breaking news
Srikakulam District News
-
ఇన్ని లోపాలు ఏంటి సర్?
కవిటి: కవిటి బెహరావీఽధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ లోపభూయిష్టంగా జరుగుతోందని వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం పార్టీ రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, సల్ల దేవరాజ్తో కలిసి కవిటి బెహరావీధిలోని పలు పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా బీఎల్వోలు విధులు నిర్వహించడం తగదన్నారు. 89వ పోలింగ్స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో ఆరుగురు ఓటర్లు ఉండగా వారిలో కేవలం ముగ్గురికే ఎస్ఐఆర్ ఫారాలు అందించి మిగిలిన వారికి ఇవ్వలేదన్నారు. బీఎల్ఏగా ఉన్న బెందాళం రమణమూర్తికి కూడా ఒక్క ఫారం మాత్రమే అందజేశారని చెప్పారు. బీఎల్ఏకే ఇలా జరిగితే నిరక్ష్యరాస్యులైన ఓటర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇంటింటికి వెళ్లకుండా అందరినీ ఒకేచోటికి రప్పించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. 92వ పోలింగ్ కేంద్రం బీఎల్ఓ జానకిరావు.. నాగుల గిరిదాస్ అనే వ్యక్తి ఇంట్లో ఐదుగురు ఓటర్లకు గాను ఇద్దరికే ఫారాలు ఒక్కొక్కటి ఇచ్చారని, దీనిపై ప్రశ్నించగా రెండు ఇస్తే పోగొట్టుకుంటారని తన వద్ద ఉంచేశానని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిటి మండల కేంద్రంలోనే ఈ తరహా పనితీరు కనిపిస్తుంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇటీవల కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సైతం తహసీల్దార్ టి.కల్యాణచక్రవర్తి మాట్లాడుతూ బీఎల్ఓలను నియంత్రించలేకపోతున్నానని చెప్పడం గమనార్హం. 23 ఓట్ల తొలగింపునకు కుట్ర! సారవకోట: చిన్నకిట్టాలపాడు పంచాయతీ బొంతుగూడలో 23 మంది గిరిజనుల ఓట్లు తొలగించేందుకు స్థానిక టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేశారు. మంగళవారం విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ మండల కమిటీ ఉపాధ్యక్షుడు బొంగు కొండయ్య, డీఎల్డీఏ చైర్మన్ నక్క తులసీదాస్లు గ్రామానికి చేరుకుని బీఎల్ఏలతో మాట్లాడారు. దీంతో గిరిజనులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. 23 మంది ఓటర్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని, తుది జాబితాలో వారి పేర్లు లేకపోతే పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని నాయకులు స్పష్టం చేశారు. -
వేదన మిగిలింది
కల కరిగింది● రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం ● కుమారుడి మృతదేహంపై పడి బోరున విలపించిన తండ్రి కుమారుడి మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి అప్పారావు టెక్కలి రూరల్: చేతికి అందివచ్చిన కుమారుడు ఇక లేడని తెలిసి ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. కలలన్నీ చెదిరిపోవడంతో గుండెలవిసేలా రోదించాడు. తనలా కూలి పని చేయకూడదనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఇంజినీరింగ్ చదివిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడటంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ విషాద ఘటన విక్రంపురం జంక్షన్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కర్రి జగదీష్(19) కె.కొత్తూరు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ప్రతి రోజు ద్విచక్రవాహనంపై కళాశాలకు వెళ్లేవాడు. ఎప్పట్లాగే మంగళవారం కూడా ద్విచక్ర వాహనంపై బయలుదేరి టెక్కలి నుంచి కోటబొమ్మాళి వైపు వెళ్తుండగా విక్రాంపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయ్యాడు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడమో లేక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందో అనే విషయమై స్పష్టత రావడం లేదు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన జగదీష్ని హైవే అంబులెన్స్లో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న తండ్రి అప్పారావు ఆస్పత్రికి చేరుకుని కుమారుడిపై పడి బోరున విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. జగదీష్కు తల్లి కన్నమ్మ, అన్నయ్య ఉన్నారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు జాబ్మేళా
శ్రీకాకుళం న్యూకాలనీ : శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్) కళాశాలలో ‘ఉన్నతి’ ఫౌండేషన్ సహకారంతో బుధవారం మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు, ఉన్నతి ఫౌండేషన్ ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ బి.రంజిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నస్ ఇన్స్ట్రూమెంట్స్, వోల్టాస్, అపోలో ఫార్మసీ, దూత్ ట్రాన్స్మిషన్స్, టీవీఎస్, డాటా క్రాప్, విస్ట్రాన్ వంటి 15 కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. సుమారు 600 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఎంఎల్టీ, ఫార్మసీ తదితర అర్హతలు కలిగిన యువతీ యువకులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ ధ్రువపత్రాలు, జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, రెండు పాస్ఫొటోలతో ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణం వద్దకు చేరుకోవాలని సూచించారు. ఉత్తీర్ణత శాతం పెరగాలి నరసన్నపేట: రెసిడెన్షియల్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత శాతం పెరగాలని ఏపీఎస్డబ్ల్యూ ఆర్ఐఈఎస్ జాయింట్ సెక్రటరీ కె.రాజ్యలక్ష్మి అన్నారు. తామరాపల్లిలోని మహిళా రెసిడెన్సియల్ కళాశాలను మంగళవారం తనిఖీ చేశారు. భోజన వసతి, తరగతుల నిర్వహణ తదితర అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కళాశాల సిబ్బందికి, వంట ఏజెన్సీ ప్రతినిధులకు తగు సూచనలు చేశారు. ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ అవసరమన్నారు. ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు తీర్చిదిద్దాలన్నారు. ఈమె వెంట డీసీఓ వై.యశోదలక్ష్మి ఉన్నారు. పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఖైదీలకు, వన్యప్రాణుల దాడి బాధితులకు చట్టప్రకారం సకాలంలో న్యాయ సహాయం అందించడంలో పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన పలు పథకాలపై వలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. జైళ్లలో ఉన్న ముద్దాయిలు, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీ ల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘స్పృహ’ పథ కం గురించి వివరిస్తూ.. ఖైదీలపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యులకు, ఖైదీలకు నడుమ వలంటీర్లు సమన్వయకర్తలుగా వ్యవహరించాలన్నారు. ఉచిత న్యాయవాదిని నియమించడంలో సహాయం చేయాలని సూచించారు. అడవుల సరిహద్దు ప్రాంతాల్లో జరిగే మానవ – వన్యప్రాణి సంఘర్షణల వల్ల నష్టపోయే బాధితులకు ఈ నూతన పథకం ద్వారా న్యాయం పొందేలా తగిన అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
ఎచ్చెర్ల : ఎస్ఎంపురంలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ప్రవేశాలకు మంగళవారం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు, తల్లిందండ్రులు హాజరయ్యారు. మొదటి అడ్మిషన్ పొందిన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కాశీపట్నం గ్రామానికి చెందిన వి.ప్రీతి, అనకాపల్లి జిల్లాకు చెందిన సీహెచ్ దీక్షిత్ ధర్మతేజలకు డైరెక్టర్ గిరిధర్ మద్రాసు ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కౌన్సెలింగ్ కన్వీనర్ అమరేంద్రకుమార్ మాట్లాడుతూ ఈ నెల 24 వరకు కౌన్సెలింగ్ కొనసాగుతుందన్నారు. తొలి రోజు 500 మందికి గాను 319 మంది అమ్మాయిలు, 104 మంది అబ్బాయిలు మొత్తం 423 మంది అడ్మిషన్లు పొందారని వివరించారు. 24వ తేదీన 500 మందికి కౌన్సెలింగ్ జరుగుతుందని వివరించారు. కార్య క్రమంలో ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ పాల్గొన్నారు. -
● అర్ధరాత్రి మృత్యుకేళి
వజ్రపుకొత్తూరు: ఎప్పుడో తోడును కోల్పోయిన ఆ తల్లికి కొడుకు మాత్రమే ఆధారం.. కొడు కు సంపాదనే బతుకు బండిని నడిపిస్తోంది. ఒకే ఒక్క ప్రమాదం ఆ అమ్మను అనాథను చేసింది. ఒక రోజు కిందటే ఇంటికి వచ్చిన మరో యువకుడి భవిష్యత్ను అంధకారంలోకి నెట్టేసి ఆ కుటుంబానికి శోకం మిగిల్చింది. ఉత్సవాలు చూద్దామని ఉత్సాహంగా వెళ్లిన ఆ ఇద్దరు యువకులు శవాలై ఇంటికి చేరారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం గోపీ నాథపురానికి చెందిన కర్ని తులసీరావు (కోదండరావు) (27), కొండవూరు పంచాయతీ గర్తంవానిపేటకు చెందిన గర్తం మణికంఠ(24) ఆదివారం రాత్రి మండలంలోని సైనూరులో జరుగుతున్న చింతలపోలమ్మ తల్లి ఉత్సవాలు చూద్దామని వెళ్లారు. రాత్రి అక్కడ వినోద కార్యక్రమం జరగడంతో అది తిలకించి తిరిగి వస్తుండగా.. ఉద్దానం రామకృష్ణాపురం రహదారిలో పాతటెక్కలి వద్ద స్కూటీతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం రాత్రి సుమారు 12 నుంచి 2.30 గంటల సమ యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముళ్లపొదల్లో పడి ఉన్న యువకుల మృతదేహాలను సో మవారం తెల్లవారు జామున గుర్తించిన స్థానికులు వజ్రపుకొత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబాల్లో కన్నీరు.. కోదండరావు తండ్రి మోహనరావు చాలా ఏళ్ల కిందట మృతి చెందగా తల్లి రాజేశ్వరి ఉన్నారు. ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లే కోదండరావు మృతితో ఆ తల్లి గుండెలవిసేలా రోదించారు. మణికంఠ ఒక రోజు కిందటే నెల్లూరు నుంచి వచ్చాడు. అతడికి తల్లిదండ్రులు గంగాధర్, నీలవేణిలతో పాటు ఓ తమ్ముడు ఉన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్ ఇద్దరు యువకుల దుర్మరణం చింతలపోలమ్మ ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా ఘటన -
● రోడ్డు ప్రమాదంలో తాపీమేస్త్రి..
పలాస: పలాస మున్సిపాలిటీకి చెందిన కుమ్మరి రామారావు(60) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాశీబుగ్గ పోలీసులు, బంధువులు ఇచ్చిన వివరాలు ప్రకారం.. ఆయన పలాస–కాశీబుగ్గ పట్టణంలో తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నా రు. ఉదయం పూట కూలీలను తీసుకొని వెళ్లి పనికి అప్పగించి ఇంటికి ప్రతి రోజు వస్తుంటారు. సాయంత్రం వేళల్లో మళ్లీ వారు పనిచేసే చోటకు వెళ్లి పరిశీలించి తిరిగి ఇంటికి వస్తుంటారు. రోజూ మాదిరిగానే సోమవారం కూడా కాశీబుగ్గ నుంచి తిరిగి బైకుపై వస్తుండగా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని మద్యం దుకాణం వద్ద మున్సిపాలిటీకి చెందిన చెత్తను సేకరించే ట్రాక్టరు ఆగి ఉంది. ఆ ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించి ఆ పక్కనే ఉన్న పండ్ల దుకాణం వద్ద నిలబడి ఉన్నాడు. రామారావు ఆ ట్రాక్టర్ను బలంగా ఢీకొన్నారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను అంబులెన్స్లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తు ప్రాణాలు తీసినట్లు చెబుతున్నారు. -
ఈ ‘ఆదాయ’ పైత్యాన్ని ఏమందురు..?
● గుడులు, బడుల వద్ద మద్యం విక్రయాలు ● బరి తెగిస్తున్న వ్యాపారులు ● కొత్తూరు జంక్షన్లో గిరిజన బాలికల వసతి గృహం పక్కనే రెండు వైన్షాపులు ● శ్రీకాకుళం, కాశీబుగ్గలో గుడులకు ఎదురుగా వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు శ్రీకాకుళంలో పొన్నాడ వంతెన బస్ షెల్టర్ సమీపంలో శ్రీరామమందిరం గుడికి ఎదురుగా 100 మీటర్ల లోపు ఉన్న మధు బార్ అండ్ రెస్టారెంట్ దృశ్యమిది. టీడీపీ నాయకుడు ఇప్పిలి మధుకు చెందిన బార్ అండ్ రెస్టారెంట్ ఇది. దీని పై ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రభుత్వం ఆదాయమే పరమావధిగా పెట్టుకుంది. దీనికి మద్యాన్నే మార్గంగా ఎంచుకుంది. ఇంకేముంది గుడి, బడి అని చూడటం లేదు. ఎక్కడ కావాలంటే అక్కడ మందు షాపులు పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో శాంతిభద్రతల సమస్య పెచ్చుమీరుతోంది. నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతంలో వైన్షాపులుంటే అక్కడున్న బాలికల రక్షణ దేవుడికెరుక. అలాంటిది మందుబాబులు సంచరించే ఏరియాలో బాలికల వసతి గృహాలు ఉంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అనుమతి ఎలా ఇచ్చారో..! ● కొత్తూరు జంక్షన్లో ఉన్న గిరిజన బాలికల వసతి గృహాన్నే తీసుకోండి.. ఒక వైన్షాపు పక్కనున్న కాంప్లెక్స్లో గిరిజన బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన కొన్ని నెలలకు మరో వైన్షాపు అక్కడ పెట్టారు. ● వైన్షాపు పక్కన గిరిజన బాలికల వసతి గృహం ఏర్పాటుకు సంబంధిత అధికారులు అనుమతి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. ● బాలికల వసతి గృహం ఉన్న దగ్గరలో కొత్తగా మరో వైన్షాపు ఏర్పాటు చేసేందుకు ఎకై ్సజ్ అధికారులు అనుమతి ఇవ్వడం మరింత విచిత్రం. ● ఇక్కడ ఇరు శాఖల అధికారుల తప్పులూ ఉన్నాయి. ● టీడీపీకి చెందిన వ్యక్తి వైన్షాపు కావడంతోనే అనుమతులు వచ్చేశాయని అంటున్నారు. మొత్తానికి పైఅంతస్తులోని వసతి గృహంలో ఉంటున్న బాలికలు కిందకి దిగి ప్రతి రోజూ ఆ వైన్షాపుల ముందు నుంచే వెళ్లాల్సి వస్తోంది. గుడి.. బడి.. ఏదైతే మాకేంటి..! గుడుల వద్ద వైన్షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు కొదవ లేదు. దేవదాయ శాఖ పరిధిలోకి రాలేదని చెప్పి జిల్లాలో పలు దేవాలయాల పక్కన, ఎదురుగా వైన్షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు ఎకై ్సజ్ అధికారులు అనుమతులిచ్చేశారు. అవన్నీ టీడీపీ నేతలకు చెందినవి కావడంతో స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. పవిత్రమైన దేవాలయాల వద్దకు వెళ్లే భక్తులకు వైన్షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు దర్శనం ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఎక్కడా స్థలం లేనట్టు దేవాలయాల దగ్గర వైన్షాపులు పెట్టడానికి వ్యాపారులకై నా మనసు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. డబ్బు కోసం దేవాలయాలు, విద్యాలయాలు కూడా వదలరా అన్న చర్చ జరుగుతోంది. కాశీబుగ్గ పాత జాతీయ రహదారిపై రైల్వే స్టేషన్కు ఎదురుగా రామాలయం, షిర్డీ సాయి ఆలయాలు ఉన్నాయి. వాటి ఎదురుగా ఒక వైన్షాపు, ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఇందులో ఒకటి నగర టీడీపీ నాయకుడిది. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పచ్చమూకల దాష్టీకం
టెక్కలి: రాధావల్లభపురం గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు యర్ర శ్యామలరావు, తమ్మినేని రమణమూర్తి తదితరులపై గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సోమవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వారి ని కుటుంబ సభ్యులు 108 వాహనంలో టెక్కలి ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. రాత్రి సమయంలో గ్రామానికి వెళ్తుండగా గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు బొడ్డేపల్లి వెంకటేష్, సనపల కృష్ణమూర్తి ఇరువురూ దారి కాచి దాడి చేశారు. ఈ దాడిలో శ్యామలరావు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకోగా.. రమణమూర్తి చేయి విరిగిపోయింది. దాడి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్, రాధావల్లభపురానికి చెందిన నాయకులు అజయ్కుమార్, సనపల కృష్ణారావు తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగిందనే సమాచారం తెలుసుకున్న నాయకులు కర్ణిక జీవన్, బడ్డ రాజేష్, ఆట్ల రాహుల్, బర్ల కార్తీక్, చింతాడ జీవన్, కవిటి చిన్న, బగాది జయరాం, మెండ భాస్కర్ తదితరులు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. గతంలో గ్రామంలోని ఓ కేసు విషయమై సాక్షులుగా ఉన్న తమను బెదిరించడమే కాకుండా దాడికి పాల్పడ్డారని బాధితులు తెలియజేశారు. మరో 8 మందికి కొడతామని బెదిరించారని, కిల్లి అజయ్ను చంపేస్తామని అన్నారని తెలిపారు. దాడి ఘటనపై తిలక్ మాట్లాడుతూ గ్రామాల్లో రెచ్చిపోతున్న టీడీపీ కార్యకర్తలను వదిలిపెట్టేది లేదని, టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు అండతో దాడులకు తెగబడుతున్నారని ఆయన మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
ఇళ్లు కేటాయించని డిపాజిట్లు వెనక్కి
శ్రీకాకుళం: టిడ్కో ఇళ్ల కోసం డిపాజిట్లు కట్టి, గృహాలు పొందలేకపోయిన లబ్ధిదారులకు వాటిని వెనక్కి ఇచ్చేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సుమారు దశాబ్ధ కాలం క్రితం నగరవాసులు టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,820 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయించేందుకు నిర్ణయించారు. వీరి నుంచి కేటగిరీల వారీగా రూ.25,000, రూ.50,000, రూ.లక్ష డిపాజిట్లుగా తీసుకున్నారు. అయితే వీరిలో 1,904 మందికి మాత్రమే ఇళ్లను కేటాయించారు. అప్పటినుంచి మిగిలిన 1,916 మంది తమకు ఇళ్లను కేటాయించాలని, లేనిపక్షంలో డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని కోరుతూ వచ్చారు. దీంతో ప్రభుత్వం ఆ డిపాజిట్లను వెనక్కి ఇచ్చేందుకు నిధులను కేటాయించింది. ఇదిలా ఉంటే తమకు ఎటువంటి వడ్డీ లేకుండా పన్నెండేళ్ల తర్వాత డిపాజిట్లను వెనక్కి ఇస్తున్నారని, అదే బ్యాంకులో వేస్తే ప్రతీ ఐదేళ్లకు ఒకసారి రెట్టింపు అవుతుందని, ఈ లెక్కన తమ డిపాజిట్ డబ్బు రెండుసార్లు రెట్టింపు అయ్యేదని లబ్ధిదారులు అంటున్నారు. వడ్డీతో సహా చెల్లించాలని కోరుతున్నారు. కాగా కార్పొరేషన్ అధికారులు లబ్ధిదారుల నుంచి ఆధారాలను సేకరిస్తున్నారు. లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డుతో పాటు డిపాజిట్ చెల్లించినప్పుడు కార్పొరేషన్ నుంచి ఇచ్చిన రశీదును కార్పొరేషన్ కార్యాలయంలో గానీ, సచివాలయాల్లో గానీ అందజేయాలని సూచిస్తున్నారు. అయితే సగం మంది లబ్ధిదారుల వద్ద అప్పట్లో ఇచ్చిన రశీదు లేకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రెవెన్యూ క్లినిక్లో 60 అర్జీలు స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: స్థానిక జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. పీజీఆర్ఎస్లో భాగంగా సోమవారం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ను ఏర్పాటు చేశారు. కలెక్టర్తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య అక్కడ ఏర్పాటు చేసిన అన్ని కౌంటర్లను పరిశీలించారు. రెవెన్యూ క్లినిక్లో 60 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, కలెక్టరేట్ పరిపాలన అధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల సందర్శన శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పెదపాడు గురుకుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ జాయింట్ సెక్రటరీ రాజ్యలక్ష్మి సోమవారం సందర్శించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. భోజన శాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని రుచి చూశారు. పాఠశాలలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే పరిష్కరించాలని స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దేవికి సూచించారు. ఆమెతో పాటు పాఠశాల సిబ్బంది ఉన్నారు. సోంపేట: మండలంలోని తోటవూరు గ్రామానికి చెందిన రిక్కభరత్(21) శనివారం రాత్రి హైదరాబాద్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు చందానగర్లోని వీఆర్ షటిల్ కోచింగ్ సెంటర్లో షటిల్ కోచ్గా విధులు నిర్వహిస్తున్నాడు. షేర్లింగపల్లిలోని ఒక లాడ్జిలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు ఆదివారం సమాచారం అందింది. మృతదేహం సోమవారం తోటూరు గ్రామానికి చేరింది. అయితే మృతుడి తండ్రి ఇదివరకే మరణించడంతో.. కొడుకు మృతదేహానికి తల్లి లీలావతి అంత్యక్రియలు నిర్వహించారు. భరత్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. -
2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్
● 1998 డీఎస్సీ ఉపాధ్యాయుల ఆందోళన ● మొత్తం ఖాళీలు చూపించడం లేదని ఆవేదన శ్రీకాకుళం: జిల్లాలో 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు 108 మందికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలను కేటాయించారు. ప్రతిఏటా వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలను కేటాయిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా సోమవారం వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరితోపాటు 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కూడా కౌన్సెలింగ్ కోసం పిలిచారు. వీరంతా కలిసి 321 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే 1998 డీఎస్సీకి చెందిన ఉపాధ్యాయులకు రాష్ట్ర అధికారులు ఇచ్చిన హామీ మేరకు కౌన్సెలింగ్ జరగలేదంటూ వారు ఆందోళన చేపట్టారు. కౌన్సెలింగ్ హాల్ ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేసి జిల్లా విద్యాశాఖ అధికారిని నిలదీశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను చూపించాలని డిమాండ్ చేశారు. అయితే జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు 321 ఖాళీలను మాత్రమే చూపించారు. దీనికి 1998 ఉపాధ్యాయులు అంగీకరించకుండా అన్ని ఖాళీలు చూపించాల్సిందేనని పట్టుబట్టి కౌన్సెలింగ్ బహిష్కరించారు. అధికారుల చర్యలు సరికాదు ఈ సందర్భంగా 1998 డీఎస్సీ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రతి ఉపాధ్యాయుడు 50 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారని, ఎటువంటి అలవెన్సులు లేకుండా అతి తక్కువ జీతానికి పనిచేస్తున్న తమకు మరింత దూరం వెళ్లేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం సరికాదని వాపోయారు. 321 స్థానాలు మాత్రమే ఖాళీగా చూపిస్తే.. తమకంటే ముందు నియమించబడిన 2008 ఉపాధ్యాయులు 108 మంది ఉన్నారని, వారంతా దగ్గరలోని ఖాళీలను కోరుకుంటే తాము సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలి సభ్యులు రాష్ట్ర అధికారులతో మాట్లాడినప్పుడు అన్ని ఖాళీలను చూపిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. రాత్రి 8 గంటల వరకు ఈ వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. ఇదిలా ఉండగా వీరి డిమాండ్కు తలొగ్గి అన్ని ఖాళీలను చూపిస్తే 2008 ఉపాధ్యాయులకు రీ కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
ఊర్వశిది హత్యే
● ఆస్తి గొడవలతో హత్య చేసిన మరిది ● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులుసోంపేట: మండలంలోని గొల్లవూరు గ్రామంలో ఈనెల 18వ తేదీన పిన్నింటి ఊర్వశిని ఆస్తి గొడవల కారణంగా మరిదే హత్య చేసినట్లు కాశీబుగ్గ డీఎస్సీ టి.భవానీ వెల్లడించారు. సోంపేట సర్కిల్ పోలీస్స్టేషన్లో స్థానిక సీఐ బి.మంగరాజుతో కలిసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ టి.భవానీ మాట్లాడుతూ.. మందస మండలం రట్టి గ్రామానికి చెందిన గోకర్ల లోకనాథం తన రెండో కుమార్తె పిన్నింటి ఊర్వశి మృతిపై అనుమానం ఉందని బారువ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లోకనాథం ఫిర్యాదు మేరకు బారువ ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేశారు. సోంపేట సీఐ బి.మంగరాజు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం జరిగిందన్నారు. మృతురాలి భర్త రాజారావుకు అన్న జయరాం, తమ్ముడు శివకుమార్ ఉన్నారు. రాజారావు కుటుంబానికి, మిగతా కుటుంబ సభ్యులకు ఆస్తి తగాదాలు ఉన్నాయి. పెద్దల సమక్షంలో సమావేశాలు నిర్వహించినా మృతురాలి మరిది శివకుమార్ పెద్దల తీర్పునకు అంగీకరించలేదు. ఈ క్రమంలో మృతిరాలి భర్త మూడు నెలల క్రితం మృతి చెందాడు. అప్పటినుంచి ఆస్తుల గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల మృతురాలు ఊర్వశి భూ సమస్యల పరిష్కారం కోసం బావ జయరాం, మరిది శివకుమార్, తోటికోడలు పిన్నింటి యశోదకు లాయర్ నోటీసులు పంపించింది. అవి వారికి 17వ తేదీన అందాయి. – దాడిచేసి హత్య నోటీసులు రావడంతో మృతురాలి మరిది శివకుమార్ కక్ష పెంచుకుని 18వ తేదీ ఉదయం మృతురాలిని ఏమైనా చేస్తానని గ్రామ పెద్దల వద్ద బెదిరించాడు. అనంతరం ఉదయం 9.30 గంటల సమయంలో మృతురాలి ఇంటి నుంచి కంగారుగా వస్తూ పారిపోయినందున శివకుమార్ను పోలీసులు అనుమానితుడిగా గుర్తించారు. 22వ తేదీన మందస మండలంలోని జిల్లుండి వద్ద శివకుమార్ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో 18 తేదీన ఉదయం 9.10 గంటల నుంచి 9.30 గంటల ప్రాంతంలో మృతురాలిపై దాడిచేసి హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆమె మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి, సాధ్యం కాకపోవడంతో మంచంపై మృతదేహాన్ని వదిలి పారిపోయినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. ముద్దాయి నుంచి నేరం చేసిన సమయంతో ధరించిన రక్తం మరకల దుస్తులు, ఉపయోగించిన స్కూటీ, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుండడం విశేషం. సమావేశంలో బారువ ఎస్ఐ ఎస్.హరిబాబు నాయుడు ఉన్నారు. -
● వ్యక్తి అనుమానాస్పద మృతి
నందిగాం: మండలంలోని నౌగాం పంచాయతీ హుకుంపేటలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు.. సోమవారం సాయంత్రం గ్రామంలోని ఉపాధి వేతనదారులు పనికి వెళ్లిపోయాక.. గ్రామానికి చెందిన దాసరి సింహాచలం(37) తన ఇంటికి రెండిళ్ల దూరంలో ఉన్న మరొకరి ఇంటిలో గొంతులో తీవ్ర రక్తస్రావమై పడి ఉన్నాడు. బంధువులు ఆయనను గమనించి 108లో టెక్కలి ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందాడు. ఆయన మృతి చెందిన విధానంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం తన తల్లి సూరమ్మ, భార్య మణెమ్మతో కలిసి ఉంటున్నాడు. అయితే భార్యతో నిత్యం గొడవపడుతూ ఉండేవాడని సమాచారం. మృతికి గల కారణం పోలీసు దర్యాప్తు పూర్తయితేనే తెలుస్తుంది. -
పైడి భీమవరం.. సొమ్ములకు క్షవరం
పైడిభీమవరం గ్రామ సచివాలయంరణస్థలం: జిల్లాలో అధిక రాబడి సాధించే పైడి భీమవరం పంచాయతీకి అవినీతి మరకలు అంటుకున్నాయి. పంచాయతీలో 2025–26లో ఉన్న సాధారణ నిధులు రూ.9,43,08,960 ఏడాది లోపే వివిధ పనులు, అడ్వాన్స్ రూపంలో ఖర్చు చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో దాదాపు రూ.3 కోట్లు ఎలాంటి పత్రాలు లేకుండా అడ్వాన్స్ రూపంలో ఆ గ్రామ సర్పంచ్ ప్రతినిధి, టీడీపీ నాయకుడు రౌతు శ్రీనివాసరావు మింగేయడం విస్మయం కలిగిస్తోంది. నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధికి కూడా ముడుపులు అందినట్లు ప్రచారం జరుగుతోంది. కంపెనీల డబ్బే.. జిల్లా ముఖద్వారమైన పైడిభీమవరం పంచాయతీలో గల పారిశ్రామికవాడలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 28 వరకు ఉన్నాయి. అందులో 12 కంపెనీల నుంచి నేరుగా పన్నుల రూపంలో పంచాయతీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. మిగతా కంపెనీలు ఏపీఐఐసీకి పన్నులు చెల్లించినా మళ్లీ ఏపీఐఐసీ నుంచి 30శాతం పంచాయతీకే వస్తుంది. ఏడాదికి సుమారు రూ 2.5కోట్ల వరకు పైడిభీమవరం పంచాయతీకి నిధులు వస్తాయి. వైఎస్సార్ సీపీ హయాంలో పకడ్బందీగా.. 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి సర్పంచ్ పదవి రాగా, 14 వార్డు మెంబర్ల స్థానాల్లో వైఎస్సార్సీపీ 10, టీడీపీ 4 వార్డు మెంబర్లు గెల్చుకున్నారు. దీంతో పంచాయతీ డబ్బును ఇష్టానుసారం ఖర్చు పెట్టే వీల్లేకుండా పోయింది. ప్రతి పనీ పద్ధతిగా జరిగింది. 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పరిస్థితులు ఒక్కొక్కటిగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. మింగేశారిలా.. 2025లో పంచాయతీ తీర్మానం లేకపోయినా ఒకే ఏడాది రూ. 9.43 కోట్లు పైచిలుకు నిధులు అడ్డగోలు లెక్కలు చూపించి విత్డ్రా చేశారు. అందులో ప్రధానంగా సీసీ రోడ్డులు, కాలువలు, కుళాయిలు, విద్యుత్ సామాన్లు, డ్రైనేజ్ పైపులు రూపంలో ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. కానీ అవసరం లేని చోట ప్రైవేటు లే–అవుట్లకు ప్రభుత్వ సొమ్ముతో సీసీ రోడ్లు వేశారు. ఎక్కడా బ్లీచింగ్ పౌడర్ కనిపించకపోయినా, ట్రాక్టర్ మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయల పేరుతో భారీగా నిధులు స్వాహా చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ టీడీపీ నాయకుడి అకౌంట్లో.. పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం రూ. 5లక్షలు దాటి నిధులు డ్రా చేయాలంటే మండల ఉన్నతాధికారుల సంతకాలు కావాలి. అలాంటిది ఎలాంటి అర్హత లేని ఆ గ్రామ సర్పంచ్ ప్రతినిధినని చెప్పుకునే టీడీపీ నాయకుడు రౌతు శ్రీనివాసరావు అకౌంట్లో నేరుగా రెండు నెలల వ్యవధిలో అడ్వాన్స్ రూపంలో రూ. 2.52 కోట్లు నిధులు జమ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఆ డబ్బులతోనే ఇటీవల పెట్రోల్ బంకు నిర్మించాడనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అలాగే తాగునీటి పైపులు, కుళాయి ట్యాపులు, ప్లంబింగ్ పనులు రూపంలో సుమారు రూ.2కోట్లు నిధులు బొక్కేశారు. బాసిన లక్ష్మణరావు అనే ప్లంబర్పైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఒక్క రౌతు శ్రీనుకే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏడాదిలో సుమారు రూ. 5కోట్లు ముట్టినట్లు సచివాలయ ఉద్యోగుల టాక్. ఇక సీఎం పర్యటనల పేరుతోనూ బొక్కేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలపై సీఎంఓకు ఫిర్యాదు వెళ్లింది. కూటమి, నాయకులతోపాటు అధికారుల పాత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిగ్గు తేల్చాలి.. కూటమి పాలన కాలంలో పైడి భీమవరంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై నిగ్గు తేల్చాలి. మా పంచాయతీలో అక్కడక్కడా మొక్కుబడిగా రోడ్లు వేశారు తప్ప రూ.9 కోట్ల నిధులు ఖర్చు చేసేంత పనులు జరగలేదు. గోల్మాల్ జరిగింది. వీటిపై దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాలి. – పైడిభీమవరం గ్రామ పెద్దలు పైడిభీమవరం పంచాయతీలో సాధారణ నిధులు గోల్మాల్ ఏడాదిలో రూ.9.43 కోట్ల నిధులు మాయం అడ్వాన్స్ రూపంలో నిధులు స్వాహా చేసిన టీడీపీ నేత సీఎంఓకు ఫిర్యాదుతో విషయం బహిర్గతం మేం సంతకాలు చేయలేదు గత ఐదేళ్ల పంచాయతీ పాలనలో వైఎస్సార్సీపీ తరఫున 10మంది వార్డు మెంబర్లు ఉన్నాం. అందులో నేనే ప్రతి సమావేశానికి హాజరయ్యాను. వాళ్లు నిధులు అడ్డగోలుగా ఖర్చు చేస్తామంటే ఎప్పుడూ మా 10మంది ఒప్పుకోలేదు. మరి ఇంత భారీగా ఎలా నిధులు ఎలా స్వాహా చేశారో అర్థం కావటం లేదు. – చింతపల్లి చిన్నా, మాజీ 2వ వార్డ్ మెంబర్, పైడిభీమవరం పంచాయతీ విచారణ జరపాలి పైడిబీమవరం పంచాయతీలో గత ఏప్రిల్ నాటికి రూ.9కోట్లకు పైగా నిధులు ఉండేవి. అందులో చివరి రెండు మీటింగ్లకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు చూస్తే నిధులన్నీ ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మేము ఎక్కడా సంతకాలు చేయలేదు. పంచాయతీలో ఎక్కడా పనులు జరగలేదు. – ఎం.శ్రీను, మాజీ వార్డు మెంబర్, పైడిభీమవరం విచారణ చేస్తాం పైడిభీమవరం పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై ఫిర్యాదులు వచ్చాయి. పూర్తి స్థాయిలో ఎంకై ్వరీ చేసి వివరాలు వెల్లడిస్తాం. – ఆర్.స్వరూపరాణి, జిల్లా పంచాయతీ అధికారి -
బైక్ల చోరీ కేసులో నిందితుడు అరెస్టు
● 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం పలాస: మండలంలోని పెదంచల గ్రామానికి చెందిన నాతిమిరి రఘునాథన్ను బైకుల చోరీ కేసులో అరెస్టు చేసినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కాశీబుగ్గ పోలీసుస్టేషన్ ఆవరణలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. రఘునాథన్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చదువు మానేసి వెల్డింగ్ పనులు నేర్చుకున్నాడు. అనంతరం బెంగాల్, అబుదాబిలో పనిచేసి 2019లో విశాఖపట్నం చేరుకున్నాడు. పరవాడ ప్రాంతంలోని ఒక ఫార్మా కంపెనీలో వెల్డింగ్ పనులను 2021 వరకు చేశాడు. ఈ సమయంలో ఇతను చెడు అలవాట్లుకు బానిసయ్యాడు. ఆర్థిక పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోవడంతో బైకుల దొంగతనాలకు పాల్పడ్డాడు. కొన్ని బైకులు అతని సొంతానికి వాడుకున్నాడు. ఈ క్రమంలోనే పలాసలోని ఒక ఇంటి ముందు ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ను గత నెల 30వ తేదీన దొంగలించాడు. సోమవారం మరో బండిని దొంగతనం చేయడానికి వస్తుండగా కాశీబుగ్గ పోలీసులు పలాస మండలం కంబిరిగాం కూడలి వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా చిక్కాడు. – మొత్తం 18 కేసులు పట్టుబడిన రఘునాథన్ను విచారించగా అతనిపై మొత్తం 18 కేసులు ఉన్నట్లు స్పష్టమయ్యాయి. బైకుల దొంగతనం కేసుల్లో ఆమదాలవలస, అనకాపల్లి, విజయనగరం, పరవాడ తదితర పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి. 2024 సెప్టెంబర్ 29న పర్లాకిమిడిలో అరైస్టె.. విశాఖపట్నం సెంట్రల్ జైలుకు వెళ్లి తిరిగి ఈ ఏడాది జనవరి 8న బయటకు వచ్చాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత మరలా దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పలాసలో బైకు దొంగతనం చేయడానికి వస్తూ పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ, సీఐ వై.రామకృష్ణ, ఎస్ఐలు ఆర్.నర్సింహమూర్తి, ఎన్.సునీల్, సీసీసీ ఎస్ఐ భరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రిమ్స్ సూపరింటెండెంట్ బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ సౌమిని బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్న కుమార్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. కేజీహెచ్లో ప్రసూతి విభాగం హెచ్ఓడీగా పనిచేస్తున్న ఈమెను కొద్ది రోజుల కిందట రిమ్స్లో పదోన్నతి పై నియమించిన విషయం పాఠకులకు తెలిసిందే. తర్జనభర్జన అనంతరం ఆమె బాధ్యతలు తీసుకున్నారు. మంగళవారం నుంచి ఆమె పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండనున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో అర్హులైన చేతులు లేని దివ్యాంగులను గుర్తించి, ఆగస్టు 16న విజయనగరంలో జరిగే ఉచిత కృత్రిమ చేతుల అమరిక శిబిరానికి వారిని పంపించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.దేవరాజుతో కలిసి కలెక్టర్ విడుదల చేశారు. విజయనగరం వెళ్లే ముందు జిల్లాలో ఒక స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి, మోచేతి దిగువన నాలుగు అంగుళాల చేయి ఉన్నవారిని గుర్తించేందుకు స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు. -
ఐదో అంతస్తు నుంచి కింద పడి యువతి మృతి
మియాపూర్: అపార్ట్మెంట్ ఐదో అంతస్తు టెర్రస్ పై నుంచి కిందపడి ఓ యువతీ మృతి చెందిన విషాద ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శిరీషారెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళానికి చెందిన బుద్ధ వెంకటప్రతాప్రెడ్డి, ప్రశాంతి దంపతులకు ఓ కుమార్తె బుద్ధ శ్రీ ప్రాణమ్య(20), ఓ కుమారుడు ఉన్నారు. వెంకటప్రతాప్రెడ్డి కుమారునితో పాటు అమెరికాలో ఉంటున్నారు. ప్రశాంతి కూతురు ప్రాణమ్యతో కలిసి అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. మియాపూర్ మయూరీనగర్ కాలనీలోని బొమ్మరిల్లు అపార్ట్మెంట్లో తల్లిదండ్రుల ఇంటిలో ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ప్రాణమ్య వారు ఉంటున్న అపార్ట్మెంట్ ఐదో అంతస్తు టెర్రస్ పైకి ఫోన్ మాట్లాడేందుకు వెళ్లింది. టెర్రస్ గోడకు అనుకొని మాట్లాడుతుండగా అదుపుతప్పి గ్రౌండ్ ఫ్లోర్లో పడి పోయింది. అదే సమయంలో ప్రాణమ్య తల్లి ప్రశాంతి బయటికి వెళ్లి అపార్ట్మెంట్కు చేరుకుంది. అక్కడ ఉన్న వాచ్మెన్ చూసి మీ కూతురు భవనం పై నుంచి కిందపడిందని సమాచారం ఇవ్వడంతో దగ్గరకు వెళ్లి చూడగా కూతురు ప్రాణమ్య తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉంది. స్థానికుల సహాయంతో దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి ప్రాణమ్య మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలి ప్రాణమ్య ఆన్లైన్లో డిగ్రీ చదువుతోంది. బొమ్మరిల్లు అపార్ట్మెంట్ దగ్గరలోనే ఓ అపార్ట్మెంట్లో ప్రశాంతి సొంత ఫ్లాట్ ఉంది. రెండు, మూడు రోజుల్లో ఆ ఇంటికి వెళ్లేందుకు క్లీనింగ్ ఇతర ఏర్పాట్లను చేసుకున్నారని సమాచారం. ప్రాణమ్య భవనం నుంచి కింద పడిపోవడానికి ముందు తల్లితో మాట్లాడింది. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకొని ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి తల్లి ప్రశాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
అప్రమత్తతే కీలకం..!
