జిల్లా కేంద్రంలో గత కొన్ని నెలలు గా కార్గిల్ పార్కు నిర్మాణం చేస్తున్నారు. ఈ పార్క్ నిర్మాణానికి సుడా నిధులు రూ.2కోట్లు వరకు వెచ్చించారు. కానీ పనులు పూర్తి కాకుండానే హడావుడిగా ప్రారంభించేశారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని జనసైనికులు మండిపడుతున్నారు. అంతేకాకుండా రామలక్ష్మణ కూడలి నుంచి పెద్దపాడు వరకు రోడ్డు నిర్మాణం, డివైడర్ పనులు, సెంట్రల్ లైటింగ్ తదితర పనులను మొత్తం రూ.3.68కోట్లతో చేశారు. ఇందులో ఏ పనులూ పూర్తికాకుండానే ప్రారంభించేశారు. సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, సుడా వైస్ చైర్మన్ లేని సమయంలో ప్రారంభించడం ఏంటని జనసేన నాయకులు మండిపడుతున్నారు. వీరిద్దరికి ఎలాంటి సమాచారం లేకుండా కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్లు 21వ తేదీ రంజాన్ నాడు రాత్రికి రాత్రి పనులు ప్రారంభించేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ పనులు పూర్తయ్యి అంతా సిద్ధంగా ఉన్నాక ప్రారంభించారా అంటే అదీ లేదు. తెలుగుదేశం పార్టీ నేతలే పెత్తనం చెలాయిస్తున్నారు తప్ప కూటమిలో జనసేన నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సుడా సొమ్ముతో పనులు చేసినప్పుడు కనీసం ఆ శాఖ చైర్మన్కి ప్రాధాన్యత ఇవ్వాలి, కనీసం వైస్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. ఆయన కూడా లేని సమయంలో ప్రారంభించేశారు. -
‘నంది విగ్రహం ధ్వంసం దారుణం’
సోంపేట: బారువ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలోని ఉమామహేశ్వర స్వామి దేవాలయంలోని నంది విగ్రహాన్ని దొంగిలించి ధ్వంసం చేయ డం దారుణమని వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్త సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి కోటిలింగేశ్వర స్వామి దేవాలయాన్ని, ఉమామహేశ్వర స్వా మి దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం దేవాలయంలో నంది విగ్రహం దొంగిలించిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నిందితులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. దేవాలయాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. బారువ మేజర్ పంచాయతీ పరిధిలోని బారువ పేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారిని ఆదుకోవాలని, జగనన్న కాలనీని అభివృద్ధి చేయాలని కోరా రు. డిగ్రీ కళాశాల సమీపంలో శిథిలావస్థలో ఉన్న మంచినీటి ట్యాంకును కూల్చాలని అధికారులను కోరారు. ఆయనతో పాటు పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, వైస్ ఎంపీపీ గురాల శ్రీను, బారువ, పలాసపురం సర్పంచ్లు యర్ర రజని, తడక జోగారావు, ఎంపీటీసీ తామాడ పద్మ, దేవాలయ అర్చకులు భువనేశ్వర్ పాణిగ్రాహి, పార్టీ నాయకులు నర్తు బాను, తామాడ బుజ్జి, దున్న మాదవరావు, కర్రి సత్యం, తెప్పల ధర్మారావు, తిరుపతిరెడ్డి, అమర లోకనాథం, శంకర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
● అతడి భార్యకు, పాపకు తీవ్రగాయాలు రణస్థలం: లావేరు మండలంలోని బుడుమూరు జాతీ య రహదారిపై ఆదివారం బైక్ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్కూటీపై కె.రమే ష్(32) తన భార్య సుజాత, రెండేళ్ల కుమార్తె ధాతిశ్రీతో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో బుడుమూరు దగ్గరకు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో గాయపడిన రమేష్ను స్థానికులు హుటాహుటిన 108 వాహనంపై శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయారు. భార్య సుజాత, పాప ధాతిశ్రీకి బలమైన గాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమేష్ స్వగ్రామం విజయనగరం జిల్లాలోని దాకమర్రి. గార మండలం నిజామాబాద్లో ఉన్న అత్తవారింటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
ఇంటర్ ‘స్పాట్’ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యుయేషన్ మొదలైంది. శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వేదికగా ఆదివారం మొదటి విడత సబ్జెక్టుల జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, హిస్టరీ, ఎకనామిక్స్ పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టారు. ఆయా సబ్జెక్టుల బోర్డుల ఏర్పాటు అనంతరం దిద్దుబాటును ఆరంభించారు. ఈ సబ్జెక్టులకు నియామకమైన స్క్రూటినైజర్లు సోమవారం రిపోర్ట్ చేయనున్నారు. సీఈలు, ఏఈలకు ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జవాబుపత్రాల దిద్దుబాటులో అప్రమత్తంగా వ్యవహరించాలని, దిద్దుబాటును, మార్కుల పోస్టింగులు, మిగిలి న ఖాళీ పేపర్ల పరిశీలన, బబ్లింగ్, వంటి విషయాల్లో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన ప్రతిఒక్కరూ స్పాట్ కేంద్రం వద్ద విధిగా రిపోర్ట్ చేయాలని ఆర్ఐఓ సురేష్కుమార్ స్పష్టంచేశారు. బీఐఈఏపీ కాలేజ్ లాగిన్లోని అపాయింట్మెంట్ ఆర్డర్ను కళాశాల యాజమాన్యాలు/ప్రిన్సిపాళ్ల నుంచి తీసుకోవాలన్నారు. గైర్హాజరైనవారిపై బోర్డు ఆదేశాల మేరకు తగు చర్యలు ఉంటాయని ఆర్ఐఓ వెల్లడించారు. -
హుండీలో నగదు చోరీ
సోంపేట: బారువ గ్రామంలోని బస్టాండ్ వద్ద గల ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివా రం రాత్రి హుండీని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి నగదు దొంగిలించారు. కమిటీ సభ్యులు ఆదివారం ఉదయం వెళ్లే సరికి హుండీ ధ్వంసమై ఉండడాన్ని గమనించారు. కమిటీ సభ్యుడు ఎస్.ఆదినారాయణ బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదినారాయణ ఫిర్యా దు మేరకు ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా నిరసన మందస: బిడిమి గ్రామంలో జుత్తు జగన్నాయకులు స్మారక చిహ్నం వద్ద ఆదివారం కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు కొందరు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు శ్రీకాకుళం కలెక్టరేట్కు వెళ్లి భూములు ఇవ్వడానికి ఈ ప్రాంతం ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారని, అది పూర్తిగా అసత్యమని తేల్చి చెప్పారు. ఈ ప్రాంతంలో సెంటు భూమి కూడా ఇవ్వబోమని తేల్చి చె ప్పారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషకు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పామన్నారు. కేంద్ర మంత్రికి ఉద్దానం సమస్యలపై పట్టింపు లేదన్నారు. కార్యక్రమంలో తెప్పల అప్పారావు, కృష్ణమూర్తి, గంటు రామస్వామి, దున్న రామారా వు, తామాడ లక్ష్మీ నారాయణ, దున్న సురేష్, మర్ల సంతోష్, లబ్బ సురేష్ తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నారని రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రటరీ సీమ రామకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు సమస్యలపై వినతులు అందజేయవచ్చన్నారు. సాయంత్రం మూడు గంటలకు జిల్లా అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు. -
నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలి
● జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ శ్రీకాకుళం: జిల్లా అభివృద్ధి పథకాల అమలులో వేగం పెంచాలని, ప్రభుత్వ నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ అధికారులను ఆదేశించారు. ఆదివా రం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన 1, 2, 4, 7వ స్థాయీ సంఘాల సమావేశాలు సుదీర్ఘంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు సూచించిన పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసి, నివేదికలను సిద్ధం చేయాలన్నారు. ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన పనులపై విచారణ జరపాలన్నారు. అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులను సహించేది లేదు. సమావేశాల్లో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ, వివిధ మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఫోజులు కొత్తవి
పనులు పాతవి.. ఈ ఫొటో చూడండి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన అరసవల్లి ఇంద్ర పుష్కరిణి పునః నిర్మాణ పనులకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కలిపి మరోసారి శంకుస్థాపన చేసిన దృఽశ్యమిది. నాడు మంజూరైన నిధులనే వినియోగిస్తూ దానికి ప్రసాద్ స్కీమ్ రూ. 58కోట్లతో అభివృద్ధి పనులని కలరింగ్ ఇచ్చారు. ఈ ఫొటో చూడండి. 2023 డిసెంబర్ 20వ తేదీన రూ.4కోట్లతో అరసవల్లి ఇంద్ర పుష్కరిణి పునః నిర్మాణ పనులకు నాటి రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేసిన దృశ్యమిది. నిధులు కూడా మంజూరయ్యాయి. పుష్కరిణిలో ఉన్న నీరు అంతా తీసేసి క్లీన్ చేశారు. అప్పటికి కాంట్రాక్టర్ ఖరారు కాలేదు. పనులు చేసే లోపు ఎన్నికల కోడ్ వచ్చేసింది. పనులు ముందుకు సాగలేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అభివృద్ధి అనే పదానికి చంద్రబాబు ప్రభుత్వం వింత అర్థం చెబుతోంది. గత ప్రభుత్వంలో శంకుస్థాపన జరిగిన పనులకు మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రసాద్ స్కీమ్ కింద అరసవల్లి అభివృద్ధి చేస్తామని అనేక శాశ్వత కట్టడాలను కూల్చేశారు. ఆ పనులకు ఇప్పటివరకు అతీగతి లేదు. ఇప్పటికే రెండు రథసప్తమి వేడుకలు అయిపోయాయి. కూల్చేసిన కట్టడా లు ఎక్కడికక్కడే ఉన్నాయి. ప్రసాద్ స్కీమ్ మంజూరుకు నోచుకోలేదు. ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడేమో రూ. 58కోట్లతో ప్రసా ద్ స్కీమ్ ద్వారా అరసవల్లి క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పి.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేసిన ఇంద్ర పుష్కరిణి పనులకే మళ్లీ కింజరాపు బాబాయ్, అబ్బాయ్లు శంకుస్థాపన చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రథ సప్తమి వేడుకలు రాష్ట్ర పండగగా గుర్తించి, ప్రజల సొమ్ముతో సంబరాలు చేసి, వివిధ కార్యక్రమాలతో సోకులు చేశారే తప్ప ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకురాలేదు. అట్టహాసం పేరుతో విపరీతమైన పబ్లిసిటీ చేసి ఈ సారి రథసప్తమి దర్శనాల సమయంలో భక్తులను తీవ్ర ఇబ్బందులకు గు రి చేశారు. ప్రత్యేకంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. ఒక్క పైసా విడుదల చేయలేదు. కార్పొరేషన్లో అప్పటికే ఉన్న నిధులను, సుడా నిధులను వాడేసి అభివృద్ధి పనుల ముసుగులో కావాల్సిన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారు. ఆ పనులు ఎంత నాసిరకంగా ఉన్నాయో వాటిని ప్రస్తుతం చూస్తే ఎవరికై నా అర్థమవుతుంది. కార్పొరేషన్ సొమ్మును దుబారా చేయడం తప్ప పనులకు సార్థకత ఉండటం లేదు. వీరు చేసిన పనికి కార్పొరేషన్ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిందని, నిధులు ఖాళీ అయిపోయాయని, కొత్త పనులు చేపట్టడానికి ఏమీ లేదని ఓ అధికారి ఉన్నతాధికారులకు ఏకంగా నివేదిక ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడేమో రూ. 58కోట్లతో ప్రసాద్ స్కీమ్ కింద అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని కొత్త పబ్లిసిటీకి తెరలేపారు. డైవర్షన్ పాలిటిక్స్ మాదిరి ప్రజల్ని మభ్య పెట్టేడమే లక్ష్యంగా అడుగులు వేస్తు న్న పరిస్థితులు ఉన్నాయి. నాలుగు సార్లు ముఖ్య మంత్రిగా చేసిన చంద్రబాబు ఈ జిల్లాకు చేసిన మేలంటూ ఏమీ లేదు. వైఎస్సార్ చేపట్టిన వంశధార ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేపట్టిన మూలపేట పోర్టు, బుడగట్లపాలెం పిషింగ్ హార్బర్, వంశధార ఎత్తిపోతల పథకం, కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి, ఉద్దానం మంచినీటి పథకం, గత ప్రభుత్వంలో మంజూరైన విద్యా సంస్థలకు పూర్తి సౌకర్యాలు, వసతులు, పనుల పూర్తిపై ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. ఇప్పటికే అధికారం వచ్చి రెండేళ్లు కావస్తోంది. మిగతా మూడేళ్లలో ఏం చేస్తారో క్లారిటీ లేదు. దానికి అరసవల్లి ఆలయం అభివృద్ధి పనుల పేరుతో కూల్చేసిన కట్టడాల చిత్రాలే నిలువెత్తు సాక్ష్యం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేసిన శంకుస్థాపనలకు మళ్లీ శంకుస్థాపనలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నదిదే కొత్తగా మంజూరు కాని నిధులు పాత వాటితో సోకులు అరసవల్లి ఆలయ అభివృద్ధి పేరుతో కొత్తగా హడావుడి -
‘ఇచ్ఛాపురం ఎమ్మెల్యే ప్రకటన సరికాదు’
పలాస: ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఇటీవల బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో కలపాల నే ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి వీల్లేదని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పలాసలో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా జేఏ సీ అధ్యక్షుడు సవర రాంబాబు, ప్రధాన కార్యదర్శి గురాడి అప్పన్న, గిరిజన సంఘం నాయకుడు సవర జగన్నాయకులు, జేఏసీ చీఫ్ అడ్వైజర్ వాబ యోగి మాట్లాడుతూ బెందాళం అశోక్ స్పీకరు రఘురామకృష్ణంరాజును కలిసి బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చాలని కోరడం సరికాదన్నారు. గతంలో ఈ విషయంపై జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికలను చూసి ఎమ్మెల్యేలు ముందుకు వెళ్లాలని కోరారు. -
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక, భూసమస్యలకు సంబంధించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీల నమోదు, స్థితిగతులకు సంబంధించి 1100 నంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం భక్తుల వసతి గృహం అందుబాటులోకి వచ్చింది. సుదూర ప్రాంతాల భక్తులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ఈఓ కె.ఏడుకొండలు ఆదివారం తెలిపారు. -
తెరుచుకున్న తలుపులు
ఇచ్ఛాపురం రూరల్: తన కింద పనిచేసే వ్యక్తిపై యజమాని కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇంటికి తాళాలు వేసి పిల్లల్ని అర్థనగ్నంగా బయటకు గెంటేశారంటూ శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘మంటగలిసిన మానవతత్వం’ కథనానికి అధికారులు స్పందించారు. ఇచ్ఛాపురం రూరల్ ఎస్ఐ జనార్దనరావు ఆధ్వర్యంలో బాధితుడు కోళ్ల మన్మధరావుకు శనివారం ఇంటి తాళాలు అప్పగించారు. 15 రోజుల్లో ఇల్లు తమ సొంతమని నిరూపించుకోవాలని, లేనిపక్షంలో ఇంటిపై హక్కులు కోల్పోతారని ఎస్ఐ ఇంటి తాళాలు ఇప్పించారని మన్మధరావు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, పెద్దలకు బాధితుడు కృతజ్ఞతలు చెప్పారు. -
అసమానతలు ఉన్నంత కాలం ఉద్యమాలు ఆగవు
● సీపీఐఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ ● కోమర్తిలో అప్పలసూరి 29వ వర్ధంతి సభ నరసన్నపేట: భారత విప్లవోద్యమంపైన ఆరు దశాబ్దాలుగా పాలకులు అనేక నిర్బంధాలను ప్రయోగిస్తున్నారని, అరెస్టులు అక్రమ నిర్బంధాలతో విప్లవోద్యమాన్ని ఆపలేరని, అసమానతలు ఉన్న చోట ఉద్యమాలు సహజమని సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. నరసన్నపేట మండలం కోమర్తి అమరవీరుల స్థూపం వద్ద మామిడి అప్పలసూరి 29వ వర్థంతితో పాటు కోమర్తి అమరులకు నివాళి అర్పించే కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిజం అంతమైందని పాలకులు చెప్పుకుంటున్నా.. సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం విప్లవోద్యమాన్ని అనచటం ఎవరి తరమూ కాదన్నారు. ఒక్కో సందర్భంలో పోరాటం సాయుధ రూపం సైతం తీసుకుంటుందని, నిత్య జీవన సంఘర్షణ నుంచి ప్రతిఘటనా పోరాటాలు సాగుతాయని చెప్పారు. అఖిత భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు మాట్లాడుతూ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం పెచ్చుమీరుతోందని, ఎందరో అమాయకులు వారి పంతాలకు ప్రాణాలు కోల్పోతున్నారని, మరెందరో అభాగ్యులుగా మిగిలి పోతున్నారని, వీటికి కారకులైన వారిని ప్రధాని మోదీ వెంటేసుకు రావడం సరికాదన్నారు. సీనియర్ నాయకులు అప్పయ్య, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు కృష్ణవేణి మాట్లాడుతూ అమరుల త్యాగాలు వృథాగా పోనీయకూడదని, వారి ఆశయాల సాధనకు నేటి తరం ప్రజలను ఏకం చేయాల్సి అవసరం ఉందన్నారు. అప్పలసూరి లాంటి నాయకులు చూపిన పోరాట స్ఫూర్తి ఎందరికో ఆదర్శమన్నారు. కార్యక్రమంలో న్యూ డెమొక్రసీ జిల్లా కమిటీ సభ్యులు నేతింటి నీలం రాజు, జిల్లా నాయకులు బగ్గు భాస్కరరావు, గ్రామ కమిటీ ప్రతినిధులు కొల్లి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
23న జిల్లా బూత్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం
నరసన్నపేట : వైఎస్సార్సీపీ జిల్లా బూత్ కమిటీల విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళంలోని జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ హాలులో సాయంత్రం 3 గంటలకు జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు దోమ మన్మధరావు అధ్యక్షతన సమావేశం ఉంటుందన్నారు. అదే రోజు ఉదయం 10 గంటలకు మూలపేట పోర్టు సందర్శన సన్నాహక సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త ముత్యాలనాయుడు, పార్లమెంట్ పరిశీలకుడు కుంబా రవిబాబు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర బూత్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారని తెలిపారు. నియోజకవర్గ, మండల బూత్ కమిటీ అధ్యక్షులు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు హాజరుకావాలని కోరారు. -
నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం
హిరమండలం: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించిందని వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ ఉద్యోగ నియామకాలు అంటూ ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగాలేదన్నారు. ఉగాది నాడు మంత్రి లోకేష్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో తేదీలు తప్ప.. ఉద్యోగాల సంఖ్య వేయకపోవడం హాస్యాస్పదమని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అంటూ ప్రకటనలతో ఊదరగొట్టిన విషయాన్ని గుర్తుచేశారు. నిరుద్యోగ భృతిని అటకెక్కించారని.. ఉద్యోగాల నోటిఫికేషన్ల ఊసే లేకుండా పోయిందని విమర్శించారు. ప్రైవేటు కంపెనీల ఉద్యోగాలను కూడా తమ ఖాతాల్లో వేసుకున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆరు లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని చెప్పారు. 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ యువతను దగా చేశారని.. వచ్చే ఎన్నికల్లో యువత బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. -
ఇంటర్ స్పాట్కు సర్వం సిద్ధం
● నేటి నుంచి మొదలుకానున్న ఇంటర్మీడియెట్ మూల్యాంకనం ● శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వేదికగా వాల్యుయేషన్ ● ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా అధికారులు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్)కు సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ (బాలుర) జూనియర్ కళాశాల కేంద్రంగా ఆదివారం నుంచి ప్రారంభంకానున్న ఈ మూల్యాంకనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పలు విడతల్లో జరిగే స్పాట్లో మొదటి విడతగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మాథ్స్, ఎకనామిక్స్, హిస్టరీ పేపర్ల దిద్దుబాటు చేపట్టనున్నారు. ఇప్పటికే సంస్కృతం పేపర్ వాల్యుయేషన్ మొదలైన విషయం తెలిసిందే. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం పేరిట శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించిన సంగతి తెలిసిందే. స్పాట్కు హాజరయ్యేవారు సమయపాలన పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని, దిద్దుబాటులో జరిగే తప్పులు, దోషాలకు తగు మూల్యం చెల్లించుకోకతప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సీసీ కెమెరాలను అమర్చి, ఆన్లైన్ స్ట్రీమింగ్ చేశారు. జిల్లాకు చేరిన 2.35 లక్షల పత్రాలు.. శ్రీకాకుళం జిల్లాకు 2.35 లక్షల జవాబుపత్రాలు చేరుకోనున్నాయి. ఇప్పటి వరకు 2 లక్షల జవాబుపత్రాలు చేరాయి. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 13 ప్రధాన సబ్జెక్టుల జవాబుపత్రాలు చేరుకుంటున్నాయి.మూల్యాంకనం మొత్తం వివిధ స్పెల్స్లలో జరగనుంది. ఒక ఎగ్జామినర్ పూటకు 15 చొప్పున రోజుకు 30 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. పర్(స్క్రిప్ట్)కు రూ.23.66 పైసలు చెల్లిస్తారు. ఈ లెక్కన రోజుకు రూ.709.66 చెల్లించనున్నారు. వీటితోపాటు టీఏ, డీఏ, లోకల్ కన్వీయిన్స్/అవుట్స్టేషన్ అలవెన్స్ ఇలా చెల్లించే మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. అధికారులు, ఎగ్జామినర్ల నియామకం పూర్తి.. స్పాట్ వాల్యుయేషన్లో అన్ని సబ్జెక్టులకు కలిపి మూల్యాంకనంలో మొత్తం వెయ్యి మంది వరకు యంత్రాంగం/సిబ్బందిని నియమించారు. స్పాట్ క్యాంప్ ఆఫీసర్గా ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ వ్యవహరిస్తున్నారు. ఏసీవో జనరల్–1గా గణపతి వెంకటేశ్వరరావు (ఇన్చార్జ్ ప్రిన్సిపాల్– జీజేసీ శ్రీకాకుళం బాలురు), జనరల్–2గా ఎస్.సత్యనారాయణ, సీసీవోలు, కోడింగ్ ఆఫీసర్లు, ఏసీవోలు, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్లు నియామక ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లాలో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. అధికారులు, సిబ్బంది నియామకం పూర్తయింది. నియామక ఉత్తర్వులను కళాశాలల లాగిన్లో సిద్ధంగా ఉన్నాయి. విధిగా సమయపాలన పాటించాలి. సీసీ కెమెరాలను అమర్చి, స్ట్రీమింగ్ చేయించాం. బోర్డు ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తారు. – రేగ సురేష్కుమార్, డీవీఈఓ/ఆర్ఐఓ/ఇంటర్ స్పాట్ క్యాంప్ ఆఫీసర్, శ్రీకాకుళం -
నకిలీ బంగారం ముఠా గుట్టురట్టు
రణస్థలం : జె.ఆర్.పురం పంచాయతీలోని స్టార్ గోల్డ్ (వన్ గ్రామ్ గోల్డ్) షాపులో నకిలీ బంగారం అమ్మేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టు రట్టయ్యింది. పోలీసులు, షాపు యజమాని రమణ తెలిపిన వివరాల ప్రకారం.. వన్ గ్రామ్ గోల్డ్ షాపునకు ఐదు రోజుల క్రితం ఓ మహిళ, ఇద్దరు పురుషులు వచ్చి నల్లపూసలు దండ కొనుగోలు చేసుకుని వెళ్లిపోయారు. మరుసటి రోజు వచ్చి తమ వద్ద 300 ఏళ్ల క్రితం కాయిన్స్, బంగారం ఉందని, కొనుగోలు చేయాలని కోరారు. అయితే తన వద్ద డబ్బులు లేవని, మరుసటి రోజు రమ్మని చెప్పి పంపించేశారు. ఇంతలో వారు తెచ్చిన బంగారం తాలుకా ఫొటోలను స్నేహితుడికి పంపించి ఆరా తీయగా.. కొంత ఒరిజినల్ చూపి మిగతా అంతా నకిలీ బంగారం అంటగడతారని, కొనవద్దని చెప్పారు. మూడు రోజులుగా వారిపై నిఘా వేసి క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వారు కేజీ నకిలీ గొలుసులతో రాగా చాకచక్యంగా వారిని పట్టుకుని జె.ఆర్.పురం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేస్తామని ఎస్సై ఎస్.చిరంజీవి చెప్పారు. -
భవనం పైనుంచి జారిపడి కార్మికుడి మృతి
పలాస : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఉదయపురం రామలక్ష్మణ కాలనీకి చెందిన భవన నిర్మాణం కార్మికుడు సత్యం కృష్ణారావు(41) శనివారం ప్రమాదవశాత్తు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగిలిపాడు వద్ద శ్రీగౌరీ ఇంజినీరింగ్ వర్క్స్ యజమాని చౌదరి ఉపేంద్ర వద్ద వెల్డింగ్ పనులను కృష్ణారావు చేస్తుంటాడు. ఎప్పటి లాగే ఇంటి వద్ద నుంచి శనివారం ఉదయం బయలుదేరి వెళ్లాడు. మొగిలిపాడు దత్తాశ్రయం దారిలో తర్లాన సంజీవరావు బిల్డింగ్ పైఅంతస్తులో రేకులు బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి గాయాలపాలయ్యాడు. తీవ్ర గాయాల పాలవడంతో కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయాన్ని చౌదరి ఉపేంద్ర ఫోన్ ద్వారా కృష్ణారావు భార్య సత్యం గీతకు తెలియజేశారు. ఆమె వెంటనే ఆస్పత్రికి వెళ్లి చూడగా భర్త విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించింది. కృష్ణారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● భక్తిశ్రద్ధలతో రంజాన్
ప్రసంగిస్తున్న ముఫ్తీ జియావుర్ రహమాన్ రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షలను విరమించారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పుకుని పేదలకు దానధర్మాలు చేశారు. జిల్లా కేంద్రంలోని చారిత్రక జామియా మసీదు వద్ద రంజాన్ సందర్భంగా సందడి వాతావరణం కనిపించింది. –శ్రీకాకుళం కల్చరల్ / సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం -
సాహిత్యంతో పోరుబాట
శ్రీకాకుళం కల్చరల్ : సాహిత్యంతోనే పోరుబాట సాగించాలని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం శ్రీకాకుళంలోని రెడ్క్రాస్ సమావేశ మందిరంలో జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరసం 90 ఏళ్ల ప్రస్తానమని, అటువంటి సంస్థకు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఎంతో మంది అభ్యుదయ కవుల స్ఫూర్తితో సంస్థ సేవలు విస్తృతంగా ఉన్నాయని, ఈ నెల 23, 24 తేదీలలో మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ అభ్యుదయ వాద సంఘాలన్నీ ఏకతాటిపైకి నిలిచి దేశంలో జరుగుతున్న అరాచకాలపై గళం, కలం ఝుళిపించాలని పిలుపునిచ్చారు. అరసం జిల్లా అధ్యక్షుడు నల్లి ధర్మారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా వాసుదేవాచారి గజల్ గీతాలు ఆలపించారు. నూతన కమిటీ ఎన్నిక.. అరసం కమిటీ నూతన జిల్లా గౌరవాధ్యక్షుడిగా చింతాడ కృష్ణారావు, అధ్యక్షుడిగా నల్లి ధర్మారావు, ఉపాధ్యక్షులుగా బెందాళం వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా టి.తిరుపతిరావు, కార్యదర్శులుగా నరేష్కుమార్, బీవీఎస్ రాజులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరి శివప్రసాద్, గేదెల ఇందిరాప్రసాద్, వి.జగన్నాథంనాయుడు, కె.శరత్చంద్ర, టి.తిరుపతిరావు, సీహెచ్ కృష్ణారావు, నరేష్, కంచరాన భుజంగరావు, తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు శ్రీకాకుళం రూరల్: రాగోలు జెమ్స్ ఆస్పత్రిలోని బొల్లినేని మెడిస్కిల్స్లో 2025లో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత సాధించిన పేద విద్యార్థులకు బీఎస్సీ పారామెడికల్ కోర్సుల్లో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సును పూర్తి చేసుకొని ఉద్యోగం పొందాక ఫీజు చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఎస్సీలో న్యూరో ఫిజియాలజీ, డయాలసిస్, పెరిఫ్యూజన్ రెస్పరేటరీ మెడికల్ రికార్డ్స్, బ్లడ్ హెమటాలజీ టెక్నాలజీ, ఎంఎల్టీ కోర్సులకు సంబంధించి అడ్మిషన్లు జరుగుతున్నట్లు వివరించారు. 2026లో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నామని, వివరాలకు 7995013422 నంబర్ను సంప్రదించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రంలో మంటలు పలాస: బ్రాహ్మణతర్లా అంగన్వాడీ కేంద్రంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు రూ.20వేలు విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసుల కథనం ప్రకారం.. బ్రాహ్మణతర్లా చాకలి వీధిలోని అంగన్వాడీ కేంద్రం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చెత్తా చెదారంపై సిగరెట్ పీక వేయడంతో మంటలు చెలరేగాయి. దీంతో రేకుల షెడ్లో ఉన్న సామగ్రి కాలిపోయింది. విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్త అగ్నిమాపక, కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఎ.ఎస్.ఐ సోమేశ్వరరావు, కాశీబుగ్గ హెచ్సీ జగన్మోహన్రావు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇంద్ర పుష్కరిణి పనులు ప్రారంభం శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ప్రాంగణంలో రూ.4 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్న ఇంద్ర పుష్కరిణి పనులకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. తిరుపతి పుణ్యక్షేత్రం తరహాలో ఆలయాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వారు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్, ఈఓ ప్రసాద్, అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. గెడ్డలో మృతదేహం కలకలం మందస: డిమిరియా గ్రామ సమీపంలోని గెడ్డలో శనివారం మృతదేహం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న మందస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీయగా మృతుడు అంబుగాం గ్రామానికి చెందిన గుడియా జగన్నాథరావు(47)గా గుర్తించారు. ఈయన తోపుడు బండిపై తిను బండారాలు అమ్ముకునేవాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లక్ష ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలోని క్రాంతి భవన్లో శనివారం ఆయన విలేకరులతోమాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేనిపక్షంలో నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు. అన్ని శాఖల్లోనూ వేలాది సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ పదివేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. వెంటనే ఈ జాబ్ క్యాలెండర్ను రద్దుచేసి లక్ష ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు జరిగిన యువగళం పాదయాత్రలో నారా లోకేష్, ఎన్నికల సభల్లో చంద్రబాబునాయుడు, వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ యువతకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోక పోవడం సిగ్గు చేటన్నారు. మరోవైపు రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు, డ్రగ్స్ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోందన్నారు. సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్, నాయకులు ఆర్.అరవింద్, వసంతరావు, సంతోష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
కార్గోఎయిర్ పోర్టు ప్రభావిత గ్రామాల్లో నిరసనలు
పలాస : కార్గో ఎయిర్ పోర్టు ప్రభావిత గ్రామాల్లో ఈ నెల 23 నుంచి 31 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, లిబరేషన్ నాయకుడు ఎం.రామారావు, కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు చెప్పారు. కాశీబుగ్గ సి.ఐ.టి.యు.కార్యాలయంలో శుక్రవారం కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాటానికి సంఘీభావ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి సెగ తగిలేలా చేయాలని పిలుపునిచ్చారు. కార్గో ఎయిర్ పోర్టు పేరుతో ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్గో ఎయిర్ పోర్టు ప్రభావిత ప్రాంతాల్లో సభలు సమావేశాలు పెట్టనీయకుండా ఎందుకు పోలీసు ఆంక్షలు పెడుతున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడిని ప్రశ్నించారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు జీడి మామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు కె.మోహనరావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, సి.ఐ.టి.యు. జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్కుమార్, పోరాట కమిటీ మీడియా కన్వీనర్ బత్తిన లక్ష్మణ్, పి.కుసుమ, కె.గురయ్య, పొట్టి ధర్మారావు, గుంటి లోకనాథం, గుంటు రామస్వామి, లండ రామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఎంత చెబితే అంతే..!
