breaking news
Srikakulam District News
-
కండ్రావార్డు హైస్కూల్కు ఎన్బీటీ పుస్తకాలు
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని కండ్రావార్డు ఉన్నత పాఠశాలకు భారత ప్రభుత్వం న్యూఢిల్లీ నుంచి విలువైన పుస్తకాలను గురువారం పంపించింది. ఈ సందర్భంగా ఎంఈఓ కురమాన ఆప్పారావు మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయురాలు బూరవిల్లి ఉమామహేశ్వరి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురష్కారానికి నామినేట్ కావడం జిల్లాకే గర్వకారణమన్నారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఆమె దేశ వ్యాప్తంగా 154 మంది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో చోటుదక్కించుకున్నారని చెప్పారు. దీనిలో భాగంగానే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాఠశాల విద్య, సాక్షరత విభాగం ఆధ్వర్యంలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎన్బీటీ) పుస్తకాలను బహుమతులుగా అందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పుస్తకాలను పాఠశాలలో ప్రదర్శించి హెచ్ఎం ఉమామహేశ్వరిని దుశ్శాలువతో సత్కరించారు. -
ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం
మెళియాపుట్టి: ఏకలవ్య గురుకుల పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ అధికారులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 30 మంది బాలురు, 30 మంది బాలికల సీట్లు భర్తీ చేసేందుకు ఏప్రిల్ 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 5 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. కోడిగుడ్ల లారీ బోల్తా ఎచ్చెర్ల : తూర్పుగోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి పశ్చిమబెంగాల్కు కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ గురువారం వేకువజామున ఎచ్చెర్ల సమీపంలోని బైపాస్ జాతీయ రహదారిపై బోల్తాపడింది. లారీ ముందు భాగంలోని టైరు పంక్చర్ కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు పది లక్షల విలువ చేసే గుడ్లు పాడయ్యాయి. ఈ ఘటనలో పశ్చిమబెంగాల్కు చెందిన లారీ డ్రైవర్ రోహిత్ ఖాజీ, క్లీనర్ షేక్ రోహిత్లు స్వల్పంగా గాయపడ్డారని ఎచ్చెర్ల ఎస్సై జి.లక్ష్మణరావు తెలిపారు. కబళించిన కిడ్నీ వ్యాధి నరసన్నపేట: తామరాపల్లికి చెందిన కోల చక్రవర్తి(30)ని కిడ్నీ వ్యాధి కబళించింది. ప్రైవేటు డ్రైవర్గా పనిచేస్తున్న చక్రవర్తి కొన్నాళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విధుల్లోకి ఉపాధ్యాయుడు టెక్కలి: కోటబొమ్మాళి మండలం మాసాహెబ్పేట పంచాయతీ కమలనాభపురం ప్రాథమిక పాఠశాలకు ఎట్టకేలకు గురువారం ఉపాధ్యాయుడు విధులకు హాజరయ్యారు. ఇదే పాఠశాలలో గతంలో పనిచేసిన ఉపాధ్యాయుడు గత నెల 31న పదవీ విరమణ పొందిన తరువాత కొత్తగా ఉపాధ్యాయుడిని నియమించినప్పటికీ అతను విధులకు హాజరుకాలేదు. ఈ విషయమై విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘ఏకోపాధ్యాయ ఎక్కడయ్యా...’ అనే కథనం గురువారం సాక్షిలో ప్రచురితమైంది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరయ్యారు. ఆదిత్యుని సన్నిధిలో పంచాయతీరాజ్ కమిషనర్ అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వి.ఆర్.కృష్ణతేజ గురువారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, అధికారులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ డి.సత్యనారాయణ, అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, సాందీప్శర్మ, ఫణీంద్రశర్మ, జూనియర్ అసిస్టెంట్ చక్రవర్తి పాల్గొన్నారు. గడ్డి కుప్ప దగ్ధం ఆమదాలవలస: పురపాలక సంఘం పరిధిలోని 6వ వార్డు కె.మన్నయ్యపేటలో వరి గడ్డి కుప్పకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి కాల్చేశారు. దీంతో బాధితుడు అన్నెపు గోవిందరావు లబోదిబోమంటున్నారు. గత ఏడాది కూడా తన గడ్డి కుప్పను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారని వాపోయారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచూకీ తెలపండి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో, వివిధ సెక్షన్లకు సంబంధించి కేసులో ముద్దాయి ఆమదాలవలస మండలం బొడ్డేపలి గ్రామస్తుడు గొండు సురేష్ ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ ఎం.హరికృష్ణ కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొంతకాలంగా పైకేసులో వాయిదాలకు హాజరుకానందున కోర్టు ప్రోక్లమినేషన్ నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఎవరికై నా తెలిస్తే ఒకటో పట్టణ పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. -
హోరాహోరీగా పోరు
జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో తండ్యాలవలస పోలీసు శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న వార్షిక పోలీసు స్పోర్ట్స్ గేమ్స్ మీట్ రెండో రోజు గురువారం ఉత్సహభరితంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులు అధికారులు, సిబ్బంది ఉత్సహంగా క్రీడాపోటీల్లో పాల్గొంటున్నారు. బ్యాడ్మింటన్, జావెలిన్ త్రో, ట్రాక్ రన్నింగ్, షాట్పుట్ వంటి పోటీలు హోరాహోరీగా సాగాయి. మహిళా సిబ్బంది కోసం మ్యూజికల్ చైర్, స్పూన్ గేమ్, రింగ్ టెన్నిస్ తదితర వినోదాత్మక క్రీడలు కొనసాగాయి. – శ్రీకాకుళం రూరల్ – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం -
పల్లె పాట.. భాగ్యనగర బాట!
రికార్డింగ్ రూమ్లో జానపద పాటలు పాడుతూ.. నటుడు సమీర్ చేతుల మీదుగా నంది అవార్డు అందుకుంటున్న శ్రీనివాస్ ఇచ్ఛాపురం రూరల్ : ఇచ్ఛాపురం మండలం బుడ్డేపుపేటకు చెందిన లెంక శ్రీను చిన్నతనం నుంచే పల్లెల్లో పాటలు పాడటం అలవాటుగా మార్చుకున్నాడు. ఎప్పటికై నా వేదికపైకి ఎక్కి అద్భుత ప్రదర్శనతో అందరితో ప్రశంసలు అందుకోవాలని కలలు కన్నాడు. పల్లె పాటల మాధుర్యమే ఊపిరిగా, కలలే దారిగా.. తన ఊరి మట్టి వాసనను గుండెల్లో దాచుకుని ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతూ పదకొండేళ్ల వయసులోనే భాగ్యనగరానికి రైలెక్కి బయల్దేరాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. కానీ..కళ్లల్లో మాత్రం ధైర్యం, ఆశల వెలుగు, సినిమాల్లో పాడాలన్న కోరికతో చేసిన ప్రయాణంలో శ్రీనును అక్కున చేర్చుకున్నాడు ప్రముఖ గాయకుడు రసమయి బాలకిసాన్. ఆ ఆశ్రయమే శ్రీనివాస్ జీవితాన్ని మలుపుతిప్పింది. గాయకుడిగా, కళాకారుడుగా తన ప్రతిభకు పదును పెట్టుకున్నాడు. ‘థూమ్ ధామ్’ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. భీమ్లానాయక్, దసరా, బాహుబలి–2, ఇటీవల సంక్రాంతికి విడుదలైన మన శంకర వర ప్రసాద్ సినిమాలకు శ్రీనివాస్ అసిస్టెంట్ క్యాస్టింగ్ డైరెక్టర్గా పరిశ్రమలో అడుగు పెట్టాడు. ఐదు వందల జానపద పాటలకు లిరిక్స్ రైటర్గా తన కలాన్ని ఝులిపించిన శ్రీనివాస్.. శివ కళ్యాణ్ దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ‘తురుమ్ ఖాన్లు’ చిత్రానికి ఆరు పాటలు రాశాడు. అంతే కాకుండా యూట్యూబ్లో ప్రాచుర్యం పొందిన ‘బెంగాలీ రసగుళ్ల’, ‘చికెనీ తెస్తాడు నా అల్లుడు’, ‘రాను బొంబాయికి రాను’, ‘బాయిలోనే బల్లి పలికే’, నిమ్మ తోట వనంలో, బావ బంగారం’ వంటి జానపథ పాటలకు బ్యాక్ గ్రౌండ్ ఆర్ట్ డైరెక్టర్గా తన సృజనాత్మకతను చాటుకుంటూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అంతే కాకుండా సుమారు 25 జానపద గేయాల్లో హీరోగా నటనను నిరూపించుకున్నాడు. ప్రొడక్షన్ మేనేజర్గా 200 జానపథ గేయల చిత్రీకరణలో పనిచేశాడు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్న శ్రీనివాస్ హైదరాబాద్లో ధూమ్ధామ్ కార్యక్రమం ద్వారా వెలుగులోకి గాయకుడు రసమయి శిష్యుడిగా ప్రస్థానం 500కు పైగా జానపద పాటలకు సాహిత్యం అందించిన బుడ్డేపుపేట కుర్రాడు టాలెంట్స్వర్ణ బంగారు నంది బహూకరణ పల్లె ప్రాంతం నుంచి పట్టణానికి వచ్చిన శ్రీనివాస్ బహుముఖ ప్రతిభకు ఇటీవల రుద్ర ది బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్, రుద్ర స్టూడియోస్ నిర్వాహకులు ప్రముఖ నటుడు సమీర్ చేతుల మీదుగా ‘స్వర్ణ బంగారు నంది’ అవార్డు ప్రదానం చేశారు. కలలు కనడమే కాదు.. వాటిని నిజం చేయాలన్న పట్టుదల ఉంటే పల్లె నుంచి భాగ్యనగరం దాక విజయబాట తప్పదని తెలియజేసిన శ్రీనివాస్ తన పేరును ‘శ్రీను శ్రీకాకుళం’గా మార్చుకున్నాడు. -
అప్పులు తీర్చేందుకు చోరీలు
శ్రీకాకుళం: అప్పులు తీర్చేందుకు శ్రీకాకుళం రూరల్ మండలం నందగిరిపేటలో జనవరి 30న చైన్ స్నాచింగ్కు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వివేకానంద తన కార్యాలయంలో గురువారం విలేకరులకు వెల్లడించారు. గత నెల 30న వేకువజామున 5 గంటల సమయంలో నందగిరిపేటలోని పాతిన భూదేవమ్మ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. నీరు కావాలని అడిగే క్రమంలో భూదేవమ్మ మెడలోని 32.4 గ్రాముల బంగారు పుస్తెలతాడును తెంచుకుని కారులో పారిపోయారు. ఈ మేరకు బాధితురాలి కుమారుడు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలించారు. గ్రామానికి రాకపోకల సాగించిన కార్లపై దృష్టిపెట్టారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను బట్టి కారు నంబరును గుర్తించి యజమాని వివరాలను సేకరించారు. ఆమదాలవలసలోని మెట్టెక్కివలస ప్రాంతానికి చెందిన కారు యజమానిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నించగా తానే మరో ఇద్దరితో కలిసి నేరం చేసినట్లు అంగీకరించారు. చైన్ స్నాచింగ్కు పాల్పడిన వారిలో గుంట జగదీశ్వరరావు, గుంట ప్రమీలతోపాటు మెండ వెంకటరమణ ఉన్నారు. వీరి ముగ్గురూ ఆమదాలవలస పట్టణంలోని మెటక్కివలస హడ్కో కాలనీకి చెందినవారు. వీరిలో జగదీశ్వరరావు, ప్రమీల భార్యాభర్తలు కాగా, వెంకటరమణ వీరికి స్నేహితుడు. వీరంతా అప్పుల పాలు కావడంతో వాటిని తీర్చేందుకు దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నారు. 20 రోజుల పాటు నందగిరిపేటలో రెక్కీ నిర్వహించి ఒకటి రెండు సార్లు విఫలమయ్యారు. వేకువజామున అయితే ఎవరూ ఉండరని భావించి చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. నిందితుల వద్ద నుంచి 32.4 గ్రాముల బంగారం, సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును వారం రోజుల్లోనే ఛేదించిన శ్రీకాకుళం రూరల్ సీఐ కె.పైడపునాయుడు, ఎస్సై కె.రాములను ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు. సిబ్బందికి నగదు పారితోషకాలను డీఎస్పీ అందజేశారు ముగ్గురు చైన్స్నాచర్ల అరెస్ట్ 32.4 గ్రాముల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివేకానంద -
బోర్డు బంగ్లా స్థలంపై ప్రత్యేక దృష్టి
● ఇప్పటికే స్థల వివాదంపై సమీక్ష చేసిన కలెక్టర్ ● ఎంపీడీఓ ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన ఎస్సై నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేట నడిబొడ్డున విలువైన బోర్డు బంగ్లా స్థల వివాదంపై అధికారులు దృష్టి పెట్టారు. ఏటా ఎవరో ఒకరు వచ్చి స్థలం తమదంటూ స్వాధీనానికి ప్రయత్నిస్తుండటం తెలిసిందే. దీనిలో భాగంగా గత గురువారం రాత్రి ఆమదాలవలసకు చెందిన వ్యక్తులు శ్రీకాకుళంకు చెందిన కూటమి నాయకుడి సూచనలతో స్థలం వద్ద పనులు చేపట్టిన తెలిసిందే. దీనిపై విమర్శలు చెలరేగడంతో అధికారులు మేల్కొన్నారు. ఏటా వివాదం జరుగుతుండటంతో దీనిపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టి తగిన చర్యలు తీసుకోవడానికి చర్యలకు ఉపక్రమించారు. ఈ స్థలంపై కూటమి నాయకుల కన్ను ఉందని ఎమ్మెల్యే స్వయంగా చెప్పడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ దశలో ఎంపీడీఓ వెంకటేశ్వరప్రసాద్ నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ టి.సత్యనారాయణతో కలిసి కలెక్టర్ వద్దకు వెళ్లి స్థల వివాదం వివరించారు. అక్కడే ఉన్న ఎస్పీ మహేశ్వరరెడ్డిని కూడా కలిశారు. దీంతో కలెక్టర్, ఎస్పీలు తగిన చర్యలు తీసుకొనేందుకు కింది స్థాయి అధికారులకు మౌఖికంగా ఆదేశాలిచ్చారు. ఈ మేరకు పాత రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో కోర్టు నుంచి వచ్చిన సమాచారం.. ఎవరెవరు దీనిపై కోర్టుకు వెళ్లారు అనే వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు నరసన్నపేట ఎస్సై బి.గణేష్ ఎంపీడీఓ ఇచ్చిన ఫిర్యాదు పై ఆమదాలవలసకు చెందిన ముద్దాడ గోవిందరావు తదితరులను గురువారం పిలిచి విచారించారు. తనకు స్పష్టంగా హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నాయని, అధికారులు ఎవరూ ఈ స్థలంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ గోవిందరావు కోర్టు ఆర్డర్లు ఉన్నాయని తెలిపినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని ఎస్సై తెలిపారు. ముదిరిన వివాదం.. కాగా, గొట్టిపల్లి సర్వే నంబరు 219/బీ1 లో ఉన్న 38 సెంట్ల స్థలం బోర్డు బంగ్లాకు చెందిన స్థలంగా ఉంది. అధికారులు దీనిపై సరైన చర్యలు గతంలో తీసుకోకపోవడంతో ఇప్పుడు వివాదం మరింత ముదిరింది. 2023 అక్టోబరు 21న, డిసెంబర్ 16న, 2024 ఫిబ్రవరి 20న ఈ స్థలంపై వివాదం జరిగింది. తాజాగా జనవరి 29న మరోసారి వివాదం చోటు చేసుకుంది. -
‘యురేకా సైన్స్ ఎక్స్పో’ విజయవంతం చేయండి
శ్రీకాకుళం: త్వరలో అన్ని జిల్లాల్లోనూ జరగనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగాల వినూత్న పోటీలు (యురేకా సైన్స్ ఎక్స్పో– 2026)ను విజయవంతం చేయాలని డీఈఓ ఏ.రవిబాబు, పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పిలి కామేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు సామ సంజీవరావు, జిల్లా కార్యదర్శి పూజారి గోవిందరావు మాట్లాడుతూ ప్రయోగాలతో విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెరుగుతుందన్నారు. జేవీవీ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ మాట్లాడుతూ ఇన్నోవేషన్– టెక్నాలజీ,పర్యావరణం– వ్యవసాయ రంగం, అపోహలు –శాసీ్త్రయ వివరణ అనే అంశాలపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 8,9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, టెక్కలి ఉపవిద్యాశాఖాధికారులు ఆర్.విజయ్కుమారి, పి.విలియం, జిల్లా పరీక్ష విభాగాధిపతి చంద్రభూషణ్, డీసీఈబీ సెక్రటరీ సంజీవరావు పాల్గొన్నారు. -
వారి నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని అఫీషియల్ కాలనీకి చెందిన అనంత పట్నాయకుని రామ్మోహనరావు(65), గుజరాతిపేటకు చెందిన పొట్నూరు నిర్మల(45) మృతిచెందడంతో వారి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్క్రాస్కు సమాచారం అందించారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ–టెక్నీషియన్ పూతి సుజాత, నంది ఉమాశంకర్ల ద్వారా కార్నియాలు సేకరించి విశాఖ ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. సహకరించిన కుటుంబ సభ్యులకు చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్, సభ్యులు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు. -
మిస్సమ్మ బంగ్లా స్థలం పరిశీలన
టెక్కలి: టెక్కలి పాతబస్టాండ్లో మిస్సమ్మ బంగ్లా స్థలాన్ని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి గురువారం పరిశీలించారు.ఈ స్థలంలో కొన్నేళ్లుగా వివాదాలు చోటు చేసుకుని నిరుపయోగంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్డీఓ నేతృత్వంలో రెండు రోజులుగా జంగిల్ క్లియరెన్స్ చేస్తూ స్థలాన్ని శుభ్రం చేస్తున్నారు. సుమారు 1.75 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ స్థలాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా వాణిజ్య పరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన ఆక్రమిత స్థలాన్ని సైతం స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.సత్యం, డీటీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. స్థలాన్ని పరిశీలిస్తున్న జేసీ, ఆర్డీఓ -
పారిశుద్ధ్య నిర్వహణకు ఈ–ఆటోలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఎనిమిది ఎలక్ట్రికల్ ఆటోలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పరిశుభ్రతను పాటించాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య మాట్లాడుతూ కవిటి మండలం రాజపురం పంచాయతీ, కంచిలి మండలం ఎం.ఎస్.పల్లి, ఇచ్ఛాపురం మండలం మసకాపురం, వజ్రపుకొత్తూరు మండలం పల్లివూరు, మందస మండలం బుడారిసింగి, పలాస మండలం తర్లకోటకు ఒక్కొక్కటి చొప్పున, కోటబొమ్మాలి మండలం నిమ్మాడకు రెండు వాహనాలు మంజూరైనట్లువివరించారు. వాహనాల పరిశుభ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అనుభవం ఉన్న డ్రైవర్లతో పని చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఓ భారతి సౌజన్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
వందేమాతరం.. అందాం అందరం
నరసన్నపేట: సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ సైకిల్ యాత్ర గురువారం సాయంత్రం నరసన్నపేటకు చేరుకుంది. మండల సరిహద్దు గ్రామం తామరాపల్లి వద్ద ఘన స్వాగతం పలికారు. వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ సీఐఎస్ఎఫ్ కోస్టల్ బృందాలు సైకిల్ యాత్రను పశ్చిమ బెంగాల్లో జనవరి 28న ప్రారంభించాయి. ఈ ర్యాలీ కేరళ వరకు సాగుతుంది. అందు లో భాగంగా గురువారం నరసన్నపేటకు వచ్చిన ర్యాలీకి పారామిలటరీ మాజీ సైనికులు, పోలీసులు, ఎన్సీసీ కేడెట్లు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక పైడితల్లి అమ్మవారి ఆలయం రోడ్డు లో ఉన్న పారామిలటరీ మాజీ సైనికుల కార్యాలయం వద్ద భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ సౌత్ జోన్ డీఐజీ ఎం.జీ.రాఘవేంద్రకుమార్ మాట్లాడుతూ వందేమాతర గీతం స్వాతంత్రోద్యమ కాలంలో దేశ సమైక్యతను చాటిందని అన్నారు. ఈ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఐఎస్ఎఫ్ జవాన్లతో సైకిల్ ర్యాలీ తలపెట్టామన్నారు. 25 రోజుల పాటు తొమ్మిది రాష్ట్రాలను కవర్ చేస్తూ 6533 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తామన్నారు. నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు కల్పించారు. కార్యక్రమంలో ఐసీఎల్ కమాండర్ డి.జితేంద్ర బాబు, డిప్యూటీ కమాండర్ అవినాష్కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సునీల్ కుమార్ తో పాటు పలువురు సీఐఎస్ఎఫ్ అధికారులు పాల్గొన్నారు. -
సిబ్బంది లేక..
అవినీతి నిరోధక శాఖ● అరకొర సిబ్బందితో ఏసీబీ ● డీఎస్పీ సహా సరిపడా సిబ్బంది లేక అవస్థలు శ్రీకాకుళం క్రైమ్ : అవినీతిని నిరోధించాల్సిన శాఖ.. సిబ్బంది కొరతతో కునారిల్లుతోంది. గత ఏడాది అక్టోబరులో డీఎస్పీ బీవీ రమణమూర్తి విశాఖపట్నం బదిలీ కావడం, విజయనగరం జిల్లాకు చెందిన డీఎస్పీ రమ్యకు అక్కడితో పాటు ఇక్కడ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం, ఆమె విజయనగరానికే ఎక్కువ శాతం పరిమితం కావడంతో జిల్లాలో ఈ శాఖ స్తబ్ధుగా ఉండిపోయింది. 2025 ఏడాదిలో మూడంటే మూడు కేసులు అదీ రమణమూర్తి డీఎస్పీగా ఉన్నప్పుడే కట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో అవినీతి పెచ్చుమీరుతున్నా అవినీతి నిరోధక శాఖ నిద్రావస్థలో ఉందన్న విమర్శలు అధికమవ్వడంతో ఈ మధ్య ఏసీబీ దాడులు అధికం చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలను మేలుకొలిపి అవినీతిపై ఫిర్యాదులిచ్చేవిధంగా సంబంధిత శాఖ 14400 టోల్ఫ్రీ నంబర్కు విస్తృతంగా ప్రచారం కల్పించింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్తగా వచ్చిన 1064 టోల్ఫ్రీ నంబర్ అంత బాగా ప్రాచుర్యంలో లేదు. సిబ్బంది కొరత.. ఆరుగురు పీసీలు, ఆరుగురు హెచ్సీలు, ముగ్గురు ఎస్ఐలు, ముగ్గురు సీఐలు, ఓ రెగ్యులర్ డీఎస్పీ జిల్లా ఏసీబీలో ఉండాలి. దాదాపు 8 ఏళ్లు డీఎస్పీగా కొనసాగిన రమణమూర్తి గత ఏడాది అక్టోబరులో విశాఖపట్నానికి బదిలీ కావడం, రెగ్యులర్ డీఎస్పీ లేకుండా ఇన్చార్జిగా విజయనగరం డీఎస్పీ రమ్యను మన జిల్లాకు నియమించినా ఆమె సరిగా రాకపోవడం చాలా ఇ బ్బందిగా పరిణమిస్తోంది. అంతేకాక సీఐ ఒకరు, ఎస్ఐలు ముగ్గురు, పీసీలు ముగ్గురు, హెచ్సీ ఒకరు లేకపోవడంతో ఉన్నవారిపైనే పూర్తిగా భారం పడుతోంది. దీనిపై ఈ మధ్య ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వద్ద ప్రస్తావించగా సిబ్బంది కొరత మాట వాస్తవమేనని, రెగ్యులర్ అధికారి వచ్చినంత వరకు ఇబ్బంది ఉంటుందన్నారు. కొత్త ఫోన్ నంబర్లు, టోల్ఫ్రీ నంబర్ల తాలుకా పాంప్లెట్లు, స్టిక్కర్లు వచ్చాయని, ప్రచారం కల్పిస్తామన్నారు ఈ శాఖలపైనే ఆరోపణలు ● జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఇబ్బడిముబ్బడిగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ● నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల ను, నిర్ణీత జరిమానా చెల్లించడం ద్వారా చట్టబద్ధం (రెగ్యులరైజ్) చేసే ప్రక్రియ బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్)ను సంబంధిత రెవెన్యూ, మున్సిపల్, కార్పొరేషన్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచే వినిపిస్తున్నాయి. ● సుడా పరిధిలో ఏవైనా నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులు కోసం వెళ్తే కాగితాల కోసం తిప్పిస్తారని, చేతులు తడిపితే పని వేగంగా అవుతుందనే ఆరోపణ అంతటా వినిపిస్తోంది. ● తూనికలు కొలతల శాఖ, ఎరువుల కంపెనీల నుంచి వచ్చే కంటైనర్లు, హోల్సేల్ ఎరువుల షాపుల్లో అవినీతి పెచ్చుమీరుతోంది. ● పశు సంవర్ధక శాఖపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోలీసు శాఖపై కూడా అక్కడక్కడా ఆరోపణలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. బంగా రం రికవరీ విషయంలో ఆరోపణలున్నాయి. ఏదీ ప్రచారం.. ? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అవినీతి నిరోధక శాఖకు చెందిన 14400 టోల్ఫ్రీ నంబర్ను, జిల్లా అధికారుల నంబర్లను, మెయిల్ అడ్రస్ల ను మండలకేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనే కాక మారుమూల పల్లెలకు సైతం పాంప్లెట్లు, స్టిక్కర్ల రూపంలో అంటించి విస్తృత ప్రచారం కల్పించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం కొంతమేర నిధులు సైతం వెచ్చించారు. కొత్తగా వచ్చిన టోల్ఫ్రీ నంబర్ 1064 ఆ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లకపోవడానికి కారణం, కొత్తగా వచ్చిన పాంప్లెట్లు, స్టిక్కర్లు ఇప్పటికీ స్టోరేజీ రూముల్లో మగ్గుతుండటమే. ఇప్పటికీ ప్రజలు పాత టోల్ఫ్రీ నంబర్కే ఫోన్ చేస్తుండటం, అది పనిచేయకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. -
తత్కాల్ స్కీమ్ ద్వారా టెన్త్ ఫీజు చెల్లింపునకు అవకాశం
శ్రీకాకుళం: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు తత్కాల్ స్కీం ద్వారా ఈనెల 12వ తేదీ వరకు ఫీజులు చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు తెలిపా రు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ పరీక్ష తప్పిన విద్యార్థులతో పాటు రెగ్యులర్ విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఫీజులకు అదనంగా వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. పరీక్షల విభాగం డైరెక్టర్ ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించారని, ఆరో తేదీ నుంచి 12వ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చన్నారు. నామినల్ రోల్స్ ను కూడా ఆన్లైన్లో సమర్పించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు ‘సమన్వయంతోనే వివాదాల పరిష్కారం’ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో వివిధ భూ సమస్యల కేసులు అధికారుల సమన్వయంతోనే పరిష్కారమవుతాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లాలో గల ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, పోలీస్ అధికారులతో రెవెన్యూ సదస్సు సమావేశాన్ని గురు వారం నిర్వహించారు. రెవెన్యూ సమస్యల వివరాలను ముందుగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించిన పవర్ ప్రజెంటేషన్ ద్వారా అందించిన వివరాలపై కలెక్టర్ స్పందిస్తూ రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూ చించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మా ట్లాడుతూ తప్పుడు కేసులకు అండదండలు అందించిన వారికి భయం కలిగేలా బైండోవర్ కేసుల్లో పూచికత్తుగా ఉన్న మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించకూడదని, తప్పు చేయా లనే ఉద్దేశం ఉన్నవారికి కేసుల భయం, ఆర్థిక భారం కలిగేలా వ్యవహరించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ రిటైర్ అయి గ్రామాల్లో ఉన్న నాయుడు, కారణం తదితర వాళ్ల సహాయంతో రెవెన్యూ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని అన్నారు. స్థలాల పరిశీలన సంతబొమ్మాళి: మూలపేట పోర్టు పరిసర ప్రాంతాల్లోని మర్రిపాడు, కాకరపల్లిలో స్థలాలను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ గురువారం పరిశీలించారు. మర్రిపాడులో కాకరపల్లిలో ఏిపీఐఐసీ చెందిన 400 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలాల్లో పోర్టు అనుబంధ పరిశ్రమలు, టౌన్షిప్ కోసం సేకరణ చేస్తున్నట్లు సమాచారం. అనంతరం మూలపేట పోర్టును నౌపడలో ఆర్అండ్ ఆర్ కాలనీని పరిశీలించారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, తహసీల్దార్ హేమసుందరరావు, ఆర్ఐ చంద్రమౌళి ఉన్నారు. ‘వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పోలీసు సేవలు సులభం’ శ్రీకాకుళం క్రైమ్ : డిజిటల్ పాలనలో భాగంగా ప్రజలకు మరింత సులువుగా పోలీసు సేవలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్సు) సేవలు అందరూ వినియోగించుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిపాలనకు సంబంధించి అన్ని పనులను ఈ–ఆఫీస్ విధానంలోనే నిర్వహించాలని, పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్సు) ద్వారా స్వీకరించే ప్రజా ఫిర్యాదులను సకాలంలో పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలుండాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఎఫ్ఐఆర్ కాపీ, ఎఫ్ఐఆర్ ప్రస్తుత స్థితి, ఈ–చలానా వివరాలు పొందవచ్చన్నారు. ఈ సేవలు పొందేందుకు 9552300009 నంబర్ను మొబైల్ఫోన్లో సేవ్ చేసుకుని ఆ నంబర్కు ‘హాయ్’ అని మెసేజ్ పంపితే ప్రభుత్వ సేవల వివరాలు వస్తాయన్నారు. . -
చిరు వ్యాపారులతో చెలగాటం
పలాస: కాశీబుగ్గ కేటీ రోడ్డులోని క్రిస్టియన్, ముస్లిం శ్మశానం ఎదురుగా గత కొన్నేళ్లుగా ఆశీలు కడుతూ వ్యాపారాలు చేస్తున్న చిరు వ్యాపారులతో టీడీపీ నాయకులు చెలగాటమాడుతున్నారు. మున్సిపాలి టీ ఏర్పాటు కాక ముందు నుంచి శ్మశానం ఎదురుగా వీరు వ్యాపారాలు చేస్తున్నారు. గతంలో కేటీ రోడ్డు వెడల్పు చేసే సమయంలో వీరిని శ్మశానం ఎదురుగా ఉన్న ఫుట్పాత్పైకి పంపించారు. రోడ్డు వెడల్పైన తర్వాత వీరు మళ్లీ యథా స్థానాలకు వచ్చారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్గా వచ్చిన ఇ.శ్రీనివాసరావు వారిని ఫుట్పాత్పైకి పంపడంతో అంతా వెళ్లిపోయారు. ఇటీవల ఓ టీడీపీ నేత వారి వద్దకు వెళ్లి అద్దె వసూలు చేయడానికి రాయబేరా లు నడిపాడు. మున్సిపాలిటీకి తాము ఆశీళ్లు కడుతున్నామని వ్యాపారులు చెప్పినా ఆ నాయకుడు ఒప్పుకోలేదు. తమకు డబ్బులు చెల్లిస్తేనే షాపులు ఉంటాయని హెచ్చరించాడు. దీంతో వారంతా ఆందోళన చేసి రోడ్డు మీద దుకాణాలు పెట్టుకున్నారు. గురువారం పోలీసులు వచ్చి మళ్లీ ఫుట్పాత్ ము న్సిపాలిటీదని, అక్కడే పెట్టుకోండని వారే దగ్గరుండి మళ్లీ పెట్టించారు. బాధిత వ్యాపారులు రోహిణీ బెహరా, మీనకేశ్వరరావు, బరాట వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ తమ పొట్టకొట్టవద్దని, చాలా కాలంగా దీన్ని నమ్ముకొని బతుకుతున్నామని, మున్సిపాలిటీకి కూడా ఆశీలు కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకో తీరుగా వ్యవహరిస్తూ నరకం చూపిస్తున్నారని అంటున్నారు. -
శ్రీకాకుళం
పల్లెపాట.. భాగ్యనగర బాటబుడ్డేపుపేట కుర్రాడు అదరగొడుతున్నాడు. పాటలతో ఆకట్టుకుంటున్నాడు. –8లో శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కార్యక్రమాల షెడ్యూల్ ఫిబ్రవరి 7 ఆంజనేయస్వామికి అభిషేకం. 8 వాసుదేవునికి అభిషేకం. 9 గరుడపూజ,ధ్వజారోహణం, హనుమద్వాహనం, శేషవాహన సేవ. 10 కల్పవృక్ష వాహనం, ఎదుర్కోలు ఉత్సవం. 11 వాసుదేవుని కల్యాణ మహోత్సవం. 12 పొన్నచెట్టు వాహనం,తెప్పోత్సవం, అశ్వవాహన సేవ. 13 రథోత్సవం, చక్రస్నానం, శ్రీ పుష్టయాగం కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సంకీర్తనలు జరుగుతాయి. మందసలోని వాసుదేవ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నా యి. ఈ బ్రహ్మోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ జీర్ణోద్ధరణ పనులు అయ్యాక త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో 2010 ఫిబ్రవరి 5వ తేదీన మొదటి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఆలయ చరిత్రలోకి వెళ్తే.. 1744వ సంవత్సరంలో మందస సంస్థానానికి స్థానాచార్యులుగా నరసాపురానికి చెందిన తెలికిచర్ల కందాడ రామానుజాచార్యస్వామి ఉండేవారు. ఆయన వద్ద త్రిదండి శ్రీమన్నారాయణ పెద్ద జీయర్ స్వామి, గోపాలచార్య స్వామి శిష్యులుగా ఉండేవారు. వాసుదేవుని ఆల య ప్రాంగణంలోని వేద పాఠశాలలో వీరిద్దరూ పండిత విద్యను అభ్యసించారు. అప్పట్లో వాసుదేవునికి నిత్య అర్చనలు జరిగేవి. ఏటా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. రాచరిక పాలనలో వైభవోపేతంగా ఉత్సవాలు జరిగేవి. రాచరికం పోయాక బ్రహ్మోత్సవాలు నిలిచిపోయా యి. క్రమానంతరం ఆలయం కూడా జీర్ణావస్థకు చేరుకుంది. పెద్ద జీయర్ స్వామి తదనంతరం వచ్చిన త్రిదండిచిన్నజీయర్స్వామి ఆలయ ప్రాధా న్యతను గుర్తించి గురువుల స్మారకార్థం అభివృద్ధి చేసేందుకు సంకల్పించారు. 2000 జూలై 7వ తేదీన మధుభయ వేదాంత ఆచార్య పీఠం దేవదాయశాఖ నుంచి సర్వహక్కులను తీసుకుంది. శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించారు. ఒడిశాకు చెందిన కళాకారులతో పనులు చేయించి 2009 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన వేదపండితులతో స్వామిని పునఃప్రతిష్టించారు. ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు వస్తుంటారని ఆలయ ప్రధాన అర్చకులు గోపీనంబాళ్ల దాసుకూర్మాచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవానికి హాజరైన భక్తులకు భోజన ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. -
హైవే.. తనిఖీలకు నో వే..!
రణస్థలం: జాతీయ రహదారిపై ఇసుక బళ్లు దర్జాగా దూసుకెళ్తున్నాయి. అక్రమమా, సక్రమమా అని అడిగే నాథుడు లేకపోవడంతో హైవే వెంబడి హారన్ కొట్టుకుంటూ బళ్లు రంకెలేస్తున్నాయి. నాగావళి, వంశధార పరివాహక ప్రాంతాల నుంచి నిత్యం ఇసుక తవ్వుకుంటున్న వారు వందలాది లారీల్లో ఆ ఇసుకను విశాఖ తదితర ప్రాంతాలకు సులువుగా తరలించుకుంటున్నారు. సాధారణంగా సుదూర ప్రాంతాలకై తే ప్రభుత్వ నిర్దేశిత రుసుం చెల్లించి అనుమతులు పొందాలి. కానీ అనుమతులు ఉన్నాయో లేవో పరిశీలించే దిక్కు కూడా లేకపోవడంతో హైవే ఇసుక రవాణాకు ప్రధాన రహదారిగా మారిపోయింది. జిల్లా నుంచి వెళ్లే ఇసుక వాహనాలను పైడిభీమవరం ఇసుక చెక్పోస్టు వద్ద తప్పనిసరిగా తనిఖీ చేయాలని, అనుమతులు ఉంటేనే విడిచిపెట్టాలని లేదంటే వెంటనే సీజ్ చేయాలని రెవెన్యూ, పోలీస్ సిబ్బందికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి 2024 ఆక్టోబర్ 6వ తేదీన పైడిభీమవరం ఇసుక చెక్పోస్టు పరిశీలనలో ఆదేశించారు. చెక్పోస్టు వద్ద ఆ రోజే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి పోలీస్, రెవెన్యూ, విజిలెన్సు, మైన్స్ సిబ్బందికి ఆర్డీఓ, జేసీల సమక్షంలో పలు సూచనలు చేశారు. కానీ ఆ ఆదేశాల అమలు మూడునాళ్ల ముచ్చటగానే సాగింది. నకిలీ బిల్లుల ఊసే లేదు జిల్లా నుంచి నకిలీ బిల్లులతో ఇసుక అక్రమంగా తరలిపోతుందని 2025 ఫిబ్రవరి 14న ఎస్పీ, కలెక్టర్ అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆ రోజు పట్టుకున్న 28 ఇసుక లారీల్లో 12 లారీలు నకిలీ బిల్లులేనని క్షేత్రస్థాయిలో గుర్తించారు. ఆపై 12 లారీలు సీజ్ చేసి కేసులు నమోదు చేసి లారీలు వదిలేశారు. పట్టుకున్న ఇసుకకు కాపలాగా వీఆర్ఏలను నియమించారు. వారు ఆరుమాసాల పాటు కాపు కాశారు. తర్వాత ఆ ఇసుకను వేరే శాఖకు అప్పగించి నిర్మాణాలకు ఉపయోగించారు. ఇసుక అక్రమ రవాణాలో ఓ అధికారి చేతివాటం ఉందని పత్రికల్లో రావటంతో అప్పట్లో ఎంకై ్వరీ చేసినా ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో నీరుగార్చేశారు. ఇంత పగడ్బందీగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులు ఏడాది గడవక ముందే చేతులెత్తేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెక్పోస్టు అలంకార ప్రాయమేనా..? గత కొన్ని నెలలు పైడిభీమవరం చెక్పోస్టులో ఎలాంటి తనిఖీలు జరగడం లేదు. రెవెన్యూ అధికారులు ఉండటం లేదు. సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలు, ఇతర వస్తువులకు కాపాలాగా పగటి పూట ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటున్నారు. వారు అలా కాలక్షేపానికి వచ్చి వెళ్లిపోయినట్లు వెళ్తున్నారే తప్ప లారీ ఆపి తనిఖీలు చేయడం లేదు. కనిపిస్తే లారీ నంబర్ ఒక నోట్ బుక్పై రాస్తున్నారు. లేదంటే అదీ లేదు. రాత్రి తనిఖీలు ఉండడం లేదు. అంతా సక్రమమేనా..? శ్రీకాకుళం జిల్లా వైపు నుంచి విశాఖపట్నం వైపు రోజు 150కిపైగా ఇసుక భారీ లారీల్లో తరలిపోతోంది. ఇసుక అంతా సక్రమమేనా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. పగటి పూట ఓ పుస్తకంలో ఆ వాహనాల నంబర్లు రాస్తున్నారు. రాత్రిపూటైతే అదీ లేదు. దీనిపై జేఆర్పురం సీఐను సంప్రదించగా పైడిభీమవరం ఇసుక చెక్పోస్టు వద్ద తమ సిబ్బంది ఉంటున్నారని పేర్కొన్నారు. సిబ్బంది ఉండడం లేదు రీ సర్వే పనుల్లో భాగంగా పైడిభీమవరం చెక్ పోస్టులో మా సిబ్బంది ఎవరూ ఉండటం లేదు. పోలీస్ అధికారులు మాత్రమే ఉంటున్నారు. రెవె న్యూ అధికారులకు ఎలాంటి డ్యూటీలు వేయలేదు. – సనపల కిరణ్ కుమార్, తహసీల్దార్, రణస్థలం జాతీయ రహదారిపై ఇష్టానుసారం ఇసుక అక్రమ రవాణా తనిఖీలు లేకపోవడంతో రెచ్చిపోతున్న ఇసుకాసురులు అలంకారప్రాయంగా మారిన పైడిభీమవరం ఇసుక చెక్ పోస్టు షిఫ్ట్లుగా ఉంటున్నారు పైడిభీమవరం ఇసుక చెక్పోస్టు వద్ద ఉదయం, సాయంత్రం ఒక్కొక్కరుగా పోలీస్ సిబ్బంది ఉంటున్నారు. రాత్రి ఎవరూ ఉండడం లేదు. రెవెన్యూ సిబ్బంది గత కొన్ని నెలలుగా రావడం లేదు. ఇసుక లారీ వచ్చే బిల్లులు నకిలీయా లేక ఒరిజినలా అన్నది రెవెన్యూ, విజిలెన్స్ వాళ్లకే తెలుస్తుంది. – ఎస్.చిరంజీవి, ఎస్ఐ, జేఆర్ పురం -
రెయిన్ గన్తో సాగునీరు ఆదా
గార: వ్యవసాయంలో రెయిన్ గన్ వాడడం ద్వారా పూర్తిస్థాయిలో పంటకు సాగునీరు అందడంతో పాటు సాగునీరు ఆదా అవుతుందని శ్రీకాకుళం వ్యవసాయ సహాయ సంచాలకురాలు బగ్గు రజిని అన్నారు. బుధవారం రామచంద్రాపురం పంచాయతీ అంబటివానిపేట ఆర్ఎస్కే పరిధిలోని మొక్కజొన్న, అపరాలు, మిరప మొక్కలకు రెయిన్ గన్ద్వారా సాగునీరు అందించే పద్ధతిని రైతులు, అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. మొక్కజొన్న సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారన్నారు. అధికంగా యూరియా వాడడడంతో సూక్షధాతు లోపాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రబీలో ఈ ఏడాది అధికంగా మంచు కురవడంతో పెసర, మినుము పంట పాడయ్యిందని, పూత దశలో మల్టీకే వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో దుంపల పద్మావతి, ఏఈవోలు బడగల దుర్గాప్రసాదరావు, శ్రీదీప్తి, వినీత, అంబటి సుధాకరరావు, సాధు దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఏకోపాధ్యాయ ఎక్కడయ్యా..?