విద్యుత్ ప్రమాదం.. సమాచారం ఇవ్వాలి వర్షాకాలంలో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాల బారినపడే అవకాశాలున్నాయి. వీధిలో గాలి, వర్షాలకు తీగలు తెగిపడితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. మరమ్మతులు చేయిస్తాం. విద్యుత్ సమస్యలపై వెంటనే సమచారం ఇవ్వాలి. – జి.ప్రసాదరావు, విద్యుత్ శాఖ ఏడీ, పాతపట్నం పాతపట్నం: ప్రస్తుతం ఉరుములు, మెరుపులు, పిడుగులతో అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇటువంటి సమయాల్లో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇళ్లు, రోడ్లు, కార్యాలయాలు, వ్యవసాయ బావుల వద్ద ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఏమ్రాతం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పవు. ముఖ్యంగా పొలాల్లో వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. వర్షంలో వైర్లు తెగిపడినట్లు గుర్తిస్తే వాటి దగ్గరకు వెళ్లకుండా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● తడి చేతులతో విద్యుత్ తీగలు, స్విచ్లు తాకవద్దు. ● విద్యుత్ సంబంధిత మరమ్మతులు సొంతంగా చేయకూడదు. ● సిబ్బంది సెల్ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి. ● వీధుల్లో, పొలాల్లో తడిచిన విద్యుత్ స్తంభాలను తాకకూడదు. ● తోటలు, పొలాలు వంటి ప్రదేశాల్లో విద్యుత్ తీగలు పడితే 1912కు కాల్ చేయాలి. ● విద్యుత్ తీగలపై బట్టలు ఆరవేయకూడదు. ● విద్యుదాఘాతం సంభవిస్తే వెంటనే సరఫరా నిలిపివేయాలి. బాధిత వ్యక్తిని ప్లాస్టిక్ లేదా ఎండిన కర్రతో వేరుచేయాలి. వానాకాలంలో జాగ్రత్తలు అవసరం లేకుంటే ప్రాణాలకే ప్రమాదం జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన -
● తాత మనవడి ఆఖరి ప్రయాణం
పూసపాటిరేగ / కంచిలి: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కంచిలి నుంచి విశాఖపట్నానికి సోమవారం ఉదయం కారులో బయలుదేరారు. తాత, అమ్మమ్మ, మనవలు, కుమార్తె కబుర్లలో మునిగిపోయారు. అల్లుడే డ్రైవింగ్ కావడంతో నిశ్చింతగా ప్రయాణిస్తున్నారు. భోగాపురం మండలం పోలిపల్లి ఫ్లైఓవర్పై కనురెప్పపాటులో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఆవలవైపు ఉన్న రోడ్డుపైకి చేరింది. అంతే... అదే సమయంలో శ్రీకాకుళం వైపు వస్తున్న లారీ కారును బలంగా ఢీకొని 80 మీటర్ల మేర ఈడ్చుకుపోయింది. ప్రమాదంలో తాతా మనవడు దుర్మరణం చెందగా, నలుగురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం... కంచిలిలో నివసిస్తున్న మన్యాల సూరిబాబు (60), లక్ష్మి.. ఇంటికి అల్లుడు రాపాక కిశోర్కుమార్, కుమార్తె ఉమామహేశ్వరి, మనవడు రాపాక సాత్విక్ రిహాన్సుహాసన్ (ఏడాదిన్నర), మరో మనవరాలు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు కొయ్య నేహశ్రీ ఇటీవల కారులో వచ్చారు. అక్కడ పనులు ముగించుకుని రాజమండ్రిలో శుభకార్యానికి హాజరయ్యేందుకు అందరూ బయల్దేరారు. తొలుత విశాఖపట్నం మధురవాడలో నివసిస్తున్న అల్లుడు కిశోర్కుమార్ ఇంటికి చేరుకోవాలనుకున్నారు. మరో అరగంట సమయంలో ఇంటికి చేరుకుంటారనగా.. పోలిపల్లి వద్ద జాతీయరహదారిపై ఉన్న ఫ్లై ఓవర్పై జరిగిన ప్రమాదంలో సూరిబాబు, మనవడు సాత్విక్రిహాన్సుహాసన్ దుర్మరణం చెందారు. మిగిలిన నలుగురు గాయపడ్డారు. -
త్వరితగతిన అర్జీలు పరిష్కరించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్లో 155 అర్జీలు స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి సోమవారం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ అర్జీలపై అధికారులు సమీక్షించుకోవాలని సూచించారు. మొత్తం 155 ఆన్లైన్ అర్జీలు స్వీకరించగా.. వాటిలో రెవెన్యూ 52, పంచాయతీ రాజ్ 22, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 14, వ్యవసాయ శాఖ 9, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 7, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 6, హోం శాఖ 6, ఏపీఈపీడీసీఎల్ 6, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 5, గ్రామీణ నీటి సరఫరా 5, వాటర్ రిసోర్సెస్ ఈఎన్సీ 4, మైన్స్ అండ్ జియాలజీ 3, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2, బీసీ సంక్షేమం 2, పబ్లిక్ హెల్త్ 2, పౌర సరఫరాలు, మెడికల్ ఎడ్యుకేషన్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు నుంచి ఒక్కొక్కటి చొప్పున స్వీకరించారు. అర్జీల స్వీకరణలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం రెడ్క్రాస్కు సంబంధించి కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ శిబిరం చేయూత గోడ పత్రికను ఆవిష్కరించారు. పలు వినతులు పరిశీలిస్తే... ● విశ్రాంత ఉద్యోగుల పింఛన్ బకాయిలు, ఇతర బకాయిలు చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పీజీఆర్ఎస్ లో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు శ్యామ్, జనరల్ సెక్రటరీ కేటీ నాయు డు, కోశాధికారి వాసుదేవరావు, కార్యదర్శి వెంకట్రావు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొన్నారు. ● ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినతి అందజేశారు. అంతకుముందు వారు జెడ్పీ ముందు నిరసన తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజల పాలిట కూటమి ప్రభుత్వం కర్కశత్వంతో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 59,300 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 43,300కు తగ్గిందన్నారు. ఒకప్పుడు అద్దె బస్సులతో కలిపి ఆర్టీసీలో 12,500 బస్సులు ఉంటే, ఇప్పుడు 10,700 మాత్రమే ఉన్నాయని తెలిపారు. 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుమారు రూ.700 కోట్లు నిధులు వెచ్చించి 1,459 బస్సులు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డొప్ప రాము తదితరులు పాల్గొన్నారు. ● ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఏఐవైఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. మందుగా వారు ఎన్జీవో హోం నుంచి ర్యాలీగా పీజీఆర్ఎస్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ రెండేళ్లలో కూటమి నాయకులు ఏమి సాధించారో చెప్పి సంబరాలు జరుపుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.సంతోష్, కొన్న శ్రీనివాస్లు ప్రభుత్వానికి సూచించారు. ● విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పుస్తకాలు, ఫీజుల పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. -
సంబరాలు చాలు.. ఉద్యోగాలు ఇవ్వండి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని, ఈ రెండేళ్లలో ఏం సాధించారో చెప్పి సంబరాలు జరుపుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.సంతోష్, కొన్న శ్రీనివాస్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలో సూర్య మహల్ జంక్షన్ వద్ద సో మవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేళ్లలో నాలు గు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు ప్రకటించారో చెప్పాలన్నారు. నిరుద్యోగ యువత రోడ్లపై తిరుగుతుంటే.. సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ చేపట్టాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీచ్ షాక్స్ పేరుతో రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 30 వేల పైచిలుకు ఉద్యోగాలతో సమగ్ర మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 19,000 పోస్టులను భర్తీ చేసి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని, ఇతర అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వేణు, నాయకులు వసంత్, హేమంత్, జగదీశ్, రామోజీ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ పెన్కాక్ సిలాట్ పోటీలకు ఎంపిక
టెక్కలి: నాసిక్లో ఈ నెల 26 నుంచి 28 వరకు జరగనున్న జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్ మార్షల్ ఆర్ట్స్ పోటీలకు కోటబొమ్మాళి గౌతమ్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు ఎంపికై నట్లు కోచ్ సామ గౌతమ్ ఆదివారం తెలిపారు. ముంగి అర్జున్, గొండు భవి భాస్కర్నాయుడు తదితరులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. వీరిని అసోసియేషన్ ప్రతినిధులు ఆర్.దయామయ, ఎన్.లక్ష్మణ్నాయుడు, ఎం.గౌతమి అభినందించారు. వైన్షాపులో చోరీ హిరమండలం: మేజర్ పంచాయతీ హిరమండలంలో ఎస్బీ వైన్ షాపులో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షాపులోకి ప్రవేశించి రూ.2.30 లక్షల నగదు దోచుకుపోయారు. ఉదయం సిబ్బంది వచ్చి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న హిరమండలం పోలీసులు, క్లూస్టీమ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. హెచ్సీ సర్వేశ్వరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోను ఢీకొన్న బైక్ రణస్థలం: లావేరు మండలం రావివలస సమీపంలో ఆదివారం ఉదయం ఆటోను ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న షేక్ షాయిబ్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో రణస్థలం సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బైక్లో ఉన్న గొర్రె చర్మాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కాంప్లెక్స్ కిటకిట శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు, పలువురు ప్రయాణికులతో కాంప్లెక్స్ కళకళలాడింది. సరిపడా బస్సులు లేక నిరీక్షణ తప్పలేదు. బస్లు ఫుట్పాత్ వద్దకు చేరుకున్న వెంటనే సీట్ల కోసం ఎగబడ్డారు. -
రైతు బేజారు
ప్రజలకు తక్కువ ధరలకే కూరగాయలు అందించాలన్న ఉద్దేశంతో నేరుగా రైతుల ద్వారానే విక్రయాలు జరిపేందుకు పట్టణాల్లో ఏర్పాటు చేసిన రైతుబజార్లు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. అటు విక్రేతలతో పాటు ఇటు కొనుగోలుదారులు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రైతుబజారు ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతున్నా సదుపాయాలు మాత్రం కల్పించడం లేదు. ఆమదాలవలస మున్సిపాలిటీలో నిర్వహణ కొరవడి రైతుబజారు మూతపడింది. ఇక, పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో రైతుబజారు కలగానే మిగిలిపోయింది. కాగితాలకే పరిమితం.. ఆదరణ కరువై.. ఆదాయం ఫుల్..అభివృద్ధి నిల్ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా కేంద్రంలోని రైతు బజారులో మొత్తం 96 షాపులున్నాయి. అందులో సుమారు 25 వరకు అద్దెలు వచ్చే షాపులున్నాయి. వాటి ద్వారా ప్రతి నెలా రూ.1,73,640 సొమ్ము అద్దె రూపేనా వస్తోంది. ఏటా సుమారు రూ.20లక్షలకు పైగా ఆదాయం సమకూరుతుంది. ఇంత మొత్తం వస్తున్నా ప్రభుత్వం రైతు బజారులో సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. సరైన సదుపాయాలు లేక ఇప్పటికే సగానికి పైగా షాపులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం రెండు గేట్లకు ఎదురుగా ఉండే 20 షాపుల్లోనే పూర్తిస్థాయిలో కూరగాయలు అమ్మకాలు జరగుతున్నాయి. మిగిలిన షాపుల యజమానులకు వ్యాపారాలు లేక అసలు దుకాణాలే తియ్యడం లేదు. కనీస సౌకర్యాలు కరువు.. రైతుబజారులో వ్యాపారుల నుంచి అద్దెలు వసూలు చేస్తున్నప్పుడు వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కంప్యూటర్ కాటాలకు చార్జింగ్ పెట్టుకునేందుకు ప్లగ్పిన్లు కూడా లేవు. ఫ్యాన్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు షాపులకు ఒక లైటుతో చాలీచాలనీ విద్యుత్ కాంతితో చీకటిపడితే వ్యాపారాలు చేయలేని పరిస్థితి. మరుగుదొడ్ల పరిస్థితి మరింత దారుణం. పురుషులకు ఆరు మరుగుదొడ్లకు గాను రెండు మాత్రమే తెరిచి ఉన్నాయి. మహిళల మరుగుదొడ్లదీ అదే పరిస్థితి. చినుకుపడితే చెరువే.. రైతుబజారును ఎత్తుచేయాలని, మార్కెట్ మధ్యలో నిలిచిపోయిన వర్షం నీరు బయటకు వెళ్లేలా చేయాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో పలుమార్లు నిధులు మంజూరు చేయడం..అరకొర పనులు చేసి నిధులు స్వాహా చేయడం వంటివి చేస్తున్నారు. గతంలో రైతుబజారు ఆధునికీకరణ పేకట సుమారు రూ.40లక్షలు నిధులు ఖర్చుచేసి నాణ్యతలేని పనులు చేసి మమా అనిపించేశారు. దీంతో కొద్దిపాటి వర్షం కురిసినా రైతుబజారులోకి వెళ్లలేని పరిస్థితి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతుబజారు అభివృద్ధిపై దృష్టి సారించాలని రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు కోరుతున్నారు -
కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/శ్రీకాకుళం అర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం సమరశీల పోరాటాలను సాగించాల ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఏపీఎన్జీవో కార్యాలయంలో ఆదివారం ఇఫ్టూ నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికై న జిల్లా కమిటీ సమస్యలపై రాజీలేని పోరాటాలు సాగించాలని కోరారు. పోరాటాల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న లక్ష్యంతో ముందుకెళ్లాలన్నారు. సమావేశంలో పలు ప్రజా సంఘాల నాయకులు తాండ్ర ప్రకాష్, సన్నశెట్టి రాజశేఖర్, మామిడి క్రాంతి, జుత్తు వీరాస్వామి, సవలాపురపు కృష్ణవేణి పాల్గొన్నారు. నూతన కార్యవర్గమిదే.. జిల్లా అధ్యక్షుడిగా మామిడి క్రాంతి, ఉపాధ్యక్షుడిగా జుత్తు వీరాస్వామి, ప్రధాన కార్యదర్శిగా సవలాపురపు కృష్ణవేణి, కార్యదర్శిగా దంత వెంకన్న, కోశాధికారిగా పోతనపల్లి మల్లేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా బర్ల గోపి, పి.ఆనందరావు, పి.షణ్ముఖరావు, కిర్రు దానేసు, కురమాన నాగమణి, ఎచ్చెర్ల పుణ్యవతిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
కళింగాంధ్ర తొలి దళిత ఆత్మఘోష ‘ఈర్నం’
శ్రీకాకుళం కల్చరల్ : ‘తెలుగు సాహిత్యరంగానికి నాయకత్వం వహించే స్థాయిలో కళింగాంధ్ర ఉంది. దళిత కవితాత్వికతలో చాలా వెలితి కన్పించేది. కలమట దాసు బాబు తాజాగా రచించిన ‘ఈర్నం’ చదివిన తర్వాత అది భర్తీ చేసే తరం ప్రారంభమైందన్న సంతృప్తి కలిగింది’ అని ప్రముఖ కవి, విమర్శకుడు గుంటూరు లక్ష్మీనరసయ్య అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు సమావేశ మందిరంలో శ్రీకాకుళ సాహితీ, సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో ఈర్నం కవితా సంకలనం ఆవిష్కరించారు. పుస్తక ప్రచురణ బాధ్యత స్వీకరించిన చిగురుపల్లి చంద్రకళ స్మారక వేదిక చైర్మన్ సీహెచ్.ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు సంకలనాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఈ కవితా సంపుటిపై ప్రముఖ కవి బాల సుధాకర్ ‘దళిత కళింగం’ పేరుతో రచించిన పరిశీలనాత్మక వ్యాసాన్ని ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో దాసరి రామచంద్రరావు (కథా నిలయం), చీకటి దివాకర్, కె.శ్రీనివాస్ (సాహితీ స్రవంతి), అల్లాడ లక్ష్మి (ఐద్వా), నల్లి ధర్మారావు, సిరికి స్వామినాయుడు (అరసం), పక్కి రవీంద్రనాథ్ (స్నేహ కళా సాహితి, పార్వతీపురం), పి.వి.నరసింహులు( విశ్వసాహితి, ఆమదాలవలస), అల్టి మోహనరావు (రాజాం రచయితల వేదిక) తదితరులు పాల్గొన్నారు. -
లక్షలు వ్యయం..లక్ష్యం శూన్యం!
కొత్తూరు: మండల కేంద్రం కొత్తూరులో ఏపీజీవీబీ బ్రాంచి వద్ద అలికాం–బత్తిలి రోడ్డు గోతులమయంగా మారింది. నిత్యం రద్దీగా ఉన్న ఈ రోడ్డు పాడైపోవడంతో ఇటీవలే సుమారు రూ. 26 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. అయితే రోడ్డుకు ఓ వైపు కాలువ లేకపోవడం, మరో వైపు ఉన్న కాలువ ఎత్తుగా ఉన్నందున రోడ్డుపైనే వర్షపునీరు నిలిచిపోతోంది. దీంతో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్అండ్బీ, పంచాయతీ అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అరసవల్లిలో భానుసప్తమి సందడి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భానుసప్తమి పర్వదినం సందర్భంగా భక్తుల సందడి కనిపించింది. స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకబృందం రూ.300 వీఐపీ టికెట్లు కొనుగోలు భక్తులకు అంతరాలయ దర్శనాన్ని చేయించారు. ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ఏఈవో అప్పలనాయుడు ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించారు. సీఎంఆర్ గ్రూప్ యాజమాన్యం ఉచితంగా పరమాన్నం, పెసల మొలకలు ప్రసాదాలు పంపిణీ చేశారు. సిబ్బంది చేతివాటం.. కేశఖండన శాలలో తలనీలాల మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లిన భక్తుల నుంచి కనీసంగా రూ.50 నుంచి రూ.100 వరకు వసూళ్లు అదనంగా చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్టు ధర రూ.40 కాగా.. అదనంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారని, లేదంటే గుండుపై చిన్నపాటి గాయాలయ్యేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. మరుగుదొడ్లు, స్నానాల గదులు, రావిచెట్టుకు దీపం పెట్టిన చోట, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం వద్ద కూడా డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కేశఖండన శాల వద్ద అక్రమ వసూళ్లుపై ఈఓకు పలు ఫిర్యాదులు చేరడంతో అక్కడ పనిచేస్తున్న ఒకరిద్దరిని రెండు వారాల పాటు సస్పెండ్ చేశారు. అయినప్పటికీ సిబ్బందిలో మార్పులు కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్యూలైన్లలో భక్తులు -
మాస్టార్లూ..అభినందనలు..
మందస : మందస మండల కేంద్రంలోని శ్రీ రాజా శ్రీనివాస స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తమ పిల్లలను కూడా అదే బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారని ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు అన్నారు. తోటి ఉపాధ్యాయులు డి.నాగేశ్వరరావు, జ్ఞానేశ్వర్ గౌడ, డి.ఢిల్లీ, అరుణ్కుమార్ పాడి, కిషోర్గౌడ్లు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించడం మిగిలిన వారికీ స్ఫూర్తిగా ఉంటుందని అభినందించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యా బోధన అందుతుందని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి రణస్థలం: గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట(నదీ ప్రవాహం)లో పోతిరెడ్డి మురళి(24) అనే యువకుడు సరదాగా ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దీంతో స్వగ్రామం లావేరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళి హైదరాబాద్లోని విప్రో కంపెనీలో సాఫ్ట్వేరు ఇంజినీర్గా పని చేస్తున్నాడు. తన స్నేహితుడి సోదరికి నీట్ పరీక్ష కేంద్రాన్ని విజయవాడలో కేటాయించారు. దీంతో ముగ్గురూ విజయవాడ వచ్చాడు. ఆదివారం ఆమె పరీక్ష రాసేందుకు వెళ్లగా.. పక్కనే కరకట్టలో ఈత కొట్టేందుకు మురళి దిగాడు. ప్రమాదవశాత్తు మునిగిపోయి చనిపోయాడు. స్థానికులు గమనించి మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో స్వగ్రామం లావేరులో విషాదఛాయలు అలముకున్నాయి. మురళి తండ్రి వెంకటరమణ ఉప్పు వ్యాపారం చేస్తుంటారు. తల్లి సరళ గృహిణి. సోదరి ప్రసన్నకు వివాహం నిశ్చయమైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఆంజనేయ గుడిలో చోరీ బూర్జ: సింగన్నపాలెం గ్రామ సమీపంలో పాలకొండ–శ్రీకాకుళం రోడ్డులోని ఆంజనేయ ఆలయంలో శనివారం రాత్రి హుండీ చోరీ జరిగింది. మూడేళ్ల నుంచి గ్రామస్తులు ఈ హుండీని తెరవలేదు. ఆదివారం ఉదయం గ్రామస్తులు ఆలయం వద్దకు వెళ్లెసరికి హుండీ చోరీ జరిగిన విషయం గుర్తించారు. ఈ విషయమై గ్రామానికి చెందిన తులగాపు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ ఎం.ప్రవల్లిక, సిబ్బంది పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
శ్రీకాకుళం
కలెక్టర్ సారూ.. ఇదేం తీరు..!సోమవారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2026నువ్వు పనికి రావు.. అర్జెంట్గా రిజైన్ చేసి వెళ్లిపో... పొమ్మనడానికి మీరెవరు సార్.. ఒక్క క్షణమైనా తీరిక ఇస్తున్నారా..? ఏమనుకుంటున్నావ్.. ఉద్యోగం చేయాలని ఉందా..? లేదా..? పనులు చేయమంటారు.. డబ్బులు మాత్రం ఇప్పించరు.. ఇవేమీ సినిమా డైలాగులు కావు.. సాక్షాత్తు కలెక్టర్, ఉద్యోగుల మధ్య జరుగుతున్న కోల్డ్వార్కు నిదర్శనాలు. కలెక్టర్ వ్యవహార శైలిపై జిల్లా ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. విపరీతమైన ఒత్తిడి పెడు తుండడంతో పాటు మాట విసిరేస్తుండడంతో కింది స్థాయి ఉద్యోగులు మనస్తాపం చెందుతున్నారు. ఇది చినికి చినికి గాలివానలా మారుతోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కలెక్టర్ మాట చేటు తెస్తోంది. ఆయన ఆగ్రహావేశాలకు ఉద్యోగులు బాధ పడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల సమీక్షల పేరుతో జరుగుతున్న సమావేశాలు కాస్తా ఉద్యోగులపై చిందులు తొక్కే వేదికలుగా మారుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారిక సమీక్ష సమావేశాల్లో, గ్రీవెన్స్ సెల్లో ఉద్యోగులు, అధికారులపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తీవ్రంగా మండిపడుతున్నట్టు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పులు ఉంటే సరిదిద్దడం, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం విధి నిర్వహణలో భాగమే. కానీ, దానికి భిన్నంగా అందరి ముందూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా రన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం కింది స్థాయి సిబ్బందిపైనే కాకుండా బాధ్యతాయుతమైన జిల్లా స్థాయి అధికారులపై కూడా పరుష పదజాలం వాడుతుండటంపై ఉద్యోగులు మనస్తాపం చెందు తున్నారు. జిల్లాను నడిపిస్తున్న వ్యక్తిగా కలెక్టర్ అందరినీ కలుపుకుంటూ పోవాలి. కానీ ఆ కలుపుగోలుతనం ఇప్పుడు కనిపించడం లేదు. జిల్లాకు వచ్చిన తొలినాళ్లతో మంచిపేరే సంపాదించుకున్నా.. ప్రస్తుతం మాత్రం ఉద్యోగులు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది. అందరి ముందూ.. కొన్నాళ్ల కిందట టెక్కలికి చెందిన ద్వితీయ శ్రేణి అధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం సమీక్షలో ప్రగతి నివేదికపై మాట్లాడుతూ ‘నువ్వు పనికి రావు. అర్జంట్గా రిజైన్ చేసి వెళ్లిపో’ అంటూ కటువుగా మాట్లాడారు. ‘కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించాను. పొమ్మనడానికి మీరెవరు సార్. అయినా ఒక్క క్షణమైనా తీరిక ఇస్తున్నారా? టాస్క్ల మీద టాస్క్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా రు’ అని ఆ అధికారి ఎదురు తిరిగారు. దీంతో మరింత మండిపడుతూ ‘వెళ్లిపో.. నువ్వు మాట్లాడకు..’ పక్కనున్న సహాయకులను పిలిచి ‘చార్జెస్ ఫ్రేమ్ చేయండి. త్రీమెన్ కమిటీ వేయండి’ అని ఆదేశించారు. దానికి ఆ అధికారిణి బదులిస్తూ ‘ఉద్యోగం తీయడం కుదరదు సార్. ట్రిబ్యునల్ లేవా?న్యాయస్థానాల్లేవా? చూసుకుందాం’ అని ఎదురు తిరిగారు. ఏదైనా పనిచేయకపోతే ‘అరేయ్ బాబు.. ఏమనుకుంటున్నావ్. ఉద్యోగం చేయాలని ఉందా? లేదా? పనిచేస్తే చేయ్.. లేదంటే వెళ్లిపో. లేదంటే పైకి రాస్తాను’ అంటూ పలు శాఖల అధికారులపై తీవ్ర స్వరంతో ఆగ్రహించిన సందర్భాలు ఉన్నాయి. బిల్లులు కావు.. కానీ అరసవల్లి రథసప్తమి వేడుకల ఏర్పాట్ల బిల్లులు, జలుమూరులో జరిగిన శివరాత్రి ఉత్సవాల బిల్లు లు, బారువ బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు బిల్లులు, యోగాంధ్ర బిల్లులకు సంబంధించిన నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల సంబంధిత అధికారులు, ఉద్యోగులకు అప్పగించిన పను లు సకాలంలో చేయలేని పరిస్థితుల్లోనైతే కలెక్టర్ ఆగ్రహం మామూలుగా ఉండదని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. ‘డబ్బులు ఇవ్వకపోతే మేం ఎలా చేస్తాం. ఒకటి రెండు సార్లు కాంట్రాక్టర్లను బుజ్జగించి చేయిస్తాం. ప్రతి సారి ఇదే పనేంటి? మీరు డబ్బులు ఇవ్వరు.. వాళ్లు పనిచేయరు.. మధ్యలో మేం నలిగిపోతున్నాం’ అంటూ కలెక్టర్తో కాస్త గట్టిగా మాట్లాడారన్న వాదనలు ఉన్నాయి. ఆ మ ధ్య ఓ యూనివర్సిటీ అధికారిణిపై ఒక ప్రారంభోత్సవ విషయంలో కఠినంగా మాట్లాడారన్న చర్చ జరిగింది. ఇన్ని సమీక్షలా..? ప్రభుత్వం పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం తానే బాగా చేయాలన్న తపన ఆయనలో ఎక్కువని, కానీ దానికి తగ్గట్టుగా నిధులు ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ‘అధికార పార్టీ నేతలంటే ప్రేమ. వారు చెప్పిన ప్రతి పనిచేయడానికి మొగ్గు చూపుతారు. ఈ సందర్భంలో అధికారులపై ఒత్తిడి పెడతారు. ఆ సమయంలో చేయకపోతే సీరియస్ అవు తారు’ అంటున్నారు. 24 గంటల్లో ఒకే శాఖపై భౌతికంగా, జూమ్లో, వాట్సాప్ కాన్ఫరెన్స్, టెలీ కాన్ఫరెన్స్ల ద్వారా మూడు, నాలుగు సార్లు రివ్యూలు చేస్తారు.’ అన్న వాదనలూ ఉన్నాయి. కార్గో ఎయిర్పోర్టు విషయంలోనూ కేవలం మంత్రి ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారు గానీ క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సమయ పాలన పేరిట అదనపు గంటల పా టు ఉంచుకోవడం, నిర్దేశిత సమయం తర్వాత కూడా సమీక్షలు నిర్వహించడం, గంటల తరబడి టెలీకాన్ఫరెన్స్, జూమ్ కాన్ఫరెన్స్లు, ఫోన్ కాన్ఫరెన్స్లు నిర్వహించడం ఉద్యోగులకు తలనొప్పిగా మారింది. పీజీఆర్ఎస్, సమీక్ష సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లలో అందరి ముందే ఉద్యోగులు, అధికారులపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కలెక్టర్ వైఖరిపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు మాట విసిరేస్తున్నారని మనస్తాపం ఒత్తిడికి లోనవుతున్నామంటున్న సిబ్బంది పనిచేయమంటారు.. డబ్బులు ఇప్పించరంటూ గగ్గోలు -
పరీక్ష ముగిసింది
● జిల్లాలో ప్రశాంతంగా సాగిన నీట్–2026 రీఎగ్జామ్ ● వానతో ఇబ్బంది పడిన విద్యార్థులు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో నీట్ రీ ఎగ్జామ్ యూజీ–2026 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. వర్షాల తో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులు ఆపసోపాలు పడ్డారు. వర్షపు నీటిలోనే తడుచుకుంటూ లోపలికి ప్రవేశించారు. సుదూర ప్రాంతాల నుంచి నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేక జిల్లాలో ముగ్గురు విద్యార్థులను పరీక్ష కేంద్రం లోపలకు అనుమతించకపోవడంతో వారంతా నిరాశగా వెనుదిరిగారు. 2103 మందికి 183 మంది గైర్హాజరు.. జిల్లాలో నీట్ రీ ఎగ్జామ్కు ఏర్పాటు చేసిన నాలు గు పరీక్ష కేంద్రాలకు మొత్తం 2103 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 1920 మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 183 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎప్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, డీఎస్పీలు సీహెచ్ వివేకనంద, దాసరి లక్ష్మణరా వు, స్థానిక తహసీల్దార్ గణపతిరావు, శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో సుమారు 150 మంది వరకు పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే లోపలికి అనుమతించారు. పరీక్ష నియమానుసారం కేంద్రానికి వస్తున్న ఓ విద్యార్థినిసమయాభావం కావడంతో విద్యార్థినులకు గొడుగులు వేసి పరీక్ష కేంద్రం లోపలికి తీసుకువెళ్తున్న శ్రీకాకుళం టూటౌన్ సీఐ ఈశ్వర్ప్రసాద్ ఎగ్జామ్కు వెళ్లే ముందు కుమార్తె చెవికి ఉన్న దిద్దులను తీస్తున్న తల్లి పరీక్షా కేంద్రాలవారీగా హాజరు పరీక్ష కేంద్రం పరీక్ష రాయాల్సిన హాజరైంది గైర్హాజరు వారి సంఖ్యఆర్జీయూకేటీ 720 659 61 ఆర్ట్స్ కళాశాల 696 639 57 కేంద్రీయ విద్యాలయం 447 406 41 పాలిటెక్నిక్ కాలేజ్ 240 216 24 మొత్తం 2103 1920 183 -
కూటమిపై వ్యతిరేకతతోనే పార్టీలో చేరికలు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బారువ గ్రామానికి చెందిన కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు పార్టీలో చేరిన బారువ కొత్తూరుకు చెందిన టీడీపీ, జనసేన పార్టీల నాయకులు సోంపేట: రాష్ట్రంలో కూటమి పాలనపై ఆ పార్టీ నాయకులకే విరక్తి వచ్చిందని, అందుకే వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మండలంలోని బారువ మేజర్ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ వైస్ ఎంపీపీ సానా రాజేష్ కన్నా ఆధ్వర్యంలో 70 కుటుంబాల వారు ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి ధర్మాన కృష్ణదాస్ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కృష్ణదాస్ మా ట్లాడుతూ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమిలోని పార్టీలు మోసం చేశాయని మండిపడ్డారు. సానా రాజేష్ కన్నాతో పాటు బారువ నుంచి సానా సోమేశ్వరరావు, సానా ముకుందరావు, కీలు తిరవయ్య, పొందర వల్లభరావు, బత్తిన పాపారావు, దుమ్ము దనరాజు, దున్న యాదవరావు, దున్న జగన్నాయకులు, తెలుకుల కృష్ణారావు, వనిమిన బాలరాజు, గురాల పురుషోత్తం, సాన ధర్మరాజు, యజ్జల వాసు, బెవర జగన్నాయకులు, పడాల సతీష్, కర్రి చిట్టెయ్య, టి.సురేష్, పి.కేశవరావు, కూ ర్మారావు, సోమయ్య, బీజేపీకి చెందిన కాళ్ల చంద్రయ్య తదితరులు చేరారు. బారువ కొత్తూరు గ్రా మం నుంచి టీడీపీకి చెందిన యర్ర బాపనమ్మ, గొరక హేమరాజు, తోట పురుషోత్తం, జనసేనకు చెందిన దంగ పాపారావు, సి.మోహనరావు, కర్రి కొర్లయ్య, డొంక సునీల్, బడే రాజేష్ , గొరక సోమయ్య తదితర కుటుంబాల వారు చేరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తురామారావు, పార్టీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, పార్టీ పరిశీలకులు దుంపల లక్ష్మణరావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్ర యాదవ్, ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్, జెడ్పీటీసీ తడక యశోద, కంచిలి ఎంపీపీ పైల దే వదాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఇప్పిలి కృష్ణారావు, పార్టీ నాయకులు శిలగాన భాస్కరరావు, తడక జోగారావు, గురాల శ్రీను,యర్ర రజని ఉన్నారు. -
ఆగని ఆక్రమణలు
● జగనన్న కాలనీలో ఆక్రమణలకు గురవుతున్న ఖాళీ స్థలాలు ● పట్టించుకోని రెవెన్యూ అధికారులు సర్టిఫికెట్లు మంజూరు చేయలేదు మండలంలో ఈ మూడేళ్ల లో ఎవరికీ ఎలాంటి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయలేదు. కేవలం జగనన్న కాలనీకి సంబంధించిన లబ్ధిదారుల వివరాలు, ఆన్లైన్లో ఉన్న లబ్ధిదారుల వివరాలు సరి చూసి వారి అవసరమైన అనుమతులు ఇస్తున్నాం. ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. – ఎన్.వెంకటరావు, తహసీల్దార్, ఇచ్ఛాపురం ఇచ్ఛాపురం: పురపాలక సంఘం పరిధిలో పేద ల కోసం గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన జగనన్న కాలనీలో ఖాలీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్ఛాపురం పురపాలక సంఘం రత్తకన్న పరిధిలోని ఐదు లేఅవుట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసి 1210 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఈ లేఅవుట్లలో కాలనీ భవిష్యత్ అవసరాల కోసం పార్కులు, కమ్యూనిటీ భవనాలు నిర్మించేందుకు అనువుగా కొంత స్థ లాలను విడిచి పెట్టి కాలనీ నిర్మాణాలకు అవసరమైన వసతులను కల్పించింది. ఈ క్రమంలో ఈ రత్తకన్న లేఅవుట్లలో ఇప్పటికే 70 శాతం నిర్మాణాలు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించకపోవడంతో కొన్ని నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోగా.. మరి కొన్నింటిలో నిర్మాణ పనులు ప్రారంభించలేదు. కొన్ని చోట్ల ఖాళీ స్థలాలు ఉండగా.. వాటిపై టీడీపీ నాయకుల కన్ను పడింది. దీంతో జేసీబీలతో చదును చేయించి వాటిని స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టా లేకుండా నిర్మాణాలు ఎందుకు ప్రారంభించారని ప్రశ్నిస్తే.. నన్ను అడగడానికి మీరెవరు అంటూ ఎదురు తిరుగుతున్నారు. రెవెన్యూ సిబ్బంది పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేశారని, అందుకే ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు టీడీపీ నాయకులు చెప్పుకొస్తున్నారు. అధికారులు పట్టించుకోవ డం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ఉపయోగాలెన్నో..
● ఘనంగా యోగా దినోత్సవం శ్రీకాకుళం కల్చరల్: ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డచ్ భవనం వద్ద ఆదివారం భారీ ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ యువత యోగా చేయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్లో వారికి ఆరోగ్యకరమైన జీవనానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. యోగా సోలో, సింక్రనైజ్డ్, యోగ స్లోగన్, వ్యాసరచన, తదితర యోగా పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, మెమెంటోలను బహూకరించారు. సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా శ్రీకాంత్ శిష్యబృందం నృత్య ప్రదర్శన, యోగా పై గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగి పాట పాడి వినిపించారు. యోగా గురువులు పాండ్రంకి మురళీకృష్ణ, పతంజలి నుంచి చినబాబు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి సుధారాణి తదితరుల యోగాసనాలను తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటరామన్, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్.కూర్మారావు, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత, జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వినాయక, ఆర్ అండ్ ఎస్ఈ ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఇంధన ధరలు ఎందుకు తగ్గించరు..?
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధర ఎందుకు తగ్గించలేదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, సీపీఎం జిల్లా కా ర్యదర్శి డి.గోవిందరావు ప్రశ్నించారు. శ్రీకాకు ళం నగరంలో పాలిటెక్నిక్ కాలేజీ రోడ్డులో శ్రీకాకుళం కళాసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరల వల్ల కార్మికులు, పేద, మధ్యతరగతి ప్రజల నిజ వేతనం పాతాళంలో కి పడిపోయిందన్నారు. అంబానీ, అదానీలకు వేల కోట్ల రూపాయలు రాయితీలిచ్చి పేద మధ్యతరగతి ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుంటే ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా బి. చిన్నారావు, అధ్యక్షులు ఎం.వెంకటరావు, ప్రధాన కార్యదర్శి పళ్ల అప్పలరాజు, కోశాధికారి పంగ సత్యనారాయణ, ముత్యాలమ్మ వెజిటేబుల్ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా వేలాద్రి దుర్గారావుతో పాటు 15 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. పిడుగుపాటుకు ఆవు మృతిహిరమండలం: ఎల్ఎన్పేట మండలం డొంకలబడవంజలో శనివారం రాత్రి పిడుగుపడింది. ఈ ఘటనలో గేదెల జనార్దనరావుకు చెందిన ఆవు మృతి చెందింది. పశువుల శాలకు సమీపంలో ఉండగా పిడుగు పడడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందింది. దీంతో బాధిత రైతు కన్నీటిపర్యంతమయ్యాడు. మృతిచెందిన ఆవు రూ.50 వేలు వరకూ ఉంటుందని, ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. -
అభాగ్యులకు ఆశ్రయం
కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్ ఆవరణలో కొన్నాళ్లుగా అనాథలుగా కాలం గడుపుతున్న తల్లీబిడ్డలకు సీతయ్య ఫౌండేషన్ వారు ఆశ్రయం కల్పించారు. వారితో పాటు దుర్భర పరిస్థితుల్లో ఉన్న మానసిక దివ్యాంగురాలిని కూడా ఆదుకున్నారు. వీరిని మండపల్లి గ్రామం వద్ద వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వానప్రస్థాశ్రమంలో చేర్పించారు. కవిటి మండలం దూగానపుట్టుగ వద్ద బారపుట్టుగ గ్రామవాసి దేవర హేమ రాజమండ్రిలో ఓ వ్యక్తిని ప్రేమించింది. అతడు పెళ్లి చేసుకున్నాక మోసం చేసి వదిలేశాడు. దీంతో చంటి బిడ్డతో ఆమె రైల్వే స్టేషన్లోనే మూడు నెలలుగా ఉంటోంది. దీంతో పాటు మరో మహిళ కంచిలిలో స్థానికుల ఆదరణ మీదే బతుకుతోంది. వీరిని సీతయ్య ఫౌండేషన్ అక్కున చేర్చుకుంది. -
నీట్ రీ–ఎగ్జామ్కు ఏర్పాట్లు పూర్తి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఆదివారం జరగనున్న నీట్– 2026 రీ–ఎగ్జామ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. శ్రీకాకు ళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ, కేంద్రీయ విద్యాల యం పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రంలో వసతులు, ఫర్నీచర్, సీసీ కెమెరాల నిఘా, భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఇతర అధికారులు పరిశీలించారు. నాలుగు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 2,112 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ట్రిపుల్ ఐటీ లో 720 మంది, ఆర్ట్స్ కళాశాలలో 696 మంది, కేంద్రీయ విద్యాలయంలో 447 మంది, ప్రభుత్వ పాలిటెక్నిక్లో 240 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మే 3వ తేదీన నీట్–2026 ఎగ్జామ్ జరగగా.. పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకేజీ అయిన ఉదంతంతో పరీక్షను రద్దుచేసిన విషయం తెలిసిందే. దీంతో ఎట్టకేలకు మళ్లీ నీట్ రీ–ఎగ్జామ్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 11 నుంచి లోపలకు అనుమతి.. నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరగనుంది. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుండి లోపలకు అనుమతించనున్నారు. మ ధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే లోపలకు అనుమతిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. మధ్యాహ్నం 1.30 దాటిన తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి రానిచ్చేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం లోపల కేవలం చీఫ్ సూపర్వైజర్కు మా త్రమే మొబైల్ అనుమతిస్తున్నారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాలు తీసుకురావడానికి వీల్లేదని అధికా రులు హెచ్చరిస్తున్నారు. మౌలిక సదుపాయాలు తప్పనిసరి.. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల సౌకర్యార్థం తాగునీరు, ఎండదెబ్బ తగలకుండా టెంట్లు, ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలు అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు విద్యార్థులంతా అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత శ్రీకాకుళం క్రైమ్ : నీట్ (యూజీ) –2926 పునఃపరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిపేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలసి ఎస్పీ ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ పాలిటెక్నిక్, కేంద్రీయ విద్యాలయ, ఆర్ట్స్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను సందర్శించారు. సీసీ కెమెరాలు, నిఘా, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నాలుగు పరీక్ష కేంద్రాలకు డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ప్రతి కేంద్రానికి ఓ సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులతో పాటు పోలీసు సిబ్బందిని నియమిస్తామన్నారు. అభ్యర్థులు ముందుగా రావాలి.. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వంటి పరికరాలు అనుమ తి లేకుండా కేంద్రాల వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ద్వారా తనిఖీలు నిర్వహించి అభ్యర్థులకు లోపలికి అనుమతిస్తామన్నారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులు, అనధికార కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఆమదాలవలస రైల్వేస్టేషన్, శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థులకు తోడుగా వచ్చేవారు గూమిగూడకుండా సహకరించాలని, ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరించినా పరీక్ష నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రయత్నించినా చట్టపరమైన చర్యలుంటాయన్నారు. హాల్టికెట్లలో పేర్కొన్న నియమాలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, చిన్న ఘటనలు జరిగినా తక్షణమే 112కు సమాచారమివ్వాలని ఎస్పీ తెలిపారు. -
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026నీటి మూటలు పట్టుకున్న నీలి మబ్బులు ఆకాశ వీధి నుంచి సిక్కోలుకు గొడుగు పట్టాయి. శనివారం సంధ్య వేళలో ఇలా కట్ట కట్టుకుని వచ్చిన మేఘాలు నగరాన్ని కమ్ముకున్నాయి. కానీ కాసిన్ని చినుకులు మాత్రమే చిలకరించి ఆశలపై నీళ్లు వదిలాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం నిలబడి చేసే ప్రాథమిక ఆసనాల్లో ఒకటి. దీన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీర సమతుల్యత మెరుగవుతుంది. ఏకాగ్రత పెరిగి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. ఆసనంలో స్థిరంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శరీరానికి మనస్సుకి ప్రశాంత ఇస్తుంది. ఈ ఆసనాన్ని రోజూ సాధన చేయడం వల్ల ఒత్తిడి తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడటం వంటి అనేక రకాల ఆరోగ్య ప్ర యోజనాలు ఉన్నాయి. నాడీ వ్యవస్థను ప్రశాంత పరుస్తుంది.భుజాల నుంచి చేతి వేళ్ల వరకు యాక్టివేషన్ జరుగుతుంది. తల కిందకి ఉండడం వల్ల మెదడు ఉత్తేజితమవుతుంది. వెన్నెముక, కాళ్లకు, చేతులకు బలం కలుగుతుంది. భుజాలు శక్తివంతమవుతాయి. కొవ్వు కరుగుతుంది. అతిమూత్రం, రక్తపోటు నివారిస్తుంది. పొట్ట పెరగకుండా అరికడుతుంది. వెన్నుపాముకు శిరస్సుకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో సో మవారం ఒలింపిక్ డే రన్ ర్యాలీని నిర్వహించనున్నట్టు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు తెలిపారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 22వ తేదీన ఉదయం 6 గంటలకు ఈ ఒలింపిక్ డే రన్ ర్యాలీ జరుగుతుందని చెప్పా రు. శ్రీకాకుళం నగరంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి కళింగ రోడ్, వైఎస్సార్ సర్కిల్, పాలకొండ రోడ్, కృష్ణాపార్క్, డే అండ్ నైట్, అంబేడ్కర్ జంక్షన్ మీదుగా కోడిరామ్మూర్తి స్టేడియం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందన్నా రు. సమావేశం అనంతరం రన్ ముగుస్తుందని కృష్ణదాస్, సాంబమూర్తి తెలిపారు. ఆమదాలవలస: పట్టణంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ చెక్కును శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రాష్ట్ర పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే కూన రవికుమార్ రైతులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీరు వీక్షించి అనంతరం నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులకు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద మంజూరైన సహాయానికి సంబంధించిన పత్రాలు, నమూనా చెక్కులను సంయుక్తంగా పంపిణీ చేశారు. నరసన్నపేట: స్థానిక 108 వాహన సిబ్బంది విశ్రాంతి తీసుకు నే గదిలో శనివా రం విషసర్పం హల్చల్ చేసింది. దీంతో పెదిలాపు రమణయ్యతో పాటు ఇతర సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. భయంతో పామును హతమార్చారు. ఎప్పటికప్పుడు తాము ఉంటున్న వంశధార క్వార్టర్స్లోని గదిలోకి పాములు వస్తున్నాయని, గది శిథిలమైందని, వర్షం పడితే కారుతోందని, ఇక్కడ ఉండేందుకు భయంగా ఉందని సిబ్బంది అంటున్నారు. మరో మంచి గదిని కే టాయించాలని కోరుతున్నారు. శనివారం సా యంత్రం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి విజ్ఞాపన పత్రమిచ్చామని రమణయ్య తెలిపారు. నరసన్నపేట: కేసులు రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ మంచి వేదిక అని ఫ్యామిలీ జిల్లా కోర్టు, మూడో అదనపు జిల్లా జడ్జి సీహెచ్ వివేకానంద్ శ్రీనివాస్ అన్నా రు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం న్యాయవాదులు, పోలీసు అధికారులకు లోక్ అదాలత్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జూలై 11 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఇందులో నరసన్నపేట కోర్టుకు సంబంధించిన కేసులు వీలైనన్ని పరిష్కరించే విధంగా చూడాలని సూచించారు. సబ్జైల్ పరిశీలన.. అవగాహన కార్యక్రమం అనంతరం స్థానిక సబ్జైల్ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ కా ర్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి హరిబాబుతో కలిసి పరిశీలించారు. జైల్లో రిమాండ్ ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెనుక స్థానిక సివిల్ జడ్జి కోర్టు జడ్జి ఎస్.వాణి, జైలు సూపరింటెండెంట్ విజయకుమార్ తదితరులు ఉన్నారు. మెదడు నిండా ఆలోచనలు.. మనసు నిండా భయాలు.. లేనిపోని ఆందోళనలు.. కొత్త తరం ఎదుర్కొంటున్న సమస్యలివి. డిప్రెషన్, నిద్ర లేమి, అతిగా ఆలోచించడం, ఏకాగ్రత లేకపోవడం.. ఇలాంటి సమస్యలన్నీ ఇదివరకు కంటే బాగా పెరిగిపోయాయి. వీటన్నంటికీ యోగా చక్కటి సమాధానమని నిపుణులు సూచిస్తున్నారు. నేడు యోగా దినోత్సవం. ఆసనాలతో ఆలోచనలు మారుతాయని, యోగాతో జీవన శైలి మెరుగవుతుందని చెబుతున్నారు. – శ్రీకాకుళం కల్చరల్ గత 39 ఏళ్లుగా యోగా సాధన చేస్తున్నాను. వందల మందికి యోగా నేర్పించాను. 78 ఏళ్లు వచ్చినా యువకులతో సమానంగా 108 సూర్య నమస్కారాలు చేయిస్తుంటాను. – ఎంవీ రామారావు, విశ్రాంత ఏఈ, బీఎస్ఎన్ఎల్, శ్రీకాకుళం యోగాతో ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా ఎదుర్కోవచ్చు. అన్ని ఆరోగ్య సమస్యలకు ప్రత్యేక యోగాభ్యాసాలు ఉన్నాయి. డాక్టర్లు కూడా యోగ విద్యను అభ్యసిస్తున్నారు. – మావురి నాగేశ్వరరావు, యోగా గురువు శ్రీకాకుళం రూరల్: ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ బృందం సభ్యులు హెచ్చరించారు. శుక్రవారం సింగుపురంలోని గౌతమి ట్రేడర్స్ షాపులో తనిఖీలు నిర్వహించారు. ఎరువుల ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని, రోజువారీ విక్రయాలను మండల వ్యవసాయాధికారికి తెలియజేయాలన్నారు. ఎరువులతోపాటు ఇతర వస్తువులు అంటగట్టరాదని, బిల్లుపుస్తం, ఇన్వాయిస్లు తప్పనిసరిగా షాపులో అందుబాటులో ఉంచాలని సూచించారు. -
సునీల్కుమార్ అరెస్టు ఓ చీకటి దినం
● బీసీలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేధింపులు ● వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవి. స్వరూప్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీ నాయకుడు కానుమూరి సునీల్కుమార్ అరెస్ట్ ఓ చీకటి దినంగా భావిస్తున్నామని పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్ అన్నా రు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్వరూప్ మాట్లాడు తూ మద్యాన్ని అక్రమంగా రవాణా చేశారంటూ బీసీ వర్గం యాదవ కులానికి సునీల్కుమార్ను అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తే కూట మి ప్రభుత్వంలో ఆయావర్గాల ప్రజలను అణచి వేయడం దుర్మార్గమన్నారు. 2019లో బీసీ వర్గానికి చెందిన కానుమూరు నాగేశ్వరరావు మంత్రిగా గొ ప్ప సేవలందించారని, ఆయన కుమారుడు సునీల్ కుమార్ ఉన్నత విద్యావంతుడని చెప్పారు. అలాంటి వారిని జైల్లో పెట్టి మానసికంగా, ఆర్థికంగా దెబ్బ కొట్టడం సరికాదన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో 200 ఓట్లు కూడా లేని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు అందించి బీసీలకు అన్యాయం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కాపుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగిస్తే కాపుల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ●యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఇవి నకిలీ మద్యం కేసులు కాదని, నారా నకిలీ కేసులని పేర్కొన్నారు. 30 శాతం వైన్ షాపులను తగ్గించి బెల్ట్ షాప్ అనేది లేకుండా చేసిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ●యువజన విభాగం జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోత సతీష్ మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలుచేయడం చేతకాక ప్రశ్నించేవారిపై కేసులు పెడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సమావేశంలో యువజన విభాగం శ్రీకాకుళం నగర అధ్యక్షుడు ఎం.భరద్వాజ్, పవన్ కళ్యాణ్, రౌతు సూర్యనారాయణ, బాలి శ్రీనివాసులునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
30 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయిని అక్రమంగా తరలించేందుకు ప్రయ త్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. మహారాష్ట్ర అహిల్యనగర్ జిల్లా, జామ్ఖేద్ కి చెందిన శంకర్ చంద్రకాంత్ పవార్, నవీముంబై థా నే జిల్లా, భుతవాలీగామ్ కి చెందిన సునీత విజయ్ కాలే అనే మహిళ ఇద్దరూ కలసి లగేజి బ్యాగ్లతో ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కి వస్తుండగా తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి ఆర్థి క పరిస్థితి బాగులేకపోవడంతో ముంబైలో గంజా యి వ్యాపారం చేసే దీపక్ అశోక్ పవార్ అనే వ్యక్తిని ఆశ్రయించారు. ఒడిశా నుంచి గంజాయి వ్యాపారి సూచించిన వ్యక్తి వద్ద నుంచి గంజాయి తీసుకొచ్చి తనకి అందజేస్తే తీసుకొచ్చిన ప్రతి సారి రూ.10 వేలు ఇస్తానన్నాడు. దీనికి నిందితులు ఇద్దరూ అంగీకరించి ఒడిశాలో మార్షల్ లిమ్మా అలియాస్ రాజే ష్ వద్ద నుంచి గంజాయిని తీసుకెళ్లి ఇప్పటికే మూ డు సార్లు గంజాయి వ్యాపారికి అందజేశారు. ఇదే క్రమంలో ఈనెల 12 వ తేదీన గంజాయి కోసం విశాఖపట్టణం చేరుకున్నారు. అక్కడి నుంచి గంజా యి సరఫరా చేసే వ్యక్తికి ఫోన్ చేయగా బరంపురంలో పోలీసులు తనిఖీలు ఎక్కువగా ఉన్నాయని 20 వ తేదీన ఇచ్ఛాపురంలో ఉంటే అక్కడికి తీసు కొచ్చి సరుకు అందజేస్తానని చెప్పాడు. దీనికి వీరు విశాఖపట్టణంలో ఐదు రోజులు ఉండి అక్కడి నుంచి బ రంపురం చేరుకున్నారు. బరంపురంలో రెండు రోజులు బస చేసి శనివారం ఇచ్ఛాపురం చేరుకున్నా రు. వీరు గంజాయి సరఫరా చేసే వ్యక్తి రాజేష్కి ఫో న్ చేయగా ఉదయం ఒక లగేజి బ్యాగ్, రెండు చేతి బ్యాగ్లతో 30.600 కిలోల గంజాయిని ఎల్సీగేట్ వద్ద అందజేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వీరిద్ద రూ లగేజ్తో రైల్వేస్టేషన్కి వస్తుండగా పట్టణ పోలీసులకు తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు సెల్ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
ఇచ్ఛాపురం.. ఇష్టానుసారం!
● ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ‘సర్’ నిర్వహణ తీరుపై అనుమానాలు ● అధికారులను ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ నేతలు కంచిలి: ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ‘సర్’ కార్యక్రమంలో పారదర్శకతపై అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. ఫారాల పంపిణీలో జా ప్యం, టీడీపీ నేతల మితిమీరిన జోక్యం, వారికి సంబంధించిన బీఎల్ఏల రుబాబు.. కలగలిపి ‘సర్’ నిర్వహణ తీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎంతో పారదర్శకంగా చేపట్టాల్సిన సర్ ప్రక్రియ కొందరు బీఎల్ఓలు మెతక వైఖరి, టీడీపీ నేతల అజమా యిషీతో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో సోంపేట పట్టణంలో వైఎస్సార్ సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు వారు దరఖాస్తులో కోరిన చోట కాకుండా వేరే చోట్ల బూత్లు కేటాయించారు. తీరా అక్కడకు వెళ్తే టీడీపీ బీఎల్ఏలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సోంపేటలో అయితే ఓ టీడీపీ నేత బూతులు తిట్టాడు. పైగా అతడు బూత్ ఏజెంట్ కూడా కాదు. కంచిలి మండలం పురుషోత్తపు రం పంచాయతీ పరిధి ఆర్.గెద్దలపాడు గ్రామంలో 37 ఇళ్లకు ఇప్పటికీ ఫారాలు ఇవ్వలేదు. ఓ మండపంపై కూర్చుని అందరినీ అక్కడికే పిలిపించుకోవ డం కనిపించింది. పెద్దశ్రీరాంపురం గ్రామంలో ఓటర్కు ఇచ్చిన రెండు ఫారమ్స్ నింపిన వాటిని బీఎల్ఓ తీసుకెళ్లి, వాటిని అప్లోడ్ చేసి తిరిగి ఇస్తా మని చెబుతున్నారు. వాస్తవానికి ఆ ఫారమ్స్ను ఓటరు ఇంటి వద్దే అప్లోడ్ చేసి, అక్నాలెడ్జ్ మెంట్ను తిరిగి ఓటరుకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఈ విషయమై ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్రెడ్డి సోంపేట తహసీల్దార్ అప్పలస్వామిని శుక్రవారం సాయంత్రం కలిసి పరిస్థితిని వివరించారు. మరోవైపు కంచిలి ఎంపీపీ పైల దేవదాస్రెడ్డి ఆర్.గెద్దలపాడు గ్రామంలో బీఎల్ఓ తీరును స్థానిక తహసీల్దార్ ఎన్. రమేష్కుమార్ దృష్టిలో పెట్టినట్లు తెలిపారు. సర్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టాలి. ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ప్రక్రియ కొనసాగించాలి. ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా అధికారులు నడిపించాలి. – సాడి శ్యాంప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఇచ్ఛాపురంకంచిలి మండల పరిధిలో సర్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉంది. పలు గ్రామా ల్లో ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫారమ్స్ పంపిణీ చేపట్టలే దు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఆర్.గెద్దలపాడు గ్రామంలో 37 కుటుంబాలకు ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫారమ్స్ బీఎల్ఓ పంపిణీ చేయలేదు. – పైల దేవదాస్రెడ్డి, ఎంపీపీ, కంచిలి -
రెవెన్యూ శాఖ సేవలు భేష్
శ్రీకాకుళం పాతబస్టాండ్: కాగితంపై ఉండే వివరాలు, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను సరిగ్గా బేరీజు వేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావడంలో రెవెన్యూ వ్యవస్థ సమర్థంగా పని చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్లో రెవెన్యూ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, ఫలితాల ఆధారిత సేవలందించడమే ప్రతి రెవెన్యూ ఉద్యోగి లక్ష్యంగా ఉండాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ మాట్లాడుతూ బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, జి.జయదేవి, సివిల్ సప్లయ్ డీఎం వేణుగోపాల్, కలెక్టరేట్ పరిపాలన అధికారి సూర్యనారాయణ, రిటైర్డ్ జేసీ–2 రజనీకాంతరావు, రిటైర్డ్ ఆర్డీఓ పీఎంజే బాబు, సెక్షన్ సూపరింటెండెంట్ నాగేశ్వరరెడ్డి, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు గణపతిరావు, తదితరులు పాల్గొన్నారు. -
జీవనాధారమే ప్రాణం తీసింది
● గొర్రెలను రక్షించబోయి కాపరి మృతి ● ప్రాణాలు కోల్పోయిన 30 గొర్రెలు ● రెడ్డిపేటలో విషాద ఛాయలు పొందూరు: జీవనాధారమే ఆ కాపరి ప్రాణాలు పోయేలా చేసింది. 40 ఏళ్లుగా గొర్రెల పెంపకాన్ని నమ్ముకుని బతుకుతున్న ఆ వ్యక్తి ఆ గొర్రెలను రక్షించే క్రమంలో తన ప్రాణాలు కోల్పోయారు. పొందూరు– జి.సిగడాం మండలాల సరిహద్దు రైలు పట్టాలకు సమీపంలో ఉన్న గొర్రెల మందలో నుంచి కొన్ని గొర్రెలు అకస్మాత్తుగా రైలు పట్టాలపైకి వెళ్లడంతో శనివారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు, గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. పొందూరు మండలంలోని రెడ్డిపేట(పుల్లాజీపేట) గ్రామానికి చెందిన శనగల పోతయ్య(47) గొర్లె కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. సుమారు 4 దశాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉన్నారు. ఎప్పటిలాగానే ఆయన శనివారం గొర్రెల మందను వాండ్రంగి సమీపంలోని రైలు పట్టాల వద్దకు మేత కోసం తీసుకెళ్లారు. అకస్మాత్తుగా కొన్ని గొర్రెలు రైలు పట్టాలమీదకు వెళ్లిపోయాయి. అదే సమయంలో అతివేగంగా వస్తున్న రైలును గమనించి పోతయ్య పరుగు పరుగున పట్టాలపైకి వెళ్లారు. గొర్రెలను రక్షించే క్రమంలో తన సంగతి మర్చిపోయాడు. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 30 గొర్రెలూ చనిపోయాయి. మృతునికి భార్య మంగమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోతయ్య మృతి విషయాన్ని తెలుసుకున్న భార్య కుమారులు పట్టాల వద్దకు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. -
ఉపాధి వేతనదారులపై తేనెటీగల దాడి
సంతబొమ్మాళి : నౌపడలో ఒరేమాడు చెరువులో శనివారం ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా 16 మంది వేతనదారులపై తేనెటీగలు దాడి చేశాయి. బాధితులను నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించగా స్టాఫ్ నర్సులు ధనలక్ష్మి, అమర వైద్యం అందించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి పలాస: పలాస రైల్వే స్టేషన్ పరిధిలో గుణుపూర్–కటక్ ప్యాసింజర్ రైలులో గుర్తు తెలియని వ్యక్తి శనివారం ప్రయాణిస్తూ ఆకస్మికంగా మృతిచెందాడు. మృతుడి వయస్సు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుందని, ఎరుపు టీ షర్ట్, నలుపు ఫ్యాంట్ ధరించాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గాలివాన బీభత్సం హిరమండలం: ఎల్.ఎన్.పేట, హిరమండలం మండలాల్లో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. పొలాల్లో భారీగా నీరు చేరింది. ఇప్పటికే ఖరీఫ్లో జల్లిన విత్తనాలు నీట మునిగాయి. దబ్బగూడలో పూరిల్లు నేలకొరిగింది. ఎంటీఎస్ టీచర్లను ఇబ్బందిపెట్టొద్దు శ్రీకాకుళం : డీఎస్సీ–2008, 1998 ఎంటీఎస్ టీచర్ల నియామకం జరిగినప్పటి నుంచి రాష్ట్ర విద్యాశాఖ ప్రతి సంవత్సరం వారిని వర్క్ అడ్జెస్ట్మెంట్, బదిలీల పేరుతోనూ స్థాన చలనం చేయడం తగదని డీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు పేడాడ కృష్ణారావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పూజారి హరిప్రసన్న, ఎన్ని వెంకటప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనూ జూన్ 22లోపు వారి స్థాన చలనం కోసం రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అభ్యంతరం చేశారు. ప్రతిసారీ సుదూర ప్రాంతాల పాఠశాలలకు పంపించడంతో వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మొదట్లో నియామకం చేసినప్పుడు వారి సొంత మండలంలోనే పోస్టింగ్ ఇచ్చారని, ఆ తర్వాత పక్క మండలాలు, డివిజన్ కూడా దాటి పంపించడం సరికాదన్నారు. విద్యా శాఖ అవసరాన్ని బట్టి జిల్లాలో ఎక్కడికి వేస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన చెందుతున్నారని, వారికి ఇచ్చే జీతం తక్కువ కావడం, మిగిలిన సర్వీస్ కూడా తక్కువే ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి సాయం శ్రీకాకుళం క్రైమ్ : గుండెపోటుతో మరణించిన ఇచ్ఛాపురం హెడ్ కానిస్టేబుల్ తమ్మినేని ప్రసాద్ కుటుంబానికి జిల్లా పోలీస్ అసోసియేషన్ డెత్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కృష్ణంనాయుడు ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు శనివారం నగరంలోని సంపత్బాలాజీనగర్లో నివాసముంటున్న ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. సతీమణి లక్ష్మికి ధైర్యం చెబుతూ అసోసియేషన్, జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ట్రెజరర్ కె.భుజంగరావు పాల్గొన్నారు. -
యోగాతో ఆరోగ్యకర సమాజం
శ్రీకాకుళం కల్చరల్: ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగాసనాలను జీవితంలో భాగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు అన్నాదొరై పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కార్గిల్ పార్కులో గిరిజన సంక్షేమ శాఖ, ఏపీఈపీడీసీఎల్ శాఖల ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ సమన్వయంతో ప్రత్యేక యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జీఎన్ ప్రసాద్ మాట్లాడుతూ నిరంతరం యోగాసనాలు సాధన చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటుందన్నారు. జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్రాజ్ రాణా మాట్లాడుతూ రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో యోగా, ధ్యానం కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శక ఓటరు జాబితా లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)–2026 కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు ఇంటింటా సర్వేలు చేసి కచ్చితమైన ఓటరు జాబితా రూపొందించేందుకు కృషి చేయాలని శ్రీకాకుళం రెవెన్యూ డివిజినల్ అధికారి కె.సాయిప్రత్యూష అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలై 14 వరకు సర్వే కొనసాగుతుందన్నారు. ఓటర్లకు ఫారాలు అందించి నిబంధనల ప్రకారం వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జూలై 21న ఉంటుందని, తర్వాత అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు. అభ్యంతరాలపై జిల్లా ఎన్నికల అధికారి, ప్రధాన ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో అర్బన్ ఏపీసీ జానకి, ఎన్నికల డీటీ జి.కె.శ్రీనివాసరావు, నాయకులు ఐ.టి.కుమార్, రమేష్, పైడి వేణుగోపాల్, ఈశ్వరి, పి.ఎం.జె.బాబు, శంకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
34 బెల్టుషాపులపై కేసులు
● 40.32 లీటర్ల అనధికార మద్యంసీజ్ ● బహిరంగంగా మద్యం సేవిస్తున్న 9 మందిపై కేసులు శ్రీకాకుళం క్రైమ్ : సాక్షి దినపత్రికలో ఈ నెల 19న వచ్చిన ‘నేతలు.. మేతలు’ కథనానికి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ యంత్రాగం స్పందించింది. మద్యం ఎమ్మార్పీపై అదనపు వసూలు, బెల్టుషాపుల్లో విక్రయాలు, అడుగడుగునా అక్రమ మద్యం, అక్రమ వసూళ్లు, నేతలు దర్జాగా దోచేస్తున్న వైనంపై శనివారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా 34 బెల్టుషాపులపై ఎకై ్సజ్ శాఖ కేసులు నమోదు చేశారు. 40.32 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న 9 మందిపై కేసులు నమోదు చేశారు. నెలాఖారువరకు స్పెషల్ డ్రైవ్.. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశాలతో ఈ నెలాఖరు వరకు అనధికార మద్యం అమ్మకాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్రెడ్డిత తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు పర్యవేక్షణలో జిల్లా ఎకై ్సజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ జరుగుతుందన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజలకు ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా చర్చలు, సమావేశాలు, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. -
సునీల్కుమార్ అరెస్టు అక్రమం
కంచిలి : మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు, బీసీ యువ నాయకుడు సునీల్ను అక్రమంగా అరెస్టు చేయడం తగదని ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆరోపించారు. కంచిలిలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం శోచనీయమన్నారు. కారుమూరి సునీల్కుమార్ను అరెస్ట్ చేయటం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి వైఎస్సార్ సీపీ నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యం విక్రయాలు పారదర్శకంగానే జరిగాయని చెప్పారు. 2014–19 మధ్య కాలంలో రాష్ట్రంలో అంతులేని మద్యం అక్రమాలు జరిగాయని, వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రస్తుతం లేని మద్యం స్కామ్ సృష్టించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ లాకప్డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య, డీఎస్సీ–25లో అంతులేని అక్రమాలు, అవినీతి, అమరావతిలో వేలాది మంది రైతుల్లో వ్యతిరేకత, ఆక్వా రైతుల ఉద్యమాలు.. ఇలా టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు నీచ రాజకీయాలకు తెగబడ్డారని మండిపడ్డారు. టీడీపీ అక్రమ అరెస్టులు ఆపకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ నేతలు రామదాసు తదితరులు పాల్గొన్నారు. -
‘నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు’
నరసన్నపేట: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుందని దీంట్లో పోలింగ్ బూత్ స్థాయి అధికారు లు, ఆపై అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ ‘సర్’ కార్యక్రమం జిల్లా ఇన్చార్జి కుంబా రవిబాబు అన్నారు. నరసన్నపేట నియోజకవర్గ పరిధిలోని పోలాకి మండలం కుసుమపోలవలస, నరసన్నపే ట మండలం సత్యవరం గ్రామాల్లో సర్ కార్యక్ర మం క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తీరును ఆయన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్తో కలసి శనివారం పరిశీ లించారు. బీఎల్ఓను అడిగి సర్ కార్యక్రమం నిర్వహిస్తున్న తీరును తెలుసుకున్నారు. నిబంధనలు పాటించాలని, అర్హులను ఓటరు జాబితా నుంచి తొలగిస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించా రు. పార్టీ బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఓటర్లకు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారాలు ఒకటి ఓటరు వద్దే ఉండాలని, అప్పుడే మనకు బలం అని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి పౌరుని కీ ఓటు హక్కు ఉండాలన్నారు. వారి వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ఆరంగి మురళి, పార్టీ బూత్ కమిటీ జిల్లా అధ్యక్షులు దోమ మన్మధరావు ఉన్నారు. -
మోసపోతే మౌనమెందుకు?
శ్రీకాకుళం క్రైమ్ : కొన్నాళ్ల క్రితం జిల్లా డీఎంహెచ్వో కార్యాలయంలో ఓ హెల్త్ అసిస్టెంట్ ఓ వివాహిత వద్ద రూ.4.50 లక్షలు తీసుకుని ఫేక్ ఆర్డర్ కాపీ ఇచ్చి ఉద్యోగమని నమ్మించాడు. అక్కడే ఓ జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే మహిళ వద్ద రోజూ ఫేక్ అటెండెన్సు రిజిస్టర్లో సంతకాలు పెట్టించి కొన్నాళ్లు జీతం ఇచ్చి ఆపై జాబిచ్చానన్న నెపంతో సదరు మహిళను శారీరకంగా లోబర్చుకున్నాడు. ఉద్యోగానికి సంబంధించి విధులు లేకుండా ఇలా చేస్తుండటంతో అనుమానమొచ్చిన బాధితురాలు డీఎంహెచ్వోను కలిశాక అసలు విషయం బయటపడింది.. అతనిచ్చింది జాబ్కాదని.. ఆ నెపంతో తనను మోసం చేశాడని తెలుసుకుని నిర్ఘాంతపోయింది. ఇదే పరిస్థితి అనేక చోట్ల ఉంది. దాదాపు అనేక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో మహిళలు, విద్యార్థినులు నిత్యం ఇలాంటి లైంగిక వేధింపుల సమస్యలు ఎదుర్కొంటున్నా బయటకు చెప్పుకోలేక.. ఫిర్యాదు చేసినా న్యాయం జరుగుతుందో లేదోనని, అనవసరంగా పరువు పోతుందేమోనని భయపడుతున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టింది మొదలు ఆకతాయిల నుంచి టార్చర్ మొదలు. మరి మహిళల భద్రతకు చట్టం ఎలా నిలుస్తుదన్నది ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవవ్యకత ఎంతైనా ఉంది.. చట్టం కిందకు వచ్చేవివే.. లైంగిక వ్యాఖ్యలు, అసభ్య దూషణ, అసభ్య చూపులు, అవసరం ఉన్నా లేకున్నా అనుమతి లేకుుండా తాకరాదు. ఫోన్లో ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ–మెయిల్, ఫేస్బుక్, ఇన్స్ర్ట్రాగామ్లో అసభ్య, అభ్యంతరకర సందేశాలు పంపరాదు. ఉద్యోగం, పదోన్నతి కల్పన ఆసర చేసుకుని లైంగిక అనుకూలతలుగా మార్చుకోవడం వేధింపుల చట్టం కిందే వస్తాయి. కమిటీలూ ఉంటాయి.. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, కర్మాగారాలు, పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్మాల్స్, దుకాణాలు, ఇతరత్రా రంగాల్లో 10 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తే అక్కడ అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలి. కమిటీలో చైర్పర్సన్గా సీనియర్ మహిళా అధికారి, ఇద్దరు సభ్యులు, సామాజిక కార్యకర్త ఉంటారు. పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురైతే విచారణ చేపట్టడం, ఆరోపణ నిర్ధారణ అయితే చర్యలు సూచించడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఈ కమిటీల విధులు. న్యాయం జరుగుతుందిలా..! బాధితురాలు ఘటన జరిగిన మూడు నెలల్లోపు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. లైంగిక వేధింపుల నివారణ హెల్ప్లైన్ నెంబర్ 181కు కాల్ చేసి వివరాలు తెలియజేయవచ్చు. ఫిర్యాదు అందుకున్న 90 రోజుల్లో కమిటీ విచారణ పూర్తి చేసి నివేదికను ఉన్నతాధికారికి అందిస్తుంది. నేరం నిర్ధారణ అయ్యిందంటే నేరస్థితిని బట్టి హెచ్చరించడం, సస్పెన్షన్, తొలగింపు వంటివి చేస్తారు. ఉద్యోగోన్నతి, శాలరీ నిలుపుదల చేసి బాధితురాలికి నష్టపరిహారం అందిస్తారు.. -
శ్రీకాకుళం
ఎన్నాళ్లీ ఎదురు చూపులుఆఫ్షోర్ నిర్వాసితులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఆర్ఆర్ కాలనీలో వసతులు లేవు. –8లోహృదయ విదారకం : రైలు పట్టాలపై మృతదేహాలు అంత పెద్ద రైలు ఎదురుగా వస్తుంటే ఆ చిన్ని గుండెలు ఎంత భయపడ్డాయో.. కాస్త కింద పడితేనే తట్టుకోలేని ఆ దేహాలు ఛిద్రమైన దశలో ఎంత యాతన అనుభవించాయో.. బతుకంటే తెలీని పసి వయసులో చావు ఎంత వణికించిందో. ఊపిరి పోసిన అమ్మ ఉసురు తీస్తుందని వారు ఊహించలేదు. అమ్మ ఆవేశం తమ ఆయువు తీస్తుందని వారు అనుకుని ఉండరు. తాళభద్ర రైల్వే గేటుపై నిశిరాత్రి పూట ఈ రక్తపు మరక పడింది. క్షణికావేశంలో ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. తన ప్రాణాలు తీసుకోవడంతో పాటు కన్నపేగులను బలిపెట్టింది. పలాస, టెక్కలి: పలాస రైల్వే స్టేషన్కు సమీపంలోని తాళభద్ర రైల్వే గేటుకు కొద్ది దూరంలో గురువారం రాత్రి కోటబొమ్మాళి మండలం చలమయ్యపేటకు చెందిన గేదెల పూజ (26), ఆమె కుమారుడు కుశాంత్వర్మ(6), కుమార్తె దీక్షిత(4)లు రైలు కింద పడి మృతి చెందినట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. ఇది పలాసలో సంచలనంగా మారింది. పట్టాలపై విగత జీవు లుగా పడి ఉన్న తల్లీబిడ్డలను చూసిన వారి కళ్లు చెమ్మగిల్లాయి. అర్ధరాత్రి ఘటన జరిగాక తెల్లవారుజామున పట్టాలపై మృతదేహాలను చూసి రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది. పలాస రైల్వే పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. చలమయ్యపేట గ్రామానికి చెందిన గేదెల వెంకట్, భార్య పూజ, ఇద్దరు పిల్లలు కుశాంత్, దీక్షితతో విజయవాడలో ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల వెంకట్ తల్లి పాపమ్మకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అప్పటి వరకు సపర్యలు చేసిన వెంకట్ సో దరి తన కుటుంబ సమస్యల నేపథ్యంలో అత్తవారింటికి వెళ్లిపోయారు. దీంతో అమ్మకు సపర్యలు చేయ డం కోసం వెంకట్ భార్యాపిల్లలను చలమయ్యపేట తీసుకుని వచ్చారు. భార్యా పిల్లలను ఇక్కడే విడిచిపెట్టి తాను ఒక్కడే విజయవాడ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. దీనిపై దంపతుల మధ్య గొడవలు జరిగేవి. గ్రామ పెద్దలు సైతం పలుమార్లు కలుగజేసుకుని సర్దిచెప్పారు. ఈ క్రమంలో గురువారం పూజ భావనపాడు లోని తన కన్నవారింటికి పిల్లలను తీసుకుని వెళ్లిపోతానని బయల్దేరారు. ఈ క్రమంలో వెంకట్ భావనపాడు గ్రామంలో ఉన్న తన అత్తకు గురువారం సా యంత్రం 5 గంటలకు ఫోన్ చేసి పిల్లలను తీసుకెళ్లమని సమాచారం ఇచ్చాడని మృతురాలి బావ జోజేశ్వరరావు తెలిపారు. దీంతో పూజ తల్లిదండ్రు లు కంగారు పడి బస్సులో బయల్దేరి చలమయ్య పేట వెళ్లారు. వారు ఇంటికి వెళ్లే సరికి తల్లీపిల్లలు కనిపించలేదు. వెంటనే కోటబొమ్మాళి పోలీస్స్టేషన్కు వెళ్లారు. పోలీసులు తాము ఇప్పుడేమీ చేయలేమని, సీసీ పుటేజీలు, ఇతర సమాచారం సేకరించి చెబుతామని వారిని పంపించేశారు. వారు రాత్రంతా తల్లీపిల్లల కోసం గాలించారు. తెల్లారే సరికి పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని తాళభద్ర రైల్వే గేటుకు సమీపంలో రైలు పట్టాలపై విగత జీవులుగా కనిపించారు. ఈ అఘాయిత్యానికి కారణం ఏమై ఉంటుందని రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో ఆ తల్లి ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నా రు. మృతదేహాలు ఉన్న పలాస ప్రభుత్వ ఆస్పత్రికి మృతురాలి స్వగ్రామం భావనపాడు నుంచి, ఆమె బావ ఉన్న మాకన్నపల్లి నుంచి పెద్ద ఎత్తున బంధువులు, ఇతరులు వచ్చినప్పటికీ చలమయ్యపేట నుంచి కనీసం ఒక్కరు కూడా చేరుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసును పలాస జీఆర్పీ సీఐ రవికుమార్ దర్యాప్తు చేస్తున్నారు. శనివారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2026 ఇద్దరు బిడ్డలతో రైలుకిందపడి తల్లి ఆత్మహత్య పలాస రైల్వేస్టేషన్ పరిధి తాళభద్ర సమీపంలో ఘటన అత్తకు సపర్యలు చేసే విషయంలో భర్తతో వివాదం కోటబొమ్మాళి మండలం చలమయ్యపేటలో విషాద ఛాయలు -
ఇలా ఐతే ఎలా..?
● పాతపట్నంలో మూతపడిన నేత్ర పరీక్ష కేంద్రం ● రెండేళ్లుగా తెరుచుకోని వైనం ● అవస్థలు పడుతున్న రోగులు పాతపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యం రంగం నీరుగారిపోతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో నేత్ర పరీక్ష కేంద్రం రెండేళ్లుగా తెరచుకోవడమే లేదు. వైఎస్సార్ హయాంలో ఇక్కడ ఐ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, సావరకోట, ఎల్.ఎన్ పేట మండలాల ప్రజలకు అందుబాటులో ఉండేది. నేత్ర సంబంధమైన సమస్యలు తలెత్తితే ఐ కేంద్రానికి వచ్చి పరీక్షలు చేసి అవసమైన వారికి ఉచితంగా మందులు, కంటి అద్దాలను అందజేసే వారు. అలాగే ప్రతి ఆరు నెలలకు నేత్ర వైద్య శిబిరాలను సైతం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేవారు. పాతపట్నం సామాజిక ఆస్పత్రిలో కంటి వైద్యుడు గతంలో ఉండేవారు. ఇప్పుడు సీహెచ్సీలో కంటి వైద్యుడు కూడా లేకపోవడం, కూట మి ప్రభుత్వం నియంచకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే నేత్ర వైద్య సేవలు 2024 సెప్టెంబర్ 16వ తేదీ నుంచి నిలిచిపోయాయి. వృద్ధులు, పేదలు ఆస్పత్రికి వచ్చి నేత్ర పరీక్ష కేంద్రంలో సేవలు అందకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికై నా వైద్యాధికారులు దృష్టి సారించి నేత్ర పరీక్ష కేంద్రం ద్వారా సేవలు పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. నేత్ర వైద్య సేవలు అవసరం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాతపట్నం సామాజిక ఆస్పత్రి లో ఐ సెంటర్ను ఏర్పాటు చేశారు. రెండేళ్ల కిందటి వరకు సక్రమంగా సేవలు అందేవి. – సవిరిగాన ప్రదీప్, వైస్ ఎంపీపీ, పాతపట్నం ఉన్నతాధికారులకు తెలియజేశాం పాతపట్నం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలోని నేత్ర పరీక్ష కేంద్రం ద్వారా సేవలు పునరుద్ధరించాల ని జిల్లాఉన్నతాధికారులకు విన్న వించాం. కౌన్సిలింగ్లో కంటి వైద్యులను నియమిస్తామన్నారు. – డాక్టర్ దాము లీలాకుమార్, సీహెచ్సీ సూపరిండెంటెంట్ -
21 డచ్ భవనం వద్ద ప్రపంచ యోగా దినోత్సవం
శ్రీకాకుళం పాతబస్టాండ్: డచ్ భవనం వద్ద ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం తెలిపారు. 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు యోగా కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థులు, ప్రజలు పాల్గొని ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ పాతపట్నం: ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని సాంఘిక సంక్షే మ గురుకుల జిల్లా సమన్వయాధికారి(డీసీఓ) వై.యశోద లక్ష్మి అన్నారు. మండలంలోని ప్రహారాజపాలెంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను శుక్రవా రం తనిఖీ చేశారు. భోజనాలను పరిశీలించా రు. వంటశాల, నిత్యావసర సరుకులు, ఎక్స్పైరీ డేట్లను తనిఖీ చేశారు. వంటగదిని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. ఆమెతో పాటు ప్రిన్సిపాల్ పి. పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోలీసుల సంక్షేమమే ముఖ్యం శ్రీకాకుళం క్రైమ్ : పోలీసు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం, సంక్షేమమే డయల్ యువర్ ఎస్పీ పోలీసు గ్రీవెన్స్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫోన్లో నేరుగా సిబ్బందితో మాట్లాడి వృత్తిపరమైన, వ్యక్తిగత సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘భోగాపురం తర్వాత ఆస్పత్రిపై దృష్టి పెడతా’ శ్రీకాకుళం : రిమ్స్ను జిల్లాలోనే ఉత్తమ సేవలు అందించే ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బల గలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అక్షర సమావేశ మందిరంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.4 కోట్ల ముప్పై లక్షల సీఎస్సార్ నిధులతో ఏర్పాటు చేయనున్న వైద్య పరికరాలకు సంబంధించి మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ను జీజీహెచ్ అధికారులతో కలిసి శుక్రవారం మార్చుకున్నారు. భోగాపురం పూర్తయ్యాక.. ఆస్పత్రిపై దృష్టి పెడతానని అన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ కేవలం ఆరు రోజుల్లోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లాంటి ఒక భారీ ప్రభుత్వ రంగ సంస్థ రూ.4.51 కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ టేబుల్ ల్యాంప్స్ కూడా లేవని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. బొడ్డపాడు లేఅవుట్ ప్లాట్లకు ఈ–వేలం శ్రీకాకుళం పాతబస్టాండ్: పలాస మండలం బొడ్డపాడు ఎన్.టి.ఆర్. స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్లలో మిగిలి ఉన్న ప్లాట్లను ఈ–వేలం ద్వారా విక్రయించనున్నట్లు సుడా వైస్ చైర్మన్, జా యింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ శనివారం తెలిపారు. గతంలో అమలు చేసిన ఈ–లాటరీ విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఈసారి ‘భూ కొనుగోలు’ పోర్టల్ ద్వారా ఈ–వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫేజ్–1లో ఖాళీగా ఉన్న 200 ప్లాట్లు, ఫేజ్–2లో అందుబాటులో ఉన్న 361 ప్లాట్లను కొనుగోలుదారుల కోసం సిద్ధం చేశామని చెప్పారు. చదరపు గజం ధర రూ.5,700 గా నిర్ణయించామని వివరించారు. ఆసక్తి గల వారు జూన్ 20 ఉదయం 10 నుంచి జూలై 12 రాత్రి 10గంటల లోపు konugolu.ap.gov.in వెబ్సైట్లో తమ ఆధార్, పాన్కార్డ్ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్లాట్ఫామ్ ఫీజు రూ.500, ప్రాసెసింగ్ ఫీజు రూ. 2,000తో పాటు లక్ష రూపాయల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారితో జూలై 15న వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
ఉక్కపోతతో విలవిల
● కూటమి సభలో అర్ధంతరంగా వెనుదిరిగిన కూటమి కార్యకర్తలుశ్రీకాకుళం : జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలిలో శుక్రవారం నిర్వహించిన కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభకు హాజరైన వారంతా ఉక్కపోతతో విలవిల్లాడిపోయారు. వేదికపై కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేసినప్పటికీ సభా ప్రాంగణంలో ఉన్నవారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో వేడి, ఉక్కపోతను తట్టుకోలేక కార్యకర్తలు సభ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంతో కొందరు వడదెబ్బ బారినపడి ఇంటి ముఖం పట్టారు. మరోవైపు జిల్లా స్థాయి విజయోత్సవ సభకు సంబంధించిన బ్యానర్లపై ఎన్టీఆర్ ఫొటో కనిపించకపోవడంతో ఆయన అభిమానులు, తొలి నుంచి పార్టీలో ఉన్న నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
● ఆఫ్షోర్ నిర్వాసితులకు తప్పని పాట్లు ● టెక్కలిపట్నం ఆర్అండ్ఆర్ కాలనీలో కనీస వసతులు కరువు ● పరిష్కారం కాని ప్యాకేజీ సమస్యలు ● పట్టించుకోని పాలకులు మెళియాపుట్టి : ఆఫ్షోర్ రిజర్వాయర్ కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు చివరకు కష్టాలే మిగులుతున్నాయి. మౌలిక వసతులతో పాటు ప్యాకేజీ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. మెళియాపుట్టి మండలంలోని చీపురుపల్లి, దాసుపురం, సవర చీపురుపల్లి గ్రామాల ప్రజలు ఆఫ్షోర్ రిజర్వాయర్ కోసం విలువైన భూములు, ఇళ్లను ప్రభుత్వానికి అప్పగించారు. టెక్కలిపట్నంలోని ఆర్ఆర్ కాలనీలో చీపురుపల్లి గ్రామానికి చెందిన సుమారు 200 నిర్వాసిత కుటుంబాలవారు ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. అయితే వారికి రహదారులు, కాలువల నిర్మాణాలు నేటికీ చేపట్టకపోవడంతో వర్షపునీరు, మురుగు నిల్వలతో అవస్థలు పడుతున్నారు. నిర్వాసితుల కాలనీలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించే సమయంలో బంధువులు వస్తే రహదారుల్లేక అవస్థలు తప్పడంలేదని వారు వాపోతున్నారు. త్యాగాలకు ఏదీ ప్రతిఫలం? ఆఫ్షోర్ రిజర్వాయర్లో మెళియాపుట్టి, టెక్కలి, నందిగాం మండలాలకు చెందిన పలు గ్రామాలు పడటంతో నిర్వాసితులకు న్యాయపరంగా ప్యాకేజీలు అందించాల్సి ఉంది. అయితే తగిన న్యాయం జరగకపోవడతంతో నిరాహార దీక్షలు ప్రారంభించారు. గత ఏడాది మే 22న చీపురుపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. అయినా నేటికీ న్యాయం జరగలేదు. అర్హులైన 132 మందికి పరిహారాలు అందక వారంతా ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో 14.55 ఎకరాల డి–పట్టాభూములకు సైతం పరిహారం అందించలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 240 మంది యువతకు ప్యాకేజీలు అందించలేదని, 360 కుటుంబాలకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. గతంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావులు నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ అమలుకాలేదు. కనీసం మౌలిక సదుపాయాలైనా కల్పించడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పర్యవేక్షణ శూన్యం..!
