breaking news
Srikakulam District News
-
ఆటోను ఢీకొట్టిన పాల వ్యాన్
ఇచ్ఛాపురం రూరల్: పాలతో వెళ్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర గాయాలపాలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కవిటి మండలం సీమూరుకు చెందిన తాపీమేసీ్త్ర శేఖర్ ముగ్గురు మహిళా కూలీలతో ఆటోలో ఇచ్ఛాపురం మండలం పెద్దలక్ష్మీపురం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న పాలవ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రామయ్యపట్నంకు చెందిన లండ కాముడమ్మ మోచేతికి, మేసీ్త్ర శేఖర్ తలకు తీవ్రగాయాలయ్యాయి. మిగతా ఇద్దరు మహిళలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఇచ్ఛాపురంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, కాముడమ్మను మెరుగైన చికిత్సకు శ్రీకాకుళంలో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. శేఖర్ తలకు కుట్లు వేసి చికిత్స అందజేస్తున్నారు. వివాహిత ఆత్మహత్య ఇచ్ఛాపురం: పట్టణంలోని దానంపేట కు చెందిన వివాహిత కె.మౌనిక(28) ఆత్మహత్య చేసున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కొండక వీరభద్రస్వామి (రిటైర్డ్ కోర్టు ఉద్యోగి), అరుణకుమారి (రిటైర్డ్ మున్సిపల్ స్కూల్ హెచ్ఎం) దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్దమ్మాయి మౌనిక విశాఖపట్నంలో పీజీ పూర్తిచేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. విశాఖకు చెందిన రమాకాంత్ని ప్రేమించి 2019లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కవల పిల్లలు. దంపతులు పోచారం పోలీస్స్టేషన్ పరిధిలోని సింగపూర్ టౌన్షిప్ సమీపంలోని గెలాక్షి టవర్స్లో నివాసముంటున్నారు. భర్త సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. ఏం జరిగిందో గానీ ఆదివారం భర్త ఇంట్లో ఉండగానే మౌనిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోచారం పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మౌనిక మృతితో దానంపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. -
జనవరిలో ఉత్తరాంధ్ర కవి సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్: రానున్న జనవరిలో శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర స్థాయి కవి సమ్మేళనం నిర్వహించాలని తెలుగు రచయితల వేదిక(తెరవే) ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని కిల్లాన కాంప్లెక్స్ ఆవరణలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ఆర్.వి.రమణమూర్తిల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెరవే సభ్యుల కవితా రచనలతో ఓ పుస్తకాన్ని విడుదల చేయాలని మరో తీర్మానం ఆమోదించారు. సమావేశంలో రచయితలు కిల్లాన శ్రీనివాసరావు, మంగిపూడి శ్రీనివాసరావు, నిక్కు హరిసత్యనారాయణ, వావిలపల్లి రాజారావు, లలితారెడ్డి, తోట గోపాలరావు, బాలాజీ రవికిరణ్, తాళ్ళూరు విజయలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
చేనేత కార్మికులకు.. పెహచాన్ కార్డులు
● ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేస్తున్న కేంద్రం ● వినియోగించుకోవాలంటున్న అధికారులునందిగాం: చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేస్తోంది. సంబంధిత శాఖ ద్వారా పెహచాన్ కార్డులను జారీ చేస్తోంది. మగ్గం నేసే కార్మికులకు, చేనేత అనుబంధ పనులు చేసేవారికి మేలు చేసేందుకు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ద్వారా ఉచితంగా పెహచాన్ కార్డులను పంపిణీ చేస్తోంది. ఈ గుర్తింపు కార్డుల వల్ల చేనేత కార్మికులకు అధికారిక గుర్తింపు లభించడంతో పాటు ప్రభుత్వం అందించే చేనేత సంక్షేమ పథకాలు పొందడానికి, రాయితీలు, శిక్షణ, పరికరాలు వంటి ప్రయోజనాలకు అర్హత నిర్ధారణలో ఈ కార్డులు ఉపయోగపడతాయి. బ్యాంకు రుణాలు, బీమా తదితర పధకాల్లో గుర్తింపుగా ఉపయోగపడే అవకాశం ఉంది. చేనేత వృత్తిగా జీవిస్తున్న వారందరూ ఈ–పెహచాన్ ఆన్లైన్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు, పాస్పోర్టు సైజ్ ఫొటో, బ్యాంకు ఖాతా వివరాలు, సంతకం, ఫోన్ నంబరు, వృత్తికి సంబంధించిన వివరాలు సమర్పిస్తే ఆ వివరాల ప్రకారం చేనేత శాఖకు సంబంధించిన అధికారులు నేరుగా దరఖాస్తు చేసుకున్న కార్మికుని ఇంటికి వచ్చి పరిశీలిస్తారు. దరఖాస్తుదారులు మగ్గం నేస్తున్నారా లేదా అనుబంధ పనులైన రాట్నం నుంచి నూలు వడకడం, కండెలు పట్టడం, ఆసు తిప్పడం వంటివి చేస్తున్నారా అనేది పరిశీలించి వాటిని వీడియో రికార్డు చేసి ధ్రువీకరిస్తారు. అనంతరం నెల రోజుల్లోగా కార్డులను జారీ చేస్తారు. దరఖాస్తుదారుడు ఆన్లైన్లోనే కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. మగ్గం నేసే కార్మికునికి గులాబీ, అనుబంధ పనులు చేసేవారికి నీలం రంగు కార్డులు జారీ చేస్తారు. ఉపయోగాలెన్నో.. ● పెహచాన్ కార్డుల వల్ల ముద్ర రుణాలు పొందవ చ్చు. ●నేత కార్మికులకు అవసరమైన మగ్గం, డాబీ, ఆసు మిషన్, వర్క్షెడ్ వంటివి రాయితీపై పొందవచ్చు.● మార్కెటింగ్పై శిక్షణ పొందవచ్చు. ● కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బీమా పథకాలు పొందవచ్చు. ● కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు లభిస్తాయి. ● నేతన్న నేస్తం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సదుపాయాలు పొందవచ్చు. పెహచాన్ కార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ విషయమై జిల్లాలోని చేనేత కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో సుమారు 1750 మంది మగ్గం నేసే కార్మికులు, వెయ్యి మంది అనుబంధ కార్మికులు ఉన్నారు. వీరంతా కార్డులను సద్వినియోగం చేసుకోవాలి. – టి.జనార్దనరావు, ఏడీ చేనేత జౌళిశాఖ, శ్రీకాకుళం -
ఆదిత్యుని సన్నిధిలో తెలంగాణ ఎమ్మెల్యే
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సన్నిహితులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈఓ కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఆర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, సాందీప్శర్మ, సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వరరావు, ఆలయ పాలక మండలి సభ్యుడు కొయ్యాన రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆదివారం స్వామివారికి రూ.3,67,944 మేర ఆదాయం లభించిందని ఈఓ ప్రకటించారు. జిల్లా రెడ్క్రాస్కు పురస్కారం శ్రీకాకుళం కల్చరల్: విజయవాడలో నిర్వహించిన ‘ది ఫిఫ్త్ ఇన్సైట్ యాన్యువల్ గ్యాదరింగ్‘ కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖకు ఉత్తమ ప్రశంసా పురస్కారం లభించింది. మానోబంధు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ భూపతిరాజు రామకృష్ణంరాజు, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ గౌరవ అధ్యక్షుడు వై.డి.రామారావు అవార్డు అందజేశారని రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు తెలిపారు. రెడ్క్రాస్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం వచ్చిందన్నారు. కోచింగ్ సెంటర్ల నమోదు తప్పనిసరి శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో పోటీపరీక్షలకు, విద్యార్థుల ట్యూషన్ కోసం శిక్షణ అందిస్తున్న కోచింగ్ అకాడమీలు/శిక్షణా సంస్థలు తక్షణమే కోచింగ్ ఇన్స్టిట్యూట్ రెగ్యులేషన్ అండ్ మోనిటరంగ్ సిస్టమ్ (సీఐఆర్ఎంఎస్)లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఇంటర్మీడియెట్ విద్య డీవీఈఓ/జిల్లా ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ ఉన్నత విద్యాశాఖ జీవో నెంబర్ 9లోని మార్గదర్శకాలు, ఏపీ విద్యా చట్టం 1982 నిబంధనల ప్రకారం విద్యార్థులకు పోటీపరీక్షలు, ట్యూషన్, కోచింగ్, గైడెన్స్, విద్యాపరమైన సహాయాన్ని అందిస్తూ 50 మంది, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులకు అందిస్తున్న అన్ని కోచింగ్ సంస్థలు తప్పనిసరిగా సీఐఆర్ఎంఎస్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వివరాలకు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి 9440816001 నంబర్ను సంప్రదించాలని కోరారు. యువకులను క్షేమంగా తీసుకొస్తాం శ్రీకాకుళం పాతబస్టాండ్ : మలేషియాలో చిక్కుకున్న సిక్కోలు యువకులను స్వస్థలాలకు క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు. సోంపేట మండలం ఎర్ర ముక్కాం గ్రామానికి చెందిన చీకటి సాయి వంశీ, సిరిమామిడి గ్రామానికి చెందిన గిరిబాబు, వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన చొక్కర సాయి, లండ తరుణ్ కుమార్లు మలేషియాలో చిక్కుకున్నారు. శారి కుటుంబ సభ్యులు ఆదివారం శ్రీకాకుళంలోని మంత్రిని క్యాంపు కార్యాలయంలో సమస్య వివరించారు. మంత్రిని కలసిన వారిలో మత్స్యకార నాయకులు సూరాడ చంద్రమోహన్, అశోక్, రాజు, దుర్గారావు, అఖిల్ తదితరులు ఉన్నారు. ఛాయరాజ్ రచనలు స్ఫూర్తిదాయకం శ్రీకాకుళం: ఛాయరాజ్ రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, వర్తమాన సామాజిక సంక్షోభాలకి పరిష్కారాలు ఛాయరాజ్ కవిత్వంలో లభిస్తాయని జనసాహితి జిల్లా అధ్యక్షుడు టి.శోభన్బాబు అన్నారు. శ్రీకాకుళంలోని ఓ కల్యాణమండపంలో జనసాహితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజా సాహిత్య, సాంస్కృతికోద్యమ కవి ఛాయరాజ్ 13వ వర్థంతి సభ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మాతృభాష మాధ్యమానికి, ప్రజల భాషకు సంఘీభావంగా ఛాయరాజ్ రాసిన మృతృభాష కవితను చదివి వినిపించారు. ఛాయరాజ్ శ్రీకాకుళంపైన ప్రచురించిన అదిగోరా తూరుపు పుస్తకాన్ని రైతు కూలీ సంఘం నాయకురాలు తాండ్ర అరుణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జనసాహితి రాష్ట్ర అధ్యక్షుడు పి.ఎస్.నాగరాజు, ప్రధాన కార్యదర్శులు ఎ.సురేష్, శివాజీ, పి.మోహనరావులు, కె.పాపారావు, శ్రీనివాసరావు, కె,.భానుమూర్తి, ప్రభాకరరావు, అప్పలనాయుడు, రచయితలు, కవులు, సాహితీత్తలు తదితరులు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ చేస్తున్న దృశ్యం -
పర్యావరణహిత వేడుకలు అభినందనీయం
శ్రీకాకుళం పాతబస్టాండ్/శ్రీకాకుళం కల్చరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధ్యాత్మికతతో అనుసంధానం చేసి వినాయక ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. నగరంలోని రైతు బజార్ జంక్షన్లో ఇలిసిపురం మెగా యూత్ కమిటీ చైర్మన్ హారిక ప్రసాద్ ఆహ్వానం మేరకు ఆదివారం కుటుంబ సమేతంగా వినాయక మండపాన్ని సందర్శించారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి రూపంలో దర్శనమిస్తున్న వినాయకుడిని దర్శించుకున్నారు. 25 అడుగుల భారీ విగ్రహాన్ని పూర్తిగా సహజ మట్టితో రూపొందించి పర్యావరణ పరిరక్షణకు గొప్ప సందేశమివ్వడం పట్ల కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. కాణిపాకం వినాయకుడి నమూనాను బావి నుంచి పైకి, కిందకు కదిలేలా రూపొందించిన వినూత్న సాంకేతికతను ప్రశంసించారు. ఉత్తరాంధ్రలోనే తొలిసారిగా హోలోగ్రామ్ సాంకేతికత ద్వారా ప్రదర్శించిన శివతాండవం, మహాగణపతి నత్య ప్రదర్శనలు వీక్షించిన ఆయన, ఇలాంటి ఆవిష్కరణలను జిల్లాలో అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామమని కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ హారిక ప్రసాద్, నీహర్, ఇలిసిపురం మెగా యూత్ సభ్యులు వాసు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా సాఫ్ట్బాల్ జట్ల ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్స్ సాఫ్ట్బాల్ జట్ల ఎంపికలు ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి బాలబాలికల సాఫ్ట్బాల్ సెలక్షన్ ట్రయల్స్కు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులను జిల్లా ప్రాబబుల్స్ జట్లకు ఎంపిక చేస్తామని సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎంవీ రమణ చెప్పారు. వైఎస్సార్ కడప జిల్లాలో అక్టోబర్ 14 నుంచి 15 వరకు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీలకు జిల్లా జట్లను పంపిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యాక్షులు మెట్ట తిరుపతిరావు, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ సత్యనారాయణ, రాంబాబు, మౌళి బాబూజీ, ఢిల్లీశ్వరరావు, దవళ పెంటయ్య, ఎ.ఢిల్లీరావు, రాజగోపాల్, డాక్టర్ పి.రమేష్, బి.శ్రీనివాసరావు, గౌరి, హరికృష్ణ, వెంకటరమణ, రామ్మోహన్, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. -
జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు పూర్తి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు పూర్తయ్యాయి. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో జరిగిన ఈ ఎంపికలకు సుమారు 700 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–14, 16, 18, 20 వయో విభాగాల్లో 100మీటర్లు, 200, 400, 800, 1500 మీటర్ల పరుగు పందాలు, 3కేఎం, 5కేఎం రన్స్, హైజంప్, లాంగ్జంప్, డిస్కస్త్రో, హేమర్త్రో, జావెలిన్త్రో, హార్డిల్స్ రన్స్, త్రోస్, జంప్స్ ఈవెంట్స్ను నిర్వహించారు. సెలక్షన్ ట్రయల్స్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల వివరాలను నమోదుచేశారు. ఎంపికై న క్రీడాకారుల జాబితాను త్వరలో వెల్లడిస్తామని అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా ఛైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు (వాసు), రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, జిల్లా కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి తెలిపారు. అనంతరం సీనియర్ అథ్లెట్స్ పి.తవిటయ్య, ఎం.కామయ్య, కె.గోపిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘ జిల్లా సలహాదారు పి.సుందరరావు, కె.రాజారావు, కె.హరిబాబు, కె.మాధవరావు, టి.శ్రీనివాసరావు, బి.నారాయణరావు, వి.మురళి, రామారావు, మహంతి, సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
రణస్థలం: రణస్థలం ఫ్లై ఓవర్ పనుల రద్దీ కారణంగా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం సాయంత్రం ఎచ్చెర్ల నుంచి విజయనగరం వెళుతున్న కారును ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ సమయంలో కారులో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. మరో కారును కూడా ఇంకో లారీ ఢీకొట్టింది. త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదాలపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్సై చెప్పారు. -
బీసీ ఓట్ల కోసమే రిజర్వేషన్ డ్రామాలు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం చంద్రబాబునాయుడు చెప్పడం కేవలం ఓట్ల కోసమేనని, అదంతా బూటకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ విమర్శించారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతిభవన్లో ఆదివారం సీపీఐ జిల్లా కార్యవర్గ, సమితి సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు చాపర సుందర్లాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ బీసీ ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి చంద్రబాబు డ్రామాడుతున్నారని దుయ్యబట్టారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులిచ్చిందని, అలాంటప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీ అమలయ్యే పరిస్థితే లేదన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు తాండవిస్తోందని, ఇప్పటికే 513 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు ప్రభుత్వ అధికారులే ధ్రువీకరించారని, ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ భారాన్ని మోపడమే కాకుండా, ఇప్పుడు కొత్తగా యూపీఐ లావాదేవీలపై కూడా చార్జీలు విధించి ప్రజలను నిలువునా దోచుకునేందుకు చూస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. ‘మార్పు రావాలి – మార్పు కావాలి’ అని ఢిల్లీలో సీపీఐ చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష మద్దతు లభించిందన్నారు. అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో జిల్లా స్థాయి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, జిల్లా కార్యవర్గ, సమితి సభ్యులు పాల్గొన్నారు. -
సొంత ఊరికి కొంత మేలు
● స్వగ్రామంలో రూ. 30 లక్షలతో అభివృద్ధి పనులు ● కోమర్తిలో స్కూల్, అశిరమ్మ అమ్మవారి గుడి, పెద్ద చెరువు అభివృద్ధి ● విశాఖకు చెందిన వైశ్యరాజు జ్యుయలర్స్ యజమాని ఫల్గుణరావు ఔదార్యం నరసన్నపేట: పుట్టిన ఊరి రుణం ఫల్గుణరాజు తీర్చుకున్నారు. ఏకంగా రూ. 30 లక్షలు వెచ్చించి మండలంలోని కోమర్తిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. 30 ఏళ్ల కిందట కోమర్తి నుంచి విశాఖ వెళ్లిన ఫల్గుణరాజు వైశ్యరాజు జ్యుయలర్స్ పేరున బంగారం షాపులు పెట్టి ఉన్నత స్థాయికి చేరారు. అయితే తాను చదువుకున్న స్కూల్, వినియోగించిన చెరువు, పూజించిన అమ్మవారి గుడి శిథిలావస్థలో ఉన్నాయని తెలుసుకొని పెద్ద మనసుతో వీటి అభివృద్ధికి కంకణం కట్టారు. ఇప్పుడు చెరువు అభివృద్ధి జరిగింది. స్కూల్ రూపు రేఖలు మారాయి. అశిరమ్మ తల్లి మంటపం సుందరంగా తయారైంది. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తనకు చదువు చెప్పిన కొల్లి ఇల్లయ్య మాస్టారు విగ్రహాన్ని కూడా స్కూల్లో ఏర్పాటు చేశారు. స్కూల్లో చేపట్టిన అభివృద్ధి పనులు డైనింగ్ హాల్, పార్క్, క్లాస్ రూం, ప్లే గ్రౌండ్, ఫుట్పాత్కు వాకింగ్ టైల్స్, ప్లాంటేషన్, చదువు చెప్పిన గురువు విగ్రహం, ప్రహరీ నిర్మాణం చేప ట్టారు. అలాగే క్లాస్ రూమ్స్లో ఫ్యాన్లు, ట్యూబులైట్లు, ప్లే గ్రౌండ్కు అవసరమైన ఆట పరికరాలు, విద్యార్థులకు ఐడీ కార్డులు, మినరల్ వాటర్ ప్లాంట్, కిచెన్కు టైల్స్ వంటి అభివృద్ధి పనులు చేపట్టారు. అలాగే చెరువు మెట్లు నిర్మాణం, సుందరీకరణ, చెరువుకు ఆనుకొని ఉన్న కాలువను అభివృద్ధి చేశారు. చెరువు వద్ద షెడ్ కూడా పునర్నిర్మించారు. బీసీ కాలనీ వద్ద అశిరమ్మ అమ్మవారి గుడిని అభివృద్ధి చేశారు. చుట్టూ స్టీల్ గ్రిల్స్, ఫ్లోరింగ్, గోడల ఎత్తు పెంచారు. అలాగే స్కూల్తో పాటు అమ్మవారి గుడికి రంగులు వేయించారు. ఆదివారం ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ నాటికి నా ఊరికి సేవ చేసే అవకాశం వచ్చింది. నా కుమారులు నరేష్, కిరణ్, గిరి భార్య భారతి ఎంతగానో సహకరించారు. – వైశ్యరాజు ఫల్గుణరాజు -
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. అయితే రెవెన్యూ క్లినిక్ మాత్రం ఉండదని ఆయన ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. నేటి నుంచి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటనలో ఉన్నందున రెవెన్యూ క్లినిక్ నిర్వహించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించి రెవెన్యూ సమస్యలపై పీజీఆర్ఎస్ కు రావద్దని ఆయన కోరారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగా పై కార్యక్రమంలో లేదా ఆన్లైన్లో మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్లో నమోదు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. రూ.3.15లక్షలకు మహాలడ్డూ వేలం శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని మొండేటివీధిలో లక్ష్మీగణపతి ఆలయంలో జరిగిన మహాలడ్డూ వేలంలో సన్సిల్వర్ పార్కు తిరుమలరాజు రూ.3,15,000లకు లడ్డూ దక్కించుకున్నారు. ముత్యాలహారం రూ.30వేలకు కొల్లి కృష్ణారావు దక్కించుకోగా, పగడాల హారం రూ.35వేలకు పొట్నూరు విఠల్, దినేష్, వేలంకిలు, మణిమాల హారం జామి సతీష్ రూ.70,001లకు దక్కించుకున్నారు. రెవెన్యూ సర్వీసుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కిరణ్ కుమార్ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రణస్థలం తహసీల్దారు సనపల కిరణ్ కుమార్ నియమితులయ్యారు. ఆదివారం విజయవాడ పట్టణంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం 18వ రాష్ట్ర ఎన్నికల్లో భాగంగా జరిగిన రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లా తరఫున రణస్థలం తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రణస్థలం: వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ దేరసాం గ్రామంలో కప్పల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కప్పలకు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించి, గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు పండాలని ప్రార్థించారు. మాదకద్రవ్యాలతో జీవితం నాశనం శ్రీకాకుళం క్రైమ్ : మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత శారీరకంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోవడంతో పాటు చెడు మార్గాల్లోకి వెళ్లే ప్రమాదముందని, వాటికి దూరంగా ఉండాలని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద అన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ‘నో డ్రగ్స్ – వికసిత్ భారత్’ కార్యక్రమానికి రూపొందించిన పోస్టర్ను ఆదివారం డీఎస్పీ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో జె.జోషి, జి.చిరంజీవి, కె.ప్రకాష్, పి.రాజు, ఎస్.రాజా తదితరులు పాల్గొన్నారు. -
వాయుగుండంపై విద్యుత్ శాఖ అప్రమత్తం
అరసవల్లి: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం జిల్లా తీర ప్రాంతంపై పడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖ తరఫున అప్రమత్తంగా ఉన్నామని విద్యుత్ శాఖ సర్కిల్ ఎస్ఈ జీఎన్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల కారణంగా వాయుగుండంగా తీవ్ర ప్రభా వం చూపుతుందని ఉన్నతాధికారుల సూచనల మేరకు జిల్లాలో శ్రీకాకుళం, పలాస, టెక్కలి డివిజన్ల పరిధిలో అన్ని తీర ప్రాంతాల్లో అలెర్ట్ చేశామన్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లోని 11 మండలాల్లో భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లుగా అందుతున్న సమాచారం మేరకు సిబ్బందిని ప్రత్యేకంగా సెక్షన్ల వారీగా నియమించామన్నారు. అలాగే సర్కిల్ పరిధిలో అన్ని హోదాల్లో విద్యుత్ శాఖ ఉద్యోగులు, ఇంజినీరింగ్ అధికారులకు సెలవులను రద్దు చేసినట్లుగా ప్రకటించారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యు త్ శాఖకు నష్టం వాటిల్లితే, యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులను చేపట్టేలా చర్యలు చేపడుతున్నట్లుగా వివరించారు. ఇందుకోసం మొత్తం 1500 విద్యుత్ స్తంభాలు, 15 కిలోమీటర్ల మేర కండక్టర్లు, మేచింగ్ మెటీరియల్స్, 2 వేల మంది ఓఅండ్ఎం స్టాఫ్ను సిద్ధం చేశామన్నారు. 36 సెక్షన్లలో 10 మంది కాంట్రాక్టర్ సిబ్బందిని నియమించి తదుపరి చర్యలకు ఆదేశించినట్లుగా ప్రకటించారు. జిల్లా కేంద్రంలోనూ అలాగే డివిజన్ కేంద్రాల్లోనూ కాల్సెంటర్/ మానిటరింగ్ సెల్ను పెట్టి ఎప్పటికప్పుడు వివరాలను సేకరిస్తామన్నారు. -
తీర మండలాలకు ప్రత్యేక అధికారులు
శ్రీకాకుళం పాత బస్టాండ్: రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో ని 11 తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే భారీ వర్షాలు, తీవ్ర ఈదురుగాలుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విపత్తు నిర్వహణ చర్యలను సమర్థంగా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి సీనియర్ అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించారు. నియమితులైన అధికారులు సంబంధిత మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, స్థానిక సిబ్బందితో కలిసి సహాయక చర్యలను వేగవంతం చేయాలని, అవసరమైన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మండలాల ప్రత్యేకాధికారులు రణస్థలం పి.సుగుణాకరరావు, ఎస్ఈ సుడా 7901402999 ఎచ్చెర్ల కె.రాజగోపాలరావు, జేడీ పశుసంవర్దక శాఖ 9989932798 శ్రీకాకుళం బి.లవరాజు, పీడీ డ్వామా 8790008399 గార ఆర్.స్వరూపారాణి, డీపీఓ 8341493877 పోలాకి ఆర్.వెంకటరామన్, జెడ్పీ సీఈఓ 9100997770 సంతబొమ్మాళి పి.కిరణ్ కుమార్, పీడీ డీఆర్డీఏ 8008803800 వజ్రపుకొత్తూరు టి.సుమలత, జేడీ, ఫిషరీష్ 9885863475 సోంపేట కాళ్ల అజయ్కార్తికేయ, ఏసీ, కార్మికశాఖ 9492555034 మందస పి.చంద్రశేఖర్, ఏడీ, పలాస 9492416700 కవిటి చంద్రశేఖర్, ఏడీ హర్టీకల్చర్ 7995086760 కంచిలి పి.వేణుగోపాలరావు, ఏపీసీ సమగ్రశిక్ష 8500525525 -
జిల్లాలో వానలకు అవకాశం
శ్రీకాకుళం పాతబస్టాండ్: బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం తుఫాన్గా మారనున్న సందర్భంగా సోమవారం నుంచి జిల్లాలో వర్షా లు, గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు అధికా రులు ఓ ప్రకటన విడుదల చేశారు. అల్ప పీడనం సోమవారం బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు. బుధవారం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్–దక్షిణ ఒడిశా తీరాల సమీపానికి వస్తుందని తెలిపారు. దీని ప్రభావంతో సోమవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురి సే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవింవవచ్చని తెలిపారు. -
అలసిపోతున్నారు..!
● మత్స్యకారులకు గడ్డుకాలం ● చిక్కని సముద్ర సంపద ● తుఫాన్ హెచ్చరికలతో ఇంటికే పరిమితమవుతున్న వైనం వజ్రపుకొత్తూరు: సముద్రంలో చేపల వేట నిషేధం ముగిసి 90 రోజులు దాటింది. కానీ మత్స్యకారులు ఈ కాలంలో వేటకెళ్లి సంతృప్తిగా ఇంటికొచ్చిన రోజులు అందులో సగం కూడా లేవంటే అతిశయోక్తి కాదు. సంద్రంలో ఏ మాత్రం అలజడి రేగినా గంగపుత్రుల వేటపై నిషేధం అమలవుతుంది. దీంతో వీరు ఇంటికే పరిమితమవుతున్నారు. పోనీ వేటకెళ్లిన సందర్భంలో మత్స్య సంపద దొరుకుతుందా.. అంటే అదీ లేదు. పెద్ద పెద్ద బోట్లపై వేటకు బయల్దేరుతున్న పొరుగు రాష్ట్రాల మత్స్యకారులతో చిన్న చిన్న బోట్లపై వెళ్తున్న మన గంగపుత్రులు పోటీ పడలేకపోతున్నారు. వరుసగా ఎదురవుతున్న వేట నిషేధాలకు తోడు డీజిల్ ఖర్చులకు కూడా రాని చేపల వేటలతో వీరు అలసిపోతున్నారు. ఇదీ పరిస్థితి జిల్లాలో సుదీర్ఘంగా విస్తరించి ఉన్న తీరం వెంబడి 2.10లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. ఇందులో 16,569 మంది నిత్యం సముద్రంలో చేపల వేటతోనే తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఐతే ఏటా రెండు నెలలు మత్స్య సంపద పునరుత్పత్తి కారణంగా చేపల వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. ఈ రెండు నెలల కాలంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరు. సముద్రంలో చేపల సంతానోత్పత్తి పెరగడంతో పాటు అప్పటికే ఉన్న మత్స్య సంపద మరింతగా పెరుగుతుంది. ఐతే సముద్ర తీరం వెంబడి ఏర్పాటవుతున్న పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య వ్యర్థాలను సముద్ర జలాల్లో వదిలేస్తుండడంతో మత్స్య సంపద ఉనికి కోల్పోతోంది. తమిళ జాలర్లు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో మరబోట్లుతో స్వైర విహారం చేస్తున్నారు. వీరి వద్ద సన్న పిల్ల సైజు నుంచి పెద్ద పెద్ద చేపలు పట్టే వలలు ఉండడంతో వీరు మత్స్య సంపదను కొల్లగొట్టడంతో మన గంగపుత్రులు లబోదిబోమంటున్నారు. నిర్మానుష్యంగా సముద్ర తీరం చేపల వేట నిషేధం ముగిసిన తర్వాత స్థానిక మత్స్యకారులతో సందడిగా ఉండాల్సిన సముద్ర తీరం గంగపుత్రులు లేక నిర్మానుష్యంగా ఉంది. చేపల వేటకు వెళ్లినా సముద్రంలో చేపలు లేకపోవడంతో రెక్కలు కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవడంతో మత్స్యకారులు సముద్ర తీరానికి రావడానికి కూడా ఇష్ట పడడం లేదు. జిల్లాలో 193 కిలోమీటర్ల తీర ప్రాంతం 11 మండలాల్లో విస్తరించి ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, సంతబొమ్మాళి, పోలాకి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం తదితర మండలాల్లో చేపల వేట చేసి బతుకుతున్న మత్స్యకారులు రెక్కాడితే కానీ డొక్కాడని వారి కుటుంబాలను పోషించడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతూ అప్పు ల పాలవుతున్నారు. వైఎస్సార్ సీపీ హయాలో మూలపేట పోర్టు, ఫిషింగ్ జెట్టీలు, హార్బర్ల నిర్మాణాలు మొదలయ్యాయి. కానీ ప్రభుత్వం మారాక అవన్నీ మూలకు చేరడంతో మత్స్యకారుల అప్పుల పాలవుతున్నాం సముద్రంలో ఎంత దూరం వెళ్లినా చేపలు దొరకడం లేదు. వలలు వేసి సముద్రం నీటిలో లాగడం వల్ల రెక్కల కష్టం తప్ప ఏమీ మిగలడం లేదు. దీంతో రోజు వారీ ఇంటి దగ్గర ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుంటున్నాం. ఈ లోగా ఆరోగ్యం ఏమైనా సుస్తీ చేస్తే ఆ అప్పు మరింత పెరుగుతుంది. – సీహెచ్.నీలయ్య, మత్స్యకారుడు, మంచినీళ్లపేట డీజిల్ ఖర్చు రావడం లేదు వేటకు వెళితే చిన్న చిన్న చేపలు తగుతుతున్నాయి. అవి ఆశించిన ధరకు పోవడం లేదు. ఐదారుగురం కలిసి వేటకు వెళితే కనీసం డీజిల్ ఖర్చులు దాటడం లేదు. తమిళ జాలర్లు, మర బోట్ల వల్ల సముద్రంలో మత్స్య సంపద లేకుండా పోతుంది. వేటలో వారు ఉపయోగించే సామగ్రి మా వద్ద లేదు. ప్రభుత్వం వేట నిషేధ భృతి ఇవ్వడంతో పాటు ఆధునిక వేట సామగ్రి సబ్సిడీపై అందించాలి. – జుత్తు చిన్నారావు, మత్స్యకారుడు, భావనపాడు -
వామ్మో.. వానరాలు
● మెళియాపుట్టిలో కోతుల దాడిలో 42 మందికి గాయాలు ● స్థానిక పీహెచ్సీలో చికిత్స పొందుతున్న బాధితులు ● పట్టించుకోని అధికారులు ● వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ దాడులు చేస్తున్న కోతులు మెళియాపుట్టి: మండలం కేంద్రాన్ని కోతులు స్వాధీనంలోకి తెచ్చుకున్నట్టు ఉన్నాయి. విచ్చలవిడిగా వీధుల్లో తిరుగుతూ దాడులకు తెగబడుతున్నాయి. ఇప్పటివరకు కోతుల దాడిలో గాయాలపాలై స్థానిక పీహెచ్సీలో 42 మంది చికిత్స పొందినట్లు వైద్యశాఖ సిబ్బంది తెలియజేశారు. ఇంకా ఆస్పత్రుల్లో చేరిన వారితో కలిపితే 100 మంది వరకు గాయపడి ఉంటారని అంచనా. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్ అధికారుల్లో చలనం లేదు. ఎవరో వస్తే పట్టుకుంటామని వారు చెబుతున్నారు. అధికారుల్లో సమన్వయం లేకపోవడంతో అమాయక ప్రజలు దాడులకు గురవుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆదిత్యుని సాక్షిగా ల్యాండ్ వార్
● భూబదలాయింపు ద్వారా ఆలయానికి చెందనున్న భూములకు ఎన్ఓసీ ఇవ్వాలంటూ ఒత్తిళ్లు ● ఈ విషయంపై ఈఓ ప్రసాద్పై కలెక్టర్ ఆగ్రహం ● సెలవులోకి వెళ్లిపోనున్న ఆలయ ఈఓ ప్రసాద్ అరసవల్లి: అరసవల్లిలో భూ బదలాయింపుల అంశం వివాదాలకు దారి తీస్తోంది. ఈ వ్యవ హారంలో రూ.లక్షల్లో చేతులు మారినట్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ప్రతి అంశం చర్చకు దారి తీస్తోంది. అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి జిల్లాలో పలు చోట్ల సుమా రుగా 102 ఎకరాల భూములున్నాయి. అయితే ఇందులో సుమారుగా 57 ఎకరాల భూములు వంశపారంపర్య అర్చకుల జీతభత్యాలకు బదులుగా అప్పట్లో అధికారికంగా కేటాయించారు. అయితే ఆలయానికి భక్తుల ద్వారా ఆదాయ వనరులు పెరగడంతో గత ప్రభుత్వ హయాంలోనే డిప్యూటీ కమిషనర్ హోదా పెరిగిన సంగతి విదితమే. అయితే ఇంకా అభివృద్ధి చేయాలనుకున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో అభివృద్ధికి అవసరమైన భూములను గుర్తించి, ఆయా ప్రైవేటు భూ యజమానుల నుంచి వాటిని తీసుకుని, ప్రత్యామ్నాయంగా ఆలయ భూములను బద లాయింపు చేసేలా (ల్యాండ్ టు ల్యాండ్) గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ భూ లావాదేవీలను జేబులు నింపుకునే వ్యవహారాలుగా మారిపోయాయనే విమర్శలు వినిపించాయి. ఏకంగా ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ అంతా తానై భూ బదలాయింపులు చేసి తద్వారా లాభపడినట్లుగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రైవేటు యజమానుల నుంచి మొత్తం 1.22 ఎకరాల భూములను ఆలయ అవసరాలకు తీసుకుంటూనే ఆలయానికి ఎంతో విలువైన ప్రాంతా ల్లో ఉన్న కీలక భూములను కట్టబెట్టేలా నిర్ణయాలను తీసుకున్నారు. ఇదే ఇప్పుడు వివాదాంశమైంది. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు రా మ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ల ఆధ్వర్యంలోనే ఇలా ఆలయానికి చెందిన కీలక భూముల బదలాయింపునకు గ్రీన్సిగ్నల్ వచ్చేసింది. దీంతో భవిష్యత్లో అరసవల్లికి చెందిన చిన్నతోట, పెద్దతోటలతో పాటు మరిన్ని విలువైన స్థలాలు ఇక ప్రైవేటు పరం కానుండడం లాంఛనమే అయ్యింది. ఎన్ఓసీ కోసం పట్టు భూబదలాయింపు విధానంలో భాగంగా స్థానికులైన సలుగు శేఖర్కు చెందిన 12 సెంట్ల భూమికి బదులుగా మెయిన్ రోడ్డులో ఉన్న సర్వే నంబర్ 485/2 లో 9.50 సెంట్లు (నందల తయారీ స్థలం) ఇవ్వడానికి, అలాగే పెద్దింటి పూర్ణ, బమ్మిడి కృష్ణారావులకు చెందిన 46 సెంట్లను తీసుకుని వారికి సర్వే నంబర్ 89/6లోని 37 సెంట్ల భూమితో పాటు వప్పంగి గ్రామ పరిసరాల్లో ఉన్న 592 గజాల స్థలాలను బదలాయింపుగా ఇచ్చేలా నిర్ణయించారు. అలాగే మద్దుల సూర్యనారాయణ, రమేష్ చక్రవర్తిలకు చెందిన 18 సెంట్ల స్థలానికి బదులుగా ఆలయానికి చెందిన చిన్నతోటలోని 14 సెంట్లను, అలాగు గంగు రామన్న కుటుంబానికి చెందిన 46 సెంట్ల స్థలానికి బదులుగా పెద్దతోటలోని 40 సెంట్లను బదలాయింపుగా ఇచ్చేసేలా దేవదాయ శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు కూడా వచ్చేశాయి. ప్రైవే టు వాళ్ల నుంచి మొత్తం 1.22 ఎకరాల భూములను ఆలయానికి చెందనుండగా, ఆలయానికి చెందిన 1.10 ఎకరాల విలువైన భూములు ఆ యా ప్రైవేటు భూయజమానుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఆలయానికి చెందనున్న 1.22 ఎకరాల భూములను దేవదాయ శాఖ చట్టం 30/87 ప్రకా రం ప్రోపర్టీ రిజిస్టర్లో ఎంటర్ కావాల్సి ఉంది. ఇంతలోనే కొత్తగా ‘స్వదేశ్ దర్శన్ 2.0’ పేరిట ప్రతిపాదనలు తెరమీదకు రావడంతో ఆలయ ఈఓ ప్రసాద్ చిక్కుల్లో పడ్డారు. స్వదేశ్ దర్శన్ పథకం కింద అరసవల్లి ఆలయ పరిసరాల అభివృద్ధితో పాటు అరసవల్లి సన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను, అలాగే డచ్ భవనం, నాగావళి రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం రూ.107.94 కోట్లతో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రతిపాదించగా ఇటీవలే కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు ఈ స్కీం నిధులతో నిర్మాణాలను ఆలయ భూముల్లోనే కట్టాలంటే బదలాయింపు ద్వారా ఆలయానికి సమకూరిన 1.22 ఎకరాల భూములకు దేవదాయ శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవడం తప్పనిసరి. అయితే ఈ ప్రక్రియ మరింత వేగవంతమయ్యేందుకు నేరుగా కలెక్టర్ రంగంలోకి దిగి ఎలాగైనా ఎన్ఓసీ ఇవ్వాలంటూ ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ఒక దశలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆలయ భూములపై భవనాల నిర్మాణాలు చేయాలన్నా ఎన్ఓసీ ఇవ్వాలన్నా రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ మాత్రమే అధికారం ఉండడంతో ఈ ఒత్తిడి ఆలయ ఈఓ ప్రసాద్ను తాకింది. దీంతో ఆయన ఏకంగా సెలవుపై వెళ్లిపోయేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు భూ బదలాయింపుపై వస్తున్న ఆరోపణలపై కూడా విచారణ వేయనున్నారని విశ్వసనీయ సమాచారం. అరసవల్లి ఆలయ ఈఓ సోమవారం నుంచి సెలవులోకి వెళితే ఈ స్థానంలో విఽశాఖపట్నం డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న సుజాతకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. -
● 21 నుంచి వానలు ప్రారంభమయ్యే అవకాశం ● 22, 23 తేదీల్లో భారీ వర్షాలు ● అధికారులకు సెలవులు రద్దు
శ్రీకాకుళం పాత బస్టాండ్: తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాబో యే నాలుగు రోజులు ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఈనెల 23, 24 తేదీల్లో తుఫానుగా శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర వైపునకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ నెల 21 నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు ప్రారంభమై, 22, 23 తేదీల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకా శం ఉన్నందున మత్స్యకారులు ఈ నెల 25 వరకు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్లో 24 గంటలూ పనిచేసే విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్ (ఫోన్: 08942 240557) అందుబాటులోకి తెచ్చామని, 11 కోస్తా మండలాలకు సీనియర్ అధికారులను ఇన్చార్జిలు గా నియమించామని పేర్కొన్నారు. జిల్లాలోని అధికారులందరికీ సెలవులు రద్దు చేశామని, సోమవారం రాత్రి నుంచి రాత్రివేళ విధులు (నైట్ డ్యూటీలు) అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రవాహం ఉన్న కాలువలు, నదుల్లో కాకుండా ప్రభుత్వం అనుమతించిన ప్రదేశాల్లోనే వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. జలాశయాలు, నదుల నీటిమట్టం పెరుగుతున్నందున నదీ పరివాహక ప్రాంత ప్రజ లు సురక్షితంగా ఉండాలని, రాబోయే నాలుగు రోజుల పాటు ఇసుక రీచ్లలో తవ్వకాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తుఫాను పునరా వాస కేంద్రాలు లేని ప్రాంతాల్లోని పాఠశాలలను కేంద్రాలుగా మార్చి మంచినీరు, బియ్యం, ప్రాథమి క వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.మట్టి ఇళ్లలో ఉండేవారు ముందస్తుగా పునరావాస కేంద్రాలకు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లిపోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో కలెక్టర్ తో పాటు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ ఉన్నారు. -
రైతులను ఆదుకోవడంలో
● వెంటనే కరువు మండలాలను ప్రకటించాలి ● ప్రతి రైతుకు రూ.25వేలు చొప్పున చెల్లించాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట: మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో రైతులు నట్టేట మునుగుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నా రు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మా ట్లాడారు. రాష్ట్రంలో ఉన్నది ఎల్నినో ఎఫెక్టు కాదని ఎల్లో నినో ఎఫెక్టు అని కృష్ణదాస్ ఎద్దేవా చేశారు. తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా సీఎం చంద్రబాబు గానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గానీ తగిన విధంగా స్పందించడం లేదని విమర్శించారు. ఎల్నినో ప్రభావంపై ఫిబ్రవరి 4 వ తేదీనే ముఖ్యమంత్రి ప్రకటన చేశారని, అయితే దీనికి తగ్గట్టు రైతులకు తగు సూచనలు చేయడంలో, ముందస్తు ప్రణాళిక రూపొందించడంలో, తగిన విధంగా సహాయ పడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు.. కరువు కవలలు అని ఎద్దేవా చేశారు. కరువు మండలాలుగా ప్రకటించాలి.. వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తోందని,జిల్లాలో ఉన్న 30 మండలాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఉచిత పంటల బీమా ఉంటే రైతులకు ఎంతో మేలు జరిగేదని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని కోరారు. ఇప్పటి వరకూ బీమా చెల్లించిన రైతులకు బీమా ప్రీమియం తిరిగి చెల్లించాలని కోరారు. అలాగే రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం దారుణంగా విలఫమైందన్నారు. -
ప్రయాణికులు ఫుల్..బస్సులు నిల్!
జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో శనివారం ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన నిమిత్తం జనాలను తరలించేందుకు బస్సులు కేటాయించడంతో కాంప్లెక్స్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుబాటులో ఉన్న అరకొర బస్సులు కూడా క్షణాల వ్యవధిలో నిండిపోవడంతో మిగిలిన వారంతా ఉసూరుమంటూ నిట్టూర్చారు. ప్రయాణికులకు సరిపడా బస్సులు కేటాయించకపోవడంతో పాలకుల తీరుపై మండిపడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం/శ్రీకాకుళం అర్బన్ -
గొటివాడలో టీడీపీ నేతల బరితెగింపు
● యంత్రాలతో సచివాలయ నిర్మాణ పనులు ధ్వంసం ● యథేచ్ఛగా గ్రామకంఠం ఆక్రమణ ● మంత్రి పేరు చెప్పి దౌర్జన్యం జలుమూరు: గొటివాడలో గ్రామ కంఠమైన సర్వే నంబర్ 69–3లో సుమారు 30 సెంట్లు భూమిని స్థానిక టీడీపీ నాయకులు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. జేసీబీ యంత్రాలతో స్థలాన్ని చదును చేస్తున్నారు. గత ప్రభుత్వంలో సుమారు రూ.1.50 కోట్లతో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాల కోసం పునాదులు, పిల్లర్లు వేసి పనులు కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించి రూ.11 లక్షల బిల్లులను చెల్లించడంతో, రూ.22 లక్షల విలువైన మెటీరియల్ సమకూర్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్థలంపై టీడీపీ నాయకుల కన్నుపడింది. నీకింత నాకు కొంత అని వాటాలు వేసుకుని యంత్రాలతో వచ్చి పునాదులు తొలగించి ఆక్రమణలకు తెరలేపారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మెయ్యి శ్రీనివాసరావు కుటుంబ సభ్యుడు చైతన్య అనే వ్యక్తి మంత్రి అచ్చెన్నాయడు కార్యాలయంలో పనిచేయడంతో స్థానిక అధికారులు ఈ ఆక్రమణలకు అడ్డుచెప్పడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేయడంతోపాటు ప్రస్తుత ఈ స్థలం కోర్టు వివాదంలో కూడా ఉందని గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు పల్లి రమణ చెబుతున్నారు. ఇందులో మరికొంత స్థలాన్ని స్థానిక టీడీపీ నాయకులు సోమినేని శ్రీనివాసరావు, నేతింటి రామారావు, ముద్ద రాజు, మెయ్యి దిలీప్ తదితరులు కూడా ఈ ఆక్రమణలో భాగస్వామ్యంగా ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేయనున్నామని రమణ తెలిపారు. రోడ్డును ఆనుకొని ఉన్న స్థలం కావడంతో రూ.కోట్లు విలువ చేయడంతో ఆక్రమణదారుల కన్నుపడింది. ఈ విషయమై తహసీల్దార్ జెన్ని రామారావు వద్ద ప్రస్తావించగా ఆ స్థలంలో భవన నిర్మాణాలు ఉండటం వాస్తవమేనని చెప్పారు. అయితే అధికారులు ఇందులో జోక్యం చేసుకోకూడదని కోర్టు ఆర్డర్ ఇచ్చిందన్నారు. దీనిపై స్థానిక రెవెన్యూ సిబ్బందిని పంపి క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. -
29న జెన్–జెడ్ సెమినార్
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 29న ‘నేటి యువత ఆసక్తులు, ఆలోచనలు, ఆదర్శాలు ఏమిటి?’ అనే అంశంపై జెన్–జెడ్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి. చందు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం శ్రీకాకుళంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో సెమినార్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ నేటి యువత సమాజంపై బాధ్యతతో వ్యవహరించడం, ఇతరుల పట్ల గౌరవం కలిగి ఉండటం, భారతదేశ పౌరులుగా తమ బాధ్యతలను గుర్తించడం, సామాజిక సమస్యలపై అవగాహన పెంపొందించుకోవడం వంటి అంశాలపై ఈ సెమినార్లో చర్చించనున్నట్లు తెలిపారు. దేశంలో విద్యారంగంలో పెరుగుతున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ, విద్యార్థుల భవిష్యత్ను ప్రభావితం చేస్తున్న పేపర్ లీకేజీలు వంటి సమస్యలపై యువతలో చర్చ, అవగాహన అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి. చందు, గర్ల్స్ కన్వీనర్ దివ్య, జిల్లా కమిటీ సభ్యులు మురళి, జగన్, కార్తీక్, పార్థు, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
తప్పిన పెను ప్రమాదం
మేము విశాఖలో బస్సు ఎక్కాం. పలాస వెళ్తున్నాం. ఇంతలో జమ్ము వద్దకు వచ్చే సరికి బస్సు టైర్ పేలడం, మంటలు వ్యాపించడం అన్నీ కొన్ని నిమిషాల్లోనే జరిగి పోయాయి. వెంటనే సిబ్బంది కేకలు వేసి పరుగులు తీశారు. మేమూ కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నాం. – సుభావతి, టెక్కలి నరసన్నపేట : మొదట టైరు పేలిన శబ్దం.. అది పరిశీలిస్తుండగా ఎయిర్ సిలిండర్ పేలిన చప్పుడు.. కమ్మేసిన పొగలు.. అంతా దిగి చూసే సరికే వ్యాపించిన మంటలు. జమ్ము కూడలి వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాదం తీరు ఇది. ప్రయాణికులంతా సురక్షితంగా దిగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నడిరోడ్డుపై కేవీఆర్ ట్రావెల్స్ బస్సు అలా కాలిపోవడం మాత్రం విస్మయం గొలిపింది. -
సరిహద్దులో సారాజ్యం!
● ఏరులై పారుతున్న నాటు సారా ● రెండు రాష్ట్రాల అధికారుల సంయుక్త దాడులు ● కేసులు నమోదవుతున్నా తగ్గని అక్రమార్కులు హిరమండలం: జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. ముఖ్యంగా ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని మహేంద్రగిరులు, ఇతర అటవీ ప్రాంతాల్లో సారా శిబిరాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. వాటినే చలామణి చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు దాడులు చేస్తున్నా.. కేసులు నమోదుచేస్తున్నా అక్రమార్కులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సారాకు అలవాటుపడి ఎంతోమంది అనారోగ్యానికి గురై ఆస్పత్రిపాలవుతున్నారు. ప్రధానంగా పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తూరు, టెక్కలి, సోంపేట, మందస, కంచిలి మండలాల్లోని సరిహద్దుల్లో సారా తయారీ ఎక్కువగా జరుగుతోంది. మరోవైపు సీతంపేట, భామిని, పాలకొండ మండలాల్లోని గిరిజన ప్రాంతాల్లో తయారవుతున్న సారాను తెచ్చి మరీ విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి కూడా సరుకు బాగా దిగుమతి అవుతోంది. ఒడిశా సరిహద్దు ప్రాంతాలపై ఎక్కువగా ఎకై ్సజ్ అధికారులు దృష్టిపెట్టారు. ఇప్పటివరకూ రెండు రాష్ట్రాల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సరిహద్దులోని రెండు రాష్ట్రాల పరిధిలో 10,510 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. తయారీకి ఉపయోగించే 1.54 లక్షల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నీటి లభ్యత అధికంగా ఉండే మారుమూల గిరిజన గ్రామాల్లో సారా తయారు చేస్తున్నారు. వందల లీటర్ల నాటుసారాను నీటి క్యానులు, ప్యాకెట్లలో నింపి ద్విచక్ర వాహనాల్లో నిర్దేశించుకున్న ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన సమాచారంతో ఎకై ్సజ్ అధికారులు దాడులు చేస్తున్నారు. కానీ సారా తయారీ, రవాణా మాత్రం ఆగడం లేదు. ఎప్పటికప్పుడు స్థావరాలు మార్చి మరీ తయారు చేస్తున్నారు. రవాణా మార్గాలను మారుస్తూ అధికారుల కళ్లుగప్పి గుట్టుగా సరిహద్దులను దాటించేస్తున్నారు. మరోవైపు ఎకై ్సజ్ శాఖలో సిబ్బంది కొరత అక్రమార్కులకు కలిసివస్తోంది. -
నిర్భయ్ ఫండ్తో మహిళలకు రక్షణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: నిర్భయ్ ఫండ్తో మహిళలకు రక్షణ, భద్రతా సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్తో కేంద్ర ప్రభుత్వ అధికారులు వర్చ్వుల్గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు పింక్ టాయిలెట్లు, సీసీ టీవిలు, క్రిటికల్ కేర్ యూనిట్లు, చార్జింగ్ స్టేషన్లు, చీకటి ప్రదేశంలో హైమాస్క్ లైట్లు, పోలీస్ శాఖ పానిక్ బటన్ సౌకర్యం, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రావణ్కుమార్, డీఎస్పీ వివేకానంద, డీటీసీ మణికుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి పి.శోభారాణి, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి, ఎంవీఐ ఆర్.అనిల్ తదితరులు పాల్గొన్నారు. తీర పరిరక్షణ అందరి బాధ్యత సోంపేట: సముద్రతీరాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్య అన్నారు. అంతర్జాతీయ తీర ప్రాంత స్వచ్ఛత దినోత్సవం సందర్బంగా బారువ తీరంలో శనివారం మహా స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు, అధికారులతో కలిసి చెత్తాచెదారాలు తొలగించారు. కార్యక్రమంలో అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి టి.దేవరాజు, మైరెన్ సీఐ రమేష్, ఎంపీడీఓ ఈశ్వరమ్మ, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు సూరజ్ ప్రధాన్, కొండ సోమేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శతాధిక వృద్ధురాలి మృతి గార: బూరవెల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు మళ్ల సరస్వతమ్మ (105) శనివారం మృతి చెందారు. ఈ వయసులోనూ తన పనులు తానే చేసుకునేవారని, ముందు రోజు అస్వస్థతకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంపీపీ గొండు రఘురామ్, పార్టీ సీఈసీ సభ్యుడు గొండు కృష్ణమూర్తి తదితరులు సరస్వతమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆవిష్కార్ సీజన్–4 పోస్టర్ ఆవిష్కరణ టెక్కలి : టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న ఆవిష్కార్ సీజన్–4కు సంబంధించి శనివారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సమాజానికి ఉపయోగపడేలా వినూత్నమైన ఆవిష్కరణలు రూపకల్పన కోసం ఆవిష్కార్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ఐతం రైజ్ సీఈఓ బి.మనోజ్కుమార్, కన్వీనర్ జి.సతీష్కుమార్, కో–కన్వీనర్ పి.శిరీషా, శాక్ ఇన్చార్జి జె.సురేష్ తదితరులు పాల్గొన్నారు. 26న రెడ్ రన్ అరసవల్లి: హెచ్ఐవీపై అవగాహన కల్పించే క్రమంలో జిల్లా కేంద్రంలోని 80 ఫీట్ రోడ్డులో ఈ నెల 26న ఉదయం 5.30 గంటల నుంచి రెడ్ రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాఽధికారి డాక్టర్ నరేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.7 వేలు వంతున బహుమతులు అందిస్తామని ప్రకటించారు. ఆసక్తి గల యువకులు ఈ నెల 24లోగా 9494474206 నంబర్కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. -
లవి కాని హామీలు.. మలుపై మీనమేషాలు
కాశీబుగ్గ : అలవి కాని హామీలతో చంద్రబాబు అధికారం దక్కించుకున్నారని, ఇప్పుడు అమలు చేయడం తన వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇలాంటి మోస గాళ్లను ప్రజలు స్వాగతిస్తారా? అని ప్రశ్నించారు. పలాసలో శనివారం స్థానిక ఎన్నికల సంసిద్ధతపై నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఫలాలు ఎవరికీ అందడం లేదన్నారు. ఆనా డు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీకి భయపడిందని, కానీ నేడు వైఎస్సార్సీపీ ఎన్నికలకు సంసిద్ధంగా ఉందని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడు తూ స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లా డుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే తప్పుగా మారిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. ఇలాంటి దుర్నీతికి చరమగీతం పాడాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ చంద్రబాబు తనకు తాను వాటర్ మ్యాన్ అని బిరుదులు ఇచ్చుకుంటున్నారని, వాస్తవానికి వీధివీధికీ నీటిని కాకుండా మద్యాన్ని అందుబాటులో ఉంచుతూ క్వార్టర్ మ్యాన్గా మారారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వ హయాంలో పలాస నియోజకవర్గంలో మంచి నీళ్ల ట్యాంకులు చిన్నవిగానూ, వాటికి వేసిన శిలాఫలకాలు పెద్దవిగా కనిపిస్తున్నాయని చురకలు అంటించారు. -
పిడుగు దెబ్బకు కరెంటు కట్
అరసవల్లి: విద్యుత్పై పిడుగులు ప్రతాపం చూపాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక (తెల్లారితే శనివారం) 2 గంటల సమయం నుంచి సుమారు 5 గంటల సేపు జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. భారీగా ఉరుములు, పిడుగుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. భారీ వర్షానికి తోడుగా పిడుగులు నేరుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లపై పడటంతో ఎక్కడికక్కడ 10 వరకు ఇన్సులేటర్లు పేలిపోయాయి. అంపోలు– ఇండోర్ సబ్స్టేషన్ మధ్య 33 కేవీ ఫీడర్ లైన్లో చోటుచేసుకున్న ఈ ఘటనలతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక.. విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో విద్యుత్ శాఖ ఎస్ఈ జీఎన్ ప్రసాద్, ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావుల ఆదేశాలు, సూచనల మేరకు డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది వేకువజాము నుంచి యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీంతో 5 గంటల్లో కొత్త ఇన్సులేటర్లు ఏర్పాటు చేశారు. అరసవల్లి ఆదిత్యనగర్ కాలనీ పరిధిలో ట్రాన్స్ఫార్మర్తో పాటు 33 కేవీ మెయిన్ లైన్లో కండక్టర్ల ఏర్పాటు పనులు చేపడుతున్న క్రమంలో శనివారం మధ్యాహ్నం కూడా సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు, లైన్ ఇన్స్పెక్టర్లు కాకర్ల శ్రీను, పాపారావులతో పాటు, లైన్మెన్లు, సిబ్బంది ఈ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. -
శ్రీకాకుళం
వినాయక.. సెలవికవినాయక నిమజ్జనాలు ఘనంగా జరిగాయి. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. –8లోసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : మీ గ్యాస్ కనెక్షన్కు ఈకేవైసీ చేసుకోలేదా..? అయితే మీ కనెక్షన్ బ్లాక్ అయిపోయినట్టే. ఇకపై మీకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రాదు. బుక్ చేసినా తీసుకోదు. ఎంత చెబుతున్నా బయో మెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ(బీఏఏ) పూర్తి చేయని డొమెస్టిక్ ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. బీఏఏ చేసేంతవరకు సబ్సిడీ, నియంత్రిత ధరకు గ్యాస్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీలకు ఈనెల 17వ తేదీన కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ వినియోగదారులంతా ఈకేవైసీ చేసుకోవాలని గత ఏడాది ఫిబ్రవరి నుంచి కేంద్ర ప్రభుత్వం సీరియస్గా చెబుతూ వస్తోంది. కానీ, చాలా మంది వినియోగదారులకు బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేసుకోవడం లేదు. గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగం జరుగుతున్న దృష్ట్యా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున భారం పడుతోంది. ఎన్ని సార్లు గడువు పెంచినా చాలా మంది వినియోగదారులు ఈకేవైసీ చేసుకోకపోవడంతో కేంద్రం సీరియస్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని కంపెనీలకు సంబంధించి సుమారు 18లక్షల గ్యాస్ కనెక్షన్లు బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేసుకోలేదని విశ్వసనీయ సమాచారం. అదే స్థాయిలో జిల్లాలో కూడా వేలాదిగా వినియోగదారులు కేంద్రం ఆదేశాలను పట్టించుకోలేదు. వినియోగదారుల్లో స్పందన లేకపోవడంతో గ్యాస్ రీఫిల్పై ఆంక్షలు విధించింది. బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేయని గ్యాస్ కనెక్షన్లను బ్లాక్లో పెడతామని స్పష్టం చేసింది. బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేసుకోనంతవరకు సబ్సిడీ, నియంత్రిత ధరకు గ్యాస్ బుకింగ్ జరగదు. వారంతా బయట మార్కెట్లో నిర్ణయించే ధరకు గ్యాస్ కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. ఎవరైతే వెంటనే బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ చేసుకుంటారో ఆ తర్వాత కనెక్షన్ యాక్టివేషన్ చేసి, సబ్సిడీ, నియంత్రిత ధరకు సిలిండర్లను సరఫరా చేస్తారు. -
రూ.5లక్షలతో కవిటి శ్మశాన వాటిక పనులు
కవిటి: ‘ఆఖరి మజిలీకి అగచాట్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై అధికార వర్గాలు, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఈ మేరకు శనివారం ఆగిపోయిన కల్వర్టు కమ్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. జేసీబీ సాయంతో దట్టంగా పేరుకుపోయిన ముళ్లపొదలను తొలగించడం ద్వారా ఈ మార్గంలో పెండింగ్లో పడిన మిగిలిన రహదా రి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. వాస్తవానికి కలెక్టర్ మంజూరు చేసిన రూ.3.5లక్షల నిధులు వెచ్చించి ఇప్పటివరకు జరిగిన మేరకు పనులు నిర్వహించినట్టు పీఆర్ ఇంజనీర్ హిమ సాగర్ తెలిపారు. మిగిలిన పనులకు మండల పరిషత్ నిధుల నుంచి తాజాగా రూ.5లక్షలు వెచ్చించి చేపడుతున్నట్టు మండల పరిషత్ కార్యాలయం ఏఓ కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పనులు సాధ్యమైనంత త్వరలో పూర్తిచేయాలని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు నిర్మాణ పనుల స్థలాన్ని సందర్శించి విలేకరులకు తెలిపారు. సంతబొమ్మాళి: సంతబొమ్మాళి పంచాయతీలో ‘తెనిగిపెంట కిడ్నీ వ్యాధుల తంటా’ అనే శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై వైద్య, అర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు స్పందించారు. సంతబొమ్మాళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ శ్రావణి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను అందజేశారు. సుమారు 50 మంది నుంచి రక్తం తదితర సమూనాలను సేకరించారు. గ్రామంలో మూడు రోజులు పాటు మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ నందిని తెలిపారు. అనారోగ్యానికి కారణాలను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా అర్డబ్ల్యూఎస్ ఏఈ మహేష్ తాగునీటి నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షించారు. అనంతరం గ్రామంలోని వాటర్ ట్యాంక్, మురుగు కాలువలను పరిశీలించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. -
పోలింగ్ కేంద్రాలు 1989
● ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు జాబితా విడుదల అరసవల్లి: జిల్లాలో స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాలో మొత్తం 30 మండలాల్లో తుది పో లింగ్ కేంద్రాలు 1989గా ప్రకటిస్తూ ఆమోదం తెలి యజేస్తున్నట్లుగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా జిల్లా పరిషత్ సీఈ ఓ ఆర్.వెంకట్రామన్ ప్రకటించారు. గ్రామీణ ఓటర్లుతో పాటు పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లాలో వివరాలను ఆయన ప్రకటించారు. -
పాత ఆస్పత్రిలో ఇనుప వస్తువులు చోరీ
టెక్కలి రూరల్ : టెక్కలిలోని పాత జిల్లా ఆస్పత్రిలో ఐరన్ ఫ్రేమ్లు చోరీకి గురవుతున్నాయి. కొన్నాళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఈ భవనాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో కొందరు విలువైన వస్తువులు పట్టుకుపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం వేళల్లో మందుబాబులు చేరుకుని అసాంఘికకార్యకలాపాలు సాగిస్తున్నారని అంటున్నారు. ఐరన్ గేటులు, కిటీకీలకు ఏర్పాటు చేసిన ఫ్రేమ్లను గోడలను బద్దలుకొట్టి పట్టుకుపోతున్నారని చెబుతున్నారు. ట్రామాకేర్ అంబులెన్స్ సైతం నిరుపయోగంగా వదిలేయడంతో అందులో వస్తువులు చోరీకి గురౌతున్నాయని, ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఎవరో..ఎందుకు దిగాడో..!
● గుర్రపుడెక్క ఊబిలో చిక్కుకున్న వ్యక్తి ● రక్షించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాశీబుగ్గ : పలాస మండలం గరుడఖండి సవరగెడ్డలో ఓ వ్యక్తి పొరపాటున గుర్రపుడెక్కలో దిగి ఊబిలో చిక్కుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సవరగెడ్డలో పూర్తిగా గుర్రపుడెక్క పేరుకుపోవడంతో అక్కడ నీరు ఉందన్న ఆనవాళ్లే కనిపించని పరిస్థితి. అయితే ఆ గెడ్డలో శుక్రవారం ఓ వ్యక్తి ఎందుకు దిగాడో తెలియదు కానీ ఊబిలోంచి బయటకు రాలేకపోయాడు. గెడ్డలోంచి కేకలు వేయడంతో స్థానికులు గమనించారు. లోపల సుమారు 55 ఏళ్ల వ్యక్తి ఉన్నాడని గ్రహించి వెంటనే కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్, అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో అతికష్టమ్మీద బయటకు తీసుకువచ్చారు. అప్పటికే అపస్మారకస్థితికి చేరుకోవడంతో పలాస సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రేపు జూనియర్ సాఫ్ట్బాల్ జట్ల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్బాల్ ఎంపిక పోటీలు ఈ నెల 20న జరగనున్నాయని జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు గురువారం పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని ఇప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ సెలక్షన్ ట్రయల్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. బాలబాలికలు 2009 జనవరి ఒకటి తర్వాత జన్మించి ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లను అక్టోబర్ 13 నుంచి 15వ తేదీ వరకు వైఎస్సార్ కడప జిల్లా వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్బాల్ చాంపియన్షిప్–2026 పోటీలకు పంపిస్తామని తెలిపారు. ఆసక్తి గల వారు జనన ధృవీకరణ పత్రం, ఆధార్కార్డుతో ఇప్పిలి జెడ్పీహెచ్ స్కూల్ వద్దకు చేరుకోవాలని, పూర్తి వివరాలకు పీడీ మెట్ట తిరుపతిరావు (94404 36317)ను సంప్రదించాలని కోరారు. రేపు ఛాయారాజ్ వర్ధంతి సభ శ్రీకాకుళం: ప్రజాసాహిత్య, సాంస్కృతికోద్యమ నేత, భావాల సరిహద్దుల వద్ద కాపలా కాసిన నూతన ప్రజాస్వామిక కవి కామ్రేడ్ ఛాయారాజ్ 13వ వర్ధంతి సభ ఈ నెల 20న శ్రీకాకుళంలో నిర్వహిస్తున్నట్లు జనసాహితి జిల్లా అధ్యక్షుడు టి.శోభన్ బాబు, ఉపాధ్యక్షుడు కె.పాపారావు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాల సమావేశ మందిరంలో ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజంతా సదస్సు, కవి సమ్మేళనం జరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయంతం చేయాలని కోరారు. ఆకట్టుకున్న నాటిక పోటీలు శ్రీకాకుళం కల్చరల్ : సుమిత్ర కళాసమితి ఆధ్వర్యంలో అఖిల భారత బహుభాషా నాటిక పోటీలు రెండో రోజు శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో ఉత్సాహంగా సాగాయి. ముంబైకు చెందిన బియింగ్ కళాకార్ రచన, యువరాజ్ వివేక్తమహంకర్ దర్శకత్వంలో ‘సూప్’ అనే మరాఠీ నాటిక ప్రదర్శించారు. అనంతరం వీకేఎం కళావిదురు, బెంగళూరుకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ కంబార్ రచనలో, సీఎం తిమ్మయ్య దర్శకత్వంలో ‘సాంగ్వా –బాల్య’ కన్నడ నాటిక ఆద్యంతం అలరించింది. అనంతరం కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఇప్పిలి శంకరశర్మ, కె.సోమేశ్వరరావు, విశ్రాంత రిజిస్ట్రార్ గుంట తులసిరావు, ప్రిన్సిపాల్ నంద సూర్యనారాయణ స్వామి, ఎల్.నందికేశ్వరరావు, కొంక్యాన మురళి, గుత్తు చిన్నారావు, మండవిల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, కె.సురేష్, పూజ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. శనివారం ‘పేసెస్ ఆఫ్ ఉమెన్’ ఒడియా నాటిక, ‘యకీనన్‘ ఛత్తీస్గఢ్ నాటికలు ప్రదర్శిస్తారు. -
టీడీపీ కుట్రల వల్లే కార్పొరేషన్ ఎన్నికలకు ఆటంకం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతలే అడ్డుకుంటున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వి స్వరూప్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో మున్సిపల్ ఎన్నికలకు సన్నాహలు చేసినప్పుడు ఏడు పంచాయతీలు విలీనమైతే ఎన్ఆర్జీఎస్ నిధులు ఆగిపోతాయని, దాంతో అభివృద్ధి జరగదనే నెపంతో టీడీపీ నేతలే కోర్టులో కేసులు వేసి ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వైఎస్సార్సీపీ అభ్యర్థినే మేయర్గా భారీ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు. శ్రీకాకుళం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం (టౌన్హాల్)లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా స్వరూప్ మాట్లాడుతూ నిన్నగాక మొన్న గెలిచిన ఎమ్మెల్యే గొండు శంకర్ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును విమర్శిస్తూ శ్రీకాకుళానికి ఏం చేశారని అనడం దారుణమన్నారు. రిమ్స్ మెడికల్ కాలేజ్, మూడు వంతెనలు, అంబేడ్కర్ యూనివర్సిటీ, కళింగరోడ్డు విస్తరణ, 80 అడుగుల రోడ్డు, రైతుబజారు రోడ్డు విస్తరణ, 24గంటల తాగునీరు అందించిన వ్యక్తి ధర్మానే అని గర్వంగా చెప్పగలమన్నారు. రోడ్డుమీద రోడ్డులు వేయడం, వాణిజ్య ప్రకటనల బోర్డులో టీడీపీ కార్యక్రమాలు చెప్పుకోవడమే తప్ప అంతకుమించి చేసింది లేదన్నారు. రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. కార్పొరేషన్కు ఎన్నికలు జరిగితే ధర్మాన ప్రసాదరావు సూచనల మేరకు ఆయన నిర్ణయించే వ్యక్తిని గెలిపించి తీరుతామన్నారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, రఫీ, అంధవరపు రామారావులు మాట్లాడుతూ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. డే నైట్ జంక్షన్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తీర్ణ పనుల్లో నిబంధనలు పాటించలేదన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో డబ్బులు ఎదజల్లడం వల్లనే టీడీపీ గెలించిందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు, మైనార్టీసెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎంఏ బేగ్, గ్రీవెన్స్సెల్ అధ్యక్షుడు రౌతు శంకరరావు, బీసీ విభాగం నగర అధ్యక్షుడు గద్దిబోయిన కృష్ణయాదవ్, మండవిల్లి రవి, భైరి మురళి, దుంగ సుధాకర్, సీపాన మహేంద్ర, చంగళరావు, తేజ, భాను, తంగి అప్పన్నస్వామి, సుధ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచి జగనన్నకు కానుకగా ఇస్తాం మున్సిపాల్టీని అవినీతికి అడ్డాగా మార్చేశారు తెలుగుదేశం నేతలపై వైఎస్సార్సీపీ నాయకుల మండిపాటు -
ఎరువుల దుకాణంలో ధరల దోపిడీ
● అధికారులకు ఫిర్యాదు చేసిన రైతులు సోంపేట : మండలంలో ఆగస్టు, సెప్టెంబరు నెల ప్రథమార్థం వర్షాలు కురవలేదు. ప్రస్తుతం కురుస్తున్న అడపాదడపా వర్షాలకు కొన్ని చోట్ల రైతులు నాట్లు వేస్తున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో డీఏపీ, యూరియా ఆశించిన స్థాయిలో సరఫరా కాకపోవడంతో రైతులు ఎరువుల దుకాణదారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా జింకిభద్ర రహదారిపై రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణం యజమాని రైతులకు అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీకి పాల్పడ్డాడు. భారత్ ఎన్పీకే గ్రోమోర్ రూ.750 విలువైన ప్యాకెట్ను రైతులకు రూ.1200కు విక్రయిస్తున్నారు. శుక్రవారం బెంకిలి గ్రామానికి చెందిన రైతులు మడ్డు కృష్ణారావు తదితరులు బస్తాపై అమ్మకపు ధర రూ.750 ఉంటే రూ.1200కు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. అనంతరం వ్యవసాయాధికారి బి.నర్సింహమూర్తికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన దుకాణానికి చేరుకుని ఎరువుల అమ్మకం నిలుపుదల చేశారు. ఇంత వరకు విక్రయించిన బిల్లుల వివరాలు అందజేయాలని యజమానిని ఆదేశించారు. రైతులు ఎరువుల అవసరాలను తమకు తెలియజేస్తే అందజేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో వ్యవసాయ సహాయకురాలు ఐశ్వర్య, తదితరులు పాల్గొన్నారు. -
ఆఖరి మజిలీకి అగచాట్లు
కవిటి : ప్రశాంతంగా జరగాల్సిన అంత్యక్రియలకూ ప్రహసనం తప్పడం లేదు. కవిటి మండల కేంద్రంలో శ్మశానవాటికకు వెళ్లేందుకు సరైన మార్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కవిటి, గొండ్యాలపుట్టుగ, ప్రగడపుట్టుగ, రామయ్యపుట్టుగలలోని సుమారు ఐదు వేల మంది ప్రజలకు ఒకే శ్మశానవాటిక ఆధారం. సుమారు ఏడాదిన్నర కాలం నుంచి ఈ శ్మశానానికి వెళ్లేందుకు అనువైన మార్గం లేక అంత్యక్రియలకు తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కవిటి శ్మశాన వాటికకు వెళ్లేందుకు వేస్తున్న రోడ్డు నిర్మాణం పనులు పూర్తి కాకపోవడమే దీనికి కారణం. శ్మశానవాటికకు వెళ్లే దారేదీ? శుక్రవారం గొండ్యాలపుట్టుగలో ఓ వ్యక్తి మృతిచెందారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రోడ్డు నిర్మా ణం పూర్తికాకపోవడంతో గ్రామస్తులు మరోమార్గంలో వెళ్లాలని ప్రయత్నించారు. ఆ దారిలో గణేష్ మండపం ఉంది. ఇటువైపుగా రావడానికి వీల్లేదని నిర్వాహకులు అడ్డుతగిలారు. దీంతో నడిరోడ్డుపైనే మృతదేహాన్ని పట్టుకుని గంటలతరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. స్థానికంగా ఉంటున్న వారు ప్రత్యామ్నాయ మార్గంలో శవాన్ని తీసుకువెళ్లేందుకు ఒప్పుకోలేదు. ప్రశాంతంగా జరగాల్సిన అంత్యక్రియల ప్రక్రియ గొడవలకు దిగాల్సిన పరిస్థితులు దాపురించడం సిగ్గుచేటని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పనులు సకాలంలో పూర్తికావాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ దుస్థితి నెలకొందని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా కవిటి పంచాయతీకే చెందిన ప్రభుత్వ విప్, మూడుసార్లు గెలిచిన జిల్లాలోనే సీనియర్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కనీసం పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కూటమి ప్రభుత్వం హయాంలో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ప్రహసనంగా మారింది. అందుకే పనులు సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు అధికారులు ఆదేశించడానికి ధైర్యం చాలడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు ఐదు గ్రామాల ప్రజలకు తీవ్ర సమస్యగా మారిన కవిటి శ్మశానవాటికకు మండల కో ఆప్షన్ సభ్యుడిగా గతంలో రూ.3లక్షల నిధులతో పనులకు ప్రతిపాదించాను. దాన్ని జరక్కుండా అడ్డుకున్నారు. సర్పంచ్గా ఉన్న కాలంలో సర్వేచేయించి శ్మశానవాటిక పరిరక్షణ అభివృద్ధికి నా వంతు చర్యలు చేపట్టాను. ఇవన్నీ పక్కన పెడితే సమస్య తీవ్రతను ప్రభుత్వ యంత్రాంగం గుర్తించి వెంటనే పరిష్కరించాలి. – పాండవ శేఖర్, మండల కో–ఆప్షన్ సభ్యుడు, కవిటి కవిటి శ్మశానవాటికకు సంబంధించి రోడ్డు పనులు అసంపూర్ణంగా నిలిచిపోయిన మాట వాస్తవమే. మరికొంతమేర నిధులు జోడించి పనులు ఆగిపోయిన దశ నుంచి పనులు పూర్తిచేసేందుకు చర్యలు చేపడతాం. – ఎల్.త్రినాథ, కవిటి పంచాయతీ ప్రత్యేకాధికారి కవిటిలో శ్మశానవాటికకు వెళ్లేందుకు మార్గం కరువు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ఈ దుస్థితి కనీసం స్పందించని ఎమ్మెల్యే, అధికారులు -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
పాతపట్నం: మండలంలోని కొరసవాడ ప్రధాన రహదారిపై ధనుపురం నుంచి పాతపట్నం వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో కొరసవాడ గ్రామానికి చెందిన శంకర్ గాయపడ్డారు. శంకర్ మిశ్రా ద్విచక్రవాహనంపై వస్తుండగా కొరసవాడ వివేకానంద విగ్రహం వద్ద వచ్చేసరికి ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పాతపట్నం సీహెచ్సీ ఆటోపై తరలించారు. ప్రథమ చికిత్సను డాక్టర్ అనిత అందించి, మెరిగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. శంకర్ మిశ్రో ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేశామని, ట్రాక్టర్ను పోలీసు స్టేషన్కు తీసుకువచ్చామని ఎస్ఐ కె.మధుసూధరావు తెలిపారు. -
మున్సిపల్ కార్మికుల ప్రైవేటీకరణ ఆపాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, పట్టణ ప్రజలకు నష్టదాయకమైన మున్సిపల్ సేవల ప్రైవేటీకరణ ఆపాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, నగర అధ్యక్షుడు అరుగుల గణేష్ డిమాండ్ చేశారు. స్ట్రీట్ లైటింగ్ టెండర్లు ప్రక్రియ వెంటనే నిలిపివేయాలని, పట్టణాలలో పౌరసేవలు ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో వాటర్ సప్లయ్, వీధి లైట్లు, పార్కులు, రోడ్లు, వాహనాలు తదితర 14 కీలక విభాగాలను, పౌరసేవలను పీపీపీ పేరిట ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు తప్పదన్నారు. కోటిన్నర మంది పట్టణ ప్రజలపై యూజర్ చార్జీల భారం పడుతుందన్నారు. ప్రజా సంక్షేమాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించి మున్సిపల్ కార్మికులు, పట్టణ ప్రజల్ని కష్టాలపాలు చేసేందుకే మున్సిపల్ సేవల ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపాలిటీలు వసూలుచేస్తున్న పన్నులన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాగేసుకుంటున్నాయని దుయ్యబట్టారు. ఆ నిధులు ఇవ్వకపోవడం వల్లే మున్సిపాలిటీలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. మున్నిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించి హక్కులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర కమిటీ నాయకులు ఏ.జ్యోతిప్రసాద్, ఎం.రాఘవ, ధనాల చిట్టి, ఆర్.యుగంధర్, జె.మాధవి, ఎన్.పార్వతి, వి.సరోజ, డి.గంగ తదితరులు పాల్గొన్నారు. -
నేడు పలు ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి శనివారం పలు ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దయ్యాయి. విశాఖపట్నంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన నేపథ్యంలో అక్కడికి ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను విశాఖ పంపించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులు తగ్గనున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు మాత్రం యధావిధిగా నడవనున్నాయి. శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 25 బస్సులు, శ్రీకాకుళం రెండో డిపో నుంచి 20, టెక్కలి డిపో నుంచి 10 కలిపి మొత్తం 50 బస్సులు విశాఖకు వెళ్లనున్నాయి. దీంతో జిల్లా కేంద్రంతో పాటు టెక్కలి డిపో పరిధిలో కూడా కొన్ని రూట్లలో బస్సులు తగ్గనున్నాయి. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాని ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్.అప్పలనారాయణ కోరారు. పశుసంవర్థక సహాయకులను రెగ్యులర్ చేయాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా 2023లో నిబంధనల మేరకు మెరిట్, ఇతర అర్హతల ఆధారంగా ఎంపికై నియమితులైన పశుసంవర్థక సహాయకులను రెగ్యులర్ చేయాలని కోరుతూ సదరు ఉద్యోగులు శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. జిల్లావ్యాప్తంగా 30 మంది ఉన్నామని, రెండేళ్ల ప్రొబేషన్ కాలాన్ని ఫిబ్రవరి 2026లో పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు సర్వీస్ రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు జారీ కాలేదని జిల్లా పశుసంవర్ధక సహాయకుల సంఘం అధ్యక్షుడు టి.అయ్యప్ప, కార్యవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెలకు రూ.15,000, కన్సాలిడేటెడ్ వేతనంతో పనిచేస్తున్నారని, చాలీచాలని జీతంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని తెలిపారు. పాలకులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. కరువు ప్యాకేజీ ప్రకటించాలి రణస్థలం : రైతు, కౌలు రైతు, వ్యవసాయ కూలీలకు కరువు ప్యాకేజీ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సహాయ కార్యదర్శి బి.రాంబాబు, కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెలమల రమణ డిమాండ్ చేశారు. రణస్థలంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువును ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో 655 మండలాల్లో వర్షాభావం నెలకొందన్నారు. చాలా వరకు ఖరీఫ్ పంటలు వేయలేదని, వేసిన చోట కూడా పంటలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే కరెంట్ కోతలు విధిస్తున్నారని, గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. ఈ ఏడాది కరువు ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. కరవు సహాయ నిధి కింద ఎకరాకు రూ. 25వేలు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ నాయకులు పిషిణి సత్యం, ఏ.అప్పారావు, ఆర్.సత్యనారాయణరావు, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ స్తంభం విరిగిపడి కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని సీపన్నాయుడుపేట విజయాదిత్యా పార్కు సమీప పొలాల్లో విద్యుత్ స్తంభం విరిగిపడిన ఘటనలో కాంట్రాక్ట్ వర్కర్ మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురానికి చెందిన సాధు కామేష్ (42) కొంతకాలంగా కాంట్రాక్టు ఉద్యోగిగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య లక్ష్మీ, డిగ్రీ చదువుతున్న కుమారు పవన్ ఉన్నారు. శుక్రవారం విధుల్లో భాగంగా విజయాదిత్యాపార్కు ఎదురుగా ఉన్న పొలాలలో విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఓవైపు పూర్తిగా ఒరిగి ఉన్న స్తంభం కావడంతో అకస్మాత్తుగా విరిగిపోయి పొలంలో పడిపోయి. అతనిపైనే స్తంభం ఉండిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. -
గిల్ట్ నగలు తాకట్టు పెట్టి రూ.2లక్షలకు టోకరా
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని రెండో పట్టణ పోలీస్స్టేషన్ వెనుక ఉన్న ఓ ఫైనాన్స్ సంస్థలో ఓ మహిళ గిల్ట్ నగలు తాకట్టు పెట్టి రూ. 2.40 లక్షలకు టోకరా వేసింది. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మహాలక్ష్మి నగర్ కాలనీకి చెందిన మండల భవాని ఈ ఏడాది జూన్ 15 న తమ ఫైనాన్స్ సంస్థను ఆశ్రయించిందని బ్రాంచ్ మే నేజర్ చౌదరి రవీంద్రబాబు పోలీసులతో పేర్కొన్నారు. పరిచయం ఉన్న మహిళ కావడంతో సిబ్బంది పూర్తి స్థాయిలో నగలు తనిఖీ చేయకుండా ౖపైపెనే చేసి ఒరిజినల్ బంగారు నగలే అనుకుని రూ. 2,43,300 రుణం మంజూరు చేశారని మేనేజర్ తెలిపారు. అక్కడకు కొద్ది రోజుల్లోనే జూలై 23న ఆడిట్ అధికారులు బ్యాంకుకు వచ్చి పూర్తిస్థాయిలో తనిఖీలు చే యగా పైన పూత బంగారం లోపల నకిలీ ఉండడాన్ని నిర్ధారించారన్నారు. వెంటనే మండల భవానీని ఫోన్లో సంప్రదించి బ్రాంచికి రప్పించి విషయం తెలుపగా తొందరలోనే తాకట్టు డబ్బులు కట్టేస్తానని చెప్పిందన్నారు. అయితే తాను తాకట్టు పెట్టిన బంగారు నగలు వేరే వారివని వారికే ఆ డబ్బులు పంపించానని మరోసారి చెప్పిన భవానీ.. ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారు. దీంతో పోలీసులను ఆశ్రయించినట్లు బ్రాంచ్ మేనేజర్ చౌదరి రవీంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. ‘పనుల్లో జాప్యం సహించబోను’శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనుల నిర్వహణను వేగవంతం చేయడంతో పాటు ఆన్లైన్ అప్లోడింగ్, బిల్లుల చెల్లింపుల ప్రక్రియను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీరాజ్, రహదారులు భవనాలు, నీటిపారుదల, ట్రైబ ల్ ఇంజినీరింగ్ సహా వివిధ శాఖల పరిధిలోని ఉపాధి హామీ పనుల పురోగతిపై అసిస్టెంట్ ఇంజినీర్ల వారీగా కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో మంజూరైన పనులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, పనులు పూర్తయిన వెంటనే బిల్లుల కు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయా లని స్పష్టం చేశారు. కొత్తూరు, హిరమండలం, మందస, పలాస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్చాపురం, గార, శ్రీకాకుళం, రణస్థలం, లావే రు, బూర్జ సహా జిల్లాలోని అన్ని మండలాల సహాయ ఇంజనీర్లు తమ తమ పరిధిలోని పనులను యుద్ధప్రాతిపదికన పురోగతిలోకి తీసుకురావాలని సూచించారు. రూ.లక్ష పలికిన లడ్డూ వజ్రపుకొత్తూరు: మండలంలోని ఉద్దానం రామకృష్ణాపురం(బొడ్డువానితోటలు)లో వినియక చవితి లడ్డూ ఏకంగా రూ.లక్ష పలికింది. శుక్రవారం వినాయకుని నిమజ్జనోత్సవం సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించగా సైనూరు గ్రామానికి చెందిన చింత బాలకృష్ణ ఒక్కసారిగా రూ.లక్షకు లడ్డూను దక్కించుకున్నారు. -
వ్యవస్థల్ని నాశనం చేసిన ఘనత బాబుదే
● తీవ్రంగా విమర్శించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ● ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుదాం ● ఇచ్ఛాపురం వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చిన పార్టీ సీనియర్ నేతలు కంచిలి, కవిటి, సోంపేట: చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. సోంపేట పట్టణంలో వీబీఆర్ కళ్యాణ మండపం ఆవరణలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఇచ్ఛాపురం నియోజకవర్గం విస్తృత స్థాయి వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైఎస్ జగన్ పాలనలో గ్రామ స్వరాజ్యం కల సాకారమైతే.. కూటమి పాలన వాటిని నిస్తేజపరిచిందన్నారు. ఎరువుల బస్తా వెయ్యి రూపాయలకు కొను గోలు చేసే దిక్కుమాలిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందని ఎద్దేవా చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరుగుతున్నాయని, రూ.13 లక్షలు కోట్లు అప్పు చేసి ఖర్చుచేశారని, క్షేత్రస్థాయిలో మాత్రం అభివృద్ధి జరగలేదని, ఇచ్ఛాపురంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయంతో చంద్రబాబుకు గట్టిగా గుణపాఠం చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. జిల్లాలో వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలలో మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రజల్లోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీ ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేదని ఆరోపించారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ కూటమి పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. పార్టీ సూచించిన అభ్యర్థినే గెలుపించుకుని మరోసారి వైఎస్సార్ సీపీ సత్తా చాటుదామన్నారు. ఎమ్మెల్సీ, జిల్లా పరిశీలకుడు కుంభా రవిబాబు మా ట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశా రని ఆరోపించారు. ఇచ్ఛాపురం నియోజవవర్గంలో మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్ప్రసాద్రెడ్డిఆరోపించారు. -
హాస్టల్ సమస్యలపై పోరుబాట
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి పరిష్కారం కోసం కార్యాచరణ చేపట్టనున్నట్లు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.నాగభూషణం తెలిపారు. శ్రీకాకుళం నగరంలో క్రాంతి భవన్లో జిల్లా సమితి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.నాగభూషణం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమశేఖర్, రవి మాట్లాడుతూ సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్ల సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర సంక్షేమ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, హాస్టళ్లలోని వాస్తవ పరిస్థి తులను పరిశీలిస్తామని తెలిపారు. భోజనం నాణ్యత, మెస్ మెనూ అమలు, తాగునీరు, వసతి గదులు, విద్యుత్, ఫ్యాన్లు, లైట్లు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, పారిశుధ్యం, స్టడీ అవర్స్, పాఠ్యపుస్తకాలు, విద్యా సామగ్రి తదితర అంశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. తక్కువ మెస్ బిల్లుల కారణంగా విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై ప్రభావం పడకుండా ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలన్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత సొంత భవనాలు నిర్మించి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, వంటశాల, భోజన శాల తదితర సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు కేవలం వసతి కల్పించడం మాత్రమే కాకుండా వారి చదువుకు అనుకూలమైన నాణ్యమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు హర్షవర్ధన్, గౌరీ, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. -