రణస్థలం: కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను అన్నీ కష్టాలే వెంటాడుతున్నాయి. గత ఏడాది అకాల వర్షాలు, తుఫాన్లు వల్ల నష్టపోయిన పంటలకు ఇంతవరకు పరిహారం చెల్లించకపోవడంతో రైతులు కుదేలైపోయారు. రబీలో పంటలు సాగు చేద్దామంటే తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టుల ద్వారా సాగునీరు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. తాజాగా చేతికి అందుతున్న మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించక, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో వరి, అపరాలు తర్వాత మెట్ట ప్రాంతాల్లో మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట చేతికొచ్చేసినా మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల వరకు రూ.2300 వరకు పలికిన క్వింటా ధర ప్రస్తుతం రూ.1600కు పరిమితమైంది. మరోవైపు కూటమి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల ఎంత చెబితే అంతకే అమ్మకాలు జరపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే రైతులు చాలాచోట్ల మొక్కజొన్న కోతలు మొదలయ్యాయి. మద్దతు ధర పెరిగితే కోతలు మొదలుపెడతామని మరికొందరు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వమే మేలు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏటా ఫిబ్రవరిలోనే మార్కెటింగ్ శాఖ అధికారుల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. మద్దతు ధర ప్రకటించి రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పొలం వద్దకే బస్సులు పంపించి మరీ మొక్కజొన్న కొనుగోలు చేసేవారు. అప్పట్లో రూ.2400 వరకు మద్దతు ధర ప్రకటించారని, రవాణా ఖర్చులు లేకుండా అంతా జగన్ ప్రభుత్వమే చూసుకుండేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. మద్దతులేక రైతుల గగ్గోలు.. ఎకరా విస్తీర్ణంలో మొక్కజొన్న సాగుకు సుమారు రూ.30వేల నుంచి రూ.35వేల వరకు పెట్టుబడి అవుతుంది. బాగా పండితే ఎకరాకు 35 క్వింటాళ్ల నుంచి 43 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అమ్మే సమయానికి క్వింటాల్ మద్దతు ధర రూ.2400 వరకు ఉంటే సుమారు లక్ష వరకు రాబడి వస్తుంది. ప్రస్తుత మార్కెట్ ధర రూ.1600 ప్రకారం చూసుకుంటే రూ.70వేలు లోపే వస్తుంది. అంటే ఎకరాకు రూ.30 వేలు చొప్పున, క్వింటాకు రూ.700 వరకు రైతులు నష్టపోతున్నారు. తెరుచుకోని కేంద్రాలు.. కూటమి ప్రభుత్వ పాలనలో ఆ పార్టీల నాయకులు చెబుతున్న మాటలకు బయట కనిపిస్తున్న చేష్టలకు పొంతన లేకుండాపోతోంది. ఇటీవల కూటమి నాయకులు ఎక్కడికక్కడ ఉపన్యాసాల్లో మొక్కజొన్న రైతును ఆదుకుంటామని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో చూపించడం లేదు. మొక్కజొన్న మద్ధతు ధర ప్రకటించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు నిలదీస్తున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష పార్టీల నాయకులపైనా, రైతులపైనా అక్కసు చూపడం సరికాదని, వెంటనే మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలులో దళారులదే రాజ్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కూటమి ప్రభుత్వం మద్దతు ధర రూ.1600కు పడిపోవడంతో రైతులు కుదేలు మంత్రి ఉన్నా ప్రయోజనం లేదు.. మొక్కజొన్న పంట వేసిన రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని స్థితిలో వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఉన్నారు. జిల్లాలో 58 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అవుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. మొక్కజొన్న పంటకు వెంటనే మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – గొర్లె కిరణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే, ఎచ్చెర్ల ఆదేశాలు రాలేదు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, మద్దతు ధర ప్రకటనపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. రైతులకు క్షేత్రస్థాయిలో అదే చెబుతున్నాం. – వి.శ్రీనివాసరావు, ఏడీఏ -
టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ను సస్పెండ్ చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): డ్రగ్స్ కేసులో పట్టుబడిన తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్కుమార్ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ప్రతినిధులు డిమాండ్ చేశారు.ఈ విషయమై శ్రీకాకుళం సూర్యమహల్ జంక్షన్ వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీపై టీడీపీ నాయకత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పట్టుబడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలని తరచూ ఉపన్యాసాలు చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇప్పుడు తమ పార్టీ ప్రజాప్రతినిధులే డ్రగ్స్ కేసుల్లో చిక్కుకోవడంతో ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తి నైతిక బాధ్యత వారే వహించాలన్నారు. ఇలాంటి కేసుల్లో పట్టుబడిన ప్రజాప్రతినిధులకు ఎలాంటి రాజకీయ పరిరక్షణ లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని, యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచేందుకు ప్రజల్లో చైతన్యం పెంచే కార్యక్రమాలను మరింత విస్త్రృతంగా చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్, నాయకులు అరవింద్, రామోజీ, వసంతరావు, శ్రీనిధి, అన్నాజీ, హేమంత్, కృష్ణ, వికాస్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న ఏఐవైఎఫ్ నాయకులు -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం
మందస/వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం గ్రామానికి చెందిన లావేటి మనోజ్(20) గురువారం రాత్రి హరిపురం నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా కొర్రాయి గేటు సమీపంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో మనోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మనోజ్ కార్పెంటర్గా పని చేసేవాడు. తండ్రి సూర్యనారాయణ, తల్లి గౌరి, సోదరుడు వినయ్ ఉన్నారు. మనోజ్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ.. రణస్థలం : వరిశాం సమీపంలో ఈ నెల 16న ఓ ప్రైవేటు పాఠశాల బస్సును ఢీకొట్టిన ప్రమాదంలో లంక మోహన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి కారి సీతయ్య గాయపడి శ్రీకాకుళంలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. పరిస్థితి విషమించడంతో సీతయ్య(27) శుక్రవారం ఉదయం మరణించినట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. -
గేట్లో ఉత్తమ ర్యాంకులు
శ్రీనివాస్ కల్యాణ్ (488వ ర్యాంకు) జి.సాయిగణేష్ (31వ ర్యాంకు) ఇంటూరు ఉమేష్చంద్ర (77వ ర్యాంకు) పూడి అభిషేక్ (246వ ర్యాంకు) ఎచ్చెర్ల : గేట్–2026 ఫలితాల్లో ర్యాంకులు కై వసం చేసుకున్న విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకోవాలని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. జి.సాయిగణేష్ (ఈసీఈ) 31వ ర్యాంకు, ఇంటూరి ఉమేష్చంద్ర (సీఎస్ఈ) 77వ ర్యాంకు, మరో 20 మంది విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చాయని చెప్పారు.కార్యక్రమంలో డీన్ శివరామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. – సంతబొమ్మాళి: కోటపాడు పంచాయతీ కాశీపురం గ్రామానికి చెందిన పూడి అభిషేక్కు గేట్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచాడు. ఆలిండియా స్థాయిలో 246వ ర్యాంకు సాధించాడు. అభిషేక్ తండ్రి రాంబాబు రైతు కాగా, తల్లి సునీత గృహిణి. తాడేపల్లిగూడెంలో ఇంజినీరింగ్ చదివి గేట్లో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల కుటుంబసభ్యులు, గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జి.సిగడాం: మండల కేంద్రం జి.సిగడాంకు చెందిన పుప్పాల శ్రీనివాస్ కల్యాణ్ గేట్లో ఆలిండియా స్థాయిలో 488వ ర్యాంకు సాధించాడు. తండ్రి గౌరీ ప్రసాద్ ఆటో డ్రైవర్, తల్లి దివ్యకుమారి గృహిణి. శ్రీనివాస్ కల్యాణ్ బీటెక్ పూర్తి చేసుకుని ఇంటి వద్దనే చదువుకుంటూ గేట్లో మంచి ర్యాంకు సాధించడం పట్ల కుటుంబసభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ముగ్గురికి రిమాండ్
హిరమండలం : పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడిచేసిన ముగ్గురికి కోర్టు రిమాండ్ విధించింది. హిరమండలం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనా వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 18న రాత్రి 112 అత్యవసర విభాగానికి వచ్చిన ఫిర్యాదును విచారించేందుకు కానిస్టేబుళ్లు ఇద్దరు హిరమండలం ప్రధాన రహదారికి వెళ్లారు. అయితే దంత తేజేశ్వరరావు, అల్లాడ మధుబాబు, నీలంశెట్టి మిన్నారావు అసభ్యకరంగా ప్రవర్తించారు. దాడిచేసే ప్రయత్నం చేశా రు. దీనిపై కానిస్టేబుళ్లు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ముగ్గుర్ని అరెస్టు చేసి కొత్తూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్కు ఆదేశించడంతో జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్ఐ హేమంత్ కళ్యాణ్ తెలిపారు. నేడు అరసం జిల్లా మహాసభ శ్రీకాకుళం కల్చరల్ : అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జిల్లా మహాసభ శనివారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీకాకుళం రెడ్క్రాస్ భవనంలో నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నల్లి ధర్మారావు, చింతాడ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. 70 ఏళ్ల చరిత్ర గల ఈ సంస్థకు ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరవుతారని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్రంథాలయ పునర్నిర్మాణ ఉద్యమ సంస్థ, రాష్ట్ర కన్వీనర్ వల్లూరు శివప్రసాద్, ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు. అభ్యుదయ వాదులంతా ఆహ్వానితులేనని తెలిపారు. జీడి తోటలో మంటలు టెక్కలి రూరల్ : తొలుసూరుపల్లి గ్రామ సమీపంలోని జీడి తోటలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. గూన వేణుగోపాలరావుకు చెందిన నాలుగు ఎకరాల జీడితోటలో గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. స్థానిక యువకులు గమనించి మంటలను అదుపు చేశారు. -
కార్గిల్ పార్కు పనుల పరిశీలన
శ్రీకాకుళం : జిల్లా పరిషత్ రోడ్డులోని సుడా కార్గిల్ పార్కులో జరుగుతున్న పనులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం పరిశీలించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫొటో సెషన్, స్పీచ్ పాయింట్ల వద్ద ప్రాక్టికల్ డెమో విధానంలో ఫొటోలు తీయించి పరిశీలించారు. పబ్లిక్ టాయిలెట్లు సైతం పరిశీలించారు. పెండింగ్ పనులను టీములు వారీగా ఏర్పాటు చేసి సత్వరమే పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పార్కు ప్రారంభోత్సవం నాడు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో సుడా ఎస్ఈ సుగుణాకర్, మున్సిపల్ కార్పొరేషన్ ఎం.ఈ. శర్మ, ఎంహెచ్ఓ సుధీర్, సైనిక్ వెల్ఫేర్ అధికారి ఎ.శైలజ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, డీఎస్డీఓ మహేష్, సుడా ఏఈలు పాల్గొన్నారు. 24న జిల్లా స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ(శాప్) ఆదేశాల మేరకు ఈ నెల 24న జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జిల్లా స్థాయి శాప్ లీగ్ మాస్టర్స్ (వెటరన్స్) క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను మాస్టర్ వెటరన్ అథ్లెట్స్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్బాబు కోరారు. 35 ఏళ్లుపైబడి, 45 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు వేర్వేరుగా వివిధ అథ్లెటిక్స్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్టు చెప్పారు. 100, 400, 800, 1500 మీటర్ల పరుగు, లాంగ్జంప్, హైజంప్, షాట్పుట్, డిస్కస్త్రో, జావెలన్త్రో, రిలే పరుగు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వెటరన్ క్రీడాకారులను ఈ నెల 30, 31 తేదీల్లో గుంటూరు జిల్లా కేంద్రంలో జరిగే ఏపీ రాష్ట్ర స్థాయి శాప్లీగ్ మాస్టర్స్ (వెటరన్) పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి గల వెటరన్ అథ్లెట్స్ స్పోర్ట్స్.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఎస్డీఓ సూచించారు. వివరాలకు 9390352942 నంబర్ను సంప్రదించాలని కోరారు. ఒకేసారి మూడు కొలువులు హిరమండలం: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే చాలా కష్టంగా ఉన్న రోజులివి. అటువంటిది ఒకేసారి మూడు బ్యాంకు కొలువులను సాధించాడు హిరమండలం మండలంలోని పిండ్రువాడ గ్రామానికి చెందిన కురమాన జగదీష్. ఇటీవల విడుదలైన స్టేట్బ్యాంక్ క్లర్క్, యూనియన్ బ్యాంకు క్లర్క్, ఆర్ఆర్బీ క్లర్క్ పోస్టులకు ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు నాగేశ్వరరావు, సత్యవతి సాధారణ వ్యవసాయ కూలీలు. జగదీష్ విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే జరిగింది. ఈ సందర్భంగా జగదీష్ను గ్రామస్తులు అభినందించారు. -
రూ.26.96 కోట్లతో మడ్డువలస ఫేజ్–2 పనులు
జి.సిగడాం : మడ్డువలస ప్రాజెక్ట్ కాలువ పనుల కోసం ఫేజ్–2 కింద రూ.26 కోట్ల 90 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని ప్రాజెక్ట్ ఎస్ఈ పొన్నాడ సుధాకరరావు తెలిపారు. శుక్రవారం దేవరవలస వద్ద చేపడుతున్న కాలువ పనులను ఎస్ఈ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్కు రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనులు జరుగుతున్న సమయంలో ప్రజలు, రైతులు సహకరించాలన్నారు. ఇప్పటికే అవసరమైన రైతులకు కాలువ ద్వారా సాగునీరు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఫేజ్–2 పనులు పూర్తయితే ప్రతిసెంటు భూమికీ సాగునీరు అందుతుందన్నారు. ఈయనతోపాటు ఈఈ బోర గోవిందరావు, డీఈఈలు పి.రవికుమార్, ఎ.రమేష్, జేఈఈలు బి.కోటేశ్వరరావు, రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు. దేవరవలస వద్ద పనులను పరిశీలిస్తున్న ఎస్ఈ సుధాకరరావు, ఈఈ గోవిందరావు -
దొంగతనాలే వృత్తిగా..
● ఒకరు 22, మరొకరు 7 కేసుల్లో ముద్దాయిలు ● ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు రణస్థలం: దొంగతనాలు చేయడంలో ఆరితేరిన ఓ ముద్దాయికి మరొక ముద్దాయి జైల్లో పరిచమయ్యాడు. ఇరువురు కలిసి దొంగతనాలే వృత్తిగా ఎంచుకున్నారు. ఒకే నెలలో 10 దొంగతనాలు చేసి ఆపై వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నారు. జె.ఆర్.పురం పోలీస్ స్టేషన్లో సీఐ ఎం.అవతారం తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 23న లావేరు మండలం ఆర్.ఆర్.వైన్ షాపులో చోరీ జరిగింది. షట్టర్ పగలగొట్టి లోపల క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.15 వేలు నగదు, డీవీఆర్ బాక్స్, జీవో రూటర్ బ్యాక్స్ను పట్టుకుపోయారు. షాప్ సేల్స్మెన్ బవిరి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ కె.మహేశ్వరరెడ్డి ఆదేశాలతో రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. నాయని ప్రభుకుమార్ (లవ్లీకుమార్), బైరెడ్డి మోహన్కుమార్ (పండు) ఈ చోరీ చేసినట్లు గుర్తించి శుక్రవారం లావేరు మండలం సుభద్రపురం జంక్షన్ వద్ద పట్టుకుని అరెస్టు చేశారు. జైల్లో పరిచయం.. విజయవాడకు చెందిన లవ్లీ కుమార్పై గతంలో 22 చోరీ కేసులు ఉన్నాయి. మూడో తరగతి వరకు చదువుకుని 13 ఏళ్లత వయస్సులోనే చిన్న, చిన్న షాపులు, సైకిల్లు, బైకులు, రాగి బిందెలు వంటి దొంగతనం చేస్తుండేవాడు. ఇలా 22 కేసుల్లో ముద్దాయిగా జైలుకు వెళ్లాడు. రాజమండ్రికి చెందిన బైరెడ్డి మోహన్కుమార్ తొమ్మిదో తరగతి వరకు చదివి రైల్వే ఫ్లాట్ ఫాంపై సమోసాలు అమ్ముకుంటూ సెల్ ఫోన్లు దొంగిలిస్తూ నేరాలు చేసేవాడు. ఇద్దరూ రాజమండ్రి సెంట్రల్ జైలులో పరిచయమయ్యారు. జైలు నుంచి జనవరి 31న విడుదలైన తరువాత ఇద్దరూ కలిసి దొంగతనాలు చేయడం మొదలెట్టారు. నెల రోజుల వ్యవధిలోనే విజయవాడ, పెందుర్తి, శ్రీకాకుళం, లావేరు, సబ్బవరం, ఎస్.కోట, బొండపల్లి, రామభద్రపురం వంటి చోట్ల జరిగిన చోరీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. దొంగతనంగా సంపాదించిన సొమ్ముతో విలాసవంతమైన హోటళ్లలో మద్యం సేవించడం, కోల్కత్తా వంటి ప్రాంతాలకు వెళ్లి అసాంఘిక పనులు చేసేవారు. వీరి వద్ద నుంచి రూ.68,800 నగదు, కెమెరా, డీవీఆర్ బాక్స్లు రికవరీ చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ అవతారం తెలిపారు. ముద్దాయిలను పట్టుకున్న లావేరు ఎస్సై కె.అప్పలసూరి, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సమావేశంలో లావేరు, రణస్థలం ఎస్సైలు కె.అప్పలసూరి, ఎస్.చిరంజీవి, సిబ్బంది ఉన్నారు. -
రైలు హాల్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
టెక్కలి/పాతపట్నం/మందస: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే హాల్ట్ వద్ద విశాఖ–గుణుపూర్ ప్యాసింజర్ రైలు హాల్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు కోరారు. శుక్రవారం ప్యాసింజర్ రైలు హాల్టింగ్ను ప్రారంభించారు. పాతపట్నం రైల్వే స్టేషన్లో రూర్కెలా–గుణుపూర్ రాజారాణి ఎక్స్ప్రెస్ రైలు హాల్టును, మందస రైల్వే స్టేషన్లో బ్రహ్మపురం–విశాఖ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ను కేంద్రమంత్రి, పాతపట్నం, పర్లాకిమిడి ఎమ్మెల్యేలు మామిడి గోవిందరావు, రూపెష్ పాణిగ్రహీ, రైల్వే అధికారులు ప్రారంభించారు. కార్యక్రమంలో వాల్తేరు, ఖుర్ధా రైల్వే డివిజన్ డీఆర్ఎంలు లలిత్, సునీల్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం
–8లోనువ్వలరేవులో రామయ్య వైభోగం ● సాగర తీరంలో సీతారాముల పరిణయానికి సర్వం సిద్ధం ● నువ్వలరేవులో రేపటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం ● తరతరాలుగా ప్రత్యేకతను చాటుకుంటున్న మత్స్యకారులు ● ఏప్రిల్ 2 వరకు వేడుకల నిర్వహణ నేటి ఇంగ్లిష్ పరీక్ష వాయిదా శ్రీకాకుళం: రంజాన్ సందర్భంగా ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించిన నేపథ్యంలో పదో తరగతి, ఓపెన్ స్కూల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డీఈఓ పి.రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 21న జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి, ఓపెన్ స్కూల్ గణితం, భారతీయ సంస్కృతి పరీక్షలను మార్చి 30వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు. గతంలో కేటాయించిన ఇన్విజిలేటర్లు, సిబ్బంది అందరూ మారిన తేదీల్లో యధావిధిగా విధులకు హాజరుకావాలని స్పష్టం చేశారు. మొక్కజొన్న కొనుగోలులో దళారులదే రాజ్యంగా మారింది. మద్దతు ధర రూ.1600కు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026ఎన్నో సరదాలు గుండెలతో పలకరింపులు ‘ఫజర్’ నమాజు నుంచి ఆక్రీ జుమ్మా దాకా నెలవంక పొడుపు నుంచి రంజాన్ ‘ఈద్’ దాకా.. రంజాన్ మాసం వన్నెల రంగుల దీపం మనిషి మనిషిని కలిస్తే ఆయుష్షు పెరిగే సంతోషం 22 నుంచి ఇంటర్మీడియెట్ స్పాట్ శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఈ నెల 22 నుంచి మొదలుకానుందని జిల్లా ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ తెలిపారు. వాస్తవానికి ఈ నెల 21 నుంచి స్పాట్ మొదలుకానుండగా రంజాన్ సెలవును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20కి బదులుగా 21వ తేదీకి మార్పు చేసిందని గుర్తుచేశారు. ఇప్పటికే సంస్కృతం పేపర్ల వాల్యుయేషన్ జరుగుతోందన్నారు. మిగిలిన షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. 29న బాలుర క్రికెట్ జట్టు ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లా అండర్–19 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలను ఈ నెల 29న జరగనున్నాయని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ శుక్రవారం తెలిపారు. చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ క్రీడామైదానం వేదికగా ఉదయం 8 గంటల నుంచి ఎంపికలు మొదలవుతాయని పేర్కొన్నారు. 2007 సెప్టెంబర్ ఒకటి తర్వాత జన్మించిన వారు అర్హులని స్పష్టంచేశారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు జనన ధృవీకరణ పత్రం, ఆధార్కార్డు, తెలుపు యూనిఫాం, స్పోర్ట్స్ కిట్తో హాజరుకావాలని కోరారు. దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్కు 7 అర్జీలు శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. కలెక్టర్, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ బి.శైలజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏడు దరఖాస్తులు స్వీకరించారు. అందులో దివ్యాంగ పింఛన్ల మంజూరు కోరుతూ 1, బ్యాటరీ వాహనం కోరుతూ 1, సదరం సర్టిఫికెట్ కోరుతూ 1, ఆర్టీసీ బస్ రిజర్వేషన్ సమస్యపై 1, ఉద్యోగ ఉపాధి కల్పించమని కోరుతూ 3 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జనారణ్యంలో జింక మృతి పలాస : అభయారణ్యం నుంచి జనారణ్యంలోకి వచ్చిన జింక రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందింది. పలాస మండలం శాసనాం జాతీయ రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ వన్యప్రాణి మృత్యువాత పడింది. సమాచారం అందుకున్న వైల్డ్ లైఫ్కు చెందిన ఓంకార్ త్యాడి జింక మృతదేహాన్ని పలాస ప్రభుత్వ పశువుల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. అనంతరం పూడ్చిపెట్టారు. కాగా, గ్రావెల్ మాఫియా కంకర కోసం అటవీ ప్రాంతాల సమీపంలోని కొండలను తొలిచేస్తున్నారు. అక్కడ రణగొణ ధ్వనుల వల్ల అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనారణ్యంలోకి వచ్చి ఈ విధంగా మృత్యువాత పడుతున్నాయి. అటవీశాఖ అధికారులు స్పందించి వన్యప్రాణుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ, జంతు ప్రేమికులు కోరుతున్నారు. వర్షంతో ఉపశమనం శ్రీకాకుళం/కొత్తూరు : జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతకు గురైన ప్రజానీకానికి వర్షం కొంత ఉపశమనమిచ్చింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రెండు రోజులుగా వాతావరణ శాఖ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు జిల్లావ్యాప్తంగా వర్షం పడింది. కొత్తూరు, కర్లెమ్మ, పారాపురం, మహసింగి తదితర గ్రామాల్లో వర్షం కురవడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఐకమత్యంతో ఉత్సవాలు.. తరతరాలుగా వస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలు ఐకమత్యంతో జరుపుకుంటున్నాం. మాఇంటి ఇలవేల్పుగా బృందావతి అమ్మవారిని కొలుసుకుంటూ మాకు ఆదర్శ దైవంగా నిలిచిన శ్రీరాముడు, సీతమ్మలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఏటా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. – మువ్వల పూర్ణచంద్రరావు, సర్పంచ్ నువ్వలరేవు, వజ్రపుకొత్తూరు మండలం ఆచారాలకు పెద్దపీట.. తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తాం. వలస కూలీలు ఎక్కడ ఉన్న స్వగ్రామానికి చేరుకుని ఉత్సవాలలో భాగస్వామ్యం అవుతారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు, పూజారులు, యువకులు సహకారంతో ఉత్సవాలు జరుపుకుంటాం. – బి.వెంకటేష్, మాజీ ఎంపీటీసీ, నువ్వలరేవు, వజ్రపుకొత్తూరు మండలం వజ్రపుకొత్తూరు రూరల్: కోదండరాముడి కల్యాణోత్సవానికి జిల్లాలోనే అతిపెద్ద మత్స్యకార గ్రామమైన నువ్వలరేవు(లక్ష్మిదేవిపేట) ముస్తాబవుతోంది. తరతరాలుగా వస్తున్న కుల కట్టుబాట్లు, సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తూ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్తులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు ఏప్రిల్ 2 వరకు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. అంతటా ప్రత్యేకమే.. స్వగ్రామానికి వలస జీవులు.. తాము ఎక్కడ ఉన్నా గ్రామ దేవత బృందావతి అమ్మవారి చల్లన దీవెనలు, సీతారాముల కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని గ్రామస్తుల విశ్వాసం. అందుకే భారీ వ్యయంతో పెద్ద పండగగా కల్యాణోత్సవం జరుపుకుంటారు. ఈ వేడుకను తిలకించేందుకు వలస జీవులంతా స్వగ్రామానికి చేరుకుంటారు. ఊరంతా వెలుగు.. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో ఊరంతా విద్యుత్ వెలుగులతో విరజిమ్ముతుంది. ఉత్సవాలు తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది జనం తరలివస్తుంటారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల చొరవతో గ్రామస్తులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. స్పీకర్ శుభాకాంక్షలు రంజాన్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ముస్లింలందరికీ శుభాకాంక్షలు. రంజాన్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ 30న మూలపేట పోర్టు సందర్శన పోలాకి: జిల్లా ప్రజల చిరకాల స్వప్నం మూలపేట పోర్టును ఈ నెల 30న వైఎస్సార్సీపీ ఉన్నత స్థాయి అధికార బృందం సందర్శించనున్న నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ క్షేత్రస్థాయిలో సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మబగాంలో పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నేతృత్వంలో ముఖ్యనాయకులతో కృష్ణదాస్ సమావేశమాయ్యరు. కార్యక్రమానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రారంభించి దాదాపు 85 శాతం పనులు పూర్తిచేసిన తరువాత కూడా మిగిలిన పనులు పూర్తిచేయకుండా కూటమి ప్రభుత్వం పోర్టు పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ముఖచిత్రం మార్చేయాలనే ధ్యేయంతో, వలసల నివారణ కోసం తీసుకున్న ఈ నిర్ణయం క్రెడిట్ వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందుతుందనే దురుద్దేశంతోనే పోర్టుపై కూటమి నాయకులు కినుక వహిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో కలసి పోర్టును సందర్శించి ప్రభుత్వ తీరును ప్రజలముందు ఉంచాలని చెప్పారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ పోర్టులో కనీసం ట్రయల్ రన్ వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రాంతీయయాత్ర ద్వారా జగన్ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత పనుల జాప్యాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. హిరమండలం: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో త్వరలో ప్రత్యేకాధికారుల పాలన అమలుకానుంది. ప్రస్తుతం సర్పంచ్ల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుండగా, నిబంధనల ప్రకారం ఆ లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ల ఖరారు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక వంటి సాంకేతిక, న్యాయ పరమైన అంశాల కారణంగా పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల జరిగే వరకు గ్రామ పంచాయతీల పరిపాలనను ప్రత్యేకాధికారులకు అప్పగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీంతో ఆశావహులు మూగబోతున్నారు. జిల్లాలో 912 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఇతర మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించే అవకాశం ఉంది. అధికారుల కొరత ఉన్న ప్రాంతాల్లో ఒక అధికారికి రెండు, మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఆలస్యానికి ప్రధాన కారణాలు... పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందు బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రావాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం (ట్రిపుల్ టెస్ట్) రిజర్వేషన్ల అమలుకు ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ 45 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. అనంతరం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ప్రారంభించడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశముంది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మారనున్నారు. ఈ ప్రక్రియల్నీ పూర్తయ్యే సరికి పంచాయతీ ఎన్నికలు జూన్ తర్వాతే జరిగే అవకాశం ఉందని రాజకీయవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక కూటమిలోని నాయకులు, కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికలు జరిగి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పగ్గాలు చేపడితే నాయకులు, కార్యకర్తలను వందశాతం సంతృప్తి పరచలేమని, ఏడాది పాటు ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రణాళికలు రచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరో వైపు ప్రజల్లో అసంతృప్తిని సైతం అంచనా వేసి, ఎన్నికల ను దూరం చేస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక అధికారుల జాబితాపై కసరత్తు గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించేందుకు జిల్లా అధికారులు ఇప్పటికే జాబితా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తహసీల్దార్లు, మండల పరిషత్ అధికారులు, పంచాయతీ రాజ్ సహా య ఇంజినీర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, మండల విద్యాధికారులు, వ్యవసాయ అధికారులు, పశు వైద్యాధికారులు,ఆరోగ్యశాఖ సూపర్వైజర్లు, ఉద్యా న శాఖ అధికారులు, ఉప తహసీల్దార్లు తదితర శా ఖ అధికారుల పేర్లను పరిశీలిస్తున్నారు. ప్రత్యేకా ధికారులుగా గెజిటెడ్ అధికారులనే నియమించాల ని ప్రభుత్వం స్పష్టం చేయడంతో టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. అయితే అధికారుల కొరత ఏర్పడితే చిన్న పంచాయతీల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల పరిషత్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, హెడ్మాస్టర్లను కూడా ప్రత్యేక అధికారులుగా నియమించే అవకాశం ఉంది. మండల కేంద్రాలకు జిల్లాస్థాయి అధికారులను ప్రధాన గ్రామ పంచాయతీలకు తహసీల్దార్లను పెద్ద జనాభాగల పంచాయతీలకు ఎంపీడీఓలను ప్రత్యేకాధికారులుగా నియమించే ప్రతిపాదనలు ఉన్నాయి. అవసరమైతే ఒక అధి కారికి రెండు లేదా మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. ఏప్రిల్ 2తో సర్పంచ్ల పదవీ కాలం ముగింపు జూన్ తర్వాతే పంచాయతీ ఎన్నికలకు అవకాశాలు అప్పటివరకు ప్రత్యేక అధికారుల చేతిలో గ్రామ పాలన ఇది నిజమేనా..? పంచాయతీ ఎన్నికల నిర్వహణ క్రమంపై కూటమి పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. సాధారణంగా పార్టీ గుర్తులు లేకుండా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో వర్గపోరుకు దారి తీసే అవకా శం ఉందని నాయకులు భావిస్తున్నారు. ఈ ప్రభా వం తర్వాత జరిగే మండల పరిషత్, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని జిల్లా నాయకులు అంటున్నారు. అందుకే ముందుగా పార్టీ గుర్తులతో జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ప్రత్యేక కార్యక్రమాలివే..
● గ్రామంలో 12 రోజుల పాటు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తారు. ● ఈ నెల 22న సాయంత్రం దాసుడు ఇంటి నుంచి దేవరతో బయలుదేరుతారు. టక్కురాణి అమ్మవారికి పూజలు చేసి జెండా ఆవిష్కరణతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు వచ్చే నెల 02న జరిగే రావణ సంహారంతో ముగియనున్నాయి. దాదాపుగా 12 రోజుల పాటు సందడిగా జరిగే ఈ ఉత్సవాలు మొదటి రోజున అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తారు. మరసటి రోజు చిన్న పండగ నిర్వహించి పగటి వేషాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు. 2న పెద్ద పండగ నిర్వహించి అమ్మవార్లకు చల్లదనం, మొక్కులు తీర్చుకుంటారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం శ్రీరామనవమి (ఈ నెల 27)న నాడు ముందుగా గ్రామ దేవత బృందావతి అమ్మవారి ఆలయం వద్ద జెండాను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేస్తారు. రామాలయం వద్ద మరో జెండాను ఆవిష్కరించి వేదమంత్రోచ్ఛారణల మధ్య సీతారాములు కల్యాణం నిర్వహిస్తారు. తర్వాత రోజు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. యువకులు డ్యాన్స్లు, పగటి వేషాలతో అలరిస్తారు. కర్రసాము, గారడీ, పాండురంగ, రామ నాటకం, రామయ్య పట్టాభిషేకం, కోయి డాన్స్, రావణ దాహనం తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు ముగిస్తారు. -
ప్రాణం తీసిన వివాదం
● రాత్రివేళ ఎందుకు తిరుగుతున్నావంటూ బంధువును ప్రశ్నించిన టీడీపీ కార్యాలయ మేనేజర్ ● వాగ్వాదానికి దిగిన మరో యువకుడు ● తోపులాటలో గాయపడి మేనేజర్ మృతి ● నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలోని మండలవీధిలో గురువారం రాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం ఓ యువకుడి మరణానికి దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలవీధిలో నివాసముంటున్న గొర్లె మోహన్కృష్ణ (32) గురువారం రాత్రి అదే వీధిలో ఆరుబయట కూర్చున్నాడు. ఈ సమయంలో తన బంధువు కొందరు యువకులతో తిరుగుతూ కనిపించాడు. ఈ రాత్రి వేళ వీరితో ఎందుకు తిరుగుతున్నావని మోహన్కృష్ణ ప్రశ్నించాడు. ఇదే సమయంలో అటుగా వస్తున్న మహాలక్ష్మినగర్ కాలనీకి చెందిన గడ్డి మనోహర్ అనే యువకుడు మోహన్కృష్ణతో వాగ్వాదానికి దిగాడు. తమ వీధి వారితో తిరిగితే తప్పేంటని ప్రశ్నించగా ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట చోటుచేసుకుంది. మనోహర్ నెట్టేయడంతో మోహన్కృష్ణ తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడిని ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు ఏం చెబుతున్నారంటే.. మోహన్కృష్ణపై నలుగురు దాడి చేశారని బంధువులు చెబుతున్నారు. దాడి జరిగిన సందర్భంలో మోహన్కృష్ణ బంధువు కూడా అక్కడే ఉన్నా అతను నోరు మెదపకపోవడానికి కారణాలను కూడా కొందరు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో తరచూ గంజాయి బ్యాచ్ తిరుగుతుంటారని, ఇది కూడా వారి పనేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషాదంలో కుటుంబ సభ్యులు.. మోహన్కృష్ణ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ మేనేజర్గా పనిచేస్తున్నాడు. గతంలో ఇతని తండ్రి వెంకటరమణ పార్టీ కార్యాలయ పనులన్నీ చూసేవారు. రెండేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందడంతో మోహనకృష్ణకు బాధ్యతలు అప్పగించారు. మోహనకృష్ణ సోదరికి వివాహం కాగా, తల్లి లక్ష్మితో కలిసి మండల వీధిలో నివాసం ఉంటున్నాడు. రక్షణ ఏదీ? ఇటీవల కాలంలో శ్రీకాకుళం నగరంలో హత్యలు పెరిగిపోతున్నాయి. కొద్దిరోజుల క్రితమే 80 అడుగుల రోడ్డులో మోహన్ అనే యువకుడ్ని హత్య చేయగా, ఇప్పుడు మోహనకృష్ణ మృత్యువాత పడటం గమనార్హం. -
మాటలన్నీ గ్యాసేనా..?