సీజనల్ భయం..పశు సంవర్ధక ఽశాఖ అధికారులు దిగువ స్థాయిలో సిబ్బందిపై పశువైద్య సేవల బాధ్యతలు పెట్టకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తే సమస్యలు గుర్తించవచ్చు. సీజనల్గా వచ్చే వ్యాధులు గురించి పాడి రైతులకు గ్రామాల్లో అవగాహన కల్పించాలి. సిబ్బంది పనితీరు మెరుగుపరచాలి. – పైడి మోహనరావు, మతలబుపేట, సరుబుజ్జిలి పశువులకు సీజనల్గా వ్యాపించే అంటువ్యాధులపై పాడి రైతులకు అంతగా అవగాహన ఉండడం లేదు. దీనివలన తరుచూ పశువులకు వ్యాపిస్తున్న వ్యాధులతో నానా ఇక్కట్లు పడుతున్నాము. పశువైద్య శాఖ అధికారులు పశువుల పెంపకం, సంక్రమించే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించాలి. లంపిస్కిన్ వ్యాధితో అప్పట్లో చాలావరకు పశునష్టం చవిచూశాం. – చల్ల యర్రయ్య, చిగురువలస, సరుబుజ్జిలి సరుబుజ్జిలి: ఇటీవల పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గోతుల్లో నీరు చేరింది. దీంతో మనుషులు మాదిరిగా పశువులకు కూడా అనేక రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సీజనల్గా వచ్చే వ్యాధులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండి పలు ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వ్యాధుల నివారణకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పాడి రైతులకు అవగాహన కల్పించడంలో శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో లంపిస్కిన్(ముద్దచర్మ వ్యాధి) వ్యాపించి చాలావరకు పశువుల నష్టాలు జరిగాయి. అలాంటి నష్టాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కార్యాలయాలకే పరిమితం వాస్తవానికి పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా(ఏడీ) ఉన్న ఉద్యోగి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి తమ సిబ్బందిని అప్రమత్తం చేయాలి. ఈవిధంగా తరుచూ పర్యటించి సీజనల్గా పశువులకు వ్యాపిస్తున్న అంటువ్యాధులు, వాటి నివారణా చర్యలు గురించి పాడి రైతులకు అవగాహన కల్పించాలి. గ్రామాల్లో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. అప్పుడు దిగువ స్థాయి సిబ్బంది కూడా సక్రమంగా పనిచేస్తారు. అయితే ఏడీ స్థాయిలో ఉన్న ఉద్యోగులు మండల పశువైద్య కార్యాలయం నుంచి బయటకు కదలకపోవడంవలన పశువైద్యం ఆశించిన స్థాయిలో అందడం లేదన్న విమర్శలు పాడి రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని పాడి రైతులు కోరుతున్నారు. పశువులకు సంక్రమించే వ్యాధులు చిటుకు వ్యాధి గొర్రెల్లో చిటుకువ్యాధి అధికంగా వస్తుంది. ఇది బ్యాక్టీరియా వలన వస్తుంది. ఉన్నటుండి గాలిలో ఎగిరి గొర్రెలు చనిపోతాయి. దీని నివారణకు ముందుగా నీరసంగా ఉన్న గొర్రెలను మంద నుంచి వేరుచేయాలి. వ్యాధి నివారణకు పెన్సిలిన్ వేయించాలి. వ్యాధి సోకని వాటికి వ్యాక్సిన్ వేయించాలి. నీలి నాలుక నీలి నాలుక గొర్రెలు, మేకల్లో వస్తుంది. ఈ వ్యాధి సోకిన జీవాలకు జ్వరం అధికంగా వస్తుంది. నోటి నుంచి చొంగ కారుస్తూ, గిట్టలకు పుండ్లు ఏర్పడతాయి. ఈ వ్యాధి నివారణకు యాంటీ బయాటిక్స్, లివర్ టానిక్ ఉపయోగించాలి. జీవాలను మంద నుంచి వేరు చేయాలి. గొంతువాపు వ్యాధి ఈ వ్యాధి అన్ని వయస్సుల ఆవులు, గేదెల్లో కనిపిస్తుంది. 105 నుంచి 108 డిగ్రీల జ్వరం వస్తుంది. నోటి నుంచి చొంగలు కారి, నోటి నుంచి గాలి పీల్చుకుంటాయి. గొంతవద్ద వాపు వలన మేత తీసుకోలేవు. నివారణకు సల్పాడిమిడిన్ వాడుతూ, 4 నెలలు దాటిన జీవాలకు వ్యాక్సినేషన్ చేయించాలి. గాలికుంటు వ్యాధి ఇది అన్ని జీవాల్లో కనిపిస్తుంది. నోటి, గిట్లల్లో పుండ్లు, ఎక్కువగా జ్వరం ఉంటుంది. నివారణకు బోరిక్ గ్లిజరిన్ ఆయింట్మెంట్ను నోటిలో పూత పూయాలి. పీపీ ద్రావణంతో కాలిగిట్ల మధ్య కడగాలి. ప్రతిఏటా ముందస్తుగా ఏప్రిల్, మే నెలల్లో వ్యాక్సిన్ వేయించాలి. -
హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలే శరణ్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగుల హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలే శరణ్యమని ఏపీ అమరావతి జేఏసీ జిల్లా అధ్యక్షుడు బీవీఎన్ రాజు అన్నారు. ఉద్యోగులంతా ప్రభుత్వంపై ఉద్యమబాటకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జేఏసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా శుక్రవారం జిల్లా సర్వే ఉద్యోగుల సంఘం, గణాంక శాఖ ఉద్యోగుల సంఘం, ట్రెజరీ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు జేఏసీ అధ్యక్షుడిని కలిసి మద్దతు ప్రకటించారు. సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.జగన్, కార్యవర్గ సభ్యులు, గణాంక శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి.సుధాకరరావు, కార్యవర్గ సభ్యులలు, ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ట్రెజరర్ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పి.వి.రమణ తదితరులు మద్దతు తెలియజేశారు. -
ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, పట్టణ ప్రజలకు నష్టదాయకమైన ప్రైవేటీకరణ ప్రయత్నాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, శ్రీకాకుళం పట్టణ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ఎం.గోవర్ధనరావు డిమాండ్ చేశారు. పట్టణాలలో పౌరసేవలను ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్–ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో వాటర్ సప్లయ్, వీధిలైట్లు, పార్కులు, రోడ్లు, వాహనాలు తదితర 14 కీలక విభాగాలను పీపీపీ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ ప్రభు త్వం జారీ చేసిన 975, 673 జీవోలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్రజలు గౌరవప్రదంగా జీవించేలా తగిన విధానాలను రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రైవేటు సంస్థలకు పెద్దపీట వేస్తున్నాయని మండిపడ్డారు. అనంతరం మున్సిపల్ హెల్త్ అధికారి పి.సుధీర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర కమిటీ నాయకులు ఏ.జ్యోతిప్రసాద్, ఎం.రాఘవ, ధనాల చిట్టి, ఆకుల మోహన్, ఆర్.యుగంధర్, జె.మాధవి, ఎన్. పార్వతి, వి.సరోజ, డి.గంగ తదితరులు పాల్గొన్నారు. -
కూర్మనాథాలయ ప్రాంగణంలో యోగా
ఉక్కపోతకు గురైన వృద్ధురాలుగార: యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అన్నారు. శుక్రవారం ప్రముఖ విష్ణు క్షేత్రం శ్రీకూర్మనాథాలయ ప్రాంగణలో యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు వారి ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ప్రస్తుత రోజుల్లో జీవితంలో ప్రతి ఒక్కరికీ శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం యోగా ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డచ్ భవనం వద్ద భారీ యోగా కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, జిల్లా ఆయుష్ అధికారి ఉత్తమ్రాజ్ రాణా, తహశీల్దార్ ఎం.చక్రవర్తి, ఎంపీడీఓ ఎస్.శ్రీనివాసులు, దేవదాయ శాఖ ఏసీ ప్రసాద్ పట్నాయక్, ఆలయ ఈఓ టి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
27న రెడ్క్రాస్ వార్షిక సమావేశం
శ్రీకాకుళం కల్చరల్: ఇండియన్ రెడ్క్రాస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న జెడ్పీ సమావేశ మందిరంలో వార్షిక సమావేశం నిర్వహిస్తున్నట్లు రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశానికి సభ్యులంతా హాజరుకావాలని కోరారు. విరాళాలు అందచేసిన దాతలకు, రక్తదాన శిబిరాలు నిర్వాహకుల కు, నేత్ర మోటివేటర్లకు, వలంటీర్లకు సేవా ప తకం, అవార్డులు అందిస్తామని పేర్కొన్నారు. చెట్టు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు టెక్కలి రూరల్: పెద్దరోకళ్లపల్లి గ్రామానికి చెందిన రాంప్రాతుని చంద్రశేఖర్ అనే యువకుడు శుక్రవారం చెట్టు పైనుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు తీస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడటంతో కుడిచెయ్యి విరిగిపోయింది. వెంటనే బాధితుడిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు సంతబొమ్మాళి : ఇంటి నిర్మాణం చేయకుండా అడ్డుకుంటున్నారని.. తమ స్థలంలో చెట్లను జేసీబీతో తొలగించి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఉమిలాడ గ్రామానికి చెందిన బాధితులు మైలపిల్లి ఓంకార్, తల్లి లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామ పెద్దలను కలిసి గోడు వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామం పక్కన ఉన్న పోలాకి మండలం గుప్పెడుపేట పంచాయతీ చిన్నకొరివిపేటలో పూర్వం నుంచి సొంత ఆస్తులు ఉన్నాయని, పూరిల్లు కూలిపోవడంతో కొత్త ఇల్లు నిర్మాణం చేయడానికి ప్రయత్నించగా అధికార పార్టీ కార్యకర్తలు సురపతి నీలయ్య, మెరుగు చిరంజీవి, పొన్నాడ లక్ష్మణరావు, సురపతి లక్ష్మణరావు, పొన్నాడ తాతారావు, కొమర జంగమయ్య, గుంటూ పోలరావు, చోడుపిల్లి దుర్గారావులు అడ్డుకున్నారని చెప్పారు. దౌర్జన్యం చేసి జేసీబీతో చెట్లు తొలగించి ఇసుక తరలించుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నీలయ్య అనే టీడీపీ కార్యకర్త ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడి చంపుతానని బెదిరించాడని వాపోయారు. ఈ విషయమై పోలాకి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, తిరిగి తనపైనే బైండోవర్ నమోదు చేస్తామని చెప్పడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశామని బాధితులు వివరించారు. -
రోడ్డునపడ్డాం
ప్రమాదంలో మా బోటు కాలిపోయింది. దీంతో నేను.. నాతో పాటు వేటకు వస్తున్న మరో ఆరుగురి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మాది పెద్ద ఫ్యామిలీ. ప్రస్తుతం ఎటువంటి ఆధారం లేకుండా పోయింది. లక్షల్లో ఆస్తినష్టం జరిగిపోయింది. ప్రభుత్వం స్పందించి మా అందరినీ ఆదుకుంటే ఈ కష్టం నుంచి బయటపడగలం. – గండుపల్లి బాబూరావు, బాధితుడు, పెద్ద కర్రవానిపాలెం ప్రభుత్వం ఆదుకోవాలి వలలు, బోట్లు దగ్ధమవ్వడంతో మత్స్యకారులంతా తీవ్రంగా నష్టపోయారు. ఇంత భారీ ప్రమాదం జరగడంతో ఈ బోట్లుపై ఆధారపడిన దాదాపు 60 కుటుంబాలు వరకు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం, అధికారులు వేగవంతంగా స్పందించి బాధితులకు నష్ట పరిహారం అందజేయాలి. – కర్రి గోపయ్య, ఎంపీటీసీ, పెద్ద కర్రివానిపాలెం -
ఒడిశాలో కొని.. కాశీబుగ్గకు బస్సులో తెచ్చి
● గంజాయితో పట్టుబడిన పశ్చిమబెంగాల్ వాసి ● గోవా, ఒడిశాలకు చెందిన మరో ఇద్దరితో లింక్ పలాస, శ్రీకాకుళం క్రైమ్ : ఒడిశాలో 5.160 కిలోల గంజాయి కొని.. కాశీబుగ్గకు బస్సులో తెచ్చి.. గోవా వెళ్లేందుకు ట్రైన్కని రైల్వేస్టేషన్కు వెళ్తూ పశ్చిమబెంగాల్వాసి పోలీసులకు పట్టుబడ్డాడు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురిదీ ఒక్కో రాష్ట్రం. వీరిలో ముస్తాక్ అలమ్ అలియాస్ బంటిది పశ్చిమబెంగాల్ హౌరా కాగా ఓమ్ నాయక్ది ఒడిశాలో జయపూర్ సమీప నౌరంగాపూర్. మూడోవాడైన సుమిత్ అలియాస్ విక్కీది గోవాలో కేంథోలిమ్. తొలినుంచే ఒడిశాలోని ఓంనాయక్ గోవాలో ఓ హోటల్లో పనిచేసే విక్కీకి పరిచయాలున్నాయి. నాయక్ ఊరి సమీప అడవు ల్లో దొరుకుతున్న గంజాయిని ప్యాకెట్లుగా మార్చి ప్యాకెట్లుగా పంపడం, అక్కడ అధిక ధరలకు అమ్మడం అలవాటు. ఇదే క్రమంలో సుమిత్ పనిచేసిన హోటల్లోనే హౌరాకు చెందిన బంటి చేరి పరిచయం కావడంతో.. నాయక్ వద్ద గంజాయి మాల్ కొనుక్కుని తెస్తే డబ్బులిస్తానని చెప్పడంతో బంటి వెళ్లాడు. నాయక్ వద్ద నౌరంగాపూర్లో మాల్ తీసుకుని బస్సు ఎక్కి ఎవరికీ అనుమానం రాకుండా కాశీబుగ్గలో దిగాడు. రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా నడుస్తుండగా అదుపులోకి తీసుకున్నామని, బ్యాగులో గంజాయి ఉండటంతో స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సీఐ చెప్పారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
సోంపేట: సోంపేట – బారువ రైల్వేస్టేషన్ల పరిధిలో సుమారు 50 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నలుపు ఫుల్హ్యాండ్ షర్ట్, నీలం జీన్స్ ఫ్యాంటు ధరించి ఉన్నాడని చెప్పారు. మృతదేహన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. వివరాలకు రైల్వే కానిస్టేబుల్ ఎం.సోమేశ్వరరావు (9492250069)ను సంప్రదించాలని కోరారు. గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి శ్రీకాకుళం క్రైమ్ : ఇచ్ఛాపురం టౌన్ పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ తమ్మినేని ప్రసాద్(56) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటకు చెందిన ప్రసాద్ పీఎన్కాలనీ సంపత్బాలాజీనగర్లో భార్యాపిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. కుమార్తె ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు సంతోష్ లా చదువుతున్నారు. కొన్నేళ్లుగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్న ప్రసాద్ సాధారణ బదిలీల్లో భాగంగా గత జూన్లో ఇచ్ఛాపురం చేరారు. తనకు అనారోగ్యమని, డయాలసిస్కు ఇబ్బంది అవుతుందని, కుటుంబానికి దగ్గరగా ఉండేలా బదిలీ చేయమని ఎస్పీని పలుమార్లు వేడుకున్నట్లు పోలీసువర్గాల సమాచారం. పిడుగుపాటుకు ఆవు మృతి కవిటి: జగతి గ్రామంలో పూడి వంశీమోహన్కు చెందిన ఆవు పిడుగుపాటుకు గురై మృతి చెందింది. శుక్రవారం మధ్యాహ్నం తోటలో ఆవు మేస్తుండగా పిడుగు పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పశుసంవర్థఖ శాఖాధికారులు ఆవును పరిశీలించి పిడుగు పాటు కారణంగా మృతి చెందినట్లు నిర్థారించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. ప్రసాద్(ఫైల్) -
‘నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు’
నరసన్నపేట: జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–2026) ప్రక్రి యలో పారదర్శకత లోపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేశా రు. కొత్తూరు మండలంలో సహా పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఓట్ల తనిఖీకి వస్తున్న అధికారులు ఓటరు సంతకం తీసుకున్న తర్వాత రెండు ఫారాలూ తీసుకుంటున్నారని, దీనికి వెనుక ఉన్న మోసం ఏమిటని ప్రశ్నించారు. ఇది ఓట్లు గల్లంతు చేసే కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఆదేశాలను క్షేత్రస్థాయిలో సిబ్బంది తూచా పాటించాలని సూచించారు. కొత్తూరులో జరిగిన సంఘటనను ఉదాహరణగా కృష్ణదాస్ వివరించారు. కొత్తూరులో వైఎస్సార్ సీపీ నాయకులు తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ జిల్లా వ్యాప్తంగా ఇలాంటివి జరగకుండా రెవెన్యూ అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. ఎస్ఐఆర్ పూర్తి అయ్యే వరకూ వైఎస్సార్ సీపీ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
22న చేనేత కార్మికుల ధర్నా
రణస్థలం : రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు లావేరులో చేనేత కార్మికులతో కలిసి ధర్నా కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు నేతన్న నేస్తం కింద సంవత్సరానికి రూ.25వేలు ఎప్పటిలోగా అమలు చేస్తారో నేతన్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డి.వెంకట్, యు.శంకరయ్య, ఎ.గడ్డియ్య, యు.పెంటలింగ, ఏ.ఉమా, కె.జాంబ, ఎన్.రుద్రయ్య, యు.కాశి, ఏ.వేణు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనలో దళితులకు రక్షణ కరువు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): చంద్రబాబు రెండేళ్ల పాలనలో దళితులకు, బీసీలకు రక్షణ కరువైందని, గాదె సాయికృష్ణ ఉదంతం పూర్తికాకుండానే విజయవాడ కృష్ణలంకలో దళిత మాదిగ యువకుడు క్రాంతికుమార్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆత్మహత్య చేసుకోక ముందు సెల్ఫీ మరణ వాంగ్మూలం రికార్డ్ చేస్తూ మరణించిన తీరు చూస్తుంటే, చంద్రబాబు పాలనలో దళితులకు రక్షణ లేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. దళితులకు ఈ రాష్ట్రంలో జీవించే హక్కు.. భద్రత లేదా? అని ప్రశ్నించారు. దళిత యువకుడు వేధింపులకు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే అది ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ నిర్మాణాన్ని పక్కనపెట్టి.. రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేయడం ఎంతవరకు సమంజసమన్నారు. -
చెరువులన్నీ పొలములాయె..!
● కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువులు రణస్థలం: లావేరు మండలంలోని చాలా పంచాయతీల్లో చెరువులు రూపురేఖలు కోల్పోయాయి. గో విందపురం పంచాయతీలో గల ఇజ్జాడపాలెం గ్రా మంలో తుమ్మలవాని చెరువు కబ్జా కోరల్లో చిక్కు కుంది. సర్వే నెంబర్ 117గల తుమ్మలవాని చెరువు విస్తీర్ణం 12 ఎకరాలు ఉండగా అందులో ఐదు ఎకరాల మేర ఆక్రమణలకు గురైంది. కొంతమంది వ్య క్తులు చెరువును చదును చేసి పంటలు వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. అలాగే అదే మండలంలోని అదపాక రెవెన్యూ పరిధిలోని నిడగంట్లవాని చెరువూ అదే కోవలోకి వస్తుంది. చెరువు విస్తీర్ణం 72 ఎకరాలు ఉండగా అందులో 30 ఎకరాల ఆక్రమించి పొలాలుగా మార్చేశారు. చెరువులో ఉన్న మొక్క లు తొలగించి వ్యవసాయానికి అనుకూలంగా మార్చేశారు. ఇలా జరిగితే భూగర్భ జలాలు అడుగంటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో భారీ స్థాయిలో చెరువులు ఆక్రమణలకు గురవుతు న్నా కనీసం అధికారులు పట్టించుకోకపోవడం వెనుక తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ స్థానికంగా ఉండే వీఆర్వోలు, వీఆర్ఏలు చెరువులు పరిరక్షించాలని కోరుతున్నారు. -
పారదర్శకత ఉందా
● ఓటరు దగ్గర ఒక్క ఫారమైనా ఉంచరా? ● కొత్తూరులో రెండు ఫారాలు తిరిగి తీసుకుంటున్న బీఎల్ఓలు ● బీఎల్ఓల తీరుపై అనుమానాలు ● తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 2026 ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ఆరోపణలు ఉన్నాయి. ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఎక్కడికక్కడ భయం పట్టుకుంది. తమ ఓట్లు ఏమవుతాయోనన్న ఆందోళన నెలకొంది. పారదర్శకంగా వ్యవహరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత బీఎల్ఓలపై ఉంది. అప్పుడే ప్రత్యేక సమగ్ర సవరణకు విలువ ఉంటుంది. కానీ కొత్తూరు మండలంలో కొందరు బీఎల్ఓలు ఓటర్కు ఇచ్చిన రెండు ఫారాలు నింపి, సంతకం చేసి, రెండింటినీ తిరిగి ఇవ్వాలని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. వాస్తవంగా బీఎల్ఓ సంతకంతో కూడిన ఒక ఫారం ఓటర్ వద్ద ఉండాలి. మరొకటి బీఎల్ఓలు తీసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా కొందరు బీఎల్ఓలు వ్యవహరిస్తుండటంపై అనుమానాలకు తావిస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణ కచ్చితంగా జరుగుతుందా? ఏదైనా తేడా జరుగుతుందా? అన్న ఆందోళనకు అవకాశమిస్తోంది. ఒక్క కొత్తూరులోనే కాదు జిల్లాలో అనేక చోట్ల ఇదేరకంగా జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. తహసీల్దార్కు ఫిర్యాదు ఓటరుకు ఇచ్చిన రెండు ఫారాలలో ఒకటి ఓటర్కు ఇవ్వాలని, మరొకటి బీఎల్ఓ తీసుకోవాలని కొత్తూరు తహసీల్దార్ సరోజనీకి వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి చింతాడ సూర్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు గండివలస ఆనందరావు, మండల బూత్ కమిటీ అధ్యక్షుడు గోడబండి పోలయ్య, ఎంపీటీసీ వనుము లక్ష్మీ నారాయణ కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. రెండు ఫారాలు తీసుకోవడం సరికాదని, కొందరు బీఎల్ఓల తీరుపై తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై తహసీల్దార్ సరోజినిని ‘సాక్షి’ వివరణ కోరగా ఒక ఫారం ఓటర్ దగ్గరే ఉంటుందని, బీఎల్ఓలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తామని చెప్పారు. బీఎల్ఓ ఇంటికొచ్చి రెండు ఫారాలు ఇచ్చారు. వాటిపై సంతకాలు చేయించారు. వివరాలు నింపి, సంతకాలు చేశాక ఆ రెండు ఫారాలను బీఎల్ఓ తన వెంట తీసుకెళ్లిపోయారు. మాకు ఒక్క ఫారం కూడా ఇవ్వలేదు. – కొత్తూరు మండలం ఒండ్రు జోలకు చెందిన కింతల మన్మధరావు, కింతల శ్రీనివాసరావు ఓట్ల తనిఖీలో భాగంగా బీఎల్ఓ మా ఇంటికి వచ్చారు. వివరాలు అడిగారు. రెండు ఫారాలు ఇచ్చారు. రెండు ఫారాలపైన ఫొటో అంటించి, సంతకం పెట్టి తిరిగి ఇవ్వాలని బీఎల్ఓ చెప్పారు. మళ్లీ వస్తాను అప్పటికి సిద్ధంగా ఉంచండి అని అన్నారు. – పాటంశెట్టి శ్రీరాములు, కొత్తూరు గ్రామం ఇంటికొచ్చి బీఎల్ఓ రెండు ఫారాలు ఇచ్చారు. వాటిని నింపి సంతకం చేసి ఇవ్వండని చెబుతున్నారు. ఏంటో తెలియడం లేదు. – పాటంశెట్టి అమ్మాయమ్మ, కొత్తూరు -
శ్రీకాకుళం
తప్పుడు పత్రాలతో రుణాలు తప్పుడు పత్రాలతో బ్యాంకు రుణాలు పొందారు. ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లారు. –8లోమహిళ అనుమానాస్పద మృతి గొల్లూరులో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. –8లోహిరమండలం: మండల వాసులను తాగునీటి సమస్య వదలడం లేదు. రోజు రోజుకూ సమస్య జఠిలమవుతూనే ఉంది. దీంతో స్థానిక మహిళలు ఎప్పటికప్పు డు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా గురువారం మళ్లీ వారు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున అలికాం–బత్తిలి రోడ్డుపై బైఠాయించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రోజు కాదు, వారం కాదు, నెలలు కాదు సంవత్సరాల తరబడి అదే సమస్య వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి నిరసనతో రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. అడిగితే కేసులు.. మహిళలు రోడ్డెక్కడంతో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మీసాల వెంకట రామకృష్ణ వారికి సంఘీభావం తెలుపుతూ వారితో కలిసి బైఠాయించారు. అయితే దీన్ని తట్టుకోలేని టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి చేయించి మీసాల వెంకట రామకృష్ణ ను అరెస్టు చేయించారు. పోలీస్ యాక్టు 30 ఉన్నందున ఆందోళన కొనసాగిస్తే కఠినమైన కేసులు న మోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో మహిళలు ఆందోళన విరమించక తప్పలేదు. అయి తే మీసాల వెంకటరామకృష్ణతో పాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి హిరమండలం చేరుకున్నారు. స్థానికుల తాగునీటి సమస్యను అడి గి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్స్టేషన్లో ఉన్న మీసాల వెంకటరామకృష్ణతో పాటు ఆ నలుగురిని పరామర్శించారు. నీరు అడిగితే కేసులు నమోదు చేసే చేతకాని పాలకులను ఏమనాలని ప్రశ్నించారు. భేషరతుగా కేసులను వెనక్కి తీసుకోవాలని కోరారు. అప్పుడలా.. ఇప్పుడిలా.. దాదాపు నెల రోజుల కిందట కూడా స్థానిక మహిళలు నీటి కోసం ఆందోళన చేశారు. అప్పట్లో పోలీసులు సముదాయించారు. కానీ సమస్య పరిష్కా రం కాక మరోమారు రోడ్డెక్కే సరికి వెర్రెక్కిపోయా రు. అధికారులు కనీసం ఇటువైపు రాలేదు. సమస్య పరిష్కరిస్తామని చెప్పలేదు. ఏకంగా పోలీస్ యాక్టు ఉందని చెప్పి స్థానికుల నోరు మూయించే ప్రయ త్నం చేశారు. వంశధార గట్టునే ఉన్నా ఈ యాతన ఏమిటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
జిల్లా రిజిస్ట్రార్గా సంజీవయ్య
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): శ్రీకాకుళం జిల్లా రిజిస్ట్రార్గా బి.సంజీవయ్య విధుల్లో చేరారు. ఈయన కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ హెచ్ఓడీగా విజయవాడలో వి ధులు నిర్వహించి పదోన్నతిపై జిల్లాకు వచ్చా రు. ఈయన శ్రీకాకుళం జిల్లాలో 1986లో జూనియర్ అసిస్టెంట్గా పలాస–కాశీబుగ్గలో పనిచేశారు. రాజాం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీ తికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పనులు జరిగేలా చర్యలు చేపడతానన్నారు. క్రయ, విక్రయదారులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందు లు వచ్చినా తనను సంప్రదించవచ్చన్నారు. సంతబొమ్మాళి: ‘చెరువు ఆక్రమణ జరగవ చ్చు.. అయితే దానికి సంబంధించి రికార్డులు మా వద్ద లేవు’ అంటూ రెవెన్యూ, పంచాయతీ అధికారులు చేతులెత్తేశారు. ‘అప్పట్లో ఒక పెద్ద చెరువుండేది’ అనే కథనం ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం ప్రచురి తం కావడంతో రెవెన్యూ, పంచా యతీ అధికారులు స్పందించా రు. నౌపడ అర్ అండ్బీ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఒత్తగుండమ్మ చెరువును ఆర్ఐ చంద్రమౌళి, సర్వేయర్ సురేష్, వీఆర్వో జోగారావు గురువారం పరిశీలించారు. సర్వే నంబర్ 418 గ్రామ కంఠానికి సంబంధించిందని, దానికి సంబంధించిన రికార్డులు తమ వద్ద లేవని రెవెన్యూ అధికారులు తేల్చేశారు. గ్రామ పంచాయతీలో ఉండవచ్చునని చెప్పారు. పంచాయతీ కార్యదర్శిఽ ఉప్పాడ ఉమాపతిని అడుగ గా అలాంటి రికార్డులు ఏమీ లేవని సమాధా నం ఇచ్చారు. ఎఫ్ఎంలో చెరువుకు సంబంధించిన విస్తీర్ణం లేదని, అయితే ఎస్ఎల్ఆర్లో ఆ చెరువుకు సంబంధించిన కాగితం పూర్తిగా చింపేసి ఉందని తెలిసింది. ఇది ఎప్పుడు జరిగింది, ఎవరి హయాంలో రికార్డులు మాయం అయ్యాయో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల ని గ్రామస్తులు కోరుతున్నారు. చెరువును పునరుద్ధరించి వర్షపునీరు, వరదనీరు తమ ఇళ్లలోకి రాకుండా చూడాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి ఫలితాలతో పోల్చితే సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో కాస్త నయమని అనిపించారు. ఫస్టియర్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో 5వ స్థానం, ద్వితీ య సంవత్సరం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో 10వ స్థానంలో నిలిచారు. ఉత్తీర్ణత సాధించారిలా.. సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ప్రథమ సంవత్స రానికి సంబంధించి 4937 మంది పరీక్ష రాయ గా.. 43 శాతం ఉత్తీర్ణతను సాధించి, 2113 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయం సంవత్సరానికి సంబంధించి 5221 మంది పరీక్షకు హాజరుకాగా.. 56 శాతం ఉత్తీర్ణతతో 2911 మంది పాసయ్యారు. 26లోగా దరఖాస్తు చేసుకోవాలి.. రీ వెరిఫికేషన్(ఆర్వీ)/రీ కౌంటింగ్(ఆర్సీ) కో సం విద్యార్థులు ఈనెల 19 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇంటర్బోర్డు జిల్లా ఆర్ఐఓ ఎం.కృష్ణవేణి పేర్కొన్నారు. రీ వెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ.1300, రీ కౌంటింగ్కు సబ్జెక్టుకు రూ. 260 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని ఆమె తెలిపా రు. ఈ ఫీజులను వారు చదువుకుంటున్న కళా శాలల్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. నందిగాం: కూటమి ప్రభుత్వంలో దళితులపై నిరంతరాయంగా దాడులు జరుగుతూనే ఉన్నాయని దళిత మహాసభ జిల్లా కార్యదర్శి అక్కురాడ లోకనాథం అన్నారు. గురువారం నందిగాంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దళితులను వర్గీకరణ పేరుతో రెండు వర్గాలుగా విడదీసి, ఐక్యత లేకుండా చేసి రాష్ట్రవ్యాప్తంగా కూటమి నాయకులు దాడులు, హత్యలు చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. మాచెర్లలోని పిడుగురాళ్లలో దళితుడుని హింసించి హత్య చేశారని, అలాగే కోటబొమ్మాళి మండలం కొత్తపల్లిలో తెలుగుదేశం వారు స్థానిక అగ్రవర్ణాలవారితో కలిసి దళితుని ఇల్లు జేసీబీలతో కూలదోయించి, ని వాసం లేకుండా చేశారని మండిపడ్డారు. కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సంస్కృతి కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో వీటికి పర్యవసానాల ను తెలుగుదేశం పార్టీ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. -
● మద్యం అధిక ధరలన్నీ నేతల జేబుల్లోనికే ● జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీకి మించి విక్రయాలు ● పలాసలో మొదలై జిల్లా అంతటికీ పాకిన జాడ్యం ● మందుబాబులను నిలువు దోపిడీ చేస్తున్న సిండికేట్లు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మద్యం ఎమ్మార్పీపై అదనపు వసూలు, బెల్టు షాపుల్లో విక్రయాలు, అధిక ధరలకు మద్యం అమ్మకాలు.. ఇలా అడుగడుగునా వసూలవుతున్న అక్రమ సొమ్ము అంతిమంగా ఆ నియోజకవర్గాల కీలక నేతల జేబుల్లోకి వెళ్తోంది. మందుబాబులను అటు వ్యాపారులు, ఇటు నేతలు దర్జాగా నిలబెట్టి దోచేస్తున్నారు. చూసీ చూడనట్టు వదిలేసేందుకు ఎకై ్సజ్కు కొంత ముట్ట చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మద్యం బాటిళ్లపై అదనంగా బాదుతున్నారు. కొన్ని చోట్ల రూ.10, ఇంకొన్ని రూ.20 అంటూ వారి జేబులు గుల్ల చేస్తున్నారు. పచ్చ నేతలకే కాసులు ప్రైవేటు మద్యం పచ్చ నేతలకు కాసులు కురిపిస్తోంది. టీడీపీ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో సిండికేట్ అ వ్వగా, వారికి అండగా నిలిచినందుకు మిగతా నేతలకు భారీగా చేతులు తడుపుతున్నారు. స్వపక్షంలో పెద్ద శక్తుల నుంచి వ్యతిరేకత రాకుండా సిండికేట్లు మేనేజ్ చేస్తున్నాయి. ఒక్కో షాపుకింత అని నెల వా రీగా ఇచ్చేస్తున్నారు. జీతం పడినట్టు ఠంఛన్గా ప్రతి నెలా ఇంటికెళ్లి అందిస్తున్నారు. బెల్ట్షాపులు, కల్తీ మద్యం, అదనపు ధరలు ఇలా ఏదో ఒక తీరులో సిండికేట్లు సొమ్ము చేసుకుంటున్నాయి. దాంట్లో సింహభాగం నేతలకు అప్పచెబుతున్నారు. తొలుత పలాస, రాజాం నియోజకవర్గంలో ప్రారంభమైన దోపిడీ ఇప్పుడు జిల్లా అంతటా విస్తరించింది. వారిదే గుత్తాధిపత్యం జిల్లాలో ఉన్న మద్యం షాపులపై దాదాపు పచ్చ నేతలే గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. కొన్నిచోట్ల బయట వ్యక్తులకు షాపులు వచ్చినప్పటికీ నేతల కనుసన్నల్లోనూ ఆ షాపులూ నడవాల్సి వస్తోంది. లేదంటే దాడులు, ఆంక్షలు, బెదిరింపులకు దిగుతున్నారు. వారిని ఇబ్బంది పెట్టే విధంగా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. దీంతో ఎందుకొచ్చిందని వారి దారిలోకి మిగతా వ్యాపారస్తులు కూడా రాక తప్ప డం లేదు. వైన్షాపుల కౌంటర్లోనే క్వార్టర్ బాటిల్పై కొన్ని చోట్ల రూ.10, మరికొన్ని చోట్ల రూ.20 అదనంగా విక్రయిస్తున్నారు. పనిలో పనిగా పర్మిట్ రూమ్ల పేరుతో లూజ్ విక్రయాలు చేపడుతున్నారు. ఇక, మద్యం కల్తీ గురించైతే చెప్పనక్కర్లేదు. ఎక్కడ బడితే అక్కడ మద్యంలో నీళ్లు కలిపి, యథావిధిగా సీల్ వేసి విక్రయిస్తున్నారు. ఇలాంటి వాటిలో దొరికిన వారంతా టీడీపీకి చెందిన వారే కావడం గమనార్హం. -
జాహ్నవికి అభినందనలు
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని, ఎన్.ఎస్.ఎస్ వలంటీర్ సనపల జాహ్నవి కళాశాలకు గర్వకారణంగా నిలిచిందని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు పేర్కొన్నారు. జాతీయ స్థాయి ‘వికసిత్ భారత్’ యూత్ పార్లమెంట్కు ఎంపికై న జాహ్నవిని అధ్యాపకులతో కలిసి ప్రిన్సిపాల్ అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎన్.చిన్నారావు, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ ఎస్.పద్మావతి, అకడమిక్ కో–ఆర్డినేటర్ కె.మౌనిక, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టి.ఆదిలక్ష్మి, ఎన్ఎస్.ఎస్ పీఓలు రుద్రమరాణి, ఐ.హేమ పద్మజ, పి.జమున పాల్గొన్నారు. -
గాలికొదిలేశారు..
శ్రీకాకుళం: కార్పొరేషన్ అధికారులకు అసలు నగరంలో ఎన్ని పార్కులు ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. గాంధీ పార్కు, కార్గిల్ విక్టరీ పార్కు, రివర్ వ్యూ పార్కు, శాంతినగర్ కాలనీ పార్కు, డైమండ్ పార్క్, అఫీషియల్ కాలనీలో ఉన్న పార్కుల మాత్రమే కాస్త పచ్చదనంతో కనిపిస్తున్నాయి. హడ్కో కాలనీ, శాంతినగర్ కాలనీ, జానకిరామ నగర్ కాలనీ తదితర పార్కు పిచ్చి మొక్కలు, మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రిజర్వ్ స్థలాలను కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా ప్రభాకర్ నగర కాలనీ పార్కును చెప్పవచ్చు. ఇక్కడి రిజర్వ్ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేసేందుకు 15 ఏళ్ల క్రితం నగరపాలక సంస్థ అధికారులు ప్రహరీ నిర్మించగా, ఓ సంస్థ వచ్చి దీనిని తమకు హోమియో క్లినిక్ నిర్వహించేందుకు లీజు పద్ధతి పై కేటాయించారని చెప్పడంతో ఆ సంస్థకు అప్పగించేశారు. ఏఎస్ఎన్ కాలనీ పార్కుదీ అదే పరిస్థితి. అందులో ఏకంగా వాటర్ ట్యాంక్ నిర్మించేశారు. రామకృష్ణ నగర్ కాలనీలో రిజర్్వ స్థలాన్ని ఓ ప్రైవేటు వ్యక్తి తమదని పోరాటం చేయగా, నగరపాలక సంస్థ న్యాయ పోరాటం చేసి దానిని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అక్కడ నగరంలో పట్టుబడిన పశువులను తీసుకువెళ్లి ఉంచుతున్నారు. కాలనీల్లో చాలాచోట్ల రిజర్వ్ స్థలాలు ఉన్నప్పటికీ పార్కులుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. పదేపదే అభివృద్ధి చెందిన పార్కులపైనే నిధులు వెచ్చిస్తున్నారు తప్ప అసలు అభివృద్ధి జరగని పార్కులపై దృష్టి సారించడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అసలు పార్కులు, రిజర్వ్ స్థలాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎంత మేర అభివృద్ధి పనులు చేపట్టాలనే విషయమై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమాలకు వీఆర్ఓల మద్దతు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఏపీజేఏసీ అమరావతి తీసుకున్న నిర్ణయాలు, ఉద్యమాలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు జిల్లా వీఆర్వోల సంఘం గురువారం ప్రకటించింది. ఈ మేరకు శ్రీకాకుళంలోని రెవెన్యూ వసతి గృహంలో జిల్లా వీఆర్వోల సంఘం నాయకులు, ఏపీ జేఏసీ అమరావతి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు డి.రాజేష్కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి చేపట్టనున్న ఉద్యమ కార్యక్రమాలకు, శ్రీకాకుళం జిల్లా వీఆర్వో సంఘం, పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని ప్రకటించారు. సమావేశంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు బి.వి.వి.ఎన్.రాజు, వీఆర్వో ల సంఘం జిల్లా కార్యదర్శి బి.రామ్జీ, ట్రెజరర్ జి.ఢిల్లేశ్వరరావు, ఏపీ గ్రామ వార్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.గోవిందరావు, వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
యోగా పోస్టర్ పోటీల విజేతలకు బహుమతులు
గార: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన యోగా పోస్టర్ రూపకల్పనలో గెలుపొందిన విద్యార్థులకు వమరవల్లి డైట్ ప్రిన్సిపాల్ ఏ.గౌరీశంకరరావు బహమతులు అందజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జనాభా విద్యా ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో శ్రీకాకుళం ఏపీఎంజేపీ స్కూల్ టి.గాయత్రి ప్రథమస్థానం, వప్పంగి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని డి.ఉష ద్వితీయ, టెక్కలి ఏపీఎంజేపీ పాఠశాల విద్యార్థిని పి.జ్యోత్స్న తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి సర్టిఫికెట్తో పాటు నగదు బహుమతులు అందజేసారు. పోటీలను జిల్లా విద్యాశాఖాధికారి ఏ.రవిబాబు పరిశీలించారు. కార్యక్రమంలో యోగా జిల్లా కో ఆర్డినేటర్ ఎస్.ప్రసాద్, పి.కృష్ణ పాల్గొన్నారు. -
తుప్పలతో పరిసరాలు
స్వచ్ఛమైన గాలికోసం కాసేపు సేదతీరుదామంటే సరైన పార్కులు లేవు. కొన్నిచోట్ల ఉన్నా అందులోకి అడుగు పెట్టలేని పరిస్థితి. తుప్పుపట్టిన పరికరాలు, విరిగిపోయిన ఆట వస్తువులు, తుప్పలతో నిండిన పరిసరాలు.. ఇవీ జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని పార్కుల పరిస్థితి. శ్రీకాకుళంలో ఇటీవల అభివృద్ధి చేసిన ఒకటీ అరా పార్కుల తప్పితే మిగిలిన పురపాలికలైన ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాసలలో ఉద్యానవనాల పరిస్థితి ఘోరంగా ఉంది. అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు పంపించడం తప్ప కార్యాచరణకు మాత్రం నోచుకోవడం లేదు. మున్సిపాలిటీల పరిధిలోని పార్కుల పరిస్థితిపై ‘సాక్షి’ ఫోకస్.. ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదం కరువవుతోంది. రైల్వేట్రాక్ను ఆనుకుని బి.ఆర్.నగర్లో ఉన్న అమరావతి పార్కు అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. మొద ట్లో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పార్కుపై ప్రత్యేక దృష్టి సారించడంతో పట్టణ ప్రజలు కాసేపు సేదతీరేవారు. తర్వాత పార్కును గాలికొదిలేయడంతో తుప్పలు, పాముల పుట్టలతో నిండిపోయింది. లక్ష్ముడిపేట, వెంకయ్య పేట గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన మినీ పార్కు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. ఆమదాలవలస మోనింగివారి వీధిలోని రామలింగేశ్వర పుష్కరిణీ పార్కు, భగత్సింగ్ కార్ రేస్ పార్కులు, నెహ్రూ చిల్డ్రన్ పార్కులు నిర్వహణ లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో పార్కు లు అధ్వానంగా మారాయి. పలాసలో నెహ్రూ పార్కు(ముత్యాలమ్మ కోనేరు), భద్రం కోనేరు, కాశీబుగ్గలోని రాధాకాంత చెరువు పార్కులకు రూ.లక్ష లు వ్యయం చేశారు. ప్రస్తుతం ఒక్క నెహ్రూ పార్కు అందుబాటులో ఉండగా.. అందులో కూడా తగిన సదుపాయాలు లేవు. ఈ ఏడాది నెహ్రూ పార్కులో ట్రాక్, రివిట్మెంటు, డీపింగ్, లైటింగ్ తదితర పనులు కోసం సుమారు రూ.50 లక్షలు వెచ్చించా రు. అయినా తగిన ఫలితం కనిపించడం లేదు. కొత్తగా మొక్కలు వేసినా తగిన రక్షణ లేక పోవడంతో ఎండిపోతున్నాయి. సరైన ప్రహరీ లేకపోవడంతో పశువులు వచ్చేస్తున్నాయి. -
వాస్తవాలు వెలుగులోకి రావాలి
ఇచ్ఛాపురం రూరల్: విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన విషాదకరమైన ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. గురువారం ఆయన ఇచ్ఛాపురంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. తన కొడుకును చంపేస్తే కనీసం శవమైనా ఇవ్వండీ, లేకపోతే బూడిదైనా ఇవ్వండి అని ఒక తల్లి వేడుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని, దోషులు ఎవరైనా చట్టం ముందు నిలబెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో సామాన్యులకు భద్రత లేకుండా పోయిందని, రెడ్బుక్ రాజ్యాంగంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. సోంపేట : గొల్లూరు గ్రామానికి చెందిన పిన్నింటి ఊర్వశి (38) గురువారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. గురువారం రాత్రి 7 గంటల సమయంలో మంచంపై విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది మార్చి 13న ఊర్వశి భర్త పిన్నింటి రాజారావు అదే ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఇప్పుడు ఊర్వశి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. బారువ ఎస్ఐ హరిబాబునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవపంచనామా అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఊర్వశి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
రక్తదానం ప్రాణదానంతో సమానం
శ్రీకాకుళం అర్బన్: రక్తదానం ప్రాణదానమని ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ ప్రతినిధులు అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ విజనరీ లీడర్ తారకనాథ్ 22వ వర్ధంతి సందర్భంగా యూనియన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రెటరీ, ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ జనరల్ సెక్రెటరీ ఎల్.చంద్రశేఖర్, ప్రెసిడెంట్ ఆర్.నరేంద్ర కుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ విశాఖపట్నం, ఎస్బీఐ మాడ్యూల్ సుష్మ, వైస్ ప్రెసిడెంట్ సతీష్ పిలుపు మేరకు గురువారం బ్యాంకు రీజనల్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. స్టాఫ్ యూనియన్ శ్రీకాకుళం రీజనల్ సెక్రెటరీ కేసీహెచ్ వెంకటరమణ ఆధ్వర్యంలో సిబ్బంది ద్వారా సుమారు 150 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఉదయ్కుమార్ సింగ్, రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
చట్ట సవరణతో టెట్ మినహాయించాలి
శ్రీకాకుళం: ఆర్టీఈ చట్ట సవరణ ద్వారా 2010 టెట్ నోటిఫికేషన్కు ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి ఉత్తీర్ణత నుంచి మినహాయింపు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఏపీయూఎస్) అధ్యక్షుడు దుప్పల శివరామ్ప్రసాద్ కోరారు. ఈ మేరకు గురు వారం కలెక్టరెట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు ఎచ్చెర్ల మురళి, ఎస్.రాజు, ఉపాధ్యక్షుడు కల్లి శ్రీనివాసరావు, మద్దెల నవీన్ పాల్గొన్నారు. -
నేడు సిక్కోలు ప్రగతి సంబరాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లా కేంద్రంలో శుక్రవా రం నిర్వహించనున్న జిల్లా స్థాయి ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం‘ (దీపం–2.0 థీమ్) ప్రగతి సంబరాలను విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్పుండ్కర్ కోరారు. ఈ మేరకు గురు వారం ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతి, వివిధ రంగాలలో సాధించిన విజయాలను ప్రజల కు వివరించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసిందన్నారు. సుమారు 5,000 మంది లబ్ధిదారులతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని తెలిపారు. ఏడు రోడ్ల కూడలి సమీపంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో ఉదయం 10:30 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, జిల్లాలో కలెక్టర్గా సేవలందించిన ఎస్ఈ శేఖర్బాబు మృతి పట్ల విశ్రాంత ప్రణాళిక శాఖ అధికారి డాక్టర్ వి.మహీపాల్, విశ్రాంత సీనియర్ రెవిన్యూ అధికారి పీఎంజే బాబు, జర్నలిస్టుల సంఘం నాయకులు నల్లి ధర్మారావు తదితరులు గురువారం సంతాపం వ్యక్తం చేశారు. 1990 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన శేఖర్బాబు 1998–99 మధ్య శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. శ్యామ్ పిస్టన్ పరిశ్రమ లాకౌట్ సమయంలో విశేష అధికారాలు ఉపయోగించి తెరిపించడం ఆ రోజుల్లో సంచలనం. శ్రీకాకుళం పట్టణం నడిబొడ్డున ప్రెస్క్లబ్ నిర్మాణానికి స్థలం కేటాయించడంలో ఆయనదే ప్రధాన పాత్ర. బదిలీ తరువాత పంచాయతీరాజ్ కమిషనర్గా, సమాచార కమిషన్ కార్యదర్శిగా పనిచేసి 2012లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. శ్రీకాకుళం: జిల్లాలో జోరుగా సాగుతున్న ఇసుక, గ్రావెల్, గ్రానైట్ అక్రమ రవాణాను అరికట్టి ప్రకృతి వనరులను పరిరక్షించాలని యునైటెడ్ జనతాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం తిరుపతినాయుడు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులు, నలుగురు ఎమ్మెల్యేల డైరెక్షన్లో అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు. ఇందులో కొందరు పోలీసులు, అధికారుల పాత్ర ఉందన్నారు. కలెక్టర్, ఎస్పీలు స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. సమావేశంలో జేడీయూ జిల్లా కార్యదర్శి అంధవరపు మనోహర్, జిల్లా మహిళా కన్వీనర్ మామిడి తేజోవతి, బురగాపు లక్ష్మి పాల్గొన్నారు. -
● గోదారి కాదు రహదారే..!