విగ్రహాలకు శాపం
● శ్రీముఖలింగంలో రూపు కోల్పోతున్న విగ్రహాలు ● పట్టించుకోని పురావస్తు శాఖ అధికారులు పర్యవేక్షణ లోపం.. సిబ్బందిని ఏర్పాటు చేస్తాం శ్రీముఖలింగం దేవాలయం అతి పురాతన మైనది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాతోపాటు దేవదాయ శాఖ, అర్చకులు, భక్తులు అందరిపై ఉంది. ఇలా పానపట్టం మీద దీపాలు, పసుపు కుంకుమలు పోయడంతో విగ్రహాలు యథా స్వరూపం కోల్పోతున్నాయి. అలా చేయకుండా ఇప్పటికే మా సిబ్బంది పర్యవేక్షణ ఉంది. నిత్య పరవేక్షణ కోసం అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసి విగ్రహాలకు ముప్పు కలగకుండా చర్యలు తీసుకుంటాం. భక్తులు దీపాలు పెట్టేందుకు స్టాండ్లు ఏర్పాట్లుచేస్తాం. – కె.మూర్తి, కన్జర్వేటివ్ అధికారి, విశాఖపట్నం, కేంద్రపురావస్తు శాఖ జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో అష్ట దిక్పాలకుల మూర్తులు యథారూపాన్ని కోల్పో తున్నాయి. ఇక్కడ కొలువైన మధుకేశ్వురుడిని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది భక్తులు వస్తుంటారు. ప్రధానంగా కార్తిక మాసం, శివరాత్రి, దస రా, వినాయక ఉత్సవాలకు భక్తులు దేశవిదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ దేవాలయంలో పూజలు, ధూపదీపాలు దేవదాయ శాఖ ఆధీనంలో నిర్వహిస్తుండగా.. వీటి పర్యవేక్షణ మాత్రం కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉంది. ఇక్కడ కొలువైన వివిధ దేవతా విగ్రహాలను సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఇవి యథా రూపా న్ని కోల్పోతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులు ఈ ఆలయం దర్శిచుకోవడంతోపాటు పూజలు, అభిషేకాలు, ఏకవార అభిషేకాలు, ప్రత్యేక పూజలు, ధూప దీపాలు పెడుతుంటారు. అలాగే కుంకుమార్చనలు, పుష్పాలతో అలంకరణ చేస్తుంటారు. దీని వల్ల విగ్రహాలు యథా స్వరూపం కోల్పోవడంతోపాటు వాటి ఉనికి కూడా ప్రమాదంగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీముఖలింగం ప్రధాన ఆలయంలో కొలువైన ఇంద్రుడు, ఆగ్నేయేశ్వరుడు, హేమేశ్వరుడు, నైరుతేశ్వరుడు, వరుణేశ్వరుడు, వాయవేశ్వరుడు, కుభేరశ్వరుడు, ఈశానేశ్వరుడు విగ్రహాల వద్ద దీపాలు పెట్టి అలాగే వదిలేస్తుండడంతో అవి యథా స్వరూపాన్ని కోల్పోతున్నాయి. అలాగే డుండీ గణపతి సాక్షి గణపతి, చింతామణి గణపతి, కాలభైరవుడు తదితర విగ్రహాల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా శివుని లింగం పానపట్టం మీద అమ్మవారు అయిన పార్వతీ దేవి ఉంటుందన్నది శాస్త్ర ప్రమా ణం. అలాంటి పానపట్టం మీద ఇలా దీపాలు పెట్ట డం శాస్త్ర విరుద్ధం. కాని తెలియని భక్తులు కొందరు ఇలా దీపాలు పెట్టడంతో ఆ విగ్రహాలు రూపం, తేజస్సు కోల్పోతున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన దేవదాయ శాఖ కనీసం చర్యలు చేపట్టడం లేదు. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఈ దేవాలయంపై సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడం విగ్రహాలకు శాపంగా మారింది. -
ఆటతీరు
క్లాస్ ● భారత్–ఎ క్రికెట్ జట్టుకు త్రిపురాన ఎంపిక ● స్వదేశంలో ఆసీస్తో జరిగే మల్టీ డే మ్యాచ్కు అవకాశం ● పట్టలేనంత సంతోషంతో విజయ్, కుటుంబ సభ్యులు శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు క్రికెటర్ త్రిపురాన విజయ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ భారత జట్టు వైపు అడుగులు వేస్తున్నాడు. టెక్కలికి చెందిన ఈ యువ ఆల్రౌండర్ తాజాగా భారత్–ఏ జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మల్టీడే (టెస్టు)మ్యాచ్లలో పాల్గొనే భారత్–ఏ జట్టుకు ఎంపికై నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న తన కలకు ఒకే ఒక్క అడు గు దూరంలో నిలిచాడు. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 11 మధ్య రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆసీ స్ జట్టు భారత్కు వస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన యువ పేసర్ విజయ్కుమార్ వైశాఖ్కు గాయం కారణంగా దూరం కావడంతో అనూహ్యంగా ఆంధ్రాకు చెందిన ఈ స్టార్ ఆల్రౌండర్కు బీసీసీఐ నుంచి పిలుపొచ్చింది. ఆసీస్తో జరిగే ఈ మ్యాచ్లో రాణించి భారత సెలక్షన్ కమిటీని ఆకట్టుకోవాలని విజయ్ భావిస్తున్నాడు. ఆల్రౌండర్గా కీర్తి గడించిన ఈ ఆఫ్ స్పిన్నర్ లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్గా ఆకట్టుకుంటున్నాడు. వీటికితోడు బెస్ట్ ఫీల్డర్గా అనేక మ్యాచ్ల్లో రివార్డులు అందుకున్నాడు. దులీప్ ట్రోఫీలో రాణింపుతో.. దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో రాణించడం ద్వారా సిక్కోలు యువతేజం విజయ్.. భారత–ఎ జట్టుకు ఎంపికయ్యాడు. ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ వంటి ఇండియన్ టాప్క్లాస్ ప్లేయర్లను ఔట్ చేసి దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు. సౌత్జోన్కు ప్రధానమైన ఆఫ్ స్పిన్నర్గా సేవలు అందించాడు. ఇప్పటికే బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మక లీగ్ ఐపీఎల్కు 2025, 2026 రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. జూలై నెలలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన ఎమర్జింగ్ పురు షుల క్రికెట్ టోర్నీలో ఇండియా–బి జట్టుకు ప్రాతినిధ్యం వహించి మెరిశాడు. భారత్–ఏ జట్టుకు విజయ్ ఎంపికపై జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు, ప్రతినిధులు, కోచ్లు, సీనియర్ క్రికెటర్లు, విజయ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెక్కలిలోని అయ్యప్పనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు త్రిపురాన విజయ్ తండ్రి త్రిపురాన వెంకట కృష్ణరాజు సమాచార శాఖ ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి లావణ్య గృహిణి. విజయ్ను కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు అభినందించారు. పట్టలేనంత ఆనందంతో ఉన్నాను ఆసీస్తో జరిగే మల్టీ డే మ్యాచ్లో పాల్గొనే భారత–ఏ జట్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. బీసీసీఐ ప్రకటించిన స్క్వాడ్లో నన్ను చేర్చిన ట్టు వర్తమానం వచ్చిన ఆనందక్షణాలు మర్చిపోలేను. ఇటీవలి ఎమర్జింగ్ టోర్నీ, దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో రాణింపుతో సెలెక్టర్లు అవకాశం ఇచ్చారని భావిస్తున్నాను. నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న క్రికెట్ సంఘ పెద్దలు, కోచ్లు, తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను. – త్రిపురాన విజయ్, క్రికెటర్ -
ఒకేషనల్ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఒకేషనల్ ఎం అండ్ ఏటీ గ్రూపు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.సౌజన్య తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. బీటెక్ రెగ్యులర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి బీటెక్ మెకానికల్, ఆటోమొబైల్ చేసిన వారు అర్హులని స్పష్టంచేశారు. ఆసక్తి గల అభ్యర్థులు రెండు సెట్ల ధ్రువపత్రాలతో ఈ నెల 19, 21వ తేదీలలో శ్రీకాకుళం ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాలలో సంప్రదించాలని కోరారు. ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం జి.సిగడాం: మండలంలోని సీతంపేట పంచాయతీ నక్కపేటలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం తహసీల్దార్ మహాదేవు సరిత, ఎంపీడీఓ గుంటముక్కల రామకృష్ణారావు, ఎస్ఐ కొండపల్లి అప్పలసూరి, సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఆక్రమణులను తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో గ్రామస్తులంతా చేరుకుని తామంతా పేదలమని, సెంటు భూమి కూడా లేదని, ఎన్నో ఏళ్లగా చెరువు గట్టుపై పాకలు వేసి నివాసం ఉంటున్నామని, ఇప్పుడు తొలగిస్తే తమ గతి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. రాజికీయ కక్షలతో తమ పాకలను తొలగించడం భావ్యం కాదన్నారు. దీనిపై అధికారులు స్పందించి హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం భూముల్లో ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నామని, స్వచ్ఛందంగా తొలిగిస్తే సరే అని, లేనిపక్షంలో రెండు రోజుల్లో పోలీసు బందోబస్తుతో వచ్చి ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చామని, ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలన్నారు. -
బహుభాషా నాటిక పోటీలు ప్రారంభం
శ్రీకాకుళం కల్చరల్: కళాకారుల సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో శ్రీ సుమిత్ర కళాసమితి ఆధ్వర్యంలో అఖిల భారత బహుభాషా నాటిక పోటీలు గురువారం ప్రారంభమాయ్యాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు, సుడా ఈఈ పొగిరి సుగుణాకరరావు, నిక్కు హరిసత్యనారాయుణ, ఎల్.రామలింగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న నాటికలు.. తొలుత కోల్కతాకు చెందిన దాల్పుట్ మాణికతలా నాట్య సంస్థ ఆధ్వర్యంలో బెంగాలి నాటిక ‘జ్వాలా‘ ద్వారా దేశవిభజన, శరణార్థుల జీవితాల గురించి, దేశవిభజనలో కలిగిన వేదనలు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. అనంతరం అసోంకు చెందిన ‘జీవశ్రేష్ట’ ద్వారా మానవీయ విలువలను ఎలా కాపాడుకోవాలో సందేశాత్మకంగా తెలియజేశారు. కార్యక్రమంలో ఇప్పిలి శంకర్శర్మ, మెట్ట పోలినాయుడు, కొంక్యాన మురళి, గుత్తు చిన్నారావు, మండవిల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, అశోక్కుమార్, లాడె చంద్రశేఖర్, వీవీఆర్ మూర్తి, జ్యోతి, పూజ, నక్క శంకరరావు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం మరాఠీ నాటిక ‘సూప్’, కన్నడ నాటిక ‘సాంగ్యా –బాల్య’ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
గోల్డ్ స్కీమ్ పేరుతో స్కామ్
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలో గోల్డ్ స్కీమ్ పేరుతో స్కామ్ చేసి సొంత యజమానినే అకౌంటెంట్ బురిడీ కొట్టించాడు. గడిచిన రెండేళ్లలో ఏకంగా రూ. 41.5 లక్షల స్కీమ్ సొమ్ము ను స్వాహా చేశాడని యజమాని ఆరోపిస్తున్నా రు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని జీటీ రోడ్డు లో రాజా జ్యుయలరీ షాపును నడుపుతున్న వైశ్యరాజు నాగరాజు వద్ద అకౌంటెంట్గా ఇప్పి లి రమణ కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. నాగరాజు నగరంలోనే రాజా సిల్క్మందిర్, ఆర్ఎస్ఎం తదితర షాపింగ్మాళ్లకు ఓనర్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో గోల్డ్ స్కీమ్ పేరుతో కస్టమర్ల రోజువారీ డిపాజిట్ సొమ్ము ను అకౌంట్స్లో టాలీ చేసి రికార్డుల్లోనే చూపిస్తున్న రమణ.. నగదు రూపేణా చూపించకపోవడమే కాక నెలకు రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు మాయం చేశాడు. ఇలా రెండేళ్లుగా రూ. 41.5 లక్షలు రమణ మోసం చేసినట్లు గ్రహించిన నాగరాజు ఒకటో పట్టణ పోలీసులను ఇటీవల ఆశ్రయించాడు. దీనిపై ఇంకా కేసు నమోదు కాలేదని, రాజీ ప్రయత్నం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పల్లె నిద్రతో శాంతిభద్రతలపై అవగాహన శ్రీకాకుళం క్రైమ్ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తలపెట్టిన పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో భద్రతాభావాన్ని పోలీసులు కల్పిస్తున్నారని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మహిళలు–చిన్నారుల భద్రత, సైబర్ మోసాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణ, శాంతిభద్రతలు, ఎన్నికలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద భైరిలో పల్లె నిద్ర చేయగా, రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు సిబ్బందితో కలిసి పీఎన్కాలనీలో చేయగా జిల్లాలో పలు పోలీస్స్టేషన్ల పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమాలు జరిగాయి. అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా, ఎక్క డ అవాంఛనీయ ఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగినా 112కు సమాచారం ఇవ్వా లని ఎస్పీ ప్రజలను కోరారు. 18.5 కిలోల గంజాయి స్వాధీనం కాశీబుగ్గ: ఒడిశా నుంచి వయా పలాస మీదు గా విజయవాడకు గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని కాశీబుగ్గ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లాకు చెందిన మున్నా బరదన్తో పాటు గజపతి జిల్లాకు చెందిన సంజనా కర్జిలకు ఓ వ్యక్తి విజయవాడకు గంజాయిని తరలిస్తే చెరో రూ. 5వేలు ఇస్తానని ఆశజూపాడు. తక్కువ సమయంలో ఆదాయం వస్తుందని భావించి అంగీకరించిన వీరిద్దరూ వేకువ జామున పదంపూర్ నుంచి పర్లాకిముడి చేరుకున్నారు. అక్కడి నుంచి కాశీబుగ్గ బస్సులో వచ్చి పలాస రైల్వే స్టేషన్ వైపు వెళ్తుండగా ఎస్ఐ సీహెచ్ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం వారిని అదుపులోకి తీసుకుంది. వారిదగ్గరున్న రెండు సంచులను తెరిచి చూడగా 18.5 కిలోల గంజాయి వెలుగుచూసింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికి గంజాయి సరఫరా చేయమని చెప్పిన వ్యక్తి ఎవరన్న విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి. రామకృష్ణ తెలిపారు. -
బోరవానిపేట పంచాయతీకి ఐఎస్ఓ సర్టిఫికెట్
గార: బోరవానిపేట పంచాయతీ రాష్ట్రం నుంచి చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్గా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీలకు నామినేట్ అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఐఎస్ఓ సర్టిఫికెట్ ప్రదానం చేసింది. గురువారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ నుంచి డిప్యూటీ ఎంపీడీవో రమేష్, పంచాయతీ సెక్రటరీ బి.కృష్ణవేణి ఐఎస్ఓ సర్టిఫికెట్ అందుకున్నారు. గుడ్ గవర్నెన్స్ నేపథ్యంలో సర్టిఫికెట్ అందజేస్తున్నట్లు వారు తెలిపారు. 20న ఉత్తరాంధ్ర స్థాయి వాలీబాల్ పోటీలు జి.సిగడాం: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉన్న వాలీబాల్ క్రీడాకారులకు జి.సిగడాం మండలం మెట్టవలస గ్రామంలో ఈ నెల 20న ఉత్తరాంధ్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని మల్లికార్జున యువజన సంఘం సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగే ఈ పోటీల్లో ప్రథమ బహుమతి రూ. 20 వేలు, రెండో బహుమతికి రూ.10 వేలు, మూడో బహుమతికి రూ. 5 వేలు, నాలుగో బహుమతి కింద రూ.3 వేలు చొప్పున అందిస్తామని వివరించారు. ఆసక్తి గల జట్లు 63016 31609 నంబర్ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 21న అప్రెంటిస్ మేళా ఎచ్చెర్ల : స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 21న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని తొమ్మిది కంపెనీల ప్రతినిధులు హాజరై అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో వివిధ ట్రేడ్లలో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులు మూడు బయోడేటాలతొ పాటు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని కోరారు. శ్యాంక్రంగ్ పిస్టన్స్, నాగార్జున అగ్రికమ్, దీపక్మైనీ, సొల్యూషన్, జయభేరి తదితర కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. భార్యను వేధించిన భర్తకు జైలుశిక్ష కాశీబుగ్గ : భార్యను వేధించిన కేసులో భర్తకు మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ పలాస మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి యు.మాధురి తీర్పునిచ్చారు. పలాస మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన గుంట స్వాతి తన భర్త విశ్వేశ్వరరావు వేధిస్తున్నాడంటూ 2018లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి సీఐ కె.అశోక్కుమార్ కేసు నమోదు చేయగా, గురువారం న్యాయమూర్తి తుది తీర్పును వెలువరించారు. ముద్దాయికి మూడు నెలల జైలు శిక్ష, రూ. 3వేల అపరాధ రుసుం విధించినట్లు కాశీబుగ్గ సీఐ జి.రామకృష్ణ తెలిపారు. రేపు జాబ్మేళా రణస్థలం: కౌశలం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19న జిల్లా పరిషత్ నూతన సమావేశ మందిరంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రణస్థలం ఎంపీడీవో ఎం.ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 గంటలకు నియామక ప్రక్రియ ప్రారంభమౌతుందని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, బీటెక్ మెకానికల్ విద్యార్హతలతో 18 నుంచి 32 ఏళ్ల పురుష అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. -
అంబేడ్కర్ను కించపరిస్తే సహించం
శ్రీకాకుళం : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్పై హమారా ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శ్రీకాకుళం నగరంలో జిల్లా దళిత ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు దళిత ప్రజా సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరై డే అండ్ నైట్ కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. హమారా ప్రసాద్ రచించిన ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని నిషేధించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్పై అవమానకర వ్యాఖ్యలు చేయడం సామాజికంగా ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని, మతోన్మాది హమారా ప్రసాద్పై దేశద్రోహం కేసు పెట్టి శిక్షించాలన్నారు. నిరసన కార్యక్రమంలో దళిత ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు పేడాడ కృష్ణారావు, బోకర నారాయణరావు, మిస్కా కృష్ణయ్య, రాయి వేణుగోపాల్, దుర్గాసి గణేష్, కంఠ వేణు, తైక్వాండో శ్రీను, యడ్ల గోపి, ఎస్సీ ఎస్టీ లాయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.మురళీకృష్ణ, చలపతిరావు, ముక్కు ఆదినారాయణ, నటుకుల మోహనరావు, పోతుల దుర్గారావు, బోనెల అప్పారావు, ముస్లిం మైనార్టీ నాయకులు రఫీ, జర్నలిస్టు నల్లి ధర్మారావు, శాసపు జోగినాయుడు పాల్గొన్నారు. -
సొమ్ములిస్తేనే శుద్ధజలం!
● డొంకూరు ఉన్నత పాఠశాలకు 60 రోజులుగా ట్యాంకర్ నీరే దిక్కు ● ఐదు వేల లీటర్లకు రూ.1,750 చెల్లిస్తున్న గ్రామ పంచాయతీ ఇచ్ఛాపురం రూరల్: పాఠశాల విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించాల్సిన పరిస్థితుల్లో...డబ్బులు చెల్లిస్తేనే శుద్ధజలం అందుతున్న వైనం మత్స్యకార గ్రామమైన ఇచ్ఛాపురం మండలం డొంకూరు ఉన్నత పాఠశాలలో నెలకొంది. వంతెనల నిర్మాణ పనుల కారణంగా పాఠశాలకు గతంలో అందుతున్న రక్షిత మంచినీటి సరఫరా పైపులైన్ సుమారు 160 మీటర్లు మేర తొలగించడంతో సుమారు 60 రోజులుగా ట్యాంకర్ నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో 300 మందికి పైగా విద్యార్థులు తాగేందుకు, మధ్యాహ్న భోజనం వండేందుకు ఇదే నీటిని వినియోగిస్తున్నారు. రూ.1,750 చెల్లిస్తే 5వేల లీటర్లు.. పాఠశాలకు రెండు రోజులకు ఒకసారి ఈదుపురం ఎన్టీఆర్ సుజలధార ప్రాజెక్ట్ నుంచి ట్యాంకర్ ద్వారా 5 వేల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందుకు ఎన్టీఆర్ సుజలధార ప్రాజెక్టు–పలాస వారికి గ్రామ పంచాయతీ నుంచి ఒక్కో ట్యాంకుకు రూ.1,750 చెల్లిస్తున్నట్లు పంచాయతీ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు తాగునీరు అందించేందుకు స్థానిక సంస్థ నిధుల నుంచి ఇలా నిరంతరం వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటికి రుసుమా? ఎన్టీఆర్ పేరుతో నడుస్తున్న ఎన్టీఆర్ సుజలధార ప్రాజెక్టు నుంచి పాఠశాల విద్యార్థులకు తాగునీరు అందించేందుకు రుసుము వసూలు చేయడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులకు ఉచితంగా సురక్షిత తాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. శాశ్వత పరిష్కారమెప్పుడో? వంతెనల నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో పాఠశాలకు రక్షిత మంచినీటి సరఫరాను పునరుద్ధరించడంపై అధికారులు దృష్టి సారించాల్సి ఉందని స్థానికులు అంటున్నారు. ట్యాకర్లపై ఆధారపడటం వల్ల పంచాయతీకి అదనపు భారం పడటంతో పాటు రెండు రోజులకు ఒకసారి వచ్చే నీటితో 300 మందికి పైగా విద్యార్థుల అవసరాలు తీర్చడం ఎంత వరకు సాధ్యమన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలకు శాశ్వతంగా రక్షిత మంచినీటి సరఫరా పునరుద్ధించాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. మరమ్మతులు చేపట్టాలి వంతెనల నిర్మాణం కారణంగా పైప్లైన్ పూర్తిగా పాడైంది. రెండు నెలలుగా పాఠశాలకు రక్షిత మంచినీటి పథకం ద్వారా మంచినీరు రాకపోవడంతో ఎన్టీఆర్ సుజలధార నిర్వాహకులను పంచాయతీ, ఎంపీడీఓ ద్వారా సంప్రదించాం. పాఠశాలకు ఉచితంగా నీటిని సరఫరా చేయలేమని చెప్పడంతో ఒక్కో ట్యాంకుకు రూ.1,750లు పంచాయతీ ద్వారా వెచ్చించి తాగునీరు అందిస్తున్నారు. వంతెన కాంట్రాక్టర్లు తక్షణమే స్పందించి పైప్లైన్ పనులు చేపట్టి పాఠశాలకు మంచినీటిని సరఫరా చేయాలి. – బుడ్డ కళ్యాణ్, యువకుడు, డొంకూరు -
కొంపముంచిన రాబంధువు
● పాతటెక్కలి భారీ చోరీ ఘటనలో దొరికిన కీలక నిందితుడు ● మరో ఇద్దరు పాత నేరస్తులతో కలసి పథక రచన ● ముగ్గురిదీ ఒడిశానే– పోలీసుల అదుపులో నిందితులు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో ఇటీవలి కాలంలో భారీ చోరీలతో రెచ్చిపోయిన ఒడిశా చోరులు జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఇప్పటికే వారినుంచి పూర్తి స్థాయి లో సొత్తును స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. పాత టెక్కలి కేసే పట్టించింది పాతటెక్కలిలో చిన్న టిఫిన్ కొట్టు నడుపుతూ ఇద్దరు కుమార్తెలు, భార్యతో కలసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న మళ్లా భూపతి ఈ నెల 5 రాత్రి 7.30 గంటలకు కుటుంబంతో కలసి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లాడు. తిరిగి 7న వచ్చి చూసేసరికి తాళాలు బద్దలు గొట్టి ఇంట్లో దొంగలు ప్రవేశించి బీరువాలో ఉన్న బంగారు వస్తువులు 10 తులాలు, వెండి వస్తువులు కిలోన్నర, రూ. 4 లక్షల నగదు చోరీ చేశారు. వెంటనే వజ్రపుకొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అడిషనల్ ఎస్పీ (క్రైమ్) పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలోని బృందాలుగా విడిపోయిన పోలీసులు నిందితులను అనతికాలంలోనే పట్టుకున్నారు. బంధం కలిపాడు.. ఇంటికి కన్నమేశాడు బాధితుడైన భూపతిని పోలీసులు ఎవరిౖపైనెనా అనుమానం ఉందా అని అడుగగా.. ఒడిశా పర్లాఖిముండి కాంప్లెక్స్ ఎదురుగా టిఫిన్షాపు నడుపుతున్న తన పెద్దమ్మ మనవడు పొట్నూరు మిన్నాపైన అనుమానం ఉందన్నాడు. మిన్నా ఈ ఏడాది ఏప్రిల్ 30న అతని సోదరుని పెళ్లికి వెళ్లేటప్పుడు పరిచయమయ్యాడని, ఆ రోజే తన భార్య ఒంటిపై బంగారం చూశాడని, రెండు నెలల క్రితం ఇంటికొచ్చాడని, అప్పుడప్పుడూ ఫోన్లో కుటుంబసభ్యులతో మాట్లాడేవాడని, ఆ క్రమంలోనే చోరీకి 3 రోజుల ముందు తమ కుమార్తెతో మాట్లాడి విజయవాడ వెళ్తున్నట్లు తెలుసుకున్నాడన్నారు. ఒకానొ క సందర్భంలో మిన్నా సోదరుడు సైతం మిన్నాతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడని భూపతి తెలిపారు. దీంతో పోలీసులు మిన్నాను అదుపులోకి తీసుకుని విచారించగా ఇద్దరు పాత నేరస్తులతో కలసి చోరీకి పథక రచన చేసినట్లు చెప్పాడు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయగా 4 నెలల కిందట మెళియాపుట్టిలోని 12 తులాల బంగారం కేసుతో పాటు మరో 3 నాన్ గ్రేవ్ కేసుల్లో హస్తముందని తెలిసింది. వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని సొత్తు పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి కేసులకు సంబంధించి సొత్తు పూర్తిగా రికవరీ అయినట్లు సమాచారం. పాతటెక్కలి చోరీ కేసులో పోలీసులు రికవరీ చేసినవి.. నల్లపూసలు 2.5 తులాలు, బిస్కెట్లు 2 తులాలు, గొలుసు తులం, చిన్నబిల్ల వున్న గొలుసు తులం, పట్టీలు 4 జతలు (వెండివి), ఉంగరాలు –2 (తులం), చిన్న ఉంగరం వెండి వస్తువులు కేజీన్నర 3 రకాలు, క్యాష్ రూ. 4 లక్షలు -
విశ్వకర్మలు మన తొలి ఇంజినీర్లు
● విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి వైఎస్సార్సీపీ కృషి చేస్తుంది ● విశ్వకర్మ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): విశ్వకర్మ జయంతి అంటే కేవలం ఒక వర్గానికి సంబంధించిన కార్యక్రమం కాదని తరతరాలుగా సమాజానికి సేవలందించిన వృత్తుల గురించి గుర్తుచేసుకునే సందర్భమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. విశ్వకర్మలు మన సమాజంలో తొలి ఇంజినీర్లు అని అన్నారు. విశ్వకర్మ భగవాన్ జయంతి కార్యక్రమాన్ని డాకోజు వెంకటరావు అధ్యక్షతన వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయం (టౌన్ హాల్)లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పాల్గొని విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ సంప్రదాయ వృత్తులు మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందేందుకు ఆధునిక శిక్ష ణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవకాశాలు, ఆర్థిక సహకారం అందించాల్సిన అవసరం ఉంద న్నారు. ఆ దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన చేసి విశ్వకర్మలను ఆదుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు. విశ్వకర్మలను కేవలం ఒక వృత్తికి చెందినవారిగా చూడకూడదని, వారి వెనుక ఉన్న జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, శ్రమను గౌరవించాలన్నారు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఎంవీ పద్మావతి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సీఈసీ మెంబర్ అంధవరపు సూరిబాబులు విశ్వకర్మల అభివృద్ధి ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యపడుతుందన్నారు. విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేకంగా ఓ సామాజిక భవనాన్ని జిల్లా కేంద్రంలో నిర్మించి ఇచ్చిన ఘనత ధర్మాన ప్రసాదరావుకే దక్కిందన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు సింహాద్రి ధనుంజయరావు, అనుపోజు కోటిబాబు, టేకి వీరభద్రరావు, సింహాద్రి గోపాలకృష్ణ, మంతిన హరనాధరావు, బాలకృష్ణారావు, శ్రీనివాసరావు, కోటిపల్లి మోహనరావు, శ్రీధర్, తారక్లతో పాటు అధిక సంఖ్యలో విశ్వకర్మలు పాల్గొన్నారు. వారికి సన్మానం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తూర్పుకాపు బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవీ స్వరూప్, రాష్ట్రకార్యదర్శి, పలాస నియోజకవర్గ పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, టెక్కలి నియోజకవర్గ పరిశీలకులు చల్ల రవికుమార్, యువనేత ధర్మాన రామ్మనోహర్నాయుడు, జిల్లా ప్రధానకార్యదర్శి గేదెల పురుషోత్తం, కళింగవైశ్యకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు కోణార్క్ శ్రీను, ఎస్సీ విభాగం రాష్ట్రకార్యదర్శి పొన్నాడ రుషి, జిల్లా అధ్యక్షులు ముంజేటి కృష్ణమూర్తి, రౌతు శంకరరావు, లంక రమేష్, ఎం.ఏ భేగ్, గొండు రఘురాం, మూకళ్ళ తాతబాబు, మండవల్లి రవి, సాధు వైకుంఠరావు, గద్దిబోయిన కృష్ణయాదవ్, సనపల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
బాలరాజుకు యూత్ ఐకాన్ అవార్డు
హిరమండలం: సౌత్ ఇండియా ఎడ్యుకేషనల్ యూత్ ఐకాన్ అవార్డుకు హిరమండలం మండలంలోని దుర్భలాపురానికి చెందిన ఉపాధ్యాయుడు బాలరాజు ఎంపికయ్యారు. పాఠశాల విద్యారంగంలో కృషికి బాలరాజు చేసిన సేవలను గుర్తించిన మక్స్ గ్లోబల్ ఫౌండేషన్ ఈ అవార్డు ప్రకటించింది. ఈ నెల 20న హైదరాబాద్లో జరగనున్న కార్యక్రమంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ చేతులమీదుగా బాలరాజు అవార్డు అందుకోనునున్నారు. తెలంగాణలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలరాజు ఎస్అండ్ఎస్ పబ్లికేషన్స్ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువకులకు పోటీ పరీక్షలకుగాను శిక్షణ అందిస్తున్నారు. -
చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీపై చర్చకు రావాలి
● ఎమ్మెల్యే కూన రవికుమార్కు ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ సవాల్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): డీఎస్సీలో అక్రమాలు చేసి అన్నీ సక్రమాలే అంటూ ఎమ్మెల్యే కూన రవికుమార్ నిస్సిగ్గుగా చెప్పడం దారుణమని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మండిపడ్డారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడు తూ ఫేక్ సర్టిఫికెట్లతో రాష్ట్రంలో 3.40 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో కూన రవికుమార్ ఆడుకోవడం సరికాదన్నారు. చేసేవన్ని దొంగపనులు, వాటిని కప్పిపుచ్చుకోవడానికి నోరుంది కదా అని పెద్ద పెద్ద కేకలు వేసి అరిస్తే అబద్ధాలు నిజమైపోవన్నారు. జీవో నెంబర్ 47లో ఏ లోపాలు లేకుంటే మా నాయకుడు జగన్మోహన్రెడ్డి ప్రశ్నించిన వెంటనే మరో జీవో 56ని ఎందుకు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. నిజంగా నిరుద్యోగులపై చిత్తశుద్ధి ఉంటే ఆధారాలతో సహా బహిరంగ చర్చకు ఈ నెల 22న ఆమదాలవలస వైఎస్సార్ విగ్రహం వద్దకు రావాలని, లేదా ఏదైనా వేదిక మీరు చెప్పినా ఆధారాలతో నేను వస్తానని సవాల్ విసిరారు. ఫామ్–2లో స్పోర్ట్స్కు సంబంధించి సాఫ్ట్బాల్ కార్యదర్శి సంతకాలుంటేనే అర్హులుగా భావిస్తామని చెబితే అధ్యక్షులుగా ఉన్న కూన రవికుమార్ సంతకాలు ఎలా చెల్లుబాటవుతాయని మండిపడ్డారు. కేవలం నాలుగు మాత్రమే తాను సంతకాలుపెట్టి ఇచ్చానని కూన చెప్పడం దారుణమన్నారు. మొత్తం 37మందికి సాఫ్ట్బాల్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలిస్తే అందులో తన దగ్గరే 25 మందికి కూన రవి సంతకాలతో ఉన్నాయని, ఇంకా మిగిలినవి ఉద్యోగాలు రానివి దరఖాస్తు చేసుకున్నవారు ఇంకెంతమంది ఉన్నారో, ఎంతమంది దగ్గర ఎన్ని లక్షలు దోచుకున్నారో తెలియదన్నారు. స్పోర్ట్స్ కోటాలో 2025 మే 31 చివరి తేదీగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారని, అయితే 2025 జూలై 16న జారీచేసిన సర్టిఫికెట్లు ఎలా చెల్లుబాటు అవుతాయో చెప్పాలన్నారు. ఫేక్ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందిన షేక్సబ్బీర్, అశోక్కుమార్లకు ఎలా ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలన్నారు. నిరుద్యోగులపై చిత్తశుద్ది ఉంటే తక్షణమే సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఇంటర్లో మ్యాథ్స్ వారికి 10 సబ్జెక్టులుంటాయని అనడం దారుణమని, కనీసం ఎన్ని సబ్జెక్టులుంటాయో తెలియని మీరు చదువుకోసం మాట్లాడం సిగ్గుచేటన్నారు. చూసిరాసి పాసైతే ఏయే గ్రూపులకు ఎన్ని సబ్జెక్టులుంటాయో ఎలా తెలుస్తుందన్నారు. గ్లోబల్కి..గోబెల్కి తేడా తెలియని కూన తమ నాయకుడి కోసం మాట్లాడటం తగదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, సరుబుజ్జిలి మండల అధ్యక్షుడు బెరవ మల్లేశ్వరరావు, కోరాడ రమణమూర్తి, పొడుగు శ్రీనివాసరావు, చింతాడ ప్రసాదరావు, ఈశ్వరరావు, సురవరపు నాగేశ్వరరావు, చిన్నారావు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి చెరువులో మట్టి దోపిడీ
సంతబొమ్మాళి: అధికార పార్టీ నాయకులు సహజ వనరులను కొల్లగొడుతున్నారు. ఒక వైపు కంకరను తరలించుకు పోగా.. మరో వైపు మట్టిని కూడా వదలకుండా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే హనుమంతునాయుడు పేట పంచాయతీ చిన్నకేశనాయుడు పేట గ్రామంలో ఉపాధి చెరువు మట్టిని అక్రమంగా గురువారం పట్టపగలు తరలించుకుపోయారు. గ్రామంలోని కొత్తచెరువులో ఏటా లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో పనులు చేపడుతున్నారు. పనుల్లో భాగంగా ఉపాధి కూలీలు చెరువులోని మట్టిని గట్లపై పోసి లెవలింగ్ చేశారు. ఈ మట్టిపై కొందరు టీడీపీ నాయకుల కన్ను పడింది. దీంతో యంత్రాలు వినియోగించి ట్రాక్టర్ల ద్వారా మట్టిని పట్టపగలు తరలించుకుపోతున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టిని సుమారు రూ.400లకు విక్రయిస్తున్నట్లు ఉపాధి హామీ కూలీలు తెలిపారు. పట్టపగలే ట్రాక్టర్లతో మట్టి తరలిస్తుండటాన్ని గమనించిన స్థానిక యువకులు అక్కడకి చేరుకుని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొంత సమయం మట్టి తరలింపు నిలిచిపోయింది. అనంతరం యువకులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మళ్లీ యథేచ్చగా మట్టి తరలించారు. అధికారులకు తెలిసిన చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉపాధిహామీ ఏపీఓ పంగ నరసింహమూర్తిని సంప్రదించగా ఉపాధిహామీ చెరువు మట్టిని తరలించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. స్థానిక వీఆర్వో సాయిని అడుగగా తన దృష్టికి రాలేదని, సమాచారం ఇస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. -
అరకొరగా నెఫ్రాలజిస్టు సేవలు
కాశీబుగ్గ : ఉత్తరాంధ్ర కిడ్నీ వ్యాధి బాధితుల ఆశాదీపం.. పలాస కిడ్నీ ఆస్పత్రి నిండా సదుపాయాలు ఉన్నా.. వాటిని వినియోగించక నానాటికీ కునారిల్లుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, మేటి వసతులతో జాతీయస్థాయి ఎయిమ్స్ తరహాలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఆస్పత్రిని తీర్చి దిద్దారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చొరవ తీసుకుని అన్ని సదుపాయాలు కల్పించారు. గతంలో పాలించిన వారికి ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో ఈ ఆస్పత్రిని ఈ ప్రాంతంలో నిర్మించారు. అలాంటి అరుదైన వనరును వినియోగించుకోవాల్సింది పోయి.. కనీస సదుపాయాలను కూడా క ల్పించలేకపోతున్నారు. ఆస్పత్రిలో నేటికీ పూర్తిస్థాయిలో భర్తీ కాని వైద్యులు, సిబ్బంది ఖాళీలే అందుకు నిదర్శనం. 166 మందికి.. 30 మందితోనే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, నెఫ్రాలజీ, యూ రాలజీతోపాటు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య పోస్టులు 46, సిబ్బంది 60, ఇతర సహాయ సిబ్బంది 60 చొప్పున ఆస్పత్రికి మంజూరు చేశారు. కానీ ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం జరగలేదు. వైద్యులు 20 మంది మాత్రమే ఉన్నారు. సాంకేతిక సహాయ సిబ్బంది విషయానికి వస్తే 18 మందికి 10 మందితో సేవలు సాగిస్తున్నారు. ఈ పదిమందిలో కొందరు కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. సకల సదుపాయాలున్నా.. ఉద్దానం ప్రాంత కిడ్నీ బాధితులకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. క్యాజువాలిటీ, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, నెఫ్రాలజీ వార్డులు, ఓటీ కాంప్లెక్స్, పోస్ట్ ఆపరేటివ్, రేడియో డయాగ్నోసిస్, ఆస్పత్రి స్టోర్స్, సెంట్రల్ ల్యాబ్లు, ఐసీయూ, యూరాలజీ వార్డులు, పరిశోధన ల్యాబులతో ఆస్పత్రిని ప్రారంభించారు. 2 డీ ఎకో, సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్రే, హైఎండ్ కలర్ డాఫ్లర్, ఏబీజీ అనలైజర్ పరికరాలతో పాటు పూర్తి రిమోట్ నియంత్రిత ఐసీయూ సౌకర్యాలను కిడ్నీ పరిశోధన కేంద్రంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ వీటి సేవ లు మాత్రం పూర్తిగా వినియోగంలోకి రాని పరిస్థితి నెలకొంది. బాధితులు పెరుగుతున్నారు ఇటీవల ఉద్దానం ప్రాంతంలో 3,897 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 949 మందికి కిడ్నీ సంబంధిత వ్యాధులున్నట్లు గుర్తించారు. అంటే బాధితులు 24.35 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో కిడ్నీ వ్యాధి తీవ్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి, శాశ్వత పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని వైద్య రంగ నిపుణులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల డిమాండ్లు ఇవే.. వ్యాఽధి మూలాలను కనిపెట్టి శాసీ్త్రయంగా నిర్ధారించేందుకు అంతర్జాతీయ నిపుణుల సహకారంతో సమగ్ర పరిశోధన అవసరం. పరిశోధన కేంద్రంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలి. ప్రస్తుతం 60 ఉన్న డయాలసిస్ వార్డుల సంఖ్య రెట్టింపు చేయాలి. డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలి. మండలానికో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రోగులకు మరిన్ని వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. మండలస్థాయి ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలి. ఆయా కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహించే సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు కల్పించాలి పలాస కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని వేధిస్తున్న ఖాళీలు నలుగురి సేవలను ఒకరితో చేయిస్తున్న వైనం వైద్యులు, సిబ్బంది భర్తీపై ఎనలేని నిర్లక్ష్యం డయాలసిస్ కేంద్రంలో ప్రత్యేక నెఫ్రాలజిస్టు ఒకరున్నారు. ఈయన అప్పుడప్పుడు మాత్ర మే అందుబాటులో ఉంటున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఇంకొందరు వైద్యులు, సిబ్బంది అయితే డిప్యుటేషన్పై ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ సేవలు అందించేందుకు అంత సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. కారణం నలుగురు చేయాల్సిన పనులను ఒకరితోనే ప్రభుత్వం చేయిస్తోంది. దీంతో వారంతా విముఖత వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత మేరకు ఇక్కడి నుంచి వెళ్లిపోతే బాగుండనే భావన వైద్యుల నుంచి సిబ్బంది వరకు కనిపిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. విధుల నిర్వహణలో వైద్యులతో పాటు సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలను గుర్తించాలి. వాటి పరిష్కారానికి కృషి చేయాలి. లేకుంటే కిడ్నీ బాధితులకు వైద్యమందని పరిస్థితి నెలకొనే ప్రమాదముంది. -
నవరాత్రి శోభ
● కళలను ఆదరిస్తూ, ఆకలిని తీరుస్తున్న వినాయక మండపాలు ● చల్లటి సాయంత్రాలలో భక్తి గీతాల ఆలాపన ● ప్రతి ఊరిలోనూ అన్న సంతర్పణ భజనలతో భక్తి భావం భజనలతో ప్రజల్లో భక్తిభావాలు పెంపు చేయవచ్చు. డీజేలతో ఒక పక్క చెవులకు ఇబ్బంది, మరో పక్క సౌండ్ పొల్యూషన్ వస్తుంది. డీజేలు రద్దుచేయడం ఎంతో మంచి పని. నగరంలోని దండివీధిలో భజన ఏర్పాటు చేశారు. – పాపారావు స్వామి, శివజ్యోతి భక్త భజన బృందం అపార్టుమెంటులో భజనలు నగరంలోని పీఎన్ కాలనీలో ఉన్న సాయివిహార్ అపార్టుమెంట్లో గణపతి నవరాత్రు లు సందర్భంగా భజన ఏర్పాటుచేశారు. భజన ముక్తి మార్గమని మన పురాణాలు చెపుతున్నాయి. – దాసరి పాపారావు, శ్రీసత్యసాయి భజన మండలి సామాజిక బాధ్యత అన్నదానం పుణ్యకార్యం మా త్రమే కాదు. ఆకలితో ఉన్న మనిషికి చేయూతనిచ్చే సామాజిక బాధ్యత కూడా. ఆహారం వృధా కాకుండా అవసరమైన వారికి చేరేలా చూడటం, సామూహిక అన్నదానాలను సద్వినియోగం చేయడం సమాజానికి మంచిది. – ఎం.రాంబాబు, అడ్వకేట్డీజేల గోల మధ్య ఓ సుస్వర రాగమొకటి పల్లవిస్తోంది. వింత వింత ఆకృతులనే వాదనల మధ్య ఓ అన్నార్తుడి ఆకలి తీరుతోంది. వినాయక మండపం సుస్వరాల ‘విందు’ను అందిస్తోంది. అసందర్భ సినిమా పాటలు, అశ్లీల గానాల విమర్శలు ఉన్నా.. ఎక్కడో ఓ చోట భజన మండలి వారు చల్లటి సాయంత్రం వేళ హృద్యమైన కీర్తనలు ఆలపిస్తూ దోష పరిహారం చేస్తున్నారు. భారీ అలంకరణలతో పాటు అంతే భారీగా అన్నదానాలూ జరుపుతున్నారు. దేవుడి పండగను కళను ఆదరించడానికి, ఆకలిని తీర్చడానికి వేదికగా సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామాల్లో భజనలు గ్రామాల్లో భజనలకు ప్రాధా న్యం ఇస్తాం. తద్వారా ప్రజలలో భక్తి భావాలు పెరుగుతాయి. గణపతి ఉత్సవాలకు ప్రతి ఏడాది భజనలు చేస్తుంటాం. – కాయ లక్ష్మణరావు, శ్రీరామ భజన బృందం భజన తప్పనిసరి గణపతి ఉత్సవాల్లో భజనలు ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రజలకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భగవంతుని సులువుగా చేరేందుకే భజన చక్కటి మార్గమని అని మన పెద్దలు చెబుతారు. – కర్రి ఆదినారాయణ, చైతన్యభారతి భజన బృందం శ్రీకాకుళం కల్చరల్/ఇచ్ఛాపురం రూరల్: వినాయక మండపాలు ప్రత్యేకత చాటుకుంటున్నాయి. డీజేల గోల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఒకప్పటిలా భజన బృందాల గానాలాపనతో పవిత్రత సంతరించుకుంటున్నా యి. ఈ ఏడాది జిల్లా అధికారులు గణపతి ఉత్సవాల సమయంలో ఊరేగింపుల కోసం డీజేలను పోలీసులు నిషేధించారు. గత ఏడాది కూడా నిషే ధం ప్రకటించినా అంతగా అమలు కాలేదు. ఈ ఏడాదీ అదే దారిలో వెళ్తున్నారు. అయితే డీజేల స్థానంలో అక్కడక్కడా మన సంప్రదాయ భజనలు వినిపిస్తున్నాయి. ఇది గణపతి ఉత్సవాలకు మరింత శోభను తెచ్చి పెడుతోంది. అపార్ట్మెంట్లు, వినాయక మండపాల్లో ఈ భజనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని పీఎన్కాలనీ, దండివీధితో పాటు మారుమూల పల్లెల్లో ఈ గానాలాపన కొనసాగుతోంది. అన్నం.. ఆత్మీయత ఆకలితో ఉన్న వాడికి పట్టెడు అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదు. చవితి సంబరాల్లో అన్నదానాలు చేయడమన్న ఆనవాయితీ కొనసాగుతోంది. గతంలో దేవాలయాలు, పెద్ద ఉత్సవ ప్రాంగణాలకే పరిమితమైన అన్నదాన కార్యక్రమాలు ఇప్పు డు వీధులు, కాలనీల్లోనూ విస్తరిస్తున్నాయి. ఉత్సవ కమిటీలతో పాటు యువత ముందుకు వచ్చి చందాలు సేకరించడం, దాతల సహకారం తీసుకోవడం, భక్తులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్నదానం అంటే కేవలం భోజనం పెట్టడం మాత్ర మే కాదు. అపరిచితులను సైతం ఆత్మీయంగా పలకరించి, ఒకే వరుసలో కూర్చోబెట్టి భోజనం పెట్ట డం ద్వారా సామాజిక సమానత్వాన్ని చాటడం. ఒకే పంక్తిలో అన్ని వర్గాల ప్రజలు భోజనం చేయడం పండుగ వాతావరణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అన్నదానం కార్యక్రమంలో భక్తులు పద్మావతినగర్లో ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవ మండపం వద్ద డీజేలు వద్దని ప్లకార్డుల ప్రదర్శన -
జీతం ప్రభుత్వానిది.. పని పార్టీది..!