ప్రతి రోజూ కమర్షియల్ సిలిండర్స్ డిమాండ్ 1000 అక్రమంగా స్టాక్ చేసిన ఏజెన్సీల పై చర్యలు కూడా తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. వచ్చిన వాటిలో కొన్ని ఏజెన్సీలు అక్రమంగా స్టాక్ చేసి, పంపిణీ చేయకుండా నిల్వ చేసి, బ్లాక్లో విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరఫరా 100 మాత్రమే. ప్రభుత్వ హాస్టళ్లలో గ్యాస్ కష్టాలు మామూలుగా లేవు. కట్టెల పొయ్యే గతి వినియోగదారులకు గ్యాస్ అందకపోవడంతో కట్టెల పొయ్యి గతిగా మారింది. ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు వినియోగదారులకు తీవ్రంగా వేధించడంతో చిరుదుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దుకాణాలు మూత వేయలేక, అలా అని నడపలేక ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు: 38 డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు6,12,000 సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: గ్యాస్.. సామాన్య వినియోగదారుడు నుంచి హోటల్ యజమానుల వరకు అందరి నోటా ఇదే మాట. గతంలో గ్యాస్ బుక్ చేసుకుంటే ఒకటి రెండు రోజుల్లో వచ్చేసేది. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకొని వారాలు గడుస్తున్నా అందని పరిస్థితి జిల్లాలో నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 38 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా వీటిలో హోటళ్లు, రెస్టారెంట్, చిరు వ్యాపారులు వినియోగించే కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు 4,320 ఉన్నాయి. అలాగే గృహ వినియోగదారులు వినియోగించేందుకు డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు 6,12,000 ఉన్నాయి. అయితే ప్రధానంగా కమర్షియల్ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకుంటే జిల్లా వ్యాప్తంగా రోజుకి 1,000 గ్యాస్ సిలిండర్లు అందాల్సి ఉండగా నేడు కేవలం 100 సిలిండర్లు మాత్రమే అందటంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలను తెరవలేని దయనీయ దుస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో భోజన ప్రియులు సైతం ఇబ్బంది పడుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్, చిరు దుకాణాల్లో రుచికరమైన భోజనాలు ఆరగించే భోజన ప్రియులు మూత బడిన దుకాణాలు చూసి విస్తుపోతున్నారు. వీటిలో పనిచేస్తున్న వారికి ఉపాధి కరువైంది. కొంత మంది చిరు దుకాణ నిర్వాహకులు దిక్కుతోచని పరిస్థితిలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. కొరత లేదంటూనే... వంటలు చేసేందుకు గృహిణులు సైతం అనేక తంటాలు పడుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఇంటిలో గ్యాస్ లేక, గ్యాస్ బుక్ చేస్తే ఏజెన్సీలు పెట్టిన కొర్రీలు వంట చేసే మహిళలకు శాపంగా మారాయి. గ్యాస్ లేక కట్టెల పొయ్యిపై వంటలు చేస్తూ పొగతో నానా తిప్పలు పడుతున్నారు. జిల్లాలో గ్యాస్ కొరత ఇంతలా వేధిస్తుంటే అధికారులు మాత్రం కొరత లేదు అంటూ ప్రకటనలు చేస్తుండటం విడ్డూరంగా ఉంది. అధికారులు చెప్పినట్లు గ్యాస్ కొరత లేకపోతే తాము గ్యాస్ బుక్ చేసుకుప్పటికీ ఎందుకు సకాలంలో రావడం లేదని లబ్ధిదారులు ఘాటు విమర్శలు చేస్తున్నారు. జిల్లా అధికారులు వారి మెప్పు కోసం ఉత్త గ్యాస్ ప్రకటనలే చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో వచ్చి చూస్తే ప్రజలు పడుతున్న గ్యాస్ కష్టాలు వారి కళ్లకు కనిపిస్తాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్పై నెపం.. జిల్లా అధికారులు చేసిన ప్రకటనలు నిజమైతే లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి ఎక్కడా లేదు. దీనికి కారణం గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ను కృతిమ కొరత సృష్టిస్తున్నాయా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ● కొన్ని ప్రాంతాల్లో ఒక్కో గ్యాస్ సిలిండర్ వినియోగదారుడి అవసరాన్ని బట్టి అదనంగా రూ.300 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. ● డొమెస్టిక్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని చెబుతున్నా వినియోగదారులకు మాత్రం సకాలంలో అందడం లేదు. ప్రశ్నిస్తుంటే మా చేతిలో ఏమి లేదని, అంతా జేసీ చేతిలో ఉందని చెప్తూ చేతులు దులుపుకుంటున్నారు. ● దీంతో గ్యాస్ కోసం ఏం చేయాలో తెలియక బహిరంగ మార్కెట్లో అధిక డబ్బులు ఇచ్చి మరీ గ్యాస్ను కొనుకుంటున్నామని కొందరు వాపోతున్నారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదని జేసీ ప్రకటన గ్యాస్ దొరక్క అల్లాడిపోతున్న లబ్ధిదారులు మూతపడుతున్న చిరు దుకాణాలు -
రిటైర్డ్ డీఎంహెచ్ఓకు రూ.56 లక్షలకు టోకరా
● పుడమి తల్లి పూజలో... శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని ఓ రిటైర్డ్ డీఎంహెచ్ఓ సైబర్ మోసానికి గురయ్యారు. కేటుగాళ్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని శనివారం రూ.56.25 లక్షలకు టోకరా వేశారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. పీఎన్ కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ డీఎంహెచ్ఓకు గత ఏడాది డిసెంబర్ 17న ఓ వీడియో కాల్ వచ్చింది. అందులో పోలీస్ గెటప్లో ఉన్న ఓ వ్యక్తి ‘ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం’ అని చెబుతూ మీరు డీఎంహెచ్ఓగా ఉండేటప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడ్డారని, అనేకమంది మహిళలకు సంబంధించి అశ్లీల వీడియోలు, ఇతర ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బెదిరిస్తూ.. మిమ్మల్ని అరెస్టు చేయడం తప్పదని, లేదంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత మొత్తం చెల్లించాలని చెప్పారు. దీంతో బాధితుడు డిసెంబర్ 19న రూ.15.75 లక్షలు, 29న రూ. 21.74 లక్షలు, ఈ ఏడాది జనవరి 5న రూ. 18.75 లక్షలు వారు చెప్పిన ఖాతాల్లోకి ఆన్లైన్ లావాదేవీల ద్వారా పంపించాడు. అప్పటికీ వాళ్లు మరో రూ. 18 లక్షలు అడగడంతో తాను సైబర్ మోసానికి గురయ్యానని గ్రహించాడు. ఆన్లైన్ పోర్టల్ లో సైబర్ క్రైమ్ వెబ్సైట్కు ఫిర్యాదు చేశాడు. గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు వెల్లడించారు. -
మంటగలిసిన మానవత్వం
● చిన్నారులను బయటకు తోసేసిన యజమాని ● ఇంటికి తాళాలు వేసిన వైనం ● అర్ధనగ్నంగా ఆరుబయట చిన్నారులు ఇచ్ఛాపురం రూరల్: యజమాని, కింద పనిచేసేవా రి మధ్య జరిగిన గొడవ ఇచ్ఛాపురం మండలం పాయితారి గ్రామంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం పాయితారి గ్రామానికి చెందిన రైతు లోపింటి వెంకటరమణ వద్ద కోళ్ల మన్మధరావు గత ముప్పై ఏళ్లుగా పనిచేస్తున్నారు. వీరు దగ్గరి బంధువులు కూడా. దీనికి కృతజ్ఞతగా యజమాని వెంకటరమణ మన్మధరావుకు వివాహం కూడా జరిపించారు. పదేళ్ల కిందట తన ఇంటి పక్కనే ఇల్లు కట్టుకునేందుకు కూడా సమ్మతించారు. అయితే బుధవారం మన్మధరావు, వెంకటరమణ కుటుంబాలకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కొట్లాటకు దారి తీసింది. దీంతో ఇరువురు స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కొట్లాటలో గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తన కింద పనిచేసిన వ్యక్తి తిరుగుబాటు చేయడం సహించలేని రైతు వెంకటరమణ అదే రోజు సాయంత్రం ఇంటికి తాళం వేసేశాడని స్థానికులు చెబుతున్నారు. మన్మధరావు కుమారులు నరేష్, శ్రీనులు బడి విడిచిపెట్టిన తర్వాత బుధవా రం మధ్యాహ్నం తమ ఇంటికి చేరుకున్నాక ఇంటికి తాళం వేసి ఉండడం చూసి హతాశులయ్యారు. తగాదాల్లో మీ తల్లిదండ్రులు ఇచ్ఛాపురం ఆస్పత్రిలో ఉన్నారని, మీ ఇంటికి వెంకటరమణ తాళాలు వేసేశాడంటూ చెప్పడంతో చిన్నారులు తమ యజమానిని తాళాలు తీయాలంటూ వేడుకున్నారు. అయినప్పటికీ కనికరించని యజమాని ఇంటి దగ్గర నుంచి వెళ్లిపోవాలంటూ ఆగ్రహించడంతో చిన్నారులు ఆరుబయటే ఉండటం చూసిన స్థానిక సర్పంచ్ వలపల రంజిత చిన్నారులను చేరదీసి రాత్రి తన ఇంట్లో భోజనం పెట్టి నిద్రపుచ్చారు. గురువారం ఉగాది కావడంతో చిన్నారులు తమ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లడంతో ఆగ్రహించిన యజమాని నిర్దాక్షిణ్యంగా చిన్నారులను అర్ధనగ్నంగా బయటకు గెంటేసి తలుపులకు తాళాలు వేసేశాడు. స్థానికులు రూరల్ ఎస్ఐకు సమాచారం అందివ్వగా ఎస్ఐ జనార్ధనరావు ఇంటి తలుపులు తీయించి ఫొటోలు తీసి, ఆరుబయట ఉన్న పిల్లలు పరిస్థితిని చూసీ చూడనట్లు వ్యవహరించి మళ్లీ తాళాలు వేయించేశారని స్థానికులు చెబుతున్నారు. -
కళహండి కట్టప్ప
● ప్రదర్శనల్లో అలరిస్తున్న సునీల్ మహానంద ● నటుడిగా, ఫోక్ డ్యాన్సర్గా, గాయకునిగా రాణింపు ● కేరమ్స్లో నేషనల్ ప్లేయర్గా గుర్తింపు కలహండి కట్టప్ప వేషధారణలో సునీల్ మహానంద కంచిలి: ఉత్తరాంధ్రలో ఎక్కడ జాతర జరిగినా విచిత్ర వేషధారణతో ఓ వ్యక్తి కనిపిస్తాడు. ఆడు తూ, ఆట పట్టిస్తూ హుషారుగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటాడు. భారీ కాయంతో జాతర కు సెంటర్ఆఫ్ అట్రాక్షన్గా మారుతాడు. జనం అతడిని ‘కలహండి కట్టప్ప’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ వేషధారణ హాస్యానికే అయినా.. అతడు జానపద గీతాలను అద్భుతంగా పాడగలడు. అంతకుమించి ఆటను రక్తి కట్టించగలడు. జాతీయ స్థాయి కేరమ్స్ పోటీల్లోనూ రాణించాడు. పుట్టుక ఒడిశాలోని కలహండే అయినా మన తెలుగు వారికి అందులోనూ సిక్కోలు వారికి చిర పరిచితుడు. ఈ కట్టప్ప అసలు పేరు సునీల్ మహానంద. స్వస్థలం ఒడిశా రాష్ట్రం. ఇటీవల రథసప్తమి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అలాగే కంచిలిలో జరిగిన జాతరలో ఈ కలహండి కట్టప్ప తళుక్కున మెరిశాడు. ఓ 20 మందిని వెంటబెట్టుకుని 350 కిలోమీటర్లు ప్రయాణించి కంచిలిలో ప్రదర్శన ఇచ్చాడు. తెలుగు ప్రాంతాల్లో ఎక్కడ జాతర జరిగినా అతడు బండి కట్టి రావాల్సిందే. సునీల్ మహానంద తన గురువు ప్రమోద్కుమార్ నాయక్ వద్ద నాటక రంగంలో శిక్షణ పొందారు. 15 ఏళ్లుగా ఈ వృత్తినే ఎంచుకొని ప్రయా ణం కొనసాగిస్తున్నారు. ఇతడు నటనతోపాటు నేషనల్ ఫోక్ డ్యాన్సర్గాను, గాయకునిగా కూడా రాణిస్తున్నారు. ఇతని స్వగ్రామం కలహండి జిల్లా భవానీపట్నం. కలహండి కట్టప్ప ప్రదర్శనను సంబర మహోత్సవాల్లో స్ట్రీట్ షోలతోపాటు, స్టేజి ప్రదర్శనలు కూడా ఇస్తారు. 20 మంది బృంద సభ్యులతో ఈ ప్రదర్శనలిస్తున్నారు. ఇప్పటి వరకు ఒడిశా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోను, పక్క రాష్ట్రాల్లో ప్రదర్శనలిచ్చారు. సినిమాల్లోనూ రాణింపు సునీల్ మహానంద వీధి ప్రదర్శనలతోపాటు స్టేజి షోలను చేస్తున్నారు. ప్రస్తుతం వీటితోపాటు ఒడి యా సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేశారు. అలాగే షార్ట్స్ ఫిల్మ్లను కూడా చేస్తున్నారు. సమాజానికి అవసరమైన మెసేజ్ ఇచ్చే షార్ట్ ఫిల్మ్లను కూడా తీస్తుంటారు. వీటితోపాటు ‘నృత్యగాన సాంస్కృతిక అనుస్టాన్’ పేరుతో భవానీపట్నంలో ఫోక్ డ్యాన్స్ అకాడమీని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ‘కలహండి కట్టప్ప’ అనే పేరుతో యూట్యూబ్ చానెల్ను కూడా నిర్వహిస్తున్నారు. -
సమష్టి కృషితో జిల్లా అభివృద్ధి
శ్రీకాకుళం కల్చరల్: నూతన సంవత్సరంలో జిల్లా సమగ్ర అభ్యున్నతికి సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో గురువా రం ఘనంగా జరిగాయి. కలెక్టర్, శాసన సభ్యు లు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చెందే విధంగా ప్రణాళికతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పంచాంగం శ్రవణం శ్రీపరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం పురస్కరించుకొని ప్రముఖ పండితులు ధర్మపురి గౌరీశంకరశాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు బాగుంటాయని తెలిపారు. ముగ్గురు అర్చకులకు ఉగాది పురస్కారాలు జిల్లాలో ముగ్గురు అర్చకులకు ఉగాది పుర స్కారాలను అందించారు. నగరంలోని కోదండరామాలయం ప్రధాన అర్చకులు బంకుపల్లి శేషాచార్యులకు, గుజరాతీపేట జగన్నాథ స్వా మి దేవాలయం అర్చకులు పెంట సత్యన్నారాయణ శర్మకు, ఎల్ఎన్పేట జగన్నాథ స్వామి దేవాలయం అర్చకులు వినోద్ కుమార్ స్వామి కి ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. శివ శ్రీ నృత్య కళానికేతన్ గురువు శ్రీకాంత్ రఘుపాత్రుని కళా బృందం ప్రదర్శించిన కూచిపూడి, కోలాటం నృత్యాలు ఆహూతులను అలరించాయి. కవులు ఆలపించిన కవితలు అందరినీ ఆకట్టుకున్నాయి. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి ఇచ్ఛాపురం: పట్టణ పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లుపడ, చిన్నకొండవీధికి చెందిన యువకుడు ఉప్పాడ కుమార్ (23) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు యువకుడు ద్విచక్రవాహనంపై బెల్లుపడ నుంచి పట్టణం వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎల్లమ్మ గుడి సమీపంలో బెల్లుపడ వైపు వేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వస్తున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని వివరాలు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి త్రినాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ ముకుందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం కల్చరల్: గార మండలం శ్రీ కూ ర్మంకి చెందిన అంధవరపు బాలకృష్ణ మూర్తి (88) కన్ను మూయగా ఆయన నేత్రాలను దా నం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు, కొడుకు అంధవరపు బాలకృష్ణమూర్తి, అంధవరపు శ్రీనివాస నెహ్రూలు రెడ్క్రాస్కు తెలియజేశారు. మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, పి.చిన్నికృష్ణల ద్వా రా కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునే వారు 7842699321 కు సంప్రదించాలన్నారు. -
21న అప్పలసూరి వర్ధంతి
నరసన్నపేట: శ్రీకాకుళం నక్సల్బరీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అమరవీరుడు మామిడి అప్పలసూరి అని సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. కోమర్తిలో అమరవీరుల స్థూపం వద్ద 21న కోమర్తిలో 29 వ వర్ధంతి సభ నిర్వహిస్తున్నామని, దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోమర్తిలో గురువారం ఉదయం ఈ మేరకు కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పలసూరి చూపించిన పోరాట మార్గాన్ని అనుసరించి నూతన ప్రజాస్వామిక విప్లవ సాధన కోసం ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపు నిచ్చారు. సమస్యల పరి ష్కారానికి పోరాటమే సరైన మార్గమని అన్నారు. 21న ఉదయం 10 గంటల నుంచి కోమర్తిలో వర్ధంతి సభ నిర్వహిస్తామని పార్టీ కార్యకర్తలు, అప్పలసూరి అభిమానులు, కోమర్తి ప్రజలు అదిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనసెట్టి రాజశేఖర్, ఐఎఫ్టీయూ జిల్లా నాయకురాలు సవలాపురం కృష్ణవేణి, న్యూ డెమొక్రసీ జిల్లా నాయకులు నేతింటి నీలం రాజు, ఏఐకెఎంఎస్ జిల్లా నాయకులు బగ్గు భాస్కరరావు, కోమర్తి కాలనీ వాసులు కొల్లి చిన్నబాబు, పెదలాపు దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
82 సెలవులు
232 పనిదినాలు.. శ్రీకాకుళం న్యూకాలనీ: నూతన విద్యా సంవత్సరానికిగాను జూనియర్ కళాశాలల్లో ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలో సెకెండియర్ విద్యార్థులకు ఆ రోజు నుంచే తరగతులు మొదలు కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటర్మీడియెట్ బోర్డు డైరెక్టర్/సెక్రటరీ పి.రంజిత్భాషా అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఇంట ర్మీడియెట్ కోర్సులను అందిస్తున్న జూనియర్ కళాశాలల్లో ఇటీవలి ఫస్టియర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు సెకెండియర్ తరగతులను ఏప్రిల్ ఒకటి నుంచి మొదలుపెడతా రు. వాస్తవానికి గత ఏడాదికి ముందు వరకు ఏటా జూన్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతుండేవి. గత విద్యా సంవత్సరం నుంచి ఏప్రిల్ ఒకటి నుంచే తరగతుల ను నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. అలాగే ప్రైవేటు కాలేజీలకు పోటీగా ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్ ప్రవేశాలకు అ డ్మిషన్లు మొదలుపెట్టాల ని ఆదేశాలు జారీ చేశారు. నాడు–నేడుతో ప్రభుత్వ కాలేజీలకు కొత్తశోభ.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇప్పటికే అధికారుల ఆదేశానుసారం అడ్మిషన్ డ్రైవ్స్ (క్యాంపెయినింగ్లు) నిర్వహించారు. ిఫిబ్రవరి, మార్చి నెలల్లో కళాశాలలకు సమీప ప్రాంతాల్లో ఉన్న సర్కారీ పాఠశాలల్లో, గ్రామా ల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అడ్మిషన్ డ్రైవ్స్ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలల్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో నాడు–నేడు కార్యక్రమం ద్వారా వసతులు, సౌకర్యాలు, ల్యాబ్లు, డిజిటల్ వి ద్య, ఐఎఫ్పీ ప్యానెల్స్ పెరిగాయి. డొక్కా సీతమ్మ పేరిట మధ్యాహ్న భోజనం అమలుచేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు ఇంటర్ విద్య డైరెక్టర్ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 164 కాలేజీలు ఫంక్షనింగ్.. జిల్లాలో అన్ని యాజమాన్య జూనియర్ కళాశాలలు 164 ఫంక్షనింగ్లో ఉన్నాయి. వీటిల్లో 38 ప్రభుత్వ, 13 మోడల్, 25 కేజీబీవీలు, 9 సోషల్వెల్ఫేర్, ఒక ట్రైబల్, 6 హైస్కూల్ ప్లస్, రెండు కో ఆపరేటివ్, 70 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఫస్టియర్ పరీక్షలు రాసిన 19850 మంది విద్యార్థులు సెకెండియర్ తరగతుల్లో కూర్చోనున్నారు. 82 సెలవులు.. 2026–27 విద్యా సంత్సరానికి సంబంధించి ఇంటర్ కోర్సులను అందిస్తున్న జూనియర్ కళాశాలలు 232 రోజులు పనిచేయనున్నాయి. 2026 ఏప్రిల్ 1న కాలేజీలు మొదలుకానుండగా, వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ ఒకటో తేదీగా ప్రకటించారు. మళ్లీ జూన్ 1వ తేదీన పూర్తిస్థాయిలో కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఆఖరి పనిదినంగా 2027 మార్చి 18గా నిర్ణయించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 18 వరకు మొత్తం 314 రోజులు ఉండగా ఇందులో ఇందులో 232 రోజులు కళాశాలలు పని చేయనున్నాయి. 2026–27 అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు ఏప్రిల్ 1 నుంచి సర్కారు జూనియర్ కళాశాలల్లో తరగతులు ప్రారంభం ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు జూన్ ఒకటి నుంచి కళాశాలలు పునఃప్రారంభం అడ్మిషన్లు పెంచడమే లక్ష్యం ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులు, సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, బ్యాగులతోపాటు మధ్యాహ్న భోజనం కూడా అమలవుతోంది. ఈ ఏడాది అడ్మిషన్లను భారీగా పెంచేందుకు ఇంటర్ విద్య ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని కాలేజీలు అకడమిక్ క్యాలెండర్ను విధిగా పాటించి, అమలుచేయాల్సి ఉంటుంది. – రేగ సురేష్కుమార్, ఇంటర్మీడియెట్ విద్య డీవీఈఓ/ఆర్ఐఓ శ్రీకాకుళం -
‘తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత’
శ్రీకాకుళం కల్చరల్: తెలుగు భాషా పరిరక్షణ అందరి బాధ్యత అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వీసీ డాక్టర్ కేఆర్ రజిని అన్నారు. తెలుగు రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో శుక్రవారం ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన ఉగాది సంబరాలు, పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రజిని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ తెలుగు కవులు, జర్నలిస్టులు, రచయితలు తెలుగు భాషా సాహిత్య సంస్థల ద్వారా తెలుగు భాషను పరిరక్షిస్తున్నారని పేర్కొన్నారు. రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల ప్రచారానికి తెరవే చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. తెరవే సభ్యుడు తోట గోపాలరావు రచించిన తోట వారి కథలు, స్పందన కవితా సంపుటి పుస్తకాలను వైస్ చాన్స్లర్ కేఆర్ రజిని ఆవిష్కరించి పంపిణీ చేశా రు. స్పందన కవితా సంపుటిని డాక్టర్ ముట్నూరు ఉపేంద్ర శర్మ సమీక్షించగా, తోట వారి కథలు పుస్తకాన్ని పీఎస్ నాగరాజు సమీక్షించారు. కవి సమ్మేళనలో కిల్లాన శ్రీనివాస్, భోగిల ఉమామహేశ్వరరావు, ఇద్ది పాపయ్యల నిర్వహణలో 50 మంది కవులు పాల్గొని స్వీయ కవితలను వినిపించారు. భోగిల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఐఎన్డీ ప్రసాద్, ఇద్ది పాపయ్యలు తొలుత ప్రతిస్పందన అనే నాటికను ప్రదర్శించారు. -
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ నుంచి ఉర్లాం రైల్వే స్టేషన్ వెళ్లే మార్గ మధ్యంలో గురువారం రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారని శ్రీకాకుళం రోడ్డు జీఆర్పీ ఎస్ఐ ఎం.మధుసూదన రావు తెలిపారు. రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి శ్రీకాకు ళం సర్వజన ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించామని తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని, సమాచారం తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ కోరారు. బంగారం కొనుగోలులో గందరగోళం కొత్తూరు: ఉగాది నాడు కొత్తూరులో బంగారం కొనుగోలుదారులు గందరగోళానికి గురయ్యారు. ఉగాది నాడు బంగారం కొనుగోలు చేయడం చాలా మందికి సంప్రదాయం. ఉగా ది రోజు ఉదయం ఒక గ్రాము బంగారం ధర రూ.15,800 చూపించింది. సాయంత్రానికి రూ.14,900కు తగ్గింది. అయితే కొత్తూరులోని పలు షాపుల్లో తగ్గిన ధర కాకుండా ఉదయం ధరకే బంగారం విక్రయించారు. కొనుగోలుదారులు తర్వాత విషయం తెలుసుకుని నష్టపోయామని లబోదిబోమన్నారు. ఒకే ఊరిలో ఒక్కో షాపులో వేరు వేరు ధరలతో బంగారం విక్రయాలు జరగడంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గేట్లో ఆల్ ఇండియా 248వ ర్యాంక్ పొందూరు: మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన మొదలవలస రాజ్కుమార్ గేట్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచాడు. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గేట్ ఫలితాలలో ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంక్ 248 పొందాడు. ప్రస్తుతం రాజ్కుమార్ ఐఐటీ ధన్బాద్లో కృత్రిమ మేథస్సు, డేటా సైన్స్ విభాగంలో పరిశోధనలు చేస్తున్నారు. రాజ్కుమార్ తండ్రి మొదలవలస గోవిందరావు మెడికల్ బిజినెస్ చేస్తుంటారు. తల్లి మొదలవలస జయసుధ గృహిణి. గేట్లో 544వ ర్యాంకు సంతబొమ్మాళి: బోరుభద్ర పంచాయతీ గొదలాం గ్రామానికి చెందిన పిలక పవన్కుమార్ గేట్ ఎంట్రన్స్టెస్ట్లో ఆల్ ఇండియాలో 544వ ర్యాంకు సాధించారు. ప్రాథమిక విద్య బోరుభద్రలోని ప్రైవేటు పాఠశాలల్లో, వెన్నెలవలస నవోదయలో ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. ఫిబ్రవరి 8న జరిగిన గేట్ ఎంట్రన్స్ లో ఆల్ ఇండియా ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు రమేష్బాబు, కళావతమ్మ గ్రామస్తులు అభినందించారు. టెక్కలి: కోటబొమ్మాళి మండలం కురుడు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ లఖినేని కిరణ్కుమార్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పశు వైద్యాధికారిగా ఎంపికై గురువారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా అవార్డును అందుకున్నారు. పశువుల పునరుత్పత్తి విభాగంలో 2012 – 2026 వరకు కృత్రిమ గర్భధారణ లక్ష్యాలను పూర్తి చేయడంలో కిరణ్కుమార్ చేసిన సేవలకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాతో పాటు టెక్కలి డివిజన్ పరిధిలో గల పశు సంవర్ధక శాఖ సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేశారు. -
ఈ ఏడాది నీటి కష్టాలు తప్పవా..?
● ఏడాదిగా మరమ్మతులకు నోచుకోని ఆర్వో ప్లాంట్ ● టెక్కలి ఆస్పత్రిలో రోగులకు తప్పని తాగునీటి కష్టాలు టెక్కలి రూరల్: ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ టెక్కలి జిల్లా ఆస్పత్రిలోని ఉన్న ఆర్వో ప్లాంట్ గత ఏడాదిగా పని చేయడం లేదు. ఆస్పత్రికి వస్తున్న రోగులు తాగునీటికి తంటాలు పడు తున్నారు. ఎప్పటికప్పుడు దీనిపై ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ దాన్ని బాగు చేయకపోవడంతో ఈ ఏడాది సైతం నీటి కష్టాలు తప్పేలా లేవని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వేసవిలో ఆర్వో ప్లాంట్ మరమ్మతులకు గురైంది. ఆ ఏడాది ఆస్పత్రికి వచ్చే రోగులు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. నీటి బాటి ల్స్ కోనుగోలు చేసుకుని తాగేవారు. కొంత మంది తమ ఇళ్ల నుంచి నీరు తెచ్చుకునే వారు. అప్పట్లో ‘సాక్షి’లో వచ్చిన వార్తలకు స్పందించి రోగులకు క్యాన్లతో నీటిని ఏర్పాటు చేశారు. అయినప్పటికి పూర్తిస్థాయిలో రోగులకు తాగునీరు అందివ్వలేకపోయారు. ఈ ఏడాది అయినా ఆర్వో ప్లాంట్ మరమ్మతులు చేయించి రోగులకు తాగునీరు అందిస్తారనే ఆశ ఉన్నప్పటికీ.. ఇంత వరకు ఆర్వో ప్లాంట్ మరమ్మతులు చేయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. వేసవిలో సైతం తాగునీటికి తంటాలు తప్పేలా లేవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఆర్వో ప్లాంట్ మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు. -
రౌడీషీటర్ ఘాతుకం.. యువకుడి హత్య
● కత్తిపోట్లకు 19 ఏళ్ల యువకుడు బలి ● మరొకరి పరిస్థితి విషమం ● ఇసుకతోటలో దారుణం ఎంవీపీకాలనీ: నగరంలోని ఇసుకతోట రామాల యం సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాతకక్షల నేపథ్యంలో బొచ్చు వెంకటేష్(19) అనే యువకుడు రౌడీషీటర్ చేతిలో దారుణ హత్యకు గురవగా, బాకీ సంతోష్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో రౌడీషీటర్ పల్లా అనీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడికావడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. నిత్యం రౌడీషీటర్లను పర్యవేక్షిస్తున్నా, తరచూ కౌన్సిలింగ్లు ఇస్తున్నా.. ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. రణస్థలం, పూసపాటిరేగ ప్రాంతాలకు చెందిన బొచ్చు వెంకటేష్, బాకీ సంతోష్ వరుసకు అన్నదమ్ములు. ఉపాధి నిమిత్తం వీరిద్దరూ విశాఖలో ఉంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్లా అనీల్పై ఎంవీపీకాలనీ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. గతంలో ఇతని ఆగడాలు మితిమీరడంతో పోలీసులు నగర బహిష్కరణ కూడా చేశారు. కొంతకాలం రణస్థలంలో ఉన్న అనిల్, ఇటీవల మళ్లీ నగరానికి చేరుకున్నాడు. రణస్థలంలోనే అనీల్కు, వెంకటేష్కు పరిచయాలు ఉన్నాయి. కాగా.. వెంకటేష్ భార్య విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా తగాదాలు నడుస్తున్నాయి. దీనిపై గతంలోనే వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మూడు నెలల కిందట పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినా వీరి మధ్య వివాదం సద్దుమణగలేదు. ఇటీవల మరోసారి గొడవ జరగడంతో ‘చూసుకుందాం రా’ అంటూ వెంకటేష్ సవాల్ విసిరినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం రాత్రి అర్ధరాత్రి సమయంలో ఇసుకతోట రామాలయం వద్ద వెంకటేష్, అనీల్ తర ఫు వాళ్లు తలపడ్డారు. ముందస్తు పథకం ప్రకారం కత్తితో సిద్ధంగా వచ్చిన అనీల్, ఒక్కసారిగా వెంకటేష్, సంతోష్లపై దాడి చేశాడు. బలమైన కత్తిపో ట్లు తగలడంతో వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సంతోష్ తీవ్ర గాయాలపాలవగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నైట్ బీట్ పోలీసులు అక్కడికి చేరుకుని సంతోష్ను వెంటనే కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనలో సుమారు 12 మంది యువకులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ నరసింహమూర్తి గురువారం తెలిపారు. రౌడీషీటర్ అనీల్ వెంకటేష్(ఫైల్) -
వంటలు భేష్
● బయో గ్యాస్.. ● గ్యాస్ కష్టాలను అధిగమిస్తున్న హరేకృష్ణ అక్షయపాత్ర ● రోజుకు 30వేలకు పైగా భోజనాల పంపిణీ ● కేవలం బాయిలర్లతోనే భోజనాల తయారీ బయో గ్యాస్ ద్వారానే వంట.. అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటకాలకు గాను రోజుకు పది సిలిండర్లు అవసం కాగా కేవలం ఐదు సిలెండర్లను వాడుతూ మిగిలినది పునరుత్పాదక ఇంధనాల ద్వారానే వంట చేస్తోంది. ప్రధానంగా మిగిలిపోయిన కూరగాయలు, మిగిలిన భోజనాలు ఈ బయోగ్యాస్ ప్లాంట్లో ఉపయోగించి రోజుకు 15 నుంచి 20 కిలోల గ్యాస్ను ఉత్పత్తి చేస్తోంది. పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించి కేవలం నీటి ఆవిరి ద్వారానే పప్పు, అన్నం, కూరగాయల కు సంబంధించి వంటను తయారు చేస్తోంది. వీటన్నింటికీ బ్రికెట్స్ బాయిలర్ ద్వారా గ్యాస్ ఉత్పత్తి చేస్తూ వంట చేస్తోంది. వీటితో పాటు అదనంగా చెక్కపొడి, కొబ్బరిపీసు, వేరుశనగ పొట్టుతో కలిసి పునరుత్పాదక శక్తి వనరుల ద్వారానే అక్షయపాత్రలోని వంటకాలు నిర్విరామంగా తయారు చేస్తున్నారు. ఈ దిమ్మలను బాయిలర్లో వేడి చేయడం ద్వారా వచ్చే వేడితో వంట చేస్తున్నారు. అలాగే సోలార్ ద్వారా రోజుకు 450 యూనిట్ల కరెంటు ఉత్ప త్తి చేస్తూ వంటశాలకు నిర్వహిస్తున్నారు. పాఠశాలలకు భోజనాలు సరఫరా చేసే వాహనాలను సైతం ఎలక్ట్రికల్ వెహికిల్స్నే వాడుతున్నారు.శ్రీకాకుళం రూరల్: ప్రపంచమంతా సిలిండర్ భారాన్ని మోస్తుంటే హరేకృష్ణ సంస్థకు చెందిన అక్షయ పాత్ర మాత్రం గ్యాస్ కష్టాలు దరి చేరకుండా వండి వారుస్తోంది. కేవలం బాయిలర్లతోనే భోజనాలు తయారు చేస్తోంది. శ్రీకాకుళం మండల పరిధిలోని సింగుపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 312 మంది విద్యార్థుల కోసం అప్పట్లో అక్షయ పాత్ర మొదలుపెట్టారు. నేడు శ్రీకాకుళంతో పాటు, గార, ఆమదావలస పాఠశాలకు సైతం 18వేల మంది విద్యార్థులకు నిత్యం భోజనాలు అందిస్తోంది. వీటితో పాటు హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో 9 అన్న క్యాంటీన్లకు గాను పదివేలు భోజనాలు సైతం ఈ సంస్థే సరఫరా చేస్తోందని సంస్థ పర్యవేక్షకులు తిలారి శ్రీనివాస్ తెలిపారు. -
అసభ్యంగా ప్రవర్తిస్తే గట్టిగా ఎదిరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అమ్మాయిలపై బంధువులు, స్నేహితులు లేదా ప్రయాణాల్లో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, శరీర భాగాలపై అనుచితంగా చేతులు వేసినా భయపడకుండా వెంటనే ఎదురించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి కె.హరిబాబు సూచించారు. నగరంలో ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని ఆర్సీఎం సెయింట్ జాన్స్ స్కూల్లో విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్పై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల భద్రత కోసం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నాల్సా) రూపొందించిన స్నేహ పూర్వక న్యాయ సేవలు వారి రక్షణకు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఆపదలో ఉన్నప్పుడు లేదా వేధింపులకు గురైనప్పుడు విద్యార్థులు వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ 1098, పోలీసు 100 లేదా ఉచిత న్యాయ సేవల నంబర్ 15100కు సమాచారం అందించాలని సూచించారు. పిల్లలు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో న్యాయవాది జి.ఇందిరా ప్రసాద్, సిస్టర్ జ్యోత్స్న, టి.సుమంజలి పాల్గొన్నారు. -
అంగన్వాడీ కార్యకర్తపై దాడి
ఇచ్ఛాపురం రూరల్: వ్యక్తిగత కక్షలు పెంచుకున్న బంధువులు విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తపై కర్రతో దాడి చేసిన ఘటన మండలంలో కలకలం సృష్టించింది. స్థానిక రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాయితారి అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న లోపింటి లక్ష్మీభాయికి, సమీప బంధువులు కోళ్ల మన్మథరావు, తేజేశ్వరి దంపతులకు కాలువ విషయమై వ్యక్తిగత సమస్యతో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కార్యకర్త లక్ష్మీభాయి వద్దకు వెళ్లిన మన్మథరావు దంపతులు వాగ్వాదానికి దిగారు. వీరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో సహనం కోల్పోయిన దంపతులు.. కర్రతో లక్ష్మీభాయి తలపై దాడి చేయడం తీవ్ర రక్తస్రావమైంది. దీంతో స్పందించిన స్థానికులు హుటాహుటిన ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రిలో చేర్పించారు. రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ జనార్థనరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సమగ్ర శిక్ష గత ఏపీసీ శశిభూషణ్ సస్పెన్షన్
శ్రీకాకుళం: శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న సంపత్ రావు శశిభూషణ్ గతంలో సమగ్ర శిక్ష అభియాన్లో ఏపీసీగా పనిచేసినప్పుడు కోర్టు ఉత్తర్వులను అమలు చేయని కారణంగా ఆయన్ని సస్పెండ్ చేయాలని ఆదేశించడంతో దాన్ని అమలు చేస్తూ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. శశి భూషణ్ రావు కంటే ముందు ఏపీసీగా పనిచేసిన జయ ప్రకాష్ జిల్లాలో కేజీబీవీలో సీఆర్పీలుగా పనిచేస్తున్న కొందరిని తొలగించారు. దీనిపై ఆయా సీఆర్టీలు హైకోర్టును ఆశ్రయించారు. ఇది జరిగిన సందర్భంలో జయప్రకాష్కు బదిలీ అవ్వగా శశిభూషన్ ఏపీసీగా బాధ్యతలు స్వీకరించారు. తొలగించిన సీఆర్టీలను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీన్ని శశిభూషణ్ రావు అమలు చేయకుండా ఉండిపోయారు. దీంతో బాధిత సీఆర్పీలు కోర్టు తీర్పును అమలు చేయలేదని మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆగ్రహం చెందిన హైకోర్టు న్యాయమూర్తి సమగ్ర శిక్ష రాష్ట్ర అధికారిని వివరణ కోరారు. దీనిపై ఎస్పీడీగా తాను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ఉత్తర్వులు జారీ చేశానని, జిల్లా స్థాయిలో దాన్ని అమలు చేయలేదని వివరణ ఇచ్చారు. ఈ కారణంగా అప్పటి ఏపీసీ శశిభూషణ్ రావును సస్పెండ్ చేయాలని కోర్టు ఆదేశించడంతో సమగ్ర శిక్ష అధికారులు ప్రస్తుతం శశిభూషణ్ పనిచేస్తున్న ఉన్నత విద్యాశాఖ అధికారులకు విషయాన్ని పొందుపరిచారు. వీటిని పరిశీలించిన ఉన్నత విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేస్తూ రెండు రోజుల కిందట ఉత్తర్వులు వెలువరించారు. అయితే దీన్ని కళాశాల ప్రిన్సిపాల్ పోలి నాయుడు అమలు చేయకుండా తాత్సారం చేశారు. దీనిపై ఎవరు అడిగినా ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయని, ఈ కారణంగానే అమలు చేయలేదని చెబుతూ, సస్పెన్షన్ ఉత్తర్వులను వాట్సాప్లో పంపించడం వల్ల, దాన్ని డిలీట్ చేసేశానని చెబుతూ వచ్చారు. అయితే బుధవారం సాయంత్రం సరికి సస్పెన్షన్ ఉత్తర్వులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. దీనిని అమలు చేయకపోవడంపై దళిత సంఘాలు మండిపడుతూ గురువారం ఆందోళన చేపట్టాలని నిశ్చయించాయి. హైకోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేసి సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్ , కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం
కవిటి: మండలంలోని ఒక పంచాయతీలో మానసిక దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని కవిటి పోలీస్స్టేషన్లో బుధవారం ఎస్ఐ వి.రవివర్మ కేసు నమోదు చేశారు. ఈ కేసును ఇచ్ఛాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.చిన్నంనాయుడు విచారణ చేశారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి స్వాధీనం శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని బైరిగ్రామం, కరజాడ పరిసర ప్రాంతం మడపాం వంతెన ఇసుక ర్యాంప్ వద్ద బుధవారం రెండు కేజీల గంజాయితో బగ్గు నవీన్, అమర్నాయక్ అనే ఇద్దరు వ్యక్తులను శ్రీకాకుళం రూరల్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సివిల్స్ విజేత రాముకు ఎస్పీ ప్రశంసలు శ్రీకాకుళం క్రైమ్: సివిల్స్లో 463వ ర్యాంకు సాధించిన జి.సిగడాం మండలం నడిమివలసకు చెందిన సౌరోతు రామును ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రశంసించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. గ్రామీణ ప్రాంతంలోని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు సివిల్ సర్వీసెస్లో ఉన్నత ర్యాంకు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. రాము సాధించిన ర్యాంకు ఆధారంగా ఐపీఎస్, ఐఏఎస్ సేవల్లో ఎంపికయ్యే అవకాశాలున్నాయన్నారు. భర్తను కోల్పోయినా కృంగిపోకుండా రాము తల్లి కూలి పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తూ కొడుకును ఉన్నతస్థాయికి తీసుకెళ్లడం అభినందనీయమని కొనియాడారు. జిల్లా యువత రామును ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. -
18వ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): భూమి కోసం, ఉపాధి హామీ కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 18వ మహాసభలు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలో సుందరయ్య భవన్లో గోపి అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగరాపు సింహాచలం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 1934లో నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య నిర్మించారని, ఆయన స్ఫూర్తితో జిల్లాలో చౌదరి తేజేశ్వరరావు లాంటి నాయకుల నాయకత్వంలో వెనుక బడిన మన జిల్లా అభివృద్ధికి పేదలకు భూ పంపిణీ చేయాలని ఉద్యమాలు, పోరాటాలు చేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘానికి ఉందన్నారు. ప్రభుత్వం సేకరిస్తున్న భూములు ఎక్కువ భాగం దళితులు, ఇతర పేదల ఆక్రమణలో ఉన్న భూములేనని, గ్రామీణ పేదలకు పని హక్కుగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. వంశధార నిర్వాసితుల హక్కుల కోసం నిర్బంధాలను ఎదురించి సమరశీల పోరాటాలు చేసి నిర్వాసితుల పక్షాన పోరాడిన సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.నవీన్, కె.చింటు, వినాయక్, పి సురేష్, శంకర్, రాకేష్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
● ఎమ్మెల్సీ నర్తు రామారావు ఇచ్ఛాపురం రూరల్: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఎమ్మెల్సీ నర్తు రామారావు మండిపడ్డారు. స్థానిక విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వికృత చేష్టలు ప్రజలను కలచివేశాయని, ఇలాంటి ఘటనలు ప్రభుత్వ పరువు తీసేలా ఉన్నాయని అన్నారు. ఇదే సమయంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ వంటి వ్యక్తులు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండటం కూటమి ప్రభుత్వం నైతిక విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతోందని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కూటమి ఎమ్మెల్యేలు అఘాయిత్యాలకు పాల్పడినా వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో అరాచకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజలకు మంచి పాలన అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు వివాదాలు, అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని, ఎంపీ పుట్టా మహేష్కుమార్ యాదవ్ను వెంటనే పదవుల నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
భర్తకు తలకొరివి పెట్టిన భార్య
కంచిలి: మండలంలోని గోకర్ణపురం కాలనీకి చెందిన బల్ల వైకుంఠరావు(40) అనే వ్యక్తి రెండు కిడ్నీలు పాడై బుధవారం మృతి చెందారు. మృతుడు చైన్నెలో ఉపాధి పొందుతుండేవాడు. సుమారు మూడు నెలల క్రితం వ్యాధిని గుర్తించాడు. అనారోగ్యం ఏర్పడడంతో విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతుండేవాడు. అయితే ఆయన మృతి చెందడంతో చితికి భార్య గౌరి తలకొరివి పెట్టింది. వారి పెద్ద కుమారుడు చరణ్ విజయనగరంలోని బాలాజీ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా మొదటి సంవత్సరం చేస్తున్నాడు. పరీక్షలు రాస్తుండడంతో రావడం కుదరకపోవడం, ఆరో తరగతి చదువుతున్న కుమార్తె హారిక ఇంటి వద్దే ఉన్నప్పటికీ.. తనకు కూడా గుండెలో రంధ్రం ఏర్పడడంతో అనారోగ్యంతో ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితిల్లో మృతుని భార్యే చితికి నిప్పు పెట్టింది. పేద కుటుంబానికి చెందిన యజమాని మృతి చెందడం, మరోవైపు మృతిని కుమార్తె కూడా గుండె జబ్బుతో బాధపడుతుండడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. -
దివ్యాంగులకు అండగా ఉంటాం
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం సందర్భంగా కలెక్టరేట్లో దివ్యాంగ ఉద్యోగులు, ఇతర దివ్యాంగులకు బుధవారం భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగులతో మాట్లాడి అర్హతలు తెలుసుకున్నారు. వారి అర్హతకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి అధికారిని పిలిచి వారు చేయగలిగే ఉద్యోగం ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కు వెళ్లి అందరూ పరిశీలన చేసి, ఏం అవసరమో తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీఏ సూర్యనారాయణ, తహసీల్దార్ గణపతిరావు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ లింగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో 12.70 లక్షల మందికి లబ్ధి
● మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం రూరల్: రాష్ట్రంలో 12.70 లక్షల మంది దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం (ఉచిత బస్సు ప్రయాణం) కింద లబ్ధి చేకూరనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. బుధవారం ఆయన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్లతో కలిసి శ్రీకాకుళంలోని రాగోలు వద్ద దివ్యాంగ శక్తి పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాగోలు నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ బస్సులో దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 175 నియోజకవర్గాల్లో ఉచిత బస్సు సర్వీసును ప్రారంభించినట్లు చెప్పారు. దివ్యాంగులకు ఉన్న శాతాన్ని బట్టి పెన్షన్ను అర్హులందరికీ అందిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. జిల్లాలో 32 వేల మందికి దివ్యాంగుల పెన్షన్ను అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణాశాఖాధికారి సీహెచ్ అప్పలనారాయణ, రాష్ట్ర ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ డైరక్టర్ పీఎంజేబాబు పాల్గొన్నారు. -
హమ్మయ్యా..!