తాము అధికారంలోకి వస్తే రహదారులను అద్దాల్లా మెరిపిస్తామని కూటమి నాయకులు గొప్పలు పలికారు. అధికారంలోకి వచ్చాక ఆ సంగతే మరిచిపోయారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే కొత్తూరు మండలం నివగాంలోని పట్నాల వీధి వద్ద రహదారి. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో భారీ గోతులు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరిపోయి చెరువును తలపిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. – కొత్తూరు -
సంగీత పోటీల కరపత్రాలు ఆవిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్: జిల్లాలోని బాల, బాలికలు, యువతలో మ్యూజిక్ టాలెంట్ను వెలికి తీసేందుకు డాక్టర్ కనుగుల దుర్గా ధీరజ్ చారిటబుల్ ట్రస్ట్, వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయం, జీబీఏ స్వరమాధురి సంయుక్త ఆధ్వర్యంలో సంగీత ప్రతిభా పోటీలు నిర్వహించనున్నట్లు జీబీఏ స్వరమాధురి వెల్ఫేర్ అండ్ సర్వీస్ సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు పీఎన్కాలనీలోని వరసిద్ధి వినాయక దేవాలయంలో కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. రెండు గ్రూపుల్లో 8–14 ఏళ్లు, 15–21 ఏళ్ల వయస్సు కలిగినవారికి గాత్రము పోటీలు, 8 నుంచి 21 ఏళ్లలోపు వారికి కీబోర్డు, గిటార్, తబలా, మృదంగం, వయోలిన్ వాద్యాలపై పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు జూలై 15వ తేదీలోపు 90000 50235 నంబర్కు వాట్సాప్ ద్వారా గానీ.. స్వయంగా గానీ దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పోటీల తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. సమావేశంలో స్వరమాధురి అధ్యక్షుడు, రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్రావు, చార్టెడ్ అకౌంటెంట్ కనుగుల దుర్గా శ్రీనివాస్, జీబీఏ స్వరమాధురి కార్యదర్శి డాక్టర్ నిక్కు అప్పన్న, కన్వీనర్ ఎంవీ కామేశ్వరరావు, కమిటీ సభ్యులు బండారు రమణమూర్తి, వైకుంఠరావు, చక్రవర్తి, పీవీఆర్ ఎం.పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పాత బ్యాగులు
నా డు● పాఠశాలలు తెరుచుకున్నా జాడలేని స్కూల్ బ్యాగులు ● చిరిగిన సంచులతో బడిబాట పడుతున్న విద్యార్థులు ● గత ప్రభుత్వ హయాంలో తొలి రోజే పంపిణీ ● మండిపడుతున్న తల్లిదండ్రులు కొత్త క్లాసులు..ఇచ్ఛాపురం రూరల్ : ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా విద్యార్థులకు ఇంకా బ్యాగులు అందకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వీటిని ఉచితంగా అందించాల్సినా ఇంతవరకు ఆ ఊసే లేకపోవడంతో వేలాది మంది విద్యార్థులు పాత, చిరిగిన బ్యాగులతోనే బడులకు వెళ్తున్నారు. కొందరు విద్యార్థులు పుస్తకాలను చేతుల్లో పట్టుకుని, మరికొందరు పాత సంచుల్లో పెట్టుకొని, మరికొందరు మార్కెట్లో కొనుగోలు చేసిన బ్యాగుల్లో ఉంచి పాఠశాలలకు వెళ్తున్న దృశ్యాలు జిల్లాలోని అనేక పాఠశాలల్లో కనిపిస్తున్నాయి. అసలు బ్యాగులు ఎప్పుడు వస్తాయో, పంపిణీ ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బడులు మొదలైనా.. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న పిల్ల లుపుస్తకాలు, నోట్బుక్స్ తీసుకెళ్లేందుకు ఇబ్బందు లు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో గత ఏడా ది ఉపయోగించిన బ్యాగులను వినియోగిస్తున్నా రు. చాలా వరకు బ్యాగులు చిరిగిపోవడం, జిప్లు పనిచేయకపోవడం, పట్టీలు తెగిపోవడం వంటి సమస్యలతో ఉన్నా.. వాటినే వాడాల్సిన పరిస్థితి. పేదలపై ఆర్థిక భారం బ్యాగులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో కొందరు తల్లిదండ్రులు ఆర్థిక భారమైనప్పటికీ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యా అవసరాల కోసం ఖర్చులు పెరిగిన తరుణంలో బ్యాగుల కొనుగోలు మరో భారంగా మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. గతంలో తొలి రోజే పంపిణీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశా తప్పని ఎదురుచూపులు.. జిల్లాలో 2,611 ప్రభుత్వ పాఠశాలల్లో 1,48,600కు పైగా విద్యార్థులు కొత్త బ్యాగుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే బ్యాగులను జిల్లాకు తరలించి పంపిణీ చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై ఆరా తీసేందుకు జిల్లా విద్యాశాఖాధికారి, ఉప విద్యాశాఖాధికారిలను ఫోన్లో సంప్రదించినా స్పందించకపోవడం గమనార్హం. లలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ద్వారా బ్యాగులు, యూనిఫామ్, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, టైలు వంటి విద్యా సామగ్రి పంపిణీ జరిగేదని పలువురు తల్లిదండ్రులు గుర్తు చేస్తున్నారు. పాఠశాలకు వచ్చిన మొదటి రోజే అవసరమైన వస్తువులు అందడంతో చదువుపై దృష్టి పెట్టేవారని చెబుతున్నారు. -
‘నీట్’ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం
శ్రీకాకుళం అర్బన్: నీట్ పరీక్షకు (ఈ నెల 21న ) హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణ అధికారి సీహెచ్ అప్పలనారాయణ బుధవారం తెలిపారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కాలేజ్), పెద్దపాడులోని కేంద్రీయ విద్యాలయం, శ్రీకాకుళం గుజరాతిపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 2,103 మంది హాజరుకానున్నారని పేర్కొన్నారు. హాల్టికెట్ చూపించి ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో స్వస్థలం నుంచి పరీక్ష కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. శ్రీకాకుళం కాంప్లెక్స్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
పీఎం స్వానిధి చిరు వ్యాపారుల పెన్నిధి
శ్రీకాకుళం: పీఎం స్వానిధి పథకం చిరు వ్యాపారుల పెన్నిధిగా నిలుస్తోందని లీడ్ బ్యాంక్ మేనేజర్ పి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన పీఎం స్వానిధి ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చిరువ్యాపారుల ఆర్థిక స్వావలంబనకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రుణాలను సకాలంలో చెల్లించేవారికి అదనపు రుణ సాయంతో పాటు క్రెడిట్ కార్డు సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. అర్హులైన వారికి సత్వర రుణ సాయం అందిస్తామని తెలిపారు. మెప్మా ప్రతినిధి జి.కిషోర్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని నగరపాలక సంస్థతోపాటు, మూడు పురపాలక సంఘాల పరిధిలో వీధి వ్యాపారుల గుర్తింపు, నమోదు, రుణాల మంజూరు కోసం ఆర్పీల ద్వారా చర్యలు చేపడుతున్నామన్నారు. శ్రీకాకుళం గ్రామీణం, బలగ, నరసన్నపేట, పొందూరు, టెక్కలి, హిరమండలం, సోంపేట మండలాల్లో కూడా పీఎం స్వానిధి కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మెప్మా బాధ్యులు వై.శారదావాణి, బి.రామారావు, సీఎంఎండీ కృష్ణారావు, పట్టణ జిల్లా సమాఖ్య అధ్యక్షుడు బి.నాగలక్ష్మి, యూనియన్, ఇండియన్, ఏపీజీబీ బ్యాంకు మేనేజర్లు బి.శ్రీనివాసరావు, ఎం.నారాయణరావు, భారతి, పి.వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
సిండికేట్ పాలన..
రాష్ట్రంలో కూటమి పాలన కాదు సిండికేట్ పాలన జరుగుతోంది. అంతా వ్యాపార ధోరణిలో దోచుకుంటున్నారు. రైతుభరోసా, క్రాప్ ఇన్సూరెన్స్ వంటి పథకాలు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనతో వచ్చినవి. ఆ విధానాలనే ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా పీఎంకిసాన్, పీఎంఎఫ్బీవై పథకాల పేరిట అమలుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలవారినీ మోసం, దగా చేయడమే తప్ప పథకాలు అమలు చేయడం లేదు. నేరడి బ్యారేజ్, వంశధార ఫేజ్–2, స్టేజ్–2 అనేవి చిన్నపిల్లాడిని అడిగినా వైఎస్సార్, ధర్మాన ప్రసాదరావుల చలువేనని చెబుతారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు చేసేదేమీ లేక ట్రిబ్యునల్ గెజిట్ ఇస్తే అవి తామే చేశామని చెప్పడం సిగ్గుచేటు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులను క్యూలైన్లలో ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అవగాహన రాహిత్యం.. హిరమండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ వృథాగా పెట్టారని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం అవగాహన రాహిత్యానికి నిదర్శనం. ప్రాజెక్టు పూర్తయితే జిల్లా మొత్తానికి నీరు అంది పంటలు సస్యశ్యామలం అవుతాయి. కానీ అలా చేయడం లేదు. చంద్రబాబు అడుగు జాడల్లోనే అచ్చెన్నాయుడు నడుస్తుంటారు. – గొండు రఘురాం, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
ఈ సర్కారే శుద్ధ దండగ!
వ్యవసాయం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వ్యవసాయాధారిత భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ రైతులను ప్రోత్సహిస్తుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు సర్కారు వ్యవసాయం దండగ అనే రీతిలో పాలించడం సరికాదని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. నిరాశ నిస్పృహలో ఉన్న రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు పలు రకాలుగా ఇబ్బందిపెట్టడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు అండగా ఉంటూ వారి తరఫున వైఎస్సార్ సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొండు రఘురాం ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం సమావేశం బుధవారం నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ యువనేత ధర్మాన రామ్మనోహర్నాయుడు మాట్లాడుతూ యూరియా, విత్తనాలు బ్లాక్మార్కెట్లో అమ్ముకున్న చరిత్ర చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలకే దక్కుతుందన్నారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు పెట్టడం, గొంతు నొక్కడమే చంద్రబాబుకి తెలిసిన పాలన అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ సోషల్మీడియా అకౌంట్లు బ్లాక్లో పెట్టినంత మాత్రాన కూటమి పాలకులు చేసిన అన్యాయాలు, అక్రమాలు ప్రజలకు తెలియకుండాపోవన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు గొర్లె అప్పలనాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గ అధ్యక్షుడు పీస శ్రీహరి, నరసన్నపేట నియోజకవర్గ అధ్యక్షుడు మడ్డు కృష్ణారావు, అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడు సదాశివరాజు, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర నాయకులు బుక్కూరు ఉమామహేశ్వరరావులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను ఏ విధంగా దగా చేస్తుందో...వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఆదుకున్నారో స్పష్టంగా వివరించారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, వెలమకుల రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వి.స్వరూప్, ఎస్ఈసీ మెంబర్ గొండు కృష్ణమూర్తి, ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి, మైనార్టీసెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎంఏ బేగ్, గ్రీవెన్స్సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు రౌతు శంకరరావు, నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, చిట్టి జనార్దనరావు, పీస గోపి, గంగు నరేంద్ర, అంధవరపు రమేష్, సీపాన రామారావు, కింజరాపు రమేష్, భైరి మురళి, మూకళ్ల తాతబాబు, రైతు విభాగం టెక్కలి నియోజకవర్గ అధ్యక్షుడు బగాది దివాకర్, రైతు విభాగం నాయకులు పాల్గొన్నారు. అన్నదాతల పాలిట శాపంగా చంద్రబాబు సర్కారు రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం: మాజీ మంత్రి ధర్మాన కూటమి కాదు సిండికేట్ ప్రభుత్వం: మాజీ మంత్రి సీదిరి వైఎస్సార్సీపీ రైతు విభాగం సమావేశంలో కూటమి పాలనను ఎండగట్టిన నాయకులు రియల్ వ్యాపారం రైతులే సమాజానికి వెన్నెముకలాంటి వారనేది వైఎస్సార్, జగన్మోహన్రెడ్డిలు నమ్మిన సిద్ధాంతం. వ్యవసాయం దండుగ చంద్రబాబు నినాదమైతే.. వ్యవసాయం దండుగ కాదు ఓ పండుగ అని నిరూపించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. వర్షాలు పడాలి పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలు కోరుతుంటే.. చంద్రబాబు మాత్రం వర్షాలు వద్దు అమరావతిలో పనులు నిలిచిపోయతాని తాపత్రయ పడుతున్నారు. జలయజ్ఞంలో భాగంగా వంశధార ప్రాజెక్టుకు రూ.900కోట్లకి పైగా నిధులిచ్చి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి వైఎస్సార్. రైతుల భూమితో రియల్ వ్యాపారం చేసుకుంటున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. – చింతాడ రవికుమార్, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త -
నాటుబాంబు పేలి లేగదూడ మృతి
నందిగాం: మండలంలోని బెజ్జిపల్లి రాళ్ల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు అడవి పందుల కోసం అమర్చిన నాటుబాంబు పేలి లేగదూడ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువుల్లో రాత్రివేళ అడవి పందులు సంచిరిస్తూ దుంపలు తింటూ ఉంటాయి. అయితే అడవి పందుల వేటగాళ్లు ఆయా చెరువుల్లో పందులు సంచరించే ప్రాంతాల్లో రాత్రివేళల్లో నాటుబాంబులు అమర్చుతారు. దుంపలనుకొని నాటుబాంబును అడవి పంది నోటితో కొరికిన వెంటనే అది పేలి పంది మృత్యువాత పడుతుంది. దీంతో వేటగాళ్లు అడవి పందులను రహస్యంగా తరలించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అయితే బుధవారం ఉదయం బెజ్జిపల్లి రాళ్ల చెరువులోకి పోతులూరు తమిరె రాజుకు చెందిన పశువులు మేతకు వెళ్లాయి. అయితే ఒక లేగదూడ వేటగాళ్లు అమర్చిన నాటుబాంబును కొరకడంతో అది పేలి దూడ మృతి చెందింది. రహస్యంగా నిర్వహిస్తున్న ఈ అడవి పందుల వేటతో మనుషులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో, ఈ వ్యవహారంపై పోలీసులు, ఫారెస్టు అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. బాంబులు పెట్టినవారిపై చర్యలు తీసుకొని, బాధితుడికి న్యాయం చేయాలని కోరుతున్నారు. -
పిచ్చికుక్క స్వైర విహారం
రణస్థలం: లావేరు మండలంలోని శిగిరి కొత్తపల్లి గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. చాలామందికి కుక్క కరవడంతో గ్రామస్తులు అందోళన చెందారు. అందులో పి.నారాయణమ్మ, డోకల ఎర్రయ్యకు తీవ్రంగా గాయాలవ్వడంతో, 108 వాహనంపై శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 108 సిబ్బంది ఈశ్వరరావు, కృష్ణలు సమాచారాన్ని తెలిపారు. నేపాల్లో కొత్తూరు వాసి మృతి కొత్తూరు: మండల కేంద్రంలోని ఎన్ఎన్ కాలనీకి చెందిన మల్ల మీనాక్షి (60) నేపాల్లో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. 10 రోజుల క్రితం మీనాక్షి కుటుంబ సభ్యులతో కలిసి నేపాల్లోని యమునా పుష్కరాలకు వెళ్లారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురై అక్కడ ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. స్వగ్రామం కొత్తూరులోని ఎన్ఎన్ కాలనీలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. మహిళకు పాటుకాటు పోలాకి: మండలంలోని మబగాం గ్రామానికి చెందిన మద్దిలి కళావతి అనే ఉపాధి వేతనదారు పని ప్రదేశంలో పాముకాటుకు గురైంది. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్, తోటి వేతనదారులు నరసన్నపేటలోని గొలివి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతానికి చికిత్స అందుతోందని ఏపీవో రమణ తెలిపారు. పాముకాటుకు గురైన కళావతిని ఆస్పత్రిలో జెడ్పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణచైతన్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. రహదారి ప్రమాదంలో యువకుడు మృతి సోంపేట: మండలంలోని బారువ – సోంపేట ప్రధాన రహదారి కంబవద్ద బుధవారం రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో సోంపేటలో పకోడి షాప్ నిర్వహిస్తున్న యువకుడు శశిభూషణ్ (38) మృతి చెందాడు. మృతుడు శశిభూషణ్ వేరే రాష్ట్రం నుంచి ఉపాధి నిమిత్తం వచ్చి జీవనాధారం పొందుతున్నాడు. బుధవారం రాత్రి బారువ వెళ్లి తిరిగి వచ్చే సమయంలో కంబ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సోంపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తలకు తీవ్రగాయం కావడంతో ఘటన స్థలంలోనే యువకుడు మృతి చెందాడు. సోంపేట సామాజిక ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. సోంపేట ఎస్ఐ మోహిని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. -
దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజలకు అందించే రెవెన్యూ సేవల్లో ఎటువంటి అలసత్వం వహించరాదని, నిర్దేశిత గడువులోగా దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం టెక్కలి డివిజన్ రెవెన్యూ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డివిజన్ పరిధిలోని మొత్తం 140 గ్రామాలకు గాను ఫేజ్–3, ఫేజ్–4 రీసర్వే ప్రక్రియలు, విలేజ్ సర్వేయర్, వీఆర్వో, తహసీల్దార్ లాగిన్లలో డేటా ఎంట్రీల స్థితిగతులను నివేదికల ఆధారంగా నిశితంగా పరిశీలించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, బాగా పనిచేసిన అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
చేతకాని మంత్రి..
ఎవరి సహకారంతో గెలిచారో వారిని దూరం పెట్టడం చంద్రబాబు ఒక్కడికే చెల్లుబాటు. గతేడాది తుఫాన్లకు జిల్లాలో 30 వేలు ఎకరాలు తీవ్రంగా నష్టపోతే ఒక్క రైతుకూ నష్టపరిహారం ఇవ్వకపోవడం వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడి చేతకానితనానికి నిదర్శనం. వరి పండించవద్దని మంత్రి చెప్పడం దారుణం. ఎకరాకు ఎన్ని విత్తనాలు వెయ్యాలో, ఎంత ఎరువు వెయ్యాలో ప్రతి రైతుకీ తెలుసు..కొత్తగా చంద్రబాబు, అచ్చెన్నాయుడులు నేర్పించాల్సిన పని లేదు. కూటమి పాలనలో విత్తనాల నుంచి ధాన్యం అమ్మే వరకు ప్రతిదానికీ లంచం ఇస్తేనే పని జరుగుతోంది. –పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త -
ఫీడ్ ధరలు తగ్గించాలని వినతి
సంతబొమ్మాళి: రొయ్యల ఫీడ్ ధరలు తగ్గించాలని ఆక్వా రైతులు కోరారు. ఈ మేరకు స్టేట్ ఆక్వా ఫెడరేషన్ పిలుపుతో తహసీల్దార్ హేమసుందర్రావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఫీడ్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రంగానికి విదేశీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, రైతులు మాత్రం నష్టాలను చవిచూస్తున్నారని వాపోయారు. ఫీడ్ ధరలతో పాటు సాగు ఖర్చులు భారీగా పెరిగినప్పటికీ.. రొయ్యల ధరలు మాత్రం తగ్గాయన్నారు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆక్వా రైతులు కెల్లి జగన్నాయకులు, పాల వసంతరెడ్డి, మేరుగు అప్పారావు, నక్క భీమారావు, జోగి రాములమ్మ, బి.మోహన్రెడ్డి, ఎం.నాగభూషణరావు, లక్ష్మణరావు పాల్గొన్నారు. -
దారుణం..
వైఎస్సార్, జగన్మోహన్రెడ్డిలు ఏనాడూ రైతాంగానికి అన్యాయం చేసిన సందర్భాలు లేవు. చంద్రబాబు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి రోడ్డెక్కించి ధర్నాలు, రాస్తారోకోలు చేయించేలా పాలిస్తున్నారు. రేషన్ కార్డుల తరహాలో రైతులకు కార్డులిచ్చి తాము నిర్దేశించిన మేరకే ఎరువులు, విత్తనాలు ఇస్తామనడం దారుణం. – గొర్లె కిరణ్కుమార్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే కూటమి వైఫల్యమే.. ఎవరు ఎన్ని చెప్పినా రైతులను అక్కున చేర్చుకుని ఆదుకున్నది మాత్రం వైఎస్సార్, జగన్మోహన్రెడ్డిలే. వరి, మొక్కజొన్న పంటలకు సంబంధించి చాలా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు బస్తాకు రూ.8 కమీషన్ దండుకోవడం దారుణం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు విభాగాలతో సమావేశాలు ఏర్పాటుచేసి రైతులకు జరుగుతున్న అన్యాయం ప్రజలకు వివరించి అండగా ఉంటాం. రైతుల ఆత్మహత్యలు కేవలం కూటమి ప్రభుత్వం వైఫల్యమే కారణం. – జెన్నూరి రామారావు, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు -
ఐటీఐ కుర్రోడు.. గంజాయికి బానిసయ్యాడు!
టెక్కలి– మెళియాపుట్టి రోడ్డులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని టెక్కలి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు టెక్కలి పోలీసుస్టేషన్లో సీఐ ఎ.విజయ్కుమార్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. మెళియాపుట్టికి చెందిన ఓ విద్యార్థి టెక్కలిలో ఐటీఐ సెకెండియర్ చదువుతున్నాడు. గంజాయి బానిసయ్యాడు. స్నేహితుడితో కలిసి డ్యాన్స్ ఈవెంట్స్కు వెళ్తూ టెక్కలి శ్రీనివాసనగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఒడిశాలో తక్కువ ధరకే గంజాయి దొరుకుతుందని, ఇక్కడికి తీసుకొచ్చి అధిక మొత్తంలో అమ్ముకోవచ్చని ఐటీఐ విద్యార్థికి స్నేహితుడు సలహా ఇచ్చారు. ఈ మేరకు ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా బడగాం గ్రామానికి చెందిన బారిక సభాపతి నుంచి మంగళవారం రెండు కేజీల గంజాయి తీసుకొస్తుండగా మెళియాపుట్టి రోడ్డులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద పోలీసులు పట్టుకున్నారు. గంజాయితో పాటు సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. –టెక్కలి రూరల్ -
కట్టెల వంట.. హోటళ్లలో వద్దంట!
● నిర్వాహకులకు కార్పొరేషన్ అధికారుల షాక్ ● కట్టెల పొయ్యి వినియోగించకూడదని నోటీసులు శ్రీకాకుళం : నగరంలో హోటళ్ల యజమానులకు నగరపాలక సంస్థ అధికారులు షాక్ ఇచ్చారు. ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లలో కట్టెల పొయ్యి వినియోగించకూడదని నోటీసులు జారీ చేశారు. కర్రలతో వండటం వల్ల పొగ వస్తోందని, దీనివల్ల పలువురు అనారోగ్యం బారిన పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయని నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. అయితే, నగరంలో కొన్ని దశాబ్దాలుగా కొందరు వర్తకులు ఊకపొయ్యిలనే వినియోగిస్తున్నారు. వాస్తవానికి దీనివల్లే అధికంగా పొగ వెలువడుతుంది. ఇదే విషయమై గతంలో ఫిర్యాదులు వచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇలాగైతే కష్టం.. కమర్షియల్ సిలిండర్ల కొరత, ధర విపరీతంగా పెరగడం వంటి కారణాల వల్లే కట్టెల పొయ్యిలు కొనసాగిస్తున్నామని రెస్టారెంట్, హోటళ్ల యజమానులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దీనివల్ల వ్యాపారాలు చేయడం కష్టతరం అవుతోందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారాలు లేక తీవ్ర ఆందోళన చెందుతుండగా కార్పొరేషన్ అధికారులు తాజాగా ఇటువంటి నోటీసులు జారీ చేయడం తగదని తప్పుపడుతున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి సమస్యను వివరించాలని వారంతా నిర్ణయించుకున్నారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
శ్రీకాకుళం కల్చరల్: యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా పరిషత్ సీఈవో వెంకటరామన్ తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది కార్గిల్ పార్కులో ఆయుష్ శాఖ సమన్వయంతో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, ఆందోళన, వివిధ రకాల అనారోగ్య సమస్యలకు యోగా ఒక అద్భుతమైన దివ్య ఔషధంగా ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాసనాలను భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యోగా గురువు పాండ్రంకి మురళీకృష్ణ, కొంక్యాన మురళి, జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది, ఆయుష్ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. మత్స్యకారుల తెప్పబోల్తా వజ్రపుకొత్తూరు: మండలంలోని దేవునల్తాడ గ్రామానికి చెందిన మత్య్సకారులు బుధవారం వేకువజామున చేపల వేటకు వెళ్తుండగా రాకాసి అల తాకిడికి తెప్పబోల్తా పడింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు మత్య్సకారులు చిన్న, చిన్న గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బాధిత మత్య్సకారుడు గరక గారయ్యకు చెందిన తెప్పలో ఆయనతో పాటు అదే గ్రామానికి చెందిన మత్య్సకారులు హేమారావు, ఎర్రన్న, జోగారావు, అప్పన్నలు వేకువజామున చేపలవేటకు బయల్దేరారు. అయితే ఈ మత్య్సకారులు కొంతదూరం వెళ్లాక అలల తాకిడికి తెప్ప బోల్తా పడింది. మత్య్సకారులు చాకచక్యంగా ఈదుకుంటూ స్వల్ప గాయాలతో ఒడ్డుకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తీరానికి చేరుకున్నారు. స్థానిక మాజీ సర్పంచ్ సీదిరి చిరంజీవికి చెందిన ఇంజిన్ బోటు సాయంతో సముద్రంలో బోల్తాపడిన తెప్పను తిరిగి ఒడ్డుకు చేర్చారు. వివాహిత ఆత్మహత్య హిరమండలం: ఎల్.ఎన్.పేట మండలం మోదుగువలస నిర్వాసిత కాలనీ(చిన్న కొల్లివలస) గ్రామానికి చెందిన వివాహిత గొబ్బక లావణ్య (19) చీమల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సరుబుజ్జిలి ఎస్ఐ బి.హైమవతి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకొల్లివలసలో ఉంటున్న లావణ్య ఇంటి వద్ద ఈనెల 15వ తేదీన చీమల మందు తాగేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆటోలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. రిమ్స్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలికి తండ్రి ప్రసాదరావు, తల్లి పావని ఉన్నారు. లావణ్యకు మూడు నెలల క్రితం వివాహం అయ్యింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. దాడి చేశారని ఫిర్యాదు శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని సింగుపురం పంచాయతీ మామిడివలస గ్రామానికి చెందిన యడ్ల రమణ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన ఎల్లయ్య, అప్పన్న ప్రసాద్ అనే వ్యక్తులు దాడి చేశారని, బాధితుడు రూరల్ ఎస్ఐ రాముకు బుధవారం ఫిర్యాదు చేశారు. గ్రామంలోని భూమి కొలతల్లో ఇరువర్గాలకు అరసెంటు విషయంలో తేడా రావడంతో ఒకరుపై ఒకరు దాడి చేసుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అక్రమాలకు వత్తాసు పలుకుతున్నవారిని విడిచిపెట్టం
● అధికారులకు పేరాడ తిలక్ హెచ్చరిక టెక్కలి: నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలకు వత్తాసు పలుకుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, దళితులు, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఏ ఒక్క అధికారినీ విడిచిపెట్టేది లేదని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ హెచ్చరించారు. కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తల ప్రోద్బలంతో అధికారులు చేసిన దౌర్జన్యానికి నష్టపోయిన బాధిత దళితుడు బాద లక్ష్మీనారాయణ కుటుంబాన్ని బుధవారం తిలక్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడి అండతో టీడీపీ నాయకులు సామాన్యులపై రెచ్చిపోతున్నారని గుర్తు చేశారు. పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారుల ఆగడాలు శృతిమించుతున్నాయని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అధికారులు చేస్తున్న అక్రమ చర్యలకు వారు ఎక్కడికి బదిలీ అయినా సమాధానం చెబుతామని హెచ్చరించారు. అనంతరం బాధితుడికి భరోసా కల్పించే విధంగా మానసిక స్థైర్యం కల్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.హేమసుందర్రాజు, నాయకులు నూక సత్యరాజ్, బి.దివాకర్, ఎస్.వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం
మందస: రెండు రోజుల క్రితం కొన్ని వార్తా పత్రికల్లో వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఉద్దానం కార్గో ఎయిర్ పోర్టుకు భూములు ఇవ్వడానికి భేతాళపురం గ్రామ రైతులు ముందుకు వచ్చారనేది అవాస్తవమని, ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని బాధిత రైతులు, గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామంలో బుధవారం మాట్లాడుతూ.. గత 20 నెలలుగా ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టరాదని అనేక విధాలుగా నిరసనలు తెలియజేస్తూనే ఉన్నామన్నారు. కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గౌతు శిరీష, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర అధికారులు, ప్రభుత్వ పెద్దలకు తమ వైఖరిని స్పష్టంగా తెలియజేశామన్నారు. గ్రామాలకు దూరంగా ఎక్కడైనా ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఉంటే అక్కడ ఇటువంటి నిర్మాణాలు చేసుకోవాలని కోరారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, రైతుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మడియా పురుషోత్తం, బత్తిని ఉమాపతి, గార ఆనందరావు, కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ మీడియా వింగ్ కన్వీనర్ బత్తిని లక్ష్మణ్, జుత్తు నారాయణ, సాహుకరి కృష్ణారావు, బత్తిని తులసీరావు, దున్న పార్వతి, కీలు గున్నమ్మ, మడియా రుషి, దున్న మోహన్రావు, కోరిబిల్లి సుమలత, సాహుకరి ఉపేంద్ర, మడియా వల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో రైతులకు కష్టాలు
నరసన్నపేట : కూటమి పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండగలా వ్యవసాయం చేసే వారని తెలిపారు. ఇంటి వద్దకే ఎరువులు, విత్తనాలు, సమయానికి రైతు భరోసా నిధులు, ఉచిత పంటల బీమా, పంట రుణాలకు సున్నా వడ్డీ తదితర పథకాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేశారని గుర్తు చేశారు. కూటమి పాలనలో ఎరువులు, విత్తనాలు సక్రమంగా అందడం లేదని, అన్నదాత సుఖీభవ నిధులు సకాలంలో ఇవ్వడం లేదని, ఎంతోమంది అర్హులకు ఎగనామం పెడుతున్నారని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఎటువంటి నష్టపరిహారం రావడం లేదని ఆందోళన చెందారు. రైతుల ఉసురు కూటమి ప్రభుత్వానికి తప్పక తగులుతుందన్నారు. ఇలాంటి తరుణంలో రైతుల పక్షాన నిలుస్తూ వారి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. డీసీసీబీలో యూపీఐ సేవలు శ్రీకాకుళం అర్బన్: ఖాతాదారులకు ఆధునిక, సురక్షితమైన, వేగవంతమైన బ్యాంకింగ్ సేవలను అందించడమే లక్ష్యమని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ పేర్కొన్నారు. బ్యాంకులో నూతనంగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలను బుధవారం శ్రీకాకుళం డీసీసీబీ బ్యాంక్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఐ సేవల ప్రారంభం వల్ల కస్టమర్లకు బ్యాంకింగ్ మరింత సులభతరం అవుతుందనిన్నారు. ఖాతాదారులు తమ మొబైల్లో అందుబాటులో ఉన్న ఏదైనా డిజిటల్ చెల్లింపుల యాప్ ద్వారా బ్యాంకు ఖాతాను అనుసంధానించుకుని, తక్షణ నగదు రహిత లావాదేవీలను ఎప్పుడైనా, ఎక్కడైనా సులభంగా నిర్వహించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ డీడీఎం కృష్ణ, డీసీసీబీ జీఎం వరప్రసాద్, జగదీష్, డీజీఎం రమేష్, సత్యన్నారాయణ, సునీల్, బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 4 కేంద్రాలు.. 2103 మంది విద్యార్థులు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో నాలుగు కేంద్రాల్లో జరిగే నీట్ పరీక్షకు 2103 మంది విద్యార్థులు హాజరు కానున్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. పరీక్ష ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జూన్ 21న జరగనున్న నీట్ పరీక్షకు సంబంధించి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో 720 మంది, ఆర్ట్స్ కళాశాలలో 696 మంది, కేంద్రీయ విద్యాలయంలో 447 మంది, శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 240 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. సమావేశంలో ఆర్టీసీ డీఎం అమరసింహుడు, ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత, నీట్ పరీక్ష సిటీ కో ఆర్డినేటర్ షోయబ్ ఆలం, అసిస్టెంట్ కమీషనర్ (ఎగ్జామ్) జి.చంద్రభూషణరావు, తహసీల్దార్లు గణపతిరావు, చక్రవర్తి, కిరణ్కుమార్, శ్రీనివాసరావు, బి.గోపాల్, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. రేపు ఎండల మల్లన్న వార్షిక కల్యాణం టెక్కలి: రావివలస ఎండల మల్లికార్జునస్వామి దేవస్థానంలో శుక్రవారం భ్రమరాంబిక సహిత ఎండల మల్లికార్జునస్వామి వార్షిక కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఈఓ జి.గురునాథరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి నిర్వహిస్తున్న కల్యాణ వేడుకలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొనాలని కోరారు. -
రైతుల్లో ధరదడ
● పెరిగిన పెట్టుబడుల భారం ● దుక్కులపై డీజిల్ ధరల ప్రభావం ● ప్రభుత్వ ప్రోత్సాహం కరువు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ధరల బెంగ పట్టుకుంది. ఇప్పటికే ఎరువుల ధరలు పెరగ్గా, యుద్ధ ప్రభావంతో డీజిల్ ధరలు సైతం పెరుగుతుండటంతో అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొద్దిరోజులుగా అడపా దడపా కురుస్తున్న వర్షాలతో చాలాచోట్ల రైతులు దుక్కులకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో డీజిల్ లీటర్పై పది రోజుల వ్యవధిలో రూ.8 వరకు పెరగడంతో ట్రాక్టర్ యజమానులు అద్దెలు పెంచేశారు. దీంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ట్రాక్టర్తో దున్నేందుకు గంటకు రూ.1000, రోటావేటర్తో రూ.1250 వరకు వసూలు చేసిన యజమానులు ఈ ఏడాది రూ.1200 నుంచి రూ.1450 వరకు డిమాండ్ చేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పొంచి ఉన్న ఎల్నినో ముప్పు ధరలు పెంపునకు తోడు ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని రైతులు కలవరపడుతున్నారు. ఈ ప్రభావం పంటల సాగుపై పడే అవకాశం లేకపోలేదని ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయం చూసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. –హిరమండలం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
టెక్కలి రూరల్: స్థానిక మెళియాపుట్టి రోడ్డు జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగాం మండలానికి చెందిన సకలభక్తుల రంజిత్కుమార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నందిగాం గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై టెక్కలి వైపు వస్తుండగా, స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్ సమీపంలో రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రంజిత్ కుమార్కు తీవ్రగాయాలు కావడంతో హుటాహూటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వ్యక్తి కుడి కాలు పూర్తిగా విరిగిపోవడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. -
ఇది మా ప్రభుత్వం.. మా ఇష్టం!