● హాస్టల్లో నైట్వాచ్మెన్గా చేరిన ఐటీడీపీ కార్యకర్త ● విధులకు రాకుండా జీతం తీసుకుంటున్న వైనం ● చర్యలకు వెనుకాడుతున్న అధికారులు ప్రత్యేక అనుమతులు ఇచ్చారా రాజపురం వసతి గృహంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం పొందిన పుల్లట రాజు ఐటీడీపీ కార్యకర్తగా బహిరంగంగానే టీడీపీ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటున్న వ్యక్తికి ఈ తరహా కార్యక్రమాలు, పార్టీ నాయకులతో కలిసి తిరగడంలో చట్టపరంగా ప్రత్యేక అనుమతులు ఏమైనా కల్పించారా..? అధికారులు స్పందించి ఇప్పటికై నా చర్యలు తీసుకోవాలి. – సనపల కృష్ణారావు, ఎంపీటీసీ సభ్యుడు, రాజపురంకవిటి: అతనో వాచ్మెన్.. పనికి రాకుండా జీతం తీసుకుంటున్నారు. ఎందుకిలా.. అని వార్డెన్ ఆరా తీస్తే కొందరు ‘పెద్ద మనుషుల’ పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఆ శాఖ ప్రశ్నించలేకపోయింది. ఓ సారైతే జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నుంచి నోటీసులు కూడా వచ్చాయి. కానీ దానికి బదులిచ్చేంత సమయం వాచ్మెన్కు లేకపోయింది. ఉద్యోగం చేయను అని చెప్పడు.. పోనీ రాజీనామా అయినా చేస్తాడా అంటే అదీ లేదు. ఓ చిన్న ఉద్యోగి ఇంత నిర్భయంగా ఎలా వ్యవహరిస్తున్నాడని ఆరా తీస్తే ‘ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి’ అనే హోదా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే... కవిటి మండలం రాజపురం బీసీ బాలుర వసతి గృహంలో 2025 జూలైలో ఆర్.బైరిపురానికి చెందిన పుల్లట రాజు అనే వ్యక్తి ఔట్ సోర్సింగ్ విధానంలో నైట్ వాచ్మెన్ ఉద్యోగం పొందారు. కానీ ఏనాడూ పనికి రాలేదు. హాస్టల్లో సాయంత్రం 4 నుంచి ఉదయం 6 గంటల వరకు విధులు నిర్వర్తించాలి. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఒక్కరోజు కూడా విధులు నిర్వహించలేదు. కానీ నెలకు రూ.15 వేలు చొప్పున ఐదు నెలల జీతం కూడా అందుకున్నారు. దీనిపై హాస్టల్ వార్డెన్ ఉపేంద్రను వివరణ కోరగా.. రాజు సక్రమంగా డ్యూటీ చేయలేదని, అందుకే ఐదు నెలలకు మాత్రమే జీతం చెల్లించామని తెలిపారు. కానీ ఆ తర్వాత ఆయన విధులకు రాకుండానే జీతం చెల్లించాలని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే అశోక్ మనుషుల నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఆ శాఖ అధికారులు బిక్కమొకం వేయక తప్పలేదు. నోటీసులు వచ్చినా... రాజు గత కొన్ని నెలలుగా విధులకు రావడం లేదని జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి నుంచి సైతం తాఖీదులు వచ్చాయి. దీనిపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పుల్లట రాజు బదులు కూడా ఇవ్వలేదు. ఉద్యోగం చేయను అని చెప్పలేదు. రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇవ్వలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి పుల్లట రాజు ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా అడ్డూ అదుపు లేకుండా టీడీపీ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగిపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించిన దాఖలాలు లేవని స్థానికంగా బహిరంగంగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్న పుల్లట రాజును ‘సాక్షి’ వివరణ కోసం సంప్రదించింది. హాస్టల్లో పిల్లలకు సరిగ్గా భోజనం పెట్టాలని వసతి గృహం సంక్షేమాధికారి ఉపేంద్రను తాను పలుమార్లు కోరానని తెలిపారు. దీనితో తనపై ఆయన కఠినంగా వ్యవహరించి తనకు జీతం పొందేందుకు అవసరమైన డ్యూటీ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని, దీంతో జీతం ఆలస్యం కావడంతో తాను కొంత అసహనానికి లోనై విధులు డుమ్మాకొట్టిన మాట వాస్తవమేనని తెలిపారు. మొత్తానికి పుల్లట రాజు తన విధుల కంటే ఐటీడీపీ ప్రచార కార్యక్రమాలు, టీడీపీ నేతల కార్యక్రమాల్లో బహిరంగంగానే పాల్గొంటూ విధులకు సక్రమంగా హాజరుకాలేదన్న విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. అయితే ఇదే విషయమై హాస్టల్ సంక్షేమాధికారి ఉపేంద్ర వివరణ కూడా కోరగా.. పుల్లట రాజు నైట్ వాచ్మెన్గా 2025 జూలై నుంచి కేవలం ఐదు నెలల కాలానికి మాత్రమే డబ్బులు చెల్లించామని చెబుతున్నారు. ఆ తర్వాత ఆయన విధులకు రాని కారణంగా డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. సమాచారం లేకుండా విధులకు హాజరు కాని విషయాన్ని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం లిఖితపూర్వకంగా తెలిపామన్నారు. ఈ మేరకు అందుకు గల కారణాన్ని తెలియజేయాలని మెమో జారీచేసినప్పటికీ అతని నుంచి వివరణ అందలేదని అధికారులు తెలిపారు. -
ప్రతిభా అవార్డులతో విద్యార్థుల్లో స్ఫూర్తి
సంతబొమ్మాళి: విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి ప్రతిభా అవార్డులు దోహదపడతాయని మత్య్సకార సామాజిక సాంస్కృతిక సమితి జిల్లా అధ్యక్షుడు సూరాడ జోగారావు అన్నారు. బుధవారం పాతమేఘవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్వంతంగా షీల్డ్, నగదును సురాడ జోగారావు అందించారు. 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 536 మార్కులతో ప్రథమ స్థానం సాధించిన బొంగు మోహనరావుకు షీల్డ్, రూ.3 వేలు నగదు, 534 మార్కులతో ద్వితీయ స్థానం సాధించిన బొంగు గోవిందరెడ్డికి షీల్డ్, రూ.2 వేలు నగదు, 531 మార్కులతో తృతీయ స్థానం సాధించిన పరిమిల్లి మౌనికకు షీల్డ్, రూ.వెయ్యి నగదుపాటు శాలువతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. సూరాడ జోగారావు ఇదే పాఠశాలలో 15 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా సేవలు చేశారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం మాధవరావు, మాజీ ఉప సర్పంచ్ మంకు సింహాచలం, మత్య్సకార నాయకుడు గంట ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వైద్య సిబ్బంది నిరసన
టెక్కలి రూరల్: స్థానిక జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆస్పత్రి ఆవరణలో బుధవారం నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకుని నిరసన తెలిపారు. దీనిలో భాగంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగి కుటుంబానికి అర్థిక భద్రత కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, లాబ్ టెక్నీషియన్స్, ఫార్మాసిస్ట్లు పాల్గొన్నారు. మద్యం విక్రయదారుడిపై కేసు నమోదు వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని పెదబాడాం గ్రామానికి చెందిన మద్యం విక్రయదారుడు ఎస్పీ వెంకటరావుపై మద్యం కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి ఎస్ఐ అప్పలరెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి పోలీసులు చేసిన తనిఖీల్లో వెంకటరావు వద్ద అక్రమంగా నిల్వ ఉన్న 10 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. దీంతో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
వినోదం కారాదు విషాదం
● వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు తప్పనిసరి ● హెచ్చరికలు పెడచెవిన పెడితే అనర్థాలే ●ఇసుక తవ్వకాలు జరిగే చోట్ల అప్రమత్తం ● భద్రతా చర్యలకు ప్రాధాన్యమివ్వాలంటున్న పోలీసులు శ్రీకాకుళం/శ్రీకాకుళం క్రైమ్ : వినాయక నిమజ్జనం ఎంత సందడిగా ఉంటుందో..ఏమాత్రం అజాగ్రత్త వహించినా అంతే విషాదం మిగుల్చుతుంది. పోలీసుల సూచనలు, హెచ్చరికలను పాటించకుండా పెడచెవిన పెడితే కోరి ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్లే. తాజాగా బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పెదకంచెర్లలో జరిగిన వినాయక విగ్రహ నిమజ్జనంలో ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడటం విచారకరం. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రాథమికంగా అక్కడ గుర్తించారు. వినాయక ఉత్సవ కమిటీలు ఉత్సవాలను ఎంత ఘనంగా చేయాలనుకుంటున్నారో.. అంతకు రెట్టింపు ప్రజల భద్రతపై కూడా ప్రాధాన్యతనివ్వాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సూచనలు పాటించాల్సిందే.. జిల్లాలో దాదాపు 4 వేలకు పైగా వినాయక మండపాలు పెట్టినట్లు అంచనా. ఇప్పటికే చాలా చోట్ల నిమజ్జనాలు నదులు, వాగులు, గెడ్డలు, చెరువుల్లో మొదలయ్యాయి. యువత, మహిళలతో పాటు వృద్ధులు, చిన్నారులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ● సాధ్యమైనంత వరకు వృద్ధులు, చిన్నారులను రాకుండా నియంత్రించాలి. నదుల్లో చాలా చోట్ల ఇసుక తవ్వకాలు జరగడంతో గుమ్మి ప్రాంతాలు ఒడ్డుకు సమీపంలోనే అధికంగా ఉంటున్నాయి. అవి గమనించకపోతే నదిలో మునిగే ప్రమాదముంది. ● సూర్యాస్తమయానికి ముందే నిమజ్జనం చేస్తే మంచిది. రాత్రివేళ నిమజ్జనం చేయడం వల్ల వెలుతురు సరిగా లేక ప్రమాదాలు జరిగే అవకాశముంది. ● భారీ విగ్రహాలను తరలించేటప్పుడు, వాహనాలపై ఎక్కించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. విశాఖలో విగ్రహాన్ని తరలించే క్రమంలో అది పడిపోవడంతో ముగ్గురు యువకులు కింద ఉండిపోవడం, తక్షణమే మిగతా యువకులు అప్రమత్తమవ్వడంతో గాయాలతో బయటపడ్డారు. ● మండపాల వద్ద విద్యుద్దీపాలంకరణ వైర్లు పట్ల అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు పడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. రెండేళ్ల క్రితం శ్రీకాకుళం హడ్కో కాలనీలో 8 ఏళ్ల బాలుడు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ● ఊరేగింపు సమయంలో డీజేలను వినియోగించడం వల్ల హృద్రోగులు, బాలింతలు, గర్భిణులు, వృద్ధులు, పసిపిల్లలకు చాలా ప్రమాదం. ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన నిబంధనలతో పాటు డీజేలను నిషేధించింది. నదులు, చెరువుల్లో నిమజ్జనాలకు ఆంక్షలు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని బీఆర్ఆర్ వంశధార పర్యవేక్షక ఇంజనీర్ రామచంద్రరావు కోరా రు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా నిర్వహించుకోవాలే తప్ప నదీజలాలు, చెరువులు కలుషితమయ్యేలా చేయకూడదన్నారు. విగ్రహాలతో పాటు పూలమాలలు, పూజా సామగ్రి, అలంకరణ వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు తదితర వ్యర్థాలు కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో చేరుతున్నాయని తెలిపారు. ఈ వ్యర్థాలు కాలువలపై ఏర్పాటు చేసిన ట్రాష్ ర్యాక్లు వద్ద పేరుకుపోవడం వల్ల నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోందన్నారు. నీటి నియంత్రణ, నియంత్రణా గేట్ల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో నీటిని విడుదల చేయడం, నియంత్రించడం కష్టతరమవుతోందని పేర్కొన్నారు. దీంతో కాలువలపై ఆధారపడే రైతులకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు అర్ధం చేసుకుని సహకరించాలని కోరారు. భద్రతకు ప్రాధాన్యమివ్వాలి.. నిమజ్జన సమయంలో చిన్నారులు నీరు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. కమిటీ సభ్యులు కూడా గమనించాలి. మద్యం సేవించి డ్యాన్సు, హంగామాల పేరుతో అల్లర్లు సృష్టించోద్దు. – సీహెచ్ వివేకానంద, డీఎస్పీ డీజేలు పెడితే కేసు డీజేలు, ఇతర సౌండ్ బాక్సులు అత్యధిక ధ్వనితో పెట్టి ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది పెడితే కేసులు కట్టి వాటిని సీజ్ చేస్తాం. పోలీసుల పరంగా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. డీజేలు పెడితే రూ. 10 వేల నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా తప్పదు. – పి.ఈశ్వరరావు, రెండో పట్టణ సీఐ, శ్రీకాకుళం -
పెదంచలలో విషాదఛాయలు
● ముగిసిన శేషగిరి అంత్యక్రియలు కాశీబుగ్గ: సైనికుడినవుతా.. దేశసేవ చేస్తా.. అందరినీ బాగా చూసుకుంటానన్నావ్. ఇంతలోనే చేజారిపోయావా చిన్నోడా.. అంటూ గిన్ని శేషగిరి తల్లిదండ్రులు బాలమ్మ, కాళిదాసు, ఇద్దరు అన్నయ్యల రోదనలతో పెదంచల గ్రామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అగ్నివీర్ ఎంపికలో భాగంగా ఈనెల 15న విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించిన పరుగు పోటీల్లో అస్వస్థతకు గురైన శేషగిరి మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ మేరకు యువకుడి భౌతికకాయం బుధవారం మధ్యాహ్నం విశాఖ నుంచి స్వగ్రామానికి చేరుకుంది. వందలాది మంది యువత ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టగా, వారిని అనుసరిస్తూ అంబులెన్స్ ఊరులోకి చేరుకుంది. కన్న కొడుకును విగతజీవిగా చూసిన ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. స్నేహితులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం శేషగిరికి అశ్రునయనాల నడుమ ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న దృశ్యం -
సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
హిరమండలం: వరి తెగుళ్ల బారిన పడకుండా సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ జేడీ వై.వి.మురళీకృష్ణ అన్నారు. ఎల్ఎన్పేట మండలం రావిచెంద్రిలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వరి పొలాలను పరిశీలించి యాజమాన్య పద్ధతులపై రైతులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1.59 లక్షల హెక్టారుల్లో వరి సాగు అవుతున్నట్టు వివరించారు. పత్తి, వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటల సాగు కూడా జరుగుతోందని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరి సాగులో మెలకువలు పాటించాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉదయ్బాబు, ఏడీ రాజగోపాల్, ఏవో కిరణ్వాణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ట్రెజరీ అధికారి ఏఏవో ఎం.భాగ్యలక్ష్మి అత్యద్భుతమైన ప్రదర్శన కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తణుకు వేదికగా ఈనెల 12, 13 తేదీల్లో జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో 50 ప్లస్ వయో విభాగంలో మూడు పతకాలు సాధించి సత్తాచాటారు. జావెలిన్ త్రోలో బంగారు పతకం, లాంగ్జంప్లో రజత పతకం, షాట్ఫుట్లో కాంస్య పతకం సాధించిన భాగ్యలక్ష్మి యువ అథ్లెట్స్కు ఆదర్శంగా నిలిచారు. దీంతో అక్టోబర్ 9 నుంచి 11 వరకు కోయంబత్తూరు వేదికగా జరిగే ఆలిండియా నేషనల్ లెవల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్–2026 పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా ట్రెజరీ కార్యాలయంలో డీడీ సీహెచ్ రవికుమార్ రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన ఏఏవో భాగ్యలక్ష్మిని ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ పోటీల్లోను రాణించి జిల్లాకు, ట్రెజరీ శాఖకు పేరుతీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ట్రెజరీ శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం శ్రీకాకుళం కల్చరల్: ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామివారికి బుధవారం కప్ప జయవర్ధన్, నిహారిక దంపతులు వారి కుమార్తె జుహిత పేరున అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళమందించారు. వారిని వేదమంత్రాలతో ఆశీర్వచనం చేయించి చిత్రపటం, ప్రసాదాలు ఆలయ పాలక మండలి సభ్యులు అంధవరపు రఘురాం అందించారు. ఆర్జేడీ ఆకస్మిక పర్యటన శ్రీకాకుళం అర్బన్: సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ పద్మలత బుధవారం శ్రీకాకుళంలోని ఐసీడీఎస్ కార్యాలయం, అరసవల్లిలోని శిశుగృహ, చిల్డ్రన్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారుల ఆలన, పాలన, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హరిఓం పాండే, ఐసీడీఎస్ పీడీ పి.శోభారాణి, నోడల్ అధికారి మణెమ్మ, డీఎఫ్సీ కో–ఆర్డినేటర్ ఉమ, డీసీపీవో రమణ, సీనియర్ అసిస్టెంట్ కె.రామారావు, డీపీఏ ఎం.మహేశ్వరరావు, శిశుగృహ మేనేజర్ నరేష్, అధికారులు, సిబ్బంది ఉన్నారు. పీహెచ్సీలో డీఎంహెచ్ఓ తనిఖీలు గార: గార ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నరేష్కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీలో అందుతున్న సేవలు, వ్యాక్సినేషన్లు పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీ పరిధిలోని బోరవానిపేట పంచాయతీని చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్గా జాతీయ స్థాయి పోటీకి నామినేట్ చేయడంతో సచివాలయాన్ని సందర్శించారు. పంచాయతీలోని ఆరోగ్య పరిస్థితులు, తాగునీటి సరఫరాకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సోనియా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
బాల్యానికి మూడుముళ్లు
● జిల్లాలో ఇంకా కనిపిస్తున్న బాల్య వివాహాలు ● ఏజెన్సీలోనే అధికం ● తల్లిదండ్రుల నిరక్షరాస్యతే కారణం చట్టరీత్యా నేరం బాల్య వివాహాలు చట్టపరంగా నేరం. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిపిస్తే ఫిర్యాదు చేయాలి. ఎలాంటి భయం అవసరం లేదు. స్థానిక పోలీసుల రక్షణలోనే విచారణ జరుగుతుంది. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. వారి సమ్మతితోనే వివాహాన్ని నిలుపుదల చేయిస్తాం. బాల్యం వివాహాలతో అనారోగ్య సమాజం ఖాయం. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. – బి.ఉమాజానకి, పీఓ, ఐసీడీఎస్ కొత్తూరు హిరమండలం: కొండ కోనల్లో బాల్యం మూడు‘ముళ్ల’ బాటన పడుతోంది. తెలిసీ తెలియని వయసులో వారి మెడలో పసుపు తాళ్లు పడుతున్నాయి. చదువు, ఆటపాటలతో హాయిగా గడవాల్సిన సమయంలో ఏకంగా గర్భం దాల్చుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న అమాయక బాలలు ఇంకా మన ఏజెన్సీలో కనిపిస్తున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు, కట్టుబాట్లతో పెద్దలే చిన్నారులకు పెళ్లి చేసి అత్తారింటికి పంపుతున్నారు. జల్లాలో ప్రధానంగా వలసలు వెళ్లే పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. జిల్లాలో 11 తీర ప్రాంతాల్లో సైతం బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపుగా గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు అనేవి ఒక సంప్రదాయంగా వస్తున్నాయి. అక్కడ కులం కట్టుబాట్లతో ఎక్కువగా చిన్ననాడే పెళ్లిళ్లు జరిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదీ పరిస్థితి.. 2020–21లో 114, 2021–22లో 68, 2022–23లో 105, 2023–24లో 93, 2024–25లో 57, 2025–26లో 64 బాల్య వివాహాలను అడ్డుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో వలసలు వెళ్లే దంపతులు ఆడపిల్లను అత్తారింటికి పంపేందుకు తొందర పడుతున్నారు. ఫిర్యాదు చేయవచ్చు బాల్య వివాహాలు జరిగితే నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. 1098, 100, 181 టోల్ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలకు సైతం సమాచారం అందించవచ్చు. కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహాల నియంత్రణకు ‘బాల్య్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమం చేపట్టింది. బాల్య వివాహాల విషయంలో ఇటీవల ఫేక్ ఫిర్యాదులు చేస్తుండడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వ్యవహారాల కారణంగా కొంతమంది తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే నిజంగా బాల్య వివాహం జరుపుతుంటే మాత్రం నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. 3వ స్థానంలోరాష్ట్రంలో 45 శాతానికి మించి బాల్య వివాహాలు జరుగుతున్న జిల్లాల్లో శ్రీకాకుళం మూడోస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అందులో 23 శాతం మంది 15 నుంచి 18 ఏళ్లలోపు బాలికలే అమ్మలుగా మారుతున్నారు. ఈ పరిస్థితుల్లో బిడ్డ గర్భంలో చనిపోవడం, వైకల్యంతో పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. -
స్వచ్ఛతతోనే ఆరోగ్యకర సమాజం
శ్రీకాకుళం పాతబస్టాండ్: పరిశుభ్రతపై ప్రజల్లో వి స్తృత చైతన్యం తేవడమే లక్ష్యంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా ‘స్వచ్ఛత హి సేవా – 2026’ పక్షోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో చెత్త విభజన, వర్షపు నీటి సంరక్షణ, పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై రోజువారీ ప్రణాళిక ప్రకారం ప్రచారం నిర్వహించాలని సూచించారు. అక్టోబర్ 1న ‘ఒక రోజు, ఒక గంట, అందరం కలిసి’ పిలుపుతో శ్రమదానం, అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా గ్రామసభలు, కౌన్సిల్ సమావేశాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సఫాయి మిత్రుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. పాలనలో పారదర్శకత, ప్రభుత్వ సేవలందింపుపై ప్రజల అభిప్రాయం ఆధారంగా ఆయా విభాగాలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, నూతన పెన్షన్ల దరఖాస్తులు, ఇ–ఆఫీస్ వినియోగం, రీసర్వే, రేషన్ పంపిణీ, తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై సమీక్షించారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
ఇచ్ఛాపురం: ప్రైవేటు పాఠశాలల సమస్యలు పరిష్కరించి బలోపేతం చేసేదిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రైవేటు పాఠశాలల గౌరవ అధ్యక్షుడు మెట్ట జనార్ధనరావు అన్నారు. పట్టణంలోని స్వర్ణభారతి ప్రైవేటు పాఠశాల ఆవరణలో ప్రైవేటు పాఠశాలల నియోజకవర్గ అధ్యక్షుడు చాట్ల తులసీదాస్ రెడ్డి అధ్యక్షతన ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సిబ్బందితో సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలన్నీ ఐక్యంగా ఉంటే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోవడం సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల పర్యవేక్షణకు ఒక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రత్యేక కార్యవర్గంలో సభ్యులుగా జోహార్ఖాన్, వాసుపట్నాయక్, కింగ్, పి.చిరంజీవి, పక్కి బాలకృష్ణ, కె.రామారావులు ఉన్నారు. కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల ఉత్తరాంధ్ర అధ్యక్షుడు గణపతిరావు, జిల్లా అధ్యక్షుడు అప్పలాచారి, ప్రతినిధులు కృష్ణమూర్తిరెడ్డి, వేణుగోపాలరావు, రవికుమార్, శ్రీరామమూర్తి, రమేష్, కన్నబాబు, చిన్న, ఆదినారాయణ, డి.తిరుపతి, భానుతేజ, మాధవరావు, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. -
సృష్టి శిల్పికి.. భక్తి నీరాజనం..!
● నేటి నుంచి విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ● ఐదు రోజుల పాటు జరగనున్న వేడుకలు ● ఏర్పాట్లు పూర్తి చేసిన కమిటీ సభ్యులు శ్రీకాకుళం కల్చరల్: సకల కళలకు ఆది దేవుడు, దేవలోకాలను నిర్మించిన వాస్తు శిల్పిగా పేరుగాంచిన విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీకాకుళం నగరంలో ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు ఐదురోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఆయా కమిటీల ప్రతినిధులు సర్వం సిద్ధం చేశారు. విశ్వకర్మను బ్రహ్మదేవుని కుమారునిగా పురాణాలు చెబుతున్నాయి. దేవ లోకాలను నిర్మించిన స్తపతి. దేవతలకు ఆకాశమార్గాన విహరించే పుష్పక విమానం, ఆభరణాలను, ఆయుధాలను తయారు చేసిన శిల్పి. కృష్ణు ని కోసం ద్వారకా నగరాన్ని, పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజ భవనాన్ని, విష్ణువు సుదర్శన చక్రం, శివుని త్రిశూలం, కార్తికేయుని బల్లెం వంటి అనేక అద్భుతమైన ఆయుధాలను దేవతల కోసం నిర్మించిన ఘనత ఆయనకు దక్కింది. యాంత్రిక శాస్త్రం, వాస్తు శాస్త్రమైన స్థపత్య వేదాన్ని కూడా ఆయనే రచించారని భావిస్తారు. ఆయనను సమస్త చేతివృత్తుల వారికి ఆరాధ్యదైవంగా పరిగణిస్తారు. విశ్వకర్మ పూజ సందర్భంగా ఆయన గౌరవార్థం తరచుగా వృత్తి పనిముట్లను పూజిస్తారు. కళాకారులు, చేతివృత్తి నిపుణు లు, మెకానిక్లు, కమ్మరివారు, వెల్డర్లు, పారిశ్రామిక కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, ఇతర కార్మికులు ఈ పండగను జరుపుకుంటారు. రాష్ట్ర పండుగగా.. విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుర్తించింది. అప్పటినుంచి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. విశ్వకర్మ నిర్మాణ శిల్పి కావడం వల్ల పట్టణంలోని స్వర్ణకార సంఘం, విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఆయా కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నారు. చంపాగల్లివీధిలోని శ్రీకంచి కామాక్షి దేవి శ్రీకాకుళం పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఐదురోజులపాటు వేడుకలు జరగనున్నాయి. శ్రీకాకుళం మండలం చాపురం పంచాయతీలోని గోవిందపురం గ్రామంలో చలపాక సూర్యారావు తన తండ్రి జ్ఞాపకార్థం విశ్వకర్మ గార్డెన్ నిర్మించారు. ఉద్యోగ విరమణ పిదప తండ్రి నారాయణాచారి కోరక మేరకు ఈ గార్డెన్లో ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులు ప్రతి ఏడాది ఘనంగా చేస్తాం ప్రతీ ఏడాది విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం. గత ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడంతో మరింత విశిష్టత చేకూరింది. – సోపింటి తారకేశ్వరరావు, అధ్యక్షుడు, పట్టణ స్వర్ణకార సంఘం, శ్రీకాకుళం దేవవాస్తు శిల్పి విశ్వకర్మ దేవ వాస్తుశిల్పిగా పేరు గాంచిన విశ్వకర్మ మాలాంటి వారికి ఆరాధ్య దైవం. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పండుగ చేస్తారు. పనిముట్లను నమ్ముకున్న మాకు స్వామివారి పూజ ఎంతో విశిష్టమైనది. – కడారి దుర్గాప్రసాద్, కార్యదర్శి, పట్టణ స్వర్ణకార సంఘం, శ్రీకాకుళం కార్యక్రమాలు ఇలా.. 17న విశ్వకర్మ మృణ్మయ విగ్రహం గ్రామ ప్రదక్షిణ, పూజలు. 18న విరాట్ విశ్వకర్మ సహస్రనామ పత్రిపూజ. 19న గాయత్రి దేవి, లలితాదేవి సహస్రనామ కుంకుమార్చనలు, లక్ష దీపారాధనలు. 20న స్వామివారికి సహస్రనామ పత్రపూజ, తీర్థప్రసాద వితరణ. 21న విశ్వకర్మ పంచసూక్త హోమం, పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ జరుగుతాయి. 23న సాయంత్రం నిమజ్జనోత్సవం నిర్వహిస్తారు. -
ఢీ కొట్టి.. పరారీ..
● కాలికి తీవ్ర గాయాలతో విలవిల్లాడిన వాహనదారుడు ● అర్ధరాత్రి వేళ దారుణం శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని గుజరాతీపేట సమీపంలోని నాగావళి వంతెన వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి బుధవారం అర్ధరాత్రి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుడివీఽధికి చెందిన గుంటుకు స్వామిబాబు హయాతి నగరం నుంచి ఏడురోడ్ల కూడలి వైపు వెళ్తుండగా అటునుంచి అతివేగంగా వస్తున్న గుర్తు తెలియని ద్విచక్రవాహనదారుడు బలంగా ఢీకొట్టి పరారయ్యాడు. స్వామిబాబు కుడికాలు ముడుకు భాగం నుజ్జయింది. స్థానికులు ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
సధరం.. లేదు కనికరం..!