● ముగిసిన ఇంటర్మీడియట్ రెగ్యులర్ కోర్సుల పరీక్షలు ● ఇళ్లబాట పట్టిన విద్యార్థులు ● ఈనెల 21 నుంచి వాల్యూయేషన్ శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. ఇక మూల్యాంకనమే మిగిలి ఉంది. ఈనెల 17వ తేదీతో ఇంటర్ ప్రథమ సంవత్సరం రెగ్యులర్ కోర్సుల పరీక్షలు ముగియగా.. బుధవారంతో ద్వితీయ సంవత్సరం (సీనియర్ ఇంటర్) రెగ్యులర్ కోర్సుల పరీక్షలు ముగిశాయి. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి జిల్లాలో 71 పరీక్ష కేంద్రాల్లో ఫిబ్రవరి 23వ తేదీన మొదలైన ఈ పరీక్షలు ప్రభుత్వ సెలవులు మినహా.. మిగిలిన అన్ని రోజుల్లో 20 రోజులపాటు పరీక్షలు నిర్విరామంగా జరిగాయి. అయితే జిల్లాలో అతి తక్కువ కేంద్రాల్లో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే విద్యార్ధులు రాసే పలు బ్రిడ్జ్ కోర్సుల పేపర్లకు మార్చి 24వ వరకు పరీక్షలు జరగనున్నాయి. 259 మంది గైర్హాజరు ఇదిలా ఉండగా పరీక్షల్లో భాగంగా బుధవారం సెట్–2 ప్రశ్నాపత్రంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కెమిస్ట్రీ పరీక్ష రాశారు. జిల్లావ్యాప్తంగా 71 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు జనరల్ విభాగంలో 15,624 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 15,365 మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 259 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు హాస్టల్స్, వసతి కేంద్రాల్లో ఉంటున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రయాణికులతో కిటకిటలాడింది. మాల్ ప్రాక్టీసు కేసులు నిల్ ఈ ఏడాది ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీసులు నమోదుల(డీబార్లు) కాకపోవడం విశేషం. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఒక్క మాల్ ప్రాక్టీసు కేసు కూడా నమోదు కాకపోడం ఇదే తొలిసారి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 2023లో సీసీ కెమెరాలతో ఆన్లైన్ స్ట్రీమింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానంతో పరీక్ష కేంద్రాలపై అధికారులు పక్కా నిఘా ఉంచారు. నిరంతరం పర్యవేక్షించారు. ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ నేతృత్వంలో డీఈసీ కమిటీ సభ్యులు బి.శ్యామ్సుందర్, ఎస్.భీమేశ్వరరావు, ఎస్.అన్నపూర్ణారావుతోపాటు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు జరిపినప్పటికీ ఎలాంటి మాల్ ప్రాక్టీసులు నమోదు కాలేదు. మూల్యాంకనకు ఏర్పాట్లు కాగా ఈనెల 21వ తేదీ నుంచి శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కేంద్రంగా ఇంటర్మీడియట్ జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియ మొదలుకానుంది. వివిధ విడతలుగా జరగనున్న ఈ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియకుగాను అధికారులు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నారు. ప్రధాన ద్వారంతోపాటు దిద్దుబాటు జరిగే అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలను అమర్చడంతోపాటు ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. వాల్యూయేషన్లో పాల్గొనే అధికారులు, ఎగ్జామినర్లు, సిబ్బంది నియామకం ఉత్తర్వులను ఆయా కాలేజీల లాగిన్లలో ఇంటర్మీడియట్ బోర్డు పొందుపర్చింది. -
ఐఐటీ మద్రాస్తో ఆదర్శ పాఠశాల ఒప్పందం
రణస్థలం: మండలంలోని కొండములగాం ఆదర్శ పాఠశాల విద్యా ప్రమాణాల ఉన్నతీకరణలో భాగంగా ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్తో స్కూల్ కనెక్ట్ అనే ప్రొగ్రాం ద్వారా ఆన్లైన్ కోర్సులను అందించేందుకు ఒప్పందం జరిగిందని ప్రిన్సిపాల్ పొట్నూర్ శ్రీధర్ తెలిపారు. మండలంలోని విద్యార్థులు ఇంటర్లో అడ్మిషన్ తీసుకోవడం ద్వారా ఈ గొప్ప అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పదో తరగతి పరీక్షకు 87 మంది గైర్హాజరు శ్రీకాకుళం: జిల్లాలో బుధవారం జరిగిన పదో తరగతి హిందీ పరీక్షకు 87 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 28,539 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 28,452 మంది పరీక్ష రాశారు. 145 కేంద్రాల్లో పరీక్ష జరగగా, డీఈఓ ఏడు కేంద్రాలను, జిల్లా పరిశీలకులు ఆరు కేంద్రాలను పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 9 కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్ 47 కేంద్రాల్లో తనిఖీలు జరిపాయి. ఇది ఎలా ఉంటే తొమ్మిది కేంద్రాల్లో జరిగిన ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షలకు 82 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 591 మంది విద్యార్థులకు గాను 509 మంది పరీక్ష రాసినట్లు డీఈఓ రవిబాబు చెప్పారు. భూములు ఇచ్చేది లేదుటెక్కలి: పోర్టు ఆధారిత పరిశ్రమలకు తమ భూములు ఇచ్చేది లేదంటూ టెక్కలి మండలం పాతనౌపడ గ్రామంలో రైతులు, గ్రామస్తులు బుధవారం రాత్రి నిరసన తెలిపారు. ‘రైతుల భూము లు కార్పొరేట్లకు కట్టబెట్టవద్దు, పోర్టు ఆధారిత పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదు, ప్రాణాలైనా అర్పిస్తాం–భూములను కాపాడుకుంటాం’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అప్పలరెడ్డి, సర్పంచ్ ప్రతినిధి డి.లోకేశ్వర్రెడ్డి, రామా రావు, యోగితో పాటు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పంచాంగ శ్రవణం
పోలాకి: మండలంలోని మబగాంలో పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రాబోయే మార్పు లు, వాతావరణం, రాజకీయ, సామాజిక అంశాలపై శృంగవరపు లక్ష్మీధనుంజయశర్మ పంచాగ పఠనంలో స్పష్టంగా తెలియజేశారని కృష్ణదాస్ అన్నారు. స్వగ్రామంలో తోటి రైతులు, గ్రామస్తులతో కలిసి పంచాంగ శ్రవణంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అభిమానులు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. -
పోర్టు సభ విజయవంతం చేయండి
● వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ సంతబొమ్మాళి: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండే ళ్లు కావస్తున్నా మూలపేట పోర్టు నిర్మాణం మొద టి దశ కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహి స్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 30న నౌపడలో నిర్వహించనున్న సభను విజయవంతం చేయాల ని వైఎస్సార్ సీపీ టెక్కలి ఇన్చార్జి పేరాడ తిలక్ కోరారు. మండలంలోని నౌపడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఈ ప్రాంత చిరకాల స్వప్నమైన మూలపేట పోర్టును 75శాతం పూర్తి చేసినా, కూటమి ప్రభుత్వం మిగిలిన పనులు చే యకుండా కాలక్షేపం చేస్తుందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి విఽఘాతకులుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు మిగిలిపోయారని దుయ్యబట్టా రు. మూలపేట పోర్టుపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అన్ని విభాగాల నాయకులు ఈ నెల 30న మూలపేట పోర్టు పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఈ పర్యటనలో వాస్తవ పరిస్థితి తెలుసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి, ప్రజల తరఫున పోరాటం చేసే బాధ్యతను తీసుకుంటామని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మూలపేట పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి ల్యాండ్ ఎంక్విజేషన్ చేసి నిర్వాసితులకు అనువైన పునరావాస కాలనీకి భూములు కేటాయించారని, పోర్టు రోడ్ నిర్మాణం తదితర పనులు 75 శాతం పూర్తి చేశా రని వివరించారు. కూటమి ప్రభుత్వం కనీసం నిర్వాసిత కాలనీలో కనీస వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. టీడీపీ నాయకులకు ప్రత్యేక ప్యాకేజీ, యూత్ ప్యాకేజీ ఇచ్చి వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు సామాన్య ప్రజలకు, రైతులకు, పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రోడ్డుకు ఇరువైపులా భూములు తీసుకుంటున్నారనే ప్రచారంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ మండల పార్టీ అఽధ్యక్షుడు బి.మోహనరెడ్డి, నాయకులు పి.రవికుమార్ రెడ్డి, నక్క భీమారావు, సత్తారు సత్యం, తదితరులు ఉన్నారు. -
ప్రమోషన్ ఫైల్పై విచారణకు కలెక్టర్ ఆదేశాలు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని 154 హెల్త్ అసిస్టెంట్ల (ఏఎన్ఎంలు) ప్రమోషన్లకు సంబంధించి ఫైల్పై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇద్దరు అధికారులను విచారణకు ఆదేశించారు. ఏడాదిన్నర కాలంగా తమకు రావాల్సిన గ్రేడ్–2 ప్రమోషన్లు నిర్దాక్షిణ్యంగా ఆపేశారంటూ జిల్లాలో వివిధ పీహెచ్సీల్లో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్లు సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలో ఉన్న డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని ముట్టడించిన సంగతి విధితమే. రాత్రి కార్యాలయంలోనే నిద్రించి తిరిగి మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు తమ నిరసనను వీరు కొనసాగించారు. విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, పాలకొండ ఆర్డీవో స్వప్నిల్ పవార్ జగన్నాథం, జెడ్పీసీఈఓ సత్యనారాయణను తక్షణమే సంబంధిత కార్యాలయానికి వెళ్లి సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని ఆదేశాలిచ్చారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు డీఎంహెచ్ఓ చాంబర్లోకి వెళ్లి సంబంధిత ఫైల్ పూర్వాపరాలు పరిశీలించారు. ప్రమోషన్లు ఆగడానికి ఎస్టీ కమిషన్ విచారణే కారణమని డీఎంహెచ్ఓ అనిత సోమవారం చెప్పారు. 154 మంది ఉన్న ప్రమోషన్ లిస్టులో తమ ఎస్టీ రిజర్వేషన్ ప్రాతిపదికన 9 పోస్టులు రావాల్సి ఉండగా నాలుగే కేటాయించారని ఎస్టీ కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి వారికి గతంలోనే 412 శాంక్షన్ పోస్టుల్లో 24 కేటాయించాల్సి ఉన్నా 29 కేటాయించడంతోనే 5 పోస్టులు అదనంగా అప్పట్లోనే ఇచ్చేయడంతోనే ఇప్పుడు తగ్గించినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఢిల్లీ ఎస్టీ కమిషన్ సైతం మీ జిల్లాలోనే ఈ అంశం తేల్చుకోవాలని చెప్పినట్లు సమాచారం. -
శ్రీకాకుళంలో ఇఫ్తార్ విందు నేడు
శ్రీకాకుళం కల్చరల్: రంజాన్ పండుగను పురస్కరించుకుని బుధవారం నగరంలో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ రోడ్డులోని శశి కన్వెన్షన్ హాల్ (జూడియో బిల్డింగ్ 4వ అంతస్తు)లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విందు కార్యక్రమానికి జిల్లాలోని ముస్లిం మత పెద్దలు, సోదరులందరూ విచ్చేయాలని ఆయన కోరారు. ఆర్హెచ్పురంలో అక్రమంగా గ్రావెల్ తరలింపు సంతబొమ్మాళి: మండలం ఆర్హెచ్పురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 191లో ఎలాంటి అనుమతులు లేకపోయినా అధికార పార్టీ నాయకులు అక్రమంగా గ్రావెల్ను తరలించుకుపోతున్నారు. ఈ తతంగమంతా కొన్ని నెలలుగా జరుగుతున్నా రెవె న్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. జేసీబీ సాయంతో కొండను తవ్వి ట్రాక్టర్ల సాయంతో తరలించుకుని వెళ్లిపోతున్నారు. రోజుకు సుమారు 100లోడులు వరకు తరలించి దూరాన్ని బట్టి రూ.700 నుంచి రూ.1500లు వరకు ట్రాక్టర్ గ్రావెల్ను అమ్ముకుంటున్నారు. ఈ గ్రావెల్ను లేఅవుట్లకు, రోడ్లకు వినియోగిస్తున్నారు. దీనిపై రెవె న్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని స్థానిక సర్పంచ్ ఎన్ని మన్మధరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై వీఆర్వో శంకర్ను అడుగగా గతంలో గ్రావెల్ ను తరలిస్తుంటే అడ్డుకున్నామని, ఇప్పుడు తరలిస్తున్నట్లు తెలియదని అన్నారు. పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని అన్నారు. కూర్మ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు హిరమండలం: వైదిక గ్రామం కూర్మలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. 26న యువకులకు ఆధ్యాత్మిక ప్రవచనం, 27న శ్రీరామనవమి వేడుకలు, 28,29 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. భక్తి వికాస స్వామి ముఖ్య అతిథిగా రానున్నా రని చెప్పారు. మూడు రోజుల పాటు ఆధ్యాత్మి క ప్రవచనం ఇస్తారని తెలిపారు. అన్నదానం కూడా ఉంటుందన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఇతర వివరాలకు 7732075607 నంబరును సంప్రదించాలని కోరారు. సివిల్స్ విజేతకు కలెక్టర్ సత్కారం శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ బడిలో చదివి, పేదరికాన్ని జయించి సివిల్స్లో 463వ ర్యాంక్ సాధించి సత్తా చాటిన సౌరోతు రాము ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో కలసి ఘనంగా సత్కరించారు. ఈ అపురూప ఘట్టానికి రాము తల్లి లక్ష్మి కూడా సాక్షిగా నిలిచారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కలిసి రాముకు శాలుశా కప్పి, పుష్ప గుచ్ఛం, విలువైన పుస్తకాలను బహూకరించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తండ్రిని కోల్పోయినా కుంగిపోకుండా ఎన్ఐటీ వరంగల్లో చదివి, నేడు సివిల్స్లో ర్యాంకు సాధించడం సామాన్యమైన విషయం కాదని కొనియాడారు. రాము సాధించిన ర్యాంకుకు ఐపీఎస్ వస్తుందని భావిస్తున్నానని, ఐఏఎస్ కూడా వచ్చే అవకాశం ఉందని, ఏ విభాగంలో సేవలందించినా జిల్లాకు గర్వకారణమని ఆకాంక్షించారు. కలెక్టర్ పెద్దమనసు.. సత్కార కార్యక్రమం ముగిసిన అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. రాము తల్లిని గౌరవిస్తూ, ఆ తల్లీకొడుకులను స్వయంగా కలెక్టర్ కార్యాలయం కింద వరకు తోడ్కొని వెళ్లి, మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారు. -
శ్రీకాకుళం
కల్తీ కాటేస్తుందికల్తీ సరుకులు పెరిగిపోతున్నాయి. నూనెలను సైతం వదలడం లేదు. –8లోదాడులు హేయం టీటీడీ ఛైర్మన్ను తొలగించండి ● వైఎస్సార్సీపీ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు దారుణం ● టీడీపీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య ● నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026పాలన ఘోరంశ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని చంద్రబాబుకి నిరంతరం భజన చేస్తూ, అబద్దాలనే నిత్యం ప్రచారం చేసే టీవీ చానెల్ యజమాని బీఆ ర్ నాయుడుకు అప్పగించడం దారుణమని వైఎస్సా ర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు బయటపడిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం మానవహారం చేసి నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఆర్ నాయుడు వీడియోలు వైరల్ అయ్యాక వైఎస్సార్సీపీ నాయకులు తిరుపతిలో శాంతియుతంగా చేపట్టిన ర్యాలీ ని పోలీసులు అడ్డుకుని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం దారుణమని అన్నారు. శిల్పారామంలో బీఆర్ నాయుడు ఉన్న ఓ హోటల్ వద్ద నిరసన చేయడం తప్పా అని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేసి అక్రమ కేసులు బనాయించి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలుచేయడం దారుణమన్నారు. ఇదేనా సూపర్ సిక్స్ బీఆర్ నాయుడు అనైతికంగా ప్రవర్తించి దాడులు చేయించడం, అక్రమ అరెస్టులు చేయడం హేయ మైన చర్యగా భావిస్తున్నామని వైఎస్సార్సీపీ డాక్ట ర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. అబద్దాలు చెప్పడం, సమర్థించడం చంద్రబాబునాయుడుకి, బీఆర్నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్ అంటే ఖాదర్భాషా, ఆదిమూలం, నజీర్, కిరణ్రాయల్, అరవల, బీఆర్నాయుడుల వీడియోలేనా అని ఎద్దేవా చేశారు. ఇలాంటి అనైతిక చర్యలు చేస్తున్నా వారికి వెనకేసుకుని రావడమే కూటమి నాయకుల లక్ష్యమన్నారు. ప్రజలు కూటమికి అధికారం ఇచ్చింది కక్షలు సాధించుకోడానికి కాదని హితవు పలికారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, వైఎస్సార్ సీపీ టెక్కలి, ఆమదాలవలస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల సమన్వయకర్తలు పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఎంవీ పద్మావతి, తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, వెలమ కుల రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, నియోజకవర్గాల పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, కరిమి రాజేశ్వరరావు, పిన్నింటి సాయి, కేవీజీ సత్యనారాయణ, పిల్లల రామకృష్ణ, చల్ల శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, ధర్మాన రామ్మనోహర్నాయుడు, తమ్మినేని చిరంజీవినాగ్ (నాని), పొన్నాడ రుషి, ముంజేటి కృష్ణమూర్తి, చింతాడ వరుణ్, గేదెల పురుషోత్తం, మార్పు పృథ్వీ, ఎంఏ రఫీ, ముత్తా విజయ్కుమార్, రౌతు శంకరరావు, మండవిల్లి రవి, ఎం.ఏ రఫీ, ఖండాపు గోవిందరావు, గుమ్మడి రాంబాబు, సనపల నారాయణరావు, యజ్జల గురుమూర్తి, గంట్యాడ రమేష్, రాజాపు అప్పన్న, తంగుడు నాగేశ్వరరావు, సీపాన మహేంద్ర, పి.సుగుణారెడ్డి, టి.కామేశ్వరి, అంధవరపు సురేష్లతో పాటు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు భారీగా పాల్గొన్నారు. -
గొట్టా బ్యారేజీ దిగ్బంధం
● అన్నదాతల మెరుపు ఆందోళన హిరమండలం: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారింది. గొట్టా బ్యారేజీ వద్ద మంగళవారం రాత్రి రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. గొట్టా బ్యారేజీలో రబీ పంటలకు నీరు స్థిరీకరణ లేకపోవడంతో పాటు ఉన్ననీటిని వృథాగా దిగువ సముద్రంలోకి విడిచిపెట్టడంతో నిరసనకు దిగారు. ఈ ఏడాది మోంథా తుఫానుతో వంశధారకు గట్లు, కరకట్టలు దెబ్బతిన్నాయి. వాటిని బలోపేతం చేసేందుకు గాను బ్యారేజీలో ఉన్న నీటి ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దిగువకు విడిచిపెట్టారు. ఈ విషయంపై ప్రత్యేక ప్రకటన చేయలేదు. ఇది తెలియని దిగువన ఉన్న రైతులు రబీలో భాగంగా వివిధ పంటలు వేసుకున్నారు. బ్యారేజీలో నీటి స్టోరేజీ తగ్గుముఖం పడుతోంది. దిగువకు నీటిని వృథాగా విడిచిపెట్టడంతో వంశధార నదీ తీర గ్రామాల రైతులంతా మంగళవారం రాత్రి ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ముందే ప్రకటించి ఉంటే తాము సాగుచేసేవారం కాదని, తీరా పెట్టుబడులు పెట్టాక సాగునీరు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వందలాది మంది రైతులు గొట్టా బ్యారేజీపై ఆందోళనకు దిగడంతో అటు పాతపట్నం, ఇటు శ్రీముఖలింగం, హిరమండలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి మాట్లాడగా.. వంశధార సిబ్బంది ఈ ఒక్క రోజుకు నీటిని దిగువకు వెళ్లకుండా నిలుపుదల చేస్తామని రైతులకు తెలిపారు. తర్వాతి రోజుకు మాత్రం కలెక్టర్, వంశధార ఎస్ఈ నుంచి ఆర్డర్ తె చ్చుకోవాలని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. -
కృత్రిమ మేధ.. వికృత నీడ
● మన గడపలోకే.. మార్ఫింగ్.. ఎక్కడో ఎవరివో ఫొటోలు మార్ఫింగ్ చేశారంటే నోరెళ్లబెట్టి చూసేవాళ్లం. ఇప్పుడు ఆ వికృత క్రీడ మన గడప వరకు పాకింది. మన బడులు, కాలేజీలకూ ఈ జాడ్యం వచ్చేసింది. అందివచ్చిన సాంకేతికతను కొందరు ఇలా తప్పుడు పనులకు వినియోగించడంతో మన అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో పోస్టులు, వాట్సాప్ స్టేటస్లు, సరదాగా తీసుకున్న ఫొటోలు సైతం ఇప్పుడు భయపెడుతున్నాయి. ఏఐ సహకారంతో జరుగుతున్న ఈ దురాగతానికి మన ఏమరపాటే అదనుగా మారుతోంది. టెక్కలి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పక్కదారి పడుతోంది. ఒక వ్యక్తి ఫొటో, వీడియోను ఉపయోగించి ఇష్టానుసారంగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఒకప్పుడు సెలబ్రిటీల ఫొటోలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాల్లో పోస్టు చేసేవారు. ఇప్పుడు విద్యాలయాలకు ఆ వికృత సంస్కృతి పాకింది. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్తో పాటు బహిరంగ ప్రదేశాల్లో జరిగిన కార్యక్రమాల్లో వీడియాలు, ఫొటోలను సేకరించి వాటితో వికృతమైన చేష్టలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అవగాహన కలిగిన వ్యక్తులు ధైర్యంగా ఫిర్యాదు చేసి నిందితుల్ని సైబర్ పోలీసులకు పట్టిస్తున్నారు. మరి కొంత మంది వీటి బారిన పడినప్పటికీ బయటకు చెప్పుకోలేక తల్లడిల్లిపోతున్నారు. కఠిన శిక్షలు ● ఏఐతో కొంత మంది దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వాటిలో మార్ఫింగ్, వాయిస్ క్లోనింగ్, రాజకీయ కుట్రలు తదితర చేష్టలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్కు పాల్పడడంతో పాటు ఇతర డిజిటల్ దుర్వినియోగానికి కఠినతరమైన శిక్షలను అమలు చేశారు. ● ఏఐ ద్వారా వ్యక్తిగతంగా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్కు పాల్పడితే సెక్షన్ 67,67ఏ ప్రకారం 5 ఏళ్లు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ● ఏఐను వినియోగించి మరో వ్యక్తి మాదిరిగా ఫొటోలు, వీడియోలు సృష్టిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. ● మరొకరి సంతకాన్ని డిజిటల్ సంతకంగా మార్చి ఉపయోగిస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. ● వీటితో పాటు ఫేక్ న్యూస్ సృష్టించడం, వాయిస్లు సృష్టించడం, నకిలీ ఎలక్ట్రానిక్ రికార్డులు సృష్టించడం, మరొకరి గౌరవాన్ని భంగం కలిగించడం వంటి దుర్వినియోగానికి ఐటీ చట్టం 2000 ప్రకారం 66డి, 67 , బీఎన్ఎస్ కింద కఠినతరమైన శిక్షలు పడే అవకాశం ఉంది. అత్యవసర సమయాల్లో 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మార్ఫింగ్ కీచకులతో తస్మాత్ జాగ్రత్త బహిరంగ ప్రదేశాల్లో తీసిన వీడియోలు, ఫొటోలతో మార్ఫింగ్ వీడియోలు ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) సహకారంతో దురాగతాలు విద్యాలయాలకు పాకిన వికృత చేష్టలు కచ్చితంగా దొరికిపోతారు అరకొర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న వారి వల్లనే ఏఐ దుర్వినియోగంగా మారుతోంది. వీడియోలు, ఫొటోలు మార్ఫింగ్కు పాల్పడితే కచ్చితంగా పట్టుబడతారు. ఏఐ టూల్స్ వినియోగంలో కొన్ని రకాల చెడు ప్రభావం లేకుండా మార్పులు చేయాలి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదులు చేయాలి. – కె.నిహారిక, సీఎస్ఈ, (ఆర్టిఫిషియల్, మెషిన్ లెర్నింగ్) ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల , టెక్కలి డేటా షేర్ కాకుండా చూసుకోవాలి సోషల్ మీడియాల్లో వ్యక్తిగతమైన డేటా షేర్ కాకుండా చూ సుకోవాలి. ముఖ్యంగా మహి ళలు, విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో ఫొటోలు, వీడియోలు విషయంగా భద్రత పాటించాలి. – ఎస్.చిరంజీవి, సీఎస్ఈ, ఏఐఎంఎల్ మార్ఫింగ్ జరిగితే ఆందోళన వద్దు ఏఐ ద్వారా డీప్ ఫేక్ మార్ఫింగ్ జరిగితే ఆందోళన చెందకూడదు. దీనికి సంబంధించి రక్షణ కోసం సైబర్ విభాగాలు ఉన్నాయి. వారికి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో ఆ వీడియోలు, ఫొటోలను తొలగిస్తారు. ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యంగా ఉండాలి. – ప్రియాంకపాడి, సీఎస్ఈ, ఏఐఎంఎల్ -
ఎమ్మెల్యే అశోక్ తీరుపై ఆగ్రహం
కంచిలి: ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తీరుపై ఆదివాసీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు పురేంద్ర సవర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని నువాగడ గ్రామంలో స్థానిక సర్పంచ్ సబితా గొమాంగో ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నకిలీ బెంతో ఒడియా వారికి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ఎమ్మెల్యే చేసిన కృషి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రం మొత్తం ఆదివాసీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు రోడ్డు ఎక్కే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఆ ఉద్యమం తీవ్రంగా ఉంటుందని, దానికి బాధ్యులు ఎమ్మెల్యే అవుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఋషి సవర, డొంబురు, లక్ష్మణ, స్వప్న, కళావతి తదితరులు పాల్గొన్నారు. -
వాటర్ ట్యాంకర్ ప్రారంభం
శ్రీకాకుళం: ఆమదాలవలస పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో దానేటి శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన వాటర్ ట్యాంకర్ను ఎమ్మెల్యే కూన రవికుమార్, వైద్యుడు దానేటి శ్రీధర్తో కలిసి ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా డాక్టర్ దానేటి శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చి ట్యాంకర్ను అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో తమ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. వేసవికాలంలో పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యను కొంతవరకై నా తగ్గించేందుకు ఈ ట్యాంకర్ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తమ్మినేని గీతాసాగర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ కూన వెంకట రాజ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి తదితరులు పాల్గొన్నారు. -
శానిటరీ ఇన్స్పెక్టర్ను విధుల్లోకి తీసుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): శ్రీకాకుళం నగరపాలక సంస్థలో అధికారులు తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు, మేసీ్త్రలు మంగళవారం ఉదయం 5 గంటల నుంచి విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ – ఎంప్లాయీస్ ఫెడరేషన్(సీఐటీయూ) శ్రీకాకుళం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ఒక ప్రాంతంలో డయేరియా ప్రబలితే శానిటేషన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన ఎన్.శరత్ని బాధ్యులుగా చేస్తూ విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరుద్యోగులపై అక్రమ తొలగింపు సరికాదని, దీనిపై జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చొరవచేసుకుని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. విధుల్లోకి తీసుకోకుంటే పోరాటాలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, అధ్యక్షుడు ఎ.గణేష్, డి.యుగంధర్, ఎం.రాఘవ, ఎ.శంకర్, ఎ.మోహన్, డి.చిట్టిబాబు, ఎ.జ్యోతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం తాగి కుర్చీలు ధ్వంసం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని ఆర్ష, సాహిత్య, ఆధ్యాత్మిక సేవా సంస్థ ఉపనిషన్మందిరం ఏర్పడి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 19వ తేదీ నుంచి వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు గుమ్మా నగేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కరపత్రాలు ఆవిష్కరించారు. పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది సందర్భంగా సాయంత్రం 6 గంటలకు కోదండ రామాలయంలో ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త తెన్నేటి విక్రమ్ శర్మచే పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రముఖ పండితులు రామాయణంలోని వివిధ ఘట్టాలను వివరిస్తూ ప్రసంగించనున్నారని తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామ దర్బార్ నిర్వహిస్తున్నామని, కవి పండితులు ఆరోజు శ్రీరాముల వారిని కీర్తిస్తూ పద్య, గద్య భక్తి గీతాలు ఆలపించనున్నారని పేర్కొన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి శ్రీమద్రామాయణ ప్రసంగాలు నిర్వహిస్తున్నామని ఆధ్యాత్మిక ప్రియులు, సాహితీవేత్తలు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మందిరం ప్రతినిధులు పి.పతంజలి శాస్త్రి, నిష్టల నరసింహమూర్తి, కామేశ్వరరావు, డీజీ పట్నాయక్, తెన్నేటి విక్రమ్ శర్మ, జంధ్యాల శరత్ బాబు, బాపయ్య పంతులు, ఈశ్వర సుబ్రహ్మణ్య శర్మ, రంగుడు ప్రసాదరావు, గుహానంద్ పాల్గొన్నారు. -
ఆశలు ఆవరి..!
దారుణం ● రబీ పంటకు సాగునీటి కష్టాలు ● నీరు నిలుపుదల చేసిన అధికారులు ● ఆందోళనలో అన్నదాత సారవకోట: పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు నిలుపుదల చేయడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బద్రి రెవెన్యూ పరిధిలో ఈ ఏడాది రబీలో వంశధార ఎడమ కాలువ కింద 600 ఎకరాల్లో 300 మంది రైతులు వరిపంట సాగు చేస్తున్నారు. అయితే మరో 20 రోజుల్లో పంట చేతికొచ్చే అవకాశం ఉన్న సమయంలో వంశధార అధికారులు నీరు నిలుపుదల చేశారని మంగళవారం రైతులు ఆరోపించారు. ఒక్కో ఎకరా సాగు చేసేందుకు ఇప్పటివరకు రూ.30 వేలు ఖర్చు పెట్టామని, కానీ వంశధార అధికారులు హిరమండలం గొట్టా బ్యారేజీ దగ్గర నుంచి సాగునీరు కాలువ ద్వారా రాకుండా నిలుపుదల చేయడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. అదే జరిగితే తాము ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తీవ్రంగా నష్టపోతాం నాకున్న 7 ఎకరాలు రబీలో వరిసాగు చేస్తున్నాను. ఏకరాకు రూ.30 వేలు చొప్పున ఇప్పటివరకు ఖర్చు చేశాం. పంట చేతికొచ్చే సమయంలో వంశధార అధికారులు ఇప్పుడు నీరు నిలుపుదల చేస్తే పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతాం. – మెండ సూర్యనారాయణ, బద్రి, సారవకోట మండలం ఆర్థిక ఇబ్బందులు తప్పవు నాకున్న పొలంతో పాటు కౌలుకు తీసుకుని 12 ఎకరాలు రబీలో సాగు చేస్తున్నాను. పంట పొట్ట దశకు వచ్చింది. వచ్చే నెల మొదటి వారం నాటికి చేతికొచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో వంశధార అధికారులు నీరు నిలుపుదల చేస్తే మా పంటలన్నీ ఎండిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. – యాళ్ల రమణయ్య, బద్రి, సారవకోట మండలం పనులు చేయించాలి ఆరుతడి పంటలు వేసుకోవాలని, రబీలో వరి వేయవద్దని గత డిసెంబర్లో ఆయకట్టు రైతులకు చెప్పడం జరిగింది. రూ.16 కోట్ల అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. ఆ పనులు ఈ ఏడాది మేలోగా చేయించాలి. అందుకే కాలువ ద్వారా నీటిని మంగళవారం నుంచి నిలుపుదల చేశాం. – శిమ్మ శ్రీనివాసరావు, డీఈఈ, వంశధార -
కమీషన్ల కక్కుర్తి.. నిలిచిన గిరిజన ప్రగతి..!
● పాతపట్నంలో ముందుకు సాగని అభివృద్ధి పనులు ● కీలక నేతకు ముందుగానే కమీషన్లు చెల్లింపు ● బిల్లుల జాప్యంతో నిలిచిపోయిన పనులు ● అవస్థలు పడుతున్న గిరిజనులు హిరమండలం: పాతపట్నం నియోజకవర్గంలో గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మెళియాపుట్టి, కొత్తూరు మండలాల్లో అత్యధికంగా గిరిజనులు నివసిస్తున్నారు. హిరమండలం, ఎల్ఎన్పేట, పాతపట్నం మండలాల్లో సైతం గిరిజన గ్రామాలున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో రహదారులతో పాటు మౌలిక వసతులకు సంబంధించి పనులు ముందుకు సాగడం లేదు. రోడ్లను చదును చేసి.. మట్టి, గ్రావెల్ వేసి వదిలేశారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడం, ముందుగానే కీలక ప్రజాప్రతినిధికి 7 శాతం కమీషన్లు ముట్టజెప్పాల్సి రావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముందుగానే కమీషన్లు.. 2024 సంవత్సరంలో పాతపట్నం నియోజకవర్గానికి మంజూరైన పనులకు సంబంధించి కాంట్రాక్ట్లు కొందరి చేతుల్లో ఉన్నాయి. వీరంతా ముందుగానే ఒక కీలక నేతకు కమీషన్లు సమర్పించుకుంటున్నట్లు సమాచారం. దీంతో వారికి పనులు ప్రారంభించేందుకు అనుమతులిచ్చారు. వారు కంకర, మట్టితో చదును చేసి కొంతవరకు పనులు పూర్తి చేశారు. అనంతరం బిల్లులు పెట్టుకున్నారు. అయితే బిల్లుల్లో జాప్యం జరగడంతో కాంట్రాక్టర్లు ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, ఆమదాలవలస, పాతపట్నం నియోజకవర్గాలకు 268 పనులు అప్పట్లో మంజూరయ్యాయి. వాటిలో 123 పనులు పాతపట్నం నియోజకవర్గానికే కేటాయించారు. మొత్తం రూ.109.7 కోట్లకుగాను.. రూ.57.49 కోట్లు పాతపట్నంకే కేటాయింపులు చేశారు. కానీ కమీషన్ల పర్వం, ఆపై బిల్లుల్లో జాప్యంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పూర్తయినవి 14 పనులే... పల్లె పండుగ పనుల విషయంలో సైతం పాతపట్నం నియోజకవర్గం వెనుకబడి ఉంది. ఒక్క ఎల్ఎన్పేట మండలానికి మినహాయించి మిగతా పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తూరు మండలాలకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో 91 పనులు మంజూరయ్యాయి. అయితే అందులో పూర్తయినవి 14 పనులు మాత్రమే. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పల్లె పండుగ 2.0 కింద పనులు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పనుల మంజూరు కోసం పాతపట్నం నుంచి 1, హిరమండలం నుంచి 21, ఎల్ఎన్పేట నుంచి 10 ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 11 అసలు ప్రారంభించలేదు. 21 వివిధ దశల్లో ఉన్నాయి. అసలు కొత్తూరు, మెళియాపుట్టిల నుంచి ప్రతిపాదనలే రాలేదని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం పల్లెపండుగ–1లో పనులకే ఇంతవరకూ మోక్షం లేకపోవడమే. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఇంతవరకూ గిరిజన గ్రామాలకు సరైన రోడ్లు వేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు పల్లెపండుగ పనుల్లో కమీషన్ల పర్వంపై అధికార పార్టీలోనే చర్చ జరుగుతోంది. దీనిపై అధిష్టానానికి కొందరు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది. -
కల్తీ కాటేస్తుంది..!
● జాగ్రత్త...● జిల్లాలో యథేచ్ఛగా వంటనూనెల కల్తీ ● నెయ్యిని సైతం వదలని వైనం ● చోద్యం చూస్తున్న యంత్రాంగం హిరమండలం: ఇప్పుడు ఏ నోట విన్నా కల్తీ అన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా వంట నూనె, నెయ్యి కల్తీ జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన కాకినాడ సమీపంలో 870 కిలోల కల్తీ నెయ్యిని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదంతా శ్రీకాకుళం జిల్లాలోని ఒక వ్యాపారికి తరలిస్తున్నట్లు పట్టుబడినవారు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. అయితే జిల్లాలో వంట నూనె, నెయ్యిలో కల్తీ జరుగుతోందన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. కాకినాడలో దీని మూలాలు తేలడంతో అనుమానాలకు బలం చేకూరింది. సరిహద్దు ప్రాంతాల్లో.. జిల్లాలో ఒడిశా సరిహద్దు ప్రాంతాలు అధికం. అటువంటి చోట రెండు రాష్ట్రాల బ్రాండ్లు పేరిట కల్తీని చలామణి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒడిశా వారికి ఏపీ ఉత్పత్తులుగా.. ఏపీలో ఒడిశా ఉత్పత్తులుగా చూపుతున్నారు. ధర తక్కువగా ఉండడంతో జనాలు నమ్ముతున్నారు. కల్తీ నూనెను కొనుగోలు చేసి చేజేతులా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. జిల్లాలో కొంతమంది వ్యాపారులు, దళారులు వంటనూనెను యథేచ్ఛగా కల్తీ చేస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. జిల్లాలో ఎక్కువగా సన్ ఫ్లవర్, పామాయిల్, రైస్బ్రాన్, వేరుశనగ నూనెను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అన్నిరకాలు కలిపి నెలకు దాదాపు 1,700 టన్నుల నూనె విక్రయిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతినెలా సుమారు రూ.15 కోట్ల నూనె వ్యాపారం జరుగుతుంటుంది. చిన్న, మధ్యతరహా హోటళ్లు, రెస్టారెంట్లలో ఎక్కువగా పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్నే వినియోగిస్తుంటారు. మిగిలిన వాటి కంటే తక్కువ ధరకు లభిస్తుండడంతో వీటివైపే మొగ్గుచూపిస్తుంటారు. అయితే వంటనూనెను సైతం కల్తీ చేస్తున్నారు. రకరకాల రసాయనాలు కలుపుతున్నారు. రంగు పోకుండా ఉండేందుకు మోతాదుకు మించి రసాయనాలు, నిషేధ పదార్థాలను వినియోగిస్తున్నారు. అటువంటి నూనె వాడడం వల్ల ప్రాణాంతాక వ్యాధులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిబ్బంది లేక ఇబ్బంది జిల్లాలో వేల టన్నుల వంటనూనె, వేల కిలోల నెయ్యి విక్రయాలు జరుగుతున్నాయి. వందల కొద్దీ వ్యాపారులు ఉన్నారు. కానీ ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ అధికారులు మాత్రం ముగ్గురే ఉన్నారు. జిల్లా ఆహార భద్రతా అధికారి ఒకరు ఉండగా.. డివిజన్–1, డివిజన్–2 పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. డివిజన్–1 పరిధిలో శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట న్యాయస్థానాల పరిధిలో తనిఖీ చేయాలి. డివిజన్–2లో ఎచ్చెర్ల, పొందూరు, శ్రీకాకుళం, పలాస, సోంపేట కోర్టుల పరిధిలో తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఒక్క శ్రీకాకుళం నగరంలో చిన్నపాటి హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్టుఫుడ్ కేంద్రాలు 500 వరకూ ఉన్నాయి. 30 మండలాల్లో ఆ సంఖ్య 5 వేల వరకూ ఉండొచ్చని ఒక అంచనా. కానీ వీరందరి వద్ద కల్తీ జరగకుండా నియంత్రించే బాధ్యతలో ముగ్గురు అధికారులు ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఫలితంగా ఎక్కడా సక్రమంగా తనిఖీలు జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. నెయ్యిలో ఇలా.. జిల్లాలో నెయ్యి సైతం కల్తీ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. సాధారణంగా నెయ్యిని రెండు రకాలుగా ఉత్పత్తి చేస్తారు. ఇళ్లలో పెరుగు చిలికి వెన్నను తీస్తారు. దానిని మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు. ఇది 10 నెలలు అయినా నిల్వ ఉంటుంది. అలాగే యంత్రంలో పాలుపోసి మరిగించడం ద్వారా వెన్నను తీయడం రెండో పద్ధతి. దీని నాణ్యత నెల రోజుల తర్వాత తగ్గిపోతుంది. జిల్లాలో రెండో రకం నెయ్యి ఉత్పత్తి, విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో వనస్పతి, పామాయిల్ కలిపేసి ఎక్కువ మంది కల్తీ చేస్తున్నారు. జిల్లాలో నెలకు 50 వేల లీటర్ల నెయ్యి విక్రయాలు జరుగుతాయని గణాంకాలు చెబుతున్నాయి. రకం, నాణ్యత బట్టి కిలో నెయ్యి రూ.350ల నుంచి రూ.1,000ల వరకూ విక్రయిస్తుంటారు. తీవ్ర అనారోగ్యం కల్తీ నూనె, నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలు తింటే అనారోగ్యానికి గురవుతారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తాయి. శ్వాసకోస సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. మలబద్ధకం, ఒళ్లునొప్పులు, గుండెపోటు, పక్షవాతం వంటి రుగ్మతలు వస్తాయి. జీర్ణ వ్యవస్థ గాడి తప్పుతుంది. అందుకే ఆరోగ్యం పాడుచేసుకోవడం కంటే ముందే మేల్కోవడం ఉత్తమం. – పి.సాయికుమార్ వైద్యాధికారి, పీహెచ్సీ, హిరమండలం ఫిర్యాదు చేయాలి ఆహార పదార్థాల కల్తీ జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి. జిల్లాలో ఇద్దరు ఇన్స్పెక్టర్ల పరిధిలో తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. లేకుంటే 93984 67652 నంబర్ను సంప్రదించవచ్చు. తనిఖీలో కల్తీ అని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం. – సీహెచ్ లక్ష్మీనారాయణ, ఆహార భద్రతా అధికారి, శ్రీకాకుళం -
ముందే డబ్బు కట్టు..