● ఉచితం మాటున ఇసుక దందా ● కేశుపురం పంచాయతీలో ఐ–టీడీపీ నేత దౌర్జన్యంరాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం ముసుగులో ప్రజలకు అందాల్సిన ఇసుకను కొందరు అధికార పార్టీ నేతలు అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. ముఖ్యంగా స్థానిక బాహుదానది పరివాహక ప్రాంతంలో అధికార పార్టీ నేతల అనుచరులు అడ్డూఅదుపు లేకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం కేశుపురం పంచాయతీ నీలాపుపుట్టుగ గ్రామానికి చెందిన ఐ–టీడీపీ నాయకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రాక్టర్లతో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా సాగించాడు. విషయం తెలుసుకున్న విలేకరులు ఫొటోలు తీయడంతో ‘అధికారంలో ఉన్నాం.. ఇది మా ప్రభుత్వం.. మమ్మల్ని ఆపేది ఎవరు..?’ అంటూ బెదిరించడంతో విషయాన్ని స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై తహసీల్దార్ స్పందిస్తూ బాహుదానదిలో ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. –ఇచ్ఛాపురం రూరల్ -
రోగ్య శాఖలో
రు పోస్టుల కథ ● ఎస్టీలకు దక్కాల్సిన పదోన్నతులపై నీలినీడలు ● కావాల్సిన వారికి పదోన్నతులు ఇస్తున్నారంటూ ఆరోపణలు ● జిల్లా వైద్యారోగ్యశాఖ సచివాలయ ఏఎన్ఎంల పదోన్నతుల్లో గందరగోళం మళ్లీ కోర్టును ఆశ్ర యిస్తున్నాం గ్రేడ్–2 ఏఎన్ఎం పదోన్నతుల వ్యవహారంలో ఎస్టీలకు అన్యాయం జరిగింది. ఇదేంటని అడిగితే రోస్టర్ రిజిస్టర్ పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చామంటున్నారు. ఆ రిజిస్టర్ లేకుండా వీళ్లు ఎలా ఇంతమందికి పదోన్నతులు ఇస్తున్నారో ఉన్నతాధికారులు గమనించాలి. ఎలాగైనా అక్రమంగా పదోన్నతులను ఇచ్చేయాలని కొందరు అధికారులు జేబులు నింపుకున్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలను సైతం పట్టించుకోకుండా పదోన్నతులు పూర్తి చేస్తున్నారు. మాకు రావాల్సిన 9 పదోన్నతుల్లో ఇంకా ఆరు పదోన్నతులు ఇవాల్సి ఉంది. దీనిపై మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం. – వాబ యోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరసవల్లి: హెల్త్ సెక్రటరీల పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయడానికి వైద్యారోగ్య శాఖాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయాల్లో 656 మంది వరకు గ్రేడ్–3 హెల్త్ సెక్రటరీలను నియమించారు. ఈ గ్రేడ్–3 సెక్రటరీలను గ్రేడ్–2 ఏఎన్ఎంలుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం వేదికగా అక్రమ వసూళ్లు, సిఫారసుల పుణ్యమా అని ఇంకా మొదటి విడత పదోన్నతుల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. తాజాగా మరోసారి ఈ పదోన్నతుల ప్రక్రియ ఫైల్ కలెక్టరేట్కు చేరుకుని మంగళవారం కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. అయితే ఈ పదోన్నతుల ప్రక్రియలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రక్రియను పాటించకపోవడంతో న్యాయంగా తమకు దక్కాల్సిన తొమ్మిది పదోన్నతులు తమ వారికి దక్కడం లేదంటూ ఎస్టీ సామాజిక సంఘ ప్రతినిధులు గళమెత్తారు. ఇదే విషయంలో ఆదివాసీల సంఘం ఆధ్వర్యంలో గత ఏడాదిలో కూడా నిరసన వ్యక్తం చేయడంతో అప్పట్లో మూడు పోస్టులను ఎస్టీలకు కేటాయించారు. అయితే మిగిలిన ఆరు పోస్టుల విషయం మాత్రం వివాదాస్పదంగా మారింది. దీంతో ఈ పదోన్నతుల అంశం న్యాయస్థానాలకు వెళ్లడంతో పెండింగ్లో పడింది. జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలు సైతం బేఖాతరు రాష్ట్రంలో దాదాపుగా అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ ఏఎన్ఎం పదోన్నతుల తొలివిడత ప్రక్రియ పూర్తయిపోయి రెండో విడత కూడా సిద్ధం అవుతుండగా.. జిల్లాలో మాత్రం ఇంకా తొలివిడతే పూర్తి కాలేదు. దీంతో మొత్తం తొలివిడతలో 154 ఏఎన్ఎం (గ్రేడ్–2) పదోన్నతుల్లో 148 వరకు ర్యాంకింగ్ ఇచ్చి మిగిలిన ఆరు పోస్టులను ఎస్టీలకు కేటాయించకుండా రహస్య అజెండాగా ఉంచేశారు. ఎలాగోలా పదోన్నతులు పూర్తి చేయాలనే లక్ష్యంతో వాట్సాప్ల్లో కూడా ఆర్డర్లు ఇచ్చేసి...ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మంగళవారం నాడు కూడా మళ్లీ ఆ ఆరు పోస్టుల వ్యవహారం తెరమీదకు వచ్చింది. అప్పట్లో ఈ అంశంపై జాతీయ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించిన ఎస్టీ బాధితులకు స్పష్టమైన అనుకూల ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మొత్తం 154 పోస్టుల్లో ఆర్ఓఆర్ ప్రకారం 9 పోస్టులను ఇవ్వాలంటూ జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశించింది. కానీ మూడు పోస్టుల్లో మాత్రమే ప్రమోషన్లు ఇచ్చి.. మిగిలిన ఆరు పోస్టుల్లో మిగిలిన కులాల వారికి పలు సిఫారసులతో పదోన్నతులు కల్పించాలని అధికారులు పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాల అమలు జరగాలని ఎస్టీ కుల సంఘ ప్రతినిధులు, బాధితులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ను, డీఎంహెచ్ఓ డాక్టర్ అనితను కలిసి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఆ ఆరు పోస్టుల వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో జిల్లా ఎస్టీ సామాజిక వర్గ ప్రతినిధులు నిరసన చర్యలకు సిద్ధమవుతున్నారు. -
ఉత్తమ విద్యాలయాలకు జాతీయ ‘స్వచ్ఛ ఏవం’ పురస్కారాలు
హిరమండలం, జలుమూరు: జాతీయ స్థాయిలో ఏవమ్ హరిత విద్యాలయంగా హిరమండలం కేజీబీవీ ఎంపికై ంది. ఏపీలో 8 పాఠశాలలు ఎంపిక కాగా.. అందులో హిరమండలం కేజీబీవీ ఒకటి కావడం విశేషం. పాఠశాలలో ఉత్తమ విద్యాబోధనతో పాటు పరిశుభ్రత, పచ్చదనానికి పెద్దపీట వేసినందుకుగాను పురస్కారానికి ఎంపిక చేశారు. పురస్కారం ఎంతో బాధ్యత పెంచిందని కేజీబీవీ ప్రత్యేక అధికారిణి కృష్ణవేణి తెలిపారు. జలుమూరులో.. జాతీయ స్థాయిలో ఉత్తమ పాఠశాలగా జలు మూరు ప్రాథమిక ఆదర్శ పాఠశాల ఎంపికై ంది. దీన్ని సమగ్ర శిక్ష రాష్ట్ర డైరెక్టర్ శ్రీనివాస్ ధ్రువీకరించినట్లు హెచ్ఎం ఇప్పిలి మాధవరావు మంగళవా రం తెలిపారు. పచ్చదనం, పరిశుభ్రత, పర్యావర ణం పరిరక్షణ, విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని అందించడం, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశా లు పరిగణలోకి తీసుకుంటారు. జలుమూరు ఆద ర్శ ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ఉపాధ్యాయులు మెండ రామారావు పాఠశాల రూపురేఖలను మార్చారు. విద్యార్థుల హాజరు పెంచడంలో హెచ్ఎం మాధావరావు, తోటి ఉపాధ్యాయులు రామారావు కీలక పాత్ర పోషించారు. -
30 కిలోల గంజాయి పట్టివేత
ఇచ్ఛాపురం: పట్టణంలో ఎల్సీ గేట్ వద్ద పట్టణ పోలీసులు మంగళవారం 30 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఎల్సీగేట్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఒక లగేజి బ్యాగ్, రెండు సూట్కేసులతో రైల్వేస్టేషన్ వైపు వెళ్తుండగా అనుమానం వచ్చి వారిని తనిఖీ చేయగా.. 30.210 కిలోల గంజాయి దొరికింది. వీరిని మహారాష్ట్ర, ముంబై, అంధేరిలో నివాసముంటున్న విశాల్ య శ్వంత్ కాంబ్లె, అర్పిత వర్మ అలియాస్ జరా ఫాతిమాగా గుర్తించారు. గంజాయి వ్యాపారం చేసే మహ్మద్ షరీఫ్ వద్ద పనికి చేరిన వీరు ఒడిశా నుంచి గంజాయి తరలించడానికి బరంపురం వచ్చారు. అక్కడ గంజాయిని సప్లయ్ చేసే రోషన్ అలియాస్ సల్మాన్మజి అనే వ్యక్తికి ఫోన్ చేశారు. ఎల్సీ గేటు వద్ద గంజాయి తీసుకున్నారు. అనంతరం రైల్వేస్టేషన్కు వస్తుండగా అక్కడ పోలీసులకు చిక్కారు. వీరి వద్ద ఉన్న గంజాయి, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇచ్ఛాపురం రూరల్: విద్యా సంవత్సరం ప్రారంభించినా బడులకు బియ్యం సరఫరా చేయలేదంటూ మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మిథ్యాహ్న భోజనమేనా..?’ కథనానికి అధికారులు స్పందించారు. సివిల్ సప్లయ్ గోదాం ఎంఎల్ఎస్ పాయింట్ డిప్యూటీ తహసీల్దార్ కిశోర్ మంగళవారం హుటాహుటిన ఇచ్ఛాపురం మండలం, మున్సిపాలిటీ, కవిటి మండలాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం బియ్యం సరఫరా చేశారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. డీఎంహెచ్ఓ కార్యాలయ ఏఓపై బదిలీ వేటు అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖలో ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓల జీతాల చెల్లింపులో ఉద్దేశ్యపూ ర్వక జాప్యానికి కారణాలు, అక్రమాలపై కలెక్టర్ నియమించిన త్రీమెన్ కమిటీ విచారణ పూర్తి చేసింది. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం డీఎంహెచ్ఓ కార్యాలయ ఏఓ బాబూరావుపై బదిలీ వేటు పడింది. జిల్లాలో మొత్తం 120 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ఏడాది మే లో చెల్లించాల్సిన జీతాలు ఇవ్వలేదంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు వెళ్లింది. ఈ మేరకు నియమించిన ఆర్డీవో సాయి ప్రత్యూష, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి, మైన్స్ ఏడీలతో కూడిన త్రీమెన్ కమిటీ స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఈనెల 4న విచారణ జరిపి ఇందుకు బాధ్యుడుగా పరిపాలనాధికారి (ఏఓ) బాబూరావును గుర్తిస్తూ నివేదిక సిద్ధం చేశారు. దీంతో బాబూరావును తక్షణమే విధుల నుంచి తప్పి స్తూ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నర్సింగ్ కళా శాల ఏఓగా బదిలీ చేశారు. కాగా ప్రభుత్వ జిల్లా జనరల్ ఆస్పత్రి (రిమ్స్)లో ఏఓగా పనిచేస్తున్న గ్రూప్–1 అధికారి పైడి ప్రదీప్కు డీఎంహెచ్ఓ కార్యాలయ ఏఓగా అదనపు బాధ్యతలను అప్పగించారు. -
కష్టబడితే ఫలితమిలా..
● ఉపాధి పనుల వద్దకు వెళ్లి తల్లిదండ్రులను ఒప్పించిన టీచర్ ● 30 మందిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన గురువు జి.సిగడాం: ‘ఒక సంవత్సరం మన పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి. మేము విద్య నేర్పించకపోతే మీ పిల్లలు ఇక మీ ఇష్టం’.. ఇదేదో నోటి మాట కాదు. ఏకంగా బాండ్ పేపర్పై సంతకం చేసి ఓ ఉపాధ్యాయుడు ఇచ్చిన హామీ. ఆ టీచర్ ఇచ్చిన హామీతో ఊరిలో పిల్లలంతా ప్రభుత్వ బడి వైపు మళ్లారు. బడిలో పిల్లల సంఖ్య 67కు పెరిగింది. మండలంలోని మధుపాం ఎంపీయూపీ పాఠశాలలో 2025 సంవత్సరంలో 1వ తరగతి నుంచి 8 వ తరగతి వరకు 36 మంది విద్యార్థులు ఉండేవారు. వీరికి ముగ్గురు టీచర్లను ప్రభుత్వం నియమించింది. కానీ బడిలో పిల్లల సంఖ్య తగ్గడంతో ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గే ప్రమాదం ఏర్పడింది. దీంతో అక్కడి టీచర్ టేకి రామకృష్ణ ప్రైవేటు బడులకు వెళ్తున్న పిల్లలను తమ స్కూల్లో చేర్పించాలని తలిచా రు. ఏకంగా పిల్లల తల్లిదండ్రులు పనిచేస్తున్న ఉపాధి హామీ స్థలాల వద్దకు వెళ్లి వారిని ఒప్పించారు. పిల్లలను బాగు చేసి తీరుతాం.. అని బాండ్ పేపర్పై సంతకాలు చేసి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దీంతో పిల్లలంతా ఈ బడిలో చేర్చడంతో హాజరు సంఖ్య 67కు పెరిగింది. కష్టానికి ఫలితం ఇక్కడి విద్యార్థులు 30 మంది ఆటోలపై పొందూరులోని ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయేవారు. వారిని మా బడిలో చేర్పించడానికి వేసవి సెలవులను వినియోగించుకున్నాం. మా హెచ్ఎం అరవింద కుమారి సహకారంతో మేము పడిన కష్టాన్ని గ్రామస్తులు గుర్తించారు. పిల్లలను మా బడిలో చేర్పించారు. – టేకి రామకృష్ణ, ఉపాధ్యాయుడు, మధుపాం ఆనందంగా ఉంది పాఠశాలలో విద్యార్థులను చే ర్పించడానికి మేము ముగ్గురు టీచర్లం ఎంతో కష్టపడ్డాం. ఆ ఫలితంగానే పాఠశాలలో 67 మంది పిల్లలు ఉన్నారు. ఆనందంగా ఉంది. – దున్న శ్రీదేవి, ఉపాధ్యాయురాలు, మధుపాం బడిని నిలబెట్టాలని కోరిక ఈ ఏడాది పిల్లలు లేకపోతే ఉపాధ్యాయులూ ఉండరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని టేకి రామకృష్ణ కృషితో 30 మంది కొత్తగా చేరారు. విద్యా బోధన కోసం వలంటీర్ను కూడా నియమించుకున్నాం. – పతివాడ అరవింద కుమారి, ప్రధానోపాధ్యాయురాలు, మధుపాం -
బస్తీ మే సవాల్
● జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఇద్దరు బస్డ్రైవర్ల వాగ్వాదం ● గతంలో ఇదే స్థలంలో పలు ప్రమాదాలు ● అయినా మారని సారథుల తీరు శ్రీకాకుళం క్రైమ్ : మంగళవారం ఉదయం 10.15 గంటలు.. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్సు.. డేఅండ్నైట్ వైపు నుంచి ఎస్పీ కార్యాలయం మీదు గా కాంప్లెక్సుకు ఓ ఆర్టీసీ బస్సు రయ్మంటూ దూసుకునివచ్చింది. అదే సమయంలో ఆర్టీసీ కాంప్లెక్సు లోపలినుంచి ఔట్ గేట్ వైపు వస్తున్న మరో ఎక్స్ప్రెస్ సర్వీసు బస్సు ఆదరాబాదరాగా వచ్చింది. దాదాపు రెండు బస్సులు గుద్దుకునేంత పనిచేశాయి. అంతే ఇద్దరి డ్రైవర్ల ఇగోలు బద్దలైపోయా యి. ఒకరితో ఒకరు రోడ్డుపైనే వాగ్వాదానికి దిగా రు. నువ్వు ముందు తీయ్.. అంటే నువ్వే ముందు తీయ్ అంటూ వాదనకు దిగారు. అప్పటికే అంబేడ్కర్ కూడలి వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు నిలువరించినా ఇరువురూ ఏ మాత్రం తగ్గలేదు. కాసేపటికి అటుగా పోయే వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులు సైతం ఇరువురికీ క్లాస్ పీకడంతో కాంప్లెక్స్ నుంచి వస్తున్న ఎక్స్ప్రెస్ వెనక్కి తీయడంతో కథ సుఖాంతమైంది. అసలే డేంజర్ జోన్ జిల్లా కేంద్రంలోని డేఅండ్నైట్ పరిసర ప్రాంతాలన్నీ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం డేంజర్ జోన్ కిందకే వస్తాయి. ఆర్టీసీ కాంప్లెక్సు ఎదురుగా జిల్లాకోర్టు ఉండటం, సమీపంలోనే ఎమ్మార్వో, ఎస్పీ, ట్రెజరీ కార్యాలయాలుండటంతో నిరంతరం ఆ ప్రాంతమంతా రద్దీగానే ఉంటుంది. ఇదే ప్రాంతంలో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అలాంటి చోట్ల డ్రైవర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఇలా వాదులాడుకోవడం తగదని స్థానికులు సూచిస్తున్నారు. ● ఈ ఏడాది ఏప్రిల్ 4న జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్సులో తాను వచ్చి దిగిన ఆమదాలవలస బస్సే నడుస్తుండగా ఢీకొనడంతో లావేరు మండలం వెంకటాపురం చెందిన అంధవరపు జయలక్ష్మి మృతిచెందారు. ● ఈ ఏడాది జనవరి 11న జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్సు ఇన్గేట్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని పైల నరసమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ● గత ఏడాది సెప్టెంబర్లో టెక్కలి నుంచి విశాఖ వెళ్తున్న బస్సు ఆర్టీసీ కాంప్లెక్సు లోపలికి వెళ్తున్న రాజాం మండలానికి చెందిన గురు వూరు శంకరరావును ఢీకొట్టింది. దీంతో రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యి విశాఖలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ● గత ఏడాది మార్చి 3న డేఅండ్నైట్ నుంచి తన భర్త స్కూటీపై వెళ్తున్న గర్భిణిని నాగావళి కొత్త వంతెనపై ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో మృత్యువాత పడింది. ● గత ఏడాది అక్టోబరులో వృద్ధుడైన బిల్డర్ అంబేడ్కర్ కూడలి మలుపు వద్దకొచ్చేసరికి అతివేగంతో వస్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. -
వ్యవసాయం నిర్వీర్యం చేయడానికి కుట్ర
● మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాను దోచేస్తున్నారు ● దుమ్మెత్తిపోసిన వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ టెక్కలి: జిల్లాలో దశాబ్దాల కాలంగా దోపిడీలు, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పెద్ద దోపిడీదారుడు వెన్నుపోటు పార్టీకి చెందిన మంత్రి అచ్చెన్నాయుడు అని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. టెక్కలి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వెన్నుపోటు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతం కావడంతో అది తట్టుకోలేక మంత్రి అచ్చెన్నాయుడు మైక్ పట్టుకుని ఉన్మాదిగా మాట్లాడుతున్నారని తిలక్ దుయ్యబట్టారు. ఈ జిల్లాలో కింజరాపు కుటుంబం గ్రానైట్, ఇసుక, మద్యం, చివరకు ఊకలో సైతం అక్రమాలకు పాల్పడిందని తెలిపారు. ఒకరు భోగాపురం పోర్టు, మరొకరు మూలపేట పోర్టుతో పాటు ఇద్దరు సోదరులు విజిలెన్స్ అధికారం, మైన్స్, ధాన్యం, ఊకలో అక్రమాలు చేసుకుంటున్నారని తిలక్ దుయ్యబట్టారు. ఇటీవల జిల్లాలో సుమారు 11 కోట్ల రూపాయలతో సీఎంఆర్ బియ్యం అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ ఎందుకు వేయ లేదని తిలక్ ప్రశ్నించారు. సీఎంఆర్ బియ్యం, ఊక అక్రమాల్లో కింజరాపు కుటుంబానికి ఎంత వాటాలు చేరాయని తిలక్ నిలదీశారు. ఎన్నికల మునుపు ఇచ్చిన హామీల్లో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, పూర్తి స్థాయి బస్సుల్లో ఉచిత ప్ర యాణం, లబ్దిదారులందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేకపోయారని, అందుకే వెన్నుపోటు పార్టీగా పిలుస్తున్నారని తిలక్ గుర్తు చేశారు. వ్యవసాయ శాఖకు అచ్చెన్నాయుడు మంత్రిగా ఉండడం పెద్ద అరిష్టంగా మారిందన్నారు. రైతులు వరి వేయొద్దని చెప్పడం సిగ్గుచేటుగా లేదా అని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని నిర్వీ ర్యం చేయడానికి కుట్ర పన్నుతున్నారని అన్నా రు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కాకుండా సొసైటీల ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన ఆదేశాల వెనుక పెద్ద అవినీతి జరగబోతోదని తిలక్ పేర్కొన్నా రు. మోంథా తుఫాన్ బాధితులకు రూపాయి పరిహారం ఇవ్వలేదన్నారు. ఓటర్ల జాబితా సమ గ్ర సర్వే పారదర్శకంగా నిర్వహించాలన్నారు. టెక్కలి నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు మ్యాపింగ్ చేశారని ఇందులో ఆర్డీఓ తన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, నాయకులు సంపతిరావు హేమసుందర్రాజు, కిల్లి అజయ్కుమార్, చిన్ని జోగారావు, ఎస్.జనార్ధన్రెడ్డి, బడ్డ రాజేష్, ఎస్.వినోద్, కె.జీవన్ తదితరులు ఉన్నారు. -
వెద.. సాగు చేద్దాం పద
● యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు ● ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం జలుమూరు: పొలాల్లో ఖరీఫ్ సందడి మొదలైంది. రైతులు తమ పొలాలు దుక్కులు దున్నడంతోపాటు వెద వేసేందుకు అనువుగా మార్చుకుంటున్నారు. మన జిల్లాకు సంబంధించి వరి సాగు 4.20 లక్షలు ఎకరాలు కాగా ఇందులో వెద పద్ధతిలో 78 శాతం సుమారు 3.10 లక్షలు ఎకరాలు నాట్లు, ఉడుపు పద్ధతిలో మరో 1.10 లక్షలు ఎకరాలలో సాగు చేస్తుంటారు. వెద పద్ధతిలో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. దీంతో ఈ పద్ధతిపై అధిక శాతం మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. వాతావరణం ప్రతికూలంగా మారినా.. తక్కువ నీటితో గట్టెక్కిపోవచ్చు. ప్రయోజనాలివే.. ● తొలకరి వర్షాలు సద్వినియోగం చేసుకోవచ్చు. ● నారుమడి పెంపకం, నాట్లకు అయ్యే ఖర్చు సుమారు ఎకరాకు ఎనిమిది నుంచి పది వేలు మిగులుతోంది. ● చెరువులు, కాలువల కింద సాగు చేసే వారు నాట్లు ఆలస్యం కాకుండా సకాలంలో వేసుకోవచ్చు. ● విత్తన మోతాదు 40–50 శాతం తగ్గించుకోవచ్చు. ● పంట నేలకు పడిపోకుండా పది నుంచి 15 రోజులు ముందు కోత కోసుకోచ్చు. ● తెగులు, పురుగుల బెడద తగ్గించుకోవచ్చు. ● కోత యంత్రాలతో సులువుగా పంట కోత కోసుకోవచ్చు. ఈ విత్తనాలు మేలు ● లోతట్టు ప్రాంతాలు ముంపు ప్రాంతాలకు ఎంటీయూ(1061)ఇంద్ర,ఎంటీయూ (1064)అమర, ఆర్జిఎల్ (2537) శ్రీకాకుళం సన్నాలు బాగుంటాయి. ● సాధారణ కాలువ ప్రాంతాలు, చెరువుల కింద ఉండే పొలాలకు ఎంటీయూ 1121(శ్రీధృతి), ఎంటీయూ 3291(సోనామసూరి) బీపీటీ 5204(సాంబమసూరి) ఎంటీయూ 1210 (సుజాత) ఎంటీయూ 1262(మార్టేర్ సాంబ) ఎంటీయూ 7029(స్వర్ణ) మేలుగా ఉంటాయి. ● కాలువ శివారు భూములకు ఎంటీయూ 1156(తరంగణి), ఎంటీయూ 1153(చంద్ర), ఎన్ఎల్ఆర్ 34449 మంచివి. నేల తయారీ వర్షాలు పడిన వెంటనే నేలను పలుమార్లు దున్ని మెత్తగా తయారు చేసిన తర్వాత కలుపు సమస్య కొంత వరకూ అధిగమించవచ్చు. ఆఖరి దుక్కిలో సిఫారసు మేరకు భాస్వరం, పొటాష్ తదితర ఎరు వులు వేసి నేలను కలియదున్నాలి. నేలలో తేమ సరిగా లేకపోతే మొలక రాదు. తేమను చూసుకుని రోటావేటర్తో విత్తనాలు వేసుకోవడం మంచిది. కాలిబాటలు వల్ల పైరుకు వెలుతురు, గాలి తగలడం, ఎరువులు సులువుగా వేసుకోవడం, చీడపీడ ల నివారణ తదితర ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే విత్తనాలు పుట్టిన తర్వాత మొక్కలు లేనిచోట కొత్త మొక్కలు వేసుకోవాలి. అధిక దిగుబడులకు సూచనలు ● పంట పడిపోని, త్వరితగతిని కలుపు నివారణకు గల రకాలు ఎంచుకోవాలి. ● సరైన సమయంలో తగిన మోతాదులో కలుపు మందు పిచికారీ చేయాలి. ● కలుపు మందు పిచికారీ చేసే సమయంలో పొలంలో నీరు పలుచగా ఉండేటట్లు చూసుకోవడంతో పాటు తర్వాత కూడా రెండు రోజులు వరకూ నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ● ఎరువులు విత్తిన 15 రోజులకు పిలక దశలో మళ్లీ చిరు పొట్టదశలో వేయాలి. ● పొటాష్ ఎరువును విధిగా చిరుపొట్ట దశలో నత్రజనితోపాటు వేయాలి. ● చేనును కోత కోసే వారం రోజులు ముందు మాత్రమే ఎండగట్టాలి. -
ఆరోగ్యకర జీవనానికి యోగా అవసరం
శ్రీకాకుళం కల్చరల్: ఆరోగ్యకరమైన జీవనానికి యోగాసనాలు అత్యంత ఆవశ్యకమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. పర్యాటక ప్రాంతమైన డచ్ భవనం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన పాల్గొన్నారు. నేటి కాలంలో మారుతున్న జీవన శైలి, ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వీటన్నింటికీ సహజసిద్ధమైన, శాశ్వతమైన పరిష్కారం యోగా అని తెలిపారు. రెండు నెలల నుంచి ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నట్లు చెప్పారు. ఇది కేవలం శరీరానికి మాత్రమే కాదు, మన మనస్సును కూడా చురుగ్గా ఉంచుతుందన్నారు. జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా మాట్లాడుతూ యోగాసనాల వల్ల శరీరం ధృఢంగా ఉంటుందన్నారు. ఆసనాలు వేయడం ద్వారా శరీరంలోని కండరాలు, కీళ్లు బలాన్ని పుంజుకుంటాయని పేర్కొన్నారు. శరీరం ఫ్లెక్సిబుల్గా మారుతుందన్నారు. యోగా మాస్టారు పాండ్రంకి మురళీకృష్ణ, పలువురు యోగా ట్రైనర్లు పాల్గొన్నారు. డచ్ భవనం వద్ద నిర్వహించిన పర్యాటక యోగాలో విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు. -
‘వృద్ధులపై వేధింపులు తగవు’
శ్రీకాకుళం కల్చరల్: వృద్ధులను గౌరవించడం, వారి సంక్షేమానికి పనిచేయడం అత్యవసరమని జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బలివాడ మల్లేశ్వరరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని శాంతా కల్యాణ అనురాగ నిలయంలో ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించా రు. వృద్ధుల ఆస్తి, ప్రాణ రక్షణకు చర్యలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. వృద్ధుల వికలాంగుల సహాయ సంచాలకులు బి.దేవరాజ్, ప్రత్యేక అతిథి పెన్షనర్ల జేఏసీ అధ్యక్షు లు సీహెచ్ పురుషోత్తమనాయుడు, ముఖ్య అతిథి గా హాజరైన సంఘ గౌరవాధ్యక్షుడు పోలుమహంతి జగన్మోహన రావులు మాట్లాడుతూ వృద్ధుల పట్ల దుర్భాషలు, వేధింపులు లేకుండా వారికి గౌరవం ఇచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. రైల్వే రాయితీలు వంటివి తీసేయడం దారుణమన్నారు. -
మళ్లీ అదే దైన్యం..!
సాగుకు సన్నద్ధం..● ఏరువాకకు ముందే యూరియా గుబులు ● ఖరీఫ్కు తగినంత అందించలేమంటున్న ప్రభుత్వం ● అన్నదాతలో ఆందోళన నిబంధనలు ప్రకారమే సరఫరా ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రైతులకు యూరియా సరఫరా చేయడం జరుగుతుంది. ఈ ఏడాది యూరియా దిగుమతి తగ్గే అవకాశం ఉంది. అధిక ధరలకు విక్రయించినవారిపై చర్యలు తీసుకుంటాం. – ఎం.మోహనరావు, వ్యవసాయశాఖాధికారి, ఆమదాలవలస మండలం తగిన యూరియా అందించాలి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూడడం సరికాదు. రైతులకు కావాల్సిన ఎరువులు అందించకపోవడం వల్ల చిన్న, సన్నకారు రైతులే కాకుండా ముఖ్యంగా కౌలు రైతులూ ఇబ్బందిపడే ప్రమాదం ఉంది. దీంతో అధిక నష్టం జరుగుతుంది. అందువలన ప్రభుత్వం ఆలోచించి తగిన యూరియా అందించేందుకు చర్యలు తీసుకోవాలి. – పి.రాము, రైతు, వంజంగిపేట, ఆమదాలవలస ఆమదాలవలస రూరల్: అన్నదాత గుండెల్లో యూరియా గుబులు మొదలయ్యింది. వచ్చే ఖరీఫ్ సీజన్కు తగిన యూరియా అందించలేమని ప్రభు త్వం చేతులెత్తేయడంతో సాగుపై భయం నెలకొంది. ఎకరానికి ఒక బస్తా లేదా ఎకరాన్నరకు ఒక బస్తా చొప్పున మాత్రమే ఈ ఏడాది యూరియా అందించగలమని అధికారులు ముందే చెప్పడంతో గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఈ ఏడాది పంటలు ఎలా పండించాలోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తొలకరి వర్షాలు ప్రారంభమవ్వడంతో ఏరువాకకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి మన ప్రాంతంలో ఎకరానికి రెండు లేదా మూడు బస్తాల యూరియాతో పాటు తగిన కాంప్లెక్స్ ఎరువులు వేస్తే కానీ పంట దిగిబడులు వచ్చే అవకాశం లేదు. అయితే అధికారులు ముందుగానే రైతులకు తగిన యూరియా అందించలేమని చెప్పడంతో అన్నదాతలు భయాందోళన చెందుతున్నారు. భారీగానే నిల్వలు వాస్తవంగా జిల్లాకు పలు కంపెనీల నుంచి ఏజెన్సీలు ఉన్నాయి. రైల్వే వ్యాగన్లు ద్వారా ఆమదాలవలస పట్టణానికి యూరియా దిగుమతి అవుతోంది. అయితే ఈ ఏడాది యూరియా కొరత ఉండవచ్చని ముందుగానే గ్రహించిన ఏజెన్సీలు ముందు నుంచి భారీ నిల్వలకు ప్రణాళికలు చేశారు. పలు ప్రభుత్వ గోదాంలతో పాటు అనేక ప్రైవేటు గోదాంలు లీజ్కు తీసుకొని భారీ నిల్వలు వేస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలో చెందిన వ్యాపారులకు పలు ఏజెన్సీల నుంచి అందించడం జరుగుతుంది. అయితే ముందస్తుగానే నిల్వలు పెంచుకొని రైతులు నుంచి భారీ వసూళ్లకు ఏజెన్సీదారులు, వ్యాపారులు కుమ్మక్కు అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృత్రిమ కొరతతో దోపిడి స్థానికంగా ఉండే కొందరు వ్యాపారులు ఏజెన్సీదారులతో కలిసి ఇప్పటినుంచే కృత్రిమ కొరత సృష్టించి అన్నదాతల నుంచి భారీ దోపిడీకి పాల్పడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బస్తాకు మీకు ఇంత.. మాకు ఇంత అని వ్యాపారులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇంకా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే ప్రభుత్వ ధర ప్రకారం రూ.278 లకు విక్రయించాల్సిన యూరియా బస్తా రూ.500ల నుంచి రూ.550ల వరకు ధర పలుకుతోంది. అంటే ఇక ఖరీజ్ సీజన్ ప్రారంభమైతే బస్తా ధర ఏ స్థాయిలో ఉంటుందో అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారుల కళ్లెదుటే ఈ వ్యవహారం జరుగుతున్నా చోధ్యం చూస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందువలన ఇప్పటికై నా వ్యవసాయశాఖ విజిలెన్స్ అధికారులు రంగ ప్రవేశం చేసి ఽయూరియాపై ధరలు నియంత్రణ చేయకపోతే, అన్నదాతలకు అవస్థలు తప్పవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
హార్డ్వేర్ షాపులో చోరీ
టెక్కలి రూరల్: స్థానిక అయ్యప్ప నగర్లో గల ఒక హార్డ్వేర్ షాపులో మంగళవారం చోరీ జరిగింది. ఈ మేరకు షాపు యజమాని, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మంగళవారం షాపు యజ మాని తిరుమల రావు షాపులోకి వెళ్లే సమయానికి షాపు వెలుపలి భాగంలో తలుపులు తెరిచి ఉండటం గుర్తించి లోపలకి వెళ్లి పరిశీలించగా క్యాష్ కౌంటర్లు తెరిచి ఉన్నాయి. ఒక కౌంటర్లో ఉన్న సుమారు రూ.1లక్ష50 వేలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. షాపు వెలుపలి సీసీ కెమెరాలకు గుడ్డలతో కప్పేసి షాపులోని సీసీ కెమెరాలు కట్ చేసి ఉండటం గుర్తించారు. అనంతరం పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే గత కొద్ది రోజులుగా టెక్కలి పరిధిలో జరుగుతున్న చోరీలతో ప్రజలు భయపడుతున్నారు. కొద్ది రోజుల కిందట వేంకటేశ్వర కాలనీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అది మరువక ముందే స్థానిక సంతోషిమాత ఆలయంలో చోరీ జరిగింది. అది జరిగి 20 రోజులు కాకముందే మరో చోరీ జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్ పాటించలేదని ఫిర్యాదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో సచివాలయ ఏఎన్ఎం ఉద్యోగుల పదో న్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటించకుండా అడ్డగోలుగా పదోన్నతుల జాబితాలు సిద్ధం చేశారని దళిత సంఘాల జేఏసీ నాయకులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కి మంగళవారం ఫిర్యా దు చేశారు. దళిత సంఘాల జేఏసీ అధ్యక్షుడు కంఠ వేణు, ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీను, రాష్ట్ర ఆదివాసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు రాయి వేణుగోపాల్ మాట్లాడుతూ పదోన్నతుల్లో ఎస్సీ ఉద్యోగులకు సంబంధించి పదోన్నతి రిజర్వేషన్లు కేటాయింపులో అనుమానాలు ఉన్నాయన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ జారీ చేసిన ఆదేశాలను సంబంధిత అధికారులు తక్షణమే అమలు చేయాలని వారు కోరారు. రోస్టర్ వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు. -
కాలువపై విద్యుత్ తీగలు
హిరమండలం: వంశధార కుడి ప్రధాన కాలువ వద్ద నుంచి విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమా దం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో ఉంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయం చెంతనే వంశధార కుడి ప్రధాన కాలువ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ కాలువ మీదుగా 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ వెళుతోంది. అయితే వైర్లు వేలాడడంతో పాటు గాలికి రాపిడికి గురై నిప్పులు ఎగసిపడుతున్నాయి. చేతికి అందేంత ఎత్తులోనే తీగలు ఉన్నాయి. వంశధార కాలువ పొడవునా రేవులు ఉన్నాయి. స్థానికులు స్నానాలతో పాటు ఇతర అవసరాలకు అటువైపుగా వెళుతుంటారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనతో ఉన్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించింది వైర్లను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలం దృష్ట్యా త్వరగా మరమ్మతు పనులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టాలపై గుర్తు తెలియని మహిళ మృతదేహం గుర్తింపు పొందూరు: మండలంలోని పెనుబర్తి, బొడ్డేపల్లి గ్రామాల మధ్య రైల్వే పట్టాలపై మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో మృతదే హం గుర్తు పట్టలేని విధంగా తయారైంది. ప్రమాదం ఏ విధంగా జరిగిందీ అనేది తెలియదని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ముగిసిన టెన్నిస్ వేసవి శిబిరాలు శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 50 రోజులుగా నిర్వహించిన టెన్నిస్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఉన్న టెక్నాస్ అకాడమీ వేదికగా నిర్వహించిన ఈ శిక్షణ శిబిరాలకు ఉదయం, సాయంత్రం 30 మందికి పైగా పిల్లలు హాజరయ్యారు. ఆఖ రి రెండు రోజులపాటు లీగ్ మ్యాచ్లు నిర్వ హించి విజేతలుగా నిలిచిన బాలబాలికలకు బ హుమతులు ప్రధానం చేశారు. శిక్షణలో పా ల్గొన్న ప్లేయర్స్ అందరికీ ప్రాతినిధ్యపు సర్టిఫికెట్లను అందజేశారు. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్వీఎస్ఆర్కే నేతాజీ, ఉపాధ్యక్షుడు మూల వెంకటరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.విజయ్కృష్ణ తదితరులు హాజరై మాట్లాడుతూ జిల్లాలో లాన్టెన్నిస్ క్రీడాభివృద్ధికి పనిచేస్తున్నామన్నారు. -
దళితుడి స్థలంపై దౌర్జన్యం
● యంత్రాలతో రేకుల షెడ్డును కూల్చేసిన అధికారులు టెక్కలి: టెక్కలి నియోజకవర్గంలో దళితులపై భౌతిక దాడులు, దళితుల ఆస్తులపై దౌర్జన్యాలు మితి మీరిపోతున్నాయి. ఇటీవల మాసాహెబ్పేట గ్రా మంలో దళిత, గిరిజన యువకులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన మరువక మునుపే అదే మండలం కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ఓ దళితుడి ఇంటి స్థలంపై అధికారులు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీకి సానుభూతి పరుడిగా ఉన్నాడనే కారణంతో టీడీపీ నాయకుల ప్రోద్బలంతో గ్రామానికి చెందిన బాధ లక్ష్మీనారాయణ అనే దళితుడి ఇంటికి ఆనుకుని ఉన్న స్థలంలో అతనికి చెందిన రేకుల షెడ్డును యంత్రాలతో తొలగించేసి ఇంట్లో సామాన్లు, ఫలసాయం చిందరవందర చేసేశారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. కొత్తపల్లి గ్రామంలో దళితుడు బాధ లక్ష్మీనారాయణ ఇంటికి ఆనుకుని తన స్థలంలో ఎప్పటి నుంచో రేకుల షెడ్డును వేసుకున్నాడు. ఈయన వైఎస్సార్ సీపీకి సానుభూతి పరుడిగా ఉన్నాడనే కక్షతో అది ప్రభుత్వ స్థలం అని చూపిస్తూ గ్రామానికి చెందిన కొంత మంది టీడీపీ కార్యకర్తలు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఎలాంటి నోటీసులు, సమాచారం, సమయం ఇవ్వకుండా మంగళవారం హఠాత్తుగా కొంత మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు కొత్తపల్లి గ్రామానికి చేరుకుని యంత్రాలతో లక్ష్మీనారాయణకు చెందిన రేకుల షెడ్డును కూల్చేశారు. కుటుంబ సభ్యులంతా మొరపెట్టుకున్నప్పటికీ షెడ్డులో సామాన్లు, ఫలసాయం మొత్తంగా చిందర వందర చేసేశారు. గ్రామంలో సాగునీటి కాలువను కొంత మంది టీడీపీ కార్యకర్తలు కబ్జా చేస్తున్నారంటూ ఇటీవల కొంత మంది రైతులు అధికారులకు ఫిర్యాదు చేశా రు. దానిపై కక్ష సాధింపు చర్యగా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు కొంత మంది గ్రామస్తులు చెబుతున్నారు. తనపై గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కోరాడ సుబ్రహ్మణ్యం, శిమ్మ సింహాచలం, రెడ్డి మోహన్, రెడ్డి సింహాచలం, రెడ్డి లక్ష్మీనారాయణ తదితరులు కక్ష పెంచుకుని, ఇలా తన రేకుల షెడ్డును కూల్చేశారని బాధిత దళితుడు లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. -
అడ్వెంచర్ శిక్షణలో జిల్లా విద్యార్థి ప్రతిభ
శ్రీకాకుళం రూరల్: విపత్తులు వచ్చేటప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి, వరదలు, నదులు పొంగేటప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని ఎలా రక్షించాలి అన్న శిక్షణలో సిక్కోలు విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. ఉత్తరాంధ్ర నుంచి 14వ ఆంధ్రా బెటాలియన్ తరఫున గురజాడ విద్యాసంస్థలు గాయత్రీ కళాశాలలో బీఎస్సీ సెకెండియర్ చదువుతున్న సార్జంట్ బుంగ నాని ఈ శిక్షణ పూర్తి చేసుకున్నాడు. శ్రీకాకుళం మండలం మునసబుపేటకు చెందిన నాని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. గడిచిన నెలలో జరిగిన ఎంపికల్లో ఉత్తరాంధ్ర నుంచి స్పెషల్ అడ్వంచర్ క్యాంప్నకు గాను శ్రీకాకుళం జిల్లా నుంచి నాని మాత్రమే ఎంపిక కావడం గమనార్హం. అస్సోంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాంట్రింగ్న్ అండ్ అడ్వంచర్లో 12 రోజుల పా టు ఈ విద్యార్థి శిక్షణ పొందాడు. పర్వతారోహణ, రివర్ క్రాసింగ్ చేయడం, తాళ్లతో కట్టుకొని బ్రిడ్జిలు దాటడం వంటివి వాటిలో మెలకువలు నేర్పించా రు. ప్రతికూలమైన అటవీ ప్రాంతంలోనూ, కొండల్లోనూ టెంట్లు వేసుకొని ఎలా నివసించాలి, సర్వైవల్ టెక్నికల్ ద్వారా ఎలా బయట పడాలి వంటివి నేర్పిస్తారు. విద్యార్థి ప్రతిభపై గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ స్వామినాయుడు, ప్రిన్సిపాల్ కేవీవీ సత్యన్నారాయణ, ఎన్సీసీ క్యాడెట్ ప్రత్యేకాధికారి వంగా మహేష్ అభినందనలు తెలిపారు. -
బాబోయ్ పిడుగు..