టెక్కలి రూరల్: కవిటి మండలం కుసుంపురం గ్రామానికి చెందిన జుత్తు చలపతి అనే దివ్యాంగుడు ఏడాది కాలంగా సదరం సర్టిఫికెట్ కోసం టెక్కలి జిల్లా ఆస్పత్రి చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు బుధవారం తెలిపారు. గతంలో పింఛన్ వచ్చేదని అయితే తన పాత సదరం సర్టిఫికెట్లో సన్ ఆఫ్ వద్ద తన తల్లి పేరు రావడంతో దానిని డిలేట్ చేసి, గతేడాది నవంబర్ 16వ తేదీన స్లాట్ బుక్ చేసుకుని 18వ తేదీన టెక్కలి జిల్లా ఆస్పత్రికి వచ్చినట్లు వెల్లడించారు. అయితే ఆస్పత్రి సిబ్బంది సర్వర్ బాగులేదని చెబుతూ మూడుసార్లు ఆస్పత్రి చుట్టూ తిప్పించుకున్నారన్నారు. వైద్యుడు వద్ద ఉన్న ఓ వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఫోన్ చేస్తున్నాడని.. ముందుగా రూ.30 వేలు ఇస్తే పని అయిపోతుందని చెప్పాడన్నారు. అయితే తాను లేటు చేయడంతో దానిని రూ.50 వేలకి పెంచాడని వాపోయారు. కాగా ఇటీవల మరలా ఫోన్ చేయగా ఇప్పుడైతే సుమారు రూ.70 వేలు వరకు అవుతుందని డబ్బులు డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయగా.. వారు వెంటనే స్పందించి జిల్లా వైద్యాధికారులకు ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. దీంతో వారు టెక్కలి జిల్లా ఆస్పత్రిలో వెళ్లి అడగమని చెప్పడంతో.. మరలా ఆస్పత్రికి వచ్చి అడగగా మీ డేటా లేదని మరలా దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్లు వాపోయాడు. ఇలా ఏడాది కాలంగా అనేక అవస్థలు పడుతున్నానని ఆవేదన చెందాడు. -
19న జాబ్మేళా
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాలలో నోడల్ జేకేసీ, కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 19న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ఎస్ఎన్ స్వామి, జేకేసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ డి.అసిరితల్లి ఒక ప్రకటనలో తెలిపారు. హెటిరో ఫార్మాస్యూటికల్ సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం శనివారం ఉదయం 9 గంటల నుంచి కళాశాలలో వాన్–ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొ న్నారు. డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఇంజినీరింగ్, ఇంటర్, ఐటీఐ అర్హతలు కలిగిన వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బయోడేటాతో హాజరుకావాలని, మరిన్ని వివరాలకు 8074649919 నంబర్ను సంప్రదించాలని కోరారు. నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం పాతబస్టాండ్: నవోదయ పాఠశాలలో 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 30 అని, 2027 ఏప్రిల్ 10న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్ (http://navodaya.gov.in)ను సంప్రదించాలని కోరారు. -
బేస్బాల్లో శ్రీకాకుళం ప్రభంజనం
శ్రీకాకుళం న్యూకాలనీ: బేస్బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో శ్రీకాకుళం జిల్లా ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ సీజన్లో ఇప్పటికే సాఫ్ట్బాల్, బాల్ బాడ్మింటన్, బాక్సింగ్, మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో సత్తాచాటిన శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు.. బేస్బాల్లోనూ అద్భుతమైన ఆటతీరుతో రాణించి విజయదుందుబీ మోగించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగిన 8వ ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ బేస్బాల్ ఛాంపియన్షిప్–2026 పోటీల్లో శ్రీకాకుళం జట్లు విజయవిహారం చేశాయి. మహిళల జట్టు విజేతగా నిలవగా, పురుషుల జట్టు రన్నరప్గా నిలిచింది. పలువురు క్రీడాకారులు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా జట్లు అద్భుతమైన ప్రతిభతో విజేతలగా నిలవడంపై శ్రీకాకుళం జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, ప్రధాన కార్యదర్శి గుంటముక్కల వీరభద్రరావు, కార్యనిర్వాహక కార్యదర్శి కొండపల్లి రవికుమార్, సంఘ ప్రతినిధులు హరి, కె.కిరణ్కుమార్, చల్లా జగదీశ్, సాదు శ్రీనివాసరావు, వై.పోలినాయుడు, అరుణ్కుమార్ గుప్తా, రామాంజనేయులు, రవి, సింహాద్రి నాయుడు, ఒలింపిక్ సంఘ జిల్లా కార్యదర్శి మెంటాడ సంబమూర్తి, డీఎస్డీవో ఎ.మహేష్బాబు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
పాతపట్నం: పాతపట్నం మేజర్ పంచాయతీ కాపువీధికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కలమట యశ్వంత్ (23) హైదరాబాద్లో హాస్టల్ భవనం నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. యశ్వంత్ తండ్రి కలమట రమేష్ విశ్రాంత సైనికుడు కాగా ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు. తల్లి కలమట బిందు విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు స్కూల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. ఒక్కొగానొక్క కొడుకు మృతి చెందడంతో పాతపట్నం కాపువీధిలో విషాదచాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చి వెళ్లాడని, తండ్రికి వ్యవసాయంలో సాయపడేవాడని స్నేహితులు చెబుతున్నారు. -
‘కెమికల్ పార్కునకు భూములు ఇవ్వం’
సంతబొమ్మాళి: రైతులు, మత్స్యకారుల జీవితాలను దెబ్బతీసే కెమికల్ పార్కు ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని వడ్డితాండ్ర గ్రామ రైతులు, మత్స్యకారులు తేల్చిచెప్పారు. మంగళవారం వడ్డితాండ్రలో కెమికల్ పార్కు పై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ అభ్యంతరాలను, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాతలు, తండ్రుల కాలం నుంచి తమ కుటుంబాలకు ఆధారంగా ఉన్న భూములను పరిశ్రమల కోసం కోల్పోయి, వారు ఇచ్చే పరిహారంతో తాము ఎక్కడా భూమి కొనుగోలు చేయలేమని రైతులు అవేదన వ్యక్తం చేశారు. భూమి ఉంటేనే మాకు భరోసా.. డబ్బులు మాకు వద్దు అంటూ స్పష్టం చేశారు. తమ భూములకు విలువ లేదని అధికారులు చెబుతున్నప్పుడు పరిశ్రమలను మాత్రం ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. తాగునీటి సమస్యను పరిష్కరించలేని పరిస్థితుల్లో పరిశ్రమలు తమకు అవసరం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. సుమారు 4వేల కుటుంబాలు తంపరపైనే ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. తంపరలో కొందరు వ్యక్తులు అక్రమణలకు పాల్పడుతున్నారని, ఆ భూములను ఎవరు ఇచ్చారు? ఏ విధంగా ఇచ్చారో తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ మాట్లాడుతూ కెమికల్ పార్కు ఏర్పాటుకు సుమారు 3వేల ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. ఈ పార్కులో వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుపై ఉన్న అపోహలను వీడి, పార్కు స్థాపనకు అందరూ సహకరించాలని కోరారు. -
ఆదిత్యుని సన్నిధిలో గంజాం జిల్లా ఐఏఎస్ అధికారి
అరసవల్లి: ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఐఏఎస్ అధికారి కీర్తివాసన్ కుటుంబ సమేతంగా మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వరరావు, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం ఆలయ విశిష్టతను వివరించి వేదాశీర్వచనాన్ని అందించారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి సాందీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు. కళా ప్రియులకు నాటకాల విందు ● 17 నుంచి బహుభాషా నాటక పోటీలు శ్రీకాకుళం కల్చరల్: సుమిత్రా కళా సమితి ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు బహుభాషా నాటిక పోటీలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళా మందిరంలో నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి నాటిక ప్రదర్శనలు చేపట్టనున్నారు. కలకత్తా, గౌహతి, ముంబై, బెంగళూరు, రూర్కెలా, రాయ్పూర్, గుడివాడ, ప్రయాగ్రాజ్ ప్రాంతాల నుంచి కళాకారులు వచ్చి నాటికలను ప్రదర్శిస్తారు. 2017లో కూడా బహుభాషా నాటిక పోటీలు నిర్వహించారు. తొలిరోజు 17న బెంగాళీ కళాకారులు జ్వాలా, అస్సామీ బృందం జీవశ్రేష్ఠ్, 18న మరాఠీ నాటిక సూప్, కన్నడ నాటిక సాంగ్యాచీబాల్యా, 19న ఒడియా నాటిక ఫేసెస్ ఆఫ్ ఉమెన్, ఛత్తీస్ఘడ్ నాటిక యకీనన్ ప్రదర్శించనున్నారు. 20న స్వాతంత్య్ర సమరయోధుడు భగత్సింగ్ నాటిక హిందీ, పంజాబీ భాషలో ప్రదర్శిస్తారు. తెలుగు నాటిక ద్వారబంధాల చంద్రయ్యనాయుడు ప్రదర్శిస్తారు. పాముకాటుతో రైతు మృతి రణస్థలం: మండలంలోని నారువ పంచాయతీ బోయపాలెం గ్రామానికి చెందిన రైతు నిద్రబంగి రమణ (39) పాముకాటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సోమవారం ఉదయం తన పొలంలోని అరటి తోటలో నీరు కడుతుండగా పాముకాటుకు గురైయ్యాడు. వెంటనే పక్క తోటలోని రైతులు తెలియజేసి సమాచారం అందించారు. వాళ్లు ఆటోను పిలిచే లోపు స్పృహ కోల్పోయాడు. హుటాహుటిన కొండములగాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రమణ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రిమ్స్లో మంగళవారం శవపంచనామా చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. కుటుంబ పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్య మహాలక్ష్మి, ఇద్దరు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్పురం ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరికి గాయాలు టెక్కలి రూరల్: మండలంలోని కె.కొత్తూరు సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై సోమవారం ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసన్నపేట మండలం జడూరు గ్రామం నుంచి ఇటుకల లోడుతో టెక్కలి వైపు వస్తున్న క్రమంలో కె.కొత్తూరు వద్ద ట్రాక్టర్ వెనుక తొట్టే ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆ ఇటుకలపై కుర్చొని ఉన్న జి.కృష్ణారావు, బి.ఒన్నారిలపై ఇటుకలు పడిపోవడంతో తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడినవారిని హుటాహూటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇటుకలు మొత్తం రహదారిపై పడిపోవడంతో విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ సరిచేశారు. టెక్కలి రూరల్: స్థానిక జిల్లా ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా 13 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. స్థానిక చిన్నబజారు, కొడ్రవీధి, కండ్రవీధి తదిత ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వీధికుక్కలు పలువురిపై దాడి చేసి గాయపరిచాయి. వీరిలో టి.భూలక్ష్మి, బి.జ్యోతి, బి.లిఖిత, బి.ఉమాశంకర్, కె.మధు, పి.ఆశిరమ్మ, ఎస్.రవి, ఎన్.మల్లేశ్వరరావు, డి.మణికంఠ, డి.చిన్నారావు, ఎల్.పృథ్వీరాజ్, పి.మల్లేష్, బి.రమేష్ లపై దాడి చేసి గాయపచడంతో వారు జిల్లా ఆస్పత్రిలో చేరారు. వీధుల్లో తిరుగుతున్న సమయంలోనే కుక్కలు వారిపై దాడిచేసినట్లు తెలిపారు. అలానే జూన్ నెలలో సైతం పిచ్చికుక్క స్వైరవిహారం చేసి 20 మందిని గాయపరిచింది. -
సిక్కోలు అభిమానం మరువలేను
● హీరో సుహాస్ శ్రీకాకుళం అర్బన్: ‘మండాడి’ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటానని, వారికి ప్రత్యేక ధన్యవాదాలని ఆ సినిమా హీరో సుహాస్ అన్నారు. ‘మండాడి’ సినిమా సక్సెస్ మీట్లో భాగంగా మంగళవారం శ్రీకాకుళంలోని కిన్నెర కాంప్లెక్స్ను హీరో సుహాస్ సందర్శించి ప్రేక్షకులతో ముచ్చటించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ప్రతి సినిమాను జిల్లా ప్రజలు, అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మండాడి సినిమా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.65కోట్లు వసూలు చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. -
తెలుగు తమ్ముళ్లు.. అక్రమ వసూళ్లు!
● ఇచ్ఛాపురం నియోజకవర్గంలో భూబాగోతం ● హక్కు పత్రాల పేరుతో రైతుల నుంచి వసూళ్లు ● పట్టించుకోని రెవెన్యూ అధికారులు అవి నిషేధిత భూములే ఇచ్ఛాపురం మండలం కొఠారీ పంచాయతీలో ఉన్న 22ఏ నిషేధిత భూములే. ఆ భూముల్ని ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తిగానే పరిగణిస్తాం. ఆ భూములు ఎవరి పేరిట జిరాయితీ భూములుగా మార్చడానికి అవకాశం లేదు. వసూళ్ల విషయం మా రెవెన్యూశాఖకు సంబంధం లేదు – ఎన్.వెంకటరావు, తహసీల్దార్, ఇచ్ఛాపురం మండలం పేదల ఇళ్లకు కేటాయించాలి ఇచ్ఛాపురం మండలం కొఠారీ పంచాయతీ పరిధిలో ఉండే 22ఏ నిషేధిత భూమలను కవిటి మండలం భైరిపురం గ్రామానికి చెందిన వ్యక్తుల ఆధీనంలో ఉండటం దురదృష్టకరం. ఈ భూములపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు పిర్యాధు చేశాం. సమగ్ర విచారణ చేసి మా పంచాయతీలో ఇళ్లులేని నిరుపేదలకు ఆ భూమి కేటాయించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. – దుక్క ధనలక్ష్మి, తాజీ మాజీ సర్పంచ్, కొఠారీ, ఇచ్ఛాపురం మండలం ఇచ్ఛాపురం రూరల్: ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలను ఇప్పిస్తామని నమ్మించి కొంతమంది కూటమి నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కవిటి మండలంలో కలకలం రేపుతున్నాయి. ఇచ్ఛాపురం మండలం కొఠారీ పంచాయతీ పరిధిలో ఉన్న సుమారు 5.85 ఎకరాల 22ఏ నిషేధిత ప్రభుత్వ భూమిని కవిటి మండలం భైరిపురం గ్రామానికి చెందిన పది మందికి పైగా రైతులు గత కొంతకాలంగా సాగు చేస్తున్నారని, దీనిపై రెవెన్యూ రికార్డులు, పట్టాలు, ఇతర పత్రాలు పరిశీలించి వాస్తవ పరిస్థితులు నిర్థారించాలని కోరుతూ కొఠారీ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ దుక్క ధనలక్ష్మీ గత నెల 15న కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన భైరిపురం గ్రామానికి చెందిన కొంత మంది తెలుగు తమ్ముళ్లు భూములకు హక్కు పత్రాలు ఇప్పిస్తామంటూ చెప్పి రైతులకు మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి నుంచి సెంటుకు రూ.500 నుంచి రూ.3వేల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల అవసరమే అవకాశంగా.. తమ ఆధీనంలో ఉన్న భూములకు చట్టబద్ధమైన హక్కు పత్రాలు వస్తాయన్న ఆశతో పేద రైతులు అధికారంలో ఉన్న తెలుగు తమ్ముళ్లను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో స్థానికంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు మధ్యవర్తులుగా రంగ ప్రవేశం చేసి రెవెన్యూ శాఖాధికారులతో పాటు అధికార ప్రభుత్వానికి చెందిన పెద్దలను మేనేజ్ చేసేందుకు పెద్ద మొత్తంలో అందజేయాలంటూ రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు తమ భూముల సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకంతో డబ్బులు చెల్లించినట్లు చెబుతున్నారు. అయితే హక్కు పత్రాల విషయంలో స్పష్టమైన ఫలితం కనిపించకపోగా అన్యాయంగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు రావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రైతుల భూములే లక్ష్యంగా మధ్యవర్తిత్వం సాగిందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల తీరుపై విమర్శలు.. రైతుల నుంచి వస్తున్న ఆరోపణలపై రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూముల హక్కులు, సర్వే నంబర్లు, రికార్డుల విషయంలో అధికార యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తెవాల్సి ఉన్నప్పటికీ ‘మాకేం తెలియదు’ అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భూముల వ్యవహారాల్లో మధ్యవర్తుల జోక్యం, రైతుల నుంచి డబ్బుల వసూళ్ల ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రెవిన్యూ అధికారులపై ఉంది. కానీ ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. రికార్డులు బయటపెడితే.. కొఠారీ, భైరిపురం ప్రాంతాల్లోని సంబంధిత సర్వే నంబర్లు, పాత భూ పంపిణీ రికార్డులు, ప్రస్తుత సాగుదారు వివరాలు, రెవెన్యూ రికార్డులను అధికారులు బహిర్గతం చేస్తే అసలు వాస్తవం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రైతుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపి నిజనిజాలు తేల్చాలని, అధికారుల పాత్రపైనా సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
నిర్భయంగా నిమజ్జనం
● ఆరేళ్లుగా సేవలు అందిస్తున్న ‘స్విమ్మింగ్ షేక్ సుభాన్’ ● నాగావళి తీరంలో ప్రత్యేక సేవలు శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం నగర పరిసరాల్లో నాగావళి నది తీరంలో జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమం మొదటి రోజు అత్యంత ప్రశాంతంగా ముగిసింది. కొంత ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నాగావళి నది ఒడ్డున నది ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, నీటి ప్రమాదాలు జరగకుండా భక్తులు సురక్షితంగా నిమజ్జనాలు పూర్తి చేసుకున్నారు. జిల్లాకు చెందిన నేషనల్ లైఫ్ సేవింగ్ మెడలిస్ట్, ఎకై ్సజ్ కానిస్టేబుల్ షేక్ సుభాన్ (స్విమ్మింగ్ సుభాన్) స్పాట్లో ఉండి ప్రత్యేక రక్షణ విధులు నిర్వర్తించారు. ఘాట్ వద్దకు వచ్చిన చిన్న పిల్లలను సైతం దగ్గరుండి అత్యంత సురక్షితంగా నిమజ్జనం చేయించారు. ఒకప్పుడు ఏటా మరణాలు సంభవించే ఈ ప్రమాదకర ఘాట్ వద్ద, గత ఆరేళ్లుగా చిన్న ప్రమాదానికి కూడా తావు లేకుండా ‘జీరో క్యాజువాలిటీ’ రికార్డును సుభాన్ కాపాడుకుంటూ రావడంపై భక్తుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ల సేకరణ ఈ ఎకై ్సజ్ కానిస్టేబుల్ విధుల్లో ఉంటూనే అద్భుతమైన పర్యావరణ స్పృహను చాటారు. నిమజ్జనానికి వచ్చిన భక్తులు విసిరేసిన ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు నాగావళి నదిలో కలవకుండా ప్రతి ఒక్క కవరును తానే స్వయంగా ఏరి ఒడ్డున వేశారు. ప్లాస్టిక్ వల్ల నదీ జలాలు ఎలా కలుషితమవుతాయో భక్తులకు వివరిస్తూ ఆయన చేసిన ఈ నిస్వార్థ సేవ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్ లైఫ్ సేవింగ్ సొసైటీ ప్రతినిధి సీహెచ్ వెంకటేష్తో పాటుగా సెక్రెటరీ దట్టి ప్రకాష్ ట్రెజరర్ బాలాజీ, వైస్ ప్రెసిడెంట్ నౌపాడు రాజారావు, జిల్లాకు చెందిన సీనియర్ క్రీడాకారులు అభినందించారు. నదిలో నిమజ్జనం చేయిస్తున్న సుభాన్ -
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
రణస్థలం: మండలంలోని పైడిభీమవరం జాతీ య రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఎన్.భరణి (19) అనే యువకుడికి తీవ్రగాయాలవ్వడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జేఆర్పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 13న విజయనగరంలో ఒక వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా పైడిభీమవరం దగ్గర బైక్ అదుపుతప్పి భరణి డివైడర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భరణిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందించారు. మంగళవారం ఉదయం అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జేఆర్పురం ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఇతడిది శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని రెల్లవీధి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి.సత్యనారాయణ వెల్లడించారు.రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస పంచాయతీలో ఉన్న రావివలస జాతీయ రహదారిపై ఆగివున్న లారీని విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఆటో మంగళవారం మధ్యాహ్నం ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న ఎస్ఎంపురం గ్రామానికి చెందిన పేడాడ శ్రీనివాస్, ఆమదాలవలస గ్రామానికి చెందిన ఎస్.మహేష్లు తీవ్రగాయాలు పాలయ్యారు. వీరిని 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ఈ ప్రమాదంపై లావేరు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘనంగా ఇంజినీర్స్ డే అరసవల్లి: శ్రీకాకుళం నగరంలోని జెడ్పీ ఆవరణలో ఇంజినీర్స్ డే వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ డిప్లమో ఇంజినీర్ల సంఘం ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో రక్తదా నశిబిరాన్ని నిర్వహించారు. పీఆర్ ఎస్ఈ వీఎస్ నగేష్బాబు, ఇంజినీర్ల సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్వీఏ పోలినాయుడు, జి.రవిబాబు, ఉపాధ్యక్షుడు సామ్యూల్ పాల్గొన్నారు. -
సాగు హక్కును కల్పించాలి
ఎచ్చెర్ల: మండలంలోని చిలకపాలేం పంచాయతీ నారాయణపురం భూములను తరతరాలుగా సాగు చేస్తున్న దళిత, బీసీ, పేద రైతులకు సాగు హక్కులను కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కె.మోహనరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావులు కోరారు. ఈ మేరకు మంగళవారం నారాయణపురం భూసాగుదారుల కమిటీ ఆధ్వర్యంలో రైతుల సాగుహక్కు కోసం చేపట్టనున్న పాదయాత్రలో భాగంగా ప్రజా గాయకుడు కె.హేమసుదన్ పాడిన పాటల సీడీని చిలకపాలేంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిలకపాలేం నుంచి శ్రీకాకుళం కలెక్టరేట్ వరకు ఈనెల 21, 22వ తేదీల్లో చేపట్టనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. పాదయాత్రకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ బి.తులసీరావులు హాజరవుతారన్నారు. సాగుదారులకు పట్టాలు లేకపోవడం వలన రైతుభరోసా, వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు వంటి ప్రభుత్వ పథకాలు అందక రైతులు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ బకాసురులు తప్పుడు పత్రాలను సృష్టించి తరతరాలుగా సాగు చేస్తున్న రైతుల భూములను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సాగుదారులుగా నమోదు చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తప్పుడు పత్రాలను సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఎన్వీ రమణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, తోనంగి నందోడు, పుట్టా బుచ్చిబాబు, కోరాడ అప్పన్న, జరజాపు సీతారాం, పైడియ్య తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
టెక్కలి రూరల్: మండలంలోని పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కృష్ణారావు మంగళవారం తెలిపారు. ఈనెల 11, 12, 13 తేదీల్లో కర్నూలు డీఎస్ఏ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి ఆట్యపాట్య క్రీడల్లో పాఠశాల నుంచి బి.హనీష్, పి.నరేష్ పాల్గొని ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. వీరిలో పి.నరేష్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో అక్టోబర్ 2 నుంచి 5 వరకు జరగనున్న జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గోనున్నట్లు వెల్లడించారు. దీంతో విద్యార్థులకు డిప్యూటీ డీఈవో పి.విలియమ్స్, వ్యాయామ ఉపాధ్యాయులు జగదీశ్వరరావు, ఆదిశేషు తదితరులు అభినందించారు. -
రాజుల చెరువును కాపాడండి
● తుంగతంపర గ్రామస్తుల ఆందోళన హిరమండలం: తమ గ్రామంలో రాజుల చెరువును కాపాడాలని కోరుతూ తుంగతంపర గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పర్లాకిమిడి గజపతిరాజుల నుంచి 77 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు జవ్వాజి శ్రీరామమూర్తి చెబుతున్నారు. ఆ భూమికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాల కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దశాబ్దాలుగా గ్రామ అవసరాలకు వినియోగించుకుంటున్న చెరువును అక్రమ మార్గంలో కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ అవసరాలకు ఉపయోగిస్తున్న చెరువును అక్రమ మార్గంలో స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దశాబ్దాల కిందట నాటి భూమికి ఇప్పటి రికార్డులు చూపించి స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. -
ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు
సోంపేట: కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సోంపేట పోలీసులు అరెస్టు చేశారు. సోంపేట సర్కిల్ పోలీస్స్టేషన్లో కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ, సోంపేట సీఐ బి.మంగరాజు, ఎస్ఐ బి.మోహినితో కలిసి విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం బరంపురంనకు చెందిన సత్యప్రదాన్, అమిత్ సాహు అనే ఇద్దరు యువకులు స్నేహితులు. పదో తరగతి వరకు చదువుకున్న సత్య ప్రదాన్ వలస కార్మికుడిగా చైన్నెలో కొంతకాలం విధులు నిర్వహించాడు. అనంతరం బరంపురం ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాంటిన్ నడుపుతూ జీవనం సాగించాడు. ఇతను జూదం, ఆన్లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగులకు బానిసయ్యాడు. వచ్చిన ఆదాయం సరిపోవకపోవడంతో దొంగతనాలు చేయడం వృత్తిగా భావించి ద్విచక్ర వాహనాల దొంగతనానికి అలవాటుపడ్డాడు. అదే ప్రాంతానికి చెందిన అమిత్ సాహుతో సత్యప్రదాన్కు పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ కలిసి కాశీబుగ్గ డివిజన్ పరిధిలో సుమారు 17 ద్విచక్ర వాహనాలు దొంగతనం చేశారు. సోంపేట పట్టణంలో చార్జింగ్ బండిపై బైక్ దొంగతనం చేయడానికి వస్తున్నారు. సోంపేట పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండడం చూసి వీరిద్దరు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చిన సోంపేట ఎస్ఐ బి.మోహిని వీరిఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించి వీరి వద్దనుంచి 14 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మాట్లాడుతున్న డీఎస్పీ భవానీ -
స్థానిక సంస్థల విజయమే చంద్రబాబుకు గుణపాఠం
● టెక్కలి వైఎస్సార్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, కుంభా రవిబాబు మాట్లాడుతున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. చిత్రంలో ధర్మాన కృష్ణదాస్, కుంభా రవిబాబు, జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, పేరాడ తిలక్ తదితరులుటెక్కలి: చంద్రబాబును గద్దెనెక్కించి తప్పు చేశామని ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయంతో చంద్రబాబుకు గట్టిగా గుణపాఠం చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నా రు. టెక్కలిలో మంగళవారం పార్టీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు చంద్రబాబు వెనకడుగు వేశారని, కానీ ఇప్పుడు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. కూట మి రెండున్నరేళ్లలో అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, ఈ విషయాలను ప్రజలకు వివరించాలన్నారు. అన్యాయం జరిగిందని పోలీస్స్టేషన్కు వెళ్తే తిరిగి వేధిస్తున్నారని తెలిపారు. డీఎస్సీ అక్రమాలన్నీ బయటపడ్డాయన్నారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలంతా ఐకమత్యంగా పోరాడాలన్నారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ కూటమి ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రా న్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని, సుమారు 92 లక్షల 70 వేల కోట్ల రూపాయలు అప్పుల భారం వేశారని ఆరోపించారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 6 లక్షల పెన్షన్లు తొలగించేశారని తెలిపారు. టెక్కలిలో అధికారులు కూడా అచ్చెన్నాయుడు అండ చూసుకుని రెచ్చిపోతున్నారని, వారిని విడిచిపెట్టేది లేదని పార్టీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు. -
ఊరు.. మండపం
● ఒకే కుటుంబంలా మారుతున్న గ్రామాలు ● ఒక్కటిగా చవితి వేడుకలు 76 ఏళ్లుగా.. ఆంధ్రా, ఒడిశా రాష్ట్ర ప్రజలు కలసి ఉండే గ్రామం మాది. రాష్ట్రాలు వేరైనా మేమంతా గత 76 ఏళ్లుగా ఒకే దగ్గర వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి వారం రోజుల పాటు ఘనంగా పూజలు చేస్తాం. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు సహకారం అందిస్తూ పండుగను రెండు రాష్ట్రాల పండుగగా మార్చుకుంటాం. – తిప్పన ధనుంజయరెడ్డి, టి.బరంపురం, ఇచ్ఛాపురం మండలం పూర్వం నుంచి ఒకే వేదిక అందరం కలసి ఒకే మండపం ఏర్పాటు చేసి పండుగను సామూహికంగా నిర్వహించాలన్నది మా పూర్వీకుల అభిప్రాయం. వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా ఐక్యమత్యంగా గత 63 ఏళ్లుగా వినాయక పూజలు ఒకే దగ్గర చేస్తున్నాం. – దున్న గురుమూర్తి, బూర్జపాడు ఒక్కటిగా.. ఒకే వేదికపై గణనాథుడి పండుగ మనుషుల మధ్య దూరాలను పెంచేలా కాకుండా.. బంధాలను బలపరిచేలా ఉండాలనే ఉద్దేశంతో మా పూర్వీకులు 66 ఏళ్ల క్రితం మా గ్రామంలో ఒక్కటిగా వినాయక పూజలు చేయడం ప్రారంభించారు. ఒకే మండపం ఏర్పాటు చేస్తే ఆధ్యా త్మికతతో పాటు సామాజిక ఐక్యత కూడా పెరుగుతుంది. – చినపాన నాగరాజు, బెన్నుగానిపేట, ఇచ్ఛాపురం మండలం ఇచ్ఛాపురం రూరల్: వీధికి నాలుగు గణేశుని మండపాలు వెలుస్తున్న కాలంలో ‘ఒక ఊరు.. ఒకే వినాయకుడు.. ఒకే మండపం’ అంటూ దశాబ్దాలుగా ఐక్యతను చాటుతున్నాయి కొన్ని గ్రా మాలు. ఇచ్ఛాపురం మండలంలోని తిప్పనపుట్టుగ, బూర్జపాడు, బెన్నుగానిపేట, టీ. బరంపురం గ్రామాలు భక్తి పేరుతో విభజన కాకుండా భక్తితోనే ఐక్యతను పెంచుకోవచ్చ ని నిరూపిస్తున్నాయి. ఈ గ్రామాల్లో గ్రామస్తులంతా కలిసి ఒకే గణేష్ మండపాన్ని ఏర్పాటు చేస్తారు. అందరూ కలసి పూజలు నిర్వహిస్తారు. ఉత్సవ కార్యక్రమాల్లో ప్రతి క్కరూ భాగస్వామ్యులవుతారు. తరాలు మారినా.. సంప్రదాయం మారలేదు. ఈ గ్రామాల్లో గణేష్ ఉత్సవాల నిర్వహణలో ఐక్యత దశాబ్దాలుగా కొనసాగుతోంది. దీంతో పండుగ సమయంలో గ్రామం మొత్తం ఒక కుటుంబంలా మారుతుంది. పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు తదితర కార్యక్రమాలను గ్రామస్తులంతా కలసి నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్మాణం కోసం గ్రామాన్ని, భూములను త్యాగం చేసినా ఇప్పటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మూలపేట నిర్వాసితులు వినూత్న నిరసన చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం గ్రామంలో కొలువుదీరిన గణనాథుడికి తమ సమస్యలను విన్నవిస్తూ పూజలు నిర్వహించారు. అధికారులను, ప్రజాప్రతినిధులు తమ గోడును పట్టించుకోవడం లేదని పేర్కొంటూ.. తమ పరిహారం అందేలా చూడాలని గణనాథుడిని వేడుకున్నారు. మూలపేట గ్రామంలో సుమారు 450 కుటుంబాలు ఉండగా, దాదాపు అందరూ గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాస ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే 50 కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందకపోవడంతో గ్రామాన్ని వీడకుండా అక్కడే ఉండిపోయారు. పరిహారం చెల్లించే వరకు గ్రామం నుంచి కదిలేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. వీరిలో కొందరికి జీడితోటల పరిహారం అందాల్సి ఉండగా, మరి కొందరికి ఇళ్లకు సంబందించిన ఎస్టిమేషన్లో తేడాలు ఉన్నాయని నిర్వాసితులు చెబుతున్నారు. ఇంకొందరికి పీడిఎఫ్ పరిహారం ఖాతాల్లో జమకాలేదని వాపోతున్నారు. గ్రామంలో ఓ వైపు ఇళ్ల కూల్చివేతలు జరుగుతుండగా.. మరోవైపు పరిహారం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లలేక అక్కడే ఉంటున్నాయి. తమకు రావాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించి న్యాయం చేయాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు. రెండు మండలాల ప్రజలం కలసి అటు ఇచ్ఛాపురం, ఇటు కవిటి మండలాలకు చెందిన ప్రజలు మా గ్రామంలో ఉన్నారు. మండలాలు వేరైనా మేమంతా ఒక్కటే అంటూ గత 58 ఏళ్లుగా ఒకే ఊరు, ఒకే వినాయకుడు, ఒకే ఐక్యతగా సాగుతున్నాం. – తిప్పన శంకర్రెడ్డి, ఎన్ఆర్ఐ, తిప్పనపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం -
కారుంటే రూ.20వేలు..
భూమి ఉంటే రూ.15వేలు ● అడిగినంత ఇస్తే కొత్త పింఛన్కు అర్హులే ● సచివాలయ ఉద్యోగులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు కాశీబుగ్గ : రాక రాక వచ్చిన కొత్త పింఛన్ల అవకాశాన్ని టీడీపీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త పింఛన్లకు దరఖాస్తు లు తీసుకోవడం సచివాలయ ఉద్యోగులకు కత్తీమీద సాములా మారింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అర్హులు కాని వారిని సైతం పరిగణించాల్సి వస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్లో తమ ఉద్యోగాల కు ఎలాంటి ముప్పు తెస్తుందో అని కలవరపడుతున్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి ప్రభుత్వం నూతన పింఛన్ల ముసుగులో పార్టీ శ్రేణులకు ఉపాధి మార్గం కల్పించింది. దీంతో కొందరు అర్హత లేనివారితో సైతం దరఖాస్తు పెట్టిస్తున్నారు. కారు ఉన్నవాళ్ల నుంచి రూ. 20వేలు, పరిమితికి మించి భూమి ఉంటే రూ.15వేలు ఇలా ఒక్కో కొర్రీ కి ఒక్కో రీతిలో వసూళ్లకు పాల్పడుతున్నారు. రోజుకు రూ. వేలల్లో వసూళ్లకు తెరలేపారని స్థానికంగా చర్చ జరుగుతోంది. అనర్హులకు ఆశ చూపి దరఖాస్తు చేసేవారిలో ఎక్కువ మంది అనర్హులు ఉండటంతో వాటిని ఆసరాగా తీసుకుని ఆదాయ వన రుగా మార్చుకుంటున్నారు. సగటున ఒక్కో దర ఖాస్తు నుంచి రూ. 10వేలకు తగ్గకుండా తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్లు, భూములు ఉన్నవారు, పన్నులు చెల్లించేవారంతా అనర్హులు. కానీ ఇవేమీ వారికి పట్టడం లేదు. ప్రభు త్వం మాది, మేం సూచించేవారికే పింఛన్ వస్తుందంటూ డాంబికాలు పలుకుతున్నారు. నూతన పింఛన్ల దరఖాస్తుకు ఈనెల 16 ఆఖరు కావడంతో ఎక్కువమందితో దరఖాస్తు పెట్టించేందుకు వసూ లు రాయుళ్లు తహతహలాడుతున్నారు. అనర్హులని తెలిసినప్పటికీ అలాంటి వారితో నాయకులు దగ్గరుండి దరఖాస్తు చేయడంపై సచివాలయ ఉద్యోగులు ఈసడించుకుంటున్నారు. -
కష్టాలకు దగ్గరగా.. పెన్షన్కు దూరంగా
ఈ చిన్నారి పేరు రేఖ బెహరా. నాల్గో తరగతి చదువుతున్న ఈ బుజ్జాయి పుట్టుకతోనే దివ్యాంగురాలు. మెళియాపుట్టి మండ ల కేంద్రంలోనే వీరి కుటుంబం నివాసం ఉంటోంది. ఒడిశా నుంచి వచ్చినా ఆంధ్రాలోనే స్థిరపడ్డారు. ఇక్కడే రేషన్, ఆధార్ అన్నీ ఉన్నా యి. కానీ ఈ చిన్నారికి ఇంతవరకు దివ్యాంగ పింఛన్ మంజూరు కాలేదు. బాలిక తండ్రి దుర్యోధన కూలి పనులు చేస్తుంటారు. కుమార్తెకు పింఛన్ మంజూరైతే ఆమె జీవితానికి కాసింత ఆధారం దొరుకుతుందని ఆ తండ్రి అభ్యర్థిస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు. – మెళియాపుట్టి -
ఉత్సాహంగా సాఫ్ట్ టెన్నిస్ జట్ల ఎంపికలు
పాతపట్నం: పాతపట్నం ఆల్ఆంధ్ర రోడ్డు సమీపంలో ఉన్న అక్షర పాఠశాల మైదానంలో సాఫ్ట్ టెన్నిస్ ఏపీ సబ్ జూనియర్ బాలికల ఇంటర్ డిస్ట్రిక్ట్ కమ్ రాష్ట్ర జట్టు ఎంపికలు శనివారం ఉత్సాహభరితంగా సాగాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. అనంతరం రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాయామ సంఘం అధ్యక్షుడు వై.శేఖర్బాబు, ఏపీ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ చైర్మన్ డి.నవీన్కుమార్లు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్కు పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అక్షర స్కూల్ డైరెక్టర్ రియాజ్ బేగ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ కొండాల చక్రపతి, కె.రాజారావు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల చెంతకు మూడేళ్ల బాలిక
నరసన్నపేట: స్థానిక హనుమాన్ నగర్కు చెందిన మూడేళ్ల బాలికను నరసన్నపేట పోలీసులు వారి తల్లిదండ్రులకు శనివారం సురక్షితంగా అప్పగించారు. రోజువారీ కూలి పనుల కోసం తల్లిదండ్రులు రవి బెహరా, కమలా బెహరాలు వెళ్లిపోగా కుటుంబ సభ్యుల వద్ద ఉన్న మూడేళ్ల బాలిక ఇంటి వద్ద ఆడుకుంటూ సమీపంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్కు నడుచుకుంటూ నాలుగు గంటల సమయానికి చేరుకుంది. చాలా సమయం వరకూ బాలిక కాంప్లెక్స్ పరిసరాల్లోనే తిరగడంతో స్థానికులు గుర్తించారు. 6 గంటల సమయంలో బాలికతో ఎవరూ లేనట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎస్ఐ బి.గణేష్ పోలీసులను పంపారు. అనంతరం బాలిక వివరాలు తెలుసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. నాలుగు గంటల నుంచి బాలిక కనిపించకపోవడంతో ఆందోళనకు గురై వెతుకుతున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆలోగా పోలీసులే బాలికను అప్పగించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ పిల్లలను ఇంటి వద్ద ఒంటరిగా వదిలేయకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
●అడ్డుకుంటాం..
గతంలో ఇదే మాదిరిగా ఇసుక అక్రమ రవాణా జరిగితే సిబ్బందితో పరిశీలన చేయించి ట్రాక్టర్లు పట్టుకున్నాం. ఇప్పుడు రాత్రివేళ లు, సెలవురోజుల్లో తరలిస్తున్నట్లు తెలిసింది. పోలీసుల సహకారంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. – రాము, ఇన్చార్జి తహసీల్దార్, మెళియాపుట్టి సిబ్బందిని అప్రమత్తం చేసి ఇసుక అక్రమ రవాణా జరగకుండా కట్టడి చేస్తాం. ఇదివరకే మహేంద్ర తనయ నదీ తీరంలో పలుమార్లు మా ఎస్సై, సిబ్బంది కలిసి నిఘా పెట్టారు. ఒడిశాకు ఇసుక తరలించకుండా స్థానికులు, రెవెన్యూ సిబ్బంది సకాలంలో సమాచారం అందించి సహకరించాలి. – వెంకటరావు, సీఐ, పాతపట్నం -
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
టెక్కలి రూరల్: పరశురాంపురం కూడలి వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటబొమ్మాళి మండలం చలమయ్యపేట గ్రామానికి చెందిన చెల్లూరి సంతోష్(29) తన స్నేహితులు సీహెచ్ కార్తీక్, బి.రామకృష్ణలతో కలిసి ద్విచక్రవాహనంపై చాకిపల్లి వద్ద ఉన్న దాబాకు వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా పరశురాంపురం కూడలి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి గుర్తు తెలియని కంటైనర్ లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు యువకులు గాయపడటంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే సంతోష్ మృతిచెందారు. సంతోష్ కొన్ని నెలలు క్రితమే దుబాయ్ నుంచి వచ్చాడు. మృతుడి సోదరి కావ్య ఫిర్యాదు మేరకు టెక్కలి ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
12,159 కేసుల పరిష్కారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లోనూ కలిసి 12,159 కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొండబోలు మాట్లాడుతూ లోక్ ఆదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం ఎంతో మేలన్నారు. రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకుంటే ఇరు పక్షాలకు సమయం ఆదాయ అవుతుందని అన్నారు. జిల్లా మొత్తం మీద 20 బెంచ్లను ఏర్పాటు చేయగా, శ్రీకాకుళం జిల్లా కోర్టు ఆవరణతో ఐదు బెంచ్లను ఏర్పాటు చేశారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి బి.సాధుబాబుక, 3వ అదనపు జిల్లా జడ్జి, సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి, సీనియర్ డివిజన్ ఆర్.శాంతిశ్రీ, డీఎల్ఎస్ఏ కార్యదర్శి కె.హరిబాబు, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, మొహిద్దీన్ జమరుత్ బేగం కములుద్దీన్, స్పెషల్ మొబైల్ కోర్ట్ మెజిస్ట్రేట్, వి.సాహితి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్ కె.అనురాగ్ , పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అదాలత్లలో 12,159 కేసులు పరిష్కారం చేశారు. ఇందులో సివిల్ కేసులు 101, క్రిమినల్ కేసులు 11,97, ప్రిలిటిగేషన్ కేసులు 50, మోటారు వాహన యాక్సిడెంట్ కేసులు 21, కాగా వీటికి గాను రూ.5,95,16,236 వసూలు చేశారు. -
వేధింపులకు చెక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వేధింపులు.. బెదిరింపులు.. ఛీత్కారాలు.. అవమానాలు.. ఐదేళ్ల కూటమి పాలనలో వైఎస్సార్ సీపీ కార్యకర్త ఎదుర్కొన్న ప్రతి అన్యాయాన్ని ఆ పార్టీ గుర్తుంచుకుంటోంది. అధికార పక్షం చేతిలో రెడ్బుక్ పట్టుకుని వికటాట్టహాసం చేస్తుంటే.. దాని కి సమాధానంగా ‘డిజిటల్ బుక్’కు వైఎస్సార్ సీపీ ఊపిరి పోస్తోంది. రాలిన ప్రతి కన్నీటి చుక్కకు సమాధానం చెప్పేందుకు, జరిగిన ప్రతి అవమానానికి బదులు ఇచ్చేందుకు ఇప్పటినుంచే కార్యాచరణ లిఖిస్తోంది. ఫొటోలు, వీడియోలు, ఎఫ్ఐఆర్ కాపీ లతో సహా ప్రతి ఆధారాన్ని నిక్షిప్తం చేయనుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కక్ష సాధింపులకు బలవుతున్నారు. ప్రభుత్వం అక్రమ కేసులతో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతోంది. కొందర్ని ఏకంగా జైళ్లకు పంపుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచిన, అసంతృప్తితో ఉన్న వారిని భయపెట్టో, బెదిరించో అణగదొక్కాలని సర్కారు చూస్తోంది. అందుకు పోలీసు, ఇతర యంత్రాంగాన్ని వాడుకుంటోంది. ఈ పరిస్థితుల్లో న్యాయపోరాటం చేస్తున్నా కక్ష సాధింపులు ఆగడం లేదు. వైఎస్సార్సీపీ ఎదుర్కొన్న ఈ కక్ష సాధింపులకు సమాధానం చెప్పేందుకు పురుడు పోసుకున్నదే డిజిటల్ బుక్. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి డిజిటల్ బుక్ను ఆవిష్కరించారు. 040 49171718 టోల్ ఫ్రీ నంబర్ను విడుదల చేశారు. ఎవరు ఎక్కడి నుంచైనా తమ బాధలను చెప్పుకోవచ్చు. జరిగిన అన్యాయాన్ని డిజిటల్ బుక్లో నమోదు చేసుకోవచ్చు. ‘నేను ఒంటరిని కాను.. నా వెనుక నా నాయ కుడు ఉన్నాడు. నా బాధకు ఒక గుర్తింపు ఉంది’ అనేలా కార్యకర్త, నాయకుడు ధైర్యంగా ఉండేలా డిజిటల్ బుక్ సహాయపడుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తప్పు చేసిన వారు రిటైర్ అయినా, చట్టం ముందు నిలబడక తప్పదనే హెచ్చరికతో డిజిటల్ బుక్ ప్రస్థానం మొదలవుతోంది. అవసరమైన చోట బాధితులకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం, కోర్టుల్లో ప్రైవేటు కేసులు దాఖలు చేయడం వంటివి ప్రతిపక్ష పార్టీ చేస్తోంది. వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో కూడా డిజిటల్ బుక్ అమలుకు జిల్లా పార్టీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్గా శిమ్మ రాజశేఖర్ను నియమించగా, సభ్యులుగా నర్తు నరేంద్రయాదవ్, పుట్టా మోహన్రెడ్డిల ను నియమించింది. ఈ కమిటీ ఈనెల 7వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం కూడా చేసింది. వారితో పాటు జిల్లా నాయకులంతా డిజిటల్ బుక్ అమలుపై ప్రమాణం చేశారు. ఈ కమిటీ జిల్లా స్థాయిలో బాధితుల గోడును విననుంది. కూటమి ప్రభుత్వం వేధింపులు, దౌర్జన్యాలతో పాటు పోలీసు అధికారులు, ఇతర అధికారులను అనుసరిస్తున్న తీరుపై ఫిర్యాదులు తీసుకోనుంది. అలాగే, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయి లో స్థానిక నాయకులు కూడా క్షేత్రస్థాయిలో వచ్చిన ఫిర్యాదులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డిజిటల్ కమిటీ దృష్టికి తీసుకురానున్నారు. వాటిని నిశితంగా పరిశీలించి, జెన్యూన్ అనుకున్న వాటిపై సీరియస్గా ఫోకస్ పెట్టనున్నారు. ఇబ్బందులు పెడుతు న్న అధికారులతో మాట్లాడట మే కాకుండా డిజిటల్ బుక్లో ఎక్కించి, భవిష్యత్లో కార్యాచరణ అమలయ్యేలా చూడ నుంది. ఇప్పటికే జిల్లా స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంది, నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో పాల్గొంటోంది. ఆ తర్వాత మండల స్థాయి సమావేశాల్లో కూడా పాల్గొని కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇచ్చేలా డిజిటల్ బుక్ ప్రాధాన్యతను శిమ్మ రాజశేఖర్ నేతృత్వంలోని కమిటీ వివరించనుంది. -
శ్రీకాకుళం
పట్టుబడిన దొంగలుదేవాలయాల దొంగలు పట్టుబడ్డారు. బంగారం, వెండి రికవరీ చేశారు. –8లోనా ప్రియాతిప్రియమైన భక్తులకు ఆశీస్సులు.. కాలం భాద్రపదంలోకి అడుగు పెట్టింది. మూషికుడు నా రథాన్ని సిద్ధం చేస్తున్నాడు. హిమగిరులపై నుంచి నేనూ అన్నీ చూస్తూనే ఉన్నాను. మీరు మండపాలు కట్టడం.. నా ప్రతిమలు తయారు చేయడం.. పూజాదులకు ప్రణాళికలు వేసుకోవడం.. అన్నీ గమనిస్తూనే ఉన్నాను. చవితి పూజకు జరిగే ప్రతి క్రతువూ నాకు సంతోషదాయకమే. నవరాత్రులు నన్ను పూజించేందుకు మీరు పడే తాపత్రయం సర్వదా నా హృదిని రంజింపజేస్తూనే ఉంటుంది. మరి కాల మహిమో.. కలి మహిమో గానీ.. చవితి వేడుకలో కొన్ని పెడ ధోరణులు నన్ను కాస్త కలవరపరుస్తున్నాయి. నా భక్తులకు నేను చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు. నా మాతృమూర్తి నలుగుతో నన్ను తయారు చేసి ప్రాణం పోసింది. నా తండ్రి బూడిద రాసుకుని విహరిస్తారు. ఓ గుప్పెడు మారేడు దళాలను నా ముందు కడితే చాలు.. నేను పరవశుడినైపోతాను. కానీ భారీ అలంకరణల కోసం ఎక్కువ చందాలు వసూలు చేయడం, అవి చాలక నా భక్తులు తిప్పలు పడడం నాకు గొప్పగా అనిపించడం లేదు. మీరు గొడవలు పడి మరీ నాకు భారీ అలంకరణలు చేయాలా..? భక్తితో కట్టే చిన్న మండపంలోనైనా నేను సంతోషంగా కొలువుదీరుతాను. నా భక్తులు చందాల వసూలును దందాలుగా మార్చకపోతే చాలు. నా ఈ గజవదనం నా తండ్రి నాకు ఇచ్చిన వరం. ఈ దేహాన్ని హేళన చేసినందుకే చంద్రుడు శాపగ్రస్తుడయ్యాడు. నన్ను అవతారా ల్లో చూసుకోవాలని నా భక్తులు ముచ్చటపడతారని నాకూ తెలుసు. కానీ మరీ సినిమా హీరోలకు నా రూపాన్ని అమర్చి.. దాన్ని భక్తి అంటే ఎలా చెప్పండి..? ఓ బుజ్జి ప్రతిమను తయారు చేసి నన్ను ఆవాహన చేసినా నేను వచ్చి వాలిపోతాను. ముప్పై అడుగులు, నలభై అడుగులు అంటూ మీ గొప్పలకు నా రూపాన్ని పెంచాల్సిన పనిలేదు. వ్యాస మహర్షి భారతం చెబుతుంటే.. ఒంటి చేత్తో నేను రాసిన సంగతి అందరికీ తెలిసిందే కదా. సాహిత్యమే కాదు సంగీతం అంటే కూడా నాకు ఎనలేని ఇష్టం. కానీ నా వేదికపై పెడుతున్న పాటలు వింటే చెవులు మూసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఉత్కృష్టమైన సాహితీ సంపదను నిలువెల్లా నింపుకున్న తెలుగు పాటలు మీకు కోకొల్లలుగా ఉన్నాయి. భారత భాగవతాదుల గానాలూ ఉన్నా యి. అవన్నీ కాదని అశ్లీల పాటలే నా మండపంలో వినిపించడం నేరం కాదు పాపం. ఇక గంగమ్మ ఒడికి నన్ను చేర్చే అనుపు తంతు గురించి ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటు న్నాను. మన ఆనందానికి ఇతరులను బాధ పెట్టడం భావ్యమా చెప్పండి.. నా ముందు మీరు సంతోషంగా చిందులేస్తే చూసి నాకూ ముచ్చటేస్తుంది. కానీ పరిమితికి మించిన శబ్దానికి జనమంతా ఇబ్బంది పడుతుంటే.. నేనెలా సంతోషించగలను. డీజేలు పెట్టి ప్రాణాలతో చెలగాటమాడాల్సిన అగత్యం ఏముంది. నా కథ మీ అందరికీ తెలుసు. నా పుట్టుక మీ అందరికీ పరిచయ మే. ఆ కథ మీకు ఏం నేర్పించింది. భక్తుడైనా సరే.. లోక విరుద్ధ పనులు చేసి గజాసురుడు ప్రాణా లు పోగొట్టుకున్నాడు. అందగాడైనా సరే హేళన చేసి చంద్రుడు శాపగ్రస్తుడయ్యాడు. మరెవరూ అలా చేయకూడదనే.. మీరు ఏటా మీకు నా కథ వినిపిస్తారు. ఈ హెచ్చరికలూ అందులో భాగమే. రసాయనాలను నీటిలో నింపే లోక విరుద్ధమైన పనులు మీరు చేయవద్దు.. నా గజవదనాన్ని చూసి నవ్వుకునే రీతిలో విగ్రహాలను రూపొందించవద్దు. ఇప్పటికే ఎక్కడా వర్షాలు లేవు. చెరువులు ఎండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రంగుల హంగులకు పోకండి. మనస్ఫూర్తిగా మట్టి ప్రతిమతో ఆరాధించండి. అది చాలు నాకు. ఏటా పెరగాల్సింది నా విగ్రహం పొడవు కాదు. మీ బుద్ధి, మనసు. సుగుణాలను వికసింపజేయండి. సాటివారిని ప్రేమించండి. నన్ను నమ్మి ముందడుగెయ్యండి. మిమ్మల్ని నమ్మినోళ్లని వెనకడుగు వేయకుండా చూడండి. మట్టి రూపంలో మొక్కండి. పుడమితల్లిని పాడు చేసే పనులు మానండి. సర్వేజనా సుఖీనోభవంతు.. ఇటు.. మీ గణేశుడు – కాశీబుగ్గ -
డీజేలకు అనుమతి లేదు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో 3,946 గణేష్ మండపాలకు సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో అనుమతులు కోరుతూ నిర్వాహకులు దరఖాస్తులు చేసుకున్నారని.. ఇప్పటికి 2359 మండపాలకు అనుమతులిచ్చామని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల ఆరంభంలో గానీ, నిమజ్జన, ఊరేగింపు ఆఖరి మజిలీలో గానీ డీజే వంటి సౌండ్ సిస్టమ్లకు అనుమతులు లేవని, ఇప్పటికే వీటి యజమానులకు నోటీసులు పంపామని, ఒకవేళ డీజేలు పెట్టారని తెలిస్తే తక్షణ మే సీజ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని గూనపాలెం సబ్డివిజనల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఊరేగింపు నిమజ్జనం కార్యక్రమంలో మద్యం సేవించి డ్యాన్స్ చేస్తామంటే కుదరదని, ఆల్కహాల్ టెస్టులు జరుపుతామని, ఆ సమయంలో రెగ్యులర్గా ఉండే పెట్రోలింగ్, బీటు బృందాలతో పాటు ప్రత్యేక బృందాల నిఘా ఉంటుందన్నారు. మండపాల్లో సీసీ కెమెరాలు పెట్టుకోవడం నిర్వాహకుల బాధ్యత అని తెలిపారు. జిల్లాకేంద్రంలోని నాగా వళి 2 వంతెనల వద్ద నిమజ్జన ప్రదేశాలను గుర్తించి 2 క్రేనులు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేశామన్నారు. 1 నుంచి 5 అడుగుల విగ్రహాలు 487, 6 నుంచి 10 అడుగుల విగ్రహాలు 219, 15 అడుగుల విగ్రహాలు 31, 20 అడుగుల విగ్రహాలు 3 ఉండగా, 30 అడుగులు, 23 అడుగులు, 21 అడుగుల చొప్పున విగ్రహాలు ఒక్కొక్కటి నమోదైనట్లు డీఎస్పీ చెప్పారు. -
అర్ధరాత్రి తలుపు తట్టినా మీ వెంటే ఉంటాం
ఆమదాలవలస: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ క్యాడర్ పనిచేయాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఆమదాలవలస పట్టణంలోని శారద కల్యాణమండపంలో శనివారం పార్టీ ఆమదాలవలస నియోజవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్త సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మాన మాట్లాడుతూ అక్రమ కేసులకు ఎవ్వరూ భయపడవద్దని, ప్రతి కార్యకర్తకు, నా యకుడికి పార్టీ క్యాడర్, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అర్ధరాత్రి తలుపు తట్టినా మీ వెంటే ఉంటామని చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి అధిష్టానం గుర్తింపు ఇస్తుందన్నారు. ప్రస్తుతం టీడీపీ పాలనలో రైతులకు యూరియా దొరికే పరిస్థితి లేదని, రూ.300 విలువ చేసే యూరియాను ఒడిశాకు వెళ్లి రూ.వెయ్యికి కొనాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వెన్నుపోటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలు నెరవేర్చలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ విషయం గ్రామస్థాయి లో కార్యకర్తలు తెలియజెప్పాలన్నారు. అధికారు లు నిష్పక్షపాతంగా పనిచేయాలని లేకుంటే డిజిటల్ బుక్లో నమోదు చేసిన తర్వాత వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు వేల కోట్లు అప్పులు చేసి ప్రజల నెత్తిన భారం పెడుతూ ఆ సొత్తు అంతా అమరావతిలో తన స్వలాభానికి వాడుకుంటున్నారని విమర్శించారు. -
గురుకులంలో అరకొర భోజనాలు!