టెక్కలి: కోటబొమ్మాళి మండలంలోని కమలనాభపురం గ్రామ ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. ఈ పాఠశాలకు చెందిన ఒకే ఒక్క ఉపాధ్యాయుడు జనవరి 31వ తేదీన ఉద్యోగ విరమణ పొందారు. అదే రోజున మరో ఉపాధ్యాయుడిని నియమిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉపాధ్యాయుడు మాత్రం విధులకు హాజరవ్వడం లేదు. దీంతో రెండు రోజులు పాటు సీఆర్పీతో నెట్టుకొచ్చారు. కొత్తగా నియమించిన ఉపాధ్యాయుడు బుధవారం సైతం రాకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లినప్పటికీ పాఠాలు బోధించేవారు కరువయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖాధికారి గోవిందరావు పాఠశాలకు వెళ్లి పరిస్థితిని గమనించారు. అనంతరం ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరవ్వని విషయాన్ని విద్యా శాఖాధికారుల వద్ద ప్రస్తావించగా.. ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ పొందిన రోజునే చిన్నహరిశ్చంద్రాపురం పాఠశాలలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడ్ని నియమించామన్నారు. అయితే ఆదివారం సెలవు కావడంతో సోమవారం సైతం విధులకు సెలవు పెట్టారని పేర్కొన్నారు. దీంతో రెండు రోజుల పాటు విధులకు రాకపోవడంతో సీఆర్పీతో పాఠశాలను నిర్వహించామన్నారు. బుధవారం కూడా రాలేదనే విషయం గ్రామస్తులను నుంచి తెలుసుకున్నామని తెలిపారు. తక్షణమే విధులకు హాజరు కావాలని ఆదేశించామని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికీ విధులకు హాజరవ్వాల్సిన ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్లకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. -
ఆకట్టుకున్న అవధానాలు
నరసన్నపేట: మండలంలోని ఉర్లాంలో బుధవారం నిర్వహించిన త్రిగళ అష్టావధానం ఆకట్టుకుంది. సుసరాపు చంద్రశేఖర శర్మ, రంప సాయికుమార్ శర్మ, ఎన్.జయలక్ష్మిలు తెలుగు, ఆంధ్రం, సంస్కృతం భాషల్లో త్రిగళ అవధానం చేశారు. మండపాటి మహేశ్వరి అష్టావధానం నిర్వహించారు. 212 మంది కవులు, పండితులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు అవధాన కార్యక్రమాలు జరిగాయి. సంధించిన ప్రశ్నలను అవధానులు సమయస్ఫూర్తితో వివరించడం ఆకట్టుకుంది. అవధాన సభా అధ్యక్షుడు బంకుపల్లె రమేష్ శర్మ మాట్లాడుతూ ఉర్లాం సంస్థానం కళలకు పెట్టింది పేరని, దానిని గుర్తు చేసుకొని ఈ అవధాన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సత్యవరాగ్రహారానికి చెందిన మారుతీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధి మావుడూరి జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
● తవ్వేస్తూ.. తరలిస్తూ..
నరసన్నపేట నియోజకవర్గంలో ఇసుకాసురలు చెలరేగిపోతున్నారు. అటు కరకవలస నుంచి ఇటు వనితమండలం వరకూ వంశధార నదిలో ఇష్టారాజ్యంగా అనధికార ర్యాంపులు ఏర్పాటు చేసి తవ్వకాలు సాగిస్తున్నారు.గోపాలపెంట, మడపాం, బుచ్చిపేట, చేనువలస, ఉప్పరిపేట, లుకలాం, వెంకటాపురం, పర్లాం, కొమనాపల్లి, దొంపాక, అందవరం ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చాలాచోట్ల అనుమతులు లేకుండా నదీ గర్భంలో పరిమితికి మించి జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నారు. విశాఖ వంటి దూర ప్రాంతాలకు నిత్యం ట్రిప్పర్ ద్వారా రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. పర్యావరణానికి తూట్లుపొడుస్తున్నారు. – నరసన్నపేట -
మాయమవుతున్న సాగునీటి కాలువలు..?
టెక్కలి: వంశధార ప్రధాన కాలువ నుంచి టెక్కలి పరిధిలోని పలు గ్రామాల సాగునీటి అవసరాలకు ఆసరాగా ఉన్నటువంటి కాలువలు మాయమవుతున్నాయి. సాగునీటి కాలువలను ఆక్రమిస్తూ అక్రమ కట్టడాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్న విషయం అధికారులు గుర్తిస్తున్నప్పటికీ, వాటిని తొలగించే విషయంలో తాత్సారం కనిపిస్తోంది. దీంతో సాగునీటి కాలువల స్వరూపం మారిపోతోంది. టెక్కలి నుంచి బన్నువాడకు వెళ్లేదారిలో కోదండ రామవీధికి ఎదురుగా 49–1ఆర్ కాలువకు ఆనుకుని కొన్ని నెలల క్రితం ఒక వెంచర్ వేశారు. అప్పట్లో సాగునీటి కాలువను ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. వెంచర్కు ఆనుకుని ఉన్న ఆక్రమణలతో పాటు మొత్తం కాలువ ఆక్రమణలు తొలగిస్తామని సంబంధిత అధికారులు హడావుడి చేసి మధ్యలో వదిలేశారు. దీంతో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా పాత జాతీయ రహదారిలో గతంలో 49–ఏఆర్గా పిలవబడే సాగునీటి కాలువకు ఆనుకుని ఇటీవల ఒక పెద్ద స్థలాన్ని చదును చేశారు. అయితే సాగునీటి కాలువ స్థానంలో మండల పరిషత్ నిధుల నుంచి కాలువల నిర్మాణం చేస్తున్నారు. కాగా గతంలో ఉన్న కాలువకు ఇప్పుడు నిర్మాణం చేస్తున్న కాలువకు పూర్తిగా స్వరూపం మారిపోయింది. కొత్తగా చదును చేసిన స్థలానికి లబ్ధి కలిగే విధంగా సాగునీటి కాలువను మురుగునీటి కాలువలా స్వరూపం మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు పూర్తిగా సర్వే నిర్వహించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ స్థానికంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై వంశధార ఈఈ శేఖర్రావు వద్ద ప్రస్తావించగా.. పాత జాతీయ రహదారిలో గతంలో రైతుల ప్రయోజనం దృష్ట్యా 49–ఏఆర్తో చానల్ ఉండేదన్నారు. అలాగే బన్నువాడకు వెళ్లే మార్గంలో వేసిన వెంచర్కు ఆనుకుని ఉన్నటువంటి 49–1 ఆర్లో ఆక్రమణలు గుర్తించామని, దీనిపై రెవెన్యూ అధికారుల సాయంతో తొలగింపు ప్రక్రియ కోసం ఇప్పటికే అన్ని రకాల అనుమతులతో సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. -
అల్లం సాగుపై ఆసక్తి..!
మెళియాపుట్టి: వ్యవసాయంలో నూతన పంటల సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. సంప్రదాయ పంటల సాగు వలన వస్తున్న నష్టాల నుంచి గట్టెక్కేందుకు వాణిజ్య పంటలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగానే అల్లం సాగుపై అధికంగా మక్కువ చూపిస్తున్నారు. ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గం వ్యాప్తంగా 1,328 ఎకరాల్లో గిరిజనులు అల్లం సాగు చేస్తున్నారు. కొత్తూరు వెలుగు అసోసియేషన్ (స్వచ్ఛంద సంస్థ) సభ్యులు స్వచ్ఛందంగా అల్లం విత్తనాలను రాయితీపై ఇస్తూ సహకారం అందిస్తున్నారు. పాతపట్నం నియోజకవర్గవ్యాప్తంగా అల్లం సాగు చేస్తున్నారు. మార్కెట్లో దొరికే హైబ్రీడ్ అల్లం వలన పలువురు చిన్న వయస్సులోనే మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అందువలన మైదాన ప్రాంత ప్రజలు గిరిజన రైతులు పండిస్తున్న దేశీ అల్లం, అదేవిధంగా చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. కరోనా తర్వాత అత్యధిక శాతం మంది ఆహారపు అలవాట్లను మార్చుకున్నారని పలువురు వైద్యులు చెబుతున్నారు. ఎటువంటి ఎరువులు ఉపయోగించకుండా అల్లం పండిస్తున్నట్లు పలువురు గిరిజనులు తెలుపుతున్నారు. వారపు సంతల్లో విక్రయాలు నిర్వహిస్తున్నామని, పలువురు గ్రామాలకే వచ్చి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని ఎకరాల్లో అల్లం సాగు చేస్తామని పేర్కొంటున్నారు. అల్లం సాగుతో ఆర్థికంగా మేలు జరుగుతోందని చెబుతున్నారు. మెళియాపుట్టి మండలంలోని ఆంపురం, గొట్టిపల్లి, కేరాసింగి, నేలబొంతు గ్రామాల గిరిజనులు, నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఈ ఏడాది అధికంగా సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మేము దేశవాలీ విత్తనాలు వేసి పండిస్తున్న అల్లంకు చాలా గిరాకీ ఉంది. అదేవిధంగా లాభాలు సైతం అధికంగానే వస్తున్నాయి. కుటుంబాలతో కష్టపడుతున్నాం. ఫలితం కూడా ఆశించిన విధంగానే ఉంది. గతేడాది 50 సెంట్లలో పండించాను. ప్రస్తుతం మరో రెండెకరాల్లో పండించాలని యోచిస్తున్నాం. – జన్ని భాస్కరరావు, నేలబొంతు గ్రామం, మెళియాపుట్టి మండలం అల్లం సాగు చేయడానికి పెట్టుబడులు తక్కువ. నేను ఒక ఎకరాలో పోడు వ్యవసాయం చేస్తున్నాను. అల్లం విత్తనాలను కొత్తూరు వెలుగు అసోసియేషన్ వారు రాయితీపై అందిస్తున్నారు. మేము పండించే అల్లం మాకు ఆర్థికంగా పురోభివృద్ధి చేకూర్చడమే కాకుండా, పలువురుకి ఆరోగ్యం అందిస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు మరింత సహకారం అందించాలి. – సవర రమేష్, కేరాసింగి గ్రామం, మెళియాపుట్టి మండలం గిరిజనులు అధిక శాతం అల్లం పంట పండిచే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. చాలా మంది రైతులకు దీని లాభాలు తెలియజేశాం. రైతులకు అన్నివిధాలుగా.. ఆర్థిక సహకారం అందేందుకు ఉద్యానవన పంటలు పండించాలి. గిరిజనులకు ప్రాధాన్యత కలిగిన మరిన్ని రకాలు చిరు ధాన్యాలు పండించేందుకు కూడా కృషి చేస్తున్నాం. – మంగమ్మ, ఉద్యాన శాఖ అధికారి, పాతపట్నం -
ప్రాణం పోసిన రిమ్స్ వైద్యులు
శ్రీకాకుళం: నగరంలో రిమ్స్ సర్వజన ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో ఇద్దరు రోగులకు అత్యంత క్లిష్టమైన చికిత్స చేసి వైద్యులు ప్రాణం పోశారు. వివరాల్లోకి వెళ్తే.. వనజ సాయిశ్రీ అనే 22 ఏళ్ల మహిళ తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని సీహెచ్సీలో ప్రసవం చేయించుకుంది. అనంతరం గత నెల జనవరి 27వ తేదీన వేకువజామున 5 గంటలకు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తీవ్ర రక్తస్రావంతో వచ్చింది. అప్పటికే డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీ ప్రియ రోగిని పరీక్షించారు. ప్రసవానంతరం ఆమెకు గర్భసంచి సైతం బయటకు వచ్చినట్లు గుర్తించారు. దీంతో రోగి పరిస్థితిని ఇన్చార్జి ఆర్.పద్మజ, అసోసియేట్ ప్రొఫెసర్ సురేష్ కుమార్లకు తెలియజేశారు. అనంతరం వైద్యులంతా పరిశీలించి నాణ్యమైన వైద్యాన్ని అందించారు. దీంతో వనజ సాయిశ్రీ ప్రస్తుతం కోలుకున్నారు. అలాగే హెచ్వోడీ డాక్టర్ డి.పార్వతి నేతృత్వంలో మరో మహిళకు చికిత్స అందజేసి ప్రాణాలు కాపాడారు. నందిగామ మండలంలోని చిన్న గురువూరుకు చెందిన జగదీశ్వరి అనే మహిళకు టెక్కలి ఆస్పత్రిలో ప్రసవం అయింది. అయితే ఆమెకు తీవ్ర రక్తస్రావం జరగడంతో శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆక్సిజన్ అందిస్తూ 20 మంది వైద్యులు 6 గంటల పాటు శ్రమించి చికిత్స అందించడంతో కోలుకుంది. దీంతో ప్రసూతి విభాగం వైద్యులను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్, ఆర్ఎంవో డాక్టర్ సుభాషిణి, డిప్యూటీ ఆర్ఎంవో డాక్టర్ శ్రీదేవిలు అభినందించారు -
పిచ్చికుక్క స్వైర విహారం
● పలువురిపై దాడి టెక్కలి రూరల్: మండలంలోని నర్శింగపల్లి, కిట్టాలపాడు, ముఖలింగాపురం గ్రామాల్లో బుధవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ కనిపించిన వారిపై దాడికి పాల్పడింది. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం ఉదయం కిట్టాలపాడు గ్రామానికి చెందిన మోద అప్పారావు అనే వ్యక్తి గ్రామంలో తిరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న పిచ్చికుక్క అతడి కాలిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. అదే కుక్క నర్సింగపల్లి గ్రామం వైపుగా వెళ్తూ అక్కడ సైతం సింగుపురం పాపారావు, రట్టి లక్ష్మణరావు, నాగవరపు మణికంఠతో పాటు మరికొంత మందిపై దాడి చేసింది. అలాగే ముఖలింగాపురం గ్రామంలో సైతం కొంతమందిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. కుక్కకాటుకి గాయపడిన వారిలో 9 మంది వరకు టెక్కలి జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా మంగళవారం సైతం కొల్లివలస గ్రామంలో కూడా ఇదే పిచ్చికుక్క కొంత మందిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఈ కుక్క ఇంక ఎంతమందిపై దాడి చేస్తుందోనని బయపడిన గ్రామస్తులు హతమార్చినట్లు తెలుస్తోంది. -
వ్యాయామ విద్యాభివృద్ధికి కృషి చేయాలి
ఇచ్ఛాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులంతా వ్యాయామ విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(ఐపీఈ) ఆంధ్రప్రదేశ్ ఎండీ మహబూబ్బాషా అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వ్యాయామ విద్యపై పర్యవేక్షణ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వ్యాయామ ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయులంతా సమయపాలన పాటించడంతో పాటు నిబద్ధతతో పనిచేస్తూ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. విద్యార్థుల్లో దాగున్న క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు పి.తవిటయ్య, జోన్–1 వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.పద్మనాభం రెడ్డి, పి.గజేంద్ర, హెచ్ఎంలు కె.సూర్యారావు, కె.హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
రూ.
అరసవల్లి ఆదిత్యుడి ఆదాయం 1,35,14,879 అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ హుండీ కానుకల లెక్కింపు బుధవారంతో పూర్తయ్యింది. రెండు రోజులుగా ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో కానుకల లెక్కింపు జరుగుతుండగా బుధవారం మొత్తం నగదు, చిల్లర కలుపుకుని రూ.33,49,379 ఆదాయం లభించింది. మంగళవారం లెక్కింపులో లభించిన ఆదాయం కలిపితే మొత్తం రూ.1,35,14,879 ఆదాయం లభించిందని ఈఓ వివరించారు. అనివెట్టి మండపంలో జరిగిన ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, పలు ఆలయాల ఈవోలు జి.గురునాథరావు, మునగవలస సుకన్య తదితరులు పాల్గొన్నారు. -
లెక్కలు చెప్పండి సార్..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇటీవల జరిగిన రథసప్తమి వేడుకలకు ప్రభుత్వం పైసా నిధులు కూడా విదల్చకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు దాతలపై భారం వేశారు. అధికారికంగా డొనేషన్లు అడిగారు. ఫండ్స్ సేకరణకు ఎనిమిది మంది అధికారులతో ప్రత్యేక కమిటీ వేశారు. వీరికి తోడు ప్రజాప్రతినిధులు నేరుగా ఫోన్లు చేసి, సమావేశాలు నిర్వహించి విరాళాలు సేకరించారు. అసలెంత వచ్చాయి? వచ్చిన దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు? ఇంకా ఎంత మిగిలింది? ఇప్పుడీ వివరాలు వెల్లడిస్తే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వాటిని పారదర్శకంగా వెల్లడించాల్సిన అవసరం అధికారులపై ఉంది. జనం సొమ్ముతో ఘనంగా సంబరాలు నిర్వహించారని, అదే స్ఫూర్తితో ఆ సంబరాలకు సహకరించిన ప్రముఖుల వివరాలు ప్రకటిస్తే అంతా సవ్యంగా జరిగినట్టు అవుతుందనే వాదన వినిపిస్తోంది. గతేడాది సేకరించిన విరాళాలకు సంబంధించి వివరాలు వెల్లడించకపోవడంతో అనేక ఆరోపణలకు తావిచ్చాయి. మరోసారి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏడు రోజులకు పెంచినా.. ఈసారి రథసప్తమి వేడుకలను ఏడు రోజులకు పెంచారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయించారు. ఈసారీ చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. రథసప్తమి వేళ నగరంలో అభివృద్ధి పనులకు మున్సిపల్ మంత్రి నారాయణ రూ.2 కోట్లు విడుదల చేసినట్టు ప్రకటించారు. ఆ ప్రకటనపై కూడా హడావుడి చేశారు. ఎమ్మెల్యేను ప్రశంసిస్తూ కథనాలు కూడా రాయించుకున్నారు. కానీ, ఆ రూ.2 కోట్లు విడుదల కాలేదు. ప్రకటనకే పరిమితమైంది. ఇక, సంబరాల కోసమైతే చెప్పనక్కర్లేదు. చిల్లి గవ్వ ఇవ్వలేదు. ఈసారి కూడా జనం సొమ్ముతో చేయాలని నిర్ణయించారు. ఆమేరకు ప్రమఖులతో సమావేశాలు పెట్టారు. ప్రజాప్రతినిధులు నేరుగా ఫోన్లు చేసి, పండగకు సహకరించాలని కోరారు. ఒకవిధంగా డొనేషన్ల కోసం ఒత్తిడి కూడా చేశారు. అంతటితో ఆగలేదు. వివిధ రంగాల నుంచి ఫండ్స్ సేకరణకు ఎనిమిది మంది అధికారులతో ప్రత్యేక కమిటీ వేశారు. అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వారి పరిధిలో ఉన్న ప్రముఖులు, వర్తకులు, వైద్యులు.. ఇతరత్రా వర్గాల నుంచి నిధులు సేకరించేందుకు తమదైన శైలిలో ప్రయత్నించారు. మొత్తానికి సిక్కోలు దేవుడు పండగ అని అంతా సహకరించారు. సంబరాల కోసం విరాళాలు ఇచ్చారు. తమన్ మ్యూజికల్ నైట్, రథసప్తమి దర్శనాల రోజున నకిలీ పాసుల బాగోతంతో ఇబ్బందులకు గురి చేసినా సంబరాలు మాత్రం బాగానే జరిగాయి. ఇందుకు కారణమైన దాతల వివరాలు మాత్రం నేటికీ వెల్లడించలేదు. ఒకవేళ దాతలు ఎవరైనా తమ పేర్లు బయటికి చెప్పొద్దని అంటే.. వారి పేర్లు మినహాయించి వెల్లడించాల్సిన అవసరం ఉంది. కనీసం ఎంత వచ్చింది? ఎంత ఖర్చు పెట్టారు? దేనికెంత ఖర్చు అన్నది ప్రకటిస్తే పారదర్శకం అవుతుంది. ఎందుకంటే, ఎవరి స్థాయిలో వారు విరాళాల సేకరణకు కృషి చేశారు. ఎవరి ద్వారా ఎంత వచ్చింది? మన దగ్గర ఏదైనా పండగ చేయాలంటే దాతలు ఏ స్థాయిలో ముందుకొస్తారో? భవిష్యత్లో ఒక అంచనాకు రావడానికి దోహదపడుతుంది. అంతేకాదు ఎటువంటి అపోహాలకు, అనుమానాలకు, ఆరోపణలకు తావివ్వకుండా ఉంటుంది. రథసప్తమి వేడుకలకు భారీగా ఫండ్ సేకరణ జనం సొమ్ముతో సంబరాల నిర్వహణ అధికారికంగానే నిధులు సేకరణ ఎవరెంత ఇచ్చారో వెల్లడిస్తేనే పారదర్శకత గతేడాది నిధులకూ నేటికీ లెక్క చెప్పని వైనం పైసా విదల్చని ప్రభుత్వం.. గతేడాది రఽథసప్తమి వేడుకలను రాష్ట్ర పండగగా ప్రభుత్వం ప్రకటించింది. మూడు రోజుల పండగను ఆర్భాటంగా చేసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదు. నగరంలో జరిగిన పనులు సైతం కార్పొరేషన్, సుడా నిధులతో కానిచ్చేశారు. వాటికింత వరకు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆ పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగలేదు. వారంతా ఏడాదికి పైగా బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు. గత ఏడాది మూడు రోజుల సంబరాలన్నీ దాతల సొమ్ముతోనే జరిగాయి. వారిచ్చిన విరాళాలతోనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఖర్చు దాతలదే. వారి సొమ్ముతో సంబరాలు చేసి శభాష్ అన్పించుకున్న అధికారులు, పాలకులు.. దాతలు, ఖర్చు వివరాలు అధికారికంగా ప్రకటించలేదు. -
సీఆర్పీఎఫ్ ఉద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు
జలుమూరు: మండలంలోని చిన్న దూగాంనకు చెందిన సీఆర్పీఎఫ్ ఉద్యోగి దుంగ వల్లయ్య తనపై దాడిచేసి గాయపరిచినట్లు అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త, సామాజిక కార్యకర్త రావాడ హిమంత్ బుధవారం పబ్లిక్ గ్రీవెన్స్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024లో వల్లయ్య అనే సీఆర్పీఎఫ్ ఉద్యోగి పలు అక్రమాలకు పాల్పడడం, మోసాలు చేయడంతో ఈయనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో రిట్ వేశానన్నాడు. ఇటీవల కోర్టు రిట్ను స్వీకరించినట్లు వల్లయ్యకు నోటీసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరిగితే తన ఉద్యోగానికి ముప్పు వాటిళ్లుతుందనే భయంతో రిట్ పిటిషన్ వాపస్ చేసుకోవాలని వల్లయ్య ఒత్తిడి తెచ్చాడన్నారు. దీనికి తాను నిరాకరించడంతో దాడిచేసి గాయపరిచాడని తెలిపారు. దాడిలో తనకు ముఖం, కంటిపై గాయాలయ్యాయని పేర్కొన్నారు. దీంతో చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్లో చేరానన్నాడు. అలాగే టెక్కలి డీఎస్సీని కూడా కలిసి వల్లయ్యపై ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. దీనిపై హెచ్సీ రాజశేఖర్ మాట్లాడుతూ చిన్నదూగం వెళ్లి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లారీ – కారు ఢీ టెక్కలి రూరల్: మండలంలోని బొప్పాయిపురం గ్రామ జాతీయ రహదారిపై బుధవారం రెండు వాహనాలు ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గార ప్రాంతానికి చెందిన కారు టెక్కలి మండలం బొప్పాయిపురం వద్దకు వచ్చేసరికి అదే మార్గంలో వెళ్తున్న లారీని ఓవర్టెక్ చేయబోయి అదుపుతప్పి లారీని ఢీకొంది. దీంతో కారు సమీప డివైడర్ పైకి దూసుకుపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. విద్యుత్ షాక్తో ఇద్దరికి గాయాలు వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని కొండవూరు గ్రామానికి చెందిన ఒక మహిళ, చిన్నారి విద్యుత్ షాక్కు గురై తీవ్రగాయాలు పాలయ్యారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అద్ది సింహాచలం, ధనలక్ష్మిల రెండేళ్ల బాబు భువన్ మంగళవారం రాత్రి డాబాపై ఆడుతూ విద్యుత్ తీగలకు తాకి ఉన్న ఇనుప చువ్వను పట్టుకోవడంతో ప్రమాదానికి గురయ్యాడు. దీంతో వాళ్ల నాన్నమ్మ తులసమ్మ చిన్నారిని కాపాడే ప్రయత్నంలో అమె కూడా విద్యుత్ ఘాతానికి గురైంది. దీంతో క్షతగాత్రులను పూండిలోని ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలి శ్రీకాకుళం కల్చరల్: పలు ప్రాంతాల్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలని వైఎస్సార్సీపీ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డా.ప్రత్తి అన్వేష్ అన్నారు. నగరంలోని ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో జిల్లాలో ఉన్న బాప్టిస్ట్ చర్చి దైవ సేవకులందరూ బిషప్.రెవరెండ్.డా.కొత్తపల్లి అబ్రహం ఆధ్వర్యం బుధవారం సమావేశమయ్యారు. దీనిలో భాగంగా క్రైస్తవుల మీద, దైవ సేవకులు మీద, చర్చిల మీద జరుగుతున్న దాడులు, వ్యతిరేక ప్రచారాలపై చర్చించారు. భవిష్యత్లో జిల్లాలో ఉన్న క్రైస్తవ దైవ సేవకుల సంఘాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గడ్డిమందు తాగి వృద్ధుడు మృతి పొందూరు: మండలంలోని తానెం గ్రామానికి చెందిన బాకి పాపినాయుడు(65) గడ్డి మందు తాగి మృతి చెందినట్లు బుధవారం ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 2వ తేదీన మద్యం మత్తులో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
తాగునీరు అందించేందుకు చర్యలు
కవిటి: మండలంలోని కొత్తపాలెం గ్రామంలో తాగునీటి సమస్యకు సంబంధించి ‘ఏం నేరం చేశామని ఈ శిక్ష’ శీర్షికతో జనవరి 28వ తేదీన సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనంపై అధికారులు పటిష్టమైన చర్యల దిశగా అడుగులు వేశారు. ఈ మేరకు కవిటి గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి రూ.3.6 లక్షల వ్యయంతో 15,000 లీటర్ల అండర్ గ్రౌండ్ సంప్ నిర్మాణానికి ఎమ్మెల్యే అశోక్, సర్పంచ్ పూడి లక్ష్మణరావులు బుధవారం భూమిపూజ చేశారు. త్వరలో ఈ పనులు పూర్తిచేసి తాగునీరు అందించేవిధంగా చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి ఎంపీడీవో కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. అనుమానాస్పదంగా ఆర్మీ హవల్దార్ మృతిమందస: మండలంలోని రాధాకృష్ణపురం గ్రామానికి చెందిన ఆర్మీ హవల్దార్ లోళ్ల జోగారావు(36) బుధవారం హరిపురం రైల్వే లైన్ సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు జోగారావు ప్రస్తుతం జమ్ముకాశ్మీర్లో దేశానికి సేవలు అందిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియలేదు. విషయం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవపంచనామ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని కొండవూరు గ్రామానికి చెందిన యువకుడు, పశు పెంపకందారుడు కొల్లి నాగేశ్వరరావుపై బుధవారం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కారంతో దాడి చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. తనకు ఉన్న పశువుల శాలలో ఉదయం పాలు తీస్తుండగా.. ఒక వ్యక్తి వచ్చి తనకు పాలు కావాలని అడుగుతూ ఒక్కసారిగా దాడికి పాల్పడినట్లు తెలిపాడు. అయితే అప్పటికే కొంతమంది వ్యక్తులు కారులో దాడి చేసేందుకు మాటు వేసినట్లు తాను గమనించినట్లు బాధితుడు వెల్లడించాడు. ఇంతలో పాల కోసం తన వద్దకు వచ్చిన దుండగుడు ఒక్కసారిగా తన కళ్లలో కారం కొట్టి దాడి చేసే ప్రయత్నం చేయడంతో తాను తప్పించుకున్నట్లు చెప్పాడు. ఇది గమనించిన దుండగులు కారులో పరారయ్యారని పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నాగేశ్వరరావుపై జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడింది. -
అందుబాటులో ఆక్వా ల్యాబ్లు
అరసవల్లి: జిల్లాలోని ఆక్వా ల్యాబ్ల్లో రైతులకు వివిధ రకాల సేవలందిస్తున్నామని మత్స్యశా ఖ డిప్యూటీ డైరెక్టర్ వై.సత్యనారాయణ బుధవారం తెలిపారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో ఉన్న ల్యాబ్తో పాటు నరసన్నపేట, టెక్కలి, సోంపేట, పలాసలలోని ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్లలో నీటి విశ్లేషణ పరీక్షలు, పీహె చ్ ఉష్ణోగ్రత, టీడీఎస్, లవణీయత, అమ్మో నియో, మట్టి పీహెచ్ తదితర పరీక్షలకు నిర్ణీత రుసుం చెల్లించి ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. కొత్తగా చేపలు, రొయ్యిల చెరువుల రిజిస్ట్రేషన్ల కోసం సచివాలయాల్లో మత్స్య సహాయకులను సంప్రదించాలని కోరారు. మద్యం బెల్టుషాపులపై ఎకై ్సజ్ దాడులు ● బొడ్డపాడుకాలనీలో వ్యక్తి అరెస్టు ● మద్యం బాటిళ్లు స్వాధీనం పలాస: వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో బుధవారం పలాస ఎకై ్సజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పలాస మండలం బొడ్డపాడు కాలనీలో బెల్టు షాపు నిర్వహిస్తున్న మామిడి పాపారావును అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ‘ కల్తీ మద్యం తాగి ప్రాణాలు పోతున్నాయి’ అనే శీర్షికతో సాక్షి మెయిన్ ఎడిషన్లో బుధవారం ప్రచురితమైన కథనానికి ఎకై ్సజ్ అధికారులు స్పందించారు. అక్కుపల్లి, బొడ్డపాడు కాలనీ, గరుడఖండి, అల్లుకోల తదితర గ్రామాల్లో పర్యటించి మద్యం దుకాణాలపై పలాస ఎకై ్సజ్ సీఐ కె.మల్లికార్జునరావు, సిబ్బంది సూర్యారావు, సింహాచలం తదితరులు తనిఖీలు చేశారు. కాగా, బెల్టుషాపుల నిర్వాహకులకు ముందుగానే ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలకు వస్తున్నట్టు సమాచారం చేరవేయడంతో బెల్టుషాపుల నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసతి గృహంలో మెనూపై ఆరా మెళియాపుట్టి: మండల కేంద్రం మెళియాపుట్టికి సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న భరణికోట గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని సీతంపేట ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూపై ఆరా తీశారు. వసతి గృహం పరిసరాలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఇన్చార్జి హెచ్ఎం వాసంతికి సూచించారు. ఇటీవల డిప్యూటీ డీఓ నారాయుడు వసతిగృహాన్ని సందర్శించిన నేపథ్యంలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదనే ఫిర్యాదు రావడంతో పీఓ ఇక్కడికి సందర్శనకు వచ్చినట్లు తెలిసింది. పరిశ్రమల్లో భద్రతపై రాజీవద్దు శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలోని రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలులో రాజీపడవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షోభ నివారణ బృందం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ సిఫార్సులను యుద్ధప్రతిపాదికన అమలు చేయాలన్నారు. పైడిభీమవరంలోని శ్రేయాస్ ఇండస్ట్రీస్లో మిథనాల్ నిల్వ సామర్థ్యాన్ని కమిటీ పరిశీలించాలన్నారు. పరిశ్రమల్లో విష వాయువుల లీకేజీని గుర్తించేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిరంతరం నిఘా ఉంచాలని, అత్యవసర సమయాల్లో స్పందించేందుకు వీలుగా ఆన్–సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. పరిశ్రమల్లో ప్రమాదాలపై సమీప గ్రామాల ప్రజలకు, కార్మికులకు అవగాహన కల్పించడంతో పాటు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్లకు జిల్లా అగ్నిమాపక అధికారి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో విశాఖపట్నం ఫ్యాక్టరీల జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ జె.శివశంకర్ రెడ్డి, జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ బి.రాంబాబు, డీఐసీ జనరల్ మేనేజర్ రఘునాథ్, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బిల్లు బాదుడు తప్పదా!
● ఐదు రోజులుగా సమ్మెలో విద్యుత్ మీటర్ల రీడర్లు ● స్లాబ్ పెరిగి బిల్లులు అధికమయ్యే అవకాశాలు ● తీవ్ర ఆందోళనలో వినియోగదారులు అరసవల్లి : కూటమి ప్రభు త్వం వచ్చాక ఇప్పటికే మూడు సార్లు విద్యుత్ చార్జీలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన సామాన్యులు.. తాజాగా మరో బాదుడు తప్పదనే సంకేతాలతో ఆందోళనకు గురవుతున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ మీటర్ రీడర్లు ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వారు సకాలంలో రీడింగ్ తీయకపోవడంతో స్లాబ్ పెరిగితే.. యూనిట్ చార్జీలు పెరుగుతాయని వినియోగదారులు ఆందోళనలో ఉన్నారు. పెనుభారం.. వాస్తవానికి ప్రతి నెలా 2 నుంచి 10వ తేదీలోగా గృహ విద్యుత్మీటర్ల వినియోగ రీడింగ్ను తీయాల్సి ఉంది. నేటికి ఐదు రోజులుగా రీడింగ్కు ఎవ్వరూ రాకపోవడంతో విద్యుత్ వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి నెలా 10లోగా మీటర్ రీడింగ్ తీస్తే అప్పుడున్న వినియోగం బట్టి యూనిట్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 0–50 యూనిట్లు లోపు వినియోగానికి యూనిట్కు రూ.1.50, అదే 50–75 యూనిట్ల లోపు అయితే రూ.3 చొప్పున, 76–125 యూనిట్ల లోపు ఉంటే రూ.4.50 వరకు చార్జీ చేస్తారు. అదే 126–225 యూనిట్లు ఉంటే రూ.6 వరకు చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా రీడర్ల సమ్మెతో రీడింగ్ ఆలస్యమైతే..స్లాబ్కు మించి ఒక యూనిట్ దాటినా భారీగా విద్యుత్ బిల్లులు వచ్చే అవకాశాలున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇదీ పరిస్థితి జిల్లాలో విద్యుత్ శాఖలో మొత్తం 6 లక్షల వరకు గృహ విద్యుత్ కనెక్షన్లున్నాయి. ప్రతి నెల వీటి నుంచి సుమారుగా రూ.32 కోట్ల నుంచి రూ.35 కోట్లు వరకు డిమాండ్ ప్రకారం బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్లలో ఈమేరకు విద్యుత్ మీటర్ల రీడర్లు 207 మంది ఉన్నారు. రీడింగ్ మిషన్లు ఛార్జీలు, ఫోన్ రీఛార్జ్, రీడింగ్ పేపర్ రోల్స్, మరమ్మతులు, ఈఎస్ఈ, ఈపీఎఫ్ మినహాయింపులు పోగా ఒక్కో రీడర్కు ఒక్కో మీటర్ నుంచి రూ.3.10 మాత్రమే అందుతుంది. సగటున ఒక రీడర్ నెలకు 3 వేల మీటర్లను రీడింగ్ చేస్తే నెలకు ఆదాయం రూ.10 వేల లోపే వస్తుంది. డిమాండ్లు ఇవే.. స్మార్ట్మీటర్లు తీసుకొచ్చిన తరుణంలో మీటర్ రీడర్లకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. రీడర్ల విద్యార్హతల బట్టి విద్యుత్ శాఖలో టెక్నికల్, నాన్ టెక్నికల్ షిఫ్ట్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వాచ్మేన్లు, అటెండర్లు వంటి పోస్టుల్లో నియమించాలి. ఎస్క్రో ఖాతా తెరిపిస్తామన్న హామీ నెరవేర్చాలి. సమస్యలు పరిష్కరించాల్సిందే.. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు మీటర్ల రీడర్ల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సమ్మె చేస్తున్నాం. హామీలను నెరవేర్చి ప్రత్యామ్నయ ఉపాధి కల్పించేవరకు పోరాడతాం. – మామిడి బాలకృష్ణ, జిల్లా విద్యుత్ మీటర్ల రీడర్ల సంఘం ప్రతినిధి ప్రత్యామ్నాయం అమలు చేస్తున్నాం... రీడర్లు సమ్మెలో ఉండడంతో సదరు క్రాంట్రాక్టర్లు నుంచి 160 స్కానర్లు, 160 ప్రింటర్లు అందుబాటులోకి తీసుకున్నాం. 250 మందికి పైగా లైన్మేన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, జేఎల్ఎంల సహాయంతో ఇంటింటి వినియోగ బిల్లుల రీడింగ్ను సకాలంలో తీయించేలా చర్యలు చేపడుతున్నాం. – నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఎస్ఈ -
సర్వం అక్రమాల మయం
● ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ కొన్నట్లు నమోదు ● అక్రమార్కులకు భారీ లబ్ధి సిక్కోలుకు ఒడిశా ధాన్యం ● జిల్లా రైతుకు సున్నంసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒడిశా నుంచి జిల్లాకు ధాన్యం అక్రమ రవాణా ఆగడం లేదు. అక్కడ కొనుగో లు చేసిన ధాన్యాన్ని జిల్లాలో కొనుగోలు చేసినట్టుగా లెక్కల్లో చూపిస్తున్నారు. ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను పొందుతున్నారు. కొందరు మిల్లర్లు, దళారులు కుమ్మకై ్క అక్రమ దందా సాగిస్తూనే ఉన్నారు. దీనికి కొందరు కొనుగోలు కేంద్రాల సిబ్బంది సహ కరిస్తున్నారు. అక్రమంగా కొనుగోలు చేసిన ధాన్యా నికి చట్టబద్ధత కలిగిస్తున్నారు. వాస్తవంగా జిల్లాలో ఎక్కడికక్కడ కొనుగోలు చేయని ధాన్యం రైతుల వద్ద ఉంది. లక్ష్యాలు అయిపోయాయని కొందరు మిల్లర్లు, బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వక మరికొందరు మిల్లర్లు కొనుగోలు చేయడం లేదు. కానీ, తక్కువ ధరకు దొరికే ఒడిశా ధాన్యాన్ని మాత్రం ఇక్కడ ఆన్లైన్ చేసి దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు అంతా ఒక మిస్టరీగా మారిపోయింది. రైతుల కళ్లాల్లో ధాన్యపు రాశులు కనబడుతుంటాయి. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసినట్టు లెక్కలు కనిపిస్తాయి. కొనుగో లు చేసిన ధాన్యమంతా ఎక్కడదని ఆలోచిస్తే అదో రహస్యంలా అనిపిస్తోంది. ధాన్యం కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్టు రికార్డులో చూపిస్తూ, వాటికి ట్రక్షీట్ జారీ చేస్తూ, సీఎంఆర్ కోసం మిల్లుకు పంపించినట్టు, మిల్లులు కూడా వచ్చిన ధాన్యాన్ని ఆడించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇచ్చినట్టు సైక్లింగ్ ప్రక్రియ అంతా సాగిపోతోంది. ఒడిశా నుంచి తీసుకొచ్చిన ధాన్యాన్ని ఇక్కడ రైతుల వద్ద కొనుగోలు చేసినట్టుగా చూపించి, రికార్డుల్లో కౌలు రైతులు తీసుకున్న భూముల వివరాల్లో ఆన్లైన్ చేసి, వాటికి ట్రక్షీట్ జారీ చేసి, మిల్లులకు తరలించినట్టు జిమ్మిక్కు చేస్తున్నారు. ఇదంతా పథకం ప్రకారం జరుగుతోంది. దళారులు, మిల్లర్లు కుమ్మకై ్క చేస్తున్న బాగోతమిది. వీటికి తోడు రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చినఽ ధాన్యాన్ని తేమ శాతం, నూకలు పేరుతో 5 నుంచి 10 కిలోలు వరకు అదనంగా తీసుకుని దోపిడీ చేస్తున్న సంగతి ఇక చెప్పనక్కర్లేదు. రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని ఆడించి సీఎంఆర్ ఇవ్వాల్సిన స్థానంలో పీడీఎస్ బియ్యం ఇస్తారన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. ఇలా జరగాలి.. వాస్తవంగా మిల్లుల వద్ద రెండు రకాల ధాన్యం ఉండాలి. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని ‘ఏ’ రిజిస్టర్లో నమోదు చేసి, ఆ ధాన్యానికి బదులు సీఎంఆర్ ఇవ్వాలి. చెప్పాలంటే సవ్యంగా జరిగిన ప్రక్రియ అని చెప్పాలి. ఇక, మిల్లర్లు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది. కాకపోతే, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. అలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ‘బి’ రిజిస్టర్లో నమోదు చేయాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు అఽధికారులు తనిఖీలు చేసి పరిశీలించాలి. ● ఆ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. రైతుల విస్తీర్ణంలో మాయ చేసి మద్దతు ధర కొట్టేస్తున్నారు. ● తాజాగా ఎల్ఎన్పేట మండలం స్కాట్పేట వద్ద పట్టుబడ్డ లారీ కూడా అలాంటిదే. ఒడిశాలో కొనుగోలు చేసిన ఽరూ.7లక్షల విలువైన ధాన్యాన్ని అక్రమంగా లారీలో ఒక రైస్మిల్లుకు తీసుకొస్తూ జిల్లా అధికారులకు పట్టుబడ్డారు. ● వాస్తవంగా జిల్లాలో ఇప్పటికే 6.70లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిగిపోయాయి. మరో 70వేల మెట్రిక్ టన్నుల వరకు లక్ష్యాల మేర కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది కాకుండా మరో లక్ష మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం రైతుల వద్ద ఉంది. ఏ, బీ రిజిస్టర్ల ప్రకారం కొనుగోలు చేయాలి. కానీ ఇక్కడైతే మద్దతు ధర రైతులకు ఇవ్వాల్సి వస్తుందని, ఒడిశాలో తక్కువ రేటుకు కొని ఇక్కడ మద్దతు ధరకు అమ్మి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. -
● రూ.7 లక్షల విలువైన ధాన్యం లారీ పట్టివేత
హిరమండలం: ఎల్ఎన్పేట మండలం స్కాట్పేట వద్ద మంగళవారం ఓ అనూహ్య ఘటన జరిగింది. ఓ మిల్లుకు ధాన్యం లోడుతో వచ్చిన లారీ రోడ్డు పక్కనే నిలబెట్టి ఉంది. ఆ సమయంలో పౌరసరఫరాల శాఖ డీఎం టీ.వేణుగోపాలరావు అటువైపుగా వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించిన లారీని పరిశీలించారు. ఎక్కడకు తీసుకొచ్చారని డ్రైవర్ను అడగ్గా స్థానిక రైస్మిల్లుకు తీసుకొచ్చినట్టు తెలిపాడు. కానీ అందుకు తగ్గ పత్రాలేవీ లేవు. పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ లారీ లోడు ధాన్యాన్ని స్థానిక తహసీల్దార్ ఈశ్వరమ్మ, వీఆర్వో రమణమ్మలకు అప్పగించి పోలీస్స్టేషన్కు తరలించాలని ఆదేశించారు. లారీలో రూ.7 లక్షల విలువైన ధాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రూ.కోటి దాటిన హుండీ కానుకల ఆదాయం
● అరసవల్లిలో నేడు కూడా కొనసాగనున్న హుండీ ఆదాయం లెక్కింపు ప్రక్రియ అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ హుండీ కానుకల లెక్కింపులో రికార్డు స్థాయిలో 60 రోజులకు గాను రూ.కోటికి మించి ఆదాయం లభించింది. తొలిరోజు మంగళవారం జరిగిన లెక్కింపులో మొత్తం రూ. 1,01,65,500 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ తెలియజేశారు. గత రెండు నెలల నుంచి ఆలయంలోని 19 హుండీల్లో లభించిన భక్తుల కానుకలను అనివెట్టి మండపంలో గట్టి భద్రత నడుమ లెక్కింపు చేపట్టారు. ఈ మేరకు నగదుతో పాటు బంగారం 30 గ్రాములు, వెండి 1700 గ్రాముల వరకు కానుకలు లభించినట్లుగా తెలియజేశారు. తొలిరోజు 17 హుండీలను తెరిపించగా బుధవారం మిగిలిన హుండీలను తెరిపించడంతో పాటు చిల్లరను కూడా లెక్కించనున్నామని ఈఓ తెలిపారు. -
పొన్నాడలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ
ఎచ్చెర్ల: మండలంలోని పొన్నాడ గ్రామంలో పాఠశాల సమీపంలోని 255 సర్వే నంబర్ కలిగిన ప్రభుత్వ స్థలాన్ని స్థానికులు కొంతమంది ఆక్రమించుకుంటున్నారు. ఇక్కడ ఉన్న సు మారు రెండెకరాల చెరువు గర్భంలో మొక్కలు వేస్తామంటూ స్థలాన్ని చదును చేస్తున్నారు. ఆ స్థలాన్ని పాఠశాల మైదానం కోసం గతంలో ఇక్కడ ప్రజాప్రతినిధులు అడిగితే ఇది ప్రభు త్వ స్థలమని అధికారులు ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే వారి ప్రోద్భలంతో గ్రామానికి చెందిన కొందరు ఇది తమ స్థలమని చదును చేసేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై వీఆర్ఓ మురళీని వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ తమ దృష్టికి రాలేదని, క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎంఆర్ఓ గోపాల్ మాట్లాడుతూ ఇది చెరువు గర్భమని, పరిశీలిస్తామని అన్నారు. ఇందులో ఆక్రమణలు చేపడితే చర్యలు తీసు కుంటామని అన్నారు. గతంలో ఇక్కడ పనులు చేపడితే తాము అడిగామని, చెరువు క్లీన్ చేసి చెత్తను భోగి మంటలో వేస్తామని వారు చెప్పారని పేర్కొన్నారు. -
శాంతిభద్రతలు క్షీణించాయి
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దర్యాప్తు సంస్థల నివేదికలు కూడా కాదని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. వీరి బుద్ధి మారాలని ఆలయాల్లో పూజలు చేసినా వారి మనసులోని నీచమైన ఆలోచనలు మారడం లేదు. – తమ్మినేని చిరంజీవి నాగ్, వైఎస్సార్ సీపీ యువనేత, –దుంపల లక్ష్మణరావు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, – కేవీజీ సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి (ఆమదాలవలస పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం..) -
ఉచితం.. అత్యల్పం!