● శోకం మిగిల్చిన మేఘాలు ● పిడుగుపాట్లకు జిల్లాలో ఇద్దరు బలి ● మన్యం–పార్వతీపురం జిల్లాలో సిక్కోలు యువకుడు మృతి జిల్లా వ్యాప్తంగా సోమవారం చినుకులు పలకరించాయి. సాయం సంధ్య వేళ ముసురుకున్న మబ్బులు అకస్మాత్తుగా పిడుగులు కురిపించాయి. వేర్వేరు చోట్ల పిడుగు పాట్లకు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. మన్యం పార్వతీపురం జిల్లాలోనూ సిక్కోలు యువకుడు బలైపోయాడు. పలు చోట్ల వానలు కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. రాజశేఖర్ మృతదేహం నరసమ్మ (ఫైల్) పార్వతి (ఫైల్) జలుమూరు: బసివాడ గ్రామానికి చెందిన పొన్నాన నరసమ్మ (50) సోమవారం సాయంత్రం పిడుగుపాటు కు బలైపోయారు. ఆమె రోజూ మాదిరిగానే ఉపాధి పనులకు వెళ్లిన అనంతరం వేతనదారులతో ఇంటికి వస్తుండగా.. దారిలో వాన పడడంతో చెట్టు వద్ద నించున్నారు. అదే సమయంలో పిడుగు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త పన్నెండేళ్ల కిందట కాలం చేశారు. మృతురాలికి కొడుకు లోకేష్, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. తాతగారింటికి వచ్చి.. భామిని/మెరకముడిదాం: ఎల్.ఎన్.పేటకు చెందిన పెనుగుదురు రాజశేఖర్(20) మన్యం పార్వతీపురం జిల్లా భామిని మండలం సొలికిరి గ్రామంలోని తాతగారి ఇంటికి వేసవిసెలవుల కోసం వచ్చాడు. సొలికిరి గ్రామ యువకులతో కలిసి వంశధార తీరంలో సాయంత్రం క్రికెట్ ఆడుతుండగా మేఘావృత మై వర్షం ప్రారంభమైంది. ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో రాజశేఖర్ పిడుగుపాటుకు గురయ్యాడు. వెంటనే మిగిలిన జట్టు సభ్యులు బాలేరు పీహెచ్సీకి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మృతితో తోటి స్నేహితులు, తాత, అమ్మమ్మలు పూడి సింహాచలం, సరస్వతి బోరున విలపించారు. ఆవును మేతకు తీసుకువెళ్లి.. నరసన్నపేట: నడగాం పంచాయతీ దుద్దిపేటలో పిడుగులు పడి ముంజి పార్వతి(62) మృతి చెందా రు. వర్షానికి ముందు ఆవును పొలాల్లోకి తీసుకువెళ్లగా పిడుగులు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యు లు కన్నీరు మున్నీరయ్యారు. భర్త సూర్యనారాయణ సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. పిడుగుపాటుకు ఆవు మృతి నరసన్నపేట: రెడ్డికిపేటలో పిల్ల ఆదిలక్ష్మికి చెందిన ఆవు పిడుగుపాటుకు గురై సోమవారం సాయంత్రం మృత్యువాతపడింది.పొలంలో ఆవును మేతకు తీసు కెళ్లి ఇంటికి వస్తుండగా దారిలో పిడుగు పడింది. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు హిరమండలం: మండలంలో సోమవారం సాయంత్రం వీచిన గాలులకు భగీరథిపురం వద్ద 33 కేవీ లైన్ విద్యుత్ స్తంభాలు నాలుగు నేలకొరిగాయి. పంట పొలాల్లో నీరు చేరి సోలార్ ప్లేట్లు గాలికి విరిగిపడ్డాయి. టెక్కలి: జిల్లాలో పిడుగు పాట్లు భయపెడుతున్నా యి. అప్పటి వరకు నిర్మలంగా ఉండే ఆకాశం ఒక్కసారిగా మబ్బులు ముసురుకోవడం, ఉరుములు రావడం, పిడుగులు పడడం క్షణాల్లో జరిగిపోతోంది. దీంతో తప్పించుకునే అవకాశం కూడా ఉండడం లేదు. సోమవారం ఒక్కరోజే ముగ్గరు పిడుగుపాటుకు బలయ్యారు. ఓ మూగజీవం కూడా ప్రాణాలు కోల్పోయింది. మరి ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవడం ఎలా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..? ఇంట్లో ఉంటే.. ● పిడుగులు సంభవించే పరిస్థితులు కనిపించిన ప్పుడు ఇంటి తలుపులు, కిటికీలు మూసేయాలి. ● టీవీ, ఫ్రిజ్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు వంటి విద్యుత్ పరికరాలను స్విచ్చాఫ్ చేయడం ఎంతో శ్రేయస్కరం. ● ముఖ్యంగా చార్జింగ్లో ఉన్న ఫోన్లు పక్కకు తీసేయాలి. ● నీటి పైపులు, మెటల్ తలుపులు, మోటార్లు వద్ద ఉండకూడదు. నీటి ద్వారా వేగంగా ప్రసరించే ప్రమాదాలు ఉన్నాయి. బయట ఉన్నప్పుడు.. ● ముఖ్యంగా చెట్ల కింద, పెద్ద టవర్ల దగ్గర, ఎత్తయిన ప్లాట్ఫామ్ మీద నిలబడకూడదు. ● నదులు, సరస్సులు, పెద్ద నీటి ఉపరితలాలు, మైదానాల్లో నుంచి వెంటనే సురక్షితమైన భవనాలు, కార్ల లోపలకు వెళ్లి తలదాచుకోవాలి. ● భూమిపై నిలబడినప్పుడు రెండు కాలు మడమలు కొంచెం దగ్గరగా ‘వి’ ఆకారంలో ఉంచాలి. ఇలా చేస్తే పిడుగు భూమిలోకి వెళ్లే మార్గం తక్కువగా ఉంటుంది. -
పేరుకు మినరల్.. శుభ్రత నిల్
● టెక్కలి జిల్లా ఆస్పత్రిలో మినరల్ పేరిట కలుషిత నీటి సరఫరా ● ఆందోళనలో రోగులు టెక్కలి రూరల్: టెక్కలి జిల్లా ఆస్పత్రిలో రోగులకు మినరల్ వాటర్ పేరిట కలుషిత నీరు అందిస్తున్నారు. ఆస్పత్రిలో తాగునీటి సమస్య ఉండడంతో మినరల్ వాటర్ అందించే ఏర్పాటు చేయగా.. అందులోనుంచి కూడా కలుషిత నీరే వస్తోంది. ఆస్పత్రిలోని మినరల్ వాటర్ క్యాన్లలో నాచు పేరుకుపోవడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగకుంటే గొంతు ఎండుతుంది. తాగితే రోగాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నెలలుగా ఆస్పత్రిలో ఉన్న ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులకు గురైన విషయం అందరికి తెలిసిందే. దాన్ని బాగు చేయకుండా మినరల్ వాటర్ క్యాన్లతో రోగులకు తాత్కాలికంగా తాగునీరు అందిస్తున్నా రు. అయితే అందించిన తాగునీరు కూడా కలుషితంగా నాచుపట్టి ఉండటంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు రోగులు, రోగుల బంధువులు కోరుతున్నారు. -
ఆదా..
చేత కాదా..? మిథ్యాహ్న భోజనమేనా..? టీసీ ఇచ్చేందుకు రూ.లక్ష డిమాండ్ ఇంధనం ఆదా చేయాలన్నారు.. పొదుపు మంత్రం పాటించాలని సూచనలు ఇచ్చారు.. జనాలకు మనమే ఆదర్శంగా ఉండాలని పిలుపు కూడా ఇచ్చారు.. కానీ కలెక్టర్ సూచనను అధికారులు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా.. ఇంధనాలు ఆదా చేయాలని సాక్షాత్తు ప్రధాని సూచించారు. అందుకు అనుగుణంగా ప్రతి వారం గ్రీవెన్స్ సమయంలో అధికారులు సైకిల్ను వినియోగించాలని, వాహనాలు వీలైనంతగా వాడకుండా ఉంటే మేలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. కానీ ఈ వారం ఆయన మాత్రమే సైకిల్పై గ్రీవెన్స్ కు వచ్చారు. మిగతా అధికారులంతా ప్రభుత్వ వాహనాలనే వినియోగించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం ఇచ్ఛాపురం రూరల్: బడి గంటలు మోగాయి. వేసవి తర్వాత గేట్లు తెరుచుకున్నాయి. పిల్లలు స్కూలు బాట పట్టారు. కానీ విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్న భోజనం విషయంలో పాఠశాలలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ అవసరమైన బియ్యం, చెక్కీలు సమయానికి అందకపోవడంతో ప్రధానోపాధ్యాయులు, వంట సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల పక్క పాఠశాలల నుంచి బియ్యం అప్పుగా తీసుకువస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొన్ని పాఠశాలల్లో గత ఏడాది మిగిలిపోయిన బియ్యం నిల్వలతోనే భోజనాలు సిద్ధం చేస్తున్నారు. చేరని బియ్యం.. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలకు అవసరమైన బియ్యం నిల్వలు చేరాల్సి ఉన్నప్పటికీ అనేక ప్రాంతాలలో సరఫరా జరగలేదు. దీంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంపై నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని పాఠశాలల్లో రెండు, మూడు రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉండగా మరికొన్ని చోట్ల పూర్తిగా కొరత ఏర్పడింది. చెక్కీలు లేవు విద్యార్థులకు పోషకాహారం అందించే పోషక విలువలు గల చెక్కీలు కూడా పాఠశాలలకు ఇంత వరకు అందలేదు. కూరగాయలు, నూనె, గ్యాస్, మసాలా దినుసులు కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులు లేక వంట సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో కొన్ని చోట్ల స్థానికంగా అప్పులు చేసి వంటలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. మాట్లాడుతున్న సీఐ చిన్నంనాయుడు, ఎస్ఐ ముకుందరావు రాగి మాల్ట్కు బ్రేక్ ప్రైవేట్ కళాశాల నిర్వాకంపై ఎస్ఎఫ్ఐ ఆందోళన శ్రీకాకుళం: నగరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న మద్ది మణికంఠ అనే విద్యార్థికి టీసీ ఇచ్చేందుకు కళాశాల యాజమాన్యం రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. వీరంతా సోమవారం కలెక్టర్ను కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. మణికంఠ ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో ప్రభుత్వ కళాశాలలో చేరాలని నిర్ణయించుకున్నాడని, దీంతో ప్రైవేటు కళాశాల యాజమాన్యాన్ని టీసీ కోసం సంప్రదించగా రూ.లక్ష చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. దీంతో సమస్యను పరిష్కరించాలని ఆర్ఐఓను కలెక్టర్ ఆదేశించారు. తక్షణమే స్పందించిన ఆర్ఐవో సంబంధిత కళాశాల యాజమాన్యాన్ని పిలిచి మాట్లాడా రు. తొలుత తటపటాయించిన యాజమాన్య ప్రతినిధి అనంతరం టీసీ ఇవ్వడంతో సమస్య పరిష్కారమైంది. కాగా టీసీలు ఇచ్చేందుకు పలు ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు ఇదేవిధంగా వ్యవహరిస్తున్నాయని, తక్షణం వారిని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అదనపు ఆహారంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023 మార్చి నెలలో పాఠశాలల్లో రాగుల పిండి, బెల్లంపొడి తో తయారు చేసిన రాగి జావను ప్రారంభించింది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో విద్యార్థికి 150 మిల్లీలీటర్ల చొప్పున స్టెయిన్లెస్ స్టీలు గ్లాసుల ద్వారా అందించేది. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అదే మెనూను అమలు పరుస్తూ వస్తోంది. గత విద్యాసంవత్సరం ఏప్రిల్ నెలలో విద్యార్థులకు పూర్తిగా రాగి మాల్ట్ పానీయం సరఫరా చేయలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొత్త విద్యా సంవత్సరంలోనూ సరఫరాపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ పాఠశాలలు స్రారంభమైన తర్వాత కూడా మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియ్యం, చెక్కీలు, రాగిమాల్ట్ వంటివి అందుబాటులో లేకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. విద్యార్థుల భోజనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా తక్షణమే సరఫరా చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. బడులు తెరుచుకున్నా చేరని బియ్యం, చెక్కీలు మధ్యాహ్న భోజన నిర్వాహణకు తంటాలు బియ్యం అప్పు తెచ్చుకుంటున్న హెచ్ఎంలు నిలిచి పోయిన రాగిమాల్ట్ -
యోగా పోస్టర్ తయారీ పోటీలకు ఆహ్వానం
గార: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జనాభా విద్యా ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పోస్టర్ తయారీ పోటీలను నిర్వహిస్తున్నామని వమరవల్లి డైట్ ప్రిన్సిపాల్ ఎ. గౌరీ శంకరరావు తెలిపారు. ఆరోగ్యానికి యోగా– పాఠశాలలో యోగా అనే అంశంపై పాఠశాల స్థాయిలో జూన్ 17 వరకు పోటీలు నిర్వహించాలన్నారు. వీటిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు జూన్ 18న నిర్వహించే జిల్లా స్థాయి పోటీలకు పంపాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న పోస్టర్ల ప్రదర్శనతో పాటు మెరిట్ సర్టి ఫికెట్లు, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.1000, రూ.750, రూ.500లు అందజేస్తామన్నారు. -
ఆదిత్యునికి ప్రత్యేక పూజలు
అరసవల్లి : అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. కేశఖండన శాలలో తలనీలాలను సమర్పించారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తుల కోసం ఏఈఓ గడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పలు ఏర్పాట్లు చేశారు. ఎండ నుంచి రక్షణగా చర్యలు చేపట్టినప్పటికీ..వాతావరణం చల్లబడటంతో భక్తులు ప్రశాంతంగా దర్శనాలు చేసుకున్నారు. అన్నదాన ప్రసాదం కోసం భక్తులు ఆసక్తి చూపినప్పటికీ కొందరికి ప్రసాదం దొరక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో రూ.300 చెల్లించిన భక్తులకు అంతరాలయ దర్శనం చేయించి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు. పలువురు ప్రముఖులు ఆదిత్యున్ని దర్శించుకున్నారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: సింహాచలంలోని వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని ఆదివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆలయ సంప్రదాయం మేరకు స్వాగతం పలికారు. అనంతరం క్షేత్ర మహిమాన్వితానికి ప్రతీకగా భావించే కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. దేవస్థానం తరఫున కలెక్టర్ దంపతులను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. దుకాణదారుడు పొందూరు : బంగారాన్ని తక్కువ ధరకే ఇస్తామని ఆశ చూపించి డబ్బులు దోచుకున్న ఘటన పొందూరు మండలం రాపాక కూడలి వద్ద చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. రాపాక సెంటర్లో ఫొటోఫ్రేమ్ దుకాణానికి వారం కిందట ఇద్దరు సీ్త్ర, పురుషులు వచ్చి ఫొటోఫ్రేమ్లు కొనుగోలు చేశారు. ఈ నెల 10న అదే దుకాణానికి మళ్లీ వచ్చి తాము కూలి పనులు చేసుకుని జీవిస్తున్నామని, పని చేసేచోట 200 గ్రాముల బంగారం దొరికిందని నమ్మబలికారు. తమకు డబ్బులు అవసరం పడిందని, అందులో సగం బంగారం రూ.5 లక్షలకే ఇస్తామని చెప్పారు. దీంతో దుకాణదారుడు బంగారం తీసుకుని తెలిసిన వారి వద్ద పరీక్షించగా నిజమైన బంగారమేనని తేలింది. అయితే, ప్రస్తుతం తన వద్ద అంత డబ్బులేదని, మరుసటి రోజు రమ్మని చెప్పి పంపించేశాడు. ఈ నెల 11న మరలా రావడంతో దుకాణదారుడు తన వద్ద ఉన్న రూ.1.30 లక్షలు ఇవ్వగా సదరు వ్యక్తులు బంగారం ముక్క ఇచ్చి మిగిలిన డబ్బుల కోసం తర్వాత రోజు వస్తామని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. దుకాణదారుడు మరుసటి రోజు బంగారాన్ని పరిశీలించగా అది నకిలీ బంగారమని తేలింది. మిగిలిన డబ్బుల కోసం ఆ ఇద్దరూ వస్తారని ఎదురుచూసినప్పటికి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు లభ్యం నరసన్నపేట: ఉర్లాం రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్పై బుధవారం మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి వివరాలు లభ్యమయ్యాయి. మృతుడు అల్లాడకు చెందిన పట్ట అప్పలరామయ్య(85)గా ఆమదాలవలస రైల్వే పోలీసులు గుర్తించారు. భార్య దాలమ్మ, కుమారుడు సింహాద్రిలు మృతుడిని గుర్తించారు. ఆదివారం పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు రైల్వే హెచ్సీ మధుసూదనరావు తెలిపారు. బుధవారం ఉదయం గుర్తు తెలియని రైలు ఢీకొని అప్పలరామయ్య మృతి చెందాడని చెప్పారు. -
ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి
శ్రీకాకుళం : ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, విద్యా హక్కుచట్టంలో సవరణలు చేయాలని ఫోరం ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్స్ ఆర్గనైజెషన్ (ఎఫ్ఓఆర్టీఓ) జిల్లా చైర్మన్ పిసిని వసంతరావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎఫ్ఓఆర్టీఓ కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం లేకుండా చట్టం చేయాలన్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ నెల 15, 16వ తేదీల్లో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన విరామంలో ప్లకార్డులతో శాంతియుత ప్రదర్శన చేపట్టాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ముఖ్య సలహాదారుడు బలివాడ ధనుంజయరావు, కో చైర్మన్ బోనెల రమేష్, జిల్లా జనరల్ సెక్రటరీ బరాటం వెంకటరమణ, మిస్కా కృష్ణయ్య, వడమ శరత్, డి.రాము పాల్గొన్నారు. -
శిష్టకరణాలను ఓబీసీలో చేర్చాలి
నరసన్నపేట : శిష్టకరణాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని, ఇందుకోసం కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులు అవసరమైన చర్యలు తీసుకోవాలని నరసన్నపేట శిష్టకరణ సంఘం అధ్యక్షుడు సదాశివుని రాంబాబు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నరసన్నపేటలోని శిష్టకరణ సంఘ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం తరఫున కేంద్ర,రాష్ట్ర మంత్రులతో పాటు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని కలిసి వినతిపత్రాలు ఇచ్చేందుకు తీర్మానం చేశామని తెలిపారు. సోమవారం నుంచి నిర్వహించనున్న ఎస్ఐఆర్(సర్) కార్యక్రమంలో శిష్టకరణ సంఘ సభ్యులు తమ ఓట్లు పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీఎల్ఓలు ఇంటికి వచ్చేటప్పుడు అవసరమైన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు గోవిందరావు, బలివాడ కృష్ణారావు, కస్పా ప్రసాద్, సదాశివుని సింహాచలం, చౌదరి కాంతారావు, కుప్పిలి వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఓబీకి మోక్షమెన్నడో?
● ఇచ్ఛాపురం పరిధిలోని రత్తకన్న– కొళిగాం రోడ్డులో నిత్యం యాతన ● తరచూ గేటు వేస్తుండటంతో వాహనచోదకుల నిరీక్షణ ● పట్టాలెక్కని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పురపాలక సంఘం పరిధిలో రత్తకన్న కొళిగాం రోడ్డులో రైల్వే లేవల్క్రాసింగ్(ఎల్సీ నం–329) గేట్ వద్ద వాహనచోదకులకు నిరీక్షణ తప్పడం లేదు. నియోజకవర్గం కేంద్రం ఇచ్ఛాపురం మున్సిపాలిటీ నుంచి రత్తకన్న గ్రామం, కొండపోలమ్మ కాలనీ, డిగ్రీ కళాశాల రోడ్డు, తోటూరు, మండపల్లి, మసాఖపురం, బిర్లంగి, తేలుకుంచి, హరిపురం, పాయితారి, కొలిగాం గ్రామాలతో పాటు మరికొన్ని ఒడిశా గ్రామాల ప్రజలు ఈ గేటు ద్వారానే నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వేలాది మంది ప్రజలు నిత్యం ఇదే దారిలో ప్రయాణిస్తుంటారు. మరోవైపు, కోల్కతా నుంచి విశాఖపట్నం రైల్వేలైన్ కావడంతో నిత్యం రైళ్ల తాకిడి ఉంటుంది. దీంతో ఎల్సీగేట్ వద్ద ప్రతి 30 నిమిషాలకోసారి గేట్ పడుతూ ఉంటుంది. గేట్ వేసిన ప్రతిసారి పాదచారులు, వాహనచోదకులు, స్కూల్బస్సులు అధిక సమయం వేచి ఉండాల్సి వస్తోంది. అత్యవసర పనుల నిమిత్తం కొందరు రైలు పట్టాలు దాటే క్రమంలో గాయాలపాలవ్వడంతో పాటు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గేట్ వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణం చేపట్టాలన్న స్థానికుల కల కలగానే మిగిలిపోతోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో ఎల్సీ గేట్లను ఎత్తివేసి వాటి స్థానంలో ఆర్ఓబీలు నిర్మించాలని గతంలో రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఇచ్ఛాపురం కొళిగాం ఎల్సీ గేట్ వద్ద ఆర్ఓబీ నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు కావాలని ఈస్ట్కోస్ట్ రైల్వే అధికారులు పురపాలకసంఘం పాలక వర్గానికి, కలెక్టర్కు 2019లో లేఖ రాశారు. అందుకు అనుగుణంగా పురపాలకసంఘం పాలక వర్గం కౌన్సిల్ సమావేశంలో మద్దతు తెలుపుతూ 2022లో తీర్మానం చేసి కలెక్టర్, ఈస్ట్కోస్ట్ రైల్వే అధికారులకు ఆమోదం తెలియజేశారు. ఈ మేరకు 2023లో ఆర్వోబీ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసిన చేసిన రైల్వే అధికారులు ప్లాన్, ప్రతిపాదనలకు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా తలెత్తే సమస్యలను అధిగమించి పూర్తిస్థాయిలో ఆర్ఓబీ నిర్మాణం కోసం సర్వే చేపట్టాలని ఉన్నతాధికారులు సూచించారు. ఆర్ఓబీ పనులు ప్రారంభయ్యే వరకు ఎల్సీ గేట్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారం దిశగా ప్రత్యమ్నాయ ఏర్పాటుగా రైల్వే అండ్ పాసేజ్ ఏర్పాటు చేయాలని గత మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, స్థానికులు, రైల్వే యూజర్ కమిటీ సభ్యులు రైల్వే ఉన్నతాధికారులను కోరగా అందుకు సమ్మతించారు. దీనికి అనుగుణంగా టెండర్పనులు కూడా గతేడాది ఆగస్టులో పూర్తిచేశారు. పనులు మాత్రం ఇంతవరకు ప్రారంభిచలేదు. ఇవి కేవలం ప్రతిపాదనలుగానే మిగిలిపోయాయి తప్ప కార్యరూపం దాల్చలేదు. ఇటీవల ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ ఈస్ట్కోస్ట్ జోన్, ఖుర్దా డివిజన్ నుంచి సౌత్కోస్ట్ జోన్ విశాఖపట్నం డివిజన్ లోనికి మార్చారు. ఈ క్రమంలో ఆర్బీఓ నిర్మాణం, అంతవరకు ప్రత్యామ్నాయంగా రైల్వే అండర్ పాసేజ్లకు ఈస్ట్కోస్ట్ జోన్లో అనుమతులు లభించినప్పటికి ప్రస్తుతం సౌత్త్ కోస్ట్ జోన్లోకి వెళ్లడం వల్ల ఈ నిర్మాణాలు ప్రారంభమవుతాయా లేదా అనే సందిగ్ధత ప్రజల్లో నెలకొంది. గేట్ కారణంగా చాలా సమయం వృథా అవుతోంది. ముఖ్యంగా ఆస్పత్రులకు, విద్యాసంస్థలకు, కార్యాలయాలకు వెళ్లే వారు అధిక సమయం వేచి ఉండాల్సి వస్తోంది. రైల్వే అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలి. – నరేంద్రనాథ్పట్నాయక్, ఉపాధ్యాయుడు, ఇచ్ఛాపురం గేట్ పడితే వాహనాలు నిలిచిపోవడంతో కిలోమీటర్ మేరకు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. నిత్యం ఇదే పరిస్థితి. దీంతో ఇరువైపులా వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యకు పరిష్కారానికి ప్రత్యామ్నాయంగా కనీసం అండర్ పాసేజ్నైనా నిర్మించాలి. – జి.ఈశ్వర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇచ్ఛాపురం -
పంటకు శ్రీరామరక్ష!
భూసార పరీక్ష.. ● భూసార పరీక్షలతో లాభసాటి వ్యవసాయం ● అధిక దిగుబడులకు సూక్ష్మ పోషకాలే కీలకం ● నమూనాల సేకరణలో మారిన విధానం ● పరీక్షలకు వేసవి అనుకూల సమయం ఆమదాలవలస: కాలం మారింది. పద్ధతులు మారుతున్నాయి. సాగు విధానాలు కూడా మారాలి. ఇన్నాళ్లూ సీజన్లను అనుసరించి పంటలు వేసేవారు. ఇకపై భూమి సారాన్ని అంచనావేసి ఏ పంట వేయాలి.. ఏ ఎరువు వాడాలి అని నిర్ధారించుకునే సమయం ఆసన్నమైంది. పంట సాగు చేసే ముందు ప్రతి రైతు దీనిపై అవగాహన పెంపొందించుకోవాలి. పంట కోతలు ముగిసిన నెలరోజులకు మట్టి నమూనా సేకరించాలి. భూసార పరీక్ష వల్ల ఏ పంట పండించాలో తెలుస్తుంది. ఏ ఎరువు ఎంతవేయాలో తెలుస్తుంది. ఈ పరీక్ష చేయడం వల్ల అటు భూమికి ఇటు పంటకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి, దిగుబడులు పెరగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. పోషకాలు గుర్తించకుండానే.. జిల్లా 90 శాతం రైతులు పంటలకు కావాల్సిన పోషక విలువలు తమ భూమిలో ఉన్నాయో, లేదో తెలుసుకోకుండానే పంటలు సాగు చేస్తున్నారు. దిగుబడుల కోసం రసాయన ఎరువులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఫలితంగా ఖర్చులు తప్ప దిగుబడులు పెరగడంలేదు. అంతేకాకుండా ఎరువుల వల్ల భూమిలో సహజ సిద్ధంగా ఉండే పోషకాలు నశించిపోతున్నాయి. జీపీఎస్ విధానంలో.. ఆధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో అమలు చేస్తూ రైతులు మెరుగైన దిగుబడులు సాధించేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పలు పరికరాలతో భూసార పరిశోధన స్థానాలను మెరుగుపరిచారు. ఇందులో భాగంగానే మోతాదుకు మించి రసాయన ఎరువుల వినియోగాన్ని నియంత్రించడంతో పాటు రైతులకు పెట్టుబడి భారం తగ్గించేలా వ్యవసాయాధికారులు సలహాలిస్తున్నారు. భూసార పరీక్షల ఆధారంగా నేలలో ఉన్న పోషకాలను గుర్తించి పంటల సాగు చేపట్టేలా రైతులను చైతన్య పరుస్తున్నారు. ఇందుకోసం జీపీఎస్ ద్వారా మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. మూడేళ్లకోసారి తప్పనిసరి.. పొలంలో సేకరించిన మట్టిని ప్రయోగశాలలో భౌతిక, రసాయన పద్ధతుల్లో విశ్లేషించి నేల స్వభావం, లక్షణాలు, పోషక విలువల స్థాయి గుర్తిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా ఏ పంటకు ఎంత మోతాదులో పోషకాలు అవసరమో తెలుస్తుంది. దీంతో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. భూమిలో లోపించిన వాటిని గుర్తించి దానికి అనుగుణంగా ఎరువులను వేసుకోవడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి భూసార పరీక్షలు చేయించడం మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి.. ● పొలంలో ఎరువులు వేసిన తర్వాత నెలరోజుల వరకు మట్టి సేకరించకూడదు. పంటకు నీరు పెట్టిన తర్వాత, నీడ ప్రదేశాలు, ఎరువుల కుప్పలున్న చోట, గట్లు, చెట్ల వద్ద నమూనాలు తీయరాదు. ● పంటకోత తర్వాత వేసవిలో పంటలు లేని సమయాల్లో భూసార రీక్షలక మట్టి నమూనాలు సేకరించాలి. పొలంలో వి ఆకారంలో 15–20 సెంటీమీటర్లు లోతున పారతో గుంత తీసి అందులో పై పొర నుంచి కింది వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. ● పొలం మొత్తంగా 8–10 చోట్ల సేకరించిన మట్టిని ఒకచోట చేర్చి బాగా కలిపి నాలుగు భాగాలను మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా మట్టి అరకిలో వచ్చేవరకు చేస్తుండాలి. ఇలా సేకరించిన మట్టిలో రాళ్లు గడ్డి వేరుచేసి నీడలో అరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్లో గానీ, పాలిథీన్ కవర్లో గానీ నింపి రైతు వివరాలు రాసి భూసార పరీక్ష కేంద్రాలకు పంపాలి. మట్టి సేకరణకు స్థానిక రైతు సేవా కేంద్రం సిబ్బంది సాయం తీసుకుంటే వారే రైతు పొలం వద్ద మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్ష కేంద్రాలకు పంపుతారు. సూక్ష్మపోషకాలు కీలకం.. అధిక దిగుబడులు సాధించాలనే తపనతో మితిమీరి రసాయన ఎరువులు వాడటం వల్ల భూమిలోని పోషకాలు నశించిపోతున్నాయి. పొటాష్ను ఎక్కువగా వాడడం వల్ల మెగ్నీషియం, జింక్ ఇనుము వంటి సూక్ష్మపోషకాలు మొక్కకు అందకుండా పోతున్నాయి.జింక్ లోపం కారణంగా మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడులపై ప్రభావం చూపుతోంది. సూక్ష స్థూల పోషకాలతో పాటు నైట్రోజన్ సేంద్రియ కర్బనాల స్థాయి చాలా కీలకం . సేంద్రియ కర్బనం లోపిస్తే భూమి తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది. ఎంత ఎరువు వేసినా భూమి గ్రహించకుండా నిస్సారమైపోతుంది. భూమిలో సేంద్రియ కర్బనం 0.5 శాతం నుంచి 0.76 శాతం వరకు ఉంటే సాధారణంగా పరిగణిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలా చోట్ల భూమిలో ఇది 0.1 శాతం నుంచి 0.20 శాతం వరకే ఉన్నట్లు పరీక్షలు ఫలితాలతో తెలుస్తోంది. భూసార పరీక్షల ఆధారంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయి. పరీక్షలు చేసి మండలంలో రైతులకు కార్డులు అందించే కార్యక్రమం చేపడుతున్నాం. ఈ ఏడాది కూడా భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల భూమిలో సారం తగ్గి పంట దిగుబడి తగ్గిపోతుంది. భూసార పరీక్షలపై ఇప్పటికే గ్రామ వ్యవసాయ సహాయకుల శిక్షణ కార్యక్రమ పూర్తిచేశాం. – మెట్ట మోహనరావు, మండల వ్యవసాయాధికారి, ఆమదాలవలస -
బొల్లినేని విద్యార్థుల ప్రతిభ
శ్రీకాకుళం రూరల్: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన బీఎస్సీ ఎలైడ్ అండ్ హెల్త్కేర్ సైన్సెన్స్ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర ఫలితాల్లో రాగోలులోని బొల్లినేని మెడిస్కిల్స్ విద్యార్థులు విజయదుందుభి మోగించారని కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ స్థాయిలో వివిధ కోర్సుల్లో ఆరుగురు విద్యార్థులు మొదటి ర్యాంకులు సాధించగా, ముగ్గురు రెండో ర్యాంకు, ఒకరు మూడో ర్యాంకు, ఇద్దరు నాలుగో ర్యాంకు, ఒకరు ఐదో ర్యాంకు, ముగ్గురు ఆరో ర్యాంకు, ఒకరు ఏడో ర్యాంకు, ముగ్గురు ఎనిమిదో ర్యాంకు, ఇద్దరు తొమ్మిదో ర్యాంకు, మరొకరు పదోర్యాంకు సాధించారని వివరించారు. తృతీయ ఏడాదిలో తొమ్మిది మంది ఉన్నత శ్రేణిలో, 45 మంది ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 20 మంది ఉన్నత శ్రేణిలో, 35 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి శివారు భూముల వరకు నీరిస్తామన్న హామీకి రెండేళ్లు గడిచినా ఎందుకు నిధులు కేటాయించడం లేదో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.తులసీదాసు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని సుందరయ్య భవన్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని, జీడికి గిట్టుబాటు ధర, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, శ్రీకాకుళంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేసి సుందర శ్రీకాకుళంగా తీర్చిదిద్దుతామని హామీలు గుప్పించినా అందులో ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. పాలకుల నిర్లక్ష్యమే జిల్లా వెనుకబాటుకి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో నాటి షట్టర్ కుంభకోణం తర్వాత నేటి వరకు వంశధార కాలువలకు షట్టర్లు బిగించకపోవడంతో శివారు భూములకు నీరు వెళ్లక రైతులు తీవ్రమైన ఇబ్బందు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వంశధార బ్యారేజ్ నిర్మాణం పూర్తయి 50 ఏళ్లు కావడంతో శిథిలావవస్థకు చేరుకుందని, ఆధునీకరణ కోసం రూ.1500 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కేంద్ర సంస్థలైన సింపు నుంచి ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా నేరేడు బ్యారేజీ నిర్మాణముకు గజిట్ నోటిఫికేషన్ వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి పని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రూ 200 కోట్లు కేటాయిస్తూ లిఫ్ట్ ద్వారా తాత్కాలికంగానైనానా వంశధార రిజర్వాయర్ నింపి రైతులకు నీరు ఇవ్వచ్చని, ఆ పని కూడా ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ సముద్రతీర ప్రాంతాన్ని రేర్ ఎర్త్ మినరల్ పేరుతో ఆదానివంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కార్గో ఎయిర్పోర్టు పేరుతో ఉద్దానం విధ్వాంసానికి పూనుకుంటున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళంలో నాగావళి నది జలకాలుష్యాన్ని నివారించి ప్రజలకు మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు భవిరి కృష్ణమూర్తి, కోనారి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
కరకట్టగలరా..?
● కలగానే కరకట్టల పనులు ● చినుకు పడితే వణుకు పుట్టిస్తున్న కరకట్టలు ● ఏటా ముంపు భయంలో బతుకుతున్న పరివాహక ప్రాంత వాసులు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): చినుకు పడితే చాలు.. ఎక్కడ ఏరు ఊరి మీద పడుతుందోనని వంశధార, నాగావళి తీర ప్రాంత ప్రజలు ఏటా భయపడుతూనే ఉన్నారు. వర్షాకాలం వచ్చిందంటే తీర ప్రాంతాల ప్రజల గుండెల్లో రైళ్లు పరుగులు పెడతాయి. జూన్ నెల నుంచి దాదాపుగా నాలుగైదు నెలల పాటు భయంభయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతారు. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండేళ్లు పూర్తవుతున్నా కరకట్టల కోసం కనీసం ఆలోచన చేయలేదు. నాగావళి వరద కట్టల పరిస్థితి.. నాగావళి జిల్లాలో 110 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. వరదలు వస్తే ఎక్కువగా బూర్జ మండలంలో లాభాం, బూర్జ, కా–ఖండ్యాం, ఆమదాలవలస మండలంలో దూసి, తొగరాం, ముద్దాడపేట, దూ సిపేట, తోటాడ, ఇసుకలపేట, శ్రీకాకుళం మండ లంలో బలగ, హయాతినగరం, ఫాజుల్బాగ్పేట, పెలసవీధులు దెబ్బ తింటాయి. అప్పుడెప్పుడో 2007లో వైఎస్సార్ హయాంలో కరకట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పటికీ ఈ పనులు పూర్తి చేయలేదు. భూసేకరణ పనులు పూర్తి కాకపోవడంతో కరకట్టల నిర్మాణంలో జాప్యం తప్పడం లేదు. వంశధార ఇలా.. జిల్లాలో వంశధార కొత్తూరు, హిరమండలం, ఎల్ఎన్పేట, సరుబుజ్జిలి, శ్రీకాకుళం, గార మండలాల్లో ప్రవహిస్తుంది. మన్యం పార్వతీపురం జిల్లా భామిని మండలం బత్తిలిలో మొదలుకుని శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలో గల గార మండలం వరకు అనేక గ్రామాలు చినుకుపడితే వణికి పోతున్నాయి. పనులు సులభంగా పూర్తి చేసేందుకు గాను వంశధార కరకట్టల పనులను నాలుగు ప్యాకేజీలుగా విడగొట్టారు. ఈ పనులు కొంతమేర జరిగినా.. పాలకులకు పూర్తి చేసే ఉద్దేశం లేకపోవడంతో తీర గ్రామాలకు ముంపు భయం తప్పడం లేదు. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం ఏటా వర్షాకాలం వచ్చిదంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తాం. చిన్న వరద వచ్చినా పొలాల్లోకి నీరు చేరిపోతోంది. దీంతో పంటన్నీ ముంపులో ఉండిపోయి పాడవుతున్నాయి. తరాలు మారిన రైతుల తలరాతలు మారడం లేదు. – తొత్తడి కృష్ణ, బూర్జ గ్రామం, నాగావళి నదీ తీర ప్రాంతం చర్యలు చేపడతాం వంశధార, నాగావళి కరకట్టల పరిధి నదీతీర ప్రాంత గ్రామాల్లో అత్యంత ప్రమాదకరమైన పాయింట్లు గుర్తించి ప్రభుత్వానికి పంపించాం. వంశధార ప్యాకేజీ–2 వాళ్లు ఎస్ఆర్ కనస్ట్రక్సన్స్ వాళ్లు భామిని మండలం, కొత్తూరు, హిరమండలం మండలాల్లో తుంగతంపర వరకు చేశారు. భూసేకరణ చేసి పేమెంట్స్ ఇచ్చిన ప్రాంతాల్లో పనులు చేస్తున్నాం. ప్యాకేజీ–1, 2 పనులు మాత్రమే వేగవంతం చేస్తున్నాం. వచ్చే సీజన్ నాటికి పూర్తిచేసేందుకు ప్రయత్నం చేస్తాం. – పొన్నాడ సుధాకర్, జల వనరులశాఖ ఈఈ, శ్రీకాకుళం జిల్లా -
తాగడంలో మనోళ్లు ధీరగం‘బీరు’లే..!