శ్రీకాకుళం రూరల్: ‘మా స్కూల్.. మా ఇష్టం.. ఇక్కడికి రావడానికి ఎవరికీ అనుమతులు లేవు.. మేం వండిందే మెనూ..’ ఇదీ పెదపాడులోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల వద్ద శుక్రవారం పరిస్థితి. గురువారం గురుకులంలో జరిగిన ఘటన చర్చనీయాంశం కావడంతో శుక్రవారం గురుకులం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పాఠశాల గేట్లు మూసేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. విలేకరులకు సైతం అనుమతి ఇవ్వలేదు. విద్యార్థులకు భోజనాలు అరకొరగానే పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రుచి లేకపోవడంతో కొందరు విద్యార్థులు ఆహార పదార్థాలను డస్ట్బిన్లోనే పడేస్తున్నట్లు తెలిసింది. తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. స్నానాలకు తండేవలస నుంచి ఓ కెనాల్ ద్వారా నీటిని తెచ్చి ట్యాంకులు నింపుతున్నారని సమాచారం. ఉదయం వేగంగా లేచిన వారికి మాత్రమే స్నానానికి నీరు దొరుకుతుందని, మిగిలిన వారు ముఖం కడుక్కోని తరగతులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. కాగా, అంబేడ్కర్ గురుకులాల్లో తరచూ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నా సంబంధిత అధికారి సరిగ్గా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఆటో బోల్తాపడి డ్రైవర్కు గాయాలు
టెక్కలి రూరల్: స్థానిక మండాపొలం కాలనీ వద్ద శుక్రవారం సాయంత్రం ఆటో బోల్తాపడి డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలి నుంచి పలాస వైపు ఇద్దరు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో మండాపొలం కాలనీ సమీపంలోకి వచ్చే సరికి కుక్కలు అడ్డురావడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా డ్రైవర్ గేదెల శంకరరావు ఆటో కింద ఇరుక్కుని గాయపడ్డా డు. బాధితుడిని వెంటనే టెక్కలి జిల్లా ఆస్పత్రి కి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు నమోదు చేశారు. జి.సిగడాం(పొందూరు): వరకట్న వేధింపు కేసులో ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ పొందూరు కో ర్టు న్యామయూర్తి బి.జ్యోత్స్న శుక్రవారం తీర్పునిచ్చారు. పొందూరు మండలం ఖాజీపేటకు చెందిన పల్ల ఎర్రయ్య తన భార్య రాజేశ్వరిని వరకట్నంతోపాటు శారీరకంగా మానసికంగా వేధిన్నాడని మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు నేరం రుజవు కావడంతో జైలుశిక్ష, జరిమానా విధించారు. కొత్తూరు : కర్లెమ్మ పంచాయతీ అఫీషియల్ కాలనీలో ఇటీవల బంగారం వస్తువులకు మెరు గుపెడతామని చెప్పి పుస్తెలతాడు అపహరించుకుపోయిన కేసులో బీహార్ రాష్ట్రానికి చెంది న దినేష్కుమార్ యాదవ్ను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ కె.వెంకటేష్ తెలిపారు. దినేష్కుమార్ యాదవ్తో పాటు మరో వ్యక్తి నమ్మించి పుస్తెలతాడుతో పరారయ్యారని, దర్యాప్తు నిర్వహించి యాదవ్ను అరెస్టు చేశామని చెప్పారు. మందస: చిన్నలోహరిబంద గ్రామానికి చెందిన తల్ల వీరమ్మ(63) రెండు రోజు లుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు శుక్రవా రం మందస పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంబుగాం వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసన్నపేట: చైన్నె–కోల్కతా రైలు మార్గంలో మామిడివలస వద్ద కోరమండల్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతిచెందా డు. మృతుడు పశ్చిమబెంగాల్ రాష్ట్రం మాల్డాకు చెందిన తపాన్ కిస్కూ (29)గా గుర్తించారు. కూలి పను ల కోసం చైన్నె వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమదాలవలస రైల్వే హెచ్సీ మధుసూదనరావు తెలిపారు. ఎచ్చెర్ల : శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్లో నాలుగు డిప్లమో ఇంజినీరింగ్ ప్రోగ్రామ్లకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) న్యూఢిల్లీ అక్రిడిటేషన్ పొడిగించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ సమర్పించిన కాంప్లిన్స్ రిపోర్ట్ను పరిశీలించిన అనంతరం ఎన్బీఏ ఈ నిర్ణయం తీసుకుందని ప్రిన్సిపాల్ కె.నారాయణరావు శుక్రవారం తెలిపారు. శ్రీకాకుళం క్రైమ్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి ది ఫాల్స్ లీడర్ పుస్తకం రాసిన హమారా ప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జర్నలిస్టు అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు డీఎస్పీ సీహెచ్ వివేకానందకు వినతిపత్రం అందించారు. ప్రసాద్ను తక్షణమే అరెస్టు చేయాలని, పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జి.ఎజ్రా, పి.అప్పన్న, బి.వేణు, ఎ.కృష్ణ, డి.గోవింద్ తదితరులున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : కొంతమంది వ్యక్తులు చంపేస్తామని బెదిరిస్తున్నారని, వీరి నుంచి రక్షణ కల్పించాలని ఎచ్చెర్ల మండలం అజ్జరాం గ్రామానికి చెందిన కొయ్య సత్యనారాయణ, భవాని దంపతులు కోరారు. శుక్రవారం వారు మాట్లాడుతూ తమ కుటుంబం 35 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఏడు ఎకరాల జీడి తోటను ధ్వంసం చేయడమే కాక ఎటువంటి సంబంధం లేని వ్యక్తి పేరును భూ రీసర్వే సమయంలో జాయింటుగా నమోదు చేశారన్నారు. దీనిపై ఈ నెల 2న రెవెన్యూ అధికారులకు, పోలీసులకు, ఎస్పీ గ్రీవెన్స్లో సైతం ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికై నా తమకు న్యాయం చేయాలని కోరారు. -
మా కొండ జోలికి రావద్దు
జి.సిగడాం: నడిమివలస–గదబపాలెం గ్రామ సమీపంలో ఉన్న కొండలో సుమారు 202 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని, తక్షణమే ఈ ఆలోచనలు విరమించుకోవాలని నడిమివలస భూముల రక్షణ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జి.సిగ డాం తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండను ఏపీఐఐసీ పారిశ్రామికవాడ గా ఏర్పాటు చేయడానికి, సర్వే నంబరు 36.38లో 202 ఎకరాల్లో ఎన్ఈఆర్ సివికాన్ కంపెనీకి ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొండను ఇచ్చేది లేదన్నారు. అనంతరం తహసీల్దార్ మహాదేవు సరిత, ఎంపీడీఓ గుంటముక్కల రామకృష్ణారావులకు వినతిపత్రాలను అందించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు ఇజ్జి రోతు రమేష్, యడ్ల గౌరీనాయుడు, వంకల గణపతి, అప్పలనాయుడు, రవి, జగదీశ్వరరావు, దాలినాయుడు సత్యంనాయుడు, అప్పల సూరి, రమణ, నారాయణరావు, అప్పన్న, సూరి, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
కరకట్టలు కలేనా!
ఏటా వర్షం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తాం. చిన్నపాటి వర్షం వచ్చి నా పొలాల్లోకి నీరు చేరిపోతుంది. పంటలన్నీ ముంపులో ఉండిపోయి, పాడవుతున్నాయి. తరాలు మారినా రైతుల తలరాతలు మారడం లేదు. – తొత్తడి సురేష్, రైతు, బూర్జ గ్రామం కరకట్టలు నిర్మించకపోవడంతో వర్షాలు ఎక్కువగా పడితే వ్యవసాయ భూము లు ముంపునకు గురవుతున్నాయి. గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ఇటువ్యవసాయ రైతులు, అటు నదీతీర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించాలి. – భవిరి ధనుంజయరావు, రైతు, బూర్జ గ్రామం బూర్జ: చినుకు పడితే చాలు ఎక్కడ ఊరు వరదగా మారుతుందోనని వంశధార, నాగావళి నదులను ఆనుకుని ఉన్న తీర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఆయా గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తుంటారు. జూన్ నుంచి దాదాపుగా నాలుగైదు నెలలపాటుగా భయం భయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా రెండున్నర ఏళ్లు దాటినా ఇంతవరకు కరకట్టల ఆలోచన చేయకపోవడంతో వారంతా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నాగావళి ఇలా.. నాగావళి నది జిల్లాలో సుమారు 110 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. వరదలువస్తే ఎక్కువగా బూర్జ మండలంలోని లాభాం, బూర్జ, వావాం, మామిడివలస, లంకాం, కాఖండ్యాం, అల్లెన, ఆమదాలవలస మండలంలోని దూసి, తోగరాం, కలివరం, ముద్దాడ పేట, దూసిపేట, తోటాడ, ఇసుకలపేట, శ్రీకాకుళం మండలంలోని బలగ, హయాతినగరం, ఫాజుల్బాగ్పేట తదితర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంటుంది. 2007లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కరకట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయినా ఇంతవరకు పనులు పూర్తి చేయలేదు. భూసేకరణ పనులు పూర్తికాకపోవడంతో కరకట్టల నిర్మాణంలో జాప్యం తప్పడం లేదు. వంశధార అలా.. జిల్లాలో వంశధార నది కొత్తూరు, హిరమండలం, ఎల్ఎన్పేట, సరుబుజ్జిలి, శ్రీకాకుళం, గార మండలాల్లో ప్రవహిస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం బత్తిలిలో మొదలుకుని శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలోని గార మండలం వరకు అనేక గ్రామాలకు ఏటా వరద ముప్పు తప్పడం లేదు. పనులు సులభంగా పూర్తి చేసేందుకుగాను వంశధార కరకట్టల పనులను నాలుగు విడతలుగా విభజించారు. పనులు కొంత మేర జరి గినా తర్వాత పట్టించుకోకపోవడంతో తీర గ్రామా ల ప్రజలకు ముంపు భయం తప్పడం లేదు. వంశధార, నాగావళి కరకట్టల పరిధిలో నదీతీర ప్రాంత గ్రామాల్లో అత్యంత ప్రమాదకరమైన పాయింట్లు గుర్తించి ప్రభుత్వానికి పంపించాం. వంశధార ప్యాకేజీ–2 ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులు భామిని, కొత్తూరు, హిరమండలం మండలాల్లో తుంగతంపర వరకు వేశారు. భూ సేకరణ జరిగిన ప్రాంతాల్లో పనులు చేస్తున్నాం. వచ్చే సీజన్ నాటికి అన్నిచోట్లా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాం. – పొన్నాడ సుధాకర్, జలవనరుల శాఖ ఎస్ఈ -
గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు
నరసన్నపేట: ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న రియాజ్ పాషాను నరసన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ. 30 వేల విలువైన 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నరసన్నపేట సీఐ మరడాన శ్రీనివాసరావు శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆటోడ్రైవర్గా పనిచేస్తున్న బెంగళూరులోని జయనగర్కు చెందిన రియాజ్ పాషాకు ఒడిశాకు చెందిన హిమాన్స్ ఫికర్తో పరిచయం ఏర్పడింది. ఆటో నడుపుతూ ఎంత డబ్బు సంపాదిస్తావు.. గంజాయి అమ్మకం ద్వారా ఒకేసారి అధిక మొత్తంలో సంపాదించవచ్చని ఆశచూపి గంజాయి అక్రమ వ్యాపారానికి ఒప్పించాడు. ఈ క్రమంలో పలుమార్లు గంజాయిని బెంగళూరు తీసుకువెళ్లి విక్రయాలు సాగించాడు. దీనిలో భాగంగా బరంపురం ప్రాంతానికి చెందిన బికారి ముఖి వద్ద 8 కేజీల గంజాయి కొనుగోలు చేసి బస్సులో వస్తుండగా నరసన్నపేట పోలీసులు దేవాది ఫ్లై ఓవర్ వంతెన వద్ద గురువారం పట్టుకున్నారు. టోల్గేట్ వద్ద ఎస్ఐ బి.గణేష్ గురువారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా పాషా అనుమానాస్పదంగా కనిపించడంతో వెంబడించారని, దేవాది వద్ద పట్టుబడ్డాడని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పవన్ కుమార్ అరెస్టు.. సారవకోటకు చెందిన ఎస్.పవన్ కుమార్ను గంజాయికి సంబంధించిన ప్రత్యేక చట్టం ద్వారా అరెస్టు చేసి విశాఖ సెంట్రల్ జైల్కు పంపినట్లు సీఐ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేస్తూ అధికసార్లు పట్టుబడిన వారిని ఈ విధంగా అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. పవన్ కుమార్పై నాలుగు గంజాయి కేసులు ఉన్నాయని, ప్రభుత్వ అనుమతితో శుక్రవారం అరెస్టు చేసి జైలుకు పంపించామన్నారు. -
ఉత్సాహంగా చెకుముకి సైన్స్ సంబరాలు
శ్రీకాకుళం: విద్యార్థుల్లో సృజనాత్మకతను గుర్తించేందుకు, ప్రశ్నించేతత్వాన్ని ప్రోత్సహించేందుకు చెకు ముకి సైన్సు సంబరాలు దోహదపడతాయని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్, జిల్లా కన్వీనర్ పి.కూర్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పిలి కామేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రెండ వ దశ మండల స్థాయి చెకుముకి సైన్సు సంబరాలు విజయవంతంగా జరిగాయన్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో చెకుముకి సైన్సు మండల స్థాయి సంబరాలు నిర్వహించామన్నారు. జిల్లాలో 30 మండలాల్లో 435 పాఠశాలల్లో 25 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. -
‘ప్రేరణ’కు మెట్టక్కివలస విద్యార్థి ఎంపిక
ఆమదాలవలస : గ్రామీణ ప్రాంత విద్యార్థులలో ప్రేరణ కల్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత పాఠశాలలో ప్రేరణ కార్యక్రమంపై పరీక్ష నిర్వహించి ఎంపికై న వారికి ఇంటర్వ్యూ చేసి అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మందిని ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు విద్యార్థులు ఎంపిక కాగా అందులో ఆమదాలవలస పట్టణంలోని మెట్టక్కివలస మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి రుంకు హర్షవర్ధన్ ఒకరు. వీరిని ప్రధాని మోదీ చదివిన పాఠశాల వాద్నగర్కు నవంబర్ 15 నుంచి 21 వరకు తీసుకెళ్లి ప్రేరణ కలిగిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా హర్షవర్దన్ను శుక్రవారం పాఠశాలలో సన్మానించారు. -
ఆదివాసీలకు అన్యాయం చేయవద్దు
సారవకోట: ఆదివాసీలకు కూటమి నాయకులు అన్యాయం చేయడం తగదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి అన్నారు. శుక్రవారం సారవకోటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం జరిగిన క్యాబినేట్ సమావేశంలో ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాలో లేని కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చుతామని ప్రకటించడం, మంత్రి కార్యాలయం నుంచి పోస్టర్ కూడా విడుదల చేయడంతో ఆదివాసీలు భయాందోళనకు గురౌతున్నారన్నారు. జిల్లాల విభజన జరిగిన తరువాత శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ కావాలని ఉద్యమాలు, నిరసన దీక్షలు చేస్తున్నా పట్టించుకోకుండా జిల్లాలో లేని కులాన్ని ఎస్టీలో చేర్చి వారికి అన్ని ఫలాలు అందిస్తామని కేబినేట్ మాట్లాడం విచారకరమన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో లాభం పొందేందుకు మంత్రి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఆదివాసీలు ఉద్యమాలు చేసి స్థానిక ఎన్నికలలో తడాఖా చూపిస్తామన్నారు. ఇప్పటి వరకు లేని కులాలను ఎస్టీలలో చేర్పించాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్లు సైతం ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని, దీనిని ఆదివాసీలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. -
రాష్ట్ర బేస్బాల్ పోటీలకు జిల్లా జట్లు పయనం
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి బేస్పోటీల్లో జిల్లా జట్లు సమష్టిగా రాణించి విజయదుందుభి మోగించాలని బేస్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుతమ్మినేని సుజాత పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న 8వ ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషులు, మహిళల బేస్బాల్ చాంపియన్షిప్–2026 పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు శుక్రవారం ఇక్కడి నుంచి పయనమై వెళ్లాయి. జిల్లా కార్యదర్శి వీరభద్రరావు, కొండపల్లి కిరణ్కుమార్, పొట్నూరు అజయ్కుమార్ సంయుక్తంగా సమకూర్చిన క్రీడాదుస్తులను క్రీడాకారులకు, కోచ్ మేనేజర్లకు పంపిణీ చేశారు. ఎన్.రవిబాబు, వి.గురుమూర్తి క్రీడాకారులకు రవాణా ఖర్చుల నిమిత్తం రూ.15 వేల ఆర్థిక సాయం అందించారు. కాగా అంతకుముందు వారం రోజుల పాటు పురుషుల జట్టుకు బొంతలకోడూరు(ఎచ్చెర్ల మండలం)లో, మహిళల జట్టుకు ఇప్పిలి (శ్రీకాకుళం రూరల్ మండలం) వేదికగా రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంపు నిర్వహించేందుకు అవసరమైన మొత్తాన్ని, క్రీడాకారులకు వసతి, భోజన ఏర్పాట్లను బేస్బాల్ జిల్లా అధ్యక్షులు తమ్మినేని సుజాత, కార్యదర్శి వీరభద్రరావు సమకూర్చి క్రీడాకారులకు అండగా నిలిచారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.రవికుమార్, కోచ్ మేనేజర్లు, సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
ఎచ్చెర్ల : ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్మించడమే కామ్రేడ్ సీతారాం ఏచూరికి మనం ఇచ్చే ఘన నివాళి అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పొందూరు చంద్రరావు అన్నారు. సీఐటీయూ మండల కన్వీనర్ ఎన్.బంగార్రాజు అధ్యక్షతన శుక్రవారం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు టి.రామారావు, ఎల్.రామప్పడు, ఎం.ఎ.రమణ, సత్యనారాయణ, ఎన్.నాగేశ్వర రావు, కేదారేశ్వరరావు, బెవర శ్రీను, ఎం.వి.రమణ, గోవిందు పాల్గొన్నారు. -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
● లోకేష్, కూన రవికుమార్, భరత్లకు జైలుశిక్ష తప్పదు ● వైఎస్సార్సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవి ధ్వజం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్రంలో డీఎస్సీ–2025 నియామకాల్లో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందన్న విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం టౌన్హాల్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి, ఇందులో కీలకపాత్ర పోషించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి రాత పరీక్షలేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చేందుకు జీవో నంబర్ 47కి తెరలేపారని, దీనిపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించడంతో జీవోని రద్దుచేసి కొత్త జీవో తీసుకురావడం దారుణమన్నారు. టెట్ లేకుండానే ఉద్యోగాలు ఇవ్వడం సరికాదన్నారు. క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి కాకుండా ఫేక్ అసోసియేషన్ సర్టిఫికేటుగాళ్లకు ఉద్యోగాలిచ్చారని దుయ్యబట్టారు. లోకేష్, కూన రవికుమార్లు అసోషియేషన్ నుంచి రూ.15లక్షలు చొప్పున తీసుకుని రద్దయిన సాఫ్ట్బాల్ అసోసియేషన్ నుంచి 37 మందికి ఉద్యోగాలిచ్చి, కష్టపడి చదివినవారికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. వాస్తవానికి శాప్, సాఫ్ట్బాల్ అసోషియేషన్ కార్యదర్శి సంతకం చేసి ఇచ్చే సర్టిఫికెట్లు మాత్రమే సరైనవని, అధ్యక్షుడికి ఎటువంటి అర్హత లేదని స్పష్టం చేశారు. అసలు డీఎస్సీ నియామకం జరిగిన 2025 నాటికి సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ 2024 డిసెంబర్తో ముగిసిందని, మళ్లీ 2026 జూలైలో రికర్గనైజేషన్ చేశారని చెప్పారు. కూన రవికుమార్ అపరమేధావి అని, శ్రీకాకుళం జిల్లాలో కాని, ఆయన నియోజకవర్గంలో ఒక్కరికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వలేదని, డబ్బులు తీసుకుని ఇస్తే జిల్లా ప్రజల దగ్గర చెడ్డ పేరు వస్తుందనే ఇవ్వలేదని విమర్శించారు. బహిరంగ చర్చకు సిద్దమా...! డీఎస్సీ అక్రమాల్లో ప్రధాన సూత్రదారి కూన రవికుమార్ తనతో బహిరంగ చర్చకు రావాలన్నారు. కూనకు జగన్మోహన్రెడ్డికి సవాలు విసిరే స్థాయి లేదన్నారు. రానున్న మూడేళ్లలో ఏ నియామకాల్లోనైనా ఏ ఉద్యోగానికై నా స్పోర్ట్స్ కోటా కింద పరీక్ష లేకుండా ఉద్యోగాలిచ్చేందుకే జీవో 47ను తీసుకొచ్చారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రెస్మీట్లు పెట్టాకే దాన్ని మార్చేసి జీఓ నెం.56ని తీసుకొచ్చి హారిజెంటల్ విధానం ద్వారా ఉద్యోగాలు అమ్మేందుకు రంగం సిద్ధం చేశారని ధ్వజమెత్తారు. నారా లోకేష్, భరత్, కూన రవికుమార్లకు జైలు శిక్ష ఖాయమన్నారు. ఇసుక, గ్రావెల్, మట్టి, బ్లాక్స్టోన్లను అక్రమంగా అమ్ముకుని అవినీతి చేసి బతుకడమే కూన రవికుమార్కు తెలిసిన నాయకత్వమని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, బూర్జ మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, వైఎస్సార్సీసీ టీఎఫ్ నాయకులు జల్లు బలరాంనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
చైల్డ్ఫ్రెండ్లీ విలేజ్ పోటీలకు బోరవానిపేట
గార : జాతీయ స్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ పోటీలకు గార మండలంలోని బోరవానిపేట పంచాయతీని రాష్ట్రస్థాయిలో నామినేట్ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి తెలిపారు. ఈ మేరకు బోరవానిపేటలో ఎమ్మెల్యే గొండు శంకర్ పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ, పాఠశాల, పంచాయతీ కార్యాలయాలకు కావాల్సిన ఫర్నిచర్ను వెంటనే అందించాలని సూచించారు. తాగునీరు, కాలువలు, రోడ్డు పనులకు అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు.త్వరలోనే కేంద్రం నుంచి ప్రత్యేక బృందం బోరవానిపేట వస్తుందని, అప్పటికల్లా అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్రామన్, ఎంపీడీఓ శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓ రమేష్ పాల్గొన్నారు. -
కూటమి కోతలు
పాలకుల కర్కశం.. బలైన నిండు ప్రాణం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమి నిర్దయకు నిదర్శనంగా మరో నిండు ప్రాణం బలైపోయింది. అనారోగ్యంతో ఉన్న ఓ దళిత అధికారిపై కనికరం అన్నదే లేకుండా వ్యవహరించడంతో ఆయన ఏకంగా ప్రాణాలు కోల్పోయారు. పశు సంవర్ధక శాఖలో టెక్కలి డిప్యూటీ డైరెక్టర్గా పని చేసిన వి.జయరాజ్ను కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్నాళ్ల తర్వాత పాడేరుకు బదిలీ చేసింది. ఆయనకు అప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయనకు గుండెకు సంబంధించి బైపాస్ సర్జరీ జరిగింది. కరోనాలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. పైగా నిమోనియాతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వ్యక్తికి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఓ మంత్రికి నచ్చలేదనే ఏకై క కారణంతో ఆయనను ఏకంగా పాడేరుకు బదిలీ చేశారు. బదిలీ వెనక రాజకీయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అక్కడికి బదిలీ అయిన తర్వాత కూడా మంత్రిని కలిసి, తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తగు ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాలని ప్రాధేయ పడ్డారు. అయినా ఎవరూ కరుణించలేదు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పాడేరులో పని చేస్తున్న జయరాజ్ శుక్రవారం కార్యాలయంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలేశారు. కృష్ణా జిల్లాకు చెందిన జయరాజ్ భార్య శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సర్వీస్లో ఉండటంతో ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సచివాలయాల్లో టీడీపీ నాయకుల హల్చల్ ఇచ్ఛాపురం: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సామాజిక పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో సచివాలయాల్లో టీడీపీ నాయకులు హల్చల్ చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో ఉదయాన్నే టీడీపీ నాయకులు తిష్టవేసుకుని కూర్చుంటున్నారని దరఖాస్తు దారులు చెబుతున్నారు. మున్సిపాలిటీలోని 9,10 వార్డు కార్జి వీధి సచివాలయంలో ఆయా వార్డులకు చెందిన టీడీపీ నాయకులు సచివాల య సిబ్బంది పక్కనే కుర్చీలు వేసుకుని కూర్చుని అధికారుల్లా వ్యవహరిస్తున్నారు. సచివాలయానికి వచ్చిన దరఖాస్తు దారుల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకొని వాటిని పరిశీలన చేస్తున్నారు. తమ సూచనలు వచ్చిన తర్వాతే ఆన్లైన్ చేయాలని సిబ్బందికి చెబుతున్నారు. బ్యాంకు ఉద్యోగుల ధర్నా శ్రీకాకుళం అర్బన్: బ్యాంక్ ఉద్యోగులకు 5రోజుల పనిదినాలు కల్పించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బ్యాంక్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా యూఎఫ్బీ యూ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని జీటీరోడ్లోగల డీసీసీబీ బ్యాంక్ నుంచి ర్యాలీగా బయలుదేరి సూర్యమహల్ కూడలి వద్ద మానవహారం నిర్వహించా రు. అనంతరం సూర్యమహల్ కూడలి నుంచి దీపామహల్ పెట్రోల్ బంక్ వద్ద నున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకూ ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. శ్రీనివాసులు మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలపై సానుకూల స్పందన లేకపోవడం వల్ల ఈ సమ్మె చేస్తున్నామన్నారు. బ్యాంకుల్లో క్లరికల్, సబ్–స్టాఫ్ నియామకం, కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఎన్పీఎస్కు బ్యాంక్లు ఇచ్చే అదనపు 4శాతం కాంట్రిబ్యూషన్పై ఆదాయపు పన్ను మినహాయించాలని కోరారు. విద్యుత్ ఉత్పత్తి బట్టే.. జిల్లాలో ఈఎల్ఆర్ అనివార్యమైంది. విద్యుత్ ఉత్పత్తి బట్టే సప్లైకి అవకాశాలు ఇస్తారు. జనరేషన్ కేంద్రా ల వద్ద జిల్లాకు కేటాయించిన మేరకే సప్లయి జరుగుతుంది. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా ఆ ప్రభావం గ్రిడ్ మీద పడుతుంది. అందుకే ఉన్నతాధికారుల ఆదేశాలు, సూచనల ప్రకారం వారి మానిటరింగ్ ప్రాప్తికి జిల్లాలో విద్యుత్ సరఫరా చేస్తున్నాం. అయితే ప్రాసెసింగ్ పరిశ్రమలకు, ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే లోడ్ రిలీఫ్ నుంచి మినహాయింపు ఇస్తున్నాం. – జీఎన్ ప్రసాద్, ఎస్ఈ, విద్యుత్ సర్కిల్ రాత్రి వేళల్లో కోతలు గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలంలో రాత్రి వేళల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో మారుమూల వీధుల్లో ఇబ్బందులు పడుతున్నాం. అర్ధరాత్రి సమయాల్లో విద్యుత్ కోతల వల్ల దొంగతనాలు, ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. – జి.శ్యామలరావు, ఆదిఆంధ్రావీది, టెక్కలి అల్లాడిపోతున్నాం.. అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్నాం. వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సరఫరా నిలిపివేస్తున్నారు. అర్ధరాత్రి వరకూ సరఫరా నిలిచిపోతోంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – పెనుమజ్జి పద్మావతి, యంబరాం, ఎల్ఎన్పేట ఘోరంగా ఉంది విద్యుత్ సరఫరా పరిస్థితి ఘోరంగా ఉంది. సిబ్బంది ని అడుగుతుంటే ఈఎల్ఆర్ అని చెబుతున్నారు. విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. చాలా ఇబ్బందులుపడుతున్నాం. – కరణం శివరాం, పిండ్రువాడ, హిరమండలం కోతలతో అవస్థలు వేళాపాళా లేకుండా కరెంటు తీసేస్తున్నారు. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నారు. గత వా రం రోజులుగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ విద్యుత్ సరఫరా ఈఎల్ఆర్ పేరిట నిలిపేస్తున్నారు. – దామ మన్మధరావు, పాగోడు, జలుమూరు మండలం అరసవల్లి: కష్టకాలంలో చేతలు చూపాల్సిన సర్కారు కోతలు చూపిస్తోంది. వేసవిలో విద్యుత్ కోతలు సర్వ సాధారణం. కానీ వర్షాకాలంలో కూడా విద్యుత్ కోతలు విధిస్తున్నారంటే ప్రభుత్వ సమర్థత అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దుస్థితి విద్యుత్ శాఖలో గతంలో ఎన్నడూ చూడలేదన్న చర్చ ఆ శాఖలోనే జోరుగా సాగుతుంది. దీనికితోడు వెనుకబడిన జిల్లా కావడంతో విద్యుత్ అందించే పంపిణీ సంస్థలకు కూడా జిల్లాపై చిన్నచూపే కనిపిస్తోంది. ఇతర జిల్లాలతో పోల్చితే సరఫరా కూడా డిమాండ్ మేరకు సప్లై ఇవ్వడం లేదన్న ది అధికారిక లెక్కలే రుజువు చేస్తున్నాయి. నాలుగేసి గంటలు పాటు కోతలే విద్యుత్ ఉత్పత్తి తగ్గిందన్న కారణాలు చూపించి జిల్లాలో విద్యుత్ కోతలకు అధికారులు చర్యలకు దిగారు. ఎన్నడూ లేని విధంగా వర్షాకాలం సీజన్లో కూడా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) పేరిట విద్యుత్ కోతలు అధికమయ్యాయి. ఏకంగా రూరల్ ప్రాంతా ల్లో చాలా ఫీడర్లలో పీక్ లోడ్ అవర్స్లో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నా రు. అలాగే రెండు మూడు దఫాలుగా నాలుగు గంటలుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇక పట్టణాల్లో అయితే విద్యుత్ వినియోగం దృష్టిలో ఉంచుకుని రెండు గంటల పాటు జిల్లా కేంద్రంలో కూడా పగటి పూట రెండు గంటలు, రాత్రి వేళల్లో చిన్నపాటి గా లులకు, వర్షాల పేరిట మరో గంట నుంచి గంటన్నర వరకు విద్యుత్ దఫదఫాలుగా కోత లు విధిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరసనలకు దిగుతున్నారు. జిల్లాకు రోజుకు 100 మెగావాట్లు లోటు జిల్లాలో శ్రీకాకుళం, పలాస, టెక్కలి డివిజన్ల పరిధిలో ఎల్టీ విద్యుత్ వినియోగదారులు (గృహాలు) 8,07,794, హెచ్టీ విద్యుత్ వినియోగదారులు 504 విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఇందులో పారిశ్రామిక రంగంతో పాటు తయారీ రంగం, ఎమర్జెన్సీ విభాగాలు ఉన్నా యి. అయితే విద్యుత్ డిమాండ్ పరంగా ఉత్పత్తి కేంద్రాల నుంచి పంపిణీ సంస్థల ద్వారా జిల్లాకు రోజుకు గరిష్టంగా 420 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరం కాగా.. ప్రస్తుతం గత వారం రోజుల నుంచి రోజుకు కేవలం 320 వరకు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో విద్యుత్ వినియోగదారులకు పూర్తి స్థాయిలో విద్యుత్ను అందించలేని పరిస్థితులు తలెత్తాయి. ఏకంగా రోజు కు సుమారుగా 100 మెగావాట్లు విద్యుత్ తగ్గి రావడంతో అడ్జస్ట్మెంట్ విధానంలో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట విద్యుత్ కోతలతో నెట్టుకొస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లాపై చిన్నచూపా.. అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచబోమని, కోతలే ఉండవని ప్రకటనలు గుప్పించిన వారు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన వేసవిలో సరిపడా విద్యుత్ అందించలేక కోతలు విధించిన కూటమి సర్కారు వర్షాకాలంలో కూడా ఈఎల్ఆర్ పేరిట విద్యుత్ కోతలు మొదలుపెట్టేశారు. మన జిల్లాకు విద్యుత్ పరంగా చాలా అన్యాయమే జరుగుతోంది. కోనసీమ, విశాఖ జిల్లాలతో పోల్చితే మన విద్యుత్ డిమాండే తక్కువ. కోనసీమలో రోజుకు డిమాండ్ 900 మెగావాట్లు కాగా.. విశాఖలో 1300 మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ ఉంది. అయితే వాటితో పోల్చితే మన జిల్లాకు 420 నుంచి 450 మెగావాట్ల వరకు మాత్రమే డిమాండ్ ఉంది. అయితే అందులో కూడా వంద మోగావాట్ల వరకు తగ్గించి సరఫరా చేయడంపై చిన్నచూపు స్పష్టమవుతోంది. వారం రోజులుగా ఈఎల్ఆర్ పేరిట విద్యుత్ కోతల విధింపు వర్షాకాలంలో కూడా ఇలాంటి కోతలతో కూటమి ప్రభుత్వం రికార్డు విద్యుత్ సప్లై విషయంలోనూ జిల్లాపై చిన్నచూపు -
16,09,818
జిల్లాలో గ్రామీణ ఓటర్ల సంఖ్య అరసవల్లి: జిల్లాలో గ్రామీణ ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 16,09,818 మంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితాలను జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్. వెంకటరామన్ శుక్రవారం వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని 538 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో, అలాగే 30 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 16,09,818 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 7,99,219 మంది పురుషులు, 8,10,544 మంది మహిళలు, 55 మంది ఇతరులు ఉన్నారని ఆయన వెల్లడించారు. -
శ్రీకాకుళం
● ఎకోదంతుడు కేరాఫ్ బైరి తిరుపతి శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026చవితి నాడు ఏకదంతుడిని తయారుచేయడం సర్వ సాధారణమే. కానీ అత్యంత సహజ సిద్ధంగా ఏ మాత్రం కృత్రిమత్వం లేకుండా ‘ఎకో’దంతుడిని తయారు చేయడం బైరి తిరుపతి శైలి. కవిటి మండలం బొరివంకకు చెందిన ఉద్దానం యూత్ క్లబ్ ఏటా నిర్వహించే గణేష్ ఉత్సవాల్లో ఈయన వైవిధ్యమైన ప్రతిమలు తయారు చేస్తున్నారు. 2012లో మొదలుపెట్టి 2025 వరకు ఈ ఒరవడి కొనసాగించారు. బొరివంకలో ఉద్దానం యూత్క్లబ్కు జాతీయ స్థాయి ఖ్యా తిని తెచ్చి పెట్టడంలో భైరి తిరుపతి కీలక పాత్ర పోషించారు. 2014లో ఇండియా బుక్ఆఫ్ రికార్డ్స్, 2016 హైరింగ్బుక్ఆఫ్ వరల్డ్రికార్డ్స్, 2019లో చాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్,వండర్బుక్ఆఫ్రికార్డ్స్ సాధించారు. –కవిటిహరిద్ర గణపతిఆవాలనారుతో..నలుగుతో..వనమూలికలతో.. -
కట్టె కాలింది