లేదంటే కరెంట్ కట్! హిరమండలం: కరెంట్ కావాలంటే ఇక నుంచి ముందుగానే డబ్బులు కట్టుకోవాలి. అలా చేసుకుంటేనే ఇంటిలో బల్బులు వెలుగుతాయి. లేదంటే చీకటే. ప్రస్తుతం కరెంటు బిల్లు కట్టేందుకు కొన్ని రోజులు గడువు ఉంది. అది దాటినా అపరాధ రుసుంతో కలిసి కట్టేయవచ్చు. కానీ ఇంటి బయట స్మార్ట్ మీటర్ వచ్చి గోడకు వాలిందంటే.. ఆ సదుపాయాలన్నీ ఆగిపోతాయి. సెల్ఫోన్, డీటీహెచ్ మాదిరిగా వినియోగించిన మేర ముందుగానే రీచార్జ్ చేసుకోవాలి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా స్మార్ట్మీటర్ల అమరిక ప్రారంభమైంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో అన్నిరకాల విద్యుత్ కనెక్షన్లు 8 లక్షల వరకూ ఉన్నాయి. ఇందులో వ్యవసాయ పంపుసెట్లకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అయితే విద్యుత్ వృథాను నియంత్రించేందుకు స్మార్ట్మీటర్లు అమర్చుతున్నట్టు కేంద్ర ప్రభు త్వం చెబుతోంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభు త్వం ఉచిత విద్యుత్ అందించే వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు అమర్చుతామంటే కూటమి వ్యతిరేకించింది. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం గృహ వినియోగదారులకు సైతం స్మార్ట్ మీటర్లు బిగిస్తోంది. దీనిపై ప్రజలతో పాటు ప్రజాసంఘాల నుంచి వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గలేదు. అయితే గృహ వినియోగానికి సంబంధించి స్మార్ట్ మీటర్లు బిగించుకునేందుకు ప్రజలు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా అమర్చాలని నిర్ణయించింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో 62,866 సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చినట్టు తెలుస్తోంది. ఇలా చేస్తారు.. స్మార్ట్ మీటర్లుగా పిలిచే ప్రీ పెయిడ్ మీటర్లు ప్రతినెలా రీచార్జ్ చేస్తేనే విద్యుత్ సరఫరా అవుతుంది. 12 నెలల విద్యుత్ బిల్లులను పరిగణనలోకి తీసుకొని విద్యుత్ వినియోగంపై ఒక అంచనాకు వస్తారు. అందుకు అనుగుణంగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడు రోజులు ముందుగానే రీచార్జీకి సంబంధించి వినియోగదారుడికి అలెర్ట్ మెసేజ్ వస్తుంది. అంతకు ముందు రీచార్జీ విలువ? ఎంత విద్యుత్ వినియోగించారు? ఇంకా ఎంత రీ చార్జ్ చేయాల్సి ఉంటుంది? అనేది ఆ మెసేజ్లో స్పష్టంగా పొందుపరచి ఉంటుంది. తద్వారా తదుపరి నెలలో విద్యుత్ వినియోగంపై ఒక అవగాహన వస్తుంది. ఒక వేళ రీచార్జీ చేయడం ఆలస్యమైతే మాత్రం ఆటోమేటిక్గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ రీచార్జీ చేసుకున్న తర్వాతే సరఫరాను పునరుద్ధరిస్తారు. ఇందు కోసం స్మార్ట్మీటర్ల కంపెనీ ఒక కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటుచేసి తమ సిబ్బందితో మానటరింగ్ చేస్తుంటుంది. ప్రజల్లో భయాందోళనలు.. స్మార్ట్ మీటర్లపై ప్రజల్లో ఒకరకమైన భయాందోళనలు ఉన్నాయి. ఇదే కూటమి గతంలో స్మార్ట్ మీటర్లపై పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించాల ని చెబుతుండడంతో ప్రజలు అనుమానిస్తున్నారు. అందుకే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. విద్యుత్ వృథాను అరికట్టేందుకేనని చెబు తున్నా ఎవరూ నమ్మడం లేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల సర్వీసులకు సంబంధించి స్మార్ట్ మీటర్లను అమర్చాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో అన్నిరకాల ప్రభు త్వ కార్యాలయాలు సుమారుగా 15 వేలు ఉన్నాయి. ఇప్పటికే సగానికిపైగా కార్యాలయాలకు అమర్చారు. 32 శాఖలకు సంబంధించి కార్యాలయాలకు, గ్రామ పంచాయతీలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు స్మార్ట్ మీటర్ల అమరిక వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న ఆలోచనలో ఉన్నారు. జిల్లాలో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు రీచార్జి చేసుకుంటేనే విద్యుత్ బలవంతం కాదంటూనే బిగింపులు ఏప్రిల్ 1 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో.. -
డీఎంహెచ్ఓ కార్యాలయ ముట్టడి
● తమ ప్రమోషన్లు నిర్దాక్షిణ్యంగా ఆపేశారని హెల్త్ అసిస్టెంట్ల ఆవేదన శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని సోమవారం రాత్రి హెల్త్ అసిస్టెంట్లు ముట్టడించారు. చీకటి ముసురుకున్నా వారు అక్కడి నుంచి కదలకపోవడం గమనార్హం. గ్రేడ్–3 గా ఉన్న తమను గ్రేడ్–2కు పదోన్నతి కల్పించడంలో జిల్లా అధికారులు, నేతలు విఫలమయ్యారని, తమ ప్రమోషన్లను నిర్దాక్షిణ్యంగా ఆపేశారని జిల్లాలో వివిధ పీహెచ్సీల్లో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్లు ఆందోళన నిర్వహించారు. ఇదీ అసలు కథ2019 అక్టోబరులో రెగ్యులర్ ప్రాతిపదికన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రిక్రూట్ అయిన 154 మంది హెల్త్ అసిస్టెంట్లు గ్రేడ్–3 ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబరులో అన్ని జిల్లాల్లో ఉన్న హెల్త్ అసిస్టెంట్లను గ్రేడ్–2 ఉద్యోగులుగా ప్రమోషన్ కల్పిస్తూ జీఓ విడుదల చేసింది. అన్ని జిల్లాల్లోను 2024 నవంబరులో ఈ ప్రక్రియ జరిగినా మన జిల్లాలో ఉన్న 154 మంది రోస్టర్ ఫైల్ సక్రమంగా సిద్ధం చేసినా అధికారులు ప్రమోషన్ కల్పించడంలో విఫలమయ్యారు. నవంబరు 30న వెబ్ కౌన్సిలింగ్ పేరిట పిలిపించి లిస్ట్ మొత్తం సిద్ధం చేసిన అధికారులు డిసెంబరు 1కి ప్రమోషన్ లిస్ట్ ఆగిపోయిందని చెప్పడంతో అవాక్కయ్యామని, ఆ రోజు నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ బాధ వినలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముట్టడి జరిగేటప్పుడు తమను తొక్కుకుంటూ ఏఓ, సూపరింటెండెంట్లు వెళ్లారని, కార్యాలయంలోపలే ఉన్న డీఎంహెచ్ఓను కలిసి ప్రమోషన్ల విషయం ప్రస్తావించామన్నారు. ఏఓ, సూపరింటెండెంట్లు సంతకాలు పెట్టేస్తే తాను కూడా పెట్టేస్తానని డీఎంహెచ్ఓ చెప్పారని, ఆ తర్వాత ఏఓ, సూపరింటెండెంట్లకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. పోలీసుల సాయంతో.. డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని ముట్టడించారన్న విషయం తెలుసుకున్న రెండో పట్టణ ఎస్ఐలు మధు, లక్ష్మిలు తమ సిబ్బందితో చేరుకున్నారు. ముందుగా హెల్త్ అసిస్టెంట్ల వద్ద విషయం తెలుసుకుని కార్యాలయంలోపలికి వెళ్లి డీఎంహెచ్ఓ అనితను కలిసి మాట్లాడారు. పోలీసుల సాయంతో డీఎంహెచ్ఓ బయటకు వచ్చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ కేంద్రంగా ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేయడం వల్ల ఫైల్ కదల్లేదని, ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఐదుగురితో కమిటీ వేసి రోస్టర్ ఫైల్ సక్రమంగానే ఉన్నట్లు నిర్ధారించుకుని ఆ నివేదికను ఢిల్లీ ఎస్టీ కమిషన్ వద్దకు వెళ్లి నివేదించారని వివరించారు. తర్వాతి ఉత్తర్వులు వచ్చే వరకు వేచి చూస్తున్నట్లు తెలిపారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస వంటి సుదూర ప్రాంతాల నుంచి సైతం హెల్త్ అసిస్టెంట్లు రావడం, వారంతా అర్ధరాత్రి దాటినా అక్కడే ఉండిపోవడం గమనార్హం. -
శ్రీకాకుళం
ప్రాణం తీసిన అతివేగంఅతివేగం ప్రాణం తీసింది. వరిసాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. –IIలో● సజావుగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026● తొలిరోజు ● పుట్టెడు దుఃఖంలో పరీక్షకు హాజరై.. మెళియాపుట్టి: తండ్రి తనని శాశ్వతంగా విడిచిపెట్టి రెండురోజులే అయింది. విషాదం నుంచి ఆ కుటుంబం కోలుకోలేదు. ఆ దుఖంలోనే విద్యార్థిని పదో తరగతి పరీక్షలకు హాజరైంది. మెళియాపుట్టి మండలం పెద్ద లక్ష్మీపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ చైన్నెలో వలస కూలీగా పనిచేస్తూ.. ఈ నెల 14న కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు. ఈయన కుమార్తె భూమిక పదో తరగతి చదువుతోంది. తండ్రి పోయిన దుఖంలోనే పరీక్ష రాయడానికి సిద్ధమైంది. గ్రామస్తులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, భూమికకు ధైర్యం చెప్పారు. శోకాన్ని దిగమింగి మొదటి పరీక్షకు చాపర హైస్కూల్కు హాజరైంది. పరీక్షా కేంద్రాలు -
26న ‘తపాలా అదాలత్’
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు ‘తపాలా అదాలత్’ను నిర్వహించనున్నట్లు తపాలాశాఖ సూపరింటెండెంట్ వి.హరిబాబు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరింత మెరుగైన తపాలా సేవలు అందించడంలో భాగంగా ఈ నెల 26వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సూపరింటెండెంట్ కార్యాలయం, రెల్ల వీధి, ఎస్.ఎస్.ఆర్ డిగ్రీ, పీజీ కాలేజ్ దగ్గర గల తపాలా కార్యాలయంలో సూపరింటెండెంట్తో తపాలా అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తపాలా సేవలకు సంబంధించిన ప్రత్యేక, వ్యక్తిగత ఫిర్యాదులు ఈ అదాలత్లో చర్చిస్తామని, శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు ఈనెల 25వ తేదీ లోగా ‘తపాలా అదాలత్ ‘అనే శీర్షికతో వి.హరిబాబు, సూపరింటెండెంట్ ఆఫ్ ఆఫీసెస్ శ్రీకాకుళం, పోస్టల్ డివిజన్– శ్రీకాకుళం–532001 అనే చిరునామాకు పంపాలని కోరారు. ఫిర్యా దులు గడువు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తు లు స్వీకరించబోమని, ఫిర్యాదులు వ్యక్తిగతంగా కూడా తీసుకొని అదాలత్కు హాజరు కావచ్చునని, ఆర్థిక అవకతవకలు సంబంధించిన విషయాలపై ఫిర్యాదులు తీసుకోబోమని తెలిపారు. మాల్ఖానా భద్రత ఏర్పాట్ల పరిశీలన శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను ఒకే చోట అత్యంత భద్రంగా నిల్వ చేసేందుకు ఏర్పాటు చేస్తున్న మాల్ ఖానాను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, అదనపు ఎస్పీ శ్రీనివాసరావుతో కలసి సోమవారం సందర్శించారు. నగరంలో ని వంశధార పాత క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక ప్రత్యేక కేంద్రాన్ని శనివారం వారిద్దరూ స్వయంగా భవనం లోపల, బయట కలియతిరిగి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అజాగ్రత్తకు తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. బిల్డింగ్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఎస్ఐ పి.నరసింహమూర్తికి భద్రత విషయంలో పలు కీలక సూచనలు చేశారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను నిల్వ చేసిన పద్ధతిపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ మురళీమోహన్, ఆర్ అండ్ బి అధికారులైన డీఈ ధనంజయ్, ఈఈ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. వాహన చోరీలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ శ్రీకాకుళం క్రైమ్ : వాహన చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా పెట్టామని, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను పెట్టి ద్విచక్రవాహనాలను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామన్నారు. గత ఏడాదిలో ద్విచక్రవాహన చోరీలకు సంబంధించి 103 కేసులు, ఈ ఏడాది 11 కేసులు కట్టి మొత్తంగా 76 కేసులు ఛేదించామన్నారు. వాహన చోరీలకు సంబంధించి సమీప పోలీ స్స్టేషన్లోనే కాక వాట్సాప్ ద్వారా సమాచారం అందజేయవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. చోరీకి గురైన వాహనాల పూర్తి వివరాలు, యజమాని వివరాలు, వాహనం పార్కింగ్ ప్రదేశం, తదితర సమాచారం కింది నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపితే తక్షణం స్పందిస్తామన్నారు. ఎస్పీ 6309990800, అదనపు ఎస్పీ (క్రైమ్) 6309990803, పోలీస్ కంట్రోల్ రూమ్ 6309990933ను సంప్రదించాలన్నారు. 18న జిల్లా సమీక్ష కమిటీ సమావేశం శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 18వ తేదీన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10:00 గంటలకు జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని, సభ్యులు హాజరుకావాలని ఆయన కోరారు. -
● అమరజీవికి ఘన నివాళి
అమర జీవి పొట్టి శ్రీరాములుకు వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నరసన్నపేటలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు నిస్వార్థ దేశ భక్తుడని కొనియాడారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చరిత్రను కొత్త తరానికి తెలియజేయాలన్నారు. – శ్రీకాకుళం (పీఎన్ కాలనీ) -
చెక్..!
సర్వైకల్ క్యాన్సర్కు ● 14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్పీవీ టీకా ● జిల్లాలో 14,036 మంది గుర్తింపు ● మందకొడిగా వ్యాక్సినేషన్ నరసన్నపేట: ప్రపంచాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద అనారోగ్య భూతం క్యాన్సర్. క్యాన్సర్ అనేది మహిళలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తూ వారికి పెద్ద శాపంగా మారింది. అందులో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ఒకటి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వలన వస్తుంది. ఈ వైరస్ను నివారించడానికి హెచ్పీవీ అనే టీకాను తయారు చేశారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను పూర్తిగా నివారించవచ్చు. హెచ్పీవీ వ్యాక్సిన్ కేవలం సర్వైకల్ క్యాన్సర్ను మాత్రమే కాకుండా.. వైజనల్ క్యాన్సర్తో పాటు మరో మూడు క్యాన్సర్లను కూడా నివారిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. 14–15 ఏళ్ల బాలికలను ఉచితంగా ఈ టీకాను అందించేందుకు కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్యాన్సర్కు కారణమయ్యే హెచ్పీవీ టైప్ 16, 18తో పాటు టైప్ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని ఆరోగ్య శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఒక డోస్ వ్యాక్సిన్ అందించడం వల్ల బాలికలకు సంబంధిత వైరస్ నుంచి దీర్ఘకాలిక రక్షణ కల్పించబడుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 14,036 మందిని టీకాకు అర్హులుగా గుర్తించారు. ఇప్పటికే జిల్లాలో ఈ టీకా పంపిణీ ప్రారంభం కాగా.. మూడు రోజుల నుంచి పీహెచ్సీల పరిధిలో కూడా వ్యాక్సినేషన్ జరుగుతోంది. కాగా ఈ వ్యాక్సిన్పై ఎటువంటి అపపోహలు, భయాలు పెట్టుకోవద్దని, 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలకు ఈ టీకాను తప్పనిసరిగా వేయించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ హెచ్పీవీ వ్యాక్సిన్ 14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించింది. దీంట్లో భాగంగా 14–15 ఏళ్ల బాలికలకు గుర్తించారు. అయితే వ్యాక్సినేషన్పై బాలికలు, వారి తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అర్హలైన బాలికలను గుర్తించినా వారు ముందుకు వచ్చేందుకు నిరాశక్తత చూపుతున్నారు. దీనికి కారణం సరైన పద్ధతిలో అవగాహన కల్పించకపోవడమేనని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం 9 వ తరగతి చదువుతూ ఉన్న బాలికలను గుర్తించి టీకా వేస్తున్నారు. నరసన్నపేట మండలంలో ఉన్న మాకివలస, ఉర్లాం పీహెచ్సీల్లో ఇప్పటివరకు 34 మంది బాలికలకు వ్యాక్సినేషన్ చేశారు. సద్వినియోగం చేసుకోవాలి మాకివలస పీహెచ్సీలో 290 మందిని గుర్తించాం. రెండు రోజుల్లో 24 మందికి వ్యాక్సినేషన్ వేశాం. ఈ మేరకు బాలికలకు పూర్తిగా అవగాహన కలిగిస్తున్నాం. ఏప్రిల్ నుంచి బాలికల్లో మరింతగా అవగాహన పెరగవ చ్చు. 14–15 ఏళ్ల బాలికలు అపోహలకు పోకుండా ఈ వ్యాక్సినేషన్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. – విజయకుమార్, వైద్యాధికారి, మాకివలస టీకా వేయించుకోవాలి హెచ్పీవీ వ్యాక్సినేషన్తో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పూర్తిగా నివారించవచ్చు. 14–15 ఏళ్లలోపు బాలికలకు మాత్రమే ప్రస్తుతం ఈ టీకా వేయడం జరుగుతుంది. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. ఆయా వయసు కలిగిన బాలికలు ముందుకు రావాలి. అలాగే వారి తల్లిదండ్రులు కూడా బాలికలకు ప్రోత్సహించాలి. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్సీల్లో ఈ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతోంది. అలాగే వైద్య శాఖ సిబ్బంది గ్రామాల్లో బాలికలు, తల్లిదండ్రులకు అవగాహన కలిగిస్తున్నారు. – తాడేల శ్రీకాంత్, డిప్యూటీ డీఎంహెచ్వో టీకా కొత్తదేమీ కాదు 2008 నుంచే ఈ టీకా అందుబాటులో ఉంది. సీ్త్రల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఉపయోగిస్తున్న హెచ్పీవీ టీకాను కొత్తగా ప్రవేశపెట్టారని, ఇది ఎలా పనిచేస్తుందో అనే కొత్త భయం బాలికల తల్లిదండ్రుల్లో నెలకొంది. అయితే ఈ టీకా కొత్తగా ప్రవేశపెట్టింది కాదనే విషయం చాలా మందికి తెలియదు. 2008 నుంచే ఈ టీకా అందుబా టులో ఉంది. పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ టీకా రూ.15 వేలు చెల్లించి మహిళలు వేయించుకుంటున్నారు. అయితే గర్భాశయ క్యాన్సర్ అవగాహన ఉన్నవారు, డబ్బున్న వారే హెచ్పీవీ టీకాను వేయించుకుంటున్నారు. ఇప్పుడు ఉచితంగా అందుబాటులోనికి వచ్చింది. -
వేదన తీర్చండి..!
● గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని సర్పంచ్ విన్నపం ● సొంత నిధులు రూ.3 లక్షలు ఇస్తానని ఆఫర్ ● నీటి సదుపాయం కూడా కల్పిస్తానని హామీరైలు కిందపడి వ్యక్తి మృతి పాతపట్నం: పాతపట్నం రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రహారాజపాలేం గ్రామ బ్రెడ్స్ కార్యాలయం ఎదురుగా ప్రమాదవశాత్తు గుణుపూర్–పూరీ రైలు కిందపడి ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా సింగపూర్ గ్రామానికి చెందిన బిభిషాణ్ మిషాల్ (29) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం ఉదయం గుణుపూర్ నుంచి పూరీ వెళ్తున్న రైలు ప్రహరాజపాలేం సమీపంలోని బ్రెడ్స్ కార్యాలయం ఎదురుగా వచ్చేసరికి, బిభిషాణ్ మిషాల్ దురదృష్టావశాత్తు రైలుకింద పడిపోయాడు. దీంతో రైల్వే సిబ్బంది పలాస జీఆర్పీ పోలీసులకు తెలియజేశారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్దనున్న ఓటర్ కార్డు ఆధారంగా ఒడిశాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశామని జీఆర్పీ ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. ఆవేదనతో ఆఫర్ ఐదు సంవత్సరాలు సర్పంచ్గా పని చేసిన సమయంలో ఈ నాలుగు రోడ్లు బాగు చేయించలేకపోయాను. ఎక్కువ నిధులతో కూడుకున్న పనులు కాబట్టి నేను చేయడానికి అవకాశం లేదు. రోడ్లు బాగు చేయాలని పలువురు పాలకులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. దీంతో తీవ్రంగా ఆవేదన చెంది అధికారులకు ఈ ఆఫర్ ఇవ్వడం జరిగింది. – బోర సింహాద్రి నాయుడు, సర్పంచ్, గురండి గ్రామం నిర్లక్ష్యం తగదు పాలకులు, అధికారులు గురండి గ్రామంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామానికి వచ్చిన నాలుగు రోడ్లు బాగులేకపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్లు బాగు చేయాలి. – ఎ.రాఘవ, గురండి గ్రామం వర్షం కురిస్తే నడవలేని పరిస్థితి వర్షం కురిసినట్లయితే నేరడి నుంచి గురండికి వెళ్లే రోడ్డు, దాశరథీపురం నుంచి గురండి వెళ్లే రోడ్లు బురదమయం అవుతున్నాయి. రోడ్డ మీద గోతులు ఉన్నందున నడవ లేని దుస్థితి నెలకొంది. కనీసం వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నాం. ఇంతవరకు మట్టి రోడ్లుతో ఉన్నాయి.. కనీసం గ్రావెల్ రోడ్లుగా మార్చకపోవడం దారుణం. – ముంజేటి వెంకటరమణ, గురండి గ్రామం కొత్తూరు:ప్రస్తుత కాలంలో చిన్నపని చేయాలన్నా.. నిధులు లేవని సాకులు చెప్పే నాయకులు ఎక్కువ. కానీ మండలంలోని గురండి గ్రామ పంచాయతీ సర్పంచ్ బోర సింహాద్రి నాయుడు మాత్రం అందుకు భిన్నం. గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన చలించిపోయాడు. దీంతో తమ గ్రామానికి రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొస్తే తాను కూడా రూ.3 లక్షలు సాయం అందజేస్తానని అధికారులకు తెలిపాడు. ఇదీ విషయం.. విద్యావంతుడైన బోర సింహాద్రి నాయుడు పంచాయతీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో 2021లో సర్పంచ్గా పోటీచేసి విజయం సాధించాడు. అనంతరం పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టాలని సంకల్పించాడు. అయితే గ్రామానికి వచ్చే నేరడి– గురండి, దాశరాథిపురం–గురండి, కలిగాం రోడ్డు నుంచి గ్రామ సచివాలయం రోడ్డు, కలిగాం రోడ్డు కూడలి నుంచి గురండి రోడ్లను నిర్మించడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యహరించారు. సుమారు దశాబ్ధ కాలంగా ఈ రోడ్లు బాగు చేయకపోవడంతో పూర్తిగా పాడైపోయాయి. వర్షాలు కురిస్తే బురదమయం అయ్యేవి. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు సర్పంచ్ వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో మరో 17 రోజుల్లో తన పదవీ కాలం పూర్తవ్వనున్న నేపథ్యంలో అధికారులకు రోడ్డు నిర్మాణంపై మరోసారి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోడ్డు పనులు చేపడితే తన సొంత నిధులు రూ.3 లక్షలు అందజేస్తానని తెలిపారు. దీంతో పాటు సొంత ట్యాంకర్లతో ఉచితంగా నీటి సరఫరా చేయడం జరుగుతుందని ప్రకటించారు. అయితే ఈ పనులను తన పదవీ కాలం పూర్తయ్యేలోగా చేపట్టాలని కండీషన్ పెట్టారు. కానీ ఇంతవరకు అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హంఉండ్రుకుడియా గెడ్డలో వ్యక్తి మృతి వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని ఉండ్రికుడియా గ్రామంలో అర్అండ్బీ కల్వర్టు పక్కనే ఉన్న గెడ్డలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గెడ్డలో ఒక మృతదేహం సోమవారం స్థానికులకు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి పలాస మండలంలోని లొత్తూరు పంచాయతీ చినపరియా గ్రామానికి చెందిన సవర భాస్కరరావు(36)గా గుర్తించారు. మృతుడు తన భార్య సవర భారతి, ఇద్దరు పిల్లలలో కలిసి కాశీబుగ్గలోని ఒక అద్దె ఇంట్లో నివాసముంటూ స్థానిక జీడి పరిశ్రమలో పని చేస్తున్నాడు. అయితే ఈ నెల 14వ తేదీన మధ్యాహ్న సమయంలో భాస్కరరావు తన మామయ్య ఆరోగ్యం బాగులేదని తెలిసి తన ద్విచక్ర వాహనంపై లొత్తూరు వెళ్లాడు. అనంతరం రాత్రి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఉండ్రికుడియా కల్వర్టు వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంతో పాటు పడిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ఇంటికి చేరకపోవడంతో భార్య తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ భాస్కరరావు అచూకీ లభ్యం కాకపోవడంతో, ఇంటికి వస్తాడులే అనుకున్న తరుణంలో మరణవార్త తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు మృతదేహంతో పాటు ద్విచక్ర వాహనాన్ని పైకి తీసి శవపంచనామ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. కాగా భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు హెచ్సీ వైకుంఠరావు తెలిపారు. -
పని ఒత్తిడితో ఉద్యోగి మృత్యువాత?
● ఆలస్యంగా వెలుగులోకి... శ్రీకాకుళం: జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పని చేస్తున్న కిషోర్ కుమార్ అనే యువకుడు పని ఒత్తిడితో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఈ సంఘటన జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం సెలవు అయినప్పటికీ పన్నుల వసూళ్లు, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పని ఉండడం వల్ల తప్పక రావాల్సిందేనని చెప్పడంతో కిషోర్ కుమార్ కార్యాలయానికి వచ్చారు. టెలీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఈయన ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో మిగిలిన ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పంచాయతీ అధికారి పరిధిలో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులో ఈ విషయాన్ని తెలియజేయడంతో సోమవారం వెలుగులోకి వచ్చింది. కిషోర్ మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అదుపు తప్పిన కారు నరసన్నపేట: స్థానిక సత్యవరం కూడలి సమీపంలో జాతీయ రహదారిపై ఒడిశాకు చెందిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. అయితే కారులో ప్రయాణిస్తున్న సురేష్కుమార్ సాహుతో పాటు మరో నలుగురు వ్యక్తులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఈ కారు నరసన్నపేట వద్దకు వచ్చేసరికి అదుపు తప్పింది. డివైడర్పై ఉన్న ఐరెన్ రాడ్లును ఈడ్చుకుంటూ కొంతదూరం వెళ్లి రివర్స్లో డివైడర్పై ఆగింది. కారు ముందరి భాగం పూర్తిగా నుజ్జు అయింది. డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే కారులో ఉన్న అందరూ సీటుబెల్టు పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డామని సురేష్ కుమార్ తెలిపారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎస్ఐ బి.గణేష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఉపాధ్యాయుల పదోన్నతులకు అవకాశాలు శ్రీకాకుళం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్ ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర పాఠశాలల విద్యాసంచాలకుల ఆదేశాల మేరకు పదోన్నతులు కల్పించేందుకు సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్సైట్లో ఉంచినట్లు డీఈవో ఎ.రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్సైట్లో ఉన్న పదోన్నతుల తాత్కాలిక సీనియారిటీ జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీకాకుళం కార్యాలయంలో తగిన ధ్రువీకరణ పత్రాలు ఆధారాలతో సమర్పించాలని కోరారు. -
నారీశక్తి కోర్సు ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం నారీ శక్తి కోర్సు పేరిట ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా ఈ శిక్షణ ప్రారంభించిన కళాశాలగా గుర్తింపు పొందింది. రెండేళ్ల వ్యవధి కలిగిన ఈ కోర్సు ద్వారా ఫిజికల్ ఫిట్నెస్, డ్రిల్, సాఫ్ట్ స్కిల్స్ డవలప్మెంట్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు పేర్కొన్నారు. కోర్సు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు శారీరకంగా ధృడంగా, మానసికంగా స్థిరంగా ఉండడానికి ఈ నారీ శక్తి కోర్సు ఎంతగానో దోహదపడుతుందన్నారు. కోర్సు కో–ఆర్డినేటర్, శిక్షకుడిగా వ్యవహరిస్తున్న ఎన్సీసీ అధికారి, సీనియర్ మాథ్స్ అధ్యాపకుడు కెప్టెన్ డాక్టర్ ఎన్.రామకృష్ణ మాట్లాడుతూ నారీశక్తి కోర్సు ప్రాధాన్యత, అవసరాన్ని వివరించారు. ప్రతిరోజు శిక్షణ ఉంటుందని, కోర్సు పూర్తిచేసినవారికి సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.చిన్నారావు, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
వినతులను సకాలంలో పరిష్కరించాలి
● జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ● పీజీఆర్ఎస్కు 117 అర్జీలు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చే వినతులకు సకాలంలో పరిష్కారం చూపాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా 117 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యలను పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నందున జాప్యంలేకుండా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 23, పంచాయతీరాజ్కు సంబంధించి 13, వ్యవసాయ శాఖకు సంబంధించి 13, సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన)కు సంబంధించి 12 వినతులు అందాయి. కార్యక్రమంలో సహాయ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు ఎన్.కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో పి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ క్లినిక్ సందర్శన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) నిర్వహించిన అనంతరం జెడ్పీ సమావేశ మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ను జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సందర్శించారు. ప్రజల నుంచి వచ్చిన భూ సంబంధిత సమస్యల పరిష్కార స్థితిగతులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు బి.లవరాజ్, డిప్యూటీ కలెక్టర్ డి.పద్మావతి, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి వీఎస్ఎస్ఎల్ ప్రసన్న, జిల్లా పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజినీర్ కేవీ నాయుడు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజినీర్ పి.సుధాకర్ బాబు, జిల్లా పంచాయతీ అధికారి గోపిబాల, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు కె.త్రినాథరావు, భూగర్భ గనుల శాఖ ఉప సంచాలకుడు సి.మోహన్రావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.అనిత, సర్వశిక్షా అభియాన్ ఏపీసీ పి.వేణుగోపాల్, జిల్లా ఉపాధి కల్పన అధికారి కె.సుధా, మెప్మా పథక సంచాలకుడు ఎస్.వెంకటరావు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కె.సూర్య ప్రకాష్, ఎస్సీ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ వి.వినాయకం, జిల్లా కార్మిక శాఖ అధికారి కె.అజయ్ కార్తికేయ, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్రావు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకుడు వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని ఫిర్యాదులు పరిశీలిస్తే.. ● శ్రీకాకుళం రూరల్లోని పెద్దపాడు గ్రామంలో తాగునీటి కొరత ఉందని, సమస్యను పరిష్కరించాలని గ్రామానికి చెందిన మహిళలు ఫిర్యాదు చేశారు. ● రిమ్స్లో కార్మికులకు రిమ్స్ కాంట్రాక్టర్ ఇబ్బందులు పెడుతున్నారని, జీతం ఇవ్వడం లేదని, ఇతర సంక్షేమాలు చూడడం లేదని కార్మికులు ఫిర్యాదు చేశారు. దీనిపై కాంట్రాక్ట్రర్కు పల మార్లు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. ● శ్రీకాకుళం మండలంలోని కరజాడలో డ్రైనేజీ నిర్మాణ పనులు జరగకుండా కొంతమంది ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారని గ్రామానికి చెందిన బలగ లక్ష్మణరావు తదితరులు ఫిర్యాదు చేశారు. -
ఎస్పీ గ్రీవెన్సుకు 62 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు సకాలంలో పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సుకు ప్రజల నుంచి 62 వినతులు అందాయి. ఎస్పీ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. వినతులు పరిశీలిస్తే... ● పోలాకి మండలానికి చెందిన ఒక యువకుడు తనను ప్రేమించి గర్భవతిని చేశాడని, తీరా వివాహం చేసుకోమనగా పట్టించుకోవడం లేదని ఒక దళిత యువతి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గత నెల 6వ తేదీన నరసన్నపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని వాపోయింది. ● ఈనెల 9వ తేదీన వప్పంగిలో తమ కుటుంబ సభ్యులపై కొందరు దాడికి పాల్పడగా గాయాలతో రిమ్స్కు చేరామని, అక్కడ ఎంఎల్సీ నమోదైందని అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదని గీత కార్మికుడు లక్ష్మణరావు ఫిర్యాదు చేశారు. -
ప్రాణం తీసిన అతివేగం
రణస్థలం: అతివేగం ఒక కన్నతల్లికి కడుపుకోతను మిగిల్చింది. మండలంలోని వరిసాం సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై లంక మోహన్ (18) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు మైలపల్లి లక్ష్మణ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జేఆర్పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పైడిభీమవరం నుంచి రణస్థలం వైపు సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అతివేగంగా ద్విచక్ర వాహనంపై మైలపల్లి లక్ష్మణ, లెంక మోహన్(చందు) వస్తున్నారు. వారు వరిసాం సమీపానికి వస్తున్న సమయంలో సర్వీస్ రోడ్డు నుంచి హైవే రోడ్డు ఎక్కేందుకు ఒక ప్రైవేటు స్కూల్ బస్సు వస్తూ మలుపు తిరుగుతోంది. ఆ సమయంలో అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం స్కూల్ బస్సు వెనుక ఢీకొట్టి.. అదుపుతప్పి డివైడర్ను బలంగా గుద్దుకున్నారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న మరువాడ గ్రామానికి చెందిన మోహన్ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న కొవ్వాడ గ్రామానికి చెందిన మైలపల్లి లక్ష్మణకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న లక్ష్మణను 108 వాహనంపై శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగంగా బైక్ నడుపుతున్న లక్ష్మణను జేఆర్పురం పోలీసులు పలుమార్లు హెచ్చరించినా పరిస్థితి మారలేదు. మృతుడు రణస్థలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి లంక రామారావు కూలీ పనులు చేస్తుండగా.. తల్లి శారద ఆదర్శ పాఠశాలలో వంట పని చేస్తోంది. ఈ ప్రమాదంతో మరువాడ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. తండ్రి రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
సిలిండర్
శ్రీకాకుళం● పెరుగుతున్న గ్యాస్ ఇబ్బందులు ● ఇప్పటికే మూత పడుతున్న హొటళ్లు, రెస్టారెంట్లు ● గృహ వినియోగదారులకూ తప్పని ఇబ్బంది సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026శ్రీకాకుళం పాతబస్టాండ్, హిరమండలం: పశ్చిమాసియా యుద్ధం వంటింటిలో మంట రేపుతోంది. జిల్లాలో నానాటికీ గ్యాస్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. అధికారు లు ఇబ్బంది లేదని చెబుతున్నా చిరు వ్యాపారులు, గృహ వినియోగదారులు తీవ్రంగానే ఇక్కట్లకు గురవుతున్నారు. ఆంక్షలకు లోబడే గ్యాస్ను సరఫరా చేయాలని ఆయా కంపెనీలకు, అధికారులకు ఉత్తర్వులు చేరాయి. వివిధ కంపెనీల ఏజెన్సీల బుకింగ్యాప్లు కూడా పనిచేయడం లేదు. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పరిమితులు గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కొన్ని పరిమితులు విధించింది. దానికి లోబడి ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు సిలిండర్ విడిపించుకునేందుకు సమయం ఇచ్చా రు. గడువులోగా బుకింగ్కి అవకాశం లేదు, ఒక వేళ బుకింగ్ చేసుకున్నా ఆ గడువు తీరేంత వరకు సిలిండర్ రాదు. ఇక డబుల్ సిలిండర్లు ఉన్నవారికి 32 రోజులకు సిలిండర్ పొందేలా చర్యలు తీసుకున్నా రు. దీనివల్ల పెద్ద కుటుంబాలకు, ఎక్కువ గ్యాస్ వినియోగించే వారికి గ్యాస్ సిలిండర్ సమస్యలు వస్తున్నాయి. యాప్ ఇబ్బందులు గృహావసరాలకు గ్యాస్ను బుకింగ్ చేసేందుకు ప్రస్తుతం సెల్ ద్వారా ఉన్న యాప్, మిస్కాల్, నేరుగా ఫోన్ చేసి వారు చెప్పిన విదంగా అంకెలను నొక్కి బుకింగ్ చేసుకునే విధానం ఉంది. అయితే గత నాలుగు రోజులుగా ఈ బుకింగ్ సజావుగా సాగడం లేదు. రోజులో ఏదో సమయంలో ఒక సారి బుకింగ్ చేయడం అవుతోంది. మిగిలిన సమయాల్లో బుకింగ్ యాప్ తీసుకోవడం లేదు. దీంతో వినియోగదారులు గ్యాస్ సమస్యలు పెరిగాయని ఆందోళన చెందుతున్నారు. నగరంలో ఒక గ్యాస్ ఏజెన్సీలో ఒకే రోజున వారం రోజుల్లో జరిగే బుకింగ్ అంటే సుమారుగా 5000 వరకు బుకింగ్ అయ్యా యి. వాస్తవానికి ఆ ఏజెన్సీలో వారం రోజుల పాటు 5000 సిలిండర్ల్ బుకింగ్ అవుతాయి. వారం వరకు రాదు.. ఒక్క సారిగా అధిక సంఖ్యలో గ్యాస్ బుకింగ్ చేయ డం వల్ల ఏజెన్సీలకు భారమవుతోంది. ట్రాన్స్పోర్టు, నిబంధనలు, కొరత వంటి కారణాలన్నీ కలిపి గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఆలస్యమవుతోంది. కనీసం వారం వరకు గ్యాస్ డెలివరీ జరగడం లేదు. కమర్షియల్ కష్టాలు కమర్షియల్ సిలిండర్ల వినియోగదారులకు కష్టాలు పెరిగాయి. ఇప్పటికే వారికి కొరత ఉంది. ముఖ్యంగా హోటల్స్పై ఈ ప్రభావం పడింది. దీంతో పాటు ప్రభుత్వ ప్రైవేటు వసతి గృహాలు, రెసిడెన్సియల్ విద్యాసంస్థల వారు ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల కట్టెల పొయ్యిలు వెలిశాయి. ఎల్పీజీ కొరత.. గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తుంటే.. వాహనాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ కేవలం వారం రోజుల వ్యవధిలోనే లీటరుకు రూ.30 పెరగడం భయపెడుతోంది. జిల్లా వ్యాప్తంగా 67 ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. అయితే జాతీయ రహదారి 193 కిలోమీటర్లు ఉండడంతో దాదాపు ఓ 30 బంకుల్లో ఎల్పీజీ సైతం విక్రయిస్తున్నారు. ఎల్పీజీ వాహనాలు ఉండడంతో రోజుకు దాదాపు 20 వేల వరకూ లీటర్ల ఎల్పీజీ అమ్మకాలు జరుగుతాయని సమాచారం. యుద్ధం ప్రారంభానికి ముందు లీటరు ఎల్పీజీ రూ.55 వరకూ ఉండేది. కానీ ప్రస్తుతం రూ.85కు చేరుకోగా.. మరో రెండురోజు ల్లో రూ.100లకు ఎగబాకడం ఖాయమని వ్యాపారులు చెబుతున్నారు. రోజుకు ఎల్పీజీ గ్యాస్ వినియోగంపై రూ.75 లక్షల వరకూ అదనపు భారం పడుతోంది. అయితే ఇటీవల ఎల్పీజీ గ్యాస్ వాహనాలు తగ్గి ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. -