హిరమండలం: జిల్లాలో ఉచిత గ్యాస్ పథకం ప్రహసనంలా మారింది. అధికారంలోకి వస్తే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 2024 అక్టోబరులో దీపావళికి కానుకగా ఈ పథకాన్ని మన జిల్లాలోనే ప్రకటించారు. అక్కడ నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒక గ్యాస్ సిలెండర్ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఈ లెక్కన ఇప్పటివరకూ ప్రతి కుటుంబానికి ఐదు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించాలి. కానీ ఒకటి రెండుసార్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అది కూడా కొంతమంది, కొన్ని ఏజెన్సీలకు మాత్రమే ఇచ్చారు. దీంతో ఉచిత గ్యాస్ పథకంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లలో గ్యాస్ నగదు పడకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమల్లో వైఫల్యం.. జిల్లాలో తెల్లరేషన్కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ ఉచిత గ్యాస్ పథకం వర్తిస్తుందని అప్పట్లో ప్రకటించారు. అప్పట్లో 4,95,793 మంది అర్హులుగా తేల్చారు. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఉచితంగా అందిస్తామని తెలిపారు. గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డోర్ డెలివరీ చేసే ఏజెన్సీకి వినియోగదారులు డబ్బులు చెల్లిస్తున్నారు. తరువాత ఒకటి రెండు రోజుల్లో సిలిండర్ నగదును వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్లలో వేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే చాలా మందికి సాంకేతిక కారణాలు చూపుతున్నారు. వేలిముద్ర పడలేదని.. వివరాలు సరిగ్గా అందించలేదని చెప్పడంతో గ్యాస్ ఏజెన్సీలతో పాటు అధికారులకు దరఖాస్తులు అందిస్తున్నారు. అయినప్పటికీ బ్యాంక్ అకౌంట్లలో రూపాయి కూడా జమకాలేదు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో హెచ్పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ సంస్థలకు చెందిన మొత్తం 37 ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ద్వారా 692825 లక్షల మంది వినియోగదారులు అన్ని పథకాల నుంచి గ్యాస్ కనెక్షన్లు పొంది ఉన్నారు. అయితే ఉజ్వల, దీపం వంటివన్నీ తెల్ల రేషన్కార్డు ఉన్నవారికే అందించారు. అటువంటప్పుడు లబ్ధిదారుల్లో కోత ఏంటనేది అంతుపట్టడం లేదు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ముందుగానే చెల్లింపులు చేస్తామని చెప్పింది. అయినా అమలుకావడం లేదు. లబ్ధిదారులకు కోత ప్రభుత్వం 2024 నవంబర్లో ఈ పథకాన్ని ప్రారంభించగా మొదటి విడతగా 435037 మందికి ఉచిత సిలిండర్లకు సంబందించిన నగదు జమచేశారు. రెండో విడతగా 408740 మందికి, మూడో విడతగా 352254 మందికి, నాలుగో విడతగా 191015 మంది లబ్ధిదారులకు మాత్రమే ఉచిత సిలిండర్ల నగదు జమ చేశారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: సీపీఎస్ రద్దు కోరుతూ రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సాగర్ ఘోష పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతున్నా సీపీఎస్ను ప్రస్తావించడం లేదని, ఎన్నికల ముందు ఏడాదిలోగా పరిష్కార మార్గం చూపిస్తామని హామీ ఇచ్చినట్లు గురచ్తు చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు హామీ మరచిపోయారన్నారు. ఇప్పటికే గత ఏడాది సెప్టెంబర్ 1న విజయవాడలో భారీ నిరసన తెలియజేశామని చెప్పారు. 26 జిల్లాల్లో సుమారు 2500 కిలోమీటర్ల మేర సీపీఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర చేసి కలెక్టర్లకు ఉద్యోగుల సమస్యపై వినతిపత్రాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఆ పోరాట ఫలితమే ఇటీవల డీఏల బకాయిల విడుదలయ్యాయని చెప్పారు. మార్చి 1న సీపీఎస్ ఉద్యోగుల సాగర ఘోష పేరు తో విశాఖపట్నం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన చేస్తామని తెలియజేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కౌన్సిలర్ పి.సూర్యచంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాబేళ్ల మృతికి వలలే కారణం ఎచ్చెర్ల : సముద్రతీర ప్రాంతంలో తాబేళ్లు మృత్యువాత పడటానికి మత్స్యకారులు వేసే వలలే కారణమని పొన్నాడ వెటర్నరీ అసిస్టెంట్ శ్రీసాయి ప్రసాద్ అన్నారు. స్కిడ్ నెట్, నానాజాతి వలలు, గిల్లెట్ నెట్, టేకువలల్లో తాబేళ్లు చిక్కుకుని మృతి చెందుతున్నట్లు చెప్పారు. బొంతలకోడూరు ప్రాంతంలో మంగళవారం శ్రీకాకుళం అటవీ పరిధి అధికారి, సిబ్బంది నిర్వహించిన విచారణలో విశాఖపట్నం నుంచి వచ్చే మెకానికల్ బోట్లు వల్ల కూడా తాబేళ్లు అధికంగా మృత్యువాత పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అటవీ, ఫిషరీష్, మైరెన్, ట్రీ ఫౌండేషన్, స్థానిక మత్స్యకారులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించడం అవసరమన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారి రాజశేఖర్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి వినోద్కుమార్, ట్రీ ఫౌండేషన్, అటవీసిబ్బంది పాల్గొన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలో సాంకేతిక సమస్య అని చెబుతున్నారు. కార్యాలయాలతో పాటు గ్యాస్ ఏజెన్సీకి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని చెబుతోంది. కానీ రకరకాల కారణాలు చెప్పి అందించడం లేదు. – బి.మురళీ, గ్యాస్ వినియోగదారుడు, తంప, హిరమండలం మా కుటుంబానికి తెల్ల రేషన్కార్డు ఉంది. అయినా ఉచిత గ్యాస్ సిలిండర్ అందడం లేదు. ఒకటి రెండు సార్లు మాత్రమే బ్యాంక్లో నగదు వేసినట్టూ చూపుతోంది. అయితే ముందుగా గ్యాస్ సొమ్ము అకౌంట్లో వేసి పథకం అమలు చేస్తే బాగుంటుంది. – పెనుమజ్జి పద్మావతి, గ్యాస్ వినియోగదారురాలు, యంబరాం గ్రామం జిల్లాలో ఉచిత గ్యాస్ పథకం అమలవుతోంది. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అయితే ఏవైనా తప్పిదాలు, సాంకేతిక సమస్యలు ఉన్నవారికే అందడం లేదు. అటువంటి వారు బ్యాంకులతో పాటు గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలను సంప్రదించాలి. – సూర్యప్రకాశ్, డీఎస్వో, శ్రీకాకుళం -
ముగిసిన జిల్లా స్థాయి గ్రిగ్స్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాలల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో గ్రిగ్స్ క్రీడా పోటీలను ప్రతీ ఏటా నిర్వహించేది శ్రీకాకుళం జిల్లా మాత్రమేనని రాష్ట్ర వ్యాయామ విద్య పరిశీలకుడు షేక్ మెహబూబ్ బాషా అన్నారు. శ్రీకాకుళం పీఎస్ఎన్ఎంహెచ్ స్కూల్ ఆధ్వర్యంలో స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బాలుర గ్రిగ్స్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. రెండోరోజు ఉదయం జరిగిన వివిధ క్రీడాంశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన బాషా మాట్లాడుతూ ప్రతిరోజు కనీసం గంటపాటు క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యంతో పాటు విద్యలో కూడా రాణించవచ్చన్నారు. కాగా, బాలుర జిల్లా స్థాయి గ్రిగ్స్ పోటీల్లో శ్రీకాకుళం రూరల్ మండలంలోని శాస్త్రులపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటి ఓవరాల్ చాంపియన్గా నిలిచారు. గేమ్స్ చాంపియన్షిప్ను ఎంజేపీఏపీ నరసన్నపేట విద్యార్థులు కై వసం చేసుకున్నారు. డీఎస్డీఓ ఎ.మహేష్బాబు విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రిగ్స్ జిల్లా కార్యదర్శి టి.శ్రీనివాసరావు, పీడీ–పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు పి.తవిటయ్య, ప్రధా న కార్యదర్శి ఎం.వి.రమణ, టోర్నీ ఆర్గనైజర్, హెచ్ఎం దేవదత్తానాంద్, పీడీ కె.మాధవరావు, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ ఎం.తిరుపతిరావు, ఎస్జీఎఫ్ కార్యదర్శి స్వాతి, జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, హెచ్ఎంలు కె.హరిబాబు, వై.పోలినాయుడు పీడీ, పీఈటీలు పాల్గొన్నారు. శాస్త్రులపేట పాఠశాల -
8న మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ కప్ సెలక్షన్ ట్రయల్స్ను ఈ నెల 8న నిర్వహిస్తున్నామని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్, ప్రధాన కార్యదర్శి మెట్ట అశోక్కుమార్ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం శాంతినగర్కాలనీలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టోర్నమెంట్తోపాటు రాష్ట్రపోటీల సెలక్షన్ ట్రయల్స్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణశెట్టి వెంకట కిరణ్కుమార్ మాట్లాడుతూ ఇక్కడ రాణించిన వెటరన్ క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేస్తామని చెప్పారు. విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఫీల్ షోరూమ్ అధినేత కేఎస్ మదీనా శైలానీ తన తండ్రి కేఎస్ సైఫుల్లా జ్ఞాపకార్థం స్పాన్షర్షిప్ అందిందేందుకు ముందుకు రావడం సంతోషదాయకమని చెప్పారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కేఎస్ మదీనా శైలానీ, గురుగుబెల్లి ప్రసాద్, బి.దామోదరరావు, ఎన్ఈ రత్నజీ. జి.అనిల్ కుమార్, ఎం.శాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
కాలయాపన చేస్తే సహించేది లేదు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● టెక్కలిలో రెవెన్యూ క్లీనిక్ ● వివిధ భూ సమస్యలపై 125 అర్జీలు స్వీకరణ టెక్కలి: భూ సమస్యల పరిష్కారంలో అధికారులు కాలయాపన చేస్తూ.. అర్జీదారులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. సోమవారం టెక్కలి సబ్ కలెక్టర్ ప్రాంగణంలో రెవెన్యూ క్లీనిక్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొన్ని రకాల కారణాలతో పరిష్కారం కాని భూ సమస్యలను పరిష్కరించే దిశగా రెవెన్యూ క్లీనిక్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ భూ సమస్యలపై 125 అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్వో వీఎస్ లక్ష్మణమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అర్జీలను పరిశీలిస్తే... ● టెక్కలి మండలంలోని అక్కవరం గ్రామానికి చెందిన కుమ్మరి మల్లేష్ తనకు చెందిన భూమి మరొకరి పేరును మారిపోయిందని, దానిని సరి చేయాలని కోరారు. ● కంచిలి మండలంలోని బూరగాం సమీపంలో రైల్వే ఫ్లై ఓవర్ వంతెన కోసం చేపట్టిన సర్వేలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జిరాయితీ స్థలంలో రాళ్లు పాతారని, దీనిపై న్యాయం చేయాలని బి.జయప్రసాద్ కోరారు. ● కొత్తూరు మండలంలోని మెట్టూరు గ్రామంలో ఉన్న గ్రామకంఠం ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేశారని, వాటిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్తో పాటు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ● తన భూమికి సంబంధించిన వివరాలు తప్పుగా నమోదు చేయడంతో పాస్ పుస్తకాల్లో తప్పులు చోటు చేసుకున్నాయని, వాటిని సరిచేయాలని టెక్కలి మండలం తలగాం గ్రామానికి చెందిన పేడాడ శార్వాణి కోరారు. ● టెక్కలి మండలంలోని చింతలగార సమీపంలో తమ భూమికి సంబంధించిన వివాదంలో అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడమే కాకుండా తప్పుడు మార్గాన్ని అనుసరిస్తున్నారని, దీనిపై చర్యలు చేపట్టాలని రాధావల్లభాపురం గ్రామానికి చెందిన బగాది కృష్ణారావు విన్నవించారు. -
గ్రిగ్స్ పోటీలు ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం వేదికగా జిల్లాస్థాయి బాలుర గ్రిగ్స్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు కబడ్డీ, ఖోఖో, సాఫ్ట్బాల్, బాస్కెట్ బాల్, బాల్ బాడ్మింటన్ క్రీడాంశాల్లో పోటీలు ఉత్సాహ భరితంగా సాగాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన పాఠశాలల జట్లకు జ్ఞాపికలను అందజేశారు. మిగిలిన వివిధ క్రీడాంశాల్లో పోటీలు మంగళవారం నిర్వహించి గ్రిగ్స్ పోటీలను ముగిస్తారు. కాగా అంతకుముందు పోటీలను డీఈవో ఎ.రవిబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో పోటీల నిర్వహణ పాఠశాల హెచ్ఎం దేవదత్తానందం, పీడీ కె.మాధవరావు, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, పి.తవిటయ్య, గ్రిగ్స్ సెక్రటరీ టి.శ్రీనివాసరావు, ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, ఆర్.స్వాతి, ఎం.తిరుపతిరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
జీవితాల్లో వెలుగు లేక..!
హిరమండలం: జిల్లాలో చిరుద్యోగులు ఉద్యమబాట పట్టారు. విద్యుత్ మీటర్ల రీడింగ్ తీసేవారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి సమ్మెకు దిగారు. దీంతో ఫిబ్రవరి నెలకు సంబంధించి విద్యుత్ మీటర్ రీడింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో విద్యుత్ శాఖ ఆందోళన చెందుతోంది. సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లు ( గ్రేడ్–2 లైన్మెన్ల)తో రీడింగ్ తీసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండడంతో వారు కూడా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పని ఒత్తిడిలో తాము ఉంటే.. రీడింగ్ పని చేయలేమని తేల్చి చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక విద్యుత్ శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు సుమారు 7.37 లక్షలు ఉన్నాయి. ఇందులో గృహ, వాణిజ్య మీటర్లకు చిరుద్యోగులు రీడింగ్ తీస్తుంటారు. ఇలా జిల్లావ్యాప్తంగా 235 మంది వరకూ రీడింగ్ తీసేవారు ఉన్నారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ల పరిధిలో ఒక్కొక్కరూ 3,000 మీటర్లకు రీడింగ్ తీస్తుంటారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా వారిని గుర్తిస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు సమీపిస్తున్నా ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాలేదు. ఏడాది కిందట ఇదే మాదిరిగా మీటర్ రీడింగ్ తీసేవారు రీజియన్ల వారీగా ఆందోళనకు దిగారు. సమ్మెకు సిద్ధమయ్యారు. అయితే రకరకాల కారణాలు చెప్పి ప్రభుత్వం వారి నోరు మూయించింది. అయితే కాలం గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు సమ్మెబాట పట్టారు. నేను కొన్నేళ్లుగా మీటర్ రీడింగ్ తీస్తున్నాను. కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తిస్తారన్న నమ్మకంతో పనిచేస్తున్నాను. జీతం నెలనెలా సక్రమంగా అందించడం లేదు. అందుకే కమీషన్ పెంచడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నాం. – పెద్దకోట జనార్దనరావు, మీటర్ రీడింగ్ తీసే ఉద్యోగి, ఎల్ఎన్పేట మాకు చాలా అన్యాయం జరుగుతోంది. ఇంటింటికీ వెళ్లి రీడింగ్ తీస్తే కనీసం గిట్టుబాటు కావడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి కమీషన్ పెంచుతామని హామీ ఇచ్చారు. 20 నెలలుగా ఎదురుచూస్తున్నా ఫలితం లేకపోయింది. అందుకే సమ్మెబాట పట్టాం. – ప్రసాద్ మహోపాత్రో, మీటర్ రీడింగ్ తీసే ఉద్యోగి, హిరమండలం సమ్మెబాట పట్టిన విద్యుత్ మీటర్ రీడింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తామని కూటమి హామీ 20 నెలలుగా కార్యరూపం దాల్చకపోవడంతో ఆందోళన ప్రారంభమవ్వని ఫిబ్రవరి నెల రీడింగ్ మీటర్ల రీడింగ్ తీసేవారు చాలా తక్కువ వేతనానికి పనిచేస్తున్నారు. గతంలో విద్యుత్ శాఖ సిబ్బంది ఈ రీడింగ్ తీసే క్రమంలో ఇతర పనులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. అందుకే ఈ రీడింగ్ తీసే బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. ఈ ఏజెన్సీలు చిరుద్యోగులను నియమించుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో విద్యుత్ మీటరు రీడింగ్ తీస్తే రూ.3.70లు, పట్టణ ప్రాంతాల్లో తీస్తే రూ.3.60లు ఇస్తున్నారు. అయితే ఇలా రీడింగ్ తీస్తున్న క్రమంలో వీరికి వేతనాలు సక్రమంగా అందించడం లేదు. ఇచ్చిందే తక్కువ కాగా సంబంధిత కాంట్రాక్టర్ జీతాలు సక్రమంగా సకాలంలో ఇవ్వడం లేదు. కూటమి అధికారంలోకి వస్తే నేరుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి.. కమీషన్ను భారీగా పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప హామీ అమలు చేసే దాఖలాలు కనిపించడం లేదు. -
అర్జీలపై తక్షణమే స్పందించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 41 వినతులు టెక్కలి: ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై అధికారులు తక్షణమే స్పందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తదితరులు సుమారు 41 వినతులు స్వీకరించారు. వినతులు పరిశీలిస్తే... ● టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ అనారోగ్య సమస్యలతో వస్తున్న వారిని రిఫర్ పేరుతో పంపించేస్తున్నారని, అంతేకాకుండా ప్రైవేట్ క్లీనిక్లు అధికమై రోగులకు ప్రభుత్వ వైద్య సేవలు అందకుండా చేస్తున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు జర్జాన రామ్జీ తదితరులు ఫిర్యాదు చేశారు. ● తనకు పీఎం కిసాన్ సాయం పడడం లేదని, సమస్యను పరిష్కరించాలని టెక్కలి మండలం బూరగాం గ్రామానికి చెందిన జనపాన నీలయ్య విన్నవించారు. ● తన తండ్రి పేరున ఉన్న ఇంటి పన్నును తన పేరుకు మార్చాలని టెక్కలికి చెందిన నేపాలం బలరాం కోరారు. ● తన భర్త ప్రమాదవశాత్తు గాయపడి ఎటువంటి పనులు చేసుకోలేకపోతున్నారని, అతనికి దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని టెక్కలి మండలం ఆంజనేయపురం గ్రామానికి చెందిన ముడిదాన దుర్గ విన్నవించారు. ● తన కుమారుడు ధనుష్కు దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని టెక్కలి మండలం ఆంజనేయపురం గ్రామానికి చెందిన జామి సంతోషికుమారి వినతి అందించారు. ● నందిగాం మండలంలోని పాలవలస గ్రామానికి ఉపాధి పనులు కల్పించాలని గ్రామస్తులు విన్నవించారు. ● టెక్కలి మండలంలోని సీతాపురం గ్రామంలో రోడ్డుకు ఆనుకుని నివసిస్తున్న 8 మంది ఎస్సీ కుటుంబాలకు కాలనీ ఇళ్లు మంజూరు చేశారని, అయితే అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆయా కుటుంబాలు విన్నవించారు. ● టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వలన ఆదివాసీ కుటుంబానికి చెందిన పసికందు మృతి చెందిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన చైతన్య వేదిక ప్రతినిధులు కోరారు. ● తనకు బ్రెయిన్ క్యాన్సర్ ఉండడం వలన ఎటువంటి పనులు చేసుకోలేకపోతున్నానని, తనకు పింఛన్ మంజూరు చేయాలని సంతబొమ్మాళి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన చల్లా రాజారావు విన్నవించారు. ● ఎలక్ట్రికల్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న తాను కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రమాదంతో పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నానని, తనకు పింఛన్ మంజూరు చేయాలని టెక్కలి గోపినాథపురం గ్రామానికి చెందిన సత్తారు ప్రేమ్చంద్ కోరారు. ● గత కొన్ని సంవత్సరాలుగా అందుతున్న దివ్యాంగ పింఛన్ను సాంకేతిక కారణాలతో ఆపేశారని, దీనికి సంబంధించి అన్ని రకాల క్లియరెన్స్ పత్రాలు సమర్పించినప్పటికీ పింఛన్ అందజేయడం లేదని టెక్కలికి చెందిన గొంటి వెంకటరత్నం విన్నవించారు. ● టెక్కలి అంజనాపురం సమీపంలోని జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డి.రాజ్కుమార్రెడ్డి కోరారు. జిల్లాకేంద్రంలో బోసిపోయిన పీజీఆర్ఎస్ శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ను సోమవారం నిర్వహించారు. అయితే కలెక్టర్, జేసీ ఇతర అధికారులు టెక్కలి రెవెన్యూ క్లీనిక్కి వెళ్లడంతో బోసిపోయింది. జిల్లా రెవెన్యూ శాఖ, పంచాయతీ రాజ్ విభాగాలు సమన్వయంతో వినతులు స్వీకరించారు. డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య, డీఎస్వో సూర్య ప్రకాష్లు అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను నమోదు చేసుకున్నారు. -
స్మార్ట్ మీటర్లతో ఆందోళన
కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున స్మార్ట్ మీటర్లు అమర్చుతోంది. దీనికి తోడు సూర్యఘర్ పథకం కింద సోలార్ పథకానికి రూపకల్పన చేసింది. దీంతో విద్యుత్ మీటర్లు గణనీయంగా తగ్గముఖం పట్టనున్నాయి. స్మార్ట్ మీటర్తో నేరుగా వినియోగదారుడే ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియ జరుపుతాడు. సూర్యఘర్తోనూ అదే పరిస్థితి. అందుకే మీటర్ రీడింగ్ తీసేవారు ఆందోళనలో ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు. ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టారు. -
ఎస్పీ గ్రీవెన్సుకు 61 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమం (గ్రీవెన్సు)లో ప్రజల నుంచి 61 వినతులు స్వీకరించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల నుంచి వినతులు స్వీకరించి సకాలంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో ఈనెల 27న 10 వేల మంది దంపతులతో స్వర్ణ పుష్పాభిషేక మహోత్సవం, శ్రీమద్విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కార్యక్రమానికి అనుమతి కోరుతూ ఎస్పీని కలిశారు. పీఎన్కాలనీ నారాయణ తిరుమల వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. -
‘మాదిన’కు జాతీయ అవార్డు
కంచిలి: మండలంలోని పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన విశాఖపట్నం పశువైద్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ మాదిన ప్రసాదరావుకు పశువైద్య రంగంలో అత్యున్నత స్థాయిలో సేవలు అందించిన పశువైద్యులకు జాతీయ స్థాయిలో ఇచ్చే డాక్టర్ సీఎం సింగ్ సుశృత గౌరవ్ రత్న సమ్మాన్ 2025 అవార్డులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపిక చేశారు. ఈ అవార్డులను వెటర్నరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(వీఏఐ) ఎంపిక చేసినట్లు ప్రసాదరావు తెలిపారు. ఈ అవార్డుకు తనతోపాటు ఒంగోలు వెటర్నరీ పాలీ క్లినిక్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ నల్లపాటి జగత్ శ్రీనివాస్కు కూడా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధకశాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ దామోదరనాయుడు చేతులమీదుగా సోమవారం అమరావతిలో రాష్ట్ర కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్లు డాక్టర్ రత్నకుమారి, డాక్టర్ రజనీకుమారి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ భూపాల్రెడ్డి పాల్గొన్నారు. సచివాలయం పరిశీలన జి.సిగడాం: మండలంలోని బాతువ గ్రామ సచివాలయాన్ని అదనపు ట్రైనీ కలెక్టర్ డి.పృథ్వీరాజ్ కుమార్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, పనితీరుపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అలసత్వం వహించవద్దన్నారు. సిబ్బంది సమర్దవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఆయనతో పాటు డిప్యూటీ తహసీల్దార్ ఎన్.నిర్మల, ఆర్ఐ అబోతుల రాధ, సర్వేయర్ శాంతారావు తదితరులు ఉన్నారు. ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు శ్రీకాకుళం క్రైమ్: నగరంలోని 80 ఫీట్ రోడ్డులో వాకింగ్ చేస్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన సువ్వారి కృష్ణ అనే వ్యక్తి ఆదివారం 80 అడుగుల రహదారిలో వాకింగ్ చేస్తున్నారు. అదే సమయంలో ఒక ద్విచక్ర వాహనంపై అతివేగంగా వచ్చిన వ్యక్తి మద్యం మత్తులో ఢీ కొట్టడంతో సువ్వారి కృష్ణకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితుడిని రిమ్స్కు తరలించారు. కృష్ణ ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ ఎస్ఐ దండపాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. తప్పిన ప్రమాదం సరుబుజ్జిలి: సరుబుజ్జిలి జంక్షన్ వద్ద సోమవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. సరుబుజ్జిలి నుంచి హిరమండలం వైపు ద్విచక్ర వాహనంతో వెళ్తున్న యువకుడు సరుబుజ్జిలి జంక్షన్ దాటుతున్న సమయంలో వాహనం అదుపు తప్పడంతో పల్టీలుకొట్టింది. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం శ్రీకాకుళం: నగరపాలక సంస్థకు మంజూరవుతున్న ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయకపోవడంతో ఈ నెలాఖరు నాటికి అవి మురిగిపోయే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే తక్షణమే ఈ నిధులను ఖర్చు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అయితే అధికారులు దృష్టి సారించడం లేదు. ముఖ్యంగా అధికారులకు సిబ్బంది సహకరించకపోవడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. 2020–21, 2021–22 సంవత్సరాల్లో ఆర్థిక సంఘం మంజూరు చేసిన నిధులతో అధికారులు పంపిన పనులకు సంబంధించిన అంచనాలను ప్రభుత్వం ఆమోదించింది. వీటికి టెండర్లు కూడా పూర్తయినప్పటికీ పనులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల అవి పెండింగ్లో ఉండిపోయాయి. నిబంధనల ప్రకారం వీటిని రద్దుచేసి కొత్త్త పనులకు ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది వాటిని చేపట్టాల్సి ఉంది. పాత పనులను రద్దుచేసి కొన్ని కొత్త పనులకు ప్రభుత్వ ఆమోదం పొందినా.. ఇప్పటివరకు వీటికి సంబంధించిన టెండర్లను పిలవకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే కోట్లాది రూపాయులు వృథాగా మురిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా ఉండిపోయిన నిధులు సుమారు రూ.20 కోట్లకు పైబడి ఉండవచ్చని తెలుస్తోంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థకు 2010 నుంచి పాలకవర్గం లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులు మంజూరునకు కేంద్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అందువలన నిధుల ఖర్చుకు ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
అందరి సొమ్ములు ఒకేసారి చెల్లించాలి
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పోస్టాఫీస్లో జరిగిన సుమారు రూ.2.78 కోట్ల భారీ స్కామ్లో 33 మంది బాధిత ఖాతాదారులు తమందరికీ సొమ్ములను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత ఖాతాదారులంతా సోమవారం స్థానిక పోస్టాఫీస్ వద్ద బైఠాయించి పోస్టల్ సిబ్బందిని కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఇటీవల ఖాతాదారులంతా డిసెంబర్ 15వ తేదీన ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో సంక్రాంతి నాటికి అందరి సొమ్ములను చెల్లించడం జరుగుతుందని జిల్లా పోస్టల్ అధికారి హామీ ఇచ్చారు. అయితే సంక్రాంతి అయిపోయినా ఇప్పటివరకు డబ్బులు చెల్లించకపోవడంతో మరోసారి ఆందోళన చేపట్టారు. దీంతో స్థానిక పోస్టల్ సిబ్బంది బాధితుల్లో 20 మందికి చెక్లను సిద్ధం చేశారు. కాగా బాధిత ఖాతాదారులంతా అందరికి ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఖాతాదారులంతా స్థానిక పోలీస్ సిబ్బందిని ఆశ్రయించడంతో సీఐ మీసాల చిన్నంనాయుడు జిల్లా పోస్టల్ అధికారితో ఫోన్ ద్వారా సంప్రదించారు. పోస్టల్ డివిజనల్ అధికారితో బాధిత ఖాతాదారులందరితో మాట్లాడించి, వారి సమస్య పరిష్కరానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటల వరకు పోస్టల్ సిబ్బందిని కార్యాలయంలోకి విడిచిపెట్టకపోవడంతో పోస్టల్ సేవలు నిలిచిపోయాయి. -
పాఠశాలలో పాము కలకలం
పొందూరు: మండలంలోని మలకాం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం పాము కలకలం రేపింది. పాఠశాల బాత్ రూమ్ గజాల తలుపుపై సుమారు 5 అడుగుల పాము కనిపించడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. అనంతరం ఉపాధ్యాయులకు చెప్పడంతో బయటకు పంపించారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. కళాశాలలో లాప్టాప్లు దొంగతనం పాతపట్నం: స్థానిక ఆల్ ఆంధ్ర రోడ్డు సమీపంలో ఉన్న మహేంద్ర డిగ్రీ కళాశాలలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో చోరీ జరిగింది. కళాశాల తలుపుల తాళాలు పగలుగొట్టి కంప్యూటర్ లాబ్లోని ఎనిమిది లాప్టాప్లు, రెండు ఎల్ఈడీలు, మూడు డెస్క్టాప్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు ప్రిన్సిపాల్ రాజగోపాల్ ఆచార్యులు తెలిపారు. -
చావే శరణ్యం
తన భూమి సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు సంవత్సరాల తరబడి కాళ్లరిగేలా తిప్పుతున్నారని.. కానీ సమస్యను మాత్రం పరిష్కరించడం లేదని సంతబొమ్మాళి మండలంలోని మూలపేట గ్రామానికి చెందిన జీరు ధర్మారావు అనే రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమంలో తన సమస్యను విన్నవించుకునేందుకు వచ్చారు. తన గ్రామంలో పరపటి జంగమయ్యకు చెందిన 3.50 ఎకరాల భూమిని 23 ఏళ్ల క్రితం కొనుగోలు చేయగా.. అప్పట్లో అధికారులతో కుమ్మకై ్క మరో భూమిని చూపించేశారని వాపోయాడు. ఆ సమస్యను పరిష్కరించాలని ఏళ్ల తరబడి తిరుగుతున్నప్పటికీ సంతబొమ్మాళి మండలం రెవెన్యూ అధికారులు డబ్బులు దోచేస్తున్నారు తప్ప, భూ సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొద్దిరోజుల క్రితం వీఆర్వోగా పనిచేసిన ప్రసాదరావు కూడా తన వద్ద రూ.50 వేలు లంచంగా తీసుకున్నాడని ఆరోపించాడు. చివరకు సీఎం ఆఫీస్కు ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించకుండా రెవెన్యూ అధికారులు తనతో ఆడుకుంటున్నారని, ఇక తనకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ధర్మారావును పక్కకు తీసుకుని వెళ్లిపోయారు. కొంత సమయం తర్వాత రైతు ధర్మారావు మరోసారి ఫిర్యాదు చేశారు. -
చెక్ పవర్ను పునరుద్ధరించండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎచ్చెర్ల మండలంలోని బొంతలకోడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు చెక్ డ్రాయింగ్ అధికారాన్ని తాత్కాలికంగా నిలిపివేశారని, దానిని పునరుద్ధరించాలని ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు, ఎంపీటీసీ జగదేశ్వరరావు తదితరులు పీజీఆర్ఎస్లో సోమవారం ఫిర్యాదు చేశారు. సర్పంచ్ చెక్క పవర్ను 2025 ఏప్రిల్ 2వ తేదీన తాత్కాలికంగా నిలుపుదల చేశారని, అయితే గడువు పూర్తయినా ఇంకా పునరుద్ధరించలేదని పేర్కొన్నారు. దీనివలన పంచాయతీలో కనీస అవసరాలు నేరవేరక, చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు జరగక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 2025 నవంబర్ 25న నాలుగు వారాల్లో చెక్కు డ్రాయింగ్ ఇవ్వాలని హైకోర్టు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. -
● కక్ష సాధింపు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పల్లె పాలనకు అధికార పార్టీ నాయకులు తూట్లు పొడుస్తున్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన సర్పంచ్ల చెక్ పవర్ను ఉద్దేశపూర్వకంగా ఆపి ఆ ఊరి ఊపిరి తీసేస్తున్నారు. అధికారులు కూడా వారు చెప్పినట్టే తలూపడంతో ప్రజాస్వామ్య విలువలు నిలువునా కుప్పకూలుతున్నాయి. ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు సర్పంచ్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. చెరువుల ఆక్రమణలను అడ్డుకున్నందుకు అక్కడి సర్పంచ్పై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ, తప్పుడు అభియోగాలతో చెక్ పవర్ రద్దు చేశారు. నిబంధనల మేరకై తే ఆరు నెలలకు మించి చెక్ పవర్ రద్దు చేయడానికి లేదు. పునరుద్ధరించాల్సిన అధికారులు నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పది నెలలైనా పునరుద్ధరించలేదు. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదు. అలాగని, ఆ గ్రామానికి సర్పంచ్ స్థానంలో డ్రాయింగ్ ఆఫీసర్ను కూడా నియమించలేదు. దీంతో పనులు ఆగిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. పొంతన లేని అభియోగాలు సాధారణంగా ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగమైతే సామాజిక తనిఖీల్లో అభ్యంతరం వ్యక్తమవుతుంది. తేడాలుంటే రికవరీకి ఆదేశిస్తారు. అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. కానీ, ఇక్కడదేమీ జరగలేదు. నిధులు దుర్వినియోగమైనట్టు సామాజిక తనిఖీల్లో ఎక్కడా తేలలేదు. కనీసం దుర్వినియోగం జరిగినట్టు ఉత్తర్వులు కూడా జారీ కాలేదు. పంచాయతీ నిధులకు సంబంధం లేని ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం జరిగినట్టు చూపించి సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేశారు. పంచాయతీ నిధులు దుర్వినియోగమైతేనే సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి. అలాంటిదేమీ జరగకపోయినా ఉపాధి నిధులతో చేపట్టిన సచివాలయం భవన నిర్మాణాన్ని చూపించి, అందులో దుర్వినియోగం అయిందని అభియోగాలు మోపి సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేశారు. ఉపాధి నిధులకు, పంచాయతీ నిధులకు తేడా తెలియదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అసలు ఏం జరిగింది.. బొంతల కోడూరులో కూటమి నాయకుల చెరువుల ఆక్రమణలకు పాల్పడ్డారు. సర్వే నంబర్ 57–11లో గల చెరువులో రూ.3కోట్లు విలువైన ఎకరా 94 సెంట్లు, సర్వే నంబర్ 39–8లో గల రూ. 5కోట్లు విలువైన 3ఎకరాల చెరువుల ఆక్రమణలను అక్కడ సర్పంచ్ పి.రాంబాబు అడ్డుకున్నారు. ఆక్రమణదారులపై పెద్ద పోరాటమే చేశారు. చివరికి ఆక్రమణలని తేలడంతో అధికారులు సైతం చర్యలు తీసుకున్నారు. కబ్జాదారుల నుంచి చెరువులను కాపాడారు. నిబంధనలు పాటించని అధికారులు ● తప్పుడు అభియోగాలతో చెక్ పవర్ రద్దు చేసిన అధికారులు, పంచాయతీరాజ్ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలు ఉన్నాయి. ● 1995 పంచాయతీరాజ్ చట్టంలోని జీఓ ఎంఎస్ నంబర్ 30 ప్రకారం సర్పంచ్ చెక్ పవర్ రద్దు కాలం గరిష్టంగా ఆరు నెలలే ఉండాలి. తర్వాత పునరుద్ధరించాలి. లేదంటే ఎక్స్టెన్షన్ చేసినట్టు ఉత్తర్వులైనా ఇవ్వాలి. ● రద్దు చేసిన కాలంలో డ్రాయింగ్ ఆఫీసర్ను నియమించాలి. కానీ జిల్లా అధికారులు ఈ విషయాలేవీ పట్టించుకోలేదు. ● నేటికి 10 నెలలు అవుతున్నా చెక్ పవర్ పునరుద్ధరించలేదు. డ్రాయింగ్ ఆఫీసర్ను నియమించలేదు. ● చెక్ పవర్ రద్దుపై ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, 2025నవంబర్ 25న డబ్లూపీ నంబర్ 30010/2025 ఉత్తర్వుల్లో నాలుగు వారాల్లో చట్ట ప్రకారం సర్పంచ్కు చెక్ పవర్ పునరుద్ధరించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిందని సర్పంచ్ ఉత్తర్వులు చూపిస్తున్నారు. కానీ, అధికారులు హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ● కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టే అవుతుందని అంటున్నారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని, చట్టం ప్రకారంగా నడుచుకోవాలని, గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినా అధికారులు స్పందించడం లేదు. దీని వెనక కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. వారి ఒత్తిళ్లకు భయపడి అధికారులు చట్ట ప్రకారంగా నడుచుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. అయినప్పటికీ సర్పంచ్ రాంబాబు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు.అక్కసుతో కూటమి నాయకులు కక్ష సాధింపునకు దిగారు. అధికారులను అడ్డం పెట్టుకుని ఏకంగా చెక్ పవర్ రద్దు చేయించారు. ఉపాధి హామీ పథకం నిధుల అవతకవకలు అభియోగంతో చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి.. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనక భాగంలో సచివాలయం భవన నిర్మాణ పనులు కలెక్టర్ ఉత్తర్వులతో జిల్లా పరిషత్ సమావేశం తీర్మానం ప్రాప్తికి మొదలుపెట్టారు. అయితే, 2022 జూలైలో ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిర్మాణం నిలుపుదల చేశారు. అప్పటికే భవన నిర్మాణానికి గ్రామ పంచాయతీకి రూ.1,81,339 నిధులు జమయ్యాయి. ఈ నేపథ్యంలో నిలిచిపోయిన సచివాలయం భవనాన్ని మరో ప్రదేశంలో నిర్మించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు సచివాలయం పూర్తయ్యి ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది. నిలిచిపోయిన సచివాలయం భవన నిర్మాణాన్ని పార్ట్ (ఏ) గా, కొత్త సచివాలయం భవనాన్ని పార్ట్ (బి)గా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు రాటిఫికేషన్ చేసి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రాప్తికి పాత సచివాలయం కాంట్రాక్టర్ మెట్ట హరిహరరావు పేరున రూ.1,81,339లను చెక్ ద్వారా సర్పంచ్ చెల్లించారు. సంబంధిత కాంట్రాక్టర్ కూడా నిధులు దుర్వినియోగం జరిగినట్టు సామాజిక విచారణలో అభ్యంతరం వ్యక్తం చేస్తే మొత్తం నిధులు తిరిగి చెల్లిస్తానని లిఖిత పూర్వకంగా రాసి కూడా ఇచ్చారు. అంతా పక్కా పారదర్శకంగా, ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం నిర్మాణం, నిధుల వినియోగం జరిగితే.. పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని కూటమి నాయకులు ఇచ్చిన ఫిర్యాదుకు తలొగ్గి, ఒత్తిళ్లకు లోనై వారు చెప్పినట్టుగా వ్యవహరిస్తూ ఏకపక్షంగా సర్పంచ్ రాంబాబు చెక్ పవర్ను రద్దు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. -
కోతలే.. చేతల్లేవు!