కారు కదిలిందికస్పా అప్పన పట్నాయక్ అనే వ్యక్తి స్థలంలో పార్క్ చేసిన కారు ఇది. అప్పన్న బతికున్నప్పుడు గోవిందరావు అనే వ్యక్తి కారు పార్కింగ్ చేసి, రోజుల గడుస్తున్నా తీయకుండా మొండికేసి, ఏం చేస్తావో చూస్తామన్నట్టుగా వ్యవహరించారు. టీడీపీ బ్యాచ్ ఆగడాలకు కలత చెంది అప్పన పట్నాయక్ మృతి చెందిన తర్వాత ఆయన స్థలంలో ఉన్న ఫలంగా ఎన్నో రోజులుగా పార్కింగ్ చేసిన కారును తీసేసిన దృశ్యమిది. ఆయన బతికున్నంతకాలం ఆ కారు తీసేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. చివరికి పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. ఆయన మరణించాక మాత్రం ఆగమేఘాల మీద కారు తీసేసి తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పోలీసులకు ఫిర్యాదు.. కలెక్టర్కు ఫిర్యాదు.. ప్రాణం పోయేంతలా వేధింపు.. ఆఖరికి ప్రాణాలే కోల్పోయిన వైనం. జిల్లా కేంద్రంలోని కబ్జా భయం, ఓ కారు పార్కింగ్ ఘటన పాలకుల నిరంకుశ వైఖరికి నిలువెత్తు నిదర్శనంలా మారింది. జిల్లా కేంద్రానికి చెందిన అప్పన పట్నాయక్ తన స్థలం కబ్జా పాలవుతోందని భయపడ్డారు. తన స్థలంలో కారు పార్క్ చేశారని ఫిర్యాదు చేస్తే అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు వచ్చి ఆ స్థలంలో హడావుడి చేశారు. ఫిర్యాదులు చేస్తే బాగుండదని బెదిరించారు. ఎవరో వచ్చి తన స్థలంపై అజమాయిషీ చేస్తుంటే చూసి ఆయన తట్టుకోలేకపోయేవారు. కుటుంబీకులు పోలీసు స్టేషన్కు వెళ్తే అక్కడ కూడా టీడీపీ అరాచక బ్యాచ్ హడలెత్తించింది. ఇంకేముంది ఆ వృద్ధుడు కలత చెంది మృతి చెందారు. ఆ స్థలంలో కొన్ని రోజులుగా వివాదాస్పదంగా పార్కింగ్ చేసిన కారును వృద్ధుడు మరణించాక ఆగమేఘాల మీద తీసేశారు. ఒక ఫిర్యాదు వస్తే పార్కింగ్ చేసిన వివాదాస్పద కారును కూడా తీయలేని స్థితిలో పోలీసులు ఉన్నారా? లేదంటే కారు తీయకుండా ఉండటానికి పోలీసులపై ఆ స్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయా? అన్నది నగరమంతా చర్చ జరుగుతోంది. పక్కా డాక్యుమెంట్స్ ఉన్న కస్పా అప్పన పట్నాయక్ స్థలంలోకి దొండపాటి నవీన్ తదితర టీడీపీ బ్యాచ్ వచ్చి హల్చల్ చేయడమేంటి? తన స్థలంలో పార్కింగ్ చేసిన కారును తీయాలని కోరుతూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే.. అక్కడ పోలీసుల ముందే అప్పన పట్నాయక్ కుటుంబ సభ్యులపై అంతెత్తున లేవడమేంటి? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులపై ఎవరో ఇచ్చే తప్పుడు ఫిర్యాదులు, సంబంధం లేని కేసుల్లో ఏకంగా అరెస్టులు చేసే పోలీసు అధికారులు సాక్షాత్తూ ఒక పోలీసు స్టేషన్లో ఫిర్యాది దారులపై టీడీపీ బ్యాచ్ దౌర్జన్యకర రీతిలో ప్రవర్తిస్తే వారి జోలికి వెళ్లకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు స్టేషన్లో సీసీ పుటేజీలు చూస్తే ఆ టీడీపీ బ్యాచ్ బండారం బయటపడుతుంది. కస్పా అప్పన పట్నాయక్ స్థలంలో టీడీపీ నాయకులు చేసిన హడావుడిపై విచారణ జరిపితే వాస్తవాలు బయటికొస్తాయని స్థానికులు కోరుతున్నారు. కానీ అవేమీ చేయకుండా బాఽధితుడైన వృద్ధుడు మరణించాక ఫిర్యాదులో పేర్కొన్న కారును తీసి, అంతటితో చేతులు దులుపుకోవడం తగదని అంటున్నారు. కబ్జా స్థలంలో కారు తీయమని కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు అక్రమంగా పార్క్ చేసిన కారును తీయాలని అభ్యర్థించిన వృద్ధుడు బతికుండగా జరగని న్యాయం మరణించాక హుటాహుటిన కారు తీసేసిన వైనం టీడీపీ అరాచక బ్యాచ్పై కానరాని చర్యలు -
కలెక్టర్ల సదస్సుకు హాజరు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అమరావతిలో గురువారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు. అందుబాటులో ఉన్న భూములకు సంబంధించి స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్ను తయారు చేయాలని, ప్రతి ప్రభుత్వ శాఖ, జిల్లా కలెక్టర్ స్పష్టమైన యాక్షన్ క్యాలెండర్ను రూపొందించుకుని నిర్దేశిత గడువులోగా ఫలితాలు సాధించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎచ్చెర్ల: ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మించడానికి అందరూ కృషి చేయాలని జిల్లా వైద్యా రోగ్యశాఖాధిరి ఐవీవీఎన్ నరేష్కుమార్ అన్నా రు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్స వం సందర్భంగా ఎచ్చెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ దేశంలో ఏటా 1,70,746 మంది ఆత్మహ త్య చేసుకుంటున్నారని, అందులో 18 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్నవారే ఎక్కువని చెప్పా రు. మనకు తెలిసిన వారు ఆర్థిక, శారీరకపరమైన ఇబ్బందుల్లో ఉంటే అండగా నిలవాలన్నా రు. మానసిక సమస్యలతో బాధపడుతుంటే టోల్ఫ్రీ నంబర్ 14416కు సంప్రదించాలన్నా రు. కార్యక్రమంలో జిల్లా అధికారి రజనీ, వైద్యాధికారులు ఉషశ్రీ, గంగాప్రియదర్శిని, నాగోజీ, వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం: ఐటీడీఏ పరిధిలో చేపడుతున్న అన్ని ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాల ని సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ అధికారులను ఆదేశించారు. గురువా రం పాతపట్నం సబ్ డివిజన్ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లా డుతూ గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న రహ దారులు, భవన నిర్మాణాల పనులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించా రు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. అనంతరం ఇటీవల మరమ్మతులు చేసిన సబ్ డివిజన్ కార్యాలయాన్ని పీవో ప్రారంభించి ఆవరణలో మొక్క నాటా రు. కార్యక్రమంలో ఈఈ రమాదేవి, డీఈఈ నాగభూషణ్, సిమ్మన్న పాల్గొన్నారు. ఎచ్చెర్ల : బడివానిపేటకు చెందిన వారధి మహందాత (52) అనే మత్స్య కారుడు కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో గురువారం మృతి చెందాడు. తోటి మత్స్యకారులతో కలిసి సముద్రంలో వేటకు వెళ్లగా అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే తిరిగి వస్తుండగా బోట్లోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీకాకుళం క్రైమ్: ఐఆర్సీటీ పేరుతో నకిలీ పీడీఎఫ్ రిజర్వేషన్ టికెట్లను ప్రయాణికులకు విక్రయించి మోసగిస్తున్న ఇంటర్నెట్ సెంటర్ల ఏజెంట్లపై జిల్లా వ్యాప్తంగా నిఘా పెంచినట్లు సమాచారం. గురువారం ‘సాక్షి’లో ‘టిక్కేటుగా ళ్లు’ పేరిట ప్రచురితమైన కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు సిబ్బందిని జిల్లాలోని కీలక రైల్వేస్టేషన్ల పరిధిలో ఉన్న సెంటర్ల వద్దకు వెళ్లి ఆరా తీశారు. -
పోక్సో కేసు నమోదు
టెక్కలి రూరల్: కోటబొమ్మాళిలో బుధవారం ఆరేళ్ల చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు రావడంతో బుధవారం రాత్రి ఓ వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. గుజిలోవా గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు భార్య చనిపోయాక కోటబొమ్మాళిలో నివాసం ఉంటున్నాడు. తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ చిన్నారిని బుధవారం మేడపైకి తీసుకెళ్లి ఆ చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వారు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం బుధవారం రాత్రి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిపై పోక్సో కేసు నమోదు శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రం పరిధిలోని 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేసినట్లు మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ భాస్కరరెడ్డి తెలిపారు. బాలిక తల్లిదండ్రులు లేనప్పుడు యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పారు. -
త్యాగధనుల ఆశయసాధనకు కృషి
మందస: అమాయక గిరిజనులు, రైతులు, కూలీ లు, పేద ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరా డిన కుమారన్న, సీతారాములు త్యాగాలు స్ఫూర్తిదా యకమని జనశక్తి సంఘ నాయకుడు కోనేరు రమేష్ అన్నారు. మందస మండలం కుసుమల పంచాయ తీ బలయాగం గ్రామంలో గురువారం నిర్వహించి న కుమార్, సీతారాములు 28వ వర్ధంతి సందర్భంగా సంతాప సభ నిర్వహించి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమారన్న నాయకత్వంలో మెళియాపుట్టి, టెక్కలి, నందిగాం, పలాస, మందస తదితర ప్రాంతాల్లో గిరిజన భూ పోరాటాలు జరిగాయని, నాటి పోరాటాల ఫలితంగా సాధించిన భూముల్లో నేటికీ అనేక మంది గిరిజనులు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని గుర్తు చేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ పేదల హక్కుల కోసం పోరాడట మే వారికి అందించే నిజమైన నివాళి అని తెలిపా రు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధాకర్, మాధవరావు గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
వెయ్యి మంది శిష్యులతో ఆత్మీయ సమ్మేళనం
కవిటి: రాజపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సుమారు 20 ఏళ్లపాటు గణిత ఉపాధ్యాయునిగా పనిచేసి ఆత్మీయ గురువుగా పేరుగాంచిన బలివాడ లక్ష్మణరావు ఇటీవల అనారోగ్యానికి గురై మళ్లీకోలుకున్నారు. తాను చదువు చెప్పిన శిష్యులను అందరినీ చూడాలని ఉందంటూ మనసులో కోరికను బయటపెట్టడంతో గురువారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి మంది శిష్యులు హాజరై గురువుతో మాట్లాడి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఇంతటి మంచి శిష్యులను అందించిన దేవుడికి సర్వదా రుణపడి ఉంటా నని లక్ష్మణరావు మాస్టారు భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా బలివాడ లక్ష్మణరావుతో పాటు పనిచేసిన రావి రాంప్రసాద్, దండాశిరౌళో మాస్టార్లను కూడా శిష్యులు దుశ్శాలువలతో సత్క రించి జ్ఞాపికల్ని అందించారు. -
సాఫ్ట్బాల్ పోటీలకు జిల్లా జట్లు పయనం
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీ ల్లో జిల్లా జట్లు తుది వరకు పోరాడి విజయాలతో తిరిగి రావాలని సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలి వేదికగా ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి (అంతర్ జిల్లాల) సబ్–జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్బాల్ చాంపియన్షిప్–2026 పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు గురువారం ఇక్కడి నుంచి పయనమై వెళ్లాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వద్ద జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో శ్రీను మాట్లాడుతూ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చి ట్రోఫీలు సాధించి జిల్లాకు, కోచ్లకు, కన్న తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రపోటీల కు వెళ్లేందుకు జిల్లా క్రీడాకారుల బృందానికి అవసరమైన ఆర్థిక సాయం అందజేశారు. అసోసియేషన్ జిల్లా కోశాధికారి జి.వి.సత్యనారాయణ, అతని సోదరుడు అప్పలాచారి సంయుక్తంగా క్రీడాకారు లు, కోచ్ మేనేజర్లతో కలిసి 40 మందికి క్రీడా దుస్తు లు అందజేశారు. క్రీడాకారులకు సహాయ సహకారాలు అందించేందుకు అసోసియేషన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని సాఫ్ట్బాల్ అసోసియేషన్ రా ష్ట్ర కన్వీనర్ మొజ్జాడ వెంకటరమణ స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరా వు, సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు మెట్ట తిరుపతిరావు, అసోసియేషన్ సభ్యులు ఢిల్లీశ్వరరావు, ఆనంద్కిరణ్, రాజగోపాల్, శ్రీనివాసరా వు, హరికృష్ణ, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. నరసన్నపేట: స్థానిక మెయిన్ రోడ్డుపై జామియా మసీదు ఎదురుగా ఆటో అదుపు తప్పి ట్రాక్టర్ను ఢీకొన్న ప్రమాదంలో రేగుపాటి రాజారావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కోటబొమ్మాళి నుంచి నరసన్నపేట వస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో ముందు భాగంలో కూర్చున్న రాజారావుకు గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్సై బి.గణేష్ తెలిపారు. -
మందుబాబుల హల్చల్
చీకటి పడితే చాలు..ఇచ్ఛాపురం రూరల్: స్థానిక విద్యా వనరుల కేంద్రం(ఎమ్మార్సీ) అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. చీకటి పడితే చాలు ఇక్కడ మందుబాబులు గుమిగూడుతున్నారు. కార్యాలయం పక్కనే నిరుపయోగంగా ఉన్న గదుల్లో కొందరు యువకులు సిగరెట్లు, గంజాయి సేవిస్తున్నారని స్థానికులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. మద్యం, గంజాయి మత్తులో అసభ్యంగా మాట్లాడటం, గొడవలకు దిగడం వంటి ఘటనలతో పరిసరాల్లోని వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పరిసరాల్లోని పాన్షాపుల్లోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యావనరుల కేంద్రం(ఎమ్మార్సీ)కు విద్యాశాఖ సమావేశాలు, బోధన శిక్షణ, వివిధ పనుల నిమిత్తం వచ్చే మహిళా ఉపాధ్యాయులకు ఎమ్మార్సీ పరిధిలో ఖాళీ మద్యం సీసాలు, సిగరెట్ పీలికలు చూసి ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై గతంలో పూర్వ మండల విద్యాశాఖాధికారి కురమాన అప్పారావు పోలీస్, ఎకై ్సజ్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. -
పొలాల్లో దొంగలుపడ్డారు!
●ఈ నెల 8న ఎల్ఎన్పేట మండలం కోతిగార్లపాడులో పొలాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురైంది. అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్ వైర్లను తొలగించి అందులో ఉన్న విలువైన రాగిని దోచుకుపోయారు. ఉదయం రైతులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. ●ఈ నెల 7న ఎల్ఎన్పేట మండలం ఎస్కే బాలేరు గిరిజన గ్రామంలో పొలంలో ఉన్న రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేశారు. వైర్లు కట్చేసి ట్రాన్స్ఫార్మర్ను కిందకు దించారు. అందులో ఉన్న రాగిని దోచుకుపోయారు. రైతులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. హిరమండలం: జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ఒక్క ఎల్ఎన్పేట మండలంలోనే గడిచిన రెండు నెలల కాలంలో తొమ్మిది ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. విద్యుత్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడమే తప్ప.. నిందితుల అరెస్టు త్వరితగతిన జరగడం లేదు. ఒక్క ఎల్ఎన్పేట మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఈ ఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జలుమూరు మండలం లింగాలవలస ఎత్తిపోతల పథకానికి సంబంధించి భారీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురైంది. అందులో 480 కిలోల రాగి వైరు పట్టుకుపోయారు. దాని విలువ రూ.5.70 లక్షలు ఉంటుందని అంచనా. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కోటబొమ్మాళి పోలీసులు ఆరుగుర్ని అరెస్టు చేసి వారి వద్ద సుమారు రూ.8 లక్షలు విలువైన రాగి వైరును అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల వరుస ఘటనలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అంతర్ రాష్ట్ర ముఠా పనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ట్రాన్స్ఫార్మర్ చోరీ చేస్తే వేల రూపాయలు సొంతం చేసుకోవచ్చనే ఆలోచనతో దుండగులు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కొత్తగా ఏర్పాటుచేస్తున్న సోలార్ ప్యానళ్లలో సైతం రాగి చోరీకి గురవుతుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే దొంగలు ఎక్కువగా పాత ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ చేస్తుండటం గమనార్హం. అందులో 10 నంచి 22 కిలోల వరకూ రాగి ఉంటుంది. మార్కెట్లో రాగి వైరు కిలో రూ.1500 నుంచి రూ. 2000 వరకూ పలుకుతోంది. ఒక ట్రాన్స్ఫార్మర్ను కొల్లగొడితే రూ.20 వేలకు పైగా సమకూరుతుండడంతో దొంగలు చోరీబాట ఎంచుకుంటున్నారు. సాధారణంగా ఊరుకు దూరంగా ఉన్న పొలాల్లో ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. రాత్రికి రైతుల తాకిడి ఉండని వాటినే టార్గెట్ చేసుకుంటున్నారు. ఇలా చోరీ చేసిన రాగిని బరంపూర్, జైపూర్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి. ఈ నేపథ్యంలో రైతులు పంపుసెట్లపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురవుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. కొత్త వాటిని అమర్చడంలో జాప్యం జరుగుతోంది. ఒక్క ఎల్ఎన్పేట మండలంలోనే ఏకంగా తొమ్మిది ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురికావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నా వారు తగిన విధంగా పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. వరుసగా చోరీలు జరుగుతున్నాయి. పోలీసుల నిఘా ఉందన్న భయం కూడా ఆగంతకులకు లేకుండాపోతోంది. ఇప్పటికై నా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
హైరిస్క్ గర్భిణుల వివరాల నమోదు తప్పనిసరి
జలుమూరు: సాధారణ గర్భినుల వివరాలతోపాటు హైరిస్క్ గర్భిణుల వివరాలను ఆర్సీహెచ్ పోర్టల్ లో విధిగా నమోదు చేయాలని జిల్లా అడిషనల్ డీఎంహెచ్ఓ తాడేల శ్రీకాంత్ అన్నారు. గురువారం జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ నెల 11 నుంచి 24 వరకు జరగనున్న ఎల్సీడీసీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అనుమానిత కేసులను పీహెచ్సీకి తరలించి వైద్యపరీక్షలు చేసి మందులు అందించాలన్నారు. అనంతరం ప్రపంచ ఆత్మహత్య ల నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ అధికారి అహల్య, పీహెచ్ఎన్ కె.పద్మావతి, హెల్త్ సూపర్వైజర్ చినరాజులు, సిబ్బంది విజయశాంతి, చిన్నారావు, రాజారావు, అప్పలరాజు, లత తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల సమస్యలపై సమరశీల పోరాటాలు
శ్రీకాకుళం: విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలే శరణ్యమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లా ప్లీనరీ సమావేశం సందర్భంగా జిల్లా అధ్యక్షు డు డి.చందు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు తగిన నిధులు కేటాయించకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య,మౌలిక సదుపాయా లు అందడం లేదన్నారు. విద్యారంగాన్ని ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ వైపు తీసుకెళ్లడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం పెరుగుతోందని విమర్శించారు. ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను సకాలంలో భర్తీ చేయాలన్నారు. హాస్టల్ సమస్యలు, భవనాల కొరత తీర్చాలన్నారు. ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులకు స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్ట ల్ ఏర్పాటు చేయాలని, నివగాంలో జూనియర్ కా లేజీ భవనాన్ని వెంటనే నిర్మించాలని, టెక్కలి బీసీ హాస్టల్ విద్యార్థులకు భవనం కేటాయించాలని ప్లీనరీలో తీర్మానాలు చేశారు. అనంతరం 21 మందితో నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.ఖగేష్ పాల్గొన్నారు. -
ఆక్రమణల పర్వం..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మూడుసార్లు గెలిచామని అహంకారమో.. అధికారం ఉందనే విచ్చలవిడితనమో...దోపిడీ చేస్తే తమను ఎవరు అడ్డుకుంటారనే విపరీత ధోరణో తెలియదు గానీ ఇచ్ఛాపురం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. నియోజకవర్గాన్ని ప్రాంఛైజీలుగా విడగొట్టుకుని అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఇష్టారాజ్యంగా సహజ వనరులను ధ్వంసం చేసి పెట్రేగిపోతున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగిస్తామని, పట్టాలిప్పిస్తామని అందిన కాడికి దండుకుంటున్నారు. ఇసుక, మద్యం, కంకర, అక్రమ మైనింగ్, గంజాయి, నాటుసారా తదితర మత్తులో మునిగితేలుతున్నారు. అంతా అక్రమమే.. ● కంచిలి మండలంలో రామారావు అనే వ్యక్తి అవినీతిలో చెలరేగిపోతున్నాడు. సహజ వనరులను దోచేస్తున్నాడు. జలంత్ర కోట సమీపంలో నడుస్తున్న అక్రమ క్వారీల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాడు. పశువుల అక్రమ వ్యాపారం వెనకుండి చేయిస్తున్నాడు. అంగన్వాడీ న్యూట్రీషియన్ పోస్టుల నుంచి అవుట్ సోర్సింగ్ పోస్టులు వరకు అమ్ముకున్నాడు. కంచిలి మండలం మండపల్లి పంచాయతీలోని కొండలను తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లకు విక్రయించేశాడు. ● సోంపేట మండలంలో మోహన్, కుమార్ల అక్రమాలకు కీలక నేత గేట్లెత్తేశారు. బాతుపురం మహేంద్ర తనయ నది నుంచి వందలాది ట్రాక్టర్లలో ఇసుక తరలించి అక్రమంగా సంపాదిస్తున్నారు. ● శ్రీకాంత్ అనేవ్యక్తి ఆధ్వర్యంలో మద్యంసిండికేట్ను బాటి ల్పై రూ.20 నుంచి రూ.40 వరకు పెంచి మందుబాబులను దోచుకుంటున్నారు. సారా తయారీదారుల నుంచి కూడా తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున వసూలు, అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారు. విచ్చలవిడిగా అటవీ సంపదను తరలించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. కీలకనేత కనుసన్నల్లో.. ఇక్కడ మద్యం సిండికేట్ చెలరేగిపోతోంది. మహేంద్రగిరి, బాహుదా నదుల్లో ఇసుక దోచేస్తున్నారు. పల్లె పండగలో భాగంగా నాసిరకం రోడ్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకున్నారు. చివరికి బా ణసంచా షాపుల ఏర్పాటుకు సైతం అక్రమ వసూళ్లు చేశారు. ఇదంతా నియోజకవర్గ కీలక నేత కనుసన్నల్లోనే జరుగుతోందని, అంతిమ లబ్ధి ఆయనకే దక్కుతోందని సమాచారం. నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుతమ్ముళ్ల దోపిడీ సెటిల్మెంట్లు, భూ ఆక్రమణలు, అక్రమ వసూళ్లు యథేచ్ఛగా అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ తవ్వకాలు ఎంఆర్పీకి మించిన ధరలతో మద్యం విక్రయాలు కీలక నేత అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులుఇచ్ఛాపురంలో అంతర్రాష్ట్ర సరిహద్దు లో జరిగే అక్రమ వ్యాపారాల వ్యవహారాన్నీ ఓ వ్యక్తి చేతిలో పెట్టేశారు. ఆయ న అడ్డు అదుపూ లేకుండా రెచ్చిపోతున్నాడు. బాహుదా ఇసుకను కూడా సదరు వ్యక్తి పర్యవేక్షణలోనే అక్ర మంగా రవాణా చేస్తున్నారు. రత్తక న్న పీర్లుకొండను తవ్వేసి, కంకర రవా ణా చేసి సొమ్ము చేసుకున్నారు. పచ్చ నాయకులు రత్తకన్న డిగ్రీ కళాశాల వద్ద జగనన్న కాలనీ లేఅవుట్లో మిగులు స్థలాలను ఆక్రమించారు. కవిటిలో కీలక నేత సొంతూరులోని తన ఇంటికి సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు. ఆయన మామ ఆగడాలకు అడ్డే లేదు. ప్రభుత్వ నిషేధిత భూములు తొలగిస్తామని, పట్టాలు ఇస్తామని రూ.లక్షల్లో డబ్బులు తినేశారు. ఇచ్ఛాపురం మార్కెట్ కమిటీలో అవుట్ సోర్సింగ్ పోస్టులు, రాజపురం వసతి గృహం వాచ్మెన్ పోస్టుల్లో కావాల్సిన వారిని వేసుకున్నారు. కవిటి పంచాయతీలోని బొర్రపుట్టుగ వద్ద ఓ టీడీపీ నాయకుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించగా, ‘సాక్షి’లో కథనం ప్రచురితమయ్యాక అడ్డుకున్నారు. -
డీజే..
వద్దంటే వినరే ● డీజే శబ్దాలతో పెను ముప్పు ● గత ఏడాది వినాయక ఉత్సవాల్లో డీజే శబ్దానికి నరసన్నపేటలో కూలిన పోర్టికో ● డీజేల వినియోగం నిషేధించాలంటున్న ప్రజలు అధిక శబ్దంతో ఆరోగ్య సమస్యలు డీజేల వల్ల అధిక శబ్దం వస్తుంది. ఇది ఆరోగ్యపరంగా మంచిది కా దు. ప్రధానంగా వినికిడి సమస్య, గుండె పోటు సంభవించే అవకాశం ఉంది. అలాగే గర్భిణులకు అధిక శబ్దం మంచిది కాదు. చిన్న పిల్లల్లో వినికిడి సమస్య ఉత్పన్నం కావచ్చు. – తాడేల శ్రీకాంత్, అదనపు డీఎంహెచ్ఓ అనుమతి తప్పనిసరి డీజేలు ఏర్పాటు చేస్తే విధిగా అనుమతి తీసుకోవాలి. ఇష్టానుసారంగా డీజేలు ఏర్పాటు చేసి స్థానికులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. – ఎం.శ్రీనివాసరావు, సీఐ, నరసన్నపేట నరసన్నపేట : డీజే.. పండగ ఏదైనా డీజే శబ్దం లేకపోతే ముగింపు జరగడం లేదు. యువతకు ఈ శబ్దా లు ఇంపుగానే ఉన్నా.. చాలా మందికి ఇది ప్రాణ సంకటంగా మారుతోంది. గత ఏడాది వినాయక నవరాత్రుల ఊరేగింపులో నరసన్నపేట టౌన్లోని భవానీ పురం వీధిలో డీజే శబ్దానికి శిథిల భవనం పోర్టికో కూలడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు వినాయక నవరాత్రులు వస్తుండడంతో డీజేల మోత ఖాయంగా కనిపిస్తోంది. వినాయక నిమజ్జనం సందర్భంగా పలు ఉత్సవ కమిటీలు డీజేలను ఇప్పటికే బుక్ చేశారు. అయితే ఈ డీజే సౌండ్ వల్ల మనిషికి ఎంతటి హాని కలుతుందన్న విషయం ఉత్సవ కమిటీలు ఆలోచించడం లేదు. దీంతో పర్యావరణ వేత్తలతో పాటు స్థానికులు, విద్యా వంతులు ఆందోళన చెందుతున్నారు. మార్గదర్శకాలు ఇలా.. ● బహిరంగ ప్రదేశాల్లో 10 డెసిబుల్స్కు మించి శబ్దం చేయరాదు. ● ప్రైవేటు ప్రదేశాల్లో డీజేలు పెట్టకూడదు. అను మతి లేకుండా సౌండ్ బాక్స్లు అమర్చకూడదు. ● నిషిద్ధ ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో సంగీత ధ్వనులు, డ్రమ్స్ కొట్టడం ఇతర శబ్దాలు చేయకూడదు. ఆస్పత్రులు, విద్యా సంస్థలు, దే వాలయాలు, న్యాయ స్థానాలకు వంద మీటర్లు లోపు డీజేలు ఏర్పాటు చేయకూడదు. -
పొలాల్లో దొంగలు పడ్డారుపొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురవుతున్నాయి. రాగి కోసమే ఈ చోరీలు జరుగుతున్నాయి. –8లో
● పలాస కిడ్నీ పరిశోధన ఆస్పత్రిపై వికృతచర్య ● శిలాఫలాకాలపై చిరునామాల తొలగింపు ● ఆస్పత్రి బోర్డుల ధ్వంసం ఇన్ పేషెంట్ విభాగం భవనంపై భాగంలో పైశాచిక చర్యకు ప్రత్యక్ష తార్కాణం ఓపీ విభాగం భవనంపై భాగంలో డాక్టర్ వైఎస్సార్ పేరును ధ్వంసం చేసిన వైనం ఉత్తరాంధ్ర ఊపిరిపై ఉన్మాదం ఉత్తరాంధ్ర ఊపిరి, ఉద్దానం ప్రజల ఆశాదీపంగా భాసిల్లుతున్న పలాస కిడ్నీ పరిశోధన ఆస్పత్రిపై ఉన్మాద పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ హయాంలో నిర్మితమైన ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను తొలగించారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్పత్రిని ప్రారంభించిన విషయాన్ని తెలియపరిచేలా ఏర్పాటుచేసిన శిలాఫలకాలను తొలగించారు. మహానేత వైఎస్సార్ విగ్రహం కింద బోర్డులను మాయం చేశారు. ఆస్పత్రి ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ భవంతులపై డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి పేరుతో ఏర్పాటు చేసిన బోర్డులనూ ధ్వంసం చేయగా.. వాటిని సరిచేయకుండా అలానే వదిలేశారు. పైగా ఆస్పత్రి సాకారంలో ఎలాంటి ప్రమేయం లేని వారి పేర్లతో కూడిన శిలాఫలకాన్ని నెలకొల్పి నవ్వుల పాలవుతున్నారు. –కాశీబుగ్గ దివంగత నేత వైఎస్సార్ విగ్రహం దిగువ ఆస్పత్రిని ప్రారంభించిన వివరాలను తొలగించిన దృశ్యం ఈ ఆస్పత్రికి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసినట్లు సూచిస్తూ ఏర్పాటుచేసిన ఫలకం -
‘కోరమండల్పై స్పష్టత ఇవ్వాల్సిందే’
సంతబొమ్మాళి: కోటపాడు గ్రామంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ పరిశ్రమ ఏర్పాటుపై గురువారం గ్రామ సభ నిర్వహించారు. పరిశ్రమ నిర్మాణానికి సుమారు 400 ఎకరాలకు పైగా భూమి అవసరమని అధికారులు పేర్కొనగా.. రైతులు పలు సందేహాలు, సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. అసలు ఇక్కడ రా మెటీరీయల్ తయారవుతుందా? లేక ఎరువుల ఉత్పత్తి జరుగుతుందా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరారు. రా మెటీరియల్ తయారీ జరిగితే కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉంటుందని, సుమారు ఐదు కిలోమీటర్లు పరిధిలో గాలి, నీరు, భూమిపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు అందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థ నీటిని రీ సైక్లింగ్ చేసి పంపాలని కోరారు. రైతుల పొలాల్లో పరిశ్రమ నిర్మాణం కోసం భూమిని ఎత్తు చేయడం వల్ల చుట్టు పక్కల ఉన్న పొలాల్లోకి వర్షపు నీరు చేరి ముంపు సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు తెలిపారు. నీరు బయటకు వెళ్లేందుకు ప్రత్యేక డ్రైనేజీ మార్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో స్పష్టం చేయాలని రైతులు ప్రశ్నించారు. స్కిల్ లేని స్థానిక యువతకు ఎలాంటి శిక్షణ ఇస్తారు? ఉద్యోగాల్లో వారికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో వెల్లడించాలని కోరారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి మాట్లాడుతూ స్కిల్డ్ ఉద్యోగాల కోసం స్థానిక యువతకు ఇతర ప్రాంతాల్లో శిక్షణ ఇప్పించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ హేమసుందరరావు, రైతులు కోత మధుసూధనరావు, కోత సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
23న తపాలా అదాలత్
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాల సేవలకు సంబంధించి వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు సెప్టెంబర్ 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకి రెల్ల వీధిలో ఉన్న సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద తపాలా అదాలత్ నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు తెలిపారు. ఈ మేరకు గు రువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తపాల సేవలకు సంబంధించిన ప్రత్యేక, వ్యక్తిగత ఫిర్యాదులు ఈ అదాలత్లో సమర్పిస్తామని తెలిపారు. శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాల వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు ఈనెల 22వ తేదీ లోగా ‘తపాల అదాలత్’ అనే శీర్షికతో వి.హరిబాబు, సూపరింటెండెంట్, శ్రీకాకుళం పోస్టల్ డివిజన్–శ్రీకాకుళం– 532001‘ అనే చిరునామకు పంపించాలని ఆయన తెలిపారు. గడువు తేదీ ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబోమని పేర్కొన్నారు. ఫిర్యాదులు వ్యక్తిగతంగా కూడా తీసుకొని తపాలా అదాలత్ కు హాజరు కావచ్చునని పేర్కొన్నారు. ఆర్థిక అవకతవకలు సంబందించిన విషయాలపై ఫిర్యాదులు తీసుకోబోమని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యాటకానికి ఊతం శ్రీకాకుళం పాతబస్టాండ్,అరసవల్లి: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ వెల్లడించారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పట్టంశెట్టి రవి సుభాష్తో కలిసి గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని డచ్ బంగ్లా, అరసవల్లి ఆలయ అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించారు. అరసవల్లి సూర్యదేవుని ఆలయ పరిసరాల్లో భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం భోజనశాల, వాహనాల పార్కింగ్ కేంద్రం, రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఆలయ ప్రాంగణంలో సూర్యభగవా నుని విశేషాలతో ప్రత్యేక అనుభూతి కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కలెక్టరేట్ సమీపంలోని పురాతన భవనాన్ని పునరుద్ధరించి జిల్లా చరిత్ర ప్రతిబింబించేలా మ్యూజియంగా మా రుస్తామని తెలిపారు. పర్యాటకులు కేవలం విశాఖపట్నానికే పరిమితం కాకుండా అరసవల్లి, భావనపాడు తదితర ప్రాంతాలను సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. -
● ‘కోతల’ పాలన.. కొవ్వొత్తులతో నిరసన
మండలంలో రాత్రి వేళల్లో విపరీతంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఈ సమస్య తీవ్రంగా పరిణమిస్తోందని ఆంధ్రప్రదేశ్ మహి ళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఆరేలమ్మ ఆరోపించారు. ఈ మేరకు ఉప్పలాం పంచాయతీలో గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. విద్యుత్ కోతలతో బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కోతల నుంచి విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు. –సోంపేట -
ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి
ఆమదాలవలస: ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న కారణంగా రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకురాలు ఎల్.విజయ సూచించారు. మండలంలోని సైలాడ రైతు సేవా కేంద్రంలో బుధవారం ఆత్మ పథకం సౌజన్యంతో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ రైతు తాము సాగు చేసిన పంటల వివరాలను ఈ –పంటలో నమోదు చేసుకోవడంతో పాటు ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. వరిలో కలుపు యాజమాన్యం, చీడపీడల యాజమాన్యం తదితర అంశాలపై శాస్త్రవేత్త డా.జ్యోతి బసు రైతులకు సాంకేతిక సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఏవో మెట్ట మోహనరావు, గ్రామ వ్యవసాయ సహాయకురాలు బి.రవళి తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో పడి వృద్ధుడు మృతి
సోంపేట: మండలంలోని బారువ గ్రామంలో సాయిబాబా గుడి సమీపంలోని చెరువులో పడి గ్రామానికి చెందిన బురకాయల కామరాజు(70) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం మృతదేహం చెరువు ఒడ్డున ఉండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. బారువ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో వివరాలు సేకరించి గ్రామానికి చెందిన బురకాయల కామరాజు మృతదేహంగా గుర్తించారు. కామరాజుకు భార్య చంద్రావతి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు బారువ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కంటైనర్ బోల్తా టెక్కలి రూరల్: స్థానిక ఆదిఆంధ్ర వీధి సమీప జాతీయ రహదారిపై బుధవారం కంటైనర్ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవా నుంచి కలకత్తా వెళ్తున్న ఈ కంటైనర్ లారీ టెక్కలి సమీప ఆదిఆంధ్ర వీధి వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా అదుపుతప్పి సమీప డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు గానీ.. సహాయకుడికి గానీ ఎటువంటి గాయాలవ్వలేదు. లారీ రహదారికి అడ్డంగా పడిపోవడంతో విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరకొని క్రైన్ సాయంతో లారీని తొలగించి ట్రాఫిక్ను సరిచేశారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు. -
గురుకులాల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల సమస్యలు, దళితుల భూ సమస్యలు, దళిత కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా దళిత ప్రజాసంఘాల జేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు ఆయన కార్యాలయంలో వినతిపత్రం బుధవారం అందజేశారు. గతంలో పలుమార్లు జిల్లా అధికారుల దృష్టికి సమస్యలను తీసుకొచ్చినప్పటికీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన మెనూ అందించాలని, బోధన, బోధనేతర సిబ్బంది కొరతను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాతపట్నం అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలో మృతి చెందిన విద్యార్థిని చింతల పూజ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. పరిపాలనా వైఫల్యాలకు బాధ్యులైన డీసీవో యశోద లక్ష్మీపై చర్యలు తీసుకుని, ఆమె డిప్యూటేషన్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మరికొన్ని సమస్యలు ఈనెల 20లోపు పరిష్కరించాలని, లేకుంటే దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ పేడాడ కృష్ణారావు, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్ పాల్గొన్నారు. -
మిషన్.. కమీషన్!