● రికార్డు స్థాయిలో 3 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు ● వేసవి సీజన్లో ఏకంగా రూ. 64.74 కోట్లకు పైగా ఆదాయం శ్రీకాకుళం క్రైమ్ : భగభగ మండే ఎండల్లో మద్యం రుచికి అలవాటు పడిన మందు ప్రియులు చల్లని బీర్ల వైపు మొగ్గుచూపారు. జిల్లాలో ఈ వేసవి సీజన్లో రికార్డు స్థాయిలో 3 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగినట్లు సంబంధిత జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపింది. ఏప్రిల్, మే నెలలోనే కాక జూన్ 10 వరకు బీర్ల అమ్మకాలు ద్వారా ఏకంగా రూ. 64.74 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు తెలిపారు. ఎండల తీవ్రత కారణంగా ఒక్క మే నెలలోనే మందుబాబులు 1,50,022 కేసుల బీర్లు గుటుక్కుమనిపించినట్లు పేర్కొన్నారు. -
తహసీల్దార్ కార్యాలయంలో నాగుపాము కలకలం
పాతపట్నం: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఉదయం నాగుపాము కలకలం రేపింది. తహసీల్దార్ కార్యాలయంలో మేడ మెట్ల వద్ద నుంచి తహసీల్దార్ ప్రసాదరావు వస్తుండగా పాము ఒక్కసారిగా లేచి బుసలు కొట్టింది. తహసీల్దార్, డీటీ బి.వెంకటరమణ ఆ సమయంలో ఉన్నారు. వెంటనే పాములు పట్టే వ్యక్తి హిరమండలం మండలం అవలంగి గ్రామానికి చెందిన లోలుగు వేణుగోపాలరావుకు ఫోన్ చేశారు. ఆయన తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నాగుపామును పట్టుకుని, దూరంగా ఉన్న అడవిలోకి విడిచిపెట్టారు. ఫిన్లాండ్ పర్యటనకు తిమ్మరాజు నీరజ, అరుణకుమారి శ్రీకాకుళం,జి.సిగడాం: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన 29 మంది టీచర్లకు అంతర్జాతీయ శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నగరానికి చెందిన వరం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో హిందీ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న నీరజా కుమారి, జి.సిగడాం మండలంలో పనిచేస్తున్న డాక్టర్ అరుణకుమారిలను ఫిన్లాండ్ పర్యటనకు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో అమరావతిలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. 29 మంది ఉత్తమ టీచర్లకు 3 దశల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు శిక్షణ శిబిరంలో తెలిపారు. ‘దళిత ఉపముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఖాయం’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): 2029లో ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వంలో కచ్చితంగా ఒక దళిత ఉపముఖ్యమంత్రి ఉంటారని, ఆ పదవి లో తాను ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని సామాజిక విప్లవకారుడు జడ శ్రావణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిర్లో ఆదివారం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విప్లవాల పురిటిగడ్డ శ్రీకాకుళం మట్టి సాక్షిగా తాను మాట ఇస్తున్నానని, 2029లో రాబోయే కొత్త ప్రభుత్వంలో దళిత ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న విభిన్న జాతులు, కులాలు, మతాలను ఒకే తాటిపైకి తెచ్చి సమాఖ్య రాజ్యాంగంగా రూపొందించిన చరిత్ర అంబేడ్కర్కు మాత్రమే దక్కుతుందని తెలిపారు. 1950 చట్టం ప్రకారం దళిత క్రైస్తవులకు లభించే ఎస్సీ హోదాను రద్దు చేసే హక్కు ఏ చట్టానికి లేదని ఆయన ఉద్ఘాటించారు. సమావేశంలో బొకర నారాయణరావు, దళిత, సామాజిక సంఘాల నాయకులు కళ్లేపల్లి రాంగోపాల్, దుర్గాసి గణేష్, మిస్క కృష్ణయ్య, రాయి వేణుగోపాల్, పొన్నాడ రుషి పాల్గొన్నారు. శ్రీకాకుళం కల్చరల్: యోగాంధ్ర వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్లో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నా రు. వైద్య సిబ్బందికి శారీరక ధృఢత్వం, మానసిక ఉల్లాసం ఎంతో అవసరమని, అందుకు యోగా చక్కటి మార్గమని అధికారులు పేర్కొన్నారు. -
నీటి సాధనకు పోరాటమే మార్గం
మందస: వంశధార నీటి సాధనకు పోరాటం ఒక్కటే మార్గమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. వంశధార నదీ జలాలను ఇచ్ఛాపురం వరకు పొడిగించాలని పలాస వంశధార జల సాధన కమిటీ ఆధ్వర్యంలో మార్పు మన్మధరావు అధ్యక్షతన మందస మండలం హరిపురం గ్రామంలో జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వంశధార నీరు ఇక్కడి వరకు వస్తే.. ఈ ప్రాంతంలో వలసలు ఉండవని, రైతుల జీవితాల్లో మార్పులు వస్తాయని తెలిపారు. అక్షల కోట్ల రూపాయలను పాలకులు వృధాగా అనేక కంపెనీలకు ఇస్తున్నారని, రైతులకు సహకారం ఇస్తే తప్పేంటని అన్నారు. ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసిన మందస గడ్డను స్ఫూర్తిగా తీసుకుని పోరా డాలని సూచించారు. అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఏఎఫ్టీయూ జాతీయ ఉపాధ్యక్షులు పి.ప్రసాద్ మాట్లాడుతూ ఏడు దశాబ్దాలుగా ఈ ప్రాంతం వలసలకు నిలయంగా మారిందన్నారు. కార్యక్రమంలో హేమరావు చౌదరి, ధర్మార్పు వెంకటరావు, సోమ నాథం, నల్ల హడ్డి, వంకల మాధరావు, సన్నశెట్టి రాజశేఖర్, డాక్టర్ ఖగేశ్వరరావు, బాబూరావు మాస్టారు పాల్గొన్నారు. -
అల..సంద్రపు దారిలో
● నేటి ఉదయం నుంచి చేపల వేట పునఃప్రారంభం ● ఇంకా అందని వేట నిషేధ కాల భృతి అరసవల్లి: సముద్రంలో చేపల వేట నిషేధ కాలం అర్ధరాత్రితో ముగిసింది. సోమవారం ఉదయం నుంచి మళ్లీ యథావిధిగా చేపల వేటకు వేళయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి ఈనెల 14 అర్ధరాత్రి (తెల్లారితే 15వ తేదీ) వరకు ఈ వేట నిషేధ కాలం అమల్లో ఉంది. దీంతో ఈ సమయంలో పూర్తిగా వేట నిషేధాంక్షల పరిధిలో మత్స్యకార ప్రాంతాలన్నీ మైరెన్ గస్తీ కాపలాల మధ్య ఉన్నా యి. అయితే ఈ నిషేధ కాలం ఆదివారం అర్ధరాత్రితో ముగియడంతో నేటి ఉదయం నుంచి వేటకు సన్నాహాలు చేసుకున్నారు. జిల్లాలో వేలాది మత్స్యకారులు తమ జీవనాధారమైన వేట కోసం ఇప్పటికే బోటు యంత్రాలను మరమ్మతు పనులు చేసుకోగా.. సంప్రదాయ బోట్లకు పెయింటింగ్ పనులతో పాటు పటిష్టపరిచేలా చర్యలు చేపట్టారు. వేటకు వీలుగా వలలను సిద్ధం చేసుకుంటున్నారు. అసంపూర్తిగా మత్స్యకార సేవలో.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు వేట మత్స్యకారుల బోటుకు గరిష్టంగా ఆరుగురు చొప్పున వేట నిషేధ భృతిగా ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున డీబీటీ విధానంలో వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేసేలా ‘మత్స్యకారుల సేవలో..’ పథకాన్ని అమ లు చేసింది. అయితే ఈ పథకం ద్వారా కొందరు అర్హులకే నగదు బదిలీ జరగడం విమర్శల పాలైంది. మొత్తం జిల్లాలో మొత్తం 11 మండలాల్లో 16,737 మందిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. అయితే నిషేధ కాలమైన 62 రోజులు ముగిసినప్పటికీ ఇంకా చాలా మందికి ఈ నగదు బదిలీ జరగకపోవడంతో జిల్లా మత్స్యకారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంకా వెరిఫికేషన్ ప్రాసెస్లోనే చాలావరకు దరఖాస్తులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారంటే.. పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్థమవుతోంది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి జేబులు నింపారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. అసలైన మత్స్యకారులకు కాకుండా రాజకీయ కారణాలతో ప్రభావితమైన వారి బ్యాంకు ఖాతాలకు ఈ వేట నిషేధ కాల భృతి జమ అయినట్లుగా గుర్తించారు. ఇదే తీరున గత ఏడాది కూడా వందలాది మందికి ఇలాగే తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అర్హుల జాబితాలోకి చేరిన వారికి జమ చేయడంపై ఫిర్యా దులు రావడంతో చాలామంది నుంచి ఈ సొమ్మును రికవరీ చేయించారు. ఈ మేరకు ఎచ్చెర్ల, కళింగపట్నం, రణస్థలం తదితర ప్రాంతాలకు చెందిన మత్స్యశాఖ అధికారుల పాత్రలపై కూడా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే ఇలా రికవరీ చేసిన మొత్తాన్ని తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఈ వ్యవహారంలో ఇన్చార్జి జిల్లా శాఖ బాధ్యతలు చేపట్టిన ఓ అధికారికి కూడా వాటాలున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై కొత్తగా డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సుమలత విచారణ చేపడితే అసలు వాస్తవాలు బయటపడే అవకాశాలున్నాయని మత్స్యకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
విద్యతోనే కాపుల అభివృద్ధి
● రాజకీయాలకు అతీతంగా ఏకమవుదాం ● శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభా కలిగిన తూర్పు కాపు సామాజిక వర్గం ఐక్యంగా ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్సార్సీపీ శాసన మండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని సప్తగిరి కల్యా ణ మండపంలో ఆదివారం తూర్పు కాపు ఆత్మగౌరవ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా తూర్పుకాపు సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలన్నారు. తాను ఏ ఇతర కులాలకు వ్యతిరేకం కాదని తూర్పు కాపు జాతి అభ్యున్నతికి ప్రతి ఒక్కరం జీవితం ఇవ్వాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. విద్యతోనే జాతి అభివృద్ధి జరుగుతుందన్నారు. విద్యతోనే పరిపుష్టి విద్యతోనే తూర్పుకాపుల ఆర్థిక పరిపుష్టి సాధ్య పడుతుందని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. 35 రోజుల్లో తన కోసం నిరంతరం పనిచేసి గెలుపునకు బాటలు వేసి శాస నమండలికి పంపించడం తూర్పు కాపు జాతి గొప్పదనమని తెలిపారు. తూర్పు కాపు జాతిని విభజించి పాలించి వెనకబడేలా చేస్తున్నారని మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ ఆనెపు రామకృష్ణం నా యుడు ఆవేదన వ్యక్తం చేశారు. దేశస్థాయి నాయకులుగా గొర్లె శ్రీరాములనాయుడు, బొత్స సత్యనారాయణలు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని గొప్ప గౌరవాన్ని పొందారన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగేలోపే కాపు జాతికి రావాల్సిన పద్ధతిలో రాజకీయ పదవులు వచ్చేలా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పలువురు కాపు నేతలు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో తూర్పు కాపులకు సామాజిక భవనం చాలా అవసరమని తెలిపారు. పలు తీర్మానాలు.. జనాభా ప్రాతిపదికన రాజకీయ, ఉద్యోగ, అవకాశాలు రిజర్వేషన్ హక్కులను కాపాడుకోవాలని, తూర్పు కాపులపై జరుగుతున్న దాడులు, బాధితులకు అండగా ఉండడం, బాధితులకు సామాజిక న్యాయం అందించడం చేయాలని తీర్మానించారు. సుడా చైర్మన్ కొరికాన రవికుమార్కు జరిగిన అవమానంపై నిరసన, భవిష్యత్లో ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలని కూటమి నేతలకు విజ్ఞప్తి చేయడం వంటివి తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్, ఆమదావలస నియోజకవర్గ పరిశీలకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, శ్రీకాకుళం నియోజకవర్గ పరిశీలకులు పిన్నింటి సాయికుమార్, డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, జిల్లా తూర్పు కాపు సామాజిక వర్గం ప్రతినిధులు సురంగి మోహన్ రావు, శాసఫు జోగినాయుడు, పాండ్రంకి శంకర్, రౌతు సింహాచలం, డాక్టర్ ఎం.రామ జోగినాయుడు, కిల్లారి నారాయణరావు, అంకడాల తవిటన్న, పడాల తమ్మి నాయుడు, డాక్టర్ ప్రసన్నకుమార్, డోల తిరుమలరావు, వంజరాపు రమేష్, మక్కా శ్రీనివాస్, కెల్ల చిన్ని, అల్లు యుగంధర్, ప్రభాకర్, జె.ఎస్.రాజులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తూర్పుకాపు సామాజిక వర్గం ప్రతినిధులు హాజరయ్యారు. -
దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ల నిరాకరణ అన్యాయం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): క్రైస్తవులమని, చర్చికి వెళ్తున్నామని కారణం చూపి ఇటీవల కాలంలో దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు నిరాకరిస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జిల్లా దళిత సంఘాల జేఏసీ (జేఏసీ) నాయకులు బొకర నారాయణరావు, కళ్లేపల్లి రాంగోపాల్, బడే కామరాజు, మిస్కా కృష్ణయ్య, దుర్గాసి గణేష్, యర్ర గడ్డయ్య అన్నారు. శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతాల వారికే ఎస్సీ హోదా వర్తిస్తుందనే నిబంధనను సాకుగా చూపి, దళిత క్రైస్తవులను రాజ్యాంగబద్ధమైన హక్కులకు దూరం చేయడం అన్యాయమన్నారు. ‘మతం మారినంత మాత్రాన కులం మారదు. సమాజంలో అంటరానితనం, వివక్ష పోవు’ అనే సత్యాన్ని సుప్రీంకోర్టు సైతం గతంలో ప్రస్తావించిందని వారు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5గంటలకు అంబేడ్కర్ విజ్ఞాన మందిర్లో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యవక్తగా హైకోర్టు న్యాయవాది, రిటైర్డ్ జడ్జి జడ శ్రావణ్కుమార్ హాజరవుతారని పేర్కొన్నారు. -
ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల
ఎచ్చెర్ల: రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కారక్రమంలో ప్రవేశాల కోసం ప్రొవిజనల్ ఎంపిక జాబి తా విడుదలైంది. క్యాంపస్ల వారీగా కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. శ్రీకాకుళం క్యాంపస్లో జూన్ 23, 24వ తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. జూలై 1వ తేదీనుంచి తరగతు లు ప్రారంభం కానున్నాయి. ధ్రువీకరణ పత్రా ల పరిశీలన అనంతరం ప్రవేశాలను ఖరారు చేయనున్నారు. ఎంపికై న అభ్యర్థులు నోటిఫై చేసిన షెడ్యూల్ ప్రకారం సంబంధిత కౌన్సిలింగ్ కేంద్రాలకు అవసరమైన అన్ని అసలు ధ్రువీ కరణ పత్రాలతో హాజరుకావాల్సి ఉంటుందని ఆర్టీయూకేటీ ఏపీయూజీ ప్రవేశాల కన్వీనర్ ప్రొఫెసర్ అమరేంద్రకుమార్ తెలిపారు. అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మాసశివరాత్రి సందర్భంగా శివపంచాయతన సహిత మహాలింగార్చనను శనివారం ఉదయం స్థానిక అనివెట్టి మండపంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకు లు ఇప్పిలి సాందీప్శర్మ లింగార్చనను శా స్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని గోత్రనామాలతో పూజలు జరిపించుకున్నారు. అలా గే శనిత్రయోదశి కూడా కావడంతో భక్తులు నవగ్రహ మండపంలో ప్రత్యేకంగా పూజలు జరిపించుకున్నారు. శనిగ్రహ దోష పూజలు, తైలాభిషేకాన్ని చేయించారు. అర్చకులు కిరణ్శర్మ, హరిప్రసాద్ శర్మలు ప్రత్యేకంగా భక్తుల పేరిట పూజలు నిర్వహించారు. మందస: రాంపురం గ్రామంలో ప్రజలు కార్గో ఎయిర్పోర్టుకు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారనేది అవాస్తవమని ఆ గ్రామ రైతు లు స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచా రాలు మానుకోవాలని, భూములు ఇచ్చేదే లేదని వారు తేల్చి చెప్పారు. గత 20 నెలలుగా తాము ఎన్నో విధాలుగా నిరసనలు తెలుపుతున్నామని, కలెక్టర్, ఎమ్మెల్యేలకు ఇతర అధికారులకు కూడా స్పష్టంగా తమ అభిప్రాయాలను చెప్పామని తెలియజేశారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఆపాలని, కార్గో ఎయిర్పోర్టు కోసం భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని అన్నారు. కార్యక్రమంలో బాధిత రైతులు దున్న రామారావు, మర్ల సంతోష్, జుత్తు భూపతి, తామాడ వా సు, జోగారావు, సురేష్, ఎర్రయ్య, కీలు కాంతమ్మ, రామస్వామి, కూర్మారావు, కృష్ణరావు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. హిరమండలం: మండలంలోని కల్లట గ్రామానికి చెందిన బలగ అభి షేక్ ఇటీవల నిర్వహించిన యూపీఎస్సీలో అసిస్టెంట్ కమాండెంట్(సీఏపీఎఫ్) ఉద్యో గం సాధించాడు. దేశ భద్రత కోసం, దేశ సేవ కు ఎంపిక కావడం గర్వకారణంగా ఉందని అభిషేక్ తెలిపారు. అభిషేక్ ఎంపికపై గ్రామస్తులు అభినందించారు. మెళియాపుట్టి: పెద్దమడి గురుకుల జూనియర్ కళాశాలలో(బాలురు) మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ స్వప్నిల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఎంపీసీ–10, బైపీసీ 11, సీఈసీ–12 మొత్తం 33 మిగులు సీట్లకు పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత చెందిన గిరిజన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, మెరిట్ విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఈనెల 24వ తేదీన కౌన్సెలింగ్కు సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరవ్వాలని పేర్కొన్నారు. -
రాజకీయ కుట్రతోనే తమ్మినేనిపై ఆరోపణలు
ఆమదాలవలస: మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని, ఆయనపై చేస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలు పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమేనని వైఎస్సార్ సీపీ యువ నాయకుడు తమ్మినేని చిరంజీవినాగ్ హెచ్చరించారు. ఆమదాలవలసలోని తన స్వగృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం–పాలకొండ ప్రధాన రహదారి పక్కన ఆమదాలవలస పట్టణ నడిబొడ్డున తమ కుటుంబం సుమారు 25 ఏళ్ల క్రితమే స్థిర నివాసం ఏర్పర్చుకుందన్నారు. అదే ప్రాంతంలో సుమారు 15 ఏళ్ల కిందట విద్యాసంస్థను స్థాపించినట్లు వివరించారు. తమ కళాశాల వెనుక భాగంలో సుమారు 40 సెంట్ల స్థలాన్ని తమ్మినేని సీతారాం చట్టబద్ధంగా కొనుగోలు చేశారని, ఆ స్థలంలోని కొంత భాగంలో కళాశాలకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. అయితే మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమికి సబ్ డివిజన్ జరగకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని, దీనిని ఆసరాగా చేసుకుని తమ కుటుంబంపై భూ ఆక్రమణ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు గతంలోనూ పలుమార్లు జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేశారని, సంబంధిత అధికారులు భూమి హద్దులు, భూ రికార్డులు, పత్రాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల జరుగుతున్న భూముల రీ–సర్వే ప్రక్రియలో తమకు సంబంధించిన భూమి హద్దులను అధికారులకు తెలియజేసేందుకు వెళ్లిన సమయంలో సబ్ డివిజన్ కాని మొత్తం భూమిపై కొందరు వ్యక్తులు హక్కులు ప్రకటిస్తూ వివాదానికి తెరలేపారని ఆరోపించారు. ఇదే సమయంలో కొందరు వ్యక్తిగత, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వివాదం రాజేశారని పేర్కొన్నారు. మీడియా ముసుగులో రాజకీయ కుట్రలకు పాల్పడుతున్న స్వార్థపరులకు తగిన సమయంలో తగిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నాయకుడు బగ్గు కుమార్ పాల్గొన్నారు. -
‘ఉపాధిని యథావిధిగా అమలు చేయాలి’
పలాస: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని ప్రగతి శీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బొడ్డపాడు జిల్లా అమరవీరుల స్మారక భవనం వద్ద శనివారం ఆ సంఘం రాష్ట్ర 9వ మహాసభల కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అద్యక్షురాలు బదకల ఈశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు 33శాతం మహిళలకు రిజర్వేషన్ను అమలు చేయాలని కోరారు. మహిళలను పిల్లలను యంత్రాలుగా చూడటం మానుకోవాలని కోరారు. మహిళలు పోరాటాల వల్లనే రిజర్వేషన్ బిల్లు అమలకు నోచుకుంటుందన్నారు. మహిళలు, దళితులు, ఆదివాసీలకు ఉపా ధి, ఆదాయం, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఈ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా ఉందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు వంకల ఢిల్లేశ్వరి, లలిత, వరాలమ్మ, కళావతి పాణిగ్రాహి, హేమావతి, పార్వతి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. కరపత్రాలు ఆవిష్కరిస్తున్న మహిళలు -
‘ప్రభుత్వంపై వ్యతిరేకత సుస్పష్టం’
నరసన్నపేట: కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్య లు, ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతో కూటమి పాలనపై ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ‘చంద్రబాబు వెన్నుపోటు కు రెండేళ్లు’ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా 8 నియోజవర్గాల్లో విజయవంతమైందని ఆయ న ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టిన ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అనేక ఆంక్షలు పెట్టినా, కేసులు పెడతామని బెదిరించినా ప్రజలు లెక్క చేయలేదని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిరస న కార్యక్రమాలను సమన్వయం చేసి విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన నియోజకవర్గ సమన్వయ కర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ కమిటీల అధ్యక్షులు, సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ అన్ని స్థాయిల నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యుత్ షాక్
మరమ్మతులు చేస్తుండగా ● స్తంభం నుంచి కిందపడి ప్రైవే ట్ లైన్మేన్కు తీవ్ర గాయాలు ● మూడు గంటల పాటు ఘటనా స్థలంలోనే నరకయాతన మెళియాపుట్టి: మాకనాపల్లి గ్రామానికి చెందిన ప్రైవేటు లైన్మేన్ ఇప్పిలి మోహన్ విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా షాక్కు గురై కిందపడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మెళియాపుట్టి మండల కేంద్రంలో శుక్రవారం వీచిన ఈదురు గాలులకు విద్యుత్ అంతరాయం కలగడంతో మోహన్ మరమ్మతులు చేయడానికి శనివారం రట్టిణి గ్రామం వెళ్లాడు. ఇంతలో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై కిందపడ్డాడు. సాయంత్రం 5.35 గంటలకు ఘటన జరగ్గా.. పడిపోయిన చోటే 8 గంటల వరకు ఉన్నాడు. అంబులెన్స్ సైతం రాకపోవడంతో చివరికి బొలెరో వాహనంలో మంచంపై వేసుకుని మెళియాపుట్టి పీహెచ్సీకి తరలించారు. మెరుగైన చికిత్స కోసం టెక్కలి ఆస్పత్రికి తరలించారు. వెన్నెముకకు బలమైన గాయమైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగి మూడు గంటలపాటు పడిన చోటే నరకం అనుభవించినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదనీ గ్రామస్తులు, మోహన్ భార్య దివ్య ఆవేదన ద్యక్తం చేసింది. 108కు సమాచారం ఇస్తే లైన్స్ బిజీగా ఉన్నాయని, చివరికి వజ్రపుకొత్తూరు అంబులెన్స్ ఆసుపత్రి వద్దకు వచ్చిందని రట్టిణి యువకులు చెబుతున్నారు. -
ఉద్యోగులకు ప్రాణ సంకటం
సర్కారు చెలగాటం ఒక సర్వే పూర్తయిన వెంటనే మరొకటి.. అదయ్యాక ఇంకొకటి.. అంటూ సచివాలయ ఉద్యోగులను ఊరంతా తిప్పిస్తున్నారు. ఇతర శాఖల బాధ్యతలు కూడా సచివాలయాల ఉద్యోగులకే అప్పగిస్తున్నారు. ఉద్యోగం చేయలేక, మాను కోలేక తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నా రు. పని ఒత్తిడి ఎక్కువై అనారోగ్యానికి గురవుతున్నారు. గత కొంతకాలంగా ఈ తరహా మానసిక క్షోభతో 70మందికి పైగా సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పని గంటలు కూడా ఇతిమిద్ధంగా లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఎంఏ, ఎంఈడీ, ఎంటెక్లు తదితర ఉన్నత చదువులు చదివి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలా? అని ఆవేదన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : విపరీతమైన పని ఒత్తిడి.. అంతకుమించి మానసిక ఒత్తిడితో సచివాలయ ఉద్యోగులు చిత్తయిపోతున్నారు. పేరుకు ప్రభుత్వ ఉద్యోగులే గానీ సర్కారు పెడుతున్న క్షోభతో వీరు విసిగిపోతున్నారు. తీవ్ర పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా సచివాలయాలు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకోవైపు సర్వేల పేరు తో వచ్చి ఓటీపీలు అడగడమే తప్ప సంక్షేమ పథ కాలు రావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఓటీపీలు తప్ప సంక్షేమం ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకోలేక, ప్రభుత్వం అప్పగించిన బాద్యతలు పూర్తి చేసేందుకు సహకారం లేక నరకయాతన అనుభవిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల దీన స్థితి ఒక వైపైతే.. రెండో కోణం చూస్తే ప్రజలది. ముఖ్యంగా లబ్ధిదారులది. రకారకాల సర్వేలతో సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వస్తున్నారు. తరచూ వివరాలు అడుగుతున్నా రు. యాప్ల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆన్లైన్ చేశాక ఓటీపీలు పంపిస్తున్నారు. ఆ ఓటీపీలు తిరిగి హౌస్ హోల్డర్స్ చెప్పాల్సి వస్తోంది. అయితే ఎన్ని ఓటీపీలు చెప్పినా.. ఆ మేరకు లబ్ధి కనిపించకపోవడంతో అంతా విస్తుపోతున్నారు. దీనికి తోడు సాంకేతిక సమస్యలు రావడం, వివరాలు మళ్లీ అడగడం, జనరేట్ చేశాక వచ్చాక ఓటీపీలను మళ్లీ అడగడం, హౌస్ హోల్డర్స్ చెప్పడం నిరంతర ప్రక్రియగా మారిపోయింది. సంక్షేమ పథకాల కోసం వివరాలు సేకరిస్తున్నామని చెబుతున్నారే గానీ.. పథకాలు మాత్రం రావడం లేదు. ఒక పథకం కోసం అనేక పర్యాయాలు వచ్చి వివరాలు సేకరిస్తూ ఓటీపీలు తీసుకుంటున్నా.. ఖాతాలో రూపాయి కూడా పడ డం లేదు. వరుస సర్వేలకు సమాధానాలు చెప్పలేక.. కొంతమందైతే ఎందుకు చెప్పాలి.. ఏం చేస్తార ని చెప్పాలి అంటూ ఎదురు తిరిగి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఒకవైపు పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, వేధింపులు.. మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు వెరసి సచివాలయం ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆఖరుకు సెలవులు కూడా ఇవ్వని దీన స్థితి నెలకొంది. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
శ్రీకాకుళం కల్చరల్: యోగాంధ్ర 2026 వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీకాకుళం కార్గిల్ పార్కులో ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. గురుకుల పాఠశాల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై యోగాసనాలు వేశారు. షిర్డీ సాయి యోగ కేంద్రం శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది పలు రకాల ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులను నేర్పించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణకు కృషి పాతపట్నం: గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణకు సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు. పాతపట్నం మండలం చిన్నమల్లిపురంలో సత్యసాయి బాబా మందిరం వద్ద శ్రీసత్యసాయి ట్రైబుల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాంను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గర్భిణులకు, బాలింతలకు, మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సుమారు 70 గిరిజన గ్రామాల్లో మూడేళ్ల పాటు ప్రణాళిక రూపొందించామన్నారు. శ్రీకా కుళం జిల్లాలో ఆరు గిరిజన గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు, కో–ఆర్డినేటర్ పప్పల నాగేశ్వరరావు, ఎన్.లలిత, కె.వి.రమణమూర్తి, బి.నర్సింహమూర్తి, అన్నంనాయుడు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. సరిహద్దులో వాహనాల తనిఖీ పాతపట్నం: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు చెక్పోస్టు వద్ద పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.సన్యాసినాయుడు శనివారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు ఉంచుకోవాలని, పరిమితికి మించిన లోడుతో వాహనాలను నడపవద్దని చెప్పారు. మాజీ సైనికుల సేవలు అభినందనీయం శ్రీకాకుళం కల్చరల్ : డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం సేవలు అభినందనీయమని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావు అన్నారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్త రోడ్ ఆర్మీ క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసి మజ్జిగ చలివేంద్రం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బాటసారులకు, వాహన చోదకులకు వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించాలనే దృక్పథంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం మాట్లాడుతూ జీవితాంతం ప్రజాసేవలో నిమగ్నమవుతామన్నారు. కార్యక్రమంలో చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు, క్యాంటీన్ మేనేజర్ పప్పల గోవిందరావు, లయన్ పొన్నాడ రవి, లయన్ నటుకుల మోహన్, మీడియా ప్రతినిధి జోగి నాయుడు, జనరల్ సెక్రటరీ పి.మురళీధరరావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్.రామకృష్ణ, కోశాధికారి ఎం.సింహాచలం, మహిళా సెక్రటరీ డి.భారతి, జి.అమ్మన్నమ్మ, కె.జగ్గమ్మ, ఎ.లక్ష్మి, పి.జమున, పి.లీలాకుమారి, జి.సౌజన్య, పి.భారతమ్మ, ఎం.ఈశ్వరమ్మ, జి.అరుణ, ఎం.లలితకుమారి, బి.భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్బాల్ క్రీడకు విశేష ఆదరణ
శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లాలో సాఫ్ట్బాల్ క్రీడకు గణనీయమైన ఆదరణ లభిస్తోందని సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు సూర శ్రీనివాసరావు అన్నారు. స్థానిక హోటల్లో శనివారం ప్రపంచ సాఫ్ట్బాల్ దినోత్సవం పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాఫ్ట్బాల్ క్రీడను జిల్లాలో మరింత విస్తృతంగా అభివృద్ధి చేయాలని, గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలన్నారు. సీనియర్ న్యాయవాది, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ అన్నెపు భువనేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుండటం శుభపరిణామమని ఆకాంక్షించారు. సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ మొజ్జాడ వెంకటరమణ మాట్లాడుతూ దశాబ్దంన్నర కాలంలో జిల్లాలో సాఫ్ట్బాల్ క్రీడ పురోగతిని వివరించారు. కార్యక్రమంలో సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు మెట్ట తిరుపతిరావు, కోశాధికారి ఎం.ఆనంద్ కిరణ్, సభ్యులు బి.శ్రీనివాస్, జి.రాజశేఖర్, డాక్టర్ పి.రమేష్, ఏ.రాజగోపాల్, సతీష్రాయుడు, బాబూరావు, హరికృష్ణ, క్రీడాకారులు, శిక్షకులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉద్యమ ధ్రువతార మార్పు బాలకృష్ణమ్మ
వజ్రపుకొత్తూరు రూరల్: ఉపాధ్యాయ హక్కుల కోసం ఎనలేని పోరాటం చేసి ఉపాధ్యాయ ఉద్యమ ధ్రువతారగా కామ్రేడ్ మార్పు బాలకృష్ణమ్మ నిలిచారని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మామిడి భుజంగరావు అన్నారు. వజ్రపుకొత్తూరులో శనివారం బాలకృష్ణమ్మ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. విద్యారంగానికి బాలకృష్ణమ్మ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయ నాయకులు మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతంలో పుట్టి ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన విద్యారంగ పరిరక్షణకు ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఉద్యమానికి ఊపిరి పోశారని కొనియాడారు. బాలకృష్ణమ్మ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ సమస్యల సాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు కలిశెట్టి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గున్న సుభాష్, రాష్ట్ర కౌన్సిలర్ ఉదయ్కుమార్, కార్యవర్గ సభ్యులు భీమారావు, కృష్ణారావు, రవి, జగదీష్, అప్పారావు, హరికృష్ట, అనిల్, నర్సింహమూర్తి, రమణ పాల్గొన్నారు. -
నగర కుల విద్యార్థులకు ఉపకార వేతనాలు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో నగర కులానికి చెంది పదో తరగతి, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా స్కాలర్షిప్లు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు జిల్లా నగరాల సంఘం కార్యదర్శి పండు రాజగోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురికి, ఇంటర్మీడియెట్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అత్యధిక మార్కులు సాధించిన ఆరుగురికి ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత గల వారు మార్కుల జాబితా జిరాక్స్ కాపీలు, ఫోన్ నంబర్ వివరాలను ఈ నెల 25లోగా 94404 59656, 96037 09549 నంబర్లకు పంపించాలని కోరారు. అప్పలనాయుడుకు ఏఈఓగా పదోన్నతి అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న గడి అప్పలనాయుడు (నిద్దాం నాయుడు)కు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఏఈవో)గా పదోన్నతి కల్పిస్తూ దేవదాయశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్ హోదా గల అరసవల్లి ఆలయంలో ఏఈవో పోస్టు మంజూరు కావాల్సి ఉంది. అయితే ఈ క్యాడర్స్ట్రెంత్ త్వరలోనే అమలు కానున్న నేపథ్యంలో తొలిసారిగా ఏఈవోగా అప్పలనాయుడు ఇక్కడే విధులు నిర్వర్తించే అవకాశముంది. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రణస్థలం: శ్యాంపిస్టన్స్ యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వరిసాం వద్ద శ్యాంపిస్టన్స్ ప్లాంట్ – 2 పరిశ్రమ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో పరిశ్రమ వద్ద శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలు, గ్రామ పంచాయతీ పెద్దలు, కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ పరిశ్రమలో 600 మంది కార్మిక కుటుంబాలకు అన్యాయం జరుగుతోందన్నారు. 58 ఏళ్ల వరకు కార్మికులకు సర్వీస్ ఉంటుండగానే 30 ఏళ్ల సర్వీస్ పూర్తయిందని 150 మంది కార్మికులను 50 ఏళ్లకే ఉద్యోగాలు నుంచి తొలగించడం సరికాదన్నారు. ధరలు పెరుగుతున్నా ఎనిమిదేళ్లుగా వేతన ఒప్పందం జరగడం లేదన్నారు. వేతనాలు కూడా మూడు నెలలకోసారి ఇస్తున్నారని చెప్పారు. ఏప్రిల్, మే నెలల పెండింగ్ వేతనాలు వెంటనే డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరినందుకు అన్యాయంగా ఏడుగురు యూనియన్ నాయకులను ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. సమావేశంలో పైడిభీమవరం మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకులు లంకలపల్లి ప్రసాదరావు, ఎంపీటీసీలు ఆకలి శ్రీనివాసనావు, ఎం.దుర్గారావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, వివిధ సంఘాల నాయకులు కె.కళ్యాణి, మణికొండ ఆదినారాయణ, ఎన్.వి.రమణ, పి.రామకృష్ణ, అంబటి సత్యనారాయణ, ఎస్.లక్ష్మణరావు, ఎం.అప్పలనర్సయ్య, గొర్లె కిరణ్, ఆర్.ఎస్.నాయుడు, జీరు రాము, బి.తోటయ్య, ఎం.కూర్మారావు, ఎన్.నాగేశ్వరరావు, కె.జోగేష్ తదితరులు పాల్గొన్నారు. -
తప్పిన ప్రమాదం
నందిగాం: గ్రానైట్ బ్లాక్తో వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో బ్లాక్ ముందుకు జరిగి క్యాబిన్ వరకు వచ్చి ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. వివరాలను పరిశీలిస్తే.. కోటబొమ్మాళి మండలం కొత్తపల్లికి చెందిన మిత్ర గ్రానైట్కు చెందిన 36 టన్నుల బ్లాక్ను లారీలో నందిగాం మండలం కొండతెంబూరు వద్ద ఉన్న సన్ ఇండియా గ్రానైట్ పాలిషింగ్ యూనిట్కు తరలిస్తుండగా నందిగాం వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో, గ్రానైట్ తరలిస్తున్న లారీ డ్రైవర్ కూడా సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. దీంతో గ్రానైట్ బ్లాక్ ముందుకు జరిగి డ్రైవర్ క్యాబిన్ వర కు వెళ్లి ఆగింది. దీంతో ప్రమాదం తప్పింది. అనంతరం క్రేన్ల సాయంతో బ్లాక్ను వెనక్కి జరిపారు. -
భర్తకు తలకొరివి పెట్టిన భార్య
టెక్కలి: బొప్పాయిపురం పంచాయతీ నీలాపురం గ్రామానికి చెందిన మహాన్యూస్ రిపోర్టర్ కుప్పిలి ఉదయ్కుమార్ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. అంత్యక్రియల్లో భాగంగా ఆయన భార్య తలకొరివి పెట్టారు. ఈయనకు భార్యతో ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సీనియర్ జర్నలిస్టు బెండి నరసింగరావు, కోట రాము, పలువురు జర్నలిస్టులు నివాళులు అర్పించారు. బస్సు ఢీకొని మహిళ మృతి నందిగాం: నందిగాం పరిధిలో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలి మండలం ఇజ్జవరం పంచాయతీ రాజగోపాలపురం గ్రామానికి చెందిన జడ్యాడ అనసూయమ్మ(55) మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనసూయమ్మ కొద్ది రోజులుగా కాలినొప్పితో బాధపడుతుండటంతో చిన్న కుమారుడు ఉమాపతితో కలిసి ద్విచక్ర వాహనంపై పలాసలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లింది. చికిత్స అనంతరం తిరిగి గ్రామానికి వస్తుండగా నందిగాం దాటాక ఇరుకుగా ఉన్న ఖానా వద్దకు వచ్చేసరికి తమిళనాడు ఊసూర్కు చెందిన స్పార్క్ మిండా కంపెనీ పశ్చిమబెంగాళ్ నుంచి కార్మికులను తీసుకువస్తున్న బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న అనసూయమ్మ కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఉమాపతికి చెయ్యి విరిగిపోవడంతో హైవే అంబులెన్స్లో టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అనసూయమ్మకు భర్త దామోదరరావు, ముగ్గురు కుమారులు ఉన్నారు. నందిగాం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
త్వరగా పంపిణీ చేయాలి
పాఠశాలలు పునఃప్రారంభం నాడే విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు అందిస్తే బాగుంటుంది. ప్రస్తుతం యూనిఫాం, బూట్లు సరఫరా లేకపోవడంతో విద్యార్థులు పాత యూనిఫామ్తోనే బడికి వస్తున్నారు. సాధ్యమైనంత వేగంగా యూనిఫామ్, బూట్లు అందిస్తే విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా ఉంటుంది. – తమ్మినాన చందనరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్కూల్ టీచర్స్ అసోషియేషన్ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పథకాన్ని కాపీ కొట్టిన టీడీపీ ప్రభుత్వం కిట్లు పంపిణీ విషయంలో మాత్రం పాఠశాలలు పునః ప్రారంభం నాటికి అందించలేకపోతోంది. ఆ కిట్లు ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. విద్యార్థుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి వెంటనే కిట్లు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. – పిరియా విజయ, జెడ్పీ చైర్పర్సన్, శ్రీకాకుళం -
ఎరువుకూ యాప్సోపాలే
● ఎరువుల వినియోగంపై కొత్తరాగం అందుకున్న ప్రభుత్వం ● ఏపీఏఐఎంఎస్ యాప్లో నమోదైతేనే ఎరువులు హిరమండలం: ఖరీఫ్ సీజన్లో యూరియా వినియోగాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. డిమాండ్కు తగ్గట్లు యారియా సరఫరా చేయడంలో చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం యాప్ ద్వారా అమ్మకాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్ పేరుతో యాప్ను తీసుకొచ్చింది. యారియా వినియోగించడం వల్ల అనర్థాలు ఉన్నాయని, పంటలు విషతుల్యం అవుతాయని, పండించిన పంటలకు ధరలు లభించవని గత ఏడాది రైతులను నేతలు భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఏడాది యాప్ ద్వారా రైతులను ఇక్కట్లకు గురిచేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే జరిగితే కౌలు దారులు, ఎండోమెంట్, ఇనామ్, ఆర్వోఎఫ్ఆర్ భూముల ను అనుభవిస్తున్న రైతులకు యూరియా, డీఏపీ అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే మొదలైంది. యాప్ ద్వారానే అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆదేశించడంతో యారియా ఎక్కడా లభించని పరిస్థితి ఏర్పడింది. ఈ యాప్లో గత ఖరీఫ్ ఈ క్రాప్ డేటా మొత్తం వస్తుంది. గత ఏడాది పత్తిసాగు చేసి ఈసారి కూడా పత్తి సాగు చేస్తే యూరి యా ఎకరాకి ఎంత అవసరమో శాస్త్రవేత్త రెకమెండేషన్ ఉంటుంది. ఈ పంట మారిస్తే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఈ సారి సాగు చేయబోయే పంటను ఎంటర్ చేస్తే ఆ పంటకు ఎన్ని బస్తాలు యూరి యా అవసరమో సిఫార్సు వస్తుంది. మొత్తం యూరియా, డీఏపీలను మూడు డోసులుగా రైతులకు ఇస్తారు. డోస్కు డోస్కు మధ్య 20 రోజుల గ్యాప్ తప్పనిసరి. జిల్లాలో ఖరీఫ్ విస్తీర్ణం 4,59,628 ఎకరాల్లో ఉండగా అందులో వరి సాగు 4,30450 ఎకరాల్లో మెక్కజొన్న 23, 867 ఎకరాల్లో, పత్తి 3140 ఎకరాల్లో సాగు చేస్తారు. మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు వేస్తారు. అయితే వీటికి దాదాపు యూరి యా 41,366 మెట్రిక్ టన్నులు అవసరం. యాప్ ద్వారా విక్రయిస్తే 21వేల టన్నులకే పరిమితం చేయవచ్చుననేది ప్రభుత్వం ఆలోచన. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నకు ఎకరాకు 5 నుంచి 6 బస్తాలు యారియా వినియోగిస్తారు. అయి తే యాప్ ద్వారా ఎకరాలకు 3 బస్తాలకే పరిమితం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రైతుల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉంది. -
గోపి కుటుంబానికి రూ.2 లక్షల సాయం
ఎచ్చెర్ల : వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ అన్నారు. ఫరీదుపేటలో మృతిచెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు సత్తారు గోపి కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున మంజూరైన రూ.2 లక్షల చెక్ను శుక్రవారం అందజేశారు. మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చెక్కును అందజేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మొదలవలస చిరంజీవి, డోల వెంకటరమణ, లీగల్సెల్ అధ్యక్షుడు కోటిపాత్రుని శివకుమార్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 68 వాహనాలు.. రూ.2.01 లక్షలు ఆదాయం శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం పోలీస్, రెవెన్యూ, రోడ్డు రవాణా విభాగాలు సంయుక్తంగా ద్విచక్ర వాహనాల వేలం నిర్వహించాయి. ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో యజమానులు ఎవరో తెలియని ద్విచక్రవాహనాలు 68 పట్టుబడటంతో ఈ వేలాన్ని నిర్వహించగా జిల్లా నుంచే కాక విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి 27 మంది వేలంలో పాల్గొని రూ.2,01,300లకు వాహన దక్కించుకున్నారని ట్రాఫిక్ సీఐ వి.రామారావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ, ఆర్టీవో గంగాధర్, ఆర్ఐ లింగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లు మెళియాపుట్టి: మండల కేంద్రం మెళియాపుట్టిలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మర్రిపాడు–సి(మెళియాపుట్టి –నౌపడ రహదారి), పలాస–పూండి రహదారుల్లో ఎక్కడికక్కడ చెట్లు నేలకొరిగాయి. దీంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మామిడికాయలు నేలరాలడంతో రైతులు ఆందోళన చెందారు.డివిజనల్ రైల్వే మేనేజర్ విస్తృత తనిఖీలు మందస: ఇచ్ఛాపురం–పలాస సెక్షన్లో విశాఖపట్నం అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ కుందు రామారావు మందస మండలంలో హరిపురంలోని మందస రైల్వే స్టేషన్లో శుక్రవారం విస్తృత తనిఖీలు చేశారు. లెవెల్ క్రాసింగ్ గేట్ల స్థానంలో అండర్, ఓవర్ బ్రిడ్జి వంతెనల నిర్మాణానికి తక్షణం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దిగువ స్థాయి శ్రేణి సిబ్బంది సమస్యలు, ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. కొబ్బరి చెట్టుపై పిడుగు పాతపట్నం: పాతపట్నం మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో సుమారు గంట పాటు బీభత్సం సృష్టించింది. ప్రహరాజపాలెంలోని ఎంపీపీ పాఠశాల వెనక ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో మంటల్లో కాలిపోయింది. -
ఆపద్బాంధవులు
శ్రీకాకుళం కల్చరల్ : రోడ్డు ప్రమాదాలు, అత్యవసర ఆపరేషన్లు సమయంలో సకాలంలో రక్తం అందక ఎంతోమంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతమందిని కలిసినా రక్తం యూనిట్లు అందక కుటుంబ సభ్యులు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. అతికష్టమ్మీద కొందరు మాత్రమే రక్తం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు తప్ప అవగాహన లేమి, భయం, సమాచార లోపం కారణంగా రక్తదానం చేసేందుకు చాలా మంది ముందుకు రావడం లేదు. జిల్లాకు ఏడాదికి దాదాపు 60వేల యూనిట్ల రక్తం అవసరం. సేకరిస్తున్నది మాత్రం కేవలం 16 వేల యూనిట్లే. ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దే ప్రక్రియ జరగడం లేదు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే సమస్య పరిష్కారానికి ఆస్కారం ఉంటుంది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ రక్తదాన శిబిరాల ఆవశ్యకత వివరిస్తున్నారు. నేను కూడా రక్తదానం చేస్తున్నా. – పి.చైతన్యకుమార్, రెడ్క్రాస్ వలంటీర్ రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేసిన తరువాత 48 సార్లు రక్తదానం చేశాను. ప్రతి ఏడాది పెళ్లిరోజుకు, ఆగస్టు 15న తప్పనిసరిగా రక్తదానం చేస్తాను. అత్యవసరమైన వారికి కూడా రక్తదానం చేస్తాను. – మధుకల్యాణ్, మెడికల్ రిప్రజెంటేటివ్ జిల్లాలో రెడ్క్రాస్తో పాటుగా శ్రీకాకుళం రిమ్స్, మూడు ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లోనూ రక్తనిధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటన్నిటి ద్వారా ఏడాదిలో కేవలం 16 వేల యూనిట్లు మాత్రమే సేకరణ జరుగుతోంది. శ్రీకాకుళంలోని రక్తనిధి కేంద్రం చాలా మందిలో రక్తదానం అంటే భయం, అపోహలు ఉన్నాయి. రక్తం గురించి తెలుసుకుంటే ఆ భయం పోతుంది. రక్తదాన ప్రక్రియలో కేవలం 300 మిల్లీలీటర్లు మాత్రమే స్వీకరిస్తారు. సాధారణంగా మనిషిలో సరాసరి 5 లీటర్ల నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. కేవలం 300మి.లీ. రక్తం దానం చేయడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రమాదం జరిగినపుడు లీటరు వరకు రక్తం పోతుంది. సుఖప్రసవంలో తల్లి 700మి.లీ.రక్తం కోల్పోతారు. అయినా బాలింత బలహీనపడరు. ఈ సత్యం గుర్తించి రక్తదానానికి ముందుకు రావాలని బ్లడ్బ్యాంకుల నిర్వాహకులు కోరుతున్నారు. అత్యవసర వేళల్లో ఆదుకుంటున్న రక్తదాతలు 21 ఏళ్లుగా రక్తనిధి కేంద్రంలో రక్త సేకరణ రక్తదానంపై అపోహలు వీడాలంటున్న నిర్వాహకులు రేపు ప్రపంచ రక్తదాతల దినోత్సవం18 నుంచి 60 ఏళ్ల వయసు కలిగి ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా రక్తదానం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయకూడదు. ప్రతి వ్యక్తిలో కనీసం ఐదులీటర్ల రక్తం ఉంటుంది. ఏడాదిలో నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చు. సినీ హీరోల పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయవచ్చు. తమ పుట్టిన రోజుల సమయంలోనూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలవవచ్చు. యువజన సంఘాలు, కళాశాలలు, ఉద్యోగ సంఘాలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సత్యసాయి సేవా సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.