● కేంద్ర బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి ● కేంద్ర మంత్రి ఉన్నా కేటాయింపులు శూన్యం ● ప్రచారం తప్ప కనిపించని ప్రయోజనం ఉద్యోగులకు రిక్తహస్తం కేంద్ర బడ్జెట్ ఉద్యోగులను నిరాశ పరిచింది. ఇన్కంటాక్స్ శ్లాబ్లు యథాతధంగా ఉన్నా యి. ఆధారిత పన్ను మినహాయింపులో మార్పు లేదు. – హనుమంతు సాయిరాం, ఏపీ ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షుడు ఆశాజనకంగా లేదు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదు. రైల్వేజోన్కు సరిపడా నిధులు కేటాయించలేదు. జాతీయ రహదారి నరసన్నపేట నుంచి ఆరులైన్లకు నిధులు కేటాయించలేదు. – హెచ్.సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ ప్రొఫెసర్, బీఆర్ఏయూ పన్ను ఉపశమనం ఎక్కడ? రూ.12.21 లక్షల కోట్లు రికా ర్డు మూలధన ఖర్చు, రూ. 53.47 లక్షల కోట్లు మొత్తం వ్యయంతో ప్రభుత్వం భారీ పెట్టుబడి దూకుడు చూపించినా ఆదాయ పన్ను శ్లాబ్లలో ఒక్క రూపాయి మార్పు కూడా చేయలేదు. బడ్జెట్ ఒక పెట్టుబడి ఆధారిత దీర్ఘకాల వృద్ధి దిశగా భారత వ్యవస్థను మళ్లించే ప్రయత్నంగా వర్ణించవచ్చు. – డాక్టర్ మళ్ల పూర్ణసూరిగణేష్, ఆర్థిక విశ్లేషకులు, ట్రిపుల్ ఐటీ వేతన జీవులకు నిరాశ ఆదాయ పన్ను శ్లాబులు మార్చకపోవడం వేతనజీవులకు నిరాశే. స్టాండర్డ్ డిడక్షన్ 1,50,000కు పెంచి ఉండాల్సింది. సేవింగ్స్ పరిమితిని కనీసం 2.5 లక్షలకు పెంచి ఉంటే పొదుపు చేసుకోవడానికి ప్రోత్సాహం ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా ప్రకటించి ఉండాల్సింది. – బి.వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : సిక్కోలుపై సీతమ్మ మళ్లీ శీతకన్ను వేశారు. జిల్లాలో కేంద్ర మంత్రి ఉన్నా, పక్క జిల్లా ఎంపీ కూడా కూటమికే చెందినా ఈ ప్రాంతానికి ఏ మాత్రం ప్రయోజనం లేకుండాపోయింది. కోతలు ఎక్కువ.. చేతలు తక్కువ అని మ రోసారి రుజువైంది. కేంద్ర బడ్జెట్లో సిక్కోలుకు ప్రత్యేకంగా సాధించిందేమీ కనిపించలేదు. అందులోనూ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయు డు చేసిన కృషి లేశమాత్రమైనా లేకపోవడం విచారకరం. స్వల్పకాలిక ప్రయోజనాలే ● కేంద్ర బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేకమైన ప్రయోజనాలేవీ కల్పించలేదు. దేశవ్యాప్తంగా కొబ్బరి చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకం, జీడి పప్పు ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ట్టు ప్రకటన తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ జిల్లాకు అన్యాయమే జరిగింది. కొత్తగా కొబ్బరి చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం, జీడిపప్పు ఉత్పత్తికి ప్రత్యేక చర్యల వలన ఉద్దానంకు కొంత మేలు జరగనుంది. ● భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నుంచి అనుసంధానించే రహదారుల అభివృద్ధికి, పారిశ్రామిక కారిడార్లకు ప్రత్యేక నిధులు కేటాయింపు జరగలేదు. ● కిసాన్ డ్రోన్ పథధకం కింద రైతులకు ప్రోత్సాహం, మత్స్యకారులకు ఆధునిక జెట్టీలు, కోల్ట్ స్టోరేజీల నిర్మాణాలకు సాయంపై బడ్జెట్లో స్పష్టత ఇవ్వలేదు. ● ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరగలేదు. కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రాయితీలు ప్రకటించలేదు. రైల్వే, రహదారులకు స్పష్టత కరువు ● నౌపడ– గుణుపూర్ రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ. 900కోట్లతో ప్రాజెక్టు ప్రతిపాదన ఉంది. ఈ లైన్ వస్తే వాణిజ్య కార్యకలాపాలు పెరు గుతాయి. కానీ బడ్జెట్లో ఎక్కడా దీనిపై ప్రస్తావించలేదు. ● పలాస రైల్వే ఫ్లై ఓవర్ పనులకు నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. ● అమృత్ భారత్ పథం కింద శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులకు కూడా నిధుల కేటాయింపుపై క్లారిటీ లేదు. ● మూలపేట పోర్టు కనెక్టివిటీ రైల్వే లైన్, పలుచోట్ల రైల్వే అండర్ పాసెజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వీటిపైనా బడ్జెట్లో స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. ● ఈస్ట్కోస్టు రైల్వే లైన్తో పాటు విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు రైల్వే లైన్ల అభివృద్ధిపైనా ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. ● జిల్లాలో నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రస్తుతం నాలుగులైన్ల జాతీయ రహదారి మా త్రమే ఉంది. దీన్ని ఆరు లైన్లుగా మార్పు చేయా ల్సి ఉంది. ఇచ్ఛాపురం, నరసన్నపేట, పలాస, ఆమదాలవలస నియోజకవర్గాల్లో పలు వంతెనల నిర్మాణాలు కూడా చేపట్టాలి. ఇవన్నీ పూర్తి చేయాలంటే రూ. వేల కోట్లలో అవసరం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. -
శ్రీకాకుళం
సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026గ్రామాలకు నిరాశే కేంద్ర బడ్జెట్ ఉద్యోగులకు కొంత ఊరట. కానీ గ్రామీణ ఆర్థిక రంగానికి నిరాశే. ఇది పేరుకే ఆత్మ నిర్భర భారత్ బడ్జెట్. రాష్ట్రానికి ఆశించిన కేటాయింపులు చేయలేదు. విభజన చట్టం హామీలు, గిరిజన యూనివర్సిటీ, దుగరాజపట్నం పోర్ట్ విస్మరించారు. – బొడ్డేపల్లి మోహనరావు, ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులుసామాన్యులకు ప్రయోజనం లేదు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్తో సామాన్యులకు ఏమీ ప్రయోజనం లేదు. మహిళలకు, యువత, రైతులకు వ్యతిరేకంగా బడ్జెట్ ఉంది. విద్యారంగానికి నిధులు కేటాయించలేదు. యువత, రైతులు, ఉపాధి గురించి ప్రస్తావించలేదు. బడ్జెట్లో సంక్షేమ పథకాల కేటాయింపుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. – రెడ్డి శాంతి, వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
టెక్కలి రూరల్ : టెక్కలి వలేసాగరం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రావివలసకు చెందిన విద్యుత్ లైన్మేన్ పి.రామచంద్రుడు ద్విచక్ర వాహనంపై టెక్కలి నుంచి వలేసాగరం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వైపు వెళ్తుండగా అదుపు తప్పి సమీపంలో ఉన్న స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో రామచంద్రుడికి తీవ్ర గాయాలు కావడంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.స్థానిక పోలీసులు వివరాలు సేకరించారు. పశువులు పట్టివేత రణస్థలం: లావేరు మండలం బుడుమూరు జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం 7 గంటలకు అక్రమంగా తరలిస్తున్న ఐదు పశువులను పట్టుకున్నారు. శ్రీకాకుళం వైపు నుంచి రణస్థలం వైపు లగేజీ వ్యాన్లో తరలిస్తుండగా లావేరు ఎస్సై కె.అప్పలసూరి పట్టుకుని కేసు నమోదు చేశారు. గంజాయితో ఇద్దరు అరెస్టు వజ్రపుకొత్తూరు రూరల్: పూండి రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం గంజాయి తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. ఒడిశా నుంచి సికింద్రాబాద్కు గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ బి.నీహర్ తన బృందంతో కలిసి పూండి రైల్వే స్టేషన్ వద్ద మాటువేశారు. ఒడిశా రాష్ట్రం రాయ్ఘడ్కు చెందిన ప్రమోద్, సరోజ్లు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకొని ప్రశ్నించగా గంజాయి తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారి వద్ద 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు హిరమండలం: ఎల్.ఎన్.పేట మండలం చిట్టిమండలం కాలనీ వద్ద అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమ్మువలస గ్రామానికి చెందిన ఎస్.పరశురాంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరశురాం కొమ్మువలస నుంచి సరుబుజ్జిలి వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ముందు వెళుతున్న బస్సును ఓవర్ టేక్ చెయ్యిబోయి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. తీవ్రంగా గాయపడిన పరశురాంను స్థానికులు 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. -
కీలక ప్రాజెక్టులకు చోటేదీ..?
● ఉద్దానం ఏరియాలో కిడ్నీ భూతం పట్టి పీడిస్తోంది. ప్రతి రోజూ వ్యాధిగ్రస్తులు చనిపోతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి, డ యాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి, కొంతమేరకు ఆదుకుంది. దాని కొనసాగింపుగా కూటమి ప్రభుత్వంలో ఏమీ జరగడం లేదు. గత ప్రభుత్వం ప్రతిపాదనల మేరకు ఐసీఎంఆర్ చొరవ తీసుకుని, పరిశోధనలకు ముందుకొచ్చింది. కానీ, బడ్జెట్లో జాతీయ స్థాయి నిధులను మాత్రం కేటాయించలేదు. ● జిల్లా ఆర్థికంగా వెనకబడినా విద్య, స్కిల్డ్ పరంగా టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నారు. కానీ సరైన సంస్థల్లేక ప్రతిభను చూపలేకపోతున్నారు. ఇక్కడో జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుంది. కానీ ఈ బడ్జెట్లోనూ అవేవీ జరగలేదు. ● అధిక దిగబడిని ఇచ్చే కొత్త కొత్త వంగడాల పరిశోధనలు జిల్లాలో జరుగుతున్నాయి. నైరా వంటి పరిశోధనా స్థానం ఉన్నప్పటికీ దానికి జాతీయ స్థాయిలో ప్రోత్సాహం అందితే దేశానికి మరిన్ని కొత్త కొత్త వంగడాలు పరిచయం చేసేందుకు అవకాశం ఉంటుంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాల, హార్టికల్చరల్ రీసెర్చ్ సెంటర్, వెట ర్నరీ పాలిటెక్నికల్ కళాశాల వంటివి ఏర్పాటు చేశారు. అక్కడ తయారయ్యే విద్యార్థులకు జాతీయ స్థాయి సంస్థలు దగ్గరగా ఉంటే మేలు జరిగేది. ఆ కానీ ప్రయత్నం జరగడం లేదు. ● వైఎస్సార్సీపీ హయాంలో బుడగట్లపాలెం పిషింగ్ హార్బర్, జెట్టీ నిర్మాణాలు చేపట్టగా ఇప్పుడా పనులు పూర్తి చేసేందుకు ఈ ప్రభు త్వం చేస్తున్న ప్రణాళిక ఏంటో కన్పించడం లేదు. కేంద్ర బడ్జెట్లో వీటికోసం ప్రత్యేకంగా కేటాయించిన దాఖలాల్లేవు. ● జిల్లాలో అపారమైన అటవీ వనరులు ఉన్నా యి. ముఖ్యంగా ఔషధ మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. సెంట్రల్ రీసెర్చ్ ఇన్సిటిట్యూట్ ఫర్ మెడిషనల్ ప్లాంట్స్ (కేంద్రీయ ఔషద మొక్కల పరిశోధనా సంస్థ) వంటివి ఏర్పాటు చేస్తే ప్రపంచానికి కొత్త కొత్త ఔషధాలను పరిచయం చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ బడ్జెట్లో ప్రస్తావన లేదు. ● జిల్లాలో అనేక వ్యవసాయ ఉత్పత్తులు తయా రవుతున్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్ ఇండస్ట్రీస్ను ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఉపయోగపడుతుంది. వీటికీ బడ్జెట్లో చోటు దక్కలేదు. -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసులో ఆరుగురు అరెస్టు
టెక్కలి రూరల్: ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లు చోరీకి పాల్పడిన ఆరుగురిని కోటబొమ్మాళి పోలీసులు అరెస్టు చేసినట్లు టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు. ఆదివారం కోటబొమ్మాళి పోలీస్స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎం.రాము, మారేడుపాలెం గ్రామానికి చెందిన ఎం.నాగరాజు, పూసపాటిరేగ మండలం కోనాడకు చెందిన ఎన్.మోహన్రావు, పి.శ్రీను, ఎం.శ్రీనివాస్, ఎన్.రఘుబాబులు స్నేహితులు. వీరంతా మద్యానికి బానిసయ్యారు. ఎం.రాము తనకు ఎలక్ట్రికల్ వర్క్ తెలుసని, ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్లు చోరీ చేసి అమ్మితే బాగా డబ్బులు సంపాదించవచ్చని చెప్పడంతో అందరూ కలిసి చోరీ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో 2023 నుంచి లావేరు, జలుమూరు, టెక్కలి, నందిగాం, ఎచ్చెర్ల, కవిటి, జె.ఆర్.పురం, మందస, పాతపట్నం, కోటబొమ్మాళి మండలాల్లోని పలు గ్రామాల్లో శివారున ఉన్న ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యం చేసుకున్నారు. పక్కా ప్లాన్తో రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడే వారు. దీనిలో భాగంగా ఆదివారం సైతం ట్రాన్స్ఫార్మర్ల కోసం రెక్కీ చేసేందుకు రాగా వారిపై అనుమానంతో కోటబొమ్మాళి పోలీసులు జర్జంగి జంక్షన్ వద్ద పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.8లక్షల15వేల100 విలువైన 607 కేజీల కాపర్ వైర్, 20 కేజీల అల్యూమినియం వైర్లు, ఆటో, బైక్, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
అరసవల్లిలో మాఘ సందడి
అరసవల్లి: పవిత్ర మాఘ మాసం మొదటి ఆదివారం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి వేలాది మంది భక్తులు పోటెత్తారు. ఆదివారం వేకువజామునకే సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్థానిక ఇంద్రపుష్కరిణి వద్ద పిడకల పొయ్యిలో క్షీరాన్నం వండి ఆదిత్యునికి భోగం నివేదించారు. అలాగే ఆరోగ్యం కోసం పలువురు భక్తులు సూర్యనమస్కారాల పూజలను చేయించుకున్నారు. మాఘమాసం సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పుష్పాలంకరణచేసారు. ఒక్క రోజు ఆదాయం రూ.18,33,261 ఆదిత్యాలయంలో ఆదివారం ఒక్కరోజే రూ.18,33,261 ఆదాయం వచ్చినట్లు ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ తెలిపారు. టికెట్ల రూపంలో రూ.11,65,200, విరాళాల రూపంలో రూ.1,71,271, ప్రసాదాల రూపంలో రూ.3,99,090, ఆన్లైన్ ద్వారా రూ.97,700 విరాళం వచ్చినట్లు వివరించారు. -
రైతులపై అదనపు భారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు వెతలు ఇంకా కనిపిస్తున్నాయి. జిల్లాలో పండిన ధాన్యం మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ మన జిల్లాలో ఖరీఫ్లో పండించిన ధాన్యంను పక్క జిల్లాలకు పంపిస్తున్నారు. ఈ ఏడాది 4.07 లక్షల ఎకరాల్లో వరి పంటలు ఖరీఫ్లో వేశారు. ప్రభుత్వం 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు లక్ష్యంగా పెట్టుకుంది. 6.22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు చెబుతోంది. ఈ ధాన్యంను జిల్లాలో ఉన్న 271 రైస్ మిల్లులకు మిల్లింగ్కు పంపించారు. కానీ జిల్లా లో చాలా చోట్ల పొలాల్లో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. అపరాల పంటలు తర్వాత వాటిని రైతులు వాటిని నూర్పు చేస్తారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు వీటిని నూర్చే పరిస్థితి లేదు. దీంతో అదనంగా ధాన్యం సేకరించా లని రైతులు కోరుతున్నారు. తాజాగా 50వేల మెట్రి క్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ ఇది ఏమాత్రం సరిపోదని పెంచాలని రైతులు కోరుతున్నారు. పక్క జిల్లాలకు మన ధాన్యం జిల్లాలో రైతులు పండించిన ధాన్యంను పక్క జిల్లాల మిల్లర్లకు అందజేసే అవకాశం ఈ ఏడాది ప్రభుత్వం కల్పించింది. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. జిల్లాలో పండిన ధాన్యం జిల్లాలో మిల్లర్లు మా త్రమే కొనుగోలు చేసేవారు. ప్రభు త్వం నిర్ణయించే లక్ష్యాలు కూడా స్థానిక మిల్లర్లు సాధించేవారు. అయితే కూటమి ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాకు చెంది న మిల్లర్ల ఒత్తిడికి లోబడి ఆ జిల్లాకు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం పక్క జిల్లాలకు తరలిపోయాయి. జిల్లాకు కొత్తగా కొనుగోలు లక్ష్యాలు ప్రభుత్వం కల్పించకపోతే, ఇక్కడ మిగిలి ఉన్న ధాన్యం మరో రెండు లక్షలు మెట్రిక్ టన్నుల వరకు ఇతర జిల్లాకు వెళ్లే అవకాశం ఉంది. ఇలా జరి గితే జిల్లా మిల్లర్లు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. మిల్లర్లకు అన్యాయం జిల్లాలో తమకు అన్యాయం జరుగుతోందని మిల్లర్లు వాపోతున్నారు. ఈ ఏడాది అన్ని రకాలుగా ప్రభుత్వం మిల్లర్లను ఇబ్బంది పెట్టిందని, బ్యాంకు గ్యారెంటీలు అన్నీ ఇచ్చినా వారికి సరిపడినంత ధాన్యంను అందజేయలేదని ముందు నుంచీ ఫి ర్యాదులు ఉన్నాయి. పోలాకికి చెందిన మిల్లర్ ఒకరు నేరుగా కలెక్టర్, జేసీలకే ఫిర్యాదు చేశారు. జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలకు, ఉత్సవాలకు, ఇతర సంక్షేమాలకు మిల్లర్ల నుంచి సాయం తీసుకుంటున్న రాజకీయ నాయకులు వారిని కాదని ఇతర జిల్లాల మిల్లర్లకు మేలు చేసేలా వ్యవహరించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్క జిల్లాలకు వెళ్తున్న మన ధాన్యం జిల్లాలో కొనుగోలు లక్ష్యాలు పూర్తి అదనపు కొనుగోలు అంతంతమాత్రమే -
ఆగని ఇసుక దందా
● బాహుదానదిని ఊడ్చేస్తున్న ఇసుకాసురులు ● ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా ● చోద్యం చూస్తున్న అధికారులు ఇచ్ఛాపురం: ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బాహుదా నది నుంచి అక్రమార్కులు ఇసుకను దోచేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై స్థానిక ప్రజలు సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తున్నప్పుడు, వార్తాపత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు మాత్రమే స్థానిక అధికారులు దాడులు చేస్తున్నారు. తర్వాత పట్టించుకోకపోవడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. దర్జాగా అక్రమ రవాణా చేసుకుంటూ జేబులు నింపుకొంటున్నారు. స్థానిక బాహుదానది నుంచి అక్రమార్కులు నిత్యం వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకుపోతున్నారు. నది సమీప ప్రాంతాలు, తోటల్లో డంప్ చేసుకొంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అనుమతులు లేకుండానే.. ఇచ్ఛాపురం మండలంలో బాహుదానది పరివాహక ప్రాంతంలో ఎక్కడా ఇసుక రీచ్లకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయలేదు. అయినప్పటికీ ప్రజల అవసరాల నిమిత్తం నిర్మాణం కోసం ఎడ్లబండి, ట్రాక్టర్లతో ఇసుకను తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించింది. ఇదే అదునుగా అక్రమార్కులు నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. నదిలో ఇసుక లేకపోతే భవిష్యత్లో సాగునీరు, వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని ముందుగానే గుర్తించిన బెల్లుపడ రైతులు నదీ దారుల్లో డిసెంబర్లో పెద్ద పెద్ద గోతులు తవ్వించారు. అయినప్పటికీ ఇసుకాసురులు కొత్త మార్గాలను అన్వేషిస్తూ తవ్వకాలు సాగిస్తున్నారు. నదిలో తవ్వకాలు చేపట్టకూడదని రెవెన్యు సిబ్బంది హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసినా ఫలితం లేకపోతోంది. అడిగే వారేరీ? బాహుదా నది నుంచి ఇసుకను తరలించేందుకు ఇసుకాసురులు ఉపయోగించే ట్రాక్టర్ ఇంజిన్కు గానీ, ట్రాక్టర్ తొట్టెకు గాని ఎటువంటి నంబర్లు ఉండవు. వీటికి ఎటువంటి అనుమతులు కూడా ఉండవు. ఇటువంటి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను నిత్యం పట్టణంలోని రెవెన్యు కార్యాలయం, పోలీస్ స్టేషన్ ముందుగానే తరలిస్తున్నా అడిగేవారే కరువయ్యారు. ఇప్పటికై నా మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ప్రకృతి సంపద తరలిపోకుండా, ప్రజలకు నీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
పొందూరులో అగ్నిప్రమాదం
● ట్రేడర్స్ గొడౌన్ దగ్ధం ● రూ.94 లక్షల ఆస్టినష్టం పొందూరు: మండల కేంద్రం పొందూరులోని శ్రీసాయి సూర్య హర్షిని ట్రేడర్స్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాపు తెరిచే సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో యజమాని పోలాకి రవి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే గోదాంలో ఉన్న వివిధ వ్యవసాయ ఉత్పత్తుల బస్తాలు కాలి బూడిదైపోయాయి. శనివార రాత్రి విద్యుత్ షార్టు సర్క్యూట్ కావడం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనలో సుమారు రూ.94 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. 217 టన్నుల మొక్కజొన్న బస్తాలు, 650 నువ్వుల బస్తాలు, 200 మిర్చి బస్తాలు, వేరుశెనగ యంత్రం, ఇతర వస్తువులు కాలిపోయినట్లు గుర్తించారు. -
కూర్మ విలాపం
● తీరానికి కొట్టుకువస్తున్న తాబేళ్ల కళేబరాలు ● నిర్లక్ష్య ధోరణిలో మత్స్యశాఖ ● ఆందోళనలో పర్యావరణ ప్రేమికులు ఇచ్ఛాపురం రూరల్: జిల్లా తీర ప్రాంతానికి తాబేళ్ల కళేబరాలు తరచూ కొట్టుకుని వస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలను ఈ దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఇచ్ఛాపురం మండలం డొంకూరు లక్ష్మీపురం నుంచి జిల్లా చివరి మత్స్యకార గ్రామం తడా వరకు ఏటా 1500 నుంచి 2000 వరకు ఈ తాబేళ్లు చనిపోతుంటా యని మత్స్యకారులు చెబుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో ఆ జాతి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. శీతాకాలంలో ఆడ తాబేళ్లు సముద్రంలో కిలో మీటర్ల దూరం ప్రయాణించి తీరానికి చేరే ప్రయత్నం చేస్తాయి. అనువైన చోట గుడ్లు పెట్టేందుకు స్థలం ఎంపిక చేసుకుంటాయి. నవంబర్ నుంచి మే నెల వరకు ఎక్కువగా వస్తుంటాయి. ఆడ తాబేళ్లు తీరంలో రాత్రిళ్లు జనసంచారం లేని సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి. లోతైన గుంతలను తవ్వి వాటిలో 100 నుంచి 150 వరకు గుడ్లను పెట్టి వెళ్లిపోతాయి. ఏప్రిల్, మే ప్రాంతంలో గుడ్లు నుంచి పిల్లలు బయటకు వచ్చి సముద్రంలోకి చేరుతాయి. సంతానోత్పత్తి దశలో తాబేళ్లు మృత్యువాత పడుతుండటం విచారకరమని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవ తప్పిదాలే కారణమా..? వేట పడవల నుంచి వేసే నైలాన్ వలల్లో చిక్కుకుని తాబేళ్లు ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నట్లు స్థాని కులు చెబుతున్నారు. మరోవైపు సముద్రంలో పెరుగుతున్న కాలుష్యం, ఆధునిక మరబోట్ల తాకిడి, చలి వాతావరణం తాబేళ్ల మృతికి కారణమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా అటవీశాఖ, మత్స్యశాఖాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మృత తాబేళ్లను తొలగించడంలోనూ, కారణాలపై అధ్యయనం చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైజాగ్ బోట్లు వల్లే మృతి నా చిన్నతనం నుంచి చూస్తున్నా. ఏదో ఏడాది ఒక టో, రెండో తాబేళ్లు చనిపోయే వి. ఈ మధ్య వైజాగ్ నుంచి బోట్లు రావడంతో తాబేళ్లు అధిక సంఖ్యలో మృతి చెందుతున్నాయి. ఈ ప్రాంతానికి ఆ బోట్లు రాకుండా అధికారులు హెచ్చరిస్తే తాబేళ్లు మృతి చెందే అవకాశం లేదు. – బుడ్డ లింగరాజు, మత్స్యకారుడు, డొంకూరు అవగాహన కల్పిస్తున్నాం కొంత మంది సముద్రం ఒడ్డు కు దగ్గరలో పెద్ద పడవలతో అక్రమంగా చేపలను వేటాడుతుండడంతో ఒడ్డుకు వచ్చే క్ర మంలో ఈ తాబేళ్లు పడవల వలలకు చిక్కి మృతి చెందుతున్నాయి. ముఖ్యంగా టెలీ బోట్లు నిరోధి స్తే ఫలితం ఉంటుంది. మత్స్యకారులకు తాబేళ్లపై అవగాహన కల్పిస్తున్నాం. – ఏవీ నాగేంద్రరావు, సహాయక అటవీ సంరక్షణ అధికారి -
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగా పై కార్యక్రమంలో లేదా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయాలన్నారు. టెక్కలిలో రెవెన్యూ క్లినిక్ జిల్లాలోని రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తూ టెక్కలి రె వెన్యూ డివిజన్ కార్యాలయంలో జిల్లా మొ త్తానికి సోమవారం ప్రత్యేక ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. భూ సమస్యలు, మ్యుటేషన్లు, పట్టాదారు పాసు పుస్తకాలు, భూ సర్వే వంటి దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ క్లినిక్ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ‘లేబర్ కోడ్లు రద్దు చేయాలి’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): భవన నిర్మాణ కా ర్మిక సంక్షేమ చట్టాన్ని నిర్వీర్యం చేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు పటిష్టమైన చట్టం అమలు చేయా లని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.ఆదినారాయణమూర్తి, సిటు టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లాకమిటీ సమావేశం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ రాష్ట్రంలో సుమారు 30 లక్షలు, జిల్లాలో సుమారు 80 వేల మంది నిర్మాణరంగ కార్మికులు ఉన్నారని, వారు పోరాడి సాధించుకున్న నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని నిలుపుదల చేసి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్ రాజకీయ ప్రచారాలకు భవన నిర్మాణ సంక్షేమ నిధిని వినియోగించడం దుర్మార్గమని విమర్శించారు. గృహ నిర్మాణాలకు రుణాలు మంజూరు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డు ని పునరుద్ధరిస్తామని కూటమి ప్రభుత్వం హా మీ ఇచ్చి మర్చిపోయిందన్నారు. పెండింగ్ క్లెయిమ్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొని జయప్రదం చేయా లని పిలుపునిచ్చారు. తంగి హరి నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తర్ల లక్ష్మణరావు, బూసి లక్ష్మణ రావు, పనస రమేష్ వివిధ మండలాల నుంచి కార్మికులు పాల్గొన్నారు. -
లారీడ్రైవర్ మృతి
ఎచ్చెర్ల : ఎచ్చెర్ల జాతీయ రహదారిపై వెళ్తున్న భాస్కరరావు అనే లారీ డ్రైవర్ ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీకాకుళం నుంచి చిలకపాలెం వెళ్తుండగా కింతలిమిల్లు సమీపంలో ఫ్లై ఓవర్ వంతెన వద్ద లారీ ఆపి దిగాడు. అసౌకర్యానికి గురై వాంతులు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. భాస్కరారావుది విజయనగరం రైతుబజార్ వీధి. కుటుంబ సభ్యులకు క్లీనర్ సమాచారం అందించాడు. ఘనంగా తెరవే కవి సమ్మేళనం శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని శాంతినికేతన్ కళాశాలలో తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో 113వ నెలవారీ సాహితీ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, రఘుపాత్రుని వెంకట రమణమూర్తి నిర్వహణలో క్రియాశీలక సభ్యులు ఇద్ది పాపయ్య అతిథిగా పాల్గొన్న కవి సమ్మేళనంలో 13 మంది హాజరై తమ కవితలు చదివి వినిపించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచారసభ కార్యదర్శి, ఇంటెలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు కోనె శ్రీధర్ కేంద్ర ఆర్థిక శాఖ హిందీ సలహా మండలి సభ్యుడిగా నియామకం కావడం పట్ల సభ్యులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కవులు తోట గోపాలరావు, యం.ఉపేంద్రశర్మ, యు.నాగేశ్వరరావు, ఆర్.వి.రమణమూర్తి, గుడిమెట్ల గోపాలకృష్ణ, ఐ.పాపయ్య, డబ్బీరు గోవిందరావు, కిల్లాన శ్రీనివాస్, వావిలపల్లి రాజారావు, పి.వి.దుర్గాప్రసాద్, కుప్పిలి త్రినాథరావు, టి.విజయలక్ష్మణ్, కె.బి.రవికిరణ్ పాల్గొన్నారు. -
విద్యార్థులకు అభినందనలు
నరసన్నపేట: మండలంలో మారుమూల గ్రామం బసివలస ప్రాథమిక పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్ధులు రాష్ట్ర స్థాయి స్పెల్–బీ పోటీల్లో ప్రాతినిధ్యం వహించడం పట్ల ఎస్ఈఆర్టీ డైరెక్టర్ ఎం.వెంకట కృష్ణారెడ్డి అభినందించారు. మండల, జిల్లా, జోన్స్థాయిల్లో ప్రతిభ చూపిన బసివలస విద్యార్థులు బమ్మిడి యశ్విక(2వ తరగతి), పాగోటి నవీన్ (3వ తరగతి), ఇంటివెనుకల నిహారిక (3వ తరగతి)లను ప్రత్యేకంగా అభినందించారు. శనివారం రాష్ట్ర స్థాయి స్పెల్ బీ పోటీలను ఏపీ ప్రభుత్వం శనివారం విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజీలో నిర్వహించింది. ఇందులో యశ్విక చివరి రౌండ్వరకూ వెళ్లి గట్టి పోటీ ఇచ్చినట్లు ఉపాధ్యాయుడు అప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమెంటోలు జారీ చేశారు. పోటీల్లో నరసన్నపేట మండలం బొరిగివలస స్కూల్కు చెందిన తంగి లాస్యశ్రీ కూడా ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఎంఈఓలు శాంతారావు, దాలినాయుడు అభినందించారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజం ‘అరాచకం సృష్టిస్తున్నారు’ సోంపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అధికార పార్టీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు దుయ్య బట్టారు. నర్తు రామారావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై అధికార పార్టీ నేతలు దాడి చేసి వాహనాలు దగ్ధం చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామో, ఆటవిక రాజ్యంలో ఉన్నామో అర్థం కావడం లేదని అన్నారు. అంబటి రాంబాబు ఇంటి పై దాడి చేసిన వారు, దాడి చేయించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రికే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ‘రెడ్బుక్ రాజ్యాంగంతో అరాచక పాలన’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అంటూ అరాచక పాలన సాగుతోందని, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేయించడమే కాకుండా, ఆయన పార్టీ కార్యా లయం, ఇంటిని ముట్టడించి, ఫర్నీచర్, విలువైన వస్తువులకు నిప్పంటించి తగులబెట్టడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దుంపల లక్ష్మణరావు అన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒక ప్రణాళికతో బాబు, లోకేష్ జరిపించిన హత్యాయత్నంగానే భావించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన మాట పక్కనబెడితే ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు. మొదటి నుంచి చంద్రబాబు నోటి మాటలు, ఆయన ఇచ్చిన హామీలు అన్నీ కల్తీయేనని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేకత ఉప్పెనగా మారి తెలుగు దేశం పార్టీని సర్వ నాశనం చేస్తుందన్నారు. నరసన్నపేట: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని, వ్యక్తిగత స్వేచ్ఛ ను హరిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబా బుపై జరిగిన దాడే దీనికి నిదర్శనమని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత విపక్ష నేతలే లక్ష్యంగా దాడులు పెరిగి పోయాయని ఆందోళన చెందారు. పోలీసుల సమక్షంలోనే దాడులు చేశారంటే కూటమి పాలన ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. బాధితులకు రక్షణ కల్పించాల్సింది పోయి దాడులు చేస్తున్నవారికి పోలీసులు రక్షణగా వ్యవహరించారని విమర్శించారు. బహిరంగంగా కర్ర లు, కత్తులు పట్టుకొని రాంబాబుపై దాడికి తెగబడ్డారని, కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేశారని అన్నారు. వీరిపై కేసులు పెట్టాల్సింది పోయి తిరిగి రాంబాబుపై కేసు పెట్టి అరెస్టు చేయడాన్ని తప్పు పట్టారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని అన్నారు. తిరుపతి లడ్డూ వ్యవహరంలో లేనిపోని అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేశారని భక్తుల మనోబావాలను దెబ్బతీశారని ఇది ప్రజల్లోకి వెళ్లడంతో డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అంబటిపై దాడులకు తెగబడ్డారని విమర్శించారు. రాంబాబుపై దాడికి దిగిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కృష్ణదాస్ డిమాండ్ చేశారు. -
మూసేస్తున్నారు!