‘వంద శాతం అక్షరాస్యతే లక్ష్యం’
శ్రీకాకుళం: జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత దిశగా నడిపించడమే మన లక్ష్యం కావాలని, ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన ’అక్షర ఆంధ్ర – ఉల్లాస్’ కార్యక్రమం ఎంతో కీలకమైందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని అరసవల్లిలో ఏర్పాటు చేసిన ప్రాథమి క స్థాయి అక్షరాస్యత పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభ్యాసకుల హాజరును, పరీక్ష జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,462 కేంద్రాల్లో 1,13,102 మంది అభ్యాసకులు ఈ పరీక్షకు హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అభ్యాసకులు సాధించిన మార్కులను గ్రామ, వార్డు సంక్షేమ సహాయకులు తక్షణమే ‘అక్షర ఆంధ్ర’ యాప్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
● సంక్షేమానికి కత్తెర
కూటమి ప్రభుత్వం పూర్తిగా సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. చివరకు ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు సైతం చెల్లించడం లేదు. దీంతో విద్యార్థులే ఒకరికొకరు క్షవరం చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. హిరమండలం మండలం మర్రిగూడ గిరిజన గ్రామంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఒకరుకొకరు క్షవరం చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై మర్రిగూడ ఆశ్రమ పాఠశాల వార్డెన్ బాలరాజు వద్ద ప్రస్తావించగా ప్రతి వారం బార్బర్ను తెప్పించి విద్యార్థులకు క్షవరం చేయిస్తున్నామని తెలిపారు. – హిరమండలం -
టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద గట్టి నిఘా
● డ్రోన్లు, పెట్రోలింగ్ బృందాలతో భద్రతా ఏర్పాట్లు ● పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ● ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని, డ్రోన్ కెమెరాలు, పెట్రోలింగ్ బృందాలతో పటిష్ట నిఘా పెట్టనున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. 145 పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే ఈ పరీక్షలు ఏప్రిల్ 1 వరకు జరగనుండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట పోలీసు బందోబస్తు పెట్టామన్నారు. ఇప్పటికే శాఖాపరంగా అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశామన్నారు. 144 సెక్షన్ అమలు.. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపా రు. సజావుగా జరిగేలా పోలీసు, విద్యాశాఖ అధికారులు పరస్పర సమన్వయంతో చర్య లు చేపట్టాలని, కేంద్రాల లోపలకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఐప్యాడ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరాదని, హాజరయ్యే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. సిబ్బంది తప్ప సమీప ప్రాంతాల్లో ఇతరులు ఉండకుండా చూడాలని, జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు పరీక్షలు పూర్తయ్యేవరకు తెరవరాదని అన్నారు. మాస్ కాపీయింగ్, మాల్ప్రాక్టీస్ వంటి అక్రమాలకు అవకాశం లేకుండా అధికారులు చూ డాలని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని ఎస్పీ సూచించారు. -
తాబేల చూపులు
● గుడ్లు పొదిగేందుకు వచ్చి చనిపోతున్న తాబేళ్లు ● నిషేధిత వలలు, బోట్లకు తగిలి మృత్యువాత ● అంతరించిపోతున్న ఆలివ్ రిడ్లే తాబేళ్లు వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలోని సముద్ర తీరం తాబేళ్ల పాలిట మరుభూమిగా మారుతోంది. మత్స్యకారులు చేపలను వేట చేసేందుకు నిషేధిత వలలు, బోటులను వినియోగించడంతో సముద్ర జలాల్లో సంచరిస్తున్న తాబేళ్లు గాయపడి మృతి చెందుతున్నాయి. రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడుతూ సముద్ర తీరాలకు వాటి కళేబరాలు కొట్టుకువస్తున్నాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 193 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. దీంతో అత్యధిక సంఖ్యలో ఆలివ్ రిడ్లే తాబే ళ్లు తన సంతానోత్పత్తికి అవసరమైన గుడ్లు పొది గేందుకు అనువుగా ఉండే సముద్ర తీరాలకు చేరుకుంటాయి. జిల్లాలో ప్రధానంగా వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, ఇచ్ఛాపురం, కవిటి, మందస, రణస్థలం, గార మండలాల్లో గల చినకొత్తూరు, మోట్టూరు, డోకులపాడు, అక్కుపల్లి, హుకుంపేట, మంచినీళ్లపేట, భావనపాడు, కళింగపట్నం, డొంకూరు, కేవీ పాలెం, డీఎల్పురం, రట్టి, బారువ, ఇసుకలపాలెం, తోటూరు, గొలగండి, దేవునల్తాడ తదితర సముద్ర తీరాలకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు చేరుకుంటాయి. మరణ మృదంగం సముద్ర సమతుల్యాన్ని కాపాడటంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల పాత్ర కీలకం. అలాంటి అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు ప్రమాదంలో పడుతున్నాయి. ఏటా డిసెంబర్ మొదలు కొని ఏప్రిల్ వరకు వేలాది సంఖ్యలో తాబేళ్లు తమ సంతానోత్పత్తి కోసం సముద్ర తీరాలకు వస్తాయి. అనువైన ప్రాంతాలలో లక్షలాది గుడ్లను పొదిగి తిరిగి సముద్ర జలాల్లోకి వెళ్తుంటాయి. ఈ క్రమంలోనే నిషేధిత వలలు, బోట్లకు తగిలి మృత్యువాత పడుతున్నాయి. తీరాలకు చేరిన తాబేళ్ల కళేబరాలను వీధి కుక్కలు, పక్షులు పీక్కు తింటున్నాయి. వీటి గుడ్లకు సైతం సంరక్షణ లేక పక్షులు తినేస్తున్నాయి. మిగిలిన గుడ్లను ట్రీ స్వచ్ఛంద సంస్థ, అటవీశాఖ సయుక్తంగా సంరక్షిస్తున్నాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 8 కిలోమీటర్లు దాటి వెళ్లాలి.. దేశంలో అనువైన తీర ప్రాంతాలకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు గుడ్లు పొది గేందుకు వస్తాయి. ఈ సమయంలో మత్స్యకారులు 8 కిలోమీటర్లు దాటించి చేపల వేట సాగించాలి. నిషేధిత వలలు, బోట్లు వాడరాదు. వీటిని నిషేధించగలితే తాబేళ్లను రక్షించగలం. మత్స్యకార శాఖాధికారులు, మత్స్యకారులు దీనికి పూర్తి బాధ్యత వహించాలి. – మురళీకృష్ణంనాయుడు, అటవీశాఖ రేంజర్, కాశీబుగ్గ -
తీరంలో తవ్వేస్తున్నారు
● గుట్టుగా ఇసుక నిల్వ చేస్తున్న వైనంఇచ్ఛాపురం రూరల్: ఇసుకాసురులకు బాహుదా నది బంగారు బాతుగా మారిపోయింది. ఈదుపురం, కేశుపురం, సన్యాసిపుట్టుగ, చిన్న బూర్జపాడు, పెద్ద బూర్జపాడు, డొంకూరు, లక్ష్మీపురం తీర ప్రాంతం వరకు బాహుదానది పరివాహక ప్రాంతం వరకు ఇసుక అక్రమ తవ్వకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. స్థానికుల ప్రకారం కొందరు అక్రమార్కులు పగలంతా నది తీర ప్రాంతంలో ఇసుకను తవ్వి నిల్వ చేసి, తర్వాత ట్రాక్టర్ల ద్వారా మొగలి డొంకల్లోని రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాత్రి సమయంలో ఇసుక పోగుల్ని ఇతర ప్రాంతాలకు అమ్మకాలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారని, దీంతో నది గర్భం రోజురోజుకు లోతుగా మారుతోంది. మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదీ తీర ప్రాంతం క్రమంగా కుంగిపోతుందనే భయం వ్యక్తమవుతోంది. ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
నిధి.. జీతమేదీ..?నిధి పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఉద్యోగులపై ప్రభావం పడుతోంది. –8లో
మత్స్య, జీడి ఎగుమతులపై ఎఫెక్ట్.. జిల్లా నుంచి ఎగుమతి అయ్యే ఆహార ఉత్పత్తుల్లో జీడి పప్పు, మత్స్య సంపదది అగ్రస్థానం. జిల్లాలో 11 తీర మండలాల్లో 4 వేల హెక్టార్లలో చేపల ఆక్వా సాగు అవుతోంది. మన జిల్లాలో దొరి కే రొయ్యకు విదేశాల్లో గిరాకీ ఎక్కువ. ఇక్కడ కొనుగోలు చేసే రొయ్యను విశాఖ పోర్టుకు తరలించి అక్కడ నుంచి ఎగమతి చేస్తుంటారు. దుబాయ్, ఖతార్లో పోర్టులకు కనెక్టివిటీ ఉంటుంది. అక్కడి నుంచి యూరప్ దేశాలతో పాటు అమెరికాకు తరలి స్తుంటారు. అయితే ఇరాన్ సమీపంలో హర్మూజ్ జలసంధి మూసివేయడంతో ఎక్కడి కంటైనర్లు అక్కడే నిలిచిపోయినట్టు తెలుస్తోంది. దీంతో చేపల విక్రయాలపై గణనీయంగా ప్రభావం చూపుతోంది. దీంతో జిల్లాలో రొయ్యల ధర తగ్గినట్టు తెలుస్తోంది. మత్స్యకారులకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు జీడిపప్పుది అదే పరిస్థితి. జిల్లా నుంచి జీడి పప్పు ఎగుమతి అవుతుంటుంది. విదేశాల నుంచి జీడి పిక్కలు దిగుమతి చేస్తారు. అయితే యుద్ధ ప్రభావంతో నౌకా రవాణా నిలిచిపోయింది. దీంతో పిక్కల దిగుమతి లేదు. జీడి పప్పు ఎగుమతి లేదు. దీంతో జీడి పప్పు ధరపై ప్రభా వం చూపే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో కొంత ఇబ్బందులు లేవు. యుద్ధం ఇలానే కొనసాగితే మాత్రం మనజిల్లాలో ప్రధాన జీవనాధారంగా నిలిచే మత్స్య, జీడి పరిశ్రమలు, రైతులపై ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. -
జాతరకు పోటెత్తిన భక్తజనం
గార: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం వత్సవలస రాజమ్మ తల్లి (రాజరాజేశ్వరి) దర్శనానికి ఏడో ఆదివారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దూరప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చి రాజమ్మ తల్లికి మొక్కలు తీర్చుకున్నారు. శనివారం రాత్రికే వచ్చిన భక్తులు సమీప తోటలు, ఆరుబయట బసచేసి రాజరాజేశ్వరి (రాజమ్మతల్లి) పాటు భూలోకమ్మ తల్లికి ఆదివారం ఉదయం మొక్కులు తీర్చుకున్నారు. వేకువ జామున నుంచే సమీపంలోని సముద్రంలో పవిత్ర స్నానాలాచరించారు. ఎస్ఐ చోడిపల్లి గంగరాజు, మైరెన్ సీఐ బూర ప్రసాదరావులు బందోబస్తు చర్యలు చేపట్టారు. -
నిధి..జీతమేదీ?
శ్రీకాకుళం న్యూకాలనీ : కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట ‘నిధి పోర్టల్’ గుదిబండలా తయారైంది. ఉద్యోగులతోపాటు వారి కుటుంబాలను పస్తులుండేలా చేస్తోంది. జీతాలను రాష్ట్ర ప్రభుత్వం ‘నిధి’ పోర్టల్ ద్వారా జీతాలను చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే పోర్టల్లో అనేక అవరోధాలు, సాంకేతిక సమస్యల కారణంగా జీతాలు చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఫిబ్రవరి జీతాలు ఇప్పటి వరకు జమకాలేదు. ఏప్రిల్ జీతాలు సైతం జాప్యమయ్యేలా ఉందని సమాచారం. అవరోధాలు.. సాంకేతిక సమస్యలు.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జిల్లాలో 18440 మంది పనిచేస్తున్నారు. వారందరి వివరాలను నిధి పోర్టల్లో నమోదు చేసి.. దాని ఆధారంగా జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం ద్వారా ఉద్యోగుల వివరాలు ఒకే డేటాబేస్లో ఉంటాయని, తద్వారా జీతాల చెల్లింపులో పారదర్శకత పెరుగుతుందని భావించి తెరపైకి తీసుకొచ్చారు. అయితే అమల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. పోర్టల్లో ఉద్యోగుల వివరాలు నమోదు చేయాలంటే ముందుగా సంబంధిత శాఖల క్యాడర్ స్ట్రెంత్ వివరాలు కనిపించాలి. చాలా శాఖలకు చెందిన క్యాడర్ వివరాలు పోర్టల్లో అప్లోడ్ కాకపోవడంతో డేటా నమోదు ఆగిపోయింది. ఫలితంగా బిల్లులు రూపొందించలేకపోతున్నారు. ఆయా శాఖల్లో యూడీసీలు, అకౌంట్స్ సిబ్బంది రోజూ పోర్టల్లో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కావడంలేదు. దీంతో కూటమి సర్కారు తీరుపట్ల కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా ఉన్న ఫలంగా నిధి పోర్టల్ పేరిట జీతాలు లేకుండా చేయడం పట్ల వారంతా ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. నిధి పోర్టల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన మాట వాస్తవమే. అందులో అప్లోడింగ్ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు వస్తున్నట్టు తెలిసింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. – ఆర్.సురేష్కుమార్, ఇంటర్మీడియెట్ విద్య డీవీఈఓ, శ్రీకాకుళం ఇప్పటికే ఫిబ్రవరి ముగిసినా జీతాలు అందలేదు. జీతాలు లేమితో గృహ ఖర్చులు, పిల్లల చదువులు, ఇంటి అద్దె, బ్యాంకు రుణాలు, ఈఎంఐల చెల్లింపులు వంటి అంశాల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధి పోర్టల్, ఖజానా శాఖ అధికారులు ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల కల్పించుకుని జీతాల చెల్లింపునకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగ, లెక్చరర్ల సంఘ జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నిధి పోర్టల్లో సాంకేతిక సమస్యలు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిలిచిన జీతాలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని కూటమి సర్కారు జిల్లాలో 18440 మందిపై ప్రభావం -
ఘనంగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం బాపూజీ కళామందిర్లో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా త్యాగయ్య చిత్రపటంతో నగరంలో తిరువీధి నిర్వహిస్తూ గీతాలను ఆలపించారు. అనంతరం త్యాగయ్య పాడిన పంచరత్న కీర్తనలను కళాకారులు బృందం చక్కగా ఆలపించారు. ఉదయం నుంచి రాత్రి వరకు కళామందిర్ త్యాగయ్య గీతాలతో మారుమోగింది. సుమారుగా 39 మంది గాయకులు త్యాగయ్య గీతాలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, డాక్టర్ కె.సుధీర్, గౌరవాధ్యక్షురాలు డాక్టర్ మాలతి, వ్యవస్థాపకలు మావూడూరి సత్యనారాయణ శర్మ, మండా శ్రీనివాసరావు, మండాకామేశ్వరరావు, జె.వెంకటేశ్వరరావు, మార్గదర్శి శ్రీను, జె.జె.మోహన్రావు, భాస్కర్భట్ల శ్రీరామ్మూర్తిశర్మ పాల్గొన్నారు. -
గంజాయి రవాణా గుట్టురట్టు
ఎచ్చెర్ల : కుశాలపురం బైపాస్రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై 4.1 కిలోల గంజాయి తరలిస్తున్న ఒడిశా యువకుడిని ఆదివారం ఎచ్చెర్ల పోలీసులు అరెస్టు చేశారు. జేఆర్పురం సీఐ ఎం.అవతారం, ఎచ్చెర్ల ఎస్సై జి.లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా అస్కా తాలుకా మంగులూర్ గ్రామానికి చెందిన శ్రీహరిప్రధాన్ ఓ బ్యాగులో రెండు ప్యాకెట్లతో 4.1 కిలోల గంజాయిని బెంగళూరు తరలిస్తున్నాడన్న సమాచారం మేరకు ఎస్సై లక్ష్మణరావు, సిబ్బంది, డిప్యూటీ తహశీల్దార్తో కలిసి మాటువేశారు. కుశాలపురం బైపాస్రోడ్డు కూడలి వద్ద వీరిని చూసి యువకుడు పారిపోతుండగా పట్టుకున్నారు. బెంగళూరులోని భరత్ అనే వ్యక్తికి అప్పగించేందుకు వెళ్తున్నట్లు అంగీకరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అభినందించారు. టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి బూర్జ: శ్రీకాకుళం–పాలకొండ ప్రధాన రహదారిలో సింగన్నపాలెం కూడలి వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉప్పినివలస గ్రామానికి చెందిన కపీరు జీవన్కుమార్ (32) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవన్కుమార్ ద్విచక్ర వాహనంపై కొల్లివలస నుంచి ఉప్పినివలస వస్తుండగా సింగన్నపాలెం కూడలి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో జీవన్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి చేరుకుని ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్లో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. జీవన్కుమార్కు భార్య ఆదిలక్ష్మి అలియాస్ పుష్ప, ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ పి.రమణ తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడు దుర్మరణం టెక్కలి రూరల్: తిర్లంగి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన సైన రాములు(80) అనే వృద్ధుడు దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాములు తిర్లంగి గ్రామ సమీపంలో అక్కవరం వైపు వెళ్లే మార్గంలో సాగునీటి కాలువలో స్నానం చేసేందుకు వెళ్తిల తిరిగి వస్తుండగా అదే మార్గంలో ట్రాక్టర్ వెనుక్కు తిప్పుతుండగా ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలు చేయగా అప్పటికే మృతి చెందాడు. రాములుకు భార్య లచ్చమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శతాధిక వృద్ధుడు మృతి కొత్తూరు: మండల కేంద్రం కొత్తూరులో అల్లువీధికి చెందిన లోతుగెడ్డ రాములు(110) ఆదివారం అనారోగ్యంతో తన నివాసంలో మృతి చెందారు. 1916లో జన్మించిన రాములు స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ప్రజలను చైతన్యపరిచేలా గీతాలు ఆలపించేవారు. ఈయనకు ఇద్దరు కుమారులు. రాములు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
రక్తదాతలే ప్రాణదాతలు
రణస్థలం: ఆపత్కాలంలో అత్యవసరమైన రక్తాన్ని దానం చేసిన వారంతా ప్రాణదాతలేనని ఇడదాసుల విద్యా, ఆరోగ్య ఫౌండేషన్ అధ్యక్షుడు ఇ.తిరుపతిరాజు అన్నారు. రణస్థలం మండల కేంద్రంలోని సూర్య ఆస్పత్రి ఆవరణలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. మండు వేసవిని సైతం లెక్క చేయకుండా 77 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. దేరసాం గ్రామానికి చెందిన లుకలాపు అప్పారావు 50వ సారి రక్తదానం చేయడం విశేషం. సేకరించిన రక్తాన్ని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్కు అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు ఇడదాసుల యశ్వంత్, రణస్థలం వైస్ ఎంపీపీ రాయపురెడ్డి భుజంగరావు, జె.ఆర్.పురం సర్పంచ్ బవిరి రమణ, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి రమేష్, గుమడాం ఎంపీటీసీ జగ్గురోతు తవిటినాయుడు, సభ్యులు పిన్నింటి సత్యంనాయుడు, టేకి బ్రహ్మాజీ, గొర్లె స్వామినాయుడు, ముళ్లు రాంబాబు, మహంతి నీలాకృష్ణ, న్యూ బ్లండ్ బ్యాంక్ మేనేజర్ తొత్తడి మణికంఠ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఒకేసారి మూడు బ్యాంకు కొలువులు
వజ్రపుకొత్తూరు రూరల్: పొల్లాడ గ్రామంలోని సామాన్య కుటుంబానికి చెందిన బంగారు సందీప్ అనే యువకుడు ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలను సాధించాడు. కర్ణాటక రీజనల్ రూరల్ బ్యాంక్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఆర్ఆర్బీ క్లర్క్ కొలువులను సాధించి సత్తా చాటాడు. సందీప్ తల్లిదండ్రులు ప్రభావతి, వాసుదేవరావులు సామాన్య కుటుంబానికి చెందిన వారు. సోదరి లావణ్య యూకో బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నారు. పట్టుదలతో చదివి ఏకకాలంలో మూడు బ్యాంక్ ఉద్యోగాలు సాధించిన సందీప్ను గ్రామస్తులు అభినందించారు. నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం శ్రీకాకుళం కల్చరల్ : అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో నిత్యాన్నదాన పథకానికి శ్రీకాకుళంకు చెందిన అన్నెపు సూర్యనారాయణ, వైకుంఠమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు అన్నెపు రమేష్ ఆదివారం రూ.లక్ష నగదును ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్కు అందజేశారు. దాతను వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి వారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అమరజీవి జయంతి వేడుకలు విజయవంతం చేయండి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు సోమవారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం పాతబస్టాండ్ వద్ద నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్యవైశ్య వాసవి దళ్ చైర్మన్ మండవిల్లి రవి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ నాయకులు, ఆర్యవైశ్య కులస్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఆదిత్యుని సన్నిధిలో భక్తుల రద్దీ శ్రీకాకుళం కల్చరల్ : ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి ఆది వారం భక్తులు పోటెత్తారు. టికెట్ల రూపంలో రూ.3,50,300, పూజలు, విరాళాల రూపంలో రూ.70,634, ప్రసాదాల రూపంలో రూ.1,83, 690, దర్శనం, సూర్యనమస్కారాలు, వివిధ సేవలు, ప్రసాదాల బుకింగ్ను మరింత సులభతరం చేస్తూ ఆన్లైన్ రిజర్వేషన్ ద్వారా రూ.59,900 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ తెలిపారు. జాగిలాలతో తనిఖీలు శ్రీకాకుళం క్రైమ్ : గంజాయి, అక్రమ మద్యం, ఇతర మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాల అక్రమ నిల్వలు, రవాణాను అరికట్టేందుకు ఆదివారం నగర పరిధిలో పోలీసు జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. రెండో పట్టణ ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్కాంప్లెక్సు ఆవరణలో అనుమానాస్పద ప్రదేశాలు, సమీప పార్సిల్ సర్వీసులు, దుకాణాలు, ప్రయివేటు ట్రావెల్స్ కార్యాలయాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మహోన్నత గ్రంథాలు రామాయణ భగవద్గీతలు శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని ఉపనిషన్మందిరంలో ఆదివారం ‘శ్రీమద్రామాయణం – శ్రీమద్భగవద్గీత సమన్వయం’ అనే అంశంపై నిష్టల నరసింహమూర్తి ప్రసంగించారు. మహర్షులు, మహాకవులు ఎంతమంది ఉన్నా అగ్ర తాంబూలం వ్యాస, వాల్మీకులకే దక్కుతుందన్నారు. అనంతరం పలు శ్లోకాల గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో మందిరం సభ్యులు నారాయణమూర్తి, కామేశ్వరరావు, పట్నాయక్, ఈశ్వరరావు, జోగారావు, సూరిబాబు, బాబూరావు, ఈశ్వరరావు, వెంకటరమణ, చంఽద్రరావు, బాలరాజు, అరుణ, లక్ష్మి, భారతి, ఉమాదేవి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నిస్తేనే మోసాలకు అడ్డుకట్ట
శ్రీకాకుళం పాతబస్టాండ్: వినియోగదారులు అప్రమత్తంగా ఉంటూ, తప్పు జరిగినప్పుడు ప్రశ్నించినప్పుడే అక్రమ వ్యాపారుల్లో భయం కలుగుతుందని, తద్వారా మోసాలను నివారించవచ్చని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షుడు రఘుపాత్రుని చిరంజీవి అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ‘ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం– 2026’ నిర్వహించారు. ‘సురక్షితమైన ఉత్పత్తులు – విశ్వసనీయ వినియోగదారులు’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. వినియోగదారులు కేవలం ఫిర్యాదులు చేసి వదిలేయకుండా,అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకోవాలని, అప్పుడే వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పారు. ఏ వస్తువు కొన్నా అది ఆరోగ్యానికి మంచిదా కాదా అని మనకు మనమే ప్రశ్నించుకోవాలన్నారు. కొనుగోలు చేసేటప్పుడు విచక్షణతో వ్యవహరిస్తే సగం సమస్యలు దరిచేరవని స్పష్టం చేశారు. గత ఏడాది వ్యవధిలో కమిషన్కు 500కుపైగా ఫిర్యాదులు రాగా, విచారణ చేపట్టి 450కి పైగా కేసుల్లో వినియోగదారులకు న్యాయం చేశామని చెప్పారు. హక్కుల పరిరక్షణలో స్వచ్ఛంద సంస్థలు పోషిస్తున్న పాత్రను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కాగా, సదస్సు ప్రాంగణంలో తూనికలు–కొలతలు, ఆహార కల్తీ నియంత్రణ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పాలలో కల్తీని గుర్తించడం, నిత్యావసర వస్తువుల్లో కల్తీని కనిపెట్టే పద్ధతులు, తూనికల్లో జరిగే మోసాలపై అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారి జి.సూర్యప్రకాశరావు, జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బగాది రామమోహనరావు, లీగల్ మెట్రోలజీ సహాయ నియంత్రణాధికారి పి.చిన్నమ్మ, డ్రగ్స్ కంట్రోల్ సహాయ సంచాలకులు ఎం.చంద్రరావు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ చౌదరి లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.అనిత, జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త వై.సురేంద్ర బాబు, వాణిజ్య పన్నుల సహాయ కమిషనర్ చంద్రకళ, బీపీసీఎల్ సేల్స్ ఆఫీసర్ యండూరి అన్విత, ఆసరా జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంజి ఆర్.ఎజ్రా, పౌరసరఫరాల శాఖ అధికారులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఆదివారం జిల్లాస్థాయి జూనియర్స్, యూత్ బాలబాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు జరిగాయి. 60 మంది బాలబాలికలు హాజరై ప్రతిభ నిరూపించుకున్నారు. ఎంపికై న క్రీడాకారుల జాబితాను జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బలగ అనంతలక్ష్మణ్ దేవ్ (అను) సాయంత్రం వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ సంయుక్త కార్యదర్శి వంగా మహేష్, కోచ్ ఉమామహేశ్వరరావు, భీమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ సంజీవరావు, రాజీవ్, సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు వీరే.. యూత్ విభాగంలో ఎస్.రోహిత్, ఎం.సూర్యారావు, ఎం.స్వరూప్, ఎస్.దేవివిశ్వప్రసాద్, ఎ.చరణ్ కుమార్, ఎస్.కలీంబన్ని, పి.గణేష్, జి.సత్య భార్గవ, జి.శ్రీవిద్య ఎంపికయ్యారు. జూనియర్ విభాగంలో ఎస్.కార్తీక్, ఎన్.దుర్గ ప్రసాద్, ఎం.సూర్య ప్రకాష్, పి.కృష్ణమోహన్, ఎ.రామచంద్రా రెడ్డి, టి.గణేష్ ఎంపికై నవారిలో ఉన్నారు. -
జీతాల కోసం ముఖ్యమంత్రికి లేఖలు
శ్రీకాకుళం కల్చరల్: నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలియజేస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్లు ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర అధికారులకు లేఖలు, ఈమెయిల్స్ పంపుతున్నారు. తక్షణం అదనపు గ్రాంటు విడుదల చేసి సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందని, వెంటనే పెన్షన్ గ్రాంట్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళలకు ఉపాధి శిక్షణ ఎచ్చెర్ల: స్థానిక నందమూరి తారకరామారావు నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిత కేంద్రం(మహిళా ప్రాంగణం)లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ(గుంటూరు) సౌజన్యంతో మహిళలకు ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు మేనేజర్ రబీకా సామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు నెలల శిక్షణ గల అసిస్టెంట్ బ్యూటీ థెరఫిస్ట్, 45 రోజుల శిక్షణ గల హ్యండ్ ఎంబ్రాయిడర్ 8 వ తరగతి విద్యార్హత, మూడు నెలల శిక్షణ గల డొమెస్టిక్ డేటాఎంట్రీ ఆపరేటర్కు పదో తరగతి చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. స్టూడెంట్ వెల్ఫేర్ డీన్గా సింహాచలం ఎచ్చెర్ల : స్థానిక ట్రిపుల్ ఐటీ కళాశాలలో స్టూడెంట్ వెల్ఫేర్(బాయ్స్) నూతన డీన్గా సింహాచలం శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన్ను వర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్, పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, వాసు సాగర్, సిబ్బంది అభినందించారు. -
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు న్యాయం చేయాలి
శ్రీకాకుళం అర్బన్ : మినిమం/హయ్యర్ పెన్షన్పై ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ ఈయూ కార్యాలయంలో శనివారం సంఘ జిల్లా అధ్యక్షుడు ఆర్.పి.రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ఆర్ శర్మ, ఉపాధ్యక్షుడు ఎస్.అప్పారావు మాట్లాడుతూ ఏపీ పీటీడీ రిటైర్డ్ ఉద్యోగులు ఈహెచ్ఎస్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. లీవ్ ఎన్క్యాష్మెంట్స్, గ్రాట్యుటీలపై రాష్ట్ర నాయకత్వం, సర్వీస్ సంఘాలకు లేఖలు పంపుదామన్నారు. మే 4న అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం, జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుమన్, ట్రెజరర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
వజ్రపుకొత్తూరు రూరల్: గంగరాంపేట సమీపంలో విద్యుత్ స్తంభాన్ని శనివారం ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో స్థానికులు ఊపీరిపీల్చుకున్నారు. స్థానికులు, విద్యుత్ శాఖాధికారులు తెలిపిన వివరాలు మేరకు.. పల్లిసారధి గ్రామం నుంచి పలాస వైపు వస్తున్న కారు గంగారంపేట వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న 11 కె.వి. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం విరిగి నేలకు ఒరిగిపోగా.. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడికక్కడే కారును వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖాధికారులు వెంటనే కరెంట్ సరఫరా నిలుపుదల చేశారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకొని కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ప్రమాదానికి గురైన కారు ఒడిశా రిజిస్ట్రేషన్తో ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టి నష్టపరిహారం వసూలు చేస్తామని విద్యుత్ శాఖ ఏఈ వెంకటరమణ తెలిపారు. -
భవిష్యత్కు భరోసా
శ్రీకాకుళం రూరల్: నిరుద్యోగ యువతకు, వైద్యరంగ అనుబంధ విభాగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు బొల్లినేని మెడిస్కిల్స్ సంస్థ దిక్సూచిగా నిలుస్తోంది. శ్రీకాకుళం పరిధిలోని రాగోలులో గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ (జెమ్స్ కళాశాల) అనుబంధంగా 2016 జనవరి 1న ఆవిర్భవించిన ఈ సంస్థ కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని భాస్కరరావు మార్గదర్శకత్వంలో మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరుద్యోగ నిర్మూలనకు విశేషంగా కృషి చేస్తోంది. ఈ పదేళ్లలో వేలాది మంది యువతకు నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో విద్య, శిక్షణ, ఉపాధి అందిస్తున్న సంస్థగా ఖ్యాతిగాంచింది. ఎన్నెన్నో కోర్సులు.. బొల్లినేని మెడిస్కిల్స్ అత్యుత్తమ పనితీరును గుర్తించిన అనేక కార్పొరేట్ సంస్థలు వీరితో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నాయి. టెక్ మహీంద్రా ఫౌండేషన్, టాటా స్ట్రెవ్, జీఈ, హెచ్డ్ఎఫ్పీ, ఐఓసీఎల్, టాస్క్కిట్స్, హెచ్సీపీఎల్, ఎస్డీఐ, ప్రభుత్వ రంగంలోని ఐటీడీసీ, ఎన్ఎస్డీసీ, ఏపీఎస్ఎస్డీసీ, సీడాప్, ఒడిశా స్కిల్ డెవలప్మెంట్ అథారిటీతో కలిసి కోర్సులు రూపొందిస్తున్నారు. జీడీఏ, బీఎఫ్ఎస్ఐ, ప్లబాటమిస్ట్, హాస్పిటల్ ఫ్రంట్డెస్క్ ఎగ్జిక్యూటివ్, ఫార్మసీ అసిస్టెంట్, హెల్త్కేర్ బిల్డింగ్ ఎగ్జిక్యూటివ్, పేషెంట్ రిలేషన్ అసోసియేట్, హోటల్ మేనేజ్మెంట్, బ్యూటీషియన్, ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ ఆపరేటర్ వంటి నైపుణ్య అభివృద్ధి శిక్షణలతో నిరుద్యోగ యువతకు చేరువయ్యారు. పలు కోర్సుల్లో ఉచితంగా శిక్షణతో పాటు భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ 14,650 మంది నిరుద్యోగుల యువతకు శిక్షణ ఇచ్చి 70 శాతం మందికి పైగా ఉద్యోగాలను కల్పించారు. వర్సిటీలకు అనుబంధంగా.. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విజయవాడ అనుబంధంగా ఇంటర్ బైపీసీ, డిగ్రీ బీఎస్సీ అనుబంధ హెల్త్ కోర్సులు, డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు మాస్టర్ ఆఫ్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేటివ్, పీజీ డిప్లమా ఇన్ మెడికల్ రికార్ట్స్, క్రిటికల్కేర్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ కోర్సులను కుడా బొల్లినేని మెడిస్కిల్స్ అందిస్తోంది. ఇంటర్ బైపీసీ, ఎంపీసీ, ఒకేషనల్ విద్యార్థులకు ఏపీ డిప్లమా ఎలైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషనల్ కోర్సులను ఏపీఎస్హెచ్పీసీ అనుబంధంతో అందిస్తున్నారు. కన్వీనర్ కోటా సీట్లు పొందిన వారికి ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ సదుపాయం కల్పిస్తున్నారు. బొల్లినేని మెడిస్కిల్స్లో బీఎస్సీ కార్డియాలజీ చేశాను. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన అత్యున్నత ఆస్పత్రిలో ఉద్యోగానికి ఎంపికయ్యాను. ప్రపంచ వ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులైన నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేయగా భారత్ నుంచి ఎంపికై న ఇద్దరిలో నేనొకరిని. ఏడాదికి రూ.37లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. జీవితాంతం బొల్లినేని మెడిస్కిల్స్కు రుణపడి ఉంటాను. – నిస్సీ లియోన్, తెనాలి, గుంటూరు జిల్లా మా సంస్థలో చేరిన ప్రతి విద్యార్థికీ విద్యతో పాటు శిక్షణతో కూడిన ఉద్యోగం అందివ్వడమే మా లక్ష్యం. నిరుద్యోగాన్ని నిర్మూలన చేసేందుకు నిరంతర యజ్ఞంలా పనిచేస్తున్నాం. ఇంతవరకూ 15వేల మందికి శిక్షణ ఇచ్చి 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మాసంస్థ చైర్మన్ బొల్లినేని భాస్కరరావు అందించిన సహకారం మరువలేనిది. – సీహెచ్ నాగేశ్వరరావు, బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరోనా వంటి కష్టకాలంలో టెక్ మహేంద్ర ఫౌండేషన్తో కలిసి శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఉపాధ్యాయులకు, గర్భిణులకు సరుకులు అందజేశారు. తెలంగాణాలోని గిరిజన తండాల్లో నివసిస్తున్న వారికి 18 రకాల నిత్యావసర సరుకులతో 3108 కిట్లును బొల్లినేని మెడిస్కిల్స్ సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. యువతకు దిక్సూచీగా నిలుస్తున్న బొల్లినేని మెడిస్కిల్స్ రాగోలు జెమ్స్ ఆస్పత్రి అనుబంధంగా పదేళ్లుగా శిక్షణ కార్యక్రమాలు నైపుణ్యం, వైద్య విద్యకోర్సులతో ఉపాధి కల్పిస్తున్న వైనం -
కమర్షియల్ సిలిండర్లు కలేనా?