రణస్థలం: లావేరు మండలంలోని గుమడాం రెవెన్యూ పరిధిలో తాజాగా వేస్తున్న రియల్ వెంచర్పై స్థానిక అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల కన్ను పడింది. కమీషన్ ఇస్తేనే ఇక్కడ లే అవుట్ రూపాంతరం చెందుతుంది, లేదంటే నిత్యం నరకం చూపిస్తామంటూ వేధిస్తున్నారు. గుమడాం రెవెన్యూ పరిధిలో సుమారు 22 ఎకరాల్లో భారీ రియల్ వెంచర్ వేసేందుకు తాజాగా నిర్మాణ పను లు జరుగుతున్నాయి. గెడ్డకు ఆనుకుని తారు రోడ్డు వరకు ఈ లే అవుట్ చదును చేస్తున్నారు. పొలాలను వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు చేసుకున్న దరఖాస్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. మా అనుమతి ఉండాల్సిందే.. రియల్ వెంచర్ వేసేందుకు భూమి చుట్టూ ప్రహరీ, రోడ్లు, కాలువలు వంటి నిర్మాణాలు చేసేందుకు విశాఖపట్నంకు చెందిన వ్యక్తి ఎప్పటి నుంచో పరిచయమైన వైఎస్సార్ సీపీ సానుభూతిపరులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించారు. వాళ్లు పని చేసేందుకు సిద్ధమవుతున్న దశలో ఈ విషయం అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధుల చెవిలో పడింది. ఇదే అదనుగా కమీషన్ల కక్కుర్తితో ఆ ఇద్దరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు మంది మార్బలాన్ని మోహరించారు. ‘మా అనుమతి లేకుండా ఎవడ్రా ఇక్కడ వెంచర్ వేసేది’ అంటూ వాళ్ల రాజకీయ కుయుక్తులకు పదును పెట్టారు. ఆ వెంచర్ చుట్టు పక్కల గ్రామ నాయకులకు కమీషన్ బాధ్యతలను అప్పగించారు. మౌలిక వసతులు అడ్డగింత రియల్ వెంచర్ వేస్తున్న వ్యక్తులతో ఆ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నేరుగా మాట్లాడకుండా స్థానిక గ్రామ టీడీపీ నాయకులను రంగంలోనికి దించారు. వైఎస్సార్ సీపీ కాంట్రాక్టర్లు పనులు చేస్తే ఇక్కడ సహించేది లేదని అడ్డుకున్నారు. గుమడాం, తామాడ పంచాయతీలకు చెందిన ఆ గ్రామ నాయకులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండతో రెచ్చిపోయారు. దీంతో చేసేది లేక పనులు ఆపి అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల దగ్గరకు రియల్ వెంచర్ వేసే కాంట్రాక్టర్లు వెళ్లారు. కూటమి నాయకులకే రోడ్లు, కాలువలు, ఇలా అన్నీ పనులు అప్పగించాలని లేదంటే సహించేంది లేదని తీర్పు ఇచ్చారు. గుమడాంలో రియల్ వెంచర్పై అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల కన్ను కమీషన్ ఇస్తేనే పనులకు అనుమతి లే అవుట్లో మౌలిక వసతుల పనులను అడ్డుకుంటున్న వైనం కమీషన్ ముట్టజెప్పాలని ఒత్తిడి గుమడాం, తామాడ పంచాయతీలకు చెందిన ఆ యా గ్రామ నాయకులు ఒక్కొక్కరూ ఒక్కో అధికార పార్టీ ప్రజా ప్రతినిధి మధ్యవర్తులుగా వకాల్తా పుచ్చుకున్నారు. ఒక అధికార పార్టీ ప్రజా ప్రతినిధికి రూ.40 లక్షలు, మరో అధికార పార్టీ ప్రజా ప్రతినిధికి రూ.20 లక్షలు ఇవ్వాల్సిందేనని రియల్ వెంచర్ వేస్తున్న భూ యజమానుల ప్రతినిధులతో బేరసారాలకు దిగారు. చెప్పిన కమీషన్ ఇస్తేనే వెంచర్ పనులు ముందుకు వెళతాయి. లేదంటే ఇక్కడతో పనులు ఆపాల్సిందేనని నిత్యం వేధిస్తూనే ఉంటున్నారు. దీనిపై గత కొన్ని రోజలుగా పంచాయతీ నడుస్తుండటంతో ఈ రియల్ వెంచర్ టాపిక్ నియోజకవర్గంలో ఆ కూటమి నాయకుల్లోనే హాట్ టాఫిక్గా మారింది. -
టీడీపీ మూకల అరాచకం
● 75 సెంట్లు స్థలంపై కబ్జాదారుల కన్ను ● దొంగ సర్టిఫికెట్లతో మ్యూటేషన్ చేసేందుకు పంచాయతీ సెక్రటరీ యత్నం ● కోర్టుకెళ్లడంతో వృద్ధుడికి అనుకూలంగా స్టే ● ఆక్రమణదారులకు అండగా నిలిచిన టీడీపీ నాయకులు ● బాధితుడి కుమార్తెకూ నాయకుల బెదిరింపులు ● మానసిక క్షోభతో వృద్ధుడు మృతి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ అల్లరిమూకల అరాచకాలు, బెదిరింపులు ఓ వృద్ధుడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పక్షవాతంతో నడవలేని స్థితిలో ఉన్న 70 ఏళ్ల వృద్ధుడి భూమి ఆక్రమణదారుల పాలవడం, ఫిర్యాదు ఇచ్చారని పోలీసుస్టేషన్లో తన కుమార్తెకు ఆక్రమణదారుడి ముఠా వార్నింగ్లు ఇవ్వడంతో తట్టుకోలేక మానసిక క్షోభకు గురై ప్రాణాలు విడిచాడు. శ్రీకాకుళం నగరంలో దండి వీధిలో జరిగిన ఈ ఘటన టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు పరాకాష్టగా నిలిచింది. వృద్ధుడ్ని బలి తీసుకున్న పచ్చనాయకుల భూదందా నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఏం జరిగిందంటే.. శ్రీకాకుళం నగరంలోని దండివీధిలో కస్పా అప్పన పట్నాయక్(70)కు 75.5 సెంట్లు భూమి ఉంది. రెవెన్యూ సర్వే నంబర్.248–2లో ఉన్న కోట్ల రూపాయల విలువైన స్థలం కావడంతో పంచాయతీ సెక్రటరీ కస్పా శివచరణ్ దొంగ పత్రాలను సృష్టించారు. తర్వాత కస్పా రవికిరణ్, కస్పా శివచరణ్ పేర్ల మీద మ్యూటేషన్ చేసేందుకు ప్రయత్నించడంతో అప్పన పట్నాయక్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా స్పందిస్తూ స్టే ఇచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో యథాస్థితిని కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆక్రమణదారుల ఆగడాలు ఆగలేదు. ఫాజుల్బాగ్పేట నుంచి కొన్ని అల్లరి మూకలతో కలిసి తరచూ వృద్ధుడ్ని వేధింపులకు గురి చేసి భయాందోళన కలిగించారు. టీడీపీ నాయకుల వేధింపులకు మృతి చెందిన వృద్ధుడు కస్పా అప్పన పట్నాయక్ అప్పన పట్నాయక్ స్థలంలో హల్చల్ చేస్తున్న టీడీపీ నాయకుడు, వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ దొండపాటి నవీన్ తదితరులు (ఫైల్)బతికుండగా వృద్ధుడు కలెక్టర్కు చేసిన ఫిర్యాదు లేఖ కస్పా అప్పన పట్నాయక్కు చెందిన పట్టాదారు పాసు పుస్తకంఅప్పన పట్నాయక్ స్థలంలో పార్కింగ్ చేసిన కారు -
పెన్షన్ టెన్షన్
మితిమీరుతున్న టీడీపీ నేతల పెత్తనం ● సచివాలయాల్లో నాయకుల హడావుడి ● చేతులెత్తేస్తున్న సిబ్బంది నరసన్నపేట : అధికారంలోకి వచ్చిన 26 నెలల తర్వాత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్సీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు హామీనిచ్చిన కూటమి నాయకులు ఇప్పుడా హామీని పక్కన పెట్టి 60 ఏళ్లు నిండిన వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత, దివ్యాంగులు పింఛన్కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే గ్రామస్థాయిలో వచ్చే సరికి అర్హులకు పింఛన్లు అందుతాయా? అనే అనుమానం రోజురోజుకీ పెరుగుతుంది. దీనికి కారణం పింఛన్ల వ్యవహారంలో టీడీపీ నాయకుల హవా అతిగా ఉండటమే. గ్రామ సచివాలయాల్లో సిబ్బందిని పక్కన పెట్టి వారే దరఖాస్తులు తీసుకుంటున్నారు. కొంతమందికి ముందుగానే మీకు రాదు.. అని చెప్పేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు నిరాశతో వెనక్కి వెళ్తున్నారు. అలాగే దరఖాస్తుదారులు సచివాలయానికి వెళ్తే ముందుగా మీరు టీడీపీ నాయకులను కలవాలి.. అని సిబ్బందే నేరుగా చెబుతుండటం గమనార్హం. నరసన్నపేట నియోజకవర్గంలో ఈ తంతు అధికంగా ఉంది. బుధవారం నరసన్నపేట పంచాయతీ కార్యాలయంలోని సచివాలయంలో టీడీపీ నాయకుల హడావుడి ఎక్కువగా కనిపించింది. సిబ్బందితో పాటు టీడీపీ నాయకులు కూడా ఉద్యోగుల్లా సీట్లలో కూర్చుని దరఖాస్తులు తీసుకుంటున్నారు. దీంతో అర్హులకు పింఛన్లు మంజూరు అవుతాయా అనేది అనుమానంగా ఉంది. మరో పక్క సర్వర్ సమస్య అధికంగా ఉంది. దరఖాస్తులు వందల్లో వస్తుండగా అప్లోడ్ మాత్రం పదుల్లో అవుతున్నాయి. ఈ వ్యవహారంపై సర్వాత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. -
వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంటిపై దాడి
గార: మండలంలోని వత్సవలస పంచాయతీ పేర్లవానిపేట గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ అభిమాని చీకటి శ్రీరాములు ఇంటిపై టీడీపీ వర్గీయులు మంగళవారం దాడి చేశారు. అనంతరం బాధితుడైన శ్రీరాములుపైనే కేసు నమోదు చేయాలని టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చీకటి శ్రీరాములు సొంత స్థలం పక్కన ఖాళీ స్థలంలో పేర్ల ఎర్రమ్మ కుటుంబ సభ్యులు నిర్మాణం చేపడుతుండంతో వాటిని ఆపేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో వివాదం జరుగుతున్న సమయంలో బందరువానిపేటకు చెందిన పుక్కళ్ల లక్ష్మణరావు తదితర కొంతమంది శ్రీరాములు ఇంటిపై దాడి చేశారు. ప్రహరీ దూకి వచ్చి కిటికీని పగలగొట్టడంతో పాటు మరుగుదొడ్డి తలుపును బద్దలుగొట్టారు. ఇంట్లో ఉన్న అతని కోడలు ధనలక్ష్మి బయటకు వచ్చి చెప్పడంతో వాళ్లంతా పారిపోయారు. దీనిపై గార పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాధితుడైన శ్రీరాములుపైనే కేసు నమోదు చేయాలని టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా తీసుకునేందుకు చాలా సమయం తీసుకున్నారని, ఇంతవరకు కేసు రిసిప్ట్ కూడా ఇవ్వలేదని బాధితుడు శ్రీరాములు తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎంపీపీ గొండు రఘురామ్, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, కొయ్యాన నాగభూషణం, అప్పారావు, చిట్టిబాబు తదితరులు పేర్లవానిపేట వెళ్లి పరామర్శించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
టిక్కేటుగాళ్లు..!
పండగలు, దూర ప్రయాణాల రద్దీని ఆసరాగా చేసుకొని కొందరు ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు దగాకోరు అవతారమెత్తుతున్నారు. ఐఆర్సీటీసీ పేరుతో నకిలీ పీడీఎఫ్ టికెట్లు సృష్టిస్తూ నిలువునా మోసం చేస్తున్నారు. చేతిలో కన్ఫర్మ్ టికెట్ ఉందనుకుని రైలెక్కుతున్న ప్రయాణికులు తీరా టీటీఈ తనిఖీల్లో అసలు గుట్టు తేలుతుండడంతో నిశ్చేష్టులవుతున్నారు. జిల్లావ్యాప్తంగా సాగుతున్న ఈ నకిలీ రిజర్వేషన్ల దందాపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. – శ్రీకాకుళం క్రైమ్ è పలాస సమీపంలోని ఒక ఇంటర్నెట్ సెంటర్లో ఒక ప్రైవేటు చిరుద్యోగి ట్రైన్లో ముంబై వెళ్లేందుకు ఐఆర్సీటీసీ పోర్టల్లో రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకున్నాడు. తీరా ట్రైన్ ఎక్కాక అతని బెర్తులో వేరే వ్యక్తి కూర్చోవడం.. టీసీ అధికారి వచ్చి పీఎన్ఆర్ స్టేటస్లో అతని పేరుతో టికెట్ బుక్ అయినట్లే లేదని చెప్పడంతో ఖంగుతిన్నాడు. è తాజాగా గార మండలానికి చెందిన ఒక వ్యక్తి ఈ ఏడాది అక్టోబర్లో కుటుంబంతో సహా తిరుపతి వెళ్లేందుకు ఒక ఇంటర్నెట్ సెంటర్ ఏజెంటు వద్దకు వెళ్లి ఆన్లైన్లో రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకున్నాడు. అయితే పీఎన్ఆర్ స్టేటస్లో చూస్తే వేరేవారి పేరుతో బుక్ అయినట్లుండడం, వెంటనే ఏజెంట్ను సంప్రదిస్తే అవుతాయిలే అంటూ తిప్పించడంతో చేసేదేమీలేక ఎస్పీ గ్రీవెన్సులో గత వారం ఫిర్యాదు చేశారు. ఈ ఇంటర్నెట్ నిర్వాహకుడే మరో వ్యక్తి వద్ద సైతం రూ.12 వేలు రిజర్వేషన్ టికెట్లు ఇప్పిస్తానని నమ్మించి మోసగించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇలా జిల్లాలో ఇంటర్నెట్ సెంటర్లు నడుపుతున్న కొందరు ఏజెంట్లు రిజర్వేషన్ కన్ఫర్మ్ అయినట్లు డమ్మీ పీఎన్ఆర్ నంబర్ చూపించి టికెట్ల అమ్మకాలు చేస్తూ సామాన్యులను దోచేస్తున్నారు. వాస్తవానికి రైల్వే కౌంటర్లలో ఉన్న ధరకు రెట్టింపుగా అమ్మడమన్నదే ఒక నేరమైతే.. ఇలా ఫేక్ పీడీఎఫ్ల రూపేనా పనికిరాని రిజర్వేషన్ టికెట్లను ఇచ్చి ప్రజలను మోసగిస్తుండడం దారుణం. కేంద్రంలోని అతి పెద్ద వ్యవస్థగా పేర్కొనబడే రైల్వే శాఖను సైతం ఏమార్చుతున్నారంటే ఎంత పెద్ద నేరం చేస్తున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి కేటుగాళ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోకుండా టికెట్లను తీసుకోరాదని రైల్వే, పోలీసు అధికారులు చెబుతున్నారు. మోసగిస్తారు ఇలా.. ! నెట్ సెంటర్ ద్వారా ఆన్లైన్ రిజర్వేషన్ టికెట్లిచ్చే ఏజెంట్లు ఐఆర్సీటీసీ పోర్టల్లో ప్రయాణం అయిపోయిన పాత టికెట్లను (యూజ్డ్ పీడీఎఫ్) ఫొటోషాప్లో కరెక్షన్ చేస్తారు. వాస్తవానికి ఐఆర్సీటీసీ పోర్టల్లో మూడు రోజులయ్యాక పాత పీఎన్ఆర్ బుకింగ్ టికెట్లు సంబంధిత రైల్వే శాఖ తొలగిస్తుంది. ఈలోపే ఏజెంట్లు వాటిని డౌన్లోడ్ చేసి బుకింగ్ డేట్, జర్నీ డేట్, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం, ట్రైన్ పీఎన్ఆర్ నంబర్, బెర్త్, సీట్ల నంబర్లు, పేర్లు అన్నీ మన కుటుంబీకులవే ఉన్నట్లుగా మార్చేస్తారు. ఇది చూడడానికి ఒరిజినల్ మాదిరిగానే ఉంటుంది. నిబంధనలు సడలించడంతో... జిల్లాలోని కీలక రైల్వేస్టేషన్ల పరిధి పట్టణాల్లోను, మున్సిపాలిటీల్లోను రిజర్వేషన్ కౌంటర్లున్నా ప్రయాణికులు అత్యవసర సమయాల్లో టౌటింగ్ వ్యవస్థగా పిలువబడే ఏజెంట్ల వద్ద అధిక ధరలకు ఓ విధంగా చెప్పాలంటే బ్లాక్లో ఆన్లైన్ రిజర్వేషన్ టికెట్లు చేయించుకుంటారు. ఒకప్పుడు కేంద్ర రైల్వే విభాగం అధికారులు టౌటింగ్ యాక్ట్ కింద ఇలా అక్రమంగా టికెట్ల అమ్మకాలు జరుపుతున్నవారిపై కేసులు సైతం నమోదు చేసేవారు. మన జిల్లాలో అయితే ఒక్కో స్టేషన్కు 100 నుంచి 120 వరకు కేసులు బుక్కయ్యేవి. ఏడాదిన్నరగా నిబంధనలు సడలించడంతో ఇలాంటి దళారి ఏజెంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడమే కాక ఫేక్ పీడీఎఫ్ టికెట్ల పేరిట పనికిరాని రిజర్వేషన్ టికెట్లు ఇచ్చి దండిగా సొమ్ము కొల్లగొడుతున్నారు. జిల్లాకేంద్రంలోని డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనున్న దుకాణాన్ని నడుపతున్న వ్యక్తి, జీటీరోడ్డులోని ఒక క్లాత్షోరూం పక్కన దుకాణదారుడు సైతం ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులున్నాయి. వీరి బాధితుల్లో పోలీసులు, రైల్వే కౌంటర్లో పనిచేసేవారు సైతం ఉండడం గమనార్హం. గత ఆగస్టు 24న నెట్ సెంటర్ ఏజెంట్ వద్దకు వెళ్లా. విశాఖపట్నం నుంచి తిరుపతి, తిరుపతి నుంచి విశాఖపట్నం అక్టోబరు 7, 10 తేదీలకు కుటుంబ సభ్యుల పేరిట బుక్ అయినట్లు పీడీఎఫ్ టికెట్లు ఇచ్చారు. 4 రోజుల తర్వాత వాటిని పరిశీలిస్తే విశాఖ నుంచి తిరుపతికి దూరం 313 కి.మీ ఉండడంతో అనుమానమొచ్చింది. వాస్తవానికి 786 కి.మీ ఉండాలి. పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేస్తే ఇన్వ్యాలిడ్ అని వచ్చింది. వేరేవారి పేర్లతో రిజర్వ్ అయినట్లు వచ్చాయి. వెంటనే తెలిసిన రైల్వే అధికారులను సంప్రదిస్తే ఫేక్ పీడీఎఫ్లతో మోసపోయానని తేల్చారు. దీంతో పోలీసులను ఆశ్రయించాను. – బాధితుడైన ప్రైవేటు ఉద్యోగి, గార మండలం ఇటువంటి నేరాలపై టౌటింగ్ యాక్ట్, 143 సెక్షన్లు కింద కేసులు నమోదు చేస్తాం. ఫ్రాడ్ అని నిర్ధారణకొస్తే సైబర్ పోలీసులకు అప్పజెప్పాక సైబర్ క్రైమ్గా పరిగణిస్తారు. రిమాండ్కు పంపే వీలుంది. లేదంటే పూచీకత్తుపై 41 నోటీసు బెయిల్ ఇచ్చినా దాదాపు రెండేళ్లు కోర్టు ట్రయల్లో ఉంటుంది. ఆ రెండేళ్లు కోర్టు చుట్టూ తిరగాల్సిందే. రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సిందే. ఫిర్యాదు వచ్చిన వెంటనే ఇంటర్నెట్ సెంటర్ను, అందులో సిస్టమ్లను సీజ్ చేస్తాం. మళ్లీ సెంటర్ను తెరవాలంటే కోర్టు ఆర్డర్ను తెచ్చుకోవాలి. – ఆర్పీఎఫ్ అధికారి, శ్రీకాకుళం రోడ్డు ఇలాంటి మోసాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తే చాలు.. ఫ్రాడ్ అని ఆర్పీఎఫ్ పోలీసులు నిర్ధారించాక మరోమారు లోకల్ పోలీసులతో విచారణ చేయిస్తాం. బాధితులు చేయాల్సిందల్లా విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్లను అడ్రస్ చేస్తూ మెయిల్లో గానీ, వ్యక్తిగతంగా గానీ ఫిర్యాదు చేయడమే. పారదర్శకంగా విచారణ జరిపి మోసగాళ్లపై టౌటింగ్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటారు. – ట్రైనింగ్ స్కూల్ ఇన్చార్జి, రైల్వే విభాగం -
టీడీపీ నేత హల్చల్..
ఈ క్రమంలో టీడీపీ నాయకుడు, వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ దొండపాటి నవీన్ తదితరులు ఆ స్థలంలో హల్చల్ చేశారు. దౌర్జన్యకర రీతిలో వ్యవహరించారు. ఇలా బెదిరింపులు, వేధింపులు నడుస్తున్న వేళ అలపాన గోవిందరావు అనే వ్యక్తి ఆ స్థలంలో కారు పార్కింగ్ చేశాడు. ఆ వాహనాన్ని తీయండి అని అడిగినా లెక్క చేయలేదు. ఆక్రమిత భూమిలో మూడు సెంట్లు ఇచ్చేందుకు పంచాయతీ సెక్రటరీతో చేసుకున్న ఒప్పందం మేరకు గోవిందరావు అక్కడ పార్క్ చేసి మొండిగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఆ స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ప్రతిసారి కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించేలా, చట్టబద్ధ హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని కస్పా అప్పన పట్నాయక్ ఏకంగా జిల్లా కలెక్టర్కు ఆగస్టు 24న ఫిర్యాదు లేఖ రాశారు. అయినప్పటికీ సరైన స్పందన రాకపోవడంతో ఈ నెల 1న శ్రీకాకుళం వన్టౌన్ పోలీసు స్టేషన్ను ఆశ్రయించారు. లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ిఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత పోలీసు స్టేషన్కు వచ్చిన కస్పా అప్పన పట్నాయక్ కుమార్తె వెంకట లక్ష్మీని టీడీపీకి చెందిన దొండపాటి నవీన్, గోవిందరావు, వారి అనుచరులు 10 మంది గంట సేపు భయభ్రాంతులకు గురి చేసేలా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తట్టుకోలేక ఆమె విలపిస్తూ ఇంటికి వెళ్లిపోయారు. ఎవరి దగ్గరికి వెళ్లినా లాభం లేదన్నట్టుగా భయపెట్టారు. ఓవైపు దౌర్జన్యం, మరోవైపు వేధింపులు, ఇంకోవైపు తన కుమార్తె విలపించేలా బెదిరింపులు వెరసీ అప్పన పట్నాయక్ను తీవ్రంగా కలిచి వేశాయి. జరిగిన పరిణామాలకు కలత చెంది అప్పన పట్నాయక్ బుధవారం కన్నుమూశారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిమానా
సంతబొమ్మాళి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మండలంలోని పాలతలగాం గ్రామానికి చెందిన కొర్రాయి లక్ష్మణ్కు రూ.10 వేల జరిమానా కోటబొమ్మాళి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి విధించినట్లు సంతబొమ్మాళి ఎస్ఐ వై.సింహాచలం బుధవారం తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, ఒకవేళ వాహనం నడిపితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జాతీయ పోటీలకు నందిని శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా సీనియర్ నేషనల్స్ బాల్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్టార్ క్రీడాకారిణి సింగూరు నందిని ఎంపికై ంది. ఈ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి 28వ తేదీ వరకు శ్రీకాళహస్తి వేదికగా జరగనున్నాయి. రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారుల రాణింపు ఆధారంగా ఏపీ రాష్ట్ర బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ ప్రకటించిన రాష్ట్ర మహిళా జట్టు జాబితాలో నందిని చోటు నిలబెట్టుకుంది. ఎచ్చెర్లకు చెందిన ఈ యువ క్రీడాకారిణి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. నందిని జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు, ఒలింపిక్, పీడీ–పీఈటీ సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని డే అండ్ నైట్ సమీప కార్షెడ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదు చేసినట్లు రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు వెల్లడించారు. బుధవారం రాత్రి స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లామని, మృతునికి సుమారు 45 సంవత్సరాల వయస్సు ఉంటుందని తెలియజేశారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని సింగుపురం గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల మేరకు.. యనమల హటకేశం (41) వృత్తిరీత్యా వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. బుధవారం రాత్రి ఒక ఇంటిపై సోలార్ ప్యానల్ బిగించడానికి వెళ్లి.. ఇంట్లోంచి ఒక వైరును లాగుతూ మేడమీద సోలార్ బిగించే క్రమంలో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఎచ్చెర్ల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థఽ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఐటీఐ స్కిల్ హబ్ సెంటర్లో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులకు శిక్షణ అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.సుధాకర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఎం.ఎస్.ఆఫీస్ (డిజిటల్ మిత్ర) కోర్సుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఎలక్ట్రీషియన్ కోర్సుకు టెన్త్, కంప్యూటర్ కోర్సుకు ఇంటర్మీడియట్ ఆపై విద్యార్హత కలిగిన 18 నుంచి 30 ఏళ్లలోపు యువతీ, యువకులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 15లోగా స్కిల్ హబ్ సెంటర్లో పేర్లు నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 7989177887 నంబరును సంప్రదించాలని కోరారు. ఐసీడీఎస్ పీడీగా శోభారాణి శ్రీకాకుళం అర్బన్: సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్గా (ఎఫ్ఏసీ) పి.శోభారాణి నియమితులయ్యారు. ఐసీడీఎస్ సంస్థ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. శోభారాణి ప్రస్తుతం నరసన్నపేట ప్రాజెక్టు సీడీపీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పీడీగా బాధ్యతలు నిర్వహించిన ఎస్.సువర్ణ బాపట్ల పీడీగా బదిలీపై వెళ్లారు. కూర్మనాథాలయ ఈఓగా విమలాకుమారి గార : శ్రీకూర్మంలోని కూర్మనాథాలయ ఈఓగా విజయనగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి టి.విమలాకుమారి నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ ధర్మాదాయ శాఖాధికారులు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. 20న జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను ఈ నెల 20న నిర్వహించనున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు (వాసు), అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఉదయం 9 గంటల నుంచి అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 విభాగాల్లో ఎంపికలు మొదలవుతాయని చెప్పారు. బాలబాలికలకు వేరువేరుగా రన్స్, త్రోస్, జంప్స్ను నిర్వహించి మెరుగైన ట్రాక్ రికార్డులను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులను త్వరలో జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి (అంతర్ జిల్లాల) అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2026 పోటీలకు పంపిస్తామని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు తమ జనన ధృవీకరణ పత్రం, ఆధార్కార్డు, టెన్త్ మార్క్స్ మెమో, 2 పాస్ఫొటోలతో స్టేడియం ప్రాంగణంలో సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి కె.మాధవరావు వద్ద రిపోర్ట్ చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 94415 70361 నంబర్ను సంప్రదించాలని కోరారు. కొత్తూరు: ఆకులతంపర గ్రామ సమీపంలో వంశధార నదిలో ఇసుక ర్యాంపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేస్తున్న ప్రొక్లెయినర్, టిప్పర్తో పాటు మరో నాలుగు యంత్రాలను సీజ్ చేసినట్లు తహశీల్దార్ సరోజని తెలిపారు. బుధవారం ఇసుక ర్యాంపులో తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమెతో పాటు సర్వేయర్ రెడ్డి గవరయ్య ఉన్నారు. -
ట్రాన్స్ఫార్మర్లు చోరీ
హిరమండలం: ఎల్ఎన్పేట మండలం చొర్లంగి పంచాయతీ బాలేరు గిరిజన గ్రామంలో ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి పొలంలో ఉన్న రెండు ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి చోరీ చేశారు. ఉదయం రైతులు పొలాల్లోకి వెళ్లగా ఈ విషయం గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. పాతపట్నం డీఈఈ ప్రసాదరావు, ఏఈ వెంకటేశ్వర్లు వెంటనే సరుబుజ్జిలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే పంచాయతీలో ఇటీవల ఆరు ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసి రాగిని దొంగిలించుకుపోయారు. నెల రోజుల పరిధిలో 8 ట్రాన్స్ఫార్మర్లలో దొంగతనం జరగడం గమనార్హం. -
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
టెక్కలి రూరల్: టెక్కలిలోని శంబానవీధికి చెందిన డొక్కర మాధవరావు(28) అనే యువకుడు రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరావు సోమవారం రాత్రి తన కుటుంబంలో వచ్చిన చిన్నపాటి తగాదాకు మనస్థాపానికి గురై ఇంటి నుంచి బయటకు వెల్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతుకుతుండగా అర్థరాత్రి సమయంలో కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం, దండుగోపాలపురం రైల్వే లైన్ మధ్య గుర్తు తెలియని యువకుడు రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం తెలుకున్నారు. వెంటనే స్నేహితులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం నుంచి తల వేరైపోవడంతో చాలా సమయం వెతకగా చివరకు గుర్తించి మృతుడు మాధవరావుగా గుర్తించారు. అనంతరం రైల్వే పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందించారు. మాధవరావుకు ఏడాది కిందట కోటబొమ్మాళి మండలం జమ్మచక్రం గ్రామానికి చెందిన పల్లవి అనే మహిళతో వివాహం జరిగింది. ఓ పెయింటింగ్ కంపెనీలో పనిచేస్తూ ఈ నెల 6నే పుట్టినరోజు వేడుకలు సైతం నిర్వహించుకున్నాడు. ఇంతలో ఏమైందో తెలియదు గాని మాధవరావు తీసుకున్న నిర్ణయంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
క్విజ్ పోటీల్లో ఆదిత్య విద్యార్థుల ప్రతిభ
టెక్కలి : యూత్ ఫర్ వికసిత్ భారత్ – యూత్ విజన్ ఫర్ ఎ డెవలప్డ్ ఇండియా ఆధ్వర్యంలో యువ ఉత్సవంలో ఇటీవల ఆన్లైన్ ద్వారా నిర్వహించిన క్విజ్ పోటీల్లో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విద్యార్థులను అభినందించారు. కొలుసు సాయి వెంకట్ సన్నిహిత్, చల్లా సాయి స్వరూప్, చిలక ప్రవళ్లిక, మొగిలి వినయ్, గార దీపక్, సిమ్మ డిల్లేశ్వరి, జనపాన తరుణ్, జి.రితీషా, పవన్, పి.సమీర, పైడిశెట్టి జ్యోత్స్న, కొంచాడ వినయ్ తదితరులు గ్రూప్ క్విజ్లో ప్రథమ స్థానం, తృతీయ స్థానంతో పాటు ఆన్లైన్ క్విజ్లో ద్వితీయ స్థానం సాధించారు. -
అందరికీ విద్య..అందరిదీ బాధ్యత
గార : అందరికీ విద్య అందించటంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు అన్నారు. మంగళవారం వమరవల్లి ప్రభుత్వ డైట్లో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరం మనిషిని ఎంతటి ఉన్నత స్థానానికై నా తీసుకెళ్లగలదన్నారు. వయోజన విద్య ఉపసంచాలకుడు ముద్దాడ వెంకటరమణ మాట్లాడుతూ వయెజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1982 నుంచి వివిధ అక్షరాస్యతా కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ పేరుతో, రాష్ట్ర ప్రభుత్వం అక్షర ఆంధ్ర పేరుతో అక్షరాస్యతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అక్షరాస్యత సాధన– సవాళ్లు పరిష్కారాలు’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు, డిజిటల్ అక్షరాస్యత– అంతరాలు అవకాశాలు అనే అంశంపై నిర్వహించిన వ్యక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపాల్ ఏ.గౌరీశంకరరావు, డ్వామా ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డి.మనోరమ తదితరులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
నరసన్నపేట: మాకివలసకు చెందిన బొంగు నిర్మల (45) అనే వివాహిత శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందింది. భర్తతో మనస్పర్థలు కారణంగా సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా వెంటనే కుటుంబ సభ్యులు గమనించి శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు నరసన్నపేట ఎస్సై బి.గణేష్ తెలిపారు. సోమవారం ఉదయం నరసన్నపేట బ్యాంకులో పని కోసం బండిపై తీసుకువెళ్లాలని నిర్మల తన భర్త లక్ష్మణరావును కోరగా, చిన్న అబ్బాయి బండి తీసుకువెళ్లాడని, వచ్చాక వెళ్దామని చెప్పిన కొద్ది సమయానికే క్షణికావేశానికి గురై నిర్మల ఆత్యహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి నరసన్నపేట: ఉర్లాం గ్రామానికి చెందిన పసుపురెడ్డి ఈశ్వరరావు(53) ఈ నెల ఒకటో తేదీన అందిన గీతకార్మిక పింఛన్ డబ్బుతో మద్యం సేవించి ఇంటికి వెళ్తుండగా రాత్రి 7.30 సమయంలో రోడ్డుపై పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు నరసన్నపేట ఎస్సై బి.గణేష్ తెలిపారు. కుమారుడు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
టెక్కలి రూరల్: రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో టెక్కలి ఎన్టీఆర్ క్రీడావీకాస్ కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కోచ్ నర్శిపురం శేఖర్ మంగళవారం తెలిపారు. ఈ నెల 5, 6వ తేదీలలో గుంటూరు జిల్లా తెనాలిలో జెఎంజె ఉమెన్స్ కళాశాలలో జరిగిన 5వ సబ్ జూనియర్స్, 3వ కిడ్స్ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో టెక్కలి విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు. సబ్ జూనియర్ బ్లాక్ బెల్ట్ బాలురు విభాగంలో తమిరి జ్ఞానదీప్ స్వర్ణ పతకం సాధించగా, కలర్ బెల్ట్ విభాగంలో ఎల్.సాయిరామ్, బి.ఈశ్వర్కుమార్లు స్వర్ణ పతకాలు కై వసం చేసుకున్నారు. కిడ్స్ విభాగంలో ఆర్.చరణ్, కె.భరత్, పి.పూర్ణేస్, జి.హేమంత్, కె.కజిత్ స్వర్ణ పతకం సాధించారు. జి.అక్షిత, అనీష్కుమార్ రెడ్డి, కె.జ్ఞానదీప్, కె.తనీష్, భవేష్లు రజత పతకాలతో సత్తాచాటారు. స్వర్ణపతకం సాధించిన విద్యార్థులు తమిళనాడు రాష్ట్రంలో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
లోక్ అదాలత్తో సత్వర న్యాయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: న్యాయస్థానాల్లో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులను రాజీ మార్గంలో, రూపా యి ఖర్చు లేకుండా త్వరితగతిన పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఒక అద్భుత వేదిక అ ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు సునీత కొండబోలు స్పష్టం చేశారు. స్థానిక జిల్లా కోర్టు భవనంలోని సమావేశ మందిరంలో ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై మంగళవారం ఆమె అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోటారు వాహన ప్రమాద పరిహార కేసుల్లో బాధిత కుటుంబాలకు తక్షణమే పరిహారం అందేలా బీమా కంపెనీలు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులు తమ క్లయింట్లకు అవగాహన కల్పించి రాజీకి వీలున్న కేసులను గుర్తించాలని, ఇది న్యాయవ్యవస్థపై భారాన్ని తగ్గిస్తుందని సూచించారు. ఇక్కడ కుదిరిన రాజీకి సివిల్ కోర్టు డిక్రీతో సమానమైన విలువ ఉంటుందని, దీనిపై ఎలాంటి అప్పీల్ ఉండదని తెలిపారు. ఎటువంటి కోర్టు ఫీజు లేకుండా సమస్యలు పరిష్కరించుకునే ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు -
ఎన్టీఆర్ భరోసా నూతన పింఛన్ల నమోదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా ప్రజలకు ‘ఎన్టీఆర్ భరోసా’ నూతన పింఛన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కె.వినాయకం ఓ ప్రకటనలో తెలిపా రు. కొత్తగా పింఛన్ కోసం నమోదు చేసుకోవాలనుకునే అర్హులైన వారు తమ సమీప స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో డిజిటల్ అసిస్టెంట్లు లేదా వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులను నేరుగా సంప్రదించాలని తెలిపారు. ఆధార్ కార్డుతో పాటుగా అవసరమైన ఇతర అర్హత, ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జీతాలు చెల్లించాలంటూ పెద్ద ఎత్తున నిరసన సంతబొమ్మాళి: మూలపేట పోర్టులో పని చేస్తు న్న సిబ్బంది జీతాలు చెల్లించాలంటూ మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పోర్టుకు వెళ్లే రహదారి దిగ్బంధించడంతో పాటు పోర్టు గేటును తాళ్లతో కట్టి రాకపోకలు ఆపేశారు. పెద్ద ఎత్తున సిబ్బంది మోహరించి జీతాలు చెల్లించాలంటూ నినాదాలు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోర్టు జీఎం శంకర్, టెక్కలి రూరల్ సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో మాట్లాడారు. మూడు నెలలుగా జీతాలకు గాను ఒక నెల జీతం వెంటనే చెల్లించారు. మరో నెల జీతం 15వ తేదీలోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సిబ్బంది తమ నిరసన విరమించారు. నేత్రదానంపై విస్తృత ప్రచారం అరసవల్లి: నేత్రదానంపై అపోహలు తొలగించి మరింత విస్తృతం చేసేలా ప్రజల్లో అవగాహన తేవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఈవీ నరేష్కుమార్ పిలుపునిచ్చారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేత్రదానంపై ఎలాంటి అపోహలు ఉండకూదని, వైద్య శాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు చైతన్యం తీసుకురావాలని కోరారు. అనంతరం డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టిన తర్వాత వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన నర్సింగ్ విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. -
● పింఛన్ కావాలా.. ఇంటికి రండి!
● బారువలో టీడీపీ నాయకుడి ఇంటి వద్ద పింఛన్ దరఖాస్తులు ● తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన లబ్ధిదారులు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోవాలి గత ప్రభుత్వ హయాంలో అర్హత కలిగిన వారందరికీ పింఛన్లు అందించాం. కూటమి ప్రభుత్వంలో పేదవాడు పెన్షన్ కోసం ఒకరి దగ్గరికి వెళ్లి ఆత్మ గౌరవం తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. – సాడి శ్యామ్ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్త ఏడు రోజులేనా..? పింఛన్ దరఖాస్తులకు ఏడు రోజులే గడువు విధించడం అన్యాయం. అర్హులైన ప్రతి ఒక్కరి దరఖాస్తు స్వీకరించి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు చేయాలి. – డాక్టర్ నిమ్మన దాస్, ఎంపీపీ సోంపేట: పింఛన్ కోసం సామాన్యుడు ఎవరిపైనా ఆధారపడకూడదని.. ఎవరి ఇంటి వద్ద పడిగాపులు కాసే అగత్యం రాకూడదని వైఎస్సార్ సీపీ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. కానీ టీడీపీ మళ్లీ పాత పోకడలే పోతోంది. పింఛన్ ఆశావహులను ఇంటి వద్దకు రప్పించుకుని దరఖాస్తులు తీసుకున్న ఘటన బారువలో చోటు చేసుకుంది. బారువ గ్రా మానికి చెందిన టీడీపీ మండల స్థాయి నాయకుడు ఇంటి వద్దనే దరఖాస్తులు స్వీకరించి అత్యుత్సాహం ప్రదర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సచివాలయం వద్ద దరఖాస్తులు చేసుకోవాల్సి ఉండగా.. బారువ మేజర్ పంచాయతీ పరిధిలో నాయకుడు తన ఇంటి వద్దకే దరఖాస్తు దారులను రప్పించుకున్నాడు. ఈ దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి ఆన్లైన్ చేయడం విశేషం. దీనిపై స్థానికులు తీవ్ర విమర్శలు చేశారు. ఇంటికి పిలిపించుకోవడం పేదల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయడమేనని అన్నా రు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో ఈ పింఛన్ల గిమ్మిక్కులు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాయకుడి ఇంటి వద్ద పింఛన్ దరఖాస్తుల అంశంపై బారువ మేజర్ పంచాయతీ ఈఓ రాజేష్ను వివరణ కోరగా సచివాలయాలకు వచ్చేవారి దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ చేస్తున్నామని, మంజూరు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ నాయకులు సచివాలయాల వద్ద తిష్ట వేసుకుని దరఖాస్తులు స్వీకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
పుట్టిన 13 రోజులకే పాస్పోర్టు
● ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు ఇచ్ఛాపురం: పట్టణానికి చెందిన వజ్రపు అగస్త్య ప్రిన్సి అనే చిన్నారి పుట్టిన 13 రోజులకే ఇండియన్ పాస్పోర్టు పొంది ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నమోదు చేసుకుంది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వజ్రపు వెంకటేష్ రెండో కుమారుడు ఆశిష్ వ్యాపార రీత్యా లండన్లో నివాసముంటున్నారు. ఆశిష్కు మే నెల 30 వ తేదీన రాజమహేంద్రవరంలో కుమార్తె జన్మించింది. చిన్నారి పాస్పోర్టు కోసం విశాఖపట్టణంలో దరఖాస్తు చేసుకోగా 2026 జూన్ నెల 12వ తేదీన పాస్పోర్టు కార్యాలయం పాస్ పోర్టుని జారీచేసింది. దీంతో 13 రోజుల్లో పాస్పోర్టు పొందిన చిన్నారిగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించినట్లు మంగళవారం సమాచారం అందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
మీ ఓటు ఉందా.. లేదా? స్థానిక ఎన్నికలు వచ్చేస్తున్నాయి. మీ ఓటు ఉందో లేదో చూసుకోవచ్చు. –8లో
● గ్రామీణ ప్రాంతాల్లో రూ.80 పైమాటే ఘాటెక్కిన ఉల్లి కొనలేకపోతున్నాం ఉల్లి గతంలో కొన్నంత స్థాయి లో కొనుగోలు చేయలేకపోతున్నాం. రూ.65కు కిలో కొనుగోలు చేస్తున్నాం. ధర పెరిగిపోవడంతో వినియోగాన్ని తగ్గించాం. – సుజాత, గృహిణి, శ్రీకాకుళం ప్రత్యేక కౌంటర్లు ఏవీ? రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు కనిపించడం లేదు. వెంటనే ఏర్పాటు చేసి పేద, మధ్య తరగతి వినియోగదా రులకు ఉల్లిని తక్కువ ధరకే అందుబాటులోకి తీసు కురావాలి. – సీజు, వినియోగదారుడు, శ్రీకాకుళం శ్రీకాకుళం: ఉల్లి ఘాటెక్కింది. రెండు రోజుల కిందటి వరకు హోల్సేల్ మార్కెట్లో కిలో రూ.50 ఉన్న ఉల్లి ఇప్పుడు రూ.55కు చేరింది. రిటైల్లో రూ.65 వరకు పలుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏకంగా కిలో రూ.80 వరకు విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉల్లి ధర ఇంకా పెరుగుతుందని వార్తలు వినిపిస్తుండడం సామాన్యులను భయపెడుతోంది. ప్రస్తుతం 10 టన్నులు ఉల్లికి ఆర్డర్ పెడితే 5 టన్నులు కూడా పంపించడం లేదని రానున్న రోజు ల్లో ఇది మరింత తగ్గుతుందని కర్నాటక, మహారాష్ట్ర వ్యాపారులు చెబుతున్నారని జిల్లాలోని హోల్సేల్ ఏజెంట్లు అంటున్నారు. ఇక రైతు బజార్లలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ప్రత్యేక కౌంటర్లు ఇప్పటికీ కనిపించడం లేదు. హోల్సేల్లో కిలో రూ.55 పలుకుతున్న వైనం -
27 మద్యం బాటిళ్లు స్వాధీనం
సోంపేట: సోంపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధి సోంపేట, కంచిలి, మందస మండలాల్లోని పలు గ్రామాల్లో సోమవారం బెల్టు దుకాణాలపై దాడులు నిర్వహించి 27 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని నలుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ జీవీ రమణ తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలియజేశారు. దాడుల్లో ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది భానుప్రసాద్, గుణాకర్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. కాగా సోంపేట ఎకై ్సజ్స్టేషన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు నాటుసారా కేసుల్లో సీజ్ చేసిన ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు వేలం వేయనున్నట్లు వెల్లడించారు. ఎస్పీ గ్రీవెన్సుకు 58 వినతులు శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్సు కార్యక్రమంలో బాధితుల నుంచి 58 ఫిర్యాదులు అందాయి. అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఆస్తి తగాదాలు, కొట్లాటలు, కుటుంబ కలహాలు, మోసపూరిత ఘటనలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులందాయి. యాక్సిస్ బ్యాంకు డైరెక్టర్గా శేషగిరిధర్ జి.సిగడాం(పొందూరు): స్థానిక పోస్టాఫీస్ వీధికి చెందిన కుప్పిలి శేషగిరిధర్ యాక్సిస్ బ్యాంకు బోర్డు డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం బొంబాయిలో ఉన్న యాక్సిస్ బ్యాంకు బోర్డు నుంచి ఆదేశాల వచ్చాయి. ఆయన గతనెల 31న ఎల్ఐసీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈయన సేవలను గుర్తించి యాక్సిస్ బ్యాంకు బోర్డు డైరెక్టర్గా ఎంపిక చేశారు. దీంతో గిరిధర్ను పలువురు అభినందించారు.