ఒక్కొక్కటిగా.. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): గత వైఎస్సార్ సీపీ పాలనలో వ్యవసాయం పండగలా ఉండేది. విత్తనాలు, ఎరువులు, రైతు భరోసా పథకం, ఇన్పుట్ సబ్సిడీ.. ఇలా అనేక రకాల సేవలు రైతు ముంగిటకే చేరేవి. వీటన్నింటికీ కారణం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు. విత్తు నుంచి విపత్తు వరకు అన్నింటా అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచాయి. అంతటి మహత్తరమైన ఆర్బీకేలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఇప్పటికే రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే)లుగా పేరు మార్చి రైతులకు సేవలు అందకుండా చేసింది. తాజాగా రేషనలైజేషన్ పేరిట సిబ్బందిని కుదించేసి రైతు సేవా కేంద్రాలను మూసివేసే దిశగా ఆడుగులు వేస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలోనే ఇప్పటివరకు 123 రైతుసేవా కేంద్రాలు మూసివేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 656 రైతు భరోసా కేంద్రాలు ఉండేవి. రైషనలైజేషన్ పేరుతో రెండు, మూడు ఆర్ఎస్కేలను కలిపి ఒకటిగా సర్దుబాటు చేసేశారు. దీంతో కేంద్రాల సంఖ్య 533కి చేరింది. అంటే 123 రైతు సేవాకేంద్రాల సేవలకు సెలవిచ్చేశారు. ఇందులో 515 గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా మరో 18 అర్బన్ స్టేషన్లలో ఉన్నాయి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లతోపాటు విలేజ్ సెరికల్చర్ సిబ్బంది పనిచేస్తూ రైతులకు సేవలందిస్తున్నారు. ఇందులో సుమారు 52 మంది ప్రస్తుతానికి పలు కారణాల వల్ల సిబ్బంది లేనట్లు అధికారికంగా చెబుతున్నారు. కొందరు పదోన్నతులపై వెళ్లగా మరికొందరు ఉద్యోగాలను వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం 481 మంది సిబ్బంది మాత్రమే రైతు సేవా కేంద్రాలలో సేవలందిస్తున్నారు. సిబ్బంది కొరత.. జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఆయా భూముల పరిధిలోని రైతులకు సేవలందించేందుకు ఒక్కో ఆర్ఎస్కేకు ఒక్కో వీఏఏ/ వీహెచ్ఎ ఉండాల్సి ఉండగా అనేకచోట్ల సిబ్బంది కొరత ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో రైతు సేవా కేంద్రం పరిధిలోకి 1400 హెక్టార్ల భూమిని కేటాయించారు. సిబ్బంది కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో సేవలు సరిగ్గా అందడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో రైతు ఇంటి వద్దకే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందేవి. రైతుభరోసా–పీఎం కిసాన్ పెట్టుబడి సాయం ప్రతీ సీజన్లో ఠంచన్గా రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. అగ్రిల్యాబ్ల్లో పరీక్షలు సైతం నిర్వహించడం లేదు. ఇప్పటికే యూరియా ఇవ్వడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పుడు రైతుసేవా కేంద్రాలు మూసివేస్తుండటం దారుణం. – గొండు రఘురాం, వైఎస్సార్ సీపీ వ్యవసాయ విభాగం జిల్లా అధ్యక్షుడు రైతులకు సక్రమంగా సేవలందించాలన్న ఆలోచనతో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే విలీనం పేరుతో వాటిని తగ్గించేసి రైతులకు ఇబ్బంది పెట్టడం సరికాదు. హిరమండలంలో మూడు రైతు భరోసా కేంద్రాలకు గాను ఒకటికి తగ్గించేశారు. 400 మంది రైతులు ఒకే ఆర్బీకేకు వెళ్లి ఇబ్బంది పడాల్సి వస్తోంది. సేవలు దూరం చేసేలా రైతులపై కక్షసాధింపు చర్యలు తగవు. – నక్క ఆనందరావు, పాత హిరమండలం రేషనలైజేషన్ వల్ల ఆర్ఎస్కేలు తగ్గాయి. సిబ్బందిని తగ్గించాం. ప్రభుత్వం నిర్ణయాన్ని అమలుచేశాం. రైతులకు సేవలు అందించడంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. భవిష్యత్లో ఎటువంటి సేవలు అందించామో ఇప్పుడే అలానే అన్ని రకాల సేవల్ని అందిస్తున్నాం. ఎక్కడైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాలి. – త్రినాథస్వామి, జిల్లా వ్యవసాయాధికారి -
బంగారం చోరీ కేసులో మహిళ అరెస్టు
ఇచ్ఛాపురం : మున్సిపాలిటీ పరిధిలోని ఏఎస్పేటలో నివాసముంటున్న కదంబాల భాగ్యలక్ష్మి గత నెల 25న మార్కెట్లో సరుకులు కొనుగోలు చేస్తుండగా ఆరుంపావు తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ మేరకు బాధితురాలు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఆస్కా నువాపల్లి గ్రామానికి పులి సుభాషిణిని నిందితురాలిగా గుర్తించి శనివారం ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకొన్నారు. ఆమె వద్ద నుంచి ఆరుంపావు తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. నిందితురాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ బషీర్ని సీఐ మీసాల చిన్నంనాయుడు, ఎస్సై ముకుందరావు అభినందించారు. ప్రొఫెసర్ సుజాతకు పేటెంట్ హక్కులు మంజూరు ఎచ్చెర్ల : యాంటీబయాటిక్ సమూహమైన ‘టెట్రాసైక్లిన్ అనలాగ్’పై పరిశోధనలకు గాను బి. ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ విభాగం సీనియర్ అధ్యాపకురాలు ప్రొఫెసర్ పి.సుజాతకు పేటెంట్ (చట్టపరమైన మేథో సంపత్తి హక్కు) మంజూరైంది. 2018 నుంచి ఇరవై ఏళ్లపాటు ఈ హక్కులను కల్పిస్తూ కేంద్ర ప్రధాన పేటెంట్ కార్యాలయం (కోలకత్తా) తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా సుజాతను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.ఆర్.రజని శనివారం అభినందించారు. -
ఉపాధికి చంద్ర గ్రహణం
హిరమండలం : ఉపాధి హామీ పథకం పేరు, తీరు రెండూ మారనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త పథకం ద్వారానే ఉపాధి హామీ కొనసాగనుంది. అయితే నిధుల వాటాలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పథకం సక్రమంగా అమలుకావడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజవీక మిషన్ గ్రామీణ –2025 (వీబీజీ రామ్జీ )గా పేరు మార్చిన విషయం తెలిసిందే. పథకం పేరు మార్పు అటుంచితే.. నిధుల వాటాలో గతంలో పోల్చుకుంటే భారీగా తేడాలున్నాయి. 13 ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి పాత నిధులు వెచ్చించే విధంగానే మినహాయింపు ఇచ్చారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు మినహాయింపు ఇచ్చిన రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రాన్ని చేర్చుకోలేకపోవడం తీవ్ర వైఫల్యంగా పలువురు పరిగణిస్తున్నారు. జిల్లాలో వ్యయం రూ.800 కోట్లు.. ఉపాధి హామీ పథకానికి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.800 కోట్లు ఖర్చు కాగా, ఇందులో పనులకు హాజరైన 5,86 లక్షల మంది వేతనదారులకు, నిర్మాణాత్మక పనులకు ఈ మొత్తాన్ని వ్యయం చేస్తారు. అయితే ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం కూలీలకు పూర్తిగా వేతనం చెల్లించేది. ప్రస్తుత కొత్త పథకంలో వేతనదారులకు 40 శాతం రాష్ట్రమే వాటా చెల్లించాల్సిఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.800 కోట్లలో రూ.320 కోట్లు రాష్ట్రం వాటా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పనిదినాలు 100–125 రోజులకు పెంచడం వల్ల ఈ వాటా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రాలపై 40 శాతం ఆర్థిక భారం మోపుతూ తీసుకొచ్చిన వికసిత్ భారత్ జీ రామ్ జీ చట్టం వల్ల అటు రాష్ట్రాలకు ఇటు పేదలకు నష్టదాయకం. ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలి. గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలి. – సిర్ల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లాలో 4.35 లక్షల జాబ్కార్డులు ప్రస్తుత నిధుల వాటా ప్రకారం రాష్ట్రంలో పథకం నిర్వహణ గగనమే 13 రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చిన కేంద్రం అందులో చోటు దక్కించుకోవడంలో చంద్రబాబు వైఫల్యం -
పర్సు అప్పగింత
పాతపట్నం: మండల కేంద్రం పాతపట్నంలోని అచ్యుతాపురం ఎదురుగా రవింద్రభారతి పాఠశాల సమీపంలో శనివారం ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా రాణిపేటకు చెందిన బోడు గణపతికి రహదారిపై రూ.11,290, వివిధ కార్డులతో ఉన్న పర్సు దొరికింది. వెంటనే పాతపట్నం పోలీసు స్టేషన్కు వెళ్లి సీఐ ఎన్.సన్యాసినాయుడు, ఎస్ఐ కె.మధుసూదనరావు, ఏఎస్ఐ కె.రామమూర్తికి అప్పగించారు. పర్సులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా బాధితుడు కొరసవాడ గ్రామం పెద్దవీధికి చెందిన గొలుకొండ సతీష్గా గుర్తించి స్టేషన్కు పిలిపించారు. సీఐ సమక్షంలో పర్సు అప్పగించారు. నిజాయితీ చాటుకున్న గణపతిని పోలీసులు అభినందించారు. -
●దూడల పెంపకమే కీలకం
గార: మేలైన దూడల పెంపకమే పాడిసంపద వృద్ధి చెందేందుకు దోహదం చేస్తుందని శ్రీకాకుళం డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సూర్యనారాయణమూర్తి అన్నారు. మండల కేంద్రం కుమ్మరిపేటలో పశుఆరోగ్య శిబిరాల్లో డీఎల్డీఏ సౌజన్యంతో దూడల ప్రదర్శన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆడదూడల పోటీలు నిర్వహించడం వల్ల బాగా పెంపకంపై శ్రద్ధ వహిస్తారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుడు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మార్పు ధర్మారావు మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు పాడిపశువుల పెంపకంతో లబ్ధి చేకూరుతుందన్నారు. వైద్యుల సలహాలతో పెంపకం చేపట్టాలని సూచించారు. విజేతలతో పాటు పాల్గొన్న రైతులందరీకీ బహుమతులను అందజేశారు. -
గ్రూప్–1కు ఎంపికై న బోరవానిపేట యువకుడు
గార: ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో గార మండలం బోరవానిపేట గ్రామానికి చెందిన బోర జీవన్కిషోర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఎంపికయ్యాడు. ఐఐఐటీ ఖరగ్పూర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈయన 2022 గ్రూప్–1 నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా ఎంపికై ప్రస్తుతం విజయనగరం క్రైమ్ డివిజన్లో ఎన్ఫోర్సుమెంట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి డాక్టర్ బోర ప్రసాదరావు విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి బోర గీతారాణి గృహిణి. భార్య పూర్ణవర్షిత హైదరాబాద్లో గ్రాఫిక్ డిజైనర్గా పనిచేస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగిన ఉద్యోగం ఉండాలన్న కోరికతో మరోసారి గ్రూప్–1 పరీక్ష రాసి విజయం సాధించాడని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నేత్రాలు సజీవం శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని మండలవీధికి చెందిన తాళ లక్ష్మి (59) మృతిచెందడంతో ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు కుమార స్వామి, రవికుమార్ నిర్ణయించారు. విషయాన్ని రెడ్క్రాస్కు తెలియజేయడంతో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, పి. చిన్నికృష్ణల ద్వారా కార్నియాలు సేకరించారు. అనంతరం విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు. ఆల్రౌండ్ చాంపియన్గా నరసన్నపేట శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి గ్రిగ్స్మీట్ ఫైనల్స్ పోరు మొదలయ్యాయి. తొలుత జరిగిన బాలికల గ్రిగ్స్మీట్ ఫైనల్స్ పోటీల్లో అన్ని విభాగాల్లో విజయదుందుభి మోగించిన నరసన్నపేట జీహెచ్ స్కూల్ ఆల్రౌండ్ చాంపియన్గా నిలిచింది. స్పోర్ట్స్ చాంపియన్గా జెడ్పీహెచ్ స్కూల్ బొడ్డపాడు, గేమ్స్ చాంపియన్గా జీహెచ్ స్కూల్ నరసన్నపేట, జెడ్పీహెచ్ స్కూల్ అంపోలు సంయుక్తంగా నిలిచాయి. బాలికల పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లు/క్రీడాకారులకు శ్రీకాకుళం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రిగ్స్మీట్ సెక్రటరీ టి.శ్రీనివాసరావు, స్పోర్ట్స్మీట్ కార్వనిర్వాహక పాఠశాల(శ్రీకాకుళం పీఎస్ఎన్ఎంహెచ్స్కూల్) హెచ్ఎం దేవదత్తానందం, పీడీ కె.మాధవరావు, పీడీ–పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.తవిటయ్య, ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ, స్కూల్గేమ్స్ సెక్రటరీ బీవీ రమణ, ఎం.తిరుపతిరావు, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు, రాజారావు, రాజశేఖర్, పురుషోత్తం, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా బాలుర విభాగంలో జిల్లాస్థాయి గ్రిగ్స్మీట్ ఫైనల్స్ పోటీలు నిర్వహించనున్నారని కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ట్రిపుల్ ఐటీలో ముగిసిన వర్క్షాప్ ఎచ్చెర్ల : ఆర్జీయూకేటీ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాప్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్సైకిల్ (ఎన్డీఎల్సీ)పై రెండురోజులుగా నిర్వహిస్తున్న వర్క్షాప్ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా సారికి టెక్నాలజీ సంస్థ సీఈవో ప్రసాద్ సారికి మాట్లాడుతూ ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న పరిమాణాలు, వాస్తవ వినియోగాలను వివరించారు. జనరల్ ఏఐలో కొత్త విధానాలు, ప్రాయోగిక ప్రదర్శనలు, ఏఐ ఆధారిత సాప్ట్వేర్ అభివృద్ధిలో ఉన్న వృత్తి అవకాశాలపై అవగాహన కల్పించారు. విద్య, పరిశ్రమల మధ్య అంతరాన్ని వివరించారు. క్యాంపస్ డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ మాట్లాడుతూ నూతన సాంకేతికతతో పరిశ్రమల్లో పని చేయడానికి విద్యార్థులు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి ముని రామకష్ణ, అకడమిక్ డీన్ శివరామకష్ణ, ఎఫ్వో వాసు, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి కోడా దిలీప్కుమార్, డి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
తొలగిస్తున్న ఆక్రమణలు ఎవరివో అందరికీ తెలుసు
పలాస : పలాస నియోజకవర్గంలో భూ ఆక్రమణలు జరుగుతున్న మాట వాస్తవమేనని, అవన్నీ ఎమ్మెల్యే వెనుక ఉన్న దొంగలవేనని, అందుకు ఉదాహరణే కాశీబుగ్గ జగన్నాథసాగరం ఆక్రమణలని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చెప్పారు. పలాస ఉల్లాసపేటలోని వేంకటేశ్వర దేవాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం తొలగిస్తున్న ఆక్రమణలు ఎవరివో వారికే తెలుసని, ఇప్పటి వరకు తమ పార్టీ కార్యకర్త ఆక్రమణ అంటూ ఒక్కటైనా తొలగించారా అని ప్రశ్నించారు. తాను అద్దం లాంటి వాడినని, మీరు ఎలా చూస్తే అలా కనిపిస్తానన్నారు. ప్రతిసారీ నల్లబొడ్లూరు కొండ అంటారని, ఆ కంకర వెంకన్న చౌదరి తవ్వి నాకు డబ్బులు ఇచ్చాడా? అని ప్రశ్నించారు. అక్రమ కంకర తవ్వకాలపై సాక్షాత్తు పలాస తహశీల్దారు అధికారుల సమక్షంలోనే తాము అడ్డుకుంటే వెంటనే ఫోన్ వస్తుందని, తాము ఏం చేస్తామని మొరపెట్టుకోలేదా అని అన్నారు. ఆ ఫోన్ చేసిన నాయకుడిపై ఇంతవరకు చర్యలు లేవన్నారు. తన హయాంలో కబ్జా అని నిరూపించి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. కూటమి హయాంలోనే అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయని, తమ ప్రభుత్వం వస్తే ఒక్కటి కూడా ఉంచబోమని హెచ్చరించారు. సీతమ్మగుడి వద్ద వంశధార కాలువ గట్టును మింగేసి రోడ్డు వేశారని, కంబిరిగాం బ్రిడ్జి వద్ద లాండ్ సీలింగ్ యాక్టు అతిక్రమించి లేఅవుట్లు వేస్తున్నారని, వాటిపై సమాధానం చెప్పాలన్నారు. తనతో వస్తే ఎవరు ఆక్రమణలకు పాల్పడుతున్నారో చూపిస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు హనుమంతు వెంకటరావు, వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు ఉంగ సాయికృష్ణ, పైల చిట్టి, బమ్మిడి దుర్యోధనరావు, బోర బుజ్జి, పాలిన శ్రీనివాసరావు, మందస ఎంపీపీ డొక్కర దానయ్య, లీలారాణి, శిష్టు గోపి, దువ్వాడ రవి, నర్తు వెంకటరమణ, బమ్మిడి సంతోష్కుమార్, మల్లా సురేష్కుమార్, మల్లా భాస్కరరావు, పి.గురయ్యనాయుడు, ఇరోతు మోహనరావు, తిర్రి రాజారావు, డల్లి జానకి రెడ్డి, దున్న హరి, సొర్ర ఢిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు -
బెండి కొండపై ఆక్రమణల తొలగింపు
వజ్రపుకొత్తూరు రూరల్: పెద్దబొడ్డపాడు పంచాయతీ నారాయణపురం, తోటపల్లి సమీపంలో సర్వే నంబర్–252లో ఉన్న బెండి కొండపై ప్రభుత్వ భూమి ఆక్రమణలను శనివారం రెవెన్యూ అధికారులు తొలిగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెండి కొండను కొందరు నాయకులు రైతులతో కలిసి ఆక్రమించుకున్నారు. ఈ కబ్జాపై ‘10 మంది 100 ఎకరాలు..బెండి కొండపై అక్రమాల పర్వం ’ అనే శీర్షికతో గత నెల పదో తేదీన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కజ్జా పర్వంపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు శనివారం తహశీల్దార్ సీతారామయ్య సమక్షంలో యంత్రాల సాయంతో ఆక్రమణలు తొలగించారు. ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉప తహశీల్దార్ శ్రావణ్, ఆర్ఐ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతో కేసులకు మోక్షం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా సత్వరమే పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. ఎంపిక చేసిన న్యాయవాదులకు ఐదు రోజులుగా నిర్వహిస్తున్న 40 గంటల ప్రత్యేక శిక్షణా తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిత్వ ప్రక్రియలో మెలకువలు నేర్చుకోవడం వల్ల న్యాయవాదులకే కాకుండా, కక్షిదారులకు కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన న్యాయవాదులు ఈ ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించాలని, ఉభయ పక్షాల అంగీకారంతో కేసులను పరిష్కరించి ప్రజలకు భారం తగ్గించాలని సూచించారు. సీనియర్ ట్రైనర్లు వి.పి.తనకచన్, పి.జి.సురేష్లు పాల్గొని మధ్యవర్తిత్వంలోని న్యాయపరమైన చిక్కులు, వాటిని పరిష్కరించే విధానాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం
ఉపాధికి ‘చంద్ర’ గ్రహణంఉపాధికి చంద్ర గ్రహణం పట్టింది. పనులు జరగడం లేదు. –8లోనెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ చెప్పినా ప్రభుత్వం పాత పాటే పాడుతోంది. వారి దుష్ప్రచారం చివరకు వారినే చుట్టుకుంది. ఏపీ ఇమేజ్ను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నోట కల్తీ మాట రాగానే వెంటనే దేవాలయాలు శుభ్రం చేయడం, ప్రాయశ్చిత్త పూజలు చేసిన నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. – కాశీబుగ్గలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తిరుపతి లడ్డూ వివాదంలో కూటమి నాయకులు జనాలకు, భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పి తీరాల్సిందే. లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు, చేపనూనె లేదని సిట్ నివేదిక స్పష్టం చేసింది. చంద్రబాబు అబద్ధాలకు ప్రతిరూపం. ఈ ఆరోపణలు చేసిన కూటమి నాయకులంతా భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పి, తిరుపతి మెట్లన్నీ కడిగినా ప్రాయశ్చితం జరగదు. – ఇచ్ఛాపురంలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్ప్రసాద్ పాలనలో లోపాలు కప్పి పుచ్చుకోవడానికే చంద్రబాబు ఈ కుట్రలు చేస్తున్నారు. దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవడం చంద్రబాబుకు అలవాటు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే హిందూ దేవాలయాల్లో విధ్వంసాలు సృష్టించి వైఎస్సార్ సీపీపై నెట్టేయాలని చూశారు. – టెక్కలిలో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ -
రోడ్డు భద్రత అందరి బాధ్యత
శ్రీకాకుళం పాతబస్టాండ్: రోడ్డు భద్రత అనేది కేవలం ఒక నెలకే పరిమితం కాకుండా సంవత్సరమంతా పాటించాల్సిన బాధ్యత అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఉప రవాణా కమిషనర్ విజయ సారథి అధ్యక్షతన శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారి నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, క్రమశిక్షణతో వాహనాలు నడపడం ద్వారానే ప్రమాదాల నివారణ సాధ్యమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, సిబ్బంది కృషి అభినందనీయమని కొనియాడారు. మాసోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పెదపాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం విద్యార్థినులు ప్రతిభ చాటారు. ఎస్. సోని (8వ తరగతి) ప్రథమ బహుమతి సాధించగా, బి.ధనలక్ష్మి (9వ తరగతి) ద్వితీయ, బి.హాసిని (9వ తరగతి) తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేసి అభినందించారు. ఈ నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన రవాణా శాఖ అధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆర్టీఓ ఆర్.అనిల్, మోటార్ వాహన తనిఖీ అధికారులు (ఎం.వి.ఐ) గంగాధర్, కె.శిరీష, ఎస్.శిరీష, జి.శ్రీధర్, డి. సంజీవరావు, ఆర్.గోవిందరాజు, వై.శ్రీనివాస్ ఇతర సిబ్బందిని వారి నిబద్ధతకు గాను అభినందనలు తెలిపారు. -
వైఎస్ జగన్ సంస్కరణలకు కేంద్రం జేజేలు
నరసన్నపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాహసోపేతంగా చేపట్టి న భూముల సమగ్ర రీ సర్వే అప్పట్లో ఎంతో సంచలనం కలిగించింది. ఇప్పుడు కేంద్ర ఆర్థిక సర్వే కూడా ఆ ప్రక్రియ ను తాజాగా కొనియాడింది. కేంద్ర సర్వే సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్ చూసైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన శనివా రం విడుదల చేశారు. వైఎస్సార్ సీపీ కాలంలో చేపట్టిన భూ సంస్కరణలు దేశానికే మార్గదర్శకం అని కేంద్రం స్వయంగా అప్పట్లో ఒప్పుకుందని గుర్తు చేశారు. నాడు వైఎస్ జగన్ భూ సర్వే చేపడితే రైతుల భూములు లాక్కుంటార ని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, వేదికలపై అసత్యాలు మాట్లాడారని, కానీ ఇప్పుడు స్వయంగా కేంద్ర ఆర్థిక సర్వే అధికారులు ఈ పథకాన్ని ప్రశంసించడంతో బాబు కుట్రలన్నీ పటాపంచలయ్యాయని కృష్ణదాస్ ప్రకటనలో పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీ, జీపీఎస్ సహాయంతో అత్యంత పారదర్శకంగా సర్వే నిర్వహించామన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన సంస్కరణలు కేంద్రం కొనియాడుతుంటే కూటమి నాయకులు రాజకీ య కక్షతో బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిరమండలం: చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి విమర్శించారు. శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం ఎంతటి నీచానికై నా దిగజారే మనస్తత్వం చంద్రబాబు, పవన్కల్యాణ్లకు ఉందనే విషయాన్ని ప్రజలే మా ట్లాడుకుంటున్నారని అన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఎలాంటి కల్తీ జరగలేదని, ఉద్దేశపూర్వకంగా తిరుమలపై రాజకీయలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇదే విషయం ప్రజలు చర్చించుకుంటున్నారన్నారని వాటిని డైవర్షన్ చేసేందుకు కొత్తగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబును అసభ్యంగా తిట్టారంటూ ప్రచారం చేస్తూ టీడీపీ పాలిటిక్స్ మెదలుపెట్టిందని ఆమె పేర్కొన్నారు. ఎన్ని రకాల డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజలు గమనిస్తున్నారన్నారు. నరసన్నపేట: మాజీ మంత్రి అంబటి రాంబాబుపైన ఇంటి పైన కూటమి ఎమ్మెల్యే మాధవి తదితరులు దాడికి పాల్పడడంపై డీసీసీబీ మాజీ చైర్మన్, తూర్పు కాపు నాయకులు కరిమి రాజేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. రాంబాబును హత్య చేసేందుకే ఈ విధంగా పక్కా ప్లాన్ ప్రకారం ఆయన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. టీడీపీ గూండాలు పోలీసుల సమక్షంలో ఈ విధంగా భౌతిక దాడులకు తెగబడటం శోచనీయమన్నారు. ఈ మేరకు ఆయన శనివారం రాత్రి మాట్లాడారు. మాజీ మంత్రిని ఆయన కుటుంబ సభ్యులను బెదిరించి ఇంటిలో ఉన్న ఫర్నీచర్ను ధ్వంసం చేయడం, వ్యక్తిగతంగా దాడులు చేయడం సరికాదని అన్నారు. దాడులను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం శోచనీయమన్నారు. -
●వత్సవలస రాజమ్మ తల్లి జాతర ప్రారంభం
గార: జిల్లాలోనే ప్రాముఖ్యత గల వత్సవలస రాజమ్మ తల్లి జాతర శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది. శనివారం సాయంత్రానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. ఆదివారం ఉదయం ప్రధాన పీఠాల వద్ద పూజలు జరుపుకోవడంతో పాటు మొక్కులు చెల్లించుకుంటారు. వత్సవలస తొలివారం జాతరకు వచ్చే భక్తుల వాహనాలు తూలుగు మీదుగా వత్సవలస రావాలని, తిరుగు ప్రయాణంలో శ్రీకూర్మం మీదుగా శ్రీకాకు ళం పట్టణం వైపు వెళ్లాలని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్. వివేకానంద, సీఐ కె.పైడపునాయుడు తెలిపారు. సముద్ర స్నానాల్లో లోతుగా దిగవద్దని, పోలీసులకు సహకరించాలన్నారు. -
అంతర్ పాలిటెక్నిక్ క్రీడల్లో ప్రతిభ
ఎచ్చెర్ల : గత నెల 28, 29, 30వ తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అంతర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీల్లో శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. జావెలిన్త్రోలో ప్రథమ, బ్యాడ్మింటన్ సింగిల్స్, హైజంప్, 400 మీటర్ల పరుగు, 4/100 మీటర్లు రిలేలో తృతీయ స్థానాలు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్ కె.నారాయణరావు శనివారం అభినందించారు. కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు జి.దామోదరావు, బి.తులసిరావు, ఎ.శివప్రకాశరావు, డి.మురళీకృష్ణ, రామాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
కలకలం రేపిన కబ్జా
నరసన్నపేట: ప్రముఖ వాణిజ్య కేంద్రం నరసన్నపేట నడిబొడ్డున జిల్లా పరిషత్కు చెందిన (బోర్డుబంగ్లా) స్థలాన్ని కూటమి నాయకులు కాజేయడానికి ప్రయత్నాలు చేపట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. విలువైన ఈ ఆస్తిపై శ్రీకాకుళంకు చెందిన కూటమి నాయకులు కన్నేశారని, ఇది వారి పరమవుతుందనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ‘కోట్లు విలువైన స్థలం.. కొట్టేసేందుకు సిద్ధం’ అనే శీర్షికన శనివారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో ఒక్కసారిగా నరసన్నపేట ప్రజలు, రాజకీయ పక్షాలు ఉలిక్కిపడ్డాయి. అయ్యో.. ఇన్నాళ్లూ కాపాడుకుంటూ వస్తున్న ఈ స్థలమూ కబ్జాకు గురవుతుందా..అంటూ పలువురు ఆవేదన వెలిబుచ్చారు. ఉదయం నుంచీ ఈ వ్యవహారంపై చర్చ జరగడంతో అధికారుల్లో ఒక్కసారి చలనం వచ్చింది. ఆక్రమణ కట్టడికి చర్యలు మొదలెట్టారు. ఎంపీడీఓ ప్రసాద్ న్యాయ సలహా కోసం న్యాయవాదులను సంప్రదించారు. ఈ వ్యవహరంపై కలెక్టర్, జెడ్పీ సీఈఓ దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని సర్వత్రా కోరుతున్నారు. బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణపై నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాం. ముద్డాడ గోవిందరాజులు అనే వ్యక్తి గురువారం రాత్రి వచ్చి గోడ కూల్చి స్థలాన్ని దౌర్జన్యంగా చదును చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాం. – ప్రసాద్, నరసన్నపేట ఎంపీడీఓ ఈ వ్యవహారంపై స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు నరసన్నపేట పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళి, మండల పార్టీ అధ్యక్షులు లుకలాపు రవి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కనపల శేఖరరావు తదితరులు మాట్లాడుతూ కూటమి నాయకుడు కొర్ను ప్రతాప్ హస్తం దీంట్లో ఉందని ఆరోపించారు. ఆమదాలవలసకు చెందిన వ్యక్తి నుంచి ప్రతాప్ కొనుగోలు చేశారని విమర్శించారు. రాత్రిపూట వచ్చి స్థలాన్ని చదును చేయడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి నరసన్నపేటలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఈ స్థలాన్ని అన్ని విధాలా కాపాడామని, అధికారులకు సైతం పూర్తి అండగా ఉన్నామని గుర్తు చేశారు. విలువైన ఈ స్థలం కబ్జాకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఈ వ్యవహారంపై నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శనివారం స్పందించి వీడియో రిలీజ్ చేశారు. బోర్డు బంగ్లా స్థలం కాజేయడానికి కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నది వాస్తవమేనని అంగీకరించారు. భూమి విషయమై తన వద్దకూ వచ్చారని, అందుకు తాను ఒప్పుకోలేదని చెప్పారు. బోర్డు బంగ్లా స్థలం కాపాడటంలో అధికారుల ఉదాసీన వైఖరిని సైతం తప్పుపట్టారు. పరిస్థితి ఇంతవరకు రావడానికి అధికారులే బాధ్యులని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇది ముమ్మాటికీ జిల్లా పరిషత్కు చెందినదని స్పష్టం చేశారు. నరసన్నపేట బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణపై అలజడి కూటమి నేతల ప్రమేయాన్ని అంగీకరించిన ఎమ్మెల్యే బగ్గు ఆక్రమణ దందాకు అడ్డుకట్ట వేయాలన్న వైఎస్సార్ సీపీ నాయకులు న్యాయపరంగా ఎదుర్కోవడానికి అధికారుల సన్నాహాలు -
నిర్వహణ భారం
టెక్కలి: గోమాతలకు రక్షణ కరువవుతోంది. మాటలు తప్ప చేతలు లేని నాయకుల వైఖరికి నిదర్శనాలుగా కునారిల్లుతున్న గోశాలలు కనిపిస్తున్నాయి. వీటిలో వసతులు ఓ వైపు వెక్కిరిస్తుంటే గోవులకు హాస్టళ్లంటూ సమావేశాల్లో హామీలు ఇస్తుండడం విస్తుగొలుపుతోంది. కొద్ది రోజుల కిందట డివిజన్ కేంద్రమైన టెక్క లిలో గో సంరక్షణ శాల ను ఏర్పాటు చేసి కొద్ది రోజులకే మూసేశారు. ఇప్పటికే గోకులాలకు నిధులు ఇవ్వకపోవడంతో ఆ గోకులాలను అధికార పార్టీ వర్గీయులు సొంత కార్యక్రమాలకు వాడుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పశువులకు వసతి గృహాల పేరుతో ప్రతి నియోజకవర్గంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో వెండర్ పేరుతో అధికార పార్టీ కార్యకర్తలకు కాసులు వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాకుండా నియోజకవర్గ స్థాయి లో కమిటీలు ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో వసతి గృహాల నిర్వహణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వసతి గృహం ప్రక్రియలో పశు సంవర్ధక శాఖ, ఎన్ఆర్ఈజీఎస్ సమన్వయంతో షెడ్ల నిర్మా ణం చేపట్టాల్సి ఉంది. రెండు నెలల కిందట జిల్లా అధికారులకు విధి విధానాలు జారీ చేసినప్పటికీ ప్రస్తుతానికి స్థల సేకరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ వసతి గృహాల నిర్మాణంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధ్యమయ్యే పనేనా..? ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో సుమారు 50 సెంట్లు స్థలంలో సుమారు రూ. 9.95 లక్షలతో ఒక్కో పశువుల వసతి గృహం నిర్మాణం చేపట్టనున్నారు. నిర్మాణ బాధ్యతలను వెండర్కు అప్పగిస్తూ నిర్వహణ బాధ్యతలను కమిటీలకు అప్పగిస్తారు. ఒక్కో వసతి గృహంలో 20 పశువులకు ఆశ్రయం కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించారు. సొంతంగా పశువులు ఉన్న పాడి రైతులు ఆయా పశువుల పర్యవేక్షణ చేయలేని పక్షంలో వాటిని ఈ వసతి గృహంలో చేర్పించవచ్చు. ఇందులో కమిటీ సభ్యులతో అగ్రిమెంట్ కుదుర్చుకుని వారికి కొంత మొత్తాన్ని చెల్లించేలా విధి విధానాలు పొందు పరిచారు. ప్రస్తుతానికి స్థల సేకరణ ప్రక్రి య కొనసాగుతోంది. జిల్లాలో ప్రస్తుతానికి ఆవులు 3.80 లక్షలు, గేదెలు 24 వేలకు పైగా ఉన్నట్లు అధికారుల అంచనా. అయితే వ్యక్తిగతంగా నిర్మా ణం చేపట్టిన గోకులాల పరిస్థితే అధ్వానంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పశువుల వసతి గృహాల నిర్మాణం, నిర్వహణ సాధ్యమేనా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
●స్థల సేకరణ చేపట్టాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఎన్ఆర్ఈజీఎస్ అధికారుల సమన్వయంతో ఒక పశువుల వసతి గృహం ఏర్పాటుకు ఇప్పటికే స్థల సేకరణ చేపట్టాం. తదుపరి పరిశీలన చేపట్టి ఆ తర్వాత నిర్మాణం పై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. మరి కొద్ది రోజుల్లో పనుల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. –బి.రాజ్గోపాల్, జేడీ, పశు సంవర్ధక శాఖ గత ప్రభుత్వంలో పాడి రైతు చెంతకు వెళ్లి పశువులకు వైద్యం చేసే విధంగా సంచార పశు వైద్య శాలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా పశు వైద్య సిబ్బంది నియామకాలు చేశారు. వాటి కొనసాగింపు పట్టించుకోకుండా హాస్టళ్ల ఏర్పాటు అంటూ కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు. అధికార పార్టీ కార్యకర్తలకు పనులు కల్పించడానికే తప్ప పాడి రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. టెక్కలిలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రారంభించిన గో సంరక్షణ శాల నిర్వహణకే దిక్కు లేదు. – హెచ్.వెంకటేశ్వరరావు, రైతు, టెక్కలి. -
లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ‘లేబర్ కోడ్లు రద్దు చేసేవరకు పోరాడుదాం– ఫిబ్రవరి 12న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం‘ అనే పుస్తకాన్ని శనివారం శ్రీకాకుళం సీఐటీయూ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మికుల్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్ల వల్ల కార్మికుల కొనుగోలు శక్తి పడిపోయి, మార్కెట్లు మరింత కుదేలవుతాయన్నారు. అలా కాకుండా ఉండాలంటే కార్మికులు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పని బంద్ చేసి జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాలలో జరిగే ర్యాలీ, బహిరంగ సభలలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ కె.నాగమణి, జన విజ్ఞాన వేదిక జిల్లా వ్యవస్థాపక కార్యదర్శి కొత్తకోట అప్పారావు, ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఆదినారాయణమూర్తి, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డి.రమణారావు, ఉద్యోగ సంఘ నాయకులు శ్రీనివాస్ యాదవ్, సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, శ్రీకాకుళం పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఉపాధి చట్టాన్ని రద్దు చేయాలి
రణస్థలం: పీఎం మోదీ తెచ్చిన 2025 జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం–2005ను పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా గాంధీ స్ఫూర్తితో గ్రామీణ పేదలకు, రైతులకు కూలీలకు అండగా ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి పోరాడుతామని శుక్రవారం రణస్థలంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ పాత చట్టం రద్దుతో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు, పేద రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నర్సింహులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు. -
కొట్టేసేందుకు సిద్ధం!
కోట్లు విలువైన స్థలం.. నరసన్నపేట: నరసన్నపేట పట్టణం నడిబొడ్డున బజారులో ప్రభుత్వానికి చెందిన బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణకు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. కోటి రూపాయలకు పైగా విలువైన ఈ స్థలం కొట్టేయడానికి అధికార పార్టీకి చెందిన జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రికి సన్నిహితంగా ఉంటున్న ఓ వ్యక్తి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అధికారుల గతంలో కట్టిన గోడను తొలగించి గురువారం రాత్రి రెండు జేసీబీలతో బోర్డు బంగ్లా స్థలాన్ని చదును చేయించారు. ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టేందుకు సిమెంట్ ఇటుకలు సైతం సిద్ధం చేశారు. ఈ సమాచారం శుక్రవారం ఉదయం వెలుగులోకి రావడంతో స్థలం కబ్జాకు గురి కావడం ఖాయమని స్థానికులు గుసగుసలాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆమదాలవలసకు చెంది న కొందరు వ్యక్తులు బొరిగివలస వారితో కలసి తమకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని, కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందంటూ స్థలం వద్దకు వచ్చి నానా హంగామా చేశారు. అయితే అధికారులు, పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి సమర్థంగా అడ్డుకుని ఈ స్థలాన్ని కాపాడుకోగలిగారు. అప్పటి తహసీల్దార్ సింహాచలం, ఎంపీ డీఓ మధుసూదనరావులు స్పందించి ఇది ప్రభుత్వ స్థలంగా బోర్డులు పెట్టడం, స్థలం రోడ్డువైపున గోడ కట్టడం వంటివి చేయించారు. తాజాగా ఆమదాలవలసకు చెందిన వ్యక్తులు సదరు స్థలాన్ని శ్రీకాకుళానికి చెందిన టీడీపీ నాయకుడికి విక్రయించారని తెలుస్తోంది. వీరి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా సదరు నేత రాత్రిపూట వచ్చి పనులకు శ్రీకారం చుట్టారు. మంగళ, బుధవారాల్లో నరసన్నపేటకు వచ్చిన ఆయన స్థానికులతో మంతనాలు జరిపారని, టీడీపీ నాయకులు, అధికారులను సైతం కలిశారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే రాత్రి వచ్చి పనులు మట్టిని చదును చేయించారని సమాచారం. ఈ స్థలం 40 ఏళ్ల క్రితం నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. బ్రిటిష్ కాలంలో ఇక్కడ బోర్డు బంగ్లా పేరిట ఒక భవనం ఉండేది. ఇది జిల్లా పరిషత్కు చెందినది. సంబంధిత పత్రాలు సైతం ఉన్నాయని అధికారులు అంటున్నారు. అయితే ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ ఎవరో ఒకరు తమకు హక్కులు ఉన్నా యంటూ రావడం.. అధికారులు అడ్డుకోవడం జరుగుతోంది. గొట్టిపల్లి రెవెన్యూలో పరిధిలోని సర్వే నంబరు 219 బీ వన్లో ఉన్న ఈ 38 సెంట్లు (బోర్డు బంగ్లా) స్థలం ప్రభుత్వానిదేనని తహసీల్దార్, ఎంపీడీఓలు గతంలోనే స్పష్టం చేశారు. తప్పుడు పత్రా లు చూపించి తమకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, లింకు డాక్యుమెంట్లు సృష్టించుకోవడం చెల్లదని తేల్చిచెప్పారు. అయినప్పటికీ తాజాగా ఈ స్థలంలో మట్టి చదును చేయడం.. దీని వెనుక కేంద్ర మంత్రి సన్నిహితుడు ఉన్నారనే ఆరోపణలు రావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటికే పట్టణం, పరిసర గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న అధికార పార్టీ కార్యకర్తలు ఇప్పుడు దీనిపై కన్నేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై నరసన్నపేట పంచాయతీ ఈఓ ద్రాక్షాయిని వద్ద ప్రస్తావించగా సమాచారాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. బోర్డు బంగ్లా స్థలంలో రాత్రి ఎవరో వచ్చి జేసీబీల సహాయంతో మట్టి చదును చేశారని మా దృష్టికి వచ్చింది. ఎవరో తెలియకుండా రాత్రి సమయంలో వచ్చి పనులు చేయడం సరికాదు. మీ స్థలం అనుకున్నప్పుడు రాత్రి వచ్చి పనులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. పగలే చేయవచ్చుకదా? దీనిపై దృష్టి పెట్టాం. ఎవరు పనులు చేశారనేదానిపై ఆరా తీస్తున్నాం. – వెంకటేశ్వర ప్రసాద్, నరసన్నపేట ఎంపీడీఓ -
వైఎస్సార్సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురిని రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియమిస్తూ శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీచేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా బరాటం నాగేశ్వరరావు, మైనార్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంఏ రఫీ, ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ఐటీ విభా గం రాష్ట్ర కార్యదర్శిగా చినపాన సాయిసందీప్రెడ్డిలను నియమించారు. టెక్కలి: టెక్కలి ఆదిఆంధ్రావీధిలో భర్త చితికి భార్య తలకొరివి పెట్టిన ఘటన చోటు చేసుకుంది. జోగి మల్లేష్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందా డు. ఒక్కగానొక్క కుమారుడు గతంలోనే మృతి చెందడంతో భార్య సీతమ్మ అంత్యక్రియలు పూర్తి చేసింది. సంతబొమ్మాళి: తాళ్లవలసలో శుక్రవారం వరి కుప్పలు దగ్ధమయ్యాయి. దుబ్బాక శశిభూషణరావు, పురుషోత్తం, కామమ్మ, గున్న పాపారా వులకు చెందిన సుమారు ఐదు ఎకరాల వరి చేనుకుప్పలు కాలిపోవడంతో సుమారు రూ.2 లక్షలు నష్టం వాటిల్లింది. పారిశుద్ధ్య కార్మికు లు రోడ్డు ఇరువైపులా చెత్త పోగుచేసి ఒకేచోట మంట పెట్టారు. ఈ క్రమంలో పక్కన ఉన్న వరి కుప్పలకు అంటుకోవడంతో దగ్ధమయ్యా యని స్థానికులు అంటున్నారు. టెక్కలి అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: దేశం కోసం సేవలందించిన మాజీ సైనికుల సంక్షేమం, వారి కుటుంబాల రక్షణే లక్ష్యంగా ‘నాల్సా వీర్ పరివార్ సహాయత యోజన–2025’ను ప్రవేశపెట్టినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పెద్దరెల్లి వీధిలో జిల్లా సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. నూతనంగా ఏర్పాటు చేసిన లీగల్ సర్వీస్ క్లినిక్ని ప్రారంభించి, మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమ స్యలపై చర్చించారు. కార్యక్రమంలో స్పెషల్ జడ్జి (పోక్సో) ఎన్.సునీత, ప్యానెల్ అడ్వకేట్ వి.జ్యోతిర్మయి, పారా లీగల్ వలంటీర్ కె.ఆదిత్యకుమార్, కెప్టెన్ పి.ఈశ్వరరావు, జిల్లా సైనిక సంక్షేమ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం: పాత పీఆర్సీ గడువు పూర్తయి 30 నెలలు గడిచినా 12వ పీఆర్సీ కమిటీని ఏర్పా టు చేయకపోవడం తగదని ఎస్టీయూ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పీఆర్ సీ జాప్యంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన ర్లలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఈ మేరకు ఎస్టీయూ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ రమణమూర్తి నేతృత్వంలో శ్రీకాకుళం తహసీల్దార్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ప్రకటిస్తామ ని, ఆర్థిక బకాయిల చెల్లింపులు చేస్తామని, పెన్షనర్లకు పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా మని హామీలిచ్చి ఇప్పుడు విస్మరించడం తగదన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఫిబ్రవరి 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా, 25న ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాల ని నిర్ణయించామని, ఉపాధ్యాయులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. బరాటం నాగేశ్వరరావు చినపాన సాయిసందీప్రెడ్డి ఎంఏ రఫీ -
ఆక్రమణలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?
● తొలగించకపోతే మీపై చర్యలు తప్పవు ● పలాసలో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం పలాస : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో భూ ఆక్రమణలను తక్షణమే తొలగించాలని, లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. పలాస నియోజకవర్గంలో ఇష్టానుసారంగా భూ ఆక్రమణ లు, కంకర తవ్వకాలు జరుగుతుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. పలు వివాదాస్పద స్థలాలను పరిశీలించారు. సూదికొండ సర్వే నంబరు 51లో డీ పట్టా భూము ల్లో ఇతర వ్యక్తులు ఎలా ఉన్నారని , ఆ భూముల్లో ఏం సాగు చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే వారికి నోటీసులు ఇవ్వాలని తహశీల్దారును ఆదేశించారు. డి పట్టా భూములను అడుగుతున్న సమయంలో మండల సర్వేయరు గిరి సరైన సమాధా నం చెప్పకపోవడంతో అక్కడికక్కడే సస్పెండ్ చేస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నంబరు 52 లో ఉన్న లే అవుట్కు అనుమతులు లేవని కలెక్టరు దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే వారికి నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. బొడ్డపాడు రెవెన్యూ పరిధిలోని కోసంగిపురం కూడలి వద్ద సర్వే నంబరు 67లో డి.పట్టా భూములను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని బొడ్డపాడు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. పలాస జగన్నాథసాగరం ఆక్రమణ ప్రాంతాన్ని సందర్శించారు. చెరువు గర్భాన్ని ఆక్రమిస్తుంటే మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా వేసిన లేఅవుట్ ను తక్షణమే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావును ఆదేశించారు. అనంతరం వంశధా ర ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ చెరువు పనులు తక్షణమే ప్రారంభించి ఆ ఫొటోలు పంపించాలని ఆదేశించారు. చిన్న చిన్న సమస్యల ను కూడా ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ఆర్డీవో వెంకటేశ్ను ప్రశ్నించారు తహశీల్దారు కళ్యాణచక్రవర్తిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరుతో పాటు ఎమ్మెల్యే శిరీషా, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఏపీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరా వు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పీరుకట్ల విఠల్రావు, లొడగల కామేశ్వరరావు, గాలి కృష్ణారావు, బి.నాగ రాజు, ఎం.నరేంద్ర, కొరికాన శంకర్, సవర రాంబా బు తదితరులు పాల్గొన్నారు. -
పెంచుతోంది దడ
ఆకాశయానం చేస్తున్న బంగారం ధర సామాన్యులను భయపెడుతుంటే.. దొంగలను మాత్రం రెచ్చగొడుతోంది. రోజురోజుకూ స్వర్ణం ధర విపరీతంగా పెరుగుతుండడంతో చోరులు హస్త లాఘవం చూపుతున్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో దాడులకు కూడా వెరవడం లేదు. ఈ వైఖరి జిల్లాలో ఆందోళన కలిగిస్తోంది. చైన్స్నాచింగ్లు, దోపిడీలకు కూడా ఆస్కారం ఉంది. శుక్రవారమే ఏకంగా రెండు చైన్స్నాచింగ్లు జరగడం ఓ హెచ్చరిక.శ్రీకాకుళం క్రైమ్ : -
అభయం
శ్రీకాకుళంశనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026వారికి ఆ.. భయం శ్రీకాకుళం క్రైమ్: రథసప్తమి వేడుకల వీఐపీ, వీవీఐపీ పాసుల కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గురువారం నలుగురు జిరాక్స్, ప్రింటర్ షాపు యజమానులను, మరో ఐదుగురు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ఈ వార్త దావానలంలా పాకడం, ప్రభుత్వ పెద్దలకూ విషయం తెలియడంతో సూర్యనారాయణ స్వామి సన్నిధిలో అసలు ఏం జరిగిందన్నదానిపై ఇప్పటికే స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో తెరవెనుక ఉన్న సూత్రధారుల మంత్రాంగం ఇప్పటికే మొదలైంది. దాని పర్యవసానంగా శుక్రవారం పోలీసులు ఎదుట హాజరైన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లలో కీలక వ్యక్తి ప్రశాంత్, మరో వ్యక్తి రివర్స్ గేమ్ ఆడినట్లు సమాచారం. ఉన్నతాధికారులు పిలవడంతోనేనంటూ.. జిల్లా ఉన్నతాధికారులే తమను వేడుకలకు ఆహ్వానించారని, అధికారులు అన్ని విధాలా తమను వాడుకున్నారని ఇన్ఫ్లూయెన్సర్లు రివర్స్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది. తాము తీసిన వీడియోల వల్లనే వేడుకకు అంతమంది జనం వచ్చారని చెప్పినట్లు సమాచారం. ఇన్ఫ్లూయెన్సర్లను తప్పించే పనిలో.. మరోవైపు ఈ డూప్లికేట్ వ్యవహారం ముదిరి పాకాన పడటంతో వెనక ఉన్న సూత్రధారులే ఇలా మాట్లాడించినట్లు తెలుస్తోంది. ఇన్ఫ్లూయెన్సర్లు నోరు విప్పితే ఎక్కడ తమ జాతకాలు బయట పడతాయేమోనని ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు, ఇన్ఫ్లూయెన్సర్లను తప్పించే పనిలో పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ కేసులో ఉండరు. ఎలాగైనా తప్పిస్తాం’ అని కొంతమంది జిల్లా కీలక నేతల అనుచరులు అభయమిస్తున్నట్లు సమాచారం. దీంతో గత మూడు రోజులుగా పోలీసులు ఎప్పుడు పిలుస్తుంటే అప్పుడు వెళ్తున్న జిరాక్స్ ప్రింటర్ షాపుల వారినే బుక్ చేస్తారేమోననే అనుమానం వ్యక్తమవుతోంది. జిరాక్స్ షాపువాళ్లకు వీవీఐపీ పాస్ల సాఫ్ట్ కాపీ పీడీఎఫ్ అందించిన అసలైన నిందితులు.. అధికారులు, అధికార పార్టీ నాయకుల అండదండలతో తప్పించుకుంటారనే ప్రచారం జరగుతోంది. రథసప్తమి వేడుకల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వడం జిల్లా వాసులు గమనించారు. పౌర విమానయాన శాఖ అనుమతి లేనిదే హెలికాప్టర్ వద్దకు మొబైల్ తీసుకెళ్లడానికి లేదు. కానీ వీరు మాత్రం చాలా సులువుగా మొబైళ్లతో వీడియోలు తీసుకున్నారు. సామాన్యులు రూ.2200 పెడితే గానీ హెలికాప్టర్ దరిదాపుల్లోకి అనుమతించలేదు. కానీ వీరంతా ఉచితంగానే హెలికాప్టర్ ఎక్కడమే కాకుండా.. కింద అధికారులకు టాటా చెబుతూ వీడియోలు కూడా తీశారు. ఆ దృశ్యాలు చూసి ప్రజలు, మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల శాతం తగ్గించాలని జిల్లా రవాణాశాఖ అధికారి గంగాధర్ పిలుపునిచ్చారు. రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం శ్రీకాకుళంలోని ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటో డిపో గ్యారేజీ ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. జిల్లాలోని నాలుగు డిపోల్లో ప్రమాద రహితంగా విధులు నిర్వర్తించిన డ్రైవర్లను సన్మానించారు. రోడ్డు భద్రతపై మున్సిపల్ స్కూల్, అమర కౌమది స్కూల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డీఎస్పీ వివేకానంద చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా ప్రజారవాణా అధికారి సి.హెచ్ అప్పలనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం 1, 2 డిపో మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కె.ఆర్.ఎస్.శర్మ, అసిస్టెంట్ మేనేజర్లు పి.సంతోష్కుమార్, ఎ.గంగరాజు, ఎస్ఎం ఎంపీ రావు, అధికారులు ఎఎన్ఎస్ శ్రీనివాస్, పి.ప్రసాదరావు, రాజు, యూ నియన్ల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీలో వర్క్షాపు ప్రారంభం
ఎచ్చెర్ల : స్థానిక ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సారిక టెక్నాలజీ సంస్థ సహకారంతో ‘జీఈఎన్ఏ1 ఎస్డీఎల్సీ’ అంశంపై రెండు రోజుల వర్క్షాప్ను డైరెక్టర్ కొక్కిరాల వెంకటధన బాలాజీ శుక్రవారం ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ బాలాజీ సూచించారు. సంస్థ సీఈవో ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాధిపతి కోడా దిలీప్కుమార్ కన్వీనర్గా వ్యవహరించగా, డి.పద్మావతి సహ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి డాక్టర్ వాసు, కంప్యూటర్సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆలిండియా సాఫ్ట్బాల్ పోటీలకు నలుగురు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా స్కూల్గేమ్స్ అండర్–17 బాలబాలికల సాఫ్ట్బాల్ చాంపియన్షి ప్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ పోటీలు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ వేదికగా ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు జరగనున్నాయి. జిల్లా నుంచి బాలురు జట్టుకు సీహెచ్ జశ్వంత్, పి.శరత్కుమార్, పి.హర్షఅభిరామ్, బాలికల జట్టుకు ఎ.జ్యోత్స్న ఎంపికై న వారిలో ఉన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ బాలబాలికల జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు శుక్రవారం అభినందించారు. డిర్యక్రమంలో డిప్యూటీ ఈవో విలియ మ్స్, పీడీ–పీఈటీ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ, స్కూల్గేమ్స్ సెక్రటరీ బీవీ రమణ, మహిళా కార్యదర్శి ఆర్.స్వాతి, జెడ్పీహెచ్ స్కూల్ కేశవరావుపేట పీడీ వై.కోటేశ్వరరావు, జి.మల్లేష్ పాల్గొన్నారు. -
చిన్నతనంలోనే పెద్ద కష్టం
ఎచ్చెర్ల/జి.సిగడాం : నిరుపేద కుటుంబాలను ప్రాణాంతక వ్యాధులు వెంటాడుతున్నాయి. చిన్నతనంలోనే వారి బతుకులను చిదిమేస్తున్నాయి. ఏమీ చేయ లేని నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద తల్లిదండ్రులు పిల్లల బాధలను చూడలేక అల్లాడిపోతున్నారు. దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామానికి చెందిన కానూరి భద్రరావుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నకుమారుడు జ్ఞానేశ్వరరావు(7) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. మూడేళ్ల వయస్సులోనే తల్లిని కోల్పోయాడు. దీంతో తండ్రి కూలి పనులు చేసుకుంటూ జీవనం నెట్టుకోస్తున్నాడు. కొడుకు దీనావస్థను చూసిన తండ్రి తన వద్ద ఉన్నదంతా వైద్యానికి ఖర్చు చేశాడు. చివరికి ఇంటిని సైతం అమ్మేసి వైద్యం చేయించా డు. ఇప్పుడు గ్రామంలో ఓ స్కూల్లో కుటుంబంతో తలదాచుకుంటున్నాడు. వైద్యుల సూచన మేరకు జ్ఞానేశ్వరరావును అగనంపూడి క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్పించారు. బతకడానికే కష్టంగా ఉన్న ఆ కుటుంబానికి వైద్యం ఖర్చులు భరించ డం మరింత భారంగా మారింది. జ్ఞానేశ్వరరావు వైద్యం కోసం సాయం చేయాలనుకుంటే 8978820683 నంబర్ను సంప్రదించవచ్చు. -
పీఎం–ఉషా పథకంపై సమీక్ష
ఎచ్చెర్ల: ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (పీఎం–ఉషా) పథకంపై ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ కె. ఆర్.రజనీ మాట్లాడుతూ కేరళలోని కన్నూర్ యూనివర్సిటీలో పీఎం–ఉషాపై జరిగిన దక్షిణ భారత ప్రాంతీయ సమావేశంలో చర్చకు వచ్చిన ఉన్నత విద్యా రంగ అంశాలను వివరించారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా పీఎం–ఉషా పథకం క్రింద మంజూరైన నిధుల నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించామని చెప్పా రు. విద్యార్థి కేంద్రీకృత కార్యకలాపాలకు, వినూత్న వైజ్ఞానిక ప్రదర్శనల నిర్వహణకు వర్సిటీ విభాగా లు సిద్ధం కావాలన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ప్రిన్సిపాళ్లు ఎం.అనూరాధ, సీహెచ్ రాజశేఖరరావు, కె.స్వప్నవాహిని, అధ్యాపకులు పి. సుజాత, పీఎం–ఉషా వర్శిటీ నోడల్ అధికారి కె.కావ్యజ్యోత్స్న, ఎగ్జామ్ డీన్ ఎస్.ఉదయభాస్కర్, ఎస్ వో సామ్రాజ్యలక్ష్మీ, ఎల్.అనంతరావు పాల్గొన్నారు. -
ప్రయోగాలకు వేళాయె!