● ఇప్పట్లో రావడం అనుమానమే ● ఉన్నతాధికారుల ప్రకటనతో మూత దిశగా రెస్టారెంట్లు శ్రీకాకుళం : జిల్లాలో వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్లు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జాయింట్ కలెక్టర్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ గృహావసరాలకు వినియోగించే సిలిండర్లకు కొరత లేదని చెబుతూ వాణిజ్యపరమైన సిలిండర్ల సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని, కమిటీ నిర్ణయం మేరకు సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. అసలు ఆ కమిటీ నివేదిక ఎప్పుడిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. కమిటీ సిఫారసుల తర్వాతే వాణిజ్యపరమైన సిలిండర్లు సరఫరా చేస్తామని మాత్రం చెబుతున్నారు. అంటే ఇప్పట్లో వాణిజ్యపరమైన సిలిండర్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, పాఠశాలలకు మాత్రంగృహ అవసర సిలిండర్లు సరఫరా చేస్తామని చెబుతున్నారు. ఈ లెక్కన కేవలం రెస్టారెంట్లు, హోటళ్లు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 25 శాతం రెస్టారెంట్లు మూతపడగా, మిగిలినవి కూడా ఒకటి రెండు రోజుల్లో గ్యాస్ లేక మూతపడే దిశగా పయనిస్తున్నాయి. హోటల్లు మూతపడినప్పటికీ కరెంట్ బిల్లులు, సిబ్బందికి జీతభత్యాలు తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. చాలావరకు బ్యాంకు రుణాలతో హోటళ్లు, రెస్టారెంట్లను ప్రారంభించడం వల్ల వాటి ఈఎంఐలు ఎలా కట్టాలి అన్న మనోవేదనతో యాజమాన్యాలు ఉన్నాయి. అయినప్పటికీ విషయం ఎవరికీ చెప్పుకోవాలో తెలియక లోలోనే మదన పడుతున్నారు. ప్రభుత్వాలు ఆలోచన చేసి హోటల్ రంగాన్ని నిలదొక్కుకునేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
నార్కోటిక్స్ భవన నిర్మాణానికి స్థల పరిశీలన
శ్రీకాకుళం పాతబస్టాండ్: నార్కోటిక్స్, మత్తుమందుల నిర్మూలన లక్ష్యంగా జిల్లాలో వివిధ దాడులలో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను నిల్వ చేసేందుకు నూతన భవన నిర్మించేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, మొదటి ఎ.డి.జె. కోర్టు న్యాయమూర్తి పి.భాస్కరరావు శనివారం స్థల పరిశీలన చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నాలుగు సెంట్ల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపట్టేందుకు కొలతలు వేయించి సంబంధిత అధికారులకు సూచనలిచ్చారు. కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్లు చంద్రశేఖరరావు, శ్రీనివాసరావు, ఆర్అండ్బీ డీఈఈ ధనుంజయ, తహసీల్దార్ ఎస్.గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. టెన్త్ ప్రతిభావంతులకు నగదు ప్రోత్సాహకాలు శ్రీకాకుళం: జిల్లాలో పదో తరగతి చదువుతూ పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, కేజీబీవీ విద్యార్థులకు వి.కె.ఫ్యామిలీ నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు జిల్లా సమన్వయకర్త పూజారి హరిప్రసన్న శనివారం తెలిపారు. మొదటి 10 మంది విద్యార్థులకు రూ.80,000, జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి రూ.20,000, రెండో స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.15000, మూడో స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.10,000 చొప్పున వసుదైక కుటుంబం యూనివర్సల్ ఫ్యామిలీ ఫౌండేషన్ ద్వారా అందజేయనున్నట్లు హరిప్రసన్న, వి.కె.ఫ్యామిలీ జిల్లా మెంటార్స్ గుణశేఖర్, సాయికుమార్, పాపారావు, సునీత, సత్యవతి తదితరులు పేర్కొన్నారు. హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్ల పట్టివేత రణస్థలం: లావేరు మండలం బుడుమూరులో హైవే పక్కన ఉన్న రెండు హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న 14 డొమెస్టిక్(గృహావసర) గ్యాస్ సిలిండర్లను విజిలెన్సు అధికారులు శనివారం పట్టుకున్నారు. ఐదుగురు నిర్వాహకులపై 6ఏ కేసు నమోదు చేశారు. దాడుల్లో విజిలెన్స్ సీఐ డి.డి.వి.సతీష్ కుమార్, ఎస్సై బి.రామారావు, సివిల్ సప్లయ్ ఆర్ఐ శ్రీను ఉన్నారు. మాజీ డీజీపీ దొర మృతికి ధర్మాన సంతాపం శ్రీకాకుళం (పీఎన్కాలనీ) : మాజీ డీజీపీ హెచ్.జె.దొర మృతి బాధాకరమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జన్మించి ఉద్యోగ రీత్యా అనితర సాధ్యమైన ఎత్తుకి ఎదిగిన గొప్ప వ్యక్తి దొర అని కొనియాడారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిస్వార్థంగా సేవలందించారని గుర్తు చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
మహిళలు స్వతంత్ర భావాలు కలిగి ఉండాలి
శ్రీకాకుళం: సమాజంలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని, ఇందులో మార్పు రావాలంటే మహిళా ఉపాధ్యాయులే కీలకపాత్ర పోషించాలని యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు బి.ధనలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో యూటీఎఫ్ జిల్లా మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు, మహిళల హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ ముందుండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 5వ పూర్వ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ స్వతంత్ర భావాలు కలిగి ఉండి ప్రశ్నించే తత్వాన్ని మహిళలు అలవర్చుకోవాలన్నారు. ఎస్టీఎఫ్ఐ జాతీయ కార్యదర్శి అరుణకుమారి మాట్లాడుతూ మహిళల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, కార్యదర్శి ఎస్.కిషోర్కుమార్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాబూరావు, బమ్మిడి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ మహిళా సమస్యల పరిష్కారానికి సంఘం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాహిత్య సాంస్కృతిక క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వాగ్దేవి, చౌదరి రవీంద్ర, తవిటమ్మ, కోదండరావు, శారద, దమయంతి, శాంతి ప్రియ, ఎండ ఉమామహేశ్వరరావు, కోరాడ వైకుంఠరావు, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగని బస్సు.. గ్రామస్తుల కస్సుబుస్సు!
● బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంపై అలుదు గ్రామస్తుల నిరసన ● ఇరువైపులా నిలిచిపోయిన వాహనం ● పోలీసుల రాకతో సద్దుమణిగిన వివాదం సారవకోట : అలుదు గ్రామంలోని బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేయడం లేదంటూ శనివారం గ్రామస్తులు రహదారిని దిగ్బంధించారు. వైఎస్సార్ సీపీ మండల కమిటీ అధ్యక్షుడు వరుదు వంశీకృష్ణ, కళ్యాణం శ్రీను ఆధ్వర్యంలో జాతీయ రహదారి 326–ఎపై నిరసన వ్యక్తం చేస్తూ ఇరువైపులా వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సెంటర్లో సుమారు 40 ఏళ్లుగా ప్రధాన వీధికి సమీపంలోని బస్టాప్ వద్ద ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు నిలుపుదల చేసి ప్రయాణికులను ఎక్కించుకునే వారు. ఇప్పుడు కేళవలస వెళ్లే జంక్షన్ వద్ద బస్సులు నిలుపుదల చేయడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 8 గంటల సమయంలో శ్రీకాకుళం నుంచి పాతపట్నం వెళ్తున్న బస్సును బస్టాప్ వద్ద నిలుపుదల చేయాలని కోరినా ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున రోడ్డు పైకి చేరుకున్నారు. అదే బస్సు పాతపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న సమయంలో బస్సుకు అడ్డగా నిల్చుని నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వెళ్తున్న బస్సులను సైతం ఆపేసి ఆందోళన కొనసాగించారు. డ్రైవర్లు, కండక్టర్లతో పాటు శ్రీకాకుళం డిపో మేనేజర్ దృష్టికి ఎన్నిసార్లు సమస్య తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న బస్టాప్ వద్ద కాకుండా గ్రామానికి సుమారు 800 మీటర్లు దూరంలో ఉన్న కేళవలస జంక్షన్ వద్ద బస్సులు నిలుపుదల చేయడంతో రాత్రి పూట ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యంగా మహిళలు, పిల్లలతో బస్సు ఎక్కాలంటే అవస్థలు తప్పడం లేదని వాపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిరసన చేపట్టాల్సి వచ్చిందన్నారు. కాగా, ట్రాఫిక్ స్తంభించిందన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులు, ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడి సర్ది చెప్పడంతో విషయం సద్దుమణిగింది. ఈ విషయమై సోమవారం జిల్లా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయనున్నట్లు స్థానికులు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా సచివాలయం ఉన్న వీధిలో బస్సులు నిలుపుదల చేసేవారు. అక్కడ బస్టాప్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడ కాకుండా కేళవలస జంక్షన్లో ఆపడంతో వృద్ధులు, పిల్లలతో వెళ్లేటప్పుడు ఇబ్బంది పడుతున్నాం. బస్టాప్ వద్దే బస్సులు ఆపాలి. – తర్ర హేమలత, అలుదు ఎక్కడో ఊరి చివరనున్న కేళవలస జంక్షన్లో బస్సులు ఆపడంతో పిల్లలు, వృద్ధులతో వెళ్లేటప్పుడు ఇబ్బంది పడుతున్నాం. బస్టాప్ నుంచి అర కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం వెళ్లిత కేళవలస జంక్షన్ వద్ద బస్సు ఎకాల్సి వస్తుంది. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు స్పందించాలి. – కళ్యాణం పార్వతి, అలుదు -
విద్యుత్ షాక్తో యువకుడు మృతి
మెళియాపుట్టి:పెద్దలక్ష్మీపురం గ్రామానికి చెందిన యువకుడు పొట్టకూటికి చైన్నె వెళ్లి మృత్యువాత పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద లక్ష్మీపురం గ్రామానికి చెందిన బమ్మిడి చంద్రశేఖర్ కొంతకాలంగా చైన్నెలో భవన నిర్మాణ పనుల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. శనివారం విధులు నిర్వర్తిస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చంద్రశేఖర్కి భార్య రేఖ, కుమార్తెలు భూమిక, వామాక్షి ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వ్యక్తి ఆత్మహత్య హిరమండలం: హిరమండలంలోని గిరిజాల వీధిలో నివాసముంటున్న తోలేటి భానుమూర్తి (55) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన స్థానిక జ్యుయలరీ షాపులో గోల్డ్స్మిత్గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకి వివాహం జరగ్గా, కుమారుడు హైదరాబాద్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారం రోజుల కిందట భార్య విశాఖలోని కుమార్తె ఇంటికి వెళ్లింది. భానుమూర్తి ఒంటరిగానే ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి భానుమూర్తికి కుమార్తె ఫోన్ చేసింది. కలవకపోయేసరికి వీధిలో ఉన్న వారికి ఫోన్ చేసింది. వారు వచ్చి ఇంట్లో తలుపులు తెరిచేసరికి ఫ్యాన్కు ఉరివేసుకొని భానుమూర్తి వేలాడుతూ కనిపించాడు. వెంటనే కుమార్తెతో పాటు భార్యకు సమాచారం అందించగా వారు వచ్చారు. హిరమండలం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. భానుమూర్తి ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. -
వరద గట్టు పూడ్చివేత
ఇచ్ఛాపురం రూరల్: ఈదుపురం బాహుదానది వరద గట్టును అదే గ్రామానికి చెందిన మోతుబారి రైతు సాడి తులసయ్యరెడ్డి పొక్లెయినర్తో దౌర్జన్యంగా తవ్వినట్టు శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అంతా...నా ఇష్టం’ కథనానికి అధికారులు స్పందించారు. తహసీల్దార్ ఎన్.వెంకటరావు ఆదేశాల మేరకు శనివారం వీఆర్వో తిరుమలరావు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం రైతుకు నోటీసు జారీ చేసి మళ్లీ వరద గట్టు పూడ్చిపెట్టారు. ప్రభుత్వ ఆస్తులను పరాయి వ్యక్తులు వాడుకోవడం గానీ, వాటిని విచ్ఛిన్నం చేసేందుకు గానీ ప్రయత్నిస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. -
రేపుతోంది కల్లోలం..
యుద్ధం రాజేసిన గ్యాస్ మంట జిల్లాలో ఆరడం లేదు. కమర్షియల్ సిలిండర్ల కొరత ఉండడంతో హొటళ్లు కట్టెలను వినియోగించి వండి వారుస్తున్నాయి. ఈ సదుపాయం లేని వారు హొటళ్లను మూసివేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పలు హొటళ్లలో ఈ దృశ్యాలు కనిపించాయి. బుకింగ్ సెంటర్ వద్ద హడావుడి కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం మామిడి x కలమట ● పాతపట్నం టీడీపీలో అంతర్యుద్ధం ● టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనుల వివరాల కోసం దరఖాస్తు చేసిన మాజీ ఎమ్మెల్యే కలమట ● ఎక్కడో చెడిన వ్యవహారం ● పనుల గుట్టు రట్టు చేయాలన్న యోచనలో కలమట సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నం నియోజకవర్గంలో చేస్తున్న పనులపై సందేహాలు ఉన్నాయా? పనుల్లో అక్రమాలు జరిగాయా? నిధుల దుర్వినియోగం జరిగిందా? పనుల్లో గోల్మాల్ చోటు చేసుకుందా? సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన జిల్లా మాజీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ అనుమానాలు రేకెత్తుతున్నాయి. తీవ్రస్థాయిలో పోరు చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత పోరు తీవ్ర స్థాయిలో నడుస్తోంది. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మధ్య నువ్వానేనా అన్నట్టుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి సాగుతోంది. ఎన్నికల్లో వీరి మధ్య మా టలు తూటాలు పేలాయి. మామిడి గోవిందరావు వ్యవహార శైలిని కలమట వెంకటరమణ ఎండగట్టగా, మాజీ ఎమ్మెల్యే కలమట బాగోతాలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తూర్పార పట్టారు. చంద్రబా బు ప్రభు త్వం వచ్చా క కూడా అదే నడుస్తోంది. ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. ఆ మధ్య ఇసుక కోసం ఇరువురి మధ్య పోరు నడిచింది. ఇప్పుడేమో నియోజకవర్గంలో చేస్తున్న అరకొర అభివృద్ధి పనులపై వివాదం కొనసాగుతోంది. మంజూరైన పనులు, వాటి ప్రగతి, నిధు లు, బిల్లుల చెల్లింపులు కావాలంటూ సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేసేవరకు వ్యవహా రం ముందుకు సాగింది. ఒకరినొకరు అడ్డుకునే పరిస్థితి నియోజకవర్గంలో ఉప్పు–నిప్పులా ఇద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఎవరి వర్గం వారిదే అన్నట్టుగా సాగుతోంది. చివరికి, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వేసిన కమిటీల్లో కలమట వర్గీయులకు చోటు దక్కలేదని, అదే సందర్భంలో తటస్థులుగా ఉన్న నాయకులను కమిటీల్లో వస్తే తమకు ఆ పదవులు వద్దంటూ కలమటతో ఉన్న సంబంధాలతో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇరువర్గా లు ఎవరి సంపాదన వారిదే అన్నట్టుగా నడుస్తోంది. ముఖ్యంగా ఇసుక విషయంలో ఇరువురి మధ్య పెద్ద వివాదమే నడిచింది. కలమటతో సంబంధం ఉన్న ఇసుక వ్యవహారాలను ఎమ్మెల్యే అడ్డుకోగా, ఎమ్మెల్యేతో సంబంధం ఉన్న ఇసుక నిర్వాకాలను కలమట అడ్డుకున్న పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ప్రతి దాంట్లో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. పనుల సంగతేంటి..? సాధారణంగా అధికార పార్టీ చేస్తున్న పనులపై ప్రతిపక్షాలు సమాచారం హక్కు చట్టం కింద దర ఖాస్తు చేసి, వివరాలు సేకరించి, లోపాలు, అక్రమా లు, దుర్వినియోగం గుట్టు రట్టు చేస్తాయి. కానీ, ఇక్కడ అధికార పార్టీ చేసిన పనులపై అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఏకంగా సమాచార హక్కు చట్టం కింద దరఖా స్తు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీలో ఉన్న నాయకుడు...అది కూడా మాజీ ఎమ్మె ల్యే, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడైన కలమట వెంకటరమణ అడిగితే వివరాలు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించే పరిస్థితి ఉండదు. అడిగిన వెంటనే ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ, అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏకంగా వివిధ కేటగిరీల కింద పనుల వివరాలు ఇవ్వాలంటూ సమాచారం హక్కు చట్టం దరఖాస్తు చేశారు. నియోజకవర్గంలో మెటీరియల్ కాంపోనెట్ కింద ఎన్ని పనులు మంజూరయ్యాయి? మంజూరైన నిధులు ఎంత? విడు దలైన నిధులెన్ని? చేపట్టి పనుల్లో ఎన్ని పూర్తయ్యా యి? ఎన్ని పనులు కొనసాగుతున్నాయి? ఇంకా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నవెన్ని? గ్రామాల వారీగా పనులేవి? చేసిన పనులకు చెల్లించిన బిల్లు ల ఎంత? ఎంబుక్ కాపీల జెరాక్స్లు, వెండర్ పేరు, వెండర్ కోడ్ రిజి స్ట్రేషన్ వివరాలు కావాలంటూ ఆ దరఖాస్తులో కోరారు. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం: ‘మీరంతా సిగ్గు వదిలేసి పనిచేస్తున్నారా... ప్రజలకు మధ్యకు వెళితే వారు చెబుతున్న మాటల కు, చేస్తున్న ఆరోపణలకు సిగ్గు అనిపించడం లేదా .. ప్రజారోగ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా బాధ్యతగా పనిచేయరా.. ఎలా చెప్పినా మీరు వినే టట్లు లేరు.. ఇక మీదట ఉన్నతాధికారులమే క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మున్సిపల్ అధికారులు, వార్డు ఎమినిటీస్ సెక్రటరీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నీటి సరఫరా విభాగం ప్రజారోగ్య విభాగంతో పాటు వార్డు ఎమినిటీస్ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్కరూ సరైన సమాధానాలు చెప్పలేకపో యారు. వారి దగ్గర రికార్డులు కూడా లేకపోవడంతో కలెక్టర్ మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. గడచిన నెల రోజులుగా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తుంటే.. ఇప్పటికి కూడా బాధ్యత మరిచి కొందరు పనిచేస్తు న్నారని ఇకమీదట ఉపేక్షించేది లేదంటూ ముగ్గురు అధికారులు, ఇద్దరు ఎమినిటీస్ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ కార్యాలయ సి బ్బందితో చెప్పారు. ఎంహెచ్ఓ డాక్టర్ సుధీర్, నీటి సరఫరా విభాగం ఏఈ సత్యనారాయణ, మరో ఏ ఈ సృజనతోపాటు సెక్రటరీలు శరత్, ఉమాలకు షోకాజు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అయితే సమావేశం పూర్తయ్యే సరికి ముగ్గురికి మాత్రమే షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మిగిలిన ఇద్దరికి ఎందుకు ఇవ్వలేదన్న దానిపై చర్చ జరిగింది. ఇప్పుడీ ఆర్టీఐ దరఖాస్తు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో కూడా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ చేపట్టిన పనులపై అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సమాచారం హక్కు చట్టం కింద వివరాలు కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. పనుల్లో అవకతవకలు జరిగాయా? అక్రమాలు చోటు చేసుకున్నాయా? నిధుల గోల్మాల్ జరిగిందా? బిల్లులు చెల్లింపుల్లో తేడాలున్నాయా? ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు ఏమైనా సంబంధం ఉందా? అందుకనే మాజీ ఎమ్మెల్యే కలమట సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాత్రం ఇదంతా ప్రభుత్వంపై వేసిన ఆర్టీఐ దరఖాస్తుగా భావిస్తున్నారు, ప్రభుత్వం చేసిన పనులతో తనకు పేరు వచ్చిందన్న అక్కసుతో కుట్రపూరితంగా కలమట వ్యవహరించారని మామిడి తేల్చి చెబుతున్నారు. దీంట్లో ఏది వాస్తవమో? సమాచారం హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తు వెనక ఉన్న వ్యూహమేంటో? కలమట తదుపరి అడుగులతోనే తేటతెల్లం కావాలి. -
40 కిలోల రామానుజాచార్యులు ఇత్తడి విగ్రహం తయారీ
సారవకోట: మండలంలోని చీడిపూడి గ్రామానికి చెందిన ఇత్తడి కార్మికుడు కింతాడ ఈశ్వరరావు శనివారం 40 కిలోల రామానుజాచార్యు లు ఇత్తడి విగ్రహాన్ని తయారు చేశారు. విజయనగరం జిల్లా కాశీపట్నంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం అక్కడి భక్తులు ఆర్డర్ చేయగా 10 రోజులు పాటు శ్రమించి ఈ విగ్రహం తయారు చేసినట్లు తయారీ దారుడు ఈశ్వరరావు తెలిపారు. దీని విలువ లక్ష రూపాయిలు అని ఆయన తెలిపారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో శనివారం అధికంగా 11,602 కేసుల్లో పదివేలకుపైగా పరిష్కరించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా ఆధ్వర్యంలో పలు సివిల్, క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాదాల నష్టపరిహారం కేసులు పరిష్కరించారని జిల్లాన్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు చెప్పారు. జిల్లా మొత్తం మీద అన్ని కోర్టుల్లో కలిసి 20 బెంచ్ లు ఏర్పాటు చేయగా జిల్లా కేంద్రంలో 4 బెంచ్లు ఏర్పాటు చేశామన్నారు. సివిల్, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులతో పాటు ప్రభుత్వ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులు కూడా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. గత డిసెంబ ర్ నెలలో నిర్వహించిన జాతీయ లోక్అదాలత్ ద్వారా 6,454 కేసులు పరిష్కారం అయ్యాయ ని చెప్పారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన కక్షిదారులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మోటార్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కేసును రాజీ చేసి కక్షిదారులకు 37 లక్షల 50 వేల రూపాయల చెక్కును జడ్జి చేతుల మీదుగా అందజేశారు. భార్యాభర్తలను కలిపారు రాజీ మార్గం ద్వారా భార్యాభర్తలు కలిసి జీవించేందుకు అదాలత్లో ఒప్పించారు. వాస్తవ పరిస్థితులు వివరించి, వారి మధ్య విభేదాలు లేకుండా చేసి, ఒక జంటను ఏడేళ్ల తర్వాత కలిపారు. ఈ కేసులు న్యాయవాది కె.సుభాష్ రాజీ ద్వారా ఒప్పించి కేసును పరిష్కరించారు. -
●కలెక్టర్ శుభాకాంక్షలు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులందరికీ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంత చిత్తంతో పరీక్ష లు రాయాలని సూచించారు. పదేళ్ల విద్యా ప్రస్థానంలో పదో తరగతి పరీక్షలు అత్యంత కీలకమైనవని, ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజ రై, క్రమశిక్షణతో చదివి, మంచి మార్కులు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలవాలని కోరారు. పరీక్ష ల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసిందని, కేంద్రాల వద్ద మంచినీరు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. -
మూలపేట పోర్టు నిర్వీర్యం చేస్తున్నారు
● మా హయాంలో పనులు వేగంగా జరిగాయి ● పోర్టు పనుల పురోగతిపై ఈ నెల 30న సందర్శన ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ టెక్కలి: మూలపేట పోర్టు పనులను పూర్తిగా నిర్వీ ర్యం చేసి పోర్టును మూలకు చేర్చే యత్నం చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం టెక్కలి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్తో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో ఎన్నో దశాబ్దాల కలగా మిగిలిపోయిన ఈ పోర్టును గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టాలు ఎక్కించారని గుర్తు చేశారు. కూటమి సర్కారు అఽధికారంలోకి వచ్చిన తర్వాత పనుల పేరిట కాలయాపన చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోర్టుకు సంబంధించి తమ హయాంలో 85 శాతం మేర పనులు పూర్తిచేశామన్నారు. ఈ పోర్టు పనుల తాజా స్థితిగతులు ప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ నెల 30న మూలపేట సందర్శన చేపడతామన్నారు. ఉత్తరాంధ్రలో వైఎఎస్సార్ సీపీకి చెందిన ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు ప్రస్తుత ఎమ్మెల్సీలతో కలసి శాంతియుతంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని అన్నివర్గాలవారు విజయవంతం చేయాలని కృష్ణదాస్ కోరారు. సమావేశంలో సంతబొమ్మాళి, కోటబొ మ్మాళి జెడ్పీటీసీలు పాల వసంత రెడ్డి, దుబ్బ వెంకటరావు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామమూర్తి, నాయకులు అన్నెపు రామారావు, చిన్ని జోగారావు, రోణంకి మల్లయ్య, పి.వెంకటరావు, బి.రాజేష్, జయరామ్ తదితరులున్నారు. -
దక్కని న్యాయం
తగ్గిన సాయం.. ● జిల్లాలో 2.79 లక్షల మందికి ‘అన్నదాత సుఖీభవ’ అందజేత ● వైఎస్సార్సీపీ హయాంలో ఏటా 3.22 లక్షల మందికి అందిన సాయం ● లబ్ధిదారుల కుదింపుపై సర్వత్రా ఆందోళనలు ● కౌలు రైతులకు అందని సాయం ● నష్టపరిహారం శూన్యం కౌలు రైతును నట్టేట ముంచారు వైఎస్ జగన్ హయాంలో కౌలు రైతును ఆదుకున్నారు. ప్రస్తు తం చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులను నట్టేట ముంచుతోంది. కౌలు రైతు కష్టాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించక పోవడం బాధాకరం. జగనన్న హయాంలో కొండపట్టాలకు కూడా రైతు భరోసా అందించేవారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. – డి.జమ్మయ్య, ఆంపురం కౌలు రైతు ఒక విడతే వచ్చింది అన్నదాత సుఖీభవ మొదటి వి డత వచ్చింది. రెండోది రాలేదు. వ్యవసాయాధికారుల చుట్టూ తిరిగాను. సచివాలయం సిబ్బందిని కలిశాను. ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. ఎందుకు ఆపేశారో ఇప్పటికీ తెలీదు. గతంలో రైతు భరోసా క్రమం తప్పకుండా వచ్చేది. కూటమి ప్రభుత్వం ఒక విడత ఇచ్చి ఇంకో విడత ఆపేస్తోంది. – ఇసా బూలోక, రైతు, కామేశ్వరిపేట శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న జిల్లాలో అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల సంఖ్య రానురాను తగ్గిపోతోంది. వైఎస్సార్సీపీ హయాంలో 3.22లక్షల మందికి వైఎస్సార్ రైతుభరో సా పేరుతో నిధులు జమ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది పూర్తి ఎగ్గొటింది. తరువాత తొలి విడత 2.74 లక్షల మందికి, రెండో విడత 2.79లక్షల మందికి అందించారు. మూడో విడత సైతం అదే తీరుగా ఉంది. ఖరీఫ్ మొదట్లో రైతులకు కావాల్సిన ఎరువులు సకాలంలో అందించక ఈ ఏడాది తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అంతేకాకుండా తుఫాన్కు నష్టపోయినవారిని సైతం పట్టించుకోకుండా వదిలేశారు. ఇన్పుట్ సబ్సిడీ సై తం అందించక రైతులకు నిరంతరం వేధిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం పండుగలా జరిగేది. చంద్రబాబు అండ్ కో నిరంతరం ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప రైతులకు మేలు జరిగే పనులు చేయడం లేదు. కూటమి పాలనలో ఏడాది పాటు అన్నదాత సుఖీభవ డబ్బులు ఎగ్గొట్టేసి కేవలం 2.74లక్షల మందికి మాత్రమే అర్హుల జాబితాలో చూపించడమే విడ్డూరం. రెండో విడతకు మొదటి విడతకు కేవలం 5వేలు మందిని అర్హులుగా పెంచడం దారుణమని రైతులు అంటున్నారు. మూడో విడతలో మాత్రం రెండో విడతలో ఎంతమందికి ఇచ్చారో ఇప్పుడూ అంతేమందికి ఇచ్చి మమ అనిపించేశారు. వ్యవసాయశాఖ మంత్రి ఉన్న జిల్లాలో రైతుల సంఖ్య తగ్గిపోయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్ సీపీ ఐదేళ్లలో అందించిన సాయమిది సంవత్సరం రైతుల సంఖ్య లబ్ధి (రూ.కోట్లలో) 2019–20 2.58లక్షలు 348.50 2020–21 2.91 లక్షలు 393.52 2021–22 3.07లక్షలు 414.57 2022–23 3.10లక్షలు 393.14 2023–24 3.22లక్షలు 434 -
జిల్లాలో గ్యాస్ కొరత లేదు: జేసీ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని జీటీ రోడ్డులో జోయాలుక్కాస్ జ్యూయలరీ నూతన షోరూం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మాథ్యూ, మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. దేశంలో తమ సంస్థ విస్తరించడంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజుల్లో నాలుగు కొత్త షోరూ మ్లు ప్రారంభించామని థామస్ మాథ్యూ అన్నా రు. ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాలు వినియోగదారుల బలమైన డిమాండ్కు అనుగుణంగా అందించి విశ్వసనీయతకు మారుపేరుగా జోయాలుక్కాస్ బ్రాండ్ను విస్తరింపజేస్తామన్నారు. ఆభరణాల తయారీ చార్జీలపై ఫ్లాట్ 40 శాతం తగ్గింపుతో ప్రారంభ ఆఫర్ ఇస్తున్నామని, మార్చి 29 వరకు నడుస్తుందన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ముంబై, బెంగుళూర్కు చెందిన మోడల్స్ పాల్గొన్నారు. సిక్కోలుకే తలమానికం.. సిక్కోలు నగరానికే తలమానికంగా జోయాలుక్కా స్ జ్యూవెలరీ షాపు నిలుస్తుందని, మహిళలకు చూడగానే ఆకట్టుకునేలా సరికొత్త డిజైన్లతో కూడిన ఆభరణాలు, వజ్రాల నెక్లెస్లు.. మగవారి హుందాకు తగ్గట్టుగా రూపొందించిన ఉంగరాలు, బ్రాస్లెట్లు చూడముచ్చటగా ఉన్నాయని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం జీటీరోడ్డులో ప్రారంభమైన షోరూమ్ను ధర్మాన సందర్శించారు. ఆయనతో పాటు రాష్ట్ర పార్టీ ఎస్ఈసీ మెంబర్ చల్లా శ్రీనివాసరావు, మండవిల్లి రవి, కోణార్క్ శ్రీను, తంగుడు నాగేశ్వరరావు, వూన నాగరాజు తదితరులున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ప్రస్తుతం వంట గ్యాస్ కొరత లేదని, వినియోగానికి సరిపడా ఉందని, అయితే పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్లో కొరత ఉండే అవకాశం ఉందని, వినియోగదారులు గ్యాస్ ను పరిమితంగా వాడాలని జాయింట్ కలెక్టర్ ఫర్మా న్ అహ్మద్ ఖాన్ తెలిపారు. జిల్లాలో గృహావసరాలకు అవసరమైన సిలిండర్లు అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో గల 39 గ్యాస్ ఏజెన్సీల వద్ద గ్యాస్ సిలిండర్లు లభ్యంగా ఉంచుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నుట్లు తెలిపారు. ఫోన్ ద్వారా గానీ, ఆన్లైన్ ద్వారా గానీ గ్యాస్ ఏజెన్సీల వద్ద గానీ నేరుగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకుంటే, బుకింగ్ చేసుకున్న ఒకటి లేదా రెండు రోజుల్లో వారి ఇళ్లకు గ్యాస్ సిలిండర్లో సరఫరా చేస్తామన్నారు. ఆయిల్ కంపెనీ నిబంధనల మేరకు ఓటిపీ, గ్యాస్ బుకింగ్ మధ్య కాలపరిమితి 25 రోజులు ఉన్నందున, వినియోగదారులు సహకరించాలని కోరారు. వాణిజ్యపరమైన గ్యాస్ సిలిండర్ల కోసం భారత ప్రభుత్వం కమిటీని నియమించినందున ఆ కమిటీ వారి నిర్ణయం మేరకు వాణిజ్య సముదాయాలకు, హోటళ్లకు వాణిజ్య గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయనున్న ట్లు తెలిపారు. ఇళ్లు, హాస్టళ్లు, ఆస్పత్రులకు ఎలాంటి ఆటంకం లేకుండా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
కలర్ఫుల్ రెజీనా
సిక్కోలులో సినీ నటి రెజీనా కసాండ్రా సందడి చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాలకొండ రోడ్డులో పాండురంగవీధిలో ‘కలర్స్ హెల్త్ కేర్’ ప్రారంభానికి విచ్చేసిన ఈమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా తలపెట్టిన ‘డ్రగ్స్ వద్దు బ్రో’ ప్లకార్డులను ప్రదర్శించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలను వీడాలని యువతకు సందేశమిచ్చారు. – శ్రీకాకుళం క్రైమ్ -
ఎన్నాళ్లీ వేదన..!