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ సైన్స్ విద్యార్థుల ప్రాక్టికల్స్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి ఒకటి నుంచి మొదలుకానున్న ప్రాక్టికల్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే కేంద్రాలకు బుక్లెట్స్, ఇతర సామగ్రి చేరవేశారు. ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ నేతృత్వంలో డీఈసీ కమిటీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. నిఘా నడుమ పరీక్షలు.. ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో అధికారులు నిఘా పెట్టారు. ఇందుకోసం మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లతోపాటు డీఈసీ కమిటీ సభ్యులు బి.శ్యామ్సుందర్, ఎస్.భీమేశ్వరరావు, ఎస్.అన్నపూర్ణారావు, బీటీవీ మంగపతి, ఇంటర్బోర్డు అధికారులు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టనున్నారు. సీసీ కెమెరాలతో ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయడంతో వాటిని ఇంటర్బోర్డు సెక్రటరీ/సీఓఈ అధికారులతోపాటు జిల్లా ఆర్ఐఓ కార్యాలయానికి స్ట్రీమింగ్ చేశారు. కాగా, మెజారిటీ కాలేజీల్లో విద్యార్థుల నుంచి రూ.500 నుంచి 800 వరకు ‘కలెక్షన్స్’కు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 119 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. వీటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 37, మోడల్ స్కూల్/కాలేజీలు 13, సోషల్ వెల్ఫేర్ 8, ట్రైబల్ వెల్ఫేర్ 1, ప్రైవేటు అన్ ఎయిడెడ్ మరో 60 కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 15432 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్కు సన్నద్ధమౌతున్నారు. ఎంపీసీ గ్రూపు నుంచి 10626 మంది, బైపీసీ గ్రూపు నుంచి 4806 మంది విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్లు, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లు, ఇతర సిబ్బంది నియామకాలు పూర్తిచేశారు. అయితే కొంతమంది లెక్చరర్లు/ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లను సుదూర ప్రాంతాలకు ఎగ్జామినర్లగా నియామకాలు చేయడంతో వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒకటో తేదీ నుంచి మొదలయ్యే సైన్స్ ప్రాక్టికల్ పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టిక ల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల నుంచి వసూళ్లకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – రేగ సురేష్కుమార్, జిల్లా ఆర్ఐఓ -
‘అభివృద్ధి చెందిన భారత్ దిశగా విద్యా ఉద్యమం’
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అభివృద్ధి చెందిన భారత్ దిశగా ధనిక్ భారత్ విద్యా ఉద్యమం జరుగుతోందని ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత అన్నారు. ధనిక్ అనే భావన కేవలం ఆర్థిక సంపదకే పరిమితం కాకూడదని అన్నా రు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆమె గురువారం విలేకరు ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సులువుగా ఐఏఎస్ ఎలా అవ్వాలనే దానిపై అవగాహన కల్పించారు. ఒత్తిడి లేని విద్య ద్వారానే అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడం జరుగుతుందన్నారు. క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, జీవిత లక్ష్యం స్పష్టత పెంపొదించవచ్చన్నారు. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కేవలం చదువు మాత్రమే కాదని మేథస్సు నైతికత, భావోద్వేగ పరిపక్వత, జీవణ నైపుణ్యాల సమగ్ర వికాశమే ధనిక భారత్ లక్ష్యమన్నారు. సమావేశంలో ఆమెతో పాటు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు. పోలాకి: ‘నేను చనిపోతున్నాను .. ఇకపై నాతో మీకు ఏ ఇబ్బందులు ఉండవు’ అని తన కుటుంబానికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లిపోయిన మహిళను పోలాకి పోలీసులు మొబైల్ ట్రాకింగ్ సిస్టం వినియోగించి సకాలంలో రక్షించారు. పోలాకి పోలీస్స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మహిళ పైవిధంగా చెప్పి ఇంటిదగ్గర నుండి వెళ్లిపోయిందని 112కు కాల్ వచ్చింది. వెంటనే స్పందించిన ఎస్ఐ రంజిత్ సాంకేతిక సమాచారం ఆధారంగా ఆమె ఆముదాలవలస ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి లోకల్ పోలీసులతో పాటు జీఆర్పీ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బందితో పాటు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒక నిండుప్రాణాన్ని కాపాడిన పోలాకి పోలీసులను ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు. మందస: మందస మండలం జిల్లుండ పంచాయితీ డిమిరియా గ్రామంలో ప్రభుత్వం ఆమోదించిన ఇంటింటి పైపులైన్లను కొందరు అధికార వర్గ ‘పెద్ద లు’ అడ్డుకున్నారు. తమ స్థలంలో పైప్లైన్ వేయవద్దని పనులు ఆపేశారు. ఎస్సీ వీధుల్లోని ప్రభుత్వ స్థలంలో పైపులైన్లు వెళ్తుండగా ఇది తమ జాగా అంటూ బెదిరించి పనులు ఆపివేయించారు. వైస్ ఎంపీపీ సీర ప్రసాద్ దీన్ని ఖండించినా, ప్రభుత్వం తమదని, తమ ఇష్టమని విమర్శించారు. దీనిపై గ్రామ స్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవదాయ భూములను కూడా ఆక్రమించారని ఆరోపిస్తున్నారు. అధికారులు పరిశీలించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు గురువారం ఆలయంలో స్వామికి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు చేశారు. అలాగే అనివెట్టి మండపంలో శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కల్యాణమూర్తులకు ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సాందీప్ శర్మ కల్యాణం జరిపించారు. -
కృషి విజ్ఞాన కేంద్రానికి రాష్ట్రస్థాయి అవార్డు
ఆమదాలవలస: ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రానికి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చినట్లు కేవీకే ప్రొగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి గురువారం తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2024–25 సంవత్సరానికి కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాలవలస వారు చేసిన విస్తరణ సేవలకు గాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రం అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. గుంటూరు లామ్లో జరిగిన పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశంలో ఉపకులపతి, డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మీదేవి చేతులమీదుగా ఈ అవార్డును ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి అందజేశారు. -
అపార్తో ఎన్నో ప్రయోజనాలు
ఎచ్చెర్ల: ఆటోమేటిక్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ద్వారా విద్యార్థికి, విద్యా సంస్థలకు భద్రతతో కూడిన గుర్తింపు, ప్రయోజనాలు సాధ్యమవుతాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ప్రాంతీయ సమన్వయకర్త రవిపాండే అన్నారు. ప్రతి విద్యాసంస్థ, విశ్వవిద్యాలయాలు దీన్ని అనుసరించాలని కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చిందని తెలిపారు. యూజీసీ నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్.ఎ.డి) రాష్ట్ర ఉన్నత విద్యామండలితో కలిసి బిఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ‘అపార్’పై రాష్ట్ర స్థాయి వర్క్షాపును గురువారం నిర్వహించింది. రీసోర్స్ పర్సన్గా పాల్గొన్న రవిపాండే మాట్లాడుతూ అపార్లో విద్యార్థి వివరాలు నమోదు చేసుకుంటే అతనికి సంబంధించి అకడమిక్ డేటా, సర్టి ఫికెట్లు, సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలకు డిజి లాకర్లో పూర్తి భద్రత ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థి ఆన్లైన్లో ఎప్పటికప్పుడు వీటిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఆధార్, పాన్లాగే విద్యార్థులందరికీ అపార్ కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు. అపార్, సమర్థ్ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ పి.అనిల్కుమార్ మాట్లాడుతూ వాట్సాప్, ఈ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు అందుకోవడానికి అపార్, సమర్థ్ యాప్లు ఉపయోగపడతాయన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య మాట్లాడుతూ బిఆర్ఏయూ పరిధిలో సుమారు 32,451 మంది విద్యార్థులకు అపార్ ఐడీ నమోదు చేశామని, ఆరు లక్షల ఎనభై వేలకు పైగా విద్యార్థుల వివరాలు ఎన్ఏడీకి పంపించామని తెలిపారు. -
వారధి.. భయపెడుతున్నది
మేఘవరం పంచాయతీలో బొరిగిపేట, మేఘవరం గ్రామాలకు వెళ్లే మార్గంలో వంశధార ప్రధాన కాలువ పై ఉన్న వంతెనలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ఆయా గ్రామాల ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. టెక్కలి నుంచి బొరిగిపేట గ్రామానికి వెళ్లే మార్గంలో వంశధార ప్రధాన కాలువ పై ఉన్న వంతెన నిర్మాణం చేపట్టి దశాబ్దాలు గడిచాయి. ఇదే మార్గంలో అనేక గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. మరో వైపు పదికి పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరడం, అంతే కాకుండా భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాగే మేఘవరం గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వంతెన సైతం ఇదే దుస్థితిలో ఉంది. ఇప్పటికై నా పాలకులు స్పందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – టెక్కలి -
రైల్వే స్టేషన్ ఆవరణలో వ్యక్తి మృతి
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలో ఆర్పీఎఫ్ బ్యారెక్స్ పక్కన సరుబుజ్జిలి మండలం, సవలాపురం జంక్షన్కు చెందిన కొల్ల సింహాచలం (58) మృతి చెందారు. మృతుడు బుధవారం ఉదయం ఆ ప్రాంతానికి వాష్ రూమ్ కోసం వెళ్లి అక్కడే పడిపోయి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు 108కు ఫోన్ చేసి చెప్పగా వారు వచ్చి పరిశీలించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారణ చేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ విషయం రైల్వే పోలీసులు దృష్టికి వెళ్లినప్పటికీ ఆ ప్రాంతం ఆమదాలవలస పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుందని వారు పట్టించుకోకుండా విడిచిపెట్టినట్లు తెలిసింది. పోలీసులకు సమాచా రం రావడంతో గురువారం ఎస్ఐ ఎస్.బాలరాజు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి మృతుని జేబు లో ఉన్న ఆధార్ కార్డు ద్వారా సమాచారం తెలుసుకొని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీమ్తో పరిశీల న జరిపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. -
హోంగార్డుకు రూ.20 కోట్ల ఆస్తులు
విజయనగరం క్రైమ్/గుర్ల: ఆయన చేసేది హోంగార్డు ఉద్యోగం... సంపాదించింది రూ.20 కోట్లు పైబడి. విజయనగరం గోకపేటలోని లక్ష్మీనివాస్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న నెట్టి శ్రీనివాసరావు ఆదాయానికి మించిన ఆస్తుల చిట్టాను గురువారం జరిపిన దాడుల్లో ఏసీబీ అధికారులు బహిర్గతం చేశారు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం ఏసీబీ విభాగంలో సుమారు పదిహేనేళ్ల కిందట నెట్టి శ్రీని వాసరావు హోంగార్డుగా విధుల్లో చేరారు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారన్న సమాచారాన్ని ముందుగానే సంబంధిత అధికారులు, ఉద్యోగులకు చేరవేసేవారు. ఇలా రూ.వేలు, రూ.లక్షల్లో నగదు, వివిధ ఆస్తుల రూపంలో లబ్ధిపొందినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందితో లోపాయికారి ఒప్పందంతో సంబంధా లు నెరిపేవాడు. ఆయన వైఖరిపై అనుమానం వచ్చిన అధికారులు ఏడాదిన్నర బదిలీ చేయించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం మేరకు విజయనగరంలోని శ్రీనివాసరావు ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ దాడు లు చేసి రెండు ప్లాట్లు, ఒక ఆర్సీసీ బిల్డింగ్, నా లుగు ఇళ్ల స్థలాలు, 166 గ్రాముల బంగారం, రూ.60వేల నగదు, రూ.7.07 లక్షల బ్యాంకు బ్యా లెన్స్, కారు, బైక్ తదితర ఆస్తులను సీజ్చేశారు. -
జనసేన మౌనమెందుకు..?
● ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై నర్తు రామారావు ఘాటు విమర్శలు ఇచ్ఛాపురం రూరల్: జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధ్యత గల పదవిలో ఉంటూ మహిళా ఉద్యోగిని భయపెట్టి, లైంగికంగా వేధించడం అత్యంత దారుణమని ఎమ్మెల్సీ నర్తు రామారావు పేర్కొన్నారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు నైతిక విలువలకు ఆదర్శంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి వ్యవహా రాలు ప్రజలను నిరాశకు గురి చేస్తున్నాయని తెలిపారు. ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికీ నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. మహిళా సాధికారత, నైతికత గురించి ఉపన్యాసాలు ఇచ్చే పవన్ కల్యాణ్ తమ పార్టీ నేతల విషయంలో మౌనం పాటించడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఇలా వరుసగా ఘటనలు వెలుగు చూస్తు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యమే ఈ తరహా అక్రమాలకు ప్రోత్సాహం ఇస్తోందని ఆరోపించారు. ప్రజల నుంచి ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చిన నాయకులు వ్యక్తిగత జీవితాల్లో కూడా బాధ్యతగా ఉండాలన్నారు. మహిళా ఉద్యోగుల భద్రత, గౌరవం చంద్రబాబు పాలనలో ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం, మహిళా కమిషన్ తక్షణమే నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితురాలికి న్యాయం చేసి, ఎమ్మెల్యే శ్రీధర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అపవిత్ర రాజకీయంపై ఆధ్యాత్మిక విజయం
పాతపట్నం: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ కుట్రలేనని తేలిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. సీబీఐ దర్యాప్తులో నెయ్యిలో జంతువు ల కొవ్వు కలవలేదని తేలడంతో, సత్యం గెలిచినందుకు కృతజ్ఞతగా గురువారం స్థానిక శ్రీ నీలమణిదుర్గ ఆలయంలో పార్టీ నాయకులతో కలిసి రెడ్డి శాంతి అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో వాడిన నెయ్యిలో ఎలాంటి అపవిత్రత లేదని శాసీ్త్రయంగా తేలిపోయిందన్నారు. తన పాలనలోని వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ఈ లడ్డూ డ్రామా ఆడారని, దానికి పవన్ కల్యాణ్ వత్తాసు పలకడం దురదృష్టకరమని విమర్శించా రు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు ఉర్లాన బాలరాజు, పార్టీ అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, మీసాల వెంకట రామకృష్ణ, పెనుమజ్జి విష్ణుమూర్తి, పోలాకి జయమునిరావు, గండివలస ఆనందరావులు, మాజీ ఎంపీపీ బాలరాజు, నాయకులు రెడ్డి రామారావు, ఎరుకొల వెంకటరమణ, మడ్డు తాతయ్య, ఏవీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు జాబ్మేళా నిర్వహణ
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో నెహ్రూ యువకేంద్రం వేదికగా ఈనెల 31వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తు న్నట్టు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ తెలి పారు. జాబ్మేళాలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కంపెనీ, జయభేరి ఆటోమోటివ్ సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నా రు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన సీ్త్ర, పురుషులు అర్హులన్నారు. కనీసం టెన్త్క్లాస్ ఉత్తీర్ణులై ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు శనివారం ఉదయం 10 గంటలకు తమ బయోడేటా, ఆధార్కార్డు, సర్టిఫికెట్లు తీసుకురావాలని సుధ సూచించారు. అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర దేవదాయ శాఖ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజాశంకర్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు చేయించారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: చిన్న, మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధికి క్రమశిక్షణ అవసరమని, ఎన్ఆర్డీసీ వర్క్షాపులో పాల్గొన్న వక్తలు తెలిపారు. జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ(ఎన్ఆర్డీసీ), ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థలు సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళా సమాఖ్య భవన సమావేశ మందిరంలో గురువారం వర్క్షాప్ నిర్వహించారు. ‘మేధో సంపత్తి హక్కులు–సాంకేతిక బదిలీ–వాణిజ్యీకరణ’ అనే అంశంపై వ ర్క్షాప్లో మాట్లాడారు. ఎన్ఆర్డీసీ డిప్యూటీ మేనేజర్ ప్రీతి నిహారిక, ఎన్ఆర్డీసీ విశాఖపట్నం డీఎం హెడ్ డాక్టర్ భవ్య మంజీరలు ప్రసంగించారు. -
అవస్థల నడుమ..
శాలిహుండం యాత్రలో సారవకోట గ్రామానికి చెందిన తూలుగు కాంతమ్మ మెట్ల మార్గం వద్ద కుప్పకూలింది. పోలీసులు వెంటనే ప్రాథమిక చికి త్స అందించగా, సమీపంలోనున్న కిమ్స్ సిబ్బంది వైద్య చికిత్స అందించారు. అరగంట తర్వాత స్వామి దర్శనం చేయాలని పట్టుపట్టగా బీపీ ఉందని వెళ్లడం అంత మంచిది కాదని తెలిపారు. అదేవిదంగా కొండ మీద రాళ్ల దారుల గుండా ఇష్టానుసారంగా నడిచిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. తోపులాటలో మరికొంత మందికి స్వల్ప అస్వస్థతకు గురికాగా, పలు సంస్థల ఆరోగ్య శిబిరాల వద్ద చికిత్స పొందారు. మూడేళ్ల చిన్నారికి ఆరోగ్య సమస్య రావడంతో వెంటనే చికిత్స చేశారు. ● తీర్థస్నానం తర్వాత భక్తుల రద్దీ పెరిగింది. ● గుడి నుంచి కింద వరకు ఉన్న 300 మెట్లు నిండా భక్తులతో నిండిపోవడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. ● క్యూలైన్ సమీపంలోని మెట్ల వద్ద ఆరుగురు వృద్ధులు కింద పడిపోవడంతో హాహాకారాలు మిన్నంటాయి. తొక్కిసలాటలో పోలీసులు కూడా ఇరుక్కున్నారు. ● భక్తుల తాకిడితో ఉదయం 10.30 తర్వాత ఈ యాత్రకు కేటాయించిన బస్సులు కూడా ఆపేశారు. ● వంశధార నుంచి నడిచివచ్చిన భక్తులు ఎక్కువమంది ఉపవాసం ఉంటారు. కొండపైకి వచ్చాక తాగునీరు పంపిణీ ప్రారంభించలేకపోవడంతో భక్తులు మండిపడ్డారు. ● దాదాపు రెండు లక్షల మంది భక్తులకు ఒక్క మరుగుదొడ్డి కూడా ఏర్పాటు చేయలేదు. కొండ రాళ్ల గుండా వెళ్తున్న భక్తులుసొమ్మసిల్లిన భక్తురాలు -
అపురూపం.. అరటి గెలల ఉత్సవం..!
టెక్కలి: భీష్మ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామంలో రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఆ గ్రామంలో ప్రతిఏటా భీష్మ ఏకాదశి రోజున పెద్ద ఎత్తున అరటి గెలల ఉత్సవం జరుగుతుంది. గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా గ్రామంలోని లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కోర్కెలు తీరుతాయని.. భీష్మ ఏకాదశి రోజున ఆలయ ప్రాంగణంలో పరవస్తు అయ్యవారికి అరటి గెలలను సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకం అక్కడి ప్రజలది. దీంతో ప్రతిఏటా అరటి గెలల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది అరటి గెలల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో గ్రామంలో ఉత్సవ కమిటీ సభ్యులంతా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురువారం ఆలయంలో పూజా కార్యక్రమాలతో పాటు భజనా కాలక్షేపం, అన్నదానం నిర్వహించనున్నారు. వీటితో పాటు మొదటి రోజు చింతామణి నాటకం, రెండో రోజు మెగా డ్యాన్స్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇదీ చరిత్ర.. చెట్లతాండ్ర గ్రామంలో అరటి గెలలు మొక్కులుగా చెల్లించుకునే సాంప్రదాయం వెనుక ఎంతో చరిత్ర ఉంది. 172 ఏళ్ల క్రితం ప్రస్తుతం నౌపడ ఆర్ఎస్.. అప్పట్లో రాళ్లపేట రైల్వేస్టేషన్లో చెట్లతాండ్ర గ్రామానికి చెందిన కుమ్మర్లు కుండలు అమ్మడానికి వెళ్లగా, వారి వద్దకు పరవస్తు అయ్యవారు వచ్చి తనను చెట్లతాండ్ర గ్రామానికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో ఆయా కుమ్మర్లు అయ్యవారిని గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామంలో అప్పట్లో ఉన్న పాఠశాల వద్ద గ్రామానికి చెందిన పంగ అప్పలనాయుడుకు చెందిన స్థలంలో పర్ణశాల ఏర్పాటు చేసి అయ్యవారికి ఆతిథ్యం ఇచ్చారు. ఆయన నిత్యం లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధిస్తూ గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు. గ్రామంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సత్సంగ కార్యక్రమాలు చేపట్టేవారు. గ్రామంలో ఏదైనా కుటుంబంలో సమస్యలు తలెత్తినప్పుడు అయ్యవారికి తెలియజేసి నరసింహస్వామికి మొక్కుకునేవారు. దీంతో ఆ సమస్యలు తొలగిపోవడమే కాకుండా కోరిన కోర్కెలు నెరవేరుతుండేవి. అయ్యవారి వద్ద ఉన్నటువంటి అక్షయపాత్ర నుంచి ప్రతిరోజూ స్వామివారికి నైవేద్యం సమర్పిస్తూ భక్తులకు ప్రసాదాలుగా అందజేసేవారు. అయితే ఏ రోజూ వంటకాలు చేసిన దాఖలాలు లేవు. కేవలం అక్షయపాత్ర నుంచి వచ్చే ప్రసాదాన్ని మాత్రమే నైవేద్యంగా సమర్పించేవారు. ఇలా నేటి నుంచి చెట్లతాండ్రలో భీష్మ ఏకాదశి ఉత్సవాలు అరటి గెలల నైవేద్యానికి అంతా సిద్ధం తరలి రానున్న వేలాదిమంది భక్తులు -
సమస్యలపై పోరాటాలకు సిద్ధమవ్వాలి
జి.సిగడాం: ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటాలకు సిద్ధమవ్వాలని ఏపీటీఏఫ్ (257) జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు పిలుపునిచ్చారు. బుధవారం ఎందువ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు ఐఆర్, పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేస్తామని అనేక హమీలు ఇచ్చారని, వీటిలో ఒక్క హామీ నేరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదిలో అప్గ్రేడ్ చేసిన పాఠశాలల్లో హెచ్ఎంలు, పీడీ పోస్టులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. యాప్లతో ఉపాధ్యాయలను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. అలాగే సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీటీఏఫ్ నాయకులు కాయల రమేష్, కిల్లారి వెంకటరమణ, కమిటీ సభ్యులు బొడ్డేపల్లి రమణమూర్తి, ఎలకల ఆదినారాయణ, పిట్టా అప్పారావు, కోనారి నారాయణప్పడు, కొంచాడ సూర్యారావు, అల్లు బాలాజీ, సనపల రోహిణి కుమారి, ఏనుగుతల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
జి.సిగడాం: మండలంలోని సీతంపేట కూడలి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలు పాలయ్యారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. నిద్దాం గ్రామానికి చెందిన చౌదరి సూర్పనాయుడు(45), అదే గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త పొదిలాపు ఆదినారాయణ ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై రాజాం వెళ్లారు. అక్కడనుంచి తిరిగి ఇంటికి వస్తుండగా పొగిరి – పాలఖండ్యాం గ్రామాల మధ్యలో ఉన్న సీతంపేట కూడలి వద్ద అదుపుతప్పి వ్యాన్ను ఢీకొన్నారు. ప్రమాదంలో సూర్పనాయుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆదినారాయణకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా ఆదినారాయణను రాజాం అస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య గౌరమ్మ, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నిద్దాం గ్రామంలో బుధవారం నుంచి నిద్దాలమ్మ తల్లి యాత్ర మహోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ యాత్రకు పూజారులుగా సూర్పనాయుడు కుటుంబ సభ్యులు వ్యహరించారు. మరణవార్త తెలియగానే గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్సీ రమణ తెలిపారు. ● యువకుడికి తీవ్ర గాయాలు రణస్థలం: లావేరు మండల కేంద్రానికి సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇజ్జాడపాలెం గ్రామానికి చెందిన తిమిరి దుర్గ ప్రసాద్ తలకు బలమైన గాయం కావడం పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. అలాగే మరో యువకుడు ప్రమాద స్థలం నుంచి ద్విచక్ర వాహనం ఆపకుండా వెళ్లిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్వర్టును ఢీకొని.. కంచిలి: మండలంలోని మఠం సరియాపల్లి పంచాయతీ పరిధి నారాయణబట్టి గ్రామం వద్ద మంగళవారం రాత్రి ముండ్ల గ్రామానికి చెందిన దుర్యోధన ప్రధాన్(35) అనే వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో కల్వర్టును ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడు మఠం సరియాపల్లి గ్రామం వైపు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుడికి భార్య భువనేశ్వరి ప్రధాన్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడు విదేశాల్లో ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంతలో ఈ ప్రమాదం జరిగి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రభుత్వ పోరంబోకు స్థలం కబ్జా..?
కంచిలి: మండలంలో ముఖ్య వ్యాపార కూడలిగా పేరున్నటువంటి మఠం సరియాపల్లి గ్రామంలో మెయిన్రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ పోరంబోకు స్థలం కబ్జాకు గురవుతోంది. సుమారు 8 మూరల వెడల్పు, 60 అడుగుల పొడవు గల స్థలాన్ని స్థానిక టీడీపీ నేత ఒకరు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే నంబర్ 198(1)లో ఈ ప్రభుత్వ పోరంబోకు స్థలం ఉన్నట్లు చెబుతున్నారు. ఇది సుమారు రూ.25 లక్షల వరకు మార్కెట్ విలువ ఉంటుందని సమాచారం. ఈ స్థలం వెనుక ఆ నేతకు సంబంధించిన జిరాయితీ స్థలం ఉండడంతో ముందున్న పోరంబోకు స్థలాన్ని ఆక్రమించడానికి అవసరమైన గ్రావెల్ను తెప్పించి, అందులో పోసి స్థలాన్ని ఎత్తు చేశారు. దీంతో స్థానికంగా ఈ ఆక్రమణ విషయం చర్చనీయమైంది. ఈ స్థలంలో జగనన్న పాల సేకరణ కేంద్రం, పశువైద్యశాల, మార్కెట్ కాంప్లెక్స్లు నిర్మించడానికి సర్వే చేయించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఇక్కడ కొంతస్థలంలో మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించగా, మిగతా స్థలం ఖాళీగా ఉంది. స్థలంలో గతంలో కూడా ఆక్రమణపై వివాదం ఏర్పడడంతో సమస్య కోర్టు వరకు వెళ్లింది. దీనిపై కోర్టు స్పందించి ప్రభుత్వ పోరంబోకు స్థలంగా నిర్ధారించింది. తాజాగా స్థానిక టీడీపీ నేతకు చెందిన జిరాయితీ స్థలం ముందు ఉండడంతో, ఆక్రమించి నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నిస్తున్నాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై రెవెన్యూ అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేపట్టి, ప్రభుత్వ పోరంబోకు స్థలంలో జరుగుతున్న ఆక్రమణను అడ్డుకోవాలని స్థానిక సర్పంచ్ కొణపల సురేష్, ఎంపీటీసీ సభ్యుడు బుడ్డెపు విశ్వనాథం తదితరులు డిమాండ్ చేశారు. దీనిపై తహసీల్దార్ ఎన్.రమేష్కుమార్ను వివరణ కోరగా.. సమగ్రంగా దర్యాప్తు చేసి, తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని తెలిపారు. -
కిడ్నీ వ్యాధితో హెచ్ఎం మృతి
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని ఈదుపురం.ఆర్ ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న మార్కెండేయ బిసాయి(59) మంగళవారం మృతి చెందారు. కవిటి మండలంలోని కుసుంపురం గ్రామానికి చెందిన ఆయన గత కొన్ని రోజుల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ సోంపేటలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. మంగళవారం రాత్రి భోజనం చేస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే వాహనంలో సోంపేట ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందారు. ఈయనకు భార్య అనసూయ, కుమారుడు నవీన్ బిసాయి, కుమార్తె మనీషలు ఉన్నారు. మృతికి ఎంఈవోలు కురమాన అప్పారావు, ఎస్.విశ్వనాథంలు, ఉపాధ్యాయ సంఘాలు సంతాపం తెలిపాయి. బొంతొరియా సంఘ నాయకుడిగా, ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా మార్కండేయ బిసాయి సేవలు అందించారని పలువురు గుర్తు చేసుకున్నారు. -
కొత్తపాలేంలో అధికారుల పర్యటన
కవిటి: మండలంలోని కొత్తపాలేం గ్రామంలో నెలకొన్న తాగునీటి ఇబ్బందులపై ‘ఏం నేరం చేశామని’ శీర్షికతో సాక్షి దిన పత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ ఏవీ మురళీమోహనరావు, మండల ఇంజినీర్ బి.వంశీ గ్రామంలో బుధవారం పర్యటించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న దయనీయ పరిస్థితులు చూసి తక్షణ చర్యలకు సిద్ధమయ్యారు. రానున్న వేసవిలో నీటి ఎద్దడి నివారణకు రూ.3.50 లక్షల వ్యయంతో ప్రస్తుతం ఉన్న మినీ వాటర్ ట్యాంకర్తో పాటు మరొకటి ఇసుక దిబ్బలున్న వీధికి సమీపంలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి మండల పరిషత్కు అందించారు. అదేవిధంగా గ్రామంలో ఇంటింటికీ కుళాయిల నిర్మాణాలకు కీలకమైన 20,000 లీటర్ల పరిమాణం కలిగిన ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంకర్ నిర్మాణానికి ఇప్పటికే రూ.26.85 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులు టెండర్ దశకు చేరుకున్నాయన్నారు. ఈ పనులు సాధ్యమైనంత త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు. తక్షణ నీటి అవసరాల కోసం మండల పరిషత్ అధికారులు ట్యాంకర్తో నీటిని పంపిణీ చేయించారు. ట్యాంకర్తో నీటిని పంపిణీ చేస్తున్న దృశ్యం -
దర్జాగా కబ్జా..!
● ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను ● పలాసలో రూ.కోట్లు విలువైన భూములు స్వాహా ● పట్టించుకోని అధికారులు వజ్రపుకొత్తూరు రూరల్: అంతర్జాతీయ స్థాయిలో తెల్ల బంగారం(జీడిపప్పు)కు ప్రసిద్ధి గాంచిన పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. కళ్లకు కనిపించిన ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు పోటీ పడుతున్నారు. అందిన మేరకు ప్రభుత్వ భూమిని కాజేసి అమ్మకాలు చేపడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ ప్రాంతంలో వ్యాపార, వాణిజ్య కేంద్రాలతో పాటు జాతీయ రహదారి, రైల్వే రవాణా సౌకర్యం ఉండడం, అలాగే సముద్ర తీరం కూడా సుమారు 10 కి.మీ దూరంలో ఉండడంతో ఇక్కడ ఉన్న భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగే ఇటీవల పలాస జిల్లాగా మారుతుందని జోరుగా ప్రచారం జరగడంతో ఎక్కువ మంది ప్రజలు ఈ ప్రాంతంలో ఇంటి స్థలాలను కొనేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఇంటి స్థలాల రేట్లు కూడా భారీగా పెరిగాయని క్రయ విక్రయదారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే అవకాశాన్ని కొంతమంది అక్రమార్కులు అదునుగా చేసుకొని ప్రభుత్వ భూములపై కన్నేశారు. విలువైన ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలను ఆక్రమించి ఇంటి స్థలాలుగా అమ్మకాలు చేపడుతూ దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు మాత్రం తమకేమీపట్టనట్లుగా మొద్దునిద్ర నటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీ పరిస్థితి.. పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కబ్జాలు పెరిగాయి. అదే పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పలాస–కాశీబుగ్గ పరిధిలో ఉన్న సూదికొండ, పెంటిభద్ర, పురుషోత్తపురం, పద్మనాభపురం మార్కెట్ యార్డు వెనుకన ఉన్న ప్రభుత్వ భూమి, కాలువను సైతం ఆక్రమించుకున్నారు. ఆయా ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేసి, గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు చేపట్టారు. అలాగే ఒకే ఇంటి స్థలాన్ని ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు అమ్మకాలు చేసి భూ వివాదాలు సైతం సృష్టించారు. దగ్గరుండి భూ వివాదాలు సైతం పరిష్కరించి రూ.లక్షల్లో దండుకున్నట్లు తెలుస్తోంది. సూదికొండకు ఆనుకొని ఉన్న పలాస, పురుషోత్తపురం పరిధి సర్వే నంబర్ 51లో 60.20 ఎకరాల భూ విస్తీర్ణం ఉంది. ఈ మొత్తం విస్తీర్ణంలో ప్రభుత్వాలు దశలు వారీగా పేదలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేశాయి. కొంతభాగం కొండ ప్రాంతం ఉంది. కాగా సుమారు రూ.20 కోట్లు విలువైన మిగిలిన ప్రభుత్వ భూమిని ప్రస్తుతం కొంతమంది అధికార కూటమి పార్టీల నాయకులు ఆక్రమించుకొని, పక్కనే ఉన్న పద్మనాభపురం రెవెన్యూ -
తొలితరం కమ్యూనిస్టు మృతి
పలాస: మండలంలోని బొడ్డపాడు గ్రామానికి చెందిన తొలితరం కమ్యూనిస్టు నాయకుడు, బొడ్డపాడు అన్నదాత రైతు సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజాం గుణవంతు (76) బుధవారం మృతి చెందాడు. అతను అప్పటి శ్రీకాకుళం పోరా టంలో పాల్గొని కొంతకాలం అజ్ఞాత జీవితం, మరికొంతకాలం జైలు జీవితం కూడా అనుభవించాడు. నిరంతరం ప్రజల కోసం, బొడ్డపా డు గ్రామ అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి మృతిపై గ్రామస్తులు దిగ్బ్రాంతి చెందారు. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గ్రామంలో గురువారం అంతిమ యాత్ర జరగనుందని గ్రామస్తులు తెలిపారు. అనుమతులను సద్వినియోగం చేసుకోండి టెక్కలి: ఏపీ ఎండీసీ ఆధ్వర్యంలో ఇవ్వనున్న గ్రానైట్ క్వారీ లీజు అనుమతులను ఆసక్తి కలిగిన యజమానులు సద్వినియోగం చేసుకోవాలని టెక్కలి మైన్స్ ఏడీ విజయలక్ష్మి కోరారు. ఈ మేరకు ఏపీ ఎండీసీ ఆధ్వర్యంలో క్వారీ లీజు అనుమతులపై బుధవారం టెక్కలిలో గ్రానైట్ క్వారీ యజమానులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎండీసీ ఆధ్వర్యంలో క్వారీ లీజులను ఏ విధంగా పొందాలి అనే విషయా న్ని వివరించారు. కార్యక్రమంలో మైన్స్ డీడీ కార్యాలయం ఏజీ ఆర్.కుమార్నాయుడు, ఏపీ ఎండీసీ సహాయ ప్రాజెక్టు అధికారి దీన్ పాల్, స్థానిక మైన్స్ కార్యాలయం ఏజీ రాము, ఆర్ఐ గణేష్ తదితరులు పాల్గొన్నారు. అన్యాయంగా చెక్కు పవర్ రద్దు చేశారు ఎచ్చెర్ల: మండలంలోని బొంతలకోడూరు గ్రామ సర్పంచ్ చెక్కు పవర్ను కూటమి నాయకులు అన్యాయంగా రద్దు చేయించారని సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు, ఎంపీటీసీ మాడుగుల జగదీష్లు ఆరోపించారు. ఈ మేరకు గ్రామంలో బుధవారం నిరసన తెలిపారు. సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు గానీ, సాధారణ నిధులు గానీ దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. కానీ 10 నెలలుగా ఇప్పటివరకూ చెక్కు పవర్ పునరుద్ధరణ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలతో ఎన్నికై న ప్రజాప్రతినిధుల అధికారాలను కలెక్టర్, డీపీవోలు ఏ అధికారంతో తీసుకున్నారో తెలియజేయాలని ప్రశ్నించారు. రాష్ట్ర హైకోర్టు కూడా నవంబర్ 20వ తేదీన చెక్కు పవర్ను పునరుద్ధరించాలని ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాలిచ్చి 4 నెలలు కావస్తున్నా జిల్లా పంచాయతీరాజ్ అధికారులు కూటమి నాయకుల కనుసన్నల్లో పనిచేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీరాజ్ అధికారులు దర్యాప్తు చేయాలని, అవినీతి జరిగితే ఈ పదవులు విడిచిపెడతామని స్పష్టం చేశారు. చెక్కు పవర్ను వెంటనే పునరుద్ధరణ చేయాలని, లేదంటే పోరా టాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
స్వాధీనం చేసుకున్న
నగదుకంచిలి బీసీ బాలురు వసతి గృహంలో అసిస్టెంట్ బీసీ వేల్ఫేర్ ఆఫీసర్ బాల ముకుందరావు కింది స్థాయి సిబ్బంది లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇద్దరు సబార్డినేట్ స్టాఫ్ నుంచి రూ.లక్షా 84వేల70 ఏసీబీ స్వాఽధీనం చేసుకుంది. కంచిలి బీసీ బాలుర వసతి గృహాన్ని అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్గా వాడుతున్నారు. ఇటీవల భోజనం బిల్లులు వసతి గృహాల అధికారుల ఖాతాల్లో పడ్డాయి. ఆ డబ్బులను ప్రతీ నెలా ఇవ్వాల్సిన ముడుపులకు గాను బి.కాంతారావు, ఎన్.ఉపేంద్ర, ఎస్.రామకృష్ణ, పి.కృష్ణవేణి, టి.కోదండరాం అనే వసతి గృహ అధికారులు తమకు ఇన్చార్జ్గా ఉన్న వాటితో కలిపి 11వసతి గృహాలకు సంబంధించి ముడుపులను ముట్టజెప్పారు. ఒక్కొక్క విద్యార్థికి సంబంధించి రోజుకి రూ.5చొప్పున నెలకి ఒక విద్యార్థి పేరున రూ.150 ముడుపులు తీసుకుంటున్నట్టు తేలింది. ఎంత మంది విద్యార్థులుంటే అన్ని రూ.150 తీసుకుంటున్నట్టుగా స్పష్టమైంది. ఈ వ్యవహారంలో ఏబీసీడబ్ల్యూఓ, ఇద్దరు సబార్డినేట్లతో పాటు డీబీసీడబ్ల్యూఓను కూడా ఏసీబీ అధికారులు విచారించారు. -
శ్వేతగిరి..
నమ్మకాల సిరి ● ప్రత్యేకంగా నిలుస్తున్న శాలిహుండం జాతర ● భీష్మ ఏకాదశి వేళ కొనసాగుతున్న సంప్రదాయాలు ● అరటి గెలలు.. ● సొరంగం.. కొండ మధ్యభాగంలోని వీరవసంతేశ్వర ఆలయం కింది భాగంలో సొరంగ మార్గం ఉందని పెద్దలు చెబుతుంటారు. శ్వేతగిరి నుంచి శ్రీకూర్మనాథాలయం వరకు ఈ సొరంగం ఉందని, మండు వేసవిలో కూడా చల్లని నీరు ఉంటుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం. ● రాళ్లు పేరుస్తూ.. ● నామం పండ్లు.. సుద్ధతో చేసిన రామలక్ష్మణ బొమ్మలున్న నామం పండ్లను జాతరకు వచ్చేవారంతా కొనుగోలు చేయడం ఆనవాయితీ. వీటిని ఇంటికి తీసుకువెళ్తే ఆ ఏడాదంతా ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం పడదని నమ్మకం. శాలిహుండం యాత్ర(ఫైల్)గార : ఉత్తరాయణ పుణ్యకాలంలో హిందువులు ముఖ్యంగా రైతులు ఆది జాతరగా జరుపుకొనే యాత్ర శాలిహుండం గిరి జాతర. ఎన్నో నమ్మకాలు, మరెన్నో విశ్వాసాలు అడుగడుగునా గోచరిస్తుంటాయి. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తొలి జాతరగా (దాసుళ్లు యాత్ర) పిలిచే ఈ ఉత్సవంలో భక్తులు ఆచరించే కొన్ని నమ్మకాలు, విశ్వాసాలను పరిశీలిస్తే.. వేణుగోపాలుడికి క్షీరాభిషేకంకోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ వేణుగోపాలస్వామి జాతరకు వచ్చే భక్తుల్లో కొందరు ఆలయం ఎదుట అరటి గెలలు కడతారు. కోరిక నెరవేరిన తర్వాత కూడా గెలలు కట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఆ పండ్లనే భక్తులంతా ప్రసాదంగా స్వీకరిస్తారు. ● చక్రతీర్ధ స్నానం.. శ్వేతగిరి నుంచి రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న వంశధార నదికి కాళీయమర్ధన వేణుగోపాలుడి ఉత్సవమూర్తులను రెండు పల్లకిల్లో తీసుకెళ్తారు. అక్కడ చక్ర తీర్ధస్నానం చేసే సమయంలో భక్తులు సైతం పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇలా చేస్తే పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయని నమ్మకం. కొండపై రాళ్ల పేర్పు ఎక్కువగా కనిపిస్తుంటుంది. జాతరకు వచ్చిన దంపతుల్లో ఒక్కరైనా స్వామి దర్శనం తర్వాత సొంతింటి నిర్మాణం జరగాలని కోరుకుంటూ ఇలా కంకర రాళ్లు పేర్చుతారు. -
వెయిట్ లిఫ్టింగ్లో అదరహో..
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా యూనివర్సిటీ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన దూబ హేమశ్రీ సత్తాచాటింది. చంఢీఘర్లోని పంజాబ్ యూనివర్సిటీ వేదికగా జరుగుతున్న ఆలిండియా అంతర్ యూనివర్సిటీ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో 53 కేజీల విభాగంలో కాంస్య పతకంతో మెరిసింది. హేమశ్రీ శ్రీకాకుళం నగరంలోని విద్యాధరి డిగ్రీ కళాశాలలో చదువుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తరఫున టోర్నీలో ప్రాతినిధ్యం వహించింది. శాప్ కోచ్ ఐ.అప్పన్న వద్ద శిక్షణ పొందుతున్న హేమశ్రీ ఇప్పటికే అనేక ప్రతిష్టాత్మక టోర్నీల్లో రాణించి పతకాల పంట పండించింది. తండ్రి దూబ రాంబాబు టైలర్గా కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి విజయ గృహిణి. తల్లిదండ్రులు, వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్, కోచ్ల ప్రోత్సాహంతో హేమశ్రీ రాణిస్తూ యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఏపీపీగా తేజేశ్వరరావు శ్రీకాకుళం పాతబస్టాండ్: రెండో అదనపు జిల్లా కోర్టు(మహిళా కోర్టు) అదనపు పబ్లిక్ పాసిక్యూటర్గా (టెన్యూర్)న్యాయవాది శివాల తేజేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన శ్రీకాకుళం బార్ సభ్యుడిగా ఉన్నారు. తేజేశ్వరరావు నియామకం పట్ల శ్రీకాకుళం బార్ అసోషియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.శివప్రసాద్, పి.దామోదరరావు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ)లో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్, రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు గడువును అధికారులు పొడిగించారు. ఈ నెల 27తో గడువు ముగియాల్సి ఉన్నా అభ్యర్థుల సౌకర్యార్థం జనవరి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు సంబంధించి నాలుగు ఖాళీలు ఉండగా, పోస్టును బట్టి నెలకు రూ.23,120 నుంచి రూ.89,720 వరకు వేతన శ్రేణి వర్తించనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లా కోర్టు అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని, ఈ నెల 30లోపు అందజేయాల్సి ఉంటుందని, రిజిస్టర్డ్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్ ద్వారా ‘చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, శ్రీకాకుళం’ చిరునామాకు పంపాలని డీఎల్ఎస్ఏ కార్యదర్శి హరిబాబు తెలిపారు. గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ జిల్లాలోని గురుకులాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 6 నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకులాల జిల్లా కో–ఆర్డినేటర్ వై.యశోదలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు దరఖాస్తులు ఫిబ్రవరి 19లోగా అందజేయాలని కోరారు. వివరాలకు 9701736862, 8790653296 నంబర్లను సంప్రదించాలని కోరారు. మధ్యవర్తిత్వమే రాజమార్గం శ్రీకాకుళం పాతబస్టాండ్: కక్షిదారులు తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం గొప్ప అవకాశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి కె.హరిబాబు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులకు ‘మధ్యవర్తిత్వం’పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్య వర్తిత్వంలో ఇరుపక్షాల అంగీకారంతో షరతులను ఖరారు చేసి ఒప్పంద పత్రాన్ని తయారు చేస్తారని వివరించారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారమైతే కక్షిదారులు చెల్లించిన కోర్టు ఫీజును తిరిగి పొందే వెసులుబాటు ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ వి.పి.తనకచన్, అడ్వకేట్ పి.జి.సురేష్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తంగి శివప్రసాద్, కార్యదర్శి పిట్టా దామోదరరావు, న్యాయవాదులు ఎ.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రత్యేక రోజుల్లో అదనం..
అంబేడ్కర్ జయంతి, అంబేడ్కర్ వర్ధంతి, గాంధీ జయంతి, గాంధీ వర్ధంతి, జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాలు అని, పుడ్ కమిషన్ పర్యటన కోసమని, బీసీ కమిషన్ ఉన్నతాధికారులు వచ్చారని, సంబంధిత ఉన్నతాధికారులు వచ్చారని.. ఇలా పలు ప్రత్యేక కార్యక్రమాల పేరుతో సంబంధిత జిల్లా అధికారుల వరకు వసతి గృహాల అధికారుల నుంచి వసూళ్లకు తెగబడుతున్నారు. సహాయ అధికారి కార్యాలయం నిర్వహణ కోసమని రూ.500, జిల్లా అధికారి కార్యాలయం నిర్వహణ కోసమని రూ.500 చొప్పున అదనంగా ప్రతీ వసతి గృహం నుంచి ముట్టజెప్పాలి. ప్రతి డివిజన్లో కలెక్షన్ కింగ్లను పెట్టుకున్నారు. వీరు వ్యక్తిగతంగా ముడుపులు ఇవ్వనవసరం లేదు. కలెక్షన్ చేసి అధికారులకు ఇవ్వడమే వారి పని. ఒకవేళ కలెక్షన్ ఇవ్వని వారు ఎవరైనా ఉన్నా..ఆలస్యం చేసినా వారిపైన జిల్లా అధికారులకు లేనిపోనివి చెప్పి వారిపై ప్రత్యేక తనిఖీ జరిపి వేధిస్తుంటారు. ● విద్యార్థుల పేరుతో అక్రమ వసూళ్లు ● చెలరేగిపోతున్న సంక్షేమ శాఖ అధికారులు ● ఒక్కొక్క విద్యార్థి పేరున రోజుకు రూ.5 చొప్పున ముడుపులు ● అడ్డగోలు నిర్వహణతో ముడుపులు ముట్టజెబుతున్న వార్డెన్లు ● పలుచోట్ల విద్యార్థుల్లేకుండానే వసతిగృహాల నిర్వహణ ● తీర ప్రాంత వసతి గృహాల్లో పరిస్థితి మరింత అధ్వానం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడతారో లేదో అనవసరం. వారి ఆలనా పాలనా చూసుకుంటారో లేదో పట్టించుకోరు. సంబంధిత అధికారులకు కావల్సినదంతా ముడుపులే. విద్యార్థికింత చొప్పున ఇచ్చేస్తే చాలు వసతి గృహాలు ఎలా ఉన్నా విద్యార్థులు ఏమైపోయినా పర్వాలేదు. జిల్లాలోని పలు సంక్షేమ వసతిగృహాల్లో జరుగుతున్న అవినీతి బాగోతం చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క విద్యార్థికి రోజుకి రూ.5 చొప్పున, మరికొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క విద్యార్థికి నెలకి రూ.35 చొప్పున ముడుపులు ఇస్తే చాలు ఆ వసతి గృహాలపై పర్యవేక్షణ ఉండదు. సంబంధిత సంక్షేమాధికారుల జోలికి ఏ ఒక్కరూ వెళ్లరు. జిల్లాలో ఇదొక అనవాయితీగా నడుస్తోంది. అధికారులు తమ చేతికి మట్టి అంటకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కింది స్థాయి సిబ్బందితో వసూళ్ల పర్వానికి తెరతీశారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు అడ్డగోలు సంపాదనతో అధికారులకు వసతి గృహాల అధికారులు కూడా ముడుపులు ఇస్తున్నారు. తీర ప్రాంతంలో స్వాహా.. జిల్లాలో అనేక రకాలుగా వసతి గృహాల నుంచి సంబంధిత అధికారులు వసూళ్లు చేస్తున్నారు. కొన్నిచోట్ల సబార్డినేట్లను కలెక్షన్ ఏజెంట్లుగా పెట్టగా, మరికొన్ని చోట్ల కొందరు వసతి గృహ సంక్షేమ అధికారులను కలెక్షన్ కింగ్లను ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతంలోని హాస్టళ్లలో పిల్లలు ఉండటం లేదు. అక్కడ కనీసం వసతి గృహాల నిర్వహణ ఉండదు. విద్యార్థులంతా ఇంట దగ్గరే ఉంటారు. వారి ఇంటికి ప్రతిరోజు వెళ్లి ఫేస్ రికగ్నేషన్ స్కాన్(ఎఫ్ఆర్ఎస్) చేస్తారు. వారంతా వసతి గృహంలోనే భోజనం చేస్తున్నట్టుగా రికార్డుల్లో పేర్కొని డైట్ బిల్లులు, ఇతరత్రా బిల్లులు పెట్టేస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో సముద్రతీర ప్రాంతంలోని16 వసతి గృహాల్లో విద్యార్థులు లేకపోయినా.. వారి ఇంటికి వెళ్లి ఎఫ్ఆర్ఎస్ వేయించుకుని బిల్లులను అక్రమంగా డ్రా చేస్తున్నారు. ఇలా వచ్చిన సొమ్మును సంబంధిత అధికారులు పంచుకుంటున్నారు. ఒక్క బీసీ సంక్షేమ వసతి గృహాల్లోనే కాకుండా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థికి రూ.5 చొప్పున వసూలు ● కొన్నిచోట్ల తక్కువ హాజరుకు బదులు విద్యార్థుల హాజరు ఎక్కువ చూపించి బిల్లులు డ్రా చేస్తున్నారు. ● ఇలా చేసిన ఒక్కొక్క విద్యార్థి పేరున రోజుకి రూ.5, నెలకి రూ.150చొప్పున సంబంధిత అధికారులకు వసతి గృహ సంక్షేమ అధికారులు ముడుపులుగా ఇస్తున్నారు. ● వసతి గృహాలతో సంబంధం ఉన్న అధికారులందరికీ లబ్ధి చేకూరుతుండటంతో అవినీతిపర్వం యథేచ్ఛగా సాగిపోతోంది. ● మరికొన్ని వసతి గృహాల్లో ఒక్కొక్క విద్యార్ధి పేరున నెలకి రూ.35 చొప్పున అధికారులు తీసుకుంటున్నారు. ● ఇందులో సహాయ అధికారులకు రూ.20 చొప్పున, జిల్లా అధికారులకు రూ.15 చొప్పున అందుతోంది. ● జిల్లాలో 81 బీసీ, 31 ఎస్సీ, 19 ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ కలిపి 11,341మంది విద్యార్థులు ఉన్నారు. ● వీరి పేరున ఎంత ముడుపులు ఇస్తున్నారో సంబంధిత వసతి గృహాల అధికారులకు, తీసుకుంటున్న ఉన్నతాధికారులకు తెలియాలి. -
శ్రీకాకుళం
ఏం నేరం చేశామని ఈ శిక్ష..? ● పాతికేళ్లుగా తాగునీటికి తంటాలు పడుతున్నాం ● మండల పరిషత్ ఎదుట బైఠాయించిన కొత్తపాలెం మహిళలు ● ఊరికి కుళాయిలు వేయాలని వేడుకోలు బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026‘పాతికేళ్లుగా మా గ్రామానికి తాగునీరు కల గా మిగిలిపోయింది. ఉద్దానం ప్రజల దాహార్తిని తీర్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.700 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసి ఇంటింటికీ మంచినీటి కుళాయిలు వేశారు. మా ఊరికీ ఆ నీళ్లు ఇప్పించాలి. ఏం నేరం చేశామని మా గ్రామంపై ఈ చిన్నచూపు’ అంటూ కవిటి మండలం కొత్తపాలెం మహి ళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 700 జనాభా గల ఊరిలో కేజీబీవీ కూడా ఉంది. అయినా మంచినీరు ఇచ్చే ఆలోచన ఏ నాయకుడూ చేయలేదు. దీంతో స్థానిక మహిళలు మంగళవారం కవిటి మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఓట్లు వేసినప్పుడు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పిన నేతలు గెలిచాక తమకు కనీసం తాగునీరు అందించడం లేదని అన్నారు. మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే అశోక్కు కూడా ఆయన సొంత పంచాయతీలో ఉన్న తమ తాగునీటి కష్టాలు కనిపించడం లేదా? 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో మా అంతటి దుస్థితి ఎవ్వరికీ ఉండదేమో అని మండల పరిషత్ కార్యాలయం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. నెలకు మూడు నాలుగు సార్లు తమ ఊరిలో 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడి ప్రాణసంకటంగా మారుతున్నాయని, అయినా పట్టించుకోవడం లేదని అన్నారు. సమస్యలపై సత్వర చర్యలు తీసుకోకుంటే వెయ్యి మందితో రోడ్డెక్కి నిరసన తెలుపుతామని అన్నారు. ప్రస్తుతం ఊరికి ఓ ట్యాంకు వస్తున్నా అందులో వచ్చిన నీరు ఒక వ్యక్తి సగానికి పైగా వాడుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. స్నానాలకు కూడా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. –కవిటి వెయ్యిమందితో నిరసన చేస్తాం దాదాపు పాతికేళ్లుగా తాగునీటి కోసం కటకటలాడుతున్నాం. పలుమార్లు పత్రికల్లో కథనాలుగా సమాచారం ఇచ్చాం. ప్రత్యక్షంగా చెప్పాం. ఏం చేసి నా ఇప్పటివరకు సరైన చర్యలు లేవు. ఇప్పటికై నా మా సమస్యను ప్రాధాన్యతగా పరిగణించి పరిష్కరించకుంటే వెయ్యిమందితో కవిటి బస్టాండ్లో నిరసన చేపడతాం. – సూర్ని లచ్చయ్య, కొత్తపాలెం పొందూరు: లోలుగు గ్రామంలో కేజీబీవీ పాఠశాలలోని ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థిని పి.హారిక మంగళవారం అస్వస్థతకు గురైంది. పాఠశాలలో సోమవారం రిపబ్లిక్డే నిర్వహించారు. రాత్రి భోజనాలు తర్వాత అంతా నిద్రపోయారు. మంగళవారం ఉదయం అందరూ నిద్ర లేచినా ఆమె మేలుకోలేదు. తోటి విద్యార్థులు ఎంత ప్రయత్నించినా లేవకపోవడంతో కేజీబీవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పటికీ వి ద్యార్థిని లేవలేకపోయింది. దీంతో మండలంలోని వావిలపల్లిపేటలో ఉంటున్న హారిక కు టుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుని హారికను శ్రీకాకుళం రిమ్స్లో చేర్చారు. విద్యార్థినికి మంగళవారం రాత్రి వరకు స్పృహ రాలేదు. -
ప్రాణభిక్ష పెట్టండి..!
● క్యాన్సర్ వ్యాధితో మంచంపట్టిన యువకుడు ● ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు జి.సిగడాం: ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు కుమరాపు చందు. వయస్సు 21 సంవత్సరాలు. యువకుడికి క్యాన్సర్ వ్యాధి రావడంతో కుటుంబం తల్లడిల్లిపోతోంది. వ్యాధి నయం కావాలంటే సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో కొన్ని నెలల నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని డీఆర్వలస(దాలెమ్మ రాజువలస) గ్రామానికి చెందిన నారాయణరావు, భూలక్ష్మి దంపతుల కుమారుడు చందు. యవకుడు గత ఐదేళ్లుగా వ్యాధితో పోరాటం చేస్తున్నాడు. విశాఖ, హైదారాబాద్ ఇతర ప్రాంతాలకు వైద్యం కోసం తరలించారు. వ్యాధి నివారణ కావాలంటే ప్రత్యేక ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. చందును బతికించడానికి వైద్యులు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని విశాఖలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రతినెలా ఒక్క ఇంజక్షన్ రూ.2.50 లక్షల వరకు అవుతుందని, సుమారుగా ఏడాది పాటు ఈ మందును వాడాలని సూచించారు. అనంతరం శరీరంలో ఉన్న రక్తం మార్పిడి చేసిన తర్వాత క్యాన్సర్ వ్యాధి కోసం ఆపరేషన్ చేస్తామని పేర్కొన్నారు. అందువలన ప్రభుత్వం, దాతలు ముందుకొచ్చి తమ బిడ్డకు ప్రాణబిక్ష పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దాతలు 63055 62355 నంబర్ను సంప్రదించాలని కోరారు. కూలీ చేసి కాపాడుకుంటున్నాం మాది రెక్కాడితేగానీ డొక్కా డని కుటుంబం. కుమారుడిని బతికించుకోవడానికి అనేక కష్టాలు పడుతున్నాం. చాలీచా లని డబ్బులతో జీవనం సాగించలేకపోతున్నాం. మా కుటుంబాన్ని దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. – కుమరాపు భూలక్ష్మి అప్పులు చేసి వైద్యం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నా కుమారుడికి ప్రతినెలా రూ.2.50 లక్షలు వెచ్చించి మందులు ఇస్తున్నాం. ఇప్పటికే చాలా అప్పులు చేసి వైద్యం చేయిస్తున్నాం. ఇంత మొత్తం ఖర్చు చేయడం వలన నానా కష్టాలు పడుతున్నాం. దాతలు సహకరించి ఆదుకోవాలి. – కుమరాపు నారాయణరావు -
ఏసీబీ వలలో ఉప ఖజానా సిబ్బంది
● రూ. 15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయం పరిధిలోని జిల్లా ఉప ఖజనా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్టీఓ, సీనియర్ అకౌంటెంట్లు కలిసి సచివాలయ ఉద్యోగి ఎరియర్స్ బిల్లుకు సంబంధించి లంచం డిమాండ్ చేయడంతో నేరుగా ఏసీబీకి దొరికారు. విశాఖపట్నం ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి అందించిన వివరాలు మేరకు.. శ్రీకాకుళం పరిధిలోని కిల్లిపాలెం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న హేమ రాగిణి తన ఉద్యోగానికి సంబంధించిన ఎరియర్స్ బిల్లు 2023, 24, 25 సంవత్సరాలకు సంబంధించిన రూ. 4,34,000 బిల్లు చేయాలంటూ ఈ నెల 10న జిల్లా ఉప ఖజానా కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. బిల్లును రిజర్వ్ బ్యాంక్కు ఫార్వర్డ్ చేసేందుకు గాను పరిశీలించిన ఎస్టీఓ రవిప్రసాద్, సీనియర్ అకౌంటెంట్ ఎ.శ్రీనివాసరావులు ఆమెను చాలాసార్లు తిప్పించారు. ఈ నెల 22న మరోసారి తన బిల్లు పాస్ కాలేదని హేమ రాగిణి అధికారులను కలిశారు. బిల్లు చేయడానికి రూ.20వేలు లంచం అడిగారు. అంత పెద్ద మొత్తంలో ఇవ్వలేను అనడంతో చివరిగా రూ.15వేలకు కుదించారు. దీంతో నేరుగా ఆమె ఏసీబీ అధికారులకు ఈనెల 26న కలిసి విషయం తెలియజేశారు. వారు చెప్పిన విధంగా మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఉప ఖజానా సిబ్బంది ఎస్టీఓ రవిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావులకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్గా పట్టుకున్నారు. వీరిని బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఏసీబీ సహాయకులుగా సీఐ కె.భాస్కరరావు, ఎస్వీ రమణలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
లోపం నాయకులది.. నెపం అధికారులపై
పాలకుల దక్షత.. మూడు రోజుల ముచ్చట ● రథసప్తమిలో పెత్తనమంతా నాయకులదే ● నిమిత్తమాత్రులైపోయిన రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు ● తప్పులన్నీ దేవదాయ శాఖ అధికారులపై నెట్టేసే యత్నం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రథ సప్తమికి అర్చకుల సలహాలు వినలేదా..? దేవదాయ శాఖ అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదా? అంతా ప్రజా ప్రతినిధులు చెప్పినట్టే జరిగిందా? అందుకే దర్శనాల్లో విఫలమయ్యారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎవరు చే యాల్సిన పనులు వారు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అపచారమేనా? సాధారణంగా ధనుర్మాసంలోని వైకుంఠ ఏకదాశి రోజున మాత్రమే ఉత్తర ద్వారం తెరుస్తారు. కానీ ఎన్నడూ లేని విధంగా రథ సప్తమి రోజు ఉత్తర ద్వారం తెరిచి భక్తులను విడిచిపెట్టారు. అర్చకులు చెప్పినా వినలేదని సమాచారం. ఇదో అపచారంగా భక్తులు భావిస్తున్నారు. అనాలోచిత నిర్ణయాలు.. రథసప్తమి రోజున ఉద్యోగుల విధుల విషయంలో కూడా అనాలోచితంగా వ్యవహరించారు. సాధారణంగా ప్రొటోకాల్ డ్యూటీలు, వీఐపీలను దగ్గరుండి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అఽధికారులు చూసుకునే వారు. ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దేవాలయం వెలు పల రెవెన్యూ అధికారులు, అంతరాలయం లోపం దేవదాయ శాఖాధికారులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా అంతా రివర్స్లో చేశారు. అనుభవం ఉన్న రెవెన్యూ ఉన్న వాళ్లని అవసరం లేని చోట వేశారు. అనుభవం లేని వాళ్లను అవసరం ఉన్న చోట వేశారు. చెప్పాలంటే రెవెన్యూ అధికారులను క్యూ లకు కాపలాగా వేశారు. దీంతో సమన్వయ లోపం చోటు చేసుకుంది. ఫలితంగా అంతా గందరగోళమై భక్తులను కష్టాలకు గురి చేసింది. అంతేకాదు వీఐపీ పాసుల జారీ విషయం కూడా ఆలయం అధికారులకు తెలియదన్న వాదనలు ఉన్నాయి. స్కానింగ్ మెకానిజమేదీ? అర్ధగంట దర్శనమన్నారు. అంతరాలయంలో ఆరు లైన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. వేర్వేరుగా క్యూలు ఉన్నాయని చెప్పారు. తీసుకున్న ప్రతి ఒక్కరినీ స్కాన్ చేసి పంపిస్తామన్నారు. కానీ, రథసప్తమి రోజున అంతా తుస్సు అని తేలిపోయింది. స్కానర్లు కనిపించలేదు. టిక్కెట్లు తీసుకున్న వారిని స్కాన్ చేసే పరిస్థితి లేదు. దీంతో భక్తులు గుంపుగా క్యూలోకి వచ్చేయడంలో తోపులాటలు, తొక్కిస లాటలు జరిగాయి. అంతరాలయంలో ఎప్పుడూ చూడని విధంగా జాయింట్ కలెక్టర్ దర్శనాలు దగ్గర ఉండటం ఆశ్చర్యం కలిగించింది. అధికారులంతా అక్కడే.. రథసప్తమి దర్శనాలు మరికొన్ని నిమిషాల్లో జరగాల్సి ఉండగా కోడి రామ్మూర్తి స్టేడియంలో మ్యూజికల్ డైరెక్టర్ తమన్ మ్యూజికల్ నైట్ కొనసాగింది. అటు రెవెన్యూ, ఇటు పోలీసు యంత్రాంగం దాదాపు అక్కడే ఉంది. టెక్కలి ఆర్డీఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా అక్కడే ఉండిపోయారు. అంతా అక్కడే ఉండిపోతే దేవస్థానం దగ్గర వేలాదిగా వచ్చే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుందన్న విషయాన్ని విస్మరించారు. దాని పర్యవసనమే భక్తులకు ప్రత్యక్ష నరకం. నెపమంతా దేవదాయ శాఖపైనే.. భక్తులు నరకం చూశాక, పెద్ద ఎత్తున ఆర్తనాదాలు వినిపించాక, అంత వరకు పెత్తనం చెలాయించిన ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు మాట మార్చేశారు. ఇవేం ఏర్పాట్లు అని దేవదాయ శాఖాధికారులపై పడ్డారు. ఈఓ, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా నియమితులైన కనకమహలక్ష్మి దేవాలయం డిప్యూటీ కమిషనర్ శోభారాణిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ జిల్లా ఉన్నతాధికారి గట్టిగా తిట్టడంతో ఆ మహిళా అధికారి కంట తడి పెట్టుకున్నారు. అంతేకాకుండా మరో శాఖ అధికారిపై కూడా తప్పు నెట్టేసేందుకు యత్నించడంతో ఆ అధికారి సెలవుపై వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. -
ప్రజలకు క్షమాపణ చెప్పాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అరసవల్లి రథ సప్తమి వేడుకల్లో భక్తులకు చేదు అనుభవం ఎదురైందని, దీనిపై అధికార పక్ష నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్ డిమాండ్ చే శారు. ఎన్నో ఏళ్లుగా ఆధ్యాత్మికంగా జరుగుతున్న పండుగను రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం సర్వ నాశనం చేసిందని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. స్వరూప్ మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలకు రోజుకో అధికారికి బాధ్యతను అప్పగించి అసలైన రథ సప్తమికి ఎవరూ బాధ్యత తీసుకోలేదని విమర్శించారు. అరగంటలో దర్శమని కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యే, అధికారులు ప్రచారం చేసి ఆరుగంటలైనా దర్శనాలు చేయించలేకపోయారని దు మ్మెత్తిపోశారు. దాతలతోనే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయని, అలాంటిది వారికి కనీస గౌ రవం ఇవ్వకుండా కిలోమీటర్ల మేర నడిపించి దర్శనాలు చేయించారన్నా రు. ఫండ్ కలెక్షన్ కమిటీ అంటూ వ్యాపారులతో ఆయా శాఖల అధికారులకు లింక్ పెట్టి డబ్బులు వసూలు చేయడం సరికాదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు దర్శనానికి వస్తే ఆ సమయంలో ప్రొటోకాల్ అధికారులంతా అటు ఉండిపోయి సాధారణ భక్తులకు ఆటంకం కలిగించారన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ మెంబర్ చల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శనాల బాధ్యతను గాలికొదిలేసి సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారించడం సరికాదన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవీ కనిపించలేదన్నారు. ప్రజల బాధలు పట్టించుకోకుండా నాయకులు ప్రచార ఆర్భాటానికే ప్రా ధాన్యత ఇవ్వడం దారుణమన్నారు. వారి నిర్లక్ష్య మే భక్తుల పాలిట శాపమైందన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి మాట్లాడుతూ అధికార పక్ష నాయకులకు ప్రచారంపై ఉన్న శ్రద్ధ భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించడంలో లేదన్నారు. సింహాచలం, పలాసలో విషాద సంఘటనలు జరిగి నా పట్టించుకోకుండా రథ సప్తమి వేళ కూడా అదే నిర్లక్ష్యం ప్రదర్శించారని అన్నారు. మున్సిపల్ కమిషనర్, జిల్లా పరిషత్ సీఈఓ వంటివారికే దర్శనాలకు పంపించలేదంటే సామాన్యుల పరిస్థితి ఇంకెంత దారుణమో అర్థం చేసుకోవచ్చన్నారు. వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కోణార్క్ శ్రీను మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా వ్యాపారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ఉత్సవాలు చేశారని తెలిపారు. వ్యాపారులకు కమర్షియల్ టాక్స్, తూనికలు కొలతలు, కార్మికశాఖ, మున్సిపల్ వంటి డిపార్ట్మెంట్ల అధికారులతో లింక్ చేసి భయపెట్టి డబ్బులు దోచుకోవడం సరికాదన్నారు. వృద్ధులకు ప్రత్యేక లైన్లు లేవు, దాహం వేస్తే మంచినీళ్లు అందించే దాతలు లేరు, ఎటువైపు వెళితే దర్శనాలు అవుతాయో తెలియని పరిస్థితిలో వేడుకలు నిర్వహించారన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు మాట్లాడుతూ నేరుగా ఎమ్మెల్యే, కా ర్యకర్తల్ని బుల్లెట్ బండిపై ఎక్కించుకుని రోడ్షో చేయడం వల్ల భక్తులకు ఒరిగిందేమీ లేదన్నారు. పార్టీ మైలేజ్ పెంచుకోవాలన్న ఆలోచన తప్ప భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోయారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు మండవల్లి రవి, ద్వారపు అజిత్, లుకలాపు గోవిందరావు, జలగడుగుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అరగంటలో దర్శనమన్నారు, ఆరు గంటలైనా దర్శనాలు లేవు ప్రచారం మీద ఉన్న శ్రద్ధ సదుపాయాలు కల్పించడంలో లేదు రథసప్తమి పేరుతో వసూళ్లకు తెర లేపారు మీడియా సమావేశంలో దుమ్మెత్తిపోసిన వైఎస్సార్సీపీ నాయకులు -
నేటి నుంచి నిద్దాలమ్మ జాతర
జి.సిగడాం: మండలం పరిధిలో నిద్దాం గ్రామంలో వెలిసిన నిద్దాలమ్మ తల్లి 19వ యాత్ర మహోత్సవాలు ఈ నెల 28 నుంచి ప్రారంభమై, వచ్చే నెల 1 వ తేదీ వరకు జరుగుతాయని గ్రామ, ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో నిర్వహించి గ్రామస్తుంతా ఒకేసారి ముర్రాటలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఉదయం, సాయంత్రం కుంకుమార్చనలు, హోమాలు నిర్వహించనున్నామని కమిటీ సభ్యులు తెలి పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తు లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక వసతులు ఏర్పాటుచేశామని తెలిపారు. సీఐటీయూ నాయకుడు కృష్ణారావు మృతి ఆమదాలవలస/రూరల్: సీఐటీయూ సీనియర్ నాయకుడు, షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘ ఉద్యమకారుడు కామ్రేడ్ పంచాది కృష్ణారావు (67) మండలంలో కనుగులవలస గ్రామంలోని తన స్వగృహంలో మంగళవారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, కుమారులు చైతన్య, వెంకటేష్ ఉన్నారు. కామ్రేడ్ కృష్ణారావు మృతి కార్మిక ఉద్యమాలకు తీరని లోటని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు. ఆయన మృతిపై సీఐటీయూతో పాటు పలు కార్మిక, ప్రజా సంఘాలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశాయి. కామ్రేడ్ పంచాది కృష్ణారావు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేస్తూ.. దివంగత నేత కామ్రేడ్ మెట్ట కొండయ్యతో కలిసి సుగర్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్లో చురుకుగా వ్యవహరించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన ఆయన జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా ఆమదాలవలస ప్రాంతంలో అనేక కార్మిక సంఘాలను సంఘటితం చేశారు. షుగర్ ఫ్యాక్టరీ కార్మికులతో పాటు మున్సిపల్, రైల్వే, స్టీమ్ వర్కర్ల సమస్యలపై పోరాటాలకు నాయకత్వం వహించి అనేక ఉద్యమాలను నడిపారు. నిర్వాసితుల పోరాటాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన అరైస్టె పలు కేసులను ఎదుర్కొనగా, ఇటీవల కాలంలో ఆ కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. కామ్రేడ్ కృష్ణారావు అంత్యక్రియలు బుధవారం ఉదయం 8 గంటలకు వారి స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు, సీఐటీయూ నాయకులు తెలిపారు. సౌత్ జోన్ క్రికెట్ పోటీలకు డిగ్రీ కళాశాల విద్యార్థి నరసన్నపేట: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న కోట ఢిల్లీశ్వరరావు ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించే సౌత్జోన్ క్రికెట్ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్ పి.లత తెలిపారు. మైసూర్లో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలు 27 వ తేదీ నుంచి వచ్చే నెల 5 వ తేదీ వరకూ జరగనున్నాయని తెలిపారు. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ తరఫున ఢిల్లీశ్వరరావు ఎంపికయ్యారని వివరించారు. ఈమేరకు పీడీ కె.బోగేశ్వరరావు విద్యార్థికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులో ఒకరు అరెస్టు పాతపట్నం: స్థానిక రత్నాలపేటకు చెందిన ఎస్బీఐ సేవా కేంద్రం, మీ–సేవ కేంద్రం నిర్వాహకుడు టంకాల శివకుమార్ను సైబర్ క్రైమ్ కింద హర్యానా పోలీసులు అరెస్టు చేసినట్లు పాతపట్నం ఎస్ఐ కె.మధుసూదనరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్కు చెందిన గంగకాంత్ చౌదరి బ్యాంక్ ఖాతా నుంచి రూ.48 లక్షలు పాతపట్నం రత్నాలపేట శివకుమార్కు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. శివకుమార్ తనకు కాల్ చేసి ఎన్ఐఏ అధికారిగా పరిచయం చేసుకుంటూ.. డబ్బులు తన బ్యాంక్ ఖాతాలో జమ చేయకపోతే అరెస్ట్ చేస్తామని భయపెట్టినట్లు బాధితుడు గంగకాంత్ చౌదరి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు వచ్చి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అమ్మవారి నిజరూపం -
సచివాలయాలపై అక్కసు
అరసవల్లి: అధికార పక్ష నాయకులు సచివాలయ వ్యవస్థపై నిలువెల్లా పెంచుకున్న కక్ష సందర్భానుసారం బయటపడుతూనే ఉంది. తాజాగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సచివాలయా లపై తన అక్కసు వెళ్లగక్కారు. పరస్పర వాగ్వాదాల నడుమ మంగళవారం జరిగిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు రసాభాసగా మారాయి. అధికారులూ...జాగ్రత్త జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన 1వ, 2వ, 4వ, 7వ స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతున్న క్రమంలో పింఛన్లు, ఇళ్ల నిర్మాణాలపై చర్చ మొదలైంది. ఈ సందర్భంగా 2019–24 మధ్య ఇళ్ల నిర్మాణాల వివరాలు ఇవ్వాలని కూన కోరారు. అధికారులు సమాధానం ఇవ్వగా ఆ వివరాలు సరికాదని కూన అన్నారు. లెక్కలు సరిగ్గా చూసుకోవాలని అధికారులకు తెలియజేశారు. అంతకుముందు కూడా జిల్లా పరిషత్ సీఈ ఓ సత్యనారాయణతో పాటు అకౌంట్స్ విభాగ ఏఓ పక్కి రేణుకపై కూడా కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో చాలా మంది అధికారులు జెడ్పీ సమావేశాలకు సమగ్ర సమాచారాలతో హాజరుకావడం లేదని, అసలు మీ ఉద్యోగులకు నెలకు జీతం పడితే చాలు, డీఏ పెరిగితే చాలని, విధులు మా త్రం సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. ‘సచివాలయాలు దరిద్రాలయాలు’ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే రవి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పింఛన్ల మంజూరులో ఎన్నో అవకతవకలకు పాల్పడిందని, అర్హులు కానివారికి దివ్యాంగులుగా పింఛన్లు ఇచ్చేశారని వ్యాఖ్యానించారు. దీనిపై జెడ్పీ వైస్ చైర్మన్ జగన్మోహనరావు, జెడ్పీటిసీలు టొంపల సీతారాం, వంగర ఎంపీపీ ముఖర్జీ, కంచిలి ఎంపీపీ దేవదాస్రెడ్డి తదితరులు స్పందిస్తూ ఘాటుగా సమా ధానం ఇచ్చారు. దీంతో రవికుమార్ ఆగ్రహంతో వెంటనే నాటి, నేటి పింఛన్ల వివరాలను సభ లో ప్రకటించాలంటూ డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పిరియా విజయ జోక్యం చేసుకుంటూ వైఎస్ జగన్ ఇచ్చిన లక్షలాది పింఛన్ల వివరాలను వివరించారు. ప్రతి సచివాలయం వద్ద ఆయా పరి ధిలో వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలతో పాటు పింఛన్ దారుల వివరాలు అన్నీ బోర్డులో ప్రదర్శించేవారని, ఇప్పుడెందుకు ప్రదర్శించడం లేదంటూ ప్రశ్నించారు. దీంతో రవికుమార్ స్పందిస్తూ సచివాలయా లు దరిద్రాలయాలంటూ వ్యాఖ్యానించారు. సచివాలయాల్లో ఉద్యోగులెవ్వరికీ పనులు లేవని, అసలు సచివాలయ వ్యవస్థే దండగ అంటూ వ్యా ఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా జెడ్పీ టీసీలు, ఎంపీపీలు రవికుమార్ను చుట్టుముట్టి వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలని, లేదంటే సమావేశాల నుంచి వాకౌట్ చేస్తామంటూ డిమాండ్ చేశారు. వంగర ఎంపీపీ ముఖర్జీ, కంచిలి ఎంపీపీ దేవదాస్రెడ్డి త దితరులు మాట్లాడుతూ ‘అధికారంలో మీరే ఉన్నారు కదా. దమ్ముంటే సచివాలయాలను, వ్యవస్థను రద్దు చేయండి చూద్దాం...’ అని సవాల్ విసిరారు. దీంతో సచివాలయాలపై తన వ్యాఖ్యలు సొంత అభిప్రాయమని, ప్రభుత్వం ఇలాగే అనుకుంటే..వాటిని రద్దు చేస్తుందేమో అని రవి ప్రకటించారు. సచివాలయాలు దరిద్రాలయాలు అంటూ ఎమ్మెల్యే కూన రవి వ్యాఖ్య భగ్గుమన్న జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీటీసీలు దమ్ముంటే సచివాలయాలను రద్దు చేయగలరా అంటూ సవాల్ వాడీవేడిగా జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు -
అంబరాన్నంటిన.. సిరిమాను ‘శంబర’ం
సాక్షి, పార్వతీపురం మన్యం/మక్కువ/పార్వతీపురం రూరల్: ఉత్తరాంధ్రుల కల్పవల్లి, చల్లనితల్లి శంబర పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భక్తుల విశ్వాసం చూరగొన్న పోలమాంబను చూసి తరించడానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలలతో పాటు పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఆర్టీసీ బస్సులతోపాటు, ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. మక్కువ మండలం శంబర గ్రామంలో వెలసిన పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవాన్ని కనులారా తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలిరాగా.. భక్తుల జయజయధ్వానాల నడుమ శంబర గ్రామం పులకించింది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నరసన్నపేట: స్థానిక పాత స్టేట్ బ్యాంకు వీధికి చెందిన శాంతామణి రైస్ ఇండస్ట్రీస్ యజమాని ఊణ్ణ వెంకటరమణమూర్తి(67) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విశాఖపట్నంలోని మద్దెలపాలెం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటరమణమూర్తి అక్కడికక్కడే మృతి చెందారు. వైద్య పరీక్షల కోసం నరసన్నపేట నుంచి విశాఖపట్నం సోమవారం వెళ్లారు. రాత్రి తన కుమార్తె మౌనిక ఇంటి వద్ద ఉన్నారు. ఉదయం మార్కెట్కు కూరగాయలు కొనేందుకు స్కూటీపై వెళ్తుండగా విజయనగరం నుంచి విశాఖ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందారు. ఆయన నరసన్నపేటలో మిల్లర్గా మంచి గుర్తింపు పొందారు. ఈయన కుమారుడు భార్గవ్ నరసన్నపేట మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. వెంకటరమణ మూర్తి మృతికి వైఎస్సార్సీపీ నాయకులు ధర్మాన రామదాస్, మిల్లర్ల సంఘం పూర్వపు జిల్లా అధ్యక్షులు తంగుడు జోగారావు తదితరులు సంతాపం తెలిపారు. ఆయనకు భార్య శశికళ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
దుఃఖాన్ని దిగమింగుతూ..
● భర్త మృతదేహానికి భార్య అంత్యక్రియలు వజ్రపుకొత్తూరు రూరల్: పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాపువీధిలో భర్త మృతదేహానికి దుఃఖాన్ని దిగమింగుతూనే భార్య అంత్యక్రియలు నిర్వహించిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాపు వీధికి చెందిన బడబందల అభి(48) కడుపు నొప్పితో బాధపడుతూ అస్పత్రితో చేరి మంగళవారం మృతి చెందారు. భర్త మృతి చెందడంతో అగ్ని సాక్షిగా వేదమంత్రాల నడుమ తాళి కట్టించుకున్న భార్య లక్ష్మి అన్నీతానై పుట్టెడు దుఃఖంలో తన భర్త చితికి నిప్పుపెట్టి అంత్యక్రియలు చేపట్టింది. దివ్వాంగుడైన మృతుడు వాచ్ మెకానిక్ వృత్తిని నమ్ముకొని భార్య, బిడ్డలను పోషించేవాడు. అయితే ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబం వీధిన పడిందని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు, బంధువులు కోరుతున్నారు. -
యూరియా కోసం అవస్థలు
నరసన్నపేట: యూరియా కోసం ఖరీఫ్లో అన్నదాత కష్టాలు మరువక ముందే రబీలో మరోసారి అవస్థలు ఎదురవుతున్నాయి. ఒక్క బస్తా కోసం రైతులు ఆర్ఎస్కేల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తాజాగా మండలంలోని కరగాంలో యూరియా పంపిణీలో రాద్దాంతం జరిగింది. మంగళవారం యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. సచివాలయ పరిధిలోని కరగాం, నారాయణవలస, నర్శింగపల్లి, పెద్ద కరగాం, అంప్లాం గ్రామాల్లో రైతులు అధికంగా రబీలో వరి వేశారు. దీంతో వ్యవసాయాధికారి వై.సూర్యకుమారి రైతుల అభ్యర్థన మేరకు 450 బస్తాల యూరియాకు ఇండెంట్ పెట్టారు. సోమవారం యూరియా వచ్చింది. ఈ మేరకు రైతుల పేర్లు వీఏఏ రాసుకొని మంగళవారం సాయంత్రం నుంచి పంపిణీ ప్రారంభించారు. యూరియా పంపిణీ చేపడుతున్న సమయంలో నర్శింగపల్లికి చెందిన టీడీపీ నాయకుడు వచ్చి యూరియా బస్తాలు గంపగుత్తుగా తీసుకుపోవడానికి ప్రయత్నింగా రైతులు అడ్డుకున్నారు. గతంలో కూడా ఇదే వ్యక్తి 50 బస్తాలు తీసుకెళ్లాడని, ఇప్పుడు మళ్లీ అలాగే తీసుకుపోతే మిగిలిన రైతుల పరిస్థితి ఏంటని ఎదురు తిరిగారు. దీంతో కొద్ది సమయం వాగ్వాదం జరిగింది. సచివాలయ సిబ్బంది భయపడి సచివాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. తర్వాత సమాచారం తెలుసుకున్న నరసన్నపేట పోలీసులు వచ్చి పరిస్థితులు చక్కదిద్ది 120 బస్తాల ఎరువులు పంపిణీ చేయించారు. ఈ విషయంపై వ్యవసాయాధికారి సూర్యకుమారి మాట్లాడుతూ ఇంకా 330 బస్తాల యూరియా ఉందని, వీఏఏ రాసుకున్న పేర్లు మేరకు అందించేందుకు రైతులు సహకరించాలని కోరారు. -
శాలిహుండం..!