బాహుదా తీరాన..కొత్త టెండర్ గతంలో నూతన వంతెన నిర్మాణానికి రూ.20 కోట్లుకు టెండర్ పిలిచినప్పటికీ ముడి సరుకు ఖరీదు కావడంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పాత టెండర్ రద్దైపోయింది. మరలా కొత్త ప్రతిపాదనలతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సాధ్యమైనంత తొందరలో పాత టెండర్ స్థానంలో కొత్త టెండర్ వస్తుందని ఆశిస్తున్నాం. – డిక్కల విక్రమ్, ఆర్అండ్బీ ఈఈ, సోంపేటఇచ్ఛాపురం రూరల్: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రజలకు కీలకమైన బాహుదా వంతెన నిర్మాణం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటీష్ కాలం 1929లో నిర్మించిన ఈ వంతెనపై.. 2023 మే 3వ తేదీన సామర్థ్యానికి మించి సుమారు 70 టన్నుల బరువుతో గ్రానైట్ కంటైనర్ వెళ్తుండగా సగభాగం కుప్పకూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెన కూలిన మరుక్షణమే జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అప్పటి కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్తో సంఘటనా స్థలానికి చేరుకొని ప్రత్యామ్నాయంగా తాత్కాలిక వంతెన నిర్మించేందుకు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి రూ.60 లక్షలు మంజూరు చేశారు. అంతేకాకుండా అప్పటి ఆర్అండ్బీ డీఈ ఎస్.రామినాయుడు, ఇంజినీర్లు పాత వంతెన పక్కనుంచి శాశ్వత వంతెన నిర్మాణానికి సుమారు రూ.20 కోట్లతో అంచనా వేసి ప్రతిపాదనలు పంపించారు. అయితే నేటికి మూడేళ్లు దాటుతున్నా కొత్త వంతెనపై కదలిక లేదు. ప్రస్తుతం ఈ వంతెనపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు మినహా బస్సులు, లారీలు, ట్రాక్టర్లు, మినీ వ్యానులు రాకపోకలు సాగించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. టెండర్ రద్దు చేసిన ప్రభుత్వం కొత్త వంతెన నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.20 కోట్లుకు టెండర్ పిలిచింది. అయితే అప్పటి ముడి సరకులు ధరలు అధికంగా ఉండడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ టెండర్ను ఆరు నెలలు క్రితం రద్దు చేయడం స్థానికులను ఆగ్రహానికి గురి చేసింది. టెండర్ రద్దు చేసినప్పటి నుంచి కొత్తగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. సామర్థ్యం ఏడాది మాత్రమే బాహుదా పాత వంతెన సామర్థ్యాన్ని 2023 అక్టోబర్ 10వ తేదీన విశాఖపట్నంకు చెందిన ఆంధ్రా యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ కె.శ్రీనివాసరావు నేతృత్వంలో బృందం పరిశీలించింది. సుమారు 94 ఏళ్లు కావడంతో మరో ఏడాది వరకు వంతెన మన్నిక వస్తుందంటూ తేల్చి చెప్పారు. అయితే నేటికి మూడేళ్లు కావస్తున్నా... అటు ప్రభుత్వం గానీ, ఇటు ప్రజాప్రతినిధులు గానీ స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నేడు యూటీఎఫ్ మహిళా చైతన్య సదస్సు
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆడిటోరియంలో శనివారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా మహిళా చైతన్య సదస్సు నిర్వహిస్తున్నామని, మహిళా ఉపాధ్యాయులంతా హాజరై విజయవంతం చేయాలని యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి, జిల్లా కార్యదర్శి జి.శారద శ్రీకాకుళం రూరల్ ప్రధాన కార్యదర్శి కరుకోల సురేష్కుమార్, మహిళా విభాగం నాయకులు టి.సౌజన్య పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళం రూరల్ పరిధిలోని పలు ఉన్నత పాఠశాలలను సందర్శించి సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఉదయం 9.30 గంటలకు జిల్లా సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి అధ్యక్షతన జరిగే చైతన్య సదస్సులో ‘మహిళలు–నాయకత్వం– బాధ్యతలు’ అనే అంశంపై ఐద్వా పూర్వ రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, ‘మహిళలు – సమానత్వం’ అనే అంశంపై సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.మణి, ‘విద్యారంగం– మహిళల పాత్ర’ అనే అంశంపై యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్, ‘సమాజంలో మహిళలు –ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి ఎన్.అరుణకుమారి వక్తలుగా పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం ఉపాధ్యాయుల సాంస్కృతిక కార్యక్రమాలు, సమస్యలపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు. -
కవయిత్రి మొల్ల రచనలు అద్భుతం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సరళమైన తెలుగు భాషలో మొల్ల రామాయణం రచించిన కవయిత్రి మొల్లబాంబ అనేక అద్భుత రచనలు చేసి ఖ్యాతిగాంచారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎం.వి.పద్మావతి అన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు అశోక్చక్రవర్తి ఆధ్వర్యంలో శుక్రవారం మొల్ల జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ, బీసీ విభాగం నగర అధ్యక్షుడు గద్దిబోయిన కృష్ణయాదవ్, కార్యదర్శి రౌతు సూర్యనారాయణ, మట్ట రమణ, కింజరాపు రమేష్, సీహెచ్.శ్రీదేవి, గంగు కళ్యాణి, ఆర్.మహలక్ష్మి, ఆర్.సునీత, దివ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆశావహ దృక్పథంతో ముందుకుసాగాలి
ఎచ్చెర్ల: సామాజిక మాధ్యమాల ప్రభావం నుంచి దూరంగా ఉంటేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ కె.ఆర్.రజని అన్నారు. శుక్రవారం కుశాలపురం సమీపంలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నక్ కళాశాలలో జాబ్ అచీవర్స్ డే వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లోనూ గొప్ప అవకాశాలు అందుతున్నాయని చెప్పారు. అన్ని వేళలా ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. జిల్లా పారిశ్రామిక కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ప్రిన్సిపాల్ టి.విక్టర్పాల్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో కళాశాల ఎన్నో విజయాలను సాధించిందన్నారు. 90 శాతం ఉత్తీర్ణత, నూరుశాతం క్యాంపస్ రిక్రూట్మెంట్తో విద్యార్థులు కళాశాలకు గర్వకారణంగా నిలిచారన్నారు. అనంతరం ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి బాక్సింగ్ ఎంపికలు రేపు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి బాలబాలికల జూనియర్స్, యూత్ బాలబాలికలు బాక్సింగ్ ఎంపిక పోటీలు ఆదివారం జరగనున్నాయని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బలగ అనంతలక్ష్మణ్దేవ్ (అను) తెలిపారు. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం వేదికగా ఉదయం 7 గంటల నుంచి ఎంపికలు మొదలవుతాయని చెప్పారు. జూనియర్స్ విభాగంలో బాలబాలికలు 2010 జనవరి 1 నుంచి 2011 డిసెంబర్ 31 మధ్య జన్మించి ఉండాలన్నారు. యూత్ విభాగానికి 2008 జనవరి 1 నుంచి 2009 డిశంబర్ 31 మధ్య జన్మించి ఉండాలని స్పష్టం చేశారు. ప్రతిభ కనబర్చిన వారిని త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని వెల్లడించారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు, పాస్ఫొటోలతో హాజరుకావాలని కోరారు. అంతా.. నా ఇష్టం! ● వరద గట్టు తవ్వేసిన మోతుబరి రైతు ఇచ్ఛాపురం రూరల్: భారీ వరదలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట పొలాల్ని, గ్రామాన్ని కాపాడే బాహుదా నది వరద గట్టును ఓ మోతుబరి రైతు పొక్లెయినర్తో తవ్వించేశారు. ఈదుపురం పరివాహక ప్రాంతానికి ఆనుకొని బాహుదానది ప్రవహిస్తోంది. భారీ వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో వరద నీరు పంట పొలాలు, గ్రామాన్ని ముంచెత్తకుండా ఈదుపురం–ఇచ్ఛాపురం రహదారికి ఆనుకొని లక్షల రూపాయలు వెచ్చించి వరద గట్టును అధికారులు ఏర్పాటు చేశారు. స్థానిక రైతు సాడి తులసయ్యరెడ్డి తన జీడి తోటకు వెళ్లేందుకు అనువైన రహదారి మార్గం లేదంటూ గురువారం రాత్రి పొక్లెయినర్తో దౌర్జన్యంగా వరద గట్టును కూల్చి వేసి రహదారిని ఏర్పాటు చేసుకున్నాడు. విషయాన్ని గ్రామస్తులు నిలదీస్తే...‘అంతా నా ఇష్టం..’ అనడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అయినా వారు మిన్నకుండిపోయా రని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద గట్టును పూర్తిగా కూల్చి వేయక ముందే అడ్డుకోవాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన శ్రీకాకుళం అర్బన్: దేశంలో గ్యాస్ సంక్షోభం నెలకొందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సెక్స్ రాకెట్లో మన దేశానికి చెందిన కొంతమంది పెద్దలు ఉన్నారని, వారి పేర్లు త్వరలో బయటకు రాను న్నాయని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇడ్లీ పైన, దోశలు పైన, ఇసీ్త్రపైన, చిన్న చిన్న ఉద్యోగస్తులపైన పన్నులు వసూలు చేసి, యుద్ధ విమానాలు కొంటోందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరుకే చంద్రబాబు సీఎం అని, అయితే రాష్ట్రంలో ఆ నలుగురు బ్రోకర్లే ఏపీని పరిపాలిస్తున్నారని, వాళ్లే నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ అవినీతి ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని, చిన్న కుటుంబంలో పుట్టిన చంద్రబాబు నాయుడుకు నేడు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్కి లేని సంపద చంద్రబాబు ఎలా సంపాదించగలిగాడని ప్రశ్నించారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు షణ్ముఖరావు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో యువకుడు మృతి
నందిగాం: కాపుతెంబూరు పంచాయతీ లట్టిగాంలో విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందాడు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లట్టిగాంకు చెందిన గురువెల్లి మురళి(37) మూలపేట పోర్టులో వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురువారం పని ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. స్నానం చేసి డాబా పైకి బట్టలు ఆరవేయడానికి వెళ్లగా విద్యుత్ లైన్ తగలడంతో షాక్కు గురయ్యాడు. గమనించిన భార్య కృష్ణవేణి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మురళికి భార్య కృష్ణవేణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్సై షేక్ మహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి పేరిట మోసగించిన వ్యక్తి అరెస్టు
పలాస : సోంపేట మండలం జగతిపురం గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన గాజు అనిల్కుమార్ అనే యువకుడిని కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ శుక్రవారం వివరాలు వెల్లడించారు. విశాఖపట్నంలోని ఓ పార్లర్లో పనిచేసే అనిల్కుమార్ దుబారా ఖర్చులు చేస్తూ బెట్టింగ్లకు అలవాటుపడ్డాడు. దొంగతనాలు చేయడం కూడా ప్రారంభించాడు. ఈ క్రమంలో జగతిపురం గ్రామానికి చెందిన యువతి ఇన్స్ట్రాగామ్లో పరిచయమైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కాశీబుగ్గలోని ఓ లాడ్జికి రప్పించాడు. మాయమాటలు చెప్పి ఆమె వద్ద ఉన్న మూడు తులాల బంగారంతో ఉడాయించాడు. బాధితురాలు ఈ నెల 6న కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు నిందితుడు అనిల్కుమార్ను విశాఖపట్నంలో అరెస్టు చేశారు. బంగారం సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపించారు. -
ప్రభుత్వం స్పందించాలి
వంతెన నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ హయాంలో రూ.20 కోట్లతో టెండర్ పిలవగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేయడం దురదృష్టకరం. అంతే కాకుండా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారు. ఈ వంతెనపై ఇప్పటికే మూడుసార్లు విజయవాడ వెళ్లి సంబంధిత ఇంజినీర్కు వినతిపత్రాలు అందజేయడం జరిగింది. ఉగాది నాటికి ప్రభుత్వంలో ఈ అంశంపై స్పందన లేకపోతే ఏప్రిల్ మొదటి వారంలో నిరసన తెలుపడం జరుగుతుంది. – సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఇచ్ఛాపురం నియోజకవర్గం -
సిక్కోలు ‘దొర’
● మాజీ డీజీపీ హెచ్జే దొర మృతికి పలువురు సంతాపం ● ఆయన స్వగ్రామం కోటబొమ్మాళి మండలం జర్జంగి టెక్కలి, కవిటి : వెనుకబడిన జిల్లాలో పుట్టి.. అత్యున్నత శిఖరాలు అధిరోహించి.. పుట్టిన గడ్డకు ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన హనుమంతు జగన్నాథ దొర(హెచ్జే దొర) మృతిపై జిల్లాలో సంతాపాలు వెల్లువెత్తాయి. కోటబొమ్మాళి మండలం జర్జంగిలో హనుమంతు సత్యనారాయణ దొర, సుశీల దంపతుల నలుగురు సంతానంలో పెద్ద కుమారుడు హెచ్.జె.దొర. ఆయన తండ్రి సత్యనారాయణ దొర 1952లో నరసన్నపేట నియోజకవర్గ ఎమ్యెల్యేగా పనిచేశారు. హెచ్జే దొర 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డీజీపీగా పనిచేశారు. స్వగ్రామం జర్జంగిలో హైస్కూల్ ఏర్పాటు చేయించారు. 2000 సంవత్సరంలోనే పాఠశాలకు కంప్యూటర్లు అందజేశారు. ఏటా 6 నుంచి 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదుతో పాటు ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. ప్రస్తుతం ఈయన సొంత గృహంలో జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి శిక్షణ నిర్వహిస్తున్నారు. గ్రామంలో దేవాలయాలను నిర్మాణం చేశారు. దొర మృతిపై జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, జర్జంగి సర్పంచ్ అన్నెపు సుశీల, ఎంపీటీసీ అన్నెపు తులసీబాయి, అన్నెపు రామారావు, పూజారి వాసుదేవరావు, సంపతిరావు హేమసుందర్రాజు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమదాలవలస: మాజీ డీజీపీ దొర మృతి పట్ల మాజీ స్పీకర్, మంత్రి తమ్మినేని సీతారాం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో జన్మించి, పోలీసు శాఖలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి జిల్లా కీర్తి ప్రతిష్టలను జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నరసన్నపేట: ఉమ్మడి ఏపీ డీజీపీతో పాటు పలు పదవులను బాద్యతగా నిర్వహించిన వ్యక్తిగా హెచ్జే దొర ఎంతో గుర్తింపు పొంది జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు.ఏపీ ఒలింపిక్ అసోషియేషన్ అధ్యక్షునిగా దొర పనిచేసిన సమయంలో తాను ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించానని గుర్తు చేశారు. దొర మంచి క్రీడా ప్రేమికుడని కొనియాడారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మాజీ డీజీపీ హెచ్.జే. దొర మృతి పట్ల మాజీ కాళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల రామారావు (లక్ష్మణరావు) సంతాపం వ్యక్తం చేశారు. దొర సాధించిన విజయాలు జిల్లాకు గర్వకారణమని కొనియాడారు. శ్రీకాకుళం అర్బన్: దొర మృతి పట్ల డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలియజేశారు. -
యువతిపై హత్యాయత్నం
పలాస: కాశీబుగ్గ కొండివీధికి చెందిన యువతిపై అదే వీధిలో ఉంటున్న గంధం కామేశ్వర రావు కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీబుగ్గ 10వ వార్డులోని కొండి వీధిలో కామేశ్వరరావు, యువతి కుటుంబాలు పక్క పక్కనే ఉంటున్నా యి. కామేశ్వరరావు కుమారుడు సాయి.. యువతి మొబైల్ వాట్సాప్కు ‘డార్లింగ్’ అంటూ మెసేజ్ పంపించడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అర్ధరాత్రి కామేశ్వరరావు మరో కుమారుడు గంధం సాగర్ కత్తితో యువతిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువతిని వెంట నే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం ఆసుపత్రి కి తీసుకెళ్లగా ఐసీయూలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గంధం సాయి, సాగర్లను అదుపులోకి తీసుకున్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎచ్చెర్ల : రాజీవ్గాంధీ వైజ్ఞానిక విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తు న్న సండ్ర అమరేంద్రనాథ్ ట్రిపుల్ ఐటీ నూతన డైరెక్టర్గా గురువారం బాధ్యత లు స్వీకరించారు. ఇంతకుమందు డైరెక్టర్గా పనిచేసిన బాలాజీ వల ంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా అమరేంద్రనాథ్ మాట్లాడుతూ విద్యాల యం ప్రగతికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్ర మంలో పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, వాసు పొల్గొన్నారు. టెక్కలి: టెక్కలి జగతిమెట్ట సమీపంలో ప్రస్తు తం నిర్మాణం జరుగుతున్న పెట్రోల్ బంక్కు ఎదురుగా మరోసారి స్థల వివాదం చోటు చేసుకుంది. స్థలం ప్రభుత్వానికి చెందినదంటూ తహసీల్దార్ బి.సత్యం, డీటీ రవికుమార్, రెవెన్యూ సిబ్బంది నేతృత్వంలో గురువారం గోతులు తవ్వేందుకు సిద్ధమయ్యారు. అయితే, అన్ని రకాల అనుమతులతో స్థలాన్ని రిజిస్ట్రేషన్లు చేసుకున్నామని, ఈ స్థలం ప్రభుత్వానిది ఎలా అవుతుందంటూ కొనుగోలుదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎలా గోతులు తవ్వుతారంటూ నిలదీశారు. దీంతో గోతులు తవ్వడం ఆపేశారు. -
గంజాయి తరలిస్తూ కేరళ వాసి అరెస్టు
రణస్థలం: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని లావేరు పోలీసులు గురువారం పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. లావేరు పోలీస్ స్టేషన్లో జె.ఆర్.పురం సీఐ ఎం.అవతారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. కేరళ రాష్ట్రం కన్నూర్ జిల్లా ఇరుక్కుర్ పంచాయతీ పల్లిపాత్ హౌస్ గ్రామానికి చెందిన అబ్దుల్ రవూఫ్ సుభద్రాపురం జంక్షన్లో అనుమానాస్పదంగా సంచరించడంతో గురువారం పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నాలుగు గంజాయి బండీలు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం కూర్గ్ జిల్లాకు చెందిన మహమ్మద్ అలీ సూచన మేరకు ఒడిస్సా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన రాజు (నాగేన్ ప్రధాన్) వద్ద నుంచి గంజాయి తీసుకొస్తున్నట్లు అంగీకరించాడు. మహేంద్రగడ నుంచి పర్లాకిమిడి వరకు, అక్కడి నుంచి పలాస వరకు, అక్కడి నుంచి సుభద్రపురం జంక్షన్ వరకు వేర్వేరు బస్సులో రవూఫ్ వచ్చాడు. విశాఖ వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అవతారం తెలిపారు. విలేకరుల సమావేశంలో లావేరు ఎస్సై కె.అప్పలసూరి, సిబ్బంది ఉన్నారు. -
గిరిజన రహదారుల పనుల పరిశీలన
పాతపట్నం: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రహదారి నిర్మాణ పనులపై పలువురు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందడంతో, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు రహదారుల నిర్మాణాల పనులను పరిశీలించారు. గురువారం మండలంలోని నల్లబొంతు గిరిజన గ్రామానికి ఉపాధి హామీ పథకం కింద రూ.కోట్లతో ఇటీవల నిర్మాణం చేపట్టిన రహదారిని పరిశీలించారు. బీటీ, సిమెంట్, మెటల్ రోడ్లును పరిశీలిస్తున్నారు. పాతపట్నం, మెళియాపుట్టి మండలంలోని పలు రహదారులను పరిశీలించనున్నట్లు తెలిపారు. సాంకేతిక ఆమోదానికి అనుగుణంగా ప నులు జరిగాయా లేదా? అని చూస్తున్నారు. రోడ్డు పొడవు, వెడల్పులు, ఎం బుక్లోని వివరాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని నిశితంగా గమనిస్తున్నారు. విజిలెన్స్ అధికారులు పనులకు, రికార్డులకు తేడాలను పరిశీలిస్తున్నారు. ఏమైనా లోపాలు బయటపడితే సంబంధిత అధికారులు, కాంట్రాక్టులపై చర్యలకు ఉన్నతాధికారులకు తెలియజేస్తారని తెలిపారు. తనిఖీల్లో డ్వామా పీడీ బి.లవరాజు, ఐటీడీఏ డీఈఈ వర్మరాజు, ఎంపీడీఓ రమణమూర్తి, ఏపీఓ సురేష్, సర్పంచ్ మార్కండేయులు, ఏఈలు పాల్గొన్నారు. -
కేంద్రాల కేటాయింపులో కిరికిరి!
ఆమదాలవలస : ఆమదాలవలస పట్టణంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల సెంటర్ కేటాయింపుల్లో అధికారుల తీరు సక్రమంగా లేదని, దీనివల్ల మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం ఉందని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో 11 ప్రైవేటు పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులకు వేర్వేరు కేంద్రాల కేటాయింపు జరగ్గా, ఒక ప్రైవేటు పాఠశాలలో మాత్రం పదుల సంఖ్యలో విద్యార్థులకు ఒకే కేంద్రం కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. ఈ పాఠశాల నుంచి 43 మంది విద్యార్థులకు గేటులోని మున్సిపల్ హైస్కూల్ కేంద్రం కేటాయించారు. ఇక్కడే ఉన్న మరో పాఠశాలలో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు మాత్రమే ఉండగా వీరికి పట్టణంలోని రెండు కేంద్రాలు కేటాయించారు. ముగ్గురున్న పాఠశాల విద్యార్థులకు రెండు కేంద్రాలు, 43 మంది విద్యార్థులున్న పాఠశాల విద్యార్థులకు ఒకే కేంద్రాన్ని కేటాయించడం ఎంత వరకు సమంజసమని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారని తీరు.. ఇదే ప్రైవేటు పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థులందరికీ 2023 – 24 విద్యా సంవత్సరంలో సమీపంలోని మరో ప్రైవేటు స్కూల్ను కేంద్రంగా కేటాయించగా అప్పట్లో మాస్ కాపీయింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. తర్వాత సంవత్సరం ఆ కేంద్రాన్నే రద్దు చేశారు. 2024 – 25 విద్యా సంవత్సరంలో అదే ప్రైవేటు పాఠశాల విద్యార్థులందరికీ గేటు మున్సిపల్ హైస్కూల్ కేటాయించగా అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయంలో తమకు సంబంధం లేదని జిల్లా విద్యా శాఖాధికారుల నుంచి రాష్ట్ర విద్యాశాఖాధికారులు వరకు ఒకరిపై ఒకరు నెపం పెట్టుకొని తప్పించుకున్నారు. తాజాగా ఈ నెల 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల్లో అదే పాఠశాలకు చెందిన 43 మంది విద్యార్థులకు గత ఏడాదిలాగే అదే మున్సిపల్ హైస్కూల్ గేటు ప్రాంతంలో కేంద్రం కేటాయించారు. ఇలా ఏటా విద్యా శాఖాధికారులు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేంటని ఫిర్యాదులు చేస్తే.. ఆ రెండు స్కూళ్లు ఒక జోన్ పరిధిలోకి వస్తాయని చెబుతున్నారు. అయితే, అంతకంటే దూరంలో ఉన్న వెదుళ్లవలస, కొర్లకోట వంటి దూర ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆ జోన్ పరిధి దాటించి పట్టణంలోని పలు కేంద్రాలకు కేటాయిస్తుండటం గమనార్హం. ఎక్కడా ఇలా లేదు... రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలో కూడా ఒకే పాఠశాలకు చెందిన పదుల సంఖ్యలో విద్యార్థులకు ఒకే కేంద్రం కేటాయించడం లేదు. కానీ ఆమదాలవలసలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఇలా ఓ ప్రైవేటు పాఠశాలకు కొమ్ముకాస్తూ విద్యాశాఖాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు తెలివైన విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఆమదాలవలస పట్టణంలో ఒకే పాఠశాలకు చెందిన 43 మంది విద్యార్థులకు గేటు ప్రాంతంలోని మున్సిపల్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో కేటాయించడం వాస్తవమే. అయితే ఆ ప్రక్రి య కమిషనర్ కార్యాలయం నుంచి జరుగుతుంది. ఇందులో మా ప్రమేయం లేదు. – కె.ఎ.రాములు, ఆమదాలవలస ఎంఈఓ సుమారు 280 మంది పట్టే సెంటర్లో ఒకే స్కూల్కు చెందిన 43 మంది విద్యార్థులను వేయడం పెద్ద సమస్య కాదు. విద్యార్థులను పరీక్ష సమయంలో విడివిడిగా కూర్చోబెడతా రు. దీనివల్ల ఏమీ ఇబ్బంది లేదు. అయినప్పటికీ ఇలా ఒకే స్కూల్ విద్యార్థులను ఒకే పరీక్ష కేంద్రంలో వేసినట్లు మా దృష్టికి వస్తే సరిచేసేందుకు చర్యలు చేపడతాను. – రవిబాబు, జిల్లా విద్యాశాఖాధికారి -
2,79,100 రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో 2,79,100 రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథ కం వస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘సూపర్ సిక్స్‘ కార్యక్రమంలో భాగంగా అన్న దాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి రూ.20వేలు ఇస్తామన్నారు. జిల్లాకి సంబంధించి 2,79,100 రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథ కం కింద రూ.4000 చొప్పున మూడో విడతగా రూ.111.64కోట్లు జమచేయనున్నట్లు తెలిపారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘సాక్షి’లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. తమపై కీలక నేత ఒత్తిళ్లు లేవని, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని శ్రీకాకుళం, గార మండల పరిషత్ అధికారులు, రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. తన సస్పెన్షన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, దీని వెనక ఎవరో ఉన్నా రని భావించడం లేదని హనుమంతు కూర్మారావు తెలిపారు. అధికారుల సెలవుల వెనక వారి వ్యక్తిగత కారణాలు తప్ప మరేమీ లేదని మున్సిపల్ అధికారులు ప్రకటన ద్వారా వెల్లడించారు. పట్టణ టీడీపీ నాయకులు సైతం ప్రెస్ మీట్ పెట్టి, ఎమ్మెల్యేపై చేస్తున్న ఆరోపణలు సరికాదని చెప్పారు. సంతబొమ్మాళి: పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లక్కీవలస గ్రామంలో గురువారం లేగ దూడల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా కార్యనిర్వహణాధికారి డాక్టర్ సీహెచ్ సత్యప్రకాష్ మాట్లాడుతూ లేగ దూడలకు వచ్చే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం పాడి పశువుల కొనుగోలు రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల పశువుల కొనుగోలు చేయడం కష్టమని, అందువల్ల తమ దగ్గర ఉన్న పశువులనే సంతానానికి పనికివచ్చే పశువులుగా మార్చుకోవాలని కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి న ఆడదూడల ఉత్పత్తి పథకాన్ని పాడి రైతులందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. 41 లేగ దూడలు పోటీల్లో పాల్గొన్నాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. ‘హెచ్పీవీ వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలి’ టెక్కలి: బాలికల్లో గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందస్తు నివారణ కోసం ఉచితంగా అందజేస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలని టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి కోరారు. హెచ్పీవీ వ్యాక్సిన్పై అవగాహన కోసం గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యురాలు ఎస్.గాయత్రీ మాట్లాడుతూ 14 ఏళ్లు పూర్తయి 15 వ సంవత్సరం లోపు (పుట్టిన రోజుకు మునుపు) బాలి కలకు మాత్రమే ఈ వ్యాక్సిన్ వేస్తారని తెలిపా రు. టెక్కలి మండలంలో 384 మంది బాలికలను గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. టెక్కలి మండలం కె.కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ వ్యాక్సిన్ వేస్తారని వైద్యురాలు గాయత్రీ వెల్లడించారు. ఉదయం 9 నుంచి సాయంత్ర 4 గంటల వరకు వ్యాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు. ఆధార్ కార్డుతో పాటు ఆధార్ అనుసంధానం కలిగిన ఫోన్ నంబర్తో పీహెచ్సీకు రావాలని కోరారు. నేడు కవయిత్రి మొల్ల జయంతి శ్రీకాకుళం పాతబస్టాండ్: కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ(మొల్ల) జయంతి శుక్రవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు కవయిత్రి మొల్ల చిత్రపటానికి పుష్పమాలాంకరణ, అనంతరం జ్యోతి ప్రజ్వలన నిర్వహించనున్నారు. -
27 నుంచి జిల్లా స్థాయి రెవెన్యూ క్రీడలు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఆంధ్రప్రదేశ్ రెవె న్యూ సర్వీసుల సంఘం, శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న ట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ గురువారం వెల్లడించారు. కోడి రామమూర్తి స్టేడియం వేదిక గా జరిగే ఈ క్రీడా ఉత్సవంలో కలెక్టరేట్, టెక్కలి, శ్రీకాకుళం, పలాస యూనిట్లు పాల్గొంటా యని చెప్పారు. టగ్ ఆఫ్ వార్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, త్రోబాల్, కేరమ్స్, చెస్, షటిల్, మ్యూజికల్ చైర్, స్కిప్పింగ్, షాట్ఫుట్, వాకింగ్, రన్నింగ్ తదితర పోటీలు నిర్వహించనున్న ట్లు తెలిపారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 24 మంది వీఆర్వోలకు గ్రేడ్–2 వీఆర్వోలుగా గురువారం పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ లో అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లకు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ, సంఘం జిల్లా అధ్యక్షుడు డి.రాజేష్కుమార్, సహాధ్యక్షుడు అప్పలనాయుడు, సెక్రటరీ బి.రాంజీ, ట్రెజరర్ జి.ఢిల్లేశ్వరరావు పాల్గొన్నారు. నందిగాం: నౌగాంలో భర్తపై భార్య కత్తితో దాడికి పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లి సుందరరావు, కర్రెమ్మలకు సుమారు 25 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి కుమారు డు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు దుబాయ్లో పనిచేస్తున్నాడు. సుందరరావు, కర్రెమ్మలకు మనస్పర్థలు రావడంతో ఐదేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. సుందరరావు తన తల్లి వద్ద ఉంటూ అప్పుడప్పుడూ తాగి కర్రెమ్మ ఇంటికి వచ్చి గొడవ చేసేవాడు. ఈ క్రమంలో గురువారం తాగి వచ్చి గొడవ పెడుతుండగా భార్య కర్రెమ్మ కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి సుందరరావును టెక్కలి జిలా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. -
బడుగుల జెండా
ఊరూరా ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకగుండెల నిండా.. బడుగుల పార్టీ వైఎస్సార్సీపీ బడా బాబుల పార్టీ కాదు. బడుగుల పార్టీ. వైఎస్ జగన్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీ ని ఈ స్థాయిలో నిలబెట్టారు. ఇప్పు డు జరుగుతున్న దాడులు, కుట్రలు తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ యువజన శ్రామిక రైతుల జెండా ఊరూరా సగర్వంగా ఎగిరింది. స్పష్టమైన భవిష్యత్ లక్ష్యాలతో, స్వచ్ఛమైన భావజాలంతో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుక గురువారం పండగ వాతావరణంలో జరిగింది. అందరి లక్ష్యం ఒక్కటే.. జన సంక్షేమం. అందరి నినాదం ఒక్కటే.. ప్రజాభ్యుదయం. మాటల ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూనే అధికార పీఠాన్ని అధిరోహించే దిశగా కార్యకర్తలకు నాయకులు దిశా నిర్దేశం చేశారు. వైఎస్సార్ ఆశయ సాధనే ధ్యేయమని చాటి చెప్పారు. ఇచ్ఛాపురం: వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పిస్తున్న సమన్వయకర్త సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు తదితరులు సంక్షేమమే మన లక్ష్యం ప్రజాసంక్షేమమే వైఎస్సార్ సీపీ లక్ష్యం. అందు కోసమే ఈ పార్టీ ఆవిర్భవించింది. ఇంటి వద్దకే పాలన అందించిన ఘనత ఒక్క వైఎస్ జగన్ దే. కూటమి మోసాలు ప్రజలు గమనిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడుతుంది. – పిరియా విజయ, జెడ్పీ చైర్ పర్సన్, నర్తు రామారావు, ఎమ్మెల్సీ – సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పార్టీ ఇచ్ఛాపురం సమన్వయకర్త కార్యకర్తలే బలం వైఎస్సార్సీపీకి కార్యకర్తలే కొండంత బలం. వైఎస్సార్ ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీయే వైఎస్సార్ సీపీ. ‘నేను వైఎస్సార్ సీపీ..’ అని ధైర్యంగా చెప్పగలిగే పాలన అందించాం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగడదాం. – ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పేదల పార్టీ.. పేదల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ. సంక్షేమం, అభివృద్ధి రెండూ ఈ పార్టీకి రెండు కళ్లు. అదే పంథాలో వైఎస్ జగన్ పాలించి చూపించారు. చంద్రబాబును ఎప్పుడు గద్దె దింపుదామా అని జనం చూస్తున్నారు. – రెడ్డి శాంతి, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే పాతపట్నం: ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నరసన్నపేట: కేకు కట్చేస్తున్న ధర్మాన కృష్ణదాస్, కృష్ణచైతన్య. చిత్రంలో అంధవరపు సూరిబాబు -
అశ్లీలం.. అకృత్యం
● ఓ విద్యా సంస్థలో విద్యార్థినుల ఫొటోల మార్ఫింగ్ ● తల్లిదండ్రుల ఫిర్యాదుతో బయటపడిన వైనం ● కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం సమీపంలోని ఓ విద్యా సంస్థలో కొందరు విద్యార్థులు చేసిన అకృత్యాలు బయటపడ్డాయి. దీంతో విద్యార్థులంతా కాలేజీ ప్రాంగణంలోనే సి–బ్లాక్ వద్ద గురువారం భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. వారి తల్లిదండ్రులకు కూడా విషయం తెలియడంతో కాలేజీకి వచ్చి నినాదాలు చేశారు. రూరల్ పోలీసులు వచ్చి పరిస్థితి సద్దుమణిగించారు. ఏం జరిగిందంటే.. కాలేజీలో కొన్ని రోజుల కిందట విద్యార్థుల సమ క్షంలో ఓ కార్యక్రమం జరిగింది. కొందరు విద్యా ర్థులు డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిల ఫొటోలు తీసి సాంకేతిక సాయంతో వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేశారు. ఆ ఫొటోలను ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో కాలేజీకి నిత్యం బస్సులో వచ్చే ఓ అమ్మాయికి ఆమె మార్ఫింగ్ చిత్రం ఓ అబ్బాయి సెల్ఫోన్లో కంట పడింది. దీంతో ఆమె నిశ్చేష్టురాలై ఇంటిలో విషయం చెప్పింది. వారు ఆ అబ్బాయి వద్దకు వెళ్లి చిత్రాలు డిలీట్ చేయించారు. కానీ కాలేజీలో చాలా మంది అమ్మాయిల ఫొటోలు ఇలాగే మార్ఫింగ్ చేసి షేర్ చేసిన వాస్తవం తెలిసింది. దీంతో వారు వెంటనే కాలేజీ యాజమాన్యాన్ని అప్రమత్తం చేశారు. దీనికి కారణమైన విద్యార్థికి టీసీ ఇచ్చేశామని, మరో నలుగురికి కూడా వారం కిందట టీసీలు ఇచ్చామ ని తెలిపారు. దీనిపై కాలేజీ యాజమాన్య ప్రతినిధులు గురువారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వదంతులు నమ్మవద్దని ఓ ప్రకటన విడుదల చేశారు. -
‘గ్యాస్ భారం మోపడం సరికాదు’
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వంట గ్యాస్ సిలిండర్లపై రూ.60, వాణిజ్య సిలిండర్లపై రూ.115 పెంచడం ద్వారా ప్రజలపై భారీగా భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని ఏఐటీయూసీ సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొత్స సంతోష్ తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం నగరంలో మున్సిపల్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకవైపు దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, మరోవైపు ప్రజలపై ఇలాంటి భారాలు మోపుతున్నారని, దీన్ని తీవ్రంగా ఖండించాలని అన్నారు. దేశంలో అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు అనేక రాయితీలు కల్పిస్తూనే సామాన్య ప్రజలపై పెను భారం మోపడం సరికాదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం జీఎస్టీ పేరుతో అనేక భారాలు మోపుతోందని, రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని, దీని కారణంగా రవాణా చార్జీలు భారీగా పెరుగుతాయని, కేంద్ర ప్రభుత్వం అన్ని నిత్యావసర వస్తువుల ధరలను పెంచడానికి సిద్ధమవుతోందని, ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి టీడీపీ కేడర్ చేరిక
పోలాకి: మండలంలో తీరప్రాంత గ్రామమైన కొత్త రేవు పంచాయతీ నుంచి టీడీపీకి చెందిన పలు కుటుంబాలు గురువారం వైఎస్సార్సీపీలో చేరా యి. టీడీపీ మండల కార్యదర్శి బొడ్డేపు కృష్ణారెడ్డి, యువజన విభాగం నాయకుడు గుండాల రవితోపాటు సుమారు వంద మంది వరకు వైఎస్సార్సీపీ లో చేరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీరప్రాంత గ్రామాలను పట్టించు కోవటం మానేశారని, కేవలం ఓటు బ్యాంకుగానే తమను చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ టీడీపీ ని వీడుతున్నట్లు ప్రకటించారు. వీరందరికీ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కొత్తరేవు పంచాయతీలోని వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని పార్టీ నాయకులు అడ్ల శ్రీను, మిత్తన శ్రీను వివరించారు. అనంతరం కృష్ణదాస్ మాట్లాడుతూ తీరప్రాంత మత్స్యకార గ్రా మాలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని హామీఇచ్చారు. జిల్లాలో మత్స్యకారులకు జగన్ హయాంలోనే గుర్తింపు వచ్చిందన్నారు. కార్యక్రమం లక్ష పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అంధవరపు సూరిబాబు, జెడ్పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణచైత న్య, ఎంపీపీ ముద్దాడ భైరాగినాయడు, మాజీ డీసీ సీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కణితి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
సిలిండర్లు లేక..
● మూత పడుతున్న రెస్టారెంట్లు ● విపరీతంగా పెరిగిన ఇండక్షన్ స్టవ్ ధరలు ● కట్టెలకూ పెరిగిన డిమాండ్ శ్రీకాకుళం: జిల్లావ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్లు లేక పలు రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడుతున్నా యి. గురువారం శ్రీకాకుళం నగరంలోని సుమారు 7 రెస్టారెంట్లు మూతపడ్డాయి. జిల్లావ్యాప్తంగా కూడా 40 వరకు రెస్టారెంట్లు మూతపడినట్లు తెలుస్తోంది. కొందరు మాత్రం గ్రామస్థాయి నుంచి సిలిండర్లను తెచ్చుకొని ఏదోలా రెస్టారెంట్లు నడుపుతున్నప్పటికీ ఇది అధిక భారం అవుతోంది. ఇలా గ్రామస్థాయిలో దొరికే సిలిండర్లు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. బుధవారం ఒకటి రెండు రెస్టారెంట్లలో మాత్రమే కట్టెల పొయ్యిపై వంటలు చేయగా గురువారం దాదాపుగా ప్రతి హోటల్లోనూ కర్రల పొయ్యిను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కొద్ది నెలలు ఇదే పరిస్థితి ఉంటుందని భావించిన కొందరు కరెంటుతో పని చేసే ఇండక్షన్ స్టవ్ల కోసం ఆరా తీస్తూ వచ్చారు. ఇదే అదనుగా ఆ స్టవ్ల ధరలు కూడా విపరీతంగా పెంచేసినట్లు సమాచారం. రెస్టారెంట్లే నడపలేకపోతున్న తరుణంలో ఇప్పటికే కొన్ని వివాహాది శుభకార్యాలకు వంటలు ఒప్పుకున్న కొందరు అవి ఎలా చేయాలో అన్న ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కట్టెలకు కూడా డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వం పునరాలోచన చేసి కొంతమేరైనా గ్యాస్ను సరఫరా చేయాలని పలువురు కోరుతున్నారు. లేకుంటే సిబ్బందికి జీతాలు, కరెంటు బిల్లులు చెల్లించే పరిస్థితి ఉండదని చాలా మంది తీవ్రంగా నష్టపోతారని హోటల్ రెస్టారెంట్లు యజమానులు అంటున్నారు. -
రానున్నది మనమే
రాష్ట్రంలో రానున్నది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే. అందుకోసం అందరం కలిసికట్టుగా పని చేయాలి. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలి. – చింతాడ రవికుమార్, వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త వైఎస్సార్ ఆశయ సాధన కోసం.. వైఎస్సార్ ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ. వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేయడానికి కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి. – పేరాడ తిలక్, పార్టీ టెక్కలి సమన్వయకర్త మనది ప్రజా పక్షం వైఎస్సార్ సీపీది ఎప్పుడూ ప్రజల పక్షమే. జనంతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలి. రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం మరో మూడేళ్లలో వీడిపోతుంది. – గొర్లె కిరణ్కుమార్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే -
ప్రతినిత్యం ప్రజాపక్షం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం పురుడు పోసుకుని అనేక పోరాటాల నడుమ, ప్రజల ఆశీస్సులతో ఎదిగిన రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీ. అనేక ఒడిదుడుకుల మధ్య ప్రజా పార్టీగా నిలిచిన వైఎస్సార్సీపీ గురువారం 16వ వసంతంలోకి అడుగు పెడుతోంది. 2011 మార్చి 12న అవతరించి ప్రజలకు అండగా నిలవడమే కాకుండా సంక్షేమ, అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లింది. పార్టీ ఆవిర్భావం నుంచి పోరాటాలనే నమ్ముకుంది. ఓదార్పు యాత్రతో ప్రారంభమై ప్రజల కష్టాల్లో భాగస్వామ్యమైంది. 2011 నుంచి 2019 వరకు అలుపెరగని పోరాటం చేసి ప్రజల మనసులను గెలుచుకుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో 2014 ఎన్నికల్లో పాల్గొని ప్రధాన ప్రతిపక్షంగా జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. అంతకుమించి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ భేరి మోగించారు. 2014–19 మధ్య అనేక ప్రజా సమస్యలపై ఉద్యమించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజల మధ్య నడిచి జిల్లాలో ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. సుదీర్ఘ పాదయాత్ర ఇచ్ఛాపురంతో ముగించి ఎన్నికల కదన రంగంలోకి దిగారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను ఎనిమిదింటిని దక్కించుకుని పూర్తి ఆధిపత్యం కనబరిచారు. అనేక సంస్కరణలు, విప్లవాత్మక నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెటర్నరీ క్లినిక్లను నిర్మించారు. వేలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించారు. జగనన్న కాలనీలతో పేదల సొంతింటి కల నెరవేర్చారు. వంశధార ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేశారు. మూలపేటలో పోర్టు నిర్మించారు. ఉద్దానంలో పట్టి పీడిస్తున్న కిడ్నీ రోగుల కోసం రీసెర్చ్ కమ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు డయాలసిస్ సెంటర్లు నిర్మించారు. సురక్షిత మంచినీరు అందించేందుకు ఉద్దానానికి రూ.800 కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మించారు. ఆరోగ్యశ్రీతో పాటు 108, 104 సేవలను విస్తృతం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్తో వేలాది మంది ప్రాణాలు నిలబెట్టారు. బుడగట్లపాలెంలో పిషింగ్ హార్బర్, ఆమదాలవలస నియోజకవర్గంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్, వెటర్నరీ పాలిటెక్నిక్, హార్టీకల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికీ పథకాలు అందాయి. ప్రజల జీవితాల్లో ప్రగతి సుమాలు విరబూశాయి. ఎంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించినా 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడానికి వెనుక అనేక కుట్రలు ఉన్నాయన్న సందేహం అందరిలో ఉంది. ఓటు వేశాం గాని.. ఎందుకో గెలవలేదన్న వారు లక్షల్లో ఉన్నారు. ఓడినా వెనక్కి తగ్గకుండా ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు, హత్యా రాజకీయాలు, పచ్చనేతల లైంగిక వేధింపులు, పోలీసుల ఉక్కుపాదం.. ఇలా ఎన్నో అకృత్యాలపై ఉద్యమాలు చేస్తూనే ఉంది. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయ తొక్కిసలాట నుంచి శ్రీకాకుళంలో చోటు చేసుకున్న డయేరియా వరకు బాధితుల పక్షాన నిలిచింది. ప్రజా పోరాటమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం తథ్యమన్న స్థాయికి చేరుకుంది. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ౖవెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నరసన్నపేటలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ, ఉదయం 10.30 గంటలకు శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్కు చేరుకుని దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించడం, ఉదయం 11 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ జరుగుతుందని పేర్కొ న్నారు. అనంతరం కార్యకర్తల సమావేశం ఉంటుందన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
●రిజిస్ట్రేషన్ భూమిలో రోడ్డు
కూటమి నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఇదేంటని ప్రశ్నిస్తున్న వారిపై దౌర్జన్యానికి దిగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం నైరా పంచా యతీ వెంకటాపురంలోని గొల్లవీధి గ్రామంలో పల్ల చిన్నవాడుకు చెందిన రిజిస్ట్రేషన్ భూమిలో తూర్పువైపు రెండున్నర అడుగుల స్థలంలో కూటమి నాయకులు ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయించేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టి భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇదే విషయమై బాధిత కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు బుధవారం వాగ్వాదానికి దిగారు. – శ్రీకాకుళం రూరల్