దర్శించుకుందాం.. ప్రత్యేక ఏర్పాట్లు స్వామివారిని భక్తులు సులువుగా దర్శించుకునేందుకు వీలుగా బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీనికోసం వేల సంఖ్యలో లడ్డూలను తయారు చేస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు సదుపాయాన్ని ఏర్పాటు చేశామని పాలకమండలి సభ్యులు తెలిపారు. ఆర్టీసీ సంస్థ ప్రత్యేక యాత్ర బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గార: శ్వేతగిరిపై వేంచేసిన కాళీయ మర్ధన వేణుగోపాలస్వామి యాత్రకు శాలిహుండం ముస్తాబవుతోంది. మాఘశుద్ధ ఏకాదశి(భీష్మ ఏకాదశి) పురస్కరించుకొని ప్రతిఏటా నిర్వహించే ఈ యాత్రకు ఏంతో ప్రాముఖ్యత ఉంది. బుధవారం సాయంత్రానికి దూరప్రాంత భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. సాయంత్రం పరిసర గ్రామాల్లో స్వామివారి తిరువీధి ఉత్సవంతో ప్రారంభమై, రాత్రి క్షీరాభిషేకసేవ, పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. గురువారం ఉదయం 7 గంటలకు వేణుగోపాలస్వామి, లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తులను రెండు పల్లకీల్లో తీసుకొని వెళ్లి సాంప్రదాయబద్ధంగా చక్రతీర్థ స్నానమాచరిస్తారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి తిరుక్కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ యాత్రకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. సుమారు 80 వేల మంది భక్తులు యాత్రకు వస్తారని అధికారుల అంచనా. సంతాన వేణుగోపాలుడు భీష్మ ఏకాదశి రోజున స్వామివారి ఉత్సవమూర్తులు చేసే చక్రతీర్థ స్నానంలో భక్తులు కూడా స్నానమాచరించి, కొండపై వ్రతమాచరించి ఉపవాసం ఉండి వేణుగోపాలుడిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అదేవిధంగా గృహ నిర్మాణం చేసుకోవాల్సిన వారంతా జాతర రోజు వచ్చి ఇక్కడి రాళ్లను పేర్చితే తదుపరి ఏడాదిలోగా ఆ కోరిక నెరవేరుతుందని చెబుతారు. ఇక్కడి సొరంగంలో దొరికే నీటిని తీసుకెళ్లి పవిత్ర జలముగా ఉపయోగించడం, మట్టిని తీసుకెళ్లి కొత్త పడవల్లో ప్రారంభ సూచికగా జల్లుకుంటే ఎటువంటి నష్టం ఉండదని మత్స్యకారులు భావిస్తుంటారు. అదేవిధంగా పురాతన పద్ధతుల్లో ఉండే దాసురాళ్లు, దాసుళ్లు తరలివచ్చి స్వామివారికి పూజలు చేసి కొండపై స్టాల్స్లో అమ్ముతున్న విభూతి ఉండలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లి పూజలు చేస్తుంటారు. అందుకే ఈ జాతరను దాసుళ్ల యాత్రగా పరిగణిస్తారు. శాలిహుండం యాత్ర తర్వాతే ఇంటి దగ్గర సంబరాలు చేసుకోవాలని, దీని తర్వాతనే గ్రామ దేవత పండగలు నిర్వహించడం పరిపాటి. అందుకోసం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో శాలిహుండం కొండ వద్దకు చేరుకుంటారు. చక్రతీర్థ స్నానంతో భక్తులు స్వామివారితో పాటు స్నానమాచరించి కొండపైనున్న స్వామిని దర్శించుకుంటారు. ఆలయ ముందుభాగంలో కాళీయ మర్ధన వేణుగోపాలుడు శాలిహుండం జాతరకు శ్వేతగిరి ముస్తాబు నేటి సాయంత్రం నుంచి యాత్ర ప్రారంభం అర్ధరాత్రి తర్వాత మూలవిరాట్కు క్షీరాభిషేక సేవ -
పాలకుల దక్షత.. మూడు రోజుల ముచ్చట
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా కేంద్రంలో రథ సప్తమి పేరుతో జరిగిన పనులు మూన్నాళ్ల ము చ్చటగా మారాయి. రథ సప్తమికి నగరం సుందరీకరణ పేరుతో రూ.3.30కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. అయితే ఇందులో ఎన్ని పనులు ప్రారంభించారో, ఎన్ని ప్రారంభించకుండా వదిలేశారో, ప్రారంభించిన పనులు ఎంత మేరకు జరిగాయో ఆ సూర్యభగవానుడికే తెలియాలి. హడావుడిగా చేసిన పనులు మూడు రోజులకే ముక్కలైపోయాయి. పర్యవేక్షణ ఉందా..? అసలు పనులు జరిగిన చోట ఇంజినీరింగ్ సిబ్బంది పర్యవేక్షణ చేయాలి. కానీ నగరంలో అవేమీ కనిపించడం లేదు. టైల్స్ వేస్తున్న సిమెంట్లో ఇసుక తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. దీంతో ఫుట్పాత్లపై వేసిన టైల్స్ వేసిన కొన్ని గంటల్లోనే ఊడిపోతున్నాయి. పనుల ప్రతిపాదనలు ఇలా.. నగరంలో పలు కూడళ్లలో పెయింటింగ్స్ వేసేందుకు రూ.17లక్షల నిధులు వెచ్చించారు. కొత్తవంతెన, పాత వంతెన మినహాయిస్తే ఇంకెక్కడా రంగులు వేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఫుట్పాత్లపై టైల్స్ వేయడం వంటివి కూడా మమ అనిపించేస్తున్నారు. నగరంలో ఏడురోడ్లు కూడలి, రామలక్ష్మణ కూడలి ప్రాంతాల్లో లైటింగ్ కోసం స్తంభాలు వేసేందుకు సంక్రాంతి పండుగ సమయంలో రోడ్డుకి మధ్యలో పెద్ద పెద్ద గోతులు తవ్వేసి దుస్తులు కొనుగోలు చేసేవారికి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పటి వరకు స్తంభా లు ఏర్పాటు చేయలేదు. రథ సప్తమి ఉత్సవాలు చేస్తామని రెండు మూడు నెలలు ముందే నిర్ణయించినప్పుడు ప నులకు టెండర్లు మాత్రం పదిరోజులు ముందు ఎందుకు పిలుస్తున్నారో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. కొత్త రోడ్డు వద్ద రథ సప్తమి ముందురోజు సిమెంట్ పనిచేసి ఓ సర్కిల్ను నిర్మించారు. ఆ తర్వాతకే ముక్కలైపోయింది. చర్యలు చేపడతాం చేసిన పనుల్లో నాణ్యత లోపాలుంటే సంబంధిత కాంట్రాక్టర్ లేదా ఇంజినీర్లపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. రథ సప్తమి అంటే కేవ లం ఆ రోజుకే పనులు కాదు శాశ్వత ప్రాతిపదిక ఉండాలనే ఆలోచనతోనే పనులన్నీ చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి లోపాలున్నా సరిచేస్తాం. – కమలాకర్, మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్. శ్రీకాకుళం నగరపాలక సంస్థ -
మద్యం మత్తులో యువకుడి వీరంగం
పలాస: పలాస కేటీరోడ్డు ఇందిరా చౌక్ వద్ద మంగళవారం మద్యం మత్తులో ఒక యువకుడు తన చేయి కోసుకొని వీరంగం సృష్టించాడు. ప్రశ్నించిన వాహనదారులపై దాడికి ప్రయత్నించాడు. తన చేతిని విరిగిన గాజు సీసాతో కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం కాగా స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. కాసేపు ట్రాఫిక్కు అంతరాయం కలి గింది. అనంతరం అక్కడ నుంచి ఆ యువకుడు మెల్లగా జారుకున్నాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏదిఏమైనా జంట పట్టణాల్లో యువకులు మద్యానికి బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. -
● ఇలా చేరుకోవాలి...
శాలిహుండం యాత్రకు బుధవారం సాయంత్రం, గురువారం చక్రతీర్థ స్నానంతో పాటు స్వామి దర్శనాలకు వచ్చే భక్తులు మూడు మార్గాల ద్వారా చేరుకోవచ్చని, అందరూ సంయమనం పాటించి సహకరించాలని జిల్లా పోలీసు యంత్రాంగం సూచనలు చేసింది. ఈ మేరకు రూట్ మ్యాప్ వివరాలను సీఐ కె.పైడపునాయుడు తెలియజేశారు. ● జాతీయ రహదారి నుంచి గార – చింతాడ బీటీ రోడ్డు గుండా వచ్చిన భక్తుల బైక్లు, ఆటోలను పూసర్లపాడు అసిరితల్లి ఆలయం వద్ద ఉన్న పొలాల్లో పార్కింగ్ చేయాలి. ఒకవేళ అక్కడ పార్కింగ్కు అవకాశం లేకుండా నిండిపోతే కొండ నుంచి శాలిహుండం గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డులో వెళ్లి కేజీబీవీ సమీపంలో పార్కింగ్ చేసుకోవాలి. ఆర్టీసీ బస్సులకు కొంక్యాణపేట సమీపంలోని ఇటుక బట్టీల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ● శ్రీకాకుళం – కళింగపట్నం రోడ్డులో వచ్చిన భక్తులు గార తర్వాత సినిమా థియేటర్ వద్ద ఆటోలు పార్క్ చేసుకోవాలి. బైక్లు బోరవానిపేట పాఠశాలల వద్ద, ఎక్కువైతే శాలిహుండం బౌద్ధ స్థూపాల వద్ద పార్కింగ్ స్థలం ఉంటుంది. అక్కడి నుంచి నడిచి వెళ్లాలి. ● సతివాడ మీదుగా వచ్చే భక్తులు కొత్తపేట గ్రామం వద్దనే వాహనాలు ఉంచుకోవాలి. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. ● కొండమీదకి వాహనాలకు అనుమతి లేదు. విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం ప్రతీ ఏడాది స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. దర్శనం కోసం ఉచిత క్యూలైన్తో పాటు రూ.20, రూ.50 ల దర్శనాలు ఉంటాయి. పాలకమండలి సభ్యులు, దేవదాయ, రెవెన్యూ, పోలీసులకు భక్తులు సహకరించాలి. – సుగ్గు మధురెడ్డి, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త -
జిల్లా పరిషత్ వార్షిక బడ్జెట్ రూ.1743.35 కోట్లు
● 2026–27 అంచనా బడ్జెట్గా సభ్యుల ఆమోద తీర్మానం ● జెడ్పీకి రావాల్సిన ఆదాయంపై దృష్టిపెట్టాలన్న జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అరసవల్లి: జిల్లా పరిషత్ ఆదాయ, వ్యయాల ఆధారంగా 2025–26 సవరణ బడ్జెట్, 2026–27 అంచనా బడ్జెట్ ప్రతిపాదనలకు జిల్లా పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదించింది. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పిరియా విజయ అధ్యక్షతన మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ సమక్షంలో సంబంధిత అక్కౌంట్స్ ఏఓ పక్కి రేణుకాదేవి బడ్జెట్ ప్రతిని సమావేశంలో చదివి వినిపించారు. ఈ మేరకు 2025–26 సవరణ బడ్జెట్ ఆదాయం రూ.1718,85,20,770 కాగా, వ్యయం రూ.1648,67,29,256 గానూ మిగులుగా రూ.70,17,91,514 గా పేర్కొన్నారు. అలాగే 2026–27 గాను అంచనా బడ్జెట్గా ఆదాయం రూ.1743,35,73,076 కాగా, వ్యయం రూ.1671,70,96,144, మిగులుగా రూ.71,64,76,932 గా చూపించి ప్రతిపాదించారు. అయితే ఈ అంచనా బడ్జెట్లపై ఎలాంటి అభ్యంతరాలు, వివరణలు లేవనెత్తకపోవడంతో హజరైన సుమారు 26 మంది జెడ్పీటీసీలు బల్లలు చరిచి తమ ఆమోదాన్ని తెలియజేశారు. దీంతో 2026–27 అంచనా బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ ప్రకటించారు. అయితే జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ తదితర ఐదు విభాగాలతో పాటు జిల్లా పరిషత్కు వస్తున్న ఆదాయ, వ్యయాలను అంచనాలు వేసి ఇంత మొత్తంలో ఈ బడ్జెట్ను తయారు చేసినట్లుగా సీఈఓ సత్యనారాయణ తెలియజేశారు. కేవలం జెడ్పీకి సీనరేజి ఫీజు, సర్చార్జి ఆన్ స్టాంప్ డ్యూటీ, రూ.4 చొప్పున తలసరి ఆదాయంతో పాటు అద్దెలు–ఇతరత్రా మార్గాల ద్వారానే జెడ్పీకి ఆదాయం (రాబడి) రానుందని, ఈమేరకు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులంతా సకాలంలోనే జెడ్పీకి ఆదాయం వచ్చేలా కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ సూచించారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్లు సిరిపురపు జగన్మోహనరావు, పాలిన శ్రావణి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కమ్మసిగడాం జాతరకు సర్వం సిద్ధం
● నేటి రాత్రి మహాలక్ష్మీ కల్యాణంతో ప్రారంభం ● మూడు రోజుల పాటు నిర్వహణ రణస్థలం: కమ్మసిగడాం జాతరకు సర్వం సిద్ధమైంది. మంగళవారం రాత్రి 10.16 గంటలకు మహాలక్ష్మి అమ్మవారి కల్యాణం అనంతరం వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పౌరాణిక నాటకాలతో పాటు జెయింట్ వీల్స్, కార్, బైక్ విన్యాసాలు, బ్రేక్ డ్యాన్స్లు, వస్తు సామాగ్రి, తినుబండారాల స్టాల్స్ సిద్ధం చేస్తున్నారు. యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రణస్థలం మండల కేంద్రంలో జాతీయ రహదారి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనుల కారణంగా ట్రాఫిక్ మళ్లించినట్లు జే.ఆర్.పురం సీఐ ఎం.అవతారం, ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. జాతరకు చేరే వాహనాలకు 16 చోట్ల పార్కింగ్ స్థలాలను కేటాయించినట్లు చెప్పారు. 150 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షుడు వి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. ● పైడిభీమవరం, కోష్ట వైపు నుంచి వచ్చే వాహనాలు రణస్థలం రాకుండా యూబీ బీరు ఫ్యాక్టరీ పక్క నుంచి కొండములగాం వరకు ఉన్న తోటపల్లి కాలువ రహదారి మీదుగా రాకపోకలు సాగించాలి. ● నెల్లిమర్ల వైపు నుంచి రణస్థలం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదు. అర్జునవలస నుంచి సంచాం మీదుగా పైడిభీమవరం చేరుకోవాలి. మహాలక్ష్మి అమ్మవారు జాతర ఏర్పాట్లు -
పీఎం సూర్యఘర్లో ప్రతిభకు అవార్డులు
అరసవల్లి: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్ అమలు చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు శ్రీకాకుళం డివిజన్కు అవార్డులు దక్కాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం విశాఖపట్నం విద్యుత్ కార్పొరేట్ కార్యాలయంలో ఈ మేరకు శ్రీకాకుళం డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావుకు, టౌన్ డి–1 (అరసవల్లి సెక్షన్) ఏఈఈ జావాన సురేష్కుమార్లకు సీఎండీ పృథ్వీతేజ్ అవార్డులను, ప్రశంశా పత్రాలను బహుకరించారు. ఈ అవార్డులపై జిల్లా సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, శ్రీకాకుళం డివిజన్ ఈఈ పైడి యోగేశ్వరరావులు ప్రత్యేకంగా అభినందించి హర్షం ప్రకటించారు. సీఎండీ పృథ్వీతేజ్ నుంచి అవార్డు అందుకుంటున్న డిప్యూటీ ఈఈ వెంకటేశ్వరరావు అవార్డు అందుకుంటున్న ఏఈఈ సురేష్ కుమార్ -
గణతంత్రమే స్ఫూర్తి మంత్రమై..
దేశభక్తి గీతాల్లో ఉద్వేగం.. నాట్య ప్రదర్శనల్లో ఉత్సాహం.. జాగిలాల కదలికల్లో చురుకుదనం.. కలగలిపి గణతంత్ర దినోత్సవం మంత్రముగ్ధుల్ని చేసింది. కవాతు నుంచి శకటాల వరకు, నృత్యాల నుంచి స్టాళ్ల ప్రదర్శన వరకు, విరాళాల నుంచి సత్కారాల వరకు ఈ వేడుక అన్ని దశల్లోనూ అదరహో అనిపించింది. వినువీధిన ఎగిరిన మువ్వన్నెల పతాకం సాక్షిగా గణతంత్రం స్ఫూర్తిమంత్రమై ప్రతిధ్వనించింది. శ్రీకాకుళం పాతబస్టాండ్, పీఎన్ కాలనీ: జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో 77వ గణతంత్ర వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగా యి. ఉదయం 9 గంటలకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బృందాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శాంతికి చిహ్నంగా కలెక్టర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిలతో కలిసి గాలిలోకి పావురాలు, రంగురంగుల బెలూన్లను వదిలారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాయుధ దళాల పరేడ్ ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా సాయుధ పోలీస్ దళం (ఎచ్చెర్ల) రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎ.శంకర్ ప్రసాద్ పరేడ్ కమాండర్గా వ్యవహరించగా, పరేడ్ బృందాలు గంభీరంగా అడుగులు వేశాయి. 1000 మంది విద్యార్థుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు ● న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు ‘మూడు రంగుల జెండా’, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ‘జయతు జయతు భారతం’ గీతాలకు చేసిన నృత్యాలు అలరించాయి. లావేరు కేజీబీవీ విద్యార్థులు ప్రదర్శించిన ‘ఆపరేషన్ సింధూర్’, శ్రీ సాయి విద్యామందిర్ ’ఈ జెండా అమరుల తుది శ్వాసరా’ ప్రదర్శనలు వీరజవాన్ల త్యాగాలను స్మరింపజేశాయి. ● ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు తమ సంప్రదాయ గీతంతో, అంబేడ్కర్ గురుకులం విద్యార్థులు ‘హమ్ ఇండియా వాలే’ నృత్యంతో ఆకట్టుకున్నారు. ● సీతంపేట ఐటీడీఏ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులు నృత్య ప్రదర్శనతో ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. న్యూ సెంట్రల్ పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతిని సాధించగా, కేజీబీవీ లావేరు విద్యార్థులు తృతీయ బహుమతిని అందుకున్నారు. సాయం.. సత్కారం భరతమాత ముద్దుబిడ్డలైన దేశ రక్షకుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శాసన సభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా యోగా గురువు, రెడ్క్రాస్ జిల్లా శాఖ సభ్యులు యోగా రామారావు ఉచిత గురుకుల సంస్థ (హైదరాబాద్) సహకారంతో ‘జాతీయ రక్షణ నిధి’కి ప్రకటించిన లక్ష రూపాయల చెక్కును సోమవారం ఆర్ట్స్ కళాశాల గణతంత్ర వేడుకల సభలో అందజేశారు. ● గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర యోధులు కోరాడ రవీంద్రనాగ్ (శ్రీకాకుళం), మంత్రి అప్పలస్వామి కుమారుడు నరసింహమూర్తిలను సత్కరించారు. ● అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మొత్తం 150 మంది అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో డాగ్ షో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా ఎనిమిదేళ్ల ‘మున్నా’ కలెక్టర్కు, నాలుగేళ్ల ‘బ్యూటీ’ ఎస్పీకి పుష్పగుచ్ఛాలు అందించి గౌరవవందనం చేశాయి. అనంతరం డైసి, మున్నా, బ్యూటీలు కలిసి చేసిన ‘ఒబీడియన్స్ డ్రిల్’, రెండేళ్ల రోజా చేసిన అద్భుతమైన ‘హార్డిల్ జంప్’, అగ్నికీలల మధ్య నుంచి దూకడం, బ్యూటీ ప్రదర్శించిన ‘పేపర్ అండ్ మిల్క్ ఎక్సర్సైజ్’ విన్యాసాలు చూసి మైదానం చప్పట్లతో మార్మోగింది. హ్యాండ్లర్లు ఎల్.మాధవరావు, కె.ఈశ్వరరావు, సీహెచ్ జనార్దన, వి.కోదండరావుల పర్యవేక్షణలో ఈ జాగిలాలు తమ ప్రతిభను ప్రదర్శించాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం కన్నులపండువగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్న శకటాల ఊరేగింపు -
సోకు నేతలది
సొమ్ము దాతలది.. ఒక్క పైసా ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండగగా గుర్తించిన చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదు. గత ఏడాది మూడు రోజులకు ఎలాగైతే మొండి చేయి చూపిందో.. ఈ సారి వారం రోజుల పండగకు అదే రకంగా నిధులు ఇవ్వకుండా చేతులేత్తేసింది. ఎలా చేసుకుంటారో అనవసరం, రాష్ట్ర పండగగా, అత్యంత వైభవంగా చేసి, అదంతా ప్రభుత్వ గొప్పతనంగా చాటి చెప్పాలని మాత్రం మౌఖికంగా ఆదేశించింది. ఇంకేముంది కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యే రంగంలోకి ది గారు. జనం సొమ్ముతో సంబరాలు చేయాల ని నిర్ణయించారు. నిధుల సమీకరణకు అధికారులను వాడారు. అవకాశం ఉన్న చోటల్లా విరాళాలు సేకరించి ఉత్సవాలను చేశారు.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రథ సప్తమి వేడుకల వెనుక దాగిన విషయాలు విస్మయం గొలుపుతున్నాయి. ఏడు రోజుల కార్యక్రమాల్లో హడావుడి చేసిన నేతలు ప్రభుత్వం నుంచి తెచ్చిన డబ్బులు సున్నా అంటే అతిశయోక్తి కాదు. దాతలు ఇచ్చిన సొమ్ముతో నేతలు సోకులు చేసుకున్నారు. కేవలం ప్రజల సొమ్ముతో వారం రోజుల రథసప్తమి వేడుకలు చేశారు. అంతా తామే చేసినట్టు వేదికలపై ఫోజులిచ్చారు. ఏడు రోజుల రాష్ట్ర పండగగా జీఓ ఇచ్చి చేతులు దులుపుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదు. కానీ వేడుకల వైభవం తమ గొప్పతనమని ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఉత్సవాల భారమంతా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలే మోశారు. జనం సొమ్ముతో ఉత్సవాలు ఎలా చేయాలో? తమది కాని సొమ్ముతో ఎలా క్రెడిట్ కొట్టేయాలో కేంద్ర, రాష్ట్రమంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యే చేసి చూపించారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం పోయి రథసప్తమి రోజున సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫండ్స్ సేకరణకు తొలిసారిగా కమిటీ ఏర్పాటు ఏడు రోజుల రథసప్తమి వేడుకల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను వివిధ వర్గాల ఆర్థిక సహకారంతో నిర్వహించాలని నిర్ణయించడ మే తరువాయి ఫండ్స్ సేకరణకు ఏకంగా కమిటీని నియమించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఏకంగా ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఒక పండక్కి ప్రజల నుంచి నిధులు సమీకరించేందుకు కమిటీని ఏర్పాటు చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఎక్కడా చూసిన సందర్భాలు కనబడలేదు. కానీ, తొలిసారి మన జిల్లాలో విరాళాలు సేకరించేందుకు జిల్లా స్థాయి అధికారులతో కమిటీని నియమించారు. ఆదాయం వచ్చే శాఖలను ఎంచుకున్నారు. సంబంధిత అధికారులకు తప్పనిసరిగా నిధులు సేకరించే బాధ్యతను అప్పగించారు. గ్రానైట్ మైనింగ్ పరిశ్రమల నుంచి నిధుల సేకరణకు మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ను, వ్యాపారుల నుంచి నిధుల సేకరణకు వాణిజ్య పన్నుల శాఖకు చెందిన డిప్యూటీ కమిషనర్ను, నగరంలోని పలు సంస్థలు, వ్యాపారుల నుంచి నిధుల సేకరణకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను, వివిధ రకాల పరిశ్రమల నుంచి నిధుల సేకరణకు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ను, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ను, కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ను, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ను, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యుల నుంచి నిధుల సేకరణకు జిల్లా ఆస్పత్రుల సర్వీసెస్ కో ఆర్డినేటర్ను సభ్యులుగా నియమిస్తూ జిల్లా స్థాయిలో ఫండ్స్ సేకరణకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా తమకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడంలో తమవంతు కృషి చేశారు. ఆ వచ్చిన సొమ్ముతోనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముస్తాబుకు కూడా.. నగరాన్ని ముస్తాబు చేసేందుకు వివిధ శాఖలకు బాధ్యత అప్పగించారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు రాకపోవడంతో ఆయా శాఖలు కూడా తమతో అవసరమైన వారి వద్ద నుంచి నిధులు సేకరించి నగరాన్ని ముస్తాబు చేశారు. చెప్పాలంటే ముస్తాబు కోసం ప్రైవేటు వ్యక్తుల చేతి చమురు వదిలించుకోవల్సి వచ్చింది. భారీగా సమీకరించిన నిధులతో హంగులు, ఆర్భాటాలు చేశారు. ఉన్నత స్థాయి ఆదేశాలు, తప్పక చేయాల్సిందే, సహకరిస్తేనే పండగ చేయగలమంటూ సంబంధిత వ్యక్తులపై ఒత్తిడి తెచ్చి ఆ మేరకు నిధులు సేకరించి నగరంలో సొబగులు అద్దారు. ఫ్యామిలీ పండగలా.. వారం రోజుల జరిగిన వేడుకలను పరిశీలిస్తే రాష్ట్ర పండగగా కన్నా ఒక ‘ఫ్యామిలీ’ పండగ వాతావరణం కన్పించింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పా టు స్థానిక ఎమ్మెల్యే వ్యక్తిగత ఇమేజ్ కోసమే నిర్వహించినట్టు ఫోకస్ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల వేదికలపై ఎంతసేపూ కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, గొండు శంకర్ భజ నే వినిపించింది. వారి డిజిటల్ సైన్ బోర్డులు, సెల్ఫ్ డిస్ప్లేలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రముఖుల సొ మ్ముతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అయినప్పటికీ వేదికలపై వారి గొప్పలే కనిపించా యి. యాంకర్స్ కూడా వారి కోసమే ఆద్యంతం పొగుడుతూ కార్యక్రమాలు కొనసాగించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కార్యక్రమం ప్రారంభం కావాలంటే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రావాలని, ఆయన వచ్చాకనే ప్రారంభమవుతుందని వేదికపై యాంకర్ చెప్పడం గమనర్హం. వారం రోజుల వేడుకలను పబ్లిసిటీ కోసం వాడుకున్నారు. వ్యక్తి పూజ కోసం ప్రాధాన్యత ఇచ్చారు. పబ్లిసిటీ పిచ్చిలో రథసప్తమి రోజున ఏర్పాట్లను గాలికొదిలేశారు. భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ప్రముఖుల డబ్బుతోనే వేడుకలు వివిధ వర్గాల నుంచి సేకరించిన సొమ్ముతో అట్టహాసంగా కార్యక్రమాలు ఫండ్స్ సేకరణకు ప్రత్యేక కమిటీని నియమించిన జాయింట్ కలెక్టర్ ఆ సొమ్ముతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ గొప్పతనమంతా తమదే అన్నట్టు నేతల హడావుడి -
ప్రగతి పరుగులు పెడుతోంది
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జి ల్లా ప్రజలను ఉద్దేశించి ప్రగతి సందేశం ఇచ్చా రు. జిల్లా రెండో త్రైమాసిక అంతానికి 43 శాతం జీడీపీ వృద్ధిని సాధించి రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని కలెక్టర్ వెల్లడించారు. అలాగే పొదుపు సంఘాల మహిళలకు ‘సీ్త్ర నిధి’ ద్వారా రూ.278 కోట్ల రుణాలు అందించి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని సగర్వంగా ప్రకటించారు. ఉపాధి హామీ పథకంలోనూ 137.32 లక్షల పనిదినాలు కల్పించి రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపారు. దీపం–2 కింద జిల్లాలో ఈ ఏడాది జనవరిలో ఇప్పటివరకు 1,91,015 మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి, 48 గంటల్లోనే రూ. 9. 31 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. తల్లికి వందనం పథకం కింద 2,54,408 మంది లబ్ధిదారులకు రూ.330.73 కోట్ల నిధు లు అందజేశామన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద 2.79 లక్షల మంది రైతులకు రూ.370.32 కోట్లు పెట్టుబడి సాయం అందించామన్నారు. హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ పనులను రూ.176.35 కోట్లతో శరవేగంగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. పొందూరు ఖాదీకి ప్రపంచ గుర్తింపు జిల్లాలోని పొందూరు ఖాదీకి భౌగోళిక సూచిక (జీఐ) హోదా లభించడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు. దీనివల్ల చేనేత కార్మికుల నైపుణ్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో భాగంగా జిల్లాకు 5 ప్రాజెక్టుల ద్వారా రూ.5,368 కోట్ల పెట్టుబడు లు, 15,135 మందికి ఉపాధి రానుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, ఆర్డీవోలు, ఏఎస్పీలు, డీఎస్పీలు, జిల్లాలోని ఆయా శాఖలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ’సీ్త్ర నిధి’ ద్వారా రూ.278 కోట్ల రుణాలు మంజూరులో ప్రథమ స్థానం పొందూరు ఖాదీకి ‘జీఐ’ హోదా దక్కడం గర్వకారణం సంక్షేమ పథకాల్లో జిల్లాకు అగ్రస్థానం 77వ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ -
బీఈడీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో జనవరి 27 నుంచి జరగాల్సిన మొదటి సెమిస్టర్ బీఈడీ పరీక్షలను వాయిదా వేసినట్లు బీఆర్ఏయూ పరీక్షల విభాగం డీన్ డాక్టర్ ఎస్ ఉదయభాస్కర్ తెలిపారు. పరిపాలనా సంబంధిత కారణాల వల్ల పరీక్షలను వాయిదా వేశా మని ఆయన అన్నారు. తిరిగి ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తా మని అన్నారు. బీఈడీ పరీక్షలు వాయిదా పడిన సమాచారం సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లకు, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లకు తెలియజేశామన్నారు. ఈ పరీక్షలు మళ్లీ ఎప్పు డు నిర్వహిస్తామనేది విశ్వవిద్యాలయంలో వెబ్సైట్ ద్వారా, ఇతర అధికారిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తామన్నారు. నేటి నుంచి ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు మంగళవా రం నుంచి మొదలుకానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 26 జూనియర్ కాలేజీల్లో చదువుతున్న మూడు వేల మంది విద్యార్థులు ఈ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నాయి. ఇందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు వారం రోజులపాటు జరగనున్నాయి. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు మొదలుకానున్నాయి. సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలు 119 కేంద్రాల్లో జరగనున్నాయి. ఇందుకు ఆర్ఐఓ ఆర్.సురేష్కుమార్ నేతృత్వంలో డీఈసీ కమిటీ ప్రతినిధులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ పరేడ్లో ఆమదాలవలస వాసి ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణం పూజారిపేటకు చెందిన సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూజారి సంతోష్కుమార్ సోమ వారం ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో సెలెక్ట్ అయిన వారిలో ఆమదాలవలసకు చెందిన వ్యక్తి ఎంపిక కావడం గర్వకారణమని స్థానికులంటున్నారు. ఆయన తండ్రి ఆర్పీఎఫ్ మాజీ ఇన్స్పెక్టర్ పి.మోహనరావు, తల్లి జయలక్ష్మి, అన్నయ్య కిరణ్కుమార్ కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. కాలిపోయిన చిన్నారి మృతి శ్రీకాకుళం: నగరంలోని చిన్న బొందిలీపురానికి చెందిన ఆశాజ్యోతి(9) ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఈ నెల 11న వంట చేసే ఆట ఆడుకుంటూ మంటలు చెలరేగడంతో కాలిపోయిన విషయం తెలిసిందే. విశాఖ కేజీహెచ్లో 15 రోజులపాటు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. రెండో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదిత్యుని ఆదాయం రూ. 1.06 కోట్లు
● గతేడాది కంటే రూ.35.70 లక్షలు పెరిగిన ఆదాయం అరసవల్లి: రథసప్తమి సందర్భంగా ఆలయానికి వివిధ టిక్కెట్లు ద్వారా ఒక్క రోజులో రూ. 1,06,09,720 వరకు ఆదాయం లభించినట్లుగా ఆలయ ఈఓ కెఎన్వీడీవీ ప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ గత ఏడాది రథసప్తమి నాడు రూ.70,39,308 ఆదాయం రాగా ఈ సారి గత ఏడాది కంటే రూ.35,70,412 మేరకు అదనంగా ఆదాయం లభించిందన్నారు. భారీగా భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా పాసులను, దర్శన టిక్కెట్లను ఉదయం నుంచి నిలిపివేయడంతో ఆదాయం తగ్గిందని భావిస్తు న్నామన్నారు. క్షీరాభిషేకం టిక్కెట్లు (రూ.500) ద్వారా రూ.19,23,500, విశిష్ట దర్శనం టిక్కెట్లు (రూ.300) ద్వారా రూ.31,11,600, వీఐపీ టిక్కెట్లు (రూ.300) ద్వారా రూ.24,84,600, ప్రత్యేక దర్శనం (రూ.100) ద్వారా రూ.14,25, 180, కేశఖండన శాల టిక్కెట్లు (రూ.40) ద్వారా రూ. 48,280, ప్రసాదాల విక్రయాలలో లడ్డూ (రూ.15) ద్వారా రూ.7,43,700, పులిహోర (రూ.10) ద్వారా రూ.4,11,340 తదితర అంశాల ద్వారా మొత్తం ఆదాయం రూ.1,06,09,720 వరకు లభించిందన్నారు. ఉత్సవాలు విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు ఊహించని విధంగా రెండు లక్షలకు మించి రావడంతో ఒకింత ఇబ్బందులు తప్పలేదని అంగీకరించారు. ఆలయం లోపల దర్శనాలు క్యూలైన్ల విషయంలో పెద్దగా సమస్యలు తలెత్తలేదని వివరించారు. ఉత్సవ నిర్వహణలో తమకు అన్నివిధాలుగా సహకరించిన కాంట్రాక్టర్ ఉంగటి పాపారావుకు, వెల్డర్ రుప్ప దాలినాయుడు (కాళిదాస్)లకు ఆలయ ఈఓ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
కారు ఢీకొని వృద్ధుడు దుర్మరణం
పాతపట్నం: బూరగాం ఎస్సీ వీధి వద్ద జాతీయ రహదారిపై కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో కాగువాడ గ్రామానికి చెందిన వృద్ధుడు హరిచంద్ర పండి (64) మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో నరసన్నపేట నుంచి పర్లాకిమిడి వస్తున్న కారు.. బూరగాం ఎస్సీ వీధి సమీపంలో జాతీయ రహదారిపైకి వచ్చే సరికి ముందు వెళుతున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న హరిచంద్ర పండి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ శ్రీరామమూర్తి, కానిస్టేబుల్ వరలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పాతపట్నం సీహెచ్సీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. హరిచంద్రకు కొబ్బరికాయలు దుకాణం ఉంది. కొబ్బకాయలు కొనేందుకు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. హరిచంద్రకు భార్య సరస్వతి, కుమారుడు సిబ్బో పండి, కుమార్తె స్వప్న పొల్లయ్ ఉన్నారు. సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తెలిపారు. -
● ఆలయాల్లో సామూహిక సూర్యనమస్కారాలు ● వందలాదిగా హాజరైన అభ్యాసకులు
శ్రీకాకుళం కల్చరల్ : రథసప్తమి సందర్భంగా ఆదివారం పలుచోట్ల సామూహిక సూర్యనమస్కారాలు నిర్వహించారు. కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్టు, షిరిడీసాయి యోగా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖ–బి కాలనీలో షిరిడిసాయి మందిరంలో 108 సూర్యనమస్కారాలు జరిగాయి. కార్యక్రమంలో యోగా గురువు రామారావు, మురళి, హరిప్రసాద్, మధు విలేకర్, తంగి స్వాతి, కొంక్యాన వేణు, సింతు సుధాకర్, దుంపల చిన్నబాబు, పాల్గొన్నారు. నారాయణ తిరుమల యోగా సెంటర్లో జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించారు. బలగలోని ఆదిత్య విద్యానిలయం ప్రిన్సిపాల్ దేసూళ రమేష్, కరస్పాండెంట్ రాము ఆధ్వర్యంలో విద్యార్థులతో హరేరామ మందిరం ప్రాంగణంలో సామూహిక సూర్యనమస్కారాలు, ఆసనాలు చేయించారు. -
నిరంకుశ చట్టాలు రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీసీ రాంజీ, విద్యుత్ చట్టాల సవరణ, లేబర్ కోడ్స్, సీడ్ బిల్లు, మినీ అణు విద్యుత్ ప్లాంట్ల వల్ల కార్పొరేట్ కంపెనీలకు లాభాలు, ప్రజలపై భారాలు వేయడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తులసీదాసు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంకుశ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 30న గ్రామాల్లో ప్రతిజ్ఞలు, సంతకాల సేకరణ, ఫిబ్రవరి 2న సచివాలయాల్లో వినతి పత్రాలు అందజేత, 5న మండల కేంద్రాలు ధర్నాలు నిర్వహించనున్నట్లు వివరించారు. కొత్త ఉపాధి చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలు అప్పులు పాలవుతాయని, సామాజిక న్యాయం దెబ్బతిని దళితులు, పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. విద్యుత్ చట్టానికి సవరణలు చేయడం ద్వారా పేదలకు అందే క్రాస్ సబ్సిడీ రద్దవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1 నుంచి లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే, కార్మికులు కనీస హక్కులతోపాటు సమ్మె హక్కును కోల్పోతారని, 8 గంటల పని విధానం రద్దు అవుతుందన్నారు. కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులన్నీ నిర్వీర్యమవుతాయని చెప్పారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ ఎన్నికల హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానమివ్వాలన్నారు. జిల్లాలో ఐ.టి.డి.ఎ. ఏర్పాటు, జీడికి గిట్టుబాటు ధర, జీడి బోర్డు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి తదితర హామీలు నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. జిల్లాలో బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కె.మోహనరావు, సీపీఎం నాయకులు పి.తేజేశ్వరరావు, కె.నాగమణి, ఎస్.లక్ష్మీనారాయణ, ఎన్.షణ్ముఖరావు, పోలాకి ప్రసాద్, సీహెచ్ అమ్మన్నాయుడు, శిర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటు హక్కు సామాజిక బాధ్యత
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటు హక్కును సామాజిక బాధ్యతగా భావించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.వి.లక్ష్మణమూర్తి అన్నారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా కళాశాలల విద్యార్థులతో కలిసి శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి నుంచి బాపూజీ కళామందిర్ వరకు ఓటు హక్కు మన జన్మ హక్కు అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాపూజీ కళామందిర్ వేదికగా జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం నిర్వహించి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అమూల్యమైనదని చెప్పారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు సైతం వినియోగించుకోవాలన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం వక్తృత్వం, వ్యాసరచన, ముగ్గుల పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, మెమొంటోలు అందజేశారు. ముగ్గురు సీనియర్ సిటిజన్లు, ముగ్గురు దివ్యాంగులను సత్కరించారు. నూతన ఓటర్లకు ఎపిక్ కార్డులు అందజేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేత ఆర్.శంకరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తేజేశ్వరరావు, టీడీపీ నేత పి.ఎం.జె.బాబు, కాంగ్రెస్ నాయకురాలు ఈశ్వరమ్మ, నెహ్రూ యువ కేంద్రం (మై భారత్) డీడీ ఉజ్వల్, కలెక్టర్ కార్యాలయ సి–సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, సైకియాట్రిస్ట్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక కేంద్రంగా హనుమాన్ ఆలయం
నరసన్నపేట: వంశధార నది ఒడ్డున మడపాం వద్ద విశ్వవిరాట్ హనుమాన్ ఆలయం జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలో ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆలయం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే ఎత్తయిన ఆంజనేయ విగ్రహంగా మడపాం వద్ద అభయాంజనేయ స్వామి విగ్రహానికి పేరుందన్నారు. ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం శ్రీరామ భక్త హనుమాన్ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు కార్యక్రమంలో నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళి, ఆలయ కమిటీ ప్రతినిధులు తంగుడు జోగారావు, సదాశివుని కృష్ణ, వైఎస్సార్ సీపీ నాయకులు రాజాపు అప్పన్న, ఎంపీటీసీ రువ్వ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
పొదల్లోకి దూసుకెళ్లిన బైక్
మెళియాపుట్టి : ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలైన ఘటన మెళియాపుట్టి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. టెక్కలి పండాపురం కాలనీకి చెందిన బెహరా జగదీష్, బండి త్రినాథ్లు శుభకార్యం నిమిత్తం మెళియాపుట్టికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఏకలవ్య పాఠశా ల సమీపానికి వచ్చేసరికి బైక్ నడుపుతున్న త్రినాథ్కు కళ్లు తిరగడంతో అదుపుతప్పి పొద ల్లోకి దూసుకెళ్లిపోయారు. ఇద్దరికీ గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్సులో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం : జిల్లా సమగ్ర శిక్షలో సైట్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఏడుగురిపై చర్యలు తీసుకుంటూ ఎస్పీడీ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 29న రాష్ట్రస్థాయిలో ఇంజినీర్ల సమావేశం నిర్వహించగా ఏడుగురు సైట్ ఇంజినీర్లు గైర్హాజరయ్యారు. దీనిని సీరియస్గా పరిగణించిన ఎస్పీడీ వీరిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని ఏపీసీకి ఆదేశాలు జారీ చేశారు. విచారణ సవ్యంగా జరిగేందుకు ఏడుగురిని వేరొక ప్రాంతానికి బదిలీ చేయాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులు వెనక్కి మళ్లడంపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశానికి వీరు హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శ్రీకాకుళం రూరల్: కల్లేపల్లి గ్రామానికి చెందిన 30 ఏళ్ల యువకుడు మూకళ్ల షణ్ముఖరావు (అఖిల్) గుండెపోటు తో మృతి చెందాడు. అఖిల్ ఐదేళ్లుగా ఢిల్లీలో సివిల్స్కు సన్నద్ధమవుతున్నాడు. ప్రిపరేషన్తో పాటు నిరుద్యోగ యువత ఒత్తిడి సమస్యలను అధిగమించేందుకు ఆన్లైన్లో మోటివేటర్గా పరిష్కారాలు చెబుతుండేవాడు. యూపీఎస్సీ ఫలితాల్లో ఒక్క మార్కుతో పోస్టు కోల్పోయా డు. ఈ క్రమంలో ఈ నెల 23న గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈయన మృతదేహం సోమవారం స్వగ్రామం కల్లేపల్లికి రానుంది. కుమారుడి మృతితో తల్లిదండ్రులు లక్ష్మణరావు సుశీల విషాదంలో మునిగిపోయారు. -
బాబోయ్ మంటలు!
టెక్కలి రూరల్: టెక్కలి చిన్నబ్రహ్మణవీధిలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అల్లుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఖాళీ స్థలంలో చెత్తాచెదారాలకు గుర్తుతెలియని వ్యక్తులు మంటపెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజలు భయాందోళనకు గురై అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్ ఓసీ కాంతారావు ఆధ్వర్యంలో ఆదివారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రయాణికుల బ్యాగులు, సూట్కేసులు, సీట్లను తనిఖీ చేశారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ నాయక్, ఏఎస్ఐ మురళీ, సిబ్బంది పాల్గొన్నారు. -
కమ్మసిగడాంలో కల్యాణ రాట
రణస్థలం: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు కమ్మసిగడాంలోని మహాలక్ష్మీ అమ్మవారి జాతర సందర్భంగా ఆదివారం ఆలయం వద్ద కల్యాణరాట వేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు మాట్లాడుతూ మహాలక్ష్మీ తల్లి, గురప్పదొరల కల్యాణం ఈ నెల 27న రాత్రి 10.16 గంటలకు నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం జాతర మొదలవుతుందని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్/శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం తహశీల్దార్ ఎస్.గణపతిరావుకు ఆదివా రం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా విజయవాడలోని స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ అవార్డు ప్రదానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఓటరు సవరణలో భాగంగా ఉత్తమ సేవలు అందించినందుకు శ్రీకాకుళం జిల్లా ఎంపిక చేయడం పట్ల జిల్లా ఉన్నతాధికారులు గణపతిరావుకు శుభాకాంక్షలు తెలిపారు. -
కూర్మనాథుని సన్నిధిలో హైకోర్టు జడ్జి
గార: ప్రముఖ విష్ణుక్షేత్రం ఆదికూర్మనాథాలయంలో కూర్మనాథున్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. రథసప్తమి సందర్భంగా విచ్చేసిన న్యాయమూర్తికి ఆలయ అధికారులు, అర్చకులు గౌరవ స్వాగతం పలికారు. అనంతరం గోత్రనామాలతో పూజ లు చేయించారు. ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు, మురళీకృష్ణమాచార్యులు ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో స్థానాచార్యలు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు, తహశీల్దార్ మునగవలస చక్రవర్తి, పట్నాన రామచంద్రరావు పాల్గొన్నారు. -
మరోసారి టెట్ నిర్వహించాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాబోయే డీఎస్సీ ముందు టెట్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతి భవన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏపీ టెట్–2025 పరీక్ష పేపర్ గత సంవత్సరాలతో పోల్చితే అత్యంత కఠినంగా ఉందని, అనేక మంది అర్హులైన అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సిలబస్తో సంబంధం లేని ప్రశ్నలు వల్ల 37 శాతం మాత్రమే క్వాలిఫై అయ్యారని, సుమారు లక్షన్నర మంది రోడ్డున పడ్డారన్నారు. 2026 డీఎస్సీ ప్రకటించే ముందు మరోసారి టెట్ నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమం సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్, నాయకులు రామోజీరావు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.


